Railway Department
-
బైపాస్లో వెళ్లిన బడ్జెట్ రైలు
సాక్షి, అమరావతి: ఈసారి కూడా కేంద్ర రైల్వే బడ్జెట్.. రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్ సిగ్నలే చూపించింది. బడ్జెట్ రైలు రాష్ట్రాన్ని బైపాస్ చేసుకుంటూ వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రానికి ఈ బడ్జెట్లో తీసుకువచ్చిన కొత్త రైల్వే ప్రాజెక్టులు అక్షరాలా శూన్యం. ఒక్కటంటే ఒక్క డిమాండ్ను కూడా రైల్వే శాఖ పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి ఎన్డీయేకు చెందిన 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ, రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల గురించి వివరించారు. 2025–26 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ.9,417 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అయితే ఆయన చాలా తెలివిగా 2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పడం విస్మయ పరిచింది. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రసుత్త బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపలేదనే విషయాన్ని మరుగున పరిచేందుకు యత్నించారన్నది సుస్పష్టం. రైల్వే బడ్జెట్పై ఆ శాఖ పింక్ బుక్ను విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది. పాత పాటే.. కొత్త ప్రాజెక్టులు లేవు ప్రస్తుతానికి అయితే పాత ప్రాజెక్టుల పాటనే కొత్తగా పాడారని రైల్వే కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుల గురించి రైల్వే మంత్రి ప్రత్యేకంగా వెల్లడించనే లేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం గమనార్హం. వాస్తవానికి అమృత్ భారత్ పథకం కింద ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే మంత్రి పునరుద్ఘాటించారు. ఇక విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లను రూ.1,132.43 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి ఆ నాలుగు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు కూడా రెండేళ్ల క్రితమే ప్రారంభమై కొనసాగుతున్నాయి. అవేమీ కొత్త ప్రాజెక్టులు కానే కావు. ఇప్పటికే 130 కి.మీ.మేర కవచ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, మరో 1,700 కి.మీ.మేర ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.దీన్నిబట్టి కవచ్ ప్రాజెక్టు పరిధిని కొత్తగా ఏమీ విస్తరించే ఆలోచన లేదని తేల్చి చెప్పినట్లే. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అందుకే ఈ రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించ లేదని కూడా కుండబద్దలు కొట్టారు. ఏపీ మీదుగా ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు నిర్వహిస్తున్నామని చెబుతూ త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామన్నారు. కొత్త డిమాండ్లు పూర్తిగా బేఖాతరు దీర్ఘకాలికంగా ఉన్న ప్రాజెక్టులకే నిధుల కేటాయింపునకు చేతులు రాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విజయవాడ–ఖరగ్పూర్, విజయవాడ–నాగ్పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు.. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు, విజయవాడ–గూడూరు మద్య నాలుగో లైన్ నిర్మాణం, కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీఎం చంద్రబాబు ఏం సాధించినట్లు?» కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25 బడ్జెట్లో రైల్వేలో రాష్ట్రానికి కేవలం రూ.9,138 కోట్లు కేటాయించారు. దాంతో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే ఆ నిధులు సరిపోయాయి. పోనీ.. 2025–26 బడ్జెట్లో అయినా భారీగా నిధులు సాధిస్తారేమోనని ఆశించిన వారికి అడియాశే మిగిలింది. గత బడ్జెట్ కంటే కేవలం రూ.279 కోట్లే అధికంగా రాబట్టగలిగారు. పెరిగిన వ్యయంతో పోలిస్తే, ఆ నిధులు కూడా ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే సరిపోతాయి. » కాకినాడ – పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగ్గరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించనే లేదు. » అమరావతి రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదించినట్లు గత ఏడాది అక్టోబర్లో ప్రకటించినా, నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వ లేదు. » అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ) రైల్వేలైన్పై కూడా కేంద్రం ముఖం చాటేసింది. » కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా రైల్వే లైన్ల గురించి పట్టించుకోలేదు. -
ఈసారీ..భారీగానే..
సాక్షి, హైదరాబాద్: పరిమిత ప్రాజెక్టులు.. మొత్తం కేటాయింపుల్లో వాటికే సింహభాగం నిధులు.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తున్న విధానం. ఈ ప్రయోగం ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది.దీనివల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో మూడు కీలక ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే దిశగా రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో రైలు సేవలు బాగా మెరుగుపడబోతున్నాయి. బల్లార్షా–కాజీపేట–విజయవాడఉత్తర–దక్షిణ భారత్లను రైల్వే పరంగా జోడించే కీలక మార్గం ఇది. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్గా పిలుస్తారు. ఈ మార్గంలో నిత్యం 460 వరకు రైళ్లు పరుగు పెడుతుంటాయి. ప్రస్తుతం దాని ట్రాఫిక్ సాంద్రత ఏకంగా 160 శాతంగా ఉంది. ఈ మార్గంలో కనీసం మరో 250 ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను నడపాల్సి ఉన్నా, సాంద్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కావటం లేదు. దీంతో మూడో లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.కాజీపేట– విజయవాడ మధ్య మూడో లైన్ 2012–13లో మంజూరు కాగా, కాజీపేట–బల్లార్షా లైన్ 2015–16లో మంజూరైంది. కానీ పనులు వెంటనే మొదలు కాలేదు. గత మూడేళ్లుగా వీటికి భారీగా నిధులు కేటాయిస్తుండటంతో ఇప్పుడు పనులు కొలిక్కి వచ్చాయి. ఈ మార్గంలో వంతెనల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతా పనులు వేగం పుంజుకున్నాయి. దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు. కాజీపేట–బల్లార్షా మధ్య 202 కి.మీ. నిర్మాణాన్ని రూ.2,063 కోట్ల అంచనాతో ప్రారంభించారు. రాఘవాపురం–కొలనూరు, కొలనూరు–పోత్కపల్లి, విరూరు–మాణిక్ఘర్, బిజిగిర్ షరీఫ్– ఉప్పల్, విరూరు–మాకుడి, పోత్కపల్లి–బిజిగిర్ షరీఫ్, మాకుడి–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ఇప్పటికే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈసారి కొంత సవరించే అవకాశం ఉంది. భారీగా నిధులు ఇవ్వటంతో హసన్పర్తి రోడ్డు–ఉప్పల్, ఆసిఫాబాద్–రేచినిరోడ్, హసన్పర్తి–కాజీపేట పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 173.27 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. 28 కి.మీ. పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బల్లార్షా– మాణిక్ఘర్, రేచిని రోడ్–బెల్లంపల్లి– మందమర్రి, ఆసిఫాబాద్– సిర్పూర్ కాగజ్నగర్ మధ్య పూర్తి కావాల్సి ఉంది. కాజీపేట–విజయవాడ మూడో లైను ఈ లైన్ పూర్తి నిడివి 220 కి.మీ. గత బడ్జెట్లో దీనికి రూ.310 కోట్లు కేటాయించగా, తర్వాత కొన్ని నెలలకే ఆ మొత్తాన్ని రూ.500కు పెంచారు. దీంతో ఒక్కసారిగా పనుల్లో వేగం పెరిగింది. 104 కి.మీ. నిడివిలో మూడో లైన్ పనులు పూర్తి చేయటంతోపాటు, అన్ని వంతెనలను సిద్ధం చేశారు. మిగతా పనులు మూడొంతులు పూర్తి కాగా, తుదిదశ పనులు మాత్రమే మిగిలాయి. విజయవాడ–కొండపల్లి, కొండపల్లి–చెరువు మాధవరం, చెరువు మాధవరం–గంగినేని–ఎర్రుపాలెం, నెక్కొండ–చింతలపల్లి, చింతలపల్లి–వరంగల్ మధ్య ఇప్పటికే మూడో లైన్ వినియోగంలోకి రాగా, పందిళ్లపల్లి–బోనకల్, ఎర్రుపాలెం–మధిర, విజయవాడ–బెజవాడ క్యాబిన్ మధ్య గత ఏడాది కాలంలో పూర్తయ్యాయి. బోనకల్–మధిర, నెక్కొండ–పందిళ్లపల్లి మధ్య పనులు జరగాల్సి ఉంది. మరో ఏడాదిలో పనులు దాదాపు పూర్తి కానున్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి సిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్ను రైల్వే ద్వారా అనుసంధానించే 151 కి.మీ. కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా వేగంగా జరుగుతున్నాయి. గత బడ్జెట్లో దీనికి రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ఫార్మేషన్, కటింగ్, లింకింగ్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రెయిల్స్ పరవనున్నారు. ఈ సెక్షన్లో దాదాపు 60 వరకు మైనర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. నాలుగు ఆర్ఓబీల నిర్మాణం పూర్తి కావచ్చింది. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో సిరిసిల్ల వరకు రైలు నడిపేందుకు వీలు కలగనుంది. మరికొన్ని మార్గాల్లో..» సిరిసిల్ల–కరీంనగర్ మధ్య 40 కి.మీ. మార్గానికి భూ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవటంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అక్కడ పనులు జరగటం లేదు. భూ పరిహారం రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూమిని రైల్వేకు అప్పగించి ఉంటే ఈపాటికి చాలా పని జరిగి ఉండేది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. » నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని రెండు వరుసలకు విస్తరించే ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించారు. 248 కి.మీ. ఈ మార్గంలో కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పూర్తయింది. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. మిగతా చోట్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. » 2023–24లో బడ్జెట్లో మంజూరు చేసిన ముద్ఖేడ్–డోన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను సవరించి మధ్యలో రూ.550 కోట్లు మంజూరు చేశారు. » 2023–24లో మంజూరు చేసిన భద్రాచలం–డోర్నకల్, మోటమర్రి–విష్ణుపురం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు మొదలయ్యాయి. గత బడ్జెట్లో వీటికి రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. » గత బడ్జెట్లో మంజూరు చేసిన పాండురంగాపురం–మల్కాజిగిరి కొత్త లైన్, ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
ఒక ట్రిలియన్ మేమిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చటంలో తెలంగాణ సహకారం గణనీయంగా ఉండనుందని, రాష్ట్రం నుంచే ఒక ట్రిలియన్ మేర తోడ్పాటు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. ఇది సాధించాలంటే తెలంగాణలో రైల్వేల విస్తరణ చాలా అవసరమని అన్నారు. ఇందుకు కేంద్రం సహకరించి ప్రధాని మోదీ కలలుగంటున్న ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు బాటలు వేయాలని కోరారు. హైదరాబాద్ నగర శివారు చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్ను సోమవారం మ«ధ్యాహ్నం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి కూడా వర్చువల్గా హాజరై రాష్ట్రంలో రైల్వే, మెట్రో రైల్కు సంబంధించిన డిమాండ్లను ప్రధానమంత్రి ముందుంచారు. బందరు పోర్టుతో అనుసంధానంతో..‘తెలంగాణకు సముద్ర తీరం లేనందున హైదరాబాద్కు చేరువలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోని బందరు పోర్టుతో అనుసంధానం కావాల్సి ఉంది. కాబట్టి రాష్ట్రం నుంచి ఆ పోర్టుకు వేగంగా, నేరుగా చేరుకునేలా డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. అవి ఏర్పడితే మేము డ్రైపోర్టులు ఏర్పాటు చేసుకుంటాం. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. దేశ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 35 శాతం వాటాతో తెలంగాణ ముందంజలో ఉంది. ఆ ఉత్పత్తుల ఎగుమతికి, అవి వేగంగా పోర్టుకు చేరడానికి డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే, డెడికేటెడ్ రైల్వే లైన్ దోహద పడతాయి. ఆటోమొబైల్ పరిశ్రమ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ స్థానికంగా ఎదిగేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. రీజినల్ రింగ్ రైలు పనులు చేపట్టండి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి గాను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉంది. రీజినల్ రింగు రోడ్డులో 170 కి.మీ భాగానికి ఇటీవలే కేంద్రం టెండర్లు పిలిచింది. మిగతా భాగాన్ని కూడా చేపట్టడంతో పాటు, రింగు రోడ్డు వెంట రీజినల్ రింగ్ రైల్ పనులు కూడా చేపట్టాలి. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న హైదరాబాద్ మెట్రో రెండో దశకు వెంటనే అనుమతినిచ్చి పనులు జరిగేలా సహకరించాలి. తెలంగాణను కర్ణాటకతో అనుసంధానించే వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ పనులకు కూడా అనుమతి మంజూరు చేస్తే, అది ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాజీపేట ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరైన నేపథ్యంలో దాన్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలి..’ అని సీఎం రేవంత్ కోరారు. దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పదేళ్ల క్రితం 2014లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బడ్జెట్లో రూ.251 కోట్లు మాత్రమే దక్కాయని, అదే గతేడాది రూ.5,333 కోట్లు కేటాయించారని, రైల్వేల పురోగతిలో వస్తున్న గణనీయ మార్పునకు ఇది నిదర్శనమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో ఒకటైన భారతీయ రైల్వే ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణకు అన్ని విధాలా సహకారం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.1.20 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, మరో రూ.80 వేల కోట్లతో పనులు చేపట్టనుందని వెల్లడించారు. పదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 346 కి.మీ మేర రైల్వే లైన్లను అందుబాటులోకి తెచ్చిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకున్నా, సొంత నిధులతో రైల్వే శాఖనే ఎంఎంటీఎస్ విస్తరణ పనులు చేపట్టిందని గుర్తుచేశారు. రీజినల్ రింగు రోడ్డు కోసం రూ.26 వేల కోట్లు వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రైల్వేకు ఆధునిక రూపు: కేంద్రమంత్రి బండి సంజయ్ మెరుగైన వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారానే పురోగతి సాధ్యమని అమెరికా నిరూపించిందని, ఇప్పుడు ఆ మూడు రంగాలను ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రైల్వేల అభివద్ధికి కేంద్రం రూ.32 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి ఆధునిక రూపు తెచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 వేల కోట్లకు పైగా వెచ్చించిందని తెలిపారు. అప్రోచ్ రోడ్డుకు గ్రాంటు ఇవ్వండి: శ్రీధర్బాబు చర్లపల్లి రైల్వేస్టేషన్ భవిష్యత్తులో రద్దీగా, హైదరాబాద్కు ముఖ్య స్టేషన్గా మారనున్నందున విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు తరహా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. దీనికి కేంద్రం ప్రభుత్వం తన వంతుగా గ్రాంటు మంజూరు చేసి సహకరించాలని కోరారు. ఆ బాధ్యత రాష్ట్రానిదే: కేంద్రమంత్రి కేంద్రం చర్లపల్లిలో అంతర్జాతీయ స్థాయి రైల్వే టెర్మినల్ను నిర్మించి రాష్ట్రానికి కానుకగా ఇచ్చిందని, దానికి అప్రోచ్ రోడ్డు నిర్మించే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న స్పష్టం చేశారు. దీనికి సీఎం ఆమోదం తెలిపేలా నచ్చజెప్పాలని సూచించారు. కర్ణాటకలో కూడా అప్రోచ్ రోడ్డు నిర్మాణ బాధ్యత రాష్ట్రానిదేనని సీఎం సిద్ధరామయ్యకు చెప్పామని సోమన్న వివరించారు. కాగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను రూ.2 వేల కోట్లతో విమానాశ్రయాలో తరహాలో కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. -
చుక్ చుక్ బండిలో.. వెండి కొండల యాత్ర
(జమ్మూ–కశ్మీర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : 77 ఏళ్ల స్వతంత్ర భారతం నిరీక్షణకు గ్రీన్ సిగ్నల్ లభించింది! 25 ఏళ్ల నాటి ప్రణాళిక పట్టాలెక్కుతోంది! రెండు దశాబ్దాల అకుంఠిత దీక్ష ఫలిస్తోంది!! కశ్మీర్ను మిగతా దేశంతో అనుసంధానిస్తూ మన రైల్వేల ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావచ్చింది. హిమాలయాల మీదుగా భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైన 338 కి.మీ. ‘ఉద్దమ్పూర్– శ్రీనగర్–బారాముల్లా’ రైల్వే లైన్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఏకంగా 38 సొరంగాలు (టన్నెళ్లు), 931 చిన్నా, పెద్ద వంతెనలతో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చెనాబ్ వంతెన, దేశంలో మొదటి కేబుల్ రైల్వే వంతెనతోపాటు ఎన్నో ప్రత్యేకతలను ఈ విశిష్ట ప్రాజెక్టు సంతరించుకుంది. వ్యాపార, పర్యాటక, రవాణా రంగాల ప్రగతిని విప్లవాత్మక మలుపు తిప్పుతూ జమ్మూ–కశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడనుంది. దేశ రక్షణ వ్యూహాత్మక అవసరాలను తీర్చడంలోనూ అత్యంత కీలకంగా మారనుంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో భద్రతాపరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దీన్ని చేపట్టారు. మొత్తం రూ.41 వేల కోట్లతో చేపట్టి.. 2025 జనవరిలో ప్రారంభించనున్న ఈ రైల్వే ప్రాజెక్ట్ ప్రధాన అంశాలు ఇవీ..27 సొరంగాలు.. 37 వంతెనలు ఉద్దమ్పూర్– శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన 111 కి.మీ. కట్రా– బనిహల్ లైన్ నిర్మాణాన్ని రైల్వే శాఖ తాజాగా పూర్తి చేసింది. అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు, లోతైన లోయలు, అతి వేగంగా ప్రవహించే నదులతో కూడుకున్న ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. మొత్తం ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉండగా వాటిలో 27 ఈ లైన్లోనే ఉండటం గమనార్హం. ఇక 37 వంతెనలు కూడా ఈ లైన్లోనే నిర్మించారు. వాటిలో అత్యంత ప్రధానమైన చెనాబ్ వంతెన, ఆంజిఖడ్ వంతెనలున్నాయి. హిమాలయ ప్రాంత వాసులకు రైలు రవాణాను అందుబాటులోకి తెస్తూ కొత్తగా రియాసీ, బక్కల్, దుగ్గా, సావల్కోట్, సంగల్దాన్, సుంబుర్, ఖరీ రైల్వే స్టేషన్లను నిర్మించారు. హిమాలయాలను తొలిచి ప్రత్యేకంగా నిరి్మంచిన ఎత్తైన ప్రదేశాలు, సొరంగాల వద్ద ఈ రైల్వే స్టేషన్లను నిర్మించడం విశేషం. ఇక మిగిలింది 17 కి.మీ. లైనే కట్రా–రియాసీ మధ్య మరో 17 కి.మీ. మేర రైల్వే లైన్ను ఇంకా నిరి్మంచాల్సి ఉంది. ఆ ప్రాంతంలో హిమాలయాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. ఆంజిఖడ్ కేబుల్ వంతెనకు ఆవల ఓ సొరంగాన్ని నిర్మించి ఈ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఆ పనులను కొన సాగిస్తూ పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.ఉగ్ర దాడులను తట్టుకునేలా.. చెనాబ్ వంతెన పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 45 కి.మీ. దూరంలోనే ఉండటంతో రక్షణశాఖ సమన్వయంతో రైల్వే శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. వంతెన సమీపానికి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 24/7 సీసీ కెమెరాల నిఘాతో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఒక్కొక్కటి రూ.500 ఖరీదు చేసే ఐదు లక్షల బోల్టులను నిర్మాణంలో వినియోగించారు. ఒకసారి బిగించిన వాటిని ఇతరులు విప్పలేని రీతిలో తయారు చేసిన భారీ బోల్టులను వంతెన నిర్మాణంలో ప్రత్యేకంగా వాడారు. చెనాబ్ వంతెన సమీపంలో డ్రోన్లు ఎగుర వేయడాన్ని నిషేధించారు. సరిహద్దులకు అవతలి వైపు నుంచి 40 కేజీల గ్రెనేడ్లు విసిరినా వంతెన ధ్వంసం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వంతెనపై ఒక అడుగు ఎత్తులో ఇనుప జాలీలతో ఫ్లోర్ నిర్మించారు. గ్రెనేడ్లు విసిరినా అవి నేరుగా వంతెనను తాకకుండా ఈ ఇనుప జాలీలు అడ్డుకుంటాయి. దేశంలో తొలి రైల్వే కేబుల్ వంతెన కట్రా– రియాసీ సెక్షన్లో అంజీఖడ్ వద్ద దేశంలోనే తొలి రైల్వే కేబుల్ వంతెనను నిర్మించారు. భూకంపాలు, వరదలు, ప్రకృత్తి విపత్తులకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతంలో రెండు కొండలను అనుసంధానిస్తూ కేబుల్ వంతెన నిర్మాణమే సరైన పరిష్కారమని ఇంజనీరింగ్ నిపుణులు నిర్ణయించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీ సాంకేతిక పరిశోధన సహకారంతో 725.5 మీటర్ల వంతెనను నిర్మించారు. అందులో 290 బలమైన కేబుల్ వైర్లతో నిర్మించిన వంతెన 473.25 మీటర్ల పొడవు ఉంటుంది. పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా..చలి కాలంలో పట్టాలపై మంచు గడ్డ కట్టకుండా ఉండేందుకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రత్యేక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డబుల్ వాల్డ్ కాంపోజిట్ ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకులను నిరి్మంచారు. దీంతో పట్టాలపై చేరే నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది. చలికి గడ్డ కట్టదు. రైళ్లకు నీటి సరఫరా కోసం రక్షణ శాఖ సహకారంతో హీటెడ్ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లలోని టాయిలెట్లలో గీజర్ల సదుపాయం ఉంటుంది. సెంట్రల్లీ హీటెడ్ స్లీపర్ వందే భారత్ రైళ్లను ఈ లైన్లో ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
రైల్వే జోన్ పనులకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం: ఐదున్నరేళ్ల తర్వాత కలల జోన్ పనులకు రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ పనులకు రూ.149.16 కోట్లతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ టెండర్లు పిలిచింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వేకు కేటాయించిన ముడసర్లోవ భూముల్లోనే జోన్ జీఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వందేళ్లు పటిష్టంగా ఉండేలా చారిత్రక నిర్మాణంగా ఈ కార్యాలయం రూపు దిద్దుకోనుంది. టెండర్లు ఖరారు చేసిన 24 నెలల్లోనే భవన నిర్మాణం పూర్తి చేయాలని షరతులు విధించింది. ఈ ఏడాది జనవరిలోనే ముడసర్లోవ భూములు అప్పగిస్తే.. అవి ముంపు భూములంటూ అబద్ధాలతో గోబెల్స్ ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అవే భూములు దిక్కంటూ జోన్ కార్యాలయ పనులకు సిద్ధం చేయడం గమనార్హం. రెండు బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 9 అంతస్తులతో హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ నిర్మించనున్నారు. ప్రతి భవనానికి రెండు యాక్సెస్ పాయింట్లు, రెండు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బీటీరోడ్స్, సీసీ రోడ్లు, ఫుట్పాత్ ఏరియా, పార్కింగ్ పావ్డ్ ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, బిల్ట్ అప్ ఏరియా, బేస్మెంట్, పార్కింగ్ ఇలా.. ప్యాకేజీలుగా పనులు విభజించారు. అసలేం జరిగిందంటే..రోడ్డు విస్తరణలో భాగంగా పెందుర్తి ట్రాన్సిట్ కారిడార్ మంజూరు చేసిన సమయంలో రోడ్డు నిర్మాణానికి, రైల్వే భూముల్లో తరాలుగా ఉన్న మురికివాడల అభివృద్ధికి మొత్తం 26.11 ఎకరాలు అవసరమయ్యాయి. దీనిపై రైల్వే అధికారులతో దఫ దఫాలుగా జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. చివరికి 1ః2 నిష్పత్తిలో అంటే 52.22 ఎకరాలు ముడసర్లోవలో ఇచ్చే ప్రతిపాదనకు రైల్వే అధికారులు అంగీకరించారు. ముడసర్లోవ స్థలం రైల్వేకు ఇచ్చేందుకు 2013 ఫిబ్రవరి 2న నం.55/12తో జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేశారు. దీనిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 నవంబర్ 26న జీవో ఎంఎస్ నం.254 జారీ చేసింది. విశాఖపట్నం రూరల్లోని ముడసర్లోవలో సర్వే నెం.26లో జీవీఎంసీకి చెందిన సుమారు 270 ఎకరాలు పోరంబోకు ఉండగా, ఇందులో 52 ఎకరాలు రైల్వే శాఖకు అప్పగించేందుకు నిర్ణయించారు. అప్పట్లో రైల్వే అధికారులతో సంయుక్తంగా తనిఖీలు చేసి, వారు ఆమోదించిన తర్వాతే భూమి అప్పగింత చర్యలు చేపట్టారు. జీవీఎంసీ, రైల్వేల మధ్య 2013లో ఒప్పందం కుదిరితే 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా, భూమి ఇవ్వకుండా జాప్యం చేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములు అందిస్తే.. దానిపైనా విష ప్రచారం చేశారు. ఏ నిర్మాణాలకైనా అనుకూలంవాస్తవానికి రైల్వేకు ఇచ్చిన ఈ ప్రాంతం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అది మిక్స్డ్ జోన్. ఏ విధమైన భవనాలైనా నిర్మించుకునేందుకు అనుకూలమైన స్థలంగా ధ్రువీకరించారు. ఆ భూమి చెరువు బ్యాక్ వాటర్లో లేదని, ముడసర్లోవ రిజర్వాయర్లో భాగం కాదని, ముంపునకు గురయ్యే అవకాశమే లేదని మాస్టర్ ప్లాన్లో స్పష్టం చేశారు. ఈ విషయంపై రైల్వే అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, లేఖలూ రాలేదు. అక్కడ ఉన్న ఆక్రమణల్ని తొలగించి.. స్థానికులతో సంప్రదింపులు చేసి.. సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించి రెవిన్యూ శాఖ మొత్తం స్థలానికి కంచె కూడా వేసింది. రైల్వేకు ఇవ్వాల్సిన 52.22 ఎకరాల భూమిని క్లియర్ టైటిల్తో సిద్ధం చేశారు. వాల్తేరు డీఆర్ఎంకు ఈ ఏడాది జనవరి 2న లేఖలు రాసి.. అప్పగించారు. నాడు అది ముంపు ప్రాంతమంటూ అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. ఇప్పుడు అదే భూమి అద్భుతమంటూ పొగడటం గమనార్హం.తాత్కాలిక సేవలు ఎప్పుడో మరి?2019 ఫిబ్రవరి 28న కేబినెట్ ఆమోద ముద్ర వేస్తూ.. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే.. కొత్త భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనే ఆదేశాలు ఇవ్వాలా వద్దా.. అనే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. ఒకవేళ బిల్డింగ్ నిర్మాణంతో పని లేకుండా.. జోన్ కార్యకలాపాలు ప్రారంభించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ.. తను సమర్పించిన జోన్ డీపీఆర్లోనూ పొందు పరిచారు. -
పొగ బండులు ఇక మాయం
సాక్షి, హైదరాబాద్: రైలుకు పర్యాయపదంగా వాడే పొగబండి ఇక మాయం కానుంది. డీజిల్ ఇంజన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేను పూర్తిస్థాయిలో విద్యుదీకరించి.. ఇక ఎలక్ట్రిక్ ఇంజన్లనే వాడాలన్న రైల్వే శాఖ నిర్ణయానికి తగ్గట్టుగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఇంతకాలం కొత్త లైన్ల నిర్మాణాన్ని ముందు చేపట్టి, భవిష్యత్తులో కుదిరినప్పుడు ఆ మార్గాన్ని విద్యుదీకరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి, కొత్త లైన్ల పనులు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఎలక్ట్రిఫికేషన్ పనులను కూడా నిర్వహించాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయించింది.ఆ నిర్ణయాన్నే ఇప్పుడు అమలులోకి తెస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రీన్ఫీల్డ్ (పూర్తి కొత్త) లైన్ పనుల్లో దీనిని అమలు చేయనున్నారు. దీనిలో భాగమైన మనోహరాబాద్ (మేడ్చల్ సమీపం), కొత్తపల్లి (కరీంనగర్ శివారు) ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అటు ట్రాక్ పనులు నిర్వహిస్తూనే సమాంతరంగా విద్యుత్తు లైన్ కూడా ఏర్పాటు చేసే పని ప్రారంభించబోతున్నారు. మామూలుగా అయితే కనీసం ఓ దశాబ్దం తర్వాత జరగాల్సిన పనులు తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడే జరగనున్నాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. 76.65 కి.మీ. ఉన్న ఈ మార్గాన్ని ముందు విద్యుదీకరించాలని నిర్ణయించారు. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు మరో రెండుమూడు నెలల్లో పనులు చేపట్టాలని తాజాగా నిర్ణయించారు.తెలంగాణలో జరగాల్సింది94 కి.మీ. మాత్రమే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 కి.మీ. మేర రైలు మార్గాలున్నాయి. వీటిల్లో 6,150 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇందులో తెలంగాణ పరిధిలోని 2,015 రూట్ కి.మీ.లలో ట్రాక్ ఉండగా ఇప్పటికే 1,921 రూట్ కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 94 కి.మీ.మేర మాత్రమే విద్యుదీకరణ పనులు జరగాల్సి ఉంది. ఏడాదిలో ఆ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రైలు మార్గాల జాబితాలో మనోహరాబాద్–కొత్తపల్లి రూట్ను చేర్చలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే, విద్యుదీకరించనున్నందున దీనినీ ఎలక్ట్రిఫికేషన్ జాబితాలో చేరుస్తున్నారు. అకోలా మార్గంలో ఖానాపూర్–కమలాపూర్–నందగావ్ మధ్య పనులు జరగాల్సి ఉంది. అక్కన్నపేట–మెదక్ మధ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితే తెలంగాణలో 100% విద్యుదీకరణ జరిగినట్టవుతుంది. రూ.105 కోట్లతో పనులు.. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ దాటాక ఈ కొత్త మార్గం మొదలవుతుంది. అక్కడి నుంచి 76.65 కి.మీ. దూరంలో ఉన్న సిద్దిపేట వరకు పనులు పూర్తి కావటంతో రైలు సరీ్వసులు ప్రారంభించారు. ప్రస్తుతం డీజిల్ లోకోతో కూడిన డెమూ రైళ్లు నడుస్తున్నాయి. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల సమీపంలోని మానేరు మీద వంతెన నిర్మించి నది దాటాక కొత్తపల్లి వరకు ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 2027 నాటికి ఆ పనులు పూర్తవుతాయి. ఈలోపు సిద్దిపేట వరకు విద్యుదీకరించాలని నిర్ణయించి, అక్కడి వరకు రూ.105.05 కోట్లతో నిర్వహించే పనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో నిర్మాణ సంస్థకు అవార్డు అందచేయటంతో పనులు మొదలుకానున్నాయి. గజ్వేల్ సమీపంలో 25 కేవీ సబ్స్టేషన్.. విద్యుత్ సరఫరా కోసం గజ్వేల్ సమీపంలో 25 కేవీ సామర్థ్యంతో ప్రత్యేక సబ్స్టేషన్ను నిర్మించనున్నారు. త్వరలో ఈ పనులు మొదలు కానున్నాయి. స్థానికంగా ఉన్న 132 కేవీ సబ్స్టేషన్తో దీనిని అనుసంధానిస్తారు. -
‘లైడర్’ వచ్చేస్తోంది
రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. తొలి దశలో 1,000 రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి కేంద్రం తీసుకు వస్తోంది. సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ మరో వినూత్న ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైళ్లు పట్టాలు తప్పి జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘లైట్ డిటెక్టింగ్–రేంజింగ్ (లైడర్)’ టెక్నాలజీ పేరిట అధునాతన వ్యవస్థను నెలకొల్పేందుకు నిర్ణయించింది. విద్రోహ శక్తులు రైళ్లను పట్టాలు తప్పేలా చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 24సార్లు రైళ్లను పట్టాలు తప్పించేందుకు పన్నిన కుట్రలు బట్టబయలయ్యాయి. రైలు పట్టాలను తొలగించడం, పట్టాలపై ప్రమాదకర వస్తువులను పెట్టడం వంటి దుశ్చర్యలకు విద్రోహులు పాల్పడుతున్నారు. అలాంటి కుట్రలకు చెక్ పెట్టేందుకు రైలు పట్టాల భద్రత కోసం రైల్వే శాఖ లైడర్ ప్రాజెక్ట్ను రూపొందించింది. ఇప్పటికే పట్టాలు తప్పి జరిగే ప్రమాదాల నివారణ కోసం రూ.15 వేల కోట్లతో రైలు కోచ్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుకు రైల్లే శాఖ కార్యచరణ చేపట్టింది. దానికి అదనంగా లైడర్ ప్రాజెక్ట్కు కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే టెండర్లు పిలిచిన ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు సంక్లిప్తంగా...దేశవ్యాప్తంగా విస్తరణలైడర్ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. మొదటి దశలో వెయ్యి రైళ్లలో రూ.1,500 కి.మీ. మేర రైల్వే ట్రాక్లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకొస్తారు. ఇందుకు సంబంధించి రూ.3,200 కోట్ల ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ పనులు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్లు సైతం పిలిచింది. ఈ ప్రాజక్ట్ను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెన్సార్ టెక్నాలజీతో..» లైడర్ ప్రాజెక్ట్లో భాగంగా ఉండే సెన్సార్ టెక్నాలజీ రైలు పట్టాల త్రీడీ నమూనాలను రూపొందించి లోకో పైలెట్ కేబిన్లోకి పంపిస్తుంది. » రైళ్లలో ఏర్పాటు చేసే సెన్సార్లు రైలు పట్టాల రియల్ టైమ్ డేటాను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. » రైలు పట్టాలు తప్పినా, పట్టాలు విరిగినా, పట్టాలపై చిన్న బీటలు ఉన్నా సరే వెంటనే గుర్తించవచ్చు. » లేజర్ బీమ్లతో రైలు పట్టాలను సెన్సార్ చేసి.. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే గుర్తించే వీలు కలుగుతుంది.» ఆ ప్రమాదం ఎంత దూరంలో ఉందన్నది కూడా ఈ సాంకేతికత కచ్చితంగా తెలియజేస్తుంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే కనీసం 15 కి.మీ. దూరంలోనే రైలును నిలిపివేసేందుకు లోకో పైలట్కు అవకాశం ఉంటుంది. -
‘కవచ్’కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు రైల్వే శాఖ మేల్కొంది. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు అవి పరస్పరం ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక ‘కవచ్’ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రయోగాలు, పరీక్షలు అంటూ కాలయాపన చేసిన తర్వాత ఆ పరిజ్ఞానాన్ని ట్రాక్ మీద, లోకోమోటివ్లలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచింది. ఈ పరిజ్ఞానానికి సంబంధించి 4.0 వెర్షన్ ప్రయోగాలు విజయవంతం కావటంతో, దాన్ని దశలవారీగా అన్ని జోన్లలో ఏర్పాటు చేయనుంది.ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 వేల రూట్ కిలోమీటర్లలో ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో ఆ వ్యవస్థ ఉండగా, కొత్తగా మరో 1,618 రూట్ కి.మీ.లలో ఏర్పాటుకు తాజాగా రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. దక్షిణ మధ్య రైల్వేతో శ్రీకారం..: దేశంలో తొలిసారి కవచ్ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఏర్పాటు చేశారు. కవచ్ పరిజ్ఞా నాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు 2014–15లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్నగర్–వికారాబాద్–వాడి సెక్షన్లను ఎంచుకున్నారు. 250 కి.మీ. పరి ధిలో పలు దశల్లో పరీక్షించారు. 2015–16లో ప్యాసింజర్ రైళ్లలో క్షేత్రస్థాయి ట్రయల్స్ నిర్వ హించారు. 2017–18లో కవచ్ స్పెసిఫికేషన్ వెర్షన్ 3.2ను విజయవంతంగా ముగించారు. 2018–19లో ఈ పరిజ్ఞానానికి ఆర్డీఎస్ఓ ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో, 200 లోకోమోటివ్స్లో ఏర్పాటైంది. ఇప్పుడు కవచ్ మేజర్ వర్షన్ అయిన 4.0 ద్వారా ఆ పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షన్ ట్రయల్స్ కోసం సనత్నగర్–వికారాబాద్ సెక్షన్ పరిధిలో 65 రూట్ కి.మీ.లలో ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ పరీక్షలు విజయవంతం కావడంతో ఈ పరిజ్ఞానాన్ని హై డెన్సిటీ నెట్ వర్క్ పరిధిలో ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోస బలార్షా–కాజీపేట– విజయవాడ, విజయవాడ–గూడూరు, విజయ వాడ–దువ్వాడ, వాడి–గుంతకల్–ఎర్రగుంట్ల–రేణిగుంట కారిడార్లలో ఏర్పాటు చేస్తారు. ఈ రూట్లలో మొత్తం 1,618 రూట్ కి.మీ. లలో ఏర్పాటుకు ఇటీవల టెండర్లు పిలిచారు. కవచ్తో ఇవీ లాభాలు» ఒకే ట్రాక్మీద రెండు రైళ్లు వచ్చినప్పు డు లోకోపైలట్ బ్రేక్ వేయకపోయినా, ఆ పరిజ్ఞానం వల్ల రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుంది. » ఎక్కడైనా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు లోకోపైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు నడిపినప్పుడు లోకో పైలట్ను ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ రైలును ఆపకపోతే తనంతట తానుగా బ్రేక్ వేస్తుంది. » అవసరమైన ప్రాంతాల్లో హారన్ మోగించనప్పుడు ఇది తనంతట తానుగా ఆ పని చేస్తుంది. -
ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో
సాక్షి, హైదరాబాద్: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్ రైలు సిరీస్లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి 360 కి.మీ. దూరంలోని భుజ్ నగరం మధ్య ఇది నడవనుంది. మరిన్ని వందే మెట్రో రైళ్లను కూడా త్వరలో ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్–విజయవాడ రూట్ ఉంది. వందే మెట్రో కూడా వందేభారత్ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది.350 కి.మీ. నిడివి వరకు..100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం. ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.కు) రూ.445గా ఉండనుంది. -
సికింద్రాబాద్–నాగ్పూర్ వందేభారత్కు 20 కోచ్లు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పునకు కారణమైన వందేభారత్ రైళ్ల సిరీస్లో మరో నూతన అంకానికి కేంద్ర ప్రభుత్వం తెరదీస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ కేటగిరీ రైళ్లలో మొదలైన వందేభారత్ తదుపరి వర్షన్గా వందేభారత్ స్లీపర్ సరీ్వసులు ప్రారంభిస్తున్న రైల్వే, తాజాగా 20 కోచ్లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 16 కోచ్ల వందేభారత్, 8 కోచ్ల మినీ వందేభారత్ రైళ్లే తిరుగుతున్నాయి. మొదటిసారి 20 కోచ్ల రేక్ను ప్రారంభిస్తున్నారు. ఒకేసారి అలాంటి నాలుగు రైళ్లను ప్రారంభిస్తుండగా, అందులో ఒకటి తెలంగాణ నుంచి నడవనుండటం విశేషం. ఈనెల 16న ప్రారంభం కానున్న సికింద్రాబాద్–నాగ్పూర్ ఆరెంజ్ వందేభారత్ను కూడా 20 కోచ్లతో ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లే..మరింతమంది ప్రయాణికులను సర్దుబాటు చేసే క్రమంలో 20 కోచ్ల సెట్ను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ ఆలోచనకు రాగా, ప్రతినెలా అలాంటి ఒక సెట్ను తయారు చేయాలని చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యా క్టరీని ఆదేశించింది. దీంతో మే, జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి నాలుగు రేక్లు సిద్ధమయ్యాయి. వాటిల్లో రెండింటిని ఉత్తర రైల్వేకు, తూర్పు రైల్వేకు, సెంట్రల్ రైల్వే జోన్కు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. హైదరాబాద్–నాగ్పూర్ మధ్య వందేభారత్ రైలు గతంలోనే మంజూరైంది. రేక్ కొరత వల్ల దాని ప్రారంభం ఆలస్యమవుతూ వచి్చంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వేకు కేటాయించిన 20 కోచ్ల రైలును సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య తిప్పనున్నట్టు తెలిసింది. 20 కోచ్ల వందేభారత్లో 3 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు, 16 ఎకానమీ (ఏసీ చైర్కార్) కోచ్లు ఉంటాయని సమాచారం. సాధారణ 16 కోచ్ల రేక్లో ఎగ్జిక్యూటివ్ కోచ్లు 2, ఎకానమీ కోచ్లు 14 ఉంటున్నాయి.యమ గిరాకీఎనిమిది కోచ్ల వందేభారత్లో 530 సీట్లుంటున్నాయి. అదే 16 కోచ్ల వందేభారత్లో 1,128 సీట్లు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 20 కోచ్ల రేక్లో 312 సీట్లు పెంచుతూ వాటి సంఖ్యను 1,440కి విస్తరించారు. ఆ మేరకు ప్రయాణికులకు అదనంగా వెసులుబాటు కలుగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు విపరీతమైన గిరాకీ ఉంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న నాలుగు వందేభారత్ రైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేషియో 110 శాతంగా ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం వందేభారత్లో అది 130 శాతాన్ని మించింది. దీంతో కోచ్ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్–నాగ్పూర్ మధ్య మూడు డెయిలీ ఎక్స్ప్రెస్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్, దక్షిణ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ మధ్య నడిచే దానాపూర్ ఎక్స్ప్రెస్లు నాగ్పూర్ మీదుగా నడుస్తున్నాయి. ఇవి కాకుండా వారానికి ఓసారి నడిచే హైదరాబాద్–ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, వారానికి నాలుగు రోజులు తిరిగే బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్లు సహా మొత్తం 8 రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వందేభారత్ రైలు రానుంది. -
సికింద్రాబాద్: రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక, ఇక నుంచి..
వేలాదిమంది ప్రయాణికులు... ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఒకటి– పది.. ప్లాట్ఫామ్స్ వైపు ఉన్న ప్రవేశద్వారాల్లో బ్యాగేజీ చెకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పని చేయదు. పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నా పట్టించుకోరు.. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్ఫామ్లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్ఫామ్లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో... వెరసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా రూపుదిద్దుకొంటున్న సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్గా రూపాంతరం చెందనుంది. వెరసి ఈ స్టేషన్ను ఎయిర్పోర్ట్ తరహాలో పటిష్టమైన భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా రూపాంతరం చెందిన ఘనతను సాధించుకున్నది భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. కానీ, అక్కడ భారీ వ్యయంతో బ్యాగేజీ స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా.. అది ఇంకా ఉపయోగంలోకి రాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ సికింద్రాబాద్ స్టేషన్కు అటువంటి పరిస్థితి రాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.లగేజీ చెకింగ్ తర్వాతే లోనికిసికింద్రాబాద్ స్టేషన్కు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు, పదో నెంబర్ ప్లాట్ఫామ్ ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కోవైపు రూ.3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజీ స్క్రీనింగ్ మెషీన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు కచ్చితంగా తమ లగేజీని ఈ స్క్రీనింగ్లో చెకింగ్ పూర్తి చేయించుకునే లోనికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు రైలు బయలుదేరే వేళ కంటే కాస్త ముందుగానే స్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతి విమానాశ్రయాల్లోనే ఉంటోంది. విమాన ప్రయాణికులకు లగేజీ చెకింగ్ అనేది నిర్బంధ ప్రక్రియ. అది జరక్కుంటే విమానంలోకి అనుమతి ఉండదు. అదే పద్ధతిని సికింద్రాబాద్ స్టేషన్లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.రైలు అనౌన్స్మెంట్ అయ్యాకే ప్లాట్ఫామ్ పైకిప్రస్తుతం స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్పామ్లపైకి చేరుకుంటున్నారు. కానీ, ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి. లేదా.. షాపింగ్ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకు రావటానికి పదిపదిహేను నిమిషాల ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్ఫామ్ మీదకు అనుమతిస్తారు.ఆలస్యంగా వస్తే అంతేసరిగ్గా రైలు బయలుదేరే సమయానికి హడావుడిగా ప్లాట్ఫామ్ మీదకు పరుగెత్తుకు రావటం స్టేషన్లలో నిత్యకృత్యం. కానీ, కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి వచ్చాక.. సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి వారిని అనుమతించకూడదన్న యోచనలో అధికారులున్నారు. కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్ ఉంటున్నందున.. ముందుగానే స్టేషన్కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వారు కూడా లగేజీ చెకింగ్ పూర్తి చేసుకునే ప్లాట్ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు.. లేదంటే వెనుదిరగాల్సిందే.కునుకు కోసం వచ్చే వారికి ఇక నో ఎంట్రీప్రయాణాలతో ప్రమేయం లేకుండా చాలా మంది చీకటిపడగానే స్టేషన్లోకి చేరుకుని ఏ ఖాళీ బెంచీనో చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. ఇక అలాంటి వారికి లోనికి అనుమతి ఉండదు. టికెట్ ఉన్న వారిని మాత్రమే.. రైలు వచ్చే వేళకు ప్లాట్ఫామ్పైకి అనుమతిస్తారు. లేని వారికి నో ఎంట్రీ. వెరసి ఇక ప్లాట్ఫామ్ ప్రాంతాలు అడ్డదిడ్డంగా పడుకునేవారితో కనిపించవన్నమాట.మిగతావాటి సంగతేంటి..?ప్రపంచస్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. ఏపీ పరిధిలో తిరుపతి, నెల్లూరు ఉండగా, తెలంగాణలో ఒక్క సికింద్రాబాద్ మాత్రమే ఉంది. ఇక జోన్ వ్యాప్తంగా మరో 119 స్టేషన్లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు. ఇవి ఉన్న భవనాలను మెరుగు పరుస్తారు. సికింద్రాబాద్ తరహాలో మొత్తం భవనాలను తొలగించి కొత్తగా నిర్మించరు. అమృత్భారత్ స్టేషన్లలో ఈ పద్ధతులు ఉండాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అమృత్భారత్ ప్రోగ్రామ్లో భాగంగానే అభివృద్ధి చేస్తున్న నగరంలోని కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో మాత్రం సికింద్రాబాద్ తరహా విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు. -
భూ పరిహారానికీ పైసల్లేవు
సాక్షి, హైదరాబాద్: కీలక రైల్వే ప్రాజెక్టు పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించలేకపోతోంది. తక్కువ మొత్తమే అవసరమున్నా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయే దుస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి గ్రీన్ఫీల్డ్ రైల్వే మార్గంగా పనులు ప్రారంభించుకున్న మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు పనులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వేగం మందగించింది. రాజధాని నగరంతో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్లాంటి కీలక పట్టణాలను నేరుగా అనుసంధానించే కీలక ప్రాజెక్టు అయినప్పటికీ, భూసేకరణ నిధులు విడుదల చేయకపోవటంతో ఆ ప్రాజెక్టు పనులు పడకేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు 2023లో రైలు సర్విసు ప్రారంభించారు. ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి సిరిసిల్ల వరకు రైలు సర్విసు ప్రారంభించేలా పనులు పూర్తి చేయాల్సి ఉంది. సిరిసిల్ల స్టేషన్కు చేరువలో ఉన్న మానేరు నదిని దాటి తదుపరి కరీంనగర్ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. సిరిసిల్ల వరకు ట్రాక్ (రెయిల్స్ పరవటం) ఏర్పాటు పనులు జరుపుతూనే, కరీంనగర్ వరకు నేలను లెవల్ చేసే పనిని సమాంతరంగా నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడే చిక్కు వచ్చి పడింది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనుల కోసం టెండర్లు పిలిచి పనులు నిర్వహిస్తున్న రైల్వే, ఆపై కరీంనగర్ వరకు కూడా తదుపరి టెండర్ పిలవాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి వరకు భూసేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. దీంతో అక్కడి వరకు భూమి రైల్వేకు స్వా«దీనం కావటంతో.. తంగళ్లపల్లి వరకు పనుల కోసం టెండర్లు పిలిచింది. ఇప్పుడు ఆక్కడే పనులు జరుగుతున్నాయి. తంగళ్లపల్లి తర్వాత 15 హెక్టార్ల అటవీ భూములున్నాయి. దానికి సంబంధించి అనుమతి రావాల్సి ఉంది. ఆ తర్వాత సిరిసిల్ల వరకు భూపరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేయలేదు. నిజానికి కొత్తపల్లి వరకు భూసేకరణ ప్రక్రియ అంతా పూర్తయింది. రైతులకు పరిహారాన్ని అందించటమే మిగిలిఉంది. పరిహారం అందిస్తేనే ఆ భూములు రైల్వేకు స్వా«దీనం చేసే పరిస్థితి ఉంటుంది. తన వంతు వాటాగా తాజా బడ్జెట్లో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుకు రూ.350 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించింది. గతేడాది బడ్జెట్ నిధుల (రూ.185 కోట్లు) కంటే ఇది దాదాపు రెట్టింపు కావటం విశేషం. రూ.130 కోట్లు మాత్రమే.. తంగళ్లపల్లి నుంచి సిరిసిల్ల మధ్యలో పరిహారం మొత్తం రూ.68 కోట్లుగా ఉంది. ఆ తర్వాత కొత్తపల్లి (చివరి స్టేషన్) వరకు మరో రూ.62 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి సాంకేతిక అంశాలన్నీ పూర్తయి కేవలం పరిహారం చెల్లింపు మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రాజెక్టులో భూసేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ప్రక్రియనే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇతర అవసరాలకు నిధులు మళ్లించటంతో భూపరిహారానికి డబ్బులు కేటాయించలేకపోతోందంటూ కొందరు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ పలుదఫాలుగా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ నిధులు మాత్రం విడుదల కావటం లేదు. భూ పరిహారం చెల్లింపు పూర్తయితే తప్ప ఆ పనులు చేపట్టే వీలు లేదు. రైల్వే శాఖ ఆయా పనులకు టెండర్లు పిలవాలంటే కనీసం 90 శాతం భూమి తన స్వాధీనం అయి ఉండాలి. పరిహారం డబ్బులు చెల్లించనందున స్వా«దీన ప్రక్రియకు వీలు లేదు. దీంతో కొత్తపల్లి వరకు రైలును నడిపేందుకు మరో మూడేళ్ల పాటు నిరీక్షించక తప్పని పరిస్థితి ఉందని తెలుస్తోంది. -
‘ఏసీ’ భారం.. జనరల్ ‘ఘోరం’
ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఆదాయం దృష్టితో కాకుండా బాధ్యతతో వ్యవహరిస్తాయి. ప్రధానంగా మన దేశంలో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి నప్పుడు ఎక్కువగా ప్రయాణించేది రైళ్ల లోనే. అదీ స్లీపర్, జనరల్ కోచ్ల్లోనే. తక్కువ చార్జీతో గమ్యస్థానం చేరొచ్చనేదే పేదల ఆశ. అయితే కొంత కాలంగా రైల్వే శాఖ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. జనరల్, స్లీపర్ కోచ్ లను తగ్గించేస్తూ.. ఏసీ కోచ్లను పెంచేస్తూ ‘పక్కా వ్యాపారం’ చేస్తోంది. పర్యవసానంగా ఏ రైలులోని జనరల్ కోచ్ల్లో చూసినా పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి.. ఒంటి కాలిపై నిల్చొని.. టాయ్లెట్స్ ముందు ఇరుక్కుని.. మెట్లపై వేలాడుతూ.. చెమటలు కార్చుకుంటూ.. చిన్నారుల ఏడుపుల మధ్య ప్రయాణం సాగించాల్సి వస్తోంది. 70–80 మంది ప్రయాణించాల్సిన కోచ్లో దాదాపు 500 మంది వెళుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది. హౌరా, పూరి, గౌహతి–బెంగళూరు ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్.. ఇలా ఒక్కటేమిటి రైళ్లన్నింటిలోనూ ఇదే దుస్థితి. ‘ఊరికి ఎలా వెళ్లాలి దేవుడా..’ అంటూ పేదలు వణికిపోతున్నారు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు.. అనే నానుడికి ఇప్పుడు రైల్లో జనరల్ బోగీ ఎక్కిచూడు.. అనే వాక్యం కలుపుకోవాలి. రైలు ఎక్కాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనని సామాన్యులు హడలి పోతుండటం నేటి వాస్తవం. ఏసీ కోచ్లో వెళ్లాలంటే ఆరి్థక భారం.. స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉండవు.. జనరల్ కోచ్లలో కాలు పెట్టేందుకే చోటుండదు.. ఇదీ సగటు రైల్వే ప్రయాణికుల దుస్థితి. రైల్వేల ఆధునికీకరణ, మెరుగైన సౌకర్యాల పేరుతో రైల్వే శాఖ పన్నిన మాయోపాయం పేద, దిగువ మధ్యతరగతి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ధనిక, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా రైళ్లను తీర్చిదిద్దడమే ఆధునికీకరణని రైల్వే శాఖ వక్రభాష్యం చెబుతోంది. సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండటం.. వారికి మెరుగైన వసతులు సమకూర్చడం అనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. దాదాపు అయిదేళ్లుగా పక్కా పన్నాగంతో జనరల్, స్లీపర్ కోచ్ల సంఖ్యను తగ్గిస్తూ ఏసీ కోచ్ల సంఖ్యను పెంచుతోంది. కోచ్ల సంఖ్యే కాకుండా ఏకంగా దేశంలో జనరల్, స్లీపర్ కోచ్ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ... రాబోయే కాలమంతా ఏసీ రైలు ప్రయాణమేనని తేల్చి చెబుతోంది. కేవలం ఏసీ కోచ్లే అందుబాటులో ఉండేలా చేసి భారీగా టికెట్ల రాబడి పెంచుకోవాలన్న ఉద్దేశంతో సామాన్య ప్రయాణికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ అంశంపై ‘సాక్షి’ దృష్టి సారించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లా కేంద్రాల మీదుగా ప్రయాణించే ప్రధాన రైళ్లలో పరిస్థితిని పరిశీలించింది. యశ్వంత్పూర్, వాస్కోడిగామా, కోరమండల్, హౌరా–చెన్నై మెయిల్, గౌతమి, శేషాద్రి, పద్మావతి, ఎల్టీటీ, అల్లెప్పి–ధన్బాద్, తిరుపతి–పూరి, నవ జీవన్, తిరుపతి –హౌరా, ప్రశాంతి.. ఇలా ఏ రైలు చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్త రైళ్లలో తీవ్ర అవస్థల మయం.. అన్నట్లుంది జనరల్, స్లీపర్ కోచ్లలో ప్రయాణికుల పరిస్థితి. జనరల్, స్లీపర్ కోచ్ల కోత రైల్వే శాఖ ఓ ప్రణాళిక ప్రకారం నాలుగేళ్లుగా వందే భారత్ వంటి ఏసీ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. తద్వారా అధిక చార్జీలు ఉండే ఏసీ కోచ్ల వైపు ప్రయాణికులను మళ్లించడం ద్వారా అధిక ఆదాయ సముపార్జనకే పెద్దపీట వేస్తోంది. మరోవైపు దిగువ మధ్య తరగతి, పేద ప్రయాణికులు ప్రయాణించే స్లీపర్, జనరల్ కోచ్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. 2019లో మొదలుపెట్టిన ఈ ప్రక్రియను మూడేళ్లుగా వేగవంతం చేసింది. సాధారణంగా ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రాయాణికుల కోసం సగటున 22 కోచ్లతో నిర్వహిస్తున్నారు. గతంలో రైళ్లలో జనరల్ కోచ్లు నాలుగు, స్లీపర్ కోచ్లు 12 వరకు ఉండగా.. థర్డ్ ఏసీ కోచ్లు మూడు, సెకండ్ ఏసీ కోచ్లు రెండు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉండేవి. కానీ మూడేళ్లుగా రైలు కోచ్ల కూర్పును రైల్వే శాఖ అమాంతం మార్చేసింది. ప్రస్తుతం జనరల్ కోచ్లు రెండు, స్లీపర్ కోచ్లు 10కి తగ్గించింది. థర్డ్ ఏసీ కోచ్లు ఆరు, సెకండ్ ఏసీ కోచ్లు మూడు, ఫస్ట్ ఏసీ కోచ్ ఒకటిగా చేసింది. దాంతో ఒక్కో రైలులో స్లీపర్ కోచ్లలో దాదాపు 150 బెర్త్లు, జనరల్ కోచ్లలో 150 వరకు సీట్లు తగ్గిపోయాయి. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఆధారపడే 300 సీట్లలో కోత పడింది. మరోవైపు ఏసీ కోచ్ల సంఖ్య పెరగడంతో వాటిలో 280 నుంచి 300 బెర్త్లు పెరిగాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవుల స్పెషల్ రైళ్లలో అయితే స్లీపర్ కోచ్ల సంఖ్య కేవలం ఆరింటికే పరిమితం చేస్తూ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ప్రధానమైన 40 రైళ్లలో ఏకంగా 100 ఏసీ కోచ్లను పెంచింది. వాటిలో థర్డ్ ఏసీ కోచ్లు 75, సెకండ్ ఏసీ కోచ్లు 20, ఫస్ట్ ఏసీ కోచ్లు 5 ఉన్నాయి. కొత్తగా ఎల్హెచ్బీ సాంకేతిక విధానంతో ఉత్పత్తి చేస్తున్న కోచ్లను ప్రవేశపెడుతున్నామనే సాకుతో స్లీపర్ కోచ్లను తగ్గిస్తూ ఏసీ కోచ్ల సంఖ్యను పెంచుతోంది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోచ్ల ఉత్పత్తిలోనూ అదే వివక్ష కొత్త రైల్వే కోచ్ల ఉత్పత్తిలోనూ కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రయాణికుల పట్ల వివక్ష కనబరుస్తోంది. అయిదేళ్లుగా రైల్వే శాఖ ఉత్పత్తి చేస్తున్న కోచ్ల విధానమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని చెన్నై, కపుర్తలా, రాయ్బరేలీలోని కోచ్ ఫ్యాక్టరీలలో జనరల్, స్లీపర్ కోచ్ల ఉత్పత్తిని రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తూ... ఏసీ కోచ్ల ఉత్పత్తిని పెంచుతోంది. ఆ మూడు ఫ్యాక్టరీలలో 2019–20లో 997 ఏసీ కోచ్లను ఉత్పత్తి చేశారు. కాగా 2024–25లో ఏకంగా 2,571 ఏసీ కోచ్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మరోవైపు ఆ ఫ్యాక్టరీలలో 2019–20లో 1,925 జనరల్, స్లీపర్ కోచ్లను ఉత్పత్తి చేశారు. ఆ ఉత్పత్తిలో 85 శాతం కోత విధించి 2024–25లో కేవలం 278 కోచ్లే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. అంటే జనరల్, స్లీపర్ కోచ్ల స్థానంలో క్రమంగా ఏసీ కోచ్లను ప్రవేశపెట్టాలనే కార్యచరణ అమలు చేస్తోంది. 22 కోచ్లు ఉన్న రైళ్లలో కనీసం 18 ఏసీ కోచ్లే ఉండేట్టుగా చేయాలన్నది రైల్వే శాఖ అంతిమ లక్ష్యమని రైల్వే వర్గాలు చెప్పడం గమనార్హం. ‘స్లీపర్’లో దొరకదు.. ‘జనరల్’లో చోటు ఉండదు రైల్లో ప్రయాణం అంటేనే పేదలు, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. స్లీపర్ కోచ్లో ప్రయాణం చేద్దామంటే రిజర్వేషన్లు దొరకడం లేదు. బెర్త్లు తగ్గిపోవడంతో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే రిజర్వేషన్ దొరకదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ విధానంలో రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధర తడిసి మోపెడవుతోంది. జనరల్ కోచ్లో వెళ్లడం అంటే ప్రాణాలకు తెగించి సాహసం చేసినట్టే. ఒక జనరల్ కోచ్లో 72 నుంచి 80 వరకు సీట్లు ఉంటాయి. కానీ ఏ సమయంలో ఏ రైలులో జనరల్ కోచ్ చూసినా కనీసం 100 నుంచి 150 మంది వరకు ఉంటారు. ముగ్గురు కూర్చునే బెర్త్లో ఆరుగురు కూర్చోవడమే కాదు.. సీట్ల మధ్య ఖాళీల్లోనూ చివరికి లగేజీ పెట్టే రాక్ల మీద కూడా కూర్చొని కనిపిస్తారు. టాయిలెట్ల పక్కన ఒకరిని నెట్టుకుంటూ ఒకరు కూర్చోనో, నిలబడో పరస్పరం ఘర్షణ పడుతూ ప్రయాణిస్తుండటం అన్నది మన రైళ్లలో సర్వసాధారణమైంది. కనీసం నీళ్లు తాగుదామన్నా అవ్వదు.. టాయిలెట్కు వెళ్దామంటే కుదరదు.. కాలు కదుపుదామన్నా సాధ్యం కాదు.. మెట్లపైన సైతం వేలాడుతూ ప్రాణాలకు తెగించి ప్రయాణించే ప్రయాణికుల దృశ్యాలు మన రైళ్లలో నిత్యం ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపిస్తాయి. అధిక రాబడే రైల్వే శాఖ లక్ష్యం అధిక రాబడే లక్ష్యంగా రైల్వే శాఖ ఏసీ కోచ్లకు పరిమితికి మించి ప్రాధాన్యమిస్తోంది. జనరల్, స్లీపర్ కోచ్లను తగ్గించి ఏసీ కోచ్లను పెంచితే అధిక రాబడి వస్తుందన్నది రైల్వే శాఖ ఉద్దేశం. ఉదాహరణకు గోదావరి ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి విశాఖపట్నంకు స్లీపర్ కోచ్లో టికెట్ రూ.255. అదే థర్డ్ ఏసీ అయితే 660, సెకండ్ ఏసీ అయితే 910, ఫస్ట్ ఏసీ అయితే రూ.1,551. ఈ లెక్కన స్లీపర్ కోచ్ కంటే థర్డ్ ఏసీ 100 శాతానికి పైగా, సెకండ్ ఏసీ 200 శాతంపైగా, ఫస్ట్ ఏసీ ఏకంగా 400–500 శాతం అధికం. రైల్వే శాఖ స్లీపర్ కోచ్లను తగ్గిస్తూ ఏసీ కోచ్లను పెంచడం వెనుక లోగట్టు అధిక రాబడే అని ఈ గణాంకాలు బట్టబయలు చేస్తున్నాయి. రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 22 వేల రైళ్లను నిర్వహిస్తుండగా వాటిలో రోజుకు సగటున 13,500 రైళ్లు నిర్వహిస్తోంది. వాటిలో రోజూ 2.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఆ లెక్కన జనరల్, స్లీపర్ కోచ్లను తగ్గించి ఏసీ కోచ్లు మాత్రమే అందుబాటులో ఉండేట్టు చేస్తే టికెట్ల ద్వారా భారీ రాబడి సాధించవచ్చనద్ని రైల్వే శాఖ ఉద్దేశం. అంటే కేంద్ర ప్రభుత్వానికి లాభం.. సామాన్య ప్రయాణికులకు భారం. ఇదే రైల్వే శాఖ లెక్క.అమ్మో వందే భారత్ అత్యధిక చార్జీలతో పూర్తిగా ఏసీ కోచ్లతో నిర్వహించే వందే భారత్ రైళ్లకే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తుండటం సామాన్యులకు భారంగా మారింది. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లన్నీ వందేభారత్ రైళ్లేనని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ ప్రస్తుతం దేశంలో 41 వందేభారత్ రైళ్లను నిర్వహిస్తోంది. వాటిలో ఏపీలో నాలుగు నిర్వహిస్తున్నారు. కాగా 2030 నాటికి 800 వందేభారత్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలోని 40 వేల కోచ్లను కూడా వందేభారత్ కోచ్ల స్థాయికి ఆధునికీకరిస్తామని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ రైళ్లను నిర్ధిష్ట సమయంలో నడిపేందుకు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.కాళ్లు కింద మోపలేం విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే గౌహతి–బెంగళూరు ఎక్స్ప్రెస్ మంగళవారం కిక్కిరిసి విశాఖపట్నం చేరుకుంది. ఈ రైలులో జనరల్, స్లీపర్క్లాస్లలో కనీసం కాలు మోపేందుకు కూడా ఖాళీ లేదు. ఈ రైలులో జనరల్4, స్లీపర్7, ఏసీ కోచ్లు 8 ఉన్నాయి. జనరల్ కోచ్లలో 200 మంది చొప్పున ఉన్నారు. స్లీపర్ కోచ్లో కేవలం 78 బెర్తుల చొప్పున మాత్రమే ఉన్నప్పటకీ రెట్టింపు ప్రయాణికులు కనిపించారు. డిబ్రూగడ్–కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే విధంగా కిక్కిరిసి వెళ్లింది. ఈ రైలులో జనరల్ బోగీలు మూడు మాత్రమే ఉన్నాయి. ఉత్తరాంద్ర వాసుల ప్రధాన రైలు గోదావరి ఎక్స్ప్రెస్కు ఉన్న రెండు జనరల్ కోచ్లలో పరిస్థితి కనీసం కాలు మోపలేని విధంగా ఉంది. రెండు బోగీల్లో వెయ్యి మంది! ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే తిరుపతి నగరం మీదుగా రోజూ పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లలోని జనరల్ బోగీలన్నీ కిక్కిరిసి ఉంటాయి. హౌరా ఎక్స్ప్రెస్ రైల్లోని జనరల్ బోగీలో అయితే ఒకరిపై ఒకరు కూర్చొని, నిల్చొని ప్రయాణిస్తుండటం రోజూ కనిపిస్తుంది. బెంగళూరు నుంచి కాటా్పడి, తిరుపతి, రేణిగుంట, ఒంగోలు, విజయవాడ, శ్రీకాకుళం, పలాస మీదుగా హౌరాకు చేరుకునే ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసి నడిచింది. ఇందులో జనరల్ బోగీలు కేవలం రెండే ఉన్నాయి. ఈ రెండు బోగీల కెపాసిటీ 180 మంది. మంగళవారం సుమారు వెయ్యి మంది ప్రయాణించి ఉండొచ్చని అధికారుల అంచనా. అనేక మంది ఒంటి కాలుపై నిల్చుని ఉండటం కనిపించింది.ఉన్న వాటికీ ఎసరు ఏలూరులో మంగళవారం ఈస్ట్కోస్ట్ రైలు మధ్యాహ్నం 3.50 గంటలకు వచి్చంది. రెండే జనరల్ బోగీలున్నాయి. అప్పటికే ఆ బోగీ కిక్కిరిసి ఉంది. ఒక్క ఏలూరులోనే ఈ రెండు జనరల్ బోగీల్లో 60 మంది ఎక్కారు. ఒక్కో బోగీలో 150–200 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బాత్రూమ్ల వద్ద, నడిచే మార్గంలో, వాకిట్లో కూర్చున్నారు. మరి కొంతమంది రెండు బోగీలను కలిపే మార్గంలో టాయిలెట్లను ఆనుకుని కూడా కూర్చోనుండటం కని్పంచింది. కరోనా సమయంలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదు. మహిళలు, దివ్యాంగులు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఉండే బోగీ ఇప్పుడు కనిపించడం లేదు. ఉన్న రైళ్లనూ రద్దు చేస్తున్నారు.ఇదీ లెక్కరాష్ట్రంలో రోజూ సగటున ప్రయాణిస్తున్న రైళ్లు 340350ఇందులో విజయవాడ మీదుగా వెళ్తున్న రైళ్లు 280విజయవాడ నుంచి రోజూ రాకపోకలుసాగిస్తున్న ప్రయాణికులు 1,00,000మొత్తం ప్రయాణికుల్లో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారు 40%స్లీపర్ క్లాసులో ప్రయాణిస్తున్నవారు 20%ఒక రైల్లో జనరల్ బోగీలు 10% -
చెన్నై–మైసూర్ మధ్య హైస్పీడ్ రైలు
సాక్షి, అమరావతి : దక్షిణ భారతదేశంలో చెన్నై–మైసూర్ మధ్య తొలి హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా ప్రత్యేక కారిడార్ను నిరి్మంచాలని జాతీయ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 463 కి.మీ. మేర ఈ కారిడార్ను నిర్మిస్తారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ 83 కి.మీ.మేర నిరి్మంచనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్ను రైల్వేశాఖ సూత్రప్రాయంగా ఆమోదించి భూసేకరణ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఖరారు చేయనుంది. మూడు రాష్ట్రాల మీదుగా.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మిస్తారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూర్ వరకు నిరి్మస్తారు. మొత్తం 463 కి.మీ. పొడవైన ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్లో 83 కి.మీ. మేర ఉంటుంది. తమిళనాడులో 122 కి.మీ, కర్ణాటకలో 258 కి.మీ. మేర నిరి్మస్తారు. రెండు దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టును మొదటి దశ కింద చెన్నై నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ., రెండో దశ కింద బెంగళూరు నుంచి మైసూర్ వరకు 157 కి.మీ. మేర నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ హైస్పీడ్ కారిడార్లో భాగంగా ఏలివేటెడ్ కారిడార్, ఎట్ గ్రేడ్, టెన్నెల్, గ్రీన్ఫీల్డ్ సెగ్మెంట్లుగా నిర్మించాలని డిజైన్ను ఖరారుచేశారు. ఈ కారిడార్లో భాగంగా 30 కి.మీ.మేర సొరంగాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చెన్నైలో 2.8 కి.మీ, చిత్తూరులో 11.8 కి.మీ., బెంగళూరు రూరల్లో 2 కి.మీ., బెంగళూరులో 11 కి.మీ. మేర వీటిని నిర్మిస్తారు. మొత్తం 11 స్టేషన్లు.. ఏపీలో చిత్తూరులో హాల్ట్.. ఇక ఈ హైస్పీడ్ రైలుకు చెన్నై–మైసూర్ మధ్య 11 చోట్ల హాల్ట్లు కల్పిస్తారు. ఏపీలో ఒక్క చిత్తూరులోనే ఉంటుంది. దీంతోపాటు చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్లి, వైట్ఫీల్డ్, బైయపనహళ్లి, ఎల్రక్టానిక్స్ సిటీ, కెంగేరీ, మాండ్య, మైసూర్లలో ఎలివేటెడ్ రైల్వేస్టేషన్లను నిరి్మస్తారు. భూసేకరణ ప్రక్రియపై కసరత్తు.. హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 303 గ్రామాలు, పట్టణాల మీదుగా నిరి్మంచాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకోసం తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రామనగర, మాండ్య, మైసూర్ జిల్లాల్లో 2,905 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 2,660 ఎకరాలు ప్రైవేటు భూములే. ప్రస్తుతం రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు.. భూసేకరణ ప్రక్రియపై ప్రాథమిక కసరత్తు చేపట్టింది. అనంతరం డీపీఆర్ను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 2025–26 ఆరి్థక సంవత్సరంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నది రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట వేగం గంటకు 350 కి.మీ..ఇక ఈ హైస్పీడ్ రైల్ గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. సగటు వేగం గంటకు 250 కి.మీ. ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. మొత్తం 730 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. -
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
గోండా రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో దిబ్రూఘఢ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి నలుగురు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, గాయపడిన 17 మందికి ప్రయాణికులకు చికిత్స అందుతోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోపు లోకోపైలట్ (డ్రైవర్) మీడియాతో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.‘రైలు పట్టాలు తప్పడానికి ముందు భారీ పేలుడు శబ్ధం విన్నా’అని అన్నారాయన. అయితే ఇందులో కుట్ర కోణాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి రైలు నెంబర్ 15904 చండీగఢ్ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రూఘఢ్(అసోం)కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్న సమయంలో గోండా-మంకాపూర్ సెక్షన్లో మోతిఘడ్ స్టేషన్ దాటాక.. పికౌరా వద్ద ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. Gonda Train Derailment | Ex gratia of Rs. 10 lakhs to the family of the deceased, Rs 2.5 lakhs for grievous injury and Rs. 50,000 to the minor injured, has been announced. Apart from the CRS enquiry, a high-level enquiry has been ordered: Ministry of Railways pic.twitter.com/0mDy97pheD— ANI (@ANI) July 18, 2024 -
46 రైళ్లలో జనరల్ బోగీల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దేశవ్యాప్తంగా జనరల్ బోగీలను పెంచాలన్న ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిదశలో దేశంలోని 46 ప్రముఖ రైళ్లలో రెండేసి చొప్పున మొత్తం 92 జనరల్ కోచ్లను పెంచుతున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే త్వరలో మరో 22 రైళ్లలో జనరల్ కోచ్లను పెంచనున్నట్లు పేర్కొంది. కాగా, విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తున్న 12 జతల ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా 23 జనరల్ కోచ్లను ఏర్పాటు చేసి నడపనున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఆ జాబితాలో సికింద్రాబాద్–గూడూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ (12710/12709) నవంబర్ 8 నుంచి, సికింద్రాబాద్–హౌరా, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12704/12703) నవంబర్ 8 నుంచి, హైదరాబాద్–విశాఖపట్నం, గోదావరి ఎక్స్ప్రెస్ (12728/12727) నవంబర్ 10 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, గౌతమి ఎక్స్ప్రెస్ (12737/12738) నవంబర్ 8 నుంచి, కాకినాడ పోర్టు–భవనగర్, కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ (12755/12756) ఈ నెల 14 నుంచి, కాకినాడ పోర్టు–షిర్డీ సాయినగర్, షిర్డీ ఎక్స్ప్రెస్ (17206/17205) నవంబర్ 11 నుంచి, హైదరాబాద్–తాంబరం, చార్మినార్ ఎక్స్ప్రెస్ (12760/12759) నవంబర్ 11 నుంచి, కాకినాడ పోర్టు–లింగంపల్లి, కొకనాడ ఎక్స్ప్రెస్ (12775/12776) నవంబర్ 12 నుంచి, సికింద్రాబాద్–భువనేశ్వర్, విశాఖ ఎక్స్ప్రెస్ (17016/17015) నవంబర్ 14 నుంచి, మచిలీపట్నం–యశ్వంత్పూర్, కొండవీడు ఎక్స్ప్రెస్ (17211/17212) నవంబర్ 11 నుంచి, మచిలీపట్నం–ధర్మవరం, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ (17215/17216) ఈ నెల 12 నుంచి, కాకినాడ పోర్టు–లోకమాన్య తిలక్ టెర్మినస్, షిర్డీ ఎక్స్ప్రెస్ (17221/17222) నవంబర్ 16 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే తిరుపతి–కొల్లం ఎక్స్ప్రెస్ (17421/17422) కూడా ఈ జాబితాలో ఉంది. -
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా
సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ.. ‘ఏటీవీఎం ఫెసిలిటేటర్’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్.. రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ / డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లలో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. బోగస్ వెబ్సైట్లతో టోకరా.. రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్ను కొందరు మోసగాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్సైట్లను సృష్టించి యువతను మభ్య పెడుతున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్ను మారి్ఫంగ్ చేసి ఆ నకిలీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదురైల్వే శాఖ స్పష్టికరణ ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్కు కొత్త రైల్వే లైన్ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
కలలు మాని... కళ్ళు తెరవాలి!
ఏడాది గడిచిందో లేదో... సరిగ్గా అదే రకమైన దుర్ఘటన. అవే రకమైన దృశ్యాలు. మళ్ళీ అవే అనునయ విచారాలు, నష్టపరిహారాలు, దర్యాప్తుకు ఆదేశాలు, భద్రతే తమకు ముఖ్యమంటూ సర్కారీ ప్రకటనలు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సీల్డా వెళుతూ ఆగివున్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు గుద్దుకున్న సోమవారం నాటి ప్రమాద దృశ్యాలు, తదనంతర పరిణామాలు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. నిరుడు జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, మరో రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడంతో 290 మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డ దారుణ ఘటన ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉంది. ఇంతలోనే ఇప్పుడు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్లో జనం బక్రీద్ హడావిడిలో ఉండగా ఉదయం తొమ్మిది గంటల వేళ జరిగిన తాజా రైలు ప్రమాదం పాలకులు పాఠాలు నేర్చుకోలేదని తేల్చింది. గూడ్స్ పైలట్, కో–పైలట్ సహా పది మంది ప్రాణాలను బలి తీసుకొని, 40కి పైచిలుకు మందిని గాయాలపాలు చేసిన ఈ దుర్ఘటన మన రైల్వే వ్యవస్థలో లోటుపాట్లను మరోసారి బయటపెట్టింది. ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు ఉదయం 5.50 గంటల నుంచే రెండు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ చెడిపోయిందని వార్తలు వచ్చాయి. సిగ్నల్ను పట్టించుకోకుండా గూడ్స్ ట్రైన్ ముందుకు పోవడం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే బోర్డ్ ఛైర్పర్సన్ జయావర్మ సిన్హా ఉవాచ. కానీ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనప్పుడు రెడ్ సిగ్నళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిందిగా సర్వసాధారణంగా ఇచ్చే టీఏ 912 మెమోను స్టేషన్ మాస్టర్ ఇవ్వడం వల్లే రైళ్ళు రెండూ ఒకే లైనులో ముందుకు సాగాయట. విభిన్న కథనాలు, వాదనలు, తప్పొప్పులు ఏమైనా అమాయకుల ప్రాణాలు పోవడం విచారకరం. లెక్క తీస్తే 2018–19 నుంచి 2022–23 మధ్య అయిదేళ్ళలో తీవ్ర పర్యవసానాలున్న రైలు ప్రమాదాలు సగటున ఏటా 44 జరిగాయి. దాదాపు 470కి పైగా జరిగిన 2000–01 నాటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్టే కానీ, పెరిగిన సాంకేతికత, పాలకుల ప్రగల్భాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువే. ముఖ్యంగా రైళ్ళు ఢీ కొంటున్న ఘటనలు ప్రతి 3.6 నెలలకు ఒకటి జరుగుతున్నాయట. దేశంలోని మొత్తం 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే లాంటి ఆరింటిలో మినహా, మిగతా అన్నిటా నిరుడు ఏదో ఒక ప్రమాదం సంభవించింది.రైలు ప్రమాదాలను అరికట్టాలనీ, ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రైళ్ళు ఢీకొనే ప్రమాదం లేకుండా చూసేందుకు ప్రయోగాలూ సాగాయి. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ‘కవచ్’ను మూడు భారతీయ సంస్థలు దేశీయంగా రూపొందించాయి. ఈ ‘కవచ్’ భద్రతా వ్యవస్థ రైళ్ళ వేగాన్ని నియంత్రించడమే కాక, ప్రమాద సూచికలు డ్రైవర్ల దృష్టిని దాటిపోకుండా తోడ్పడుతుంది. మసక మసక చీకటిలోనూ భద్రతను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘కవచ్’ను ప్రవేశపెట్టామని పాలకులు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. కానీ, భారత రైల్వే వ్యవస్థ దాదాపు లక్ష కిలోమీటర్ల పైచిలుకు పొడవైనది కాగా, దశలవారీగా 1500 కి.మీల మేర మాత్రమే ‘కవచ్’ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నత్తనడక ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనం. అసలు ఒకప్పటిలా రైల్వేలకూ, రైల్వే శాఖకూ ప్రాధాన్యం ఉందా అంటే అనుమానమే. రైలు సేవల్లో సామాన్యుల హితం కన్నా హంగులు, ఆర్భాటాలు, ఎగువ తరగతి సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. సౌకర్యాల పేరిట అధిక ఛార్జీలు, వందే భారత్ ౖరైళ్ళు, సుందరీకరణ లాంటివాటి మీదే సర్కారు దృష్టి తప్ప, సాధారణ రైళ్ళ సంగతి పట్టించుకోవట్లేదు. సరిపడా కోచ్లు, బెర్తులు కరవన్న మాట అటుంచి, కనీసం కూర్చొనే జాగా కూడా లేక శౌచాలయాల వద్దే ఒకరిపై ఒకరుపడుతున్న జనంతో క్రిక్కిరిసిన రైళ్ళు మన దేశంలో నిత్య దృశ్యాలు. వీటన్నిటి మధ్య భద్రత మాట సరేసరి! గతంలో సాధారణ బడ్జెట్కు దీటుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. 1924 నుంచి ఉన్న ఆ రెండు వేర్వేరు బడ్జెట్ల విధానానికి 2017లో బీజేపీ సర్కార్ స్వస్తి పలికింది. ఫలితంగా ఆ తర్వాత రైల్వే శాఖకు వెలుగు తగ్గింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే రైల్వే సౌకర్యాల విస్తరణలో సింహభాగం వడ్డిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పటి రైల్వే మంత్రి, బెంగాల్ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, రైల్వేస్ ఇప్పుడో అనాథ. ఇక, నిరుటి పాలనలో లాగే... కొత్త మోదీ సర్కారులోనూ అశ్వినీ వైష్ణవ్కే రైల్వే శాఖ అప్పగించారు. పేరుకు ఆయన రైల్వే మంత్రే కానీ, కీలకమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ, సమాచార ప్రసార శాఖ సైతం ఆయన వద్దే ఉన్నాయి. దేనికదే అత్యంత ముఖ్యమైన మూడు శాఖలను వైష్ణవ్ ఒక్కరే నిర్వహించడం భారమే. ఇవన్నీ కాక సోమవారం రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే... ఆయనను రానున్న అసెంబ్లీ ఎన్నికలకై మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల కో–ఇన్ఛార్జ్గా కూడా బీజేపీ నియమించడం మరీ విడ్డూరం. పాలనా ప్రాధాన్యాల పట్ల అలసత్వానికి ఇది మచ్చుతునక. దేశంలో మునుపెన్నడూ జరగనంత ప్రమాదమైన బాలాసోర్ విషాదం తర్వాతా మనం మారలేదు. సీబీఐ దర్యాప్తు చేసి, ఛార్జ్షీట్ దాఖలు చేసినా ఆ కేసు ఇంకా కోర్టులోనే మూలుగుతోంది. అందుకే, ఇకనైనా సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణ, రైల్వే ప్రయాణ భద్రతను పెంచడం ప్రాధమ్యం కావాలి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ల గురించి రంగుల కలలు చూపిస్తున్న మన పాలకులు తాజా ఘటనతోనైనా క్షేత్రస్థాయి వాస్తవాలపై కళ్ళుతెరవాలి. ఉట్టికెగరలేకున్నా, స్వర్గానికి నిచ్చెన వేస్తామంటే హాస్యాస్పదం. -
పైనొక రైలు.. కిందొక రైలు
సాక్షి, హైదరాబాద్: పైన రైలు.. కింద రైలు.. అలాంటి వంతెనలు మన దేశంలో తక్కువ. ఒక రైలు మార్గాన్ని మరో మార్గం క్రాస్ చేసే సందర్భాల్లో వీటి అవసరమున్నా.. ఆర్థిక భారం, ఇతర కారణాలతో నిర్మించడం లేదు. అయితే క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడూరు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రెండు మూడు మార్గాల సమస్య తీరేలా.. ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది.ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది. మరోవైపు విష్ణుపురం–మోటుమర్రి మధ్య 89కిలోమీటర్ల మేర సరుకు రవాణా రైలు మార్గం ఉంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్ఓఆర్బీ)కి ప్లాన్ చేశారు. అది పూర్తయితే రైళ్లు నిరీక్షించే ఇబ్బంది తప్పుతుంది. ప్రయాణ సమయం కొంత తగ్గుతుంది. 1,400 మీటర్ల ఎలివేటెడ్ మార్గం ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దా టిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. దీనికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. భూసేకరణ ముగిసేలోపు వంతెన భాగాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
భూమి చుట్టూ 310 రౌండ్లు
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆధునికీకరణలో భాగంగా కొత్తగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లకు ఇప్పుడు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైన వందేభారత్ రైళ్లు ఇప్పటి వరకు తిరిగిన నిడివిని పరిశీలిస్తే.. 310 పర్యాయాలు భూపరిభ్రమణం చేసిన దూరంతో సమానమట. ఇది సరికొత్త రికార్డు అంటూ రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. 105.57% ఆక్యుపెన్సీ రేషియోతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సగటు 105.57 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. వీటిలో కేరళలో తిరుగుతున్న వందేభారత్ రైలు సర్వీసు గరిష్టంగా 175.3 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది. వందేభారత్ రైళ్లలో తిరుగుతున్న ప్రయాణికుల్లో 26–45 ఏళ్ల మధ్య ఉన్నవారు 45.9 శాతంగా నమోదవుతోంది. కేరళలో తిరుగుతున్న వందేభారత్ సర్వీసుల్లో అత్యధికంగా 15.7 శాతం వృద్ధులు ప్రయాణిస్తున్నట్టు తేలింది. గోవాలో తిరుగుతున్న వందేభారత్ రైళ్లలో అత్యధికంగా 42 శాతం మంది మహిళా ప్రయాణికులుంటున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సర్వీసుల్లో గరిష్టంగా 67 శాతం మంది పురుషులు ఉంటున్నట్టు నమోదైంది. తెలంగాణలో నాలుగు రైళ్లుప్రస్తుతం తెలంగాణలో నాలుగు వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్లతో కూడిన వందేభారత్ రైలు సేవలు గతేడాది సంక్రాంతికి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో ఉంటుండటంతో ఇటీవల ఇదే రూట్లో రెండో వందేభారత్ రైలు మొదలైన విషయం తెలిసిందే. రెండోది 8 కోచ్ల మినీఆరెంజ్ వందేభారత్. ఒకే రూట్లో రెండు వందేభారత్ రైళ్లు తిరగటం తొలుత కేరళలో మొదలైంది. రెండో ప్రయత్నంగా సికింద్రాబాద్– విశాఖ మార్గం ఎంచుకోవటం విశేషం. ఈమా ర్గం కాకుండా, సికింద్రాబాద్–తిరుపతి, కాచిగూడ–బెంగుళూరు మధ్య మరో రెండు సర్వీసులు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లు తిప్పాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఆమేరకు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇక త్వరలో రాత్రి వేళ తిరిగే స్లీపర్ వందేభారత్ రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి.సెమీ హైస్పీడ్ రైళ్లుగా...రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి తీసుకెళ్తూ సెమీ హైస్పీడ్ రైళ్లుగా వీటిని ప్రారంభించారు. గంటకు 160 కి.మీ. వేగ సామర్థ్యమున్న ఈ రైళ్లు సగటున 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 వరకు సర్వీసులు (స్పెషల్ రైళ్లు కలుపుకొని) సేవలు అందిస్తున్నాయి. తొలి రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అన్ని వందేభారత్ రైళ్లు 18423 ట్రిప్పులు తిరిగాయి. వీటి మొత్తం నిడివి1,24,87,540 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది 310 పర్యాయాలు భూమి చుట్టూ పరిభ్రమించిన దూరంతో సమానమని రైల్వే శాఖ పేర్కొంది. గత ఏడాది కాలంలో 97,71,705 కి.మీ.లు తిరిగినట్టు వెల్లడించింది. -
టికెట్ రద్దయితే.. రైల్వేకు పండగే!
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు. చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది. ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. 2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. రూ.60 నుంచి రూ.240 వరకూ కట్ ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది. -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్తోపాటు పశ్చిమ బెంగాల్లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
3 రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది. 2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో) కోటిపల్లి – నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు విజయవాడ–గూడూరు మూడో లైన్ 500 కోట్లు కాజీపేట – విజయవాడ మూడో లైన్ 310 కోట్లు విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు 209.8 కోట్లు అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి: 407 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, హైలెవల్ ప్లాట్ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు -
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్లో నాలుగో టర్మినల్గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
కొత్త లైన్లు లేవు.. ఉన్నవాటికే నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో రైల్వే శాఖకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల మంజూరు, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల సర్వేలాంటి కొత్తవాటి జోలికి కేంద్రప్రభుత్వం పోలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోనే సరిపెట్టింది. ఆర్మూరు–ఆదిలాబాద్, వికారాబాద్–కృష్ణా లైన్లు సహా సికింద్రాబాద్–కాజీపేట మూడో లైన్లాంటి వాటి ఊసే లేకుండా రాష్ట్రానికి కేటాయింపులు చేసింది. తేడాది బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.4418 కోట్లు కేటాయించగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం మధ్యంతర బడ్జెట్లో రూ.5,071 కోట్లను ప్రతిపాదించింది. ఇది అంతకుముందు బడ్జెట్ కంటే 15 శాతం ఎక్కువ కావటం విశేషం. 2022–23లో రూ.2,038 కోట్లు కేటాయించారు. ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా... కాజీపేట–విజయవాడ మూడో లైను: రూ.310 కోట్లు. ఇది 2012–13లో మంజూరైంది. పూర్తి నిడివి 219 కి.మీ.. దీని అంచనా వ్యయం రూ.1857 కోట్లు. విజయవాడ–కొండపల్లి వైపు పని పూర్తి కాగా, ఇప్పుడు విజయవాడ–ఖమ్మం మధ్య నిర్వహిస్తున్నారు. గత బడ్జెట్లో రూ.337 కోట్లు కేటాయించారు. కాజీపేట–బల్లార్షా మూడో లైను: రూ.300 కోట్లు. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. కాజీపేట హసన్పర్తి మధ్య పనులు జరగాల్సి ఉండగా, ఎగువ భాగంలో దాదాపు పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.350 కోట్లు ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరు కాగా, నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ.. అంచ నా వ్యయం రూ.1160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భ రించనుండగా, రాష్ట్రప్రభుత్వం ఒకవంతుతో పాటు భూసేకరణ వ్యయాన్ని భరిస్తుంది. సిద్దిపేట వరకు పనులు పూర్తి కా వటంతో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సర్విసులు మొ దలయ్యాయి. సికింద్రాబాద్–సిరిసిల్ల మధ్య భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నిధులు డిపాజిట్ చేయకపోవటంతో పనులు ఆగాయి. గత బడ్జెట్లో రూ.185 కోట్లు కేటాయించారు. భద్రాచలం–సత్తుపల్లి:రూ.6 కోట్లు ఇది 2010–11లో మంజూరైంది. నిడివి 54 కి.మీ. అంచనా వ్యయం రూ.704 కోట్లు. సింగరేణితో కలిపి రైల్వే ఈ సంయుక్త ప్రాజెక్టును చేపట్టింది. బొగ్గు తరలింపు ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ: రూ.50 కోట్లు నగర ట్రాఫిక్కు ఊరటనిచ్చే ఈ ప్రాజెక్టును 2012–13లో మంజూరు చేశారు. అంచనా వ్యయం రూ.817 కోట్లు. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా రూ.450 కోట్లు. కానీ రాష్ట్రప్రభుత్వం రూ.130 కోట్లతోనే సరిపుచ్చింది. గత బడ్జెట్లో భారీగా నిధులు విడుదల కావటంతో పనులు వేగంగా సాగాయి. దీంతో ప్రాజెక్టు సిద్ధమైంది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్: రూ.10 కోట్లు రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులివ్వలేదన్న ఉద్దేశంతో రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ. 10 లక్షలతో సరిపెట్టింది. కానీ ఈసారి రూ.10 కోట్లు కేటాయించటంతో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చర్లపల్లి శాటిలైట్ టెర్మి నల్:రూ.46 కోట్లు సికింద్రాబాద్ స్టేషన్ ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయంగా చర్లపల్లిలో టెర్మి నల్ నిర్మించారు. ఇందులో 6 ప్లాట్ఫామ్స్, 5 పిట్ లైన్లు ఉంటాయి. రైల్వే కోరినంత భూమిని రాష్ట్రప్రభుత్వం కేటాయించలేదన్న విమర్శ ఉంది. దీంతో దీన్ని ఆశించినస్థాయిలో కాకుండా చిన్నదిగానే నిర్మించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. భద్రాచలం–కొవ్వూరు: రూ.10 లక్షలు ఇది కీలకప్రాజెక్టు అయినప్పటికీ నిధుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. గత బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయించగా ఈసారి నామమాత్రపు నిధులతోనే సరిపెట్టారు. మణుగూరు–రామగుండం: రూ.5 కోట్లు కీలక ప్రాజెక్టుకు తొలిసారి భారీ నిధులు కాజీపేట మీదుగా సికింద్రాబాద్–విజయవాడ మార్గం ఇరుకుగా మారటంతో దానికి ప్రత్యామ్నాయ లైను అవసరం ఏర్పడింది. నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. 248 కి.మీ. మేర రెండోలైన్ నిర్మించాల్సి ఉంది. రూ.2853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. రెండు లైన్లు పూర్తయితే ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచుతారు. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. గత బడ్జెట్లో రూ.60 కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల్లో దాన్ని రూ.10 కోట్లకు కుదించారు. అవి కూడా విడుదల కాలేదు. తొలిసారిగా ఆ ప్రాజెక్టుకు రూ.200 కోట్లను తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కాజీపేటలో నిర్మిస్తున్న వ్యాగన్ ఫ్యాక్టరీకి రూ.150 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.140 కోట్లు ప్రతిపాదించారు. తొలుత వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాలింగ్ వర్క్షాపుగా మంజూరు చేసిన దీన్ని.. గత బడ్జెట్లో వ్యాగన్ తయారీ యూనిట్గా అప్గ్రేడ్ చేశారు. అంచనా వ్యయాన్ని రూ.521 కోట్లకు పెంచారు. గతేడాది నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చదును చేయటం, కొన్ని షెడ్లు నిర్మించటం, ఒక ఆర్యూబీని సిద్ధం చేయటం.. తదితరాలు పూర్తి చేశారు. ఇప్పుడు మెరుగ్గానే నిధులు వచ్చినందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు వేగంగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి సంవత్సరం నాటికి అది పూర్తయి పని ప్రారంభించనుంది. -
ఏపీలో 3 రైళ్ల గమ్యస్థానాల పొడిగింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఏపీలోని పలు గమ్యస్థానాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను రైల్వేశాఖ పొడిగించింది. వీటిలో గుంటూరు– విశాఖ (22701/22702) రైలు విశాఖ, విజయవాడ,గుంటూరు మీదుగా ప్రయాణిస్తోంది. మిగిలిన 2 రైళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. వాటిలో నర్సాపూర్–హుబ్లీ (17225/17226) రైలు గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. నంద్యాల–రేణిగుంట (07285/07284) రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కంభాలపల్లె స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఈ రైళ్ల సర్వీసులను శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో గుంటూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు శుక్రవారం నుంచే ప్రయాణికుల సేవల్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. -
ఇకపై వారానికి 4 రోజులు కరీంనగర్–తిరుపతి రైలు
సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో 4 రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కోరారు.బండి సంజయ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్ – హసన్పర్తి కొత్త రైల్వే లేన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వే లేన్ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా రైల్వే మంత్రిని బండి సంజయ్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి త్వరగా ఫైనల్ లోకేషన్ సర్వే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జమ్మికుంటలో పలు రైళ్ల హాల్ట్ ప్రజల సౌకర్యార్థం పలు ఎక్స్ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్లో ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సికింద్రాబాద్ – గోరక్పూర్ ఎక్స్ప్రెస్ (12590–89), యశ్వంతపూర్ – గోరక్పూర్ ఎక్స్ప్రెస్ (12592–91 ), హైదరాబాద్ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ (12723–23), సికింద్రాబాద్ – పట్నా దానాపూర్ ఎక్స్ప్రెస్ (12791–92), చెన్నై – అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్ (12656–55) రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన రైల్వే మంత్రి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది నవంబర్లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్లో 11.57 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీని ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ. కొత్త క్లైంట్లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని జోన్ జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు. -
బాబోయ్.. బాణసంచా
సాక్షి, హైదరాబాద్: వరుస ప్రమాదాలతో సతమత మవుతున్న రైల్వే శాఖ ఇప్పుడు దీపావళి పండుగ అనగానే తీవ్ర ఆందోళనకు గురవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా బ్యాగుల్లో బాణసంచా పెట్టు కుని కొందరు ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రతీ దీపావళి సంద ర్భంలో రైల్వే ఉద్యోగులు తనిఖీలు చేస్తుంటారు. అయినా వాటిని పూర్తిగా నియంత్రించ లేకపోతు న్నారు. కొంతకాలంగా రైల్వే భద్రతపై మళ్లీ విమ ర్శలు వస్తున్నాయి. ఇటీవల తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రయా ణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరస్పరం రెండు రైళ్లు ఢీకొంటుండటంతో పాటు అగ్ని ప్రమా దాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈసారి దీపావళి సందర్భంగా రైళ్లలో బాణసంచా తరలించకుండా మరింత పకడ్బందీగా వ్యవహరించాలని రైల్వే శాఖ జోన్లను ఆదేశించింది. రంగంలోకి స్నిఫర్ డాగ్స్.. నిత్యం కిటకిటలాడే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయా ణికుల తనిఖీ రైల్వే సిబ్బందికి సవాల్గా ఉంటోంది. వందలాది మంది ఒకేసారి వస్తుండటంతో వారి ని క్రమపద్ధతిన లోనికి పంపుతూ చెక్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం కుదరటం లేదు. స్టేషన్కు వెళ్లేందుకు నాలుగైదు దారులు ఉండటంతో, ఏదో ఓ దారి నుంచి లోనికి చేరుతున్నారు. వారి లగేజీలో బాణాసంచా ఉందో లేదో తనిఖీ చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు)తో కూడిన క్విక్ రియాక్షన్ బృందాల ను రైల్వే రంగంలోకి దింపుతోంది. ఈ సిబ్బంది సాధారణ దుస్తుల్లో ఉండి తనిఖీ చేస్తారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో.. రెండు చోట్ల జాగిలాలతో తనిఖీ చేసి బాణాసంచాను సులభంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. బాణ సంచా తరలిస్తే మూడేళ్ల జైలు శిక్ష ప్రస్తుతం ఉన్న సీసీటీవీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్నింటిని ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా పర్యవేక్షించేందుకు ప్రత్యే కంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.వేయి జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందంటూ రైల్వే సిబ్బంది ప్రచారం ప్రారంభించారు. ఎవరైనా బాణ సంచా సహా మండే స్వభావం ఉన్న ఇతర వస్తు వులను రైళ్లలో తరలిస్తున్నట్టు దృష్టికొస్తే 139కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠిన చర్యలు రైళ్లలో బాణసంచా తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇలాంటి పేలుడు పదార్థాల వల్ల ప్రయాణికుల భద్రత, రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే ఆస్తుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందన్నారు. -
సిగ్నల్ కోసమా? పవర్ ప్రాబ్లమా?
సాక్షి, విశాఖపట్నం : 08532 విశాఖ–పలాస రైలు కంటకాపల్లి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి దగ్గర నిలిచిపోయింది. ఆ మార్గంలో మొత్తం మూడు లైన్లు ఉండగా.. మధ్యలైన్లో ఈ రైలు నిలిపారు. అయితే.. కంటకాపల్లి నుంచి దాని వెనుకే బయలుదేరిన 08504 రైలు అదే మూడో లైన్లోకి వచ్చేసింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. విశాఖ–పలాస రైలును మధ్య లైన్లో ఎందుకు నిలిపారు? ఆలమండ స్టేషన్ నుంచి సిగ్నల్ అందలేదా? లేదా ప్రమాద సమయంలో హైటెన్షన్ వైర్లు తెగిపడి ఉన్నాయా? ప్రమాదం జరగకముందే ఇవి తెగిపడటంవల్ల రైలు నిలిచిపోయిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. ఒక రైలు ఆగి ఉన్నప్పుడు అదే మార్గంలో మరో రైలు వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ లోపంవల్లే వెనుక వస్తున్న రాయగడ రైలు.. మధ్య లైన్లోకి వచ్చినట్లు భావి స్తున్నారు.సిగ్నల్ లేక పలాస రైలును చినరావుపల్లెలో నిలిపినట్లయితే.. ఆ సమాచారాన్ని రాయగడ రైలుకు పంపాలి. అదీ జరగలేదు. పోనీ.. హైటెన్షన్ వైర్లు తెగిపడటంవల్ల నిలిచిపోయినట్లయితే.. ఆ సమాచారం కూడా వెనుక వస్తున్న రైళ్లకు చేర వేయాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా.. మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ రైలువల్లే పెను ప్రమాదం తప్పింది.. సాధారణ రోజుల్లో ఈ 2 రైళ్లు నిరంతరం ప్రయాణికులతో నిండుగా ఉంటాయి. వ్యాపారులు, స్థానికులు, ఏదైనా పని, లేదా వైద్యం.. ఇతర అవసరాల కోసం విశాఖకి ఉదయాన్నే వచ్చి.. పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి ఈ రెండు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. కానీ, ఆదివారం మాత్రం.. ఈ రైళ్లలో అంతగా జనం ఉండరు. దీనికి కారణం.. ఈ రైళ్లు బయలుదేరిన కొద్దిసేపటికే విశాఖపట్నం–విజయనగరం పాసింజర్ మెము రైలు (07468) ఉంటుంది. విజయనగరం వెళ్లే వాళ్లంతా శని, ఆదివారాల్లో ఈ రైలు కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఈ రైలు లేకపోతే.. ఇందులో వెళ్లే ప్రయాణికులంతా ఈ 2 రైళ్లనే ఆశ్రయించేవాళ్లు. అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది. -
ఓటు ప్లాట్ఫామ్పై వందేభారత్
గౌరిభట్ల నరసింహమూర్తి: ఎన్నికల్లో తొలిసారి ‘రైలు’ ప్రచారాస్త్రంగా నిలవబోతోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ‘ఇన్ని దశాబ్దాలు గడిచినా మా ప్రాంతానికి రైలు రాలేదు’ అన్న నెగెటివ్ అంశం ప్రచారంలో వినిపించినా.. ఇప్పుడు దానికి భిన్నంగా, ఓ రైలు ఘనతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ నేతలు ప్రసంగ పాఠాన్ని సవరించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కనిపించిన ఈ పంథా, ఇప్పుడు తెలంగాణ ఎనిక్నల్లోనూ కనిపించబోతోంది. కేంద్రప్రభుత్వం ట్రెయిన్ 18 పేరుతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ‘’వందేభారత్’గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. తొలి రైలే ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లూ చారలున్న తెలుపు రంగు కోచ్లు, ప్రత్యేకంగా పుష్ పుల్ పద్ధతిలో రెండు వైపులా ఇన్బిల్ట్ ఇంజిన్తో ఉండటం, 180 కి.మీ. వేగం అందుకునే సామర్ధ్యం, విలాసంగా కనిపించే కోచ్లు.. ఇలా ఒకటేమిటి, ఇంతకాలం విదేశాల్లోనే కనిపించిన రైలు మన పట్టాలపై పరుగు పెడుతుంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా మా ప్రాంతానికి కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ రైల్వేపై అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఏకంగా మూడు రైళ్లతో.. దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ వందేభారత్ రైళ్లు తెలంగాణకు ఏకంగా మూడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు వాటిని కేటాయించనే లేదు. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య మూడు వందేభారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని దశాబ్దాల కాలంలో తెలంగాణకు సాధారణ రైళ్లు మంజూరు కావటమే గొప్ప అనుకుంటున్న తరుణంలో, మోదీ ప్రభుత్వం సెమీ బుల్లెట్ రైళ్లుగా పేర్కొనే వందేభారత్ రైళ్లను మూడింటిని కేటాయించటాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో వందేభారత్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటి ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి హోదాలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రముఖంగా పేర్కొంటూ తెలంగాణకు వరాలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు వందేభారత్ను కీర్తిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా.. ప్రస్తుతం పగటి పూట నడిచే చెయిర్కార్ కోచ్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి చార్జీ ఎక్కువగా ఉన్నందున, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్ల తయారీని కూడా ప్రారంభించారు. ప్రచారం చేయాలని.... ఆ రైళ్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం మొత్తంగా వందేభారత్ రైళ్లు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు రైల్వే శాఖ నుంచి సేకరించారు. వాటి వివరాలను పార్టీ కార్యకర్తలకు కూడా అందిస్తున్నారు. ప్రచారంలో వీటిని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పాలని సూచిస్తున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు ప్రారంభించిన రైలు సర్వి సు కూడా ప్రచారంలో భాగమవుతోంది. ఆ రైలు సర్వీసు ప్రారంభం రోజు ఆ ఘనత తమదంటే తమది అంటూ బీజేపీ–బీఆర్ఎస్ నేతలు పేర్కొంటూ దాడులు చేసుకున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల్లో కూడా స్థానికంగా అది ప్రచారాస్త్రంగా మారబోతోంది. రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి కాచిగూడ నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక సరిహద్దులోని కృష్ణా స్టేషన్ వరకు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వి సును ఇటీవల ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ప్రారంభించిన విషయం తెలిసిందే. అమృత్ భారత్స్టేషన్ల పేరుతో రాష్ట్రంలో 21 స్టేషన్లకు పూర్తి ఆధునిక భవనాలు నిర్మించే పని ప్రారంభించారు. ఆధునిక రూపు తెస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. -
సికింద్రాబాద్ టు సిద్దిపేట రూ.440
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు ఎక్స్ప్రెస్ బస్ చార్జి రూ.140. వెళ్లి రావటానికి రూ.280. రెండు రోజులకు రూ.560. అదే రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ.440 చెల్లిస్తే సరి. రెండు రోజుల బస్ చార్జి కంటే చవకగా, ఏకంగా నెలరోజుల పాటు ప్రయా ణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. ఈ నెల మూడో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్–సిద్దిపేట ప్యాసింజర్ రైలు ఆ ప్రాంత వాసులకు కారు చవక ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య 117 కి.మీ. ప్రయాణానికి రైలు టికెట్ ధర కేవలం రూ.60 మాత్రమే. ఇప్పుడు దానిని మరింత చవకగా మారుస్తూ నెలవారీ సీజన్ టికెట్ను అందుబాటులోకి తెచ్చింది. మామూలు టికెట్ ప్రకారం.. వెళ్లి రావటానికి రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెల రోజులకు రూ.3,600 అవుతుంది. కానీ, నెల రోజుల సీజన్ టికెట్ కొంటే కేవలం రూ.440తో నెల రోజుల పాటు ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. ఇంతకాలం బస్సులు, ప్రైవేటు వాహనాలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ప్రయాణిస్తున్న నిరుపేద వర్గాలకు ఇది పెద్ద వెసులుబాటుగా మారనుంది. స్పెషల్ రైలు సర్వీసుగా సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య ఈ రైలు సేవలు ప్రారంభమైనప్పటికీ, సీజన్ టికెట్ను జారీ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక రైలులో ఎక్స్ప్రెస్ టికెట్ ధరలను అమలు చేస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వీసుగా మార్చగానే ఆర్డినరీ టికెట్ ధరలను వర్తింపచేస్తారు. ఈ ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న టికెట్ ధర రూ.60 నుంచి రూ.50కి తగ్గుతుంది. అయితే దీనితో సంబంధం లేకుండా ఇప్పుడు సీజన్ టికెట్ను అందుబాటులోకి తెచ్చారు. 101 కి.మీ. నుంచి 135 కి.మీ. వరకు ప్రయాణ దూరానికి సీజన్ టికెట్ ధర రూ.440 ఉంటుంది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు ప్రయాణ దూరం 117 కి.మీ.గా ఉంది. దీంతో ఈ టికెట్ ధరను రూ.440 ఖరారు చేశారు. నెల తర్వాత దానిని మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ –సిద్దిపేట మధ్య ఇతర స్టేషన్ల వరకు కూడా ఈ సీజన్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. ఆయా స్టేషన్ల మధ్య దూరం ఆధారంగా ఆ టికెట్ ధర ఉంటుంది. ట్రిప్పు వేళలు ఇలా.. ♦ సిద్దిపేటలో రైలు (నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్కు 10.15కు చేరుకుంటుంది. ♦ తిరిగి సికింద్రాబాద్లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. ♦ తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుంది. ♦ సికింద్రాబాద్లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేట కు రాత్రి 8.45 గంటలకు చేరుకుంటుంది. ♦ హాల్ట్స్టేషన్లు: మల్కాజిగిరి, కేవలరీ బ్యారెక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చ ల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట -
త్వరలో ‘వందే సాధారణ్’ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో రైల్వే శాఖ సాధారణ ప్రజలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకునే పూర్తి ఏసీతో ఉండే వందేభారత్ రైలు ఎక్కాలని సామాన్య జనానికి కోరిక ఉన్నా, రూ.1,600 టికెట్ ధర చూసి వారు వెనకడుగు వేస్తున్నా రు. మరింత సౌకర్యవంతంగా ఉండే ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్ ధర ఏకంగా రూ.2,550 ఉండటంతో మామూలు ప్రయాణికులు అటు వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతి సాధారణ జనానికి కూడా కొంతమేర వందేభారత్ రైలు అనుభూతిని కలిగించేందుకు రైల్వే శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మరో మూడు నెలల్లో నాన్ ఏసీ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ‘వందే సాధారణ్’నాన్ ఏసీ రైలు కోచ్లను రైల్వే శాఖ వేగంగా సిద్ధం చేస్తోంది. జనవరి నాటికి తొలి రైలు.. వందేభారత్ రైళ్లు విజయవంతం కావటంతో వాటిని మరింత అప్గ్రేడ్ చేసే పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రైళ్లు ఉదయం బయలుదేరి, మళ్లీ రాత్రి 12 వరకు తిరిగి వస్తున్నాయి. తాజాగా దూరప్రాంతాలకు కూడా తిరిగేలా స్లీపర్ వందేభారత్ రైళ్ల తయారీ ప్రారంభించిన రైల్వే, సమాంతరంగా నాన్ ఏసీ సాధారణ రైళ్లను కూడా తయారు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో వచ్చే జనవరి నాటికి తొలి రైలు సిద్ధమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మామూలు రైళ్లు తెరమరుగు.. శతాబ్ది రైళ్లను క్రమంగా తొలగించి వాటి స్థానంలో వందేభారత్ రైళ్లు నడుపుతారని సమాచారం. అలాగే కొత్తగా వచ్చే స్లీపర్ వందేభారత్ రైళ్లు రాజధాని రైళ్ల స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఇక సాధారణ సంప్రదాయ రైళ్లను దశలవారీగా తొలగిస్తూ వాటి స్థానంలో వందే సాధారణ్ రైళ్లను తిప్పే అవకాశం ఉందని చెపుతున్నారు. వందే సాధారణ్ ప్రత్యేకతలు ఇవే.. ♦ సంప్రదాయ నాన్ ఏసీ రైళ్లకు ఇవి కొంత భిన్నంగా ఉంటాయి. వందేభారత్ తరహాలో పుష్పుల్ పద్ధతిలో ముందు, వెనక ఇంజిన్లు ఉంటాయి. ♦ గరిష్టంగా 24 చొప్పున లింక్ హాఫ్మాన్ బుష్ (ఎల్హెచ్బీ) కోచ్లు ఉంటాయి. ♦ సంప్రదాయ రైళ్లలోని సీట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగ్గా ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద చార్జింగ్ పాయింట్లు కూడా ఉంటాయి. ♦ వందేభారత్ రైళ్లలో ఉన్నట్టుగానే ప్రయాణికులకు కోచ్లలో అనౌన్స్మెంట్ స్క్రీన్లు, ఆడియో వ్యవస్థ ఉంటాయి. ♦ ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. వందేభారత్ రైళ్ల లో ఉన్నట్టు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ♦ శుభ్రంగా ఉండేలా చూడటంతోపాటు చెడు వాసన రాకుండా బయో వాక్యుమ్ టాయి లెట్లు ఏర్పాటు చేస్తారు. -
బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంత సరిహద్దు వరకు పనులు పూర్తి కావడంతో సమాంతరంగా ఉన్న రెండు ప్రధాన రైలు మార్గాల అనుసంధానానికి అవకాశం ఏర్పడింది. మహబూబ్నగర్–కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య 243 కి.మీ. మేర జరుగుతున్న రైల్వే లైన్ పనుల్లో భాగంగా దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల అనుసంధానంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో పూర్తయింది. ఇది ఇటు సికింద్రాబాద్ (మహబూబ్నగర్)–బెంగళూరు లైను, అటు సికింద్రాబాద్–వాడీ–ముంబై లైన్లను అనుసంధానిస్తుంది. బెంగళూరు లైన్లో దేవరకద్ర నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు, వాడీ మార్గంలోని కృష్ణా స్టేషన్ వద్ద తెలంగాణ పరిధిలో ముగుస్తుంది. ఇక్కడి వరకు పనులు పూర్తి కావడంతో ఈ అనుసంధాన లైన్ను ఇప్పుడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరు సహా కొన్ని ఇతర ప్రాంతాలకు వాడీ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. దీని బదులు ఆ రైళ్లు ఇకపై దేవరకద్ర మీదుగా బెంగళూరుకు చేరుకోవచ్చు. దీనివల్ల రైల్వేకు దూరాభారం తగ్గుతుంది. సరుకు రవాణా రైళ్లకూ ఇది దగ్గరి దారి కానుంది. అలాగే జక్టేర్, మరికల్, మక్తల్, మాగనూరు లాంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రధాని చేతులమీదుగా కాచిగూడ–సిద్దిపేట డెమూ ప్రారంభం? మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ సిద్ధమై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదముద్ర కూడా రావడంతో రైళ్లను నడిపేందుకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగా కాచిగూడ–సిద్దిపేట మధ్య రోజువారీ నడిచేలా డెమూ సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించే రెండు రోజుల్లో ఏదో ఒక రోజు డెమూ రైలు సర్విసును ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ప్రధాని చేతుల మీదుగా రైలును ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది. ఇక ముద్ఖేడ్–డోన్ మార్గంలో డబ్లింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు లైన్లు వినియోగానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు: మహబూబ్నగర్–మునీరాబాద్ మంజూరు: 1997–98 నిడివి: 243 కి.మీ. ప్రాజెక్టు వ్యయం: రూ. 3,473 కోట్లు తెలంగాణ పరిధి: 66 కి.మీ. వ్యయం: రూ.943 కోట్లు విద్యుదీకరణ: పూర్తి -
ఇక ‘లెవల్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల తరహాలో క్రాసింగ్స్ లేకుండా రైల్వే లైన్లను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు మార్గాన్ని రోడ్లు క్రాస్ చేసే ప్రాంతాల్లో, వాటి మీదుగా వెళ్లే వాహనాల రద్దీ ఆధారంగా రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు, తక్కువ ఎత్తున్న అండర్పాస్లను నిర్మించనున్నారు. ప్రాజెక్టు ప్రణాళికల సమయంలోనే ఇందుకు ఏర్పాట్లు చేసి అంచనా వ్యయాన్ని నిర్ధారించనున్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఎక్కడా ఇతర రోడ్లు క్రాస్ చేయకుండా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో రైల్వే లైన్లను కూడా నిర్మించాలని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. నిర్ణయించటమే కాకుండా వెంటనే అమలులోకి తెచ్చింది. ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుల్లో సైతం: ఈ నిర్ణయం తీసుకునేసరికే మొదలై పనులు జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో మనోహరాబాద్–కొత్తపల్లి కొత్త లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కీలక ప్రాజెక్టు. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ మొదలై గజ్వేల్, సిద్దిపేట మీదుగా కొత్తపల్లి (కరీంనగర్ సమీపం) వరకు ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. గజ్వేల్ సమీపంలోని కొడకండ్ల–సిద్దిపేట మధ్య ఈనెల 15న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇది పూర్తి అయ్యాక వీలైనంత తొందరలో సిద్దిపేట నుంచి రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. ఈమేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా రైల్వే బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ ప్రాజెక్టులో కీలక ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్యూబీలు ప్లాన్ చేసినా.. ఇంకా నాలుగు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి లైన్లోని ఆ నాలుగులెవల్ క్రాసింగ్స్ కూడా తొలగింపు తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ నాలుగు లెవల్ క్రాసింగ్స్ను కూడా తొలగించాలని నిర్ణయించటం విశేషం. గజ్వేల్ దాటిన తర్వాత ఉన్న కొడకండ్ల శివారులోని రామచంద్రాపూర్ రోడ్డు వద్ద లెవల్ క్రాసింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ 3.5 మీటర్ల ఎత్తుతో లిమిటెడ్ ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. కుకునూరుపల్లి దాటిన తర్వాత కొండపోచమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన లెవల్ క్రాసింగ్ను తొలగించి ఆర్యూబీ నిర్మించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లికి వెళ్లే రెండో కమాన్ రోడ్డు వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్ను తొలగించి దాదాపు అరకి.మీ. నిడివితో ఏడు మీటర్ల ఎత్తు గల ఆర్ఓబీని నిర్మించాలని నిర్ణయించారు. సిద్దిపేట శివారులోని రంగదామ్పల్లి లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. ఇంకా 1,150 లెవల్ క్రాసింగ్స్... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పాత లైన్ల మీద ఇంకా 1,150 వరకు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. కాపలా లేని క్రాసింగ్స్ను పూర్తిగా తొలగించినా, కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని దశల వారీగా తొలగించే పని జరుగుతోంది. కానీ, కొత్తగా చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టుల్లో మాత్రం అసలు లెవల్ క్రాసింగ్స్ ఉన్న ఊసే ఉండకపోవటం విశేషం. -
15 కొత్త రైల్వే లైన్లకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 కొత్త రైల్వే ప్రాజెక్టులను నిర్మించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. 2,647 కి.మీ. నిడివితో నిర్మించే ఆ ప్రాజెక్టులకు రూ.50,848 కోట్లు వ్యయం కాను న్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. వీటితోపాటు రూ.32,695 కోట్లు వ్యయమయ్యే 2,588 కి.మీ. 11 డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులకు కూడా ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైనట్టు వెల్లడించింది. రీజినల్ రింగ్ రైల్, ఆదిలాబాద్–పటాన్చెరు, ఘ ట్కేసర్ – యాదాద్రి, తాండూరు–జహీరాబాద్, మ ణుగూరు – రామగుండం, ఉందానగర్ – జగ్గయ్య పేట, కరీంనగర్ – హసన్పర్తి, డోర్నకల్ – మిర్యా లగూడ, భూపాలపల్లి–కాజీపేట, పాండురంగాపు రం–మల్కన్గిరి, కొత్తగూడెం–కిరండోల్, బోధన్ – లాతూరు రోడ్ ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేలు మంజూరైనట్టు వెల్లడించింది. కీలకం.. రీజినల్ రింగ్ రైల్ నగరానికి 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వెలుపల దాదాపు 338 కి.మీ. నిడివితో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు వెలుపల దానికి సమాంతరంగా రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతోంది. రూ.12,408 కోట్ల వ్యయంతో దాదాపు 564 కి.మీ. నిడివితో ఈ ప్రాజెక్టు ఉంటుందని రైల్వే ప్రకటించింది. వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట్, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి–భువనగిరి, రామన్నపేట, చిట్యాల, షాద్నగర్, షాబాద్ తదితర పట్టణాలను అనుసంధానిస్తూ ఇది రూపొందనుంది. అక్కన్న పేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ల మీదుగా కొత్త లైన్లు నిర్మించనుండటం విశేషం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతి కలగటంతోపాటు సరుకు రవాణా రైళ్లకు కూడా అడ్డంకులు లేని సాఫీ ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుందని రైల్వే చెబుతోంది. ఇక 317 కి.మీ. నిడివితో రూ.5,706 కోట్లతో నిర్మితమయ్యే పటాన్చెరు (నాగులపల్లి) – ఆదిలా బాద్ ప్రాజెక్టు కూడా ఇందులో కీలకం కానుంది. ఇచ్చోడ, నేరేడుగొండ, ధానూరు, నిర్మల్, బాల్కొండ, ఆర్మూరు, బోధన్, రుద్రూరు, బాన్స్వాడ, నిజాంసాగర్, సంగారెడ్డి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చినట్టు అవు తుంది. దీంతోపాటు హైదరాబాద్–ఢిల్లీ ప్రధాన లైన్తో వీటికి అనుసంధానం కూడా కలుగుతుంది. వ్యవసాయాధారిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున, ధాన్యం తరలింపునకు ప్రధాన రవాణా సాధనం అందుబాటులోకి వచ్చినట్టు కూడా అవుతుందని రైల్వే తెలిపింది. -
ఇక రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు
సాక్షి, అమరావతి: భారతీయ రైల్వే మరింత ఆధునికతను సంతరించుకుంటోంది. విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రమాదాలు సంభవిస్తే సమగ్ర విశ్లేషణకు అవకాశం ఏర్పడనుంది. తొలిసారిగా వందే భారత్ రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు విధివిధానాలను నిర్దేశించింది. సెప్టెంబర్ నుంచి రూపొందించే రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతోపాటు రైలు ఇంజిన్లు, బ్రేకులు, ఇతర అంశాల్లో కూడా భద్రతా ప్రమాణాలను మెరుగుపరచనుంది. సీసీఆర్సీవీఆర్ పరిజ్ఞానంతో.. కేబిన్ క్రూ రెస్ట్ కంపార్ట్మెంట్ వీడియో రికార్డింగ్ (సీసీఆర్సీవీఆర్) సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్ బాక్సులు తయారు చేస్తారు. విమానాల్లోని బ్లాక్ బాక్సులను కూడా అదే సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్నారు. చిత్తరంజన్లోని లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసే వందేభారత్ రైళ్లలో ఈ బ్లాక్ బాక్సులను ప్రవేశపెడతారు. అందుకోసం డిజైన్లు ఖరారు చేశారు. సెప్టెంబర్లో తయారు చేసే వందేభారత్ రైళ్లలో వాటిని ప్రవేశపెట్టిన అనంతరం చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీలో పరీక్షించి తుది ఆమోదం తెలుపుతారు. రైలు డ్రైవర్ కేబిన్లో అన్ని కదలికలను ఈ బ్లాక్బాక్సులు రికార్డు చేసి ఆడియో, వీడియో రూపంలో భద్రపరుస్తాయి. రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఆ బ్లాక్ బాక్సులో రికార్డు అయిన సమాచారం భద్రంగా ఉంటుంది. దీంతో ప్రమాద కారణాలను సహేతుకంగా విశ్లేషించి ఇకముందు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
Central Vigilance Commission: ఆ శాఖల అధికారులపైనే అత్యధిక ఫిర్యాదులు
న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది. వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది. -
వందకు వందే భారత్!
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా వందేభారత్ రైళ్లను ఒకేసారి పెద్దసంఖ్యలో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు 30లోపు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సంఖ్యను వీలైనంత తొందరలో వందకు చేర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి నాలుగు రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా వాటిని వాయిదా వేశారు. ఇందులో కాచిగూడ– యశ్వంత్పూర్(బెంగళూరు) రైలు కూడా ఉంది. వాస్తవానికి ఈ రైలు గత నెల 31నే చెన్నై నుంచి కాచిగూడ స్టేషన్కు చేరుకుంది. ఆ తర్వాత మహబూబ్నగర్ మీదుగా దీని ట్రయల్రన్ కూడా పూర్తి చేశారు. దీనిని ఈనెల ఆరో తేదీన ప్రారంభిస్తున్నట్టు గుంతకల్ స్టేషన్ అధికారులు అప్పట్లోనే ప్రకటించగా, దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు ఖండించారు.అది పంద్రాగస్టు రోజు ప్రారంభమయ్యే సూచనలున్నాయంటూ కొందరు అధికారులు అనధికారికంగా ప్రకటించారు. దానికి బలం చేకూరుస్తూ ఈలోపే ట్రయల్రన్ పూర్తి చేశారు. కానీ, రైల్వేబోర్డు మాత్రం అధికారికంగా ప్రారంభతేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఎన్నికల వేళ... ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, వందేభారత్ రైళ్లను కూడా ప్రధాన ఆకర్షణగా జనం ముందు నిలపాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో భారత్లో వంద వందేభారత్ రైళ్లను పట్టాలెక్కించాలని ముందుగా అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్యను వీలైనంత తొందరలోనే ప్రయాణికుల సేవలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొన్నింటిని ఆపి, మరికొన్నింటిని జతచేసి ఒకేసారి ప్రారంభించాలని భావి స్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పంద్రాగస్టు కానుకగా పట్టాలెక్కాల్సిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. 8 కోచ్ల రైళ్లే ఎక్కువ.. ప్రారంభంలో వందేభారత్ రైళ్లను 16 కోచ్లతో పట్టాలెక్కించారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో మాత్రమే వందేభారత్ రైళ్లు తయారవుతున్నాయి. త్వరలో మరో మూడు కోచ్ఫ్యాక్టరీల్లో వాటి ఉత్పాదన ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒక్కో రైలు సిద్ధం కావటానికి చాలా సమయం పడుతోంది. ప్రొడక్షన్ వేగం పుంజుకునే వరకు, ఒక రైలుకు వినియోగించే 16 కోచ్లను రెండు రైళ్లుగా మార్చి నడపాలని రైల్వేశాఖ భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లు ప్రారంభించే అవకాశం ఉంటుందనేది ఆలోచన. డిమాండ్ పెరిగే కొద్ది క్రమంగా కోచ్ల సంఖ్య పెంచాలని అనుకుంటున్నారు. దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన మొదటి వందేభారత్ను సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య 16 కోచ్లతో ప్రారంభించారు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రారంభమైన రెండో వందేభారత్ను మాత్రం 8 కోచ్లతో ప్రారంభించి, ఆ సంఖ్యను పెంచుతామని తర్వాత రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పుడు 8 కోచ్ల మినీ వందేభారత్ రైళ్లు ఎక్కువ సంఖ్యలో ప్రారంభించి, ఆ తర్వాత ఉత్పత్తి పెరిగే కొద్దీ వాటికి అదనపు కోచ్లను జతచేస్తూ పోవాలని నిర్ణయించారు. -
ఆ.. 9 రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్
సాక్షి, అమరావతి: సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రాష్ట్రంలో మరో 9 రైల్వే స్టేషన్లలో ఆపాలని (హాల్ట్) రైల్వే శాఖ నిర్ణయించింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ డిమాండ్పై కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బొబ్బిలి, దువ్వాడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, సూళ్లూరుపేట, డోర్నకల్, పీలేరు, కుప్పం రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా .. బొబ్బిలి: యశ్వంత్పూర్– హతియా ఎక్స్ప్రెస్ (12835), యశ్వంత్పూర్– టాటా నగర్(12889), హతియా– ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (22837 – 22838) దువ్వాడ: శంకర్పల్లి– ముంబై ఎక్స్ప్రెస్ (18519 , 18520), విశాఖపట్నం– హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ (12803, 12804) పిడుగురాళ్ల: (1) ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (12603) (2) భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్ప్రెస్(17232), సికింద్రాబాద్–తిరుపతి ఎక్స్ప్రెస్ (12733) సత్తెనపల్లి: భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్ప్రెస్ (17232), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (12603) నడికుడి: సికింద్రాబాద్– తిరుపతి ఎక్స్ప్రెస్ (12733), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (12603), భువనేశ్వర్– సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(17015), నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్ప్రెస్ (17232) సూళ్లూరుపేట: అళప్పుజా–ధన్బాద్ ఎక్స్ప్రెస్ (13352) పీలేరు: నాగర్కోయిల్ – ముంబై ఎక్స్ప్రెస్ (16340, 16339) , కాచిగూడ–మధురై ఎక్స్ప్రెస్ (17615, 17616) కుప్పం: చెన్నై–శిరిడీ ఎక్స్ప్రెస్ (22601, 22602) డోర్న్కల్: లింగంపల్లి – కాకినాడ ఎక్స్ప్రెస్ (12737), 12738), మచిలీపట్నం– బీదర్ ఎక్స్ప్రెస్ (12749, 12750). -
ఫలక్నుమా రైలు ప్రమాదానికి అదే కారణమా.. రైల్వే అధికారులు ఏం చెప్పారంటే!
సాక్షి,యాదాద్రి/బీబీనగర్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఎస్–4లో షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయపల్లి– పగిడిపల్లి మధ్యన శుక్రవారం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలుకు జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు శనివారం ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు. రైల్వే శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం సిబ్బంది బోగీలకు కింది భాగంలో గల బ్యాటరీలను క్షుణంగా పరిశీలించారు. బ్యాటరీల ద్వారా షార్ట్సర్క్యూట్ తలెత్తివుండవచ్చని అనుమానిస్తున్నారు. సిగరెట్ తాగి ప్రయాణికులు ఎవరైనా టాయిలెట్లలో పడివేయడంతో అగ్గి రాజుకుందా అన్న కోణంలో విచారణ చేయగా అలాంటి ఆనవాళ్లు లేనట్లు అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు. 32విభాగాల అధికారుల విచారణ ఘటనపై 32 విభాగాలకు చెందిన రైల్వే, రాష్ట్ర పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఉంచిన కాలిపోయిన బోగీలను శనివారం సుమారు 50 మంది అధికారులు పరిశీలించారు. ఎస్–4 బోగీతో పాటు కాలిపోయిన అన్ని బోగీల బ్యాటరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజర్వేçషన్ బోగీల్లో సెల్ఫోన్ చార్జింగ్ సాకెట్లలో ఏమైనా స్పార్క్ వచ్చిందా, లేక రైలు చక్రాల కింద నిప్పు రవ్వలు లేచి బోగీ అంటుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, కాలిపోయిన బోగీల్లో అధికారులకు బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. అవి కాలిపోయి నల్లగా మారాయి. అలాగే లాప్టాప్, సెల్ఫోన్లు, సెల్ఫోన్ చార్జర్లు కాలిపోయి కన్పించాయి. -
అది మన నిర్లక్ష్యానికి మూల్యమే!
నెల రోజుల క్రితం దిగ్భ్రాంతికి గురిచేసిన ఒరిస్సా ఘోర రైలు ప్రమాద ఘటనకు కారణాలు ఇప్పుడిప్పుడే విచారణలో బయటకొస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాలలో అతి దారుణమైనదిగా నమోదైన ఈ ప్రమాదానికి మానవ తప్పిదం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణమని రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడైనట్టు వస్తున్న వార్తలు మన భారతీయ రైల్వేలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. అనేక స్థాయుల్లో లోపాల వల్లే 293 మంది ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ ప్రమాదం జరిగినట్టు రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్ఎస్) ఎ.ఎం. చౌధరి తన దర్యాప్తు నివేదికలో తేల్చినట్టు తాజా సమాచారం. దాదాపు 1200 మందికి పైగా గాయపడిన ఈ ప్రమాదంపై భద్రతా కమిషనర్ దర్యాప్తు ఏం చెబుతుందా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు గత నెల 28న నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించారు. మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అని నేర దర్యాప్తు చేస్తున్నందున ఈ తొలి నివేదికను బయటపెట్టడం లేదు. అయితేనేం, వివిధ మార్గాల్లో బయట కొచ్చిన ఈ నివేదికలోని అంశాలు మిగిలిన దర్యాప్తుకూ, సత్వరం చేపట్టాల్సిన చర్యలకూ స్పష్టమైన సూచికలుగా నిలిచాయి. రైల్వే సిబ్బందిని విచారించి, వాఙ్మూలాలను నమోదు చేసుకొని, అలాగే ప్రమాద స్థలం, రైల్వే ఆస్తులకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాక సీఆర్ఎస్ నివేదికను సిద్ధం చేశారు. దాదాపు 40 పేజీల నివేదికలో అవన్నీ పేర్కొన్నారు. ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద బాహానగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఈ రైలు ప్రమాదంలో చెన్నై – కోల్కతా ‘కోరమాండల్ ఎక్స్ప్రెస్’ అప్ – లూప్ లైనులోకి ప్రవేశించి, అప్పటికే ఆ లైనులో ఉన్న ఓ గూడ్స్ రైలును గుద్దుకుంది. అలా ఆ రెండు రైళ్ళు గుద్దుకోవడంతో బోగీలు పట్టాలు తప్పి, పక్కనే మరో పట్టాలపై వెళుతున్న బెంగుళూరు – హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని చివరి కొద్ది బోగీలపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎస్ అండ్ టి) విభాగంలో అనేక స్థాయుల్లో లోపాలతోనే ఇంతటి ప్రమాదానికి కారణమైందన్న నివేదిక సారాంశం అత్యంత కీలకం. ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రాథమిక కారణమేమిటనే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని సీఆర్ఎస్ నివేదిక పోగొట్టిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మూడు అంశాలను ఈ నివేదిక బయట పెట్టింది. ఒకటి – గతంలో 2018లో ఒకసారి, తాజా ప్రమాద ఘటనకు కొద్ది గంటల ముందు మరో సారి చేసిన మరమ్మతులు అరకొరగా, నిర్లక్ష్యపూరితంగా సాగాయి. ఫలితంగా సిగ్నలింగ్ వ్యవస్థ రాజీ పడ్డట్టయింది. రెండు – పదేపదే చేస్తూ వచ్చిన తప్పుల్ని ముందుగా పసిగట్టివుంటే, ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. వివరంగా చెప్పాలంటే, 2018లో కేబుల్ లోపం తలెత్తింది. దాన్ని సరిచేసినా, కీలకమైన సర్క్యూట్ బోర్డ్పై దాన్ని మార్క్ చేయలేదు. లోపం సరిచేసేందుకు అప్పట్లో సర్క్యూట్ షిఫ్టింగ్ పని చేశారు. అందుకు ప్రామాణిక పద్ధతులేమీ పాటించనే లేదు. పైపెచ్చు టెర్మినల్స్ మీద అక్షరాలు తప్పుగా పేర్కొన్నారు. అయిదేళ్ళుగా అలక్ష్యం చేసిన ఆ లోపభూయిష్ఠమైన పని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు – తప్పుడు వైరింగ్, కేబుల్ ఫాల్ట్ వల్ల తలెత్తే సమస్యలేమిటో నిరుడు పశ్చిమ బెంగాల్లోనే చూశారు. అయినా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. అలాగే బాహానగా బజార్ రైల్వేస్టేషన్కు సరిపడేలా ముందస్తు ఆమోదంతో సర్క్యూట్ డయా గ్రమ్ను మార్చి ఉన్నా రాంగ్ సిగ్నలింగ్ అయ్యేది కాదు. ఈ ఘోరం జరిగేది కాదు. ఎస్ అండ్ టి విభాగాన్ని వేలెత్తి చూపే ఈ లోపాలే కీలకమైన వేళ ఘోర ప్రమాదానికి కారణమై, అమాయకుల్ని బలిగొన్నాయని నివేదిక చెబుతున్న మాట. ఇక, రైల్వేలలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ విధానానికి కీలక కేంద్రస్థానం రిలే రూమ్. రైళ్ళను నియంత్రించే మెకానిజమ్లు, అలాగే లెవల్ క్రాసింగ్లకు సంబంధించిన సిగ్నలింగ్ సామగ్రి అయిన ‘రిలే హట్స్’ ఈ రిలే రూమ్లలోనే ఉంటాయి. అలాంటి రూమ్ ఏ స్థాయి వారికి, ఎలా అందుబాటులో ఉండాలనే విషయంలోనూ అనేక లోపాలున్నాయి. సీఆర్ఎస్ నివేదిక ఈ సంగతీ వెల్లడించింది. నివేదికను సమర్పణకు సరిగ్గా కొద్ది రోజుల ముందే రిలే రూమ్కు ఒకటికి రెండు తాళాలు వేయాలని రైల్వే నిర్ణయించడం గమనార్హం. ఎప్పుడో 2018లో జరిగిన తప్పు ఇప్పుడు ప్రాణాలు బలి తీసుకుందంటే, క్రమం తప్పకుండా చేయాల్సిన చెకింగ్లు సవ్యంగా సాగడం లేదనే! రైల్వే స్టేషన్లలో మార్పులు చేసిన సర్క్యూట్లన్నీ సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, పరీక్షించడానికి ఇకపై ప్రత్యేక బృందాన్ని నియోగించాలని సీఆర్ఎస్ సిఫార్సు చేయడం గమనార్హం. అలాగే, ప్రమాద సందర్భంలో సత్వర స్పందనకు జోనల్ రైల్వేలలో ఏర్పాట్లను సమీక్షించాలంది. కళ్ళెదుటే లోపాలు కనిపిస్తున్నాయి గనక ఇకనైనా నిద్ర మేల్కోవాలి. లోపరహిత వ్యవస్థను సృష్టించాలి. అయితే, అందుకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పన ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడింది. దీర్ఘకాలికమైన ఆ పని చేయాలంటే రాజకీయ కృత నిశ్చయం ఉండాలి. రైల్వేలో భారీగా పెట్టుబడి పెట్టాలి. పార్టీల తేడాలు లేకుండా కేంద్రంలో గద్దె మీదున్న ప్రతి ప్రభుత్వంలోనూ అవి కొరవడ్డాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సవ్యంగా నడవాలంటే బండికి నట్లు, బోల్టులు అన్నీ సక్రమంగా బిగించి ఉండడం అవసరమని ఇకనైనా గ్రహించాలి. ఎడాపెడా వందే భారత్ రైళ్ళ కన్నా ప్రస్తుతం ఇదే ఎక్కువ అవ సరం! ఒరిస్సా దుర్ఘటన, దానిపై సీఆర్ఎస్ నివేదిక ఆ సంగతే గుర్తు చేస్తున్నాయి. గుర్తుపట్టే నాథుడు లేక ఇప్పటికీ బాలాసోర్లో పడివున్న 80కి పైగా మృతదేహాలూ మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. -
రైళ్లకు రక్షణ ‘కవచం’.. కిలోమీటర్కు 50 లక్షల వ్యయం.. తేడా వస్తే బ్రేకులే!
సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో ఇటీవల కోరమాండల్ ఎక్స్ప్రెస్కు జరిగిన ఘోర ప్రమాదం రైల్వే చరిత్రలో పెద్ద మచ్చే. కవచ్ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. రైళ్ల ప్రమాదాల నివారణకు భారత రైల్వే శాఖ రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. దేశవ్యాప్తంగా కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 15 ఏళ్లు పడుతుందని రైల్వే శాఖ నివేదిక వెల్లడించింది. స్వర్ణ చతుర్భుజి మార్గంలో 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. స్వర్ణ చతుర్భుజిలోని చెన్నై – హౌరా మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందున రాష్ట్రంలో మరో ఐదేళ్లలో (2028నాటికి) కవచ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘కవచ్’ సాంకేతిక, మానవ తప్పిదాలతో రెండు రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ మీదకు వస్తే ఢీకొనకుండా నివారించేందుకు రైల్వే రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ‘కవచ్’ పేరుతో ఆధునిక రక్షణ వ్యవస్థను రూపొందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రైల్వే శాఖ రూపొందించిన ఈ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అందించే అత్యుత్తమ స్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ –4 (ఎస్ఐఎల్ 40) సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో 89 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ‘యాంటీ కొల్లీషన్ పరికరాలను’ రైల్వే శాఖ రూపొందించింది. దీనిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరీక్షించగా, పూర్తి సఫలీకృతమైంది. దీంతో ‘కవచ్’ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 1,450 కిలోమీటర్ల మేరే అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనతో కవచ్ వ్యవస్థను దేశమంతా దశలవారీగా విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికను రూపొందించింది. అందుకోసం హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ అనే సంస్థతో కలసి కవచ్ ప్రాజెక్టును చేపట్టినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇదీ ప్రణాళిక.. ♦ దేశంలో రైళ్ల రద్దీ అత్యధికంగా ఉండే స్వర్ణ చతుర్భుజి మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం కిలోమీటర్కు రూ.50 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ♦ స్వర్ణ చతుర్భుజి మార్గంలో మొదటగా ముంబయి–ఢిల్లీ, ఢిల్లీ–హౌరా రూట్లో కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇప్పటికే రైల్వే శాఖ ఈ పనులు ప్రారంభించింది. ముంబయి – ఢిల్లీ 1,384 కి.మీ., ఢిల్లీ–హౌరా 1,454 కి.మీ. కలిపి మొత్తం 2,838 కి.మీ. మేర ఈ పనులను 2024 డిసెంబర్కు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ♦ రెండో దశ కింద స్వర్ణ చతుర్భుజిలోని ఇతర మార్గాల్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ మీదుగా చెన్నై–హౌరా మార్గంలో కూడా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. చెన్నై –హౌరా, చెన్నై–బెంగళూరు–ముంబయి మార్గంలో 2024 డిసెంబర్లో పనులు ప్రారంభించి 2028నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ♦ ఆంధ్రప్రదేశ్ గుండా చెన్నై–హౌరా మార్గంలో మొత్తం 1,162 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు విజయవాడ, విశాఖపట్నం, కటక్, బాలాసోర్లను ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు. ♦ అనంతరం మూడో దశ కింద చెన్నై–ఢిల్లీ మార్గంలో మొత్తం 2,182 కి.మీ. మేర కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. కవచ్ పనిచేస్తుందిలా.. కవచ్ వ్యవస్థలో భాగంగా రైళ్లలో మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే... నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా గుర్తించొచ్చు. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. దాంతో రైళ్లు పరస్పరం ఢీకొనకుండా పూర్తిగా నివారించడం సాధ్యపడుతుంది. -
రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు
న్యూఢిల్లీ: రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచి్చంది. రైల్వే శాఖలో మొత్తంగా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్ 1 తేదీ నాటికి నాన్ గెజిటెడ్ గ్రూప్ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ఇంకా 1166 కాపలా లెవల్ క్రాసింగ్స్!
సాక్షి, హైదరాబాద్: యుద్ధప్రాతిపదికన కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ను గతంలో తొలగించిన రైల్వే శాఖ, ఇప్పుడు కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్స్ (మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్)ను తొలగించే విషయంలో చేతులెత్తేస్తున్నట్టే కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 మ్యాన్డ్లెవల్ క్రాసింగ్స్ను తొలగించినట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 80 క్రాసింగ్స్ను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కానీ, ఆర్థిక సంవత్సరం మొదలై రెండున్నర నెలలు గడుస్తున్నా కేవలం ఏడు చోట్ల మాత్రమే పనులు పూర్తయినట్టు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇంకా 1166 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్స్ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ తొలగించటం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలు తప్పవు. రైల్వే విన్నపాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలా ప్రాంతాల్లో కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ ఉండేవి. ఆయా చోట్ల పట్టాలు దాటుతూ పాదచారులు, వాహనదారులు రైలు ప్రమాదాలకు గురై దుర్మరణం పాలయ్యేవారు. వాటిని మోదీ ప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన తొలగించారు. ఇప్పుడు కాపలాదారు ఉండే లెవల్ క్రాసింగ్స్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జీ(ఆర్యూబీ)లు, రోడ్ ఓవర్ బ్రిడ్జీ(ఆర్ఓబీ)లు, తక్కువ ఎత్తున్న అండర్పాస్లను నిర్మించటం ద్వారా గేట్లు తొలగించాలన్నది లక్ష్యం. కానీ ఒక్క ఆర్యూబీ నిర్మాణానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే ఆర్ఓబీలకైతే ఒక్కోదానికి దాని నిడివిని బట్టి రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది రైల్వేకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో వాటిని చేపట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వీలైనన్ని ఆర్యూబీలతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నా.. బడ్జెట్ పెద్ద అడ్డంకిగా మారింది. దీంతో రాష్ట్రప్రభుత్వాలతో సంయుక్తంగా పనులు చేపడుతోంది. కానీ, వీటికి నిధులిచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపటం లేదు ప్రజలూ జర భద్రం: దక్షిణ మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా విజ్ఞప్తి చేసింది. ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్’ విజ్ఞప్తి మేరకు జూన్ 15ను లెవల్క్రాసింగ్స్ అవేర్నెస్ డేగా జరుపుతున్నారు. దీన్ని పరస్కరించుకుని లెవల్ క్రాసింగ్స్ విషయంలో ప్రజలను మరింత చైతన్యవంతును చేసేందుకు నాటికలు లాంటి ప్రదర్శనల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించింది. రైలు వచ్చేముందు గేటు పడటం, గేటు తెరుచుకునేవరకు ఓపికగా ఎదురుచూడటం, గేటు కింద నుంచి వెళ్లకపోవటం, పట్టాలు దాటేప్పుడు రైలు వస్తుందో లేదో అటూఇటూ చూసి వెళ్లటం లాంటి అంశాలను జనం మదిలో ఉంచుకోవాలని సూచిస్తోంది. -
భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలి
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ప్రయాణికుల అంచనాలకు తగిన విధంగా అన్ని శాఖల అధికారులు రైల్వేశాఖ నిర్దేశించిన విధంగా రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ సూచించారు. గురువారం సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్లో విజయవాడ డివిజన్లోని పలు శాఖల అధికారులు, సిబ్బందితో రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలు అనే అంశంపై డీఆర్ఎం షివేంద్రమోహన్, ఏడీఆర్ఎం ఎం.శ్రీకాంత్తో కలసి జీఎం అరుణ్కుమార్ జైన్ సెమినార్ నిర్వహించారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది ఈ సెమినార్లో పాల్గొన్నారు. ముందుగా ఏడీఆర్ఎం శ్రీకాంత్ ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డిపార్ట్మెంట్ వారీగా చేపడుతున్న భద్రత చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీఎం అరుణ్కుమార్ జైన్ మాట్లాడుతూ భధ్రత నిర్వహణలో ప్లాన్–బి లేదని, పరిపాలనశాఖ నిర్దేశించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. రోలింగ్ బ్లాక్ ప్రోగ్రామ్ ఎంతో విలువైనదని, దాన్ని అమలు చేయాలన్నారు. డీఆర్ఎంతో కలసి లోకో పైలట్లు, సీఎల్ఐ, టీఆర్డీ అండ్ ఎలక్ట్రికల్ సిబ్బందితో సమీక్షించి ఫీల్డ్స్థాయిలో వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయంలో సెక్షన్ కంట్రోలర్స్తో సమావేశం నిర్వహించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒడిశా రైళ్ల ప్రమాదంపై... సీబీఐ విచారణ
బాలాసోర్/న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. అంతేగాక, ‘‘ప్రమాదం వెనక విద్రోహ కోణాన్నీ తోసిపుచ్చలేం. రైళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటి గమనాన్ని నిర్దేశించే అతి కీలకమైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం’’ అని రైల్వే వర్గాలు చెప్పుకొచ్చాయి. రైలును ట్రాక్ను మళ్లించే ఎలక్ట్రిక్ పాయింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సంబంధిత సమస్యే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ్ భువనేశ్వర్లో మీడియాకు చెప్పారు. ‘‘పూర్తి వివరాల్లోకి నేనిప్పుడే వెళ్లదలచుకోలేదు. అయితే పాయింట్ యంత్రం సెట్టింగ్ను మార్చారు. ఇదెందుకు, ఎలా జరిగిందన్నది విచారణ నివేదికలో వెల్లడవుతుంది’’ అని వివరించారు. మూడు రైళ్ల ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. విపక్షాలు మాత్రం ఈ విషయంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ సహా పలు ఇతర విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. మంత్రుల స్థాయి నుంచి కింది దాకా బాధ్యులందరినీ గుర్తించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు మీడియా పిచ్చి, పీఆర్ గిమ్మిక్కులు ప్రభుత్వ వ్యవస్థను చేతగానిదిగా మార్చేశాయమంటూ ఖర్గే తూర్పారబట్టారు. యూపీఏ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు ఎంత ఘోరంగా ఉండేదో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. మహా విపత్తును కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను 288 నుంచి 275గా రైల్వే శాఖ ఆదివారం సవరించింది. విద్రోహ కోణంపై రైల్వే ఏం చెప్పిందంటే... పాయింట్ మెషీన్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని రైల్వే వర్గాలు వివరించాయి. ‘‘అదెంత సురక్షితమంటే ఒకవేళ అది పూర్తిగా విఫలమైనా సిగ్నళ్లన్నీ వెంటనే రెడ్కు మారి రైళ్ల రాకపోకలన్నీ తక్షణం నిలిచిపోతాయి. అయినా సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమైంది గనుక బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. కేబుళ్లను చూసుకోకుండా ఎవరైనా తవ్వేయడంతో తెగిపోయి ఉండొచ్చు’’ అని రైల్వే బోర్డు సభ్యురాలు జయా వర్మ సిన్హా వివరించారు. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రైవర్ల తప్పిదం కారణం కావని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. లోపలి, లేదా బయటివ్యక్తులు విద్రోహానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని రైల్వే అధికారి ఒకరన్నారు. టికెట్ లేని వారికీ పరిహారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో లూప్లైన్లోకి దూసుకెళ్లి ఆగున్న గూడ్సును ఢీకొని పట్టాలు తప్పడం, పక్క ట్రాక్పై పడ్డ బోగీలను ఢీకొని బెంగళూరు–హౌరా ఎక్స్ప్రెస్ కూడా పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 1,175 మందిలో వందలాది మంది ఇంకా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రైళ్లలో చాలావరకు వలస కార్మికులే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్డు గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం అందించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు సహాయ చర్యలతో పాటు ట్రాక్ల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తూర్పు, దక్షిణ భారతాలను కలిపే ఈ కీలక రైల్వే లైన్లో పూర్తిగా దెబ్బ తిన్న ట్రాకుల్లో ఇప్పటిదాకా రెండింటిని పునరుద్ధరించారు. ప్రమాదంపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రైల్వే వ్యవస్థలో ప్రమాద, భద్రత పరామితులను కమిటీ విశ్లేషించి, వాటి బలోపేతానికి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరారు. కవచ్ వ్యవస్థను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలివ్వాలన్నారు. -
సిగ్నల్ లోపం వల్లే...!
సిగ్నల్ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. ‘‘కోరమండల్ మొదటి మెయిన్ లైన్లోంచి లూప్ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్ లైన్పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే... ► సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ బహనగా స్టేషన్ను దాటుతుండగా ప్రమాదం జరిగింది. ► ఈ స్టేషన్ వద్ద రెండు మెయిన్ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్ లైన్లున్నాయి. ► పాసింజర్ హాల్ట్ స్టేషన్ గనుక ఎక్స్ప్రెస్లు, సూపర్ఫాస్ట్ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్లను లూప్ లైన్లకు తరలిస్తారు. ► శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్ ముందుగా స్టేషన్ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్ వస్తుండటంతో గూడ్స్ను లూప్లైన్కు మళ్లించారు. ► కోరమండల్ వెళ్లాల్సిన మెయిన్ లైన్పై అప్పటికి రెడ్ సిగ్నల్ ఉంది. స్టేషన్ సిబ్బంది 17ఏ స్విచ్ నొక్కి దాన్ని గ్రీన్గా మార్చాలి. కానీ ఆ స్విచ్ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్ లూప్లైన్లోకి మళ్లి గూడ్స్ను ఢీకొట్టింది. ► గూడ్స్ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్ కోచ్లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్లైన్పైకి వెళ్లాయి. ► అదే సమయంలో ఆ లైన్లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ చివరి బోగీలపై కోరమండల్ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ► హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది. ► సూపర్ ఫాస్ట్ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. ► ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
లూప్ లైనే యమపాశమైంది
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అనుమానమే నిజమైంది. లూప్లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. శుక్రవారం ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి. ఒక ఇంజన్తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు. లూప్లైన్ అంటే...? సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి. ► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు... ► ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వైఫల్యమేనని కొందరంటున్నారు. ► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్ నేరుగా లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. డ్రైవర్ల తప్పిదం కాదు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్, తొలి వందేభారత్ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్హెచ్బీ) కోచ్లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్కు అది వెళ్లిన లైన్పై గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు డేటా లాగర్లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు. ప్రమాద సమయంలో... కోరమండల్ ఎక్స్ప్రెస్ వేగం గంటకు 128 కి.మీ. బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేగం గంటలకు 116 కి.మీ. గూడ్స్ లూప్ లైన్లో ఆగి ఉంది ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు 2,700 పై చిలుకు (కోరమాండల్లో 1257, హౌరాలో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి) ప్రమాద ప్రాంత విస్తీర్ణం దాదాపు ఒక కిలోమీటర్ -
ఇక వందే భారత్ స్లీపర్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లోని ఆధునిక రైళ్లతో పోటీపడే రీతిలో రూపుదిద్దుకుని సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్ల తదుపరి వర్షన్ తయారీకి రైల్వే సిద్ధమైంది. ప్రస్తుతం చైర్ కార్ కోచ్లతో నడుస్తున్న ఈ రైళ్లలో స్లీపర్ కోచ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డిజైన్లు రూపొందించేందుకు రైల్వే చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చికల్లా డిజైన్లు ఖరారు చేసి రైల్ కోచ్ల తయారీ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుత రైలుకు భిన్నంగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 800 కి.మీ.లోపు దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య నడిచే తొలి వందేభారత్ రైలును, ఏప్రిల్లో రెండో వందేభారత్ సర్విసుగా సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడిచే రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. పగటి వేళ నడిచే రైళ్లు అయినప్పటికీ ఈ రెండు సర్వీసులు విజయవంతమయ్యాయి. వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 140 శాతంగా నమోదవుతోంది. ఇలా దేశవ్యాప్తంగా చాలా వందేభారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. అయితే, వీటిల్లో బెర్తులు లేకపోవటంతో ప్రయాణికులు కూర్చునే వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఎనిమిది గంటల్లో గమ్యం చేరేలా సమయాలను సెట్ చేశారు. దూర ప్రాంత నగరాల మధ్య నడపాలంటే, సమయం ఎక్కువ పడుతుంది, అంతసేపు కూర్చోవటం సాధ్యం కానందున కేవలం దగ్గరి నగరాల మధ్యనే తిప్పుతున్నారు. అయితే వీటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి దూర ప్రాంత నగరాల మధ్య రాత్రింబవళ్లు తిప్పాలని రైల్వే నిర్ణయించింది. మరింత వేగంగా.... గతంలో పగటి వేళ చైర్ కార్తో తిరిగేలా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టారు. అన్ని వసతులు మెరుగ్గానే ఉన్నప్పటికీ వీటి వేగం సాధారణ రైళ్లలాగే ఉండేది. దీంతో గంటల తరబడి పగటి వేళ కూర్చుని ప్రయాణించేందుకు ప్రయాణికులు విముఖత చూపటంతో ఆ కేటగిరీ విజయం సాధించలేదు. వందేభారత్ రైళ్లు మాత్రం శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వీలుండటంతో వీటి ప్రయాణ సమయం బాగా తక్కువగా ఉంది. ఈ కేటగిరీ సక్సెస్కు ఇదే ప్రధాన కారణం. దీంతో తదుపరి స్లీపర్ కేటగిరీ రైళ్లు మరింత వేంగంగా ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. వాటి గరిష్ట వేగం దాదాపు 200 కి.మీ. మించి ఉంటుందని తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించటం ఆసక్తిని రేపుతోంది. అంత వేగంతో దూసుకుపోయేలా దీని డిజైన్ను రూపొందించనున్నారని, ఇది ప్రస్తుత వందేభారత్ రైళ్లకు భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో వందేభారత్ రైళ్లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో కొత్త రైలు నమూనాలను రూపొందించే పని ప్రారంభించినట్టు సమాచారం. మార్చి నాటికి నమూనా రైలును కూడా సిద్ధం చేసి కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. వందేభారత్ రైలు 2018లో రూపొందినా.. దాదాపు ఏడాదిన్నర పాటు దాన్ని పరిశీలించి పలు మార్పులు చేస్తూ వచ్చారు. కొత్త రైలుకు కూడా అలా పరిశీలించి మార్పులు చేసి, లోపాలు లేకుండా ప్రారంభించాలని భావిస్తున్నారు. సాధారణ రైళ్లను రీప్లేస్ చేసేలా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంప్రదాయ నమూనా రైళ్లే నడుస్తున్నాయి. ప్రీమియం కేటగిరీ రైళ్లుగా పిలుచుకునే శతాబ్ది, తేజస్, రాజధాని, దురంతో లాంటివి కూడా సంప్రదాయ రూపులోనే ఉంటున్నాయి. ఇటీవల కోచ్లను మాత్రం ఐసీఎఫ్ బదులు ఎల్హెచ్బీవి జత చేస్తున్నారు. కొత్త వందేభారత్ రైలు పట్టాలెక్కటం ప్రారంభించాక ఇక ప్రీమియం కేటగిరీ రైళ్లను కొత్త వందేభారత్తో రీప్లేస్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ రైళ్లను కూడా కొత్త రూపు రైళ్లతో మార్చే యోచనలో రైల్వే ఉంది. -
తెలుగులోనూ రైల్వే టికెట్ బుకింగ్
సాక్షి, విశాఖపట్నం: జనరల్ టికెట్ కోసం ఆదరాబాదరాగా రైల్వేస్టేషన్కు చేరుకుని.. చాంతాడంత పొడవు ఉండే క్యూలైన్లలో నిలబడి.. ఈలోపు తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుందేమోనని ఆదుర్దా పడేవారే ఎక్కువ. ఇలా ఇబ్బందులు పడే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను తీసుకొచ్చి న సంగతి తెలిసిందే. యూటీఎస్ విధానంలో యాప్, వెబ్సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇంగ్లిష్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ప్రాంతీయ భాషలకు కూడా రైల్వే శాఖ విస్తరించింది. దీంతో తెలుగు సహా వివిధ ప్రాంతీయ భాషల్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సాధారణ (జనరల్) రైలు టికెట్లను దిగువ శ్రేణి ప్రయాణికులు ఎక్కువగా తీసుకుంటారని.. వీరి కోసం ప్రాంతీయ భాషల్లో యాప్ని తీసుకొస్తే వినియోగం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి శ్రమ లేకుండా యాప్ నుంచే.. యూటీఎస్ యాప్ ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా మొబైల్ ఫోన్ నుంచే జనరల్ టికెట్ పొందొచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇంగ్లిష్ మాత్రమే అందుబాటులో ఉండటంతో గ్రామీణులు, పెద్దగా చదువుకోనివారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సులభంగా యాప్ వినియోగించేలా ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఇంగ్లిష్తోపాటు తెలుగు, హిందీ, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, తమిళ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా జనరల్ టికెట్తో పాటు ప్లాట్ఫామ్ టికెట్ కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే సీజన్ టికెట్ బుకింగ్, రెన్యువల్ సైతం చేసుకోవచ్చు. యూటీఎస్ యాప్లో ప్రాంతీయ భాషల అప్డేట్ వెర్షన్ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. హార్డ్ కాపీ, పేపర్లెస్ టికెట్.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. యూటీఎస్ యాప్ ఎన్ని భాషల్లో: తెలుగు, ఇంగ్లిష్, కన్నడం, మలయాళం, హిందీ, తమిళం, ఒడియా, మరాఠీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రైల్వేస్టేషన్లు: 9,120 డౌన్లోడ్ చేసుకున్నవారు: 10 మిలియన్లకు పైగా యాప్ ద్వారా రోజుకు బుక్ అవుతున్న టికెట్లు: 2.34 లక్షలు రోజూ వినియోగిస్తున్న ప్రయాణికులు: 14.21 లక్షల మంది స్టేషన్కు 5 కి.మీ. పరిధిలో.. మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా యూటీఎస్ యాప్ పనిచేస్తోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్లో ఉండాలి. రైల్వేస్టేషన్ ఆవరణకు 30 మీటర్ల నుంచి 5 కి.మీ. పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాప్ ద్వారా 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజన్ టికెట్లను తీసుకోవచ్చు. ఎక్స్ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, సూపర్ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టికెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. – అనూప్కుమార్ సత్పతి, డీఆర్ఎం, వాల్తేరు -
కరీంనగర్–హసన్పర్తి ‘లైన్’క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కరీంనగర్ – హసన్పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన రీ సర్వే చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధుల కేటాయింపుతో పాటు నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్విని వైష్ణవ్తో బండి భేటీ శుక్రవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ – హసన్పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతిపత్రం అందించారు. ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి 2013లో సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా పురోగతి లేకుండా పోయిందని సంజయ్ తెలిపారు. దాదాపు 62 కి.మీ. లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీకి , వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణాకు ఈ లైన్ ఉపయోగపడుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో ఈ రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని కూడా సంజయ్ కోరారు. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి అధికారులను పిలిపించి మాట్లాడారు. కరీంనగర్ –హసన్పర్తి లైన్ కు తక్షణమే రీసర్వేకు ఆదేశించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే నెలలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్య లు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదే శించారు. జమ్మికుంట రైల్వేస్టేషన్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం: సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరీంనగర్ – హసన్పర్తి రైల్వే లైన్ నిర్మాణం ఆలస్యమైందని, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని సంజయ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తప్పిదంతో రాష్ట్రానికి అన్యాయం ’కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని సంజయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రజల వనరుల శాఖ సలహా దారు వెదిరే శ్రీరాంతో కలిసి సంజయ్ శుక్రవారం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందే అవకాశం ఉందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించి రాష్ట్రప్రజలకు నష్టం కలిగించారని వివరించారు. కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ను పరిశీలించి త్వరగా పనులు చేపట్టేలా అను మతి ఇవ్వాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులను పిలిచి మాట్లాడారు. డీపీఆర్ను సీడబ్ల్యూసీకి పంపి పరిశీలించడంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
వందే పాలమూరు.. కర్నూలు! వేగం తగ్గినా సరే.. నడిపేద్దాం.. మారిన వైఖరి
వందేభారత్ ఎక్స్ప్రెస్.. ఆ రైలు అంటేనే వేగం అన్న మాటగా మారింది. గంటకు 160 కి.మీ.వేగంతో ఆ రైళ్లు సులువుగా పరుగు పెట్టగలవు.. ఆ మేరకు గంటకు 130 కి.మీ. వేగానికి తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యాన్ని రైల్వే పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆ సామర్థ్యానికి సరిపోని ట్రాక్పై గరిష్టంగా 110 కి.మీ. వేగానికి పరిమితమవుతూ ఆ రైళ్లు దూసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రైళ్ల విషయంలో రైల్వే శాఖ తీరు మారినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ట్రాక్ సామర్థ్యం మెరుగుపడని ట్రాక్ మీదుగా కూడా వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. వీలైనంత వేగంగా ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్న రైల్వే శాఖ, ప్రస్తుతానికి వేగానికి సరిపడా ట్రాక్ సామర్ధ్యం పెరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేసింది. –సాక్షి, హైదరాబాద్ అదే కోవలో హైదరాబాద్–బెంగళూరు.. ఇటీవలే సికింద్రాబాద్– విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లను సమకూర్చుకున్న దక్షిణ మధ్య రైల్వేకు వచ్చే నెలలో ముచ్చటగా మూడో వందేభారత్ రైలు కూడా అందనుంది. హైదరాబాద్– బెంగుళూరు మధ్య కొత్త వందేభారత్ రైలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలల్లోనే ఇది పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు. విశాఖ వందేభారత్ రైలు ప్రారంభమైన కొద్ది రోజులకే మరో మూడు రైళ్లను కేటాయిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. అందులో తిరుపతి రైలు ఇప్పటికే మొదలు కాగా, తదుపరి బెంగళూరు రైలు, ఆ తర్వాత హైదరాబాద్–పుణే రైలు ప్రారంభం కానున్నాయి. మహబూబ్నగర్ మీదుగానే ఆసక్తి.. నగరం నుంచి బెంగుళూరుకు ప్రధాన మార్గంగా ఉన్న మహబూబ్నగర్–కర్నూలు ట్రాక్ మీదుగానే కొత్త వందేభారత్ను నడిపేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. కాచిగూడ–మహబూబ్నగర్–కర్నూలు–డోన్– మీదు గా బెంగళూరు చేరుకుంటుంది. మరో మార్గం వాడి–రాయచూర్ మీదుగా ఉంది. నిజానికి, ఈ రెండో మార్గంలో ఎక్కువ నిడివి 130 కి.మీ. వేగానికి తగ్గట్టుగా మార్చారు. ఇందులో ఎక్కువ దూరం డబుల్ లైన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో పోలిస్తే మహబూబ్నగర్ మార్గంలో ట్రాక్ను పటిష్ట పరచలేదు. మహబూబ్నగర్–డోన్ మధ్య ఇంకా సింగిల్ లైనే ఉంది. అయినా కూడా.. రాయచూర్ మార్గంతో పోలిస్తే బెంగళూరుకు 80 కి.మీ. దూరం తక్కువగా ఉండటం, మహబూబ్నగర్, కర్నూలు లాంటి డిమాండ్ ఉన్న ప్రాంతాలు ఉండటంతో పాలమూరు, కర్నూలు మార్గాన్నే ఎంపిక చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే తప్ప ఇదే ఖరారు అయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఈ మార్గం ఖరారైతే... ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరుగుపెడుతున్న రెండు వందేభారత్ రైళ్ల కంటే ఈ వందేభారత్ రైలు తక్కువ వేగంతో నడవనుంది. దీని గరిష్ట వేగం సగటున 70 కి.మీ. కంటే తక్కువే ఉంటుందంటున్నారు. -
మరోసారి దాడి.. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఆలస్యం
విశాఖ: రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. బుధవారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దారిలో.. ఖమ్మం-విజయవాడ మధ్య రైలుపై రాళ్లు విసిరిన అగంతకులు. దీంతో.. C8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. కోచ్ మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ(గురువారం) విశాఖ నుంచి రైలు ఆలస్యంగా బయలుదేరుతోంది. విశాఖ నుంచి 5.45కు బయలుదేరి వెళ్లాల్సిన వందే భారత్ ఆలస్యం..షెడ్యూల్ కంటే ఆలస్యంగా 9-.45కి బయలుదేరనుంది. గతంలోనూ ఈ రూట్లో వందే భారత్పై రాళ్ల దాడులు జరిగాయి. ఫిబ్రవరిలో ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో, అంతకు ముందు సైతం ఓసారి ఇలాగే దాడి జరిగింది. వరుసగా రైళ్లపై రాళ్ల దాడి జరగడంతో దక్షిణమధ్య రైల్వే సీరియస్గా స్పందించింది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాళ్లదాడికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు.. ఇలా నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన కేసుల్లో 39 మందిని అరెస్టు చేశారు కూడా. ఇదిలా ఉంటే.. శనివారం కొత్తగా సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. -
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై సోమవారం పార్లమెంట్కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. వందేభారత్ రైళ్ల ఉత్పత్తిపై ఆందోళన వందేభారత్ రైళ్ల తయారీ మందగమనంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2022–23లో 35 రైళ్లు తయారవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 8 రైళ్లే సిద్ధమయ్యాయి. లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, రైలు ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరాలన్నా వందేభారత్ రైలు ఇంజన్లు, బోగీల తయారీ వేగాన్ని ముమ్మరం చేయాలి. ఇందుకోసం పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేశాఖ సాంకేతిక తోడ్పాటు అందించాలి’’ అని సూచించింది. -
వందేభారత్లో త్వరలో స్లీపర్ బెర్తులు
సాక్షి, హైదరాబాద్: సెమీ బుల్లెట్ రైలుగా పరిగణిస్తున్న వందేభారత్ రైలు త్వరలో సరికొత్త మార్పులతో రాబోతోంది. ప్రస్తుతం చైర్ కార్కే పరిమితమైన ఈ రైల్లో.. స్లీపర్ బెర్తులు ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఈ రైళ్లను తయారుచేస్తున్న చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)కి ఆదేశాలివ్వడంతో ఈమేరకు రూపకల్పన పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం వందేభారత్ 2.0 సిరీస్ నడుస్తోంది. మొదటిసిరీస్లో ఐదు రైళ్లు పట్టాలెక్కగా, రెండో విడతలో మూడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య సోమవారం నుంచి (ఆదివారం లాంఛనంగా ప్రారంభంకానుంది) ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న రైలు కూడా రెండో సిరీస్లో భాగం. తదుపరి లేదా ఆ పై సిరీస్ అందుబాటులోకి వచ్చే నాటికి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే వందేభారత్ రైలుకు విపరీతమైన డిమాండ్ ఉన్నా, కొన్నిచోట్ల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే ఉంటోంది. వీటిలో స్లీపర్ బెర్తులు లేకపోవటంతో అవి రాత్రి వేళ తిరగవు. దీంతో గమ్యం చేరేవరకు కూర్చునే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. గతంలో వందేభారత్ తరహాలో వచ్చిన ఏసీ డబుల్ డెక్కర్ రైలుకు ఎంతో డిమాండ్ ఉండేది. ఐదేళ్ల క్రితం కాచిగూడ–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య తిరిగేందుకు డబుల్ డెక్కర్ రైలు మంజూరైంది. బెర్తులు లేక పోవటంతో పూర్తిగా పగటివేళ తిరుగుతుండటంతో దీనిలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం లోపే నమోదయ్యేది. క్రమంగా నష్టాలు పెరగటంతో దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వందేభారత్ విషయంలోనూ ఈ ప్రమాదం పొంచి ఉండటంతో అందులో స్లీపర్ బెర్తులు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. విశాఖకు కొంత మెరుగే.. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది. అదే వందేభారత్ రైలు మధ్యాహ్నం మూడింటికి బయలుదేరి రాత్రి 11.30 గంటలకల్లా గమ్యం చేరుతుంది. కానీ విశాఖ నుంచి ఆ రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అంటే పూర్తిగా పగటి వేళలోనే తిరుగుతుంది. దీంతో ఈ మార్గంలో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, శనివారం సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తోపాటు కిషన్రెడ్డి పరిశీలించారు. అనంతరం వందేభారత్లోనూ పరిశీలించారు. ధర ప్రభావం చూపుతుందేమో.. సికింద్రాబాద్–విశాఖ వందేభారత్లో ఎగ్జిక్యూటివ్ చైర్కార్ టికెట్ ధర రూ.3,120గా ఉంది. ఇందులో రూ.369 కేటరింగ్ చార్జి కలిసి ఉంది. అది వద్దనుకుంటే దాన్ని మినహాయించి టికెట్ జారీ చేస్తారు. అదే విశాఖకు వెళ్లే గోదావరిలో ఏసీ ఫస్ట్క్లాస్ టికెట్ ధర రూ.2,540 మాత్రమే. దురంతోలో రూ.2,795, ఫలక్నుమాలో రూ.2,465గా ఉంది. ఇవన్నీ స్లీపర్ బెర్తులుండే రైళ్లు. వీటి కంటే చైర్కార్లో వెళ్లే వందేభారత్ రైలు టికెట్ ధర చాలా ఎక్కువగా ఉండటం కూడా కొంత ప్రభావం చూపుతుందంటున్నారు. వందేభారత్ ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1,665గా ఉంటే, గోదావరిలో థర్డ్ ఏసీ ధర రూ.1080, ఫలక్నుమాలో రూ.1,045 మాత్రమే. వాటిల్లో స్లీపర్ క్లాస్ ధర రూ.450 మాత్రమే కావటం గమనార్హం. అయితే మిగిలిన రైళ్లతో పోలిస్తే.. వందేభారత్ రైలు ప్రయాణ సమయం తక్కువగా ఉంటుంది. -
టెల్కోలకు రైల్వే గ్రీన్ సిగ్నల్! రైల్వే భూమిలో టెలికం టవర్లు
రైల్వే సంబంధ భూములలో రైల్టెల్ కార్పొరేషన్కు మినహా ఏ ఇతర టెలికం కంపెనీలూ టవర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకూ అనుమతించడం లేదు. అయితే తాజాగా ఇందుకు రైల్వే శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా భూములకు కొత్త లీజ్ విధానాలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా దేశీయంగా 5జీ టెలికం నెట్వర్క్ ఊపందుకునే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. న్యూఢిల్లీ: ర్వైల్వే భూములకు సంబంధించి ల్యాండ్ లైసెన్సింగ్ ఫీజు(ఎల్ఎల్ఎఫ్) నిబంధనలను కొద్ది నెలల క్రితం కేంద్ర క్యాబినెట్ సరళీకరించింది. వెరసి ప్రయివేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో రైల్వే శాఖ కొత్త ఎల్ఎల్ఎఫ్ పాలసీకి తెరతీసింది. దీంతో మొబైల్ టవర్ల ఆదాయంలో 7 శాతాన్ని పంచుకునే నిబంధనలకు తెరదించింది. దీని స్థానే భూముల మార్కెట్ విలువలో వార్షికంగా 1.5 శాతం చార్జీల విధింపునకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. తద్వారా దేశీయంగా 5జీ నెట్వర్క్ విస్తరణకు దారి ఏర్పడనుంది. దీనిలో భాగంగా అనుమతులు మంజూరు చేసే అంశంలో భవిష్యత్ నెట్వర్క్ అవసరాలను పరిగణించేలా జోనల్ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రైల్టెల్ మాత్రమే... ప్రస్తుతం రైల్వే రంగ టెలికం అవసరాలకు రైల్టెల్ కార్పొరేషన్పై మాత్రమే ఆ శాఖ ఆధారపడుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయివేట్ రంగ కంపెనీలకూ టెండర్లను ప్రారంభించినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిని ఆయా సంస్థలు వాణిజ్యంగా వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఇదే సమయంలో ఈ మౌలిక సదుపాయాలను పోటీ ధరల ప్రాతిపదికన రైల్వేలు సైతం ఉపయోగించుకోనున్నాయి. 2016 పాలసీ ప్రకారం రైల్వే భూములలో రైల్టెల్కు మాత్రమే టవర్ల ఏర్పాటుకు వీలుండేది. తాజా విధానాలు వీటికి స్వస్తి పలికాయి. వీటి ప్రకారం 70 డివిజన్లు కార్యాలయాలు, స్టేషన్ పరిసరాలలో పోల్ మౌంట్లు, స్మాల్ సెల్స్ ఏర్పాటుకు అనుమతించనున్నాయి. రెండు నెలల గడువు సొంత నెట్వర్క్లో 5జీ సర్వీసుల వృద్ధికి కొద్ది రోజులుగా రైల్వే శాఖ ప్రయివేట్ నెట్వర్క్ ఆపరేటర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే భూములలో ప్రయివేట్ టెలికం కంపెనీలు టవర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతించడంతో వ్యయాలు తగ్గనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా సామర్థ్య మెరుగుకు ఊతం లభించడంతోపాటు, అత్యుత్తమ గ్రిడ్ ప్రణాళికలకు వీలున్నట్లు తెలియజేశాయి. రైల్వేలకు ఆయా భూములు అవసరమైనప్పుడు రెండు నెలల నోటీసు ద్వారా తిరిగి సొంతం చేసుకునే నిబంధనలు జత చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 5జీ టవర్ల ఏర్పాటుకు మొబైల్ సేవల దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ భూముల కోసం అన్వేషిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ తాజా నిర్ణయాలు పరిశ్రమకు బూస్ట్నివ్వనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో స్థానిక నెట్వర్క్లకు మరింత బలిమి చేకూరే వీలుంది. ప్రధానంగా పట్టణాలు, గ్రామీణ దూర ప్రాంతాల రైల్వే స్థలాలలో టవర్ల ఏర్పాటు కంపెనీలకు లబ్దిని చేకూర్చగలదని పరిశ్రమ నిపుణులు వివరించారు. తద్వారా టెలికం మౌలిక సదుపాయాల ఏర్పాటులో మరిన్ని ప్రణాళికలకు తెరలేస్తుందన్నారు. ఇది టెలికం పరిశ్రమ నుంచి చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే టవర్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవడం, రైల్వేకు తిరిగివ్వడం వంటి కొన్ని అంశాలలో సమస్యలను పరిష్కరించవలసి ఉన్నట్లు తెలియజేశారు. -
రైల్వే బ్రిడ్జిలకు రక్షణ కవచం
సాక్షి, అమరావతి: రైల్వే వంతెనలపై ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించింది. భారీ వర్షాలు, వరదల సమయంలో రైల్వే వంతెనలు, సమీపంలోని ట్రాక్ల భద్రత చర్చనీయాంశంగా మారుతోంది. అందుకే 24 గంటలూ రైల్వే వంతెనలతోపాటు నది, సముద్ర తీరాలకు సమీపంలోని ట్రాక్ల భద్రతను పర్యవేక్షించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసేలా బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టం(బీఎంఎస్)ను ప్రవేశపెట్టింది. వెబ్ ఆధారిత అప్లికేషన్ సాయంతో.. బీఎంఎస్ అనేది వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక వ్యవస్థ. దేశంలోని రైల్వే వంతెనలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని 24/7 విధానంలో ఇది అందుబాటులో ఉంచుతుంది. రైల్వే వంతెనల డిజైన్, అధికారుల తనిఖీల వివరాలు, తాజా ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచుతూ ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు దోహదపడుతుంది. వంతెనల వద్ద నీటిమట్టం, ప్రవాహ వేగం, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. రైల్వే అధికారులను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. బీఎంఎస్ విధానానికి అనుబంధంగా మరికొన్ని అప్లికేషన్లను కూడా రైల్వే శాఖ జోడించింది. ‘ఆన్లైన్ మానిటరింగ్ ఆఫ్ రోలింగ్ స్టాక్ (ఓఎంఆర్ఎస్), ‘వీల్ ఇంపాక్ట్ లోడ్ డిటెక్టర్ (డబ్ల్యూఐఎల్డీ) పేరుతో రెండు వ్యవస్థలను బీఎంఎస్కు అనుబంధంగా ప్రవేశపెట్టారు. నదీ ప్రవాహ వేగం, వంతెనల వద్ద ప్రవాహ వేగం, నీటిమట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎప్ఐడీ) ట్యాగ్లను ఏర్పాటు చేశారు. వాటితోపాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), హాట్ బాక్స్ డిటెక్టర్ (బీబీడీ), మెషిన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టం (ఎంబీఐఎస్)లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. తద్వారా వర్షాలు, వరదలు ముంచెత్తిన సమయంలో నది, సముద్ర తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దాంతో ఆ మార్గంలో రైళ్లను అనుమతించవచ్చా లేదా అనే దానిపై అధికారులు తక్షణం నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మొదటి దశలో దేశంలో 305.. రాష్ట్రంలో 5 బీఎంఎస్ కింద మొదటి దశలో దేశంలో 305 రైల్వే వంతెలను, ట్రాక్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్లో 5 వంతెనలు ఉన్నాయి. దేశంలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 1.44 లక్షల రైల్వే వంతెనలు ఉండగా.. వాటిలో మేజర్ వంతెనలు 37,689 ఉన్నాయి. ఎంపిక చేసిన 305 వంతెనలను మొదటి దశలో బీఎంఎస్ వ్యవస్థ కిందకు రైల్వే శాఖ తీసుకువచ్చింది. ఇందులో ఏపీలో 5 వంతెనలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 678 రైల్వే వంతెనలు ఉండగా వాటిలో మేజర్ వంతెనలు 31 ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, అనకాపల్లి సమీపంలోని శారదా నదిపై వంతెన, రాజమహేంద్రవరంలో గోదావరి వంతెన, విజయవాడ కృష్ణా నదిపై వంతెన, నెల్లూరులోని పెన్నా నదిపై నిర్మించిన వంతెన ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని దాదాపు 150 కి.మీ. మేర రైల్వే ట్రాక్ల పర్యవేక్షణను రైల్వే శాఖ బీఎంఎస్ పరిధిలోకి తీసుకువచ్చింది. భారీ వర్షాలు, వరదల సమయంలో ఈ రైల్వే ట్రాక్లపైకి వరద నీరు చేరడంతో రైళ్లను నిలిపివేయాల్సి వస్తోంది. అందుకే వాటిని ఎంపిక చేసినట్టు రైల్వేవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని రైల్వే వంతెనలు బీఎంఎస్ విధానం పరిధిలోకి చేరనున్నాయి. -
రైల్వేలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 3,15,823 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైల్వేశాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాల జాబితాను రాజ్యసభలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ విడుదల చేశారని, ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 17,134 వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఖాళీగా ఉన్న రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాలు పొందే విధంగా బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు. కేంద్రం వెంటనే రైల్వే శాఖతో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. -
AP: రాష్ట్రానికి రెండు వందేభారత్ రైళ్లు.. ఆ రెండు మార్గాల్లోనే!
సాక్షి, అమరావతి: రైల్వే శాఖ రాష్ట్రానికి రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర రైల్వే శాఖ నుంచి వర్తమానం అందింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను 2023 జనవరిలో సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడపాలని నిర్ణయించారు. త్వరలోనే అధికారికంగా తేదీని ఖరారు చేస్తారు. గంటకు 165 కి.మీ. వేగంతో ప్రయాణించడంతోపాటు 1,129 సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ రైలును మొదట సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు నడుపుతారు. తరువాత విశాఖపట్నం వరకు పొడిగిస్తారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడపనున్నారు. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు నడపాలని దక్షిణ మధ్య రైల్వేవర్గాలు భావిస్తున్నాయి. ఈ రైలు రూట్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చదవండి: (దేశంలో క్రీడలకు ప్రోత్సాహం తగినంతగా లేదు.. ఎంపీ మార్గాని భరత్ ఆవేదన) -
రైల్వేలో మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాలను నివారించే దిశగా త్వరలోనే ఆధునిక అన్మేన్డ్ ఆటోమేషన్ సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే శాఖ ప్రవేశపెట్టబోతోంది. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ‘ఇండీజినస్ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ (ఐ–సీబీటీసీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. సంప్రదాయ వ్యవస్థకు మంగళం భారతీయ రైల్వే దశాబ్దాలుగా సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థనే కొనసాగిస్తోంది. ట్రాక్ సర్క్యూట్లు, యాక్సెల్ కౌంటర్ల ద్వారా రైళ్ల గమనాన్ని తెలుసుకుంటూ రంగుల లైట్ల ద్వారా రైళ్ల లోకో పైలట్లకు సిగ్నల్స్ తెలిపే విధానాన్ని అనుసరిస్తోంది. రైళ్ల గమనాన్ని తెలుసుకోడానికి, నియంత్రించడానికి ఈ విధానం సరైనదే. కానీ.. మన దేశంలోని 68,103 కి.మీ. పొడవైన రైల్వే ట్రాక్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి ప్రస్తుత వ్యవస్థ సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత సిగ్నలింగ్ స్థానంలో ఐ–సీబీటీసీ పేరుతో పూర్తిగా మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించనుంది. చదవండి: (ఉద్యోగులకు సీఎం జగన్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు: సజ్జల) -
కాజీపేట రైల్వే యూనిట్కు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాజీపేటలో వాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రెండు దఫాలు టెండర్లు విఫలమైన తర్వాత మూడో ప్రయత్నంగా బుధవారం టెండర్లను తెరవబోతున్నారు. నిర్మాణసంస్థను గుర్తిస్తే.. సరిగ్గా రెండున్నరేళ్లలో యూనిట్ పని ప్రారంభించనుంది. రూ.383 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ నిర్మిస్తున్న ఈ యూనిట్లో నెలకు 250 వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేలా ఓవర్హాలింగ్ చేయనున్నారు. 2016లో రైల్వే శాఖ రూ.269 కోట్ల అంచనాతో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు, ఎప్పుడో పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. దానికి కావాల్సిన 150 ఎకరాల భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవటం, ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం దాన్ని రైల్వేకు అప్పగించటంలో జాప్యం చేయటంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. గతేడాదే ఆ భూమి రైల్వేకు అందటంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి యూనిట్ ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి. -
ఇంకా 23 శాతం రైళ్లు ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ రైల్వేను ఆధునికీకరిస్తున్న రైల్వే శాఖ.. కొన్ని రైళ్లు సకాలంలో గమ్యం చేరే విషయంలో మాత్రం మరింత దృస్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్ప టికీ ఇంకా 23 శాతంమేర రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. అయితే, గతంలో ఈ శాతం ఎక్కు వగా ఉండగా, ఇప్పుడు వీలైనంతమేర తగ్గించటంలో రైల్వే శాఖ విజయం సాధించిందనే చెప్పాలి. దాదాపు 76 శాతం రైళ్లు సకాలంలో గమ్యం చేరుతుండటమే దీనికి తార్కాణం. తాజాగా ఎన్ని రైళ్లు సకాలంలో చేరుతున్నాయి, ఎన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి అన్న విషయంలో దేశవ్యాప్త వివరాలను రైల్వే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ కోరిన సమాచారాన్ని రైల్వే తాజాగా అందజేసింది. ఆ వివరాల ప్రకారం.. 2016 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా రాజధాని, దురొంతో, శతాబ్ది, జనశ తాబ్ది ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు.. ఇలా కేటగిరీలు కలిపి 7689535 సర్వీసులు ఉండగా, 58,59,631 రైళ్లు సకాలంలో గమ్యం చేరాయి. 18,29,904 రైళ్లు మాత్రం ఆలస్యంగా గమ్యం చేరాయి. ప్యాసింజర్ రైళ్లే ఆలస్యం పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లలో 25.76 శాతం జాప్యం నమోదు కాగా, ధనికులు ఎక్కువగా ప్రయాణించే శతాబ్ది రైళ్లలో అతి తక్కువగా 12.45 శాతం మాత్రమే జాప్యం నమోదైంది. విచిత్రమేంటంటే రైల్వే శాఖ ఎంతో ప్రాధాన్యమిచ్చే రాజధాని సర్వీసుల్లో కూడా 25.65 శాతం జాప్యం నమోదైంది. దురొంతోలో 28.10 శాతం , జన శతాబ్దిలో 14.74 శాతం, సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో 19.05 శాతం మేర ఆలస్యంగా నడిచాయి. -
Dussehra 2022: కాసులు కురిపించిన దసరా
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణా సంస్థలకు దసరా పండగ కాసులు కురిపించింది. రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దసరా సందర్భంగా నగరం నుంచి సుమారు 30 లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లినట్లు అంచనా. వీరిలో 25 శాతం మంది సొంత వాహనాల్లో వెళ్లగా.. మిగతా 75 శాతం ఆర్టీసీ బస్సులు, రైళ్లలో బయలుదేరారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా వెళ్లారు. ప్రయాణికుల రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే సుమారు 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో సాధారణ బోగీల సంఖ్యను పెంచింది. మరికొన్ని రైళ్లకు స్లీపర్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4600 అదనపు బస్సులకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు సాధారణ చార్జీలపైనే అదనపు బస్సులను నడపడంతో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఆర్టీసీకి ఆదరణ.. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఎక్కువ శాతం నగరవాసులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులే అందుబాటులో ఉండడంతో ఆర్టీసీ సైతం విస్తృత ఏర్పాట్లు చేసింది. గతేడాది దసరాకు రూ.10 కోట్లు సమకూరగా.. ఈసారి సుమారు రూ.15 కోట్లకుపైగా లభించినట్లు ఓ అధికారి తెలిపారు. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు నడిచే 3500 బస్సులతో పాటు రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. నగరవాసులు పూర్తిస్థాయిలో బస్సులను వినియోగించుకుంటే ఆర్టీసీకి మరింత ఆదాయం లభించేదని, ఎక్కువ శాతం సొంత వాహనాలు, టాటాఏస్లు, అద్దె కార్లకు ప్రాధాన్యమిచ్చారని అధికారులు భావిస్తున్నారు. బైక్లపై కూడా పెద్ద ఎత్తున వెళ్లినట్లు సమచారం. పండగ చేసుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు.. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. పండగ రద్దీని సొమ్ము చేసుకున్నారు. టూరిస్టు బస్సులుగా నమోదైనవి కూడా స్టేజీ క్యారేజీలుగా రాకపోకలు సాగించాయి. మినీ బస్సులు, ట్రావెల్స్ కార్లు సైతం రెండు రాష్ట్రాల మధ్య పరుగులు తీశాయి. దక్షిణమధ్య రైల్వేకు.. దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.45 కోట్ల వరకు లభించినట్లు అంచనా. దసరా సందర్భంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అన్ని రూట్లలోను ప్రయాణికుల రద్దీ పెరిగింది. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్లిస్టు 250 దాటిపోయింది. దీంతో రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు రైళ్లతో పాటు అదనపు బోగీలను ఏర్పాటు చేయడం వల్ల కొంత మేరకు ఊరట లభించింది. కోవిడ్కు ముందు.. అంటే రెండేళ్ల క్రితం నాటి ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చాలా తక్కువే లభించినట్లు అధికారులు చెప్పారు. -
Train General Tickets: లైన్లో ఎందుకు.. ఆన్లైన్ ఉండగా!
సాక్షి, హైదరాబాద్: టికెట్ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేదు. లైన్లో నించోవలసిన అవసరం లేదు. ప్రయాణానికి కనీసం 15 నిమిషాల ముందు టిక్కెట్ కొనుక్కోవచ్చు. ఆ మాటకొస్తే రైలెక్కే ముందే టిక్కెట్ తీసుకోవచ్చు. పైగా టిక్కెట్ కోసం ఎక్కడికీ పరుగెత్తవలసిన అవసరం లేదు. అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్లలో యూటీఎస్ మొబైల్ యాప్ అప్రతిహతంగా దూసుకుళ్తుంది. అన్ని ప్రధాన రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ లలో సాధారణ టిక్కెట్ ల కోసం ప్రయాణికులు యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్ను ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ అనంతరం యూటీఎస్కు అనూహ్యమైన ఆదరణ పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 7.5 లక్షల మంది ప్రయాణికులు యూటీఎస్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోగా దసరా సందర్భంగా ఈ ఐదు రోజుల్లోనే సుమారు 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్లో టిక్కెట్లు తీసుకొని సొంత ఊళ్లకు బయలుదేరారు. నో ‘క్యూ’... జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 85 ఎక్స్ప్రెస్ రైళ్లు, మరో 100 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 2 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.వీరిలో కనీసం 1.5 లక్షల మంది సాధారణ ప్రయాణికులే.ఎక్స్ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీలు,ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం చేసేవారే. రైల్వేస్టేషన్లలో జనరల్ టిక్కెట్లు విక్రయించే బుకింగ్ కేంద్రాల వద్ద రద్దీ తీవ్రంగా ఉంటుంది.దసరా వంటి పర్వదినాల్లో టిక్కెట్ల కోసం తొక్కిసలాటలు, పోలీసుల లాఠీ చార్జీ వంటి ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రద్దీ నియంత్రణకు దక్షిణమధ్య రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. కోవిడ్కు ముందుకు కొంత మేర ఆదరణ కనిపించినా కోవిడ్ కాలంలో జనరల్ టిక్కెట్లకు కూడా గుర్తింపు తప్పనిసరి చేయడంతో యూటీఎస్ వినియోగం తగ్గుముఖం పట్టింది. ఇటీవల యూటీఎస్కు విస్తృత ప్రచారం కల్పించడంతో లక్షలాది మంది ఈ యాప్ను వినియోగించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో 6 వేల చొప్పున యూటీఎస్ బుకింగ్లవుతుండగా, పండుగలు, సెలవు రోజుల్లో 10 వేల నుంచి 15 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ నుంచి టిక్కెట్లు తీసుకుంటున్నారు. ఈజీగా బుకింగ్... ►మొబైల్ ఫోన్లో యూటీఎస్ యాప్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా జనరల్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ఇంటి నుంచి రైల్వేస్టేషన్కు బయలుదేరే క్రమంలోనే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ►రైల్వేస్టేషన్లో రైలు బయలుదేరడానికి ముందుకు కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. ►యూటీఎస్ టిక్కెట్ల పైన దక్షిణమధ్య రైల్వే రాయితీ సదుపాయం కూడా అందజేస్తోంది. -
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డీఎల్ఎస్) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్పై నెటిజన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్ పార్కింగ్, పికప్, డ్రాప్ జోన్స్, 91 బస్బేలు, 1,500 ఈసీఎస్ పార్కింగ్లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ను 5వేల మంది రీట్వీట్ చేశారు. ► ఓ రైల్వే స్టేషన్కు అంత సంక్లిష్టమైన డిజైన్ అవసరమా? ► నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్ను మరింత పెంచుతుంది. ► డిజైన్ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్గంజ్ నివాసితులను ఏం చేస్తారు? ► హైప్డ్ డిజైన్తో అనవసరమైన ఖర్చు. సింపుల్గా ఎఫెక్టివ్గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు. చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్లెట్ చార్జీ రూ.112 -
చర్మం ఒలిచినా దక్కని ఫలితం
వడోదర: రైల్వే ఉద్యోగం సాధించేందుకు ఓ యువకుడు చేసిన తెగింపు యత్నం బెడిసికొట్టింది. తన బొటన వేలి చర్మాన్ని ఒలిచి స్నేహితుడి వేలికి అతికించి, బయోమెట్రిక్ వెరిఫికేషన్లో బయటపడ్డాక తనకు బదులుగా పరీక్ష రాయించాలని పథకం వేశాడు. అయితే, బండారం బయటపడి ఇద్దరూ కటకటాల పాలయ్యారు. బిహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తా స్నేహితులు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. రైల్వే శాఖలోని గ్రూప్ డి ఉద్యోగాలకు మనీష్ దరఖాస్తు చేసుకున్నాడు. ఎంపిక పరీక్ష వడోదరలో ఆదివారం జరిగింది. మనీష్ బదులు చదువులో ఎప్పుడూ ముందుండే గుప్తా పరీక్షకు వచ్చాడు. అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ గండం గట్టెక్కేందుకు మనీష్ తన బొటనవేలి చర్మాన్ని ఒలిచి గుప్తా చేతి వేలికి అతికించాడు. గుప్తా ఆ చేతిని ప్యాంట్ జేబులోనే ఉంచుకుని, మరో చేతి వేలితో చేసిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ యత్నం పలుమార్లు విఫలమైంది. అనుమానించిన అధికారులు అతడి మరో చేతిని బయటకు తీయించి, శానిటైజర్ స్ప్రే చేశారు. బొటనవేలికి అతికించిన చర్మ ఊడి కింద పడింది. అధికారుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు మిత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ వెరిఫికేషన్ను ఊహించిన కుమార్..పరీక్షకు ముందు రోజే ఎడమ బొటనవేలిని స్టౌపైన కాల్చుకుని, బ్లేడుతో ఆ చర్మాన్ని ఒలిచి గుప్తా బొటనవేలికి అంటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒకవేళ, అతికించిన చర్మం ఊడి రాకున్నా వారి పన్నాగం పారేది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. -
‘వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్’: రైల్వేస్టేషన్లలో ‘స్థానిక’ స్టాల్స్
సాక్షి, అమరావతి: తిరుపతికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్తూ శ్రీవారి లడ్డూలతో పాటు రైల్వే స్టేషన్లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలూ కొని ఇంటికి పట్టుకెళ్లచ్చు.. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అక్కడే ముచ్చటైన కొండపల్లి బొమ్మలూ కొనచ్చు.. ఇలా.. రైల్వే స్టేషన్లు ప్రయాణానికే కాదు.. స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్కూ వేదికగా నిలవనున్నాయి. ‘వన్ స్టేషన్ – వన్ ప్రొడక్ట్’ విధానంతో స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ప్రోత్సాహం అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అహ్మదాబాద్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్’ సంస్థ స్టాల్స్ను రూపొందించింది. తక్కువ స్థలంలో ఉత్పత్తులను ప్రదర్శించేలా స్టాల్స్ను డిజైన్ చేసింది. ఉత్పత్తుల విక్రయాలకు స్థానిక డ్వాక్రా సంఘాలు, ఇతర హస్తకళా ఉత్పత్తుల తయారీదారులతో రైల్వే శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్ ‘వన్ స్టేషన్ – వన్ ప్రొడక్డ్’ విధానం కింద రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ పరిధిలో 91 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, స్థానిక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే పైలట్ ప్రాజెక్ట్గా రోజూ సగటున 30 వేల మంది వచ్చే తిరుపతి రైల్వే స్టేషన్లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలను విక్రయిస్తోంది. ఈ స్టాల్కు విశేష స్పందన వస్తోంది. దాంతో మిగిలిన 90 స్టేషన్లలో కూడా దశలవారీగా స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో సెప్టెంబరు 20 నాటికి 20 స్టేషన్లలో స్టాల్స్ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 10 స్టేషన్లలో ఇప్పటికే స్టాల్స్ ఏర్పాటు పూర్తయింది. స్థానిక వెండార్లకు రైళ్లలో విక్రయాలకు అనుమతి ప్రయాణిస్తున్న రైళ్లలో ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించే చిరు వ్యాపారుల కోసం రైల్వే శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఐఆర్సీటీసీ అనుమతి ఉన్న వ్యాపారులను మాత్రమే రైళ్లలో అనుమతిస్తున్నారు. పలువురు చిరు వ్యాపారులు అనధికారికంగా రైళ్లలో ప్రవేశించి వారి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వారిని నిరోధించడం సమస్యగా మారింది. భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగా వారికి కూడా లైసెన్సు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.1,500 ఫీజుతో 15 రోజులకు లైసెన్స్ జారీ చేస్తుంది. ఈ వెండార్లు వారికి నిర్దేశించిన స్టేషన్ల మధ్య రైళ్లలో ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. వీరి కోసం ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్’ సంస్థ ప్రత్యేకంగా బాడీవేర్ కిట్లను డిజైన్ చేసింది. తక్కువ స్థలంలోనే ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను రెండు ర్యాకుల్లో భుజానికి తగిలించుకునే తేలికైన కిట్ను రూపొందించింది. లైసెన్సు పొందిన వెండార్లకు వాటిని అందిస్తారు. -
Super Vasuki: ఈ గూడ్స్కు 295 వ్యాగన్లు!
న్యూఢిల్లీ: సాధారణ గూడ్స్ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన ‘సూపర్ వాసుకి’ని ఆగ్నేయ మధ్య(సౌత్ ఈస్ట్ సెంట్రల్) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది. మూడున్నర కిలోమీటర్ల పొడవు, 295 వ్యాగన్లతో 27 వేల టన్నులకు పైగా బొగ్గును తీసుకుని ఈ భారీ రైలు ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి నాగ్పూర్ సమీపంలోని రాజ్నంద్గావ్కు చేరుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సోమవారం సూపర్ వాసుకిని నడిపి చూసినట్లు అధికారులు చెప్పారు. కోర్బా నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరిన ఈ గూడ్స్ 267 కిలోమీటర్ల దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది. ఒక్కో స్టేషన్ను దాటేందుకు వాసుకికి సుమారు 4 నిమిషాలు పట్టింది. ఇప్పటి వరకు నడిపిన అత్యంత పొడవైన, అతి భారీ గూడ్స్ రైలు ఇదేనని రైల్వే శాఖ వెల్లడించింది. సూపర్ వాసుకి తీసుకువచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఒక రోజంతా నడుస్తుందని అధికారులు చెప్పారు. సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లలో 9 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయగలుగుతుంది. -
రైళ్లలో రాయితీలు కొందరికే
సాక్షి, అమరావతి: రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు రాయితీని పునరుద్ధరించకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ హైకోర్టుకు నివేదించింది. రాయితీలు కల్పించిన మొత్తం 53 కేటగిరీల్లో దివ్యాంగులు, 11 కేటగిరీల రోగులు, విద్యార్థులకు మినహా మిగిలిన వారెవరికీ ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని పేర్కొంది. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వృద్ధుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని, తమ చర్యల ద్వారా ఎవరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదని నివేదించింది. కరోనా విషయంలో తదుపరి వైద్యపరమైన సూచనలు, సలహాలు అందేవరకు రాయితీ పునరుద్ధరణ సాధ్యం కాదని వెల్లడించింది. రాయితీని పొడిగించకపోవడం ఎంతమాత్రం అన్యాయం, ఏకపక్షం, వివక్షపూరితం, రాజ్యాంగ విరుద్ధం కాదంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయాన్ని సవరించాలని పిటిషనర్ డిమాండ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వృద్ధులకు రాయితీని పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిల్ను కొట్టి వేయాలని రైల్వే శాఖ అభ్యర్థించింది. రాయితీ పునరుద్ధరణ కోసం పిల్.. వృద్ధులకు రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో కోవిడ్ సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం ఆదేశాల మేరకు రైల్వేశాఖ తరఫున దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బీడీ క్రిష్టోఫర్ కౌంటర్ దాఖలు చేశారు. రైలు ప్రయాణికులకు రాయితీలు కల్పించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ విధానపరమైన నిర్ణయమని కౌంటర్లో పేర్కొన్నారు. రాయితీల పునరుద్ధరణ విషయంలో రైల్వే బోర్డు చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. రిప్లై దాఖలుకు గడువిచ్చిన ధర్మాసనం.. జీఎన్ కుమార్ దాఖలు చేసిన పిల్ బుధవారం మరోసారి విచారణకు రాగా.. రాయితీలు పునరుద్ధరించకపోవడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీఎస్ఎస్ శ్రీకాంత్ నివేదించారు. రైల్వేశాఖ కౌంటర్కు సమాధానమిచ్చేందుకు వీలుగా తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే
న్యూఢిల్లీ: తల్లిదండ్రులను కోల్పోయిన ఛత్తీస్గఢ్ చిన్నారికి రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద పోస్టింగ్ ఇచ్చింది. 18 ఏళ్లు వచ్చాక ఆమె ఉద్యోగ బాధ్యతల్లో చేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలో ఇంత చిన్న వయస్సులో జరిపిన కారుణ్య నియామకం ఇదేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్, భిలాయ్లోని రైల్వే యార్డులో అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. జూన్ ఒకటో తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన, భార్య కూడా చనిపోయారు. వారి 10 నెలల చిన్నారి క్షేమంగా బయటపడింది. కుమార్ కుటుంబానికి అన్ని రకాల సాయాన్ని నిబంధనల ప్రకారం రాయ్పూర్ రైల్వే డివిజన్ అందిస్తుంది’అని రైల్వే శాఖ తెలిపింది. ‘రికార్డుల్లో నమోదు కోసం జూన్ 4వ తేదీన చిన్నారిని ఆమె కుటుంబీకులు తీసుకువచ్చారు. వేలి ముద్రలు తీసుకునే సమయంలో ఆ చిన్నారి ఏడ్వడం చూసి మా హృదయం ద్రవించింది. ఆ పసిగుడ్డు వేలి ముద్రలు తీసుకోవడం కష్టతరమైంది’అని రైల్వే అధికారులు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబీకులకు తక్షణమే సాయం అందించేందుకు కారుణ్య నియామకాలు చేపడతారు. -
విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్ కెమెరా లతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్ఎస్ (సీసీటీవీ కెమెరాల నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే వీడియో విశ్లేషణ సాఫ్ట్వేర్తోపాటు స్టేషన్ల ఆవరణ లోకి పాత నేరస్తులు ప్రవే శించిన వెంటనే గుర్తించి అధికారులను అప్రమత్తం చేయ గల ముఖాల గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) సాఫ్ట్ వేర్ను వినియోగించనుంది. అలాగే రైల్వే సిబ్బంది ఏ ప్రాంతంలో ఉన్న వెబ్ బ్రౌజర్ నుంచైనా స్టేషన్లలోని సీసీ కెమె రాలు, సర్వర్, యూపీఎస్, స్విచ్లను వీక్షిస్తూ పర్యవేక్షించేలా నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వాడనుంది. తొలి దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 76 స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 756 స్టేషన్లను వీడియో నిఘా వ్యవస్థ కోసం ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 39 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైల్టెల్ ఆధ్వర్య ంలో ఈ వ్యవస్థ ఏర్పాటు పనులు జరగను న్నాయి. మలి దశల్లో ఇతర స్టేషన్ లలో హైటెక్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ‘నిర్భయ నిధుల’తో చేపడు తున్న ఈ ప్రాజెక్టును 2023 జనవరి లోగా పూర్తి చేసే అవకాశం ఉందని రైల్టెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? రైల్వేస్టేషన్లలోకి వచ్చే/వెళ్లే మార్గాలు, ప్లాట్ ఫామ్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణి కుల వంతెనలు, బుకింగ్ కార్యాలయాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఇతర కీలక స్థలాల్లో ఇవి ఏర్పటవుతాయి. రైల్వే ఆవరణలను వీలైనంత మేర నిఘా పరిధిలోకి తెచ్చేలా డోమ్, బుల్లెట్, పాన్ టిల్ట్, అల్ట్రా హెచ్డీ–4కే రకాల ఐపీ కెమెరాలను వినియోగిస్తారు. ఉపయోగం ఏమిటి? ఈ సీసీటీవీ కెమెరా వ్యవస్థ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారా అనుసంధానమై ఉంటుంది. వాటి నుంచి అధీకృత సిబ్బంది ఫోన్ నంబర్లకు కూడా లింక్ ఉంటుంది. అలారంతో ఈ వ్యవస్థను జోడిస్తారు. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఆయా చిత్రాలలోని వ్యక్తులు ఇప్పటికే పోలీసుల బ్లాక్లిస్టులో ఉన్న వారి చిత్రాలతో సరిపోలితే సంబంధిత అధికారుల ఫోన్లకు (లింక్ అయినవాటికి), అధీకృత కేంద్రాలకు హెచ్చ రికలు వెళ్తాయి. అలాగే ప్రతి ప్లాట్ఫామ్ వద్ద రెండు ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న వారు/అవసరమైన వారు ఈ బటన్ నొక్కగానే వారి మొహాన్ని సీసీ కెమెరాలు క్లోజ్అప్లో బంధిస్తాయి. అక్కడి పరిసరాలను కూడా వీడియో తీస్తాయి. సంబంధిత అధి కారుల ఫోన్లకు, కేంద్రాలకు హెచ్చ రికలు, పంపుతాయి. అలా రం మోగటం ద్వారా స్టేషన్లలోని సిబ్బంది సులభంగా అప్రమత్త మయ్యేందుకు వీలు కలుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే వాటిని ఎదుర్కోవడంలో రైల్వే పోలీసులు, ఇతర సిబ్బంది మరింత సన్నద్ధంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. సంబంధిత ఆర్పీఎఫ్, కంట్రోల్ రూమ్లలో వీడియో ఫుటేజీని 30 రోజుల వరకు భద్రపరచవచ్చు. ఒక స్టేషన్లో రికార్డయిన దృశ్యాలను ఆ స్టేషన్లోనే కాకుండా డివిజినల్, జోనల్ స్థాయిలోని సీసీటీవీ కంట్రోల్ రూమ్లలో కూడా విశ్లేషించొచ్చు. రాష్ట్రంలో హైటెక్ కెమెరాల నిఘా ఉండే స్టేషన్లు ఇవే.. ఓయూఆర్ట్స్ కాలేజీ, డబీర్పురా, ఫలక్నుమా, ఉప్పుగూడ, జామియా ఉస్మానియా, మలక్పేట, సీతాఫల్మండి, విద్యానగర్, యాఖుత్పురా, భరత్నగర్, బోరబండ, చందానగర్, ఫతేనగర్, హఫీజ్పేట, హైటెక్ సిటీ, జేమ్స్స్ట్రీట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నేచర్క్యూర్ హాస్పిటల్, నెక్లెస్రోడ్, సంజీవయ్య పార్క్, లింగంపల్లి, కాచిగూడ, బేగంపేట, వరంగల్, భద్రాచలం రోడ్, కాజీపేట, ఖమ్మం, మహబూబాద్, మంచిర్యాల, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, తాండూరు, వికారాబాద్, బాసర, కామారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. -
అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. గుంటూరులో 200 మంది ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, విశాఖలో ఆందోళనకారులు నిరసనలకు ప్లాన్ చేశారనే విషయాన్ని నిఘా వర్గాలు ముందే గ్రహించాయి. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఆర్మీ ఇనిస్టిట్యూట్ సెంటర్ల నుంచి పోలీసులు అభ్యర్థుల వివరాలను తీసుకుంటున్నారు. చదవండి: (ఏపీ పోలీసుల అదుపులో సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్) -
తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: కెమెరాలో బంధించే కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పుడు చూసుకున్న జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేస్తాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో మాత్రం మరింత ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇది తండ్రీకొడుకులు తమ విధి నిర్వహణలో భాగంగా ఒకరికొకరు ఎదురైనపుడు తీసుకున్న ఫొటో. వివరాల్లోకెళ్తే.. సురేష్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేసిన ఈ చిత్రంలో ఉన్న తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా.. కుమారుడు అదే రైల్వే శాఖలో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్గా ఉద్యోగం సాధించాడు. తండ్రీకొడుకులు డ్యూటీలో ఉన్న సమయంలో ఒక రోజు అకస్మాత్తుగా ఎదురెదురు రైళ్లలో తారసపడ్డారు. ఆ క్షణంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోనే ఇది. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరు కూడా తమ యూనిఫామ్ ధరించి ఉన్నారు. अजब ग़ज़ब सेल्फ़ी पिता रेलवे में गार्ड है और बेटा टीटी है । जब दोनो की ट्रेन अगल-बग़ल से गुजरी तो एक सेल्फ़ी का लम्हा बन गया ❤️ pic.twitter.com/Zd2lGHn7z3 — Suresh Kumar (@Suresh__dhaka29) June 15, 2022 అయితే ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘తండ్రీకొడుకులు ఉద్యోగాలు చేయడం సాధారణమే. కానీ ఒకే శాఖలో రెండు విభిన్న హోదాల్లో పనిచేయడం, వారు ఇలా తారస పడటం ఎంతో అద్భుతం’ అంటూ కాంమెంట్ చేస్తున్నారు. నెట్టింట్లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 50వేల మందికి పైగా లైక్ చేశారు. Great moments. — Abinash Kumar Chatterjee (@AbinashKumarCh1) June 16, 2022 చదవండి: (ఆ ఏటీఎం మిషీన్ వద్దకే క్యూ కడుతున్న జనాలు! ఎందుకో తెలుసా!) -
గజ్వేల్ రైల్వేస్టేషన్ సరుకు రవాణా మినీహబ్గా..
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ రైల్వేస్టేషన్ను సరుకు రవాణాకు మినీ హబ్గా మార్చేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సిద్దిపేట మొదలు గజ్వేల్ వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే వివిధ పంటలతోపాటు పండ్లు, పాలు, చేపలను ఇతర ప్రాంతాలకు రైల్వే ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా వాటిని తరలించాలంటే తొలుత సనత్నగర్ రైల్వే యార్డుకు చేర్చాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ మంది వ్యాపారులు లారీల ద్వారానే ఇతర ప్రాంతాలకు సరుకు పంపుతున్నారు. తాజాగా రైల్వే ద్వారా సరుకు రవాణాకు గజ్వేల్ను ఎంపిక చేయడంతో దక్షిణమధ్య రైల్వే, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మధ్య ఇందుకు సంబంధించి అవగాహన కుదిరింది. ఇటీవల భేటీ అయిన రెండు విభాగాల అధికారులు.. ఇందుకుగల డిమాండ్పై చర్చించారు. నిత్యం 500కుపైగా లారీలు: పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతాలైన సిద్దిపేట, గజ్వేల్లలో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, కూరగాయలు, పప్పుధాన్యాలు బాగా పండుతాయి. పాడి కూడా విస్తారంగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి ప్రస్తుతం నిత్యం 500కుపైగా లారీల్లో సరుకును కొందరు వ్యాపారులు సనత్నగర్కు తరలించి అక్కడి యార్డు ద్వారా గూడ్స్ రైళ్లలోకి తరలిస్తున్న ప్పటికీ ఖర్చు ఎక్కువగా అవుతోంది. మరోవైపు రైల్వేశాఖ ఇటీవల కొన్ని నిబంధనలను సడలించి విడివిడిగా లారీల్లో సరుకు తెచ్చినా కూడా వ్యాగన్లను కేటాయిస్తోంది. తాజాగా గజ్వేల్ స్టేషన్ వద్ద సరుకు రవాణాకు వీలుగా రైల్వేశాఖ పెద్ద యార్డును సిద్ధం చేసింది. ఇటీవలే హైదరాబాద్ డీఆర్ఎం శరత్చంద్రాయణ్ ఇతర అధికారులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి యార్డు వరకు లారీలు వచ్చేలా రోడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాయి. వ్యాపారులతో మాట్లాడి సరుకు ఇండెంట్ ఇవ్వాలని ఎఫ్సీఐని రైల్వే అధికారులు కోరారు. ఇండెంట్ రాగానే గూడ్సు రైళ్లు ప్రారంభం కానున్నాయి. -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు రవాణాకు సహకరిస్తాం
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు లోడింగ్, ప్రధానమైన సరుకులను నిరాటంకంగా రవాణా చేయడానికి రైల్వే శాఖ సహాయ సహకారాలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ (జీఎం) అరుణ్కుమార్ జైన్ వెల్లడించారు. మెస్సర్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్వాహకులతో సరుకు లోడింగ్ అభివృద్ధి అవకాశాలపై రైల్వే జీఎం శనివారం చర్చించారు. పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర ముఖ్యాంశాలను రైల్వే జీఎంకు పోర్టు అధికారులు వివరించారు. పోర్టు వద్ద కోస్టల్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రైల్వే జీఎం అక్కడ మొక్కలను నాటారు. అనంతరం కృష్ణపట్నం స్టేషన్ – విజయవాడ సెక్షన్ మధ్య ప్రత్యేక రైలులో ప్రయాణించి పలు రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. గూడూరు–విజయవాడ సెక్షన్ మధ్య నిర్మాణంలో ఉన్న 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం లేదు రైల్వే అధికారులు టెక్నాలజీని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం లేదని, దానికితోడు క్రమశిక్షణతో కూడిన విధులు లేవని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ అసహనం వ్యక్తం చేశారు. జీఎం తన పర్యటనలో భాగంగా ఒంగోలు రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్ఫారంపై ఉన్న ఆహారం, పండ్ల రసం స్టాల్స్ను తనిఖీ చేసి అక్కడి విక్రయదారులతో మాట్లాడారు. విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇస్తున్నారా లేదా అని జీఎం అడిగిన ప్రశ్నకు ఓ కూల్డ్రింక్ షాపు యజమాని సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టడంతో.. బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేయిస్తుంటే ఏమి చేస్తున్నారని కమర్షియల్ రైల్వే విభాగం అధికారులను జీఎం నిలదీశారు. రైల్వే ఆస్పత్రిలో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడం, రైల్వేస్టేషన్లోని ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లోనూ సాంకేతిక సమస్యలు ఉండటం గుర్తించిన జీఎం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సక్రమంగా సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవుతున్నారని, వెంటనే లోపాలను సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే జీఎం పర్యటనలో విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్రమోహన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.