Shruti Haasan
-
అప్పుడే మహిళ ఎదిగినట్లు లెక్క!: శ్రుతీహాసన్
‘‘సమస్య ఎక్కడైనా ఉంటుంది. ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. సమస్యలకు భయపడి పారిపోతే ఓడిపోతాం... ధైర్యంగా ఎదుర్కొంటే గెలుస్తాం’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన తల్లి సారిక సినిమాలు చేసినప్పటి పరిస్థితులను, ఇప్పుటి పరిస్థితులను పోల్చి కొన్ని విషయాలు చెప్పారు శ్రుతి. ఇంకా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.∙మీ అమ్మగారి కెరీర్ని చూశారు... అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ‘ఈక్వాలిటీ’ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో ‘పీరియడ్స్’ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.∙మరి... మీ జనరేషన్ హీరోయిన్లతో పోల్చితే అప్పటివారు ఏ విషయంలో హ్యాపీ? మాటల విషయంలో... అప్పట్లో కాస్త ఓపెన్గా మాట్లాడగలిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మాటలకు కత్తెర పెట్టాల్సిన పరిస్థితి. అయితే నేనలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వల్ల ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్ని కళ్లూ మనల్నే చూస్తున్న ఫీలింగ్. అంతెందుకు? పదిహేనేళ్ల క్రితం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేదు. రిలాక్సింగ్గా ఉండేది.ఇప్పుడు ఫొటోలు తీసేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ ప్రెజర్ చాలా ఉంది. ఈ ఒత్తిడి వల్ల పబ్లిక్లోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. మా అమ్మ జనరేషన్లో ఉన్నంత కూల్గా ఉండలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా తిప్పలు తప్పడంలేదు. ‘అలా ఉన్నావు... ఇలా ఉన్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పుడే ప్రెజర్ మొదలై పోతోంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితిని నేను విమర్శించడంలేదు. మార్పుని స్వీకరించడమే. ∙ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు... మీకు అలాంటివి? నాకలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను... నాకు కంఫర్ట్గా ఉన్న చోట ఉంటాను. నాకు నచ్చని చోట ఉండను... నచ్చని మనుషులను నా లైఫ్లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే... మనకు ఏదైనా నచ్చలేదనుకోండి గొడవపడక్కర్లేదు... అరిచి చెప్పక్కర్లేదు. ‘నాకు నచ్చలేదు’ అని కూల్గా చెప్పి, సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేయాలి. ∙మీలా చాలామంది ధైర్యంగా ఉండలేరు... నిర్భయంగా మాట్లాడలేరు... వారికి మీరిచ్చే సలహా? భయాలు వదలండి. దయచేసి మీ మనసులోని సమస్యలను బయటకు చెప్పండి. మనసులోనే ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే వారికన్నా కూడా ఒక మంచి కౌన్సెలర్ అవసరం. వాళ్లయితే మన మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. ఫిజికల్గా హెల్దీగా ఉండాలంటే ‘మెంటల్ హెల్త్’ చాలా ముఖ్యం. ∙కమల్హాసన్గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా? బ్యాక్గ్రౌండ్ అనేది ప్లస్సే... కాదనడంలేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శ్రుతీహాసన్ అంటే కమల్హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను.∙‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటారా? నా ఫ్రెండ్స్తో ‘అన్ని రోజులూ మనవే’ అంటుంటాను. ‘మేల్ డే’ అని లేదు. మరి... ‘ఉమెన్స్ డే’ ఎందుకు? అంటే... ఇంకా స్త్రీ వెనకబడి ఉన్నట్లేనా? అలాగే ‘ఉమెన్ ఓరియంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజున ఉమెన్ ఎదిగినట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో మహిళలు తక్కువగా ఉండటానికి కారణం? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళల శాతం ఎక్కువే ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు. అంతెందుకు? నేను ఈ మధ్య లీడ్ రోల్ చేసిన ‘ది ఐ’ మూవీకి డైరెక్టర్,ప్రొడ్యూసర్, ఇంకా ఇతర విభాగాల్లో మహిళలే ఎక్కువ. ఆ విధంగా ఈ సినిమా నాకు స్పెషల్. -
ధైర్యమే ఆయుధం
భర్త కోసం ఒకరు... మార్పు కోసం మరొకరు... ఊరి కోసం ఇంకొకరు... ఇలా సమాజంతో, వ్యతిరేక పరిస్థితులతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని పోరాటానికి నడుం బిగించారు కొందరు తారలు. తమ హక్కులు, లక్ష్యాల కోసం సిల్వర్ స్క్రీన్పై తగ్గేదే లే అంటూ విజృంభించారు.. పోరాటానికి ‘సై’ అని కొందరు నటీమణులు చేసిన ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.క్రిమినల్... లెజెండ్ ‘అరుంధతి, రుద్రమదేవి’ వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్లో అనుష్క యాక్షన్ టాలెంట్ని ఆడియన్స్ చూశారు. కొంత గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ తరహా చిత్రం ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఓ వ్యాపారంలో ఎదుగుతున్న మహిళను కొందరు వ్యక్తులు ఓ కుట్రలో ఇరికించి, క్రిమినల్గా చిత్రీకరిస్తారు. ఆ సమస్యల నుంచి ఆమె బయటపడి, తనను ఇబ్బంది పెట్టినవారికి ఎలా బుద్ధి చెప్పింది? ఆ వ్యాపార సామ్రాజ్యానికి ఓ లెజెండ్గా ఆమె ఎలా ఎదిగింది? అన్నదే ‘ఘాటి’ సినిమా కథ అని టాక్.మా ఇంటి బంగారం కుటుంబాన్ని చక్కబెట్టే ఓ గృహిణి గన్ పట్టిందంటే అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులే కారణమై ఉంటాయి. మరి... ఆమె ఎందుకు గన్ పట్టుకుందో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలో గృహిణిగా నటిస్తున్నారు సమంత. తన నిర్మాణ సంస్థ ట్రా లా లా పిక్చర్స్పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. గత ఏడాది తన బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ను ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీపై అప్డేట్ రాలేదు. అలాగే ‘ట్రా లా లా’లోనే ఓ హారర్–కామెడీ ఫిల్మ్ రూపొందుతోందని తెలిసింది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ చేశారని సమాచారం. భర్త కోసం... ఆల్మోస్ట్ అందరూ మహిళలే ఉన్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘ది ఐ’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లీడ్ రోల్లో నటించారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో రూపొందిన అంతర్జాతీయ చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. వేరే దేశంలో ఉన్న తన భర్త మరణ వార్త విని షాక్ అయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఓ దశలో భర్త బతికే ఉన్నాడనే అనుమానం కూడా ఆమెకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఐ’ ఉంటుందని సమాచారం.వీరోచిత పోరాటం ఓ ఊరి సంరక్షణ కోసం దుష్ట శక్తులతో శివ శక్తి అనే నాగసాధువు ఎలాంటి వీరోచిత పోరాటం చేసిందనే ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ‘ఓదెల 2’. ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నారు తమన్నా. దర్శక–నిర్మాత సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. బ్యాగ్లో బాంబు ఓ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్లో కత్తి, బాంబు, తుపాకీలు పెట్టుకుని తిరుగుతుంటుంది. ఎందుకనేది థియేటర్స్లో ‘రివాల్వర్ రీటా’ మూవీ చూసి తెలుసుకోవాలి. కీర్తీ సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. స్టూడెంట్ స్టోరీ రష్మికా మందన్నా తొలిసారి చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్ఫ్రెండ్’. ప్రేమలో పడకూదనుకుంటూనే ప్రేమలో పడే ఓ కాలేజీ స్టూడెంట్ కథగా ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందు తున్న ఈ సినిమా రిలీజ్పై త్వరలో ఓ ప్రకటన రానుంది. అలాగే ‘రెయిన్ బో’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కూ రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీపై తాజా అప్డేట్ రావాల్సి ఉంది. సుబ్బు సాహసం అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత... ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన చిత్రం ‘పరదా’. ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల కోసం సుబ్బు (అనుపమ) చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘పరదా’. ఈ చిత్రంలోని మెయిన్ హీరోయిన్ రోల్లో అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాతో ఓ సామాజిక అంశాన్ని బలంగా చెప్పబోతున్నారట ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే కోర్టు రూమ్ డ్రామాలోనూ, ‘లాక్ డౌన్’ అనే మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రంలోనూ అనుపమ నటించారు. నెగటివిటీ తగ్గాలంటే... సమాజంలోని నెగటివిటీని తగ్గించాలకుని ఓ యువతి తనదైన శైలిలో ఏం చేసింది? అనే అంశంతో ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ నిర్మాణంలో ఉంది. సామాజిక, రాజకీయ అంశాల మేళవింపుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ చేస్తున్నారు. కేఎస్సీ యోగేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంయుక్త కూడా ఓ నిర్మాత. ఆమెకు నిర్మాతకు ఇదే తొలి చిత్రం కావడం ఓ విశేషం. సతీ లీలావతి ‘హ్యపీబర్త్ డే’ తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి సైన్ చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘సతీ లీలావతి’. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆరంభమైంది. కథాంశం గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.బూమరాంగ్ అనూ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటించిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బూమరాంగ్’. ఇందులో శివ కందుకూరి కీలక పాత్రధారి. ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సైకో కిల్లర్ నుంచి ఒక యువతి ఎలా తప్పించుకుంది? అనే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్.సత్యభామ కథ పెళ్లైన ఓ అమ్మాయి తన సమస్యలను తానే ఏ విధంగా పరిష్కరించుకుంది? అనే అంశంతో రూపొందుతున్న సినిమా ‘శివంగి’. ఈ మూవీలో సత్యభామగా ఆనంది, పోలీసాఫీసర్గా వరలక్ష్మీ శరత్కుమార్ నటించారు. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. అలాగే ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.మహిళలు ఎదగాలి మహిళలను గౌరవించాలి, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించాలి, సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలనే అంశాల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘నారీ’. ఈ సినిమాలో ఆమని ఓ లీడ్ రోల్ చేశారు. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఇవే కాదు... ఇంకా మరికొన్ని ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
అతీంద్రియ శక్తులతో...
శ్రుతీహాసన్ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మార్క్ రౌలీ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేశారు. ఇదిలా ఉంటే... ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.తాజాగా ముంబైలో గురువారం ప్రారంభమైన 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో (హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ విభాగాల్లో) ఇండియా తరఫున ‘ది ఐ’ చిత్రం ప్రీమియర్ అయింది. మార్చి 2 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి.మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం మహిళల నేతృత్వంలోనిప్రొడక్షన్ హౌస్లో ‘ది ఐ’ని రూపోందించడం విశేషం. ఇండస్ట్రీలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నా అభిరుచికి అనుగుణంగా ఈప్రాజెక్ట్ ఉంటుంది’’ అన్నారు. కాగా శ్రుతీహాసన్ గతంలో ‘ట్రెడ్ స్టోన్’ అనే హాలీవుడ్ టీవీ సిరీస్లో నటించగా, ‘ది ఐ’ ఫస్ట్ హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్ కావడం విశేషం. -
ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్
సినిమాల్లో మారువేషాలు మారుపేరులు కలిగిన పాత్రను చూస్తుంటాం. అయితే నటి శృతిహాసన్ నిజ జీవితంలోనూ మారుపేరుతో తిరగడం విశేషం. సలార్ చిత్రం తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు తెరపై చూడలేదు. అయినప్పటికీ ఈమె పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. అందులో ఒకటి రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ.. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో నటి శృతిహాసన్ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు .అదేవిధంగా విజయ్ సేతుపతికి జంటగా ట్రైన్ చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. అయితే, విజయ్ దళపతి 69వ చిత్రం జననాయకన్లో కూడా ఈ బ్యూటీ కీలకపాత్రలో మెరవబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా శృతిహాసన్ ఏదో ఒక సంచలన ఘటనలనో, లేక ఆసక్తికరమైన విషయాలనో అభిమానులతో పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి కమల్ హాసన్ లెగిసీని వాడుకోకపోయినా ఆయన గొప్పతనాన్ని తరచూ వ్యక్తం చేస్తూనే ఉంటారు. కాగా తాజాగా తను సినీ రంగ ప్రవేశం చేయకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల ఓ భేటీలో తెలిపారు. తాను కమల్ వారసురాలని బయట తెలిస్తే.. స్నేహితులతో తిరగడానికి ఇబ్బంది కలుగుతుందని భావించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.సినీ రంగ ప్రవేశం చేయకముందు నకిలీ పేరుతో కొన్ని రోజులు చాలా స్వేచ్ఛగా తిరిగానని పేర్కొంది. నటుడు కమలహాసన్ కూతురు అని పరిచయం చేసుకుంటే ఎవరితో మాట్లాడిన వాళ్లు పూర్తిగా తన తల్లిదండ్రుల గొప్పతనం గురించే మాట్లాడుతారని, అందుకే తాను నకిలీ పేరు చెప్పి పరిచయం చేసుకునేదానినని, అలా వారితో ఎలాంటి సంశయం లేకుండా కోరుకున్న విధంగా నేను నాలా మాట్లాడగలిగేదాన్ని శృతిహాసన్ చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే చిత్రాల్లో నటించడం ప్రారంభించానో అప్పటి నుంచి ఆ నకిలీ పేరును వాడే అవకాశం లేకపోయిందని ఈ భామ పేర్కొన్నారు. -
మహిళల ప్రీమియర్ లీగ్లో డ్యాన్స్ తో అదరగొట్టిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
స్టార్ హీరోతో సినిమా.. భారీ హైప్ తెస్తున్న శ్రుతి హాసన్
డేరింగ్ హీరోయిన్ శ్రుతి హాసన్కు కోలీవుడ్లో మరో క్రేజీ అవకాశం వచ్చి నట్లు తాజా సమాచారం. సలార్ తరువాత ఈ భామ నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. అయితే ప్రస్తుతం ఈమె ఆ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రంలో శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. తాజాగా నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 69వ చిత్రం జననాయకన్ లో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నటి పూజాహెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ బ్యూటీ మమిత బైజూ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్, దర్శకుడు గౌతమ్ మీనన్, నటి ప్రియమణి ,ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ కుమార్, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎం పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో శృతిహాసన్ నటించబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజమైతే జననాయకన్ చిత్రానికి మరింత హైప్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా నటి శృతిహాసన్ విజయ్కి జంటగా ఇంతకుముందు పులి చిత్రంలో నటించారన్నది తెలిసిందే. కాగా తాజాగా మరోసారి విజయ్తో కలిసి జననాయకన్ చిత్రంలో నటించే విషయంపై అధికార పూర్వక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. -
హీరోయిన్ శృతి హాసన్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
రెండోసారి జోడీ?
హీరో ధనుష్, హీరోయిన్ శ్రుతీహాసన్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ (2012) సినిమాలో తొలిసారి జంటగా నటించారు ధనుష్, శ్రుతి. ఆ చిత్రం విడుదలైన 12 ఏళ్లకి మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందని టాక్. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి తాజాగా ధనుష్తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ మూవీలో ధనుష్కి జంటగా శ్రుతీహాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. పైగా డైరెక్టర్పై ఉన్న నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండానే ఓకే చెప్పారట ఆమె. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర శ్రుతీహాసన్ది అని టాక్. ‘3’ మూవీతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ధనుష్–శ్రుతీహాసన్ రెండోసారి జంటగా నటించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింVŠ తో బిజీగా ఉన్నారు శ్రుతి. ఆ మూవీ పూర్తయ్యాక ధనుష్ చిత్రంలో పాల్గొంటారని కోలీవుడ్ టాక్. -
రిలేషన్షిప్ ఓకే.. పెళ్లంటేనే భయంగా ఉంది: శృతి హాసన్
ప్రేమలో పడ్డప్పుడు గాల్లో తేలుతుంటారు. అదే బ్రేకప్ అయ్యాక ఈ ప్రేమాగీమా జోలికే వెళ్లొద్దని బలంగా ఫిక్సవుతుంటారు. కానీ కొన్నాళ్లకు మళ్లీ లవ్లో పడటం.. చివరకూ అదీ బ్రేకప్ అవడం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉన్న శృతి హాసన్(Shruti Haasan) ఇటీవల అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను హీరోయిన్ డిలీట్ చేయడంతో ఇది నిజమేనని అంతా ఫిక్సయిపోయారు. అంతే కాదు పెళ్లిపై ఆసక్తి కూడా లేదని తేల్చి చెప్పింది.ప్రేమ ఓకే, పెళ్లే వద్దు!తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వివాహం గురించి మాట్లాడింది. 'రిలేషన్షిప్స్ అంటే నాకిష్టం. ఆ ప్రేమ, అనుబంధాలన్నీ నచ్చుతాయి. ప్రేమలో మునగడం ఇష్టమే కానీ పెళ్లి చేసుకుని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటేనే భయంగా' ఉంది అని చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కమల్ హాసన్ (Kamal Haasan)- సారిక(Sarika) గురించి మాట్లాడుతూ.. నేను అందమైన కుటుంబంలో జన్మించాను. మా అమ్మానాన్న ఈ ప్రపంచంలోనే ఉత్తమ జంట అని భావించాను. విడిపోతేనే హ్యాపీ అంటే..ఇద్దరూ కలిసి పని చేసుకునేవారు. కలిసే సెట్స్కు వెళ్లేవారు. అమ్మ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసేది. సంతోషంగా, సరదాగా ఉండేవాళ్లం. కానీ ఎప్పుడైతే వాళ్లిద్దరూ విడిపోయారో అంతా మారిపోయింది. మా కుటుంబమంతా బాధపడ్డాం. కలిసుండటానికి ప్రయత్నించారు, కానీ కుదర్లేదు. అయినా బలవంతంగా కలిసుండటం కన్నా విడిపోతేనే సంతోషంగా ఉంటామనుకుంటే అది మాక్కూడా మంచిదే! అని చెప్పుకొచ్చింది.సినిమా..ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ కూలీ సినిమాలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ సలార్ 2లోనూ భాగం కానుంది. కాగా కమల్- సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2004లో కమల్- సారిక విడాకులు తీసుకున్నారు.చదవండి: షాకింగ్.. యూట్యూబ్ నుంచి పుష్ప 2 సాంగ్ డిలీట్ -
'అమరన్' దర్శకుడితో ధనుష్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన టాప్ హీరోయిన్
కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, కథకుడు ఇలా.. పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్. అంతేకాదు బహుభాషా నటుడు. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ఏక కాలంలో కథానాయకుడిగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ఒకటి ద్విభాషా చిత్రం కుబేర. రెండోది ఇడ్లీ కడై. ఈ చిత్రానికి ధనుష్ దర్శకుడు కూడా. ఇక మూడో చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గోపురం ఫిలిమ్స్ పతాకంపై అన్బు చెళియన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. వీర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో ఈయన అమరన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఘనత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ ఇది కూడా రియల్ హీరో కథా చిత్రంగానే ఉంటుందని తెలిపారు. సమాజంలో ఎందరో రియల్ లైఫ్ వీరులు, హీరోలు ఉన్నారన్నారు. వారిలో ఒకరి కథగా తమ చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నటి శృతిహాసన్ నాయకిగా నటించనున్నారన్నదే ఆ అప్డేట్. ఇంతకు ముందే ధనుష్, శృతిహాసన్ 3 అనే చిత్రంలో నటించారు. దీంతో మరో సారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న మాట. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ తదుపరి ధనుష్ తో జత కట్టనున్నారన్న మాట. కాగా రాయన్ చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
గోత్ థీమ్తో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న శ్రుతీ హాసన్
స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ క్రిస్మస్(Christmas) సీజన్ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటానికి సిద్ధమైంది. ఈ సెలబ్రేషన్స్ ద్వారా కొత్త సంవత్సరాదిని సరికొత్త ఉత్సుకతలో ప్రారంభించటానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మస్ పండుగను శ్రుతీ హాసన్ తనదైన శైలిలో జరుపుకోవటానికి సెలబ్రేషన్స్ను మొదలు పెట్టింది. అందులో భాగంగా గోత్ థీమ్తో క్రిస్మస్ను సెలబ్రేట్ చేయటానికి తన స్టైల్ను జోడించింది.శ్రుతీ హాసన్(Shruti Haasan), తనదైన స్టైల్లో యూనిక్గా నిర్వహిస్తోన్న క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రత్యేకమైన శైలిలో హాలీడే సీజన్కు స్వాగతం పలుకుతూ ఆమె అభిమానులు సహా అందిరలోనూ ఆనందాన్ని నింపింది.ఇక సినిమాల విషయానికి వస్తే 2023 శ్రుతీ హాసన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ ఏడాదిగా చెప్పొచ్చు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ పార్ట్ 1 చిత్రాలు విడుదలై ఘన విజయాలను సాధించాయి.కానీ ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే అభిమానులు మాత్రం 2025లో సరికొత్త చిత్రాల్లో ఆమెను చూడొచ్చు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ కూలీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకుడు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సలార్ 2 చిత్రం కూడా వచ్చే ఏడాదిలో సందడి చేయనుందని సమాచారం.ఇవి కాకుండా మరిన్న క్రేజీ చిత్రాల్లో శ్రుతీ హాసన్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె తన అద్భుతమైన నటనతో అభిమానులు సహా ప్రేక్షకులను మెప్పించనున్నారు. -
అడివి శేష్ కి గుడ్ బాయ్ చెప్పిన శృతి హాసన్.. ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
-
డకాయిట్ మిస్టరీ.. శృతి పోయి మృణాల్ ఎలా వచ్చింది?
-
జైపూర్కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
ట్రెడిషినల్ లుక్లో మెరిసిపోతున్న హీరోయిన్ శృతి హాసన్ (ఫొటోలు)
-
సమంత బాటలో శృతిహాసన్?
సినిమా రంగంలో అనుకున్నవన్నీ జరగవు. కొన్నిసార్లు ఊహించనవీ జరుగుతాయి. అలా టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న నటి సమంత కెరీర్ ఒక్కసారిగా సమస్యల్లోకి నెట్టబడింది. భర్త నాగచైతన్య నుంచి విడిపోవడం, అదే సమయంలో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. దీంతో సినిమాలకు దూరం అయ్యారు. ఆ వ్యాధి నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. పలు రకాల వైద్యం, యోగాలు, ధ్యానాలు చేశారు. మొత్తం మీద వ్యాధి నుంచి బయట పడ్డారు. అయితే ఇంకా నటనకు సిద్ధం కాలేదు. కారణం వచ్చిన చిత్రాలు వెనక్కి పోవడమేనని సమాచారం. మలయాళంలో మమ్ముట్టికి జంటగా నటించే అవకాశం వచ్చిందన్నారు. సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. వీటిలో ఏవీ జరగలేదు. అలాగే చైన్నె లవ్స్టోరీ అనే ఆంగ్ల చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కారణాలేమైనా ఆ చిత్రం కూడా చేజారిపోయింది. అయితే ఆ చిత్రంలో నటించే అవకాశాన్ని నటి శృతిహాసన్ చేజిక్కించుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈమె కూడా ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. శృతిహాసన్ అంగీకరించి, వైదొలగడం అనేది ఇది రెండోసారి. ఈమె ఇప్పటికే తెలుగు చిత్రం డెకాయిట్ లవ్స్టోరీ అనే చిత్రం నుంచి వైదొలగారు. టాలీవుడ్ నటుడు అడవి శేషు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి శృతిహాసన్ నటించడానికి అంగీకరించారు. ఈ చిత్ర టీజర్ కూడా విడుదలై మంచి ఆదరణ పొందింది. అలాంటి సమయంలో కారణాలేమైన శృతిహాసన్ ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఆంగ్ల చిత్రం చైన్నె లవ్స్టోరీ నుంచి వైదొలిగినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీటన్నింటికీ కారణం ఆమె నటిస్తున్న కూలీ చిత్రమేనా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కూలీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ తరువాత రజనీకాంత్ అస్వస్థతకు గురి కావడంతో షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో నటి శృతిహాసన్ రజనీకాంత్కు కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా కాల్షీట్స్ సమస్య కారణంగానే ఆమె చైన్నె లవ్స్టోరీ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. అలా శృతిహాసన్ కూడా నటి సమంత బాటలోనే పయనిస్తున్నారు అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
టాలీవుడ్ మూవీ నుంచి తప్పుకున్న శృతి హాసన్!
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతేడాది సలార్ మూవీ అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.అయితే శృతిహాసన్ ఇప్పటికే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్:ఎ లవ్ స్టోరీ ఒకటి. అంతే కాకుండా చెన్నై స్టోరీ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే కొన్ని విభేదాల కారణంగానే ఆమె గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు. డెకాయిట్తో పాటు చెన్నై స్టోరీ కూడా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్ .. వీడియో వైరల్)కాగా.. గతేడాది డిసెంబర్లో అడివి శేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ మూవీని ప్రకటించారు. అదే రోజున అనౌన్స్మెంట్ టీజర్ను కూడా విడుదల చేశారు. మరోవైపు చెన్నై స్టోరీలో శ్రుతి హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషించాల్సి ఉంది. అంతకు ముందు సమంత రూత్ ప్రభుని ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్ను ఎంపిక చేశారు. తాజాగా శృతి కూడా సినిమా నుంచి తప్పుకుంది. -
చికాగో ఫ్యాన్స్ మీట్లో శృతిహాసన్ సందడి
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లోకనాయకుడు కమల్హాసన్ గారాలపట్టిగా బోల్డెంత పేరు ఉన్నప్పటికి ..తన సొంత టాలెంట్, గ్లామర్తో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. టాప్ హీరోయిన్గా వెలుగుతోంది. పలు సేవా కార్యక్రమంలో పాలుపంచుకునే శృతిహాసన్ రీసెంట్గా అమెరికాలో పర్యటించారు. చికాగోలోని ఫ్యాన్స్ మీట్లో పాల్గొని..సందడి చేశారు.సాక్షి, HR PUNDITS పార్టనర్షిప్ గా.. పక్కాలోకల్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో శృతి హాసన్ బార్బీ డాల్గా మెరిసిపోతూ.. అభిమానులను కుష్ చేశారు. ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాసన్ ను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వేదికపై శృతిహాసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా వారి కోరిక మేరకు సాంగ్స్ కూడా పాడారు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. శృతి హాసన్ తన సినీ కెరీర్ కు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. చికాగో తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైనా స్టయిల్ లో సమాధానం ఇచ్చారు.ఈ ఈవెంట్ లో శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆమె సినిమాలకు సంబంధించి పలు ప్రశ్నలను అభిమానులను అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి శృతిహాసన్ ఆటోగ్రాప్ చేసిన టీషర్ట్లను అందజేశారు. ఇక ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాన్కు సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఇక అందమైన ఫోటో ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించిన నిర్వహకులకు.. శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాదులో సందడి చేసిన నటి శృతిహాసన్ (ఫొటోలు)
-
మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!
టాలీవుడ్ నటి, గాయని శృతి హాసన్ విలక్షణ నటుడు కమల హాసన్ కూమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఒకానొక సందర్భంలో శృతి తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలంటే మొదటగా ఏం చేయాలో తెలుసా అంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అవేంటంటే..అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకే జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాయాలంటోంది శృతి. ఈ పరిస్థితిని అందరూ ఏదోఒక సందర్భంలో ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం, బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతామని చెబుతోంది. నిజానికి మానసికంగా బాధపడుతున్నాను అంటూ.. వెంటనే థెరపిస్టు లేదా కౌన్సలర్ లేదా సైక్రియాట్రిస్ట్ వద్దకు వెళ్లిపోతారు. కానీ అవేమి అవసరం లేదంటోంది శృతి. మన చుట్టు ఉన్నవాళ్లతో లేదా మనకిష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే చాలు మానసిక స్థితి కుదుటపడుతుందని నమ్మకంగా చెబుతోంది. అందుకు ఉదాహారణగా.. మనం ఏదైన జ్వరం రాగానే ఏం చేస్తాం చెప్పండి అంటోంది. మొదటగా.. ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని చూస్తారు. తగ్గలేదు అనగానే వైద్యుడిని సంప్రదించే యత్నం చేస్తారు. అలానే దీని విషయంలో కూడా మనంతట మనంగా ఈ మానసిక సమస్యను నయం చేసుకునే యత్నం చేయాలి. అవన్నీ ఫలించని పక్షంలో థెరఫిస్టులను ఆశ్రయించడం మంచిదని చెబుతోంది. అలాగే కొందరూ మెంటల్ స్ట్రెస్ తగ్గేందుకు సినిమాలకు వెళ్లతారు. ఓ మంచి ఫీల్తో హ్యాపీగా ఉండేలా చేసుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతే అయినా ఒక్కోసారి ఇది కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదని అంటోంది శృతి. చేయాల్సినవి..మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించగానే దాన్ని పెనుభూతంలా, పెద్ద సమస్యలా చూడొద్దుఆ వ్యాధి మిమ్మల్ని తక్కువగా చేసి చూపించేది కాదు.నలుగురితో కలుపుగోలుగా మెలిగే ప్రయత్నం లేదా మాట్లాడటం వంటివి చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వ్యక్తులతో సమస్యను వివరించి బయటపడేలా మద్దతు తీసుకోండి. దీంతోపాటు మానసిక ఆరోగ్య నిపుణలను సంప్రదించి..ఏం చేస్తే బెటర్ అనేది కూలంకషంగా తెలుసుకుని బయటపడే ప్రయంత్నం చేయండి.నిజానికి మానసికి ఆరోగ్య మొత్తం ఆరోగ్య శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటేనే ఏ పనైనా సునాయాసంగా చేయగలం. అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోగలుగుతాం అని చెబుతోంది శృతి.(చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!) -
కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్ .. వీడియో వైరల్
ఇంతకు ముందు సినీ హీరోలు తాము నటించే చిత్రాల కోసం తీవ్రంగా హోమ్వర్క్ చేస్తుండేవారు. అయితే, ఇప్పుడు హీరోయిన్లు కూడా తమ పాత్రల కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారు. తాజాగా నటి శృతిహాసన్ తన పాత్రకు న్యాయం చేయడం కోసం చాలా కష్టపడుతుంది. పాన్ ఇండియా రేంజ్లో రాణిస్తున్న ఈ చెన్నై బ్యూటీ మొదట హిందీలో లక్ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ల్లో నటిస్తూ పాపులర్ అయింది. నిజం చెప్పాలంటే తమిళంలో కంటే తెలుగులోనే శృతిహాసన్కు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈమె నటించిన చిత్రాలన్నీ హిట్టే అని చెప్పవచ్చు. అలా టాప్ హీరోయిన్గా రాణిస్తున్న శృతిహాసన్ తన సొంత భాష తమిళంలో నటించి మూడేళ్లకు పైగా అయ్యింది. ఈమె నాయకిగా నటించిన తమిళ చిత్రం లాభం తెరపైకి వచ్చి మూడేళ్లు అయ్యింది. అలా సుదీర్ఘ గ్యాప్ తరువాత శృతిహాసన్ కోలీవుడ్లో నటిస్తున్న చిత్రం కూలీ. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ తారాగణంతో భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో శృతిహాసన్ నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు ఒక పోస్టర్ను విడుదల చేశాయి కూడా. ఇందులో ఆమె పాత్ర చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది. చిత్రంలో ఆమెకు ఫైట్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అందుకోసం ఆమె ఆత్మరక్షణ విద్య అయిన కర్రసాములో శిక్షణ పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయో సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో ఆమె తన తండ్రి, ప్రఖ్యాత నటుడు కమలహాసన్ కూడా ఇంతకు ముందు దేవర్మగన్ (క్షత్రియ పుత్రుడు) చిత్రంలో కర్రసాము విద్యను ప్రదర్శించారని, అలాగే తానూ ఈ ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈమె వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న శృతి హాసన్..
-
పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు
హీరోయిన్గా పదిహేనేళ్ల విజయవంతమైన కెరీర్ని పూర్తి చేసుకుంటూ, ఇంకా అగ్రశ్రేణి హీరోయిన్ల జాబితాలో ఒకరిగా రాణిస్తుండటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ లిస్ట్లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్ పేరు ఈ లిస్ట్లో చేరింది. తండ్రి కమల్హాసన్ నటించిన ద్విభాషా (తమిళం, హిందీ) చిత్రం ‘హే రామ్’ (2000)లో చైల్డ్ ఆర్టిస్టుగా తొలిసారి స్క్రీన్పై కనిపించారు శ్రుతీహాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా మరో సినిమా చేయలేదు కానీ.. ‘హే రామ్’ రిలీజైన తొమ్మిదేళ్లకు హిందీ చిత్రం ‘లక్’ (2009)తో కథానాయికగా కెరీర్ను ఆరంభించారు శ్రుతి.ఆ తర్వాత సూర్య ‘సెవెన్త్ సెన్స్’, ధనుష్ ‘త్రీ’, రామ్చరణ్ ‘ఎవడు’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ రవితేజ ‘క్రాక్’ .. ఇటీవల చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రుతి. నటిగా–గాయనిగా–సంగీత దర్శకురాలిగా... ఇలా మల్టీ టాలెంట్తో దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. కథానాయికగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘అప్పుడే పదిహేనేళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదు.నేను పెరిగిన మ్యాజికల్ ఇండస్ట్రీలోనే ఇంతకాలం నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిగతా జీవితాన్ని కూడా ఇండస్ట్రీతోనే ముడివేస్తాను. ఇండస్ట్రీలో నాకు అందమైన పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులకు థ్యాంక్స్. వీళ్లే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు. రజనీకాంత్ ‘కూలీ’, ప్రభాస్ ‘సలార్: శౌర్యంగాపర్వం’, అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు శ్రుతీహాసన్. -
హారర్ మూవీకి సై
గ్లామర్, డీ–గ్లామర్... ఏ పాత్రని అయినా సునాయాసంగా చేసేస్తారు శ్రుతీహాసన్. అయితే ఇప్పటివరకూ సినిమా మొత్తం పూర్తిగా తన చుట్టూ తిరిగేలా ఉన్న కథల్లో ఈ బ్యూటీ కనిపించలేదు. అంటే... పూర్తి స్థాయి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ శ్రుతీహాసన్ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా కథానాయిక ్రపాధాన్యంగా సాగే రెండు చిత్రాల్లో ఆమె కనిపించే చాన్స్ ఉంది. ఒకటి ‘చెన్నై స్టోరీ’. ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.అయితే ఈ సినిమా నుంచి శ్రుతి తప్పుకున్నారనే వార్త కూడా ఉంది. ఆ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ విషయానికొస్తే... శ్రుతీహాసన్ హీరోయిన్గా యూవీ క్రియేషన్స్ బేనర్ ఈ సినిమానిప్లాన్ చేస్తోందట. హారర్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం సాగుతుందని, పూర్తి స్థాయి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని సమాచారం. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి... వార్తల్లో ఉన్న ప్రకారం యూవీలో సినిమాకి శ్రుతీహాసన్ సై అన్నారా? అనేది నిర్మాణ సంస్థ కానీ శ్రుతి కానీ చెబితేనే తెలుస్తుంది. -
రజనీకాంత్ కూలీలో శృతిహాసన్
కూలీ చిత్రం చాలా కాస్ట్లీ గురూ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదేవిధంగా జరుగుతోంది. నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఇది ఆయన నటించే 171వ చిత్రం అవుతుంది. లోకేష్కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇది అండర్వరల్డ్ డాన్ల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రం ప్రారంభానికి ముందే యూనిట్ వర్గాలు ఫస్ట్లుక్, టైటిల్ ప్రోమోలను విడుదల చేసి కూలీ చిత్రంపై పెద్ద ఎత్తున హైప్ తీసుకొచ్చారు. దర్శకుడు లోకేష్నకరాజ్ కూడా హడావుడీగా చిత్రం షూటింగ్కు వెళ్లకుండా కథ, కథనాల కోసం తగినంత టైమ్ తీసుకుని పకడ్బందీగా షూటింగ్ను ప్రారంభించారు. అలా జూన్ నెలలో ప్రారంభం కావాల్సిన కూలీ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లో ఎలాంటి హంగామా లేకుండా ప్రారంభమైంది. అయితే ఈ నెల 10వ తేదీన చెన్నైలో రెండో షెడ్యూల్ షూటింగ్ను నిర్వహించనున్నట్లు సమాచారం. అలా కూలీ చిత్రాన్ని హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో నిర్వ హించాలని దర్శకుడు ప్రణాళికను రచించినట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రం చాలా రేర్ కాంబినేషన్లో తెరకెక్కడం విశేషం. రజనీకాంత్, లోకేష్కనకరాజ్ల కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ఇకపోతే చాలా సంవత్సరాల తరువాత నటుడు సత్యరాజ్, రజనీకాంత్తో కలిసి నటిస్తున్న చిత్రం ఇది. అలాగే ఇందులో లోకనాయకుడి వారసురాలు, సంచలన క్రేజీ నటి శృతిహాసన్ తొలిసారిగా రజనీకాంత్తో కలిసి నటించడం మరో విశేషం. అయితే ఇందులో ఆమె కథానాయకిగా కాకుండా, చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే సమీపకాలంలో ఈమె నటిస్తున్న భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదే అవుతుంది. అలాగే బిగిల్ చిత్రం ఫేమ్ నటి రెబా మోనిక మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక యువ సంగీత తెరంగం అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా కూలీ చిత్రాన్ని ఈ ఏడాది చివరికంతా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి తీసుకువచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. -
పెళ్లి చేసుకోను సార్
అమ్మాయిలను వారి పెళ్లి గురించి అడగడం మానుకోండి అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇంతకీ విషయం ఏంటంటే.. వీలైనప్పుడల్లా సోషల్ మీడియా మాధ్యమాల్లో నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహించడం శ్రుతీహాసన్కు అలవాటు. ఇటీవల మరోసారి ఈ బ్యూటీ చాట్ సెషన్ను నిర్వహించారు. ఇందులో భాగంగా... ‘మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగితే శ్రుతీహాసన్ కాస్త గట్టిగానే బదులిచ్చారు.‘‘ఇది 2024... అమ్మాయిలను ఇలాంటి ఉపయోగం లేని వెర్రి ప్రశ్నలు అడగడం మానుకోండి’’ అంటూ బదులిచ్చారామె. అలాగే ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడమ్’ అని మరో నెటిజన్ శ్రుతీహాసన్ను ప్రశ్నించగా... ‘ఐ వోన్ట్ సార్’ (చేసుకోను సార్) అని బదులిచ్చారు. అంటే... పెళ్లి చేసుకోనని సూటిగా చెప్పేశారు. ఇక సినిమాల విషయానికొస్తే... అడివి శేష్తో ‘డెకాయిట్’ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రభాస్తో ‘సలార్ 2’, తమిళంలో ‘చెన్నై స్టోరీ’ సినిమాలు కూడా శ్రుతి చేతిలో ఉన్నాయి. -
మాజీ ప్రేమికుల కథ
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
హృదయ తలుపు మూసేశా.. బ్రేకప్ సాంగ్ పాడిన శృతిహాసన్
‘నా డోర్స్ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్ శృతిహాసన్ తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలైన ఈమె తన తండ్రి నటించిన హేరామ్ చిత్రంతో బాల నటిగా రంగప్రవేశం చేశారు. 2009లో లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2011లో 7 ఆమ్ అరివు (సెవన్త్ సెన్స్) చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.తెలుగులో ఎక్కువ సక్సెస్అయితే ఆ తరువాత నుంచి శృతిని తమిళ సినీ పరిశ్రమ కంటే తెలుగు సినీ పరిశ్రమే ఎక్కువగా ఆదరిస్తూ వస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్బాబు, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల సలార్తో సక్సెస్ అందుకోగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు కూతురిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మింగిల్ అవ్వాలనుకోవడం లేదుఇకపోతే శృతిహాసన్కు ప్రేమ అచ్చిరాలేదనుకుంటా.. ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన శృతిహాసన్ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడికి బ్రేకప్ చెప్పిందని సమాచారం. దీంతో తాను ప్రస్తుతం సింగిల్నే అని.. మింగిల్ అవ్వాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తాజాగా ‘ఐ షట్ ద డోర్. అండ్ ఐ ఈట్ ద కీ. ఐ వోంట్ బీ నీడింగ్ దట్ మీ ఎనీమోర్’ అంటూ ప్రేమలో ఓడిపోయిన వారు పాడుకునేలాంటి పాటను పోస్ట్ చేశారు. హృదయ తలుపులు మూసేశానని, ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదని శృతి హాసన్ పాట రూపంలో పాడుతుందన్నమాట! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్ -
Shruti Haasan: మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న శ్రుతి.... లేటెస్ట్ అవుట్ ఫిట్ అదుర్స్ (ఫోటోలు)
-
శ్రుతి హాసన్తో బ్రేకప్.. సారీ అంటూ క్లారిటీ ఇచ్చిన బాయ్ఫ్రెండ్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన బాయ్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన బాయ్ఫ్రెండ్ శాంతాను హజారికా రియాక్ట్ అయ్యాడు. గత కొద్దిరోజులుగా జంట డేటింగ్లో ఉన్నారు. కానీ, శృతి, శాంతాను ఇద్దరూ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో ఒకరినొకరు ఫాలో అవడం మానేశారు. దీంతో వీళ్ల బ్రేకప్ వార్తలు బయటకొచ్చాయి.ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ 'శాంతాను హజారికా'తో శ్రుతి హాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆమె కొంత కాలం క్రితం క్లారిటీ ఇచ్చింది. అయితే బ్రేకప్ వార్తలు వైరల్ అయిన తర్వాత శ్రుతి హాసన్ నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు.కానీ, శాంతాను హజారికా తాజాగా తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. "నన్ను క్షమించండి, నేను దానిపై వ్యాఖ్యానించదలచుకోలేదు" అని శాంతను బాంబే టైమ్స్తో అన్నాడు. వారిద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారని ఖచ్చితమైన సమాచారం ఉందంటూ కథనాలు వస్తున్నాయి. "వ్యక్తిగత విభేదాలు ఉన్నందున, వారు స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు" అని అంతర్గత వ్యక్తి పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది.శ్రుతి విడిపోవడం గురించి రియాక్ట్ కాలేదు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో "ఇది ఒక క్రేజీ రైడ్.., నా గురించే కాకుండా ఇతర వ్యక్తుల గురించి చాలా నేర్చుకున్నాను" అని షేర్ చేసింది. ఆపై బాయ్ఫ్రెండ్తో ఉన్న పోటోలు, పోస్ట్లను కూడా ఆమె తొలగించింది. శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్తో ప్రేమలో పడింది శృతి.. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ఈ లవ్ స్టోరీకి కూడా ఫుల్స్టాప్ పడినట్లు అయింది. -
డిటెక్టీవ్గా అక్కడ ఎంట్రీ ఇస్తున్న శృతిహాసన్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ సినీ కేరీర్ను చూస్తే నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో బాల నటిగా రంగప్రవేశం చేసిన శృతిహాసన్ ఆ తరువాత లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో ఏళాం అరివు (7th సెన్స్) చిత్రంలో సూర్యకు జంటగా నటించి గుర్తింపు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న శృతిహాసన్ ఇప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగారు. చైన్నె స్టోరీ అనే అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంలో నటించే లక్కీఛాన్స్ను నటి సమంత పొందారు. అయితే ఆమె మైయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. దీంతో ఆ అదృష్టం శృతిహాసన్ను వరించింది. ఇది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శృతిహాసన్ అనూ అనే లేడీ డిటెక్టీవ్గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ చిత్రంలో నటించడం తన మనసుకు ఉత్సాహాన్నిస్తోందని ఆమె ఒక భేటీలో పేర్కొన్నారు. -
మా జంట నాన్నకు నచ్చింది: శృతిహాసన్
నటి శృతిహాసన్ను చూస్తే పులి కడుపున పులిబిడ్డే పుడుతుందన్న సామెత నిజం అనిపిస్తుంది. కమలహాసన్కు చిత్ర పరిశ్రమలో సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. ఈ విషయంలో ఆయన వారసురాలు శృతిహాసన్ కూడా సరిగ్గా సెట్ అవుతుంది. ఈమె బాలీవుడ్లో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా నటించి అప్పుడే సంచలన నటిగా ముద్రవేసుకున్నారు. ఆ తరువాత సంగీత రంగంలోకి ప్రవేశించి తన తండ్రి కథానాయకుడిగా నటించిన ఉన్నైపోల్ ఒరువన్ (తెలుగులో ఈనాడు) చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూనే సంగీతం పైనా దృష్టి సారిస్తున్నారు. ఈమె పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శృతిహాసన్లో గీత రచయిత, మంచి గాయని కూడా ఉన్నారు. కాగా తాజాగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఆంగ్లమ్లో ఒక పాటను రాశారు. అనంతరం ఆ పాటను తమిళంలోకి నటుడు కమలహాసన్ అనువదించి తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా దానికి నటి శృతిహాసన్ సంగీత బాణీలు కట్టి పాడి నటించారు. ఈ ఆల్బమ్లో ప్రస్తుత క్రేజీ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శృతిహాసన్తో కలిసి నటించడం విశేషం. ఇది ఒక రొమాంటిక్ ఆల్బమ్ ఆన్నది గమనార్హం. ఇటీవల విడుదల చేసిన ఈ ఆల్బమ్ టీజర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా ఇనిమేల్ ఆల్బమ్ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో నటి శృతిహాసన్, దర్శకుడు లోకశ్కనకరాజ్ పాల్గొన్నారు. నటి శృతిహాసన్ మాట్లాడుతూ 4 నిమిషాల్లో ఒక జంట రిలేషన్షిప్లోని భావాలను ఆవిష్కరించే ఆల్బమ్గా ఇనిమేల్ ఉంటుందన్నారు. రిలేషన్షిప్ అనేది ఎలా ఒక లూప్గా మారుతోంది, అందులోని అప్స్ అండ్ డౌన్స్ను ఈ పాట ద్వారా చెప్పదలచానన్నారు. ఈ ఆల్బమ్ చూసిన ప్రేక్షకులు తమ రిలేషన్ఫిప్లోని లోపాలను సరిదిద్దుకుంటారనే నమ్మకంతో రూపొందించినట్లు చెప్పారు. తాను చిన్నతనం నుంచే సంగీతంతో పయనిస్తున్నానని, అది తన అదృష్టం అని పేర్కొన్నారు. సినీ సంగీతం అనేది ఒక మాన్స్టర్ అని, అందులో ప్రైవేట్ ఆల్బమ్స్ అనేవి 30 శాతం అయినా ఉండాలని భావించానన్నారు. ఇనిమేల్ ఆల్బమ్కు ఇంత ప్రచారం రావడానికి కారణం తన తండ్రి, రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అని పేర్కొన్నారు. దర్శకుడు లోకేశ్కనకరాజ్ను విక్రమ్ చిత్ర షూటింగ్ సమయంలో కెమెరాలో చూశానన్నారు. ఈయన రూపం బాగానే ఉందనిపించిందన్నారు. అలా ఆయన ఈ ఆల్బమ్లోకి వచ్చారన్నారు. ఎంతో మంది అభిమానులు కలిగిన దర్శకుడు ఇందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రేమను ఒక డెల్యూషన్ అంటారని, అది పరిపూర్ణం కాకపోతే మాయగానే అసహనంగా మారుతుందని, అదే పరిపూర్ణం అయితే ఆ మూవెంట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అవుతుందని అన్నారు. అదే డెల్యూషన్ నుంచి సొల్యూషన్ వైపునకు సాగే ప్రేమ పయనం అవుతుందన్నారు. ఈ విషయాన్నే ఇనిమేల్ ఆల్బమ్లో చూపించినట్లు చెప్పారు. ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్తో తాను నటించడం సంతోషకరమన్నారు. తమ జంట తన తండ్రి కమలహాసన్కు నచ్చిందని శృతిహాసన్ పేర్కొన్నారు. -
ఆయన్ను ఎవరైనా లవ్ చేస్తారు: శ్రుతిహాసన్
నటి శ్రుతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్. వీరు ఇద్దరూ ఇద్దరే. ఎవరి క్రేజ్ వారికుంది. హీరోయిన్గా శ్రుతిహాసన్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే నాలుగు చిత్రాలతోనే మోస్ట్ పాపులారిటీని దర్శకుడు లోకేష్ కనకరాజ్ సంపాదించుకున్నాడు. ఇక వీరికి లోకనాయకుడు కమలహాసన్ తోడైతే అది ఎలాంటి ప్రాజెక్ట్ అయినా వచ్చే క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు అదే జరిగింది. కమలహాసన్ రాసిన తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందించిన ఈ పాటకు శ్రుతిహాసన్ బాణీలు కట్టి, పాడడంతో పాటు, అందులో దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి నటించారు. ఈ ప్రత్యేక వీడియో ఆల్బమ్కు 'ఇనిమేల్' అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలో విడుదల కానున్న మ్యూజికల్ వీడియో ఆల్బమ్కు సంబంధించిన చిన్న ప్రమోషన్ టీజర్ను ఇటీవల విడుదల చేశారు. దీనికి భారీ స్పందన వస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ విషయాన్ని పక్కన పెడితే ఇందులో దర్శకుడు లోకేష్ కనకరాజ్, శ్రుతిహాసన్ కలిసి నటించిన సన్నిహిత సన్నివేశాలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఈ పాట ప్రమోషన్లో భాగంగా శ్రుతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాజ్ కమల్ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు. శ్రుతిహాసన్ పేర్కొంటూ తాను ఆంగ్లంలో రాసి ఈ వీడియో ఆల్బమ్ను రూపొందించదలచినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తండ్రి కమల్హాసన్ తో కలిసి చేద్దామని చెప్పగా ఆయన తన ఆంగ్లం పాటను తమిళంలో రాసినట్లు చెప్పారు. అది ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి మంచి రొమాంటిక్ వీడియో ఆల్బమ్గా మారిందని చెప్పారు. లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ ఈ వీడియో ఆల్బమ్ కోసం శ్రుతిహాసన్ తనను ఎందుకు ఎంపిక చేశారో తెలియలేదన్నారు. అయితే ఆమె క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ ఆల్బమ్లో అనూహ్యంగా శ్రుతిహాసన్కు లవర్ బాయ్గా ఎలా నటించ గలిగారు అన్న ప్రశ్నకు లోకేష్ కనకరాజ్ కాస్త సిగ్గుపడుతూ బదులిచ్చారు.మీకు ఎక్స్ లవ్ లాంటిది జరిగిందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన బదిలించారు. దీంతో శ్రుతిహాసన్ కల్పించుకుని లోకేష్ కనకరాజ్ను లవ్ చేయని వారు ఉంటారా అంటూ, ఈయన్ని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్రేమిస్తారు అంటూ పేర్కొన్నారు. -
కమల్ నిర్మాణంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న లోకేష్.. శృతిహాసన్ సంగీతం!
తమిళసినిమా: ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ రాబోతోంది. కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక ఆయన వారసురాలు శ్రుతిహాసన్ గురించి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా ప్రస్తుతం టాప్ మోస్ట్ డైరెక్టర్గా వెలిగిపోతున్న లోకేశ్ కనకరాజ్ క్రేజ్ ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు కలిస్తే ఆ ప్రాజెక్ట్ మజానే వేరు కదా?. అవును కమలహసన్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ను నటింపజేశారు. అయితే ఇది చిత్రంలో కాదు. ఒక స్పెషల్ మ్యూజికల్ ఆల్బమ్లో. ఈ ఆల్బమ్ను కమలహాసన్ రూపొందించడంతో పాటు, అందులోని పాటను రాయడం విశేషం. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ పాటను శ్రుతిహాసన్ పాడడంతో పాటు సంగీతాన్ని అందించడం. ఈ ఆల్బమ్కు ఇనిమేల్ అనే టైటిల్ను నిర్ణయించారు. దీనికి ద్వారకేశ్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. భువన్గౌడ చాయాగ్రహణం అందించారు. ఆల్బమ్ను త్వరలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా శ్రుతిహాసన్కు మ్యూజిక్ ఆల్బమ్లు రూపొందించడం కొత్తేమి కాదు. ఇంతకు ముందు ఎడ్జ్, షీస్ ఏ హీరో, మాస్టర్ మోషన్ పేర్లతో రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్స్ సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. దీంతో తాజాగా క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఇనిమేల్ వీడియో ఆల్బమ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #Inimel all your Delulus become Trulus#Ulaganayagan #KamalHaasan#InimelIdhuvey@ikamalhaasan #Mahendran @Dir_Lokesh @shrutihaasan @RKFI @turmericmediaTM@IamDwarkesh @bhuvangowda84 @philoedit #SriramIyengar @SowndarNallasa1 @gopiprasannaa @Pallavi_offl @iGeneDIandVFX… pic.twitter.com/awY7qzQpHF — Raaj Kamal Films International (@RKFI) March 14, 2024 -
ప్రేమించటానికి సమయం లేదు!
‘ప్రేమించటానికి సమయం లేదు’ అంటూ పాట రూపంలో చెబుతున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు.. మంచి గాయని అనే సంగతి కూడా తెలిసిందే. తండ్రి కమల్హాసన్ నటించిన ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడే తొలి అవకాశం శ్రుతికి ఇచ్చారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆ తర్వాత ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. కమల్హాసన్ నటించిన ‘ఉన్నైపోల ఒరువన్’ సినిమాకి సంగీతం అందించారు శ్రుతీహాసన్. అలాగే ‘ఈనాడు’ సినిమాలో ‘నింగికి హద్దు..’, ‘ఓ మై ఫ్రెండ్’లో ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో..’, ‘ఆగడు’లో ‘అరె జంక్షన్లో..’, ‘రేసు గుర్రం’ మూవీలో ‘డౌన్ డౌన్...’ ఇలా పలు సినిమాల్లో చాలా పాటలు పాడారామె. తాజాగా మరోసారి గాయనిగా మారారు శ్రుతీహాసన్. ‘జయం’ రవి, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ‘కాదలిక్క నేరమిల్లై..’ (ప్రేమించటానికి సమయం లేదు) పాటని శ్రుతి పాడనున్నారు. -
లారెన్స్తో జోడీ?
హీరో లారెన్స్కి జోడీగా హీరోయిన్ శ్రుతీహాసన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘రైడ్, వీర, రాక్షసుడు, ఖిలాడి’ వంటి పలు చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు రమేష్ వర్మ. ఆయన దర్శకత్వంలో ఘవ లారెన్స్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్పై జ్ఞావవేల్ రాజా తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ నిర్మించనున్నారు.రా ఈ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. కాగా ఈ మూవీలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందట. అందులో ఒక హీరోయిన్గా ఇప్పటికే నయనతార పేరు వినిపించింది.. మరో కథానాయికగా శ్రుతీహాసన్ నటిస్తారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో లారెన్స్కి జోడీగా ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించనున్నారంటూ గత ఏడాది వార్తలు వచ్చినా, ఆ తర్వాత ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా నయనతార, శ్రుతీహాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో హారర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని భోగట్టా. -
హాలీవుడ్కి హాయ్ చెప్తున్న మన హీరోయిన్స్
హాలీవుడ్లో చాన్స్ అంటే అంత సులభం కాదు. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యం కూడా కాదు. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అలా టాలెంట్తో పాటు హార్డ్వర్క్ చేస్తున్న కొందరు హీరోయిన్లను అదృష్టం కూడా వరించడంతో హాలీవుడ్ కబురు అందింది. హాలీవుడ్కి హాయ్ చెప్పిన ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► శ్రుతీహాసన్కు గత ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రుతి హీరోయిన్గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. అలాగే శ్రుతీహాసన్ ఓ లీడ్ రోల్లో చేసిన ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ‘రివర్ సిటీ’, ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్లలో నటించిన మార్క్ రౌలీ ఈ సినిమాలో శ్రుతీహాసన్కు జోడీగా నటించారు. దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెరకెక్కించారు. ‘ది ఐ’ సినిమాను త్వరలోనే థియేటర్స్లో విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. శ్రుతీ హాసన్కు ఇదే తొలి ఇంగ్లిష్ మూవీ అవుతుంది. అలాగే ‘ది ఐ’ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పదర్శితం కానుంది. బెస్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్లో ‘చెన్నై స్టోరీ’ అనే మరో ఇంగ్లిష్ ఫిల్మ్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతీహాసన్. ‘ది ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్కు లీడ్ పెయిర్గా అమెరికన్ నటుడు వివేక్ కల్రా నటిస్తారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అను (శ్రుతి పాత్ర) అనే యువతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తొలుత సమంత నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో శ్రుతీహాసన్ చేస్తున్నారు. ► తెలుగు మూలాలు ఉన్న నాయిక శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే శోభితకు హాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నటించి, దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ మూవీ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ రోల్ చేశారు శోభిత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్లో విడుదల చేయనున్నారు. ‘‘నా తొలి హాలీవుడ్ మూవీకి మీ (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం కావాలి’’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు శోభిత. ► దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన అలనాటి తార నూతన్ వారసురాలు ప్రనూతన్ బహల్. వెండితెరపై హిందీ చిత్రం ‘నోట్బుక్’ (2019)తో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు ప్రనూతన్. ఆ తర్వాత ‘హెల్మెట్’ (2021)లోనూ మెరిశారామె. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో ప్రనూతన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘కోకో అండ్ నట్’ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్లో చికాగోలో ్రపారంభం కానుంది. ఇంగ్లిష్, ఇండియన్ నటులు ఈ సినిమాలో నటిస్తారు. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హీరోయిన్ల హాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. -
పదకొండేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ని..పోల్చితే నచ్చదు: శ్రుతీహాసన్
‘‘నేను కెరీర్ ఆరంభించినప్పుడు (2009లో హిందీ చిత్రం ‘లక్’తో హీరోయిన్గా పరిచయం అయ్యారు) సోషల్ మీడియా లేదు.. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ లేవు. ఒకవేళ ఉండి ఉంటే నటిగా నేను చేసినవి ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులు చూసి ఉండేవారు. అయినప్పటికీ కెరీర్ విషయంలో, నా అప్పటి దశ పరంగా నేను హ్యాపీగా ఉన్నాను’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా ఫిల్మ్ప్ గురించిన ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘పదకొండేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా స్టార్ని. అప్పట్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే పాన్ ఇండియా అనే పదాన్ని నేను అప్పుడే వాడాను. నాకు పాన్ ఇండియా ఫీవర్ లేదు. అయితే అన్ని రకాల భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు పాన్ ఇండియా అంటూ పోటీలో ఉన్న మేల్, ఫీమేల్ యాక్టర్లతో నన్ను నేను పోల్చుకోను. ఎందుకంటే కొన్నేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా సినిమాలు చేసేశాను. కెరీర్ పరంగా నా విధానాన్ని నేను ఫాలో అయ్యాను. నన్ను ఎవరితోనైనా పోల్చితే నచ్చదు’’ అన్నారు. ఇక ప్రస్తుతం శ్రుతీహాసన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... అడివి శేష్తో ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆమె నటించనున్న ఇంగ్లిష్ మూవీ ‘చెన్నై స్టోరీస్’ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. -
Shruti Haasan: డిటెక్టివ్ అను
ఇంగ్లిష్ మూవీ ‘చెన్నై స్టోరీ’ కోసం డిటెక్టివ్గా అనుగా మారనున్నారు శ్రుతీహాసన్. ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా దర్శకుడు, ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే తమిళ మహిళ కథే ఈ చిత్రం. కనిపించకుండా ΄ోయిన తన తండ్రిని కనుగొనే ప్రయత్నంలో ఓ వ్యక్తి (బ్రిటిష్ నటుడు వివేక్ కల్రా) వేల్స్ నుంచి చెన్నైలో అడుగుపెట్టి, డిటెక్టివ్ అను సహాయం కోరడం, ఆ తర్వాత అను ఏం చేసింది? అనేది కథాంశం. ప్రధానంగా ఇంగ్లిష్, కొంచెం తమిళ్, వేల్స్ భాషలతో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం సాగుతుంది. కాగా, ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. ‘‘చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రానికి అంతర్జాతీయ భాగస్వామ్యం ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రుతీహాసన్. కాగా ఈ సినిమాని సమంత చేయాల్సింది. కానీ కొన్నాళ్లు ఆమె సినిమాలకు గ్యాప్ ఇవ్వడంవల్ల ఈ చాన్స్ శ్రుతీహాసన్కి దక్కింది. -
లక్కీ హీరోయిన్.. అన్ని సినిమాలూ సూపర్ హిట్టే!
శృతి ఉంటే సక్సేస్ ఖాయమేనా? ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అన్నట్టు శృతి అంటే సంగీతంలో శృతి లయలు అనుకునేరు. ఇక్కడ శృతి అంటే హీరోయిన్ శృతి హాసన్. లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలైన ఈమె కథానాయికగా హిందీలో నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక మాతృభాష అయిన తమిళంలో నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు చిత్రపరిశ్రమ కావడం విశేషం. అంతేకాదు ఇక్కడ సీనియర్ హీరోలకు లక్కీ హీరోయిన్గా మారారు. స్టార్ హీరోలతో జోడీ కట్టిన బ్యూటీ శృతి హాసన్ తెలుగులో పవన్ కల్యాణ్, రవితేజ, చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో జత కట్టారు. అంతకు ముందు వరకు ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోలతో శృతిహాసన్ నటించిన చిత్రాలు సూపర్ హిట్ కావడం విశేషమనే చెప్పాలి. పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్' చిత్రాల్లో, రవితేజతో 'బలుపు', 'క్రాక్' చిత్రాల్లో నటించగా ఇవి మంచి విజయాలను సాధించాయి. ఇక ఈ బ్యూటీ ఈ ఏడాది నటించిన నాలుగు చిత్రాలు సూపర్ హిట్ కావడం విశేషం. శృతి ఉంటే సినిమా హిట్టే చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణతో వీరసింహారెడ్డి చిత్రాల్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించారు. ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయ్ నాన్న చిత్రంలో శృతిహాసన్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ చిత్రానికీ మంచి ఆదరణ లభించింది. తాజాగా ప్రభాస్కు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ బాక్సాఫీస్ వద్ద రిలీజై వసూళ్ల మోత మోగిస్తోంది. దీంతో తెలుగు చిత్రాల్లో శృతి ఉంటే సక్సెస్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రవితేజతో మరోసారి జతకట్టబోతున్నారు. అదేవిధంగా కన్నడంలో ఒక చిత్రం, ఆంగ్లంలో ఓ చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చదవండి: ధనుష్ మూడో సినిమా! సౌందర్య రజనీకాంత్ కామెంట్స్ వైరల్.. -
Salaar Movie Stills: ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్
-
రాకీ భాయ్తో ‘సలార్’భామ రొమాన్స్
ఇంద్ర మహేంద్రజాలం సినిమా. లక్ అనేది ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. వరించినప్పుడు సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉంటుంది. నటి శృతిహాసన్ పరిస్థితి ఇదే. సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటీమణుల్లో ఈమె ఒకరు. ఈ బ్యూటీ చర్యలన్నీ నిర్భయంగా ఉంటాయి. వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగానే శృతిహాసన్ బాణీ ఇదే. తమిళంలో కంటే తెలుగులో అధిక హిట్ చిత్రాలలో నటించిన ఈ బ్యూటీకి మొన్నటి వరకూ సలార్ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 22న సలార్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో ఒక్క ఆంగ్ల చిత్రం మాత్రమే చేతిలో ఉన్న నటి శృతిహాసన్కు నెక్ట్స్ ఏమిటి? అనే ప్రశ్న తలెత్తింది. అలాంటి ఇప్పుడు ఏకంగా రెండు చిత్రాల అవకాశాలు తలుపు తట్టాయి. తెలుగులో అడవి శేష్ సరసన ఒక చిత్రంలో నటించనున్నారు. ఇక తాజాగా మరో పాన్ ఇండియా చిత్రంలో నాయకిగా నటించే అవకాశం వరించింది. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్తో జత కట్టబోతున్నారు. కేజీఎఫ్ సీక్వెల్ తరువాత చిన్న గ్యాప్ తీసుకుని యాష్ నటిస్తున్న ఈ చిత్రానికి టాక్సీ అనే టైటిల్ను కూడా ఇటీవలే ప్రకటించారు. కేవీఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం యశ్కు 19 చిత్రం కావడం గమనార్హం. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. కాగా అందులో నటి సాయిపల్లవి ఒకరుగా ఇప్పటికే ప్రచారంలో ఉంది.తాజాగా మరో కథానయకిగా శృతిహాసన్ ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇక మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోందని సమాచారం. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్నట్లు తెలిసింది. -
అడివిశేష్తో జోడీ కట్టనున్న శృతి హాసన్
అడివి శేష్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే షార్ట్ ఫిల్మ్కు షాన్ దర్శకత్వం వహించారు. శేష్, శ్రుతి కాంబినేషన్లో ఆయన దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్లను హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరించనున్నాం. ప్రతి భాషకు ఉన్న ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ సినిమాను విభిన్నంగా చేస్తున్నాం. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
ఒంటిపై ఉన్న టాటూ కనిపించేలా ఫోటో షూట్.. శృతిహాసన్ పోస్ట్ అర్థమేంటి?
నటి శృతిహాసన్ ఎప్పుడూ సంచలనమే. లోక నాయకుడు కమలహాసన్ వారసురాలు అయిన ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడానికి ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. హిందీ చిత్రం లక్ ద్వారా కథానాయికగా పరిచయమైనా ఆ తర్వాత దక్షిణాది చిత్రాలకే పరిమితమయ్యారు. అలా ధనుష్ కు సరసన 3, సూర్య జంటగా 7ఆమ్ అరువు వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా విజయాలను అందుకున్నది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమంలోనే. తాజాగా ప్రభాస్కు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం కోసం యావత్ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. సలార్ చిత్రం డిసెంబర్ 22వ తేదీ ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. కాగా ప్రస్తుతం ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ నెటిజన్లను ఖుషి చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య తన బాయ్ఫ్రెండ్తో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె పేరుతో కూడిన టాటూను ఒంటిపై కనిపించేలా తీసుకున్న ఫొటోలను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అందులో తాను అన్నింటిని మరచి బయటకు రావాలని కోరుకుంటున్నానని, ఇకపై తాను లేచి నిలబడడం నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. తన విషయాలను తన స్టైల్లో చేస్తానని ఇది తన రహదారి లేదా బైపాస్ అని శృతిహాసన్ పేర్కొన్నారు. దీంతో శృతిహాసన్ మాటల్లో అర్థం ఏమిటి రామా అంటూ ఆమె అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
ప్రియుడిని ముద్దుల్లో ముంచెత్తిన శృతి హాసన్
సాధారణంగా దీపావళి పర్వదినం ప్రజల్లో నూతనోత్సాహాన్ని, కాంతులను విరజిమ్ముతుంది. అయితే ఈ దీపావళి ఈ ప్రేమ జంటలో వెలుగు తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. స్వేచ్ఛ అనే పదానికి మారుపేరు శృతిహాసన్. ఈమె పెరిగిన వాతావరణం అలాంటిది. తండ్రి కమలహాసన్ తమకు స్వేచ్ఛ కల్పించారని ధైర్యంగా చెప్పే శృతిహాసన్ నటిగానూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇంకా చెప్పాలంటే తమిళ నటి ఐనా తెలుగులోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తోంది. హీరో ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్లో నటించిన శృతిహాసన్ ఆ చిత్రం అందించే రిజల్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. గతంలో ఇద్దరికి బ్రేకప్ చెప్పిన శృతిహాసన్ తాజాగా శాంతను హజారిక అనే విజువల్ ఆర్టిస్ట్తో ప్రేమలో పడింది. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను హజారికకు ప్రేమతో ముద్దులు పెట్టిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో వీరిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లెప్పుడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: ఐశ్వర్య రాయ్పై రజాక్ అసభ్యకరమైన మాటలు.. ఫైర్ అవుతున్న ఇండియన్స్ -
నాన్న సలహాలు పాటించలేను: శృతిహాసన్
తమిళసినిమా: బ్రెయిన్ చెప్పింది బ్లైండ్గా ఫాలో అయ్యే నటి శృతిహాసన్. విశ్వ నటుడు కమల్ హాసన్ వారసురాలు. అయినా ఈమె భావాలు వేరేగా ఉంటాయి. అయితే ఈమె తండ్రికి తగ్గ కూతురే. ఆయన మాదిరిగానే బహుముఖ ప్రజ్ఞ కలిగిన నటి. సంగీత దర్శకురాలిగా పరిచయమై, ఆ తర్వాత కథానాయకిగా, గాయకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటిగా ముందు బాలీవుడ్లో పరిచయమై, తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ను దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకున్నారు. తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఏళామ్ అరివు చిత్రానికి కథానాయకిగా పరిచయం అయ్యారు. అలా తొలి చిత్రంలోనే బలమైన పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు. అయితే ఎందుకనో శృతిహాసన్ను తమిళ చిత్ర పరిశ్రమ పెద్దగా ఆదరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఈమెకు చెప్పుకోదగ్గ మంచి విజయాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్లో శృతిహాసన్ కథానాయకిగా నటిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 22వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శృతిహాసన్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు ప్రభాస్కు ప్రాముఖ్యత ఇస్తూ రూపొందించిన చిత్రం సలార్ అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర యూనిట్ తనను తనలానే ఉండేలా షూటింగ్ను అనుభవించేలా చేశారన్నారు. ఇది హిందీ చిత్రం డంకీ చిత్రానికి పోటీగా విడుదలవుతుండడం గురించి ఎలాంటి భయం లేదన్నారు. కారణం తమ చిత్రంపై తమకు నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హాలీవుడ్లో తాను నటిస్తున్న ది ఐ చిత్రం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. కాగా తనను కొందరు మంత్రగత్తె అంటూ తప్పుగా అర్థం చేసుకుంటారని, అయినా తాను దాన్ని గర్వంగానే భావిస్తానన్నారు. ఇకపోతే తన తండ్రి సలహాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తాయని, అయినప్పటికీ వాటిని తాను పాటించలేక పోతానని చెప్పారు. -
అన్నయ్య కోసం తమ్ముడు మార్చుకున్నాడు!
‘‘ఎలాంటి లెక్కలు వేసుకోకుండా నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. నా ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ, నాకు నచ్చింది వారికీ నచ్చుతుందనే భరోసా కల్పించారు. ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోసారి అది నిరూపితమవుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో నాని అన్నారు. నాని, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, శ్రుతీహాసన్, బాల నటి కియారా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ ఉంటుంది. అన్ని ఏజ్ గ్రూప్లకు నచ్చే సినిమాను కమర్షియల్ మూవీ అనుకుంటే..‘హాయ్ నాన్న’ మోస్ట్ కమర్షియల్ మూవీ. మా సినిమాను ముందు డిసెంబరు 21న రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే ఓ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు, తమ్ముడు అనుకున్న తేదీకే అన్నయ్య వేడుక (ప్రభాస్ ‘సలార్’ సినిమా విడుదలను పరోక్షంగా ఉద్దేశించి..) కూడా ఖరారైతే.. తమ్ముడు తేదీ మార్చుకుంటాడు’’ అన్నారు. ‘‘ఒక మంచి కథతో ‘హాయ్ నాన్న’ తీశాం. నా దర్శకత్వంలోని తొలి సినిమాయే పాన్ ఇండియా స్థాయిలో రూపొందడం హ్యాపీ’’ అన్నారు శౌర్యువ్. ‘‘ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు మోహన్, విజయేందర్ రెడ్డి. ‘‘కథకు తగ్గట్లే మ్యూజిక్ ఇచ్చాను’’ అన్నారు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
ఈ సినిమా నాకెంతో స్పెషల్: శృతి హాసన్
చేతిలో ఉన్నది తక్కువ చిత్రాలే అయినా ఆమె చేతిలో ఉన్నవన్నీ గన్ లాంటి చిత్రాలే.. అందుకే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ నటి అయ్యారు శ్రుతిహాసన్. ఈ బ్యూటీకి సంబంధించిన వార్తలెప్పుడూ కొత్తగా, ఆసక్తికరంగా ఉంటాయి. కాగా ప్రస్తుతం శ్రుతిహాసన్ ప్రభాస్కు జంటగా నటించిన సలార్ చిత్రం విడుదల తేదీ వెల్లడైంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సలార్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక నాని కథానాయకుడిగా నటిస్తున్న హాయ్ నాన్న చిత్రంలో శ్రుతి హాసన్ ముఖ్య భూమికను పోషిస్తున్నట్లు సమాచారం. ఆమె నటిస్తున్న మరో హాలీవుడ్ చిత్రం ది ఐ. ఈ చిత్రమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ హాలీవుడ్ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డుల కేటగిరీల్లో నామినేట్ కావడం విశేషం. ది లాస్ట్ కింగ్డమ్ చిత్రం ఫేమ్ మార్క్ రౌళి కథానాయకుడిగా నటించిన ఇందులో ఆయనకు జంటగా శ్రుతిహాసన్ నటించారు. పర్యాటక పరిరక్షణ ఇతివృత్తంతో రూపొందిన ది ఐ చిత్రం లండన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైందని శ్రుతి ట్విటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా గ్రీక్ అంతర్జాతీయ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శింపబడడంతో పాటు అవార్డుల కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపారు. అలాంటి చిత్రంలో తాను నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రం తన కెరీర్లో ప్రత్యేకమన్నారు. ఈచిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శ్రుతిహాసన్ పేర్కొన్నారు. So honoured to have been a part of this beautiful story THE EYE which has been nominated for best director and best cinematographer at the Greek international film festival and the best film at the London independent film festival ! This film was made with love and care not only… pic.twitter.com/3T5dkxi8oM — shruti haasan (@shrutihaasan) October 4, 2023 చదవండి: బిగ్బాస్కు వార్నింగ్ ఇస్తున్న శివాజీ.. ఇష్టం లేకపోయినా త్యాగం చేసిన శుభశ్రీ, అతడివల్లే! -
కూతురితో చేతులు కలపనున్న కమల్ హాసన్.. త్వరలోనే..
విశ్వనటుడు కమల్ హాసన్, ఆయన కూతురు.. నటి, గాయని, సంగీత దర్శకురాలు శ్రుతిహాసన్ల కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ క్రేజీ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే మొదలైంది. కానీ అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇది వారి అభిమానులను తీవ్ర నిరాశ పరిచిందనే చెప్పాలి. అలాంటి వారికి గుడ్న్యూస్.. తాజాగా కమల్ హాసన్, శ్రుతి హాసన్ కలిసి ఒక మ్యూజికల్ ఆల్బమ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని శనివారం నాడు మీడియా ద్వారా వెల్లడించారు. శ్రుతిహాసన్కు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు షీ ఈజ్ ఏ హీరో, ఎడ్జ్.. ఇలా రెండు ఆల్బమ్లు చేశారు. కాగా మూడవ ఆల్బమ్ను తన తండ్రి కమల్ హాసన్తో కలిసి చేయబోవడం విశేషం. ఇటీవల దుబాయ్లో జరిగిన ఓ అవార్డు వేడుకలో కమల్ హాసన్ ఈ మ్యూజిక్ ఆల్బమ్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మరో పక్క బిగ్బాస్ రియాల్టీ గేమ్ షోకు హోస్ట్గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు శ్రుతిహాసన్ తెలుగులో ప్రభాస్ సరసన నటిస్తున్న సలార్ చిత్రాన్ని పూర్తి చేసి హీరో నాని 'హాయ్ నాన్న' చిత్రంలో నటిస్తున్నారు. ఎన్నై కేళుంగళ్ అనే టీవీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి కమల్ హాసన్తో కలిసి రూపొందించనున్న మ్యూజిక్ ఆల్భమ్ గురించి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. చదవండి: ఏడేళ్లుగా వాయిదా పడుతూ విడుదల రేసులోకి వచ్చిన విక్రమ్ సినిమా -
రంగారెడ్డి: యూత్ ఫెస్టివల్లో శ్రుతిహాసన్ సందడి (ఫోటోలు)
-
కున్నూర్లో హాయ్ నాన్న
కున్నూర్కు మకాం మార్చారు నాని. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతూ, నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాని కూతురి పాత్రను కియారా ఖన్నా చేస్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కున్నూర్లో ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని హీరో నాని వెల్లడించారు. నానీతో పాటు ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శౌర్యువ్. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్. -
మూడు రోజులు.. మూడు భాషలు
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్ గా, పృధ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సలార్’ తొలిపార్టు ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రభాస్, ప్రశాంత్ అండ్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్తో బిజీగా ఉంటున్నారు. రీసెంట్గా ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాకు బెంగళూరులో డబ్బింగ్ చెప్పారట ప్రభాస్. ఈ సినిమాలో ఆద్య అనే జర్నలిస్ట్ పాత్రలో శ్రుతీహాసన్ నటిస్తున్నారని ప్రచారం సాగింది. అయితే ఈ చిత్రంలో ఆమెది జర్నలిస్ట్ పాత్ర కాదని, టీచర్ ఆద్య పాత్ర అని తాజాగా తెరపైకి వచ్చింది. కాగా హిందీ, తెలుగు, తమిళంలో మూడు రోజుల్లో మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పారు శ్రుతీహాసన్. -
ఖర్మ ఎవరినీ విడిచిపెట్టదు: శృతిహాసన్
ఆత్మవిశ్వాసం కలిగిన నటీమణుల్లో శృతిహాసన్ ఒకరు అని చెప్పవచ్చు. చర్యలు చాలా బోల్డ్గా ఉంటాయి అయితే వాటిని సమర్థించుకోవడానికి గట్స్ కావాలి. అలాంటి గట్స్ మెండుగా ఉన్న నటి శృతిహాసన్. ఈ బ్యూటీ లోకనాయకుడు కమల్ హాసన్ నటి సారికల వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఒక్క ప్లస్ పాయింట్ తోనే శృతిహాసన్ నటిగా నిలదొక్కుకోలేదు. అందుకు తన టాలెంట్ను ఉపయోగించుకొని కథానాయకిగా రాణిస్తున్నారు. హిందీ, తమిళం భాషల కంటే తెలుగులోనే మంచి విజయాలను, పేరును తెచ్చుకున్న నటి శృతిహాసన్. నిజానికి తమిళంలో నటించాలనే ఆశ ఈమెకు చాలానే ఉంది. ఎందుకనో ఇక్కడ దర్శక నిర్మాతలు శృతిహాసన్ను పట్టించుకోవడం లేదు. సరైన సక్సెస్లు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈమె తమిళంలో నటించిన చివరి చిత్రం లాభం. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన పాన్ ఇడియా చిత్రం సలార్లో నటిస్తున్నారు. దీంతోపాటు హాయ్ నాన్న అనే చిత్రంలోని శృతిహాసన్ నటిస్తున్నారు. అదేవిధంగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రం కూడా చేస్తున్నారు. కాగా హేతువాది కమలహాసన్ కూతురు అయిన శృతిహాసన్కు మాత్రం కర్మ సిద్ధాంతాలపై నమ్మకం ఎక్కువ. ఈమె ఇన్ స్ట్రాగామ్లో తరచూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. కాగా శృతిహాసన్ ప్రేమ వ్యవహారం గురించి రకరకాల వదంతులు దొర్లుతుంటాయి. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఈమె ఇటీవల ఖర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. ఆమె ఇన్స్ట్రాగామ్లో ‘కొందరు తమ గోతులను తవ్వి దాటడానికి తయారవుతున్నారు. దాన్ని తాను ప్రశాంతంగా గమనిస్తున్నాను. మనం మన పనిని చేసుకుంటూ పోవాలి ఏదేమైనా ఖర్మ కచ్చితంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ఆటను మాత్రం చూడండి’ అని పేర్కొన్నారు. -
నెటిజన్ వింత ప్రశ్న.. గట్టిగానే ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటూ అప్పుడప్పుడు చాలా ఫన్ చేస్తూ ఉంటుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్స్తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చిట్ చాట్ నిర్వహించింది ముద్దుగుమ్మ. ఈ చిట్ చాట్లో నెటిజన్స్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. హద్దులు మీరి ప్రశ్నలు వేస్తుంటారు. అలా ప్రశ్నించిన ఓ నెటిజన్కు తనదైన శైలిలో కౌంటరిచ్చింది శృతిహాసన్. కొందరు నెటిజన్స్ చిన్నప్పటి ఫోటో పెట్టమని అడగ్గా.. మరొకరు ఎర్ర డ్రెస్సులో ఉన్న ఫోటో.. అలాగే బాయ్ ఫ్రెండ్ శంతన హజారికాతో ఉన్న ఫోటో పెట్టమని అడిగారు. అలా అన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రుతి హాసన్కు.. ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్నవేశాడు. నీ పాదాల ఫోటో పెట్టు పెట్టు అని అడిగాడు. అయితే అతనికి శృతి తనదైన శైలిలోనే స్పందించింది. ఏదో ఒక ఏలియన్ను పోలిన పాదాల ఫోటోను పెట్టింది. దీంతో నెటిజన్కు వింత ప్రశ్నకు తగిన బుద్ది చెప్పింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
కూతురికి కమల్ సర్ప్రైజ్
సమయానుకూలంగా మారిపోయే నటుడు కమలహాసన్. ఈయనలో గొప్పనటుడితో పాటు రాజకీయనాయకుడు ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతకుమించి గొప్ప తాత్వికుడు, ప్రేమికుడు ఉన్నారు. ప్రేమకు నిర్వచనాలు చాలానే ఉన్నాయి. అది ఎవరితోనైనా ఎప్పుడైనా పంచుకోగలిగినవారే పరిపూర్ణ మనిషి అవుతారు. కమలహాసన్ పెద్దల్లో పెద్దగా చిన్నవాళ్లలో చిన్నవాడిగా మారిపోతుంటారు. అందుకు చిన్న ఉదాహరణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరులవుతున్న వీడియో. పులి కడుపున పులిపిల్లే పుడుతుంది అనడానికి ఒక ఉదాహరణ శ్రుతిహాసన్. తండ్రి వారసురాలుగా సినీ రంగప్రవేశం చేసిన శ్రుతిహాసన్ ఇక్కడ తనను నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలుగా పలు కోణాల్లో ఆవిష్కరించుకున్నారు. తన తండ్రి అన్నా, ఆయన చిత్రాలు అన్నా ఇష్టపడే శ్రుతిహాసన్ తాజాగా కమలహాసన్ నాలుగు దశాబ్దాల క్రితం కథానాయకుడిగా నటించిన విక్రమ్ చిత్రంలో ఇళయరాజా సంగీతాన్ని అఃదించీన విక్రమ్ విక్రమ్ అనే థీమ్ సాంగ్ను ఎంతో తన్మయత్వంతో ఆస్వాదిస్తూ రిథమిక్గా హావభావాలను పలికిస్తూ ఉండగా హఠాత్తుగా చివరలో కమలహాసన్ ఎంట్రీ ఇచ్చి చిరు దరహాసంతో హాయ్ చెప్పి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది ఆ తండ్రి కూతురు మధ్య ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. కమలహాసన్లో గొప్ప నటుడు లేక రాజకీయనాయకుడు కాకుండా ఒక కూతురిని ప్రేమించే తండ్రి మాత్రమే కనిపించడం విశేషం. -
మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!
తమిళసినిమా: ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతీహాసన్. ఈమె జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పవచ్చు. విశ్వనటుడు కమల్హాసన్ వారసురాలు అయిన ఈమె హిందీ చిత్రంతో కథానాయకిగా నట జీవితాన్ని ప్రారంభించి ఆపై తెలుగు, తమిళం అంటూ తన స్థాయిని విస్తరించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తెలుగులో శ్రుతీహాసన్ లక్కీ హీరోయిన్. దాదాపు అక్కడ సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్కు జంటగా సలార్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో త్వరలో తిరిగి రావడానికి ముస్తాబవుతుంది. కాగా శ్రుతీహాసన్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు అన్ని సామెత మాదిరి శ్రుతీహాసన్ సినీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరికీ తోచింది వారు రాస్తుంటారు. ప్రచారం చేస్తుంటారు. (చదవండి: కోలీవుడ్ సూపర్స్టార్ ఎవరు?) ఇవి కూడా ఎవరూ ఎలాంటి ప్రశ్న వేసినా చాలా బోల్డ్గా బదులిస్తుంటారు తన బాయ్ఫ్రెండ్తో కూడా బహిరంగంగా తిరిగే నటి శ్రుతీహాసన్. ఎందుకంటే ఈమె పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. తమ తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, అలాగని వారికి గౌరవానికి తలవంపులు తెచ్చే ఎలాంటి పనిని తాను చేయనని చెబుతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తరుచూ అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటించే శ్రుతీహాసన్ ఇటీవల ఇన్స్ట్రాగామ్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చి వారిని ఖుషీ చేశారు. ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు మద్యం తాగుతారా? అన్న ప్రశ్న లేదు తాను మద్యం తాగాను, మాదకద్రవ్యాలు కూడా తీసుకోను అంటూ బదులిచ్చారు. అంతేకాకుండా తాను జీవితాన్ని హుందాగా గడిపే నటినని స్పష్టం చేసింది. దటీజ్ శ్రుతిహాసన్ అని మరోసారి నిరూపించుకున్నారు. -
మా నాన్న నా బెస్ట్ హ్యూమన్: శ్రుతీహాసన్
‘మా నాన్న నా బెస్ట్ హ్యూమన్’ అన్నారు శ్రుతీహాసన్. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తండ్రి కమల్హాసన్ గురించి శ్రుతి చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► మా చైల్డ్హుల్డ్ చాలా కంఫర్టబుల్. నాన్నగారు నన్ను, చెల్లి (అక్షరా హాసన్)ని చెన్నైలో మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించారు. ఆ తర్వాత అమెరికాలో బెస్ట్ కాలేజీలో చేర్చారు. మంచి ఫుడ్, మంచి బట్టలు, ఖరీదు గల కార్లు, మంచి ఇల్లు... ది బెస్ట్ ఇచ్చారు. 21ఏళ్లకే నేను హీరోయిన్ అయి, సంపాదించడం మొదలుపెట్టాను. నిజానికి నాన్న చాలా స్వేచ్ఛ ఇస్తారు. ఆయనతో ఏ విషయాన్నయినా చెప్పుకునేంత స్వేచ్ఛ మాకుంది. తండ్రి మీద ప్రేమతో పాటు చాలా గౌరవం కూడా ఉంటుంది కాబట్టి... ఆ గౌరవంతో మాకు మేముగా కొన్ని హద్దులు పెట్టుకుంటాం. మన నాన్న మనకు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఆ కూతురికి అంతకన్నా కావాల్సినది ఏముంటుంది? ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు.. నా ఫేవరెట్ హ్యూమన్ కూడా. ► ఎవరి దగ్గరైతే జీవితం గురించి చాలా విషయాలు నేర్చుకుంటామో, ఎవరైతే మనల్ని బాగా నవ్విస్తారో ఆ వ్యక్తే మన తండ్రి అయితే ఇక అదే పెద్ద ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం దక్కి నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎప్పటికీ నాకు ‘డియరస్ట్ డాడ్’గా ఉంటున్నందుకు మా నాన్నకి థ్యాంక్స్. ‘హ్యాపీ ఫాదర్స్ డే’. ► బర్త్ డే, ఫాదర్స్ డే.. అంటూ ముందుగా ప్లాన్ చేసుకుని మా ఇంట్లో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయం. సో.. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మా నాన్నకు శుభాకాంక్షలు చెబుతాను. మా నాన్నగారు సాధించిన విజయాలకు నేనెప్పటికీ గర్వపడుతుంటాను. ఇప్పటికీ ఆయన అదే ఎనర్జీతో కొనసాగుతున్నారు. ప్రొఫెషన్ అంటే అదే ప్యాషన్. ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. మా నాన్న పరంగా నేను గర్వించే విషయాల్లో ఇవి. జీవితం పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్ నాకే కాదు... నాలాంటివారికెందరికో స్ఫూర్తి. మా నాన్నలా తమ ఇళ్లలో సమానత్వాన్ని పాటిస్తూ, ప్రోత్సహిస్తున్న గుడ్ ఫాదర్స్ అందరికీ ఈ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. -
కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సిస్టర్ ఆఫ్ శంకర్ కమర్షియల్ మూవీస్లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. తొలి అడుగు ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. డాటర్ ఆఫ్ భగవత్ అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కేరాఫ్ జైలర్ టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. వెల్కమ్ టు టాలీవుడ్ వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. వీరే కాదు... కమల్హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు. -
ముంబై టు కూనూర్
గోవా టు కూనూర్ వయా ముంబై... ఇది నాని కొత్త సినిమా రూట్ మ్యాప్. నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్ కీ రోల్ చేస్తున్నారు. తొలుత గోవాలో ఓ లాంగ్ షెడ్యూల్ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇటీవల ముంబైలో మరో షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం కూనూర్ వెళ్లనున్నారు. ఇక్కడి లొకేషన్స్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్. -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా: స్టార్ హీరోయిన్ కామెంట్స్
నటి శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తనకు అనిపించింది బయటకు చెప్పే బోల్డ్ అండ్ బ్యూటీ ఈమె. స్వయంకృషితో ఎదిగిన నటి శ్రుతిహాసన్. నిజ జీవితంలోనూ ఆమె ఒక సంచలనమే. ప్రముఖ నటుడు కమల్హాసన్ వారసురాలైనా.. ఆయన పేరు ఏ విధంగానూ వాడుకోవడానికి ఇష్టపడని నటి. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అయితే తన తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తను మాత్రం వారి నుంచి ఎలాంటి ఆర్థికసాయాన్ని ఇప్పటి వరకు కోరలేదని బహిరంగంగానే చెప్పింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రుతిహాసన్.. ఇటీవల తెలుగులో నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. ఇకపోతే హీరో హీరోయిన్ల పారితోషికం విషయంలో సమానత్వం కోసం కొందరు హీరోయిన్లు బహిరంగంగానే తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. హీరోలకు తామేమి తక్కువ కాదని చిత్ర విజయాల విషయంలో తమ భాగం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నటి శ్రుతిహాసన్ కూడా పేర్కొనడం విశేషం. (ఇది చదవండి: నటుడి రెండో పెళ్లి.. మొదటి భార్య పోస్టులు వైరల్..) ఆ మధ్య ప్రియాంక చోప్రా తన కెరీర్లో 20 ఏళ్ల తర్వాత హీరోకు సమానంగా తమ పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన నటి శ్రుతిహాసన్ హీరోయిన్లకు హీరోలకు సమానంగా ఇవ్వాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్లో హీరోకు సమానంగా అందుకున్నారని.. ఇక్కడ కూడా ఆ రోజు రావాలని తాను ఎదురుచూస్తున్నానని పేర్కొంది. -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను: శ్రుతీహాసన్
‘‘ఓ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ సమానమైన పారితోషికాన్ని అందుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఫ్రాన్స్లో ప్రస్తుతం 76వ కాన్స్ చలన చిత్రోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు శ్రుతీహాసన్. ఈ సందర్భంగా ‘హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకోవడానికి నాకు రెండు దశాబ్దాలు పట్టింది’’ అన్న ప్రియాంకా చోప్రా మాటలపై మీ స్పందన ఏంటి? అన్న ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. ఈ విషయంపై శ్రుతీహాసన్ స్పందిస్తూ– ‘‘ప్రియాంకా చోప్రా అద్భుతం సాధించారు (హాలీవుడ్లో హీరోకి సమానంగా పా రితోషికం అందుకున్న విషయాన్ని ఉద్దేశించి). మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం అనే అంశం గురించి కనీసం చర్చ కూడా లేదు. కానీ హీరోలతో పాటుగా హీరోయిన్లకి కూడా సమాన వేతనం లభించే రోజు రావాలని ఎదురు చూస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘గతంలో నేను కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్లో పా ల్గొన్నాను. ఈసారి నేను నటించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసం కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నాను. విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్న కాన్స్ వేడుకల్లో దేశం తరఫున నేను ఓ ప్రతినిధిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
తొలిసారి కీ రోల్ చేస్తున్న శ్రుతి హాసన్.. నాని సినిమాలో!
సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’లో కథానాయికగా అలరించారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఇంగ్లిష్ చిత్రం ‘ది ఐ’ కూడా ఉంది. తాజాగా నాని సినిమాలో కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతి. ఇప్పటివరకూ ప్రత్యేక పాటల్లో కనిపించిన ఈ బ్యూటీ కీ రోల్స్ చేయలేదు. సో.. నాని సినిమాలో చేయనున్నది శ్రుతీకి తొలి కీలక పాత్ర అవుతుంది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఇక నాని సరసన కథానాయికగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, కెమెరా: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ ఈవీవీ. -
నాని30లో హీరోయిన్ శ్రుతి హాసన్.. మరి మృణాల్ సంగతి?
నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన నటిస్తున్న నాని30పై భారీ అంచనాలు ఉన్నాయి.నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.ఇందులో హీరోయిన్ శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చిన శ్రుతిహాసన్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రతో మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. -
కమలహాసన్ నాస్తికుడు..శ్రుతిహాసన్కు దైవ భక్తి ఎక్కువట!
నటి శ్రుతిహాసన్ విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ బ్రాండ్ను ఆమె సినీరంగప్రవేశానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆ తరువాత తన స్వశక్తితోనే కథానాయకిగా ఎదిగారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అంతేకాదు తాను తన కాళ్ల మీదే నిలబడ్డానని, ఆర్థికపరంగా ఎప్పుడూ తన తల్లిదండ్రులను సాయం కోరలేదని చెప్పారు. తనకు తన తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారని చెప్పే శ్రుతిహాసన్ ఇప్పటికీ స్వతంత్రభావాలతోనే సినీ రంగంలో నటిగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ బహుబాషా నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగులో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. తమిళంలో ఇంతకుముందు విజయ్ సరసన పులి, అజిత్కు జంటగా వేదాళం, సూర్యతో ఏళాం అరివు, విశాల్ సరసన పూజై వంటి చిత్రాల్లో నటించినా ఎందుకనో ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. కాగా త్వరలో ఒక తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. ఆ చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా కమలహాసన్ పక్కా నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధ భావాలు కలిగిన నటి శ్రుతిహాసన్. తనకు దైవభక్తి ఎక్కువని చెప్పారు. అలాగని దేవాలయాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపనని, మనసు ఆలయం అని భావిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే తన ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేసే విధంగా శ్రుతిహాసన్ తన వీపు పైభాగంలో శ్రుతి అని తన పేరుతో పాటు కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును టాటూ వేసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆయనే నా ఫస్ట్ క్రష్ : శ్రుతిహాసన్
సంచలనానికి మరో పేరు ఉంటే అది నటి శ్రుతిహాసనే అవుతుంది. విశ్వ నటుడు కమలహాసన్ వారసురాలు అయిన ఈమె తొలుత సంగీత దర్శకురాలిగా తన తండ్రి నటించిన ఉన్నైప్పోల్ ఒరువన్ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ తరువాత నటిగా తెరంగేట్రం చేశారు. హిందీలో లక్ చిత్రం, తెలుగులో అనగనగా ఒక ధీరుడు చిత్రాల్లో నటించిన తర్వాతే కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ విధంగా శ్రుతిహాసన్కు తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయాలు వరించాయి. ఇటీవల తెలుగులో ఈ బ్యూటీ నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన సోలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. మరో కొత్త చిత్రానికి సైన్ చేయకపోయినా శ్రుతిహాసన్ నిత్యం వార్తల్లో ఉంటారు. తన గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ నెటిజన్లకు బాగానే పని చెబుతుంటారు. అదేవిధంగా నిజాలను నిర్భయంగా చెప్పే నటి ఎవరైనా ఉన్నారంటే అది శ్రుతిహాసనే. తన ప్రియుడితో కలిసిన ఫొటోలను ధైర్యంగా సామాజిక మాధ్యమాలకు తెలియజేసే నటి ఈ బ్యూటీ. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రేమలో విఫలమైన శ్రుతి మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. కాగా ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తన తొలి క్రష్ నటుడు ఎవరన్న ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా హాలీవుడ్ నటుడు బ్రూస్లీ అని చెప్పారు. -
బ్లాక్ బాస్టర్ సినిమాలను వదులుకున్న హీరోయిన్లు వీళ్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. మూవీ ఆఫర్స్ టాలెంట్ తోనే కాదు...అదృష్టం వల్ల కూడా వరిస్తాయి. అలా అదృష్టం కారణాంగా గోల్డెన్ ఛాన్స్ అందుకుని సూపర్ హిట్స్ అందుకున్న హీరోయన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే కాల్షీట్స్ సర్ధుబాటు చేయలేక గోల్డెన్ ఆఫర్స్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దదే.. ఇండస్ట్రీ హిట్స్ సాధించిన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ముందుగా మరోకరిని పలకరించింది. ఆ భామలు నో చెప్పటంతో...ఈ హీరోయిన్స్ కి ఆఫర్ కాదు..ఏకంగా బంపరాఫర్ తగిలింది. 2018 లో విడుదలై బాక్సాపీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టించిన సినిమా గీత గోవిందం..ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా నటించారు. రూ.5 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 130 కోట్లు వసూళ్లు చేసింది. ఇక గీత గోవిందం సక్సెస్ తో హీరోయిన్ గా రష్మిక ఇమేజ్ టోటల్ గా మారిపోయింది. ఈ ఒక సినిమాతో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. అసలు గీతగోవిందం సినిమాకి ముందుగా మూవీ మేకర్స్ రష్మిక మందన్న అనుకోలేదట. విజయ్ దేవర కొండకి జోడిగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో రాశీ ఖన్నా గీత గోవిందం వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఆఫర్ రష్మిక మందన్న దగ్గరకి వెళ్లింది. రాశీఖన్నా గీత గోవిందం సినిమా ఒక్కటే కాదు...2019లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ఎఫ్2 లో హీరోయిన్ ఛాన్స్ కూడా వదులుకుంది. ఎఫ్2 సినిమాలో తమన్నా రోల్ కి ముందుగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే ఆ రోల్ రాశీ ఖన్నా చేయటానికి ఇంట్రెస్ట్ చూపించక మిస్ చేసుకుంది. ఇక లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం..ఈ సినిమాలో సమంత కంటే ముందు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. అనుపమ ఇంకా అమ్మ కూచి అని ఫీలైన సుకుమార్ సమంతను ఫైనల్ చేశాడు. అలా అనుపమ రంగస్థలం లో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ పల్లెటూరి అమ్మాయి అయినా కాస్త గ్లామర్ గా కనిపిస్తది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన జానపద చిత్రం బాహుబలి...ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కి ముందుగా సోనం కపూర్ అనుకున్నారట. సోనమ్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఆ ఛాన్స్ తమన్నా అందుకుంది. ఇలాగే హీరో నాని జెర్సీ, సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమాల్లో హీరోయిన్ ఆఫర్ శృతిహాసన్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మిస్ చేసుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్ర కోసం శాలిని పాండే కంటే ముందు మలయాళనటి పార్వతీ నాయర్ అనుకున్నారు. ఆ పాత్ర కాస్త బోల్డ్ ఉండటంతో ఆ బ్యూటీ వెనకడుగు వేసింది. అలాగే కుమారి 21ఎఫ్ మూవీ లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ కంటే ముందు చాందిని చౌదరి అనుకున్నారు. ఆ బోల్డ్ క్యారెక్టర్ చేయటం ఇష్టం లేక చాందిని ఆ మూవీ ఆఫర్ వదలుకుంది. . కానీ కుమారి 21 ఎఫ్ తో హెబ్బా పటేల్ కు మంచి గుర్తింపు లభించింది., ఇక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక...క్యారెక్టర్స్ నచ్చక చాలా మంది హీరోయిన్స్ సూపర్ హిట్ మూవీస్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. -
శాంతను అలాంటివాడు.. బాయ్ఫ్రెండ్పై శ్రుతిహాసన్ కామెంట్స్
హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ హీరో కమల్హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ మధ్య కెరీర్ కాస్త అదుపు తప్పినా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే శ్రుతి తన పర్సనల్ విషయాలను ఎప్పడూ సీక్రెట్గా ఉంచలేదు. బాయ్ఫ్రెండ్ శాంతను హజారికతో రిలేషన్లో ఉన్నట్లు పేర్కొన్న శ్రుతిహాసన్ అతనితోనే కలిసి ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నివసిస్తుంది. సమయం వచ్చినప్పుడల్లా ప్రియుడు శాంతనుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తాజాగా మరోసారి శాంతను గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 'నాకు బయటకు వెళ్లి తినడం అంటే చాలా ఇష్టం. నేను, శాంతను తినడం కోసం బతుకుతుంటాం. తినే టైంలో ఎన్నో విషయాలు చర్చించుకుంటాం. నాలాగే భోజన ప్రియుడ్ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. తను నా లైఫ్లోకి వచ్చినందుకు నేనంతో లక్కీ' అంటూ బాయ్ఫ్రెండ్పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. -
ప్రభాస్ సలార్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న శ్రుతిహాసన్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. శ్రుతిహాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా హీరోయిన్ శ్రుతిహాసన్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ మేకర్స్కు కృతఙ్ఞతలు తెలిపింది.'థాంక్యూ ప్రశాంత్ సార్.. నన్ను మీ ఆధ్యాగా మార్చినందుకు. మీ అందరితో కలిసిసినిమాలో పనిచేయడం చాలా హ్యాపీ' అంటూ శ్రుతి తన పోస్ట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కూడా గ్యాప్ లేకుండా షూటింగ్ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఏప్రిల్ నాటికి షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేయనున్నారని తెలుస్తుంది. -
నా గుండె నిండా, ప్రతి ఆలోచనలోనూ నువ్వే..: శృతిహాసన్
నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకుంటున్న హీరోయిన్ శృతిహాసన్. తమిళంలో ఈమె చివరిగా నటించిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే శృతిహాసన్కు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. అంతకుమించి మంచి విజయాలు ఉన్నాయి. ఇటీవల చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ సరసన నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు సూపర్హిట్ అయ్యాయి. ఈ రెండు ఒకేసారి విడుదలై రెండూ సక్సెస్ సాధించి తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల జాబితాలో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్తో సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే శృతిహాసన్.. శాంతను హజారిక అనే ఆర్టిస్ట్తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా శృతి తన ప్రియుడిని ఉద్దేశిస్తూ ఇన్స్ట్రాగామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ‘నువ్వు చాలా ఉత్తముడివి. నా హృదయం నీతోనే ఉంది. నా ప్రతి ఆలోచనలోనూ నువ్వే ఉన్నావు. నాకు వెలుగందించిన సూర్యుడివి కూడా నువ్వే. ఈ ప్రపంచంలో అదృష్టవంతురాలిని నేనే‘ అని రాసుకొచ్చింది. ఇందుకు ఆమె ప్రియుడు శాంతను బదులుగా ట్వీట్ చేస్తూ ‘ నా ప్రేయసి నువ్వే. నా ప్రపంచం నువ్వే. నా సూర్యుడు నువ్వే. నా కడలి నువ్వే. నువ్వు చాలా ఉత్తమ యువతివి‘ అని పేర్కొన్నారు. వీరి ప్రేమ ముచ్చట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: ప్రెగ్నెన్సీ వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన సునీత -
ఓటీటీలోకి బాలయ్య 'వీరసింహారెడ్డి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా వీరసింహారెడ్డి ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీ+ హాట్ స్టార్ భారీగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో వీరిసింహారెడ్డి మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు. కాగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్,మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Seema Simham vetaa shuru🦁💥#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023 -
Shruti Haasan: ఆ ఏడాది నాకు అత్యంత గడ్డుకాలం: శృతిహాసన్
శ్రుతి హాసన్ పేరు సౌత్ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లోనూ అగ్రహీరోల సరసన నటించింది కోలీవుడ్ భామ. ఇటీవలే చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో అభిమానులను పలకరించింది. ఆ తర్వాత ప్రభాస్ సరసన సలార్లోనూ కనిపించనుంది. సౌత్లో దూసుకెళ్తున్న శృతి హాసన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో వెల్లడించింది. శ్రుతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్లో రాస్తూ.. '2012లో ఎదురైన కష్ట సమయాలను గుర్తు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ చిత్రాన్ని పంచుకుంది. ఈ చిత్రం 2012 నాటిది. ఇది వ్యక్తిగతంగా నాకు మంచి జరగలేదు. నా వృత్తిపరంగా చాలా మార్పులు జరుగుతాయని నాకు తెలియదు. అయితే ప్రజలకు దీని గురించి చెప్పాలనుకుంటున్నా. నా జీవితంలో అప్పుడు నకిలీ వైపే బలమైన గాలి వీచింది. అప్పుడు నాలో ఎప్పుడూ మండే మంటలో ఒక బాధ ఉంది. ఎల్లప్పుడూ నేను భవిష్యత్తు ఏదో వెతుకుతూ ఉండేదాన్ని. కలల కోసం ఇంకా ఏదో నేర్చుకోవాలి అని ఆలోచించేదాన్ని. నిశ్శబ్దం అనేది చాలా హింసాత్మకంగా ఉంటుది. ఇది నిజం' అంటూ పోస్ట్ చేసింది. 2012లో కష్ట సమయాలను గుర్తు చేసుకుంటూ గోత్ లుక్ని షేర్ చేసింది. కాగా.. శృతిహాసన్ ప్రశాంత్ నీల్ రాబోయే యాక్షన్ చిత్రం సాలార్లో ప్రభాస్ సరసన కనిపించనుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
ఈసారి బర్త్డేకి అలా కోరుకున్నా!
‘నిన్ను నిన్నుగా నువ్వు ప్రేమించుకోవడాన్ని మర్చి΄ోకు’’ అంటున్నారు శ్రుతీహాసన్. శనివారం (జనవరి 28) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతి. ‘‘నా జీవితం ఎంత గొప్పగా సాగుతోందో, మాటల్లో వర్ణించలేని ప్రేమను ఎంతగా ΄÷ందగలుగుతున్నానో (కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ని ఉద్దేశించి) అనే ఆనందమైన ఆలోచనలతో నిద్ర లేచాను. ప్రతి ఏడాదీ నా బర్త్ డే కేక్పై ఉన్న కొవ్వొత్తులను ఆర్పిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. కానీ ఈ ఏడాది మాత్రం నా కోసమే కాదు.. అందరి కోసం కోరుకున్నాను. అందరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలని, వారు కోరుకున్నది వారికి దక్కేలా పరిస్థితులు అనుకూలించాలని కోరుకుంటున్నాను. నిజం చె΄్పాలంటే... ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతూనే ఉంటుంది. ప్రతి బర్త్ డేకి వయసు సంఖ్య పెరగడం సహజం. ఆ అనుభవం రీత్యా కాస్త తెలివైనవాళ్ళం కూడా అవుతుంటాము (సరదాగా..). అలాగే ఈ ప్రపంచమనే యుద్ధంలో ప్రతిసారీ ఒంటరి సైనికుడిలా నెగ్గుకు రాలేమని కూడా అర్థం అవుతోంది. అయితే నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో తెలివైనవారు, సానుకూల దృక్పథంతో ఉన్నవారు ఉన్నందుకు నేనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. సో.. నీ ప్రత్యేకతను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి’’ అని రాసుకొచ్చారు శ్రుతీహాసన్. కాగా ఈ బర్త్ డేని శ్రుతీహాసన్ చాలా సందడిగా జరుపుకున్నట్లుగా ఫొటోలు చెబుతున్నాయి. ఈ వేడుకల్లో శ్రుతీ తల్లి సారిక, చెల్లి అక్షరాహాసన్లతో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ శంతను హజారికా, బాలీవుడ్ నటి కాజోల్ కూడా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయాని వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ఫిల్మ్లో శ్రుతి ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
'వీర సింహారెడ్డి' విజయోత్సవం..(ఫొటోలు)
-
ట్రోల్స్పై స్పందించిన గోపీచంద్ మలినేని
తనపై వస్తున్న ట్రోల్స్పై డైరెక్టర్ మలినేని గోపిచంద్ స్పందించారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో గోపిచంద్ మలినేని స్టేజ్ మాట్లాడుతూ శృతి హాసన్కు ఐ లవ్ యూ అని చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ రూమర్స్: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు! ఆ తర్వాత స్టేజ్పై మాట్లాడిన శృతి తెలుగు ఇండస్ట్రీలో తనకు ఓ అన్నయ్య ఉన్నారంటూ గోపీచంద్ గురించి చెప్పింది. వీర సింహారెడ్డి సక్సెస్ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించారు గోపిచంద్ మలినేని. ఈ సందర్భంగా శృతి హాసన్కు ఐ లవ్ యూ చెప్పడం, ఆ తర్వాత ట్రోల్స్ రావడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘శృతితో నాకు ఇది మూడో సినిమా. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి చేశాను. నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె. తను నాకు ఓ ఫ్యామిలీలో ఒక మనిషి లాగా. బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ మాది. చదవండి: రెండు రోజుల్లో మనోజ్ నుంచి స్పెషల్ న్యూస్, ఆసక్తి పెంచుతున్న ట్వీట్! నా వైఫ్తో కూడా తను చాలా క్లోజ్. నా కొడుకు సాత్విక్ అంటే శృతికి చాలా ఇష్టం. వాడికి తరచూ చాక్లెట్స్, గిప్ట్స్ తీసుకువస్తుంది. అందుకే ఆమె స్టేజ్పై నాకు అన్నయ్య అని చెప్పంది. ఆ తర్వాత నేను మాట్లడినప్పుడు తను చెప్పిన దానికి నా కన్సన్ చూపించాను. ఈ నేపథ్యంలో ఐ లవ్ యూ అని చెప్పాను. కానీ దాన్ని సోషల్ మీడియాలో అబ్బాయి-అమ్మాయి లవ్గా మార్చి వైరల్ చేశారు. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మాకు ఇది స్పెషల్ సంక్రాంతి!
‘‘బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడే వీరయ్య (చిరంజీవి పాత్ర పేరు) క్యారెక్టర్కి ఇలాంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకున్నాను. నా ఆలోచన, బాబీగారి ఐడియాలు చాలావరకూ మ్యాచ్ అయ్యాయి. నాన్నగారూ సలహాలు చెప్పారు’’ అన్నారు సుష్మిత కొణిదెల. చిరంజీవి, శ్రుతీహాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్ర చేశారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇందులో చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసిన ఆయన కుమార్తె సుష్మిత చెప్పిన విశేషాలు. ► బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడు వింటేజ్ చిరంజీవిగారిని చూపించాలన్నారు. అంటే.. అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ టైమ్ అన్నమాట. ఈ సినిమాలో ఆయనది ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్. సో.. కథ విన్నప్పుడే కాస్ట్యూమ్స్ని ఊహించేశా. నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి వింటేజ్ లుక్లో చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ యూత్కి కూడా నచ్చాలి కాబట్టి ఇప్పటి ట్రెండ్ని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాను. ► ‘రంగస్థలం’లో నా తమ్ముడు రామ్చరణ్కి నేనే డిజైన్ చేశాను. ఇప్పుడు నాన్నగారివి కూడా అలాంటి డ్రెస్సులే. కానీ చరణ్కంటే నాన్నగారే ఈ మాస్ కాస్ట్యూమ్స్లో సూపర్. అయితే చరణ్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను సిటీలో పెరిగాడు. అయినప్పటికీ ‘రంగస్థలం’లో ఆ కాస్ట్యూమ్స్లో బాగా ఒదిగిపోయాడు. నాన్నగారి అభిమానులుగా మేం మిగతా అభిమానులతో పాటు ఈలలు వేస్తూ, గోల చేస్తూ శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు థియేటర్లో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్తో కలిసి సినిమా చూశాం. ► ప్రస్తుతం నాన్న ‘బోళా శంకర్’కి డిజైన్ చేస్తున్నాను. ఇంకా రెండు వెబ్ సిరీస్లపై వర్క్ చేస్తున్నాం. మేం నిర్మించిన ‘శ్రీదేవి శోభన్బాబు’ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్పై నాన్నగారితో సినిమా నిర్మించాలని ఉంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే ఆయన ‘మంచి కథతో రా’ అన్నారు. మేం కూడా ఆ వేటలోనే ఉన్నాం. ► ఈ సంక్రాంతి స్పెషల్ అంటే.. మా తమ్ముడు తండ్రి కానుండటం. ఈ సమయం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాం. సో.. మాకిది స్పెషల్ సంక్రాంతి. ఉపాసనది డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏం ఆహారం తీసుకోవాలి? అనేది తనకు బాగా తెలుసు. మావైపు నుంచి మేం ఆమెను వీలైనంత హ్యాపీగా ఉంచుతున్నాం. పాప అయినా, బాబు అయినా మాకు ఓకే. కానీ నాకు, శ్రీజకు ఆడపిల్లలే. ఇంట్లో గర్ల్ పవర్ ఎక్కువైంది (నవ్వుతూ). అందుకే బాబు అయితే బాగుంటుందనుకుంటున్నాను. -
శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మెంటల్ హెల్త్ బాలేదని, ఆమె మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై శృతి స్పందించింది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ‘నా ఫ్లూ సమస్య ఇలా మారిందన్నమాట’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. ‘నా వైరల్ ఫివర్ కాస్తా ఇలా మెంటల్ హెల్త్గా బయటకు వెళ్లింది. నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఇలాంటి వాటి వల్లే వారి మానసిక సమస్యలను బయటకు చెప్పుకునేందుకు భయపడేలా చేస్తున్నారు. నా ఆరోగ్యం, మెంటల్ హెల్త్ బాగానే ఉన్నాయి. ఓ సారి వైరల్ ఫివర్ వచ్చింది అంతే. దాన్ని ఇలా చిత్రీకరించారు. బాగా ట్రై చేశారు. మీకూ అలాంటి సమస్యలు ఉంటే గనుక తప్పుకుండ థెరపిస్ట్ను కలవండి’ అంటూ శృతి మండిపడింది. కాగా శృతి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తానే స్వయంగా చెప్పినట్లు పలు బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఆమె తన మానసిక సమస్యలకు చికిత్స కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాయి. Nice try !! And Thankyou I’m recovering well from my viral fever pic.twitter.com/oxTYevcK1D — shruti haasan (@shrutihaasan) January 12, 2023 -
సైకాలజికల్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్!
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా ఆమె. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తనకున్న సైకాలజికల్ ప్రాబ్లమ్స్ను బయటపెట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కింది శృతి. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ‘నాకు మానసికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్ ఉన్నట్టుండి ఎక్కువగా ఉద్రేకపడతాను. కొన్ని విషయాల్లో సహనాన్ని కోల్పోయి ఆవేశపడతాను. నా సమస్యల గురించి బయటకు చెప్పడానికి మొదట భయపడ్డాను. ఈ మధ్య చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పేస్తున్నారు. దీంతో నాకూ కూడా నా మానసిక రుగ్మతల గురించి చెప్పాలి అనిపింది’ అని చెప్పింది. ‘అయితే ప్రస్తుతం నా మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాను. మానసిక రుగ్మతలను తగ్గించడానికి సంగీతం కూడా ఉపయోగపడుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే అది షూటింగ్ స్పాట్లో అయిన, ఇంట్లో అయిన వెంటనే కోపం వస్తుంది. చదవండి: అర్జున్ రెడ్డి ఆఫర్ వదులుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశా: హీరోయిన్ అలాంటి పరిస్థితి తీవ్రం అయితే వెంటనే థెరపీ చికిత్సకు వెళుతున్నాను. నా సమస్యలను నేను దాచాలనుకోవడం లేదు’ అని పేర్కొంది. అయితే మన సమస్యలను నిర్మోహమాటంగా బయటకు చెప్పేయాలన్నారు. దాచాలనుకుంటే ఆ సమస్యలు మరింత అధికం అవుతాయని, ఎవరేమనుకుంటారో అని భయపడుతుంటారంది. కానీ మన సమస్యల గురించి బయటకు చెప్పితే భారం తగ్గడమే కాదు సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందని శృతి చెప్పుకొచ్చింది. కాబట్టి సమస్య ఎలాంటిదైనా మనసు విప్పి చెప్పుకోండి అంటూ ఆమె సూచించింది. -
‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చించుకుంటున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. వీరసింహారెడ్డిపై ట్విటర్లో అటు పాజిటివ్..ఇటు నెగెటివ్ రెండు రకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ రొటీన్గా, సెకండాఫ్ యావరేజ్గా ఉందని, బాలయ్య మాస్ మిస్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..వీర సింహారెడ్డి మూవీతో మరోసారి బాలయ్య బాబు మాస్ జాతర షురూ అయిందని కొందరు చెబుతున్నారు. నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం చాలా బాగుందని చెబుతున్నారు. Review - #VeeraSimhaReddy 1st half routine rotta 2nd half " average '' Balayya masss miss ayyam 🤣🤭 Duniya Vijay 🤝🙌💥@shrutihaasan Okayish 2 Songs 💥✨️💃🕺 B🔥G🔥M 👌❤️🔥 @MusicThaman 1.5-2/5 [Min] pic.twitter.com/mBwpkQ39F5 — chowVIEW (@chow_view) January 12, 2023 #VeeraSimhaaReddy #VeeraSimhaReddy Senseless first half and Senior Bala's character is disappointing. Imagine the second half now.. 😭😭 — That Scooby doo villain (@smile_fakeit) January 12, 2023 Excellent 1st half Elevations Emotions Pelli scene fight Pulicherala mailu rayi fight Minster ki warning 🔥🔥🔥#VeeraSimhaaReddy https://t.co/gzwiaLBB3i — Nari Kakarla 🇮🇳 | #RC15™ (@RamCharanCult27) January 12, 2023 పస్టాఫ్ బాగుంది. ఎలివేషన్స్, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. పెళ్లి సీన్ ఫైట్, పులిచర్ల మైలు రాయి ఫైట్ సీన్తో పాటు మంత్రికి బాలయ్య ఇచ్చే వార్నింగ్ సన్నివేశం అదిరిపోయాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 2nd half drag ekkuva and climax vachesariki completely dead.. bel avg/flop #VeeraSimhaaReddy .. pandaga moodu rojulu tarvatha emi undadhu — King Of Andhra (@AnudeepUsa) January 12, 2023 First Half Reports : ఊహించిందే జరిగింది .... ⭐️మాస్ జాతర ... ⭐️నందమూరి నటసింహం గర్జన .... ⭐️ BGM ⭐️ Thundering Action Blocks #VeeraSimhaReddy #VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaaReddy #NBK #Balayya #GodOfMassesNBK ☀️#CinemaYePrapancham 🔔 pic.twitter.com/3ZEdxF7M8G — Cinema Ye Prapancham (@cinema_ye) January 12, 2023 First Half : High Voltage First Half Ee character Chala Powerful Chala Rojulu Tarvata బ్రహ్మనందం Ni Big Screen Meeda Chusa First Lo 20mins Koncham Forced Ga Chusa Oka Vakeel Saab Oka Akhanda Oka VeeraSimha Reddy Chala Baga Kottadu #VeeraSimhaaReddy#VeeraSimhaReddy pic.twitter.com/OEc5I3TWrN — Sadhik⚡ (@CharanismSadhik) January 12, 2023 Block buster 1st half 🔥🔥🔥 Muthi meeda bochu molichina pratodu magadu kadura bacha..... Waiting for second half #VeeraSimhaReddy #VeeraSimhaaReddy https://t.co/qZsxWNCODJ — Nandamuri Dhoni (@m416kishore) January 12, 2023 complete 1st off OMG 👌💥 Movie లో ఈ గెటప్ సూపర్ 🔥🔥@MusicThaman Anna BGR ke Theatre🔥🥵💥 @shrutihaasan Suguna Sundari Dance 👌🔥 @varusarath5 in interval 🔥🔥🔥👌 #Balakrishna action sequences🔥dialogues Delivery 🔥 @MythriOfficial#VeeraSimhaaReddy#VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/4QSw7x3ITR — N.Ashok Gowda (@07Ashok_gowda) January 12, 2023 2nd half drag ekkuva and climax vachesariki completely dead.. bel avg/flop #VeeraSimhaaReddy .. pandaga moodu rojulu tarvatha emi undadhu — King Of Andhra (@AnudeepUsa) January 12, 2023 -
'వాల్తేరు వీరయ్య' నుంచి నీకేమో అందమెక్కువ లిరికల్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. డైరెక్టర్ బాబి తెరెకెక్కించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ హైప్ను క్రియేట్ చేస్తోంది. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.మికా సింగ్, గీతామాధురి, డీ వెల్మురుగన్ ఈ పాటను పాడారు. -
బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి
‘‘వీరసింహా రెడ్డి’కి తమన్ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ‘మాస్ మొగుడు..’ చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమెరామేన్ రిషి పంజాబీ డిఐ వర్క్లో వుండటం వలన నా ‘క్రాక్’ సినిమా కెమెరామేన్ జీకే విష్ణు ఈ పాటని చేశారు. బాలయ్యబాబుని చాలా కలర్ఫుల్గా చూపించారు’’ అన్నారు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతీహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘మాస్ మొగుడు..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మనో, రమ్య బెహరా ఆలపించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఒంగోలులో జరిగిన వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మామూలుగా ఉండదు. ‘వీరసింహా రెడ్డి’ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్... రాసిపెట్టుకోండి’’ అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘నేను బాల కృష్ణగారికి అభిమానిని. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ రాసే చాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్కి కృతజ్ఞతలు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణగారి మార్క్ ఫైర్ బ్రాండ్ సినిమా ఇది’’ అన్నారు. -
వాల్తేరు వీరయ్య ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా, కారణమేంటంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు విశాఖపట్నంలో గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిరంజీవి దంపతులు, రవితేజ, దేవిశ్రీప్రసాద్తోపాటు దర్శకనిర్మాతలు ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు చేరుకున్నారు. కానీ హీరోయిన్ శ్రుతిహాసన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అసలు సిసలైన మాస్ ఈవెంట్కు డుమ్మా కొట్టేసింది. ఇందుకు గల కారణాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చిందీ బ్యూటీ. తనకసలు ఆరోగ్యం బాగోలేదని, ఇది కరోనా కాకకపోతే బాగుండంటూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. మరో స్టోరీలో.. 'అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొనలేకపోతున్నాను. ఇందుకు చాలా బాధగా ఉంది. నేను మీ అందరినీ మిస్సవుతున్నాను. ఈ సినిమాలో చిరంజీవిగారితో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈరోజు ఈవెంట్ను విజయవంతం చేయండిస అని రాసుకొచ్చింది శ్రుతిహాసన్. చదవండి: అప్పుడు మీ టికెట్ కోసం కొట్టుకునేవాళ్లం: చిరుపై శేష్ ఎమోషనల్ -
‘వీరసింహారెడ్డి’ విజువల్ ఫీస్ట్.. చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి
‘వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి’అని సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ అన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► 'వీరసింహారెడ్డి' కోసం ఏడాది పాటు షూట్ చేశాం. దాదాపు అన్ని బుతువుల్లో షూటింగ్ జరిగింది. సిరిసిల్లల్లో షూట్ చేస్తునపుడు తీవ్రమైన వేడి ఉండేది. అలాగే టర్కీ , ఇస్తాంబుల్లో కూడా షూటింగ్ చేశాం. అక్కడ కూడా చాలా వేడి ఉంటుంది. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం. ►బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నిషియన్స్ ని చాల గొప్పగా అర్ధం చేసుకుంటారు. చాలా గౌరవిస్తారు. బాలయ్య గారికి ప్రతి డిపార్ట్మెంట్ పై గొప్ప అవగాహన ఉంటుంది. చాలా ఫ్రీడమ్ ఇస్తూ టెక్నిషియన్ కి మంచి కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. ►గోపీచంద్ మలినేని యంగ్ అండ్ డైనమిక్ వండర్ ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ ఉంటుంది. ఆలోచనలు పంచుకోవడం పట్ల చాలా ఓపెన్ గా ఉంటారు. తనతో పని చేయడం మంచి అనుభూతి. తన గత చిత్రం క్రాక్ చూశాను. నిజానికి మేము కలసి ప్రాజెక్ట్ చేయాల్సింది. వేర్వేరు ప్రాజెక్ట్స్ ఉండటం వలన కుదరలేదు. ఇప్పుడు తనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ► రవి , నవీన్ అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ ఉంది. సినిమాని చాలా చక్కగా అర్ధం చేసుకుంటారు. సినిమాకి ఏం కావాలంటే అది సమకూరుస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మళ్ళీ మళ్ళీ కలసి పని చేయాలని ఉంది ► గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చేశాను. ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను. -
'డబ్బుల కోసం వాళ్లతో నటిస్తావా'? ట్రోలింగ్పై శ్రుతి కౌంటర్
అగ్ర కథానాయకుడు కమలహాసన్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి వ్యతిరేకంగా శృతిహాసన్ నట జీవితం సాగుతోందని చెప్పక తప్పదు. కోలీవుడ్లో విజయ్, సూర్య, విశాల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో నటించినా ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. విశాల్ సరసన నటించిన పూజ చిత్రం కమర్షియల్గా విజయాన్ని సాధించింది. శృతిహాసన్ తమిళంలో చివరిగా నటించిన చిత్రం లాభం. అది నిరాశ పరిచింది. ఆ తరువాత తమిళ తెరపై కనిపించలేదు. ఇక తెలుగులో మహేష్ బాబు, రవితేజా వంటి స్టార్ హీరోలతో నటించి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అక్కడ మూడు చిత్రాల్లో నటిస్తుండగా, అందులో ఒకటి చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య కాగా మరొకటి బాలకృష్ణకు జంటగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం. మూడోది ప్రభాస్తో సలార్ చిత్రం. విశేషం ఏమిటంటే చిరంజీవి, బాలకృష్ణతో నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి బరిలో ఢీ కొనబోతున్నాయి. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ దాదాపు తన తండ్రి వయసు కలిగిన సీనియర్ నటుల సరసన నటించడంపైనే నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. శృతిహాసన్ తనకంటే రెట్టింపు వయసు ఉన్న సీనియర్ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా, డబ్బు కోసమా? అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వీటికి శృతిహాసన్ స్ట్రాంగ్గానే బదులిచ్చారు. ఆమె తన ట్విట్టర్లో ట్రోలింగ్లపై స్పందిస్తూ సినిమా రంగంలో వయసు అన్నది నంబర్ మాత్రమేనన్నారు. ప్రతిభ, సత్తా ఉంటే మరణించే వరకూ నటించవచ్చన్నారు. దీన్ని ఇంతకు ముందు పలువురు హీరోలు తమ వయసులో సగం వయసు గల హీరోయిన్లతో నటించి నిరూపించారని.. తానేమీ ఇందుకు అతీతం కాదని పేర్కొన్నారు. -
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
అభిప్రాయభేదాలు ఉంటే మంచిదే!
‘‘డైలాగ్ రైటర్గా నాకు ప్రతి కొత్త సినిమా ఓ సవాలే. హీరో ప్రాత్ర, సన్నివేశం, హీరో ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ డైలాగ్స్ రాయాలి. కేవలం స్టార్ ఇమేజ్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాయడం అనేది కరెక్ట్ కాదని నా భావన. నేను అలా రాయను’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు. ► బాలకృష్ణగారితో నేను చేసిన నాలుగో సినిమా ‘వీరసింహారెడ్డి’. అలాగే ‘క్రాక్’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో నేను చేసిన రెండో సినిమా కూడా ఇదే. ఈ సినిమా కథా చర్చల సమయం నుంచే నేను ఈ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయ్యాను. ఈ సినిమాలో ఓ కొత్త ప్రాయింట్ ఉంది. ఒక పక్కా కమర్షియల్ సినిమాకు ఇలాంటి ఓ కొత్త పాయింట్ కలవడం అనేది చాలా అరుదు. ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, బాలకృష్ణగారి నుంచి కోరుకునే అన్ని అంశాలతో ‘వీరసింహారెడ్డి’ రూపొందింది. ► కథా చర్చల్లో భాగంగా అభిప్రాభేదాలు ఉండొచ్చు. అవి ఉన్నప్పుడే పని కరెక్ట్గా జరుగుతున్నట్లు అర్థం. అన్నీ కూడా సినిమా అవుట్పుట్ బాగా రావడం కోసమే. ఒకసారి కథను ఓకే చేశాక బాలకృష్ణగారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. సందర్భానుసారంగా కొన్ని డైలాగ్స్ ఇంప్రొవైజేషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ సినిమా జర్నీలో భాగం. కన్విన్స్ చేయడం, కన్విన్స్ అవ్వడం.. ఈ రెండు లక్షణాలు ఉన్న గొప్ప దర్శకుడు గోపీచంద్ మలినేనిగారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి నిర్మాతల వల్ల ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ► కొంతమంది రచయితలు ఇండస్ట్రీకి దర్శకులు కావాలని వచ్చి, రైటర్స్గా మొదలై, ఫైనల్గా దర్శకుడిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారు. నేను రచయితను కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. రైటర్గా రాణిస్తున్నాను. ప్రస్తుతానికైతే డైరెక్షన్ ఆలోచన లేదు. ► 2017 సంక్రాంతికి చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణగారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకూ నేను పని చేశాను. రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’కు నేను చేయక΄ోయినా అదీ నా సినిమాగానే భావిస్తాను. ఎందుకంటే చిరంజీవిగారికి నేనంటే అభిమానం. దర్శకుడు బాబీ నా మిత్రుడు. ఈ రెండు చిత్రాలూ సక్సెస్ అవ్వాలి. ► ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, హీరో రామ్చరణ్–దర్శకుడు శంకర్ కాంబినేషన్ సినిమా, అర్జున్ దర్శకత్వంలోని సినిమా, నిర్మాత కేఎస్ రామారావు సినిమాలు చేస్తున్నాను. -
బాయ్ఫ్రెండ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్
డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో తాను రిలేషన్లో ఉన్న విషయాన్ని శ్రుతీహాసన్ ఎప్పుడూ సీక్రెట్గా ఉంచలేదు. సోషల్ మీడియాలో అతనితో క్లోజ్గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతుంటారీ బ్యూటీ. తాజాగా శంతను వల్ల తనలో వచ్చిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నేను, శంతను బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఉంటాం. ఇద్దరం కలిసి కామెంట్లు చదువుతుంటాం. ఎందుకంటే ఆ కామెంట్స్ కామెడీగా ఉంటాయి. ఇక తన వల్ల నేను ప్రశాంతంగా మారిపోయాను. అలాగే దయగల వ్యక్తిగా వరాను. శంతను చాలా ప్రశాంతంగా, దయగా ఉంటాడు. అందుకే తనంటే నాకు ఇష్టం. ఈ రెండు లక్షణాలను నేను అలవాటు చేసుకున్నాను’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రుతీహాసన్. ఇక సినివల విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కనిపించనున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. -
Shruti Haasan: నాకు బలహీనతలు ఉన్నాయ్.. ఆ కామెంట్స్ చాలా బాధించాయి
దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా. ముఖ్యంగా అప్పుడప్పుడూ బాయ్ ఫ్రెండ్లతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ సంచలనం సృష్టిస్తుంటుంది. అయితే అన్నింటికీ మించి ప్రతిభ కలిగిన నటి ఈమె. అయితే తమిళంలో శృతిహాసన్ ప్రతిభకు తగ్గ విజయాలు ఇంకా రాలేదనే చెప్పాలి. తెలుగులో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ మెగాస్టార్ సరసన నటించిన వాల్తేరు వీరయ్య. బాలకృష్ణతో జత కట్టిన వీర సింహారెడ్డి చిత్రాలు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం విశేషం. అలాగే మరో స్టార్ హీరో ప్రభాస్తో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నటి శృతిహాసన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ నటిగా పరిచయమైన కొత్తలో అందరూ తన హైట్ గురించే మాట్లాడుకునే వారిని చెప్పారు. కొందరైతే ఇంత ఎత్తుగా ఉన్నావేంటి? నీ హైటే నీకు మైనస్ అంటూ కామెంట్స్ కూడా చేసేవారు అని చెప్పింది. అలాంటి కామెంట్స్ ఒక దశలో తనను బాధించాయని చెప్పారు. అయితే ఆ తర్వాత తన హైటే తనకు ప్లస్ పాయింట్ అన్నది గ్రహించానని చెప్పారు. తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల సరసన నటించే అవకాశం రావడానికి నా హైట్ నే కారణంగా మారిందని చెప్పారు. అయితే తనలోను కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వస్తున్నానని శృతిహాసన్ పేర్కొన్నారు. చదవండి: (1990లోనే నాకు పోటీగా ఒక నటుడొచ్చాడు!) -
బాలయ్య ‘వీరసింహారెడ్డి’ నుంచి మరో అప్డేట్
బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘మా బావ మనోభావాల్..’ లిరికల్ వీడియోను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం ప్రకటించి, ఈ పాటలోని పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్లో బాలకృష్ణ, చంద్రికా రవి స్టెప్పులు వేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. -
శాంతనుకు శ్రుతి బ్రేకప్ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటు ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్, రిలేషన్ షిప్ విషయానికి వస్తే శ్రుతి కొంతకాలంగా శాంతను హజారిక అనే చిత్రకళాకారుడితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా శ్రుతి షేర్ చేసిన పోస్ట్ ఆమె బ్రేకప్ రూమర్లకు తెరలేపాయి. ‘నాతో నేను ఉంటేనే సంతోషం.. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో శ్రుతి మరోసారి ప్రేమలో విఫలం అయ్యిందని, శాంతనుతో తెగదెంపుల చేసుకుంది? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తన బ్రేకప్ రూమర్లకు తాజాగా శ్రుతి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శాంతనుతో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘ఎప్పుడు నేను కోరుకునేది ఇదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క ఫొటోతో శ్రుతి వీరి బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టింది. చదవండి: చాలా గ్యాప్ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్, హాలీవుడ్ నటిలా లేడీ సూపర్ స్టార్ అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏమైన మనస్పర్థలు వచ్చి ఉంటాయని, అవి సద్దుమనగడంతో కలిసిపోయారంటూ ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రుతి శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే తన బ్రేకప్ కారణం చెప్పలేదు. ఆ తర్వాత కొంతకాలనికి శాంతనుతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
స్టయిలిష్ లుక్లో చిరంజీవి.. వాల్తేరు వీరయ్య కొత్త పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్కు మాంచి ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి చిరంజీవి లేటెస్ట్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. చుట్టూ గన్స్.. మధ్యలో స్టైలిష్ గాగుల్స్తో స్టన్నింగ్ లుక్లో కనిపిస్తున్న చిరు ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. Presenting you all the new Avatar of our Megastar @Kchirutweets in #WaltairVeerayya 🔥 Ee poster Sample matrame, I promise ee episode motham POONAKALU guarantee in theatres 😎 Spot the Standees at your nearest theatres, Click your selfies and tag #WaltairVeerayyaOnJan13th 👍🏻 pic.twitter.com/9l24d13CbX — Bobby (@dirbobby) December 16, 2022 -
బాలయ్య 'వీరసింహారెడ్డి' నుంచి మరో అప్డేట్
ప్రేయసితో ఆడి పాడారు వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్ హీరోయిన్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే పాటని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఈ పాటలోని ఓ స్టిల్ను రిలీజ్ చేసింది. ‘‘ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు ΄పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ఒక్క పాటతో పూర్తి
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘వీరసింహారెడ్డి’ ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య..’ చార్ట్బస్టర్గా నిలిచింది. 2023 జనవరి 12న సంక్రాంతికి మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సీఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ. -
హీరోయిన్ శ్రుతి హాసన్కు ఏమైంది? ఆమె ముఖం ఇలా మారిపోయిందేంటి?
స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్కు ఏమైంది? ఆమె ముఖం ఏంటి ఇలా అయిపోయింది? అంటూ ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. రీసెంట్గా శృతి షేర్ చేసిన ఫోటోలే ఈ అనుమానాలకు కారణం. సాధారణంగా హీరోయిన్స్ డీగ్లామర్గా కనిపించేందుకు వెనకాడుతుంటారు. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేసేందుకు కూడా ఇష్టపడరు. అయితే శ్రుతిహాసన్ మాత్రం ఇవేం పట్టించుకోదు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫీవర్, సైనస్తో ఆమె బాధపడుతుందట. బ్యాడ్ డే, బ్యాడ్హెయిర్తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రుతిహాసన్ ముఖం బాగా ఉబ్బిపోయి బాగా డల్గా కనిపిస్తుంది. దీంతో అసలు శ్రుతిహాసన్కు ఏమైంది? ఇలా తయారయ్యిందేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలా షేర్ చేయడానికి చాలా గట్స్ ఉండాలంటూ మరికొందరు శ్రుతిని ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
వీరసింహారెడ్డి నుంచి 'జై బాలయ్య' సాంగ్ విడుదల..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జైబాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ను విడుదల చేశారు. రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన పాట బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కరీముల్లా పాడారు.ఇక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కనిపించారు. వైట్ అండ్ వైట్ అవుట్ఫిట్లో మెడలో బంగారు చైన్, చేతికి వాచ్ పెట్టుకొని తనదైన స్టైల్లో డ్యాన్స్ చేయడం విశేషం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. -
విదేశాల్లో అన్వేషణ
గ్రీస్లో బిజీ బిజీగా ఉంటున్నారు శ్రుతీహాసన్. ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసమే అంత బిజీగా ఉన్నారు. మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న సైకలాజికల్ చిత్రం ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో జరుగుతోంది. అలాగే ఏథెన్స్లోని లొకేషన్స్లో కూడా ఈ సినిమా షూటింగ్ను జరుపుతున్నారు. 1980 బ్యాక్డ్రాప్లో సాగే కథతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చిత్రంలో భర్త మరణానికి దారితీసిన కారణాల కోసం అన్వేషించే యువతి పాత్రలో శ్రుతి కనిపిస్తారని టాక్. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, ప్రభాస్ ‘సలార్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో ద్వేషపూరిత సంస్కృతి పెరిగిపోయింది: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో అభిమానులు సంపాదించుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్లో ఎక్కువ విజయాలు అందుకున్న ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జంటగా సలార్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ చిత్రాలను టార్గెట్ చేయడంపై ఆమె స్పందించారు. హిందీ చిత్రాలు విడుదల సమయంలో బాయ్కాట్ బాలీవుడ్ అంశం తెరపైకి రావడం పట్ల ఆమె మాట్లాడారు. శృతిహాసన్ మాట్లాడుతూ..'ఇది కేవలం సినిమాకు సంబంధించినది మాత్రమే కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. దీనికి చాలా కారణాలున్నాయి. మనమందరం దీనిపై ఒక్కసారి ఆలోచించుకోవాలి. సినిమాలను రద్దు చేయాలనే సంస్కృతి అనేది బెదిరింపు, దాడి చేయడం లాంటిది. ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం సమాజంలో ఆన్లైన్ సంస్కృతి సమాజంలో ద్వేషం నింపేలా మారింది.' అని అన్నారు. తాను వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో వివరించింది శృతిహాసన్. తనను 'చుడైల్' (తెలుగులో మంత్రగత్తె) అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది. కానీ దానిని అధిగమిస్తామని నాకు తెలుసు. నేను నా సొంత మార్గంలో ఆలోచిస్తాను అని వెల్లడించింది. -
మోగాస్టార్తో మాస్ మహారాజా స్టెప్పులు!
వీరయ్యతో కలిసి మాస్ స్టెప్పులు వేశారు రవితేజ. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వాల్తేరు వీరయ్య పాత్రలో కనిపిస్తారు చిరంజీవి. ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్రలో పోలీసాఫీసర్గా రవితేజ నటించారని తెలిసింది. రీసెంట్గా ఓ భారీ సెట్లో చిరంజీవి, రవితేజలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ మాస్ సాంగ్ను చిత్రీకరించారు. ‘‘చిరంజీవి, రవితేజ అద్భుతమైన డ్యాన్సర్లు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ మెగా మాస్ సాంగ్ ఆడియన్స్ను అలరిస్తుంది’’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ఎం.ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం. -
Shruti Haasan: చాలా ఎగ్జైటింగ్గా ఉంది!
హీరోయిన్ శ్రుతీహాసన్ కొన్ని రోజులుగా గ్రీస్లోనే ఉంటున్నారు. ఏదైనా వెకేషన్కి వెళ్లారేమో? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్లింది ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ‘ది ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఈ ఇంగ్లీష్ ఫిల్మ్లో మార్క్ రౌలీ, శ్రుతీహాసన్ లీడ్ యాక్టర్స్గా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ గ్రీస్లో జరుగుతున్నాయి. ఈ వర్క్షాప్స్లో శ్రుతీహాసన్ పాల్గొంటున్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం నాకు స్పెషల్. చాలా ఎగై్జటింగ్గా ఉంది’’ అని ట్వీట్ చేశారు శ్రుతీహాసన్. 1980 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాకు ఎమిలీ కార్లటన్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఐస్లాండ్లో చనిపోయిన భర్త అస్తికల కోసం అక్కడికి వెళ్తుంది ఓ యువతి. భర్త మరణం గురించి కొన్ని ఊహించని అంశాలు తెలుసుకున్న ఆ యువతి అక్కడ ఏం చేసింది? అనే నేపథ్యంలో ఈ కథనం సాగుతుందట. కాగా చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ఓ సినిమాతో పాటు ప్రభాస్ ‘సలార్’లతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్. -
టైటిల్కి వేళాయె!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రానికి ‘అన్నగారు’, ‘వీరసింహారెడ్డి’, ‘రెడ్డిగారు’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ను ఈ నెల 21న ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. మరి.. తెరపైకి వచ్చిన టైటిల్స్లో ఏదైనా ఒకటి ఫిక్స్ అవుతుందా? లేక కొత్త టైటిల్ ఖరారు చేస్తారా? అనే విషయం తెలియాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాలి. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్కుమార్, చంద్రికా రవి(స్పెషల్ నంబరు) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం:తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి. -
అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా : హీరోయిన్
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్కి పెద్దపీట వేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందంగా కనిపించడానికి హీరో, హీరోయిన్లు తెగ కష్టపడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందాన్ని పెంచుకోవడం కోసం కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారిలో శ్రుతిహాసన్ కూడా ఒకరు. కమల్హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన శ్రుతిహాసన్ తన ప్లాస్టిక్ సర్జరీపై స్పందించింది. 'అవును.. నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. నా శరీరంలో ముక్కు అంటే నాకు ఎక్కువ ఇష్టం. అది కాస్త వంకరగా ఉండేది. దానివల్ల చాలా బాధపడ్డాను. అందుకే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. దానికోసం ఎక్కువ ఖర్చుపెట్టాను. అయినా ఇది నా శరీరం. దీనిని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది' అంటూ చెప్పుకొచ్చింది. -
ఆడియో డ్రామాకు శృతి గొంతు
హీరోయిన్ శృతిహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొనవచ్చు. సంగీత దర్శకురాలిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కథానాయికగా, గాయనీగా తనలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం నటనలో బిజీగా ఉన్న శృతిహాసన్ మరో కొత్త శాఖలోకి తనను పరిచయం చేసుకున్నారు. ఆడియో డ్రామాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆడియో డ్రామాల తరువాతే సినిమాలు ప్రజల మధ్యకు వచ్చాయి. అయితే ఈ ఆడియో డ్రామాలు అనేవి హాలీవుడ్లో ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. అలా తాజాగా రూపొందిన ది సౌండ్ మాన్ యాక్ట్ అనే ఆడియో డ్రామా సిరీస్లోని గ్రామీణ పనిమనిషి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడు నైల్ గ్యామన్ దర్శకత్వంలో డీసీ సంస్థ ఇంతకు ముందు నిర్మించిన అంతర్జాతీయ సిరీస్ ది సౌండ్ మాన్.ఈ సిరీస్కు విశేషాదరణ లభించడంతో తాజాగా మూడో సిరీస్ వరల్డ్ ఎండ్ ఇన్ పేరుతో రూపొందించారు. దీనికి డబ్బింగ్ చెప్పడం గురించి నటి శృతిహాసన్ పేర్కొంటూ సంగీత కళాకారునిగా జీవితాన్ని ప్రారంభించిన తనకు ది సౌండ్ మాన్ ఆడియో డ్రామాకు డబ్బింగ్ చెప్పాలన్నది చిరకాల కల అని అన్నారు. అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. దర్శకుడు నైల్ గ్యామన్కు తాను పెద్ద ప్యాన్ అని అన్నారు. కాగా సౌండ్ మాన్ మూడో సిరీస్లో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. దీని నిర్మాత ఈ ఆడియో డ్రామాలు పలు రకాల ప్లాట్ఫామ్లకు తీసుకెళుతున్నారని చెప్పారు. కాగా నటి శృతిహాసన్ ఇంతకు ముందు ట్రెండ్ స్టోన్, ప్రోజెన్–2 సీరియల్స్ డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రభాస్తో జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంతో పాటు బాలకృష్ణ 107వ చిత్రంలోనూ, చిరంజీవి 154వ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా వున్నారు. -
డబ్బులు ఇస్తే చాలు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తా..
-
రజనీకాంత్, కమల్ హాసన్ చిత్ర రీమేక్లో శృతిహాసన్?
అగ్ర కథానాయకులు కమల్ హాసన్, సూపర్స్టార్ రజనీకాంత్ ఆరంభ దశలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. వాటిలో కొన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. అదే విధంగా ఫ్యామిలీ డ్రామా కథా చిత్రాలు, హీరోయిన్ కథా చిత్రాలు ఉన్నాయి. అలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘అవళ్ అప్పడిదాన్’. అందులో కమలహాసన్, రజనీకాంత్, శ్రీప్రియ ప్రధాన పాత్ర పోషించారు. సీ.రుద్రయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ పలు సమస్యలను ఎదురొడ్డి ఎలా నెగ్గుకొచ్చింది అన్నదే ఈ చిత్ర కథ. చదవండి: తారక్పై ట్వీట్ చేసి పప్పులో కాలేసిన నటి, అసలేం జరిగిందంటే.. అందులో కథానాయకి పాత్రలో శ్రీప్రియ నటించింది. కాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు అధర్వ, సమంత జంటగా బానాకాత్తాడి చిత్రాన్ని తెరకెక్కించిన బద్రి అవళ్ అప్పడిదాన్ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనే ఇటీవల స్వయంగా పేర్కొన్నారు. కాగా ఇందులో నటి శ్రీప్రియ పాత్రలో శృతిహాసన్, రజనీకాంత్ పాత్రలో శింబు, కమలహాసన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్లను నటింప చేయడానికి ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
యూట్యూబ్లో దుమ్మురేపుతున్న శ్రుతిహాసన్ సాంగ్ విన్నారా?
తమిళసినిమా: బోల్డ్, బ్యూటిఫుల్ ఇండియన్ నటి శ్రుతిహాసన్ లోకనాయకుడు కమలహాసన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసినా మొదట సంగీతంలో ఆసక్తి చూపారు. ఆ రంగంలో ప్రైవేటు ఆల్బమ్లు రూపొందించిన ఆమె ఆ తరువాత సినీ సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యారు. తన తండ్రి కమలహాసన్ కథానాయకుడుగా నటించిన ఉన్నైపోల్ ఒరువన్ చిత్రానికి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత కథానాయకిగా రంగ ప్రవేశం చేశారు. అలా హిందీ, తెలుగు, తమిళం మొదలగు భాషల్లో కథానాయికగా నటిస్తూ ఇప్పుడు అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ విజయాలు అందుకుని అక్కడ క్రేజీ హీరోయిన్గా రాణిస్తుండటం విశేషం. కాగా తెలుగులో ప్రస్తుతం పాత చిత్రాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. మహేష్బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు విడుదలై అనూహ్య కలెక్షన్లను రాబడుతున్నాయి. మరికొన్ని చిత్రాలను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నటి శ్రుతిహాసన్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఆమె తమిళంలో ధనుష్కు జంటగా నటించిన 3 చిత్రం తెలుగు వెర్షన్ను గత మూడు రోజుల క్రితం రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం అక్కడ 200 థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ నటనకు అప్పట్లో మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కట్టిన ఈ చిత్రంలోని వై దిస్ కొలవరి పాట ప్రపంచ వ్యాప్తంగా ఊపేసింది. అలాంటి చిత్రాన్ని మళ్లీ తెలుగు ప్రేక్షకులు ఆదరించటం చాలా సంతోషంగా ఉందని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. కాగా సినిమాలో నటిస్తునే తన సంగీత బృందంతో మ్యూజిక్ ఆల్భమ్ రూపొందిస్తున్న ఈ సంచలన నటి తాజాగా వెస్ట్రన్ స్టైల్లో సీ ఈజ్ హీరో అనే వీడియో ఆల్బమ్ రూపొందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ జంటగా సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు
‘ఈ టీచర్ చాలా స్ట్రిక్ట్’ అనిపించుకుంది సావిత్రి ‘మిస్సమ్మ’లో. ‘ఈ టీచర్ భలే చక్కగా పాఠాలు చెబుతుంది’ అని మెచ్చుకోలు పొందింది జమున ‘మట్టిలో మాణిక్యం’లో. ‘పంతులమ్మ’ సినిమాలో లక్ష్మి పిల్లల పాఠాలే కాదు కథానాయకుని జీవితాన్ని కూడా చక్కదిద్దింది. ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు టీచర్ అంటే విజయశాంతే. ‘లేడీస్ టైలర్’లో రాజేంద్ర ప్రసాద్ వంటి అల్లరి స్టూడెంట్ని బెత్తం దెబ్బలు కొట్టి సరి చేయలేదూ అర్చన. టీచర్ పాత్రకు గ్లామర్ ఉండకపోవచ్చు గాని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కొందరు హీరోయిన్లకే దక్కింది. అదిగో చాక్పీస్ ఒక చేత్తో బెత్తం మరో చేత్తో పట్టుకుని వాళ్లిటు నడిచొస్తున్నారు చూడండి. శిశువుకు అమ్మ తొలి టీచర్. స్కూల్లో ‘టీచరమ్మే’ తొలి టీచర్. నర్సరీల్లో, ఐదు లోపల తరగతుల్లో పిల్లలకు తొలిగా పరిచయం అయ్యేది ఎక్కువగా టీచర్లే. వీరే పిల్లలకు తొలుత ఆత్మీయులవుతారు. బడి పట్ల, పాఠాల పట్ల ఆసక్తి కలిగిస్తారు. ఈమె కూడా అమ్మలాంటిదే కాబట్టి భయం లేకుండా వెళ్లొచ్చు అని పిల్లలకు నమ్మకం కలిగిస్తారు. అయినా సరే ‘గురు దేవా’ అంటే మగ గురువు గుర్తుకొస్తాడు. స్త్రీల వాటా ఈ విషయంలో సమానం అయినప్పటికీ. సినిమాల్లో కూడా హీరోలు వేసిన టీచర్ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఈ చాన్స్ వచ్చింది. ‘గ్లామర్’ సినిమా కమర్షియల్ సినిమా వచ్చాక ‘టీచర్’ పాత్రలో హీరోయిన్ను గ్లామరస్గా చూపించలేము అనే భావనతో నిర్మాత, దర్శకులు హీరోయిన్ను ‘ఒక ఆడి పాడే బొమ్మ’ స్థాయికే కుదించి పెట్టారు. అయితే అప్పుడప్పుడు మంచి టీచర్ పాత్రలు సత్తా ఉన్న నటీమణుల చేతుల్లో పడి మెరిశాయి. వాళ్లు తెర మీద ఉంటే ప్రేక్షకులు బుద్ధిగా చూసే విద్యార్థులయ్యారు. రిజల్ట్ వందకు వంద వచ్చింది. మీకు మీరే మాకు మేమే: సినిమాల్లో హీరోను చూసి హీరోయిన్ జంకడం ఆనవాయితీ. కాని ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి రామారావు జంకుతుంటాడు. దానికి కారణం ఆమె నిజాయితీ, టీచర్గా సిన్సియారిటీ. స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు జమిందారు గారి కుతురికి సంగీతం పాఠాలు కూడా చెప్తుంది సావిత్రి. అంతేనా? కొంచెం నాన్ సీరియస్గా ఉన్న ఎన్.టి.ఆర్ తనను అందుకునేంతగా ఎదిగేలా చేసి ఒక రేవుకు చేరుస్తుంది. ‘రావోయి చందమామా మా వింతగాధ వినుమా’... ఆ రోజుల్లో టీచర్లు పాటలు పాడే పాటలు ఇంత శుభ్రంగా వినసొంపుగా ఉండేది. నా మాటే నీ మాటై చదవాలి: ‘మట్టిలో మాణిక్యం’ లో చలం అమాయకుడు. పౌరుషంతో పట్నం వస్తే టీచరైన జమున పరిచయం అవుతుంది. ప్రేమిస్తుంది. మామూలు చదువే కాదు లౌక్యంగా ఉండటానికి అవసరమైన చదువు కూడా చెబుతుంది. పాఠాలను పాటగా మార్చి ఆమె పాడే ‘నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి’ పాట బాగుంటుంది. ఆ తర్వాతి రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ లక్ష్మితో ‘పంతులమ్మ’ సినిమా తీశాడు. ‘పంతులమ్మ’ టైటిల్తో ఒక సినిమా వచ్చి హిట్ కావడం విశేషం. భార్య మరణించిన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక పంతులమ్మ అతని పిల్లలకు పాఠాలు చెబుతూ అతనిలోని ఒక అపోహను తొలగించడం కథ. ‘ఎడారిలో కోయిల’ పాట ఒయాసిస్ లా ఉంటుంది. ఆ తర్వాత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత టీచర్గా నటించింది. కట్నం అడగడాన్ని ఎదిరించిందని ఆమె ఉద్యోగం పోతుంది. కాని ఆమె వెరవదు. ఈ దుర్యోధన దుశ్శాసన క్లాసులోని రౌడీ పిల్లాణ్ణి సరి చేయడం టీచర్ బాధ్యత. మరి సమాజంలో ఉన్న రౌడీ పిల్లాణ్ణి దండించడం? చట్టం, న్యాయం, వ్యవస్థ విఫలమైతే ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. ‘ప్రతిఘటన’లో లెక్చరర్ అయిన విజయశాంతి ఊళ్లో అనేక ఫతుకాలకు కారణం అవుతున్న రౌడీని అంతిమంగా తెగ నరికి నిర్మలిస్తుంది. చాక్పీస్ పట్టిన చేతులు గొడ్డలి కూడా పట్టగలవు అని హెచ్చరిస్తుంది. ఈ టీచర్ పాత్ర తెలుగులో వచ్చిన అన్ని టీచర్ పాత్రల కంటే శక్తిమంతమైనది. క్లాసురమ్లో పిచ్చి జోకులు, లెక్చరర్ల మీద పంచ్లకు తావు ఇచ్చే పాత్ర కాదు ఇది. ఈ పాత్రను చూడగానే మహా మహా పోకిరి స్టూడెంట్లు కూడా సైలెంటైపోవాల్సిందే. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అని విజయశాంతి పాడుతుంటే ఆ వేదనా శక్తి చసే ప్రతి విద్యార్థిలో పరివర్తన తెస్తుంది. విజయశాంతి ఆ తర్వాత ‘రేపటి పౌరులు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో కూడా టీచర్గా నటించింది. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి: అతను బెస్తపల్లెలో రౌడీ. ఆమె క్రైస్తవ విశ్వాసాలు కలిగిన టీచర్. అతను హింస. ఆమె దయ. హింసను వీడి దయ వరకూ చేసే ప్రయాణాన్ని ఆ టీచర్ ఆ రౌడీలో ప్రేరేపిస్తుంది. అతని పాపాలన్నీ స్వీయ రక్తంతో ప్రక్షాళనం అవుతాయి. చివరకు అతను ఆమె ప్రేమను పొందుతాడు. రౌడీగా చిరంజీవి, టీచర్గా సుహాసిని ‘ఆరాధన’లో నటించారు. ‘అరె ఏమైంది’ పాట ఇప్పటికీ హిట్ ప్రేమమ్ మరికొన్ని: ఇటీవలి కాలంలో ఈ కాలపు హీరోయిన్లు కూడా టీచర్లుగా నటించారు. ‘ఘర్షణ’లో అసిన్, ‘గోల్కొండ హైస్కల్’లో కలర్స్ స్వాతి, ‘హ్యాపీ డేస్’లో కమలిని ముఖర్జీ, ‘రాక్షసుడు’లో అనుపమ పరమేశ్వరన్ టీచర్లుగా కనిపిస్తారు. మన సాయి పల్లవి మలయాళ ‘ప్రేమమ్’లో టీచర్గా నటించే పెద్ద క్రేజ్ సాధించింది. ఆ పాత్రను తెలుగులో శృతిహాసన్ చేసింది. -
రెమ్యునరేషన్ను భారీగా పెంచేసిన శ్రుతిహాసన్.. ఎంతంటే..
సాధారణంగా హీరోయిన్లు వ్యక్తిగత విషయాలు వెల్లడించడానికి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే ప్రేమ, బాయ్ఫ్రెండ్ వంటి విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు. పెళ్లి గడియలు దగ్గర పడే వరకు నోరు మెదపరు. కారణం కెరీర్ గురించి కేర్ కావచ్చు. మీడియా వదంతులకు భయపడి కావచ్చు. అయితే ఇలాంటి వాటికి భయపడని బ్యూటీ ఒకరున్నారు. ఆమే శ్రుతిహాసన్. ఈమె వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలు అన్నీ బహిర్గతమే. ఇంకా మింగిల్ గాని శ్రుతి హాసన్ బాయ్ఫ్రెండ్స్ను మాత్రం ఇప్పటికే ఇద్దరిని మార్చేసింది. ఇక వృత్తి పరంగానూ ఈమె సంచలనమే. పాత్రకు అవసరమైతే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా నటిస్తుంది.అభిమానులకు నచ్చే విషయం ఇదే. హిందీ, తెలుగు, తమిళం భాషలను చుట్టేస్తున్న ఈ బ్యూటీని ప్రస్తుతం ఎక్కువగా ఇష్టపడుతుంది మాత్రం టాలీవుడే. సక్సెస్లు కూడా అక్కడే ఎక్కువ. ప్రస్తుతం సలార్, బాలకృష్ణ సరసన ఒక చిత్రం, చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ఈ మూడు చిత్రాలపైన భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో పారితోషికం విషయంలోనూ శృతిహాసన్ కోటికి తగ్గేదేలే అంటున్నట్లు తాజా సమాచారం. ఇందుకు కారణం ఈమె ఇంతకు ముందు నటించిన చలన చిత్రాలు మంచి విజయాన్ని సాధించడమే. సలార్ చిత్రంలో ప్రభాస్కు జంటగా నటిస్తున్న ఈ భామ పారితోషికంగా రూ. 2.5-3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట.దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను శ్రుతి బాగా ఫాలో అవుతోందని అంటున్నారు సినీవర్గాలు. -
అక్క శ్రుతి హాసన్ బాటలో చెల్లి అక్షర..
సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే బ్యూటీ శృతి హాసన్. బాయ్ఫ్రెండ్తో ఉన్న ఫొటోలు, గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు. ఆమె చెల్లెలు అక్షర హాసన్ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ మాదిరిగానే ఈమె కూడా తొలుత బాలీవుడ్లో కథానాయకిగా పరిచయం అయ్యారు. అక్కడ చిత్రాలు చేశారు. ఆ తరువాత తమిళంలో అజిత్ కథానాయకుడుగా నటించిన వివేకం చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒక కీలక పాత్రను పోషించారు. చదవండి: స్పెయిన్లో జెండా ఎగురవేసిన నయనతార దంపతులు ఆ తరువాత తన తండ్రి కమలహాసన్ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నటుడు విక్రమ్ హీరోగా నిర్మించిన గడారం కొండాన్ చిత్రంలో ఒక యువకుడికి ప్రేయసిగా ప్రేమ సన్నివేశాల్లోనూ, గర్భిణీగా అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత అచ్చం మడం నాణెం పయిర్పు అనే చిత్రంలో కథానాయికగా నటించారు. ఇందులో ప్రముఖ గాయనీమణులు ఉషా ఊతప్, మాల్గుడి శుభ ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. అమెజాన్ ప్రైమ్టైంలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అగ్ని చిరగుగల్ చిత్రంలో అక్షరహాసన్ గ్లామర్ విషయంలో తన అక్క శృతిహాసన్ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా దిగిన ఫొటోలను సామాజిక మాద్యమాల్లో విడుదల చేశారు. అవికాస్తా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. -
అది కేవలం ఇండస్ట్రీలోనే కాదు, సమాజమే అలా ఉంది: శ్రుతి హాసన్
శ్రుతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా చిత్రం సలార్, బాలకృష్ణ సరసన ఎన్బీకే107, చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించి శ్రుతీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారా? అని యాంకర్ అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చింది. కానీ, పురుషాధిక్యత అనేతి కేవలం సినీ పరిశ్రమలోనే లేదని, సమాజమే అలా ఉందని చెప్పుకొచ్చింది. చదవండి: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్కు వెళ్లింది!: నాగార్జున ‘నిజం చెప్పాలంటే ప్రస్తుతం మనం పురుషుల ఆధిపత్యం ఉన్న సమాజంలోనే జీవిస్తున్నాం అనిపిస్తోంది. ఇది కేవలం ఇండస్ట్రీలోనే ఉందంటే నేను అంగీకరించను. ఎక్కడ చూసిన పురుషుల ఆధిపత్యమే ఉంది. ఈ సమాజామే అలా ఉంది’ అని వివణ ఇచ్చింది. అనంతరం తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. మనం చూసే కథలకు ప్రతిబంబమే సినిమా అని, తన ఒక నటిగా కళ జీవితాన్ని అనుసరిస్తున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం శ్రుతి సలార్, ఎన్బీకే107 చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉంది. ఇక త్వరలోనే ఆమె వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో పాల్గొననుంది. -
‘ఒక్క సినిమా కంటే ఎక్కువ చేస్తాననుకోలేదు.. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని’
లోకనాయకుడు కమల్ హాసన్ తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రుతి హాసన్. తొలుత హిందీలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత దక్షిణాదిన అడుగుపెట్టింది. నటిగానే గాయనిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, వ్యాఖ్యాతగా తనలోని విభిన్న కోణాలతో అభిమానులను మెప్పించింది. కాగా శ్రుతీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్కు, ప్రేక్షకులకు, ఇండస్ట్రీఇక ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఒక సినిమాకంటే ఎక్కువ చేస్తాననుకోలేదని వ్యాఖ్యానించింది. చదవండి: మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు ‘13 ఏళ్లు.. అద్భుతంగా ఉంది. అసలు ఒక్క సినిమా కంటే ఎక్కు చస్తానని అనుకోలేదు. దీని కోసమే పుట్టకపోయిన సినిమాను ప్రేమించడం నేర్చుకున్నాను.ఇండస్ట్రీకి, ఫ్యాన్స్కి నేను రుణపడి ఉన్నాను. నిజానికి నేను ఎప్పటికి రుణపడే జీవితాన్ని ఇండస్ట్రీ నాకిచ్చింది. ఇన్నేళ్లుగా ఎన్నో నేర్చుకున్నాను. గెలుపు, ఓటమిలను ఎలా తీసుకోవాలి, ఆత్మస్థైర్యంతో ఎలా ముందుకెళ్లాలి, కథలను చెప్తున్న వారిని ఎలా అభినందించాలి, ఎప్పుడూ కలవని మనుషులతో ఎలా మెలగాలి. నేను పొందుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీ దీనిని తేలికగా తీసుకోను. నేను మీకు దీనికంటే ఎక్కువే ఇవ్వాలని కోరుకుంటున్నాను. చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న రణ్బీర్ షంషేరా మూవీ, ఎప్పుడు.. ఎక్కడంటే నా ఈప్రయాణంలో నా ప్రేమ, అప్యాయతలను, మద్దతును ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదలు. నా రీర్లో ఈ 13 ఏళ్లకు చాలా థాంక్స్’ అంటూ రాసుకొచ్చింది. తన నటించిన ఈనాడు మూవీతో సింగర్గా సౌత్ ఇండస్ట్రీకి పరిచమైన శ్రుతి.. సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత 7th సెన్స్ , ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించి ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అంతేకాదు ఆమె వరుస చిత్రాలు ఫ్లాప్గా కావడంతో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్తో నటించిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఆమె తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. దీంతో ఆమె రాత్రిరాత్రే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రుతి? హీరోయిన్ క్లారిటీ
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను తాజాగా కొట్టిపారేసింది స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. ఇటీవల తాను శారీరక సమస్యలతో బాధపడుతున్నానంటూ శ్రుతి హాసన్ ఇటీవల ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఆసుత్రిలో చికిత్స పొందుతుందని.. బెడ్పై క్రిటికల్ పోజిషన్లో ఉందంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న పుకార్లను తాజాగా శ్రుతి హాసన్ ఖండించింది. ఈ మేరకు ఆమె ఈ పుకార్లపై వివరణ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్స్తో బిజీగా ఉన్నట్లు చెప్పింది. ‘గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగా లేదని, ఆసుపత్రిలో క్రిటికల్ కండీషన్లో ఉన్నానంటూ కొందరు ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. నా డైలీ రోటీన్స్, రెగ్యులర్ షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. నాకు ఉంది పీసీఓడి(PCOD) సమస్య ఒక్కటే. అది మహిళల్లో ఉండే సాధారణ సమస్య. దానికే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల నేను పెట్టిన పోస్ట్ను కొంతమంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను చాలా ఆరోగ్యం ఉన్నాను’ అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ మూవీతో పాటు బాలకృష్ణ ఎన్బీకే 107 చిత్రాల్లో నటిస్తోంది. -
ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్
ప్రస్తుతం తాను పలు శారీరక సమ్యలతో బాధపడుతున్నానని స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది. ఈ మేరకు ఆమె బుధవారం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘శారీరకంగా చాలా వీక్గా ఉన్నాను.. కానీ మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉన్నాను’ అని పేర్కొంది. ఈ సందర్భంగా తాను పలు హార్మోన్ల సమస్యతో బాధపడుతున్నానంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్ట్కు శ్రుతి హాసన్ ఇలా రాసుకొచ్చింది. ‘ప్రస్తుతం నేను కొన్ని చెత్త హార్మోన్ల(Pcos endomestriosis) సమస్యల్ని ఎందుర్కొంటున్నా. వీటి నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నా. హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ప్రతి మహిళకు తెలుసు. చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి ఇది మహిళల మెటబోలిక్పై ప్రభావం చూపుతుంది. అయితే నేను దీని గురించి చింతించకుండా సాధారణంగానే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందు కోసం సమయానికి తినడం, సరిపడ నిద్రపోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయమం చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మానసికంగా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అందరు ఇలాంటి సమస్యలను బయటకు చెప్పేందుకు సంకోచిస్తుంటారు.. కానీ ఇలాంటి సవాళ్లను మనం ధైర్యంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇవి మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు. అందుకే నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకున్నా’ అంటూ శ్రుతి రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ మూవీతో పాటు బాలకృష్ణ ఎన్బీకే107 చిత్రంలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
భయం నా బయోడేటాలోనే లేదురా.. అంటూ గర్జించిన బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా! శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించనున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్గా నటిస్తున్నాడు. గురువారం ఈ సినిమా నుంచి ఫస్ట్ హంట్ టీజర్ రిలీజ్ చేశారు. 'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్, భయం నా బయోడేటాలోనే లేదు, నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా..' అంటూ పవర్ఫుల్ డైలాగ్స్తో అదరగొట్టాడు బాలయ్య. నెరిసిన గడ్డం, కొత్త హెయిర్ స్టైల్తో అదుర్స్ అనిపించాడు. కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని స్టైలిష్గా చుట్ట తాగుతూ కనిపించాడు. అఖండ తర్వాత రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మాస్ మూవీకి జై బాలయ్య అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. It's just a small token of Love to my Idol,The God of Masses,NATASIMHAM #NandamuriBalakrishna garu 😊❤️ Here’s the MASS & SWAG Loaded #NBK107 First Hunt 🦁https://t.co/qseZY9yF9k#HBDGodOfMassesNBK@shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @MythriOfficial pic.twitter.com/DVbE6S7YYG — Gopichandh Malineni (@megopichand) June 9, 2022 చదవండి: పూజా హెగ్డేకు ఘోర అవమానం బిగ్బాస్లోకి హర్షసాయి? క్లారిటీ ఇచ్చిన యూట్యూబర్! -
బాయ్ఫ్రెండ్తో శ్రుతి మిర్రర్ సెల్ఫీ, ఫొటో వైరల్
హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం శాంతను హజారిక అనే చిత్రకారుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె తరుచూ అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో అతడిపై ప్రేమను వ్యక్తం చేస్తుంది. అలాగే శాంతను కూడా వీలు చిక్కినప్పుడల్లా ప్రియురాలు శ్రుతి గురించి పోస్ట్ పెడుతుంటాడు. చదవండి: ‘సలార్’ స్పీడ్ పెంచిన ప్రశాంత్ నీల్, షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి ఇదిలా ఉంటే తాజాగా ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను శ్రుతి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. శాంతానుతో కలిసి మీర్రర్ సెల్ఫీ తీసుకున్న ఫొటోను బుధవారం ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో శ్రుతి పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కూల్గా కనిపిస్తుండగా.. శాంతను గ్రే కార్గో ప్యాంట్తో జత చేసిన ఆకుపచ్చ టీ-షర్ట్లో డాపర్ లుక్లో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ జంటను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా శ్రుతి, శాంతను 2020లో తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నుంచి వీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో నివస్తిస్తున్నారు. చదవండి: సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఈ క్రమంలో ఇటీవల శాంతాను బర్త్డే సెలబ్రెట్ చేసిన శృతి ఆ ఫొటోలను షేర్ చేస్తూ స్పెషల్ నోట్ రాసింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మై లవ్ శాంతను. ఈ ప్రపంచం మీ అద్భుతమైన శక్తిని ఎదుర్కొన్నందుకు ఆశీర్వదించబడింది. ఇక ప్రతి రోజు నిన్ను తెలుసుకుంటున్నందుకు నేను కృతజ్ఞతరాలుని’ అంటూ రాసుకొచ్చింది. కాగా గతంలో ఆమె ఓ ఫొటోగ్రాఫర్ను ప్రేమించిన విషయం తెలిసిందే. ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆమె ప్రియుడి కోసం సినిమాలను కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ సడన్గా వారి ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పడింది. ఆ తర్వాత శాంతనుతో ప్రేమలో పడింది. ఇక శ్రుతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ప్రభాస్తో కలిసి సలార్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
Shruti Haasan: నాకు శ్రుతీహాసన్తో అలా పెళ్లయిపోయింది
శ్రుతీహాసన్తో తన వివాహం జరిగిపోయిందంటున్నారు చిత్రకారుడు, ర్యాపర్ శంతను హజారికా. అయితే ఆయన మాటల్లో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. శ్రుతీతో తన వివాహం క్రియేటివ్గా అయ్యిందని చెబుతున్నారు. ఈ విషయం గురించి ఓ ఇంగ్లీష్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంతను మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్గా మా (శ్రుతి, శంతను) పెళ్లి జరిగిపోయింది. అందుకు ఓ నిదర్శనం మా బలమైన బంధం. మేమిద్దరం క్రియేటివ్ పీపుల్. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్ చేయాలనుకుంటాం. నా జీవితంలో శ్రుతీ ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే నన్ను చూసి తను ఇన్స్పైర్ అవుతుంటుంది. మా క్రియేటివ్ (సృజనాత్మకత) థాట్స్ కూడా ఒకేలా ఉంటాయి. ఇక ప్రత్యక్షంగా మా వివాహం ఎప్పుడు జరుగుతుంది? అనే విషయంపై మాత్రం నాకు క్లారిటీ లేదు’’ అన్నారు. క్రియేటివ్గా పెళ్లయిందంటే.. మానసికంగా తమ బంధం ముడిపడిందని శంతను చెబుతున్నారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల ‘కపుల్ గోల్స్ చాలెంజ్’లో శంతను, శ్రుతి పాల్గొన్న విషయం గుర్తుండే ఉంటుంది. -
భయంతోనే ఇండస్ట్రీకి వచ్చాను, ఐరన్ లెగ్ అన్నారు: శ్రుతి హాసన్
హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో తనను కొందరు అన్ లక్కీ అన్నారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు శ్రుతీహాసన్. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడుతూ – ‘‘అందరికీ ఉండే భయాలతోనే నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్ పాత్రలకు సరిపోనని, నా వాయిస్ బాగోలేదని, నేను సక్సెస్ఫుల్ మూవీ స్టార్గా ఎదగలేనని కొందరు నా గురించి మాట్లాడుకున్నారు. దీనికి తోడు తెలుగులో నేను చేసిన తొలి రెండు సినిమాలు (అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్) అంతగా ఆడలేదు. దీంతో నేను ‘అన్ లక్కీ’ అని, ‘ఐరన్ లెగ్’ అని మాట్లాడుకున్నారు. కానీ తెలుగులో నేను చేసిన మూడో సినిమా (గబ్బర్సింగ్) హిట్ కావడంతో నన్ను గోల్డెన్లెగ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓవర్నైట్లో అంతా మారిపోయింది. మన గురించి ఇతరుల అభిప్రాయాలు వారికి తోచినట్లుగా ఉండొచ్చు. కానీ మనం మనతో నిజాయితీగా మాట్లాడుకోవాలి. అప్పుడే మన సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందని నా నమ్మకం. నా సక్సెస్ఫుల్ సినీ కెరీర్లో తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానం చాలా ముఖ్యమైనవి’’ అన్నారు. -
హీరోయిన్ శ్రుతి హాసన్కు కరోనా పాజిటివ్
Shruti Haasan Tests Positive For Covid-19: హీరోయిన్ శ్రుతి హాసన్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. హాయ్ ఎవర్రీవన్. ఇది సరదా అప్డేట్ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు శ్రుతి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రుతి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 107వ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. దీంతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్రంలోనూ నటిస్తుంది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
నాగచైతన్యతో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది : శ్రుతిహాసన్
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది శ్రుతిహాసన్. తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించి తొలి సినిమాకే మంచి గుర్తింపును సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంలో నెలకొన్న ఒడిదుడుకులతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవలె క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2016లొ నాగ చైతన్యతో కలిసి నటించి ప్రేమమ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ పినిమాలో నేను చేసిన మలర్ పాత్రను మలయాళ ఒరిజినల్ వెర్షన్ సాయిపల్లవితో పోల్చి నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో బాధపడ్డా. అసలు సినిమాలో నటించకుండా ఉండాల్సింది అని ఒకానొక సమయంలో బాగా ఫీల్ అయ్యాను. అయితే ఇది కొంతసేపే. ట్రోల్స్ గురించి పక్కన పెడితే, ఆ సినిమాలో మరల్ పాత్ర చేస్తున్నప్పుడు ప్రతిక్షణం ఎంజాయ్ చేశాను అని పేర్కొంది. -
నీ ఆస్తి ఎంత? అన్న ప్రశ్నకు శ్రుతి హాసన్ ఆన్సరిదే!
శ్రుతి హాసన్.. సౌత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయిక. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ సమయం దొరికితే మాత్రం ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తుంటుందీ ముద్దుగుమ్మ. అయితే దొరికిందే సందనుకునే కొందరు నెటిజన్లు చిత్రవిచిత్ర ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెడుతుంటారు. ఒకవేళ ఆమె ఆన్సర్ ఇవ్వలేదంటే గూగుల్ తల్లిని పదేపదే అడుగుతూ సమాధానాలు రాబడుతుంటారు. తాజా ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్.. తన గురించి గూగుల్లో ఎక్కువగా ఆరా తీసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. అందులో భాగంగా ఆమె ఫోన్ నంబర్ అడగ్గా.. 100 అని ఇంతకుముందు కూడా చెప్పానుగా అని బదులిచ్చింది. రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. 'ఓహ్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసు.. శ్రుతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక ఎవరు? ఇదేగా.. ఎందుకంటే దీన్ని నేను గూగుల్ చేశాను. అక్కడ కనిపించిన మిగతా ప్రశ్నల పరంపరను చూసి తెగ నవ్వుకున్నాను. ఇంతకీ నా ఆన్సరేంటంటే, అవును, నేను డేటింగ్ చేస్తున్నాను' అని తెలిపింది శ్రుతి హాసన్. 'నీ ఆస్తి మొత్తం ఎంతుంటుంది?' అన్న ప్రశ్నకు 'శ్రుతి హాసన్ దాన్ని కనుగొనే పనిలోనే ఉంది, కానీ తను అదింకా పెరగాలనుకుంటోంది' అని చెప్పుకొచ్చింది. -
డిజిటల్ ప్లాట్ ఫామ్ లో శృతి ఫుల్ బిజీ
-
బర్త్డే కేక్ డిజైన్ చేసిన ప్రియుడు, లక్కీగాళ్గా ఫీలవుతున్న శ్రుతీ!
హీరోయిన్ శ్రుతీహాసన్ లక్కీగాళ్గా ఫీలవుతున్నారు. ఈ నెల 28న శ్రుతీహాసన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ బర్త్ డే కేక్ను శ్రుతి ప్రియుడిగా చెప్పుకుంటున్న శాంతను హజారికా డిజైన్ చేశారు. ఈ విషయాన్ని శ్రుతీహాసన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొనడంతో పాటు హజారికా డిజైన్ చేయించిన కేక్ను కూడా షేర్ చేశారు. ‘‘అతను నన్ను ఎప్పుడూ ప్రత్యేకంగా నవ్వించేలా చేస్తుంటాడు. లక్కీ గాళ్గా ఫీలవుతున్నాను’’ అని పేర్కొన్నారు శ్రుతి. బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్, ప్రభాస్ ‘సలార్’లో హీరోయిన్గా శ్రుతీహాసన్ బిజీగా ఉన్నారు. -
రెండు భాగాలుగా సలార్ మూవీ? డార్లింగ్ ఫ్యాన్స్కు పూనకాలే!
Buzz: Prabhas Salaar To Be Made In Two Parts: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సలార్'. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్కు పండగే. ఇప్పటికే ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం రెండు పార్టులుగా రిలీజ్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మాటల్లో చెప్పలేను.. శ్రుతీహాసన్ ఎమోషనల్ పోస్ట్
పుట్టిన రోజు(జనవరి 25) సందర్భగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు హీరోయిన్ శ్రుతీ హాసన్. తనపై చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేనంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నాపై ప్రేమను చూపేందుకు టైమ్ కేటాయించిన అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రేమను మాటల్లో చెప్పలేను. ఈ అందమైన, క్లిష్టమైన భూమిపై నా జీవితంలో మరో సంవత్సరం గడిచిపోయింది. కానీ నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలుసు. నన్ను నేను రియాలిటీకి దగ్గరగా ఉంచుకోవాలనుకుంటాను. ప్రత్యక్షంగా కావొచ్చు.. పరోక్షంగా కావొచ్చు. జీవితంలో నాకు తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటుంటాను’అని పుట్టినరోజు సందర్భంగా శ్రుతి తన మనసులోని మాటలను వ్యక్తపరిచారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
#HBDShrutiHaasan : శృతి హాసన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
‘సలార్’ అప్డేట్: శ్రుతీహాసన్ ఫస్ట్లుక్ వచ్చేసింది
Shruti Haasan Birthday Special: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది. నేడు(జనవరి 28) శ్రుతీహాసన్ బర్త్డే. ఈ సందర్బంగా సలార్ టీమ్ శ్రుతీకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. ఆమె ఫస్ట్ లుక్ని విడుదల చేసింది. ఈ సినిమాలో ఆద్య పాత్రలో శ్రుతీ హాసన్ నటించనుంది. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో శ్రుతీహాసన్ కనిపిస్తోంది. బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటించనున్నట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది. Happy birthday @shrutihaasan. Thank u for being a part of #Salaar, and bringing in a tad bit of color to the sets !#HBDShrutiHaasan #Prabhas @VKiragandur @hombalefilms @HombaleGroup @IamJagguBhai@RaviBasrur @bhuvangowda84 pic.twitter.com/vkpwUd2f3j — Prashanth Neel (@prashanth_neel) January 28, 2022 -
అతన్ని తొలిసారి అప్పుడే కలిశాను: శ్రుతీహాసన్
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటారు హీరోయిన్ శ్రుతీహాసన్. వీలు కుదిరినప్పుడల్లా తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. తాజాగా ఫ్యాన్స్కి ఆ అవకాశం ఇచ్చారు. అయితే తన ఫేవరెట్ విషయాలను మాత్రమే అడగాలని కండీషన్ పెట్టారు శ్రుతి. కానీ నెటిజన్స్ ఊరుకుంటారా? ఎవరికి నచ్చినవి వాళ్లు అడిగారు. అవేంటో చూద్దాం. వారంలో ఏ రోజు అంటే మీకు ఇష్టం? ప్రత్యేకంగా కారణం చెప్పలేను కానీ శనివారం అంటే ఇష్టం. ఆ తర్వాత గురువారం. వర్కౌట్స్ గురించి ఏం చెబుతారు? మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా స్విమ్మింగ్, డ్యాన్సింగ్ అంటే ఇష్టం. అయితే ఎక్కువ సమయం కేటాయిం చాల్సిన యోగా అంటే నాకు అంత ఇష్టం లేదు. ఎలాంటి పువ్వులను ఇష్టపడతారు? రోజా పువ్వులంటే చాలా ఇష్టం. ఆ తర్వాత లిల్లీ పువ్వులు ఇష్టం. మీరు ఏ ఫలాన్ని ఇష్టంగా తింటారు? సీతాఫలాలు. వీటితో పాటు చెర్రీస్ కూడా. మీకు ఇష్టమైన ఫుడ్? దోసె, సాంబార్, రసం వడ. శంతను (శ్రుతి బాయ్ఫ్రెండ్)ని మీరు ఎప్పుడు కలిశారు? తొలిసారి 2018లో శంతనుని కలిశాను. 2020 నుంచి మేం రిలేషన్షిప్లో ఉన్నాం. గిటార్ లేదా పియానోలలో ఏది ఇష్టం? నాకు గిటార్ సౌండింగ్ ఇష్టం. కానీ గిటార్ను ప్లే చేయలేను. అందుకే పియానో నా ఫేవరెట్. మీ ఫేవరెట్ బుక్? ద ఓల్డ్మ్యాన్ అండ్ ది సీ స్ట్రయిట్ లేదా కర్లీ హెయిర్.. ఏది ఇష్టం? నాకు స్ట్రయిట్ హెయిర్ అంటేనే ఇష్టం. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఎప్పటికీ ఏఆర్ రెహమాన్గారే. మీ శరీరంలో మీకు ఇష్టమైనవి? నా బ్రెయిన్,నా హార్ట్. -
రిలేషన్షిప్ గురించి సీక్రెట్స్ బయటపెట్టిన హీరోయిన్
Shruthi Haasan Reveals Secrets About Her Relationship: హీరోయిన్ శృతీ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం శాంతను హజారిక అనే చిత్రకారుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శృతి తరుచూ అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో కపుల్ గోల్స్ పేరిట క్విజ్లో పాల్గొన్న ఈ జంట పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. అందులో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అన్న ప్రశ్నకు..నేను అంటూ శృతీ సమాధానం చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్తో కలిసి సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
శ్రుతీహాసన్ లిస్ట్లో మరో భారీ ఆఫర్
శ్రుతీహాసన్ లిస్ట్లో మరో భారీ ఆఫర్ చేరనుందా? అంటే ఫిల్మ్నగర్ అవుననే అంటోంది. చిరంజీవి సరసన ఈ బ్యూటీ జోడీ కట్టనున్నారని టాక్. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతీహాసన్ని కథానాయికగా ఎంపిక చేశారట. ఈ చిత్రంలో చిరంజీవి మత్స్యకారుడిగా కనిపించనున్నారని, టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రవితేజతో చేసిన ‘క్రాక్’ హిట్తో శ్రుతి మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తున్నారామె. ఇటీవలే బాలకృష్ణ సరసన సినిమా చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు వార్తల్లో ఉన్నట్లు మరో పెద్ద ఆఫర్ ఉందా? చిరంజీవి–శ్రుతీ కాంబో కుదురుతుందా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. -
టాలీవుడ్ లో దూసుకుపోతున్న శృతిహాసన్
-
బిగ్బాస్ 5: బిగ్బాస్ హోస్ట్గా శ్రుతి హాసన్!
Shruti Haasan Turns Tamil Bigg Boss 5 Reality Show Host: బిగ్బాస్ రియాలిటీ షోలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్లో 5 రోజులు ఒకేత్తు అయితే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే వీకెండ్ ఎపిసోడ్ మరో ఎత్తు. ఆ 5 రోజులు హౌజ్లో రచ్చ రచ్చ చేస్తూ, గొడవలతో దారి తప్పే హౌజ్మేట్స్ను సెట్ చేయాలన్నా, రకరకాల టాస్క్లతో కంటెస్టెంట్స్కి సంతోషాన్ని పంచాలన్నా అది బిగ్బాస్ హోస్ట్గా వ్యవహరించే వారికే దక్కుతుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో స్టార్స్ హోస్ట్స్గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు డబుల్ వినోదాన్ని పంచుతున్నారు. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు బిగ్బాస్ హోస్ట్స్ అందుబాటులో లేకపోతే.. వారి స్థానంలో మరొక సెలబ్రెటీ షో హోస్ట్గా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతేడాది తెలుగు బిగ్బాస్ సీజన్ 4 హోస్ట్ నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో ఆ వీకెండ్ ఎపిసోడ్స్ టీఆర్పీ రేసులో ముందంజలో దూసుకుపోయాయి. తాజాగా తమిళ బిగ్బాస్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ షోకు విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన కమల్ కరోనా బారిన పడ్డాడు. చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో కమల్ మరో రెండు వారాల పాటు అందుబాటులోకి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో కమల్ స్థానంలో హోస్ట్గా స్టార్ హీరోయిన్, ఆయన కూతురు శ్రుతీ హాసన్ను దింపేందుకు తమిళ బిగ్బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్ను హోస్ట్గా పెడితే ఈ షో మరింత ఆసక్తిగా మారుతుందనే ఉద్దేశంతో నిర్వాహకులు ఇలా ప్లాన్ చేస్తున్నారట. దీంతో బిగ్బాస్ నిర్వాహకులు ఆ దిశగా ప్లాన్ చేస్తూ శ్రుతిని సంప్రదించారట. మరి దీనికి ఆమె ఒకే చెప్పిందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి. కాగా తమిళంలో కూడా బిగ్బాస్ సీజన్ 5 నడుస్తోన్న సంగతి తెలిసిందే. -
జీవితకాల బాధ్యతగా భావిస్తున్నాను.. బాలయ్యపై గోపిచంద్ ఎమోషనల్ ట్వీట్
నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్లో ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలయ్య కెరీర్లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే గోపిచంద్ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ గోపిచంద్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో. నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కంటే జీవితకాల బాధ్యతగా భావిస్తున్నాను. జై బాలయ్య’అంటూ ట్వీట్ చేశాడు. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో. నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా life time achievement కంటే lifetime responsibilityగా భావిస్తూ.జై బాలయ్య pic.twitter.com/6NG75pWQbZ — Gopichandh Malineni (@megopichand) November 13, 2021 -
ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ కొత్త చిత్రం ఫోటోలు
-
బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ
హీరో బాలకృష్ణ సరసన శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా శ్రుతీహాసన్ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘ఫుల్ మాస్ మసాలా చిత్రమిది. వాస్తవ ఘటనలతో గోపీచంద్ ఈ కథ రాశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
Shruti Haasan: కొన్నిసార్లు ఏడుస్తాను... ఆ కన్నీళ్లల్లో..
‘‘మీరు (ఫ్యాన్స్) చూపించే ప్రేమ.. ఐస్క్రీమ్... ‘యాంకర్ మ్యాన్’ (అమెరికన్ కామెడీ సినిమా)... నన్ను ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చడానికి ఇవి చాలు’’ అంటున్నారు శ్రుతీహాసన్. ‘ప్రశ్నలు అడగండి.. సమాధానం చెబుతా’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఆ చిట్ చాట్లో కొన్ని ప్రశ్నలు–జవాబులు. ♦మీ నాన్న (కమల్ హాసన్) గారి నుంచి నేర్చుకున్న మూడు విషయాలు? ప్రత్యేకంగా ఈ మూడు అని చెప్పలేను. చాలా ఉన్నాయి. నిర్భయంగా ఉండటం నేర్చుకున్నాను. జీవితం ఉల్లాసంగా సాగాలంటే హాస్యం ముఖ్యం అని కూడా నాన్న నుంచి తెలుసుకున్నాను. ♦మిమ్మల్ని నెగటివ్ రోల్స్లో చూడాలని ఉంది.. చేయాలని నాకూ ఉంది. కానీ కరెక్ట్గా కుదరాలి. ఏదో నెగటివ్ రోల్ చేయాలి కదా అని ఏది పడితే అది చేయకూడదు. ♦అదృష్టాన్ని నమ్ముతారా? అంతకన్నా ఎక్కువగా హార్డ్వర్క్ని, మంచి అవకాశాలను నమ్ముతాను. ♦బాధని అధిగ మించడానికి ఏం చేస్తారు? దేవుడిని పూజిస్తాను. ఫ్రెండ్తో మాట్లాడతాను. కొన్నిసార్లు ఏడుస్తాను... ఆ కన్నీళ్లల్లో నా బాధ కూడా కరిగిపోతుంది. ♦సంగీతంపరంగా ఏ దశాబ్దం బెస్ట్ అనుకుంటున్నారు? ప్రతి డికేడ్లోనూ మంచి సంగీతం వింటున్నాం. అయితే 1970 బెస్ట్ అంటాను. ♦జీవితం ఎలా ఉంది? ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకుంటున్నాను. కొన్ని క్లిష్టమైనవి.. కొన్ని అందమైనవి. మొత్తం మీద జీవితం అద్భుతంగా ఉంది. ♦మిమ్మల్ని ఆనందపరిచే విషయం? నాకు బోలెడంత ఆనందాన్ని ఇచ్చేది ‘నిజాయతీ’ అనేది ఇన్నేళ్లల్లో నేను నేర్చుకున్న ఓ పాఠం. -
లైవ్లో ఫోన్ నెంబర్ అడిగిన ఫ్యాన్, ఆ నెంబర్ ఇచ్చిన శృతి హాసన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. బాయ్ఫ్రెండ్ శాంతను హజారికతో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతోంది. అలాగే సోషల్ మీడియాలో సైతం ఆమె ఫుల్ యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శృతి తరచూ ఫ్యాన్స్తో ముచ్చటిస్తోంది. అలాగే నిన్న(సోమవారం) ట్విటర్లో లైవ్ చిట్చాట్ నిర్వహించిన ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. చదవండి: విడాకులపై స్పందించిన సమంత తండ్రి ఆస్క్ మీ ఎనీథింగ్ లైవ్ సెషన్లో భాగంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో తనకు ఎదురైన ఓ ప్రశ్నకు శృతి తనదైన శైలి సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ శృతి ఫొటో నెంబర్ అడిగాడు. దీనికి పోలీసు హెల్ప్లైన్ నెంబర్ 100 ఇచ్చింది. దీంతో శృతి రిప్లై చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె చమత్కారానికి అందరూ ఫిదా అవుతున్నారు. సదరు నెటిజన్ను నొప్పించకుండా సమయ స్ఫూర్తితో వ్యవహిరించిన శృతి తీరుపై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. చదవండి: సొంతింటి కల నిజం చేసుకున్న బిగ్బాస్ కంటెస్టెంట్, ఇల్లు చూశారా? 100 https://t.co/82Yr6XoBKs — shruti haasan (@shrutihaasan) October 4, 2021 అలాగే తనకు ఇష్టమైన ఆటగాడు ఎవరని అడగ్గా.. మైఖేల్ జోర్డాన్, సచిన్ టెండూల్కర్ అని తెలిపింది. కాగా ఇటీవల బాయ్ఫ్రెండ్ శాంతనుతో ముంబైలోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ఇంటి సరకుల కోసం షాపింగ్ చేయడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చింది. శృతి సంతనుతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన లాభం చిత్రం ఇటీవల విడుదల కాగా, ప్రస్తుతం శృతి ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి Don’t fear the reaper - blue oyster cult https://t.co/km8UqkDsgp — shruti haasan (@shrutihaasan) October 4, 2021 My most fav is @neilhimself https://t.co/lViOCVgM7y — shruti haasan (@shrutihaasan) October 4, 2021 Don’t fear the reaper - blue oyster cult https://t.co/km8UqkDsgp — shruti haasan (@shrutihaasan) October 4, 2021 Over the years I’ve learned that what makes me the happiest is HONESTY https://t.co/XUlluulfuh — shruti haasan (@shrutihaasan) October 4, 2021 -
రానాతో శ్రుతిహాసన్..సీక్రెట్ ప్రాజెక్టా?
Shruti Haasan Meets Rana Daggubati: హీరో రానా, హీరోయిన్లు శ్రుతీహాసన్, అక్షరా హాసన్ కలిసి మాట్లాడుకున్నారు. ‘‘మంచివాళ్లతో మంచి రోజు. రానాతో పాటు నా చెల్లెలు అక్షరతో కలిసి స్పెండ్ చేసిన ఈ సమయం నాకు చాలా ప్రత్యేకం’’ అనే క్యాప్షన్తో శ్రుతీహాసన్ ఓ ఫొటో షేర్ చేశారు. ఇంతకీ ఈ ముగ్గురూ ఎందుకు కలుసుకున్నట్లు? ఏదైనా సినిమాలో కలిసి నటించనున్నారా? లేక వెబ్ సిరీస్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారా? అనే చర్చలకు ఈ ఫొటో దారి తీసింది. మరి.. వీరిది క్యాజువల్ మీటింగా? లేక ప్రొఫెషనల్ మీటింగా? వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Hyderabad Times (@hyderabad_times) -
థియేటర్లలోనే విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ల ‘లాభం’
విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ హీరో, హీరోయిన్లుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన చిత్రం ‘లాభం’. ఎస్పీ జననాథన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది. (చదవండి: ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 'విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన "లాభం" చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు. -
బ్లాక్ వాటర్ తాగుతున్న మలైకా.. స్పెషల్ ఏంటి? ధర ఎంత?
Malaika Arora Black Water Drink: బ్లాక్ వాటర్ ఎప్పుడైనా తాగారా? ఇదేంటి మినరల్ వాటర్ తెలుసు, రోజ్వాటర్ తెలుసు కానీ.. బ్లాక్ వాటర్ ఏంటి అంటారా? ఈ మధ్య కాలంలో ఈ వాటర్కి బాగా డిమాండ్ పెరిగింది. సెలిబ్రిటీలు ఈ వాటర్ని తాగేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు. తాజాగా తాజాగా బాలీవుడ్ నటి మలైకా ఆరోరా సైతం ఈ బ్లాక్వాటర్నే తాగుతుంది. ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో బ్లాక్ వాటర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. బ్లాక్ వాటర్ స్పెషల్ ఏంటి? ఈ నలుపు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఈ వాటర్ ధర ఎంత? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. (చదవండి: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్) సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు ఒక లీటర్కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది. లీటర్ బ్లాక్ వాటర్ బాటిల్కు దాదాపు రూ. 100 ఉంటుందట. ఈ వాటర్లో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీటర్ బ్లాక్ వాటర్లో 70 మినరల్స్ ఉంటాయి. అవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఈ వాటర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రభాస్కు పెద్ద థ్యాంక్స్: శ్రుతీహాసన్
మండీ బిరియానీ, గోంగూర మటన్, చేపల పులుసు, చికెన్ బిర్యానీ, పనీర్, కబాబ్, వెజ్ మంచూరియా, రెండు రకాల పప్పు కూరలు, రైస్, రసం...ఏంటీ ఈ ఫుడ్ మెను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇవన్నీ ‘సలార్’ సినిమా సెట్స్లో హీరోయిన్ శ్రుతీహాసన్ ముందు తినడానికి రెడీగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. శ్రుతీహాసన్కు ప్రభాస్ తమ ఇంటి నుంచి ఫుడ్ తెప్పించారు. ఆ ఫుడ్ ఐటమ్స్ను చూపిస్తూ తాను ఏ సినిమా సెట్స్లోనూ ఇన్ని ఐటమ్స్ను ఒకేసారి టేస్ట్ చేయలేదని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు శ్రుతి. ఇన్ని వంటకాలు పంపిన ప్రభాస్కు పెద్ద థ్యాంక్స్ అని కూడా అన్నారు. ఇక ‘సలార్’ విషయానికి విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం త్వరలో విడుదల చేయనుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. -
శ్రుతిహాసన్ కోసం ప్రభాస్ చేయించిన వంటలు చూస్తే నోరూరాల్సిందే..
Prabhas surprises Shruti Haasan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్లో ఉంటాయి. సెట్లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. వెరైటీ వంటకాల రుచి చూపిస్తారాయన. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్..ఈసారి సలార్ బ్యూటీ శ్రుతిహాసన్ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా సలార్ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ కోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీ సహా దాదాపు ఇరవై రకాల వంటకాలను ప్రభాస్ వండించి తీసుకొచ్చారట. దీనికి సంబంధించిన లిస్ట్ను శ్రుతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బయటపెట్టింది. నోరూరించే వంటకాలు చూసి శ్రుతి చాలా థ్రిల్కి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాస్ ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్కు మురిసిపోయిన శ్రుతి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఆయన డార్లింగ్ అంటూ కొనియాడుతున్నారు. -
సలార్: ఈ యాక్షన్ సీన్స్ సినిమాలోనే హైలైట్ అట!
Salaar Movie: ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శ్రుతీహాసన్ కూడా జాయిన్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొంత నైట్ షూట్ కూడా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ను తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం విలన్ ఉండే ఓ డెన్ సెట్ను తయారు చేయించారట. ప్రభాస్ పాల్గొనే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ఓ హైలైట్గా ఉంటుందట. ఈ ఫైట్ సీన్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వైరల్ ఫొటో: పబ్లిక్గా ఆ ముద్దులేంటి శ్రుతీ?
Shruti Haasan With Boyfriend Santanu Hazarika: ఎవరైనా సెలబ్రిటీ ఇల్లు దాటి బయటకొస్తే చాలు కెమెరాలు క్లిక్కుమనిపిస్తూ, వీలైతే సెల్ఫీ దిగుతూ సందడి చేస్తుంటారు జనాలు. అలాంటిది ఏకంగా తారలు తమ లవర్తో బయట కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. ఫొటోలు, వీడియోలు తీస్తూ, వారినే కళ్లప్పగించి చూస్తూ ఉంటారు. ఇంతకీ ఇప్పుడు ఏ సెలబ్రిటీ ఇలా బాయ్ఫ్రెండ్తో బయట షికారుకొచ్చిందనుకుంటున్నారా? ఇంకెవరు దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసనే.. తాజాగా శ్రుతీ హాసన్ తన బాయ్ఫ్రెండ్ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్మార్కెట్లో ప్రత్యక్షమైంది. ఇంకేముందీ ఈ జంటను అక్కడి జనాలు తమ ఫోన్ కెమెరాల్లో బంధించడంటో నిమగ్నమయ్యారు. శ్రుతీ కూడా పోజులివ్వడానికి సై అంది. శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్గా ముద్దులు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో యాడ్ చేసింది. ఇది చూసిన జనాలు పబ్లిక్గా ఆ ముద్దులేంటి? అని నోరెళ్లబెడుతున్నారు. కాగా శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ 'సలార్'లో కథానాయికగా నటిస్తుండగా, ఓ వెబ్ సిరీస్కు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. అలాగే ఆమె నటించిన 'లాభం' సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. -
చికెన్ తింటూ, తినిపిస్తూ.. బాయ్ఫ్రెండ్తో శృతీహాసన్
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'క్రాక్'తో ప్రేక్షకులకు తనలోని మాస్ యాంగిల్ను రుచి చూపించింది హీరోయిన్ శృతీ హాసన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే ఒక సినిమా చేస్తోంది. ప్రభాస్ సరసన 'సలార్'లో కథానాయికగా నటిస్తోంది. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ హాసన్ పాపులర్ అవుతూ వచ్చింది. గతంలో ఆమె ఓ ఫొటోగ్రాఫర్ను ప్రేమించిన విషయం తెలిసిందే. ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ ముద్దుగుమ్మ ప్రియుడి కోసం సినిమాలను కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ సడన్గా వారి ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పడింది. కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరికీ బ్రేకప్ కావడంతో శృతీ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. అంతలోపే ఆమెకు మరో కొత్త బాయ్ఫ్రెండ్ దొరికినట్లు తెలుస్తోంది. శాంతన్ హజారిక అనే చిత్రకారుడితో శృతీ ఈ మధ్య తరచూ కనిపిస్తుండటంతో వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు ఈ భామ అతడితో కలిసి దిగిన ఫొటోలను, వీడియోలను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఈ కథనాలకు మరింత ఊతమిచ్చినట్లైంది. తాజాగా శృతీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. కిచెన్లో దూరిపోయిన శృతీ, శాంతన్ చికెన్ ఫ్రై తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. పనిలో పనిగా తను తింటున్న పీస్లో కొంత భాగాన్ని ప్రియుడికి కూడా తినిపించింది శృతీ. "అదో సాధారణ సాయంత్రం. ఫ్రీ ఫుడ్ దొరికింది, అంతే ఓ పట్టు పట్టాం. మా ఇద్దరికీ చికెన్ ఫ్రై అంటే తెగ ఇష్టం. కలిసి తినేవారే కలిసి ఉండగలరు" అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన జనాలు 'మీ తిండి చూస్తుంటే మాకు నోరూరుతుంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
‘ఆహా.. నా నంబరు కావాలా! కుదరదు’
కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇంతకీ శ్రుతి ఏదైనా సినిమా ఆఫర్ని కుదరదంటే కుదరదన్నారా? అంటే.. కాదు... కాదు. ఇద్దరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ‘కుదరదు’ అని సమాధానం చెప్పారు శ్రుతి. ఇటీవల సోషల్ మీడియా లైవ్ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు శ్రుతీహాసన్. ఒక అభిమాని ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని అడిగితే ‘కుదరదు’ అని చెప్పారు. అలాగే మరో అభిమాని ‘మీ మొబైల్ నంబరు ఇస్తారా’ అని అడగ్గా ఈ ప్రశ్నకు కూడా శ్రుతి ‘ఆహా.. నా నంబరు కావాలా! కుదరదు’ అని సరదాగా చెప్పారు. ఇంకా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ– ‘‘క్రాక్’ సినిమాలో నేను చేసిన యాక్షన్ సీన్స్కు మంచి స్పందన లభించినందుకు సంతోషంగా ఉంది. ‘సలార్’ సినిమాలో నాకు అంతగా యాక్షన్ సీన్స్ లేవు. కానీ మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో ప్రభాస్తో యాక్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
అమ్మానాన్న విడిపోవడం సంతోషమే: శృతీ హాసన్
కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతీ హాసన్. కానీ తనదైన నటతో, ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సింగర్, నటి, డ్యాన్సర్, సంగీత దర్శకురాలిగా.. ఇలా ఎన్నో కళల్లో ఆరితేరిన శృతీ ఏదైనా సూటిగా సుత్తి లేకుండా ముఖం మీదే చెప్పేస్తుంది. తాజాగా ఆమె తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి స్పందించింది. శృతీ హాసన్ బాల్యంలోనే తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోయారు. దీని గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వారు విడిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారికి ఇష్టం లేకపోయినా ఏవేవో కారణాలు చెప్పి బలవంతంగా కలిసుండేలా చేయడం కరెక్ట్ కాదు. వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. నా చిన్నవయసులోనే వారు ఒకరికొకరు దూరమయ్యారు. అదంతా చాలా ఈజీగా జరిగిపోయింది. అయినా కలిసి ఉన్నప్పటికంటే కూడా విడిపోయాకే వారు హ్యాపీగా ఉంటున్నారు' అని చెప్పుకొచ్చింది. ఇక తను ఎక్కువగా తండ్రి కమల్కు క్లోజ్ అని చెప్పింది. కమల్ సారికను ప్రేమించి 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 1986లో శృతీ హాసన్ జన్మించింది. 1991లో అక్షర పుట్టింది. అంతలోనే కమల్, సారిక మధ్య మనస్పర్థలు తొంగి చూశాయి. అవి కాస్తా పెద్దది కావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. ఇక అక్షర హాసన్ 2015లో 'షమితాబ్' సినిమాలో తళుక్కున మెరవగా శృతీ హాసన్ తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో రాణిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె 'సలార్'లో జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. చదవండి: నెటిజన్ అడగ్గానే వాట్సాప్ నెంబర్ చెప్పేసిన హీరోయిన్ -
బాలకృష్ణ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రుతిహాసన్?
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో కథానాయుకగా శ్రుతిహాసన్ ఫైనల్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన 'బలుపు', 'క్రాక్' సినిమాల్లో శ్రుతినే హీరోయిన్గా చేసింది. ఆ రెండు సినిమాలు హిట్ కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్తో మరోసారి శ్రుతిని సంప్రదించారని, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మరోసారి శ్రుతితో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారట గోపిచంద్ మలినేని. బాలకృష్ణ చేస్తున్న అఖండ షూటింగ్ జులైలో పూర్తి కానుందట. ఈ మూవీ పూర్తయిన వెంటనే గోపిచంద్తో సినిమా చేయనున్నారు బాలయ్య. అటు శ్రుతి హాసన్ కూడా ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ఇండియా మూవీలో నటిస్తుంది. చదవండి : బాలయ్యను చూసి ఆశ్చర్యపోయా: ప్రగ్యా జైస్వాల్ కరోనా కష్టకాలంలో నెటిజన్కు నవీన్ పొలిశెట్టి సర్ప్రైజ్ -
ఈ టైంలో లవ్ అంటోన్న నటి, నెక్స్ట్ ఏంటన్న బ్రహ్మాజీ
► క్యూట్ ఫొటో షేర్ చేసిన చార్మీ కౌర్ ► రిజెక్ట్ చేసేముందు ఆలోచించుకోండి అంటూ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను షేర్ చేసిన నటి సిమ్రత్ కౌర్ ► సండేను సూపర్గా ఎంజాయ్ చేసిన యాంకర్ విష్ణుప్రియ ► కరోనా టైంలో లవ్ అంటోన్న శిల్పా శెట్టి ► ఊయలూగుతున్న నందినీ రాయ్ ► ఆహార పొట్లాలు పంచుతోన్న మంచు లక్ష్మీ టీమ్ ► తన కన్నా తన పిల్లి క్లారా బాగా రీల్స చేస్తుందంటోన్న శృతీ హాసన్ ► నెక్స్ట్ ఏంటి అని అడుగుతోన్న బ్రహ్మాజీ ► త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
Salaar: ప్రభాస్ డబుల్ యాక్షన్!
హీరో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా మారారు. ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రం రూపొందుతోంది కదా. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్ పాత్ర అని ఫిల్మ్నగర్ టాక్. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్గా ఉంటాయట. మరి... ప్రభాస్ ఇందులో రెండు పాత్రలు చేస్తున్నది నిజమే అయితే ఇంకో పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘సలార్’ షూటింగ్కి బ్రేక్ పడింది. కోవిడ్ వ్యాప్తి తగ్గిన తర్వాత తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. చదవండి: విషాదం: నటుడు కుట్టి రమేష్ కన్నుమూత -
లాక్డౌన్లో బాయ్ఫ్రెండ్తో శ్రుతీ రచ్చ, పోస్టు వైరల్
డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతీహాసన్ ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది శ్రుతీ బర్త్డేకి శాంతను పెట్టిన పోస్టులు, ముంబై రోడ్లపై వీరిద్దరూ జంటగా చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. ఇక శ్రుతీ తాజా పోస్టు చూస్తే తప్పకుండా వీరిద్దరూ అవ్బర్డ్స్ అని ఒప్పుకొక తప్పదు. లాక్డౌన్లో శాంతానుతో కలిసి ఉన్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేసింది. శ్రుతీ, తన రూమర్డ్ బాయ్ఫ్రెండ్ శాంతనుపై కుర్చోని అతడి బుక్కలు గిల్లుతూ, లాగుతూ నానా రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రుతీ ‘బెస్టీతో లాక్డ్న్’ అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం శ్రుతీ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్ వీడియో చేయడానికి రెడీ అయ్యారట. కొంతకాలంగా మ్యూజిక్ కంపోజింగ్ మీద కూడా శ్రుతి బాగా దృష్టిపెట్టిన శ్రుతీ లండన్లో కొన్ని షోలు కూడా చేశారామె. తాజాగా శ్రుతి చేస్తున్న మ్యూజిక్ వీడియోలో శాంతను ర్యాప్ పాడనున్నారట. ఇంతకుముందు ర్యాపర్గా కొన్ని పాటలు పాడిన అనుభవం శాంతనుకు ఉంది. దీంతో వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్ వీడియో చేయడానికి సిద్దమయ్యారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: కొత్త ఇంటికి మారిన బిగ్బాస్ భామ అరియాన -
ఆ చిన్నారులకు నేనున్నా అంటున్న సందీప్!
కంటికి కనిపించని కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అటు జనాలకు, ఇటు ప్రభుత్వాలకు కంటిమీద కనుకు లేకుండా చేసింది. ఆర్థిక వ్యవస్థను, అమయాకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఎంతోమందిని ఈ వైరస్ పొట్టనపెట్టుకోవడంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాధలుగా మారారు. వారి ఆలనాపాలనా, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కోవిడ్తో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని ఇటీవలే నటుడు సోనూసూద్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కానీ దీనిపై ఎటువంటి సమాధానం రాలేదు. తాజాగా టాలీవుడ్ హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, శృతి హాసన్ కోవిడ్ కారణంగా కన్నవారికి దూరమైన వారిని ఆదుకునేందుకు నడుం బిగించారు. ఆలనా పాలనా మాత్రమే కాదు..: సందీప్ కిషన్ 'దురదృష్టవశాత్తూ కరోనా వల్ల కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి. వారి వివరాలను sundeepkishancovidhelp@gamil.comకి పంపించండి. నేను, నా టీమ్ వారికి ఆహారాన్ని అందించడంతో పాటు సంరక్షణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటాం. అలాగే కొన్నేళ్ల పాటు విద్యను అందిస్తాం.. ఈ కష్ట సమయంలో అందరం ఒకరికొకరు తోడుగా నిలబడటం అత్యంత అవసరం. కాబట్టి మీరు కూడా మీ పరిసరాల్లో కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సహాయం చేయండి' అని పేర్కొంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. Please Pass on the word.. Love you All ❤️ SK pic.twitter.com/tsgRsgJtSz — Sundeep Kishan (@sundeepkishan) May 3, 2021 Some people just love to take the 1st given opportunity to be a Know it all Online..lol My team & I reasonably educated & are in touch with the concerned officials to figure the best way to do this,we are all trying to do our bit here...so if possible help,if not pls keep calm 🤟🏽 https://t.co/ugebcCXl0W — Sundeep Kishan (@sundeepkishan) May 4, 2021 వారిని మంచి మనుషుల చేతులో పెడదాం..: శృతీహాసన్ "అందరికీ నమస్కారం.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. వారికి ఏమీ కాదు, ఆ చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. అందుకు ఒక పరిష్కారమార్గం ఉంది. 1098 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించండి. వారిని మంచి మనసున్నవారికి దత్తతివ్వండి" అని శృతీ హాసన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: A1 Express: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది -
సాయం చేద్దాం అంటూ హీరోయిన్ల పిలుపు
దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు అందర్నీ కలవరపెడుతున్నాయి. ఈ క్లిష్టతర పరిస్థితుల్లో ఒకరికి ఒకరం సాయం చేసుకుంటూ ముందుకు అడుగులు వేయాలని అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్, రకుల్ ప్రీత్సింగ్, ప్రజ్ఞా జైస్వాల్. ఈ అందాల తారలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న కరోనా పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. మన వంతు సాయం చేద్దాం. ఆ సాయం కోవిడ్ ఆసుపత్రుల గురించిన సమాచారం కావచ్చు, ప్లాస్మా దాతల వివరాలు కావచ్చు... ఇలా కోవిడ్ బాధితులకు ఉపయోగపడే విధంగా తప్పకుండా సాయం చేద్దాం. మనుషులకు మనుషులే సహాయం చేసుకోవాలి. –ప్రగ్యా జైస్వాల్ దేశంలో కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను గమనిస్తుంటే నా మనసు కలత చెందుతోంది. మళ్లీ మునుపటిలా సానుకూలమైన పరిస్థితులు వస్తాయనే ఆశతో ప్రతిరోజూ నిద్రలేస్తున్నాను. కానీ నిరాశే ఎదురవుతోంది. ఈ కష్టకాలాన్ని సమూలంగా పోగొట్టలేని నా నిస్సహాయత నన్ను బాధిస్తోంది. దేశంలో కరోనా పరిస్థితులు సద్దుమణగాలనీ, కోవిడ్ బాధితులందరూ త్వరగా కోలుకోవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా కేసుల సంఖ్య పెరగకుండా మనం చేయగలిగింది చేద్దాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్లం సాయం చేద్దాం. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి. మాస్కులు ధరించండి . – రకుల్ప్రీత్సింగ్ నాకు తెలిసినవారిలో చాలామందికి కరోనా సోకింది. వారిలో కొంతమంది మృతి చెందారు కూడా! ఇది నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులను చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కోవిడ్ బాధితులు కోలుకొని, బయటపడాలని కోరుకుంటున్నాను, కరోనా అనేది పూర్తిగా మాయమై, మనందరం సంతోషంగా ఉండే రోజులు రావాలి. దయచేసి మాస్కులు ధరించండి. నిర్లక్ష్యంగా ఉండకండి. మన పరిధిలో సాయం చేసేందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా, వెంటనే చేద్దాం. – శ్రుతీహాసన్