Srikakulam District News
-
ఇక నేరుగా చెల్లింపులు..!
● మున్సిపాలిటీ సాధారణ నిధులు ఖర్చుచేసే అవకాశం శ్రీకాకుళం: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సమకూరే సాధారణ నిధులు నేరుగా ఖర్చు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. మున్సిపాలిటీలకు పన్నుల ద్వారా, షాపు అద్దెలు ద్వారా, ఆశీలు తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాధారణ నిధులకు జమ చేస్తారు. ఇదివరకు ఇలా వసూలు చేసిన మొత్తాన్ని సీఎంఎఫ్ఎస్లో ఉండే ప్రత్యేక ఖాతాలకు జమచేసేవారు. మున్సిపాటీలు ఏవైనా బిల్లులు కానీ, ఖర్చులు కానీ చేయాలనుకుంటే ఆయా బిల్లులను సీఎంఎఫ్ఎస్కు పొందుపరిస్తే అక్కడ నుంచి నిధులు మంజూరు అయ్యేవి. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగరపాలక సంస్థ అధికారులే కాంట్రాక్టర్కు బిల్లులు, ఇతర ఖర్చులను నేరుగా చెల్లించే సౌలభ్యం ఉంటుంది. సంబంధిత అంశానికి సంబంధించిన విధివిధానాలను ఆర్థిక శాఖ ఆమోదించి సంబంధింత శాఖాధికారులకు నివేదించింది. రాష్ట్రాధికారులు దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఒకటి రెండ్రురోజుల్లో వెలువరించనున్నారు. అందరి మున్సిపల్ అధికారులకు కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో విషయం తెలియజేశారు. త్వరలోనే ఉత్తర్వులు సాధారణ నిధులు నేరుగా ఖర్చు చేసే సౌలభ్యానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం వాస్తవమే. దీనివలన బిల్లుల చెల్లింపులో జాప్యం లేకండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. – పీవీడీ ప్రసాదరావు, కమిషనర్, శ్రీకాకుళం -
విద్యుత్కు వేసవి షాక్..!
పాతపట్నం: వేసవి వచ్చిందంటే ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్ వినియోగాన్ని పెంచుకుంటాం. ఇంతవరకు బాగానే ఉన్నా కన్సీల్డ్ వైరింగా, గోడలపైనే గొట్టాల్లో వైరింగ్ ఏర్పాటు చేశారా, సరైన ప్రమాణాలతో తగిన మందం ఉన్న వైర్లు వైశారా అనేది అందరూ గుర్తించాల్సిన విషయం. వైరింగ్లో ఏవైనా లోపాలుంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించాలి. రానున్న రోజుల్లో ఉష్ణాగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలతో పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిక లోడుతో అనర్థమే వేసవి కాలంలో విరివిగా విద్యుత్ ఉపకరణాల వినియోగం వల్ల ఒక్కొక్కసారి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయి. గృహాల్లో, కార్యాలయాల్లో వాడుతున్న విద్యుత్ వాడకాన్ని బట్టి లోడ్ను నిర్ధారించుకుని ఆమేరకు విద్యుత్శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో విద్యుత్ సబ్స్టేషన్ నుంచి వినియోగదారునికి అవసరమైన లోడ్ను ఆ ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ శాఖ అందుబాటులో ఉంచుతుంది. ఎవరైనా వినియోగదారుడు కేవలం 1కేవీ లోడుకు మాత్రమే అనుమతి పొంది. వేసవి తీవ్రత దష్ట్యా అధికంగా విద్యుత్ను వినియోగిస్తే ఆ ప్రభావం సమీప ట్రాన్స్ఫార్మర్పై పడి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. వినియోగదారులందరూ విద్యుత్శాఖకు సహకరించి వాడుతున్న లోడ్కు అనుగుణంగా అనుమతి పొందితే భవిష్యత్లో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏసీలు, ఫ్రిజ్లు, టీవీలు ఇతరత్రా విద్యుత్ ఉపకరణాలు వాడే సమయంలో కచ్చితంగా స్టెబిలైజర్లను వినియోగించాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తుంటే సత్వరమే సంబంధిత విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి. ఇలా చేయవద్దు ● గృహాల్లో 15 యాంప్స్ విద్యుత్ ఉపయోగించేచోట, 30 యాంప్స్ విద్యుత్ భారంపడే పరికరాలు వినియోగిస్తే తీగలు కాలిపోయే ప్రమాదముంది. ● ఒకే స్విచ్ బోర్డుకు ఎక్కువ ప్లగ్లు ఉపయోగిస్తే ఒక్కసారిగా లోడ్ పెరిగి స్పార్క్ వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. ● ఎండలో విద్యుత్ తీగలు ఉంచితే భవిష్యత్తులో తీగలపై ఉన్న రబ్బర్ మెత్తబడి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ● ఇంట్లో ఒకేసారి విద్యుత్ ఉపకరణాలన్నింటినీ ఆన్చేసి ఉంచవద్దు. ● కంప్యూటర్ పరికరాలు, టీవీల వద్ద విద్యుత్ తీగలను చిందరవందరగా ఉంచరాదు. ● రక్షణ పరికరాలైన ఎంసీబీ(మైక్రో సర్క్యూట్ బ్రేకర్), ఎంసీసీబీ(కరెంట్ కంట్రోలర్ బ్రేకర్) ఫ్యూజులను బైపాస్ చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వేసవికాలం ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరూ ఇళ్లు, కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో తీగల వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి ● విద్యుత్ వైరింగ్ చేయించేటప్పుడు పూర్తిగా ఐఎస్ఐ, బీఐఎస్ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి. ● ఇంట్లో విద్యుత్ వినియోగం ఆధారంగా విద్యుత్శాఖ నుంచి లోడ్ను తీసుకోవాలి. ● అందుకు తగినట్లు వైరింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏసీలు, కూలర్లు, వాటర్ హీటర్లు, మైక్రో ఒవెన్ ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించాలి. ● ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని బట్టి దానికనుగుణంగా నాణ్యత కలిగిన విద్యుత్ తీగలను వినియోగించాలి. ● నాసిరకం విద్యుత్ పరికరాలతో విద్యుత్ వృథా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వైరింగ్ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ● గృహాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా న్యూట్రల్ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్ ఎలక్ట్రోడ్ ఏర్పాటు చేసుకోవాలని. ● ఎండాకాలంలో రక్షణ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే ఎర్తింగ్ సరైన పద్ధతిలో ఉంచేందుకు అవసరమైన ప్రదేశంలో నీరు, దొడ్డుఉప్పు ఉపయోగించాలి. ● విద్యుత్ వాడేందుకు మూడు పిన్నుల ప్లగ్లు, సాకెట్లు మాత్రమే ఉపయోగించాలి. ● విద్యుత్ స్తంభాల నుంచి మీటర్ వరకు ఉండే సర్వీస్ వైర్లు అతుకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. X లోడ్ ఎక్కువైతే వైర్లు కాలిపోయే ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో గృహోపకరణాలకు ముప్పు సరఫరాలో లోపాలుంటే సిబ్బందికి ఫిర్యాదు చేయాలి అప్రమత్తత అవసరం వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ తీగలు వ్యాకోచం చెందే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. గృహాల్లో వినియోగించే విద్యుత్ ఉపకరణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వైరింగ్ను చేయించుకోవాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా సిబ్బందికి తెలియజేయాలి. – జి.ప్రసాదరావు, డీఈఈ, విద్యుత్శాఖ, పాతపట్నం -
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం యలమంచిలి గ్రామానికి చెందిన బందాపు ఆనందరావు(38) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు ఆనందరావు నిత్యం మద్యం సేవిస్తుంటాడు. అతని భార్య తేజావతి రెండు రోజులు క్రితం మద్యం తాగవద్దని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అతడు పురుగుల మందు తాగేశాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహూటిన కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కోటబొమ్మాళి పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య తేజావతితో పాటు కుమార్తెలు నాగమణి, మీనా, కుమారుడు భవానీ ప్రసాద్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆరోగ్యం భద్రం..!
వేసవికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బయట ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండలో పనిచేయడం, తిరగడం వలన శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో క్రమం తప్పకుండా నీటిని తాగాలి. పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. – ఆర్.కాళీప్రసాద్, ఎంపీడీవో, హిరమండలం ● రోజురోజుకూ పెరుగుతున్న వేసవి తాపం ● వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ● అప్రమత్తంగా ఉండాలని సూచనలు హిరమండలం: వేసవితాపం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజంతా మండుటెండలో కష్టించి పనిచేసే వేతనదారులు, కార్మికులు తగు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత శాఖాధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వడదెబ్బకు గురవ్వడంతో పాటు అనారోగ్య సమస్యల బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఎండల్లో ఇబ్బందులు పడకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలు ప్రస్తుతం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటకి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పని ప్రదేశాల్లో చల్లని నీరు, నీడ వసతి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉపాధి వేతనదారులు, కార్మికులు, దుకాణాల్లో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు తదితర శ్రామికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో పనులు చేసుకోవాలి. వదులైన పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ పెట్టుకోవడం మంచిది. మధ్యాహ్నం 12 గంటట నుంచి 4 గంటల మధ్య ఎండలో తిరగకూడదు నీటిని ఎక్కువగా తాగాలి, మజ్జిగ తీసుకోవాలి. గది ఉష్ణోగ్రతలను తగ్గించుకోవాలి. చక్కని వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పైకప్పు మీద గడ్డిలాంటివి ఉంచి చల్లటి నీరు పట్టించాలి. వడదెబ్బకు గురైన వ్యక్తికి చల్లని గాలి అందేలా చూడాలి. దుస్తులు వదులు చేయాలి. వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. బాధితుడిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి. -
ఆదిత్యుని సన్నిధిలో సీపీఎఫ్ శ్రీలక్ష్మి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని మహారాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ (సీపీఎఫ్) అధికారి శ్రీలక్ష్మి తన భర్త వెంకటకృష్ణారావుతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. తొలిసారి అరసవల్లి దర్శనానికి విచ్చేసిన వీరికి ఆలయ ఈవో వై.భద్రాజీ సాంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అర్చకులు వీరి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. వీరితో పాటు స్థానిక ఫారెస్ట్ అధికారులు భాషా తదితరులు ఉన్నారు. ఆర్థిక సాయం అందజేత సోంపేట: మండలంలోని రామయ్యపట్నం గ్రామానికి చెందిన వాడ ధర్మరాజు వలస మత్స్యకారుడిగా చైన్నె వెళ్లి ప్రమాదవశాత్తు ఏడాది క్రితం మృతి చెందాడు. దీంతో చైన్నెలోని బోటు యజమానులు, బోట్లకు వెళ్లే మత్స్యకారులు కలిసి రూ.2,50,000లు సేకరించి ధర్మరాజు భార్య జానకమ్మకు గ్రామంలో ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో వలస కార్మికులు, రామయ్యపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు. రీ అపోర్షన్కు గురవుతున్న ఉపాధ్యాయులు శ్రీకాకుళం: ప్రభుత్వం పాఠశాలల్లో ఒక్కసారిగా చేస్తున్న మార్పులు కారణంగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు రీఅపోర్షన్కు గురవుతున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి, జి.రమణలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను మోడల్ ప్రాథమిక పాఠశాలల కోసం వేరే పాఠశాలలకు తరలించడం, అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులను తొలగించి, ప్రైమరీగా డీ గ్రేడ్ చేయడం వంటి కారణాల వలన ఎక్కువమంది ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడే పరిస్థితులు దాపురిస్తాయన్నారు. వీరంతా బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లనున్నారన్నారు. అయితే ప్రతీ శుక్రవారం సమావేశాలు జరుగుతున్నా ఇంతవరకూ వీరికి బదిలీల్లో ప్రాధాన్యత ఉండేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరకంగా రీఅపోర్షన్కు గురయ్యే ఉపాధ్యాయులకు ప్రస్తుత స్టేషన్ పాయింట్లతో పాటుగా పాతస్టేషన్ పాయింట్లు కూడా వచ్చేలా చేసి బదిలీల్లో కొంతవరకు న్యాయం చేయాలని కోరారు. బాలుడిపై వీధి కుక్కల దాడి టెక్కలి రూరల్: వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం టెక్కలిలో చోటుచేసుకుంది. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన ఐదేళ్ల బాలుడు కె.తన్విక్ సాయి తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది గుర్తించిన స్థానికులు బాలుడిని కుక్క నుంచి రక్షించి, టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. -
నీటికుండీలో పడి కార్మికుడు మృతి
టెక్కలి: కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామ సమీపంలోని సాయిరాం గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రం బొంగైగో జిల్లా, గురునానక్ నగర్కు చెందిన కార్మికుడు కాళీరాయ్ (34) పరిశ్రమకు సంబంధించిన రీసైక్లింగ్ నీటి కుండిలో పడి మృతి చెందాడు. మృతుడు రాయ్ ఈ పరిసర ప్రాంతాల్లోని అనేక పరిశ్రమల్లో ఇదివరకు పనిచేశాడు. అయితే రాయ్ రెండు రోజులుగా పనికి రాకపోవడంతో తన స్వగ్రామానికి వెళ్లి ఉంటాడని భావించామని గ్రానైట్ యాజమాన్యం, తోటి కూలీలు చెబుతున్నారు. నిత్యం మద్యానికి అలవాటుపడిన రాయ్ ఆదివారం తెల్లవారేసరికి కంపెనీకి చెందిన 10 అడుగుల లోతు ఉన్నటువంటి రీసైక్లింగ్ నీటి కుండిలో శవమై తేలాడు. ఇది గమనించిన తోటి కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి రణస్థలం: ఈనెల 25వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఎన్హెచ్–16 రహదారిపై యూబీ పరిశ్రమ దగ్గర రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మరణించినట్లు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి ఆదివారం తెలిపారు. మృతుడికి 40–45 సంవత్సరాలు ఉంటాయని, తలకు బలమైన గాయమవ్వడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. గుండుతో ఉన్నాడని, కాఫీ కలర్ ప్యాంట్, ముదురు నీలిరంగు టీషర్టు ధరించినట్లు వెల్లడించారు. వ్యక్తి వివరాలు తెలిసినవారు 63099 90816, 63099 90850 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
‘నా ప్రశ్నకు బదులేది’ పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం అర్బన్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు రచించిన నా ప్రశ్నకు బదులేది మినీ కవితా సంపుటిని ఆంధ్రప్రదేశ్ పెన్సనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. కవి, రచయత, జర్నలిస్ట్ అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు పుస్తక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరామ్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యతను ఈ కవితా సంపుటిలోని కవితలు ప్రతిబింబించేవిధంగా ఉన్నాయని కొనియాడారు. అరుణోదయ సాంస్కృతిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ వామపక్షాల ఐక్యత ప్రస్తుత భారతదేశంలోని సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ, కార్మిక ప్రజా ఉద్యమాలను గుర్తుచేసే కవితలు పేడాడ కృష్ణారావు రాయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పప్పల రాజశేఖర్, బమ్మిడి శ్రీరామ్మూర్తి, వి.సత్యనారాయణ, కూన రంగనాయకులు, శీర రమేష్, బలివాడ ధనుంజయరావు, బోనెల రమేష్, కనిమెట్ట పద్మావతి, గురుగుబెల్లి భాస్కరరావు, దుప్పల శివరాంప్రసాద్, వల్లభ మల్లయ్య పాల్గొన్నారు. -
నా దృష్టికి రాలేదు
డయాలసిస్ సేవలు పొందుతున్నవారికి ఫిస్టులా చేసుకున్న ప్రాంతంలో ఇలాంటి కొత్త సమస్యలు వచ్చినట్లు నా దృష్టికి ఎవ్వరూ తీసుకురాలేదు. ఇప్పుడే ఈ సమస్యను చూస్తున్నాను. డయాలసిస్ అయిన తర్వాత ఒక చేతితో బాల్ను నొక్కుతూ ఉండాలి. అలాగే వారు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నా యి. వాటిపై అవగాహన కల్పించేందుకు నెఫ్రా లజీ వైద్యులతో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ప్రస్తుతం కిడ్నీ రోగులుకు వచ్చిన ఇలాంటి వాపుల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస -
పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు
ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి బి.జానకిరామ య్య ఆదివారం చెప్పారు. శ్రీకాకుళం, టెక్కలి రెండు డివిజన్లలో పరీక్ష నిర్వహణ ఈ నెల 30న ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం డివిజన్లో 25 పరీక్ష కేంద్రాల్లో 6952 మంది, టెక్కలి డివిజన్లో 14 పరీక్ష కేంద్రాల్లో 4500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నా రని చెప్పారు. జిల్లాలో మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 11,452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. రేపు జిల్లా స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు శ్రీకాకుళం అర్బన్: జిల్లాస్థాయి అండర్–23 బాలబాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు ఈనెల 29వ తేదీన జరుగుతాయని బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎంపికలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొ న్న బాల, బాలికలు 23 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బాస్కెట్బాల్ కోచ్ జి.అర్జున్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికలలో పాల్గొన్న క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబర్ను సంప్రదించాలని వారు కోరారు. జోషితకు డీఈఓ అభినందనలు మందస: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించిన హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జోషితను డీఈఓ ఎస్.తిరుమల చైతన్య ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతిని పెంచిందని అన్నారు. తల్లిదండ్రులు లేపాక్షి, మాధవరావులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా జోషితకు రూ.10వేలు నగదు బహుమతి అందజేశారు. విజయానికి కారణమైన హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నమోదైన అర్జీల గురించి దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. భావనపాడు తీరం సందర్శన సంతబొమ్మాళి: భావనపాడు తీర ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ట్రీ ఫౌండేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం 420 తాబే లు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. కార్యక్రమంలో భావనపాడు సర్పంచ్ బుడ్డ మోహన్రెడ్డి, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు, ఫారెస్ట్ సెక్షన్ అధికారి నరేంద్ర, బీట్ అధికారి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
చందనోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈనెల 30వ తేదీన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన ట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆర్టీసీ అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శ్రీకాకుళం కాంప్లె క్స్ నుంచి రణస్థలం, నాతవలస, విజయనగరం, పద్మనాభం, శొంఠ్యాం మీదుగా అడవివరం–రణస్థలం, తగరపువలస, ఆనందపురం, శొంఠ్యాం మీదుగా అడవివరం వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. అడివివరం గోశాల నుంచి కొండపైకి 13 సిటీ బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్లు వి.రమేష్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. – శ్రీకాకుళం అర్బన్ -
మే 20న అఖిలభారత సమ్మె
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మిక హక్కులు కాల రాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మే 20న నిర్వహించనున్న అఖిలభారత సమ్మె జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రిటిష్ కా లం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల ను మోదీ ప్రభుత్వం మార్చివేసిందన్నారు. యజమానులు చేసే నేరపూరిత చర్యలను నేరాలుగా పరిగణించకుండా కార్మికులు చేసే పోరాటాలను, యాజమానులను ప్రశ్నించినా నేరాలుగా పరిగణించేలా యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవ హరించేలా చట్టాలు మారుస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ప్రజల త్యాగాలతో జాతి నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచం కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తివంతంగా జరపాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ భారాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి, ఎన్.గణపతి, ఎన్వీ రమణ, కె.సూరయ్య, ఎం.ఆదినారాయణమూర్తి, హెచ్.ఈశ్వరరావు, బి.ఉత్తర, ఆర్.ప్రకాశ రావు, పి.లతాదేవి, పి.గోపి, ఆర్.సురేష్ బాబు, త్రినాధ్, సుశీల, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నీలమణి దుర్గ సన్నిధిలో వార్షిక నవరాత్రి
పాతపట్నం: ఉత్కళాంధ్రుల కొంగుబంగారంలా విరాజిల్లుతున్న పాతపట్నం ఇలవేల్పు నీలమణి దుర్గమ్మ ఆలయ సన్నిధిలో 29వ తేదీ నుంచి అమ్మవారి వార్షిక నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ఆంధ్ర, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అమ్మవారి మహోత్సవాలు భారీగా నిర్వహించేందుకు ఆలయ ఈఓ టి.వాసుదేవరావు చర్యలు తీసుకుంటున్నా రు. తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు ఇలా.. ఈ నెల 29న వర్ధినీ కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అఖండ దీపస్థాపనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 30న కుంకుమార్చన, ఆవరణ దేవతా హోమాలు, మహారాజ భోగములు, మే 1న అష్టోత్తర శతనామార్చనలు, మూలమంత్ర, మంటపస్త దేవతా హోమాలు, 2న శ్రీలలిత త్రిశతి నామార్చనలు, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాలు, 3న శ్రీలక్ష్మీనారాయణ హోమాలు, 4న రుద్ర హోమాలు, 5న వర్ధనీ కలశోద్వాసనములు, అవభృద స్నానం, 6న వర్ధని ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. 7న బలిహరణలు, మహా పూర్ణాహుతితో పాటు ప్రతి రోజు రాత్రిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు 29న సాయంత్రం తోట తులసి హరికథ, 30న సాయంత్రం ఉమామహేశ్వర భజన, మే 1 గురువారం సాయంత్రం రాగసుధ మ్యూజికల్ ఆర్కెస్ట్రా, 2న జైసంతోషిమాత కోలాటం, 3న హిమగిరి మాస్టారు ఆధ్వర్యంలో భరత నాట్యం, కూచిపూడి ప్రదర్శన, 4న ఆదివారం సాయంత్రం భజన, 5న బైరాగి నాయుడు సంగీత కచేరీ ఆ తర్వాతి రోజుల్లో పెద్దింటి మోహన్ దాస్ ఏకపాత్రాభినయం, సత్య హరిశ్చంద్ర నాటకాలు నిర్వహించనున్నారు. నీలమణి దుర్గమ్మ 29 నుంచి 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఆంధ్రా, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఏర్పాట్లు చేస్తున్నాం అమ్మవారి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయానికి రెండు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – టి.వాసుదేవరావు, కార్యనిర్వహణాధికారి, నీలమణి దుర్గ ఆలయం -
నా చేతిని చూస్తే భయపడతారు..
నా చేతిని చూసే ఎవరైనా భయపడతారు. డయాలసిస్ సేవలు అందుతున్నప్పటి నుంచి నా ఎడమ చేతిలో వాపులు భయంకరంగా మారాయి. నాకు కిడ్నీ సమస్య వచ్చిన అనంతరం ప్రాణాలు నిలుపుకోవడానికి రూ.1.50 లక్షల విలువైన గొర్రెపిల్లలను అమ్మి నేను చికిత్స చేయించుకున్నాను. ప్రైవేటులో ఫిస్టులా ఆపరేషన్ చేసుకుని ఇప్పుడు పలాస నెఫ్రోప్లస్లో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నాను. ఇప్పుడు నా చేయి రూపురేఖలు మారిపోయాయి. మా లాంటి వారి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. – సవర లక్ష్మమ్మ, సవరలింగుపురం, మెళియాపుట్టి మండలం -
బాబు గారి షూటింగ్!
● ప్రైవేటు కార్యక్రమంలా మత్స్యకారుల సేవలో పథకం కార్యక్రమం ● ఎంపిక చేసిన టీడీపీ కార్యకర్తలకు 2వేల పాసులు జారీ ● సాధారణ మత్స్యకారులకు దక్కని ప్రవేశం గుడారాల్లో సమావేశాలేమిటి? రణస్థలం/ఎచ్చెర్ల క్యాంపస్: తమ ప్రాంతానికి వచ్చి తమ ఊర్లో సమావేశం పెట్టి పాసులున్నా వదలకపోవడం ఏమిటని బుడగట్లపాలెం, కుప్పిలి, కొవ్వాడ, కొచ్చెర్ల, పాతర్లపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతోనూ కాసేపు వాగ్వా దం చేశారు. సీఎం చంద్రబాబు సభకు వారి వ ద్ద పాసులు ఉన్నా పోలీసులు లోపలకు పంపించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుడారాల్లో సమావేశాలు నిర్వహించడమేంటని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాల్లోకి వచ్చినప్పుడు చెబుతామని అన్నారు. చాలాసేపు ఎండలో నిల్చుని వెనుతిరిగారు. విన్నపాలు వినలేదు ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి బుడగుట్లపాలెం పర్యటనకు వచ్చిన నేపథ్యంలో రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు వినతి ఇ చ్చేందుకు శనివారం వచ్చారు. సెక్యూరిటీ అనుమతించకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా వారు సైతం చేతులెత్తేశా రు. ఎస్సీ వర్గీకరణ వల్ల రెల్లి కులస్తులకు తీరని అన్యాయం జరగుతుందని ఈ సంఘ ప్రతినిధులు గొల్లపల్లి మోహనరావు, బెవర రమణారావు తదితరులు అన్నారు. -
బెల్ట్ దుకాణాలపై పోలీసుల దాడి
పోలాకి: ‘మద్యం సిండికేట్ మాయాజాలం’ పేరుతో ఈ నెల 25వ తేదీన ‘సాక్షి’లో ప్రచరితమైన కథనానికి పోలీసులు స్పందించారు. పోలాకి మండలంలో పలుగ్రామాల్లో బెల్ట్ నిర్వాహకుల ఇళ్లలో సోదాలు చేశారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జడూరు జంక్షన్లో ఒక దాబాలో 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు ని, దాబా యజమాని బాబిసాహుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. అయితే తూతూ మంత్రంగా కాకుండా ఎకై ్సజ్ అధికారులతో కలసి బెల్ట్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్పీటీఈఎల్ కోర్సు పరీక్షల నిర్వహణ ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులకు శనివా రం ఎన్పీటీఈఎల్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించారు. 2768 మంది విద్యార్థులకు విడత ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 65 మంది పరీక్ష రాశారు. ఆదివారం, మే 3, 4, 5 తేదీల్లో మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జామినేషన్, ఐటీ ఇన్ఫ్రా బృందాలు పరీక్షలు పర్యవేక్షించా యి. ఈ పరీక్షలు విద్యార్థుల వృత్తి నైపుణ్యాల కు దోహద పడతాయని శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకటగోపాలధన బాలాజీ చెప్పారు. 28న మహిళా క్రికెట్ జట్ల ఎంపికలు శ్రీకాకుళం అర్బన్: మహిళా క్రికెట్ జట్ల ఎంపికలకు రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయి అండర్ –15, అండర్–19, సీనియర్స్ వయో విభాగా ల్లో ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికె ట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యద ర్శి హసన్ రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంయుక్తంగా పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియను నిర్వహించనున్నారు. -
ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డు పరిశీలన
పాతపట్నం, మెళియాపుట్టి: మండలంలోని బడ్డుమర్రి, ఏఎస్ కవిటి గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన రహదారిని శనివారం నేషనల్ లెవెల్ మానిటరింగ్ సభ్యులు కిరణ్ పాఢి బృందం పరిశీలించింది. రహదారి నాణ్యత, ఉపాధి హామీ పథకం పనితీరు, క్షేత్ర స్థాయిలో వేతనదారు లకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పథకాన్ని పారదర్శంగా అమలు చేయాలని సూచించారు. మెళియాపుట్టి మండలంలోని హడ్డివాడ గ్రామంలో ఉపాధి హామి పధకం ద్వారా చేపట్టిన రహదారి పనులను కూడా పరిశీలించారు. ఐటీడీఏ డీఈఈ బి.శిమ్మయ్య, హిరమండలం, టెక్కలి ఏపీడీలు రాధ, శైలజలు, ఎంపీ డీవో ప్రసాద్ పండా, జేఈలు ప్రసాద్, శ్రీకాంత్రెడ్డి, ఏపీఓలు సురేష్, రవి, ఈసీలు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
ప్రైవేటులో పేదలకు..ప్రైవేటులో పేదలకు ఉచిత విద్య లభించ నుంది. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. –IIలోఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మత్స్యకారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మత్స్యకారులైతే సరిపోదు.. టీడీపీ నాయకు లు ఎంపిక చేసి ఉండాలి. జనసేన, బీజేపీ జెండాలు మోస్తే సరిపోదు.. జై టీడీపీ అని ఉండాలి. ఎన్నికల్లో పనిచేస్తే సరిపోదు.. పాస్ సంపాదించుకునేంత పలుకుబడి ఉండి తీరాలి. చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా రుజువైన నిజాలివి. ఓ డైరెక్టర్ సినిమా ఏ రకంగానైతే షాట్ రెడీ అన్నట్టుగా చిత్రీకరిస్తారో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో చంద్రబాబు పర్యటన కూడా అదే రకంగా జరిగింది. ఎక్కడా బయట వ్యక్తులకు అవకాశం ఇవ్వలేదు. నిలదీసే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగా అప్రమత్తమై పాసులున్న వారికే అనుమతి అని మెలిక పెట్టారు. నిలదీస్తారనే భయంతోనే.. మత్స్యకారుల వేట విరామ సమయంలో ఇచ్చే భృతిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది ఎగ్గొట్టేసిన విషయం తెలిసిందే. గత ఏడాది వేట భృతి ఇవ్వకుండా ఈ ఏడాదికి సంబంధించి మాత్ర మే ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మత్స్యకారు లు చాలా వరకు ఆవేదనతో ఉన్నారు. గత ఏడాది వేట భృతి సంగతేంటని నిలదీసేందుకు సిద్ధమ య్యారు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ముందస్తు గా పసిగట్టినట్టు ఉంది. దానిలో భాగంగా శనివా రం చంద్రబాబు పర్యటనను విస్తృత ఆంక్షల మధ్య నిర్వహించారు. సభా ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆంక్షలు పెట్టారు. అటు కుప్పిలి ఇటు కొచ్చెర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరికైతే పాసులిచ్చారో వారిని మాత్రమే లోపలికి వదిలా రు. పాసులు లేని వారిని వెనక్కి పంపించేశారు. ఇక, 2వేల వరకు పాసులు ఎంపిక చేసిన టీడీపీ సానుభూతి పరులకు మాత్రమే ఇచ్చారు. దీంతో వారు మాత్రమే సభా ప్రాంగణంలోకి వచ్చారు. సెట్టింగ్లతో షూటింగ్లా.. షూటింగ్ స్పాట్ అందరికీ కనిపించేలా సముద్రతీరంలో సెట్టింగ్స్ పెట్టి, ఎంపిక చేసిన మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఎంపిక చేసిన వారికి ట్రాన్స్మీటర్స్ పెట్టి, వారి సమస్యలేంటని అడిగించారు. అక్కడే సిద్ధంగా ఉంచిన ఎండుచేపలను పరిశీలించారు. వారు ఎంపిక చేసిన మహిళలతో చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్కు చేరుకుని బోట్లు మరమ్మతులు చేసే వారితో సంభాషించారు. తర్వాత మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్ర జావేదికలో తమకు కావాల్సిన వ్యాపార, పారిశ్రామిక వేత్తలను వెంట బెట్టుకుని జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎంపిక చేసిన మత్స్యకారులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారడిగిన ప్రతి దానికి ‘చేసేద్దాం’ అని అక్కడికక్కడే హామీలిచ్చారు. కానీ, ఎప్పటిలోగా చేస్తామన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ఇది కూడా బహిరంగ సభ అనేదాని కంటే క్లోజ్డ్ మీటింగ్ హాల్గా చెప్పుకోవాలి. ఎంపిక చేసిన, పాసులిచ్చిన వ్యక్తులకే ప్రాంగణంలోకి ప్రవేశం ఉండటంతో అంతా పథకం ప్రకారం సాగింది. ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, నిలదీతలకు తావులేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. వాస్తవంగా గత ఏ డాది వేట భృతి ఎగ్గొట్టడంపై ప్రశ్నించేందుకు చాలా మంది మత్స్యకారులు ఎదురు చూసినా వారికెవ్వరికీ లోపలికి ప్రవేశం లేకపోవడంతో అడిగేందుకు అవకాశం లేకుండా పోయింది. బహిరంగ సభ అనుకుని చాలామందిని ఆ పార్టీ నాయకులు తీసుకొచ్చినప్పటికీ స్క్రిప్ట్ ప్రకారం పాసులున్న వారికే అనుమతి ఇవ్వడంతో నేతల తరలింపులో వచ్చిన వారు కూడా అసంతృప్తితో వెనుదిరిగారు. జనసేన, బీజేపీ నేతలకు అవమానం బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటన సాగినా ఆ పార్టీ నేతలను గౌరవించలేదు. జనసేన నాయకులకు అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. 300మంది టీడీపీ నాయకులకు సరిపడేలా ఏసీ సౌకర్యంతో కూడిన టెంట్ ఏర్పాటు చేశారు. అక్కడే మంచినీటి బాటిళ్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. కానీ, బీజేపీ, జనసేన నాయకులకు ఏర్పాటు చేసిన టెంట్లో అలాంటి సౌకర్యం కల్పించ లేదు. మంచినీటి ప్యాకె ట్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో బీజేపీ, జనసేన నాయకులు అసంతృప్తితో వెనుదిరిగారు. ●సువిశాల తీర ప్రాంతం ఉన్న మన జిల్లాలో ఇంత వరకు ఒక్క పోర్టును నిర్మించుకోలేకపోయాము.. చంద్రబాబు ఆశీస్సులతో మూలపేట పోర్టు నిర్మించుకుంటున్నామని వేదికపై చెప్పి వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన మూలపేట పోర్టును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తమ ఖాతాలో వేసుకున్నారు. జగన్ సర్కారు హయాంలో చాలా వరకు నిర్మాణం జరిగిన మూలపేట పోర్టును తాము నిర్మిస్తున్నట్టుగా చెప్పుకోవడం సిగ్గు చేటుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ●ఫిష్ ఆంధ్రా షాపుల కోసం వెటకారంగా మాట్లాడిన చంద్రబాబు, అచ్చెన్నాయుడులు.. ఇప్పుడేమో రొయ్యలు మార్కెటింగ్ పెంచాలని.. అప్పుడే వ్యాపారులు నష్టాలబారిన పడకుండా ఉంటారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ●అధికార దాహంతో చంద్రబాబు లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి ఇప్పుడేమో అప్పుల లెక్కలు చూపిస్తున్నారు. ●జిల్లాపై, మత్స్యకారులపై ప్రేమాభిమానాలుంటే వైఎస్సార్సీపీ హయాంలో శంకుస్థాపన చేసిన పోర్టులన్నీ పూర్తిచేసి వలసల నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించాలి. ●మత్స్యకారుల్ని ఓటు బ్యాంక్గా వాడుకుని వదిలేస్తామంటే మత్స్యకారుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికాక తప్పదు. ●జిల్లాలో సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడులు జిల్లా అభివృద్ధికి, మత్స్యకారుల వలసల నివారణకు ఏం చేశారో చెప్పాలి. ఈ ప్రశ్నలకు జవాబేది బాబూ..! శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు 30లోపు ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించాలి శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) 2025 మే నెలలో జరగబోయే ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30వ తే దీలోపు పరీక్ష పీజు చెల్లించాలని డైరెక్టర్ ఓపెన్ స్కూల్ వారు తెలియజేశారని జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఎస్.తిరుమల చైతన్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు ఎస్ఎస్సీకు ఒక్కో సబ్జెక్ట్కు రూ.100, ఇంటర్ పరీక్ష ఫీజు ఒక్కో సబ్జెక్ట్ కు రూ.150 ఈ నెల 30వ తేదీలోపు కట్టాలన్నారు. రూ.50 అపరాధ రుసుంతో మే 4వ తేదీలోగా చెల్లించాలని, తత్కాల్ రుసుం కింద సబ్జెక్ట్కు రూ.1000 మే 5లోగా చెల్లించాలని డీఈఓ తెలిపారు. న్యూస్రీల్బుడగట్లపాలెం సెట్టింగులో -
సమస్యలు పరిష్కరించాలి
జి.సిగడాం: సమస్యలు పరిష్కరించాలని కోరు తూ జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణల పేరిట విడుదల చేసిన జీఓలో ఈఓపీఆర్డీలకు, పరిపాలనాధికారులకు 30 శాతం కోటాను అమలు చేస్తూ ఎంపీడీఓలుగా నియమించాలని, ఎంపీడీఓల డైరెక్ట్ నియామకాలకు స్వస్తి పలకాలని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పరిపాలనాధికారి రామకృష్ణ, రాజశేఖర్, రత్నకుమారి, వెంకట్, దాలిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. చెన్నాపురంలో విషాదం నరసన్నపేట: మండలంలోని చెన్నాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన గంగు సోమేశ్వరరావు(28) తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నాపురం గ్రామానికి చెందిన సోమేశ్వరరావు భార్య శ్రావణితో కలిసి కోదాడలో టైల్స్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ట్రిప్పర్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావు మృతితో తల్లిదండ్రులు తవిటేసు, నీలవేణి, భార్య శ్రావణి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని చెన్నాపురం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుడు కొంక్యాన వేణుగోపాలరావు తెలిపారు. -
ప్రైవేటులో పేదలకు ఉచిత విద్య
నరసన్నపేట: ప్రైవేటు విద్యా సంస్థల్లో నిరుపేదలు ఉచితంగా చదువుకునే సౌలభ్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించింది. విద్యా హక్కు చట్టం–2009, సెక్షన్ 12(1)(సీ) ప్రకారం ప్రైవేటు స్కూల్స్లో పేదల పిల్లలు కూడా చదువుకునేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 2023 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కు అడ్మిషన్లకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో భాగంగా ఈ నెల 28 నుంచి దరఖాస్తులు చేసుకోవ డానికి అవకాశం కల్పించారు. మే నెల 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉచిత పథకంలో 2023లో 1120 మంది, 2024 విద్యా సంవత్సరంలో 1127 మంది విద్యార్థులు జిల్లాలో అడ్మిషన్లు పొందారు. ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు 25 శాతం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. ఏ వర్గానికి ఎంత శాతమంటే.. ● ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొటున్న వర్గాల(అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులు) విద్యార్థులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు. ● షెడ్యూల్ కులాలకు 10 శాతం, షెడ్యూల్ తెగలకు 4 శాతం సీట్లు ఇస్తారు. ● బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, గ్రామీణప్రాంతాల్లో కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ. 1.44 లక్షలకు మించకుండా ఉన్న పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తుదారులు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు.. ● ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్కార్డు/ ఓటు కార్డు/ రేషన్ కార్డు/ భూమి యాజమాన్య పత్రం/ఉపాధి హామీ జాబ్ కార్డు/పాస్పోర్టు/ డ్రైవింగ్ లైసెన్స్/విద్యుత్ బిల్లు/ రెంటల్ ఎగ్రిమెంట్(ఇంటి అద్దె) కాపీ మూడింటిని సమర్పించాలి. ● పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి ఆన్లైన్ వెబ్సైట్.. ● డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఇన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. ● 28–04–2025 నుంచి 15–05–2025 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ● దరఖాస్తులు దగ్గర్లో ఉన్న సచివాలయాలు, మీ సవా కేంద్రాలు/ఇంటర్నెట్, మండల విద్యాశాఖధికారి కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి విద్యా హక్కు చట్టం అనుసరించి గత ప్రభుత్వం ఈ అవకాశాన్ని పేద విద్యార్థులకు కల్పించింది. దీన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. పేద వర్గాల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – పి.దాలినాయుడు, ఎంఈఓ నరసన్నపేట ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులకు అవకాశం అనాథలు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులకు ప్రాధాన్యం అర్హత వయసు.. సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ/ఐబీ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2019 నుంచి మార్చి 31, 2020 మధ్య జన్మించి ఐదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం జూన్ 2,2019 నుంచి మే 31, 2020 మధ్య జన్మించి 5 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్ కులాలు, ఫెడ్యూల్ తెగలు, బీసీ, మైనారిటిలతో పాటు అల్పాదాయ వర్గాల విద్యార్థులు అర్హులు. -
ఉపాధి వేతనదారుడు మృతి
సరుబుజ్జిలి: మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి చెందిన గుజ్జల గన్నెరాజు(67) ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న సమయంలో శనివారం ఆకస్మికంగా మృతిచెందాడు. తోటి వేతనదారులతో కలిసి కాలువలో మొక్కలు తొలగిస్తున్న సమయంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయాడు. తోటి వేతనదారులు వచ్చి సపర్యలు చేసినా అప్పటికే చనిపోయాడు. టెక్నికల్ అసిస్టెంట్ లలితమ్మ, ఫీల్డ్అసిస్టెంట్ శ్రీరాములు ఇచ్చిన సమాచారం మేరుకు ఏపీఓ పార్వతి ఘటనా స్థలానికి వచ్చి విషయం తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గన్నెరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిచ్చికుక్క దాడిలో 10 మందికి గాయాలు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు తిలక్నగర్ ప్రాంతంలో రెండు రోజులుగా పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. పది మందికిపైగా గాయాలపాలయ్యారు. బాధితులు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి చేరుకుని టీకాలు వేయించుకుంటున్నారు. మున్సిపాలిటీలో కుక్కల బెడద ఇటీవల కాలంలో ఎక్కువైంది. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు ఢీకొని వృద్ధుడు మృతి ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం–సుర్లా రైల్వేస్టేషన్ల మధ్య శనివారం గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి.హరినాథ్ తెలిపారు. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండవచ్చని, పసుపు లాల్చీ, నీలం రంగు పువ్వులు కలిగిన లుంగీ ధరించాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. జీఆర్పీ ఎస్సై ఎస్కే షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిరక్షించాలి శ్రీకాకుళం అర్బన్: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి రాజ్యాంగ మౌలిక సూత్రాల రక్షణ అవసరమని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.గేయానంద్ అధ్యక్షతన సమావేశం వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని ఎంబీవీ కేంద్రంలో ఏప్రిల్ 26, 27లలో జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరలిజంలపై జరుగుతున్న దాడిని ప్రజాసైన్స్ ఉద్యమం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీడీఎఫ్ పూర్వ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రమణ్యం, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్) కార్యవర్గ సభ్యులు జి.మురళీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.త్రిమూర్తులు రెడ్డి, వైస్ నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, సమత రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సీహెచ్.జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ ఖాలీషా బాషా, బి.మాణిక్యం శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలపై కేంద్ర బృందం ఆరా
గార : గార ప్రాజెక్టు పరిధిలోని కొర్ని అంగన్వాడీ కేంద్రాన్ని నాగాలాండ్కు చెందిన జుబోమో జామి, ఒబెద్ మఘ శనివారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించిన ‘సుపోషణ పంచాయతీ’కి ఎంపిక చేసేందుకు జిల్లాలో ఈ బృందం పర్యటిస్తోంది. బాలామృతం పంపిణీ, రోజువారి అందించే ఆహారం, గుడ్లు వినియోగం, చిన్నారుల బరువు, ఎత్తు కొలవడం, ఆట వస్తువుల వినియోగం, చిన్నారులకు అందించే పుస్తకాలు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పోషణ వాటికలు నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో గార సీడీపీవో పి.నాగరాణి, రణస్థలం సీడీపీవో సీహెచ్.ఝాన్జీభాయి, అంగన్వాడీ కార్యకర్తలు వజ్జ అలివేలు మంగమ్మ, ఎన్ని గోపమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన పౌరాణిక ప్రదర్శనలు
శ్రీకాకుళం కల్చరల్: పౌరాణిక కళాకారుడు మోహనరావు ప్రదర్శనలను 40 ఏళ్లుగా ఇప్పటికీ ఆదరిస్తుండటం గొప్ప విషయమని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో మహాలక్ష్మీ ఆధ్యాత్మిక సామాజిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో హార్మోనియం కళాకారుడు బి.ఎ.మోహనరావు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు పౌరాణిక ప్రదర్శనలు శనివారం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన పౌరాణిక నటులు ధూపం రామకృష్ణ దంపతులను సత్కరిస్తూ ‘గాన కిరీటి’ బిరుదు ప్రదానం చేసి వెండి కిరీటం, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు అలరించాయి. అర్ధరాత్రి వరకు ప్రదర్శనలు కొనసాగాయి. కార్యక్రమంలో పద్మశ్రీ యడ్ల గోపాలరావు, గండ్రెటి బలరాం, రిటైర్డ్ జడ్జి జి.వి.రమణ, రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, సూర శ్రీనివాసరావు, గజల్ వాసుదేవాచారి, హైదరాబాద్కు చెందిన పౌరాణిక కళాకారులు కన్నేపల్లి సుబ్బారావు, ధర్మపురి గౌరీశంకర శాస్త్రి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య, పెదపెంకి శ్రీరామ్, సాయిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాల టాపర్కు సత్కారం
శ్రీకాకుళం అర్బన్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుత ఫలితాలను సాధించాయని శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 586 మార్కులతో టాపర్గా నిలిచిన కృష్ణచైతన్యను ఉపాధ్యాయులతో కలిసి శనివారం అభినందించారు. సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ బోధన అందుతోందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం గోవిందరావు, స్టాఫ్ సెక్రటరీ తేజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రణస్థలం: మండలంలోని యూబీ పరిశ్రమ సమీపంలోని శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖపట్నం నుంచి రణస్థలం వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఒక గుర్తు తెలియని వ్యక్తి ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, బిచ్చగాడని స్థానికులు తెలిపారు. దీనిపై జేఆర్ పురం ఏఏస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 27న జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలు శ్రీకాకుళం అర్బన్: జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ అండర్ –13 బాల బాలికల జట్ల ఎంపికలు 27న జరగనున్నాయని శ్రీకాకుళం జిల్లా బాస్కె ట్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఈ ఎంపికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 13ఏళ్ల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను చిత్తూరు వేదికగా వచ్చే నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఏపీ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వెల్లడించారు. రేపు జరిగే ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కృష్ణమూర్తి కోరారు. మరిన్ని వివరాలకు డీఎస్ఏ బాస్కెట్ బాల్ కోచ్ జి.అర్జున్ రావురెడ్డి (9949291288)ని సంప్రదించాలని ఆయన కోరారు. పెన్షనర్లలో ఐక్యత అవసరం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పెన్షనర్ల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్ల ఐక్యత అవసరం పెరిగిందని ఐక్యవేదిక సదస్సు నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎన్జీఓ హోమ్ లో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కన్వీనర్ మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వా త గౌరవప్రదమైన జీవితం కోసమే పెన్షన్ విధానం ప్రవేశపెట్టారని, ప్రభుత్వ విధానాలు పెన్షన్ భద్రత ను ప్రశ్నార్థకం చేస్తున్నాయని అన్నారు. ఇటీవల ఓల్డ్ పెన్షన్ స్కీం (ఒ.పి.ఎస్) పెన్షనర్లకు నష్టం కలిగించే రీతిలో ఉద్యోగ విరమణ తేదీ బట్టి విభజన చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం సరికాదన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సి.పి.ఎస్) విధానంలో చెల్లించే పెన్షన్ మొత్తానికి గ్యారెంటీ లేదని, యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యు.పి.ఎస్) విధానంలో అనేక లోపాలున్నాయని తెలిపారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం ఆశాజనకంగా లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు సంస్థల విశ్రాంత ఉద్యోగుల ఐక్య సదస్సు ఈ నెల 27వ తేదీ (ఆదివారం) ఉద యం 10 గంటలకు జరుగుతుందని జిల్లాలోగల వివిధ సంస్థలలో పని చేసిన పెన్షనర్లు పాల్గొని సద స్సు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డి.పార్వతీశం, కె.సోమ సుందర్రావు, ఎంఎస్ఆర్ఎస్ ప్రకాశరావు, ఎస్.భాస్కర్రావు, పి. సుధాకర్రావు, వి.చిన్నబాబు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు
ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడగుట్లపాలెంలో శనివారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెప్పారు. బుడగుట్లపాలెంలో పోలీస్ అధికారులతో శుక్రవారం భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రి వచ్చిన నుంచి పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు పార్కింగ్, తనిఖీ లు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. నలుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలతో కూడిన అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తారని చెప్పారు. 17 రోప్, స్పెషల్, క్యూఆర్డీ టీంలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. హెలీప్యాడ్, సభావేదిక, ఆలయ దర్శనం, లబ్ధిదారులతో ముఖా ముఖి వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు మండలాలకు అనుకు ని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, శిరడా, గురిసింగి గూడ, నేరడి గూడ పరిసరాల్లో 1,120 లీటర్ల నాటు సారా, 10,600 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు. మలేరియాపై అవగాహన ర్యాలీ అరసవల్లి: మలేరియాను జయించండి.. జీవితం నిలపండి అని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియాను సరైన జాగ్రత్తలు పాటించి నివారించుకోవచ్చునని, గత ఐదేళ్లలో మలేరియా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే ప్రతి ఇంట్లో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రథమ కర్తవ్యంగా మారుచకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్యశాఖ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అరసవల్లి ఇన్చార్జి ఈఓగా శోభారాణి అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇన్చార్జి ఈఓగా కె.శో భారాణిని నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈఓగా పనిచేస్తూ.. అరసవల్లి ఇన్చార్జి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈఓ వై.భద్రాజీ మెడికల్ లీవులో వెళ్లినందున జిల్లా దేవదాయ శాఖ అధికారి(ఏసీ) తో పాటు అరసవల్లి ఈఓ బాధ్యతలు కూడా శోభారాణి చూడనున్నారు. -
గిరిజన గురుకులాల్లో ఇంటర్మీయెట్ ప్రవేశాలు
● నోటిఫికేషన్ విడుదల చేసిన గురుకులం సొసైటీ ● ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ● పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 1200ల సీట్ల భర్తీ ● నేటి నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● మే 24న కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. దరఖాస్తులు ఆన్లైన్ చేయాల్సిన తేదీ ప్రారంభం: 26.04.2025 దరఖాస్తు చేసుకునే చివరి తేదీ: 18.05.2025 మెరిట్జాబితా ప్రకటన: 20.05.2025 మొదటి కౌన్సెలింగ్: 24.05.2025 రెండో విడత కౌన్సెలింగ్: 30.05.2025 తరగతులు ప్రారంభం: 02.06.2025 సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గిరిజన గురుకుల సొసైటీ ఆన్లైన్లో శనివారం నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తోంది. గిరిజన గురుకులాల్లో చేరే విద్యార్థులకు అధికారులు ఉచిత, భోజన వసతి, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు సమకూరుస్తారు. కళాశాలల్లో సీటు లభించిందంటే కార్పొరేట్ కళాశాలల్లో సీటు లభించినట్టేనన్నది విద్యావేత్తల మాట. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీలతో పాటు ఒకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, సీజీఏ గ్రూపులు బోధిస్తున్నారు. మొత్తం అన్ని గ్రూ పులు కలిపి 1270 సీట్లు ఉన్నాయి. వీటికోసం ఏటా 2 వేల మంది విద్యార్థులు పోటి పడుతున్నారు. మెరిట్ ఆధారంగానే... ఈ దఫా పదో తరగతిలో వచ్చే మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపునకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీలకు 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈలకు ఒక్కో సీటు చొప్పున కేటాయిస్తారు. ఒకేషన ల్ ఏఅండ్టీ–20, సీజీఏ గ్రూపు లో 30 చొప్పున సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించా రు. విద్యార్థులు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్.గవ్.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి. -
ఉపాధి కూలీలపై కక్ష సాధింపు
ఎచ్చెర్ల: లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో అధికార పార్టీ మేట్లు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉపాధి కూలీలు వాపోయారు. గ్రామంలో 78 మంది వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొందరు అధికార పార్టీ వారిని మేట్లుగా వేశారు. అందులో భాగంగానే తాళ్లవలసలో రాధను నియమించారని కూలీలు తెలిపారు. ఈమె రాజకీయ కక్షతో కొందరి కి మస్టర్ వేయకుండా వేధిస్తోందని, కాసేపు బయటకు వెళ్లినా మస్టర్ వేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గురువారం ఫీల్డ్ అసిస్టెంట్ రాకపోవడంతో కొన్ని గ్రూపుల కూలీలకు మస్టర్లు వేయడానికి వేరే వాళ్లను పంపించారు. దీంతో మస్టర్లు చదివే సమయంలో గొడవ జరిగింది. శుక్రవారం పలువురిని పనిలోకి రావద్దని చెప్పడంతో వారంతా ఏపీఓ సత్యవతిని కలిసి మాట్లాడారు. ఏపీఓ మాట్లాడు తూ ప్రతి రోజు మీరు ఘర్షణ పడుతున్నారని అందువలన రెండురోజులు పనిని నిలుపుదల చేయాలని చెప్పారు. అందరికీ సమానంగా పనిని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాధ అనే మేట్ ఉంటే తాము పనిచేయలేమని, ఆమె తమను పనిచేయనివ్వరని వారు ఫిర్యాదు చేశారు. -
గొట్టా.. ముప్పు ఆగేదెట్టా..?
● వరదల ధాటికి పాడైన గొట్టా బ్యారేజీ రాతి కట్టడాలు ● పనులు పూర్తి చేయకుంటే బ్యారేజీకే ముప్పు ● ఆందోళన చెందుతున్న రైతులు ● సీఈకి ప్రతిపాదనలు పంపించాం హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద ఏప్రాన్ పూర్తిగా పాడై ఉంది, పను లు చేసేయాలని ఇటీవల జిల్లాకు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి చె ప్పారు. టెండర్లు పిలిచేందుకు కావాల్సిన దస్త్రాలను సీఈకి ప్రతిపాదనలు పంపించాం. త దుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తాం. ఈ సీజన్లో దాని వల్ల ఎలాంటి ముప్పు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. వచ్చే సీజన్కు తప్పనిసరిగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తాం. – పీవీ తిరుపతిరావు, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, ఎస్ఈ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కాలం గడుస్తున్న కొద్దీ గొట్టా బ్యారేజీ ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతోంది. జిల్లాకు జీవనాడి వంటి బ్యారేజీ పరిరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. వంశధార స్టేజ్–1, ఫేజ్–2 పనులకు జలయజ్ఞంలో భాగంగా రూ.933కోట్లతో పనులు ప్రారంభించారు. అప్పట్లో వంశధార గట్లు పటిష్టం చేయడం, హిరమండలం రిజర్వాయర్ నిర్మాణం, ప్యాకేజీ–87, 88లకు శ్రీకారం చుట్టారు. వంశధార నదిలో నీటిని ఒడిసిపట్టి జిల్లాలో 2.55లక్షల హె క్టార్లలో రెండు పంటలకు నీరందించాలంటే అది ఒక్క వంశధార నదిలో నీరు వృధా కాకుండా అడ్డుకట్ట వేయడంతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి ధర్మాన ఇంజినీర్లతో కలిసి డిజైన్ చేశారు. నదిలో వచ్చే నీటిని నిల్వచేసేందుకు గొట్టాబ్యారేజీ వద్ద గేట్లు ఏర్పాటు చేసి కొంతమేర రైతుల అవసరాలను బట్టి నీటిని వదిలేవారు. నీరు నిత్యం పారుతుండడంతో గొట్టా బ్యారేజీకి దిగువ భాగాన ఉన్న రాతి కట్టడాలు వరదలకు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ తర్వాత వచ్చిన వర్షా లు, వరదలకు ఏటా కొంచెం, కొంచెంగా ఇసుక మేటలు వేసి రాళ్లు కొట్టుకుపోయి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాతి కట్టడాలు సరిగా లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. వాస్తవానికి వంశధార ఎడమ కాలువ పనులు చేసేందుకు టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పు డు రూ.380 కోట్లు ఇస్తే సరిపోయేది. ఇప్పుడు దాని పని అంచనా దాదాపు మూడింతలైంది. వైఎస్సార్సీపీ హయాంలో రూ 12.91కోట్లు మంజూరు వైఎస్ జగన్ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో హిరమండలం గొట్టా బ్యారే జీ వద్ద ఏప్రాన్ (రాతికట్టడాల) పనులు చేసేందుకు గాను రూ.12.91కోట్లు నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే హిరమండ లం రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్కు రూ 176.35 కోట్లు, ఉద్దానం ప్రాంతానికి తాగునీరు సౌకర్యం కల్పించడానికి రూ.700కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, ఆఫ్షోర్ ప్రాజెక్టుకు రూ 852.45కోట్లు, వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేందుకు రూ.216.71కోట్లు, పాతపట్నం నియోజక వర్గంలో రెండు మండలాలకు మంచినీటి ప్రాజెక్టు కింద రూ.250కోట్లు మంజూరు చేశారు. ఏప్రాన్ పనులు ప్రారంభించేలోపే ఎన్నికల కోడ్ రావడంతో అర్ధంతరంగా టెండర్ల దశలోనే ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడం దారుణమని రైతులు, నదీపరివాహక ప్రాంత వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జలవనరుల శాఖమంత్రి రామానాయుడు జిల్లాకు వచ్చినా ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులేవీ చూడకుండా అచ్చెన్న ఇలాకాలో పనులు మాత్రమే చూసి తూతూమంత్రంగా వెళ్లిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో పనులు చేసేందుకు టెండర్లు పిలిచేందుకు ఆదేశాలిస్తారో లేదో వేచి చూడాలి. -
● తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం
ఎల్.ఎన్.పేట: మండే వేసవిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు అందివ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. మండలంలోని దబ్బపాడు గ్రామంలో మహిళలతో కలిసి తాగునీటి కోసం కుళాయిల వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.62 కోట్లు ఖర్చుతో 360 పనులు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగానే పాతపట్నం మండలంలో రూ.15.50 కోట్లు ఖర్చుతో 73 పనులు, మెళియాపుట్టిలో రూ.16 కోట్లు ఖర్చుతో 100 పనులు, ఎల్.ఎన్.పేట మండలంలో రూ.8కోట్లు ఖర్చుతో 46 పనులు, కొత్తూరు మండలంలో రూ.16.50 కోట్లు ఖర్చుతో 88 పనులు, హిరమండలం మండలంలో రూ.7కోట్లు ఖర్చుతో 54 పనులు మంజూరు చేశామన్నారు. వీటిలో 88 శాతానికి మించి పనులు పూర్తయ్యాయన్నారు. 1600 ఇళ్ల ముంగిటకే కుళాయిలు ఏర్పాటు చేయించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పాలన లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇంటి వద్దకు తాగునీరు అందివ్వలేని దుస్థితి ఏర్పడింది ఆరోపించారు. దబ్బపాడు గ్రా మంలో గత కొన్ని నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాతపట్నం ఎమ్మెల్యే స్పందించక పోవటం బాధాకరమన్నారు. ఆమెతో పా టు ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, మండల ప్రత్యేక ఆహ్వానితుడు రెడ్డి రామారావు, వైఎస్సార్ సీపీ మండల ప్రెసిడెంట్ పెనుమజ్జి విష్ణుమూర్తి, మాజీ ఎంపీపీ శిమ్మ సాంబశివరావు, దబ్బపాడు సర్పంచ్ ముద్దాడ మోహిని, ఎంపీటీసీ పల్లి జయలక్ష్మి, పార్టీ నాయకులు కొల్ల కృష్ణ, ఈగల చిన్నారావు, గేదెల శ్రీనివాసరావు, ఎర్ర జనార్థన, కొల్ల లక్ష్మునాయుడు, పల్లి సంజీవ్, ముద్దాడ లక్ష్మణరావు, తలసముద్రం శోభన్బాబు పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ఆందోళన చేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి -
హార్బర్ పనులు ప్రారంభిస్తారా?
ఎచ్చెర్ల క్యాంపస్: మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బుడగుట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసింది. 2023 ఏప్రిల్ 19న పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. ఇదే గ్రామంలో శనివారం రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నా రు. ఫిషింగ్ హార్బర్ పనుల పూర్తి కోసం కోటి ఆశలు, వేయి కళ్లతో మత్స్యకారులు ఎదురు చూ స్తున్నారు. కొన్నాళ్లు అటవీ శాఖ అభ్యంతరాలు అన్నారు. అటవీ భూములు విడిచి పెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించవచ్చు, అయినా పనులు ముందుకు సాగలేదు. దాదాపుగా 11 నెలల పాటు పనులు నిలిచి పోవటం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. పనులు కొనసాగితే దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యేవి. ఫిషింగ్ హార్బర్కు భూమి పూజకు ముందే రూ.366 కోట్లు టెండర్ పూర్తిచేశారు. ఈ టెండర్లను విశ్వ సముద్ర కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం బిల్లుల చెల్లింపులు లేక, పనులు మందుకు సాగని పరిస్థితి కొనసాగుతోంది. సర్వే నంబర్ 504–18 లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయించారు. రాతి కట్టడాలు, అంతర్గత రోడ్డు లు, కాంక్రీట్ ఫౌండేషన్ వంటి పనులు ప్రారంభించి అసంపూర్తిగా ప్రస్తుతం విడిచి పెట్టారు. స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల పది గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్, సూరత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వెలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. హార్బర్ పూర్తయితే వలసలు నిలిచే అవకాశం ఉంది. -
దౌర్జన్యకాండ
● కూటమి పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలు ● భయాందోళనలో జిల్లా ప్రజలు రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అత్యాచారాలు, దాడులు, హత్యలతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నేనొస్తే శాంతియుత పరిస్థితులు ఉంటాయి. హత్యలు, అత్యాచారాలకు ఆస్కారమివ్వను. తప్పు చేసినోడికి మళ్లీ తప్పు చేయకూడదనేలా ట్రీట్మెంట్ ఇస్తాను. – ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల కా లంలో 17 హత్యలు.. ఈ ఏడాదే 9 హత్యలు.. అంతకు రెట్టింపు దొంగతనాలు, ఊరూరా రాజకీయ దాడులు, చిరుద్యోగులపై వేధింపులు, అక్రమాల ను నిలదీస్తే దాడులు.. వెరసి సిక్కోలులో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి అనడానికి ఈ లెక్కలే సాక్ష్యం. గంజాయి మత్తులో యువ త నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లాకేంద్రంలో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేకే గంజాయి బాబులు పట్టుబడటం చూస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 8 హత్యలు ● మంత్రి అచ్చెన్న సొంత పంచాయతీ నిమ్మాడలోని వెంకటాపురం గ్రామ అమ్మ వారి ఉత్సవాల్లో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా తోట మల్లేషు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి తర్వాత మరణించాడు. ● ఆగస్టు 18 అర్ధరాత్రి ఎచ్చెర్ల ఫరీద్పేటకు చెందిన వైఎస్సార్ సీపీ సాధారణ కార్యకర్త కూన ప్రసాద్ను దారి కాచి టీడీపీ కార్యకర్తలు కొట్టారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 24న మరణించాడు. ● జూన్ 5 రాత్రి సోంపేట కొర్లాం జాతీయ రహదారి సమీపంలో సంగీత దాబాలో సిబ్బంది మద్య జరిగిన గొడవలో మాదుగుల రాంబాబు (54)ను హత్య చేశారు. ● జూన్ 24న ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన కొండ్ర కుప్పయ్యను అతని భార్య హరమ్మ నిద్రలో ఉండగా కత్తితో దాడి చేసి చంపేసింది. ● జూన్ 30న ఇచ్ఛాపురం స్వర్ణపురం బీచ్లో ఆసి బాలు అనే యువకుని ఛాతీపై బలమైన ఆయుధంతో గాయపర్చి హత్య చేశారు. ● జూలై 2న పొందూరు మండలం తాడివలస సమీప బొడ్డేపల్లి గ్రామానికి చెందిన అమలాపురం రాజేశ్వరిని నరసన్నపేట మండలం ఉర్లాంకు చెందిన గోపాల్ హత్య చేసి మృతదేహాన్ని ఆటోలో పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లి లొంగిపోయాడు. ● డిసెంబరు 6న గార మండలం శ్రీకూర్మం ఆర్టీసీ కూడలిలో ఉప్పాడ రాజేష్ అనే యువకున్ని పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు దాడిచేసి హతమార్చారు. ● అక్టోబరు 22న నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం వనవిష్ణుపురం అమ్మవారి పత్రికొమ్మల విషయంలో ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకోవడంతో టీడీపీకి చెందిన పాలిన వీరాస్వామి మృతి చెందగా, కొందరికి గాయాలయ్యాయి. ఈ ఏడాది 9 హత్యలు.. ● జనవరి 19న జిల్లాకేంద్రంలోని న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను బంగారం కోసం అతి కిరాతకంగా యువకుడు చంపేశాడు. ● జనవరి 25న ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో సొంత భర్త గరుగుబిల్లి చంద్రయ్య తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరో పదిమందితో కలిసి భార్య ఈశ్వరమ్మ హత్య చేయించింది. ● ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీకాలనీలో మద్యం మత్తులో భార్యను భర్తే హత్య చేశాడు. ● ఫిబ్రవరి 24న జిల్లాకేంద్రంలో టి–ఏజెంట్కాలనీలో మజ్జి రమేష్నాయుడు (34)ను వేధింపులు తాళలేక, పిల్లలను సైతం కొట్టడంతో భార్య శశి హత్య చేసింది. ● మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను ఆమె భర్త అప్పలరెడ్డి మద్యం మత్తులో దారుణంగా నరికి చంపేశాడు. ● మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ● మార్చి 28న కవిటి మండలం ఆర్.కరాపాడు గ్రామ శివారు రైల్వేగేటు వద్ద 5 నెలల గర్భిణి కొంతాల మీనాక్షిని భర్తే కర్కశంగా దాడి చేయించి చంపేశాడు. ● ఏప్రిల్ 15న జి.సిగడాం మండలం సంతపురిటిలో వివాహిత బి.భవానిని తన భర్త గొంతు నులిమి హత్య చేశాడు. ● ఏప్రిల్ 19న పైడిభీమవరంలో ఆవాల భవాని (25) అనే వివాహితను చంపేశారు. అక్టోబరు 16న జిల్లా నడిబొడ్డున బలగమెట్టు వద్ద వందలమంది జనాలు చూస్తుండగా సనపల సురేష్ అనే వ్యక్తిని కారును జీపు, బైకులతో కొంతమంది అడ్డగించి కొట్టారు. అక్టోబరు 27న కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో దళిత దంపతులైన చల్ల అప్పలరాజు, దమయంతిలపై టీడీపీ గూండాలు ధర్మాన శ్రీను, ధర్మాన ప్రసాద్, తంగి షణ్ముఖ, పల్లి వైకుంఠరావు, పగోటి సీమలు, పగోటి అప్పారావు, మరో 70 మంది ఇంటికొచ్చి మరీ దాడికి పాల్పడ్డారు. అదే రోజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సాక్షిగా మాజీమంత్రి సీదిరి అనుచరులు అల్లు రమణ, మన్మధలపై టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. అక్టోబరు 26న ఉత్సవాల్లో డ్యాన్స్ చేయనన్నందున తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక, ఆమె తల్లిపై పలాస మండలం తెలుగు యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు దాడికి పాల్పడ్డాడు. నవంబరు 16న వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు మహిళలపై దాడి చేశారు. రాజమండ్రికి చెందిన నకిలీ నోట్ల ప్రధాన నిందితున్ని మన జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులతో కలసి కారులో తెస్తుండగా సినీఫక్కీలో 20 మందికి పైగా కారులు, బైకుల్లో వచ్చి దాడికి ఎగబడి ప్రధాన నిందితున్ని ఎత్తుకుపోయారు. 2025 జనవరి 21న పలాస మండలం రామకృష్ణాపురం చిన్ననీలావతి గ్రామానికి చెందిన పౌరహక్కుల నేత తెప్పల ఢిల్లీరావు (57) అనుమానాస్పదరీతిలో పంటపొలంలోనే విద్యుత్ తీగలు తగిలి మృతిచెందాడు. ఇది హత్యేనని అనుమానాలు ఉన్నాయి. జనవరిలో పాతపట్నం దువ్వారివీధికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త పెద్దింటి తిరుపతిరావుపై వేకువఝామున గుర్తుతెలియని వ్యక్తులు మెడపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మార్చి 30న రణస్థలం మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి బాత్రూమ్లో ఉరికి వేలాడుతూ అనుమానాస్పదంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు పరిశ్రమ ముందు ఆందోళన చేశారు. ఇలాంటి ఘటనలు మరెన్నో జరిగాయి. -
బకాయి ఇక రానట్టే..!
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. ఈ ఏడాదికి వేటనిషేధ కాలం భృతిని అందించే ‘మత్స్యకార చేయూత’ పథకంలో భాగంగా అర్హుల జాబితా ప్రాప్తికి 15548 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున భృతిని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎచ్చెర్ల మండలంలో భారీ హంగామాతో మత్స్యకారుల సమక్షంలోనే కార్యక్రమాన్ని నిర్వహించేలా మత్స్యకార గ్రామమైన బుడగట్లపాలెంలోనే కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. అయితే జిల్లా మత్స్యకార సహకార సంక్షేమ సంఘాల అధ్యక్ష, కమిటీలకు ఎలాంటి ఆహ్వానాలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండడంపై మత్య్సకార సంఘాలు తప్పుపడుతున్నాయి. అరసవల్లి: అనుకున్నదంతా అయ్యింది. గత ఏడాది మత్స్యకార భృతిపై మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు గంగ పాలయ్యాయి. 2024–25కు సంబంధించిన మత్స్యకార భృతిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో.. ఆ భృతికి ఇక చేతికి అందదని స్పష్టమైపోయింది. ఈ ఏడాదికి సంబంధించి మాత్రమే భృతి అందజేస్తుండడంతో బకాయి ఇచ్చేది లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చి చెప్పినట్టైంది. దీనికి తోడు ఈ ఏడాది కూడా వేటనిషేధ భృతి తీసుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. గత ఏడాది భృతి రానట్టే.. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు రెండు నెలల పాటు ఏపీ మైరెన్ ఫిషింగ్ యాక్ట్ 1994 ప్రకారం వేట నిషేధ కాలంగా రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014–19 మధ్యకాలంలో కూడా వేటనిషేధ సమయంలో కేవలం రూ.4 వేలు చొప్పున ఉపాధి భృతిగా ఇచ్చేవారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ, డీజిల్ సబ్సిడీని కూడా అందించింది. దీంతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా జగన్ సర్కార్ అడుగులు వేసింది. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో వేట నిషేధ కాలానికి భృతి ఇవ్వకుండా ఏడాది పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు మరోసారి నిషేధ కాలం రావడంతో గత ఏడాది భృతికి మంగళం పాడేసింది. ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లూ... గతంలో వైఎస్ జగన్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల కు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చిన సంగతి విదితమే. అయితే ముఖ్యంగా మత్స్యకారులకు వరుసగా ఐదేళ్ల పాటు వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 70,611 మందికి ఐదు విడతల్లో రూ.70.61 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమచేసింది. అలాగే ఈ ప్రకారం లబ్ధి పొందిన వారికి ప్రభుత్వం అందజేసిన ఇతర సంక్షేమ పథకాలను కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. కేవలం మత్స్యకారుల బాగు కోసం మూలపేటలో రూ.4,362 కోట్లతో పోర్టు, అలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.15 కోట్లతో షిఫ్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాలను చేపట్టారు. భృతి తీసుకుంటే..సంక్షేమం కట్ వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు భరోసాగా కూటమి సర్కార్ ‘మత్స్యకార చేయూత’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ భృతి పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించింది. 60 ఏళ్ల వయసు దాటిన వా రు, అలాగే గృహ వినియోగ విద్యుత్ నెలకు 300 యూనిట్లు వినియోగించిన వారు అనర్హులని నిబంధనలు విధించారు. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగభృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతితో పాటు పెన్షన్ కూడా పొందేందుకు అనర్హులవుతారు. 2024–25 నాటి భృతి చెల్లింపుపై వెలువడని ఉత్తర్వులు ఈ ఏడాది 15548 మందికి రూ.20 వేలు చొప్పున భృతి అందజేయనున్న సీఎం చంద్రబాబు భృతి పొందితే.. ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులే పాత బకాయిలు ఇవ్వాల్సిందే.. జిల్లాలో మత్స్యకారులకు 2024–25 వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతిని కలుపుకుని రూ.40 వేల చొప్పున జమ చేయాలి. జిల్లా మత్స్యకార సంఘాల ప్రతినిధులకు ఎలాంటి ఆహ్వానాలు లేకుండా సమావేశాలు కార్యక్రమాలను నిర్వహించడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకే వస్తుంది. గత ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధి కోసం, జిల్లా ప్రగతి కోసం చేపట్టిన పోర్టులు, జెట్టీలు, హార్బర్ల నిర్మాణాలు యథావిధిగా కొనసాగించాలి. – కోనాడ నరిసింగరావు, జిల్లా మత్స్యకార సహకార సంక్షేమ సంఘ అధ్యక్షుడు 511 మంది అనర్హులుగా గుర్తించాం జిల్లాలో మత్స్యకార చేయూత కార్యక్రమంలో భాగంగా మొత్తం 11 మండలాల్లో 15548 మందిని అర్హులు గా గుర్తించాం. 511 మందిని మాత్రమే అనర్హులుగా గుర్తించాం. అలాగే మోటరైజ్డ్ బోట్లు 1565, నాన్ మోటరైజ్డ్ 2557 బోట్లు ఉన్నట్టుగా సర్వేలో గుర్తించాం. నిబంధనల ప్రకారం అర్హులకే రూ.20 వేల చొప్పున జమ చేయనున్నాం. – వై.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ హామీ ఏమైంది?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేర కు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కొత్తూరు మండల కేంద్రంలో నిర్వాసితుల ఉద్దేశించి మాట్లాడారని, టీడీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులందరికీ స్పెషల్ ప్యాకేజీ ఇప్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గతంలో మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ గంపెడు ఆశలతో మీ ప్రభుత్వాన్ని గెలిపించారని అధికారంలోకి వచ్చి సంవత్సర కా లం కావస్తున్నా నిర్వాసితులకు ఇచ్చిన హామీ ఏమైందో తెలియడం లేదన్నారు. సీఎం శ్రీకా కుళం వస్తున్న సందర్భంగా నిర్వాసితులకు ఇచ్చిన హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని బుడగుట్లపాలెంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుడగుట్లపాలెం తీరంలో ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పర్యవేక్షించారు. అధికారుల వెల్లడించిన షెడ్యూల్ మేరకు చంద్రబాబు 12.10 గంటలకు గ్రామ దేవత అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మత్స్యకారులతో ము ఖాముఖి, మత్స్యకార చేయూత పథకం ప్రా రంభం, పార్టీ నాయకులతో సమావేశం నిర్వ హిస్తారు. నిలిచిపోయిన డయాలసిస్ సేవలు కాశీబుగ్గ: పలాస కిడ్నీ ఆస్పత్రిలో నెఫ్రో ప్లస్ వారు నిర్వహిస్తున్న డయాలసిస్ సేవలు శుక్రవారం నిలిచిపోయాయి. మూడు షిఫ్ట్లలో జరుగుతున్న డయాలసిస్ సేవలు 10:30 గంటల నుంచి 02 గంటల వరకు సేవలు పునరుద్ధరణ కాలేదు. టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఇంజనీరింగ్ అధికారులు వచ్చి మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే పలు మార్లు విద్యుత్, జనరేటర్ సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా తాజాగా మిషనరీలు టెక్నికల్ సమస్య తోడుకావడంతో డయాలసిస్కి హాజరైన కిడ్నీ రోగులు పాట్లు పడ్డారు. వారికి సహాయకులుగా వచ్చిన వారంతా రోజంతా నిరీక్షించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మ జను వివరణ కోరగా డయాలసిస్ ఈ విషయం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని వారిని పిలిపించి మాట్లాడుతానని అన్నారు. ‘ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాకు ప్రత్యేకంగా ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలుచేయలేదని, ఇప్పుడైనా అమలు చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్య దర్శి వర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టాలని, కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి 50 ఏళ్లు పూర్తి కావస్తోందని ఆధునికీకరణకు రూ. 1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్కు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని రిజర్వాయర్కు నిధులు కేటాయించాలన్నారు. -
అసభ్యకర ప్రవర్తన.. హెచ్ఎంకు దేహశుద్ధి
గార: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే తప్పుడు పనులు చేశాడు. చాలాకాలం ఓపిక పట్టి న విద్యార్థినులు తాళలేక తల్లిదండ్రులకు సమాచా రం అందజేశారు. వారు వచ్చి హెచ్ఎంకు దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మండలంలోని వత్సవలస పంచాయతీ మొగదాలపాడు యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొన్ని రోజులుగా 6,7,8 తరగతులకు చెందిన పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ముద్దులు పెట్టడం, తాకకూడని చోట చేతులు వేయడం చేస్తున్నా డు. కొన్నాళ్లు భరించిన విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం పాఠశా లకు వెళ్లి హెచ్ఎం చింతాడ వెంకటేశ్వర్లును నిలదీశారు. ఆయన తల్లిదండ్రులతో వాదనకు దిగడంతో వారు హెచ్ఎంకు దేహశుద్ధి చేశారు. అనంతరం 1098కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం డిప్యూటీ డీఈఓ విజయకుమారి, చైల్డ్లైన్ సిబ్బంది పద్నాలుగు మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను విచారించారు. జరిగిన సంఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాఠశాలలోని మిగిలిన ఉపాధ్యాయులను కూడా విచారణ చేయగా, జరిగిన సంఘటన వాస్తవమేనని అధికారులకు తెలిపినట్టు సమాచారం. విచారణ చేశామని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి చర్యలుంటాయని ఎంఈఓ నక్క రామకృష్ణ తెలిపారు. అయితే గురువారం హెచ్ఎంతో పాటు మరికొందరు గ్రామానికి విచ్చేసి గ్రామస్తులను కలసి క్షమించమని వేడుకున్నారు. అయితే బాలికలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో పెద్దలు పిలిచినా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయారు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే రాజీ ప్రయత్నాలు హెచ్ఎం వెంకటేశ్వర్లు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అనుయాయుడు కావడంతో ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జరిగింది ఏదో జరిగిందని రాజీ చేసుకోవాలని సూచిస్తుండటం గ్రామంలో విస్తృతంగా చర్చ జరగుతోంది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలోని శ్రీకాకుళం, నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్లో (ట్రిపుల్ ఐటీలు) ప్రవేశానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ గురువా రం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ సైతం విడుదల చేశా రు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు స్వీకరణకు మే 20 చివరి తేదీ. విద్యార్థులు ఒకే దరఖాస్తులో క్యాంపస్లు ప్రాధాన్యత బట్టి ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి మార్కులు, రి జర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పి స్తారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజ్ ఇస్తారు. శ్రీకాకుళం క్యాంపస్లో గత ఏడాది 1100 సీట్లుకు ప్రవేశాలు కల్పించారు. 1000 సీట్లు, 100 ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నా యి. ఈ ఏడాది సీట్ల సంఖ్య స్పష్టంగా తెలియా ల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా ఎంపికవుతున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు వస్తే రెండేళ్లు పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు), నాలుగేళ్లు ఇంజినీరింగ్ ఆరేళ్లు చదివే అవకాశం లభిస్తుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఏటా ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. బాలికలు ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. -
● కల్యాణం..కమనీయం..
అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణ సేవ గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఛైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవారి కల్యాణమూర్తులను అనివెట్టి మండపంలో కొలువుదీర్చి ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణం జరిపించారు. రూ.500 చెల్లించిన భక్త దంపతులకు ఆలయం తరఫున స్వామి వారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. – అరసవల్లి -
వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: వక్ఫ్ సవరణ చట్టం– 2025కు వ్యతిరేకంగా గురువారం జిల్లా ముస్లింల ఐక్య సమాఖ్య జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు నివాళులు అర్పించారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం ఏడు రోడ్ల కూడలిలో బయలు దేరి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటే శ్వరరావుకు జిల్లా ముస్లిం ఐక్య సమాఖ్య జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, సలీం, హాజీ అమీరుల్లా బేగ్, రఫీ, మహీబుల్లా ఖాన్, ముజీబ్, అక్బర్బా షా, మహిళా సోదరీమణులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త చట్టం ముస్లింల హక్కులను కాలరాస్తుందన్నా రు. భవిష్యత్తులో ముస్లింల మనుగడకే ఇబ్బందిగా మారే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ముస్లింల ర్యాలీకి అన్ని రాజకీయా పక్షాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, సీఐటీయూసీ, ఏఐటీయూసీ నాయకులు సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేసేదెన్నడు?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 11 నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా అమలుచేయకుండా అప్పుల లెక్కలు చెబుతూ కాలం గడిపేయడం సరికాదని వైఎస్సార్సీపీ తూర్పుకాపు కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సంక్షేమం గాలికొదిలేసి వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపులకు పాల్పడుతూ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం తగదన్నారు. నాయకుడంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిలా ఉండాలని, హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అమలుచేశారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు అధికార దాహంతో బూటకపు హామిలిచ్చిప్రజల్ని మోసగించారని దుయ్యబట్టారు. -
● లైసెన్స్డ్ వైన్షాపుల వద్ద ‘ఓపెన్ డ్రింకింగ్’ కేసుల నమోదు ● పరోక్షంగా బెల్టుషాపుల్లో విక్రయాలు పెరిగేలా స్కెచ్ ● బెల్టు నిర్వాహకులతో కుమ్మకై ్క జేబులు నింపుకుంటున్న వైనం
పోలాకి : మండలంలో మద్యం సిండికేట్ దందా సాగుతోంది. వైన్షాపులు నడిపేవారు సిండికేట్గా ఏర్పడి మందుబాబుల జేబులు గుళ్లజేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కొందరు పోలీసు లు, ఎకై ్సజ్ అధికారుల సమకారం పుష్కలంగా లభిస్తుండటంతో యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. పోలాకి మండలంలో బెలమర, జడూరు, ఈదులవలస జంక్షన్లతో పాటు మండలకేంద్రం పోలాకితో కలిపి మొత్తం 5 లైసెన్స్డ్ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 31 పంచాయతీల్లో అనధికారికంగా దాదాపు 40 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నట్లు సమాచారం. వీ టన్నింటినీ ఒకే సిండికేట్ కిందకు తీసుకురావటంలో ఎవరి పాత్ర మేర వారు కీలకంగా వ్యవహరించారు. బెల్టును ప్రోత్సహించేలా.. కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్టుషాపు లేని ఊరు లేదనేది బహిరంగ రహస్యమే. బడ్డీకొట్లు, నివాసా లు, వీధి సందులు.. ఇలా ఎక్కడ చూసినా బెల్టు షాపులే కనిపిస్తుంటాయి. అక్కడే దర్జాగా మద్యం సేవిస్తున్నా ఎకై ్సజ్ అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోరు. అదే లైసెన్స్డ్ దుకాణాల వద్ద తాగితే మాత్రం ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేస్తుంటారు. ఇక్కడే అసలైన మతలబు ఉంది. మందుబాబులు నేరుగా వైన్స్షాపుల దగ్గర కొనుగోలు చేసే దాని కన్నా బెల్ట్ నిర్వాహకుల వద్ద కొను గోలు చేస్తేనే సిండికేట్కు హోల్సేల్గా లాభం వస్తుంది. ప్రతి సీసాపైనా ఎంఆర్పీ కంటే అదనపు సొమ్మును బెల్ట్ నిర్వాహకులు అందజేస్తారు. అదే నేరుగా లైసెన్స్డ్ షాపుల వద్ద మందుబాబులకు విక్రయిస్తే వారు తాగిన దానికన్నా వాగిందే ఎక్కువ ఉంటుంది. దీంతో అధికార పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు బెల్టు దుకాణాలకు గిరాకీ పెరిగే లా ఈ స్కెచ్ వేశారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే విచ్చలవిడిగా.. ●పోలాకి మండలంలో బెల్ట్దుకాణాలు ఎక్కికక్కడే విచ్చలవిడిగా ఉన్నా అటువైపు కనీసం కన్నెత్తిచూడకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చాలామంది ప్రశ్నిస్తున్నారు. ●తీరప్రాంత గుప్పెడుపేలో నెలకు రూ.30 వేలు వరకు వేలంపాట పెట్టుకుని మరీ కూటమి నాయకులు ప్రత్యేక బెల్ట్షాపు నడుపుతున్నారు. ●జడూరు జంక్షన్లో ఓ దాబాలో అక్కడే ఉన్న లైసె న్స్ వైన్షాప్ కన్నా ఎక్కువ ధరకు మద్యం ఏరులైపారుతున్నా కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ●వ్యాపార కేంద్రం పిన్నింటిపేట, మండలకేంద్రం పోలాకిలో బెల్ట్ దుకాణాలకు నేరుగా సరఫరా చేసే వ్యక్తులు ఏ సిండికేట్కు చెందినవారో పోలీసులే తేల్చాలని పలువురు కోరుతున్నారు. ●జొన్నాం తోటల్లో నేటికీ నాటువాసన పోవడం లేదని అక్కడి వారి మాట. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.బెలమర జంక్షన్లోని లైసెన్స్డ్ వైన్స్షాప్ కఠినంగానే ఉంటున్నాం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఓపెన్ డ్రింకింగ్పై కేసులు నమోదు చేస్తున్నాం. గ్రామాల్లోనూ సిబ్బందిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లు సైతం కడుతున్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే బెల్ట్ దుకాణాలపై కూడా చర్యలు తీసుకుంటాం. – జె.శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట అడ్డగోలు దోపిడీ.. ప్రభుత్వ మద్యం పాలసీ బెల్టు నిర్వాహకులకు వరంగా మారింది. లైసెన్స్ దుకాణాల వద్ద పోలీసు కేసుల నేపథ్యంలో ఎక్కువ మంది గ్రామాల్లో బెల్ట్ దుకాణాలపై ఆధారపడుతున్నారు. అక్కడ క్వార్టర్పై రూ.40 నుంచి రూ.60 వరకు అదనపు దోపిడీ జరుగుతంది. సిండికేట్కు సైతం ఇదే అవకాశంగా మారింది. బెల్ట్ దుకాణాలపై చర్యలు తీసుకోకపోతే గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం వుంది. – రెంటికోట త్రినాథరావు, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, పోలాకి -
ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవం
అరసవల్లి: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదించిన రోజు సందర్భంగా ఇలా ప్రత్యేక దినోత్సవంగా 2010 నుంచి జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ పరిపాలనా విధానం అమల్లోకి రావడంతో క్షే త్ర స్థాయిలో స్థానిక స్వపరిపాలన సాధ్యమైందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, దారి ద్య్ర రేఖ నిర్మూలనకు విధివిధానాల రూపకల్పన, ఉపాధి కల్పన సదుపాయాల కల్పనకు ఈ సవరణ చట్టం ఆమోదంతో ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు దోహదపడిందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధిగా గెలుపొందిన తర్వాతే తనకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం వచ్చిందని ఇది గర్వంగా చెబుతున్నానని అన్నారు. స్థానికంగా గ్రామ, మండల స్థాయిలో పనిచేసిన అనుభవాలు నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఘ నంగా సత్కరించారు. అనంతరం ‘స్థానిక’ ఉత్తమ పరిపాలకులుగా సేవలందించిన సరు బుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, పలాస జెడ్పీటీసీ మచ్చ రత్నాలను జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు సంయుక్తంగా సత్కరించా రు. అనంతరం గార మండలం శాలిహుండం గ్రామ పంచాయతీని ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసి ఆ గ్రామ సర్పంచ్ కొంక్యాణ ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. అలాగే ఆ పంచాయతీ అభివృద్ధిని చూపుతూ సర్పంచ్ ఆదినారాయణ, కార్యదర్శి పల్లంటి సురేష్లు తయారు చేసిన ప్రత్యేక ‘లోగో’ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ సర్పంచ్లకు కూడా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికలను జెడ్పీ చైర్పర్సన్ విజయ అందజేశారు. డీఈఈగా సరస్వతి హిరమండలం: ఎట్టకేలకు గొట్టా బ్యారేజీ రెగ్యులర్ డీఈఈగా బోయిన సరస్వతి నియమితులయ్యారు. నాలుగేళ్ల కిందట డీఈఈగా ఉన్న ప్రభాకర్ బదిలీ అయ్యారు. కానీ ఇంతవరకూ రెగ్యులర్ డీఈఈని నియమించలేదు. ఇన్చార్జితోనే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు పదోన్నతిపై డీఈఈగా సరస్వతిని నియమించారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వంశధార అధికారులు, సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. పోలెండ్లో పలాస యువకుడు మృతికాశీబుగ్గ: పలాస మండలం తర్లాకోట పంచాయతీ ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర (33) పోలెండ్ దేశానికి వలస వెళ్లి సోమవారం అక్కడే మృతి చెందారు. ఆ దేశంలో వెల్డర్గా పనిచేసేందుకు వెళ్లిన దామోదర అక్కడి పార్కులో ఊయల వద్ద సోమవారం చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచా రం అందింది. దామోదర్కు అమ్మ పున్నమ్మ, పెరాలిసిస్తో బాధపడుతున్న తండ్రి లక్ష్మినారాయణ, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పోషణ కోసమే దామోదర్ దేశం వదిలి వెళ్లా డు. ఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా మృతదేహం రాలేదు, మృతికి గల కారణాలు కూడా తెలియరాలేదు. దీనిపై కుటుంబ సభ్యు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మె ల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సమాచారం అందించగా.. ఆ దేశ అధికారులతో మాట్లాడారు. -
ఆధిపత్యం కోసమేనా..?
ప్రస్తుతం ఉన్న నగర కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో కొత్తగా లీజుదారులతో నిర్మాణం చేపడతారని, కిమ్స్ రోడ్డు, రైతు బజారు కూడలి, కిన్నెర థియేటర్, జిల్లా పరిషత్ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చి, అక్కడ నిర్మా ణాలు చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టౌన్ వెండింగ్ కమిటీ వేయడం, అందులో ఎమ్మెల్యే సతీమణితో పాటు పలువురు కీలక వ్యక్తులను నియమించడం చూస్తుంటే కార్పొరేషన్లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా కేంద్రంపై ఆధిపత్యం కోసం స్థానికంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఎప్పుడో 2014–19లో జారీ చేసిన గెజిట్లు, రూపొందించిన చట్టాలను బయటకు తీసి టౌన్ వెండింగ్ కమిటీ పేరుతో ప్రత్యేక కమిటీని నియమించారు. 13 మంది సభ్యులు గల కమిటీలో ఐదుగురు టీడీపీ నాయకులకు చోటు కల్పించారు. వారిలో ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు బీజేపీ, జనసేన నాయకులకు మొండిచేయి చూపడం కూడా సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ కమిటీ వేసింది కమిషనరే అయినప్పటికీ ప్రతిపాదనలు మాత్రం ముమ్మాటికీ కీలక నేతల ద్వారానే జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే సతీమణి స్వాతికి చోటు కల్పించి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. నగర వెండింగ్ కమిటీలో రూరల్కు చెందిన స్వాతిని నియమించడం మరింత చర్చకు దారి తీసింది. వీరితో పాటు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన అంధవరపు ప్రసాద్, రెడ్డి గిరిజా శంకర్, ఉంగట రమణ, అల్లు నరససయ్యలకు కూడా కమిటీలో చోటిచ్చారు. టీడీ పీ నుంచి ఐదుగురిని సభ్యులుగా నియమించగా, చైర్మన్గా కమిషనర్, మిగతా హోదాల్లో వివిధ అధికారులను నియమించారు. ఈ నెల ఒకటో తేదీనే కమిటీ వేసినప్పటికీ ఇప్పుడిది తెరపైకి వచ్చింది. కమిటీ సభ్యులంతా ఇప్పటికే ఒకసారి సమావేశమై, వివిధ అంశాలపై చర్చించినట్టు కూడా తెలిసింది. చక్రం తిప్పేందుకేనా..? మొత్తానికి పాలకవర్గం లేని కార్పొరేషన్లో వెండింగ్ కమిటీ పేరుతో టీడీపీ నాయకులకు ప్లేస్ కల్పించారు. వారంతా ఏం చేస్తారో అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా కార్పొరేషన్లో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్ట్రీట్ వెండర్స్ కమి టీలను నియమించారు. ఇప్పుడా జీఓలను పట్టుకు ని టౌన్ వెండింగ్ కమిటీని నియమించినట్టు తెలుస్తోంది. కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెండర్స్ పేరు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. వెండర్స్ అంటే సరఫరాదారులు. కానీ, ఇప్పుడు వెండర్స్ అంటే పనులు చేసే వాళ్లుగా చూ పిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు మాదిరిగా టీడీపీ నాయకులను వెండర్స్గా అవతారమెత్తించి, వారిని ప్రత్యేకంగా గుర్తించి, పనులు అప్పగించారు. వారిచేతే పనులు చేపట్టి, బిల్లులు వారికే వేసి లబ్ధి చేకూరుస్తున్నారు. పనుల్లో నాణ్య త, లోపాలు, అక్రమాలు పక్కన పెడితే వెండర్స్కు తాజాగా రూరల్ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పథకం పనులు కాసులు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో తాజాగా నియమించిన టౌన్ వెండింగ్ కమిటీ ఏ రకంగా ఉంటుందో అన్నదానిపై చర్చ జరుగుతోంది. స్ట్రీట్ వెండర్స్ కోసం పనిచేస్తుందా? లేదంటే కార్పొరేషన్లో చేపట్టే పనులు, ఇతరత్రా వ్యవహారాలను చూసుకుంటుందా? అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే సతీమణి, నగర కీలక నాయకులే ఉండటంతో కార్పొరేషన్ అంతా వారి కనుసన్నల్లో, డైరెక్షన్లో నడిచే అవకాశమైతే మాత్రం ఉంటుంది. వారిని దాటి అక్కడేమీ జరిగే అవకాశం ఉండదని చెప్పొచ్చు. కొత్త నిర్మాణాల కోసమేనా..? కార్పొరేషన్లో టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు సభ్యులుగా టీడీపీ నాయకుల నియామకం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతికి చోటు వీరితో పాటు నలుగురు నాయకులకు, అధికారులకు కమిటీలో స్థానం జనసేన, బీజేపీలకు మొండిచేయి -
అగ్నికి ఆహుతైన ఎర్రచందనం చెట్లు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం శ్రీజగన్నాథపురం పంచాయతీ బిర్లంగిపేట గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు నూక సత్యరాజ్కు చెందిన సుమారు 2 ఎకరాల ఎర్ర చందనం తోటలో గురువారం రాత్రి అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క సారిగా మంటలు వ్యాపించి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, కోటబొమ్మాళి మండల కన్వీనర్ సంపతిరావు హేమసుందర్రాజు, జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, నాయకులు పేడాడ వెంకటరావు, సత్తారు సత్యం తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడు సత్యరాజ్కు అండగా నిలిచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఇలా వికృత చేష్టలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేసి బాధితుడికి న్యాయం చేయాలని నాయకులు కోరారు. -
పల్లెనిద్రలో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ
సాక్షి టాస్క్ఫోర్స్ : బూర్జ గ్రామంలో ఈ నెల 21న జరిగిన పల్లె నిద్ర కార్యక్రమానికి హాజరై న ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్కు బొమ్మాళి రేవతి అనే మహిళ సమస్యలపై నిలదీసింది. ఉపాధి పనులు చేపట్టినప్పుడు సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నారు. పాలిసెట్ హాల్టికెట్లు సిద్ధం ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవే శాలకు సంబంధించి ఏపీ పాలిసెట్ – 2025కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశా ల కన్వీనర్ బి.జానకిరామయ్య కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశా రు. పీవోఎల్వైసీఈటీఏపీ.ఎన్ఐసీ.ఐఎన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాల ని సూచించారు. ఈ నెల 30న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కూర్మనాథాలయ ఈఓగా బాధ్యతల స్వీకరణ గార: శ్రీకూర్మంలోని కూర్మనాథాలయ ఈవోగా కె.నరసింహ నాయుడు గురువా రం బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లు గా శ్రీకూర్మంతో పా టు రావివలస, పలా స గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కు ఇన్చార్జి ఈవోగా గురునాథరావు వ్యవ హరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాబేళ్లు దహనం ఘటన చోటుచేసుకోవడంతో దేవదాయశాఖ ఎట్టకేలకు రెగ్యులర్ ఈఓ నియామ కం చేపట్టింది. ఈ సందర్భంగా నరసింహనాయుడు తాబేళ్ల పార్కు, ఆలయ క్యూలైన్లు, నిత్యాన్నదాన సత్రాలను పరిశీలించారు. 10, 11వ తేదీల్లో సాహితీ సంబరాలు ఎచ్చెర్ల క్యాంపస్: ఏలూరులో శ్రీ శ్రీ కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో మే 10, 11వ తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు సంబంధించి స్వగత పత్రాలను గురువారం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బా లాజీ ఆవిష్కరించారు. సంబరాల్లో పాల్గొంటు న్న వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపా రు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, ప్రొఫె సర్ కొర్ల మోహన్కృష్ణ చౌదరి, సంక్షేమ డీన్ ర వి, తెలుగు బోధకులు పెద్దింటి ముకుందరా వు, పి.చిరంజీవిరావు, రాకోటి శ్రీనివాసరావు, కళావేదిక ఉత్తరాంధ్ర అధ్యక్షుడు వేమన, రచ యిత జంధ్యాల శరత్బాబు పాల్గొన్నారు. సీఎం భద్రతా ఏర్పాట్ల సమీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: ఈ నెల 26న ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు సమీక్ష నిర్వహించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్పై సీఎం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీ ఎ.వి.రమణతో చర్చించారు. హెలిప్యాడ్, డయాస్, సభ నిర్వహణపై సమీక్షించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. వితంతు పింఛన్లు మంజూరు శ్రీకాకుళం పాతబస్టాండ్: 2024 జనవరి నుంచి అక్టోబర్ మధ్య వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం మోమో విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో 4,623 మంది వితంతువులకు గాను రూ.1,84,92,000 కోట్లు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 25 శాతం ఉచిత సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్12(1) సి ప్రకారం 2025–26 విద్యాసంవత్సరంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులు సమీప ప్రాంతంలోని అన్ని ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త ఎస్.శశిభూషణ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు 25 శాతం కోటా కింద ప్రవేశం పొందడానికి పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, పూర్తి వివరాలకు 9703585990 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఐదు పేపర్లే రాసి.. అద్భుత ఫలితాలు సాధించి..
పొందూరు: పదో తరగతి ఫలితాల్లో పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఖనీజ్ ఫాతిమా కత్రి అరుదైన ఘనత సాధించింది. చిన్నప్పటి నుంచే కండరాల క్షీణత (మస్కులర్ డిస్ట్రోపీ) వ్యాధితో బాధపడుతున్న ఈ అమ్మాయి ఎవరైనా తోడు ఉంటేనే పాఠశాలకు వెళ్లే పరిస్థితి. అయినప్పటికీ కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో చదువును కొనసాగించింది. నడవలేని పరిస్థితి అయినప్పటికీ పట్టుదలతో చదివింది. ప్రభుత్వం ఐదు పేపర్లు రాసేందుకు అనుమతి ఇవ్వడంతో 500 మార్కులకు గాను 479 మార్కు లు సాధించి స్ఫూర్తిగా నిలిచింది. విద్యార్థినితో పా టు తల్లిదండ్రులు నజీర్ ఖత్రి, సమీర ఖత్రిలను ఎంఈవోలు గట్టు శ్రీరాములు, పట్నాన రాజారా వు, హెచ్ఎం వెంకట్రావు, సిబ్బంది అభినందించారు. -
● సూపర్సిక్స్ పేరిట జనం చెవిలో పువ్వులు పెట్టారు ● జి.సిగడాం మండల విస్తృత స్థాయిలో సమావేశంలో ధర్మాన కృష్ణదాస్, కిరణ్
జి.సిగడాం: ఎన్నికల ముందుకు కూటమి నాయకులు అనేక హమీలు ఇచ్చి గద్దెనెక్కాక అమలు చేయకుండా ప్రజల చెవిలో పువ్వులుపెట్టారని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పుతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ అన్నారు. గురువారం జి.సిగడాం రైల్వేస్టేషన్ సమీపంలో మండల నూతన కార్యవర్గ సభ్యులతో విస్తృత స్థాయి సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా ఇంతవరకు పేదల కోసం ఒక్క సంక్షేమం పథకం అమలు చేయలేదన్నారు. ప్రజల ను మోసగించడమే చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంద పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యతిరేక విధా నాలపై ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. గ్రామస్థాయిలో సైనికుల్లా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మ ప్రతినిధి ఎక్కడ? సనాతన ధర్మం ప్రతినిధిగా కోసం గొప్పలు చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తిరుపతి లో గోవులు మృత్యువాత, శ్రీకూర్మంలో నరక్షేతాల తాబేళ్ల మృత్యుత వాతం పడితే ఎందుకు నోరు విప్పడం లేదని కిరణ్ ప్రశ్నించారు. కార్యక్రమంలో పా ర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణారావు, జిల్లా అధికార ప్రతినిధి సనపల నారాయణరావు, జిల్లా కార్యదర్శి పేడాడ శ్రీరామమూర్తి, కార్యవర్గ సభ్యులు పిల్లల శివకుమార్, మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడు మీసాల వెంకటరమణ, రొక్కం బాలకృష్ణ, జెడ్పీటీసీ కాయల రమణ, మీసాల సీతంనాయుడు, వైస్ ఎంపీపీలు మీసాల సాధ్వీమణి, తోలేటి వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షులు డోల వెంకటరమణ, బోర సాయిరాం, దన్నాన రాజినాయుడు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
తమ్మినేనికి చింతాడ అభినందనలు
ఆమదాలవలస: మాజీ స్పీకర్, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినే ని సీతారాంను ఇటీవల వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్గా పార్టీ అధిష్టానం నియమించిన సందర్భంగా ఆమదాలవలస పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గురువారం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, పార్టీ మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ బొడ్డేపల్లి రమేష్కుమార్, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మాజీ కౌన్సిల ర్లు సాధు కామేశ్వరరావు, నాయకులు ఎస్.రామారావు, పొన్నాడ చిన్నారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైతులు ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలి
నరసన్నపేట: రైతుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, దీన్ని ప్రతి రైతూ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ సేవలు పొందాలని నరసన్నపేట వ్యవసాయ అధికారి కె.సునీత తెలిపారు. నేషనల్ టెస్ట్ సర్వేలెన్స్ సిస్టం అనే యాప్ను రైతులు డౌన్లోడ్ చేసుకుంటే, ఇందులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు ఆయా శాస్త్రవేత్తలు నుంచి పొందవచ్చని తెలిపారు. మడపాం రైతు సేవా కేంద్రంలో కొందరు రైతులతో యాప్ డౌన్లోడ్ చేయించి దీనిపై గురువారం అవగాహన కలిగించారు. ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో 40 మంది రైతులతో ఈ నెలాఖరుకల్లా యాప్ డౌన్లోడ్ చేయించాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు టార్గెట్ ఇచ్చామన్నారు. ఈ యాప్లో తమ పంట పొలాల్లో ఉన్న తెగుళ్లు, పురుగులు, భూమిలో లోపాలు వంటివి ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తే ఆయా విభాగాల శాస్త్రవేత్తలు వెంటనే స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. రైతులకు ఈ యాప్ ఎంతగాననో ఉపకరిస్తుందని ఆసక్తి గల రైతులు అందరూ తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
‘ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే’
పలాస: దండకారణ్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య డిమాండ్ చేసింది. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో బుధవారం మేడే కరపత్రాల ను ఆవిష్కరించారు. అన్ని ఊరూవాడల్లో కార్మిక పతాకాలను ఆవిష్కరించి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయా లని కోరారు. అలాగే కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలన్నారు. కనీసం వేతనం రూ.26వేలు చెల్లించాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి శీల కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోధనరావు, అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, దాసరి నారాయణమూర్తి, మామిడి గణపతి, గూడ మన్మధ, డొక్కర లక్ష్మణ, తామాడ గంగయ్య, మురిపింటి గంగయ్య, దాసర దానేశు తదితరులు పాల్గొన్నారు. -
అధికార మదంపై.. అక్షర శరం
అరాచకాలకు ప్రభుత్వ మద్దతు తమ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతోంది. ఏలూరులో సాక్షి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేసినట్లే. దాడికి పాల్పడ్డ ఇదే చింతమనేని గతంలో దళిత మహి ళా తహసీల్దార్పై కూడా విచక్షణారహితంగా ప్రవర్తించారు. చింతమనేనిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. – కొంక్యాణ వేణుగోపాల్, ఏపీడబ్ల్యూఏఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అధికార దురహంకారమిది.. ఏలూరు సాక్షి కార్యాలయంపై వందల మంది అనుచరులతో వెళ్లి ఎమ్మెల్యే చింతమనేని దాడి చేయించడం అధికార, మతోన్మాద, దురహంకారం. ఆయన తీరుతో చీకటి రోజులు గుర్తుకువస్తున్నాయి. దళిత మహిళా తహసీల్దార్పై గతంలో ఇలానే దాడి చేశారు. ఇప్పుడు పత్రికా కార్యాలయాలు, ప్రతినిధులపై దాడు లు చేయిస్తే ఖబడ్దార్. చింతమనేనిని బర్తరఫ్ చేయాలి. శాసనసభ సభ్యత్వాన్ని తొలగించాలి. – కంఠా వేణు, శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనరు ముక్తకంఠంతో ఖండించాలి మీడియాపై దాడులు ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. ఏలూరులో సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా మా ప్రజాసంఘాలు ఖండిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయించడంలో కూటమి ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి కనపడుతోంది. మొన్నటికి మొన్న సాక్షి ఎడిటర్, ఆరుగురి జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టించడం, మళ్లీ ఇప్పుడు ఇలా.. ఏమనుకోవాలి వీరి చర్యలను. – తేజేశ్వరరావు, సీఐటీయు జిల్లా కార్యదర్శి శ్రీకాకుళం, శ్రీకాకుళం క్రైమ్ : ఏలూరులోని ‘సాక్షి’ జిల్లా కార్యాలయంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల దాడిని అక్షరంపై అధికార పార్టీ దురహంకారంగా జర్నలిస్టు సంఘాలు అభివర్ణించాయి. మొన్న టికి మొన్న ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించిన సంగతి మర్చిపోక మునుపే.. ఇప్పుడు ఏకంగా టీడీపీ శాసనసభ్యుడే వేరే నియోజకవర్గంలో ఉన్న సాక్షి కార్యాలయానికి వందల మంది అనుచరులతో వెళ్లి ధ్వంసరచనకు పూనుకోవడం పత్రికారంగ చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిపోతుందని అంతా మండిపడ్డారు. గతంలో కూడా దళిత తహసీల్దారుపై దాడి చేయించిన చింతమనేనిలాంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకేసుకురావడం సిగ్గుచేటని దునుమాడారు. తక్షణమే చింతమనేనిని బర్తరఫ్ చేయాలని, శాసనసభ సభ్యత్వాన్ని తొలగించి ఆయనపై, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాల ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు బుధవారం ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డేఅండ్ నైట్ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ప్లకార్డులు చేతబూని ర్యాలీ చేశారు. అంబేడ్కర్ కూడలి వరకు వెళ్లి మానవహారంగా ఏర్ప డ్డారు. అనంతరం ఎస్పీకి వినతిపత్రం అందించేందుకు వెళ్లగా.. ఆయన లేకపోవడంతో సీఐ ఈశ్వరరావుకు అందించారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కొంక్యాణ వేణుగోపాల్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జోగినాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ డాక్టర్ కంఠ వేణు, జిల్లా గ్రంఽథాలయ శాఖా కన్వీనరు బుడుమూరు సూర్యారావు, ఏపీయుడబ్ల్యూజే సీనియర్ సభ్యులు జి.వి.నాగభూషణం, దళిత నాయకుడు తైక్వాండో శ్రీను, సాక్షి బ్యూరో చీఫ్ కందుల శివశంకర్, సాక్షి టీవీ బ్యూరో సునీల్, ఎల క్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బీవీఎస్ నాయుడు, శ్రీనివాసరావు, బాలు, వాసు, బి.రమేష్, చిన్నారావు, ఈశ్వరరావు, ప్రసాద్, సన్యాసినాయుడు, సీనియర్ జర్నలిస్టులు వీవీఎస్ఎన్ శ్రీనివాస్, బగాది అప్పలనాయుడు, బలివాడ శివప్రసాద్, మల్లేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ కార్యాలయంపై దాడి హేయం ఖండించిన జర్నలిస్టులు, ప్రజా సంఘాలు శ్రీకాకుళంలో నిరసన ప్రదర్శన మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తూ.. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలను భయభ్రాంతులకు గురిచేయడాన్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేయించారంటే వారి తప్పు ఎత్తిచూపుతున్న సాక్షి జర్నలిస్టులపై అక్కసు కక్కినట్లే. పత్రికారంగం లేనిదే ఏ నాయకుడు అధికారంలోకి రాలేడన్నది గుర్తు పెట్టుకోవాలి. – బుడుమూరు సూర్యారావు, జిల్లా గ్రంఽథాలయ శాఖ కన్వీనరు వ్యక్తిగత కక్షలతోనే దాడులు.. తమ అక్రమాలను, తప్పులను రా స్తున్న పత్రికా ప్రతినిధులపై దాడిచేసే వరకు వెళ్తున్నారంటే వ్యక్తిగతంగా వారిపై కక్ష కడుతున్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. ఇలా చేసే ప్రభుత్వాలన్నీ తుప్పు పట్టిపోయాయి. – జి.వి.నాగభూషణం, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ సభ్యులు ఆగడాలను అరికట్టాలి.. సాక్షి కార్యాలయంపై దెందులూరు టీడీపీ కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులతో దాడి చేయించడం అత్యంత హేయం. ఎమ్మెల్యే ఆగడాలను ఇప్పటికై నా ప్రభుత్వం అరికట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలి. మీడియా హక్కును కాపాడాలి. తప్పుడు సమాచారంతో వార్తలు రాస్తే లీగల్గా నోటీసులు పంపాలి తప్ప ఇలా కార్యాలయాలపై దాడులు చేయించడం ప్రభుత్వం తరఫున బాధ్యత గల ఓ శాసనసభ్యునిగా ఉన్న చింతమనేని దేనికి సంకేతమిస్తున్నట్లు. – జోగినాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు -
ఫిట్లెస్ సెంటర్
శ్రీకాకుళం రూరల్: ఇటీవల ఓ ప్రైవేట్ బస్సు కొందరు పాసింజర్లతో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తుండగా మార్గమధ్యంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో తుప్పల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. అంతకు వారం రోజు ల కిందటే బస్సుకు ఫిట్నెస్ పరీక్ష చేయించినట్లు డ్రైవర్ తెలిపారు. ఆరా తీస్తే ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది శ్రీకాకుళం శివారులోని ఓ ఫిట్నెస్ సెంటర్ అని తెలిసింది. ఎవరూ టెస్ట్ డ్రైవ్ చేయకుండా, మిషన్లతో పూర్తిస్థాయిలో పరీక్షించకుండా కేవలం మాన్యువల్గా పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇదే ప్రమాదానికి కారణం. ఆర్టీఏ అధికారులెక్కడ..? ఒకప్పుడు బస్సుకు గానీ, లారీలకు గానీ చివరికి ఆటోలకు సైతం ఫిట్నెస్లు చేయించాలంటే నేరు గా అనుభవం ఉన్న ఆర్టీఏ అధికారి ఆ వాహనాన్ని కొంతమేర డ్రైవింగ్ చేసేవారు. తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్య సంస్థలు లోపాలు గుర్తించడం లేదు. నామమాత్రంగా కొన్ని టెస్టులు చేసి అనుమతులు ఇచ్చేస్తున్నారు. నగరంలోని నాగావళి నదీ తీరాన, ఫాజుల్బేగ్ ప్రాంతం అగ్రికల్చర్ కార్యాలయం పరిధిలో వాహ న ఫిట్నెస్ సెంటర్లకు కొన్ని నెలల కిందట అనుమతులు ఇచ్చారు. ఇక్కడ వివిధ రకాలైన ట్రాన్స్పోర్టు (ఎల్లోబోర్డు) వాహనాలన్నింటికీ మిషనరీతోనే బండి కండీషన్లకు పర్మిషన్లు ఇస్తున్నాయి. ఇక్కడ అనుభజ్ఞులైన ఆర్టీఏ అధికారులంటూ ఎవ్వరూ లేరు. ప్రైవేట్ యాజమాన్య సంస్థ పెట్టుకున్న సిబ్బందితోనే తూతూ మంత్రంగా వాహనాలకు ఫిట్నెస్లు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆటో నుంచి తోక లారీ వరకూ ఎలాంటి వాహనానికై నా ఫిట్నెస్కు సంబంధించిన అన్ని అనుమతులు ఆ ప్రైవేట్ యాజమాన్య సంస్థే ఫిట్నెస్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఆర్టీఎ అధికారుల పాత్ర, అప్రూవుల్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఏజెంట్లకు పండగే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఏజెంట్ల ఆశలు చిగురించాయి. వారు ఇచ్చిన టోకెన్ నంబర్ ఆధారంగానే ఏదైనా బండికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు త్వరితగతిన వచ్చేస్తున్నాయి. పొరపాటున నేరుగా ఆన్లైన్ ద్వారా ఎఫ్ఫీకు సంబంధించిన స్లాట్ను వాహన యజ మాని బుక్ చేసుకుంటే అది పూర్తిగా ఫెయిల్ అవ్వాల్సిందే. ప్రభుత్వ ఆధీనంలో ఫిట్నెస్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటే రెండోరోజుకు కూడా మా ర్చుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఫిట్నెస్ సెంటర్లో ఆ పరిస్థితి లేకుండా పోయింది. భారీ దోపిడీ కేంద్రంలో వివిధ రకాలైన వాహనాలపై భారీ దోపిడీ జరుగుతోంది. ఇదంతా ఏజెంట్ల ద్వారానే కమిషన్ పద్ధతిలో నడుస్తోంది. స్థానికంగా ఏర్పాటు చేసిన రేట్లు కంటే అధిక రేట్లకు ముందస్తుగానే ఏజెంట్ ద్వారా డబ్బులు లాగేస్తున్నారు. ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్ల జారీ వాస్తవంగా ఏదైనా బండి ఫిట్నెస్ కేంద్రానికి వెళ్తే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి. ఇది బండి కొన్న నెలరోజులకే షోరూంకు వస్తుంది. కానీ ఫిట్నెస్ కేంద్రంలో ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్ను ఏర్పాటు చేస్తూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు రూ. 20 విలువ చేసే రిఫ్లెక్టివ్ రెడ్ టేపును బండికి అంటించడానికి రూ. 300 నుంచి రూ.500 వరకూ దోచేస్తున్నారు. శ్రీకాకుళం శివారులో వాహన ఫిట్నెస్ సెంటర్ ఏజెంట్ కోడ్తో బుక్ చేసుకుంటేనే ఫిట్నెస్ మంజూరు ఆర్టీఏ అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థ పేరుతో పత్రాల జారీ పట్టించుకోని రవాణాశాఖ అధికారులు ఫిర్యాదులు మా దృష్టికి వస్తున్నాయి ఫిట్నెస్ కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గ తంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నపుడు బండి కండీషన్ చూస్తూ ఫిట్నెస్ సర్టిఫికేట్లు అందించేవాళ్లం. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ప్రైవేట్ పరం చేశారు. మా పాత్ర అంటూ ఏమీ లేదు. – విజయ సారథి, డీటీసీ టోకెన్ తీసుకున్నాం ఆటో ఫిట్నెస్ కోసం ఏజెంట్కు రూ.3000 డబ్బులు ఇచ్చి ఫిట్నెస్ టోకెన్ తీసుకున్నాం. ఉదయం 10 గంటలకు ఫిట్నెస్ కేంద్రంలో బండి పెట్టాను. మధ్యాహ్నం 3 గంటలకు బండి ఇచ్చారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలో బండి ఫిట్నెస్ చేసుకుంటే రూ.1000తోనే సరిపోయేది. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ ప్రతి దానికి అధికంగా డబ్బులు కట్టాల్సిందే. – మురళి, ఆటో డ్రైవర్ -
పునరావృతం కాకుండా చూడాలి
గార: శ్రీకూర్మం క్షేత్రంలో తాబేళ్లు దహనం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. బుధవారం కూర్మనాథాలయానికి జనసేన నాయకుల తో కలసి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాబేళ్ల మరణానికి గల కారణాలు విశ్లేషించాలని, దహనం చేయడంలో ఎవరు చేశారన్నది త్వరగా విచారించాలని కోరారు. కార్యక్రమంలో పైడి వేణుగోపాలరావు, శివ్వాన ఉమామహేశ్వరి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, పండి యోగీశ్వరరావు, పైడి సిందూర, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక లారీ బీభత్సం
రణస్థలం: మండల కేంద్రంలోని సూర్య స్కూల్ జంక్షన్ వద్ద బుధవారం రాత్రి 8.50 గంటల సమయంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఇసుక లారీ ముందు వ్యా నును తప్పించబోయి డివైడర్ మధ్యలో ఉన్న రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి నిలిచిపోయింది. అదే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రణస్థలం ఒక కారు వస్తుండగా ఆ కారుపై విద్యుత్ స్తంభం పడిపోయింది. కారు ముందు భాగంలో పడడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో కృష్ణాపురం మాజీ ఎంపీటీసీ ముల్లు కృష్ణ, పల్లు కొట్లు రామకృష్ణ, ధనరాజు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జేఆర్ పురం పంచాయతీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
అంబులెన్స్లో ప్రసవం
మందస: మందస మండలం కుడుమాసాయ్ గిరిజన గ్రామంలో ఓ మహిళ అంబులెన్స్లో ప్రసవించారు. ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. అంబులెన్స్లో ఆమెను తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో నొప్పులు అధికం కావడంతో వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇద్దరినీ హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలెట్ రామచంద్రారెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ఈ నెల 26వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పర్యవేక్షించారు. గ్రామంలో ఏర్పాటు చేయనున్న సభ, హెలీప్యాడ్ ఏర్పాటు, వాహ నాలు పార్కింగ్, మత్స్యకారులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. పుస్తక ప్రదర్శన శ్రీకాకుళం అర్బన్: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కా ర్యదర్శి బి.కుమార్రాజు మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం వంటిదని అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పించడం జరిగిందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు. ఈ ప్రదర్శనలో రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, నాటికలు, ఇయర్ బుక్స్, నిఘంటువులు, పోటీ పరీక్షలకు సంబంధించిన 200 రకాల పుస్తకాలు ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప గ్రంథాలయాధికారి వీవీజీఎస్ శంకరరావు, పై.మురళీ కృష్ణ, యు.కల్యాణి, టి. రాంబాబు, పి.రామ్మోహన్ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. కందుకూరి పురస్కార గ్రహీతలకు సత్కారాలు శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని వాసవీ కల్యాణ మండపంలో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో ఇటీవల కందుకూరి పురస్కారాలు అందుకున్న కళాకారులను బుధవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. పురస్కారాలు అందుకున్న మెట్ట పోలినాయుడు, గుత్తు చిన్నారావులకు జ్ఞాపికలు, సన్మాన పత్రాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య సభ్యులు, సుమిత్రా కళాసమితి సభ్యులు పాల్గొన్నారు. ఇంటి బాట.. టెక్కలి: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులంతా ఇంటి బాట పట్టారు. బుధవారం తరగతుల నిర్వహణ చివరి రోజు కావడంతో, సుదూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులంతా వసతి గృహాల వద్దకు చేరుకుని వారి పిల్లలకు సంబంధించి సామ గ్రితో ఇంటి బాట పట్టారు. మళ్లీ జూన్ 12 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. -
393 మార్కులతో నిరాశ
శ్రీకాకుళం క్రైమ్ : అరవై శాతానికి పైగా వచ్చిన మార్కులు ఆ విద్యార్థికి అవమానంగా తోచాయి. తోటి పిల్లలతో పోల్చి చూసుకునే తత్వం ప్రాణాల మీదకు తెచ్చింది. గౌరవప్రదమైన మార్కులే అయి నా ‘పోటీ’ ప్రపంచానికి వాటిని చెప్పలేక ఓ బాలుడు ఊపిరి వదిలేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని బలగ హడ్కో కాలనీకి చెందిన పదోతరగతి విద్యార్థి గూరుగుబిల్లి వేణుగోపాలరావు(15) ఇంటిలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోష్కుమార్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలోని ఎయిడ్స్ కంట్రోల్బోర్డు సూపర్వైజర్గా పని చేస్తున్న గూరుగుబిల్లి అమ్మినాయుడు తన భార్య, కుమార్తె, కుమారునితో కలసి బలగ హడ్కో కాలనీలో నివాసముంటున్నారు. కుమార్తె బీటెక్ ఇంజినీరింగ్ చదువుతుండగా కుమారుడైన వేణుగోపాలరావు స్థానిక ప్రైవేటు స్కూల్లో పదో తర గతి చదువుతున్నాడు.393 మార్కులే రావడంతో..బుధవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో వేణుగోపాల్ ఇంటి వద్దనే తల్లి మొబైల్లో ఫలితం చూసుకున్నాడు. అప్పటి నుంచి మౌనంగానే వేరే గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. అప్పటికే తనయుని ప్రవర్తనపై తల్లికి అనుమానం వచ్చింది. తలుపు కొట్టినా ఎంతకీ తీయకపోవడంతో ఆందోళన చెందిన తల్లి బయటకు వెళ్లి వేరేవారి మొబైల్ తీసుకుని భర్తకు కాల్ చేసింది. విధుల్లో ఉన్న వేణుగోపాల్ తండ్రి హుటాహుటిన ఇంటికొచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యానుకు చీరతో ఉరేసుకున్న కుమారున్ని చూసి హతాశులయ్యారు. కొన ఊపిరైనా ఉంటుందేమోనని అంబులెన్సును పిలిపించి రిమ్స్కు తరలించారు. రిమ్స్కు చేరేసరికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించడంతో భోరున విలపించారు. అనంతరం వేణు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆరు అడుగుల పుస్తకం ఆవిష్కరణ
గార: తెలుగు భాషా విజ్ఞానానికి సంబంధించి ఆరు అడుగుల పెద్ద పుస్తకాన్ని బుధవారం ఉపాధ్యాయు లు, విద్యార్థులు ఆవిష్కరించారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా అంపోలు పంచాయతీ ఆడవరం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం భోగెల ఉమామహేశ్వరరావు ఈ పుస్తకాన్ని తయారు చేశారు. వీటిలో అక్షర వర్ణమాల, గుణింత పేర్లు, పదాలు, పద్యాలు, గురజాడ, గిడుగు, వేమన వంటి సాహిత్య కవుల చరిత్రలు, పాఠశాల ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. పుస్తక జ్ఞానంలో మనిషి విద్యావంతుడు అవుతాడన్నారు. -
గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని పలు యాజ మాన్యాల గురుకుల పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో చక్కటి ఉత్తీర్ణత సాధించారు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గు రుకులాల్లో ఈ ఏడాది 525 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కాగా475 మంది పాసయ్యారు. ఫస్ట్క్లాస్ 398 మందికి వచ్చింది. ● మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో 547 మంది పరీక్ష రాయగా 516 మంది పాసయ్యారు. 477 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. ● బీసీ వసతి గృహాల్లో ఈ ఏడాది 958 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 707 మంది పా సయ్యారు. ప్రథమ శ్రేణి 482 మందికి వచ్చింది. ఆరు వసతి గృహాల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. -
నూతన డీఐఈఓగా సురేష్కుమార్
శ్రీకాకుళం అర్బన్: జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారిగా రేగ సురేష్ కుమార్ బుధవారం బాధ్య తలు చేపట్టారు. విజయనగరం జిల్లా గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సురేష్ కుమార్ను ఇటీవల రెగ్యులర్ డీఐఈఓగా శ్రీ కాకుళం జిల్లాకు పదోన్నతిపై నియమించారు. ఇప్పటివరకు డీవీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎస్.తవిటినాయుడుకి విజయనగరం జిల్లా రెగ్యులర్ డీఐఈఓగా పదోన్న తి లభించగా, సురేష్ కుమార్ శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. 1992లో సర్వీస్ కమిషన్ ద్వారా కామర్స్ జూనియర్ లెక్చరర్గా వృత్తిజీవితం ప్రారంభించిన సురే ష్కుమార్ చినమేరంగి, గుమ్మలక్ష్మీపురం, గజపతినగరంలలో పనిచేశారు. ప్రిన్సిపాల్గా పదోన్న తి పొంది ఎస్.కోట, గుమ్మలక్ష్మీపురం, గుర్ల కళాశాల ల్లో పనిచేసి సౌమ్యునిగా పేరుపొంది, అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా డీవీఈఓగా ఎఫ్ఏసీ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నూతన డీఐఈఓగా బాధ్యతలు చేపట్టిన సురేష్కుమార్ను ఆర్ఐఓ దుర్గారావు, ప్రిన్సిపాల్స్ భీమేశ్వరరావు, వర్మ, నాగేంద్ర శర్మ, గణపతి వెంకటేశ్వరరావు, కీర్తి తవిటినాయుడు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రతినిధులు తదితరులు కలిశారు. -
ప్రకృతి వ్యవసాయంతో నేలకు మేలు
పాతపట్నం: ప్రకృతి సాగుతో అటు నేలకు, ఇటు పంటకు ఎంతో మేలు జరుగుతుందని తద్వారా రైతుకు ఆదాయం సమకూరుతుందని ప్రకృతి వ్యవసాయం అడిషనల్ డీపీఎం ధనుంజయ అన్నారు. మండలంలోని మెట్టుపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి సహజ సిద్ధ ఆహారంపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి నుంచి పండించే బెల్లం, వేరు శనగ, కొర్రెలు, కారం, రాగులు, చింతపండు వంటి పదార్థాలు తీసుకోవడం వద్ద కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. ప్రకృతి వ్యవసా యం చేస్తూ మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని రైతులకు, మహిళా సంఘాలకు వివరించారు. కార్యక్రమంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ రేణుక, గోవిందరెడ్డి, శివాజీ, సువర్ణరావు, శ్రావ్య, భారతి, రైతులు పాల్గొన్నారు. -
కుప్పిలిలో నలుగురు మాత్రమే..
టీచర్ల బిడ్డ మందస: మందస మండ లం హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కంచరాన జోషిత 597 మార్కులు తెచ్చుకుని అదరగొట్టింది. ఆమె తండ్రి మాధవరావు బి.కేశుపురంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తుండగా, తల్లి లేపాక్షి కూడా తాళభద్ర పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. రైతు కుమారుడు.. పాతపట్నం: మండలంలోని రొంపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన డోల మనోహర్ 593 మార్కులతో ప్రతిభ చాటాడు. విద్యార్థి స్వగ్రామం ఆర్ఎల్ పురం. తండ్రి డోల తేజేశ్వరరావు వ్యవసాయం చేస్తుంటారు. తల్లి డోల సావిత్రమ్మ గృహిణి. పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థానం అమాంతం పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది మాత్రం 14వ స్థానానికి పడిపోయింది. అయితే ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతలో మాత్రం జిల్లాకు స్టేట్ ఫస్ట్ రావడం కాసింత ఊరట. గత ఏడాది 93.35 ఉత్తీర్ణత శాతంతో అదరగొట్టిన సిక్కోలు.. ఈ ఏడాది మాత్రం 82.41 శాతానికి పరిమితమైపోయింది. కంచరాన జోషితశ్రీకాకుళం: పదో తరగతి ఫలితాల్లో జిల్లా గత ఏడాదితో పోలిస్తే 12 స్థానాలు కిందకు పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవగా, ఈ ఏడాది 14వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో 82.41 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 28,176 మంది పరీక్షలు రాయగా, 23,219 మంది పాసయ్యారు. బాలురుపై బాలికలదే పైచేయిగా నిలిచింది. 14,287 మంది బాలురు పరీక్షలు రాయగా 11,358 మంది ఉత్తీర్ణత సాధించారు 79.50 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 13,889 మంది బాలికలు పరీక్షలు రాయగా, 11,861 మంది ఉత్తీర్ణులయ్యారు. 85.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతానికి సంబంధించి జిల్లా స్థానం పడిపోయినప్పటీకీ ప్రథమశ్రేణిలో పాసయి న వారు జిల్లా నుంచే ఎక్కువ మంది ఉండటంతో రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. ఉత్తీర్ణత సాధించిన వారిలో 19,114 మంది ప్రథమ శ్రేణిలోనూ, 2885 మంది ద్వితీయ శ్రేణిలోనూ, 1128 మంది తృతీయ శ్రేణిలోనూ ఉత్తీర్ణులయ్యారు. మందస మండలం హరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కె. జోషిత అనే విద్యార్థి 597 మార్కులతో జిల్లాలోనే ప్రథమంగా నిలిచింది. యాజమాన్యాల వారీగా.. యాజమాన్యాలు వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 96.18 శాతంతో ప్రథ మంగా నిలిచాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలల్లో ఫలితాలు వచ్చాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95.77 శాతం ఉత్తీర్ణులయ్యారు. జ్యోతిబా పూలే పాఠశాలల్లో 94.33 శాతం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 83.22 శాతం, కేజీబీవీల్లో 89.46 శాతం, మున్సిపల్ పాఠశాలల్లో 73.53 శాతం ఉత్తీర్ణులయ్యారు. మోడల్ స్కూళ్లలో 89.60 శాతం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 90.48 శాతం, ట్రైబెల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87.32 శాతం పాసయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 70.77 శాతం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 76.22 శాతం ఉత్తీర్ణత పొందారు. 597 ఫలితాలన్నింటినీ బేరీజు వేసుకుంటే జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, కేజీబీవీల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిందనే చెప్పాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కాపీయింగ్తో సంచలనమైన కుప్పిలి పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 53 మంది పరీక్షలు రాయ గా 49 మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. -
● జిల్లాలో దిగజారిన పదో తరగతి ఫలితాలు ● 82.41 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం ● గత ఏడాది రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచిన జిల్లా ● ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతలో మాత్రం జిల్లాకు ప్రథమ స్థానం
సామాన్య కుటుంబంలో.. నరసన్నపేట: గుండవల్లిపేట మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ విద్యార్థి పొట్నూరు కుశాల్ 593 మార్కులతో సత్తా చాటాడు. రావులవలసకు చెందిన కుశాల్ తల్లిదండ్రులు పొట్నూరు హరి, లీలావతి. వీరు కిరాణాదుకాణం నడుపుతుంటారు. ఉపాధ్యాయుడి ఇంటిలో.. బూర్జ: ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్లో చదివిన బుడుమూరు ఉదయ్కిరణ్ 593 మార్కులు సాధించాడు. స్వగ్రామం కూడా ఓవీ పేట. విద్యార్థి తండ్రి బుడుమూరు వెంకటరమణమూర్తి మెళియాపుట్టి మండలం గోకర్నపురం ప్రాథమిక పాఠశాలలో టీచర్. తల్లి గోవిందమ్మ గృహిణి. 593 -
పర్యాటకులపై ఉగ్రదాడి దారుణం
జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్య పిరికిపందల చర్య అని కేంద్ర, రాష్ట్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ దాడిని నిరసిస్తూ బుధవారం రాత్రి శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ కూడలి నుంచి డే అండ్ నైట్ కూడలి వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతో నిన్నటికే 35 విమానాలను ఏర్పాటు చేసి, 4,500 మంది పర్యాటకుల్ని వారి స్వస్థలాలకు చేర్చామన్నారు. దాడిలో శ్రీకాకుళం నగరానికి చెందిన చంద్రమౌళి చనిపోవడం బాధాకరమని, ఆయన మృతదేహం బుధవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనుందని తెలిపారు. ర్యాలీలో ఎమ్మెల్యే గొండు శంకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థలు, కూటమి నేతలు పాల్గొన్నారు. చంద్రమౌళి కుటుంబం 30 ఏళ్ల కిందట శ్రీకాకుళంలోని కృష్ణా పార్కు సమీపంలో నివాసం ఉండేది. – శ్రీకాకుళం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26మందిని బలితీసుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బాధితుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం తక్షణ మే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముష్కరులు కశ్మీర్ పర్యాటక ప్రాంతంలోకి చొరబడి కాల్పులు జరపడం హేయమైన చర్య అని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో వైఎస్సార్ కూడలి (ఏడురోడ్లు) వద్ద పార్టీ శ్రేణులంతా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా బలగాల్ని పెంచాలని, రక్షణవిభాగంలో నిఘా, భద్రత బలగాలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణదాస్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయా, మాజీ ఎమ్మె ల్యే రెడ్డి శాంతి, పార్టీ టెక్కలి ఇన్చార్జి పేరాడ తిలక్, ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవి, వైఎస్సార్సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర జిల్లాల యవజన విభాగం అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, ముంజేటి కృష్ణ, ఎంఏ భేగ్, మార్పు పృథ్వీ, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమేష్, టి.కామేశ్వరి, గొండు కృష్ణ, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, గద్దిబోయిన కృష్ణయాదవ్, పొన్నాడ రుషి, రౌతు శంకరరావు, ిసీహెచ్ భాస్కరరావు, శ్రీరామ్మూర్తి, చింతాడ రామ్మోహన్, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పప్పల రమష్, సీపాన రామారావు, కె.తేజ, వానపల్లి రమేష్లతో పాటు అధిక సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తీవ్రవాదుల దాడి హేయం కాశీబుగ్గ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో యాత్రికులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా మనమందరం కలిసి కట్టుగా దేశ సమైక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు.శ్రీకూర్మనాథాలయ ఈఓగా కె.నరసింహనాయుడు గార: శ్రీకూర్మనాథాలయ కార్యనిర్వహణాధికారిగా కె.నరసింహనాయుడును నియమించారు. ఆయన ఇప్పటివరకు ఆర్కియాలజీ, మ్యూజియం ఏడీగా అమరావతి సర్కిల్లో పనిచేస్తూ దేవదాయ శాఖకు డిప్యుటేషన్ వచ్చారు. నెల రోజుల కిందటే డిప్యుటేషన్పై వచ్చినా ఇప్పటివరకు దేవదాయ శాఖ అనుమతి లేకపోవడంతో వెయిటింగ్లో ఉన్నారు. గురువారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. -
సాంఘిక సంక్షేమ శాఖ డీడీపై దర్యాప్తు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం కలెక్టరేట్లోని కేఆర్సీసీ కార్యాలయంలో ఎస్డీసీ బి.పద్మావతి విచారణ చేపట్టారు. తనకు సాంఘిక సంక్షేమ శాఖలోని వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని డీడీ విశ్వమోహన్రెడ్డి రూ.2,50,000 లంచం అడగ్గా దఫదఫాలుగా రూ.2,30,000 ఇచ్చినట్టు కొత్తూరు మండలానికి చెందిన దళిత యువకుడు ఎస్.ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. అదనంగా రూ.20 వేలు ఇవ్వనందున డీడీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇటీవల ఇదే శాఖలో ఎనిమిది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను డీడీ చేపట్టారని, అందులో తన పేరు లేకపోవడంపై ప్రశ్నించగా తనతో పాటు గజేంద్ర, పవన్ అనే యువకులపైనా కులదూషణ చేసినట్లు తెలిపాడు. తమ డబ్బులు ఇచ్చేయాలని ప్రసాద్ తల్లి దమయంతి నిలదీయగా, ఆమెను కూడా దూషించినట్లు చెప్పాడు. కాగా, బాధితులు మాత్రం విచారణ సంతృప్తికరంగా లేదని, ఏకపక్షంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
రోడ్డుకు అడ్డంగా గ్రానైట్ లారీ
మెళియాపుట్టి: మండలంలోని చింతలపోలూరు వద్ద గ్రానైట్ రాయితో వెళుతున్న లారీ సాంకేతిక కారణంగా రహదారికి అడ్డంగా నిలిచిపోయింది. సాయంత్రం సమయం కావడం, అధిక సంఖ్యలో రాకపోకలు కొనసాగించే రహదారి కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీనబంధుపురం గ్రామ పంచాయతీలో సుమారు 20కి పైగా గ్రానైట్ క్వారీలు ఉండటంతో రాకపోకలు సాగించే వాహనాల శబ్దాలతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంజాయి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష మెళియాపుట్టి : మెళియాపుట్టి కూడలిలో 2023 ఏప్రిల్ 25న గంజాయితో పట్టుబడిన బులుమాలి అనే వ్యక్తికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు వెలువరిచింది. నిందితుడిది ఒడిశా రాష్ట్రం చడియాపడ గ్రామమని పోలీసులు తెలిపారు. న్యాయమూర్తులకు బదిలీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలువురు న్యాయమూర్తులకు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. శ్రీకాకుళం ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి భరణికి నర్సీపట్నం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యింది. ఆమదాలవలస జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్.మణికి కాకినాడ, నరసన్నపేట కోర్టు న్యాయమూర్తికి పాలకొండకు బదిలీ అయ్యింది. పాలకోండ కోర్టు న్యాయమూర్తి విజయ్రాజ్కి విజయనగరం జూనియర్ డివిజన్ సివిల్ కోర్టుకు, సోంపేట కోర్టు న్యాయమూర్తి ఎ.రాముకు విశాఖపట్నం బదిలీ చేశారు. టెక్కలి కోర్టు న్యాయమూర్తి హెచ్ఆర్ తేజా చక్రవర్తికి విజయనగరం బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి కె.శ్రీనివాస్ సోంపేట కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నుంచి ఎస్.వాణి నరసన్నపేట కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 27న జిల్లా బీచ్ కబడ్డీ జట్లు ఎంపిక శ్రీకాకుళం అర్బన్: జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బీచ్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈ నెల 27న నిర్వహిస్తున్నట్టు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాదు ముసలినాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీ స్విమ్మింగ్ ఫూల్, ఇండోర్ స్టేడియం వద్ద నాగావళి రివర్ నదీతీరాన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పురుషులు 85 కేజీలు, మహిళలు 75 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జట్లు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడలో జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలలో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ సాధు శ్రీనివాసరావు (సెల్: 9441914214)ను సంప్రదించాలని వారు కోరారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలోని జాతీయ రహదారిపై పాత పెట్రోల్ బంకు కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని మంగళవారం ఉదయం 10.30 టాటా లగేజీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో బి.సీతారాం అనే వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పల్ల శివాజి, రేగాన వెంకటేష్కు స్వల్ప గాయాలయ్యాయి. జె.ఆర్.పురం ఏఎస్సై డి.రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్షతగాత్రులు లావేరు మండలం పైడియ్యవలసకు చెందినవారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఎస్పీలతో డీఐజీ సమీక్ష శ్రీకాకుళం క్రైమ్ : విశాఖ రేంజి పరిధిలోని ఎస్పీలు, ఇతర అధికారులతో డీఐజీ గోపినాథ్ జెట్టి మంగళవారం సమీక్ష నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు తదితర అంశాలపై చర్చించాచారు. చెక్పోస్టుల వద్ద నిఘా, విస్తృత తనిఖీలు నిర్వహించాలని, తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టు చేసి వారిపై ఉన్న నాన్బెయిల్బుల్ వారెంట్లు తక్షణమే జారీ చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల మనస్తత్వాన్ని మార్చలేం
● చెత్తను బయటపడేస్తారు.. కుళాయిలు విరిచేస్తారు.. ● జెడ్పీ స్థాయి సంఘ సమావేశంలో ఎమ్మెల్యే కూన వ్యాఖ్యలు శ్రీకాకుళం: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయమై మాట్లాడుతూ మహిళలు ఇంట్లో చెత్తను తీసుకువచ్చి బయట పడేస్తున్నారని, పరిసరాలు ఎలా ఉన్నా వారికి అనవసరమని చెప్పారు. తాగునీటి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వీధి కుళాయిలు వద్దని, ఇంటింటి కుళాయిలే మంచివని చెబుతూ ఆడవాళ్లు కుళాయిల ట్యాపులు కట్టకుండా వదిలేసి వెళ్లిపోతారని, అవసరమైతే కుళాయిలను విరిచేస్తారని చెప్పారు. ఈ రెండు వ్యాఖ్యానాలు చేసిన అనంతరం మహిళలను కించపర్చటం తన ఉద్దేశం కాదంటూనే వారి మనస్తత్వం ఇలా ఉంటుందని, వారిని మార్చటం సాధ్యం కాదన్నారు. గ్రంథాలయ వ్యవస్థ వృథా.. పంచాయతీలకు వచ్చే ఆదాయంలో గ్రంథాలయ పన్ను పోతుందని అంటూ గ్రంథాలయ వ్యవస్థే పనికిరానిదని కూన పేర్కొన్నారు. ఆ వ్యవస్థకు ఒక చైర్మన్, జీతం, ఇతర ఖర్చులు కూడా వృథాయేనని చెప్పారు. ఈ వ్యవస్థ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రగతి పథంలో నడిపించాలి.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో రాజకీయాలకు అతీతంగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో చేపడుతున్న సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ, పింఛన్లు తదితర ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. పన్నులు వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహనరావు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న పూలే పార్కు వద్ద శనివారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఉషారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి, జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ రాజీవ్, జి.రాఘవ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్లపై కుట్ర శ్రీకాకుళం: ఓవైపు పాత పెన్షన్ అమలు కోసం ఉద్యోగులు కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే ఇవేవీ పట్టని కేంద్ర ప్రభుత్వం పాత ఫించన్దారులకు హానికలిగించేలా పెన్షన్ సవరణ బిల్లు తీసుకురావడం దారుణమని ఎన్డీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ దాసరి క్రాంతి భవన్ వద్ద లోక్సభలో పెన్షన్ సవరణ బిల్లు ఆమోదంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్డీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకష్ణ, చింతల రామారావు, శ్రీనివాసరావు, తిరుమలరావు, జి.శ్రీనివాసరావు, హెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎస్.వి.రమణమూర్తి -
చరిత్ర తిరగరాద్దాం!
పుస్తకం తిరగేద్దాం.. శ్రీకాకుళం కల్చరల్: నేటి సాంకేతిక యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడంతో పుస్తకాలు చదివేవారు బాగా తగ్గిపోయింది. మనలో ఒంటరితనాన్ని పోగొట్టి మరో ప్రపంచంలోకి విహరింపజేసే పుస్తకాలే మనకు నిజమైన నేస్తాలని విద్యావేత్తలు చెబుతున్నారు. రోజులో కొంత సమయమైనా పుస్తక పఠనానికి కేటాయించాలని కోరుతున్నారు. నేటి తరంవారికి పుస్తకాలు చదవడం అంటే కేవలం పాఠ్య పుస్తకాలు చదవడం అనే అభిప్రాయం ఉంది. అందుకే సాధారణ పుస్తకాల చదవడం మానేశారు. ఇంకొందరు మాత్రం పుస్తకాలపై ప్రేమ చూపుతునే ఉన్నారు. తాము కొనుగోలు చేసిన, సేకరించిన పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజులో సగభాగం అందులోనే గుడుపుతుంటారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. జ్ఞాపిక శక్తి, భాషా పరిరక్షణకు పుస్తకాలే కీలకం పుస్తక పఠనం పెరగాలంటున్న విద్యావేత్తలు నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం యువత చదవాలి.. ఏకాగ్రత కోసం పుస్తక పఠనం అవలవాటు చేసుకోవాలి. పుస్తకాలు మన ఆలొచనా దృక్పథాన్ని పెంచుతాయి. నేటి తరం యువత కూడా సాహిత్యం చదవడంపై శ్రద్ధ పెంచాలి. – ముట్నూరు ఉపేంద్రశర్మ, ప్రభుత్వ అధ్యాపకుడు, శ్రీకాకుళం ఏకై క నేస్తం.. మన వ్యక్తిత్వానికి, వికాసానికి అద్దం పట్టేది పుస్తకం. పుస్తక పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చు. అత్యంత ఉత్తమ సమాచార, ప్రచార, ప్రసాద సాధనం, మాధ్యమం పుస్తకమే. – జంధ్యాల శరత్బాబు, రచయిత -
ఐదు కిలోల గంజాయి స్వాధీనం
పాతపట్నం: అక్రమంగా గంజాయి తరలిస్తున్న గార మండలం పొగాకువానిపేట గ్రామానికి చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియాస్ సాయి అనే యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాతపట్నం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వి.రామారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గార మండలం పొగాకువానిపేటకు చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియాస్ సాయి ఐటీఐ చదువుతూ మధ్యలో మానేసి వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం నెల్లూరు జిల్లాకు తరలించేందుకు 5.662 కిలోల గంజాయిని 3 ప్యాకెట్లుగా తయారు చేసి బ్యాగ్తో ఒడిశా నుంచి నడిచి వస్తుండగా పాతపట్నం చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తికి అప్పగించేందుకు గంజాయిని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సాయిని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐ బి.లావణ్య, ఏఎస్ఐ సింహాచలం, పోలీసులు పాల్గొన్నారు. -
ఇసుక దందా
సముద్ర తీరంలో.. ● నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు ● చదును చేసిన భూములను ఆక్రమించుకుంటున్న కూటమి నేతలు ● పట్టించుకోని అధికారులు పోలాకి: ‘కాదేదీ అక్రమాలకు అనర్హం’ అనే రీతిలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. ఏకంగా సముద్ర తీరప్రాంతంలోనూ ఉప్పు ఇసుక దందా సాగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలాకి మండలంలోని గుప్పెడుపేట, రాజపురం, డీఎల్పురం, కొత్తరేవు, అంపలాం, పల్లిపేట పంచాయతీల పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలో వున్న అటవీ భూముల్లో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది అటవీ భూముల పేరుతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం అటవీశాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నకొవిరిపేటలో దౌర్జన్యం.. పోలాకి మండలం గుప్పెడుపేట పంచాయతీ చిన్నకొవిరిపేటలో తన ఆధీనంలోని భూమిలో ఇసుక తవ్వకాలపై నిలదీసిన మైలపల్లి నారాయణ అనే వ్యక్తిపై ఇసుకాసురులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సర్వేనెంబర్–274 లో పట్టపగలే ఇసుకను తరలించి అక్కడే నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను సైతం నిర్మిస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1997లో ఇదే సర్వే నంబర్లో చిన్నకొరవిపేట అటవీ భూముల సాగుహక్కుల విషయంలో అప్పటి హరిశ్చంద్రపురం ఎమ్మెల్యే, ఇప్పటి రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో చేసుకున్న ఒప్పందాలను సైతం కాదని తమ భూముల్లో ఇసుక ఎత్తుకెళ్లిపోతున్నారని వారు వాపోతున్నారు. నిర్మాణాలు ప్రశ్నార్థకమే: ఉప్పుఇసుకతో భవనాలు, రహదారులు నిర్మాణం చేపట్టతుండటంతో వాటి నాణ్యత సైతం ప్రశ్నార్థకంగా మారుతోం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుకవిధానంలో ఇసుక ఉచితం అన్నప్పటికీ వినియోగదారునికి చేరేసరికి ట్రాక్టర్ లోడ్ రూ.1500 నుంచి రూ.2వేల వరకు పలుకుతోంది. అందులో సగానికే కేవలం రూ.500 నుంచి రూ.1000కే ఉప్పు ఇసుకను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వాటిని కొన్నిచోట్ల నదీ ప్రాంత ఇసుకతో మిక్సింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మండలంలో నిర్మాణం చేపట్టిన ఉపాధి సీసీ రహదారులు అన్నింటికీ ఇదే ఇసుక వినియోగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగడాలకు అడ్డేలేదు మా సాగులో వున్న అటవీ భూమిలో పట్టపగలే ఇసుకను తరలించుకుపోతున్నారు. అడ్డుపడిన నా భర్తపై దౌర్జన్యం చేసేందుకు సైతం వెనకాడలేదు. పెద్దమనుషుల ముసుగేసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామంలో అటవీ భూముల్లో ఇసుక ఎత్తుకెళ్లిన తర్వాత చదునుచేసి ఆ స్థలాలను కూటమి నాయకులు ఇష్టానుసారంగా అమ్మకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదు. – మైలపల్లి లావణ్య, బాధితురాలు, చిన్నకొవిరిపేట -
అమ్మా వస్తున్నానంటూనే.. అనంతలోకాలకు..
● అనుమానాస్పదంగా విద్యార్థి మృతి ● లొద్దపుట్టి ఆర్హెచ్ కాలనీలో విషాదం ఇచ్ఛాపురం రూరల్: ‘అమ్మా...ఈ రోజు ఇంటికి వస్తున్నాను...’ అని కన్న కొడుకు తల్లికి ఫోన్లో సమాచారం అందించాడు. దీంతో ఆ తల్లి కొడుకుకు ఇష్టమైన వంటకాలు చేసి వేయి కళ్లతో ఎదురు చూడటం ప్రారంభించింది. ఉదయం ఫోన్ చేసిన కొడుకు రాత్రి పన్నెండు గంటలైనా ఇంటికి చేరకపోవడంతో ఫోన్ చేసింది. స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైంది. తెల్లారితే... కొడుకు చదువుతున్న కళాశాలకు ఫోన్ చేస్తే మృతి చెందాడన్న పిడుగులాంటి వార్తను చేరవేయడంతో ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామం ఆర్హెచ్ కాలనీకి చెందిన నెయ్యిల నీలాద్రి(లడ్డూ), ఢిల్లేశ్వరీల కుమారుడు గోపాల్(19). విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో సెకెండియర్ చదువుతున్నాడు. తండ్రి నీలాద్రి గల్ఫ్లో కూలి పనులు చేస్తున్నాడు. సోమవారం తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా....ఈ రోజు ఇంటికి వస్తున్నాను’ అంటూ చెప్పిన గోపాల్ అర్థరాత్రి వరకు ఇంటికి చేరక పోవడంతో మంగళవారం ప్రిన్సిపాల్కు ఫోన్ చేసింది. గోపాల్ విజయనగరంలోని రైలు కింద పడి మృతి చెందినట్లు చెప్పడంతో తల్లి కుప్పకూలిపోయింది. కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసేకునేంత పిరికి వాడు కాదని, కుమారుడు మృతి వెనుక కుట్రదాగి ఉందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యార్థి గోపాల్ మృతితో గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి. -
సివిల్స్లో
సిక్కోలు మెరుపులుసాయి మోహిని మానసకు వర్యాంకు జిల్లాకు చెందిన రావాడ సాయి మోహిణి మానస సివిల్స్ ఫలితాలలో 973వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు ప్రకాషరావు, ఉషారాణి ఉద్యోగులు కావడంతో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం ఒకే చోట జరగలేదు. 1 నుంచి 4 వరకు సోంపేటలో వాణీ విద్యానికేతన్, 5వ తరగతి కంచిలి సెయింట్ జోసెఫ్ పాఠశాల, 6నుంచి 10 వతరగతి వరకు శ్రీకాకుళంలోని శార్వాణి విద్యానికేతన్లో చదివింది. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఎంబీబీఎస్ సీటు సాధించి ఆంధ్రామెడికల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి విశాఖలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు విశాఖ ఐఏఎస్ ఆకాడమీలో సివిల్స్లో కోచింగ్ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. రెండో ప్రయత్నంలో ప్రిలిమనరీలోనే వెనుదిరిగారు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మూడో ప్రయత్నంలో 973వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మోహినీని డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది, శ్రీకాకుళం నగరానికి చెందిన అంధవరపు సూరిబాబు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. సాయి మోహిని మానస ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను ఈ స్థాయికి వచ్చేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని చెప్పారు. ఏం చదవాలనే విషయమై ఒత్తిడి తేకుండా నా ఇష్టానికి వదిలేస్తూ ప్రోత్సహించారని తెలిపారు. పేదలకు ఆరోగ్య సేవ చేసేందుకు ప్రభుత్వ వైద్యురాలిగా చేరానని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవ చేసే అవకాశం సివిల్స్ ర్యాంక్ వల్ల దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె మానస తపస్సులా కృషి చేసి మంచి ర్యాంకు సాధించిందని తల్లిదండ్రులు ఉషరాణి, ప్రకాశరావు చెప్పారు. రెండు సార్లు సివిల్స్లో అర్హత సాధించనపుడు ఇక ప్రయత్నించవద్దని చెప్పినా పట్టు వీడకుండా చదివి విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. – శ్రీకాకుళం973 -
ర్యాంకు
జోషిబాబుకు 790సివిల్ సర్వీస్ ఫలితాల్లో కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన లింగూడు జోషిబాబు 790వ ర్యాంకు సాధించారు. తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. జోషిబాబు 1 నుంచి 10వ తరగతి వరకు టెక్కలిలో ఓ ప్రైవేట్ స్కూల్లో చదివారు. విశాఖలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్, ఆంధ్రా యూనివర్శిటీలో మైరెన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2021లో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్లో చేరారు. 2022లో సివిల్స్లో అర్హత సాధించలేకపోయారు. రెండో ప్రయత్నంలో తాజాగా 790వ ర్యాంకు సాధించారు. జోషిబాబుకు సివిల్స్లో ర్యాంకు రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – టెక్కలివ -
దేవదాయ శాఖ నిద్రమత్తు వీడాలి
● శ్రీకూర్మనాథాలయ ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు గార: వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ నిద్రమత్తు వీడాలని శ్రీకూర్మనాథాలయ ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు అన్నారు. నక్షత్ర తాబేళ్ల దహనం నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించారు. స్వామి దర్శన అనంతరం మాట్లాడు తూ నక్షత్ర తాబేళ్లు ఇక్కడ ఉంటేనే దైవాంశం ఉంటుందన్నారు. ఎక్కడికో తరలించడం వల్ల ఆలయానికి ప్రాశస్త్యం తగ్గుతుందన్నారు. దేవదాయ శాఖ ధర్మకర్తలను గౌరవించాలని, దేవాలయ పరిస్థితులపై సమాచారాన్ని తెలియజేయాలని అన్నారు. కూర్మనాథస్వామి ఆభరణాలు దశాబ్దాలుగా సింహాచలం దేవస్థానంలో ఉన్నాయని, ఇక్కడ ఉంచితే బాగుంటుందన్నారు. దీనిపై ఎమ్మెల్యే శంకర్ స్పందిస్తూ నగలు ఇక్కడే ఉంచాలని అధికారులకు తెలియజేశామని చెప్పారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ డీసీ సుజాత, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఇన్చార్జి వై.భద్రాజీ తదితరులు పాల్గొన్నారు. -
కూర్మాల
మృత్యుఘోషకు కారణంగార: పవిత్ర శ్రీకూర్మం దేవాలయ ప్రాంగణంలో నక్షత్ర తాబేళ్లు మృతిచెందడం దురదృష్టకరమని, దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. మృత తాబేళ్ల దహనం ఘటన నేపథ్యంలో మంగళవారం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయ తాబేళ్ల పార్కును పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైన క్షేత్రాల్లో శ్రీకూర్మం ఒకటని, ఇక్కడ తాబేళ్లు చనిపోవడం బాధాకరమన్నారు. అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిని సంరక్షించడంలో అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని, అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ప్రతీదీ రాజకీయ కోణంలో చూడకుండా తిరుమలలో గోవులు చనిపోవడం వంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం దేవదాయ శాఖ డీసీ సుజాతకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ గొండు రఘురామ్, జెడ్పీటీసీ మార్పు సుజాతమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, బరాటం నాగేశ్వరరావు, పొన్నా డ రుషి, పీస గోపి, చిట్టి జనార్దనరావు, అంబటి శ్రీనివాసరావు, ఎచ్చెర్ల శ్రీధర్, మూకళ్ల తాతబాబు, బగ్గు అప్పారావు, అంధవరపు బాలకృష్ణమూర్తి, మార్పు దుర్గా పృథ్వీరాజ్, కొయ్యాన నాగభూషణం, పీస శ్రీహరిరావు, యాళ్ల నారాయణమూర్తి, రౌతు శంకరరావు, గొలివి వెంకటరమణమూర్తి, పల్ల పెంటయ్య, బరాటం నాగరాజు పాల్గొన్నారు.తాబేళ్లు లెక్కల్లో తేడా ఎందుకు? కాంట్రాక్టర్ను నిలదీసిన దేవదాయ శాఖ డీసీ గార: తాబేళ్ల లెక్కల్లో తేడాలు ఎందుకు వస్తాయని, ఎందుకు అంత అశ్రద్ధగా ఉన్నారని దేవదాయ శాఖ డీసీ సుజాత కాంట్రాక్టర్ రమణమూర్తిను నిలదీశారు. తాబేళ్ల దహనం ఘటనపై దేవదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం కూర్మనాథాలయానికి విచ్చేసి ఆరా తీశారు. 2022లో 286 తాబేళ్లుండగా, ఇప్పుడు వాటి సంఖ్య 212కు ఎలా పడిపోయిందని ప్రశ్నించారు. తాబేళ్లు చనిపోతున్న పరిస్థితుల్లో నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కులో గ్రీనరీ లేకపోవడం వల్లే చనిపోతున్నాయని గ్రీన్మెర్సీ ప్రతినిధి రమణమూర్తి తెలపగా, అప్పట్లో ఈవోగా పనిచేసిన ఈవో విజయకుమార్ స్పందిస్తూ గ్రీనరీ తొలగించలేదని, ఇంకా విరివిగా మొక్కలు నాటామని చెప్పారు. తాబేళ్ల పార్కును వాటికి అనుగుణంగా ఆలయంలోని వేరే స్థలంలో నిర్మించాలని డీసీ సుజాతను గార ఎంపీపీ గొండు రఘురామ్ కోరారు. ప్రతి నెలా ఆరోగ్య పరిస్ధితి తెలుసుకోవడం, పశుసంవర్థక శాఖ, అటవీ శాఖ పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
ఉత్తరాంధ్ర సాగునీటి కల సాకారమే లక్ష్యం
● జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి భవితవ్యాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పాత, కొత్త ప్రాజెక్టులన్నింటినీ సమాన ప్రాధాన్యతతో పూర్తి చేసి, ప్రతి చివరి భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వంశధారపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరడి సైడ్ వియర్ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలను వెంటనే తొలగించి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా హిరమండలం రిజర్వాయర్కు నిరంతరాయంగా నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనులు ఆలస్యం చేస్తున్న ఏజెన్సీలకు తక్షణమే నోటీసులు జారీ చేసి, టెండర్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పనులకు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, పనులు నెమ్మదిగా సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్ట ఎత్తిపోతల పథకం పూర్తయితే 12 టీఎంసీల నీరు హిరమండలం రిజర్వాయర్కు తరలించవచ్చని, ఇది కీలకమైన ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. గొట్ట బ్యారేజ్ ఆప్రాన్ పనుల కోసం రూ.12.81 కోట్ల టెండర్లను వెంటనే పిలవాలని ఆదేశించారు. షట్టర్ల కుంభకోణంపై చర్చ సందర్భంగా, కోర్టు అనుమతి పొంది వెంటనే షట్టర్లను స్వాధీనం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. నాగావళి–వంశధార నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. రణస్థలం పైడి భీమవరం పారిశ్రామికవాడకు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నిరంతరాయంగా నీటి సరఫరా ఉండేలా చొరవ చూపాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు కోరారు. కళింగపట్నం, అంబల్లవలస ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంత్రిని కోరారు. -
విన్నపాలు విన్నారు
● మీకోసంకు 154 దరఖాస్తులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘మీ కో సం‘ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, వాటిలో కొన్ని సమస్యల ను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన అంశా లను సంబంధిత శాఖలకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైరిగాంలో ప్రభుత్వ చెరువుల ఆక్రమణలు టాస్క్ ఫోర్స్: సైరిగాం గ్రామంలో ప్రభుత్వ చెరువులు ఆక్రమణలకు గురువుతున్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముద్దాడ శ్రీనివాసరావు ఈ ఆక్రమణలు చేస్తున్నాడని గ్రామ సర్పంచ్ ధర్మాన అనితతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన వెంకటరమణ మూర్తి, పొన్నాన ముసలినాయుడు, కొర్ను నారాయణరావు తదితరులు సోమ వారం ప్రభుత్వ కార్యదర్శితోపాటు డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. సైరిగాం పంచాయతీలో ఊరి గుండం చెరువులో సర్వే నంబరు 90లో 7.24 ఎకరాలు ఉండగా ఇందులో పలువురు రైతులకు డీ పట్టాలు ఇచ్చారు. ఇదే చెరువులో మట్టిని యంత్రాలతో తవ్వకాలు జరిపి ట్రిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని పెరిగించి ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న అచ్చెప్ప చెరువును కప్పుతున్నారని వారు పేర్కొన్నారు. తన సోదరుడు ముద్దాడ రవి చంద్ర సీఎం కార్యాలయంలో ముఖ్య హోదాలో పని చేయడంతో ఆయన పేరు చెప్పి ఈ ఆక్రమణలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఇదే వి ధంగా పాపమ్మ కోనేరు, భూసమ్మకోనేరు, శోభనాద్రి చెరువు, ఉప్పరవాని చెరువు, మంగళివాని చెరువు, గాది బంద చెరువు తదితరవి దురాక్రమణ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై స్థానిక తహసీల్దార్కు రెండు రోజు ల కిందట ఫిర్యాదు చేస్తే.. రెండు రోజులాగి మళ్లీ ఆక్రమణలు కొనసాగిస్తున్నారని తెలిపారు. 79 ఫిర్యాదుల స్వీకరణ శ్రీకాకుళం క్రైమ్: సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కు 79 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో అదనపు ఎస్పీ (అడ్మిన్) కేవీ రమణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయి లో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీ సు అధికారులు ఫోన్ కాల్స్ ద్వారా తక్షణమే తెలియపరచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
అక్రమంగా గ్రావెల్ తరలింపు
సారవకోట: మండలంలోని జమచక్రం గ్రామం నుంచి సత్రాం పంచాయతీ గొల్లపేట వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 42 కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. ఈ మార్గంలో కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు వినియోగించుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్లు పక్కనే ఉన్న కొండ నుంచి గ్రావెల్ను ఎలాంటి అనుమతులు లేకుండా తరలించుకుంటున్నారు. ప్రస్తుతం అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న కొండ నుంచి సచివాలయం కూత వేటులోనే ఉన్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరించడం విచారకరం. దీనిపై స్థానిక వీఆర్వో రామును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
రాగుల సేకరణకు సిద్ధం
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో రాగుల సేకరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ద్వారా ఈ పంటకు సంబంధించిన కేవైసీ పూర్తిచేసిన రైతుల నుంచి రాగులను సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సంతబొమ్మాళి మండలం రైతు సేవా కేంద్రం వద్ద రాగుల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాగులు పండించిన ఇతర మండలాల్లో క్లస్టర్ పద్ధతిలో రైతులకు మరింత చేరువలో రాగుల సేకరణ కేంద్రా లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.4,290గా ఉంటుందని తెలిపారు. గోనెసంచులు, కూలీ ఖర్చులను ప్రభుత్వం భరించనుందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ తరహాలోనే, రైతు సేవా కేంద్రాల ద్వారా రాగులను సేకరించి, రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మద్దతు ధరకు తమ ఉత్పత్తిని ప్రభుత్వానికి అమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం రైతులు 7732098637 లేదా 6281839352 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. -
ఒడిశా నుంచి ప్రథమ భాష సాహిత్య పుస్తకాలు
కవిటి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒడియా మీడియం విద్యార్థులకు అవసరమైన ప్రథమ భాషా పుస్తకాలు ఒడిశా విద్యాశాఖ నుంచి అందుకున్నామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(ఒడియా) దుర్గాప్రసాద్ చౌదరి తెలిపారు. సోమవారం ఈ మేరకు బరంపురంలో అందుకున్నామన్నారు. జిల్లాలో ఒడియా మాధ్యమం చదువుతున్న విద్యార్థులకు రూ.2లక్షల విలువ చేసే 9,10 వ తరగతి సంబంధించి ప్రథమ భాష ఒడియా సాహిత్య సింధు 1270 పుస్తకాలు, సాహిత్య ధారా 1250 పుస్తకాలు, ఒడియా వ్యాకరణం 2520 పుస్తకాలు ఒడిశా ప్రాంతీయ మాధ్యమిక బోర్డు బరంపురం జోన్ జాయింట్ సెక్రటరీ సుభాష్ చంద్ర బెహరా ఉత్తరాంధ్ర ఒడియా డీఐ దుర్గా ప్రసాద్ చౌధురీకి సోమవారం బరంపురం ప్రాంతియ మాధ్యమిక బోర్డు కార్యాలయంలో అందజేశారు. -
రోడ్డెక్కిన ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనం పెంచాలని, వేధింపులు ఆపా లని డిమాండ్ చేస్తూ వారంతా సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు డచ్ భవనం వద్ద సమావేశం నిర్వహించి ధర్నా చేశారు. ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లను సీఎం, డిప్యూటీ సీఎంలు మోసం చేశారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ను ఉద్యోగులుగా గుర్తించడం లేదని, 2016 నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు పెరిగాయన్నారు. చెప్పిన పనులు చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నార ని ఆరోపించారు. మరో పది రోజుల్లో తమ సమస్య లు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామన్నా రు. ఈ నెల 16 నుంచి దశల వారీగా అధికారులకు తమ గోడు వినిపిస్తున్నామని, ఈ నెల 28 నుంచి విధులను పూర్తిగా బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగ సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, పి.రామస్వామి, ధర్మారావు, సూర్యచంద్ర, పెద్ద ఎత్తున ఎఫ్ఏలు పాల్గొన్నారు. ● 28 నుంచి సమ్మెకు సిద్ధం -
110 గ్రామాల్లో నాటుసారా ప్రభావం
టెక్కలి: జిల్లాలో 6 ఎకై ్సజ్ కార్యాలయాల పరిధిలో 110 గ్రామాల్లో నాటు సారా ప్రభావం ఉన్నట్లు గుర్తించామని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీ పి.రామచంద్రరావు వెల్లడించారు. సోమవారం టెక్కలి ఎకై ్స జ్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించి విలేకర్లతో మా ట్లాడారు. కొత్తూరు, హిరమండలం, నందిగాం, మెళియాపుట్టి, పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో నాటు సారా ప్రభావం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా సోంపేట, టెక్కలి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో గల మండలాల్లో 70 గ్రామాల్లో నాటు సారా ప్రభావం ఉందన్నారు. జూన్ నాటికి సారా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేకంగా నవోదయం కా ర్యక్రమంతో ఇప్పటికే 190 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏసీ పేర్కొన్నారు. గతంలో నాటుసారా అమ్మకాలు చేసిన 1224 మందిని గు ర్తించి వారిలో 724 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నాటు సారా తయారీ, విక్రయాలను మానేస్తే అలాంటి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే నాటుసారాకు అవసరమైన బెల్లం ఊటలను విక్రయించేవారిలో 58 మందిని గుర్తించామని వారిలో 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఏసీ రామచంద్రరావు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 838 బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకున్నామని, వాటిలో భాగంగా 1314 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలా సలో అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేసిన దుకాణంపై రూ.5 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. నాటు సారా అమ్మకాలు, అధిక ధరలకు మద్యం అమ్మకాలు, ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తరలింపు, బెల్టు దుకాణాలు నిర్వహిస్తే తక్షణమే 14405 టోల్ఫ్రీ నంబరుకు గాని, 94409 02332 ఫోన్ నంబరుకు సమాచారం అందజేయాలని కోరారు. ఆయనతో పాటు టెక్కలి ఎకై ్సజ్ సీఐ షేక్ మీరా సాహెబ్, సిబ్బంది ఉన్నారు. -
పరిమితి పెరిగిందోచ్
నరసన్నపేట: ఖరీఫ్, రబీల్లో పంటల వారీగా రైతులకు ఎంత మొత్తంలో రుణాలివ్వాలనే అంశంపై గరిష్ట రుణ పరిమితి (స్కేల్ఆఫ్ ఫైనాన్స్) ఖరారైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అన్ని పంటలకు రుణ పరిమితి 10 నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఏటా వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతుండటంతో బ్యాంకు రుణాల పరిమితిని కూడా పెంచుతున్నారు. దీంట్లో భాగంగా రానున్న ఖరీఫ్, రబీ సీజన్లకు గరిష్ట రుణపరిమితి నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో బ్యాంకుల్లో కొత్త రుణాల పంపిణీ, పాత రుణాలు రెన్యువల్స్ను బ్యాంకర్లు ప్రారంభించారు. పంటల వారీగా రుణపరిమితి ఇలా.. వర్షాధారం, నీటి వసతి కింద ఉన్న పొలాలకు వేర్వేరుగా పరిమితిని నిర్ధారించారు. వరికి గత సంవత్సరంలో ఎకరాకు రూ.46 వేలు రుణం ఇవ్వగా, దీన్ని ఈ ఖరీఫ్కు రూ.52వేలు చేశారు. రబీలో అయితే రూ.55 వేలు, విత్తన వరికి అయితే రూ.55 వేలు ఇవ్వనున్నారు. అలాగే వేరు శనగకు వర్షాధారం అయితే ఎకరాకు రూ.38 వేలు, కాలువ కింద పొలాలు అయితే రూ.41 వేలు, పత్తికి రూ.51 వేలు, మొక్క జొన్నకు రూ.47 వేలు, మినుము పంటకు రూ.30 వేలు, పెసలకు రూ.24వేలు, ఆయిల్ పామ్కు రూ. 70 వేలు, పచ్చి మిరపకు రూ.1.10 లక్షలు, రెడ్ మిరపకు రూ. 1.75 లక్షలు, చెరుకుకు రూ.80 వేలు, హైబ్రీడ్ టమాటాకు రూ.78 వేలు, వంకాయకు రూ.54 వేలు, బెండకు రూ.36 వేలు, అరటి ఎకరాకు రూ.1.10 లక్షలు, కొబ్బరికి రూ.70 వేలు, గడ్డి సాగుకు రూ.36 వేలు, బంతి పూల సాగుకు రూ.55 వేలు, వాటర్ మిలన్కు రూ.54 వేలు ఇలా మొత్తం 110 పంటలకు రుణ పరమితిని నిర్ధారించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 20 శాతం పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి రూ. 52 వేలు వరకు రుణానికి అవకాశం మొక్కజొన్నకు రూ.47 వేలు వేరు శనగకు రూ.41 వేలు బ్యాంకుల్లో ప్రారంభమైన పంటరుణాల రెన్యువల్స్ బ్యాంకర్లకు సమాచారం ఇచ్చాం పెరిగిన రుణపరిమితి వివరాలపై బ్యాంకులకు సమాచారం ఇచ్చాం. దీని ప్రకారం బ్యాంకర్లు రుణాలు రెన్యువల్ చేయడం, కొత్తవి ప్రాసెస్ చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది మరింత విరివిగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వనున్నాం. – సూర్యకిరణ్, ఎల్డీఎం -
విద్యుత్ స్తంభాల పరిశీలన
సంతబొమ్మాళి: రొయ్యల చెరువుల కోసం పంట పొలాల్లో వేసి న విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ జేఈ శివకుమార్, మండల విద్యుత్ శాఖ ఏఈ శశిభూషణరావు సోమవారం పరిశీలించారు. పంట పొలాల్లో దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు అనే శీర్షికన ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ఆయా రైతులు, రొయ్యల వ్యాపారితో మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆర్డీవో, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని విద్యుత్ శాఖ జేఈ శివకుమార్ తెలిపారు. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
● శ్రీకాకుళం మండల పరిధిలో బైరి గ్రామంలో ఘటన ● ముక్తకంఠంతో ఖండించిన వైఎస్సార్సీపీ నాయకులు ● దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండల పరిధిలోని బైరి గ్రామం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి తర్వాత పగులగొట్టి రోడ్డుకు అడ్డంగా పడేశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వీసు రోడ్డులో బైరి గ్రామానికి వెళ్లే రహదారిలో ఈ విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత కొన్ని నెలల కిందట విగ్రహం ఎడమ చేతిని కూడా గుర్తు తెలియని వారు ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే కూల్చేశారు. దీనిపై బైరి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ఎండి అసిరినాయుడుతో పాటు పలువురు గ్రామస్తులు రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను వైఎస్సార్సీపీ నాయ కులంతా ముక్తకంఠంతో ఖండించారు. జనం గుండెల్లో సుస్థిర స్థానం పొందిన వైఎస్సార్ విగ్రహంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ●విగ్రహం కూల్చివేత పైశాచికం బైరి జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేయడం పైశాచికం. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి, చట్టపరంగా శిక్షించాలి. 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పార్టీలకు అతీతంగా కోట్లాది మంది మదిలో ఆయన శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని నేలపాలు చేయటం బాధాకరం. రాజకీయ పార్టీలు ఇలాంటి అనైతిక చర్యలను ముక్తకంఠంతో ఖండించాలి. – తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు -
శ్రీకాకుళం
విన్నపాలు విన్నారుప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనం సమస్యలు ఏకరువు పెట్టారు. ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు. –8లోఈ ఫొటో చూస్తే మాల్దీవులో.. మరేవో దీవులు అనుకునేరు. ఇసుక దొంగల విధ్వంసానికి దీవిలా మారిపోయిన నాగావళి నది ఇది. ఆమదాలవలస నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇసుక దోపిడీతో పెద్ద పెద్ద గోతులతో నదీ గర్భం మిగిలిపోయింది. అయినా అధికారులకు ఇదేమీ కనిపించడం లేదు. ఇప్పటికే ప్రోత్సహించిన అక్రమాలు చాలవని కాఖండ్యాం, పురషోత్తపురం, ముద్దాడపేడ తదితర ప్రాంతాల్లో అనుమతుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇంత దారుణంగా నాగావళి నదిని కబళిస్తుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇసుకాసురుల విధ్వంస కేళీ మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గంలో కాఖండ్యాం, పురుషోత్తపురం 1, 2, ముద్దాడపేట, సింగూరు, దూసి తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఆగడం లేదు. కొన్నింటికి అనుమతుల ఇచ్చే విషయంలో యంత్రాంగం చోద్యం చూస్తోంది. నదులు ఏమైనా ఫర్వాలేదు తీర ప్రాంత గ్రామాలు ఏమైపోయినా అక్కర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు వేటికి అనుమతులున్నాయో? వేటికి అనుమతుల్లేవో? తెలియని పరిస్థితి కూడా ఉంది. నది పొడవునా తవ్వకాలు జరుగుతుండటంతో అయోమయం నెలకొంది. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని నాగావళిలో రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్న అక్రమ తవ్వకాలు, తరలింపు చూస్తుంటే భవిష్యత్లో ఎలాంటి ముప్పు వాటిల్లుతోందన్న భయం సర్వత్రా నెలకొంది. తవ్వకాలు జరపడమే కాకుండా ఆ ఇసుకను కొత్తరోడ్డు పాత బంకు దగ్గర, దూసి జంక్షన్ దగ్గరలో స్టాక్ పాయింట్గా డంపింగ్ చేసి, అక్కడి నుంచే లోడింగ్ చేసి విక్రయాలు సాగిస్తున్నారు. బాలకృష్ణ, తోంది. కోట్లాది రూపాయల మేర నిర్వాహకులు సంపాదిస్తున్నారు. రవికాంత్ తదితర వ్యక్తుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. అధికారుల వద్ద ఉండాల్సిన బిల్లుల సాఫ్ట్వేర్, డివైజ్లు నేరుగా నిర్వాహకుల చేతుల్లోకి వెళ్లాయి. రీచ్ నిర్వాహకులే స్వయంగా బిల్లులు రూపొందించి, లారీ డ్రైవర్లకు అందజేస్తున్నారు. దీంతో రోజుకి ఎన్ని బిల్లులు ఇస్తున్నారో, ఎంత తరలిస్తున్నారో కూడా కూడా లెక్క తెలియని దుస్థితి నెలకొంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కూన రవికుమార్ అండ్ కో నిర్వాకాలపై పోరాటం చేస్తున్న సనపల సురేష్ అనే వ్యక్తి ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ స్పందన లేదు. అక్రమాలు ఆగడం లేదు. ఇసుక తవ్వకాలు, తరలింపునకు బ్రేక్ పడటం లేదు. ప్రతి రోజూ వేలాది లారీల ఇసుక అక్రమంగా తరలిపో●ఫిర్యాదు చేశా.. ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఇసుక మాఫియాగా తయారై ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశాను. – చింతాడ రవికుమార్, వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త న్యూస్రీల్ ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బరితెగింపు భయంకరంగా తయారవుతున్న నాగావళి నది వంశధారలోనూ అదే పరిస్థితి నిర్వాహకుల చేతుల్లోకి సాఫ్ట్వేర్, డివైజ్లు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా సురేష్కుమార్ నియామకం
శ్రీకాకుళం అర్బన్: జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి(డీఐఈఓ)గా ఆర్.సురేష్కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. విజయనగరం జిల్లా గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఈయనను తాత్కాలిక డీఐఈఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ శ్రీకాకు ళం జిల్లా డీవీఈఓగా పనిచేసిన శివ్వాల తవిటినాయుడును విజయనగరం జిల్లా డీఐఈఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. తవిటినాయుడు పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ జిల్లా డీవీఈఓగా సేవలందించిన విషయం తెలిసిందే. ఉపాధిలో ఖాళీలకు కొత్త అభ్యర్థులకే అవకాశం శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీ స్థాయిలో ఖాళీగా ఉన్న క్షేత్ర సహాయకులు, సీనియర్ మేట్ల పోస్టులు భర్తీ చేయనున్నట్టు డ్వామా పీడీ సుధాకర్ రావు తెలిపారు. ఖాళీల భర్తీకి కొత్త అభ్యర్థుల వివరాలను మాత్రమే పంపాలని మండల అభివృద్ధి అధికారులకు తెలిపారు. మేట్ల మధ్య తగాదాలు, పని వేళల్లో గైర్హాజరీ వంటి సమస్యలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ పిల్లలు కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో స్థానిక ఎంఈఓ ఎన్.శ్రీనివాసరావు కుమార్తెను ఆరో తరగతిలో చేర్చారు. ప్రవేశ పత్రంను హెచ్ఎం గోవిందరావు అందజేసి జాయిన్ చేసుకున్నారు. ఇప్పటికే ఎంఈఓ కుమారుడిని సైతం ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. ప్రభు త్వ బడుల్లో నైతిక విలువలతో పాటు నాణ్యమైన విద్య అందుతోందని, అందుకే పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించానని ఎంఈఓ శ్రీనివాసరావు తెలిపారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని హెచ్ఎంతో పాటు సిబ్బంది ప్రచారం చేశారు. ఇసుక మేటల తొలగింపు ప్రారంభంఎచ్చెర్ల క్యాంపస్: నారాయణపురం ప్రాజెక్టు పరిధిలో ఇసుక మేటలు తొలగించే పనులు సోమవారం ప్రారంభించారు. నారాయణపురం కుడి కాలువ ద్వారా ఎచ్చెర్ల మండలంలో 13 పంచాయతీల పరిధిలో 7175 ఎకరాకు సాగునీరు అందుతుంది. గత ఏడాది సాగునీటి సమస్య కాణంగా పంటలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్య తీసుకువెళ్లారు. దీంతో ఖరీఫ్ సాగునీటి లక్ష్యంగా యంత్రాలతో పనులు ప్రారంభించారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువులను లావేరు హెచ్సీ రామారావు సోమవారం పట్టుకున్నారు. బుడుమూరు సంత నుంచి రణస్థలం వైపు వెళ్తున్న బొలెరో వ్యానులో ఈ పశువులను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాన్లో తొమ్మిది ఆవులు, మరో వ్యానులో ఏడు ఆవులు ఉన్నట్లు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, గుర్ల మండలం, గుజ్జంగివలసకు చెందిన దేవ రమేష్, ఎచ్చెర్ల మండలం రుప్పపేట గ్రామానికి చెందిన రుప్ప వెంకటరమణ, జలుమూరు మండలానికి చెందిన వాన జడ్డన్న, టెక్కలి గ్రామానికి చెందిన ఇప్పిలి రాములపై కేసు నమోదు చేశామని తెలిపారు. పశువుల అక్రమ రవాణా నేరమని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అపచారంపై భగ్గుమన్న భక్తజనం
● శ్రీకూర్మంకు పరుగులెత్తిన అధికార గణం ● బట్టబయలైన ‘గ్రీన్మెర్సీ’ నిర్లక్ష్య వైఖరి ● పొంతనలేని లెక్కలు.. నిజాన్ని దాచే ప్రయత్నాలు ● పత్రికా కథనాలపై కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు ● బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన భక్తులు, వీహెచ్పీ సభ్యులు ● పర్యవేక్షణలో డొల్లతనంపై స్థానిక ఎమ్మెల్యే సీరియస్ గార: వేల ఏళ్లుగా శ్రీకూర్మంలో విరాజిల్లుతున్న కూర్మనాథ క్షేత్రం సాక్షిగా అపురూప నక్షత్ర తాబేళ్ల సంరక్షణపై నిర్లక్ష్యపు నీడ కమ్ముకుంటోంది. సాక్షాత్తు ఆ దేవుడి ఎదుటే కూర్మాల ఆయుష్షు తగ్గిపోతోంది. ఈ వైఖరి భక్తుల మనసు తీవ్రంగా కలిచివేస్తోంది. తాబేళ్ల మరణ మృదంగంపై వచ్చిన వార్తలు చూసిన కూర్మనాథుని భక్తులు ఆలయ నిర్వాహకులతో పాటు తాబేళ్ల పార్కు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతన లేకుండా సమాధానం చెబుతున్న తీరుపై మండిపడ్డారు. కళ్ల ముందు అంతా కనిపిస్తుంటే కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు చేస్తుండడాన్ని ఖండిస్తున్నారు. స్థానికులతో పాటు భక్తులు, వీహెచ్పీ సభ్యులు, రాజకీయ నాయకులు అంతా సోమవారం కూర్మనాథ క్షేత్రానికి క్యూ కట్టారు. అంతా హడావుడే.. తేలని లెక్క కూర్మనాథాలయంలో తాబేళ్ల మృత్యుఘోష.. దహనంపై వివిధ విభాగాల అధికారులు ఆలయాన్ని సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు. కానీ పార్కులో ఉన్న తాబేళ్ల సంఖ్య ఎంత.. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి.. అనే అంశంపై మాత్రం ఎవరూ దృష్టిసారించిన దాఖలాలు లేవు. తాబేళ్ల పార్కు నిర్వహణ బాధ్యతలు చూసుకునే గ్రీన్మెర్సీ సంస్థ నిర్వాహకుడు మాత్రం 212 ఉండాలని, రికార్డు ప్రకారం అంతే ఉన్నాయని చెప్పడం విశేషం. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ రికార్డుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ అధికారి సంతకాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. 25 ఎక్కడ నుంచి వచ్చాయో.. కూర్మనాథాలయం ఈవో కార్యాలయం వెనక భాగంలో దహనం చేసిన.. కళేబరాలుగా ఉన్న తాబేళ్ల సంఖ్య 25గా అధికారులు గుర్తించారు. వాటిలో 8 తాబేళ్లను పోస్టుమార్టం కోసం పంపించారు. పార్కులో మొత్తం తాబేళ్ల సంఖ్య 212 ఉండాలని.. రికార్డుల ప్రకారం సరిపోయాయని.. గ్రీన్మెర్సీ మూర్తి సమాధానం ఇవ్వడం వెనక ఆంతర్యమేమిటని భక్తులు మండిపడుతున్నారు. మరి లెక్క సరిపోతే మరణించిన తాబేళ్లు ఎక్కడ్నుంచి వచ్చాయని.. ప్రశ్నిస్తున్నారు. అడ్డుకట్ట వేయాలి పురాతనమైన కూర్మక్షేత్రంలో స్వామి ప్రతిరూపంగా భావిస్తున్న తాబేళ్ల మృతికి అడ్డుకట్ట వేయాలని గార మండల ఎంపీపీ గొండు రఘురాం, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పీస గోపి, పార్టీ యువజన విభాగం అధ్యక్షడు మార్పు దుర్గా పృథ్వీరాజ్ -
●దోషులను కఠినంగా శిక్షించాలి
బైరిలో వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేసిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. అందరి గుండెల్లో ఆయన చిరంజీవిగా నిలిచి ఉంటారు. అలాంటి వారి మనోభావాలను దెబ్బతీసేందుకు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. – రెడ్డి శాంతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు -
●వైఎస్ స్థానాన్ని ఏమీ చేయలేరు
వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వైఎస్ విగ్రహాన్ని కూల్చివేయగలరేమో గానీ జనం గుండెల్లో వైఎస్సార్ స్థానాన్ని ఏమీ చేయలేరు. కూటమి నేతలకు దమ్ముంటే ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయాలి. అబద్ధపు హామీలిచ్చి అధికారం అందుకుని, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేస్తున్నారు. – దుంపల లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ కాళింగ కుల విభాగ రాష్ట్ర అధ్యక్షుడు -
మురుగు పారదు.. దుర్గంధం వదలదు
మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ పరిధిలోని హీరాపురం గ్రామంలోని కాలువలు మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. కాలువలు నిండి మురుగునీరు పారకపోవడంతో దుర్గంధం వెదజల్ల్లుతూ అక్కడి ప్రజలు అవస్థ లు పడుతున్నారు. దీని వల్ల వ్యాధుల బారిన ప డే అవకాశాలు ఉన్నాయని, మురుగునీటి సమ స్య ఉత్పన్నం కాకుండా పంచాయతీ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి టెక్కలి రూరల్: ఇంట్లో కరెంట్ లేదని, దాన్ని మరమ్మతు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు వదిలేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన పినిమింటి నారాయణరావు(40) అనే వ్యక్తి ఆదివారం తన ఇంట్లో కరెంట్ వచ్చి పోతుండటంతో స్విచ్ బోర్డుకి వచ్చే వైర్లు ఊడిపోవడం గుర్తించి దాన్ని మరమ్మతు చేసేందుకు పూనుకున్నారు. అయితే మరమ్మతు చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కిందకు పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి నారాయణరావు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకు న్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రో దించారు. మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తన, మహేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. ఆటో..బైక్ ఢీ: విద్యార్థికి గాయాలు మెళియాపుట్టి: ఆటో బైక్ ఢీకొన్న సంఘటనలో మండలంలోని పెద్దమడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పడాల విజయ్ అనే విద్యార్థి గాయాల పాలయ్యాడు. మండలంలోని కొత్తూరు గ్రా మానికి చెందిన విజయ్ ఆదివారం తన మామయ్య శ్రీనుతో కలిసి బైక్పై మెళియాపుట్టి నుంచి తన గ్రామానికి వెళ్తున్నాడు. మెళియాపుట్టి గ్రామ శివార్లలో వస్తున్న ఆటోని బైక్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న విజయ్ దూరంగా ఎగిరిపడ్డాడు. దీంతో అతడి కాలికి గా యమైంది. వాహనం నడుపుతున్న శ్రీనుకు సైతం గాయాలయ్యాయి. 108 వాహనంలో ఇద్దరినీ టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం తరలించినట్టు తెలిపారు. ఆశాజనకంగా చోడి పంట నరసన్నపేట: మండలంలో చోడి పంట ఆశాజనకంగా ఉంది. మెట్ట భూములతో పాటు సాగునీటి వసతులు ఉన్న పొలాల్లో రైతులు చోడిని వేశారు. రావులవలస, బొరిగివలస, బుచ్చిపేట, మడపాం, నడగాం, జమ్ము, తామరాపల్లితో పాటు గ్రామాల్లో రైతులు చోడిని వేశారు. మండలంలో 90 ఎకరాల్లో చోడి పంట ఉన్నట్లు వ్యవసాయ అదికారులు లెక్కలు తెలుపుతున్నాయి. గతంలో పోల్చితే చోడి పిండి వినియోగం ఆరోగ్య రీత్యా పెరగడంతో రైతులకు ఆదాయం వస్తుంది. కోడి పందాలు ఆడిన ఐదుగురిపై కేసు నమోదు సంతబొమ్మాళి: మండలంలోని మర్రిపాడు సమీపంలో కోడి పందేలు నిర్వహించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు నౌపడ ఎస్ఐ నారాయణస్వామి ఆదివారం తెలిపారు. కోడి పందేలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పకడ్బందీగా పోలీసులు వెళ్లి రూ.3210 నగదు, నాలుగు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
పవన్ అనాలోచిత నిర్ణయాలతో రైతులకు తీవ్ర నష్టం
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనాలోచిత నిర్ణయాలతో ఈ రోజు బియ్యం ఎగుమతులు లేక రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీజ్ ద షిప్ వ్యవహారంలో అక్రమాలను వెలికితీస్తామని చెప్పి ఎందుకు మౌనంగా ఉన్నారని దువ్వాడ ప్రశ్నించారు. గతంలో ఏపీ నుంచి విస్తారంగా సన్న రకాలు ఎగుమతులు జరిగాయని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. గతంలో వైఎస్సార్సీపీ పాలనలో రూ.2900 ధర పలికిన సన్న రకాల ధర ఈ రోజు రూ.1700కు పడిపోయిందని అన్నారు. అవి కూడా కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. సన్న రకాలను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనలతో ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల్లో విస్తారంగా సన్న రకాలు పండించారని, ఇప్పుడు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని దువ్వాడ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ పాలనలో విత్తు నుంచి విక్రయం వరకు. రైతుల సంక్షేమం కోసం అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి సుమారు 31 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, ఇదే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గతంలో గోల చేశారని ఇప్పుడు అదృశ్యమైన మహిళల్ని ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెండు బడ్జెట్లలో ఉత్తరాంధ్రకు వచ్చిన ప్రయోజనమేమిటని దువ్వాడ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏడాది కాలంలో సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారని ఇప్పుడు టీడీపీ నాయకులు పోర్టు కాంట్రాక్ట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు తప్ప పోర్టును పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బారువాను మరో గోవా చేస్తామంటూ ఇటీవల కేంద్ర మంత్రి చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని శ్రీనివాస్ అన్నారు. లింగాలవలస గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రగల్బాలు పలకడం ఆపేసి ఎన్నికల మునుపు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
యాంత్రీకరణతో రైతులకు ప్రయోజనం
కంచిలి: వ్యవసాయ యాంత్రీకరణ విధానంతో రైతులకు చక్కని ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో వ్యవసాయ యంత్ర పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం చేపట్టారు. ఇందులో నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు 236 వ్యవసాయ యంత్రాలను రూ.37.02 లక్షలు విలువ చేసినవి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్తో కలిసి పంపిణీ చేశారు. సబ్సిడీ ధరలకు వీటిని రైతులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు పి.జగన్మోహనరావు, మండల వ్యవసాయాధికారి బి.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
మెమో 57ను అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: జనవరి 1, 2004కు ముందు నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెమో 57ను తక్షణమే అమలు చేయాలని మెమో 57 ఉద్యోగ, ఉపాధ్యాయ సాధన సమితి జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో ఆదివారం మెమో 57 సాధన సమితి జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రాప్తికి అర్హత ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కోరారు. ఇందుకు కూటమి ప్రభుత్వం తమ యువగళం పాదయాత్రలో లోకేష్ మాట ఇచ్చారని వారు తమ మాట నిలబెట్టుకొని మెమో 57ను అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. జనవరి 1, 2004కు ముందు నోటిఫికేషన్ వచ్చి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల జాయినింగ్స్ లేట్ అయినప్పటికీ పీఎఫ్ ఆర్డీఏ చట్టం అమలుకు ముందే నోటిఫికేషన్ వచ్చినందున వీరందరూ పాత పెన్షన్కి అర్హులేనని అన్నారు. అందుకోసం అర్హత కలిగిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11,000 మందికి పాత పెన్షన్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. -
గడువు తీరిన మందులను చట్టబద్ధంగా కాల్చుతాం
శ్రీకాకుళం క్రైమ్ : గడువు తీరిన మందులను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి పొందిన బయోవేస్ట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా కాల్చుతామని జిల్లా డ్రగ్ ఏడీ చంద్రరావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇదివరకు ఏవైనా గడువు తీరిన (ఎకై ్స్పరీ) మందులు కొన్నింటికి కంపెనీలు రిటర్న్ పాలసీ కింద డబ్బులు చెల్లించేవని, మరికొన్నింటికి పాలసీ లేకపోవడంతో సంబంధిత ఫార్మా, జనరిక్, పీసీడీ డి స్ట్రిబ్యూటర్స్ బహిరంగ ప్రదేశాల్లో కుప్పలుగా పెట్టి కాల్చేయడమో.. లేదంటే పూడ్చేయడమో చేసేవారన్నారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి, మా నవ మనుగడకి ప్రమాదమని అన్నారు. తాజాగా జిల్లాలోని లావేరులో ఉన్న రెయిన్బో ఇండస్ట్రీస్తో ఒప్పందం అయ్యిందని, బయో వేస్ట్ వెహికల్లో అక్కడికి తీసుకెళ్లి కాల్చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారి మన జిల్లాలోనే ఈ ప్రక్రియ మొదలు పెట్టామని, త్వరలోనే డిస్ట్రిబ్యూటర్స్, మందుల దుకాణాల వారితో సమావేశంలో అంతా వివరిస్తామన్నారు. రెయిన్బో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
దేవుడి మీదే భారం
ఆయనకు కుటుంబం, శివుడు తప్ప మరెవరూ లేరు. నిత్యం శివారాధన తప్ప మరేమీ తెలీదు. ఏళ్ల తరబడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నా సెంటు భూమి కొనలేకపోయారు. చిల్లిగవ్వ కూడా వెనకేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆపత్కాలంలో ఆర్థిక స్థోమత చాలక ఆపసోపాలు పడుతున్నారు. భర్తకు సాయం చేయడం తప్ప మరేమీ తెలీని ఆ ఇల్లాలు ఇప్పుడు కూలి పనికి వెళ్లి పిల్లల కడుపు నింపుతున్నారు. మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పొందూరు: మండలంలోని మలకాం గ్రామానికి చెందిన విభూది నీలకంఠం శివాలయంలో అర్చకునిగా పనిచేసేవారు. అదే ఆయనకు జీవనోపాధి. సెంటు భూమి కూడా లేదు. ఆయనకు భార్య సరస్వతి, పిల్లలు ధనలక్ష్మి, హరినాథ రావు ఉన్నారు. భక్తులు ఇచ్చే దక్షిణలు, రేషన్ బియ్యంతో కుటుంబ పోషణ జరిగేది. ఏడాది కిందట నీలకంఠం మల కాం గ్రామానికి పక్కనే ఉన్న పైడాయవలసలోని శివాలయానికి పూజలు చేసేందుకు వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వాహనంతో ఢీకొట్టడంతో పంట పొలాల్లో పడిపోయారు. సుమారు గంట సమయం పాటు స్పృహలో లేరు. అటుగా వెళ్తున్న వారు ఆయనను గుర్తించారు. కాళ్లు, చేతులకు వైద్య సేవలందించి ఇంటికి అప్పగించారు. అయితే తలకు కనపడని గాయం ఏర్పడిన విషయం తెలియలేదు. నెలలు గడుస్తుంటే ఒకే మాటను పది సార్లు చెప్పడం, మనుషులను గుర్తించలేకపోవడం, పనిలో శ్రద్ధ తగ్గిపోవడం వంటివి కనిపించాయి. దీంతో పలు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించారు. మందులు వాడారు. చాలా నెలల తర్వాత మెదడులో రక్తం గడ్డం కట్టిందని గుర్తించారు. ఇటీవలే రాగోలు ఆస్పత్రిలో తలకు ఆపరేషన్ చేయించారు. సుమారు రూ.లక్ష 50 వేల వరకు అప్పుల పాలయ్యారు. ఈ అప్పు తీర్చేందుకు అర్చకుడి భార్య కూలి పనులకు వెళ్తున్నారు. అయినా ఆ కుటుంబానికి ఇప్పుడు పూట గడవడం లేదు. చాలా దయనీయమైన పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఇలాంటి దశలో ఇప్పుడు ఆయనకు మరో పెద్ద ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూట గడవడానికే ఇబ్బంది పడుతున్న దశలో మరోసారి ఆపరేషన్ ఎలా చేయించాలో తెలీక వారు సతమతమవుతున్నారు. పిల్లలకు ఒక పూట తిండి పెడితే మరో పూట పెట్టలేని పరిస్థితిలో భార్య ఉంది. భర్త పూర్తిగా పడుకుని ఉండడమే తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. శివాలయంలో పూజారిగా ఉండటంతో ప్రజలు అప్పుడప్పుడు కొంత సాయం చేస్తున్నారు. ఆపరేషన్ చేయించాలంటే దాతల సాయం ఒక్కటే మార్గమని వారు కోరుతున్నారు. ఎంత ఖర్చవుతుందన్న విషయాన్ని డాక్టర్లు ఇంకా స్పష్టం చేయలేదు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆలయ అర్చకుడు తలకు ఆపరేషన్ కోసం సరిపోని ఆర్థిక స్థోమత ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు -
నూర్పు చేస్తుండగా మంటలు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం పంచాయతీ శాలిపేట గ్రామంలో ఆదివారం వరి చేను నూర్పు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. మరో వైపు మంటల ధాటికి వరి చేను కూడా కాలిపోయింది. హరిశ్చంద్రాపురం గ్రామానికి చెందిన బల్లి అప్పలరాజు తన ట్రా క్టర్, నూర్పు యంత్రంతో శాలిపేట గ్రామానికి చెందిన మార్పు భూషణం అనే రైతుకు చెందిన సుమారు 2 ఎకరాల వరిచేనును నూర్పు చేస్తుండగా, అకస్మాత్తుగా ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనతో అంతా పరుగులు తీశారు. ఒక్క సారిగా మంటలు వ్యాపించి ట్రాక్టర్ ఇంజిన్ మొత్తం అగ్నికి ఆహుతి కాగా మరో వైపు వరి చేను కాలిపోయింది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోగా అంతా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఒక వైపు ట్రాక్టర్ యజ మాని అప్పలరాజు, మరో వైపు రైతు భూషణం తమకు జరిగిన భారీ నష్టంతో బోరున విలపించారు. -
ఒడిశాకు తరలుతున్న పశుగ్రాసం
పాతపట్నం: పాతపట్నం పరిసర ప్రాంతాల నుంచి వరి గడ్డివాములు ట్రాక్టర్లతో ఒడిశాకు తరలిస్తున్నారు. ఒడిశాలో వరి గడ్డి(పశుగ్రాసం)కి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దులు దాటుతోంది. పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాల నుంచి ప్రతి రోజు సాయంత్రం, రాత్రి పూటల్లో ఒడిశాకు వరిగడ్డి ట్రాక్టర్లు ద్వారా తీసుకు వెళ్తున్నారు. ఇటీవల వరి పంటలు యంత్రాలతో వరి చేను కోయడం వల్ల వరి గడ్డికి డిమాండ్ ఏర్పడింది. స్థానికంగా ట్రాక్టర్ వరి గడ్డి రూ.5 వేలు నుంచి రూ.7 వేలు వరకు ధర ఉంది. దీంతో దళారులు ఇక్కడి రైతులతో వీలైనంత మేర కొనుగోలు చేసి, ఒడిశాకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, వేసవిని దృష్టిలో ఉంచుకుని గడ్డి కొరత రాకుండా ప్రభుత్వమే రైతుల నుంచి గడ్డి సేకరించి, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పాడి రైతులు సూచిస్తున్నారు. -
దేవుడి మీద భారంశివాలయ అర్చకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాయం కోసం అర్థిస్తున్నాడు. –8లో
చాలా ఏళ్ల తర్వాత జిల్లాలో మళ్లీ బీచ్ ఫెస్టివల్ జరిగింది. బారువలో నిర్వహించిన ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రితో సహా వక్తలంతా కూర్మ రక్షణపై పెద్ద పెద్ద బాసలు చేశారు. నక్షత్ర తాబేళ్ల పిల్లలను సాగరంలోకి విడిచిపెట్టారు. బాగానే ఉంది. కానీ సాక్షాత్తు శ్రీమహా విష్ణువు కూర్మావతారంలో వెలసి పూజలందుకుంటున్న ప్రపంచంలోనే అరుదైన పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో విష్ణు స్వరూపమైన తాబేళ్ల హననం నిత్యకృత్యంగా మారింది. కూర్మాల మృత్యుఘోష స్థానికులను, భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. వాటి రక్షణకు పాలకులు చర్యలు చేపట్టకపోగా.. మృత్యువాత పడుతున్న తాబేళ్లను ఆలయం వెనుక భాగంలోనే దహనం చేస్తూ ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. ఇది చూసి మాటల్లో కాకుండా చేతల్లో నిజాయితీ చూపని నేతల తీరును ప్రజలు గర్హిస్తున్నారు. – గార బారువలో తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెడుతున్న దృశ్యంప్రజల్లో ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం, ముఖ్యంగా అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు సోంపేట మండలం బారువ తీరంలో బీచ్ ఫెస్టివల్ పేరుతో అధికారులు ఏర్పాటు చేశారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను సాగరంలోకి విడిచిపెట్టారు. తాబేళ్ల సంరక్షణ కోసం అటవీశాఖ తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తూ.. ప్రత్యేక ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా తాబేళ్ల జీవిత చక్రం, వాటికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని రక్షించడానికి మనం చేయగలిగే పనులు వంటి విషయాలను ప్రజలు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చాలా హడావిడిగా కార్యక్రమాలు చేశారు. ూర్మనాథాలయం ఈఓ కార్యాలయం వెనుక భాగంలో మంటల్లో సగం కాలిపోయి ఉన్న తాబేళ్లు కూర్మనాథాలయం ఈఓ కార్యాలయం వెనుక భాగంలో మంటల్లో సగం కాలిపోయి ఉన్న తాబేళ్లు ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయంలో తాబేళ్లు మరణిస్తున్నాయి. దేవుడి ప్రతిరూపంగా ఇక్కడ తాబేళ్లను కొలుస్తారు. అలాంటిది ఇవి పదు ల సంఖ్యలో చనిపోతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. పైగా చనిపోయిన తాబేళ్లను ఆలయ ఈఓ కార్యాలయం వెనుక భాగంలోనే దహనం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ తాబేళ్లు అనారోగ్య పరిస్థితుల్లో చనిపోతే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. గతంలో ప్రతి తాబే లుకి నంబర్ కూడా కేటాయించేవారు. పార్కులో ఎన్ని ఉన్నాయి, వాటి ఆరోగ్య పరిస్థితులు రికార్డు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే తాబేళ్లు చనిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన నక్షత్ర తాబేళ్లు... ఈ ఆలయంలో ఉండేవి నక్షత్ర తాబేళ్లు. తరతరాలుగా వీటిని ఇక్కడే భక్తుల పూజించడం వల్ల ఆలయంలో పెంపకం జరుగుతోంది. ఆలయం దక్షిణ ద్వారం వద్ద తాబేళ్ల సంరక్షణ కోసం ప్రత్యేకంగా తాబేళ్ల పార్కును నిర్మించారు. వీటి కోసం ప్రతి నెలా రూ. 24 వేలు ఆహారంతో పాటు మెడికల్ ఖర్చుల కోసం జిల్లాకు చెందిన గ్రీన్మెర్సీ సంస్థకు దేవదాయ శాఖ అప్పగించింది. అయితే తాబేళ్ల సంరక్షణ సరిగ్గా లేకపోవడం, వాటి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరగాల్సి ఉన్నా అవేమీ లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నాయని భక్తులు చెబుతున్నారు. అదే సమ యంలో కొన్ని నెలల క్రితం నుంచి భక్తుల వద్ద నుంచి తాబేళ్ల ఆహారం కోసం విరాళాలు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయంపై ఉన్న దృష్టి వాటి సంరక్షణపై లేదని భక్తులు మండిపడుతున్నారు. ఏదీ సంరక్షణ.. తాబేళ్ల పార్కులో గతంలో తాబేళ్ల పిల్లలు వచ్చే సమయంలో ప్రత్యేకంగా టబ్బులో వీటిని ఉంచి రక్షణ చర్యలు చేపట్టేవారు. ఎన్ని జన్మించాయి, వాటి వివరాలు, చనిపోయిన వివరాలు రికార్డులో నమోదు జరగాల్సి ఉన్నా అవేమీ జరగడం లేదని పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఈ విషయమై ఆలయ సిబ్బంది నర్సుబాబు వద్ద ప్రస్తావించగా ఏడు తాబేళ్లు చనిపోయి ఉన్నాయని, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. పోస్ట్మార్టం చేయకుండానే.. నక్షత్ర తాబేళ్లు మరణిస్తే వాటికి అటవీశాఖ ఆధ్వర్యంలోని వెటనేరియన్ అధికారి సమక్షంలో పోస్టుమార్టం చేయడం తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆలయంలో అలా జరగడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పాతేయడం.. దహనం చేయడం లాంటివి చేయడం చట్టరీత్యా నేరం. కానీ ఇక్కడ ఆలయ ప్రహరీ సమీపంలో దహనం చేసేస్తున్నారు. వీటి మరణాలపై అంత్య గోప్యత ఎందుకని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘లెక్క’లేని తనం.. ఐదేళ్ల క్రితం నక్షత్ర తాబేళ్ల సంతతి 280 వరకు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. వాటి సంతతి వృద్ధి చెంది తాబేళ్ల సంఖ్య మరింత పెరగాలి. కానీ అలా జరుగుతున్న దాఖలాలు ఇక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్ని తాబేళ్లు ఉన్నాయో అనే లెక్క కూడా ఆలయ అధికారుల వద్ద లేకపోవడం శోచనీయం. అలాగే తాబేళ్ల పార్కు దగ్గర వాటి సంరక్షణ కోసం విరాళాల సేకరణ కోసం చూపే శ్రద్ధ వాటి పరిరక్షణ మీద లేకపోవడం అత్యంత దారుణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది రెండు లక్షల తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సముద్రంలోకి విడిచి పెట్టకుండా సేఫ్ డిస్పోజ ల్ చేయాలి. జిల్లాలో 16 కేంద్రాలు ద్వారా తాబేళ్ల పిల్లలను సంరక్షించి సముద్రంలోకి విడిచి పెట్టడం జరుగుతుంది. ఈ అంతరించిపోతున్న జీవజాతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది. తాబేళ్లను రక్షించడానికి స్థానిక మత్స్యకారులు సహాయ సహకారాలు అవసరం. – బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రతి నెలా నివేదికలిస్తున్నాం శ్రీకూర్మనాథుడి ఆలయంలోని తాబేళ్ల పార్కు లో ఉన్న తాబేళ్లు, వాటి ఆరోగ్య పరిస్థితులపై ప్రతి నెలా జిల్లా కలెక్టర్, జిల్లా అట వీ శాఖాధికారికి నివేదికలు పంపిస్తున్నాం. పార్కులో ఉన్నంత వరకు లెక్క కచ్చి తంగానే ఉంది. ఆరోగ్య పరీక్షలు, ఆహారం ఏర్పా ట్లు నిపుణుల సూచన మేరకు నిర్వహిస్తున్నాం. –రమణమూర్తి, గ్రీన్మెర్సీ సంస్థ, శ్రీకాకుళం ప్రకృతి పరిరక్షణ.. తాబేళ్ల సంరక్షణ బీచ్ ఫెస్టివల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్మనాథా రక్షమాం.. శ్రీకూర్మనాథాలయంలో తాబేళ్ల మృత్యువాత ఈఓ కార్యాలయం వెనుకనే తాబేళ్లను దహనం చేస్తున్న వైనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు -
విద్యుత్ షాక్కు గురై.. విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందారు. ఇంటి పని చేస్తుండగా షాక్ కొట్టింది. –8లో
హైకోర్టు ఆదేశాలున్నా.. నక్షత్ర తాబేళ్లు అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో ఉన్నాయి. భారతీయ వన్య ప్రాణ సంరక్షణ చట్టంలో ఈ నక్షత్ర తాబేళ్లు షెడ్యూల్ 4వ జాబితాలో ఉన్నాయి. వీటిని బంధించినా, తరలించినా కఠిన శిక్షలు అమలవుతాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉండటం, అతి పురాతనమైన ఆలయం కావడం వలన కూర్మనాథాలయంలో తాబేళ్లను ఉంచవచ్చని, వాటిని సంరక్షణను చూడాల్సిన బాధ్యతను దేవదాయ శాఖ చేపట్టాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. సుమారు 15 ఏళ్ల క్రితం తాబేళ్ల సంరక్షణపై మీడియాలో కథనాలు రావడంతో వీటిపై హిందూ ధార్మిక సంఘాలు, వన సంరక్షణ ప్రేమికులు కోర్టులో కేసులు దాఖలు చేశారు. నిపుణుల ఆధ్వర్యంలో పార్కును ఏర్పాటు చేయాలని, వీటిని దేవదాయ ధర్మాదాయ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు తరచూ పరిశీలన చేయాలని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. అదే సమయంలో కృష్ణం వందే జగద్గురుమ్ అనే సంస్థ ఇప్పుడున్న తాబేళ్ల పార్కును నిర్మించింది. పార్కులో నీటి తొట్టెలు, వివిధ రకాలైన మొక్కలతో పాటు ఇసుక తిన్నెలు ఏర్పాటు చేసింది. -
458 పోస్టులకు పోటీ
శ్రీకాకుళం: సుమారు 16,500 పోస్టులతో డీఎస్సీ షెడ్యూల్ను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. జిల్లాకు సంబంధించి 458 పోస్టుల కోసం నో టిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 347 స్కూల్ అ సిస్టెంట్లు, 111 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అవలంబించిన అస్తవ్యస్త విధానాలతో ఇప్పటికే జిల్లాలో పలువురు ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉద్యోగులుగా ఉన్నారు. వీరిని సర్దుబాటు చేయటమే విద్యా శాఖ అధికారులకు తలనొ ప్పిగా ఉండగా డీఎస్సీ పోస్టుల భర్తీ తర్వాత కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారు కూడా మిగులు ఉపాధ్యాయులుగా ఉండే దుస్థితి ఏర్పడుతోంది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు జూన్ 6 నుంచి జూలై 6 వరకు 30 రోజుల పాటు సుదీర్ఘ ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నా యి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసాంతం వరకు 1989, 1992, 1994 డీఎస్సీల్లో భర్తీ అయిన పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. ఆయా ఖాళీల్లో ఇప్పటికే మిగులుగా ఉన్న ఉపాధ్యాయు లను సర్దుబాటు చేసి డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయలను మిగులు ఉపాధ్యాయులుగా చూపించే పరిస్థితి ఉంటుంది. ఒక్కో బడిలో ఒక్కో నిష్పత్తి ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 117 జీఓను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ దాని కంటే అన్ని వర్గాలకు నష్టం కలిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను తీసి వేయాలని ఉపాధ్యాయులు కోరుతుండగా అందుకు వ్యతిరేకంగా 1, 2 తరగతులను కూడా కొన్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి దానికి ‘బేసిక్ ప్రైమరీ స్కూల్’ అని నామకరణం చేశారు. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు 130 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్ఫత్తి 1:9 ఉండగా మోడల్ ప్రైమరీ స్కూల్స్లో 1:11 ఉంది. బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో 1:20 నిష్పత్తిని, పౌండేషన్ స్కూల్స్లో 1:30గా ఉంచాలని నిర్ణయించింది. ఇది పూర్తిగా అశాసీ్త్రయం అని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పోస్టుల వివరాలు జిల్లాలో 458 పోస్టులను ప్రకటించగా వీటిలో 347 స్కూల్ అసిస్టెంట్లు, 111 ఎస్జీటీ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో 335, మున్సిపాలిటీ ల్లో 12 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సబ్జెక్ట్ల వారీగా పరిశీలిస్తే ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు–34, హిందీ–11, ఇంగ్లిష్–64, గణితం–33, ఫిజికల్ సైన్స్–14, బయోలాజికల్ సైన్స్–32, సాంఘిక శాస్త్రం–66, పీడీ–81 పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు–3, హిందీ–1, ఇంగ్లిష్–1, బయోలాజికల్ సైన్స్–1, సాంఘిక శాస్త్రం–5, పీడి–1 పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు విషయానికి వస్తే జిల్లా పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల్లో–72, మున్సిపాలిటీల్లో –39 పోస్టులు ఉన్నాయి. వీటికి గట్టి పోటీ ఏర్పడనుంది. జిల్లా వ్యాప్తంగా 25 వేల వరకు నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా 458 పోస్టులకు పోటీ పడాల్సి ఉంది. జిల్లాలో 458 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వీటిలో 111 ఎస్జీటీ పోస్టులు 347 స్కూల్ అసిస్టెంట్ల్ పోస్టుల భర్తీ మిగులు పోస్టులుగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు డీఎస్సీ భర్తీ పోస్టులు కూడా మిగులుగా ఉండే దుస్థితి రెండు మూడు రోజుల్లో ఓ రూపు జిల్లాల్లో ఖాళీ పోస్టులు, మిగులు పోస్టుల వివరాలు రెండు, మూడు రోజుల్లో తేలనుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల మేరకు కసరత్తు చేస్తున్నాం. కొన్ని మండలాల్లో మిగులు ఉపాధ్యాయులు ఉండటం వాస్తవమే. – తిరుమల చైతన్య, డీఈఓ, శ్రీకాకుళం -
సత్యనారాయణ నేత్రదానం
శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని ఇప్పిలి వీధిలో నివాసం ఉంటున్న నారంశెట్టి సత్యనారాయణ (86) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన కుమారులు ఎన్వీ మొహెర్ సుధాకర్, ఎన్వీ సురేష్, ఎన్వీ రవికిషోర్, జగదీశ్వరరావులు బరాటం వరప్రసాద్ ద్వారా తండ్రి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇంచార్జి సుజాత, నంది ఉమాశంకర్లు సత్యనారాయణ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సభ్యులు దుర్గాశ్రీనివాస్లను అభినందించారు. ఆదిత్యునికి విశేష పూజలు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వా మికి ఆదివారం విశేష పూజలు, అర్చనలు జరిగాయి. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వాతావరణంలో మార్పులు, తీవ్ర ఎండలు, ఉక్కబోతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆలయం తరఫున ఈవో వై.భద్రాజీ భక్తుల కో సం టెంట్లు, పాదాలకు రక్షణగా ఎర్రతివాచీలు వేయించడంతో కొంతమేరకు ఉపశమనం కలిగింది. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు తొలిసారిగా కుటుంబ సభ్యులతో కలిసి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నదాన పథకంలో భాగంగా భక్తులు అన్నదానం స్వీకరించారు. అయితే రుచి, శుభ్రత విషయంలో భక్తులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజులో వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.2,66, 700, విరాళాలు, ప్రత్యేక ఆర్జిత సేవల ద్వారా రూ.70,548, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.40 లక్షలు వరకు ఆదాయం లభించినట్లుగా ఈవో భద్రాజీ తెలిపారు. ఎరక్కపోయి ఇరుక్కుని.. కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేటీ రోడ్డులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు పక్కపక్కన వెళ్తున్న సమయంలో ఓ ఆటో వాటి మధ్య నుంచి వెళ్లి ఇరుక్కుపోయింది. డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాశీబుగ్గలో ఆటోలు బస్టాండ్లో ప్రవేశించి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు తెలిపారు. -
టెక్కలిలో జాబ్మేళా
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ, వేకెంట్ హైర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించినట్లు ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ తెలిపారు. 72 మంది అభ్యర్థులు హాజరు కాగా 34 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పా రు. నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.సతీష్కుమార్, జేకేసీ కో–ఆర్డినేటర్ బి.ఝాన్సీరాణి, హెచ్ఆర్ మేనేజర్ సీహెచ్.శ్రీధర్, శాంతనకుమార్, అధ్యాపకులు కసవయ్య, పాపారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి స్కూల్ గేమ్స్కు లావేరు విద్యార్థులు ఎచ్చెర్ల: 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ బేస్బాల్ చాంపియన్షిప్ పోటీలకు లావేరు ఉన్నత పాఠశాల క్రీడాకారులు పి.నాగలక్ష్మీ, సీలా సాయికుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి 27 వరకూ ఢిల్లీలో జరగనున్న 68వ జాతీయ స్థాయి స్కూల్గేమ్స్ బేస్బాల్ పోటీల్లో వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు పసుపుల జగన్నాథరావు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రయాణానికి ఆర్థిక సహాయం అందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదే విధంగా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిల్లాస్పూర్లో జరిగిన 68వ జాతీయ జూనియర్ స్కూల్గేమ్స్ బేస్బాల్ చాంపియన్షిప్లో పాల్గొని వచ్చిన 8వ తరగతి విద్యార్థిని అల్లాడ జీవితను అభినందించారు. బీజేపీ నాయకుల ధర్నా శ్రీకాకుళం అర్బన్: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను తక్షణమే అరెస్టు చేయాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు బూరె నరేంద్ర చక్రవర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అరసవల్లి కూడలిలోని ఇందిరా విజ్ఞాన్ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపద నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపదను దోచుకున్న నిందితులను అరెస్టు చేయాలని కోరారు. నిందితులపై ఈడీ కేసులు నమోదు చేస్తే ఇది బిజెపీ కుట్రపూరిత చర్య అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, పైడి వేణుగోపాలం, బిర్లంగి ఉమామహేశ్వరరావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జల రాజు వెంకట్, సింగుపురపు వెంటరమణ, నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు ధనుష్ రంగ, తరుణ్, ఉపాధ్యక్షులు మదన మోహన్, కార్యవర్గ సభ్యుడు రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి అరసవల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిబ్బంది శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సంఘ జిల్లా అధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో ఆరోగ్యమందిర్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న 573 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. నియామకాలు జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఇన్సెంటివ్తో పాటు ఏటా 5 శాతం ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
క్రికెట్ మైదానంలో గంజాయి ఒప్పందాలు
● ఇద్దరు ఒడిశా యువకులను అరెస్టు చేసిన కాశీబుగ్గ పోలీసులు ● 10 కేజీల గంజాయి స్వాధీనంకాశీబుగ్గ: క్రికెట్ గ్రౌండ్లో ఆ యువకులకు పరిచయం ఏర్పడింది. ఓవైపు ఆడుతూనే.. మరోవైపు అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా తండిగుడ, తాళ్లబంద గ్రామాలకు చెందిన తపాన్ బెబారత, మాననిత్ సింగ్ ఇరుగుపొరుగు గ్రామాల యువకులు. తరచూ క్రికెట్ గ్రౌండ్లో కలుసుకునేవారు. పది కేజీల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తే రూ.10 వేలు వస్తుందని ఒప్పందం కుదరడంతో ఇద్దరూ పలాసలోని రైలు నిలయానికి వచ్చారు. బైక్పై అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 10.39 కేజీల గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
తిలారు పాఠశాలలో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం తిలారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోరీ జరిగినట్లు ప్రధానోపాధ్యాయుడు టి.లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17వ తేదీ రాత్రి పాఠశాలలో దుండగులు చొరబడి 6వ తరగతి గది తాళాలు బద్దలుకొట్టి డెస్క్టాప్, కీబోర్డు, ప్రొజెక్టర్ వంటి సుమారు రూ.2లక్షలు విలువైన సామగ్రీ పట్టుకుపోయారని పేర్కొన్నారు. శుక్రవారం పాఠశాల సెలవు రోజుకావడంతో శనివారం వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించామని తెలిపారు. కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం మందస: మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా చుక్కాంబో, సవర రాజపురం బుడంబో గ్రామాల్లో శనివారం తనిఖీ చేయగా సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల సారా ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.బేబి తెలిపారు. -
పాలకుల తీరుతో సర్కారు బడులకు ముప్పు
గార: ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించేలా ప్రభుత్వ ఆలోచనలున్నాయని, బాలికా విద్యకు ప్రోత్సహమంటూనే ప్రాథమికోన్నత పాఠశాలలు మూసివేసేందుకు అడుగులు పడుతున్నాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి అన్నారు. శనివారం బలరాంపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని చక్కదిద్దుతున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూ, ప్రతీ శుక్రవారం మీ అభ్యంతరాలను వినేందుకు మా అధికారులు మీ కోసం ఎదురుచూస్తున్నారని పైకి తీయని మాటలు చెబుతూనే లోలోపల పాఠశాలలను కుదించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 1256 యూపీ స్కూళ్లను ప్రైమరీగా డీగ్రేడ్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారని, ఆయా పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వీరంతా సమీప పాఠశాలలో చేరుతారని ఎలా చెప్పగలుగుతున్నారని, వాంతా ప్రైవేట్ బాటపట్టడానికి ప్రభుత్వమే అవకాశం కల్పించినట్లు ఉందని చెప్పారు. బాలికల డ్రాపౌట్లు తగ్గించేందుకు యూపీలు ప్రవేశపెట్టారని, మరి ఇప్పుడు బాలికల విద్యకు ప్రాధాన్యం లేదా అని ప్రశ్నించారు. పాఠశాలలను తగ్గించడం, పోస్టులను మిగిల్చడం తప్ప నిజంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని స్పష్టం చేశారు. హైస్కూల్తో సంబంధం లేకుండా వేరుగా మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఉండేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో హెచ్ఎం కె.అశోక్కుమార్, రామకృష్ణ, నీలవేణి, విశ్వనాథం, యామిని, ప్రియదర్శిని, అలుగోలు సత్యనారాయణ పాల్గొన్నారు. -
పంట పొలాల్లో.. దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు
సంతబొమ్మాళి: రొయ్యిల వ్యాపారి తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, దౌర్జన్యంగా పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వేశారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం సెగిడి లక్కివలసకు చెందిన శంకరమహేష్ అనే వ్యాపారి టెక్కలి మండలం నాయుడుపేటలో ఇటీవల రొయ్యిల చెరువులను కొనుగోలు చేశారు. వాటికి విద్యుత్ కనెక్షన్ కోసం వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్తంభాలను కొంతవరకు దౌర్జన్యంగా వేశారు. ఈ విషయం తెలియడంతో నౌపడ, సీతానగరం గ్రామాలకు చెందిన పలువురు రైతులు సదరు వ్యాపారిని ప్రశ్నించారు. తమకు చెప్పకుండా వ్యవసాయ పొలాల్లో ఎలా విద్యుత్ స్తంభాలు వేశారని రైతులు విశ్వగురు శర్మ, వాడరేవు గణపతి, కూర్మనాయకులు, బి.అప్పారావు, చిన్నబాబు తదితరులు నిలదీశారు. దీనిపై సదరు వ్యాపారి స్పందిస్తూ పొలాల్లో వేసిన స్తంభాలు తీసివేసి ప్రభుత్వ భూమి మీదుగా స్తంభాలు వేయిస్తానని నమ్మబలికాడు. ఆ వ్యాపారి మాటలు నమ్మి రైతులు వెనుతిరిగారు. ఇప్పుడు రైతుల స్తంభాలు తీయకపోగా రాత్రి వేళ విద్యుత్ శాఖ సిబ్బందితో పని చేయించి హైటెన్షన్ విద్యుత్ వైర్లతో కనెక్షన్ను రొయ్యిల చెరువుకు ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇదేంటని సదరు వ్యాపారిని ప్రశ్నించగా ‘మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నాకు ఏమీ కాదు’ అంటూ సదరు వ్యాపారి బెదిరిస్తూ మాట్లాడారు. మా పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు వేసి హై టెన్షన్ వైర్లకు ఉప్పు గాలులతో ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు నిలదీశారు. ఈ సమయంలో సదరు వ్యాపారి దురుసుగా ప్రవర్తించాడని రైతులు ఆరోపించారు. దీంతో శనివారం జిల్లా కలెక్టర్కు, విద్యాత్ శాఖ ఉన్నతాధికారులకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా రైతులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగకపోతే కోర్టులో పోరాడతామని రైతులకు సమాచారం ఇవ్వని రొయ్యిల వ్యాపారి కలెక్టర్, విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు -
ఉపాధి వేతనాలు తక్షణమే చెల్లించాలి
పాతపట్నం: ఉపాధి హామీ పథకం వేతనదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర తూర్పుకాపు కుల విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పాతపట్నంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరి నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయల్లో వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. పని ప్రదేశంలో కూలీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. మండుటెండలో కూలీలు శ్రమిస్తున్నా కనీసం నీటిని కూడా సరఫరా చేయకపోవడం దారుణమన్నారు. టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలన్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో సరైన సమ యంలో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో గణపతి ప్రధాన్, పాడి అప్పారావు, పడాల రంజీత్, ఎన్ని తిరుపతి, శ్రీనివాసరావు, డిల్లేశ్వరరావు, నాగరాజు, మద్ది నారాయణరెడ్డి, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
‘ఉష’స్సులుదివ్యాంగుల జీవితాల్లో ఆమె ఉషస్సులు నింపుతున్నారు. కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. –4లోఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఆలయ భూమిలోకి వచ్చేసిన ప్రహరీ పిల్లర్లు (రెడ్ మార్కు) అరసవల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా ఆలయ భూముల్లో అక్రమార్కులు చొరబడుతున్నారు. ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వా మి ఆలయ భూములను కొందరు ఆక్రమణ దారులు వ్యాపారాలకు అనువుగా వాడుకుంటుంటే.. మరికొందరు తమ ఇంటి వాస్తులకు వీలుగా ఆలయ భూములను కలిపేసుకుని ప్రహరీలు నిర్మించుకుపోతున్నారు. ఇటీవల వాడాడ కూడలి వద్ద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రహదారి వేసేయగా.. తాజాగా గ్రామదేవత అసిరితల్లి అమ్మ వారి ఆలయం ఎదురుగా ఉన్న ఆదిత్యుని భూమిని ఆక్రమించి భవన నిర్మాణానికి వీలుగా కాంక్రీట్ పిల్లర్లు వేసేశారు. ఇంత దర్జాగా ఆలయ భూములను ఆక్రమిస్తున్నప్పటికీ ఆలయ అధికారులు అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పెద్దల జోక్యమనే చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే. మొన్న రోడ్డు.. నిన్న పిల్లర్లు ఆదిత్యునికి చెందిన ఆలయ భూముల్లో కొంత భాగాలను తమ భూములకు కలిపేసుకుంటూ ఆ క్రమించేందుకు కొందరు బరి తెగించారు. వాడాడ జంక్షన్ వద్ద సర్వే నంబర్ 130లో సుమారు మూడున్నర సెంట్ల భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రహదారిని నిర్మించేశాడు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో అధికారులు ఉలిక్కిపడి పోలీసు కేసు కూడా నమోదు చేయించారు. అయినప్పటికీ ఆ రహదారి తీరు మారలేదు. పెద్దల జోక్యంతో ఇంకా ఆ అక్రమ రహదారి అలానే ఉంది. ఇదిలావుంటే తాజాగా ఆదిత్యుని ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న సర్వే నంబర్ 87లో ఉన్న స్థలంలో ఏకంగా భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ ఉన్నతాధికారికి చెందిన భూమిలో కాంట్రాక్టర్ ప్రమేయంతో ఈ ఆక్రమణ జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి ఆ జి రాయితీ భూమికి తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో ఆలయ భూముల సరిహద్దులున్నాయి. అయితే భారీ భవన నిర్మాణానికి సిద్ధపడిన ఆ భవన యజమాని వాస్తుకు అనుగుణంగా నిర్మాణాలుండాలని భావించగా సంబఽంధిత కాంట్రాక్టర్ ఏకంగా ఆదిత్యుని ఆలయానికి చెందిన భూమిలో ఏకంగా తొమ్మిది పిల్లర్లను వేసేసి ప్రహరీ నిర్మాణం చేపట్టేశాడు. సరిహద్దు భూమి యజమానులెవ్వరికీ కనీస సమాచారం ఇవ్వకుండానే భూమిలో నిర్మాణ పనులను మొదలుపెట్టడం వివాదాస్పదంగా మా రింది. అయితే స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఆలయ అధికార సిబ్బంది టౌన్ సర్వేయర్తో సహా వెళ్లి ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు. కచ్చితంగా ఆలయ భూమిని కలిపేసుకున్నారని నిర్ధారణ చేశా రు. దీనిపై ప్రశ్నిస్తే వాస్తుకు అనుగుణంగా నిర్మా ణానికి వీలుగా కలుపుకున్న ఆలయ భూమి విస్తీ ర్ణాన్ని తగ్గట్టుగా తూర్పు భాగంగా బదులు ప్రత్యామ్నాయంగా ఆలయానికి భూమిని ఇచ్చేస్తామని భవన నిర్మాణదారులు చెబుతున్నారు. ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి చేతివాటంతోనే ఆలయ భూ ముల ఆక్రమణలు సాధ్యమవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యూస్రీల్ ఆదిత్యుని భూములను వరుసగా ఆక్రమిస్తున్న వైనం మొన్న ఒకరు రోడ్డేశారు.. నిన్న మరొకరు పిల్లర్లు వేసేశారు తెరవెనుక పెద్దల జోక్యంతో ఏమీ చేయలేకపోతున్న అధికారులు ఆక్రమణను గుర్తించాం అసిరితల్లి అమ్మవారి ఆలయం ఎదురుగా ఆదిత్యుని ఆలయానికి చెందిన భూమి ఆక్రమణకు గురైందని తెలిసి పరిశీలించాం. కచ్చితంగా ఆలయ భూమిలో సుమారు రెండు సెంట్ల వరకు భూమి ప్రహరీ నిర్మాణంలో కలిపేసినట్లుగా సర్వేయర్ల బృందం తేల్చింది. ఈ ఆక్రమణ పిల్లర్లను వెంటనే తొలగించాలని ఆదేశించాం. లేదంటే తగు చర్యలు చేపడతాం. ఇక ల్యాండ్ టు ల్యాండ్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రక్రియ. అలా ఆలయ భూమి కలిపేసుకుని మరోచోట భూమి ఇస్తామంటే వెంటనే జరిగే పని కాదు. – వై.భద్రాజీ, ఆలయ ఈఓ -
వివాహిత దారుణహత్య
పైడిభీమవరంలోని బోనం పేరంటాలు గుడి సమీప ప్రాంతం. సాయంత్రం 6 గంటల సమయం. అంతా రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అంతలో ఒకామెనడుచుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు గమనించి వెళ్లి చూసేలోపే తెగిన ఆమె గొంతు నుంచి రక్తం ధార కట్టి ఆ ప్రాంతమంతా ఎర్రగామారిపోయింది. పైడి భీమవరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాతికేళ్ల వివాహితను అత్యంత కర్కశంగా గొంతుకోసి చంపేశారు.రణస్థలం: మండలంలోని పైడి భీమవరం నడిబొడ్డున శనివారం సాయంత్రం జరిగిన వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. స్థానికులు, జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకా రం.. శనివారం సాయంత్రం బోనం పేరంటాలు గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి అవాల భవాని(23) అనే వివాహితను దారుణంగా చాకుతో గొంతు కోసి వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగేసి అక్కడే పడేశాడు. కొన ఉపిరితో ఉన్న భవాని అక్కడకు కొద్ది దూరంలో వైఎస్సార్ విగ్రహం వెనుక బస్టాప్ దగ్గరలో చెరువు గట్టు వరకు వచ్చి అక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమె భర్త వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనికి వెళుతుంటాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని బరంపురం దగ్గరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.భవానీ స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరం పంచాయతీలోని గొల్లపేట గ్రామానికి చెందిన వెంకట సత్యంతో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కు మార్తె కూడా ఉంది. వెంకట సత్యం లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా.. భవాని పైడిభీమవరంలోని ఒక హోటల్ పని చేస్తోంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హొటల్ నుంచి వెళ్లిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఆ తర్వాత ఆమె సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బస్టాప్ వద్ద విగతజీవిగా కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో జేఆర్ పురం సీఐ అవతారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 3.30 గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హోటల్లో పని చేసిన ఓ వ్యక్తిపైనే ప్రధానంగా అనుమానాలు ఉన్నాయి. అతడి ప్రమేయంపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. దీనిపై జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవిని వివరణ కోరగా హత్య జరిగిందని నిర్ధారించారు. -
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
● కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ● తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్ ● తొలిరోజు ఉత్సాహంగా బీచ్ ఫెస్టివల్సోంపేట: బారువ సముద్ర తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బారువ సముద్ర తీరంలో రెండు రోజుల పా టు నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్లో భాగంగా శనివా రం ఉదయం ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచే పెట్టే ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే బి.అశోక్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల జీవిత చక్రం గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. బీచ్ వాలీబాల్ పోటీలు, పడవ పోటీలు ప్రా రంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తీరంలోని పరిసరాలు పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో భాగంగా సోంపేట నటరాజ నాట్యకళామండలి చిన్నారుల సాంస్కృతిక కార్యక్ర మాలు అలరించాయి. బారువ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా యని కేంద్ర మంత్రి తెలిపారు. స్కూబా డైవింగ్, పారామోటార్ ఫ్లయింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు బారువ కేంద్రంగా మారుతుందన్నారు. వచ్చే నెల 3, 4న వివిధ పోటీలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది రెండు లక్షల తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థా లు సముద్రంలోకి విడిచి పెట్టకుండా సేఫ్ డిస్పోజల్ చేయాలన్నారు. ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ మాట్లాడుతూ బారువ తీరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీచ్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రదీప్, స్కూబా ఇన్స్ట్రక్టర్ బలరాం, కెప్టెన్ సూర్య తదితరులు మాట్లాడుతూ అభివృద్ధి జరిగితే స్థానిక యువతకు ఉపాధి లభి స్తుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అటవీశాఖాధికారి వెంకటేశ్వ రరావు, ఎస్పీ మహేశ్వర్రెడ్డి, డీఎస్పీ వెంకటఅప్పారావు, ఆర్డీఓ వెంకటేష్, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ సుప్రజ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచ్కు దక్కని గౌరవం సభా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యర్ర రజినీని పిలవకపోవడంపై గ్రామస్తులు చర్చించుకున్నారు. పంచాయతీ పరిధిలో జరిగే సమావేశానికి సర్పంచ్ కీలకం. సర్పంచ్ సభాస్థలి వద్ద ఉన్నా ఇటు అధికారులు గానీ, అటు ప్రజా ప్రతినిధులు గానీ సభావేదికపైకి సర్పంచ్ను పిలవలేదు. -
21 నుంచి స్లాట్తోనే రిజిస్ట్రేషన్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు ఈ నెల 21వ తేదీ నుంచి స్లాట్ను బుక్ చేసుకుని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే రిజిస్ట్రేషన్లు జరగవని జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శనివా రం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ల ద్వారా జరగనున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వుల మేరకు రాబోయే సోమవారం ఏప్రిల్ 21 నుంచి జిల్లాలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే విధానంలో రిజిస్ట్రేషన్లు ఉంటాయని తెలిపారు. ఈ స్లాట్లు ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బుక్ చేసుకునే వీ లుంటుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలున్నా తమ పరిధిలో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నా రు. అదేవిధంగా ఎనీవేర్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఒక రోజు ముందుగా ఈ స్లాట్ బుకింగ్ విధానంలో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని తెలిపారు. విద్యారంగాన్ని టీచర్లే కాపాడాలి టెక్కలి రూరల్: పాలకుల విధానాల ఫలితంగా ప్రభుత్వ బడులకు ముప్పు ఏర్పడరాదని, ప్రస్తుత ప్రభుత్వ విద్యారంగాన్ని ఉపాధ్యాయులే కాపాడుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లండ బాబురావు అన్నారు. ఆయన కోటబొమ్మాళిలో శనివారం జరిగిన యూటీఎఫ్ ప్రాంతీయ సమావేశంలో పాల్గొని బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ విద్యారంగం ఉంటేనే పేద ప్రజలకు విద్య అందుతుందని అయన అన్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. -
అధికార పార్టీ నాయకుల భూ దాహం
● ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు ● ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి ● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల భూ దాహం పెరిగిపోతోందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురా లు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి శనివారం ఆరోపించారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలేం రెవెన్యూ పరిధి అటవీ శాఖతో పాటు సమీపంలో ఉన్న కొత్త చెరువు భూముల ఆక్రమణలను శనివారం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు. భూముల ఆక్రమణతో పాటు విలువైన టేకుచెట్లు మాయం, అటవీ భూముల నుంచి అక్రమంగా తరలించుకుపోతున్న కంకర తవ్వకాలపై తహసీల్దార్ ఎస్.కిరణ్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ పాతపట్నం మండలం ప్రహరాజపాలేం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 7లోని సుమారు రెండు ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి, సర్వే నంబర్ 18లో ఉన్న కొత్త చెరువు గర్భాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించుకుని ఇళ్ల స్థలాల ప్లాట్లు వేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూముల ఆక్రమణతో పాటు టేకు చెట్లను, కంకరను స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నాయకులు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఆక్రమణలపై స్పందించకపోతే సమస్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ అధికారుల్లో చలనం లేకుంటే జాతీయ కమిషన్కు సమస్యను తెలియజేస్తామన్నారు. ఆమెతో పాటు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, సీనియర్ నాయకులు బి.నారాయణమూర్తి, పణుకు మోహన్, సత్య బిస్వాల్, టంకాల సుధాకర్, జీవ, వంశీ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదు
నరసన్నపేట: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేటు పీఏ రావాడ గణపతిపై కరగాంకు చెందిన టీడీపీ కార్యకర్త యాళ్ల మల్లేశ్వరరావు నరసన్నపేట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశా రు. ఇటీవల వీరిద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదాలు జరగడం, ఈ ఫోన్ ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ కావడం, పేపర్లలో ప్రచురితం అయిన విషయం విదితమే. ఆడియోలో మల్లేశ్వరరావుకు గణపతి నరసన్నపేట వస్తే నీ అంతు చూస్తానని బెదిరించడంతో ఆయన పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ దుర్గాప్రసాద్ వద్ద ప్రస్తావించగా ఫిర్యాదు వచ్చిందని అన్నారు. -
లక్ష్మీపురం డీలర్పై కూటమి నాయకుల దాడి
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో డీలర్గా పనిచేసిన డి.రమణమ్మపై ఆ గ్రామానికి చెందిన కూటమి నాయకులు గురువారం దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఆమెను 108 ద్వారా రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో డీలర్గా పనిచేసిన డి.రమణమ్మను రేషన్ పంపిణీలో కందిపప్పు వద్ద అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో గత ఏడాది ఏప్రిల్లో సస్పెండ్ చేశారు. అయితే ఆమె హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆమె డీలర్గా కొనసాగేందుకు స్టే ఇచ్చింది. అయితే రమణమ్మ డీలర్గా కొనసాగడానికి వీల్లేదని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకురాగా.. ఆ మేరకు గురువారం ఎమ్మర్వో జోగారావు, ఆర్ఐ శ్రీనివాసరావులు గ్రామానికి చేరుకుని గ్రామస్తుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, దీన్ని తాము కాదనలేమని ఆమెనే కొనసాగించాలని అధికారులు తెలిపారు. ఏ స్టే ఇచ్చినా తమకు ఆమె డీలర్గా కొనసాగేందుకు ఇష్టం లేదని స్థానికులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఆ తర్వాత వీఆర్ఓ గ్రామస్తుల వద్ద స్టేట్ మెంట్ తీసుకుంటుండగా అక్కడకు వచ్చి న డీలర్ రమణమ్మను చూసిన కూటమి నాయకులు ఒక్కసారిగా ఆమైపె దాడికి దిగారు. ఆమె వద్దనున్న ఫోన్ లాక్కున్నారు. ఆమెతో పాటు రమణమ్మ భర్త సూరప్పన్న, కుమార్తె వసంతకుమారిలపై కూడా దాడిచేశారు. వీరంతా ప్రస్తుతం రిమ్స్లో చికిత్స పొందుతున్నా రు. కూటమి నాయకులు డీలర్పై చేసిన దాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దన్నాన రాజీన్నాయుడు, రొక్కం బాలకృష్ణలతో పాటు పలువురు తెలిపారు. సెంటీమీటర్ శిలువ కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 21వ వార్డుకు చెందిన సూక్ష్మ కళాకారులు కొత్తపల్లి రమేష్ ఆచారి పలుచటి బంగారపు రేకు పైన శిలువ గుర్తు తయారు చేశారు. కేవలం 100 మిల్లీ గ్రాముల బంగారంతో ఒక సెంటీమీటర్ ఎత్తుతో తయారు చేసి గుడ్ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వ పాఠశాలలను 10 లక్షల మంది విడిచారు’ కాశీబుగ్గ: కరోనా సమయంలో నాలుగు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే.. ఇప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను విడిచిపెట్టి వెళ్లిపోయారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లండ బాబూరావు అన్నారు. కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కార్యదర్శి కంచరాన రమేష్ ఆధ్వర్యంలో గురువారం ప్రాంతీయ సమావేశం జరిగింది. సమావేశంలో పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగంపై చేస్తున్న ప్రయోగాల వల్ల నానాటికీ విద్యావ్యవస్థ దిగజారే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒకే మీడియం పాఠశాలలను నిర్వహించడం, 3,4,5 తరగతులు హైస్కూల్లో కలపడం, నేటి ప్రభుత్వం పరిసర ప్రాంత పాఠశాలల విలీనం చేయడం పాఠశాలల మూత వేయడానికి ప్రధాన కారణమన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శి గున్న రమేష్, అకడమిక్ సెల్ కన్వీనర్ లఖినాన వెంకటాచలం, పలాస అధ్యక్షుడు తమ్మినాన జయరాం, ప్రధాన కార్యదర్శి డి.జనార్దనరావు, పి.సంజయ్కుమార్, టి.అప్పారావు, పలాస వజ్రపుకొత్తూరు మందస యూటీఎఫ్ నాయకులు హాజరయ్యారు. -
పార్టీ పటిష్టతకు కృషిచేద్దాం
● మాజీ స్పీకర్, పార్టీ పీఏసీ మెంబర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ పీఏసీ మెంబర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. ఆయనను పీఏసీ మెంబర్గా పార్టీ అధిష్టానం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సందర్భంగా.. ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో గురువారం తమ్మినేనికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కాళింగ కుల అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావుతో పాటు సరుబుజ్జలి, పొందూరు మండల నాయకులు సత్కరించారు. పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేయాలని త మ్మినేని వారికి సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తాను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, సరుబుజ్జలి, పొందూరు మండలాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పాపం కింజరాపు కుటుంబానిదే..
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో నాలుగు దశాబ్దాల కాలంగా కింజరాపు కుటుంబీకుల పాలన సాగుతోందని, జిల్లాను తలసరి ఆదాయంలో చివరిస్థానంలో ఉంచిన ఘనత వారిదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. ఆయన గురువా రం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పెద్దరికం చేసి జిల్లాకి వారు చేసింది సున్నా అని గమనించాలన్నారు. జిల్లాలో మూలపేట పోర్టు వైఎస్సార్సీపీ గ్రౌండ్ చేసిందని, అంతేకాకుండా ఫిష్ ల్యాండింగ్సెంటర్లు, పోర్టులు కూడా తమ ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టామని గుర్తు చేశారు. గ్రా మాలకు బస్సులు వేయలేనివారు జిల్లాలో ఎయిర్పోర్టులు నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన పనులకే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసి కూటమి నాయకులు గొ ప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కనీస అవసరా లు తీర్చకుండా అవసరం లేని ఆర్భాటాలు చేస్తున్నారని తెలిపారు. 30 ఏళ్ల పాటు పాలించినా ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేకపోయారని తెలిపారు. ఎక్కడ ఏ అభివృద్ధి పనులు చేస్తామన్నా ప్రజలు, ప్రజాసంఘాలు, కమ్యూనిస్టులు అడ్డుతగులుతున్నారని వారు చెప్పడం సిగ్గుచేటన్నారు. -
వంశధారకు గర్భశోకం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గారలోని వంశధార నదిలో విధ్వంస రచన జరుగుతోంది. ఇంత విధ్వంసం జరుగుతున్నా అధికారులు కిమ్మనడంలేదు. 15నుంచి 20 మీటర్ల లోతు లో నదుల్లో ఇసుక తోడేస్తున్నారు. పట్ట పగలు యంత్రాలు పెట్టి మరీ ఇసుక తీసుకెళ్లిపోతుంటే.. అధికారులు చోద్యం చూడడం విస్మయం కలిగిస్తోంది. చినబాబు పేరు చెప్పి ‘చినబాబు’ పేరు చెప్పి కొందరు వంశధారను కొల్లగొడుతున్నారు. రాత్రింబవళ్లు ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. నదీమ తల్లికి గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ, పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పట్టపగలే ఇసుకను దోచేస్తున్నారు. వందల టిప్పర్లతో తరలించేస్తున్నారు. దీంతో జల వనరులు ధ్వంసమవుతున్నాయి. నదీ గర్భంలో ఇసుకను తోడేస్తుండటంతో అవి రూపం కోల్పోతున్నాయి. జీవ నది కాస్త వాగులా మారిపోతోంది. 15నుంచి 20అడుగుల లోతులో తవ్వకాలు జరపడంతో ఎక్కడా నీటి నిల్వ లేకపోవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. 40 మీటర్ల వరకు అడుగంటిపోతున్నాయి. పట్టించుకోని అధికారులు అడ్డు అదుపూ లేని ఇసుక తవ్వకాలు అటు పర్యావరణం, ఇటు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదీ గర్భంతో పాటు తీరాల్లోనూ ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడంతో చినుకు నేలలోకి ఇంకే పరిస్థితి ఉండటం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు మరింత కిందకు జారిపోతున్నాయి. జలసిరితో కళకళలాడాల్సిన భూగర్భం తడారి ఎడారిగా మారుతోంది. నదీ గర్భంలో సైతం నీటి జాడ కరువవుతోంది. లోతైన గోతులు, కనుమరుగవుతున్న ఇసుకతో నదీ గమనం మారిపోతోంది. నదికి రక్షణగా నిలవాల్సిన కరకట్టలు బలహీనమైపోతున్నాయి. కళ్లెదుటే తవ్వకాలు జరుగుతున్నా.. ఇసుక లారీలు తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఎన్జీటీ ఆదేశాలున్నా.. గారలోని వంశధార నదిలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తవ్వకాలను ఆపాలని ఆదేశించింది. కానీ ఇక్కడ అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయడం లేదు. అక్రమ తవ్వకాలకు వంత పాడుతున్నారు. చినబాబో... పెదబాబో పేరు చెప్పి అక్రమార్కులు విధ్వంసం సృష్టిస్తున్నారు. తమ జేబులు నింపుకోవడానికి వంశధారను ఛిద్రం చేస్తున్నారు. ఏదో ఒక నెపంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. దర్జాగా వందల టిప్పర్లలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు మైనింగ్, ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులు తమకేమీ పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై స్థానికులు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. చినబాబు పేరు చెప్పి విధ్వంసం ఎన్జీటీ ఆదేశాలకు తిలోదకాలు పగలు, రాత్రి తేడా లేకుండా నదిలో ఇసుక తోడేస్తున్న వైనం అడుగంటుతున్న భూగర్భ జలాలు ఉప్పునీటిమయం అవుతున్న మంచినీటి వనరులు భూగర్భ జలాలు ప్రమాదకర(ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్) స్థితికి చేరుకుంటే ఆ ప్రాంతాల పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించాలి. నోటిఫైడ్ ప్రాంతాల్లో కేవలం స్థానిక గ్రామ, పట్టణ అవసరాలకు మాత్రమే తవ్వకాలు జరపాలి. డ్యాములు, బ్రిడ్జిలు, నీటి పంపులు, మంచినీటి బావులకు 500మీటర్ల పరిధిలో తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదు. తీరంలో 8 మీటర్లు ఆపై లోతులో ఇసుక లభ్యత ఉంటే గరిష్టంగా 2 మీటర్ల లోతు వరకు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలి. నది గర్భం నుంచి తీరం వరకు 15 మీటర్ల వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం విధించాలి. -
నాటి మార్పులే..
పేదల ఇంటిలో దీపాలు వెలిగించిన పథకాలివి. సరస్వతీ కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేక మరుగున పడిపోతున్న నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచిన కార్యక్రమాలివి. ప్రభుత్వ బడులపై ఉన్న చిన్నచూపును నాడు–నేడు సమూలంగా పోగొడితే, డబ్బుల్లేక చదువులు ఆగిపోయే పరిస్థితిని అమ్మ ఒడి రూపు మాపింది. ఖర్చులకు భయపడి పెద్ద చదువులకు దూరమవుతున్న వారికి విద్యా దీవెన, వసతి దీవెన వరాల్లా మారాయి. ఆ ఫలితాలే ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ హయాంలో జరిగిన గొప్ప మార్పులకు ఈ విజయాలే తార్కాణాలు. నాడు–నేడు అమ్మ ఒడి విద్యాదీవెన వసతి దీవెన.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటైన ఐవీఎఫ్ ప్యానెల్శ్రీకాకుళం న్యూకాలనీ/బూర్జ/ ఆమదాలవలస: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు ప్రభుత్వ విద్యార్థుల పాలిట వరంగా మారింది. గత వైఎస్సాసీపీ ప్రభుత్వ హయాంలో వారంతా ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని, విలువలను అందిపుచ్చుకున్నారు. అమ్మఒడితో ఆర్థిక భరోసాను, విద్యాకానుకతో చదువుకు అవసరమైన సామగ్రిని అందుపుచ్చుకుని, రూపా యి ఖర్చు లేకుండా అన్ని వసతులు, సౌకర్యాలతో ఇంగ్లిష్ మీడియంతో పదో తరగతి చదువులను పూర్తిచేశారు. పదో తరగతిలోను మెరిసిన ఆ బిడ్డలు.. తాజాగా ఇంటర్మీడియెట్లోను సత్తాచాటారు. ఆగమేఘాల మీద సత్కారాలు.. గత ప్రభుత్వం చేసిన సత్కారాలకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద సత్కార కార్యక్రమాలను నిర్వహించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జగనన్న ఆణిముత్యాల పే రిట వివిధ మేనేజ్మెంట్లవారీగా నాలుగు స్థాయిల్లో అంటే పాఠశాల/కళాశాలస్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో అవార్డులు, సత్కారాలు, నగదు ప్రోత్సాహాకాలను ఏర్పాటుచేసి రెండు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేవారు. ఈ విషయం విద్యార్థులందరికీ బాగా తెలుసు. రాష్ట్రస్థాయి వేడుకల్లో స్వయంగా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా రూ.లక్ష చొప్పున రివార్డు అందజేసేవారు. విద్యార్థులతోపాటు వారి ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులను సైతం సత్కరించేవారు. కానీ ప్రస్తుతం ఒక్క విద్యార్థులకు మాత్రమే షైన్ అవార్డుల పేరిట సత్కారాలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. బడిలో సదుపాయాలు ఇంటర్ ఫలితాల్లో అదరహో అనిపించిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన వసతులు, సౌకర్యాల కల్పన రూపాయి ఖర్చు లేకుండా ఇంగ్లిష్ మీడియంలో బోధన -
22న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అరసవల్లి: జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు ఈ నెల 22న నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజా పేర్కొ న్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 22వ తేదీ మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు స్థాయీ సంఘాల సమావేశం ప్రారంభం అవుతాయన్నారు. ఉదయం 10.30కు 2, 4, 1, 7 స్థాయీ, మధ్యాహ్నం 3 గంటలకు 6వ స్థాయీ, 4 గంటల 3వ స్థాయీ, సాయంత్రం 5 గంటలకు 5వ స్థాయీ సంఘాల సమావేశాలు జరగనున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు. 10.5 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్ ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి తమిళనాడుకు 10.5కిలోల గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన నరేష్ సేతి, డి.గోపీనాథ్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ చిన్నమనాయుడు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేసే లారెన్స్ ప్రధాన్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వడంతో వీరు ఇక్కడి నుంచి గంజాయి తీసుకెళ్తున్నట్లు తెలిసిందన్నారు. ఒడిశాలో గంజాయి కొని ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్కు వెళ్తుండగా పట్టణ పోలీసుల తనిఖీల్లో దొరికారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీడిపప్పు అధరహో..!
● పెరిగిన జీడిపప్పు ధరలు ● పరిశ్రమల్లో పిక్కల కొరతే కారణం ● కేజీ జీడిగుడ్లు రూ.830, జీడిబద్దలు రూ.760కు పైమాటే కాశీబుగ్గ: ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన పలాస జీడిపప్పు ధరకు రెక్కలొచ్చాయి. కొత్త జీడి పంట చేతికి అందుతున్న తరుణంలో పాత జీడినిల్వలు పూర్తవడంతో ఒక్కసారిగా జీడిపప్పుకు డిమాండ్ ఏర్పడింది. రెండు నెలలుగా వరుసగా శుభకార్యాలు ఊపందుకోవడం, నెలరోజులుగా పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలోని జీడి పరిశ్రమలలో అటు పిక్కలు, ఇటు పప్పు రెండూ అందుబాటులోకి రాకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. అనేక ప్రాంతాలలో జీడిపప్పు దొరుకుతున్నప్పటికీ ఉద్దానంఇసుక నేలలో పండిన జీడి పంట రుచే వేరు. అందుకే ధర ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గదు. అనధికారికంగా మూత.. మరోవైపు, కొంతమంది పరిశ్రమదారులు గోదాములలో పాత పిక్కలు, పప్పులను షాపులకు తరలించి ఫ్యాక్టరీలు ఖాళీ చేస్తున్నారు. పిక్కలు లేవంటూ అనధికారకంగా పరిశ్రమలను మూసివేస్తున్నా రు. కొత్త పప్పు ప్రాసెసింగ్ జరగడం లేదంటూ కృత్రిమ కొరత ఏర్పడేలా చేసి ధరలను పెంచుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా పలాస కాష్యూ మాన్యుఫ్యాక్చర్ అసోషియేషన్ పరిధిలోని మూడు వందలకు పైగా పరిశ్రమలతో పా టు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని పరిశ్రమలు సై తం ధరలు భారీగా పెంచేశాయి. టన్నుల కొద్దీ లా రీలు ఉత్తరాదికి ఎగుమతులు జరుగుతున్నా స్థానికంగా పప్పు దొరకాలంటే కష్టతరంగా మారింది. కొత్త ధరలురకం ధర జంబో జీడి పప్పు రూ.900 మొదటి రకం(240 గుడ్లు) రూ.830 మూడో రకం (330 గుడ్లు) రూ.760 నాలుగోరకం (కౌంట్లెస్) రూ.730 మొదటి రకం బద్ద (జేహెచ్) రూ.760 రెండో రకం బద్ద (జేహెచ్) రూ.600–రూ.700 మూడో రకం(కే) సగం బద్ద రూ.710 నాలుగో రకం ముక్క బద్ద రూ.610 మొదటి రకం బేబీ (జీడి నూక) రూ.440 రెండో రకం బేబీ (జీడి నూక) రూ.250 -
మానవత్వం చాటుకున్న ఏపీఓ
ఇచ్ఛాపురం రూరల్: సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఎగతాళి చేసే ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ ఉద్యోగికి సపర్యాలు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు మరో ఉద్యోగి. కంచిలి మండలం ఎం.ఎస్.పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణదాసు అనే ఒరియా ఉపాధ్యాయుడు ఒడిశా పాటి సున్నాపురం ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నా రు. గురువారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఇన్నేశుపేట వద్ద ఎదురుగా బుల్లెట్ బండిపై వస్తున్న తులసిగాం యువకులు బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి కి కాలు విరిగిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఉపాధి హామీ పథకం ఏపీఓ పెట్ల శ్రీనివాసరావు వెంటనే క్షతగాత్రుడ్ని తన ఒడిలోకి తీసుకొని సపర్య లు చేశారు. అటువైపుగా వెళ్తున్న ఉపాధి కూలీల సహాయంతో ఎండ తగలకుండా చీరను పరదాగా చేసి 108 అంబులెన్సుకు సమాచారం అందించి ఇచ్ఛాపురం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఈ.శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మీనారాయణదాసుకు సపర్యలు చేస్తున్న ఏపీఓ శ్రీనివాసరావు త్రీస్టాప్.. నో స్టార్ట్ -
ఒకేసారి మూడు ఉద్యోగాలు
సంతబొమ్మాళి: మండలంలోని ఆర్.హెచ్.పురం గ్రామానికి చెందిన యారబాటి మోహన్రావు ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల విడుదలైన బ్యాంకింగ్ ఫలితాలలో యూనియన్ బ్యాంక్ ఎల్బీవో (లోకల్ బ్యాంక్ ఆఫీసర్), సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో క్లర్క్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంపికై శభాష్ అనిపించాడు. మోహన్రావు చిన్నతనంలోనే తండ్రి కృష్ణారావు మరణించగా, తల్లి కాశమ్మ పెంపకంలో మేనమామ హేమసుందర్ సహకారంతో పట్టుదలతో ఉన్నత విద్య అభ్యసించాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. తాజాగా ఒకేసారి మూడు కొలువులు సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను యూనియన్ బ్యాంక్ ఎల్బీవోగా జాయినింగ్ అవుతానని మోహన్రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సోంపేట: మండలంలోని బేసి రామచంద్రాపురం జాతీయ రహదారి వద్ద గురువారం ఉదయం జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు రుద్రశెట్టి (23) మృతి చెందాడు. బారువ పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సోదరులు రుద్రశెట్టి, బబ్లూ శెట్టి గుంటూరులో క్వారీ పని చేస్తున్నారు. స్వగ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. బేసిరామచంద్రాపురం వద్దకు వచ్చేసరికి డివైడర్ను ఢీకొట్టి పడిపోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన డంతో రుద్రశెట్టి ఘటనా స్థలంలోనే మృతి చెందా డు. బబ్లూశెట్టికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి కి తరలించారు. బారువ ఎస్.ఐ హరిబాబునాయు డు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
ఉపాధి బిల్లులు చెల్లించేదెన్నడు?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పన్నెండు వారాలుగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా జీవనం సాగిస్తారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ జనవరి 15 నుంచి నేటి వరకు ఉపాధి వేతనదారులు ఎండనక వాననక పనిచేస్తున్నా నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఎంపీలు, ఎమ్మె ల్యేలు జీతభత్యాలు లక్షలు రూపాయలు పెంచుకుంటున్నారే తప్పా ఉపాధి కూలీల బాధలు పట్టడం లేద న్నారు. పేదల ఓట్లతో అందలమెక్కుతున్న పెద్దలు ఉపాధి కూలీల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు శిర్ల ప్రసాద్, కె.ఎల్లయ్య, భవాని పాల్గొన్నారు. -
హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి
శ్రీకాకుళం: ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 7,500 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) పోస్టులను మంజూరు చేసి ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూ ఉపాధ్యాయ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్లో గురువారం ఎస్టీయూ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదుగురు ఉపాధ్యాయలు ఉన్న ఆదర్శ పాఠశాలలో ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుడు ఉండటం వల్ల పిల్లలకు నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో 117 జీఓ రద్దుతో కూడిన సవరణలు అమలు చేస్తున్న సందర్భంలో కూడా అన్ని చోట్ల 3, 4 తరగతులు ఉన్నత పాఠశాల నుంచి ప్రైమరీ పాఠశాలలకు తీసుకురాకుండా స్కూల్ అసిస్టెంట్లతో కొన్నాళ్ల పాటు బోధన చేయించాలనే ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పాఠశాలలు 900 వరకు ఉన్నాయని వీటిలో 1, 2 తరగతులకు కూడా ప్రవేశం కల్పిస్తామని ఇటీవలి ఉన్నత అధికారులు వెల్లడించారని గుర్తు చేశారు. దీనిపై సరైన నిర్ణయాలు, నిబంధనలు ప్రకటించాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, చింతల రామారావు, కూన శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, ఎన్.లక్ష్మణరావు, ఎం.మురళీధర్, చౌదరి జగన్, ఎం.తేజ, జి.తిరుమలరావు, డీవీఎన్ పట్నాయక్ పలు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
భారీగా బెల్లం ఊట ధ్వంసం
మెళియాపుట్టి/ పాతపట్నం: గిరిజన గ్రా మాల్లో నాటు సారా స్థావరాలపై దాడులు ముమ్మరం చేస్తున్నట్లు టెక్కలి ఎకై ్స జ్ సీఐ షేక్ మీరా సాహెబ్ అన్నారు. గురువారం మెళియాపుట్టి మండలం ఎగువబగడ గ్రామంలో ఎకై ్సజ్ సిబ్బంది సారా తయారీ స్థావరాలపై గురువారం దాడులు నిర్వహించారు. 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 60 లీటర్ల సారా, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పలువురు సిబ్బంది ఉన్నారు. అదే విధంగా పాతపట్నం మండలం చాపరాయిగూడ పరిధిలో సారా బట్టీలపై దాడులు జరిపారు. 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది సోమనాథం, వాసుదేవరావు, శివ పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న సొమ్ము అప్పగింత
సారవకోట: మండ కేంద్రం సారవకోటలోని గ్రామీణ బ్యాంకు ఆవరణలో గత ఏడాది డిసెంబర్లో బొంతు గ్రామానికి చెందిన తంగుడు సురేష్ నగదు పోగొట్టుకున్నాడు. పొగొ ట్టుకున్న నగదులో లక్ష రూపాయలను గురువా రం స్థానిక పోలీసులు బాధితుడికి అప్పగించా రు. వివరాల్లోకి వెళ్తే.. బొంతు గ్రామానికి చెంది న సురేష్ గ్రామీణ బ్యాంకులో రూ 1.30 లక్ష లు నగదు జమ చేసేందుకు వచ్చి సొమ్మును బ్యాంకు కుర్చీపై పెట్టాడు. గుర్తు తెలియని వ్యక్తి నగదును బ్యాగ్ దొంగిలించుకుని పారిపోయాడు. ఇటీవల మందస పోలీసులు వేరే కేసు లో పలువురు నిందితులను పట్టుకోగా అందు లో సురేష్ నగదు దొంగిలించిన వ్యక్తి ఉండటంతో సొమ్ము రికవరీ చేశారు. రూ.లక్షను బాధి తుడికి హెచ్సీ శ్రీనివాసరావు అందజేశారు. బిత్తరబందలో దొంగల హల్చల్ మందస: మండలంలోని సాబకోట గిరిజన పంచాయతీ బిత్తరబందలో దొంగలు హల్చల్ సృష్టించారు. బుధవారం రాత్రి కారు, రెండు ద్విచక్ర వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సవర మల్లిక అనేక మహిళపై దాడి చేసి చెవికి ఉన్న బంగారపు రింగులను పట్టుకుపోయారు. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించగా కత్తితో దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్సులో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం టెక్కలి : పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలి వైఎస్సార్ జంక్షన్లో అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. అనంతరం లింగాలవలసలో గత వైఎస్సార్సీపీ హయాంలో నిర్మాణం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టుమహ దేవి కోనేరు గట్టు అభివృద్ధిలో భాగంగా ట్యాక్సీ స్టాండును తక్షణమే తరలించాలని ఆదేశించారు. ట్యాక్సీ స్టాండు కోసం ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించామని, తక్షణమే ఆ ప్రదేశంలో వాహనా లు నిలుపుదల చేసుకోవాలని స్పష్టంగా చెశారు. ఈయనతో పాటు ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, నాయకు లు కె.హరివరప్రసాద్, కె.కిరణ్, బి.శేషు పాల్గొన్నారు. అటెండర్ అనుమానాస్పద మృతి! నరసన్నపేట: స్థానిక మారుతీనగర్–1లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న కొర్రాయి రమణమూర్తి (55) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు సమాచారం. ఈయన టెక్కలి వంశధార కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. సోమవారం నుంచి ఆయన కనిపించడం లేదు. ఆయన వినియోగించే ద్విచక్ర వాహనం కూడా ఇంటి బయటే ఉంది. గురువారం సాయంత్రం ఇంటి లోపల నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇంటి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియ పెట్టి ఉండటంతో వెనక్కి వచ్చేశారు. అనంతరం కుటుంబస భ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. రమణమూర్తి కుమార్తెకు వివాహం కాగా, కుమారు డు విశాఖలో ఒక ప్రవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు అవకాశం శ్రీకాకుళం రూరల్: ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్ను గానీ, రాగోలు జెమ్స్ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివి ల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. గురువా రం అంపోలు జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో ఇప్పటివరకు న్యాయవాది ఎవ్వరూ లేనివారికి ప్రభుత్వ న్యాయవాదులు నియమించే విషయంలో సహకరి స్తామన్నారు. బెయిల్ పిటీషిన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహిళా బ్యారెక్కు వెళ్లి ముద్దాయిలతో మాట్లాడి కేసుల విషయమై వేర్వేరుగా తెలుసుకున్నారు. రానున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం లైబ్రరీ, వంటశాల, జైలు ఆవరణను పరిశీలించారు. ఆయనతో పాటు అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, జైలర్ దివాకర్నాయుడు పాల్గొన్నారు. -
ఈవీఎం గోదాముల తనిఖీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై మాసాంతపు తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్లోని ఈవీఎం గోదామును రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి కె.విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా వ్యవస్థలు, సిబ్బంది విధులు, హాజరును సమీక్షించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హాజరై భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పట్ల నమ్మకం కలిగేందుకు ఇటువంటి తనిఖీలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎన్నికల విభాగాధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
● తూరుపు వేలుపు విలాసం
శ్రీకాకుళం నగరంలో చర్చి గోడలపై అన్యమత రాతలు రాసిన వ్యక్తులను అరెస్టు చేసిన సందర్భంగా ప్రచురితమైన కథనంబజారు రోడ్డులో ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చి రక్షణ గోడలపై అన్యమత రాతలు రాసిన గూనపాలెం మేదరవీధికి చెందిన నర్రు దుర్గాప్రసాద్, అదే వీధికి చెందిన గ్రంథి సోమశేఖర్లను కూడా అరెస్ట్ చేశామని ఎస్పీ ఈ నెల 3వ తేదీనే మీడియాకు తెలిపారు. తద్వారా ఈ రెండు ఘటనలు వేర్వేరని స్పష్టం అవుతోంది. దీన్నేమంటారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళంలో ఉన్నది వారు నియమించిన ఎస్పీయే. ఇక్కడ జరిగిన ఘటనలపై విచారణ జరిపిన తర్వాత ఆయా ఘటనలకు గల కారణాలను, నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరించారు. కానీ హోంమంత్రి అనిత మాత్రం అందుకు భిన్నంగా మంగళవారం స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి ఆపాదించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. ఇప్పుడు ఇక్కడ ఎవరివి క్రిమినల్ పాలిటిక్స్? దీన్నిబట్టి హోం మంత్రి అనిత ఎంత దారుణంగా అబద్ధాలు, అవాస్తవాలను వల్లిస్తున్నారో అర్థమవుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఏం జరిగినా దానిని ప్రత్యర్థులపైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారనడానికి ఈ ఘటనలే నిలువెత్తు సాక్ష్యాలు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలతోపాటు చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్టు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చిత్రలేఖన పోటీల నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. మండల స్థాయి చిత్రలేఖన పోటీలు ఈ నెల 17న మండల కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. అందులో ప్రథమ, ద్వితీయ స్థాయిల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయాలని మండల విద్యాశాఖాధికారులకు సూచించారు. జిల్లాస్థాయి చిత్రలేఖన పోటీలు ఈ నెల 18న శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీరికి ఈ నెల 19న బహుమతుల ప్రదానం చేస్తామని తెలిపారు. మొదట్లో ఈ వ్యాపారం పెట్టినప్పుడు మాకు ఎంతో ఆందోళన ఉండేది. భారీగా అప్పు చేశాం. విజయం సాధిస్తామా లేదా అనే అనుమానంతోనే భార్యాభర్తలం ఇద్దరం కష్టపడ్డాం. నేడు విజయవంతమైన వ్యాపారం నడుపుతున్నాం. మరో పదిమందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాం. – డొంకాన స్వాతి, గొండ్యాలపుట్టుగ ●ఉపాధి కల్పిస్తూ.. -
ఫీజులు
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక అవస్థలు ● కళాశాలల ఒత్తిడితో అప్పులు చేస్తున్న వైనం ● ఆర్థిక భారంతో ప్రైవేటు కళాశాలలు ● మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజులదీ అదే దారి ● రూ.106.75 కోట్లకు పైగా బకాయిలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రైవేటు కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు కట్టకపోతే పిల్లలను ఏ రోజు కాలేజీ నుంచి ఇంటికి పంపుతారో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. చదువు పూర్తయినా సర్టిఫికెట్ల విషయంలో సతాయిస్తుండటంతో నిత్యం భయపడుతూ గడుపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో.. కాలేజీల నిర్వహణ కోసం విద్యార్థులే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చాక తిరిగి తీసుకోవాలని చెబుతున్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్ల కోసం వెళ్లిన విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెప్పే పరిస్థితి వచ్చేసింది. దీంతో వారి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా సర్కారు మాత్రం రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయడం లేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తే చేసిన అప్పులతో పాటు తమ ఖర్చులకు ఇబ్బందులు ఉండవని విద్యార్థులు నెలలు తరబడి వేచి చూస్తున్నారు. జిల్లాలో 45,657మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.106కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడి ఉంది. మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు సున్నా.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు(ఎంటీఎఫ్) కూడా చెల్లించలేదు. 2024–25 విద్యా సంవత్సరంలో ఒక్క రూపాయి విడుదల చేయలేదు. వాస్తవానికి డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ చదువుతున్న వారికి ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు, ఐటీఐ, డిప్లమో చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 45,657 మంది విద్యార్థులు ఎంటీఎఫ్కు నోచుకోలేదు. దీంతో వసతి కష్టాలు తప్పడం లేదు. ●గార మండలం బోరవానిపేట గ్రామానికి చెందిన బోర హరి విశాఖపట్నం ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి తవిటినాయుడు గారలో ఓరైస్ మిల్లులో కలాసీగా పనిచేస్తున్నాడు. తనలాగా కాకుండా కుమారుడిని ఎలాగైనా ఉన్నత చదువులు చదివించి ప్రయోజకుడ్ని చేయాలన్నది ఆయన కల. అయితే ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో యాజమాన్యం డబ్బులు చెల్లించాలని చెబుతోంది. ముందుగా మీరు డబ్బులు చెల్లించాలని, ప్రభుత్వం వేసినప్పుడు మీరే ఉంచుకోవాలని చెబుతున్నారు. రోజు వారీ కూలీపై ఆధారపడే కుటుంబం కావడంతో విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. అప్పు కోసం ప్రయత్నాలు.. కొడుకు చదువుతున్న కాలేజీ నుంచి డబ్బులు కట్టమని చెబుతున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశాం. ఏడాది పూర్తవుతోందని ఫీజు మీరే కట్టాలని అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. అప్పు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలి. – బోర తవిటినాయుడు, విద్యార్థి తండ్రి, రైసు మిల్లు కలాసీ, గార మండలం ఆమదాలవలస పట్టణంలోని మెట్టక్కివలస ప్రాంతంలో సీతారాంనగర్ లో నివాసముంటున్న పైడి నవ్యశ్రీ టెక్కలిలోని ఐతమ్ ఇంజినీరింగ్ కాలేజిలో గత ఏడాది జాయినయ్యింది. గత ప్రభుత్వం మాదిరిగా ఈ సర్కారు కూడా సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందని భావించింది. అయినా ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థి ని ఆందోళన చెందుతోంది. వేలాది రూపాయల ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి వస్తుండటంతో ఎలా చెల్లిస్తారో తెలియక భయాందోళనకు గురవుతోంది. ఇంజినీరింగ్ పూరి చేసి ఉన్నత శిఖరాలకు వెళ్లాలనే ఆశయం నీరుకారేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాలేజ్ నుంచి ఒత్తిడి.. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే నమ్మకంతో నా కుమార్తెను టెక్కలిలోని ఐతం కళాశాలలో ఇంజనీరింగ్లో చేర్పించాను. మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాకు రోజువారి పనిలో సంపాదించింది కుటుంబ పోషణకు మాత్రమే సరిపోతుంది. ఏడాదికి సుమారు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. అంత మొత్తంలో ఖర్చులు పెట్టలేను. ఇటీవల కళాశాల నుంచి ఫోన్చేసి మొత్తం డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఏం చెయ్యాలో తోచడంలేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నా కుమార్తెకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలా చూడాలి. – పైడి లోకేశ్వరరావు, విద్యార్థిని నవ్యశ్రీ తండ్రి, ఆమదాలవలస డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ వారికి ఏడాదికి ఇవ్వాల్సిన ఫీజు రూ.20 వేలు (ఒక్కో విద్యార్థికి) మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజుకు అర్హులైన విద్యార్థుల సంఖ్య 45,657 జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల సంఖ్య : 45,657 ఇప్పటి వరకు విడుదలైన నిధులు రూ.35.58 కోట్లు 2024–25లో రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.142.34 కోట్లు ఇంతవరకు విడుదల చేసిన నిధులు 0 రావల్సిన బకాయిలు రూ.106.75కోట్లు -
ఆ మొత్తం ఎప్పుడు చెల్లిస్తారో..?
చిత్రంలో కనిపిస్తున్న ఎం.సూర్యనారాయణది పశ్చిమగోదావరి జిల్లా. తల్లిదండ్రులు రామారావు, భారతి వ్యవసాయ కూలీలు. ఈపీఈఏపీ సెట్ ర్యాంకు ద్వారా ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ట్రిపుల్ఈ బ్రాంచ్లో ప్రవేశం పొందాడు. ప్రస్తుతం చివరి ఏడాదికి చేరుకున్నాడు. ఈ నెలలో చివరి సెమిస్టర్ పూర్తి చేసి, రిలీవ్ అవుతున్నాడు. కళాశాల ఫీజు స్ట్రక్చర్ రూ.43,000 కాగా, మొదటి విడత మాత్రమే రూ.10,750 విడుదలైంది. మిగిలిన డబ్బు మూడు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పూర్తి ఫీజు చెల్లించకపోతే కళాశాల యాజమాన్యం విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు అందజేయదు. దీంతో విలువైన సమయం, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని విద్యార్థి ఆందోళన చెందుతున్నాడు. -
ఏసీబీకి పట్టుబడ్డ డీఎంహెచ్వో సస్పెన్షన్
సాక్షి, అమరావతి: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శ్రీకాకుళం డీఎంహెచ్వో డాక్టర్ టి.వెంకట బాల మురళీకృష్ణ, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వి.సురేశ్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైద్యశాఖ ఉద్యోగిని నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ వీరిద్దరూ ఈ నెల నాలుగో తేదీన ఏసీబీకి చిక్కారు. కోర్టు వీరికి ఈ నెల 17 నుంచి రిమాండ్ విధించింది. వీరిని సస్పెండ్ చేసినట్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చిన వైద్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల ఈ నెల నాలుగో తేదీ నుంచి సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని వివరించారు. బ్యాంకు పీఓగా రైతుకూలీ బిడ్డ కంచిలి: మండలంలోని తలతంపర గ్రామానికి చెందిన రైతుకూలీ బిడ్డ నడుపూరి శివాజీ యూనియన్ బ్యాంకు పీఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శివాజీ తండ్రి రామకృష్ణ రోజుకూలీగా జీవనం సాగిస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి గృహిణి. శివాజీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో బ్యాంకు పీఓ ఉద్యోగానికి ఎంపికకావడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు శ్రీకాకుళం(పీఎన్కాలనీ): శ్రీకాకుళం మున్సిప ల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని రీజనల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి పి.నాయుడు అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీపీ, ప్లానింగ్ సెక్రటరీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్లానింగ్ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. తూతూమంత్రంగా నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదని, నిర్మాణదారులకు సవివరంగా తెలియజేసి జరిమానాలు విధించాలన్నారు. సెట్బ్యాక్లు, ఆక్రమణలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్లానింగ్ సెక్రటరీలదేనని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ ద్వారా రూ 4.64 కోట్లు, బీపీఎస్ ద్వారా రూ.1.4 కోట్లు వసూలు చేశామని, ఆ మొత్తాన్ని కార్పోరేషన్ పరిధిలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని చెప్పారు. నగరంలో ఇరుకుగా ఉన్న రోడ్లు వెడల్పు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. సర్క్యులేషన్ ప్యాట్రన్ అమల్లోకి వచ్చిందని, దీనిపై ప్రజల్లో విస్త్రృత ప్రచారం చేయాలన్నారు. పాలకొండ రోడ్డు, రామలక్ష్మణ కూడలి వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వెంకటేశ్వరరావు, జానకి పాల్గొన్నారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు కృషి ఎచ్చెర్ల క్యాంపస్: సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల పాత్ర కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బొంతలకోడూరు పంచాయతీ పాతదిబ్బలపాలెం సముద్ర తీరంలో బుధవారం ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను సముద్ర జలాల్లో విడిచిపెట్టారు. తీరంపై తాబేళ్లు పెట్టిన గుడ్లను 45 రోజుల పాటు సంరక్షణ కేంద్రంలో ఉంచి ప్రత్యేకంగా పొదిగేలా అటవీశాఖ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలాల్లో తాబేళ్ల సంఖ్య పెరగాలని చెప్పారు. ప్రస్తుతం వేట నిషేధం 61 రోజులు అమల్లో ఉందని, తాబేళ్లు సురక్షితంగా పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి వెంకటేష్, రేంజర్ రాజశేఖర్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ సోమేశ్వరరావు, సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
హోంమంత్రి బురద రాజకీయం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘నరసన్నపేటలోని ఒక టెంపుల్పై జీసస్ వర్డ్స్ రాయించారు. ఒక చర్చిపై జై శ్రీరామ్ అని రాయించారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే ఏదో విధంగా మత కల్లోలాలు తీసుకురావాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూను క్రియట్ చేయాలన్న దృక్పథం చాలా క్లియర్గా కన్పిస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెబుతున్నాను.. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని. ఇలాంటి సంఘటనలు పునరావృతం చేయడానికి రెడీ అవుతున్నారు. అయినా వారు ఏమీ చేయలేరు.మేమంతా అలెర్ట్గా ఉన్నాం’ అంటూ మంగళవారం మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమని స్పష్టమైంది. ఆయా రాతలకు సంబంధించి ముగ్గురు అసలైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. జలుమూరు మండలం యలమంచిలి గ్రామం ఎండల కామేశ్వరస్వామి గుడి లోపలి కాంపౌండ్ గోడపై, అదే గ్రామంలో అసిరితల్లి గుడి వద్ద, కామినాయుడుపేట కొండపోలవలసలో ఆంజనేయస్వామి గుడి గోడపై మతపరమైన రాతలపై పోలీసులు విచారణ జరిపి పీటర్ జాన్, పాగోటి ఈశ్వరరావు, మామిడి అజయ్ అనే ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షలతో వీరు గత నెల 29వ తేదీన ఆ రాతలు రాసినట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈనెల 14న మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా, ఈ నెల 1న శ్రీకాకుళం టౌన్ హాల్ రోడ్డులోని ఆర్సీఎం సెయింట్ థామస్, చిన దేవాలయాలు, చర్చిలపై అన్యమత రాతలు వాటిని ప్రతిపక్షానికి అంటగడుతూ నోరు పారేసుకున్న మంత్రి అనిత అంతకుముందే అసలు కారణాలు వెల్లడించిన ఎస్పీ జలుమూరు ఘటనపై నిందితులను అరెస్టు చేసిన సందర్భంగా ప్రచురితమైన కథనం -
2.50 లక్షల మంది విద్యార్థులు లక్ష్యం
పోలాకి: రానున్న విద్యాసంవత్సరంలో జిల్లాలో 2.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. బుధవారం పోలాకిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం 2.44 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుతుండగా వారిలో 29 వేల మంది పదో తరగతి విద్యార్తులు రిలీవ్ కానున్నారని చెప్పారు. మరో 35 వేల మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి తరగతికి ఉపాధ్యాయున్ని నియమించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల క్రమబద్ధీకరణ జరుగుతోందని చెప్పారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీఈవో తెలిపారు. దాదాపు ప్రతి పంచాయతీ పరిధిలో మోడల్స్కూల్ ఉండేలా కృషిచేస్తున్నామని చెప్పారు. పశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కంచిలి: ప్రకృతి వైపరీత్యాల నుంచి పశువుల్ని రక్షించుకోవాలని భువనేశ్వర్కు చెందిన ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు డాక్టర్ అరుణ్కుమార్ పండా, డాక్టర్ బ్రీగేంద్ర అన్నారు. కంచిలి, కవిటి మండలాలకు చెందిన మహిళా పాడిరైతులతో సోంపేట మార్గంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల పశువుల పెంపకంలో కలిగే సమస్యలు, వాటి పరిష్కారాలు, పశువుల పెంపకంలో మహిళల పాత్రను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కె.రాజగోపాల్, సోంపేట సహాయ సంచాలకులు డాక్టర్ కె.అప్పలస్వామి, పశువైద్యాధికారులు డాక్టర్ టి.శిరీష, డాక్టర్ జి.కిరణ్కుమార్, డాక్టర్ సంజయ్కుమార్, కంచిలి ఏపీఎం అప్పలనర్సమ్మ, మహిళా పాడి రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎట్టకేలకు ఫ్లెక్సీల తొలగింపు శ్రీకాకుళం పరిధిలోని పెదపాడులో వైఎస్సార్ విగ్రహం చుట్టూ టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ‘విగ్రహాన్ని కప్పేశారు’ శీర్షికన ఈ నెల 14న సాక్షిలో ఫొటో కథనం ప్రచురితమైంది. విషయం ఉన్నతాధికారుల దృష్టిలోకి వెళ్లడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. బుధవారం ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించడంతో వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – శ్రీకాకుళం రూరల్ -
కల్యాణం.. కమనీయం..
పాతశ్రీకాకుళంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న నాగావళి నదీతీరంలో కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక తిరుక్కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీకూర్మం దేవస్థానం అర్చకుడు గోపినంబాళ్ల నల్లకూర్మానదాసు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు బూరాడ వంశీకృష్ణ నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఉత్సమూర్తులను ప్రత్యేక మండపంపై ఉంచి మల్లె, బంతి వంటి పూలతో మండపాన్ని అలంకరించారు. ఉత్సమూర్తులను వేదికపై ఉంచి వేదమంత్రాల నడుమ కల్యాణం జరిపించారు. అంతకుముందు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు, మర్రి యోగేశ్వరరావు, అదిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. –శ్రీకాకుళం కల్చరల్ -
ట్రాక్టర్ను ఢీకొన్న కారు
టెక్కలి రూరల్: మండలంలోని లచ్చన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు ధ్వంసమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న కారు లచ్చన్నపేట మలుపు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జయ్యింది. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కారులో ఉన్న వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్క్రాస్ మూర్తి ఇక లేరు
● నేత్రాలను సేకరించిన ప్రతినిధులు శ్రీకాకుళం కల్చరల్: సి.వి.నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకుడు, రెడ్క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు సి.వెంకట నర్సింహమూర్తి(82) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక ఆర్అండ్బీ గెస్టు హౌస్ వద్ద సీవీ నాగజ్యోతి ఆనంద నిలయం(వృద్ధాశ్రమం) నిర్మాణ దాతగా, అనేక దేవాలయాల అభివృద్దికి విరాళాలు అందించిన మూర్తి కొంతకాలంగా వృద్ధాశ్రమంలోనే ఉంటున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేసిన మూర్తి తన జీవిత చరమాంకంలో కుమార్తె నాగజ్యోతి పేరిట చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మందికి భోజనం పెట్టారు. ఆయన మృతి పట్ల రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సభ్యులు మల్లా చక్రవర్తి, దుర్గా శ్రీనివాసరావు, తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన నేత్రాలను రెడ్క్రాస్ ప్రతినిధులు సేకరించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
● కె.కుపాసుకుద్ది గ్రామ యువకుడు దుర్మరణం ఇచ్ఛాపురం : ఈదుపురం రోడ్లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కవిటి మండలం కె.కపాసుకుద్ది గ్రామానికి చెందిన గోకిడి రవి(25) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కె.కుపాసుకుద్ది గ్రామానికి చెందిన గోకిడి మాధవరావు, వేణు దంపతుల కుమారుడు రవి విదేశాల్లో వెల్డింగ్ పనుల చేసుకొంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇరాక్ నుంచి నెల రోజుల కిందట ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి ఇచ్ఛాపురంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈదుపురం రోడ్డులోని ఇటుకల బట్టీ సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి గుంతలో పడిపోయాడు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. దీంతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఉదయం అటువైపుగా వెళ్తున్న వారు మృతదేహాన్ని గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తండ్రి మాధవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికందిన కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సారా నిర్మూలనకు నవోదయం 2.0
పాతపట్నం: నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమం చేపడుతోందని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒడిశా, ఆంధ్ర చెక్పోస్ట్లను బుధవారం పరిశీలించారు. అనంతరం పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రకు నాటుసారా, మద్యం రవాణా చేసే రహదారుల వద్ద తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. సరిహద్దు గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. కొండపై ఉన్న గూడలకు వెళ్లి తనిఖీలు చేపట్టాలని సూచించారు. సారా రహిత జిల్లాగా చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఆయనతో పాటు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు, ఎస్ఐ శ్రీనివాసరావు ఉన్నారు. -
ఐటీడీఏపై కూటమి నేతల హామీలు ఏమయ్యాయి?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గిరిజన గ్రామాలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం దారుణమని, తాము అధికారంలోకి వస్తే ఐటీడీఏ తప్పక ఏర్పాటుచేస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి నేడు పట్టించుకోకపోవడం దారుణమని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కో–చైర్మన్ డాక్టర్ మీడియం బాబూరావు అన్నారు. జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, జీసీసీ ద్వారా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. విభజిత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది ఆదీవాసీలు జీవిస్తున్నారని, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సీతంపేట ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉండేదని, ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం కావడంతో శ్రీకాకుళం గిరిజనులకు ఐటీడీఏ లేకుండా పోయిందన్నారు. గత నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో స్వయంగ రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శ్రీకాకుళం జిల్లాలో నూతన ఐటీడీఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. ఆదివాసీలు నివసిస్తున్న ఒక్క గ్రామం కూడా షెడ్యూల్ ఏరియాలో లేకపోవడంతో ఆదివాసీల భూమి, అడవులకు రక్షణ లేకుండాపోయిందన్నారు. బూర్జ మండలంలో అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, శ్రీకాకుళం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొంతు అప్పారావు, ఎన్.అప్పన్న, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సవర పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: స్థానిక ఎన్టీఆర్ కాలనీ 7వ లైన్లో నివాసముంటున్న ముడిదాన కేశవరావు(38) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగాం మండలం హుకుంపేట గ్రామానికి చెందిన కేశవరావు టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 7వ లైన్లో నివాసం ఉంటున్నాడు. భార్య నాగమణి నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. పిల్లలు రమ్య, గణేష్ బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, తాపీమేసీ్త్రగా పనిచేసే కేశవరావు అప్పులు అధికంగా వాడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంటి కరెంట్ బిల్లు సైతం కట్టకపోవడంతో కనెక్షన్ కట్చేశారని, ఫైనాన్స్ కట్టకపోవడంతో ద్విచక్ర వాహనం సైతం తీసుకెళ్లిపోయారని, మద్యాని బానిస కావడంతో చివరకు మనస్థాపం చెంది మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుడి మామ జామి భీమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీచ్ ఫెస్టివల్కు సన్నద్ధం
సోంపేట: బారువలో ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం బారువ బీచ్ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19న ప్రారంభం కానున్న బీచ్ ఫెస్టివల్కు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు హాజరవుతారని చెప్పారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెడతామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా బీచ్ క్లీనింగ్ జరుగుతుందన్నారు. క్రీడాపోటీలు, వీలైతే బోటింగ్ పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ, పర్యాటక, అగ్నిమాపక, రహదారులు భవనాలు, అటవీశాఖ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. -
బూటకపు హామీలతో మోసం
ఎచ్చెర్ల క్యాంపస్: కూటమి పార్టీలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ సమక్షంలో ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట సమీపంలో ఎచ్చెర్ల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షుడు బోర సాయిరాంరెడ్డి, అజ్జరాం సర్పంచ్ స్రవంతి, మండల పార్టీ కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందన్నారు. ప్రజలను భయపెట్టి విధ్వంస పాలన ఎన్నాళ్లూ సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తున్నారని, అందరి సూచనలు, సలహాలు తీసుకుంటారని, క్షేత్రస్థాయి పరిస్థితి వివరించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు నిర్వీర్యమయ్యాయని చెప్పారు. రాష్ట్రమంటే అమరావతి కాదని, ఇచ్చిన సూపర్సిక్స్ హామీలపై ఒక్కసారైనా దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సమష్టిగా పనిచేద్దాం.. మాజీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి గొర్లె కిరణ్కుమార్ మాట్లాడుతూ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, సమష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. 2014లో అధికారం కోల్పోయినా నిరాశ చెందకుండా 2019లో అధికారంలోకి వచ్చామని, రానున్న ఎన్నికల్లోనూ తప్పక విజయం సాధిస్తామన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం, తప్పుడు కేసుల నమోదు వంటి వాటిపై ప్రజల్లో తీవ్ర వ్యక్తిరేకత వ్యక్తమవుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, ఎచ్చెర్ల, లావేరు, రణస్ధలం, జి.సిగడాం మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాంరెడ్డి, దన్నాన రాజినాయుడు, గొర్లె శ్రీనివాసరావు, డోల వెంకటరమణ, జెడ్పీటీసీలు మీసాల సీతంనాయుడు, కాయల వెంకటరమణ, నాయకులు, ప్రజా ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ, ఎన్ని ధనుంజయ, మీసాల వెంకటరమణ, జరుగుళ్ల శంకరరావు, బల్లాడ జనార్దనరెడ్డి, బెండు రామారావు, కె.వి.వి.సత్యనారాయణ, మూగి శ్రీరాములు, అంబటి రాంబాబు, పంచిరెడ్డి రాంబాబు, తమ్మినాయుడుపేట నాయకులు సనపల సూరిబాబు, వావిలపల్లి వెంటరమణ, యండ రమేష్, గురుగుబెల్లి దివాకర్, గురుగుబెల్లి రామచంద్రరావు, పంచాది లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ -
పశువుల పట్టివేత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నారాయణవలస సమీపంలో వ్యాన్లో 13 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు కోటబొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. పశువులను తరలిస్తున్న వ్యాన్ను ఆపగా 12 మగదూడలు, ఒక ఆవు ఉన్నట్లు గుర్తించి వాటిని విజయనగరం జిల్లా కొత్తవలస గోశాలకు తరలించారు. అనంతరం ఆవులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని వినతి సారవకోట: జిల్లాలోని గిరిజన పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో కలిసి సమస్యలను వివరించారు. గిరిజన పంచాయతీలలో ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బైరిసింగి లక్ష్మినారాయణ, అడవి రాముడు, చౌదరి లక్ష్మినారాయణ, కొచ్చ శ్రీను, సింహాచలం పాల్గొన్నారు. పురుగుమందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య రణస్థలం: మండలంలోని వెంకటరావుపేటకు చెందిన కొత్తకోట సత్యం(59) అనే వృద్ధురాలు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యం మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో గడ్డిమందు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి రణస్థలం సీహెచ్సీకి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై అక్రమ వసూళ్లు! ఇచ్ఛాపురం టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని బెల్లుపడ సమీపంలో పాత టోల్గేటు వద్ద అనధికార వ్యక్తులు వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరుతో అక్రమ వసూళ్ల దందా సాగిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరిట రసీదు బుక్ చూపించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఇంటిగ్రేడ్ చెక్పోస్టు ఉన్నప్పుడు అక్రమంగా వస్తువులు రవాణా చేస్తే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసేవారు. ఇంటిగ్రేడ్ చెక్పోస్టు తొలగించాక అపరాధ రుసుం వసూలు చేయడం ఆగిపోయింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీలో కొందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, తోటపని చేసే వారు హైవేపై వ్యవసాయ ఉత్పత్తుల లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికులు, అధికారులు వచ్చే సమయంలో ఏమీ తెలియనట్లు పక్కకు జారుకుంటున్నారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆంద్రయ్య వద్ద ప్రస్తావించగా గతంలో కవిటి మండలం కరాపాడు టోల్గేటు వద్ద లారీలు ఆపి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే లారీల నుంచి పన్ను వసూలు జరిగేదని, టోల్ గేట్ వారు అభ్యంతరం చెప్పడంతో పాత టోల్గేటు వద్దకు మార్చామని చెప్పారు.సూపర్వైజర్లు, ఇతర అధికారులే పన్ను వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పెన్షనర్ల సమస్యలపై వినతి శ్రీకాకుళం అర్బన్: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు, జనరల్ సెక్రటరీ సతీష్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాష్ట్ర సెక్రటేరియేట్లో కలిసి వినతిపత్రం అందించారు. -
లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెం ఫ్లై ఓవర్ వంతెన కింద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముగడ చిన్నలచ్చయ్య (74) బస్సులో ప్రయాణిస్తూ చిలకపాలెం వద్ద దిగాడు. లావేరు మండలం బుడుమూరు సంతకు వెళ్లే క్రమంలో ఫ్లై ఓవర్ను దాటుతుండగా.. చిలకపాలెం వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో వృద్ధుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో వెంగళరావు కాలనీ సమీపంలో అప్లైన్ ట్రాక్పై మంగళవారం రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన సురవరపు శ్రీనివాసరావు(42) టాటా ఏస్ వ్యాన్ నడుపుతుంటాడు. ప్రతిరోజూ పాలకొండ నుంచి శ్రీకాకుళం కర్రపొట్టు తరలిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనివాసరావుకు భార్య భవాని, కుమార్తె స్పందన, కుమారుడు చైతన్య ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
క్రీడాకారులతో ఆటలా?
శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి సర్కారు నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. అటు పాలకులతోపాటు ఇటు అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి తాజాగా విడుదలైన క్రీడా ఎంపికల షెడ్యూల్ను పరిశీలిస్తే అర్ధం చేసుకోవచ్చు. శాప్ అధికారుల తీరుపట్ల క్రీడాసంఘాలు ప్రతినిధులు, క్రీడాకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ, స్పోర్ట్స్ ఇండియా ఆధ్వర్యంలో 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ త్వరలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఇందులో అండర్–18 బాలుర కబడ్డీ, బాలుర ఖోఖో, బాలికల ఫుట్బాల్ తదితర క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్ల ఎంపికలను బుధవారం (ఈ నెల 16న) విజయవాడ వేదికగా నిర్వహించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నిర్ణయించింది. అంత వరకు బాగానే ఉంది. అయితే ఎంపికలు జరుగుతున్న విషయాన్ని రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చేరవేయడంలో నిర్లిప్తత ధోరణిని ప్రదర్శించారు. కనీసం నాలుగు రోజుల ముందు జిల్లాకు సమాచారాన్ని చేరవేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. జిల్లాల్లో జరిగే జిల్లాస్థాయి ఎంపికలకే రెండు మూడు రోజుల ముందు సమాచారాన్ని పత్రికలు, సోషల్ మీడియా గ్రూపుల్లో క్రీడాకారులకు తెలిసేలా చర్యలు తీసుకుంటారు. అలాంటిది రాష్ట్రస్థాయి ఎంపికలకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. క్రీడాకారులు ఎక్కువ మంది వస్తే ఖర్చు అవుతుందనో.. లేదా తక్కువ మంది వస్తే తమవారినే ఎంపిక చేసుకోవచ్చనే కుతంత్రమో.. క్రీడలను పాతరేద్ధామనే దుర్భుద్దో తెలియదుగానీ శ్రీకాకుళం జిల్లాకు సైతం మంగళవారం సాయంత్రం ఎంపికల సమాచారాన్ని చేరవేశారు. క్రీడాకారుల అవస్థలు ఆలస్యంగా సమాచారం అందుకున్న నిరుపేద క్రీడాకారులు విజయవాడ పయనమయ్యేందుకు ఆపసోపాలు పడ్డారు. రవాణా చార్జీలకు కూడా ఏర్పాటుచేసుకునే సమయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ క్రీడాకారులు రాత్రి దొరికిన ట్రైన్లలో రిజర్వేషన్లు లేకుండానే జనరల్ బోగీల్లో పయనమయ్యారు. ఇంకొందమంది ఎక్కువ వ్యయప్రయాసలైనప్పటికీ.. గత్యంతరం లేక ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయించారు. మరికొంతమంది ఎంపికలకు వెళ్లలేకపోయారు. శాప్ చైర్మన్తోపాటు శాప్ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరిని ఒలింపిక్ సంఘం, క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. శాప్ నిర్లక్ష్యం వైఖరితో నష్టపోయిన క్రీడాకారులకు ఎవరు న్యాయం చేస్తారని వారంతా ప్రశ్నిస్తున్నారు. విజయవాడ వేదికగా నేడు క్రీడా జట్ల ఎంపికలు బుధవారం జరిగే ఎంపికలకు మంగళవారం సాయంత్రం మెసేజ్ శాప్ అధికారులపై మండిపడుతున్న క్రీడాకారులు, సంఘ ప్రతినిధులు -
తండ్రీకుమార్తెలపై దాడి
సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామంలో తండ్రీకుమార్తెలపై దాడి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ట పాపారావు ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తె లక్ష్మిప్రియతో కలిసి స్కూటీపై బోరుభద్రలో ఉన్న వివేకానంద పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన పిట్ట ముఖలింగం ఇనుప రాడ్డుతో వెనుక నుంచి దాడి చేయడంతో పాపారావుతో పాటు కుమార్తె కింద పడిపోయారు. కిందపడిన తండ్రీకుమార్తెలపై ముఖలింగంతో పాటు పిట్ట లక్ష్మణరావు, రామారావులు కర్రలతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకొని బాధితులకు సపర్యలు చేసి 108 అంబులెన్సులో కోటబొమ్మాళి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత, ఆస్తి తగదా వల్లే దాడి జరిగిందని సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం తెలిపారు. బాక్సింగ్ పోటీల్లో చరణ్కు కాంస్యం శ్రీకాకుళం న్యూకాలనీ: యూత్ బాక్సింగ్ పోటీల్లో సిక్కోలు కుర్రాడు ఎ.చరణ్కుమార్ సత్తాచాటాడు. విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 తేదీల్లో జరిగిన 7వ ఏపీ రాష్ట్రస్థాయి యూత్ మెన్ బాక్సింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో లైట్ మిడిల్ వెయిట్ విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. శ్రీకాకుళంలోని మాస్టర్స్ మైండ్స్ వారియర్స్(ఎంఎండబ్ల్యూ) బాక్సింగ్ క్లబ్కు చెందిన ఈ కుర్రాడు కోచ్ కె.పురుషోత్తంరావు పర్యవేక్షణలో ఇటీవల అనేక బాక్సింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించాడు. తాజాగా కాంస్య పతకం సాధించడం పట్ల బాక్సింగ్క్లబ్ అధ్యక్షుడు టి.తారకనాథ్, కార్యదర్శి బి.సురేష్కుమార్, కోచ్ పురుషోత్తం, క్లబ్ ప్రతినిధులు, డీఎస్డీఓ డాక్టర్ శ్రీధర్రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు. సన్నధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే పోలాకి: ‘చిన్నబోయిన సన్నాలు’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో పలు మిల్లుల్లో సన్నధాన్యం, బియ్యం, నూకలు తదితర స్టాకులను తనిఖీ చేశారు. వాటా, నిల్వ తదితర అంశాలను తెలియజేసే ఏ, బి రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా వ్యవసాయశాఖ అధికారులకు సైతం క్షేత్రస్థాయిలో వార్తకు సంబంధించిన అంశంపై ఉన్నతాధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. కాగా, రబీకి అందివచ్చిన సన్నధాన్యం ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు లేవని అధికారులు తెలిపారు. ఏదిఏమైనా ప్రభుత్వం ఎగుమతులకు అనుమతిస్తే తప్ప ధాన్యం కొనుగోలులో అనుకున్న స్థాయి మార్కెట్ధర పలకదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఎన్సీడీఆర్సీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)లో ఇద్దరు సభ్యుల ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ వినియోగదారుల శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు జడ్జి/పదేళ్ల అనుభవం గల జిల్లా జడ్జి/జిల్లా అదనపు జడ్జి/వ్యాపార న్యాయ ఆర్థిక అకౌంటింగ్ తదితర రంగాలలో 25 ఏళ్ల పైబడి అనుభవము కలిగిన 50 ఏళ్ల పైబడిన వారు అర్హులని పేర్కొన్నారు. మద్యం బాటిళ్లు పట్టివేత రణస్థలం: మండలంలోని నెలివాడ సమీపంలో బీహర్ దాబా వద్ద పాన్షాప్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మనోజ్ అనే వ్యక్తిని జె.ఆర్.పురం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టి 16 బీర్ బాటిళ్లు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం రిమాండ్కు తరలించామని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
కందుకూరి పురస్కారాలు
సిక్కోలు కళాకారులకు గుత్తు చిన్నారావు శ్రీకాకుళం నగర సమీపంలోని బాదుర్లుపేటకు చెందిన గుత్తు చిన్నారావుకు చిన్నతనం నుంచి నాటకాల ప్రదర్శనలంటే మక్కువ. అనేక నాటిక ప్రదర్శనలు చేశారు. స్వగ్రామంలో త్రినాథ కళానికేతన్ ఆధ్వర్యంలో మంచి–చెడు, పెంపకం, అగ్నిపథం తదితర నాటకాలలో నటించారు. ఏకపాత్రాభినయాలు, షిరిడీసాయి, బొబ్బిలిరాజు, తదితర పాత్రలు పొషించారు. సుమిత్రా కళాసమితి ద్వారా ఇటీవల కాలంలో చేస్తున్న కళాసేవ చేస్తూ గుర్తింపుపొందారు. బెందాళం శోభన్బాబు కంచిలి మండలం కత్తివరం గ్రామానికి చెందిన బెందాళం శోభన్బాబు కళారంగంలో విశేషంగా రాణిస్తున్నారు. ఉద్దాన ప్రాంతం బొరివంక కేంద్రంగా ఉన్న శర్వాణి ఫైన్ ఆర్ట్స్ సంస్థ తరఫున ప్రదర్శనలు ఇస్తున్నారు. పౌరాణిక నాటక ప్రదర్శనలో అనేక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఈయనకు కందుకూరి అవార్డు రావడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం కల్చరల్/కవిటి/కంచిలి/పలాస: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టి.వి, నాటకరంగ అభివృద్ధి సంస్థ కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతి, తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కందుకూరి విశిష్ట అవార్డులను ప్రకటించింది. అందులో జిల్లాకు చెందిన ఆరుగురు కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 16న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు జిల్లా నుంచి మెట్ట పోలినాయుడు, గుత్తు చిన్నారావు, బల్లెడ చలపతిరావు, బెందాళం శోభన్బాబు, డాక్టర్ కుమార్నాయక్, జె.సూర్యప్రకాశరావు మంగళవారం విజయవాడ పయనమై వెళ్లారు. డాక్టర్ కుమార్నాయక్ పలాసకు చెందిన డాక్టర్ కుమార్నాయక్ విద్యార్థి దశ నుంచే నాటికలు, నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం సినీ రంగంలో కూడా ప్రతిభను కనబర్చుతున్నారు. త్వరలో విడుదల కానున్న ‘పాంచాలి ’ చిత్రంలో న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు.ఈయనకు అవార్డు రావడం పట్ల పలాసలోని వివిధ కళా, సాహితీ సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. మెట్ట పోలినాయుడు శ్రీకాకుళం సమీపంలోని సనపలవానిపేటకు చెందిన మెట్ట పోలినాయుడు పంచాయతీరాజ్శాఖలో ఇంజినీర్గా పనిచేస్తూనే మరోవైపు నాటక రంగం సేవలో అందిస్తున్నారు. తండ్రి, ప్రముఖ రంగస్థల నటులు మెట్ట అప్పారావునాయుడు ఆశయాలను పుణికిపుచ్చుకొని నటనా రంగంలో కొనసాగుతున్నారు. 15 ఏళ్లుగా రచయితగా, నటుడిగా, దర్శకునిగా రాణిస్తున్నారు. అనేక సత్కారాలు, పురస్కారాలు పొందారు. 80కిపైగా నాటికలకు దర్శకత్వం వహించారు. తన గ్రామంలో అరుణోదయా ఆర్ట్స్ పేరిట నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 2000లో మదర్ ఆర్ట్స్ పేరుతో దేశం నలుమూలలా ప్రదర్శనలు ఇచ్చారు. కొత్తపరిమళం, దేవరాగం అనే నాటికలు ఈ నెల 2న తాడేపల్లిగూడెం, విజయవాడలో ప్రదర్శించగా రెండు జ్యూరీ అవార్డులు వరించాయి. బల్లెడ చలపతిరావు కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన బల్లెడ చలపతిరావు వృత్తిరీత్యా వ్యవసాయం, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుంటారు. తాతతండ్రుల కాలం నుంచి పౌరాణిక నాటికల్లో ప్రవేశముంది. 27 ఏళ్ల నటనా జీవితంతో భక్త ప్రహ్లాద నాటకంలో వేసిన హిరణ్యకశిపుని పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. బొరివంకలో శార్వాణీ గిరిజన సాంస్కృతి సమాఖ్య అనే నాటక సంస్థ స్థాపించి ప్రదర్శనలు ఇస్తున్నారు.