tamil actress
-
రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త
రిలీజై రెండు వారాలవుతున్నా సరే ఇంకా 'పుష్ప 2' హవా కొనసాగుతోంది. మూవీలోని జాతర సీన్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒకరిద్దరు మహిళలు.. ఏకంగా కూర్చున్న సీటులోనే పూనకాలతో ఊగిపోయిన ఒకటి రెండు వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ షాకింగ్ అనుభవం.. యువ నటికి ఎదురైంది. ఆ విషయాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.(ఇదీ చదవండి: మన సినిమా.. ఆస్కార్ రేసు నుంచి ఔట్)తమిళ నటి, బిగ్బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్.. రీసెంట్గా 'పుష్ప 2' సినిమా చూడటానికి వెళ్లింది. జాతర సీన్ వచ్చినప్పుడు ఈమె పక్కన కూర్చున్న మహిళ.. సామీ అని గట్టిగా అరిచిందట. దీంతో సంయుక్త తెగ భయపడిపోయింది. ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూశాడు. భయమేసి.. పది రూపాయుల టికెట్కు వెళ్లి కూర్చున్నా అని సంయుక్త ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.అయితే పూనకాలు రావడం, భయపడటం కాదు గానీ థియేటర్లలో ఇంకా రూ.10 టికెట్స్ ఉన్నాయా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అది కూడా మాల్లో ఇంత తక్కువ రేటు ఏంటి? అని ఈమెని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదలా ఉంచితే 12 రోజుల్లో రూ.1450 కోట్లపైనే వసూళ్లని 'పుష్ప 2' సాధించింది. ఈ వీకెండ్, వచ్చే వారం క్రిస్మస్ పండగ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
సీరియల్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
తమిళంలో సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి గాయత్రికి ప్రమాదం జరిగింది. మెషీన్లో ఈమె చెయ్యి ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని సాయి గాయత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 1-2 వారాల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఓవైపు సీరియల్ నటిగా చేస్తూనే సాయి గాయత్రి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ కూడా పెట్టుకుంది. పాండియన్ స్టోర్స్, నీ నాన్ కాదల్ తదితర సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే పలు వ్యక్తిగత కారణాలతో ఈ రెండు ప్రాజెక్ట్ల నుంచి మధ్యలోనే బయటకొచ్చేసింది. గతేడాది తల్లిదండ్రులతో కలిసి 'సాయి సీక్రెట్స్' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ పెట్టింది.సబ్బులు, హెయిర్ ఆయిల్ తదితర ఉత్పత్తులు తన సంస్థలో తయారు చేసి విక్రయించేది. తాజాగా కంపెనీలో పనిచేస్తున్న టైంలో సాయి గాయత్రి చెయ్యి.. అనుకోకుండా ఓ యంత్రంలో ఇరుక్కుంది. దీంతో కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
నాకు భయం లేదు.. అరెస్ట్కి ముందు కస్తూరి వీడియో
తెలుగు ప్రజలపై కొన్నిరోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని హైదరాబాద్లో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అయితే తమిళనాడు నుంచి తప్పించుకుని పారిపోయి ఇక్కడి వచ్చిందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు వీటిపై కస్తూరి స్పందించింది. తాను ఇక్కడికి రావడానికి అది కారణం కాదని చెప్పుకొచ్చింది. ఈమెని అరెస్ట్ చేయడానికి ముందు ఓ వీడియోని రికార్డ్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన కస్తూరి.. షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని చెప్పింది. షూటింగ్ ముగిసిన వెంటనే తమిళనాడు పోలీసులకు సహకరించానని పేర్కొంది. తనకు ఎలాంటి భయం లేదని చెప్పుకొచ్చింది. పోలీస్ వ్యాన్లోకి వెళ్లేటప్పుడు మాత్రం చేయి పైకెత్తి చూపిస్తూ కాస్త హంగమా చేసింది.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)వివాదం ఏంటి?నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి చెప్పిందితెలుగువాళ్లపై కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో తప్పు తెలుసుకుని రోజుల వ్యవధిలోనే క్షమాపణ చెప్పింది. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ అప్పటికే తమిళనాడులో ఈమెపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందుస్తు బెయిల్ కోసం అప్లై చేసింది. కానీ కోర్ట్ ఈమె బెయిల్ని తిరస్కరించింది. దీంతో హైదరాబాద్కి పారిపోయి వచ్చింది. కస్తూరికి నవంబర్ 29వరకు తమిళనాడు కోర్ట్ రిమాండ్ విధించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Chennai: Court remands actor Kasthuri to judicial custody till November 29. - PTI #Kasthuri pic.twitter.com/wj4b8M0W8r— Deccan Chronicle (@DeccanChronicle) November 17, 2024 -
పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్
ప్రముఖ తమిళ నటి విద్యా ప్రదీప్ శుభవార్త చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కడుపుతో ఉన్న ఫొటోలని షేర్ చేసింది. ఇందులో భర్తతో కలిసి హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్కి ఖరీదైన గిఫ్ట్)కేరళకు చెందిన విద్యా ప్రదీప్.. 2010 నుంచి సినిమాల్లో ఉంది. స్వతహాగా డాక్టర్ అయిన ఈమె.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నటిగా కొనసాగుతోంది. సహాయ పాత్రలతో పాటు పలు తమిళ చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.13 ఏళ్ల క్రితం మైకేల్ అనే ఫొటోగ్రాఫర్ని పెళ్లి చేసుకుంది. చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. సినిమాలు ఏవైనా ఉంటే విద్యా ప్రదీప్.. ఇండియా వచ్చి వెళ్తుండేది. ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి) -
యోగా ట్రైనర్ను పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్
తమిళ నటి, బిగ్బాస్ ఫేమ్ రమ్య పాండియన్ ప్రియుడిని పెళ్లాడింది. బెంగళూరుకు చెందిన యోగా నిపుణుడు లోవల్ ధావన్తో కలిసి ఏడడుగులు వేసింది. ఈ పెళ్లి వేడుకకు ఉత్తరాఖండ్లోని రిషికేష్ వేదికగా నిలిచింది. ఈ ప్రేమజంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి చేసుకున్న లొకేషన్ కూడా అదిరిందని కామెంట్లు చేస్తున్నారు.అలా మొదలైందిగతేడాది బెంగళూరులో యోగా శిక్షణ కార్యక్రమంలో రమ్య, లోవల్ ధావన్ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఈ జంటను పెద్దలు ఆశీర్వదించడంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రులు, సెలబ్రిటీల కోసం చెన్నైలో నవంబర్ 15న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.సినిమా నుంచి బుల్లితెరకుకాగా రమ్య పాండియన్.. డమ్మీ టపాసు, జోకర్, రామే ఆండాళుమ్ రావణే ఆండాళుమ్ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. కూకు విత్ కోమలి షోతో పాపులర్ అయింది. ఈ షోలో మొదటి సీజన్లో పాల్గొన్న ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచింది. అలాగే తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్లో టాప్ 5లో చోటు దక్కించుకుంది. తర్వాత బిగ్బాస్ అల్టిమేట్ షోలో పాల్గొనగా సెకండ్ రన్నరప్గా నిలిచింది. View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విజయ్ సినిమా చూసి థియేటర్లో నిద్రపోయా: హీరోయిన్
తమిళ నటి అదితి బాలన్ శాకుంతలం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే వచ్చిన సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానికి సోదరిగా నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దళపతి విజయ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 15 నిమిషాల్లో నిద్రలోకి..విజయ్కు నేను పెద్ద అభిమానిని. వింటేజ్ విజయ్ అంటే చాలా ఇష్టం. అతడి అన్ని సినిమాలు చూస్తాను. అన్నింటిలోకెల్లా కిల్లీ నా ఫేవరెట్ మూవీ. ఒకసారేమైందంటే పాండిచ్చేరిలో దాదాపు 20 మంది ఫ్రెండ్స్ కలిసి బీస్ట్ సినిమా చూసేందుకు వెళ్లాం. 15 నిమిషాల వరకు బాగానే చూశాం. నానా హంగామా చేశాం. తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాం. నేనైతే ఏకంగా నిద్రపోయాను. నా ఫ్రెండ్స్ అది కూడా వీడియో తీశారు. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంనిజంగానే బీస్ట్ మూవీ చూస్తుంటే తెలియకుండానే నిద్ర ఆవహించింది అని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నటివి అయ్యుండి హీరో గురించి ఇలాగే మాట్లాడతావా? అని మండిపడుతున్నారు. కాగా అదితి బాలన్.. అరువి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ యాక్ట్ చేస్తోంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ షోలో 'మహారాజ' నటి ఎంట్రీ?
తమిళ బిగ్బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మొదటినుంచీ ప్రచారం జరుగుతున్నట్లే ఈసారి కమల్ హాసన్ స్థానంలోకి విజయ్ సేతుపతి హోస్ట్గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని బిగ్బాస్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో షో ప్రారంభం అవుతుండటంతో ఈసారి హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఆ జాబితాలో.. విజయ్ సేతుపతితో కలిసి మహారాజ మూవీలో యాక్ట్ చేసిన సచన నమిదాస్ పేరు కూడా ఉంది. ఈ ప్రచారంపై నటి ఇంతవరకు స్పందించలేదు. కాగా మహారాజ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన సచన.. ప్రస్తుతం 1947 మూవీతో పాటు శివకార్తికేయన్ 23వ సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రిక్షాలో వెళ్తూ ప్రముఖ నటి తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ ఇంట్లో విషాదం. ఆమె తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. రిక్షాలో బయటకెళ్లిన ఆమె.. ఊహించని విధంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు నటి వెల్లడించింది. ఆగస్టు 17న ఇదంతా జరిగినట్లు అభినయ చెప్పింది. ఇన్ స్టాలో తల్లిని తలుచుకుని చాలా పెద్ద పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ హక్కులు.. ఏకంగా వందల కోట్లు?)తమిళనాడుకు చెందిన అభినయకు పుట్టుకతోనే బధిర. అంటే మాట్లాడలేదు, వినపడదు. అయినా సరే సినిమాల్లో నటిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేశ్-వెంకటేశ్కి చెల్లిగా నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. వీటితో పాటు నేనింతే, కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, గామి, ద ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.'అమ్మ నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇలా సడన్గా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు. తండ్రి-కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాద్ధృచ్చికమో కదా! నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ప్రతిచోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావ్. ఇప్పుడు నీ బాధ్యతని సాయిసునందన్ తీసుకుంటాడు. జన్మంటూ ఉంటే మళ్లీ మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా అమ్మ. రెస్ట్ ఫరెవర్ అమ్మ' అని భావోద్వేగంతో అభినయ రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్
ప్రముఖ లేడీ కమెడియన్ శుభవార్త చెప్పేసింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో విషయాన్ని ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, ఫాలోవర్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత)ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ శంకర్. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రాల్లోనూ ఇంద్రజ సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.ఈ ఏడాది మార్చిలో కార్తీక్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ప్రస్తుతం తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయానని, మాటలు రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. లవ్ మామ అని భర్తని ఉద్దేశించి తెగ ప్రేమ కురిపించింది.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) -
రూ.3 లక్షలిస్తేనే ప్రమోషన్స్.. హీరోయిన్పై నిర్మాత ఫైర్!
కోలీవుడ్ బ్యూటీ అబర్నతి ఇటీవలే మాయ పుత్తగం అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. తాను ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ నరకప్పర్ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ జూలై 30న చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి అబర్నతి డుమ్మా కొట్టింది.డబ్బు కావాలిహీరోయిన్ తీరుపై నిర్మాత సురేశ్ కామాక్షి మండిపడ్డాడు. ప్రమోషన్స్కు రావాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని బయటపెట్టాడు. అంతేకాకుండా స్టేజీపై ఎవరి పక్కన కూర్చోవాలనేది కూడా తానే నిర్ణయించుకుంటానని చెప్పినట్లు తెలిపాడు. అయితే తన వైఖరితో చిత్రయూనిట్ ఇబ్బందిపడుతోందని గమనించిన బ్యూటీ వారికి సారీ చెప్పింది. ఇక మీదట ప్రమోషన్స్కు వస్తానని హామీ ఇచ్చింది.హీరోయిన్పై సెటైర్లుప్రమోషన్స్కు వస్తానని చెప్పి మాట తప్పిన అబర్నతిపై నిర్మాత మరోసారి ఫైరయ్యాడు. తమిళ సినిమా, తమిళ నిర్మాతలు బతకాలంటే ఇలాంటివారు శాశ్వతంగా దూరంగా ఉండటమే మంచిదని సెటైర్లు వేశాడు. ఈ వ్యవహారంపై చిత్రయూనిట్.. తమిళ సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది. కాగా అబర్నతి.. జైల్, తేన్, ఇరుగపట్రు వంటి చిత్రాలతో పాపులర్ అయింది.చదవండి: సిగరెట్ తాగిన హీరోయిన్? అబ్బే, మా అమ్మాయికి అలవాటు లేదు! -
Shruti Reddy: స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న శ్రుతి రెడ్డి (ఫోటోలు)
-
ఆ తర్వాతే సినిమాలకు గుడ్ బై: యంగ్ హీరోయిన్
బోదై ఏరి బుద్ధి మారి చిత్రం ద్వారా 2019లో సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా విజయన్. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్టా పరంబరై చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపుపొందారు. దిండుగల్లోని రాజకీయ కుటుంబానికి చెందిన దుషారా విజయన్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సార్పట్టా పరంబరై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి.అలానే నక్షత్రం నగర్గిరదు, కళువేత్తి మూర్కన్, అనీతి వంటి చిత్రాల్లో దుషారా విజయన్ నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్, ధనుష్ హీరోగా వస్తోన్న రాయన్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ సరసన వీర ధీర శూరన్ చిత్రంలో నటిస్తున్నారు.మంచి అభినయం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్ అందాలారబోతకు వెనుకాడేది లేదని దుషారా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రాయన్ చిత్రంలో నటించడం సాధనగా భావిస్తున్నానన్నారు. తాను ధనుష్కు వీరాభిమానినని తెలిపారు. ఆయనతో కలసి నటించాలన్న చిరకాల కోరిక రాయన్ చిత్రంతో నెరవేరిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను ఉత్తర చెన్నై యువతిగా నటించినట్లు చెప్పారు. తాను 35 ఏళ్ల వయసు తరువాత నటనకు గుడ్బై చెబుతానని అన్నారు. ఆ తరువాత విదేశీయానం చేస్తానని చెప్పారు. అలా తాను పయనించని దేశం ఉండదని దుషారా విజయన్ పేర్కొన్నారు. -
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ సునయన. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్, దుబాయ్కు చెందిన ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖలీద్ ఇటీవల జూన్ 26న అమ్మాయి వేలికి డైమండ్ రింగ్తో చేతులు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.కాగా.. సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.మొదటి భార్యతో విడాకులు..కాగా.. జూలై 1న ఖలీద్ అల్ అమెరీ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడుతూ తాను, ఖలీద్ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీనే కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆమె పేర్కొంది. దుబాయ్కు చెందిన ఖలీద్ అల్ అమెరికీ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
ప్రముఖ నటి ఇంద్రజ శంకర్.. సోషల్ మీడియా దెబ్బకు బలైపోయింది. తమిళ నటుడు రోబో శంకర్ కూతురు ఈమె. దళపతి విజయ్ 'విజిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసింది. నెల క్రితం చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తున్నా గానీ వివాదాలు మాత్రం ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్తతో కలిసి పాల్గొన్న ఇంద్రజ.. ఆ వివాదాలపై క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్)కార్తీక్ అనే వ్యక్తిని ఇంద్రజ శంకర్ పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకలకు తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల దగ్గర చాలామంది సెలబ్రిటీల వరకు హాజరయ్యారు. అయితే పెళ్లిలో ఇంద్రజ తన తండ్రికి ముద్దు పెట్టడం, కార్తీక్.. ఇంద్రజ తల్లితో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే వాటిని దురుద్దేశంతో చూడొద్దని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది.అలానే భర్తతో కలిసి తాను ఓ ఫొటోని పోస్ట్ చేయగా.. దానికి అసహ్యకరమైన కామెంట్స్ వచ్చాయని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది. 'నా మీద ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతడి పేరు సరిగా గుర్తులేదు. 'ఇప్పుడు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఎక్కువరోజులు కలిసుండలేరు. కొన్నిరోజులు ఆగితే విడివిడిగా ఇంటర్వ్యూ ఇస్తారు. త్వరలో విడాకులు తీసుకుంటారు' అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇలా కామెంట్స్ పెట్టడంతో నేను చాలా బాధపడ్డాను. అయినా వేరొకరి గురించి అలా ఎలా కామెంట్ చేస్తారు?' అని ఇంద్రజ తన ఆవేదనని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే) -
నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్
గ్లామరస్ పాత్రలకు యాషికా ఆనంద్ పెట్టింది పేరు. కవలై వేండామ్ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు, దృవంగళ్ 16, నోటా, జాంబీ తదితర సినిమాల్లో నటించింది. బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే కొన్నాళ్ల ముందు ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తుండగా యాషికా ఆనంద్ భయంకరమైన కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ప్రాణాలతో పోరాడింది. మూడు నెలల తర్వాత తిరిగి మామూలు మనిషైంది. ఆ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఇటీవల 'సిల నేరంగళిల్' సినిమాలో నటించిన ఈ భామ ప్రస్తుతం ఇవన్ దాన్ ఉత్తమన్, రాజభీమ, పాంబాట్టం తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. (ఇదీ చదవండి: రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి) కాగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాషికా ఆనంద్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను 17 ఏళ్ల వయసులోనే ఓ తమిళ సినిమా చేసినట్లు చెప్పింది. అలాంటి గ్లామర్ పాత్రల్లో నటిస్తే, నిజ జీవితంలోనూ అలానే ఉంటారని కొందరు అనుకుంటారని, చాలా అవమానకరమెన కామెంట్స్ చేస్తుంటారని చెప్పింది. చాలా నెగిటివ్గానూ మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటివి తనకు బాధ కలిగించినా తనని అసహించుకునే వాళ్లని దూరంగా ఉండి, తనను చూసి ఎంజాయ్ చేయమనే చెబుతానని యాషికా చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే కారు ప్రమాదం తరువాత తన జీవితమే మారిపోయింది తెలిపింది. ఆ సమయంలో కంటికి నిద్రే కరువైందని, కన్ను మూస్తే ప్రమాద సంఘటనే గుర్తొచ్చేదని అప్పటిరోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంది. అలాంటి పరిస్థితి నుంచి మళ్లీ నటిస్తానని అనుకోలేదని పేర్కొంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన
నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్ను స్మోక్ అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్ సిరీస్గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. -
తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి
జనాల్ని మోసం చేయడంలో దొంగలు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే మిగతా విషయాలేమో గానీ సెలబ్రిటీలు పేరు చెప్పి డబ్బులు కాజేసే పనులు చేస్తుంటారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి పేరు చెప్పి లక్షలు వెనకేసుకునే పనిలో పడ్డారు. కానీ సదరు నటి స్పందించడంతో బండారం అంతా బయటపడింది. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) ఏం జరిగింది? తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అల్య మానస.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదింంచింది. కొన్నిరోజుల క్రితం 'వణక్కం తమిళగం' అనే షోలో పాల్గొంది. ఆ షోలో ఈమె.. మార్కెటింగ్ స్కీమ్ గురించి చెప్పినట్లు.. దీని ద్వారా లెక్కలేనంతగా డబ్బు సంపాదిస్తున్నానని ఈమె చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలు పత్రికల్లోనూ ఇదే విషయం పబ్లిష్ కాగా.. ఈ విషయం అల్య మానస దృష్టికి వెళ్లింది. 'అల్య మానస బాగా డబ్బు సంపాదిస్తోంది. ఈమెలానే మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటే.. దిగువన లింక్ క్లిక్ చేయండి' అని తన పేరు చెప్పి జరుగుత్ను మోసంపై అల్య మానస ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మార్కెటింగ్ స్కీమ్ గురించి షోలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కారు-ఇల్లు కొన్న విషయం నిజమే కానీ వాటిని ఈఎంఐ పద్ధతి తీసుకున్నానని చెప్పింది. అన్నింటికీ మించి అడ్డదారిలో కోటీశ్వరురాలిని కావాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్కి ముందే నోటీసులు) -
నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే!
అమ్మను మించిన దైవం లేదని అందరమూ నమ్ముతాం. కానీ మద్యం, డబ్బు వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. దీనికి ఉదారహణే తమిళ నటి హత్య. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన వివరాలను పరిశిలిస్తే.. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ‘కడైసి వివాసాయి’ సినిమాతో పాపులర్ తమిళ నటి కాసమ్మాళ్ హత్యకు గురైంది. అదీ కని పెంచిన సొంత కొడుకు నామకోడి ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. నామకోడి 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ, తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం జరుగుతుండేవి. గత ఆదివారం (ఫిబ్రవరి 4) రోజు కూడా మద్యం కోసం డబ్బులివ్వమని తల్లిని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది అంతే విచణక్ష మరిచిన అతగాడు చెక్కతో తల్లిపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని మధురైకి సమీపంలోని అనయ్యూర్లోని కాసమ్మాళ్ స్వగృహంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రాథమిక విచారణ తరువాత,కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని అరెస్ట్ చేశారు. కాసమ్మాళ్, ఆమె భర్త దివంగత బాలసామి దంపతుల నలుగురు పిల్లలలో నామకోడి ఒకరు. కాగా కాసమ్మాళ్ 2022లో విడుదలైన 'కడైసి వివాసాయి' చిత్రంలో విజయ్ సేతుపతి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఎం మణికండాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నల్లంది, యోగి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే? -
ఆ హిట్ సినిమాల్లో నటించిందీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా మరి?
ఏ సినిమా అయినా సరే ఫేమ్, క్రేజ్ లాంటివి హీరోహీరోయిన్లకే వస్తాయి. అయితే కొన్నిసార్లు వీళ్లతో పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసినోళ్లు కూడా ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా అప్పట్లో పలు హిట్ సినిమాల్లో కనిపించింది. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తినే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నీలిమ రాణి. గుర్తుచ్చినట్లే ఉంది కానీ ఐడియా రావట్లేదు కదా! చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె.. పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది. స్కూల్ చదువుతున్నప్పుడే ఈమెకు ఛాన్సులొచ్చాయి. అలా తెలిసీ తెలియని వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. కమల్ హాసన్ 'క్షత్రియ పుత్రుడు' చిత్రంతో అరంగేట్రం చేసింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) దాదాపు పదేళ్ల గ్యాప్లో చైల్డ్ ఆర్టిస్టుగా నాలుగు సినిమాలు చేసిన నీలిమ.. ఆ తర్వాత రూట్ మార్చింది. సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 2003 నుంచి మొదలుపెడితే స్టిల్ ఇప్పటికీ అటు సినిమాలు ఇటు సీరియల్స్లో నటిస్తూనే ఉంది. నటి,నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్టు, హోస్ట్.. ఇలా డిఫరెంట్గా క్రేజ్ సంపాదించింది. కెరీర్ మొత్తంలో ఈమెకు విలన్ తరహా పాత్రలు బాగా పేరు తెచ్చాయని చెప్పొచ్చు. కార్తీ 'నా పేరు శివ', విశాల్ 'పొగరు' లాంటి సినిమాలు చూస్తే మీకు ఈమె కనిపిస్తుంది. అలానే తెలుగులో 'వసుంధర', 'ఇది కథ కాదు', 'తాళి కట్టు శుభవేళ' లాంటి సీరియల్స్లోనూ నీలిమ సందడి చేసింది. వ్యక్తిగత జీవితానికి వస్తే.. తమిళ సినిమాల్లోనే అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్న ఎసాయి వానన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే చాలారోజుల తర్వాత ఈమె ఫొటో, సోషల్ మీడియాలో కనిపించడంతో తొలుత మనోళ్లు గుర్తుపట్టలేకపోయారు. ఐడియా వచ్చిన తర్వాత ఈమె ఆమెనే కదా అని మాట్లాడుకున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) View this post on Instagram A post shared by Neelima Rani (@neelimaesai) -
ఇప్పటివరకు ఒక లెక్క ఇకమీదట ఒక లెక్క అంటున్న హీరోయిన్
వైవిధ్యభరిత పాత్రలతో సత్తా చాటుతున్న నటి వసుంధర. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన పేరాన్మై చిత్రంలో జయంరవితో కలిసి నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఈ భామ ఒకరు. ఈ సినిమా తరువాత పలు చిత్రాల్లో కథానాయికగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా విభిన్న కథా చిత్రాల దర్శకుల ప్రాజెక్టుల్లోనూ నటించేలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. అలా ఈ ఏడాది కన్నై నంబాదే, తలైకూత్తల్ అనే రెండు సినిమాలతో పాటు మోడ్రన్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. కాగా వసుంధర ఇప్పుడు మళ్లీ బిజీ నటిగా మారారు. ఇప్పటి వరకు సెలక్టివ్ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు. ఇక నుంచి పాత్రల ఎంపికలో తన నిబంధనలను మార్చుకుంటున్నానంటున్నారు. ఇంతకుముందు ప్రతి నాయికగా నటిస్తే ప్రేక్షకుల్లో చెడు ఇమేజ్ క్రియేట్ అయ్యేదని, మారుతున్న కాలంలో అలాంటి పాత్రలను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అందుకు తన అభిమాన నటి రమ్యకృష్ణనే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆమె ఇటీవల పాజిటివ్, నెగెటివ్ పాత్రల్లోనూ సత్తా చాటుతున్నారన్నారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలతో బోర్ కొడుతోందని, విలనిజంతో నటనా ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. తాను ఇప్పుడు అలాంటి చాలెంజింగ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలా ప్రస్తుతం ఒక మల్టీస్టారర్ చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇది మహిళల ఇతివృత్తంతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పబ్ గోవా వెబ్సీరీస్ ఫేమ్ లక్ష్మీనారాయణన్రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. దీనితో పాటు ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. తన పుట్టిల్లు తమిళనాడు అని, అయితే ఇకపై తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Vasundhara (@ivasuuu) చదవండి: నటి విచిత్రను ఇబ్బంది పెట్టిన తెలుగు హీరో ఎవరు.. కమల్ ఈ సాహసం చేయగలరా? -
21 ఏళ్లకే విడాకులు.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: నటి
పైకి నవ్వుతూ ఉన్నంతమాత్రాన వారి జీవితాలు సంతోషంగా సాగిపోతున్నట్లు కాదు. కొందరు అంతులేని విషాదాన్ని, దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకుని బయటకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. నలుగురినీ నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. తమిళ యాంకర్, నటి స్వర్ణమాల్య కూడా అదే కోవలోకి వస్తుంది. యుక్త వయసులోనే ఎన్నో కష్టాలను చూసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. 21 ఏళ్లకే విడాకులు.. కారణం తెలీదు 'నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు యూత్ ఇన్నొవేషన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అప్పుడు కొంత బెరుకు ఉండేది. నిజానికి నేను ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటాను. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేశారు. కానీ అది ఎంతోకాలం నిలవలేదు. 21 ఏళ్లకే విడాకులు అయిపోయాయి. అప్పుడతడి వయసు 25. ఆ వయసులో మాకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది కూడా పెద్దగా తెలియదు. బహుశా అమెరికా లైఫ్స్టైల్ నాకు వంటపట్టలేదేమో! డిప్రెషన్, చచ్చిపోదామనుకున్నాను ఈ విడాకుల వల్ల నాకన్నా నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడ్డారు. చదువులపై ధ్యాస పెడితే ఈ బాధ నుంచి బయటపడొచ్చన్నారు. ఈ బ్రేకప్, కొట్లాటల వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాను. జీవితం అంటే ఇదేనా? ఎందుకు బతకాలి? అని విరక్తి చెందాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి చూడలేక నా సోదరి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి రెండు నెలలు పట్టింది' అని చెప్పుకొచ్చింది. కాగా యాంకర్గా కెరీర్ ప్రారంభించిన స్వర్ణమాల్య తర్వాత నటిగానూ మారింది. మణిరత్నం దర్శకత్వం వహించిన అలైపుతే సినిమాలో ఓ పాత్రలో నటించింది. నటన, యాంకరింగ్.. రెండింటిలోనూ ఆరితేరిన ఆమె ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతోంది. నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: కొత్తింట్లో దీపావళి.. పేరెంట్స్కు ఖరీదైన గిఫ్ట్.. ఎంతైనా ఆమె మనసు బంగారం! -
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ కోలీవుడ్ నటి ఇంట్లో విషాదం నెలకొంది. నటి బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మృతి చెందారు. విఘ్నేష్ వయస్సు 40 ఏళ్లు కాగా.. ప్రస్తుతం చెన్నైలోని సాలిగ్రామం దశరథపురం అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న విఘ్నేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబిలోనా సోదరుడిని కొద్ది రోజుల క్రితం చెన్నైలోని వలసరవాక్కంలో సాధారణ పెట్రోలింగ్లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేష్కు క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలోనూ అతను అనేక నేరాలకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. నటి బాబిలోనా శాస్త్ర (2000), ఇష్క్ కా ఆచార్ (2004), లెవెల్ క్రాస్ (2002) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నిర్మలా ఆంటీ అనే చిత్రంలో కనిపించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి కాగా.. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. -
జై భీమ్ నటి హీరోయిన్గా కొత్త సినిమా.. థ్రిల్లర్ కాన్సెప్ట్తో..
విభిన్న కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నటుడు శశికుమార్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన అయోత్తి చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన కళుగు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సత్య దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా జైభీమ్ చిత్రం నటి లిజోమోల్ జోస్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సుదేవ్నాయర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా శరవణన్, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ మాళవిక, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయగణపతి పిక్చర్స్ పతాకంపై పాండియన్ పరశురాం నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 1990 ప్రాంతంలో జరిగే కథాచిత్రంగా ఉంటుందన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. నటుడు శశికుమార్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, కథ, కథనం, నేపథ్యం కొత్తగా ఉంటుందని, త్వరలోనే టైటిల్ ప్రకటించి చిత్ర టీజర్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: ‘భగవంత్ కేసరి’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.. కాజల్ కంటే ఎక్కువే! -
ప్రముఖ నటి, దర్శక నిర్మాత కన్నుమూత
కోలీవుడ్ సీనియర్ నటి, దర్శక నిర్మాత జయదేవి (65) చైన్నెలో కన్నుమూశారు. తొలుత డాన్సర్గా జీవితాన్ని ప్రారంభించిన జయదేవి ఆ తరువాత నటిగా ఇదయ మలర్, సాయ్ందాడమ్మా సాయ్ందాడు,వాళ నినైత్తాళ్ వాళలామ్,సరిమాన జోడీ, రజనీకాంత్తో గాయత్రీ అనే చిత్రంలోనూ నటించారు. ఆ తరువాత నిర్మాతగా మారి మట్రవై నేరిల్, వా ఇంద పక్కమ్, నండ్రీ మీండుమ్ వరుగై తదితర చిత్రాలను నిర్మించారు. వా ఇంద పక్కమ్ చిత్రం ద్వారా పీసీ శ్రీరామ్ను ఛాయాగ్రహకుడిగా పరిచయం చేసిన ఘనత ఈమెదే. ఆ తరువాత నలమ్ నలమాగియ ఆవల్, విలాంగు మీన్, పాశం ఒరు వేషం వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు వేలు ప్రభాకరన్ను పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత విడిపోయారు. స్థానిక పోరూర్లోని సమయపురత్తిల్ వీధిలో నివశిస్తున్న జయదేవి కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిశారు. జయదేవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
సమంతలాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే! హీరోయిన్ ప్రియా బాజ్పేయ్, కల్పికా గణేశ్ సైతం మయోసైటిస్తో పోరాడుతున్నట్లు ఆ మధ్య వెల్లడించారు. వారిలాగే తాను కూడా ఓ అరుదైన వ్యాధితో పోరాడుతున్నానంటోంది నటి వనితా విజయ్ కుమార్. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చాలా ఏళ్ల నుంచి క్లాస్ట్రోఫోబియాతో సతమతమవుతున్నట్లు పేర్కొంది. దీనివల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండాలంటేనే భయమేస్తోందని చెప్పుకొచ్చింది. లిఫ్ట్, వాష్రూమ్ వంటి చిన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండలేనంది. కిటికీలు లేని గదుల్లో, జన సమూహాల్లో ఊపిరాడని భావనను ‘క్లాస్ట్రోఫోబియా’ అంటారు. గతంలో సంపూర్ణేశ్ బాబు సైతం బిగ్బాస్ షోలో ఈ భావనతో బాధపడ్డాడు. ఇకపోతే తమిళ బిగ్బాస్ మూడో సీజన్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది వనితా విజయ్కుమార్. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. ఆమె కూతురు జోవిక సైతం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏడాదిపాటు శిక్షణ సైతం తీసుకుంది. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు, గుర్తింపు రావట్లేదని చనిపోదామనుకున్నా -
'ఆంధ్రావాలా' నటి జీవితంపై వెబ్ సిరీస్.. తనే డైరెక్ట్ చేస్తుందట!
ఎవరిదైనా బయోపిక్ను తెరకెక్కించాలంటే అందుకు తగిన ఘన చరిత్ర ఉండాలి. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే సంఘటనలు ఉండాలి. అలాంటి పలు చిత్రాలు తెరకెక్కి సక్సెస్ అయ్యాయి కూడా. ఇందిరాగాంధీ, క్రీడాకారుడు ఎంఎస్.ధోని వంటివి అలా రూపొందిన చిత్రాలే. కాగా తాజాగా శృంగార తారగా ముద్రపడ్డ నటి సోనా బయోపిక్ను వెబ్ సిరీస్గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కుశేలన్ చిత్రంలో వడివేలుకు భార్యగా నటించి గుర్తింపు పొందిన బోల్డ్ లేడీ సోనా. అదే విధంగా గురు ఎన్ ఆళు, అళగర్ మలై, ఒంబదుల గురు, జిత్తన్– 2 మొదలగు పలు తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆంధ్రావాలా, కథానాయకుడు, విలన్, ఆయుధం వంటి సినిమాలు చేసింది. తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించి గుర్తింపు పొందిన సోనా నిర్మాతగానూ మారి అమ్మా క్రియేషన్స్ టీ.శివతో కలిసి కనిమోళి అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా మరో చిత్రాన్ని కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టినా అది పలు సమస్యల కారణంగా తెరకెక్కలేదు. అలాంటిది తాజాగా తన జీవిత చరిత్రలోని ఒక భాగాన్ని వెబ్ సిరీస్గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సోనానే దర్శకత్వం వహించనున్నారట. దీనికి స్మోక్ అనే టైటిల్ను నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇందులో తను నటించకుండా మరో నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. చదవండి: 'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్ -
ప్రేమ పేరుతో మోసం.. ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగట్లే: నటి ఆవేదన
తమిళ నటి, తెలుగులో 'హనుమాన్ జంక్షన్' సినిమాలో నటించిన విజయలక్ష్మి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమన్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. మోసం చేయడమే కాకుండా తనను బెదిరింపులకు గురి చేస్తున్న అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను వేడుకుంది. అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతూ.. 'నేను సీమన్పై గతంలోనూ ఫిర్యాదు చేశాను. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి నేను పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నాను. అంతకుముందున్న ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టలేదు' అని పేర్కొంది. సహజీవనం.. ముఖం చాటేసిన సీమన్ కాగా విజయలక్ష్మి.. సీమన్పై గతంలోనూ ఈ ఆరోపణలు చేసింది. 2007-2009 వరకు సీమన్, తాను సహజీవనం చేశామని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పెళ్లికి విముఖత వ్యక్తం చేశాడంది. పైగా తనపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో చెన్నై కమిషనర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ సీమన్ సెటిల్మెంట్కు రావడంతో కేసు విత్డ్రా చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మాత్రం మీడియా ముందు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడాడంటూ మరోసారి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యాయత్నం అయితే విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో 2020లో విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో సీమన్, ‘పనన్కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తన చావుకు కారణమైనవాళ్లను వదిలిపెట్టొద్దంటూ ఓ వీడియో పోస్ట్ చేసి మరీ సూసైడ్కు యత్నించింది. అయితే సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం నుంచి బయటపడింది. చదవండి: ఆమె మోజులో హీరో.. అతడినే గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్.. అప్పుడు డిప్రెషన్లో.. ఇప్పుడు నడవలేని స్థితిలో.. వడివేలు ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే.. -
ప్రేమ పెళ్లి, కొన్ని వారాలకే విడాకులు.. కొత్త కారు కొన్న నటి
పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. ఆ తర్వాత ఉండదని చాలామంది అంటుంటారు. ఏళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి మనసారా ప్రేమించుకున్న జంటపక్షులు పెళ్లి తర్వాత మాత్రం సడన్గా మారిపోతారు. అప్పటిదాకా ఒకరిపై మరొకరు కురిపించుకున్న ప్రేమ.. మెడలో మూడు ముళ్లు పడ్డ తర్వాత మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ప్రేమ స్థానంలో గొడవలు, విభేదాలు మొదలవుతాయి. అది చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకూ వెళ్తాయి. ఇప్పుడు చెప్పుకునే బుల్లితెర జంట కూడా అదే జాబితాలోకి వస్తుంది. సీరియల్తో మొదలైన ప్రేమకథ సంయుక్త.. తర్వాతి కాలంలో తన పేరును సంయుతగా మార్చుకుంది. సంయుత-విష్ణుకాంత్ సిప్పినీల్ ముత్తు సీరియల్లో కలిసి నటించారు. అప్పుడే వీరి చూపులు, మనసులు కలిశాయి. కొంతకాలం పాటు ప్రేమ జర్నీని ఎంజాయ్ చేసిన వీరు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అప్పుడు మొదలైంది అసలు సమస్య. ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చలేదు. నెల రోజులకే విభేదాలు మొదలయ్యాయి. సర్దుకుపోదామనుకున్నారు, కుదర్లేదు.. మరో నెలరోజులకు విడిపోతున్నట్లు ప్రకటించారు. తన భార్య.. మాజీ ప్రియుడు విజయ్తో ఇంకా టచ్లో ఉందని ఆడియోక్లిప్ వదిలాడు విష్ణుకాంత్. నటికి పట్టపగలే చుక్కలు చూపించిన భర్త! తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది సంయుత. వీరి విడాకుల వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా సంయుత కొత్త కారు కొనుగోలు చేసింది. 'స్వతంత్రంగా కష్టపడి జీవించగలిగే మహిళకు ఏదైనా సాధ్యమే.. మంచి మనసుతో, సద్భావాలతో ఈ సమాజంలో నెట్టుకురావడం ఒక అమ్మాయికి చాలా కష్టం. మనమేం చేసినా సరే కొందరు అదేపనిగా తిడుతూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మేలు. మనమేంటనేది ఎవరికీ నిరూపించుకోవాల్సిన పని లేదు. కుక్కలను మొరగనివ్వండి.. కుక్కలను అలాగే మొరగనివ్వండి. వాళ్ల మనసులు కుళ్లుకుతంత్రాలతో ఎంత మురికిగా మారిందో వాళ్లకే తెలుసు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఆశయాలపై ఫోకస్ చేయండి. స్వతంత్రంగా జీవించండి. పురుషాహంకారంతో విర్రవీగే వాళ్లముందు బాస్ లేడీగా ధైర్యంగా నిలబడండి. మీరు అందుకునే విజయాలతో వాళ్ల ఆలోచన తప్పని వారికే అర్థమయ్యేలా చేయండి. ఒంటరిగా తనకాళ్లపై తను నిలబడి బతుకుతున్న ప్రతి మహిళకు ఈ పాజిటివ్ వైబ్స్ అందిస్తున్నాను' అని రాసుకొచ్చింది. దీనికి తన కొత్త కారు వీడియోను జత చేసింది. మూడేళ్ల కష్టార్జితం ఇది చూసిన కొందరు.. భర్తను వదిలేసి జల్సా చేస్తున్నావా? నువ్వేదో రోల్స్ రాయిస్ కారు కొన్నట్లు బిల్డప్ ఇస్తున్నావే అని కామెంట్లు చేశారు. దీనికి సంయుత స్పందిస్తూ.. 'నేను మూడేళ్లు కష్టపడి మొదటిసారి ఓ కారు కొన్నాను. ఇది మిగతావారికి గొప్ప విషయం కాదేమో కానీ నాకు మాత్రం అద్భుతమైనదే! అయినా నీ పని నువ్వు చేసుకోకుండా ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడం నీకవసరమా?' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Samyutha (@samyutha.official) View this post on Instagram A post shared by Samyutha (@samyutha.official) చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్ -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? 20 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇప్పుడేమో
టాలీవుడ్లో హీరోయిన్లకు అస్సలు కొదవ ఉండదు. ఎందుకంటే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బ్యూటీస్ వస్తూనే ఉంటారు. అదే టైంలో పాతవాళ్లు మెల్లగా సైడ్ అవుతుంటారు. అయితే తెలుగు ప్రేక్షకులు అందరినీ గుర్తుపెట్టుకుంటారు. చాలా రోజుల తర్వాత కనిపించినా సరే గుర్తుపడతారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్గా చేసింది. చాలారోజుల తర్వాత ఇప్పుడు కనిపించి సర్ప్రైజ్ చేసింది. మరి ఎవరో గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలియాలంటే మీరు 90స్ కిడ్ అయ్యిండాలి. ఎందుకంటే శ్రీకాంత్ హీరోగా నటించిన 'ఒట్టేసి చెబుతున్నా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అన్నట్లు ఈమె పేరు చెప్పడం మరిచిపోయా కదూ.. దివ్య వెంకటసుబ్రహ్మణ్యం. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక స్క్రీన్ నేమ్ కనిహ అని పేరు మార్చుకుంది. రవితేజ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' చిత్రంలోనూ చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత మరో తెలుగు మూవీలో నటించలేదు. మధురైలో పుట్టి పెరిగిన కనిహ.. తొలుత సింగర్ గా పేరు తెచ్చుకుంది. 2001లో మిస్ చెన్నై ఈవెంట్ లో పాడాల్సింది. కానీ ఓ కంటెస్టెంట్ రాకపోవడంతో ఆమె ప్లేస్ లో ఈమె పాల్గొంది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ విజేతగా నిలిచింది. అలా సినిమాల్లోకి వచ్చేసింది. కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్న ఈమె.. 2008లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు 41 ఏళ్లు. అయినాసరే గ్లామర్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలే దీనికి ఎగ్జాంపుల్. మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Kaniha (@kaniha_official) View this post on Instagram A post shared by Kaniha (@kaniha_official) (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) -
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!
నటీనటులు అనగానే కోట్లకు కోట్లు గడిస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ అదృష్టం తక్కువమందికి దక్కుతుందనేది నిజం. హీరోహీరోయిన్ల తప్పితే మిగతావాళ్లకు ఇచ్చే డబ్బులు తక్కువగానే ఉంటాయి. ఇక సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లయితే చాలావరకు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. సోమవారం వేకువజామున 2:15 గంటలకు చనిపోయింది. (ఇదీ చదవండి: పునీత్ రాజ్కుమార్ కుటుంబంలో విషాదం) తెలుగమ్మాయి అంజలి నటించిన 'షాపింగ్మాల్' సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీలో సింధు(44) అనే నటి కూడా ఓ పాత్ర చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. అసలే మధ్య తరగతి జీవితం.. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. కొన్నిరోజుల ముందు ఆరోగ్యం మరింత విషమించడంతో చేసేదేం లేక కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సింధు చేరింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటి అయినప్పటికీ సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఈమెని కబళించేసి, కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి
కోలీవుడ్లో పాపులర్ బుల్లితెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా ఆగష్టు 2న మరణించాడు. ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా హార్ట్ అటాక్తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. (ఇదీ చదవండి: వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్) శ్రుతి షణ్ముక ప్రియ నాదస్వరం, భారతి కణ్ణమ్మ, వాణిరాణి, పూనూంజల్ లాంటి తమిళ సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది. గతేడాది ఆరవింద్ను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది. భర్త మరణంతో పుట్టెడు శోకంలో ఉన్నా కూడా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఒక విజ్ఞప్తి చేశారు. అరవింద్ మృతితో దుఃఖంలో ఉన్న తనను ఓదార్చేందుకు ఫోన్లు, మెసేజ్లు పంపిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలా చెప్పుకొచ్చారు. 'అరవింద్ నాతోనే ఉంటాడు, ఎప్పుడూ మాతోనే ఉంటాడు. ఇలాంటి సమయంలో కూడా ఈ వీడియోను ఎందుకు పోస్ట్ చేస్తున్నానో మొదట మీకు చెప్తాను. అరవింద్ మరణానికి సంబంధించి అసలు ఏం జరిగిందో తెలియని వారు దీనిని సమాచారంగా కూడా తీసుకోవచ్చు. కానీ కొంతమంది యూట్యూబర్లకు నిజం ఏమిటో తెలియదు వాళ్లందరూ రకరకాల పుకార్లను ప్రచారం చేస్తున్నారు. (ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్) అతనొక సివిల్ ఇంజనీర్, ఫ్యాషన్ కోసం బాడీబిల్డర్ కూడా. ఆయన గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా తెలిపారు. కానీ యూట్యూబర్లు మాత్రం పలు రకాలైన థంబ్నైల్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అతని మరణానికి కారణం అసలు విషయం తెలిసికూడా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తప్పుగా ప్రచురించడం న్యాయం కాదు. ఇంట్లో అందరం పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. మీ వ్యూవ్స్, లైకుల కోసం మమ్మల్ని వేధించకండి.' అని శ్రుతి షణ్ముగ ప్రియ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Sruthi Shanmuga Priya (@sruthi_shanmuga_priya) -
గతేడాది ప్రియుడితో పెళ్లి.. ఇంతలోనే నటికి పుట్టెడు శోకం..
తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగప్రియ జీవితంలో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త అరవింద్ శేఖర్(30) ఆగస్టు 2న గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆమె ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా శృతి, అరవింద్ శేఖర్ కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. గతేడాది మే నెలలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. పెళ్లయిన ఏడాదికే భర్త చనిపోవడంతో శృతి గుండెలవిసేలా రోదిస్తోంది. కాగా శృతి.. నటస్వరం సీరియల్తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. వాణి రాణి, కల్యాణ పరిసు, పొన్నుచల్, భారతీ కన్నమ్మ వంటి పలు హిట్ ధారావాహికల్లో నటించింది. సీరియల్స్ చేస్తున్న సమయంలో బాడీ బిల్డర్ అరవింద్ శేఖర్తో లవ్లో పడ్డ ఈమె అతడితో కలిసి రీల్స్ చేస్తూ ఉండేది. వీరిని అభిమానులు ముచ్చటైన జంటగా అభివర్ణించేవారు. ఇంత చిన్న వయసులో అరవింద్ మరణించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. Rest in peace #ArvindShekar 💔 Condolences to #ShrutiShanmugaPriya Sister pic.twitter.com/H93GSJ1x5q — Kollywood Cinima (@KollywoodCinima) August 3, 2023 View this post on Instagram A post shared by Sruthi Shanmuga Priya (@sruthi_shanmuga_priya) View this post on Instagram A post shared by Sruthi Shanmuga Priya (@sruthi_shanmuga_priya) చదవండి: బేబీకి అదిరిపోయే ఆఫర్.. ఆ యంగ్ హీరోతో జోడీ కట్టనున్న వైష్ణవి! -
చేసింది రెండే సినిమాలు.. క్యూ కడుతోన్న ఆఫర్లు!
కోలీవుడ్ భామ అదితి శంకర్కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కూతురిగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర సక్సెస్ అదితి శంకర్కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత శివ కార్తికేయన్తో జతకట్టిన మావీరన్ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది. (ఇది చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) తాజాగా ఈ భామ అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సెల్వరాగం దర్శకత్వంలో తెరకెక్కనున్న 7జి రెయిన్బో కాలనీ–2లో ఈ చిన్నదే నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా అదితి శంకర్కు మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా అప్డేట్. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ కుమార్ తాజాగా నటుడు విష్ణు విశాల్ హీరోగా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలోనూ అదితి శంకర్ నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆయన తెలుపుతూ నటి అదితి శంకర్ తమ చిత్ర కథను విన్నారని ఆమె ఇందులో కథానాయకగా నటించనున్నారని తెలిపారు. కాగా ఇంతకుముందు విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన ముండాసు పట్టి, రాక్షసన్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్కు సిద్ధం అవుతోందన్నమాట. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్! ) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
'సినిమా కోసం సెలక్ట్ అయ్యా అనుకునేలోపు డైరెక్టర్ తేడాగా మాట్లాడాడు'
యూట్యూబర్ నుంచి నటిగా, అక్కడి నుంచి హోస్ట్గా పలు అవతారాలెత్తింది వీజే దీపిక. ఈ తమిళ బుల్లితెర నటికి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగే ఉంది. పాండియన్ స్టోరీస్ సీరియల్తో ఈమెకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. తాజాగా ఆమె ఓ ఆడిషన్లో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. 'రాఘవ లారెన్స్ సినిమాలో అతడి చెల్లెలి పాత్ర కోసం ఆడిషన్కు వెళ్లాను. డైరెక్టర్ నన్ను ఓకే చేయడంతో ఎగిరి గంతేశాను. అయితే సినిమాలో ఓ ముద్దు సీన్ ఉంటుందని, ఇప్పుడు దాన్ని ఓసారి రిహార్సల్ చేసి చూపించమని అడిగాడు. ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఆడిషన్స్లో ముద్దు సీన్ చేసి చూపించడమేంటని నేను చేయనన్నాను. కానీ డైరెక్టర్ నాపై ఒత్తిడి తెచ్చాడు. ఇది నీకు మంచి అవకాశం, ఛాన్స్ చేజారుతుంది, నీ ఇష్టం అని మాట్లాడాడు. నాకు అతడి మాటతీరు, ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. అతడు చెప్పినట్లు చేయకపోతే ఆడిషన్కు వచ్చినవారిలో ఎవరో ఒకరిని సెలక్ట్ చేసుకుంటానని దురుసుగా మాట్లాడాడు. ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఎంతగానో మధనపడ్డాను' అని చెప్పుకొచ్చింది దీపిక. కాగా 2018లో వచ్చిన పాండియన్ స్టోరీస్ సీరియల్తో వీజే దీపిక వార్తల్లో నిలిచింది. ఇందు సుజిత, స్టాలిన్ సహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దీపిక యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. చదవండి: 9వ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్ నాకు ప్రెగ్నెంట్ అవాలనుంది: గేమ్ ఛేంజర్ హీరోయిన్ -
బర్త్డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్ అయిపోయింది. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ కూడా చేశారు నెటిజన్లు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) వారి పెళ్లి అయి రెండేళ్లు దాటింది.. ఈ జర్నీలో వారిద్దరిపై భారీగానే ట్రోలింగ జరిగింది. ఒకసారి అయితే ఏకంగా ఈ జంట విడాకులు తీసుకుంటుందని ప్రచరాం జరిగింది. పెళ్లి అయి అన్నేళ్లైనా ఇంకా ఎందుకు తల్లివి కాలదేని ఇలా పలు రకాలుగా ఆ జంటపై పలు కామెంట్లు వచ్చేవి. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నామని బహిరంగానే ఆ జంట చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్రముఖ సింగర్తో అనిరుధ్ ప్రేమాయణం) తాజాగా రవీందర్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు 6 అడుగుల ప్రత్యేక బహుమతిని ఇచ్చి మహాలక్ష్మి ఆశ్చర్య పరిచింది. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో కూడా పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక బహుమతి ఏమిటంటే... 6 అడుగుల ఎత్తు ఉన్న రవీంద్ర ఫోటోను చక్కటి పెయింటింగ్తో తయారు చేయించి తన భర్తకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. మహాలక్ష్మి బర్త్డే విషెష్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసింది. 'జీవితంలో నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు లైక్లతో పాటు పాజిటివ్ కామెంట్లు పెట్టారు. పలువురు రవీందర్కు విషెస్ చెబుతూ.. చెత్తగ మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఇలా సంతోషంగా జీవితంలో ముందుకు సాగాలని కోరారు. -
అక్కడ చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి.. అంతే కానీ: నటి బోల్డ్ కామెంట్స్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో తరచుగా ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు తమ కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతుంటారు. అంతేకాకుండా ఇటీవల హీరోయిన్స్ ఎక్కువగా వేధింపులకు గురైనట్లు మన వింటుంటాం. కానీ ఇటీవల ఓ బుల్లితెర మహిళల పట్ల వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేఖా నాయర్ మహిళల డ్రెస్ కోడ్ పట్ల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!) తమిళంలో టీవీ సీరియల్స్లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్బాస్ సీజన్-7లో కంటెస్టెంట్గా పాల్గొంది. అయితే తాజాగా మహిళల పట్ల ఆమె చేసిన కామెంట్స్పై మండిపడుతున్నారు. రేఖా నాయర్ మహిళల డ్రెస్ కోడ్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇటీవల మహిళలు చాలా సెక్సీ డ్రెస్సులు ధరిస్తున్నారు. అందువల్లే అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నారంటారా? ఈ విషయంలో మరీ మీ సంగతి ఏంటి? అని యాంకర్ ఆమెను ప్రశ్నించింది. దీనికి రేఖ సమాధానమిస్తూ.. 'అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి. అంతే కానీ ఏదో జరిగిపోయిందంటూ నానా హడావుడి చేయొద్దు. ఈ విషయంలో అమ్మాయిలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నేను వేసుకునే డ్రెస్ గురించి చాలా మంది లేడీస్ అడుగుతుంటారు. కానీ ఎవరైనా వ్యక్తి నా నడుముపై చేయి వేస్తే నేను కోప్పడను.. ఆనందిస్తా. నేను చీర కట్టుకుంటే నా నడుము కనిపిస్తుంది. బస్సులో వెళ్లినా ఎవరైనా చేయి వేస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ రాదు. ఈ రోజుల్లో మహిళలు ఇలాంటి మనసత్వాలను దూరం చేసుకోవాలి. నేను జాగింగ్ చేసినా, ఏదైనా పోటీలో పాల్గొన్నా నడుము కనిపించే డ్రెస్సులే వేసుకుంటా. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.' అంటూ వివాదస్పద కామెంట్స్ చేసింది. అంతేకాకుండా అమ్మాయిల డ్రెస్సులను మెచ్చుకునేది కేవలం అబ్బాయిలు మాత్రమేనన్నారు. అయితే ఆమె మాటలను కొందరు ప్రశంసించగా.. మహిళలు మాత్రం మండిపడుతున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
ప్రమాదంలో చిక్కుకున్న హీరోయిన్.. అందుకే నాకు ఛాన్స్: నటి
చాలా మంది నటీమణులకు హీరోయిన్ కావడానికి మోడలింగ్ ఒక మంచి మార్గంగా మారుతుంది. తాజాగా కథానాయికగా అవతారమెత్తిన మోడల్ డాలీ ఐశ్వర్య. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 23 గంటల్లో తెరకెక్కించిన కళైంజర్ నగర్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం కానుంది. ఆ చిత్రం తర్వాత ఇప్పుడు వరుసగా పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. దీని గురించి డాలీ ఐశ్వర్య తెలుపుతూ నటనపై ఆసక్తి కలగడంతోపాటు నటిగా మారడానికి మోడలింగ్ రంగాన్ని మార్గంగా ఎంచుకున్నానని చెప్పింది. ఇంతకుముందు ఒక షార్ట్ ఫిలింలో నటించానని చెప్పింది. ఇక కళైంజర్ నగర్ చిత్రంలో నటించే అవకాశం అనుకోకుండా వచ్చిందని తెలిపింది. ఈ చిత్రంలో నటించాల్సిన నటి అనుహ్యంగా ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆ అవకాశం తనను వరించిందని పేర్కొంది. రెండో రోజే షూటింగ్ అని చెప్పడం, అది 23 గంటల్లోనే రూపొందిస్తున్న రికార్డ్ చిత్రం కావడంతో ఇందులో నటించడానికి ఆందోళన చెందానంది. అయితే స్క్రిప్ట్ చదవగానే నమ్మకం కలిగిందని పేర్కొంది. ఒకే రోజులో 19 లొకేషన్లలో షూటింగ్ను నిర్వహించడంతో ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్కు మారడానికి 10, 15 నిమిషాలు మాత్రమే సమయం ఉండేది అని చెప్పింది. యూనివర్సల్ జీనియస్ అనే రికార్డు కోసం ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది. ఇలా తన తొలి చిత్రమే ఒక రికార్డు చిత్రం కావడం సంతోషంగా ఉందని పేర్కొంది. దీంతోపాటు ఇప్పుడు 2 ఇరైవిల్ కంగల్ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రం, హ్యాపీ బర్త్డే జూలీ అనే మరో థ్రిల్లర్ కథా చిత్రం, కడైసీ తోట అనే క్రైమ్ కథా చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. ఇలా వివిధ నేపథ్యాలతో కూడిన కథా చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ఆనందంగా ఉందని వెల్లడించింది. పెద్ద పెద్ద సంభాషణలు కలిగిన సాహసోపేతమైన కథాచిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది. View this post on Instagram A post shared by Dolly Aish Babiee (@iaishwarya__official) చదవండి: చంపేస్తున్నానని బెదిరిస్తున్నాడు: హీరోయిన్ -
48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్
తమిళ హాస్యనటి శర్మిలి 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. 40 ఏళ్ల వయసులో ఐటీ ప్రొఫెషనల్ను పెళ్లి చేసుకున్న ఆమె తల్లిగా ప్రమోషన్ పొందే రోజు కోసం ఎదురు చూస్తోంది. నటి వనితా విజయ్ కుమార్.. శర్మిలిని ఇంటర్వ్యూ చేయగా ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన భర్త ఓపక్క ఐటీరంగంలో పనిచేస్తూనే మరో పక్క లాయర్గానూ విధులు నిర్వహిస్తున్నాడంది. అలాగే లాయర్ నుంచి జడ్జిగా మారేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఏ విషయంలోనైనా భర్త అండగా ఉంటాడని చెప్తున్న కమెడియన్.. తనకు డెలివరీ అయిన తర్వాత తిరిగి సినిమాలు, సీరియల్స్లోకి రీ ఎంట్రీ ఇస్తానని చెప్తోంది. ఈ నిర్ణయంపై వనితా విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే 48 ఏళ్ల వయసులో తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకుంటున్న శర్మిలిని అభినందించింది వనిత. చదవండి: యాసలందు అన్ని యాసలు లెస్స -
ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!
బుల్లితెర నటి రచిత మహాలక్ష్మి తన భర్త దినేశ్ కార్తీక్ బెదిరిస్తున్నాడంటూ చెన్నై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులుగా తనకు ఫోన్లో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని ఆరోపించింది. పదే పదే మెసేజ్లు చేస్తూ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. మంగళవారం అర్ధరాత్రి రచిత పోలీసులను ఆశ్రయించిందన్న విషయం తెలుసుకున్న దినేశ్ వెంటనే సదరు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అంతగా కావాలనుకుంటే రచిత కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవచ్చని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా పిరివం సంతిప్పమ్ సీరియల్లో దినేశ్ కార్తీక్, రచిత మహాలక్ష్మి జంటగా నటించారు. ఆన్స్క్రీన్లో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న వీళ్లు ఆఫ్ స్క్రీన్లోనూ ప్రేమలో పడ్డారు. దీంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో అప్పటినుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే నటుడు దినేశ్ మాత్రం ఎప్పటికైనా గొడవలు సద్దుమణిగి కలిసుంటామని ఆశిస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రచిత క్లోజ్ ఫ్రెండ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ జీజీ కూడా గతంలో దినేశ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సలహా వల్లే రచిత దినేశ్తో విడిపోయిందని అతడు పలు ఇంటర్వ్యూలతో చెప్తున్నాడని ఆరోపించింది. తన వల్లే విడిపోయారని లేనిపోని అభాండాలు వేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇకపోతే రచితా మహాలక్ష్మి పిరివమ్, సంతిప్పం ఇళవరసై, శరవణన్ మీనాక్షి(వరుసగా మూడు సీక్వెల్స్లోనూ తనే నటించింది), నాట్యపురం వంటి సీరియల్స్లో ప్రధాన పాత్రలు పోషించింది. తెలుగులో స్వాతి చినుకులు సీరియల్లో నటించింది. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొంది. పారిజాత అనే కన్నడ చిత్రంలో, ఉప్పు కరువద అనే తమిళ చిత్రంలోనూ నటించింది. చదవండి: బ్యాచ్లర్ లైఫ్కు గుడ్బై.. పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ విలన్ -
సినిమాల్లో సక్సెస్ కాలేనని ఎగతాళి చేశారు: నటి
ఇతర రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మహిళలు పురుషులకు ధీటుగా సత్తా చాటుకుంటున్నారు. అలా రంజనా నాచ్చియార్ అనే నటి ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఈమె దర్శకుడు బాల సోదరుడి కూతురు.. ఎంఎస్సీ, ఎంటెక్, ఎల్ఎల్బీ పట్టభద్రురాలైన రామనాథపురం సంస్థానం రాజా భాస్కర్ సేతుపతి మనవరాలు కూడా! మొదట నటనపై ఆసక్తితో సినిమాలపై దృష్టి సారించారు. అలా తుప్పరివాలన్, ఇరుంబు తిరై, డైరీ, నట్పే తునై, రజనీకాంత్ నటించిన అన్నాత్తే వంటి పలు చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఇప్పుడు నిర్మాతగా మారి స్టార్ గురు ఫిలిమ్స్ పతాకంపై ఏకకాలంలో రెండు చిత్రాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఒక చిత్రానికి కుట్టి పులి చిత్రం ఫేమ్ శర్వాణి శక్తి, మరో చిత్రానికి విజయ్ టీవీ ఫ్రేమ్ శంకర్ పాండే దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి నిర్మాత రంజనా నాచ్చియార్ మాట్లాడుతూ.. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తాను సినిమాల్లో జయించలేనని చాలామంది అన్నారు. దీంతో నటిగా సక్సెస్ అయిన తాను దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. దానికి ముందుగా నిర్మాతగా మారి అనుభవం గడించాలని భావించానని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని ఆమె చెప్పారు. చదవండి: ఆ బిజినెస్లో కేజీఎఫ్ విలన్ పెట్టుబడి, పెద్ద ప్లానే వేశాడుగా -
కాబోయే భర్తను పరిచయం చేసిన 'విజిల్' నటి
తమిళ నటుడు రోబో శంకర్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తనకు కాబోయే భర్తను సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది. డైరెక్టర్ శంకర్తో తరచూ రీల్స్ చేస్తున్న ఇంద్రజ అతడితోనే ఏడడుగులు వేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుడిలో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు పెళ్లి చేసుకున్నారా? అని అడిగారు. దీనికి ఇంద్రజ స్పందిస్తూ.. పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదని, ఆ పని పూర్తవగానే త్వరలోనే వెడ్డింగ్ డేట్ చెప్తానంది. కాగా ఇంద్రజ బిగిల్(తెలుగులో విజిల్) సినిమాలో ఫుట్బాలర్ పాండియమ్మగా నటించింది. ఇందులో ఆమె నటించిన కామెడీ, సెంటిమెంట్ సీన్లకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె సర్వైవర్ అనే షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆమె కార్తీ విరుమాన్ సహా పలు సినిమాలతో బిజీగా ఉంది ఇంద్రజ. ఆమె తండ్రి రోబో శంకర్ కళక్క పోవదు యారు, అడు ఏడు ఈడు వంటి కామెడీ షోలలో మెరిశాడు. ఇదర్కు తానే ఆశైపట్టై బాలకుమార, వేలైను వందుత వేళ్లైకారన్, ఇరుంబు తిరై, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు. View this post on Instagram A post shared by தொடர்வோம் கார்த்திக் (@dr.thodarvom_karthick) View this post on Instagram A post shared by Ani Anish (@anianishh) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) చదవండి: పంజాబ్ను ఓ ఊపు ఊపిన సింగర్, ఇప్పటికీ వీడని హత్య మిస్టరీ -
నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి
తమిళ సీరియల్స్తో కన్నా వివాదాలతోనే బాగా ఫేమసయ్యాడు నటుడు అర్ణవ్. సహనటి దివ్య శ్రీధర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి అర్ణవ్పై సంచలన ఆరోపణలు చేసింది. అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు గుంచి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది. 10 ఏళ్ల క్రితమే ట్రాన్స్జెండర్తో పెళ్లి ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ ఆడియో క్లిప్పింగ్స్లో ఓ ట్రాన్స్జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి విషయం దాచిన నటి కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది. టీవీ సీరియల్స్లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్కు తెలిసింది. మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది. ఒకరిపై మరొకరు నిందారోపణలు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి దివ్య గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్ణవ్. అటు దివ్య కూడా తన భర్తకు వేరే నటితో సంబంధం ఉందని తెలిసి, షూటింగ్ స్పాట్కు వెళ్లి నిలదీస్తే కొట్టిందని, భర్త కూడా తనపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్పై బయటకు వచ్చాడు. చదవండి: వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు చూశారా? గ్లామర్కు నో చెప్పను, కానీ వల్గారిటీ మాత్రం.. -
తల్లి కాబోతున్న హీరో జీవా ఆన్స్క్రీన్ సిస్టర్
కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. కానీ వారు పోషించిన పాత్రలను మాత్రం జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా శివ మనసులో శక్తి సినిమాలో హీరో జీవా సోదరిగా నటించిన స్నేహ మురళి ఇప్పటికీ తమిళ మీమ్స్లో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. చేసింది ఒక్క సినిమానే అయినా ఆమెకు బోలెడంత పాపులారిటీ వచ్చింది. 2009లో వచ్చిన శివ మనసులో శక్తి ఆమె తొలి చిత్రం. దాదాపు 14 ఏళ్ల తర్వాత గుడ్న్యూస్ చెప్పింది నటి. త్వరలో ఐడీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఇకపోతే స్నేహ మరో శుభవార్త కూడా చెప్పింది. తను తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది. గతేడాది సిద్దార్థ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం నిత్యం టచ్లో ఉంది స్నేహ. View this post on Instagram A post shared by Sneha Murali🧿 (@snehamuralii) View this post on Instagram A post shared by Sneha Murali🧿 (@snehamuralii) చదవండి: రైలు ప్రమాదం.. కమెడియన్ అనుచిత ట్వీట్ -
అమ్మ చనిపోయేముందు నా పేరే కలవరించింది: నటి
సెలబ్రిటీ ప్రేమజంట నరేశ్- పవిత్ర లోకేశ్ జంటగా నటించిన మూవీ మళ్లీ పెళ్లి. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్ ఈ సినిమా ప్రమోషన్స్లోనూ తను నాలుగో పెళ్లి చేసుకుంటానని, పవిత్రతో జీవితం కొనసాగిస్తానని చెప్పాడు. ఇక ఈ మూవీలో నరేశ్ మూడో భార్యగా నటించిన వనితా విజయ్కుమార్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోగా మూడో పెళ్లి చట్టప్రకారం చెల్లదని చెప్పింది. శుక్రవారం (మే 26న) మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వనితా విజయ్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. బిగ్బాస్తో రీఎంట్రీ 'నేను మొదట్లో కొన్ని సినిమాలు చేసి మానేశాను. కొన్నేళ్ల తర్వాత బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్బాస్కు వెళ్లి గెలిచాక తిరిగి స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చాను. తమిళంలో సినిమా అవకాశాలు వచ్చాయి కానీ తెలుగులో మాత్రం రాలేదు. ఓ రోజు గుడికి వెళ్లి ఒక మంచి తెలుగు సినిమా కావాలని అమ్మవారితో చెప్పుకుంటూ ఏడ్చాను. ఆ తర్వాతి రోజే డైరెక్టర్ ఎంఎస్ రాజు ఫోన్ చేసి మళ్లీ పెళ్లి మూవీ ఆఫర్ ఇచ్చాడు. వెంటనే ఓకే చెప్పాను. నా కొడుకు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లా షూటింగ్లో బిజీ ఉండటంతో నా ఫ్రెండ్సే నా పిల్లలను చూసుకున్నారు. నా కుటుంబానికి నేను ఎప్పుడో దూరమయ్యాను. బయటవాళ్లు వచ్చి ఇంట్లో ఏవేవో చేసేయాలని చూసేవారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఆఖరికి నా సొంత కొడుక్కి ఏదేదో చెప్పి బ్రెయిన్వాష్ చేశారు. దీంతో మా నాన్న కూడా అదే నమ్మి వాడిని నా నుంచి కాపాడాలనుకున్నాడు, దూరం చేయాలని చూశాడు. కోర్టు కేసులు కూడా అయ్యాయి. సుప్రీం కోర్టుదాకా వెళ్లి నేనే గెలిచాను. ఈ రాద్ధాంతం జరుగుతున్నప్పుడే రెండో సారి విడాకులు తీసుకున్నాను. అమ్మ చనిపోయాక కష్టాలు.. పోలీసుల సాయం తీసుకుని నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. తమిళనాడులో అడుగుపెట్టనివ్వను అని వార్నింగ్ ఇచ్చాడు. అమ్మ చనిపోయేముందు నా పేరు కలవరించింది. అందరూ తనను మోసం చేయబోతున్నారని గ్రహించిన ఆమె నాకు ఫోన్ చేసి రమ్మంది. నేను ఒక్కదాన్నే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాను. తను మీడియాను, సుప్రీంకోర్టు లాయర్ రామ్ జెఠ్మలానీని పిలువు అని అడిగింది. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, ఇప్పుడివన్నీ చేయలేనని చెప్పాను. నాకు వీలునామా రాస్తానంది. అవన్నీ ఇప్పుడొద్దని చెప్పాను. కానీ అమ్మ చనిపోయాక వాళ్లు నన్ను ముప్పు తిప్పలు పెట్టారు' అని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్. వనితా విజయ్కుమార్ పేరెంట్స్ చదవండి: శ్రీలీల చెంపపై కొట్టిన బాలకృష్ణ, ఏం జరిగిందంటే? -
నటిని పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఆమెను మోసం చేశావంటూ ట్రోల్స్
ఆన్స్క్రీన్ మీద జోడీగా కనిపించినవాళ్లు నిజజీవితంలో కూడా జంటగా ఉండాలనేమీ లేదు. కొన్నిసార్లు వారు ఫ్రెండ్స్గా ఉండొచ్చు, మరికొన్నిసార్లు పరిచయమే లేనట్లుగా కూడా ప్రవర్తించవచ్చు. కానీ తెరపై నటులను జంటగా చూసి ముచ్చటపడిన అభిమానులు రియల్ లైఫ్లో కూడా వారు ఒక్కటైతే బాగుండని కోరుకుంటారు. ఈ క్రమంలోనే సీరియల్స్లో జంటగా నటించేవారికి తరచూ పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి. తెరపై భాగస్వామిగా కనిపించినవారిని పెళ్లి చేసుకోకపోతే కొందరు అభిమానులు హర్ట్ అవుతారు కూడా! తమిళ నటుడు రాజా వేట్రి ప్రభు విషయంలో ఇదే నిజమైంది. అతడికి నటి దీపిక వెంకటాచలంతో నిశ్చితార్థం జరిగింది. ఈ శుభవార్తను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటినుంచి మొదలైంది అసలు సమస్య.. తేజను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నావంటూ కొందరు నెటిజన్లు రాజాపై మండిపడుతున్నారు. ఈ తేజ మరెవరో కాదు.. 'కన కానమ్ కాలంగళ్' సీరియల్లో అతడికి జంటగా నటించింది. ఇదే సీరియల్లో దీపిక కూడా నటించింది. కానీ ఈ సీరియల్లో రాజా- తేజల జోడీకి మంచి పేరొచ్చింది. ఈ రీల్ కపుల్ను రియల్ కపుల్గా చూడాలనుకున్న అభిమానుల ఆశలు ఆవిరి కావడంతో నటుడిపై ఫైర్ అవుతున్నారు. శుభమా అని పెళ్లి చేసుకుంటే ఈ విమర్శల గోలేమిటి అనుకుందో ఏమో కానీ తేజ వెంటనే దీనిపై స్పందిస్తూ.. వారి పెళ్లికి, సీరియల్కు అసలు సంబంధమే లేదని స్పష్టం చేసింది. సీరియల్ వేరు, నిజ జీవితం వేరని, దయచేసి ఎవరూ రాజా, దీపికలను విమర్శించవద్దని కోరింది. వారి పెళ్లి తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొంది. ఇకపోతే రాజా- దీపికల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. శుభాకార్యాలకు నలుపు రంగు దుస్తులను దూరం పెట్టే పద్ధతికి వీడ్కోలు చెప్తూ రిసెప్షన్లో బ్లాక్ డ్రెస్లో మెరిసింది నటి. View this post on Instagram A post shared by Deepika Venkatachalam (@deepika_v__) View this post on Instagram A post shared by Deepika Venkatachalam (@deepika_v__) చదవండి: తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్ -
హీరోయిన్ కిడ్నాప్.. పోలీసుల వెతుకులాట!
హీరోయిన్ సునయన రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కోలీవుడ్లో ఓ వార్త వైరల్గా మారింది. సునయన కిడ్నాప్ అయిందని, పోలీసులు ఆమె గురించి దర్యాప్తు చేస్తున్నారంటూ ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఆచూకీ తెలిసిందని, ఈ కిడ్నాప్ అంతా డ్రామా అని, ఇది సినిమా ప్రమోషన్లో భాగమేనని తెలుస్తోంది. మండిపడుతున్న నెటిజన్లు సునయన ప్రస్తుతం రెజీనా అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డోమిన్ సెల్వ డైరెక్ట్ చేస్తుండగా సతీశ్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగానే సునయన కనిపించడం లేదంటూ పుకారు లేపారు. ఇది నిజమేనని భావించిన అభిమానులు సునయన కోసం ఆందోళన చెందారు. తీరా ఇదంతా ప్రాంక్ అని చెప్పడంతో నెటిజన్లు పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్నారు. అందరినీ కంగారు పెట్టించిన హీరోయిన్తో పాటు సినిమా టీమ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరీ సునయన.. కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది సునయన. ఆ తర్వాత తెలుగులో సమ్థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాలు చేసింది. కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నీర్ పార్వై, సమర్, మాసిలామణి, తేరి, సిలుక్కువార్పట్టి తదితర చిత్రాలతో కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నీర్ పార్వై సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. తమిళ బిగ్బాస్ 4 సీజన్లోనూ పాల్గొంది. సునయన చివరగా లాఠీ సినిమాలో విశాల్కు జోడీగా నటించింది. ప్రస్తుతం ఆమె రెజీనా చిత్రం చేస్తోంది. చదవండి: పూజలు, ఉపవాసాలు చేశా.. అయినా ఆ భగవంతుడు కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ -
ఇదంత సులువు కాదు.. ఏడ్చేసిన నటి, ఫోటోలు వైరల్
మోడల్గా కెరీర్ ఆరంభించిన రైజా విల్సన్ 'ప్యార్ ప్రేమ కాదల్' చిత్రంతో హీరోయిన్గా మారింది. బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా మరింత పాపులర్ అయింది. ఆ మధ్య ఫేషియల్ కోసం వెళ్తే మరేదో చికిత్స చేసి తనను అందవిహీనంగా మార్చారంటూ ఫోటోలు కూడా షేర్ చేసింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల తన ముఖం మీద మార్పులు వచ్చాయని, ఫలితంగా సినిమాల్లోనూ నటించలేకపోయానని చెప్పింది. తనకు జరిగిన నష్టానికిగానూ కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పట్లో ఈ సమస్య హాట్టాపిక్గా నిలిచింది. తాజాగా మరోసారి రైజా వార్తల్లో నిలిచింది. గురువారం రాత్రి నటి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏడుస్తున్న ఫోటోలను షేర్ చేసింది. 'ఇదంత సులువు కాదు. నువ్వు ఒంటరివి కాదు. మనం కలిసి దీన్ని పరిష్కరించుకుందాం' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు రైజాకు ఏమైందని కలవరపడుతున్నారు. 'నీకు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ధైర్యంగా ఉండు..', 'బాధలు, కష్టాలు ఎల్లప్పుడూ మనతోనే ఉండవు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రైజా స్పందిస్తూ.. 'నా బాగోగులు తెలుసుకునేందుకు సమయం కేటాయించి మరీ మెసేజ్ చేస్తున్న వారికి, మంచిమాటలు చెప్పి ఓదార్చినవారికి, నాలో ధైర్యాన్ని నింపినవారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మానవత్వం, కరుణ, దయ అనే పదాలకు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయలేం. థాంక్యూ సో మచ్' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా రైజా విల్సన్ ఎఫ్ఐఆర్, కాఫీ విత్ కాదల్ వంటి చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Raiza (@raizawilson) చదవండి: సైడ్ అయిన బాలీవుడ్ బ్యూటీ, కీర్తి సురేశ్ ఎంట్రీ! -
అనారోగ్యంతో నటి కన్నుమూత
సీనియర్ నటి వి.వసంత (82) శుక్రవారం సాయంత్రం చైన్నెలోని స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నె వెస్ట్ కేకేనగర్లోని వి.డి.లోకనాథ్ వీధిలోని నివసిస్తున్న ఈమె రంగస్థల నటి. మొదట్లో ఎలిసై మన్నర్ ఎం.కె.త్యాగరాజ భాగవతార్ నాటక ట్రూప్లో పలు నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం సినీ రంగప్రవేశం చేసి ఇరవుమ్ పగలుమ్ అనే చిత్రంలో జయశంకర్కు జంటగా నటించారు. అదే విధంగా కార్తికై దీపం చిత్రంలో నటుడు అశోక్ సరసన నాయకిగా నటించారు. ఆ తర్వాత మూండ్రామ్పిరై చిత్రంలో నటి శ్రీదేవికి తల్లిగాను, రాణువవీరన్ చిత్రంలో రజనీకాంత్కు అమ్మగా నటించి గుర్తింపు పొందారు. అలా మూండ్రుముగం చిత్రంలో పాటు పలు తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో వివిధ రకాల పాత్రల్లో నటించారు. 100కు పైగా చిత్రాల్లో నటించారు. కొద్ది నెలలుగా అనారోగ్యానికి గురైన వి.వసంత శుక్రవారం సాయంత్రం 3.40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతానం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వి.వసంత అంత్యక్రియలు రామాపురంలో శ్మశాన వాటికలో జరగనున్నాయి. చదవండి: పుష్ప 2లో రష్మిక చనిపోతుందా? క్లారిటీ ఇదే! -
ఆ ఫోటోలు, వీడియోలు అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: నటి
తమిళ నటి లుబ్నా అమీర్ తన మాజీ ప్రియుడు వేధిస్తున్నాడంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీస్ కమీషనర్ని ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఐటీ ఉద్యోగి మాసి ఉల్లాతో లుబ్నీ అమీర్కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే మాసిఉల్లాకు అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసి తాను దూరం పెట్టానని, అప్పట్నుంచి తనను వేధిస్తున్నాడంటూ లుబ్నా పేర్కొంది. ఇదే విషయంపై అతడిపై కేసు పెడితే ఇటీవలె బెయిల్పై బయటకు వచ్చి హింసిస్తున్నాడని, అతనితో పాటు మాసి ఉల్లా భార్య నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. అంతేకాకుండా రిలేషన్లో ఉన్నప్పుడు అతనితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: మెగాహీరో సెన్సేషన్.. రూ.100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష' అయితే మాసి ఉల్లా సైతం లుబ్నీ అమీర్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలతో డబ్బు సంపాదిస్తుందని, ఇదే తమ మధ్య గొడవలకు కారణమై విడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం -
టార్చర్.. రోజూ కొట్టేవాడు, పార్కింగ్ ప్లేస్లో పడుకునేదాన్ని: నటి
పుట్టినరోజు, పెళ్లిరోజు, ప్రేమికుల రోజు.. కాదేదీ సెలబ్రేట్ చేసుకోవడానికి అనర్హం అన్నట్లుగా బోలెడన్ని స్పెషల్ డేలు ఉన్నాయి. స్పెషల్ డే రోజు స్పెషల్ షూట్ సరేసరి. ఈ మధ్య అయితే ప్రీవెడ్డింగ్ షూట్, మెటర్నటీ షూట్.. ఇలా అనేక రకాల ఫోటోషూట్లు కూడా చేస్తున్నారు. అయితే తమిళ బుల్లితెర నటి షాలిని మాత్రం వినూత్నంగా విడాకులను సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త పీడ విరగడైందన్నట్లుగా అతడి ఫోటోలు చింపుతూ ఇన్నాళ్లకు విముక్తి లభించిందన్నట్లుగా ఫోటోలకు పోజులిచ్చింది. ఇది చూసి కొందరు విస్తుపోగా ఆమె బాధ అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ నటి తను విడాకులు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందో వెల్లడించింది. అంతేకాదు ఆ ఫోటోషూట్ పబ్లిసిటీ కోసం చేయలేదని, తనలాంటి మహిళలకు ఓ మెసేజ్గా ఉపయోగపడాలని భావించానంది. భర్త పెట్టిన టార్చర్ గురించి ఆమె మాట్లాడుతూ.. 'దుబాయ్లో నా భర్త నన్ను కొట్టినప్పుడు పార్కింగ్లో వచ్చి పడుకునేదాన్ని. ఎందుకంటే గొడవను పెద్దది చేయకుండా, దాన్ని ఆపేయడానికే ప్రయత్నించేదాన్ని. అంతకుమించి ఏం చేయాలో తెలియకపోయేది. ఒక్క క్షణం పోలీసుల దగ్గరకు వెళ్దామా.. అనిపించినా మళ్లీ అతడి జీవితం నాశనం అవుతుంది కదా అని నేను అడ్జెస్ట్ అయిపోయేదాన్ని. అలా అతడు కొట్టినప్పుడల్లా కింద పార్కింగ్ ప్రదేశంలో పడుకునేదాన్ని. తెల్లారాక ఇంటికి వెళ్లేదాన్ని. 2019 వరకు నాలుగేళ్లదాకా అతడితో దెబ్బలు తిన్నాను. అన్నేళ్లు తిన్న దెబ్బలను ఆరోజు అతడికి తిరిగివ్వాలనిపించింది. తిరగబడ్డాను, కొట్టాను. 'ఇన్ని రోజులు నా పాప కోసం ఆలోచించి మర్యాద ఇస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నా బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా రాక్షసుడిలా మారి తన ముందే నన్ను కొట్టావు.. ఇకపై నీలాంటి తండ్రి తనకు అవసరం లేదు' అని ముఖం మీదే చెప్పాను. అతడిపై చేయి చేసుకున్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. అయినా ధైర్యంగా నేను వెళ్లడం కుదరదు.. కావాలంటే నువ్వే వెళ్లిపో అని చెప్పాను' అంటూ తను అనుభవించిన నరకం గురించి చెప్పుకొచ్చింది. కాగా ముల్లుమ్ మల్లురమ్ సీరియల్తో పాపులారిటీ తెచ్చుకున్న షాలిని సూపర్ మామ రియాలిటీ షోలోనూ మెరిసింది. ఆమె రియాజ్ను పెళ్లాడగా వీరికి రియా అనే కుమార్తె ఉంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధించడంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవలే న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడంతో ఫోటోషూట్ నిర్వహించి మరీ సంబరాలు జరుపుకుంది నటి. View this post on Instagram A post shared by shalini (@shalu2626) చదవండి: వెకేషన్లో దిల్ రాజు కుమార్తె, ఫోటోలు వైరల్ -
చనిపోయింది నా మూడో భర్త కాదు, నేను సంతోషంగా ఉన్నా: వనిత
నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి నటి వనితా విజయ్ కుమార్. తండ్రితో ఆస్తి గొడవలు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, పెళ్లిళ్లు,-విడాకులు.. ఇలా ఏదో ఒక విధంగా తమిళనాట వార్తల్లో వనిత పేరు తరచూ వినిపిస్తుంది. వనితతో గతంలో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన పీటర్ పాల్ ఇటీవల కన్నుమూశాడు. దీంతో వనిత మూడో భర్త మరణించాడని తమిళ మీడియా రాసుకొచ్చింది. తాజాగా దీనిపై వనిత స్పందించింది. పీటర్తో తనకు చట్టప్రకారం పెళ్లి జరగలేదని కుండబద్ధలు కొట్టింది. 'పీటర్ పాల్తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. కాకపోతే 2020లో మేము రిలేషన్షిప్లో ఉన్నాం. అదే ఏడాది విడిపోయాం కూడా! అతడు నా భర్త కాదు, నేను అతడికి భార్యను కాదు. నేనసలు వైవాహిక జీవితంలోనే లేను. ఏ విషయానికీ నేను బాధపడటం లేదు. సింగిల్గా జీవిస్తున్నా. సంతోషంగా బతుకుతున్నా' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. కాగా లాక్డౌన్లో వనిత, పీటర్ల పెళ్లి జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తనకు విడాకులివ్వకుండా పీటర్ మరో పెళ్లి చేసుకున్నట్లు అతడి మొదటి భార్య ఎలిజబెత్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. వనిత- పీటర్ల పెళ్లి చెల్లదని పేర్కొంది. కానీ కొంతకాలానికే వారు విడిపోయారు. ఆతర్వాత సింగిల్గా ఉన్న వనిత ఓసారి తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్తో పూలదండలు మార్చుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనిపై స్పందించిన వనిత.. ఇది కేవలం పికప్ డ్రాప్ సినిమాకు సంబంధించిన ఫోటో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినా ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని మహిళ చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. నేను నాలుగు కాదు, 40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడేమో తనకసలు మూడో పెళ్లే జరగలేదని మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #VanithaVijayakumar & #PeterPaul Wedding Photos ❤️ #VanithaMarriage #VanithaWedding #VanithaVijayakumarMarriage ❤️ pic.twitter.com/ru1PRZBiOb — Happy Sharing By Dks (@Dksview) June 27, 2020 View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: స్టార్ హీరో విక్రమ్కు తీవ్ర గాయాలు -
ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు బుల్లితెర నటి ప్లాన్, చివరికి..
తమిళ సీరియల్ నటి రమ్య ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపాలనుకుంది. పోలీసుల విచారణలో రమ్య కుట్ర బట్టబయలు కావడంతో నటిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడఘలోని నల్లగౌండన్కు చెందిన నటి రమ్య దంపతులు బైక్పై వెళుతున్నారు. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వాహనంతో వీరి బైక్ను ఢీ కొట్టాడు. వెంటనే సదరు వ్యక్తి.. కిందపడిన రమేశ్ను తన దగ్గరున్న బ్లేడుతో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన రమేశ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు రమ్య పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో తనపై అనుమానం పెరిగింది. పోలీసులు ఆమె సెల్ఫోన్ పరిశీలించగా తనే భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది. దంపతుల మధ్య దూరం పెరిగిందిలా.. రమ్య, రమేశ్ల మధ్య కొంతకాలం కిందట బేధాభిప్రాయాలు వచ్చాయి. రమ్య సీరియల్స్లో నటించడం తనకు ఇష్టం లేదని రమేశ్ చెప్పాడు. కానీ రమ్య అతడి మాట వినిపించుకోలేదు. ఈ క్రమంలో వీరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. మాటామాటా పెరిగి గొడవలు పెద్దవి కావడంతో కొద్ది నెలలుగా వీరు కలిసి ఉండటం లేదు. నటిగానే కెరీర్ కొనసాగించాలనుకున్న రమ్య.. 'సుందరి', 'కన్నేదిరే తొండ్రినాల్' వంటి సీరియల్స్లో నటించింది. అదే సమయంలో సహనటుడు డేనియల్ (చంద్రశేఖర్)తో సన్నిహితంగా మెలగసాగింది. అతడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. అటు చంద్రశేఖర్ కూడా రమేశ్ ఇల్లును పది లక్షలకు కొనుగోలు చేసుకోవాలనుకున్నాడు. అంత తక్కువ మొత్తానికి ఇల్లు అమ్మడం కుదరదన్నాడు రమేశ్. దీంతో ఇద్దరూ కలిసి రమేశ్ను అంతమొందించాలని ప్లాన్ చేశారు. చివరికి ప్లాన్ ఫెయిలవడంతో ఇద్దరూ కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. -
గర్భం దాల్చా.. అంతలోనే బ్రేకప్.. సీక్రెట్గా పెళ్లి!: నటి
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్లే సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. నచ్చకపోతే నెట్టింట్లోనే విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. కాలక్షేపం కోసం లేనిపోని పుకార్లు సృష్టిస్తూ.. మరికొన్నిసార్లు సెలబ్రిటీలనే విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు. అలా ఎంతో మంది తారల రియల్ లైఫ్లో పెళ్లి జరగకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎన్నోసార్లు పెళ్లి జరిపించేశారు. తాజాగా ఈ ధోరణిపై సెటైర్ వేసింది తమిళ నటి పావని. బుల్లితెరపై పలు సీరియల్స్లో నటించింది పావని రెడ్డి. తర్వాత తమిళ బిగ్బాస్ 5వ సీజన్లో నటించింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూడగానే ప్రేమలో పడ్డాడు. తనకు ప్రపోజ్ కూడా చేశాడు, కానీ పావని లైట్ తీసుకుంది. ఈ విషయం పక్కన పెడితే బిగ్బాస్ జోడీ డ్యాన్స్ షోలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమిర్కు దగ్గరైంది నటి. ఈ షోలో విజేతలుగా నిలిచిన ఈ జంట రియల్ లైఫ్లోనూ జోడీగా ఉండబోతున్నామని ప్రకటించింది. తునివు(తెగింపు) సినిమాలో వీరు ప్రేమపక్షులుగానూ నటించారు. ప్రస్తుతం ఈ జంట చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు పెళ్లెప్పుడు? అంటూ వీరి వెంటపడుతున్నారు. తాజాగా ఓ అభిమాని మీ ఇద్దరికీ పెళ్లైపోయింది.. కానీ ఎందుకు దాచిపెడుతున్నారు, బయటకు చెప్పొచ్చుగా అని అడిగింది. దీనికి పావని స్పందిస్తూ.. పోయిన నెలలో నేను గర్భవతి అన్నారు. ఆ తర్వాత మేము బ్రేకప్ చెప్పుకున్నామన్నారు. ఇప్పుడేమో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నామంటున్నారు. మరి నెక్స్ట్ ఏం కహానీ చెప్పబోతున్నారేంటి? అంటూ తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది. -
మరిన్నీ అవకాశాలిస్తా.. గదిలో సర్దుకుపోవాలన్నారు: బుల్లితెర నటి జీవిత
సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే అంతా ఈజీ కాదు. ఎన్నో అవకాశాలు తలుపుతట్టినా కూడా అదృష్టం కలిసి రావాలి. సినీ రంగుల ప్రపంచం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. సినీ ఇండస్ట్రీ కెరీర్ ప్రారంభంలో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం వేధింపులకు గురైనవారే. తాజాగా ఈ జాబితాలో ఓ బుల్లితెర నటి చేరింది. కడైకుట్టి సింగం తమిళ సీరియల్ ఫేమ్ జీవిత తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమెకు ఎదురైన సంఘటనపై నోరు విప్పింది. ఆ సంఘటన తర్వాత జీవితంపై విరక్తి కలిగిందని చెబుతోంది. (ఇది చదవండి: అలా చేస్తేనే హీరోయిన్ ఛాన్సులిస్తామన్నారు: నటి) ఓ ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ..' ఒక దర్శకుడు తనకు ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేశాడు. అధిక రెమ్యూనరేషన్, మరిన్ని సినిమా అవకాశాల ఇస్తానని చెప్పాడు. అయితే వాటి కోసం సర్దుకు పోవాలని కోరాడు. నాకు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ కొత్త. కెమెరామెన్, నిర్మాత, మేనేజర్తో సర్దుకుపోవాలన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు గదికి రావాలి అన్నారు. దీంతో దర్శకుడి మాటలకు షాక్ తిన్నా. ఆ సమయంలో నాకు ఏడుపొచ్చేసింది. దర్శకుడి మాటలకు అవమానంగా ఫీలయ్యా. దీంతో అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వచ్చేశా.' అని అన్నారు. ఇటీవలే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్పై నటి వరలక్ష్మి శరత్కుమార్, ఖుష్బూ కూడా నోరు విప్పారు. తాము కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు. -
'అమ్మోరు తల్లి' ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు 'అయాలీ'తో అలరిస్తోంది
చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయమై.. తర్వాత హీరో, హీరోయిన్ అయిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో అభి నక్షత్ర పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘అయాలీ’ వెబ్ సిరీస్లో తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించింది. తమిళనాడులోని రాజపాలాయం గ్రామంలో పుట్టి పెరిగిన అభి నక్షత్ర .. అసలు పేరు అభినయ నక్షత్ర. ప్రశంసలు, అభిమాన గణం అభికి ఇప్పుడు కొత్తేం కాదు. స్కూల్లో ఉన్నప్పటి నుంచీ పరిచయమే. అమ్మాయి.. చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుకే. బడిలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటూ తన ప్రతిభతో అందరినీ మెప్పించేది. అందరి ప్రశంసలు అందుకునేది. అలా అనుకోకుండా ఒకరోజు సినిమా అవకాశం అభిని పలకరించింది. ఇక సినిమా అనగానే ఆమె సరదా పడటంతో తల్లిదండ్రులూ కాదనలేకపోయారు. చదువుపై నుంచి దృష్టి మళ్లకూడదని.. షూటింగ్ నుంచి తిరిగొచ్చాక అభినయని స్కూలుకు పంపేవారు. ఆమె మొదటి సినిమా ‘అమ్మోరు తల్లి’ విడుదల వరకు అభి స్నేహితులకు తను సినిమాల్లో నటించిందన్న విషయం తెలియదట. ‘అమ్మోరు తల్లి’(మూక్కుత్తి అమ్మన్) విజయం సాధించడం.. అందులోని తన అభినయ కళ అందరినీ ఆకట్టుకోవడంతో మరిన్ని సినిమా ఛాన్స్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథాంశాలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘నవరస’ అనే ఆంథాలజీలోనూ అభినయ నటించింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘అయాలి’ సిరీస్లో లీడ్ రోల్తో ప్రేక్షకులను అలరిస్తోంది. డాక్టర్ అవాలన్నది నా చిన్నప్పటి కల. కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా. సినిమాలు చేస్తూనే చదువు కూడా పూర్తి చేస్తా! – అభి నక్షత్ర. -
ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి..
సాధారణ అమ్మాయిల నుంచి నటీమణుల వరకు ప్రియుడి వేధింపులకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ప్రియుడి చేతిలో మృతి చెందిన శ్రద్ధా వాకర్ నుంచి బాయ్ఫ్రెండ్ చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న నటి ఫ్లోరా సైనీ(అలియాస్ ఆశ) ఘటనలే ఇందుకు ఉదహరణ. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన ఆశ ఇటీవల ఓ ఇంటర్య్వూలో బాయ్ఫ్రెండ్ వల్ల చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ తాజాగా మరో నటి బాయ్ఫ్రెండ్ బాధితురాలుగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన బాయ్ఫ్రెండ్ చిత్రహింసలకు గురి చేశాడంటూ ప్రముఖ తమిళ నటి అనిఖా విక్రమన్ సోషల్ మీడియా వేదికగా నోరు విప్పింది. ఈ సందర్భంగా తన రిలేషన్ తాలూకు అనుభవాలను ఇన్స్టాగ్రామ్లో గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలు, నోట్ షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనిఖా శరీరమంత గాయాలతో, ముఖం, కళ్లు కందిపోయి కనిపించింది. ఆ ఫొటోలన్నింటిని ఆమె షేర్ చేస్తూ తన బాయ్ఫ్రెండ్ వల్ల ప్రాణహానీ ఉందని, తనని.. తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని తెలిపింది. ‘గతంలో అనూప్ పిల్లై అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అది నాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశాడు. అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ఇంత ఇబ్బంది పెట్టిననా అతడిలో అసలు మార్పే లేదు. ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్నాడు’ అని పేర్కొంది. అయితే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనిఖా పేర్కొంది. చదవండి: భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్ అలాగే మరో పోస్ట్లో ‘మొదటి సారి కొట్టినపుడు.. నా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాడు. అందుకే వదిలేశా. రెండోసారి కూడా అదే రిపీట్ అయ్యింది. ఒళ్లంతా కమిలేలా కొట్టాడు. ఇక భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ పోలీసులకు డబ్బులు ఇచ్చి తన వైపు తిప్పుకున్నాడు. మొదట మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నాము. రిలేషన్షిప్లో ఉన్నపుడు తరచుగా అతడు నా ఫోన్ను చెక్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవటానికి వెళ్లాడు. నేను ఆ దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావంటూ ఎద్దేవా చేస్తూ వెకిలిగా నవ్వాడు’ అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Anicka Vijayi Vikramman (@anickavikramman) -
నటి వీపుపై టాటు.. అసలు ఆమెకేమైంది?
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న తాజాగా చిత్రం లియో. ఈ సినిమాలో హీరోయిన్గా అభిరామి వెంకటాచలం నటిస్తోంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఆమె ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో కతెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆమె వీపుపై నటరాజస్వామి టాటు కనిపించడమే. అయితే ఆమె టాటు ఎందుకు వేయించుకుందన్న దానిపై నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. అసలు అభిరామికి ఏమైందని అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వీపుపై ఆ టాటూ ఏంటని నిలదీస్తున్నారు. అంకే కాకుండా మహా శివరాత్రి రోజున ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ కూడా చేశారు. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆమె వీపుపై నటరాజ స్వామిని టాటూ కనిపించడం పలు చర్చలకు దారితీసింది. ఆ ఫొటోను తన ఇన్స్టా ఖాతాలో అభిరామి షేర్ చేశారు. అదే సమయంలో తనకు భక్తి గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. పైగా తాను ఆరాధించే శివుడిని ఎక్కడ ఉంచాలన్నది.. తన వ్యక్తిగత విషయమంటూ అభిరామి పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Abhirami Venkatachalam 🦋 (@abhirami.venkatachalam) -
రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త కూడా 12 ఏళ్లు నాతోపాటే..
'అంబల అంజులం' అనే తమిళ సినిమాతో మూడేళ్లకే బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నటి కుట్టి పద్మిని. కుళంద్యం దైవమమ్ అనే సినిమాకు గానూ ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె వైష్ణవి ఫిలింస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా మారింది. తెలుగులో లేత మనసులు, చిక్కడు దొరకడు, విచిత్ర కుటుంబం వంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. '23 ఏళ్ల వయసులోనే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మందుకు బానిసవడంతో అతడితో విడిపోయాను. 10 ఏళ్ల తర్వాత ప్రభు అనే వ్యక్తితో మరోసారి ప్రేమలో పడ్డాను. మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. కానీ కొంతకాలానికి నా మొదటి భర్తకు పూట గడవడం కూడా కష్టంగా ఉందని నా కూతురు ద్వారా తెలిసింది. ఆయనతో మళ్లీ బెడ్ షేర్ చేసుకోలేను కానీ తననలా వదిలేయాలన్పించలేదు. మా ఆఫీస్ కింద ఆయనకంటూ ఒక రూమ్ కట్టించాను. ఆఫీస్లో రూ.30,000 జీతానికి పని కల్పించాను. 12 ఏళ్లు అతడిని నాతో పాటే ఉంచుకున్నాను. ఒక ఫ్రెండ్లా మాతోనే ఉన్నారు, గతేడాది చనిపోయారు. రెండో భర్త ప్రభు నా సెక్రటరీతో లవ్లో పడ్డాడు. అతడికి నేను అడ్డుచెప్పలేదు. నేనిప్పుడు ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది పద్మిని. చదవండి: నా సెక్రటరీతో భర్త ఎఫైర్: నటి కుట్టి పద్మిని -
హీరోయిన్కు అభిమాని పూజలు.. వీడియో వైరల్
సినీ సెలబ్రిటీలను అభిమానించేవాళ్లు కొందరైతే ఆరాధించేవాళ్లు మరికొంతమంది! ఒక్కోసారి ఈ ఆరాధన ఎక్కువై తారలకు ఏకంగా గుడి కట్టేస్తారు కూడా! అలా తమిళనాడులో ఖుష్బూ, నమితలకు గుళ్లు కట్టేసి పూజలు కూడా చేస్తున్నారు. ఇకపోతే తాజాగా హీరోయిన్ యషికా ఆనంద్ను ఓ వ్యక్తి దేవతలా కొలుస్తున్నాడు. ఆమె ఫోటోలకు పూజలు చేస్తూ, హారతి ఇస్తూ ఆరాధిస్తున్నాడు. జీవిత చరమాంకం వరకు తన పాదాలను సేవిస్తూ బతికేస్తానంటున్నాడు. 'వేరే ఏ ఇతర నటి కూడా ఇంత ప్రేమ, భక్తి పొందలేరు. ఆమె పాదాలను పూజించడమే ప్రతి భక్తుడి ప్రథమ కర్తవ్యం' అంటూ యషికా ఫోటోలకు మొక్కుతూ దీపాలు వెలిగిస్తున్న ఫోటోలు షేర్ చేశాడు. 'యషికా దేవతను కొలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిజ జీవితంలో భగవంతుడిని చూడలేదు కానీ ఆమెనే దేవతగా చూశాను. జీవితాంతం తనకు భక్తుడిగానే ఉండిపోతాను. నాకున్న ప్రపంచం యషికా దేవతే..' అంటూ ఆమె ఫోటో ఎదుట చేతిలో హారతి కర్పూరం వెలిగించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీనిపై యషికా స్పందిస్తూ.. 'నేను కూడా మీలాంటి మనిషినే. ప్రేమను పంచుదాం. పైనున్న భగవంతుడిని మాత్రమే పూజిద్దాం' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by yashika Anand devotees (@devotees_of_yashika) View this post on Instagram A post shared by yashika Anand devotees (@devotees_of_yashika) View this post on Instagram A post shared by yashika Anand devotees (@devotees_of_yashika) చదవండి: నటుడి ఆత్మహత్య.. మరణానికి ముందు చిత్రహింసలు పెట్టిన రెండో భార్య చాలా త్వరగా వెళ్లిపోయావు, మిస్ అవుతూనే ఉంటా: నమ్రత -
అవకాశాలు రావడం లేదంటూ నటి ఆవేదన
'మసాలా పాదం' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తమిళ నటి రేష్మ పసుపులేటి. పలు సినిమాల్లో నటించిన ఆమె తమిళ బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి సీరియల్ చేస్తున్న ఆమె తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదని వాపోయింది. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టింది. 'నాకు లోకేశ్ కనగరాజన్ సినిమాలో నటించాలనుంది. కానీ ఆయన్ను ఎలా సంప్రదించాలో తెలియడం లేదు. ఎవరైనా నన్ను ఆయన దగ్గరకు చేర్చండి. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లవుతోంది.. కానీ సరైన అవకాశాలు లేవు. మా కంటే కొత్తగా వచ్చినవారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. దాన్ని నేను పూర్తిగా తప్పుపట్టడం లేదు. కానీ ఇది నిజంగా అన్యాయం. ఈ అసమానతలు లేని సిస్టమ్ రావాలి' అని ట్వీట్ చేస్తూ దానికి కొన్న ఫోటోలు జత చేసింది రేష్మ. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇప్పటిదాకా నటించింది చాలులే.. నిన్ను టీవీలో చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది నేరుగా చూస్తే ఏమైపోవాలో!పైగా నీకంత యాక్టింగ్ కూడా రాదు. ముందు నీ వృత్తి మార్చుకో' అని సెటైర్లు వేస్తున్నారు. Wanna be a part @Dir_Lokesh I don’t know how to get to him. Someone hook up a sista #pro #ontheprowl #beenintheindustry12years someone’s gotta do me rite I mean the new bees get more opportunities than us. No offence but it’s https://t.co/mzW9lpLfRw gotta change y’all ❤️ pic.twitter.com/KeJHQOmhjF — Reshma Pasupuleti (@reshupasupuleti) January 24, 2023 చదవండి: అతియా- రాహుల్ పెళ్లి.. ఆడి కారు, లక్షల విలువైన బైకు, ఫ్లాట్.. ఇంకా.. -
హీరోయిన్తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి
‘సూరారై పోట్రు’(తెలుగులో ఆకాశమే హద్దురా) చిత్రంతో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యలయాళ భామ అపర్ణా బాలమురళీ. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణా కథానాయికగా చేసింది. ఇందులో ఆమె తన అద్భుతన నటనకు గానూ ఆమెను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో అపర్ణాకు చేదు అనుభవం ఎదురైంది. చదవండి: శృతి హాసన్తో లవ్ ట్రోల్స్పై స్పందించిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన కొత్త మూవీ ప్రమోషన్స్లో ఓ విద్యార్థి ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఏం జరిగిందంటే... అపర్ణ నటించిన లేటెస్ట్ మూవీ తన్కమ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కేరళలోని ఓ కాలేజీలో తన్కమ్ మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మూవీ దర్శకుడు, హీరో వినీత్ శ్రీనివాసన్తో పాటు అపర్ణా పాల్గొంది. చదవండి: అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ రూమర్స్: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు! స్టేజ్పై కూర్చున్ను అపర్ణా దగ్గరి సడెన్గా ఓ విద్యార్థి వచ్చి ఆమె చేయి పట్టుకుని విష్ చేశాడు. అంతేకాదు ఓ ఫొటో కావాలని, తనని నిలుచోవాలంటే బలవంతం చేశాడు. చేసేది ఏం లేక అపర్ణ నిలబడగానికి ఆ యువకుడు ఆమె భుజంపై చేయి వేశాడు. దాంతో సదరు విద్యార్థి తిరుకు షాక్ అయిన అపర్ణా అతడి నుంచి వెంటనే దూరంగా జరిగింది. దీంతో ఆ యువకుడిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. దీంతో సారీ చెప్పి సదరు విద్యార్థి స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. A college student misbehaved with actress Aparna Balamurali during the promotion function of Thangam movie. @Vineeth_Sree I'm surprised about your silence 🙏 What the hell #Thankam film crew doing there. @Aparnabala2 #AparnaBalamurali pic.twitter.com/icGvn4wVS8 — Mollywood Exclusive (@Mollywoodfilms) January 18, 2023 -
డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చా, ఆ భయం లేదు: ప్రియా భవానీ శంకర్
డబ్బు సంపాదించడం కోసమే నటించడానికి వచ్చానని నటి ప్రియా భవానీ శంకర్ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. ఆమె బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన సంగతి తెలిసిందే. మేయాదమానే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాభవానీశంకర్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎస్జే.సూర్య సరసన మాన్స్టర్, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, అరుణ్విజయ్తో మాఫియా,ధనుష్తో తిరుచ్చిట్రంఫలం వంటి చిత్రాల్లో నటించి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం రుద్రన్, డిమాంటీ కాలనీ- 2, ఇండియన్-2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన కల్యాణం.. కమనీయం అనే తెలుగు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న తెరపైకి వచ్చింది. మరో తెలుగు చిత్రం కూడా చేస్తోంది. ఈ సందర్భంగా ప్రియాభవానిశంకర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సహజత్వంతో కూడిన కథా చిత్రాలంటే తనకు ఇష్టం అని చెప్పింది. ఇటీవల తమిళంలో ధనుష్కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటించానని చెప్పారు. నటించడానికి వచ్చినప్పుడు భవిష్యత్ గురించి ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పింది. ప్రేక్షకులు తనను ఆదరిస్తారా, లేదా అని భయపడలేదని చెప్పింది. నటిస్తే డబ్బు వస్తుంది అనే భావించానని, అందుకే నటించడానికి వచ్చానని పేర్కొంది. ఇటీవలే తెలుగులోనూ నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. సినీ నేపథ్యం కలిగిన వారే తామేంటో నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారని, దీంతో తాను ఇంకా ఎక్కువగా శ్రమించాలని భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ప్రియాభవానీశంకర్ పేర్కొంది. -
ఆ కీచకుడు నాతో పాటు నా కూతురిని కూడా టార్గెట్ చేశాడు: నటి ఆవేదన
ప్రముఖ నటి ప్రవీణా పోలీసులను ఆశ్రయించింది. గతంలో తనని వేధించిన ఓ కీచకుడు ఇప్పుడు తన కూతురిని టార్గెట్ చేశాడని ఆమె పోలీసులతో వాపోయింది. వివరాలు.. ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్ ఫేం ప్రవీణాను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడు. గతంలో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఆన్లైన్లో షేర్ చేశాడు. విషయం తెలిసి ప్రవీణా కొన్ని నెలల క్రితం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? దీంతో పోలీసుల అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత అతడు బెయిల్పై బయటకు వచ్చారు. ఇక కొన్ని నెలలు గడిచిన అనంతరం మళ్లీ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఈసారి ప్రవీణాతో ఆమె కూతురు గైరీ నాయర్ను కూడా టార్గెట్ చేశాడు. తన కూతురి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్హ స్పెషల్ రోల్? గతంలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతురిని కూడా టార్గెట్ చేశాడని, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన స్నేహితులను, బంధువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. తన చూట్టూ ఉన్న మహిళలను కూడా వదలడం లేదని, వారి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి విడుదల చేస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు మీద 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. తనవి, తన కూతురు, తన బంధువుల మార్ఫింగ్ ఫొటోలను అందరికి షేర్ చేస్తున్నాడని ప్రవీణా ఫిర్యాదు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) View this post on Instagram A post shared by Praveena Lalithabhai (@praveenalalithabhai) -
వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్
హీరోయిన్లు గ్లామర్ పాత్రలో నటించడం అన్నది పరిపాటే. ఇందుకు నటి దర్శాగుప్త అతీతం కాదు. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎదిగిన నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు. కుక్ విత్ కోమాలి అనే టీవీ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన దర్శాగుప్త కరోనా కాలంలో పలువురికి చేతనైన సాయం అందించి మంచి మనస్సును చాటుకుంది. అయితే సామాజిక మాధ్యమాల్లో తరచూ తన గ్లామర్ ఫొటోలను విడుదల చేస్తూ యువతను గిలిగింతలు పెడుతూ.. విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దర్శాగుప్త అందాల ఆరపోతకే లాకీ అంటూ నెటిజన్ల పోస్టులు పెడుతున్నారు. చదవండి: నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా కాగా జి మోహన్ దర్శకత్వంలో రిచర్డ్ హీరోగా నటించిన రుద్రతాండవం చిత్రంలో హీరోయిన్గా నటించి ∙మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇటీవల విడుదలైన ఓ మై ఘోస్ట్ చిత్రంలో నటుడు సతీష్కు ప్రియురాలుగా నటించింది. ఈ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండా నటించిన ఫైట్ సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో దర్శాగుప్త విడుదల చేసింది. గ్లామర్తోనే అవకాశాలు పొందుతున్నట్లు తనపై ముద్ర వేసిన వారికి ఇదే తన సమాధానం అంటూ అందులో పేర్కొంది. దర్శాగుప్త పెట్టిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Dharsha Gupta (@dharshagupta) -
వీడియో లీక్.. వేరొకరైతే ఆత్మహత్య చేసుకునేవాళ్లు: నటి
సోషల్ మీడియా వల్ల ప్లస్లు, మైనస్లు రెండూ ఉంటాయి. ఏ సమాచారాన్నైనా, ఎక్కడి నుంచైనా క్షణాల్లో అందరికీ చేరవేస్తుంది సోషల్ మీడియా. అందులో పనికొచ్చేవాటితో పాటు ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటో, ఫేక్ వీడియోలు కూడా ఉంటాయి. వీటిలో ఏది అసలో, ఏది అబద్ధమో తెలియక తికమకపడుతుంటారు జనాలు. కొందరైతే నటీమణులపై ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వారిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. అలా గతంలో తమిళ నటి రేష్మ పసుపులేటిపై కొందరు మార్ఫ్డ్ వీడియో చేసి నెట్లో వదిలారు. తాజాగా దీనిపై రేష్మ స్పందిస్తూ.. 'రేష్మ పసుపులేటి హాట్ వీడియో అని ఓ వీడియో వైరల్ అయింది. అది సుచీలీక్స్ పేరిట వచ్చిందని ఉంది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా చెల్లి ఫోన్ చేసి నీ వీడియో లీక్ అయింది అని చెప్పింది. నేను షాకయ్యాను. అసలు నేను ఊర్లోనే కాదు కదా ఇండియాలోనే లేను. కనీసం నాకు బాయ్ఫ్రెండ్ కూడా లేడు, అలాంటప్పుడు నా వీడియో ఎలా లీకవుతుంది? అమ్మే.. చెల్లితో ఫోన్ చేయించిందని అర్థమైంది. నాన్న సినీ నిర్మాత, తాతయ్య కూడా నిర్మాతే, అన్నయ్య ఒక నటుడు.. ఇలా అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. అదంతా ఫేక్ అండ్ మార్ఫ్డ్ వీడియో అని పసిగట్టారు. నా స్థానంలో వేరొకరు ఉంటే మెంటల్ టార్చర్తో కుమిలిపోయేవాళ్లు. ఆ వీడియోను నాకు పంపించమని చెల్లికి చెప్పాను. నా శరీరం గురించి నాకు తెలుసు కదా! అందులో ఉన్న అమ్మాయి నాకంటే అందంగా ఉంది. అందరం నవ్వుకున్నాం. కానీ నా స్థానంలో ఇంకో అమ్మాయి ఉండుంటే ఆత్మహత్య చేసుకునేది!' అని చెప్పుకొచ్చింది రేష్మ. కాగా జిగర్తాండ హీరో బాబీ సింహా చెల్లెలే రేష్మ. మసాలా పాదం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం భాగ్యలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. గతంలో తమిళ బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. చదవండి: రష్మికతో విజయ్ న్యూఇయర్ ట్రిప్, ఫోటో వైరల్ ఆ ఇద్దరినీ షాపింగ్కు తీసుకెళ్తా: ప్రభాస్ -
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్పై ఈ జంట స్పందించింది. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ డేట్కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ‘ఐ లవ్ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
మాజీ భర్తకు కాజల్ సర్ప్రైజ్.. విడాకులు తీసుకున్న పదేళ్లకు..!
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. అతను నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ తాజాగా అకస్మాత్తుగా మాజీ భార్య కాజల్ అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది. విడాకులు తీసుకుని పదేళ్లకు ఆమె శాండీ ఇంటికి వెళ్లడంతో షాక్కు కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. అయితే ఇటీవలే శాండీ ఇంటికి వెళ్లిన కాజల్ పసుపతి అతని భార్య సిల్వియా, ఇద్దరు పిల్లలు లాలా, షాన్ మైఖేల్తో మాట్లాడారు. అంతే కాకుండా శాండీ కుటుంబంతో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. విడాకుల తర్వాత కూడా ఈ జంట కలవడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా మంచి స్నేహం కొనసాగించడంపై కాజల్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసిన కాజల్.. 'శాండీ, సిల్వియా మీరు, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి" అంటూ తన ఫేస్బుక్లో రాసుకొచ్చింది. గతంలో శాండీ, సిల్వియా వివాహంపై కాజల్ విమర్శలు చేసింది. కానీ ఆ తర్వాత శాండీకి శుభాకాంక్షలు తెలిపింది. తమ విడాకులపై శాండీని నిందించవద్దని.. అలాగే అతని రెండో భార్యను లక్ష్యంగా చేసుకోవద్దని ఆమె తన అభిమానులను అభ్యర్థించింది. కాగా.. 2019లో కాజల్ ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది. View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) -
లైంగిక ఆరోపణలు.. ఇమేజ్ డ్యామేజ్ చేస్తే సహించను : నటి
తమిళసినిమా: సినీ తారలు అప్పుడప్పుడు మీడియాపై ఫైర్ అవుతుంటారు. వారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూసినప్పుడో, తమ ఇమేజ్ను డామేజ్ చేసే చర్యలకు పాల్పడినప్పుడో అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ మధ్యనే నటి రష్మిక మందన్నా కొన్ని మీడియా సంస్థల ధోరణిపై ఆవేదనను వ్యక్తం చేసింది. తాజాగా నటి పార్వతి నాయర్ ఏకంగా హెచ్చరికలే చేసింది. తమిళంలో ఎన్నై అరిందాల్, నిమిర్నిందు నిల్, ఉత్తమ విలన్, సీత క్కాతి తదితర త్రాల్లో ముఖ్య పాత్ర పోషింన మలయాళి నటి పార్వతి నాయర్. చెన్నై నుంగంబాక్కంలో నివసిస్తున్న ఈమె ఇటీవల తన ఇంట్లో రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లాప్ టాప్, సెల్ ఫోన్ వంటి వస్తువులు చోరీకి గురైనట్లు, తన ఇంట్లో పని చేసే వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త మీడియా ప్రసారం చేసింది. ఈక్రమంలో ఆమె ఇంట్లో పని చేసి మానేసిన చంద్రబోస్ అనే వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు వచ్చి పార్వతి నాయర్పై తీవ్ర విమర్శలు చేశాడు. ఆమె ఇంట్లో రాత్రి వరకు మగ స్నేహితులతో మందు పార్టీలు చేసుకునేదని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గమనించడంతో అవవనిస్తే, కించపరిచే విధంగా ప్రవర్తించిందని విమర్శించారు. ఈ వార్తా పలు చానళ్లలో ప్రసారమైంది. దీంతో ఆగ్రహానికి గురైన నటి పార్వతి నాయర్ మీడియా తన గురించి తప్పుడు ప్రచారం చేస్త తన ఇమేజ్ డామేజ్ చేసే చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరిస్తూ శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తనకు కళంకం ఆపాదించే చర్యలకు పాల్పడే కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించింది. pic.twitter.com/J2hoP0CY67 — Parvati (@paro_nair) November 12, 2022 -
నటిపై సంచలన ఆరోపణలు.. లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ..!
తమిళ నటి పార్వతి నాయర్పై సంచలన ఆరోపణలు చేశారు ఆమె పనిమనిషి సుభాశ్. తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని పార్వతి నాయర్ బెదిరించినట్లు ఆరోపించారు. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో తనను మానసిక వేధింపులకు గురి చేస్తోందని సుభాశ్ పోలీసులకు తెలిపారు. అంతే కాకుండా తనను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టి, ముఖంపై ఉమ్మి వేసిందని వివరించారు. ఆమె తనను కావాలనే దొంగతనం కేసులో ఇరికించారని అతను ఆరోపిస్తున్నారు. రాత్రిపూట ఆమె ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు రావడం చూసినందుకే నటి తనను మానసికంగా వేధిస్తోందని వాపోయారు. (చదవండి: ఓటీటీలో కార్తీ బ్లాక్ బస్టర్ 'సర్దార్'.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!) అసలేమైందంటే: 2022 అక్టోబర్లో చెన్నైలోని నుంగంబాక్కంలో పార్వతి ఇంట్లో రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్టాప్ చోరీకి గురైనట్లు పోలీసుల సమాచారం. పార్వతి నాయర్ తన ఇంట్లో చోరీ పాల్పడినట్లు పనిమనిషి సుభాష్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కాగా.. పార్వతి నాయర్ తమిళంలో యెన్నై అరిందాల్, నిమిర్ చిత్రాల్లో నటించింది. -
ఆన్లైన్లో ద్వేషపూరిత సంస్కృతి పెరిగిపోయింది: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో అభిమానులు సంపాదించుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్లో ఎక్కువ విజయాలు అందుకున్న ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జంటగా సలార్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ చిత్రాలను టార్గెట్ చేయడంపై ఆమె స్పందించారు. హిందీ చిత్రాలు విడుదల సమయంలో బాయ్కాట్ బాలీవుడ్ అంశం తెరపైకి రావడం పట్ల ఆమె మాట్లాడారు. శృతిహాసన్ మాట్లాడుతూ..'ఇది కేవలం సినిమాకు సంబంధించినది మాత్రమే కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. దీనికి చాలా కారణాలున్నాయి. మనమందరం దీనిపై ఒక్కసారి ఆలోచించుకోవాలి. సినిమాలను రద్దు చేయాలనే సంస్కృతి అనేది బెదిరింపు, దాడి చేయడం లాంటిది. ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం సమాజంలో ఆన్లైన్ సంస్కృతి సమాజంలో ద్వేషం నింపేలా మారింది.' అని అన్నారు. తాను వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో వివరించింది శృతిహాసన్. తనను 'చుడైల్' (తెలుగులో మంత్రగత్తె) అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది. కానీ దానిని అధిగమిస్తామని నాకు తెలుసు. నేను నా సొంత మార్గంలో ఆలోచిస్తాను అని వెల్లడించింది. -
బుల్లితెర నటుడి భార్య మృతి, డైట్ మార్పులే కారణమా?
తమిళ నటుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని (43) కన్నుమూశారు. గత కొన్నివారాలుగా కోమాలో ఉన్న ఆమె సోమవారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి డైట్ మార్పులే కారణమని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ స్టార్ట్ చేశారు. సడన్గా ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో ఆమె రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయాయట. మూడు నెలల క్రితం పరిస్థితి సీరియస్ కావడంతో ఆమెను చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లగా తాజాగా మరణించారు. కాగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా పేరు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ తనయుడే భరత్ కల్యాణ్. మొదట్లో సినిమాలు చేసిన ఆయన తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. అపూర్వ రంగల్, వంశం, జమిలా వంటి సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు భరత్ కల్యాణ్. చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి ఇనయను ఆడుకున్న హౌస్మేట్స్, శ్రీహాన్ లాస్ట్ పంచ్ అదిరింది -
అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటి.. అదే కారణం..!
సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బెడ్పై ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. తమిళంతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సంపాదించుకున్న నటి రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. నటనతో పాటు సీరియల్స్, టీవీ షోలలో హోస్ట్గా, డ్యాన్స్ షోలలో న్యాయనిర్ణేతగా ఉంటూ కొన్ని చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. 'వెన్నెముక విపరీతమైన నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాను. ఒకటి, రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక మళ్లీ విధుల్లో యథావిధిగా పాల్గొంటాను' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో 'కాఫీ విత్ కాదల్' అనే చిత్రాన్ని ఆమె నిర్మించారు. ఈ వారం విడుదల కావాల్సిన ఆ చిత్రం పొన్నియన్ సెల్వన్ రాకతో వాయిదా వేసుకున్నారు. Had a procedure for my coccyx bone yesterday. Back home now. Rest for 2 days n then back to work. Sorry for the wishes, once again wishing you all #happydussehra2022 #HappyVijayadashami2022. pic.twitter.com/S8n1SjHEnS — KhushbuSundar (@khushsundar) October 5, 2022 -
విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువ నటి ఆత్మహత్య!
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కోలీవుడ్కు చెందిన యంగ్ నటి దీప అలియాస్ పౌలిన్(29) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని విరుగంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఫ్లాట్లో ఉంటున్న దీప శనివారం తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప..మానసిన ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు. దీప సంప్రదించడానికి ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్కి వెళ్లి చూడగా..ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. అందులో తన చావుకు ఎవరు కారణం కాదని చెబుతూనే జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చింది. అయితే అతని పేరు మాత్రం ప్రస్తావించనట్లు సమాచారం. కాగా, పలు తమిళ సినిమాల్లో సహాయ నటిగా అలరించింది దీప. చిన్న పాత్రలు పోషించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం విశాల్ నటించిన తుప్పరివాలన్ చిత్రంలో దీపా పౌలిన్ సేవకురాలిగా నటిస్తోంది.నాజర్ నటించిన వైదా చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by Powlenjessica Amaranathan💫 (@powlenjessica_offl) -
ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కూడా
ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు వైరల్గా మారాయి. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆమె నటి మాత్రమే ప్లేబ్యాక్ సింగర్గా, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇటీవల ఆమె నటించిన ఓ చిత్రానికి గానూ జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఆమె నేరుగా ఒక్క తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా.. ఇక్కడి ప్రక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే. అచ్చంగా తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు ఆకాశమే నీహద్దురా చిత్రంలో నటనతో అబ్బురపరిచన అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ బ్యూటీ నటిగా కంటే ముందు సింగర్గా, డ్యాన్సర్గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు పలు షార్ట్ ఫిలింస్లో కూడా నటించింది. ఈ క్రమంలో ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. మాలీవుడ్, కోలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంది. ఇక ‘సర్వం తాళమయం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య సరసన సూరారై పోట్రు(తెలుగులో ఆకాశమే నీ హద్దురా) మూవీలో చాన్స్ కొట్టేసింది. లాక్డౌన్లో ఓటీటీలో విడుదలైన ఈచిత్రం ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అపర్ణ.. సుందరిగా సూర్య భార్య పాత్రలో నటించి అద్భుతమైన నటన కనబరిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న తన పాత్రకుగానూ అపర్ణ ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకుంది. ఇలా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ ప్రస్తతం బొద్దుగా తయరవడంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) -
అందాల ఆరబోతలో తప్పేం లేదు: హీరోయిన్
ఎయిర్ హోస్టెస్గా కెరియర్ మొదలెట్టిన నటి వాణి బోజన్. ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశింంది. అనంతరం టీవీ వ్యాఖ్యాతగా, బుల్లితెర నటిగా గుర్తింపు పొందింది. అలా ఓ మై కడవులే చిత్రంతో నటిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో రెండో కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ తరువాత ఆ తరహా పాత్రలే వస్తున్నాయి. కానీ కథానాయికగా ప్రాముఖ్యత కలిగిన కథా పాత్రలు రావడం లేదనే చెప్పాలి. చదవండి: హాట్టాపిక్గా ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకే అన్ని కోట్లా! తాజాగా అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటింన తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్లోనూ రెండో కథానాయిక పాత్రలోనే నటించింది. ఈ వెబ్ సిరీస్ 19వ తేదీ నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. కాగా దీని ప్రమోషన్స్తో బిజీగా ఉంది. అయితే సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. తరచూ తన హాట్హాట్ ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలను సోషల్ షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో యాంకర్ అవకాశాలు కోసం అందాలారబోతకు సిద్ధం అయినట్టున్నారే? అని ప్రశ్నించింది. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు దీనికి ఆమె స్పందిస్తూ.. అవును.. అందులో తప్పేముంది అని తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. అయినా తాను చీర ధరించినా గ్లామరస్గా ఉన్నావంటున్నారని చెప్పింది. కాలానికి తగ్గట్టు ఆలోచనలు మారాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ఇక ప్రేమ గురించి అడిగిన ప్రశ్నకు తాను పదహారేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని, ఆ వెంటనే బ్రేకప్ కూడా అయిపోయిందని తెలిపింది. అయితే అదే సమయంలో తనకు అనేక ప్రేమ లేఖలు వస్తుండటంతో బ్రేకప్ గురించి పెద్దగా పట్టించుకోలేదని వాణి బోజన్ చెప్పుకొచ్చింది. కాగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలతో ఏ వత్రం అవకాశాలను రాబట్టుకుంటుందో చూడాలి. -
ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి!
నెపోటిజం(బంధుప్రీతి) ఈ పేరు వినగానే మొదట గుర్తోచ్చేది బాలీవుడ్. దివంగత నటుడు సుశాంత్ సింగ్ మరణానంతరం బాలీవుడ్లో నెపోటిజంపై ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్లో వినిపించే ఈ పేరు ఇప్పుడు దక్షిణాదిలో సైతం వినిపిస్తోంది. తాజాగా యువ నటి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. సౌత్లో సైతం నెపోటిజం ఎఫెక్ట్ ఉన్నా ఇప్పటివరకు దీనిపై మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. తాజాగా ఈ యంగ్ బ్యూటీ ధైర్యం చేసి ఈ అంశాన్ని లెవనెత్తినట్లు కనిపిస్తోంది. ‘సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా. మరి మిగతావాళ్ల సంగతేంటి’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్లో చిత్రంలో వేణు? ఆమె ట్వీట్ చూస్తుంటే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోలీవుడ్ బంధుప్రీతిపై తొలిసారి నోరు విప్పిన ఈ బ్యూటీ పెద్ద స్టార్ ఏమీ కాదు. ఈమధ్యే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ యువ నటి. ఇప్పటి వరకు ఆమె చేసింది ఒకట్రెండు సినిమాలు మాత్రమే. ఇంతకి ఈ బ్యూటీ పేరు ఏంటంటే ఆత్మిక. ‘మిసాయి మురుకు’ అనే తమిళ చిత్రంతో ఆమె కోలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆత్మికకు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆత్మిక తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తోంది. చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా.. ఈ నేపథ్యంలో ఇటీవలే నటిగా తెరంగేట్రం చేసిన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్కు పరోక్షంగా ఆమె చురకలు వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అదితి.. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాదు సింగర్గా కూడా రాణిస్తోంది. ఆమె నటించింది ఒకటే సినిమా అయిన ఆ వెంటనే పెద్దపెద్ద ఆఫర్లు రావడంతో ఆత్మికకు కన్ను కుట్టినట్లు ఉందని, అందుకే పరోక్షంగా ఆమెను టార్గెట్ చేసి ఈ ట్వీట్ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆత్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. కాగా అదితి ఇప్పటికే హీరో కార్తి సరసన హీరోయిన్గా చాన్స్ కొట్టేయగా.. తాజాగా ఆమె శివ కార్తికేయన్ సినిమాలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. It’s good to see privileged getting easy way through the ladder while the rest 🥲 Paathukalam 🙌🏽 — Aathmika (@im_aathmika) August 4, 2022 -
ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పార్తిబన్ దర్శకత్వం వహించి నటించిన తమిళ చిత్రం ‘ఇరవిన్ నిళల్’. ఇందులో ఆయన హీరోగా నటించగా ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో యువ నటి బ్రిగిడ సాగా హీరోయిన్గా నటించింది. జూలై 15న విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్తో ముచ్చటించిన ఆమె మూవీ విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తాను నగ్నం నటించడంపై వివరణ ఇచ్చింది. చదవండి: పనిమనిషి చెప్పేదాకా చైసామ్ విడిపోతున్నారని తెలియదు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసేందుకు వెళ్లన తనను హీరోయిన్గా సెలక్ట్ చేశారని తెలిపింది. ‘నేను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సింది. కానీ నన్నే హీరోయిన్గా సెలక్ట్ చేశారు. అయితే ఇందులో ఓ సన్నివేశంలో హీరోయిన్ నగ్నంగా నటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ప్రేమించే వారే ఆ ఈ సీన్ చేయగలరని డైరెక్టర్ అన్నారు. దీంతో డైరెక్టర్ కోసమే నేను ఆ సీన్లో చేయాలని అనుకున్నాను’ అని చెప్పింది. మొదట ఈ సీన్ నటించేముందు తన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలనుకున్నానని పేర్కొంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘ఈ సీన్ గురించి నా కుటుంబ సభ్యులతో చర్చించాలంటే భయం వేసింది. వారిని ఎలా ఒప్పించాలో తెలియలేదు. చాలా సతమతమయ్యాను. చివరకు డైరెక్టర్ పార్తిబన్ సహాయంతో మా కుటుంబాన్ని ఒప్పించి అనుమతి తీసుకున్నాకే ఈ సీన్లో నటించాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో తాను పూర్తి న్యూడ్గా నటించలేదని, ఇందుకోసం కొన్ని టెక్సిక్స్ వాడినట్లు ఆమె స్పష్టం చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, ప్రియాంకా రుత్, బ్రిగిడ సాగా, ఆనంద కృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ షాట్లో చిత్రీకరించారు. అంతేకాదు మొట్టమొదటి నాన్ లీయర్ సింగిల్ షాట్ ఫిల్మ్గా ఈ చిత్రం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. -
ఎగ్జిబిషన్ ప్రారంభించిన సినీ నటి
కొరుక్కుపేట (తమిళనాడు): ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్లను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు సూత్ర సంస్థ యజమానులు మోనికా, ఉమేష్ తెలిపారు. చెన్నై నుంగంబాక్కంలోని తాజ్ కొరమండల్ వేదికగా రెండు రోజుల సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ను మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీనటి కికీ విజయ్తో పాటు సామాజికవేత్తలు కవితా పాండియన్, దీపా మదన్ పాల్గొని ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఉదయం10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే ఈ ప్రదర్శన బుధవారంతో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక, సంప్రదాయ వస్త్రాలు, ఇతర మహిళా ఉత్పత్తుల మేళవింపుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ నగరవాసులకు అమితంగా ఆకట్టుకుంటుండగా, ఇందులో దేశంలోని 100కి పైగా ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన సరికొత్త ఉత్పత్తులను చెన్నై ఫ్యాషన్ ప్రియులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. చదవండి: అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో అదిరిపోయిందిగా