telangana politics
-
అంతా రామోజీ ఊహించినట్టే జరుగుతోందా?
ఇది ఊహించని పరిణామమే!. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒక రోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసినా.. మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వాదనే సరైందని తేలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా రూ.2610 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ధారించింది. దీనితో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయలేదని, తప్పు చేయదని, ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని YSRCP ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్ను వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికి తిరిగి చెల్లించిందని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా ‘‘వార్త రాస్తే విషం చిమ్ముతారా’’ అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు. నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దబాయించడమే తప్పు. పైగా.. ఈనాడేమో.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతిన అసత్యాలతో కథనాలు వండివార్చవచ్చు. ఈనాడు గ్రూపులోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బుకాయించినప్పటికీ ఆర్బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి. మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదుల రూపంలో కొనసాగించారని, చిట్స్లో వందల కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటిని నీరుకార్చడం ఆరంభించింది. అందులో భాగంగా జప్తు అయిన వేయి కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చూస్తే.. పరస్పర రాజకీయ,వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టం అయింది. ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతోపాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ, ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధన అని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు. ఆర్బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేకపోతోంది?. ఆర్బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది?. నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసేందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తరువాతే ఆర్బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(ఎస్) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిందని తేలుతోంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకువచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రామోజీ తర్వాత హెచ్ యుఫ్ (అవిభాజ్య హిందూ కుటుంబ కర్త)గా ఆయన కుమారుడు కిరణ్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలా? లేదా? సంస్థ తరపున జరిమానా చెల్లించవలసిన బాధ్యత ఆయనపై ఉంటుందా? లేదా?అనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఇంకో సంగతి గుర్తు చేయాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఛార్జ్షీట్లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక, ఆయన కర్తగా ఉన్న సంస్థ ఆక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కాని ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా, చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందున ఈ కేసు విచారణ కొనసాగించాలా? లేదా? అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున వేసిన అఫిడవిట్లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ.. ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్ తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కుడితిలో పడ్డయినట్లయిందని అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలులో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించేశామని మరికొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఆయనకు తెలిసి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఈ దశకు చేరింది. జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయిందన్న కోపంతో ఈనాడు మీడియా పచ్చి అబద్ధాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది. ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి పెద్ద, పెద్ద లాయర్లను నియోగించింది. మొత్తం మీద 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఒక రూపానికి వచ్చినట్లనిపిస్తుంది. ఆర్థికంగా ,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత శక్తిమంతుడైనా న్యాయ వ్యవస్థ కొంత గట్టిగా ఉంటే చట్టానికి ఎవరూ అతీతులుగా ఉండలేరని ఈ ఉదంతం రుజువు చేసింది. గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైలులో పెట్టింది. రామోజీరావు ఆ గండం నుంచి తప్పించుకున్నా.. ఆయన మరణం తర్వాత అయినా సత్యం బయటపడిందని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు. కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావొచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి? అందరి వివరాలు ఉన్నాయా? అందరికి తిరిగి చెల్లించారా? లేదా? ఆ మొత్తాలకు వడ్డీని కూడా చెల్లించారా? లేదా? ఇలాంటి విషయాలు అన్ని తేలితే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు. ‘‘వయలేట్ ద లా లాఫుల్లీ’’ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్దాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బిల్డప్ బాబు.. తగ్గేదే లే అంటున్న రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు స్టైల్లోనే ప్రవర్తిస్తున్నారా? జాతీయ పార్టీ కాంగ్రెస్లో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపే ప్రయత్నం చేస్తున్నారా?. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును గమనిస్తే ఈ అనుమానాలు రాకపోవు. ‘‘నేను మారా.. మీరూ మారాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు నా వద్ద ఉన్నాయి’’. ‘‘ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించా..నా ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించుకున్నా..దానిని అందరికి అందచేస్తా..’’, ‘‘హైదరాబాద్లో ఉంటున్న నాకు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నాకు అన్నీ తెలుసు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వంలో తప్పులు ఏమీ జరగలేదు..పొరపాట్లు జరిగాయని ఎవరైనా భావిస్తే నా దృష్టికి తీసుకు వస్తే సరిదిద్దుకునేందుకు వెనుకాడను. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేశా.. మంత్రులు కూడా అలాగే పని చేశారు.. రేషన్ డీలర్లు, అంగన్వాడీల ఎంపిక జోలికి వెళితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయి.. వచ్చే పంచాయతీ ఎన్నికలలో అన్ని చోట్ల గెలవాలి. అవి కీలకం. పదవుల గురించి తొందరపడవద్దు..అన్నీ జరుగుతాయి.." అని రేవంత్ అన్నట్లు వార్తా పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాక.. ‘‘మొదటి సారి గెలవడం ఓకే .. రెండో సారి గెలవడమే గొప్ప.., సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్ లు వస్తాయి..’’ అని కూడా అన్నారంటూ కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ ప్రసంగం అంతా పరిశీలించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని నడుపుతున్న స్టైల్లోనే, అందులోను చంద్రబాబు నాయుడు సరళిలోనే రేవంత్(Revanth) వ్యవహార శైలి ఉన్నట్లు కనిపిస్తుంది. 1995లో తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసేవరకు తన వర్గ ప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం పనిచేసిన చంద్రబాబు సీఎం అయ్యాక మొత్తం సీన్ మార్చేశారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి మొదట్లో కొన్ని ట్రిక్స్ అమలు చేసినా, వారిపై పట్టు వచ్చాక స్టైల్ మార్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలకు ఆయన టైమ్ లోనే ప్రాధాన్యత వచ్చింది. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుని లీకులు ఇప్పించే వారు. అవసరమైతే ఆయనే ఆయా మీడియా సంస్థలలోని కాస్త కీలకమైన జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు. .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరు కలిసినా, 'అలా అన్నారు..ఇలా అన్నారు.."అంటూ పూర్తిగా పాజిటివ్ యాంగిల్ లోనే కవరేజీ వచ్చేలా చేసుకునే వారు. కేబినెట్ సమావేశాలలో సైతం అదే ధోరణి. తాను మారానని, మీరూ మారాలని చెబుతుండే వారు. కాకపోతే ఆయన ఏమి మారారో, తాము ఎక్కడ మారాలో అర్థ అయ్యేది కాదు. తాను అవినీతి లేకుండా పనిచేస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. కానీ పార్టీలోని ఇతర నేతలకు వాస్తవాలు తెలుసు. అయినా ఎవరికి వారు తమ అవసరాల రీత్యా ఆయన వద్ద మాత్రం తలూపి వచ్చేవారు. అక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ అక్రమం చేసినా బయట పడకుండా జరగాలన్నది చంద్రబాబు సిద్దాంతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, మంత్రులు కూడా పనిచేయాలని, అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని చెప్పేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తద్వారా తాను ఒక్కడినే కష్టపడుతున్నానన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు. అదే ప్రకారం ప్రచారం చేయించుకునేవారు. విశేషం ఏమిటంటే గత టరమ్ లో మొదటి ర్యాంకు వచ్చిందని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరికి ఆ తర్వాత టిక్కెట్లు ఇవ్వలేదు. అది వేరే సంగతి. రేవంత్ వ్యాఖ్యలు చదివితే అచ్చం తన గురువు దారిలోనే ఉన్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ బలహీనంగా ఉండడం రేవంత్ కు కలిసి వచ్చిన పాయింట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మంత్రుల, ఎమ్మెల్యేల జాతకాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో మినహాయించి మిగిలిన సీఎంలకు అంత స్వేచ్చ ఉండేది కాదు. పైగా వర్గపోరు ఉండేది. వైఎస్ కు కూడా వర్గాల తలనొప్పి ఉన్నా, అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేసేవారు. రేవంత్ కూడా ఇప్పటికైతే వర్గపోరు లేకుండా పాలన సాగిస్తున్నారు. కాని అవకాశం వస్తే ఆయనపై అధిష్టానంపై ఫిర్యాదు చేయడానికి పలువురు సిద్దంగానే ఉంటారు. ఇంతకీ రేవంత్ ఏమి మారారో ఎవరికి తెలియదు. నిజానికి పీసీసీ(PCC) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న తీరుకు చాలా తేడా ఉందన్నది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. రుణమాఫీ విషయంలో కొంతవరకు సఫలమైనా, బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కొన్ని వాగ్దానాలను నెరవేర్చినప్పటికి ఆరు గ్యారంటీలలో కీలకమైన హామీల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ గురించి ప్రజలు అడిగితే జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో ఆశించిన రీతిలో రియల్ ఎస్టేట్ సాగడం లేదు.హైడ్రా కూల్చివేతలు, మూసి హడావుడి వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా, వాటిపై నిర్దిష్ట కార్యాచరణ అంతంతమాత్రంగానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినా, దాని వల్ల ఎంత ఫలితం వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో.. తన ప్రభుత్వంలో తప్పులే జరగలేదని, ఏవైనా జరిగితే అవి పొరపాట్లేనని రేవంత్ అంటే పైకి అవునవును అని చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విషయాన్ని మరీ తెగేదాక లాగడం చాలామంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. సినిమా పరిశ్రమను నష్టపరిచేలా గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు. కాని ఇప్పుడు రేవంత్ వారిపైకి దూకుడుగా వెళ్లారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని అంటున్నారు. భాష విషయంలో కూడా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన తీరులోనే ఉండడం కొంతమందికి రుచించడం లేదు. సాధారణ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవుతోందని, దానిని గుర్తించి సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. చంద్రబాబు మాదిరి 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే నమ్మడం కష్టమే నని ఒక నేత అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సి.ఎమ్.లు ఉదయం పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి విధానపరమైన నిర్ణయాలు చేసి,ఫైళ్లు ఏమైనా ఉంటే చూసి ఇంటికి వెళ్లిపోయేవారు. అక్కడనుంచి ఏవైనా అత్యవసర పనులకు అటెండ్ అయ్యేవారు.ప్రజలను, పార్టీ వారిని కలిసేవారు. చంద్రబాబు వచ్చాక ఈ ధోరణి మార్చుకున్నారు. పని ఉన్నా, లేకపోయినా ఆఫీస్ లో గడపడం అలవాటు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్. తెల్లవారు జామున అధికారులతో భేటీ అవుతుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు తెల్లవారేసరికల్లా ప్రజలను గడవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేవారు. కేసీఆర్ ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే ఉండేవారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. నిజానికి ఏ సీఎం అన్ని గంటలు పనిచేయవలసిన అవసరం ఉండదు. అంత పని కూడా ఉండదు. చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా ఇతర పార్టీల నేతలతో అంతరంగికంగా సంబంధాలు పెట్టుకున్నారన్నది కొందరి భావనగా ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. అందువల్లే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటివారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్డీయే, ఐఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని ఒక కాంగ్రెస్ నేత చమత్కరించారు. అంతేకాదు. కాంగ్రెస్కు ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పాత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని, చంద్రబాబు, రేవంత్ లు రాజకీయంగా సహకరించుకుంటున్నారని ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఏది ఏమైనా రేవంత్ లో నిజంగా ప్రజలకు ,పార్టీకి ఉపయోగపడేలా మార్పు వస్తే మంచిదే. కాని ఆయన కూడా అధికార దర్పంతో ఉంటే అందరికి నష్టం అనే అభిప్రాయం నెలకొంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణలో పొలిటికల్ వార్
-
సంధ్య థియేటర్ ఘటన.. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వాన్నిఅస్థిరపరిచి కూల్చేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు.హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనను ఆసరాగా తీసుకుని తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు, కవిత కలిసి ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సాయంతో ఢిల్లీలో నరేంద్ర మోదీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని పడగొట్టి గవర్నర్ పాలన తీసుకువద్దామని చూస్తున్నారని ఆయన అన్నారు.మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాయని, రాబోయే 48 గంటల్లో ఏదో అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారం లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ ఉండలేదని, ఫామ్హౌస్లో కేసీఆర్ (KCR) మౌనంగా లేరని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్కెచ్ వేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి కోణాలను త్వరలో బయటపెడతామని ప్రకటించారు. న్యాయం వైపు ఉంటేనే ఈ రెండు పార్టీలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లో వేలుపడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సినీ పరిశ్రమను బోనులో పెట్టే ప్రయత్నం: ఈటల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొత్తం సినీ పరిశ్రమను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ను మంగళవారం ఆయన కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను సీఎం రేవంత్రెడ్డి వివాదంగా చేస్తున్నట్లుందని ఆరోపించారు. హీరో అల్లు అర్జున్ను (Allu Arjun) కావాలనే పోలీస్ స్టేషన్కు పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టడం మంచిది కాదని హితవు పలికారు.రాజకీయం చేయడం తగదు: డీకే అరుణ సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని.. లేకుంటే దీన్ని సినీపరిశ్రమపై ప్రభుత్వ వేధింపులుగా భావించాల్సి వస్తుందని ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. మంగళవారం శ్రీతేజను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బాలుడి కుటుంబాన్ని ఆదుకొనే బాధ్యత సీని పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కాగా, ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి సైతం బాలుడిని పరామర్శించారు. చదవండి: సంధ్య థియేటర్ పరిణామాలు.. సంక్షోభం సినీ రంగానికా? రాజకీయానికా? -
Allu Arjun Issue:‘సూపర్స్టార్లా ఫీలైపోతున్న రేవంత్’
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్స్టార్లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ఎవరు సూపర్ స్టార్ అనే విషయంలో ఆయన(రేవంత్ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్ కంటే తానే సూపర్స్టార్నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్ యాక్టర్. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. .. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. #WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY— ANI (@ANI) December 24, 2024 ఇదీ చదవండి: అల్లు అర్జున్ను ఆనాడు అడ్డుకుని ఉంటే.. -
‘అల్లు అర్జున్ను ఆరోజు ఎందుకు అడ్డుకోలేదు?’
హైదరాబాద్, సాక్షి: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్(Allu Arjun) విచారణ వేళ.. మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారాయన. సాక్షితో ఆయన మాట్లాడుతూ..‘‘రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా.. పెద్దలైనా వారికి మేం అండగా ఉంటాం. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ చేసేది ముమ్మాటికీ రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్తుతో(ఎంఐఎం అక్బరుద్దీన్ను ఉద్దేశించి..) ప్రశ్న అడిగించుకోని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అలాంటప్పుడు.. మొదటి రోజే ఎందుకు కాంగ్రెస్ (Congress party) నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు?..ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటన జరిగింది. అసలు అనుమతి లేదన్నప్పుడు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి ఎందుకు బయటకు రానిచ్చారు. ఇంటి వద్దే ఆయన్ని బారికేడ్లు వేసి ఎందుకు అడ్డుకోలేదు?. థియేటర్ వద్ద యూనిఫాం లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా!. సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి హీరో వెహికిల్ ను టోయింగ్ ఎందుకు చేయలేదు?. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్తో వచ్చిన బద్నాంను తప్పించుకునేందుకే ఇంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కక్ష గట్టి సాధిస్తోంది ’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే బీజేపీ అల్లు అర్జున్కు అండగా ఉంటుందని ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇంతకు ముందే ప్రకటించారు. అంబేద్కర్ ఇష్యూపై..కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును తీసే అర్హత లేదని రఘునందన్ చెబుతున్నారు. ‘‘తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి కనీసం దండ వేయలేదు రేవంత్ ప్రభుత్వం. అంతపెద్ద విగ్రహానికి గేటుకు తాళం వేసిన రోజే కాంగ్రెస్ చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వలేదు కాంగ్రెస్. అంబేద్కర్ ను అన్ని రకాలుగా కాంగ్రెస్సే అవమానించింది. హాస్టళ్లలో ఫుడ్ తిని విద్యార్థులు చనిపోతున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు అని రఘునందన్ మండిపడ్డారు. -
‘అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా’
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్ నివాసం వద్ద దాడి ఘటనపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని ఎక్స్ వేదికగా పిలుపు ఇచ్చారు.‘‘సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారాయన. అయితే.. అంతకు ముందు అల్లు అర్జున్ ప్రెస్మీట్పై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానుప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది.— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 23, 2024అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడి చేయడం తగదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యాస్పదమని, ఏదో అయినట్లు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అల్లు అర్జున్కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. -
పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు–నిధులు–నియామకాల గురించి పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘పదేళ్లుగా అమరుల ఆత్మ క్షోభిస్తూనే ఉంది. ఉద్యమ ఆకాంక్షలు సాకారం కాలేదనే అశాంతి, ఆగ్రహం ఉద్యమకారులను కలచి వేస్తూనే ఉంది’అని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే.. కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడ్డట్లయిందని రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు.‘గతపదేళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ పాలకులను గద్దె దించి పదేళ్ల పీడ విరగడైందని సంతోషిద్దామంటే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది’అని సంజయ్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ 6 నెలల పాలనలోనే 6 గ్యారంటీలుసహా ఇతర ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది. వేల కోట్ల అవినీతికి పాల్పడుతోంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుంది. తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది’అని ధ్వజమెత్తారు. అందుకే ప్రజల పక్షాన, అమరుల ఆశయాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైందన్నారు. -
హామీలు మరిస్తే ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, పార్లమెంట్లో ‘చిన్నమ్మ’సుష్మా స్వరాజ్ చేసిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సుష్మా స్వరాజ్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచిæ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలంగాణ పోరాటం తరహాలోనే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి గ్యారంటీలను అమలు చేయకపోతే ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, వచ్చే ఐదేళ్లు ఆయనకు కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్రెడ్డి ఇప్పుడు ఆమెకే భక్తుడు అయ్యాడు. మాజీ సీఎం కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఉచితాలు, గ్యారంటీలు ఓట్లు దండుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు. తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచు కోవడం కోసం రాజీపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు’అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అనుభవి స్తోందని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలని శ్రీకాంతాచారితో మొద లు పెడితే ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నా రు. 1,200 మంది అమరులయ్యారు. వారి బలిదానాల తోనే తెలంగాణ వచ్చింది’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ బీబీపాటిల్, పార్టీనేతలు కాసం వెంకటేశ్వర్లు, మనోహర్రెడ్డి, శిల్పారెడ్డి, ప్రేంసింగ్రాథోడ్, ఎన్విసుభాష్, పీఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 1969 ఉద్యమకారులకు బీజేపీ సన్మానం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బీజేపీ నేత డా.కె.లక్ష్మణ్ శాలు వాలతో సన్మానించారు. మాజీ మంత్రులు మేచినేని కిషన్రావు, మర్రి శశిధర్ రెడ్డి, అలాగే యాదగిరి గౌడ్ తదితరులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించి గౌరవించాలని ఉద్యమ కారులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మోదీ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. మేచినేని కిషన్రావు మాట్లాడుతూ.. ‘బీజేపీ చొరవ వల్ల తెలంగాణ సిద్ధించింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఉద్యమకారులుగా తీర్మానం చేశాం. ఈ రోజు నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు. వంద ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలి’అని అన్నారు. -
తెలంగాణలో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెలువడుతున్న వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్పోల్స్ అంచనాలకు భిన్నంగా, జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య తెలంగాణలో పోటాపోటీ వాతావరణం ఏర్పడేట్టు కనిపిస్తోంది. ఈ రెండుపార్టీలు నువ్వా, నేనా అన్నంత స్థాయిలో పోటీపడినట్టుగా ఆయా సంస్థల ఎగ్జిట్పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను.. బీజేపీ అధిక ఎంపీ సీట్లలో గెలుస్తుందని కొన్ని సంస్థలు అంచనా వేస్తే.. అదేస్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ మరికొన్ని సంస్థలు లెక్క వేశాయి. బీజేపీ, కాంగ్రెస్లు ఎన్నేసి గెలుస్తాయంటే.. ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా ఏకంగా బీజేపీ 11–12 సీట్లలో, జన్కీబాత్ 9–12 సీట్లలో బీజేపీ గెలుపొందుతుందనిఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. బీజేపీ అధిక సీట్లు సాధిస్తుందని ఆరా(08–09), ఇండియాటీవీ–సీఎన్ఎక్స్ (08–10), న్యూస్ 18 సంస్థ (07–10) అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అవకాశాలపై చాణక్య స్ట్రాటజీ సంస్థ 09–10,, ఏబీసీ–సీ ఓటర్ 07–09, పీపుల్స్ పల్స్ 07–09, ఆరా 07–08 స్థానాలు లెక్కన సర్వే ఫలితాలు వెల్లడించాయి. మొత్తంగా వివిధ సంస్థల అంచనాల్లో...కొంచెం అటూ ఇటుగా బీజేపీ, కాంగ్రెస్లకు దాదాపు సగం సీట్ల మేర గెలుచుకోవచ్చనే విధంగా ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఇమేజీ ప్రభావంతో బీజేపీకి మంచి ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇక అన్ని సంస్థల ఎగ్జిట్పోల్స్ బీఆర్ఎస్కు నిరాశాజనక ఫలితాలే రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నాయి. దాదాపుగా అన్ని మెజారిటీ సర్వే సంస్థలు హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎం నిలుపుకుంటుందని పేర్కొనడం గమనార్హం. -
ఏపీ సీఎంగా రెండోసారీ వైఎస్ జగనే
డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి పదవి చేపట్టడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దపూర్ శివారులోని హోటల్ కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలోని తన స్నేహితులు, బంధువుల నుంచి అందిన సమాచారం మేరకు జగన్ మళ్లీ సీఎం అవుతారని, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ గల్లంతు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదని, జూన్ 4న ఫలితాల తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కానుందని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో నిజామాబాద్తో పాటు కాంగ్రెస్ 13 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా కవితను గెలిపిస్తే లిక్కర్ దందాతో ఢిల్లీలో తెలంగాణ పరువు తీసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15 నాటికి రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ఎలాంటి వివాదం లేదని, దీనిపై పనిలేని వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు వెళ్తారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. -
కాంగ్రెస్ పాలనతో మళ్లీ చీకట్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. తె లంగాణలో ఇప్పుడు కరెంటు కో తలు, చీకట్లు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, విద్యుత్ కోతల సమస్యలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’లో కేటీఆర్కు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో కరెంట్ కోతలే లేవంటూ ప్రకటిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను కేటీఆర్ శనివారం రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ‘విద్యుత్ కోతలే లేకుండా పవర్ సెక్టార్లో బీఆర్ఎస్ సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. 2014కు ముందు తరచూ విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ మనకు ఉండేవి. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్ సర్కార్ది. 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయటం కారణంగా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పదేళ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది’అని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ కోతలు లేకుండా కేసీఆర్ చేసిందేమిటని కొంతమంది అడుగుతున్నారని...వాళ్లకోసం కొన్ని వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ‘1,110గా ఉన్న తలసరి వినియోగం 2,110 యూనిట్లకు చేరిక. సౌర విద్యుత్ సామర్థ్యం 71 మెగావాట్ల నుంచి 5,000+ మెగావాట్లకు పెంపు. తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్ల చేరిక. ట్రాన్స్మిషన్ సామర్థ్యం 13,900 మెగావాట్ల నుంచి 37,000 మెగావాట్ల వరకు పెంపు. కేసీఆర్ గారి పాలనలో పవర్ హాలిడేస్ అనే మాటే లేదు’అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు కాంగ్రెస్ సర్కార్ను తిడుతూ పెట్టిన కామెంట్లను కేటీఆర్ రీపోస్ట్ చేశారు. అమరుల స్తూపానికి ఇనుప కంచె..కేటీఆర్ ఎద్దేవా గన్పార్క్లో అమరవీరుల స్థూపం వద్ద ఇనుప కంచెతో బ్యారికేడ్ ఏర్పాటు చేయడంపై కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘మార్పు వచ్చింది’అనే శీర్షికతో ‘ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెచ్చేలా అమరుల స్థూపానికి కూడా ఇనుప కంచెలు తెచ్చింది’అంటూ కంచె ఏర్పాటు చేసిన ఫొటోను ట్యాగ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్తో సంబంధంలేకుండా ఫలితాలు: కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా ఫలితాల్లో ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అమరజ్యోతి వద్ద నివా ళులు అర్పించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. జీవితంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని, అమరులకు నివాళులు అర్పించని వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటాలను, అమరుల త్యాగాన్ని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులను చంపినది, బలిదానాలకు కారణమైనదే కాంగ్రెస్ అని మండిపడ్డారు. -
అమరులకు కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో.. తొలిరోజున సాయంత్రం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొవ్వొత్తితో అమరజ్యోతిని వెలిగించి అమరులకు నివాళి అర్పించారు. అనంతరం అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని కేసీఆర్ ప్రారంభించారు. వెయ్యి మందికిపైగా తెలంగాణ కవులు, కళాకారులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందినవారితోపాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సుమారు రెండు గంటల పాటు ర్యాలీ కొనసాగింది. అమరులకు నివాళి అర్పిస్తూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. రవీంద్రభారతి, ఆర్బీఐ మీదుగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ‘జోహారులు.. జోహారులు.. అమరులకు జోహారులు.. వీరులకు జోహారులు’అంటూ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి అందరూ అమరులకు నివాళి అర్పించారు. నేడు తెలంగాణ భవన్లో వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9.30కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ‘తెలంగాణ యాది’పేరిట ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. తర్వాత తెలంగాణ భవన్ పక్కనే ఉన్న కళింగ భవన్లో పార్టీ నేతలతో కలిసి భోజనం చేస్తారు. ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ: కేసీఆర్ ప్రజాస్వామిక వాతావరణంలో, పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పర్చుకుంటూ సమర్థవంతంగా పాలన అందించిన గత పదేళ్లలో.. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచిందన్నారు. అమరుల త్యాగాలను వృధాపోనీయకుండా.. గత పదేళ్ల ప్రగతిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. -
‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బి–టాక్స్, యు–ట్యాక్స్, ఆర్ఆర్– ట్యాక్స్ రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25న కమిటీ వేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించింది..’అని కేటీఆర్ విమర్శించారు. టెండర్ మొత్తానికంటే అదనంగా వసూళ్లు ‘మిల్లర్లు క్వింటాలు రూ.2,100కు కొంటామన్నప్పటికీ సగటున రూ.200 తగ్గించి రూ.1,885– రూ.2,007 మధ్య ఆ 4 సంస్థలు కొనేలా ఒప్పందం చేశారు. టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చెల్లించాలి. మిల్లర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. కానీ మిల్లర్లతో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్కు పాల్పడ్డాయి. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డాయి. టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ‘సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. పార్లమెంటు ఎన్నికలు’అంటూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.236 అదనంగా చెల్లించి తీరాలని ఒత్తిడి చేస్తున్నారు. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామంటూ బంపరాఫర్ కూడా ఇచ్చారు. ఈ మేరకు జలసౌధలో అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 35 ఎల్ఎంటీలకు గాను కింటాలుకు రూ.200 చొప్పున రూ.700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం లిఫ్ట్ చేసేందుకు గడువు ఈ నెల 23తో అయిపోయింది. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన రూ.700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్లైన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు..’అని కేటీఆర్ ఆరోపించారు. సన్న బియ్యం పేరిట మరో స్కాం ‘రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలి. వీటి కోసం కూడా పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.42–45 ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు రూ.15 అదనంగా అంటే రూ.57కు టెండర్ ఖరారు చేశారు. 2.20 ఎల్ఎంటీలకు కిలోకు అదనంగా రూ.15 చొప్పున రూ.300 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.1,000–1,100 కోట్ల స్కామ్ జరిగింది..’అపి కేటీఆర్ వివరించారు. ‘మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి విద్యాశాఖకు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులే కొనాల్సి వచ్చేది. కానీ 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం కిలో రూ.22.59 పైసలకు అమ్మేశారు..’అని విమర్శించారు. -
పట్టభద్రుల పట్టమెవరికి ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.సోమవారం పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ మోసం చేసిందంటున్న బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్క్యాలెండర్ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది.రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్ఎస్ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంలో గత పదేళ్లలో 2.36 లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 26.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి వేయి చొప్పున కేవలం 10 వేల పోస్టులు భర్తీ చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 19 రెట్లు ఉద్యోగాలిచి్చనా ప్రజలకు చెప్పుకోలేకపోవడం తనతో సహా తమ పార్టీ నేతల వైఫల్యం అని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా తెలంగాణ యువత మెదడు నిండా అబద్ధాలను నింపి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 వేల ఉద్యోగాలు ఇచి్చనట్లు ఊదరగొడుతూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతోంది. ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా? సీఎం స్థాయిలో రేవంత్ ప్రజలకు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు చూస్తే బాధ అనిపిస్తోంది’అని కేటీఆర్ అన్నారు. 95 శాతం రిజర్వేషన్ల ఘనత కేసీఆర్దే.. ‘రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, నాన్ లోకల్ కేటగిరీ పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో అటెండర్ నుంచి గ్రూప్–1 దాకా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్దే. పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చాం. అందులో 2.02 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1.60 లక్షల పోస్టులు భర్తీ చేశాం. మరో 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి.విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ఇది అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన 32,517 ఉద్యోగాలను రేవంత్ దుర్మార్గంగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గ్రూప్–1, డీఎస్సీ నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టులు పెంచకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. సీఎం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు అతీగతి లేదు. నిరుద్యోగ భృతి అంటూ ప్రియాంక గాంధీ నోట కూడా అబద్ధాలు చెప్పించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ‘బ్రూ’ట్యాక్స్ మొదలైంది ‘రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. భట్టి, రేవంత్, ఉత్తమ్ ఎవరి దుకాణం వాళ్లదే అన్నట్లు మొత్తంగా ‘బ్రూ (బీఆర్యూ)’ట్యాక్స్ మొదలైంది. బిల్డర్ల పైనా కూడా ట్యాక్స్ వేస్తూ దోచుకుంటున్నారు. త్వరలో జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సామంత రాజులు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి మూర్ఖుడు, జోకర్లా తయారయ్యాడు. ప్రైవేటు సెక్టార్లో కష్టపడి తెచ్చిన పరిశ్రమలకు కూడా రేవంత్ పాతర వేస్తున్నారు.5 లక్షల ఉద్యోగాలు వచ్చే ఫార్మాసిటీని రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తారట. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 15 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకు వచి్చన కేన్స్ టెక్నాలజీ వెళ్లిపోయింది. రూ.వేయి కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపిన కేన్స్ గుజరాత్కు వెళ్లింది. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా అనే సంస్థ వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది’అని కేటీఆర్ అన్నారు. వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడే పార్టీ బీఆర్ఎస్ సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ బీఆర్ఎస్ అని, మీరంతా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు శనివారం తెలంగాణ భవన్లో ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందని చెప్పారు.బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుంటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా మొత్తాన్ని అందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 5,522 మందికి రూ.118 కోట్లకుపైగా బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం వెచి్చంచామన్నారు. అధికారంలో లేనంత మాత్రన పార్టీ చేసే కార్యక్రమాలేవీ ఆగవని, భవిష్యత్లో కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని కేటీఆర్ సూచించారు. -
హైదరాబాద్పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్, బీజేపీలది రాజకీయం.. కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం. పోరాటాలు చేసి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇవ్వాళ బీజేపీ కొత్త కుట్ర చేస్తోంది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తరట.. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటదా.. తల లేని మొండెం అయిపోతాం మనం. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి హైదరాబాద్ను యూటీ చేయాలని లేదా మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలని కుట్రలకు తెరతీస్తున్నారు.తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించండి’అని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన మాట్లా డారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతుండగా, ఇప్ప టి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను మరో పదేళ్లు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.రైతులను ఆ మంత్రి కుక్కలతో పోలుస్తారా? సత్తుపల్లిలో సమావేశం అనంతరం తల్లాడ మండలం నూతనకల్లో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులతో హరీశ్రావు మాట్లాడారు. వర్షాలు పడినా జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి చెక్కులు రాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘వడ్లకు బోనస్ ఇవ్వమంటే ఇవన్నీ వ్యవసాయం తెలియని వారి మాటలని.. రైతులు మొరుగుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి అనడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయ శాఖ మంత్రి కుక్కలతో పోలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటు వృథా చేసుకోవద్దు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హరీశ్రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా విత్తనాలు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో మండల వ్యవసాయ శాఖా« దికారులతో మాట్లాడారు. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మాట్లాడు తూ పట్టభద్రులు తమ ఓటును వృథా చేసుకోవద్దని కోరారు.సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిమ్స్ ఆసుపత్రులపై కాంగ్రెస్ది రాజకీయం: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఐదు నెలలుగా నిర్మాణ పనుల పర్యవేక్షణను గాలికి వదిలిన మంత్రి కోమటిరెడ్డి.. గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. -
కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా!: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాష్ట్రంలో ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు..మోటార్లు, ఆస్పత్రుల్లో గంటల తరబడి కరెంటు కోతలు, ఎండుతున్న చెరువులు.. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? ఒక్కసారి ఆలోచించి వారికి ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలి..’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. మోసపోతే గోసపడుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. కేసీఆర్ లక్ష మాఫీ చేసిన వారికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేస్తారో వేయాలి..’అని అన్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఓ మెజీషియన్.. పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ప్రజలను ఇంకా నమ్మించాలని చూస్తున్నాడు..’అని ధ్వజమెత్తారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్, హనుమకొండలలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు. రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈస్ట్మన్ కలర్ సినిమా చూపించారు. కానీ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం నాటి ఘటనే ఉదాహరణ. ఎంజీఎం లాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ పోవడం దారుణం కాదా? ఆరు నెలల క్రితం వ్యవసాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం అందిందా? వంద రోజుల్లోనే చేసేస్తామన్న హామీలు ఏమయ్యాయి? రూ.2500 వచ్చినయా? ఏడాదిలో రూ.2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏదీ చేయలేదు. నాట్లు వేసే నాడు వేయాల్సిన రైతుబంధు..ఓట్లు వేసే నాడు రేవంత్రెడ్డికి గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని హామీలు ఆమలు చేస్తున్నట్లు రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీలు కూడా ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెబుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల ప్రగతి చెప్పుకోవడంలో విఫలమయ్యాం ‘గత పదేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. కానీ మనం చేసిన మంచి పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యాం. యూట్యూబ్లలో మనపై తప్పుడు ప్రచారాలు చేశారు. దీని కారణంగానే 1.8 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించి కాంగ్రెస్కు తగ్గిన బుద్ధి చెప్పాలి..’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో రాకేశ్రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీలు డా.బండా ప్రకా‹Ù, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యేలు డా.సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటిన కేటీఆర్ గీసుకొండ: రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటారు. బుధవారం హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళుతుండగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు సమీపంలో అంజయ్య అనే వ్యక్తి మోపెడ్పై వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనపడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయం గమనించిన కేటీఆర్ కారు ఆపి అతన్ని పరిశీలించారు. వెంటనే గన్మెన్ల సాయంతో తన కాన్వాయ్లోని ఓ వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సంపేటకు వెళ్లారు. ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు – పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు – కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టళ్లు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో పాటు మళ్లీ ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం. బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులతో క్యూలు కడుతున్నారు. అయినా కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..’అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
నల్లగొండ టూటౌన్/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్ మాట్లాడారు.‘‘కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్ మెడ లిస్ట్ కావాలో.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లలో పట్టు సాధించేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక వ్యూహాన్ని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఖరారు చేశారు.అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం చేసిన కేటీఆర్ బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఈ నెల 25న ముగియనుండటంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయన ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్రావు కూడా ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాగర్కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున లోక్సభ అభ్యరి్థగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరునూ కలిసి.. శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ స్థానం నుంచి బీఆర్ఎస్ వరుసగా నాలుగు పర్యాయాలు గెలవడంతో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచార గడువు, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయానికి బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.మండలాల వారీగా పట్టభద్రులు నియోజకవర్గం ఓటరు జాబితాను సమన్వయకర్తలకు అందజేసి, క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటరును పార్టీ కేడర్ కలిసేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో వైఫల్యం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విద్యార్హతలు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి తదితరాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతీ ఓటును ఒడిసి పట్టేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరును ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసంతృప్త నేతలకు బుజ్జగింపు ఏనుగుల రాకేశ్రెడ్డి అభ్యరి్థత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కోరుతున్నారు. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యరి్థత్వం ఆశించిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం కేటీఆర్ను కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఇదే కేటీఆర్ ఈ నెల 22న ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. హరీశ్రావు ఈ నెల 23న భూపాలపల్లి, వర్దన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, 24న సత్తుపల్లి, వైరా, మధుర, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. -
కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
సాక్షి, హైదరాబాద్ /దేవరకొండ: ఎన్నికల హామీ లను వరుసగా తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇవ్వడంలోనూ మాట తప్పిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిందన్నారు. అదే తరహాలో వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలోనూ కాంగ్రెస్ పచ్చి అబద్ధాలతో రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తుండగా కేవలం సన్న వడ్లకు మాత్రమే వచ్చే సీజన్ నుంచి బోనస్ ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరం. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పదిశాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుంది. కానీ దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం.. అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే’ అని హరీశ్రావు పేర్కొన్నారు. 5నెలల్లోనే కుప్పకూలిన డయాగ్నొస్టిక్ వ్యవస్థతెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంపై ‘ఎక్స్’లో హరీశ్ స్పందించారు. నాణ్యమైన వైద్య పరీక్ష లను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రస్తు తం నిర్వహణలోపంతో కొట్టుమిట్టాడుతున్నా యని చెప్పారు. బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవులకు ఝూటా హామీలు‘రాష్ట్రంలో బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవు లకు ఝూటా హామీలు.. ఇది రేవంత్ పాలన’ అని హరీశ్రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి కనీలాల్ ఇటీవల మరణించారు. ఆయనకు నివాళి అర్పించడానికి హరీశ్ రావు దేవరకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచించి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. -
ప్రశ్నించే గొంతు మండలిలో ఉండాలి
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు/సూపర్బజార్ (కొత్తగూడెం): ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. రూ.400 ఉన్న టెట్ ఫీజు రూ.2 వేలు చేసింది. వీటిపై మండలిలో గళం విప్పి గర్జించాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డిని గెలిపించాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందులో వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల రాకేష్రెడ్డి గోల్డ్మెడలిస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్మెయిలర్ అని, 74 రోజులు జైలులో గడిపారని, అలాంటి వ్యక్తి పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా అని ప్రశ్నించారు. విద్యావంతులు ఎన్నుకునే వ్యక్తి వారి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించాలన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించా మని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను ఎమ్మెల్యే పద వికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వెనకబడి.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మాయలో పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల న్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్లు అదానీకి అమ్మేస్తాయని ఆరో పించారు. ఆయా సభల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏను గుల రాకేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్కు లేఖ రాశారు.అత్యవసరమైన అంశాలు మాత్రమే..లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు.. అత్యవసరమైన, నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని ఈ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నిరీక్షించడం సాధ్యం కాని, అత్యవసరమైన అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చాలని పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరినీ సమావేశానికి హాజరుకావాలని కోరరాదని ఆదేశించింది.కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు!వాస్తవానికి గత శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసుకుంది. సోమవారంలోగా ఈసీ అనుమతించకుంటే మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు కూడా. కానీ తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి తొలగిపోయింది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాకాలం పంటల సాగు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే
హనుమకొండ/భువనగిరి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు ఒక్క తాను ముక్కలేనని, జెండాలే వేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి దుయ్యబ ట్టారు. శనివారం హనుమకొండ, భువనగిరిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హనుమకొండలో కేజీ టు పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపించగా, బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని విమర్శించారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి రింగ్రోడ్డును అమ్మిందని, ఐదు నెలల ముందు మద్యం టెండర్లు నిర్వహించిందని, హైదరాబాద్లో స్థలాలు అమ్మిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇవ్వడానికి తంటాలు పడుతోందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేదని కిషన్రెడ్డి విమర్శించారు. కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ను ప్రజలు అదరించారు తప్ప.. అభిమానంతో ఆ పార్టీకి ఓట్లు వేయలే దన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో జరిగిన నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశానికి కిషన్రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని, అధికార గొంతులు, ధిక్కార స్వరాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా ‘ఎక్స్’లో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఏనుగుల రాకేశ్రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యను చదివాడన్నారు. ప్రజా సేవ లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాకేశ్రెడ్డి.. వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆర్థిక సంబంధమైన అంశాలపై రాకేశ్రెడ్డి పలు పుస్తకాలు కూడా రాశాడని కేటీఆర్ చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యే విద్యార్థులు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ, హనుమకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారన్నారు. విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై రాకేశ్రెడ్డి గళం విప్పారని తెలిపారు. ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్నందునే రాకేశ్రెడ్డిని శాసనమండలి పట్టభద్రుల కోటా ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించినట్లు కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు భువనగిరి నియోజకవర్గంలోని సాయి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో పాల్గొని అక్కడి ఓటర్లతో మాట్లాడనున్నారు. అలాగే మధ్యా హ్నం 12 గంటలకు ఆలేరు నియోజవర్గంలోని ఎమ్మడి నరసింహారెడ్డి గార్డెన్స్లో జరిగే సమావేశంలో పాల్గొని ఓటర్లు, నాయకులతో కేటీఆర్ సమావేశం అవుతారు. -
రేపే లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. అంతా రెడీ
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు. -
నేడు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్నగర్ వరకు భారీ రోడ్షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్కర్నూల్కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత.. రాజీనామా లేఖతో హరీశ్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్ల మాటల యుద్ధం సాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రాజీనామా లేఖతో గన్పార్క్కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీష్రావు సవాల్తో పోలీసులు భారీగా మోహరించారు. గన్పార్క్ వద్ద అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.దమ్ముంటే సీఎం రేవంత్ తన సవాల్ స్వీకరించాలి..గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు.. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. ఆయనకు రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతోనైనా స్టాఫ్తోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. జర్నలిస్టుల సాక్షిగా.. మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు.‘‘ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గన్ పార్కు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హరీశ్రావుకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ, రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటూ మరోసారి ఎన్నికల స్టంట్ వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే హరీష్ రావు సవాల్ను స్వీకరించి ఇక్కడికి రావాలి. ఇవాళ కాకున్నా రేపైనా హరీష్ రావు సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని తలసాని డిమాండ్ చేశారు. -
నేడు బీజేపీ కీలక నేతల నామినేషన్లు.. అక్కడి అభ్యర్థిపై ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో నామినేషన్ట ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్ కొనసాగుతోంది. బీజేపీ హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థికి ఇంకా బీఫామ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. ఇక, కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. మరోవైపు.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత తాజాగా కిషన్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్లో ప్లాన్ మార్చిన మధు యాష్కీ.. వారిద్దరే కారణమా?
తెలంగాణ కాంగ్రెస్కు కొన్ని చోట్ల డిమాండ్ బాగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులే కనిపించడంలేదట. ఎంపీ సీట్ల విషయంలో ఈ అయోమయం కొనసాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ సెగ్మెంట్లో నాలుగు సార్లు పోటీ చేసిన నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారట. రెండుసార్లు గెలిచి, రెండు సార్లు ఓడిన ఆ నేత వలస వెళ్ళాలని అనుకుంటున్నట్లు టాక్. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎక్కడకు వెళ్లబోతున్నారు.. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు లోక్సభలో అడుగుపెట్టిన మధుయాష్కీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా?. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు ఎవరూ కనిపించడంలేదట నిజామాబాద్ కాంగ్రెస్లో. అయితే, యాష్కీ పోటీ చేయాలని అక్కడి కేడర్ భావిస్తున్నా.. ఆయన చాలాకాలం నుంచి నిజామాబాద్లో పర్యటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మధుయాష్కీ ఈసారి పోటీ చేస్తారా? లేక వేరే మరెక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏదైనా హామీ లభించిందా? అనే ప్రశ్నలు పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. కవిత, అర్వింద్ చేతిలో ఓటమి.. ఇక, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో రెండుసార్లు వరుసగా నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికైన మధుయాష్కీ 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత చేతిలో ఓటమి చెందారు. అలాగే 2019 ఎన్నికల్లో మరోసారి కాషాయ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఒకనాడు కాంగ్రెస్లో కీలకంగా ఉన్న సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడైన అరవింద్ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతర్గతంగా పనిచేశాయని అప్పుడు ప్రచారం జరిగింది. రెండుసార్లు ఓటమి చెందడంతో కొంతకాలంగా మధు యాష్కీ నిజామాబాద్ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు సీటుపై ఆసక్తి తగ్గిందనే ప్రచారం కాంగ్రెస్లోనే జరుగుతోంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడి పేరున్న మధు యాష్కీకి మరోచోట సీటు హామీ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ లేదా రంగారెడ్డి జిల్లాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. తెరపైకి ఎన్ఆర్ఐ!.. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం మహారాష్ట్ర బోర్డర్ బోధన్లో మొదలై.. జగిత్యాల నియోజక వర్గం వరకూ విస్తరించి ఉంది. మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం అంతా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ ఈ పార్లమెంట్ సీటు గురించి పట్టించుకున్నవారు కనిపించడంలేదు. మధుయాష్కీ పోటీ చేయకపోతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లేదా ఎవరైనా ఎన్ఆర్ఐతో పోటీ చేయిస్తారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. మొత్తానికి రెండుసార్లు ఓటమితో మధుయాష్కీ నిజామాబాద్ను వదిలేశారనే ప్రచారం అయితే జిల్లాలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్లాన్ మార్చిన కేసీఆర్.. కొత్త నేతకు లైన్ క్లియర్! -
బీజేపీ విజయానికి కృషి చేయాలి..! పాయల్ శంకర్
పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్: వచ్చే ఎన్నికల్లో విజయం సాఽధించేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవపూర్, కుచులపూర్ గ్రామాల్లో బీజేపీ మహాజన్ సంపర్క్లో భాగంగా టిఫిన్ బాక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాఽధించేలా గ్రామాల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. అధికార పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. సమయం తక్కువగా ఉందని, ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్, లోక ప్రవీణ్రెడ్డి, రఘుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మానాజీ, జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి, బాబారవ్ పటేల్, జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, బోథ్ అసెంబ్లీ కన్వీనర్ సూర్యకాంత్ గిత్తే, తలమడుగు మండల అధ్యక్షులు బోనగిరి స్వామి, ఇచ్చోడ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో టికెట్ల పోరు.. నీదా..! నాదా..! ఎవరరిది..?
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్లో చేరనుండటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. మరోవైపు వారి చేరికకు ముందే చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. త్వరలో ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్లో అంతర్గత పోరు తప్పదన్న సంకేతాలను చూపుతోంది. జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొల్లాపూర్ వేదికగా నిర్వహించేందుకు తలపెట్టిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం ఇరువర్గాలుగా నేతలు తమ బలప్రదర్శనను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుంటారా..! కాంగ్రెస్లోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ టికెట్ కోసం అంతర్గత పోరు తప్పేలా కనిపించడం లేదు. జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ నేత చింతలపల్లి జగదీశ్వర్రావు భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. ఏళ్లుగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల నిర్వహణ, సభ్యత్వాలను పెంచి పార్టీ బలాన్ని పెంచానని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జూపల్లికి పార్టీలో అంతర్గత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కేడర్లో నెలకొంది. సర్వేల చుట్టూ రాజకీయాలు.. నాగర్కర్నూల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం కాగా.. వచ్చే ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నుంచి టికెట్ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు. పార్టీలో అంతర్గత పోరును కట్టడి చేసేందు కు సర్వేల ద్వారా టికెట్లను ఖరారు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వే మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అ యితే సర్వేలతో పనిలేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి అవకాశం ఇవ్వాలని నాగం, జగదీశ్వర్రావులు డిమాండ్ చేస్తున్నారు. సమీకరణాలపై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి నేతల చేరికలతోపాటు పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వారి చేరికకు ముందే కొత్త, పాత నేతల మధ్య వైరం పెరుగుతుండటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఆదివారం కొల్లాపూర్లో నిర్వహించిన సమావేశానికి హాజరైన నాగం జనార్దన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకుండా చేస్తే వారిని ఓడిస్తామనే సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే ఇందుకోసం వ్యతిరేకులను అంతా ఏకం చేసే యోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఇరువర్గాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు, వారి పట్టింపుల నడుమ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పార్టీ ఆదేశించిన విధంగా కొత్త, పాత నేతలు నడుచుకుంటారా.. అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది. -
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ బీజేపీ సారథిగా సీనియర్ నేత కిషన్ రెడ్డికి అధినాయకత్వం పట్టం కట్టింది. కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కిషన్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను. ప్రధాని మోదీ సభ తర్వాత అధికారికంగా బాధ్యతలు తీసుకుంటాను. ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు వస్తాను. ఈరోజు రాత్రి 8 గంటలకు పదాధికారులతో సమావేశం జరుగుతుంది. ప్రధాని సభకు ఏర్పాట్లు చేయాలి. రెండు పదవులు నిర్వహించడం కష్టం అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. కిషన్ రెడ్డితో పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. మంత్రవర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రమంత్రి పదవికి కిషన్రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ముచ్చటగా మూడోసారి.. మరోసారి పగ్గాలు అప్పగించింది అందుకేనా? -
తెలంగాణ పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్కు ఎఫెక్ట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, ఇప్పటి వరకు దోస్తీలుగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్కు డెరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేశారు. దీనికి షకీల్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు.. అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్ ఒవైసీ.. తెలంగాణ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. పాతబస్తీ అభివృద్ధి, మెట్రో సేవలపై అసెంబ్లీ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తూ అధికార పార్టీపై ఫుల్ ఫైరయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కేటీఆర్.. ఎంఐఎంకు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. మొన్న నిజామాబాద్లో అసదుద్దీన్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఒవైసీ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. అంతేకాదు.. దళిత బంధులా.. ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందనే వాళ్లు దీనిని గమనించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని హైదరాబాద్ లోక్సభ స్థానంలో ప్రజల ఆదరణతో తామే మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో జట్టు కడతామన్నది ఎన్నికలనాటికి చెబుతామని అనడం కీలకంగా మారింది. అయితే, బీఆర్ఎస్పై ఎంఐఎం ఆరోపణల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ప్లాన్ మార్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు కాకుండా కాంగ్రెస్కు చేరువయ్యేందకు మజ్లిస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు! -
బీఆర్ఎస్, బీజేపీకి షాక్!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాజకీయాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాహుల్ సభ విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు. కాగా, పొంగులేటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభకు సంబంధించి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా ఆయనను రాహుల్ సన్మానిస్తారు. సభకు జనాన్ని రానివ్వకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ సభకు వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. నా చేరికతో ఖమ్మం కాంగ్రెస్లో ఒక వర్గం అసంతృప్తితో ఉన్నారని జరుగుతున్న ప్రచారం వెనుక కొందరి కుట్ర ఉంది. జిల్లా కాంగ్రెస్లో ఎటువంటి గ్రూపులు ఉండవని అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం అని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్లో చేరికలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. వారి పేర్లు ఇప్పుడే చెప్పను.. వారు ఎవరో మీరే చూస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీలో మరో ట్విస్ట్.. రాజాసింగ్పై విజయశాంతి సంచలన ట్వీట్ -
ఇదీ తెలంగాణలో సంగతి!.. మోదీ వద్ద కీలక చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరిపే మార్పుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కవచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి అవసరమైన మేర సంస్థాగతంగా మార్పులు, ఎన్నికల ప్రచార కమిటీలు, మరింత మెరుగైన సమన్వయానికి ముఖ్యమైన కమిటీలను నియమించే అవకాశాలున్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్ర పార్టీలపై ప్రత్యేక దృష్టి.. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా వివరించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ జాతీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సహా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరంతో పాటు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై బుధవారం అర్ధరాత్రి వరకు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. దీనికి అమిత్షా, నడ్డాలతో పాటు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈటల, రాజగోపాల్ సూచనలు ఈ సందర్భంగా తెలంగాణలో నేతల సమన్వయలేమి, సీనియర్నేతలు అసంతృప్తి వ్యక్తంచేయడం, ముఖ్యనాయకుల ఏకపక్ష ధోరణి వంటి ఇటీవలి రాజకీయ పరిణామాలను షా, నడ్డాలు మోదీకి వివరించినట్టు సమాచారం. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లోపించడం, కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో మొదలైన చేరికలు, పార్టీ నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చలు వంటి అంశాలపై నివేదించారు. అలాగే ఎన్నికల్లో పార్టీ గట్టెక్కాలంటే తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు చేసిన సూచనలపైనా ఇందులో చర్చించినట్లు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా నడ్డాకు పలువురు సీనియర్నేతలు తమ అసంతృప్తిని, అందుకు గల కారణాలను వివరించిన సంగతి కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అయోమయం, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమైన కమిటీలకు నియామకాలు.. అగ్రనేతల సమావేశంలో కొన్ని కీలక కమిటీల నియామకాలపై చర్చ జరిగిందని సమాచారం. జూలై మొదటి వారానికి ముఖ్యమైన కమిటీల నియామకాలను పూర్తి చేయాలని, నేతల మధ్య సమన్వయం చెడకుండా ఎప్పటికప్పుడు వారితో చర్చించాలని మోదీ సూచనలు చేసినట్లు తెలిసింది. దీంతో పాటే బడుగు, బలహీన వర్గాల ప్రజలతో మమేకం అయ్యేలా నియోజకవర్గస్థాయి కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష మార్పులతో పాటు, ఆయా రాష్ట్రాల నుంచి కొత్తవారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలనే అంశంపై కూ డా చర్చలు జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశం రద్దు.. అయితే ఏయే రాష్ట్రాల్లో మార్పులుచేర్పులు ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. తెలంగాణలో నాయకత్వ మార్పుతో పాటు, కేంద్రమంత్రివర్గంలో ఒకరికి చోటు లభిస్తుందని ఊహాగానాలు వస్తున్నా, వాటిపై జాతీయ నాయకత్వమే స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. ఇదే భేటీలో తెలంగాణలో ఈ నెల 8న ప్రధాని పర్యటన షెడ్యూల్ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. వరంగల్లో ప్రధాని పర్యటనను పురస్కరించుకొని ఈ నెల 8న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నాయకుల సమావేశాన్ని సైతం రద్దు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇది కూడా చదవండి: చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది! -
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది: జేపీ నడ్డా
Updates.. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ది దిశగా సాగుతోందని, తెలంగాణ అభివృద్ధిలో మోదీ చేయాల్సింది అంతా చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం ఆయన నాగర్ కర్నూల్లోని నవ సంకల్పసభలో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సామర్థ్యాన్ని కేసీఆర్ నాశనం చేశారు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘తెలంగాణ వికాసం కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు. తెలంగాణకు మోదీ భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. 80 కోట్ల ప్రజలకు మోదీ ప్రభుత్వం రేషన్ ఇస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధితో రైతులను కేంద్రం ఆదుకుంటోంది. మొత్తం ఐరోపా ఖండం కన్నా ఐదు రెట్ల మందికి రేషన్ అందుతోంది. దేశంలో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ఉజ్వల, ఉజాలా పథకాలతో గ్యాస్ అందిస్తున్నాం. ఆయుస్మాన్ పథకంతో ఎంతోమందికి బీమా కల్పించాం. మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. ♦సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్కు వెళ్లనున్న జేపీ నడ్డా.. అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ♦ సంపర్క్ సే సమర్థన్ ప్రచారంలో భాగంగా ఫిల్మ్నగర్లో క్లాసికల్ డ్యాన్సర్, పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర జయంత్తో జేపీ నడ్డా, కిషన్రెడ్డి భేటీ అయ్యారు. మోదీ పాలనలో అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాలను ఆనంద శంకరకు అందించారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా: ప్రొ.నాగేశ్వర్ జేపీ నడ్డాతో భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ పాలన గురించి నడ్డా వివరించారని తెలిపారు. ‘‘వివిధ అంశాలపై సమావేశంలో చర్చించాం. దేశవ్యాప్తంగా అనేకమందిని కలుస్తున్నారు. అందులో భాగంగానే నన్ను కలిశారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా. ప్రజాస్వామ్యంలో ఇలా కలుసుకోవడం శుభపరిణామం. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిది’’ అని నాగేశ్వర్ పేర్కొన్నారు. ♦ప్రొఫెసర్ నాగేశ్వర్తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకానికి నాగేశ్వర్కు ఆయన అందించారు. నడ్డా వెంట తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు ఉన్నారు. ♦ నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. ♦ ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందరావు, విజయశాంతి, వివేక్ తదితరులు ఉన్నారు. ♦ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డా. ♦బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలులో బీజేపీ తలపెట్టిన సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ♦ అయితే, కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా, రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించి దిశానిర్దేశం చేసే విషయంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో ముఖ్యనేతల మధ్య సమన్వయం కొరవడి బీజేపీ డీలాపడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు. ♦ జేపీ నడ్డా.. మధ్యాహ్నం ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు. నడ్డా పూర్తి షెడ్యూల్ ఇదే.. ♦ ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతారు. ♦ మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్లో రిజర్వ్ టైమ్. ♦ 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొ.నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు సమావేశమవుతారు. ♦ 2.55 నిమిషాలకు ఫిల్మ్నగర్లో పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ను కలుసుకుంటారు. ♦ 3.50కి నోవాటెల్కు చేరుకుంటారు. ♦ 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగర్కర్నూ ల్కు బయలుదేరి 4.50కు అక్కడికి చేరుకుంటా రు. ♦ సాయంత్రం 5–6గంటల మధ్య నాగర్కర్నూల్ జెడ్పీ హైసూ్కల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. ♦ 6.15కు హెలి కాప్టర్లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్కు చేరుకుంటారు. ♦ 6.45 గంటలకు ప్రత్యేక విమా నంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు. -
ఢిల్లీలో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్.. హస్తినాలో ఏం జరుగుతోంది?
సాక్షి, ఢిల్లీ: ఒక వైపు కేంద్ర మంత్రులతో కేటీఆర్ వరుస భేటీలు.. మరో వైపు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలతో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం.. దీంతో ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. పార్టీ హై కమాండ్ నుంచి పిలుపు మేరకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మరో వైపు హోం మంత్రి అమిత్షాతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇప్పటికే రాజ్నాథ్, హర్దీప్సింగ్, పీయూష్ గోయల్ను కేటీఆర్ కలిశారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ దగ్గరవుతున్నాయంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కేటీఆర్కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులు ఏఐసీసీ నేతలను కలిసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 26న ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఈనెల 25న కలవాలని అనుకున్నా రాహుల్ అపాయింట్మెంట్ 26న లభించడంతో ఆ రోజున ఢిల్లీ వెళుతున్నట్టు పొంగులేటి శిబిరం చెబుతోంది. చదవండి: కమలం పార్టీ శ్రేణుల్లో గుబులు.. నిధుల వాడకం వ్యాఖ్యలతో మైనస్ కానుందా? పొంగులేటి, జూపల్లిలు తమ ముఖ్య అనుచరులతో కలిసి ఆ రోజున రాహుల్గాంధీని కలిసినప్పుడే వారు పార్టీలో ఎప్పుడు చేరాలన్న దానిపై ఓ స్పష్టత రానుంది. వచ్చే నెల మొదటి వారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముగిసే అవకాశమున్నందున అదే నెల 2న లేదా మరో రోజున ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే సభలో పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆయన ఖమ్మంలో తన అనుచరులతో కలిసి సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఇక, ఖమ్మంలో జరిగే సభలో మాజీమంత్రి జూపల్లి కూడా కాంగ్రెస్లో చేరతారా లేక మహబూబ్నగర్లో సభ నిర్వహిస్తారా అన్నది కూడా రాహుల్గాంధీని కలిసిన రోజునే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. చదవండి: ఆ నియోజకవర్గాల్లో మళ్లీ అదే సీన్ రీపిట్ అవుతుందా? -
కేసీఆర్ను గద్దర్ ప్రశ్నించాలి: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: ‘మహా జన్సంపర్క్ అభియాన్’లో భాగంగా గురువారం నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పోలింగ్బూత్ స్థాయి కార్యకర్త దాకా మొత్తం పార్టీ యంత్రాంగం ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. తెలంగాణలో 30 లక్షల కుటుంబాలను కలుస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 9 ఏళ్ళ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నాం. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందనే విషయాన్నీ ప్రజలకు వివరిస్తున్నాం. తెలంగాణ కోసం 1400 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల ఆశయాలను పట్టించుకోలేదు. కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారు. కేవలం ప్రచారం కోసమే వేయి కోట్లు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. మునిగిపోయే నావ కాంగ్రెస్. మునిగిపోయే నావలో చేరకండి. బీఆర్ఎస్ నేతల అవినీతిపై విచారణ సాగుతోంది. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండవు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ప్రజా గాయకుడు గద్దర్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అంటే మాకు గౌరవం ఉంది. కేసీఆర్ను గద్దర్ ప్రశ్నించాలి. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కేసీఆర్ జిమ్మిక్లో భాగమే. ఈడీ, సీబీఐలతో బీజేపీ సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: మీకు రైతుబంధు రావడం లేదా?.. అయితే ఇలా చేయండి -
రిపోర్టులో ఏముంది?.. టీకాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్!
అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. టీకాంగ్రెస్ అడ్వైజర్ సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏముందనే విషయంపై గాంధీభవన్లో మల్లగుల్లాలు పడుతున్నారు. 150 డేస్ యాక్షన్ ప్లాన్లో ఏముంది? తెలంగాణలో అధికారం సాధించడానికి కాంగ్రెస్ వేస్తున్న ప్లాన్ ఏంటి?.. కర్నాటకలో సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న ఢిల్లీలో రాష్ట్ర పార్టీ నేతలతో అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సమావేశం కాబోతున్నారు. అంతకంటే ముందుగా రాష్ట్రంలో పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఒక నివేదిక అందించారు. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, ఇంకా బలం పెంచుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి సునీల్ తన నివేదికలో పలు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల వారిగా పార్టీ బలాలు, బలహీనతలతో స్పష్టమైన నివేదికను కనుగోలు టీం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితా, బీజేపీలో నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్న నేతల జాబితా కూడా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలోని వారిలో కాంగ్రెస్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నవారి పేర్లు, ఎవరిని తీసుకుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందో అనే వివరాలు కూడా పొందుపరిచినట్లు సమాచారం. టిక్కెట్ హామీ ఇస్తే కాంగ్రెస్ గూటికి చేరే ముఖ్యుల జాబితా కూడా ప్రత్యేకంగా తయారు చేశారట. పార్టీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న నాయకులు మాత్రమే కాదు.. ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా మరింత మందిని ఆకర్షించాలని సూచించినట్లు చెబుతున్నారు. 150 రోజుల యాక్షన్ ప్లాన్.. పార్టీ మైలేజ్ పెంచడం కోసం పార్టీ పెద్దలకు 150 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందట కనుగోలు టీమ్. 150 రోజుల్లో ఏ కార్యక్రమం చేస్తే ఏ మేరకు లాభం కలుగుతుంది అనేదానిపై వివరణాత్మక రిపోర్ట్ ఇచ్చారట. నేతలంతా ఐక్యంగా ఉన్నారనే ఇమేజ్ పార్టీకి ఇప్పుడు అవసరం అని అందుకోసం పీసీసీ, సీఎల్పీ, సీనియర్లతో బస్సు యాత్ర చేయించాలనే ప్రతిపాదనను సునీల్ టీం ఏఐసీసీ ముందు ఉంచిందట. ఇక దీనికి తోడు కేసీఆర్ను ముగ్గులోకి దింపడంలో కాంగ్రెస్ కొంతమేర సఫలీకృతం అయిందని, మరింతగా ఫోకస్ పెట్టాలని సూచించిందని టాక్. ధరణి వెబ్సైట్ విసయంలో సీఎం కేసీఆర్ను బయటకు లాగగలిగామని.. సీఎం నోటి నుంచే ధరణి సమస్యలను చెప్పించగలుగుతున్నామనే అంచనాలతో కనుగోలు టీం ఉందట. తెలంగాణ సెంటిమెంట్తోనే కాకుండా.. ప్రజా సమస్యల చుట్టూ ప్రచారం జరిగితే కాంగ్రెస్కే లాభం అని డిక్లరేషన్ల ద్వారా బీఆర్ఎస్ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు గ్రామ స్థాయి నుండి కార్యాచరణ చేపట్టాలని సునీల్ టీం సూచించిందట. దీంతో పాటు అనుబంధ విభాగాలతో ఆయా రంగ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని, ఇలా ఎవరికి వారు కార్యక్షేత్రంలో ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదనే రిపోర్ట్ సునీల్ ఇచ్చారట. ఈ రిపోర్ట్లోని అంశాల ఆధారంగానే తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ ఉండనుందని, ఇక ఇదే ఎన్నికల శంఖారావంగా భావించొచ్చని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక బాగానే ఉందని టీకాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కాని ఆ రిపోర్ట్ను అమలు చేయడం సాధ్యం అవుతుందా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందనే టాక్ నడుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు: జితేందర్ రెడ్డి -
బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్స్ రచిస్తోంది. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక, తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ సారధిగా నియమించినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకత్వాన్ని సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రొజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈటల రాజేందర్ ఈరోజు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ మేథోమథనం జరిపింది. రెండు రోజుల పాటు దాదాపు పది గంటలు నేతలు సమాలోచనలు చేశారు. కాగా, అధిష్టానం నిర్ణయంతో తెలంగాణ బీజేపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నా టార్గెట్ బీఆర్ఎస్.. వడ్డీతోసహా చెల్లిస్తా: పొంగులేటి -
TS: ఇంఛార్జ్లకు కొత్త టెన్షన్.. బీజేపీకి బిగ్ మైనస్ అదేనా?
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు జాతీయ పార్టీలు ఇంఛార్జ్లను పెట్టుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర ఇంఛార్జ్లు ఏం చేస్తున్నారు? వారి వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్ అవుతాయా?.. జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్ లను నియమించుకుని తమ ప్రణాళికలను అమలు చేస్తుంటాయి. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఇంఛార్జ్ లను పెట్టుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్కు ఇంఛార్జ్ గా మహారాష్ట్రకు చెందిన మాణిక్రావు ఠాక్రే వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి తెలంగాణ వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నలుగురు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శులు శివప్రకాశ్, సునీల్ బన్సాల్ తో పాటు పొలిటికల్ ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్, సహ ఇంఛార్జ్ గా అరవింద్ మీనన్ పనిచేస్తున్నారు. పార్టీలో అన్నీ తామై ముందుకు నడపాల్సిన బాధ్యత ఇంఛార్జ్ లపై ఉంటుంది. రాజకీయ క్షేత్రంలో నేతలను సమన్వయం చేయడం కష్టసాధ్యమైన పని. కాంట్రావర్సీల జోలికి వెళ్లకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ.. కార్యక్రమాలను రూపొందించడం.. పార్టీ నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల్లో అందరిని ఇన్వాల్వ్ చేయడం పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ల కర్తవ్యం. తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ల తీరు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటా అన్నట్లుగా ఉందని సొంత పార్టీలోనే నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసమ్మతి నేతలు తరుచూ భేటీ అవుతున్నారు. అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం సాధించే పనిని వదిలేసి.. ఇంఛార్జ్ లుగా పెత్తనం చేస్తున్నారని మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పలువురు నేతలకు పొసగడం లేదు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా.. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ లు ఇప్పటి వరకు సర్ధుబాటు చేయలేదని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూపీ లాంటి పెద్దరాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా పనిచేసి వచ్చిన సంస్థాగత ఇంఛార్జ్ సునీల్ బన్సల్ చేస్తున్న ప్రయోగాలు తెలంగాణ నేతలు ఒంటపట్టించుకోవడం లేదట. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బూత్ స్వశక్తికరణ్ లాంటి కార్యక్రమాలతో తొలుత హడావిడి చేసినా.. తర్వాత స్థానిక నేతల తీరుతో బన్సల్ విసిగిపోయారట. పొలిటికల్ ఇంఛార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్ తెలంగాణకు రావడమే తగ్గించారు. నేతల మధ్య సమన్వయం కోసం ఎలాంటి వర్క్ అవుట్స్ చేయకపోవడం బీజేపీకి పెద్దమైనస్ గా మారిందని చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికల విజయంతో దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతోంది. టీపీసీసీ ఇంఛార్జ్ గా మాణిక్రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు అంతర్గత గొడవలు తగ్గాయి. పీసీసీ ఛీఫ్ రేవంత్పై పార్టీలో అసమ్మతి జ్వాలలు తగ్గించడంలో ఠాక్రే కీలకంగా వ్యవహరించారని టాక్. గాంధీభవన్ లో అందుబాటులో ఉంటూ..సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతున్నారు. నేతల చేరికలపై ఎప్పటికప్పుడు ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎటువంటి హంగామా లేకుండా తెరవెనక పావులు కదుపుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు జాతీయ పార్టీల నేతలు. నలుగురు ఇంఛార్జ్ లతో బీజేపీ.. ఒకే ఇంఛార్జ్ తో కాంగ్రెస్ ఎన్నికల రేసులో దిగుతున్నాయి. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: TS: సైలెంట్ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే? -
TS: సైలెంట్ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే?
తెలంగాణ కాషాయ సేన రివర్స్ గేర్లో వెళుతోందా? రాష్ట్ర ప్రభుత్వం మీద పోరుకు సిద్ధమైన పార్టీ ఎందుకు వెనకడుగు వేసింది? గులాబీ సేనపై దాడికి ఎందుకు సంకోచిస్తోంది? టీబీజేపీకి ఢిల్లీ పెద్దలు ఇచ్చిన డైరెక్షన్ ఏంటి? అసలు తెలంగాణ కమలం పార్టీ ఆలోచన ఏంటి?.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అధికారం కాపాడుకోవాలని బీఆర్ఎస్, పీఠం ఎక్కాలని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమలదళం స్వరం మారుతోందనే ప్రచారం మొదలైంది. ముందుగా ప్రకటించినట్లుగా కేసీఆర్ సర్కార్పై రివర్స్ అటాకింగ్ ప్రోగ్సామ్స్ నిర్వహించకుండా వాటికి పుల్ స్టాప్ పెట్టింది. కేవలం మోదీ ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతోనే జనాల్లోకి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దల నుంచి ఆర్డర్స్ అందాయని సమాచారం. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీ మీద ప్రజల నుంచి నెగిటివ్ ప్రభావం లేకుండా చూసుకోవాలని కూడా అధిష్టానం సూచించిందట. జన సంపర్క్ అభియాన్ మినహా మిగతా కార్యక్రమాలు ఏవీ పెట్టుకోవద్దని బీజేపీ అగ్రనాయకులు రాష్ట్ర నేతలకు స్ట్రిక్ట్ గా చెప్పేశారట. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వివిధ శాఖలు సాధించిన విజయాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాలను అధికారంలో ఉన్న గులాబీ పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తోందని.. గులాబీ పార్టీ మీద కౌంటర్ ఎటాక్ చేసేందుకు వీలుగా తెలంగాణ బీజేపీ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అయితే బీఆర్ఎస్ మీద రివర్స్ ఎటాక్ చేసే కార్యక్రమాలకు బీజేపీ పార్టీ హైకమాండ్ నో చెప్పడంతో .. ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రెస్ మీట్స్తోనే రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టాలని రాష్ట్ర నాయకులకు పార్టీ అధిష్టానం సూచించిందట. బీజేపీ.. బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా కాషాయ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను రద్దు చేసుకోవడం చర్చకు దారితీసింది. కమలనాథులు మాత్రం జన సంపర్క్ అభియాన్ తర్వాత మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్పై తమ పోరాటం ఆగదని ఎన్నికల వరకు సాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పార్టీలో చేరికపై రేపు పొంగులేటి కీలక ప్రకటన! -
గులాబీ బాస్నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది?
తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ బాస్నే ఢీకొడుతున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? జిల్లాలో పొంగులేటికి కౌంటర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖమ్మం జిల్లాలోని పది సీట్లను గెలుచుకునే విధంగా కేసీఆర్ ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు? గులాబీ పార్టీకి కొరుకుడు పడని జిల్లా ఉమ్మడి ఖమ్మం. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ గూటిలో చేర్చుకుని తమ బలం పెరిగిందని అధికార పార్టీ భావించింది. గత ఎన్నికల్లో ఎంపీ సీటు దక్కని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉంటూ.. గులాబీ బాస్పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. చివరికి పార్టీ నుంచి సస్పెండయ్యారు. ప్రస్తుతం ఏ పార్టీకి అనుబంధంగా లేని పొంగులేటి త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరతారు. పైగా కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను పోటీ పెట్టడానికి సైతం పొంగులేటి ప్లాన్ చేశారు. తాను ఏ పార్టీలో చేరినా వారికి టిక్కెట్ ఇప్పించేవిధంగా హామీ ఇచ్చారు. జిల్లాలో పునాదులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న బీజేపీ, పోయిన బలాన్ని కూడదీసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు పొంగులేటితో మంతనాలు జరుపుతున్నాయి. మే మొదటివారంలో పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున ఒక్క ఎమ్మేల్యేను కూడ గెలవనివ్వనంటూ పొంగులేటి చేసిన శపథం అధికార పార్టీలో మంటలు రేపింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం ఈ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఒక మాజీ ఎంపీ నేరుగా సీఎంనే ఢీకొడుతుంటే ఆ పార్టీ కామ్గా ఉంటుందా? పొంగులేటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ ఎటాక్ చేయాలని గులాబీ దళానికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు పొంగులేటి మీద విమర్శలు సంధించడం ఆరంభించారు కూడా. అదేవిధంగా మే నెలలో పొంగులేటి ఏదో ఒక పార్టీలో చేరతారు గనుక.. అదే నెలలో ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?) గత రెండు ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పదికి పది నియోజకవర్గాలు తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే కేసీఆర్ కూడా ఈ జిల్లాపై పూర్తి స్తాయిలో ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఒకవేళ కాంగ్రెస్లో చేరితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి...ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ఎటువంటి పరిస్తితులనైనా ఎదుర్కొని జిల్లాను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. పార్టీ చేయించిన సర్వేల్లో ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలను ఈసారి మార్చివేసి వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో మార్పులు తప్పవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీలో చేరే విషయాన్ని మే నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించబోతున్నారు. ఇక అప్పటి నుంచే ఖమ్మం జిల్లా పొలిటికల్ ఈక్వేషన్స్లో మార్పులు రావడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొంగులేటి ప్రకటన తర్వాత అసలు గేమ్ మొదలు కాబోతోంది. చదవండి: ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
కుటుంబ ఒత్తిడి!.. బీజేపీలోకి టీకాంగ్రెస్ సీనియర్ నేత?
ఆ నేత ఒకప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరు. ఆవేశం పాళ్ళు కూడా ఎక్కువే. తెలంగాణ వచ్చాక ఆయనకు రాజకీయాలు కలిసిరావడంలేదట. అందుకే ఈ మధ్య సైలెంట్గా ఉంటున్నారా? రాజకీయాల్ని వదిలేయాలనుకుంటున్నారా? లేక పార్టీ మారదామనుకుంటున్నారా? ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు..? దామోదర రాజనరసింహ. ఉమ్మడి ఏపీకి ఆఖరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన తీరే వేరు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ సరైన దారిలో నడవడంలేదని ఆయన ఆరోపణ. జనం దగ్గరికి వెళ్ళడంలో ఉద్యమాలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఆయన ఎన్నో మార్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలకు ఒక్కోసారి వెళతారు..మరోసారి వెళ్ళరు. కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి పాలవడం దామోదర రాజనర్సింహను కొంత కుంగ దిసిందని పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఒక వైపు బీఆర్ఎస్..ఇంకో వైపు బీజేపీ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నా పట్టించుకోవడం లేదని తనను కలిసిన వారితో వాదిస్తున్నారట. రాహుల్ గాంధీ జోడో యాత్రలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో చురుకుగా పాల్గొన్న దామోదర రాజనర్సింహ ఆ తరువాత పార్టీలో పరిణామాల నేపథ్యంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆయనపై మీడియా ముఖంగానే నిప్పులు చెరిగారు. దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని, కూతురు త్రిష కాంగ్రెస్ను విడిచి బీజేపీలో చెరుదామని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దామోదర రాజనర్సింహ తమ్ముడు రామచందర్ నెల రోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలోనే దామోదర సతీమణి పద్మిని కూడా ఉదయం బీజేపీలో చేరి సాయంత్రానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దామోదర రాజనర్సింహ బీజేపీ నేతలతో టచ్ ఉన్నారనే భావన రాష్ట్ర నేతలు, స్థానిక కార్యకర్తల్లో ఉందని సమాచారం. రాహుల్ గాంధీ ఎంపీ సీటుపై అనర్హత విషయంలో దామోదర రాజనర్సింహ స్పందించకపోవడం పట్ల స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారట. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం నుండి దామోదర రాజనర్సింహ ఎనిమిది సార్లు పోటీ చేయగా మూడు సార్లు గెలుపొందారు. దివగంత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు ఓడిపోయిన దామోదర అందోల్లో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో ఉన్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా దామోదర రాజనర్సింహ వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ తరపునే పోటీ చేస్తారా? లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కాషాయ తీర్థం తీసుకుంటారా అనే చర్చ ఆందోల్లో జరుగుతోంది. -
బీఆర్ఎస్తో పొత్తుపై మాణిక్రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు
సాక్షి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండబోదని రాహుల్గాంధీ గతంలోనే చెప్పారని మాణిక్రావుఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయనీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి సోమవారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సంగారెడ్డికి వచ్చిన ఠాక్రే మీడియాతో మాట్లాడారు. దళిత సీఎం అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఠాక్రే వెంట ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎంపీ ఉత్తమ్, నేతలు వి.హన్మంత్రావు, అజారుద్దీన్, పొన్నాల లక్ష్మయ్య, రోహిత్చౌదరి, మధుయాష్కిగౌడ్, మహేశ్కుమార్గౌడ్, కుసుమ్కుమార్ ఉన్నారు. కాగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేరిక విషయమై విలేకరులు అడగగా, పారీ్టలోకి ఎవరైనా రావచ్చని, పొంగులేటి వస్తే ఆహా్వనిస్తామన్నారు. చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్ -
తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహల్గాంధీ తెలంగాణలో రాజకీయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల పనితీరు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల విషయాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలు, మైనార్టీల మొగ్గు, ఓబీసీల జనగణన వంటి అంశాలపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తూ మార్గమధ్యలో ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో ఆగారు. కొద్దిసేపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ముఖ్య నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్చౌదరిలు పాల్గొన్నారు. జాతీయ నాయకులొస్తే బాగుంటుంది.. రాష్ట్రంలో హాథ్సే హాథ్ జోడో యాత్రలు జరుగుతున్న తీరు గురించి రాహుల్ అడిగి తెలుసుకున్నారు. యాత్రలు బాగా జరుగుతున్నాయని, అయితే వీటికి జాతీయ స్థాయి నేతలు హాజరయితే బాగుంటుందని రేవంత్రెడ్డి కోరినట్టు తెలిసింది. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతను కాంగ్రెస్ పారీ్టవైపు మరల్చుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణను అమలు చేస్తారన్న దానిపై కూడా రాహుల్ చర్చించారు. బీజేపీ కార్యకలాపాలపై కూడా ఆరా తీశారు. మైనార్టీలు.. ఓబీసీల జనగణన.. ముఖ్యంగా రెండు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్రంలో మైనారీ్టల మూడ్ ఎలా ఉందని, ఆ వర్గాలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశముందని రాహుల్గాంధీ ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలోని మైనారీ్టలు ఎక్కువగా ఎంఐఎం వైపే ఉంటారని, గ్రామీణ జిల్లాల్లోని మైనార్టీలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్కు అండగా ఉంటారని రాష్ట్ర నేతలు తెలిపారు. అయితే బీజేపీపై కాంగ్రెస్ పోరాటం, రాహుల్ గాంధీపై అనర్హత వేటు లాంటి అంశాల నేపథ్యంలో ఈసారి మైనార్టీల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా మరలే అవకాశముందని నేతలు వివరించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఓబీసీల జనగణన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జనగణనకు కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రజలకు చెప్పాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ విధానం అనుకూలంగా ఉన్నందున అన్ని రాష్ట్రాల పీసీసీలతో తీర్మానాలు చేయించాలని, దీంతో ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ పారీ్టకి సానుకూలంగా మారే అవకాశం ఉందని యాష్కీ సూచించగా, రాహుల్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. 30–35 నిమిషాల పాటు రాష్ట్ర నేతలతో మాట్లాడిన రాహుల్.. శాండ్విచ్ తిని, తేనీరు సేవించి ఢిల్లీ వెళ్లారు. చదవండి: ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా నేతలు.. అసమ్మతిపై బీఆర్ఎస్ ఆరా! -
ఖమ్మం వైపు చూస్తున్న రాష్ట్ర రాజకీయాలు
-
ఖమ్మంవైపు తెలంగాణ రాజకీయాలు.. త్వరలో కొత్త పార్టీ?
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర రాజకీయాలు ఖమ్మం వైపు చూస్తున్నాయి. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో వీరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డవారంతా ఏకమవుతారని పొంగులేటి కీలక వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మే నెలలో తెలంగాణలో కీలక పరిణాలు జరగబోతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గంతో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలోని 9 నియోజక వర్గాల్లో ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఖమ్మం నియోజకవర్గం మాత్రమే మిగిలుంది. ఇక్కడ జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు లక్ష మంది పాల్గొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. చదవండి: బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. పొంగులేటి, జూపల్లిపై వేటు ఖమ్మం వేదిక ద్వారానే పార్టీ మార్పు, కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై పొంగులేటి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన అనుచరులు. ముఖ్యంగా జిల్లాలోని జనరల్ కేటగిరి స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి శ్రీనివాస రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యాలయం వెల్లడించింది. -
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకెన్నాళ్లు?
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? గులాబీ పార్టీ మీద ఎర్రన్నల ప్రేమ వన్ సైడేనా? మునుగోడు విజయంతో ఎర్ర పార్టీలను పొగిడిన గులాబీ దళపతి... ఇప్పుడు పట్టించుకోవడంలేదా? మిత్రపక్షాలుగా మారిన ఎర్ర గులాబీలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నాయి ఎందుకు? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది? తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ గులాబీ పార్టీ విషయంలో చెరో దారిలో ప్రయాణించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కు బేషరతు మద్దతు ప్రకటించాయి. ప్రచారంలో కలిసి ముందుకు సాగాయి. మునుగోడులో గులాబీ పార్టీ విజయంలో లెఫ్ట్ పార్టీల సహకారం గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దీంతో సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతుందనే ప్రచారం జరిగింది. ఉనికి కోసం ఆరాటపడుతున్న ఉభయ కమ్యూనిస్టులకు మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కలిసొచ్చింది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని.. అసెంబ్లీలో ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. ముఖ్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గాల్లో ఖర్చీఫ్లు కూడా వేసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్తో కుదిరిన స్నేహం కారణంగా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శల్లో తీవ్రత తగ్గించారు కమ్యూనిస్టు పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పై లెఫ్ట్ పార్టీలు ఎంత ప్రేమ చూపిస్తున్నా... పైకి ప్రేమగా మాట్లాడుతున్నా లోపల కత్తులు దూస్తున్నారట జిల్లాల్లోని గులాబీ పార్టీ నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ జిల్లాల్లో స్థానిక నేతలు కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదనే చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీ చేస్తానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించగా.. సిటింగ్ ఎమ్మెల్యేను తానుండగా ఇంకెవరు పోటీ చేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపెందర్ రెడ్డి రచ్చకు దిగారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం కొంత వెనక్కి తగ్గి సీపీఎం పోటీ చేస్తే బీఆర్ఎస్ సహాకరిస్తుంది.. బీఆర్ఎస్ పోటీ చేస్తే సీపీఎం సహకరిస్తుందని ప్రకటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావుకు మధ్య అసలు పొసగడం లేదట. అన్ని రకాలుగా ప్రభుత్వానికి సహాకరిస్తున్న తమను పట్టించుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారని జూలకంటి రంగారెడ్డి వాపోతున్నారట. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కూడా తన సొంత నియోజకవర్గం కొత్తగూడెంలో పలు సార్లు పరాభవం ఎదురైందట. కేసీఆర్ తనకు సన్నిహితంగా ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కూనంనేని. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న తనకే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో తమ పార్టీ నేతల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారట కూనంనేని. రాష్ట్ర స్థాయిలో పార్టీ అగ్రనాయకుల మధ్య అవగాహన ఉన్నా.. స్థానిక నాయకత్వం మధ్య స్నేహం లేకపోవడంతో సీపీఐ, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్కు అవగాహన కుదరడం లేదట. తాము వన్ సైడ్ లవ్తో ప్రభుత్వానికి సహకరిస్తున్నా స్పందించకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారట కమ్యూనిస్టు పార్టీల నేతలు. చూడాలి మరి ఎర్ర పార్టీలకు, గులాబీ పార్టీతో పొత్తు కుదురుతుందా లేక గతంలో మాదిరిగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే తమ సీటు పోతుందనుకుంటున్న గులాబీ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు మాత్రం లెఫ్ట్ నాయకులంటే కస్సుమంటున్నారనే టాక్ నడుస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ చదవండి: రేవంత్ ఒక్కడే ఎందుకిలా?.. ఆ జిల్లాకు వెళ్లాలంటే భయమా? -
హైదరాబాద్కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. పలు రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ఎయిమ్స్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని శనివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళతారు. అక్కడి కార్యక్రమాల తర్వాత పరేడ్గ్రౌండ్స్ సభలో పాల్గొంటారు. కొంతకాలం నుంచి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ విచారించడం, పదో తరగతి పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన కాక రేపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడం, మోదీని, బీజేపీని టార్గెట్ చేస్తూ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టడం, సింగరేణి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించడం అగి్నకి ఆజ్యం పోస్తోంది. ఇక ‘పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలేమైనా చేస్తారా? కేవలం కేంద్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి ఇచి్చన నిధులు, సాయం వంటి అంశాలకే పరిమితమవుతారా?’ అన్నదానిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ పారీ్టలు కూడా నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ తెలంగాణకు సంబంధించి రూ.11 వేల కోట్ల పైచిలుకు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మోదీ వస్తున్నందున రాజకీయపరమైన అంశాలపై మాట్లాడతారా, లేదా అన్న చర్చ సాగుతోంది. గత ఏడాదిన్నర కాలంలో పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన మోదీ.. కొన్నిసార్లు కేసీఆర్ను, రాష్ట్రసర్కార్ను ఉద్దేశించి నేరుగా.. మరికొన్ని సార్లు పరోక్షంగా విమర్శలు సంధించారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్పై, సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై ఘాటైన విమర్శలు చేస్తారా, లేక గతంలో తరహాలో పరోక్ష విమర్శలు చేస్తారా? బండి సంజయ్ అరెస్టు వంటి అంశాలను ప్రస్తావించి తప్పుపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ‘ఎఫెక్ట్’ ఉంటుందంటున్న బీజేపీ! కొన్నినెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మోదీ సభలో తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర సర్కారు, బీఆర్ఎస్ టార్గెట్ చేయడం వంటివి చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీ, సంజయ్ అరెస్ట్, మళ్లీ సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తేవడం, ఢిల్లీ లిక్కర్స్కాంలో కవితను ఈడీ విచారించడం వంటి అంశాలను ప్రధాని మోదీ పరోక్షంగానైనా ప్రస్తావించి... తద్వారా బీఆర్ఎస్ పెద్దలకు, రాష్ట్ర బీజేపీకి తగిన సంకేతాలు ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుటుంబ పారీ్టలు, రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా విమర్శించే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్తున్నారు. బీజేపీ–బీఆర్ఎస్.. టగ్ ఆఫ్ వార్.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచాయి. దీనితో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాలపై బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీఆర్ఎస్ సర్కారును, కేసీఆర్ కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ కూడా దీటుగా స్పందించి ప్రత్యారోపణలకు దిగింది. పదో తరగతి పేపర్ల లీక్ కేసులో కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, రిమాండ్తో వేడి పెరిగిపోయింది. తాజాగా మోదీ పర్యటన సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి అటు కేంద్రాన్ని, ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది. పార్టీ శ్రేణుల్లో దూకుడు పెంచేందుకు కేసీఆర్ సహా కీలక నేతలంతా ప్రయతి్నస్తున్నారు. ఇక ప్రధాని పర్యటనను, సభను విజయవంతం చేసి.. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈసారీ కేసీఆర్ దూరమే! దాదాపు ఏడాదిన్నర కాలంలో వివిధ అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ నాలుగుసార్లు రాష్ట్రానికి రాగా.. సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా స్వాగతం పలకడానికి వెళ్లలేదు. ఆయన కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు ఐదోసారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎంకు ఆహా్వనం పంపడంతోపాటు బహిరంగ సభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయం కూడా కేటాయించారు. కానీ ఈసారి కూడా ప్రధాని కార్యక్రమాలు, సభలో కేసీఆర్ పాల్గొనడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలకడానికి మంత్రి శ్రీనివాస్యాదవ్ను పంపిస్తున్నారు. మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ.. ⇒ ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు.. ⇒ 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్ కేబిన్లో సిబ్బందిని కలుసుకుంటారు. ⇒ 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. ⇒ మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్గ్రౌండ్స్కు చేరుకుంటారు. ⇒ 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి ప్రసంగాలు ⇒ 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం... ⇒ 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్ వీడియోల ప్రదర్శన. ⇒ 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం ⇒ 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం రాక.. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్న మోదీ ► సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభోత్సవం ► ఎంఎంటీఎస్ సరీ్వసుల ప్రారంభం.. మహబూబ్నగర్ డబ్లింగ్ లైన్ జాతికి అంకితం ..బీబీనగర్ ఎయిమ్స్లోపలు పనులకు భూమి పూజ ► పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ► పరేడ్గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం కాక.. ► రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు ► ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు.. ► సింగరేణి ప్రాంతాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన ► మోదీ సహా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలపై బీఆర్ఎస్ నేతల విమర్శలు ► తామూ నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్, వామపక్షాల నిర్ణయం చదవండి: మోదీ పర్యటన వేళ.. బీఆర్ఎస్ సరికొత్త ప్రచార అస్త్రం.. ‘ఇదే ఆహ్వానం..’ -
జానారెడ్డి ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ.. పోటీ చేసేది ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తన కొడుకు పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. అలాగే, బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, జానారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుడూ.. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం. పార్లమెంట్లో జరుగుతున్న వ్యవహారంతో దేశం అట్టుడుకుతోంది. దేశంలో బీజేపీ పెట్టుబడుదారుల కొమ్ము కాస్తోంది. అదానీ కంపెనీలో షేర్లు పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదానీ, ప్రధాని మోదీ సంబంధాలపై రాహుల్ గాంధీ నిలదీశారు. రాహుల్ ప్రశ్నించకుండా ఉండేదుకే ఇలా ఆయన గొంతు నొక్కారు. అదానీ వ్యవహారం బయటపడొద్దని రాహుల్ను పార్లమెంట్ నుంచి బయటకు పంపించారు. అక్రమాలకు, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ అధికార యంత్రాంగాన్ని వాడుకుని రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారు. ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. దేశవ్యాప్తంగా మోదీ పరిపాలనకు వ్యతిరేకంగా 17 పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని కాంగ్రెస్కు మద్దుతివ్వాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడింది, కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికారం కోసం బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి బుద్ధి చెప్పాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తన కొడుకు బరిలోకి దిగుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. -
‘అరెస్టు చేస్తారనే భయంతోనే మోదీపై ఆరోపణలు’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ఆమెకు సడన్గా మహిళలపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసని ధ్వజమెత్తారు. కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళలు లేనప్పుడు కవిత ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పెంచిన ట్యాక్స్లపై బీఆర్ఎస్ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేస్తారనే భయంతో ముందుగానేై మోదీపై ఆరోపణలు చేస్తున్నారని అరుణ ఫైర్ అయ్యారు. మోదీపై ఆరోపణలు చేసినందుకే అరెస్ట్ చేస్తున్నారనే వాతావరణాన్ని సృష్టించేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ -
బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి
న్యూఢిల్లీ: జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి బీజేపీలో చేరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో తనను అణచివేశారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం తనను ఓదార్చలేదన్నారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. జగిత్యాలలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ ఆయనే.. -
తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల రగడ
-
TS: వైద్యం ‘కుదేలు’.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ రెండో చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రెండో చార్జిషీట్ వేసింది. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా రెండు నెలలపాటు ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్లు వేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా వైద్యరంగంపై చార్జిషీట్ వేసింది. శనివారం గాంధీభవన్లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర సమన్వయ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 16 అంశాలతో కూడిన అభియోగ పత్రాన్ని విడుదల చేశారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం కుదేలైందని, మండలస్థాయిలో 30 పడకల దవాఖానా ఏర్పాటు హామీ, డాక్టర్లు ఊర్లోనే నివసించాలన్న నిబంధన ఎత్తివేత, బడ్జెట్లో 4.4 శాతం మాత్రమే నిధుల కేటాయింపు, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులలేమి, సిబ్బంది కొరత, రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న వైనం, జిల్లాకేంద్రాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయకపోవడం, అత్యవసర సేవల నిర్వీర్యం, సమగ్ర వైద్య విధానం రూపకల్పనలో వైఫల్యం, పల్లెల్లో అరకొర వైద్యం, ఆరోగ్యశ్రీ, జర్నలిస్టుల హెల్త్కార్డుల సేవలకు ఆటంకాలు, కరోనా కట్టడిలో విఫలం, కరోనా బూచితో కార్పొరేట్లకు దోచిపెట్టడం, గ్రేటర్ హైదరాబాద్లో పడకేసిన వైద్యం అనే అంశాలతో ఈ అభియోగపత్రాన్ని రూపొందించింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు: ఏలేటి కొత్త సచివాలయం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, క్యాంపు ఆఫీస్ల మీద ఉన్న ప్రేమ సీఎం కేసీఆర్కు ప్రజారోగ్యంపై ఎందుకు లేదని ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఆరోగ్య తెలంగాణ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ బడ్జెట్లో 8 శాతం మేర కేటాయించాల్సిన నిధులను కేవలం 4.4 శాతానికి పరిమితం చేశారన్నారు. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కోల్పోయేలా చేశారని, ముఖ్యమంత్రి తన సాధారణ పరీక్షలకు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ఆయనకే చెల్లిందన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్వాయి స్రవంతి, నిరంజన్, మదన్మోహన్, కైలాశ్, భరత్చౌహాన్ పాల్గొన్నారు. చదవండి: 'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్ -
దమ్ములేనిది కేసీఆర్ బానిసలకే: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: ‘సీఎం కేసీఆర్ బానిసలు, ఆయన సంధించిన సైకో శాడిస్టులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్ళు నెత్తికెక్కి, అహంకారంతో బలుపెక్కి దమ్ముందా అని మాకు చాలెంజ్ చేస్తున్నారు ... దమ్ములేనందునే వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, తుర్క నరసింహులుతో కలిసి శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో ఈటల మీడియాతో మాట్లాడారు. తమపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన తమ ధైర్యం ఏమాత్రం దెబ్బతినదని.. వారి మాటలను మరింత స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఇంకా దూకుడుగా కొట్లాడ తామన్నారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాదు ఒక ప్రత్యేక దేశం అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరి స్తున్న తీరు ఏమాత్రం మంచిది కాదన్నారు. గవర్నర్తో వ్యవహరించిన తీరు జుగుప్సాకరం ‘ఈ జనవరి 26న కేసీఆర్ రాజ్యాంగం పట్ల వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని మహిళలను అవమానపరచడమే’ అని ఈటల అన్నారు. చదవండి: మంత్రి కేటీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సవాల్ -
అన్ని పార్టీల్లో కేసీఆర్కు కోవర్టులున్నారు.. ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. కాగా, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. "అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో నాతో సహా 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు" అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఈటల కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రానున్న కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు పొలిటికల్ పార్టీలను టెన్షన్కు గురిచేస్తున్నారు. కాగా, కేసీఆర్కు చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్స్ చేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కెసిఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? టీఆర్ ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల లాంటి సీనియర్ ఎవరిని లక్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? ఇప్పుడీ అంశాలన్నీ బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి. -
దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్: బండి సంజయ్
ఆదిలాబాద్: కేశ్లాపూర్ నాగోబా జాతరలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగదేవత అత్యంత శక్తిమంతమైన దేవత అన్నారు. హిందువుగా పుట్టడమే తన అదృష్టమని పేర్కొన్నారు. గోండిలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. నాగోబా జాతరకు వేల మంది తరలి వస్తున్నా ఏర్పాట్లు సరిగా చేయలేదన్నారు. నిజాం శవానికి అంత్యక్రియలు చేయడానికి ఇస్తున్న ప్రాధాన్యత అదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎనిమిది సంవత్సరాలలో ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ నాగోబా జాతరకు రాలేదని ధ్వజమెత్తారు. 'పోడు భూముల సమస్య ఉంది. కుర్చీ వేసుకోని పట్టాలు ఇస్తామన్నారు సీఎం. ఆ సంగతి మర్చిపోయారు. పోటుగాడు సీఎం కేసీఆర్ పైసలు ఇస్తామని తండాలను పంచాయితీ చేశారు. కాని ఒక్కపైసా ఇవ్వలేదు. గ్రామపంచాయితీ నిదులు దోంగిలించిన దండుపాళ్యం ముఠా నాయకుడు కేసీఆర్ పేదలను ముంచుతున్నారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఇది లాస్ట్ అసెంబ్లీ. ఇచ్చిన హమీలను అసెంబ్లీ వేదికగా అమలు చేయాలి. అన్ని జాతులను ,వర్గాలను మోసం చేసిన నాయకుడు సీఎం. టీఆర్ఎస్ బోర్డు తిప్పేసి బీఆర్ఎస్ మార్చారు.' అని బండి ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా బండి సంజయ్తో పాటు నాగోబా జాతరలో పాల్గొన్నారు. నాగోబా దేవతను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. చందాలు వేసుకొని అద్భుతమైన మందిరాన్ని నిర్మించారని కొనిడాడారు. జల్ ,జంగల్, జమీన్ హక్కులు కల్పించడంతో తెలంగాణ సర్కారు విపలైందని అర్జున్ ముండా ఆరోపించారు. 'ఆదివాసీలకు జంగలే దేవుడు. పట్టాలు ఇవ్వడం లేదు. కనీసం కమ్యూనిటీ హక్కులు ఇవ్వడం లేదు. తెలంగాణ లో బీజేపీ అదికారంలో వస్తుంది. అదికారంలోకి రాగానే పట్టాలు ఇస్తాము. కొందరు అడవులను మింగేస్తున్నారు. ఆదివాసీల ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం. అదివాసీల కోసం కేశ్లాపూర్ దర్మశాల నిర్మిస్తాం.' అని అర్జున్ ముండా అన్నారు. చదవండి: డెక్కన్మాల్ ఘటన.. దొరకని మృతదేహాలు.. ఇక మిగిలింది బూడిదేనా? -
తెలంగాణపై ఇంటెలిజెన్స్ నిఘా.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై షాడో టీమ్స్ ఫోకస్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నిఘా పెరిగింది. ఎవరెవరు, ఏమేం చేస్తున్నారన్నది గంటగంటకు నిక్షిప్తమవుతోంది. మండలానికి ఒకరు చొప్పున మోహరించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది.. ముఖ్య నేతల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. రోజూ రెండుపూటలా ఈ సమాచారాన్ని హైదరాబాద్కు చేరవేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్ల విషయంలో అయితే.. షాడో టీమ్లు వారి వెన్నంటే ఉంటున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ముఖ్య కార్యకర్తలు, సాధారణ ప్రజల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తున్నాయి. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు, ఇతర పార్టీల నాయకులతో వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇంటెలిజెన్స్కు చిక్కకుండా.. గన్మెన్లను, సెల్ఫోన్లను సైతం వదిలేసి వెళ్తున్న ఘటనల వివరాలు కూడా రాజధానికి చేరుతున్నాయి. 30 నియోజకవర్గాలపై దృష్టి అధికార బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు, పోటీ ఉన్న 30 నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ ఫోకస్ మరింతగా పెంచింది. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ నిర్వహిస్తుండటం, అదే సమయంలో ఆ జిల్లా ముఖ్య నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనతోపాటు పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగటం లేదంటూ గళం విప్పడంతో.. ఆ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలను లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గతంలో కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఈసారి ఎమ్మెల్యే కావాలన్న ఆశతో ఉన్నారు. ఇల్లెందులో కోరం కనకయ్య (కొత్తగూడెం జెడ్పీ చైర్మన్), పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లిలో పిడమర్తి రవి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్ బృందాలు గ్రామాలు, మండలాల వారీగా రాజధానికి నివేదికలు పంపుతున్నాయి. రంగారెడ్డిలో దూకుడుగా నేతలు బీఆర్ఎస్ తరఫున ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలో ఉంటారని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఇతర నేతలూ ప్రయత్నాలు చేస్తున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, ఎల్బీనగర్లో రామ్మోహన్గౌడ్, ఉప్పల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుభా‹Ùరెడ్డితో పాటు బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్లు క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో మునిగిపోయారు. కేంద్ర బృందాల నిఘా సైతం కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా రాష్ట్రంలో పరిస్థితిని ఆరా తీస్తున్నారు. జిల్లాల్లో రాజకీయ పరిణామాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కేంద్ర మంత్రుల పర్యటనలు, స్థానిక ఆందోళనలు, ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో నువ్వా నేనా? వనపర్తి నియోజకవర్గంలో మంత్రి నిరంజన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్రెడ్డి మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. కొల్లాç³Nర్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సిద్ధమయ్యారు. నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన చల్లా వెంకట్రాంరెడ్డిని ఎక్కడి నుంచి పోటీలో దింపుతారన్న అంశం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అసక్తికరంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య– మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య వర్గపోరు సాగుతోంది. బీఆర్ఎస్తో వామపక్షాల పొత్తు కుదిరి మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలను సీపీఎం, సీపీఐ కోరితే.. ఎలాంటి సమీకరణ ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్లో రోజుకో పరిణామం చేసుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు జెడ్పీ చైర్మన్ల విషయంలోనూ ఆసక్తి నెలకొంది. -
రూట్ మార్చిన బీజేపీ.. తెలంగాణలో యూపీ వ్యూహం!
బహిరంగ సభలు, పాదయాత్రలు, వరుస సమావేశాలతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా వేవ్ సృష్టించే ప్రయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు రూట్ మార్చింది. అధికారంలోకి రావాలంటే పార్టీ గ్రౌండ్ లెవల్ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలని నమ్మిన జాతీయ నాయకత్వం మరో యాక్షన్ ప్లాన్ కు తెరలేపింది. బేస్ బాగుంటేనే పార్టీ నిలుస్తుందని విశ్వసించే బీజేపీ యూపీలో అనుసరించిన ఫార్ములాతో రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఉత్తరప్రదేశ్ లో రచించిన వ్యూహాలనే అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. బీజేపీ అగ్రద్వయం మోడీ, షా ఎక్కడైనా ఎంట్రీ ఇవ్వాలంటే ముందు బన్సల్ రంగంలోకి దిగి అంతా సెట్ చేస్తారనే టాక్. అందులో భాగంగానే యూపీ ఎలక్షన్ అనంతరం సునిల్ బన్సల్ ను హైకమాండ్ ఇక్కడికి పంపించింది. తెలంగాణ ఎన్నికల్లోనూ తనదైన మార్క్ వేయాలని బన్సల్ వ్యూహరచన చేస్తున్నారు. ఈనెల 24 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న బీజేపీ గ్రౌండ్ లెవల్లో నేతలకు రీచ్ కావడంపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది. ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న కాషాయదళం ఈనెల 24వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. వరుస కార్యకలాపాలతో నేతలను ఎప్పటికప్పుడు యాక్టివ్ మోడ్ లో ఉంచడంపై ఫోకస్ పెడుతోంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం ఈనెల 27న జిల్లా కార్యవర్గ సమావేశాలు, 28, 29 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. ఫిబ్రవరిలో శక్తి కేంద్రాల వారీగా కార్నర్ మీటింగ్స్ కు ప్రణాళిక చేసుకుంది. పార్టీ గ్రౌండ్ లెవల్ ప్రిపరేషన్ పై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. అలాగే 9 వేల శక్తి కేంద్రాల్లో సమావేశాలకు ప్లానింగ్ చేసుకున్నారు. శక్తి కేంద్రాల ఆధ్వర్యంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయనుంది. ఒక్కోరోజు అసెంబ్లీలోని ఒక్కో మండలంలో ఈ సమావేశాలు నిర్వహించే ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళ్తోంది. హైదరాబాద్కు షా ఈనెలాఖరున తెలంగాణలో అమిత్ షా టూర్ ఉంది. రెండ్రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయి. ఒకరోజు ఖమ్మం జిల్లాలో అమిత్ షా పర్యటన కొనసాగితే మరోరోజు పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టిసారించనున్నట్లు టాక్. ఇప్పటికే వచ్చే ఎలక్షన్ కు మూడు నెలల పాటు ఎన్నికల క్యాలెండర్ ను సిద్ధం చేసుకున్న పార్టీ ప్రజా క్షేత్రంలోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇటు సంస్థాగత బలోపేతంతో పాటు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్లాన్ చేసుకున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే పాలసీతో బీజేపీ ముందుకు వెళ్తోంది. యూపీలో వరుసగా రెండుసార్లు వరుసగా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు అరుదు. అలాంటిది బీజేపీ సంస్థాగత బలపేతంపై దృష్టి పెట్టి గ్రౌండ్ లెవల్ లో స్ట్రాంగ్ చేసుకుంటూ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. అందుకే తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసి అధికారంలోకి రావాలని చూస్తోంది. గ్రౌండ్ లో ఉంటూ వాస్తవికతను అంచనా వేసి అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదును పెట్టనుంది. - విక్రమ్, పొలిటికల్ రిపోర్టర్, సాక్షి. -
TS: బీఎస్పీకి కంచుకోట ఉందా? అక్కడి నుంచే ప్రవీణ్ కుమార్ పోటీ!
ఆ నియోజకవర్గం BSP కంచుకోటగా చెబుతారు. ఆ బహుజనుల కోట నుంచే పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్నికల బరలో దిగబోతున్నారా? అక్కడి నుంచే పోటీ చేయడానికి ప్రవీణ్కుమార్ భావించడానికి కారణం ఏంటి? నియోజకవర్గంలో ప్రవీణ్ పర్యటన ఎన్నికల యాత్రేనా? కుమ్రంబీమ్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీకి బలమైన స్థావరంగా భావిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు సీట్లలో అనుహ్యంగా BSP రెండు స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ టి నియోజకవర్గం నుండి BSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బరిలో దిగాలని భావిస్తున్నారట. అందులో బాగంగానే బహుజన రాజ్యదికార యాత్రను ఐదురోజుల పాటు ఈ నియోజకవర్గంలో ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల యాత్రలో తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లుతున్నారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యం తెచ్చేందుకు మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోనేటి కోనప్ప విఫలం చెందారని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. గుడ్బై ఐపీఎస్.. ఛలో అసెంబ్లీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ..ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్కుమార్ బహుజన సమాజ్ పార్టీ ద్వారా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికలే ఆయన ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు. సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ప్రవీణ్ అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం లో దళిత, గిరిజన, మైనారీటీ, బీసీ ఓటర్లు భారీగా ఉన్నారు. ఆయా వర్గాలే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. పైగా 2014లో ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే మళ్ళీ బలహీనవర్గాల ప్రజలంతా మద్దతిస్తారనే అంచనాతోనే ఈ స్థానంపై కన్నేసారని తెలుస్తోంది. పైగా స్థానిక ఎమ్మెల్యే కోనప్ప పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని టాక్. ఎమ్మెల్యేపై వ్యతిరేకత బిఎస్పీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ...జనరల్ సీటులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఎంత పెద్ద నాయకులైనా రిజర్వుడు కేటగిరికి చెందినవారైతే..ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారు. కాని దానికి భిన్నంగా అందరివాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ప్రవీణ్కుమార్ జనరల్ సీటునే ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతున్నా..పార్టీ నాయకత్వం మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి
హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు మారలేదా? అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లంతా ముడుపులిస్తే మేం కూడా ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. బీజేపీకి బీ టీంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తోందని సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ కాంగ్రెస్ను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. చదవండి: ఇన్ని రోజులు నిద్రపోయారా.. కాంగ్రెస్పై బండి సంజయ్ ఫైర్ -
మాజీ ఎంపీ పొంగులేటికి షాకిచ్చిన కేసీఆర్ సర్కార్..! భద్రత తగ్గింపు
ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతమున్న 3+3 పోలీసు భద్రతను 2+2కు తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్ను, ఇంటి ముందు ఉండే గన్మెన్లను కూడా తొలగించింది. ఈ విషయం ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటి గత కొంతకాలంగా సొంతపార్టీ అయిన బీఆర్ఎస్పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. పొంగులేటి తీరుపై బీఆర్ఎస్ అధిష్ఠానం గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చదవండి: ఖమ్మం పాలిటిక్స్లో కలకలం -
కమలంతో టచ్లోకి ‘హస్తం’ నేతలు!.. 20 మంది జంప్?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ముఖ్యనేతలతో పలువురు కాంగ్రెస్ నాయకులు టచ్లోకి వచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. వీరిలో మాజీ మంత్రులు మొదలుకుని మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరస్థాయిల నాయకులు 15 నుంచి 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తోపాటు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు సాగించినట్టు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నాయకులకు దగ్గరగా ఉన్నవారు, వారి అనుచరులు ఈటలతో ఆయన నివాసంలో భేటీ అయ్యి సంబంధిత నాయకులతో ఫోన్లో మాట్లాడించినట్టు సమాచారం. బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని కూడా పలువురు కాంగ్రెస్ నేతలు సంప్రదించినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగిన మాజీ మంత్రులు డీకే అరుణ, మర్రిశశిధర్రెడ్డి కూడా చేరికలపై హస్తం పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. టికెట్పై దక్కని హామీ బీజేపీలో చేరే వారికి మాత్రం టికెట్ల కేటాయింపుపై అటు సంజయ్, ఈటల, కొండా ఇతర నేతలు ఎవరూ కూడా ఎలాంటి హామీనివ్వడం లేదు. పారీ్టలో చేరాక సంబంధిత నియోజకవర్గంలో పలుకుబడి, రాజకీయ ప్రాబల్యం, ప్రజల్లో మద్దతు వంటి అంశాలపై పార్టీపరంగా చేసే సర్వే ఆధారంగానే బలమైన అభ్యరి్థకి టికెట్ ఇస్తామని బీజేపీ నాయకత్వం స్పష్టంచేస్తోంది. ఇదిలాఉంటే తనతో సంప్రదింపులు జరిపిన నేతలు, వారికి సంబంధించిన సమాచారాన్ని ఈటల రాజేందర్ సోమవారం రాత్రి పార్టీ జాతీయకార్యదర్శి, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్కు తెలియజేసినట్టు పారీ్టవర్గాల సమాచారం. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల కు ఆయా పేర్లను తెలియజేసి తదుపరి చేపట్టే కార్యాచరణకు గ్రీన్ సిగ్నల్ కోసం రాష్ట్ర పార్టీ నేతలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి, అసంతృప్త స్వరాలు ఒక్కసారిగా పెరగడంతోపాటు అధికార టీఆర్ఎస్లోనూ తొలిసారిగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డిపై బహిరంగ తిరుగుబాటును ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ప్రకటనలు చేయడం.. రేవంత్కు అనుకూలంగా ఆయన వర్గం నేతలు ఆయా కమిటీలకు రాజీనామా చేయడం వంటి పరిణామాలను బీజేపీ నాయకత్వం సునిశితంగా గమనిస్తోంది. ఆ మంత్రి వద్దు ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒక టీఆర్ఎస్ నేతను చేర్చుకునేందుకు బీజేపీ నేతలు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివాదాస్పద మంత్రిగా ముద్రపడిన ఆ నేతను చేర్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల తన దుందుడుకు వైఖరితో విమర్శల పాలైన ఆ మంత్రిని చేర్చుకుంటే బీజేపీ బెదిరింపులతో ఈ కార్యక్రమం చేస్తోందనే ప్రచారాన్ని టీఆర్ఎస్ చేసే అవకాశమున్నట్లు అంచనా వేస్తోంది. ఇది తదుపరి టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ముఖ్యనేతలను చేర్చుకోవడానికి ప్రతిబంధకంగా మారొచ్చునని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ మంత్రితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలను సంప్రదించినట్టు పారీ్టవర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు దాకా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే విషయంపై ప్రాథమిక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. -
డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్..
సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈమేరకు మాట్లాడారు. రోహిత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్ను దొర అని తిట్టారని, కానీ ఇప్పుడు అదే దొర వద్ద ఆయన పనిచేస్తున్నారని రఘునందన్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను డబ్బులు వసూలు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా.. విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. రూ.100ల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. చదవండి: TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి -
ఓట్లేయండి.. పేర్లు మారుస్తాం.. తెలంగాణలో కమలం పార్టీ కొత్త వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా పట్టణాల పేర్ల మార్పుపై కమలం పార్టీ దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ ప్రచార వ్యూహంలో ఇది కూడా ఓ భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే టీఎర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తాజాగా తెలంగాణలో మరికొన్ని పట్టణాల పేర్లు మారుస్తామని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణలో తమను అధికారంలోకి తీసుకొస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా, మహబూబ్నగర్ పేరును పాలమూరుగా, వికారాబాద్ను గంగవరంగా, భైంసాను మైసాగా, కరీంనగర్ పేరును కరినగర్గా మారుస్తామని బీజేపీ చెబుతోంది. ఇప్పటికే సంఘ్ పరివార్ క్షేత్రాలు ఈ పట్టణాలను ఇదే పేర్లతో ప్రస్తావిస్తున్నాయి. మరి ఊరి పేర్ల నినాదంతో ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్న కమలం పార్టీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వచ్చే ఏడాది తేలిపోనుంది. చదవండి: ‘కాంగ్రెస్ సీనియర్లకు ఏమైంది?.. నేనింకా జూనియర్నే’ -
ఎక్కడా తగ్గని రేవంత్రెడ్డి.. ఇక కొత్తగా కాంగ్రెస్!
సాక్షి, హైదరాబాద్: పీఏసీని మార్చారు.. కొత్తగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.. 24 మంది ఉపాధ్యక్షులను నియమించారు.. సీనియర్ ఉపాధ్యక్షులను కొనసాగిస్తున్నారో లేదోననే స్పష్టత లేకుండానే వారిలో కొందరిని ఎగ్జిక్యూటివ్ కమిటీలో నియమించారు. ఏకంగా 84 మందికి ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టారు. ఆరు జిల్లాల అధ్యక్షులను మార్చారు. పాత డీసీసీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. మొత్తంగా ఏఐసీసీ తెలంగాణ పీసీసీని జంబ్లింగ్ చేసి జంబో కమిటీలను నియమించింది. శనివారం విడుదల చేసిన పీఏసీ, పీఈసీ, పీసీసీ కమిటీల్లో మొత్తం 170 మందికి స్థానం కల్పించడం విశేషం. వీరికి తోడు టీపీసీసీ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శుల జాబితా ఇంకా రావాల్సి ఉంది. కీలకమైన పీఏసీలో మార్పులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో మార్పులు జరిగాయి. గతంలో 14 మంది సభ్యులతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ నియమించిన కమిటీల చైర్మన్లు, ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు ఈ కమిటీలో ఉండేవారు. ఇప్పుడు సభ్యుల సంఖ్యను 18కి పెంచారు. అదనంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. గతంలో పీఏసీ సభ్యులుగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్కలను తొలగించారు. ఏఐసీసీ నియమించిన కమిటీల చైర్మన్లలో ఏలేటి మహేశ్వర్రెడ్డిని పీఏసీ సభ్యుడిగా తీసుకోలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితా నుంచి గీతారెడ్డిని తొలగించి 18 మంది సభ్యుల జాబితాలో చేర్చారు. నలుగురు ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, శ్రీధర్బాబు, వంశీ, సంపత్లను కూడా అదే జాబితాలో చేర్చారు. ఇక ఇన్చార్జి కార్యదర్శుల పేర్లు కొత్తగా నియమించిన కమిటీలో లేవు. ఈ కమిటీకి చైర్మన్గా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ను కొనసాగించగా గతంలో షబ్బీర్అలీకి ఇచ్చిన కన్వీనర్ హోదాను తొలగించారు. కొత్తగా ఎగ్జిక్యూటివ్ కమిటీ 40 మందితో కొత్తగా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. పీఏసీలోని 21 మందికి అదనంగా మరో 19మందిని దీనిలో నియమించారు. టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలను దీనిలో నియమించారు. కొండా సురేఖ, వినోద్, ఈరవత్రి అనిల్లలో ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని భావించినా.. ఆ ముగ్గురినీ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకున్నారు. కొత్తవారికి డీసీసీలు డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం కల్పించింది. గ్రేటర్ హైదరాబాద్ అవతల 24 మందిని జిల్లా అధ్యక్షులను ప్రకటించగా.. గ్రేటర్ కమిటీలో కొత్తగా ఖైరతాబాద్, హైదరాబాద్ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. సికింద్రాబాద్తోపాటు సూర్యాపేట, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, జనగామ, భూపాలపల్లి జిల్లాలను పెండింగ్లో పెట్టారు. ఆయా చోట్ల కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై స్పష్టత లేకపోవడం, ఇప్పుడున్నవారికి ఏం పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు తెగకపోవడంతో పెండింగ్లో పెట్టినట్టు తెలిసింది. ఎంపీ కోమటిరెడ్డి పేరెక్కడ? ఏఐసీసీ తాజాగా నియామకాల్లో ఎక్కడా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కనిపించలేదు. గతంలో ఉన్న పీఏసీ సభ్యుడి హోదాను తొలగించడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ ఆయన పేరు చేర్చలేదు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో వెంకటరెడ్డిని పక్కన పెట్టారనే చర్చ జరుగుతోంది. ఎక్కడా తగ్గని రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వర్గంగా గుర్తింపు పొందినవారికి సీనియారిటీతో సంబంధం లేకుండా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులు రావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్కు ఉపాధ్యక్షుడిగా.. ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు మానవతారాయ్, చరణ్కౌశిక్ యాదవ్, చారుకొండ వెంకటేశ్, దుర్గం భాస్కర్, బాలలక్షి్మలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా చాన్స్ ఇచ్చారు. ఆదివాసీ ఉద్యమ నాయకుడు వెడమ బొజ్జు, సామాజిక సమావేశాలు పెట్టిన దయాకర్, గోమాస శ్రీనివాస్లకు.. గత ఎన్నికల్లో మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవులిచ్చారు. ఎంపీ వెంకటరెడ్డితో మొదటి నుంచీ విభేదించిన మహబూబ్నగర్ నేత ఎర్ర శేఖర్కు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. పీజేఆర్ కుమార్తె, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి, బడంగ్పేట్ మేయర్ పారిజాతం నర్సింహారెడ్డి, జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డిలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. గతంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంఆర్జీ వినోద్రెడ్డికి పదోన్నతి కల్పించి ఉపాధ్యక్షుడి హోదాలో నియమించారు. -
కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం..
నిర్మల్: ‘‘కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో. సొంత ఇంటిజాగా ఉన్నవాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినవ్. మాట తప్పి ఇప్పుడు రూ.3లక్షలే ఇస్తామంటున్నవ్. మాట తప్పి తప్పు చేశానంటూ అసెంబ్లీ సాక్షిగా లెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలి. నీ పాలనలో పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. పుట్టబోయే బిడ్డపైనా రూ.లక్షకుపైగా అప్పు చేసినవ్. నీకు పేదలంటే మంట. వానొస్తే మునిగిపోతున్న గుండెగాంను చూస్తే గుండె తరుక్కుపోతోంది. సమస్య తీరే దాకా ఈ సర్కారుపై పోరాడుదాం. ఈసారి వాన వచి్చనప్పుడు టీఆర్ఎస్ నేతలను తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి. మీ కష్టమేందో కేసీఆర్కు అప్పుడు తెలుస్తది..’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. బుధవారం ప్రజాసంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగాం, మహాగాం, కుభీర్ మండలం చాత మీదుగా లింబా(బి) శివారుకు చేరుకుంది. మా ఊరు తెలంగాణలో లేదా.. గుండెగాం వాసుల గోస ‘‘వర్షం వస్తే మా పరిస్థితిని మాటల్లో కూడా చెప్పలేం. గత ఏడేళ్లుగా పునరావాసం కోసం తిప్పలు పడుతున్నాం. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే మమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు. ప్రశి్నస్తే మమ్మల్ని పోలీస్స్టేషన్లో వేస్తున్నారు. గుండెగాం గ్రామం తెలంగాణలో లేదా..? ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. బండి సంజయ్ వస్తున్నాడంటే... టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెండుసార్లు సర్వే చేశారు’’అంటూ గుండెగాం వాసులు తమ గోస వినిపించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పల్సికర్ రంగారావ్ ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన గుండెగాం హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. గుండెగాం ప్రజల గోస వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. కేసీఆర్ కమీషన్ల కోసం ప్రగతిభవన్, సచివాలయం కట్టుకుంటడు, కాళేశ్వరం కడతడు, కానీ కమీషన్లు రావని గుండెగాం ప్రజలను గాలికొదిలేసిండని మండిపడ్డారు. గుండెగాం ప్రజలు బాధపడొద్దని, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్ని హామీలు అమలు చేసినవ్.. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచి్చన హామీలేవీ అమలు కాలేదని బండి సంజయ్ ఆరోపించారు. భైంసా మండలంలోని మహాగాంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే వాటిని దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి సహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో కొత్త డ్రామాలకు తెరదీశాడన్నారు.చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ నోటికి మాటలు ఎక్కువన్నారు. కల్వకుంట్ల ఇంట్లోనే ముఖ్యమంత్రి పీఠం కోసం లొల్లి మొదలైందని సంజయ్ ఆరోపించారు. దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులనూ పొట్టనబెట్టుకుంటున్నరు.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్ల కుప్పలపై రైతన్నలతోపాటు విద్యార్థులు సైతం ప్రాణాలను కోల్పోతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మూల్యాంకనంలో చేసిన నిర్వాకం వల్ల సిరిసిల్లలో ఓ విద్యారి్థని ఆత్మహత్య చేసుకుందన్నారు. 37 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీలో తెలంగాణ తల్లి బందీ అయిందని, ఆ తల్లిని బంధ విముక్తి చేసేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నామని, ప్రజలంతా బీజేపీ వెంట ఉండాలని బండి సంజయ్ కోరారు. చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. 5 గంటల పాటు వాడీవేడిగా వాదనలు -
నిలబడి.. కలబడేదెలా?.. కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ.. పట్టు నిలుపుకోవడం కోసం ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటంతో.. తమ ప్రమేయం లేకుండానే తగులుతున్న ఎదురుదెబ్బలను అడ్డుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో తామూ చురుగ్గానే ఉన్నామని చెప్పుకొనేందుకు ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక మొదలు జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయ పరిణామాల ప్రభావం నుంచి బయటపడటంపై కాంగ్రెస్లో అంతర్మథనం సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ అవగాహన ఉందని, బెంగాల్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న రాజకీయ ఆటకు చెక్పెట్టడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చేతులు కాలకముందే..! రాష్ట్రంలో కేవలం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉందనే భావన నుంచి ప్రజల దృష్టి మరల్చాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడి ఆకర్షించాలని.. ఇదే సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉన్న అవగాహనను ఎండగట్టాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. చేతులు పూర్తిగా కాలకముందే.. సగం కాలిన చేతులతో అయినా ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. చేతులు పూర్తిగా కాలిపోతాయా? బాగవుతాయయా అన్నది వేచి చూడాలి..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏం చేస్తే బాగుంటుంది? బీజేపీ, టీఆర్ఎస్ల దూకుడును దీటుగా ఎదుర్కోవడం, సమస్యలపై ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)శనివారం జూమ్ యాప్ ద్వారా సమావేశమైంది. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇద్దరూ కిసాన్సెల్ నేతలతో సమావేశమై రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో.. రేవంత్రెడ్డి, భట్టితోపాటు ముఖ్య నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బోసురాజు, నదీమ్ జావేద్, చిన్నారెడ్డి, షబ్బీర్అలీ, కోదండరెడ్డి, మల్లురవి, జి.నిరంజన్, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను రేవంత్, భట్టి వివరించారు. అనంతరం ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణ గురించి నేతలు చర్చించారు. తొలిదశలో భాగంగా రైతులు, ఓబీసీ సమస్యలను చేపట్టాలని నిర్ణయించారు. రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేయాలని, ఓబీసీల జనగణన అంశం, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు అంశాలపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. కాంగ్రెస్ కార్యాచరణ ఇదీ.. రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రైతు రుణమాఫీతోపాటు ధరణి సమస్యల పరిష్కారం, ఏపీలో జరుగుతున్న తరహా కార్యక్రమాల అమలు కోసం 21న సీఎస్ను కలవాలని తీర్మానించారు. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించనున్నారు. ► రైతు సమస్యలపై.. ఈ నెల 24న మండలాలు, 30న నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ► డిసెంబర్ 5న జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపట్టాలని.. స్థానికంగా ఉన్న మహా నాయకుల విగ్రహాల వద్ద నుంచి కలెక్టరేట్ల వరకు భారీ ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ ఆందోళనల్లో రాష్ట్రస్థాయి నాయకత్వం పాల్గొనాలని నిర్ణయించారు. ► ఇతర వర్గాలకు చెందిన సమస్యలు, తదుపరి కార్యాచరణపై మరోమారు సమావేశం కావాలని జూమ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: Bengal Style Politics: తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం! -
25 అసెంబ్లీ సీట్లపై సీపీఐ దృష్టి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాలపై సీపీఐ దృష్టి కేంద్రీకరించింది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 25 నియోజకవర్గాల్లో బలోపేతంపై కసరత్తు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని, 25 సీట్లల్లో మాత్రం పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలన్నదానిపై పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదరకపోతే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలన్నది ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం. అంతేకాక పొత్తుల్లో ఎక్కువ సీట్లు అడగాలన్నా, 25 నియోజకవర్గాల్లో బలం ఉందని చూపించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. తాము మద్దతు ఇచ్చే పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి తమకుందని నిరూపించుకోవడం కూడా కీలకమన్న భావన ఉంది. బీజేపీకి ఉన్న బలమెంత? రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తమకు పార్టీ కమిటీలున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పార్టీ అని సీపీఐ నేతలు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో బలమైన పార్టీగా ఉన్నామని చెపుతున్నారు. వాస్తవంగా ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ డబ్బుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందే కానీ, తమతో పోలిస్తే ఆ పార్టీ బలమెంత అని సీపీఐ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రచారం అధికంగా చేసుకుంటోందని, కానీ తాము అంత ప్రచారం చేసుకోవడంలేదని చెపుతున్నారు. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని, తాము ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో బలమైన చోట్ల సీట్లను అడిగి తీరుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగిన విషయం విదితమే. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జాతీయ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ బలం పెంచుకోకుండా ఎన్నికల్లో ముందుకు సాగలేమని నాయకత్వం భావిస్తోంది. పొత్తుల్లోనూ బలం నిరూపించుకోవాల్సిందేనని అంటున్నారు. ‘బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రానున్న ఎన్నికలకు వెళతాము. అందుకోసం రాష్ట్రంలో వామపక్షాలు, టీఆర్ఎస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి. అదే సందర్భంలో మేం గెలవగలిగే స్థానాలపై సరైన అవగాహనకు రావాల్సి ఉంది. పొత్తుల పేరుతో పార్టీకి బలం ఉన్న స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదు’అని ఒక నేత అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాక పార్టీ పటిష్టత పైన, ప్రచారంపైన ప్రత్యేకంగా దృష్టిసారించారని నాయకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
ఫలితమొచ్చి వారం గడుస్తున్నా.. ఒడవని మునుగోడు ముచ్చట!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు నెలల పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్గా నిలిచిన ‘మునుగోడు’ వేడి ఇంకా చల్లారలేదు. ఉప ఎన్నిక ఫలితం వచ్చి వారం గడుస్తున్నా రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ఫలితం ఇచ్చిన సంకేతాలేంటి? త్రిముఖ పోటీ జరిగితే 2023 ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది? అనే ఎన్నో ప్రశ్నలపై చర్చలు జరుగుతున్నాయి. గేరు మార్చిన ‘కారు’ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రాజకీయ సమీకరణాల్లో కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ దోస్తీ గురించే రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరుగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాజకీయ రణరంగంలో తిరుగులేని శక్తిగా నిలిచిన టీఆర్ఎస్.. ఇప్పుడు పొత్తు రాజకీయాలకు మునుగోడు నుంచే తొలి అడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలవాలన్న టీఆర్ఎస్ వ్యూహం సత్ఫలితాన్నే ఇచ్చినా.. ‘కారు’కు అదనపు బలం అవసరం పడుతోందనే చర్చకూ తావిచ్చిందని చర్చ జరుగుతోంది. కోరి తెచ్చుకున్నా చేదు తీర్పు! మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మునుగోడు వేదికగా గోల్ కొట్టి ‘రాజ’సంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక ఫలితం చేదు తీర్పు ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్.. కోలుకునేదెప్పుడు? సిట్టింగ్ స్థానంలో పోటీచేసి.. మూడోస్థానానికి పడిపోయి, డిపాజిట్ను గల్లంతు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఉప ఎన్నిక సందిగ్ధంలోకి నెట్టింది. తమకు 23 వేలకు పైగా ఓట్లు రావడం, పార్టీని వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్రెడ్డి ఓడిపోవడంతో సంతోషించాలో.. సిట్టింగ్ నుంచి మూడోస్థానానికి పడిపోవడంపై బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ఇంకెప్పుడు కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. చిన్నాచితకా పార్టీలు.. ఎప్పటిలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కూడా ఎంతోకొంత ప్రభావం చూపుతాయని మునుగోడు ఉప ఎన్నిక తేల్చిందనే చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగితే ఫలితం ఎలా ఉంటుందన్నది ఈ ఉప ఎన్నికతో తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. -
కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదని స్వయంగా ఒప్పుకొన్న కేసీఆర్ కమ్యూనిస్టుల సహకారంతో మునుగోడులో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో పరాన్న జీవిగా మారిందని ఎద్దేవా చేశారు. రేవంత్ బుధవారం తన నివాసంలో మీడియాతో మా ట్లాడుతూ కమ్యూనిస్టుల సహకారంతో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారించి సాధించిన గెలుపు కూడా గెలుపేనా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్కు సహజమిత్రు లని, ఇప్పుడేదో మోజులో కేసీఆర్కు మద్దతి చ్చారన్నారు. కేసీఆర్ అక్కున చేరిన వాళ్లెవ రూ మళ్లీ కనిపించలేదని, ఆ విషయం క మ్యూనిస్టులకు కూడా తెలుసని పేర్కొన్నారు. దేశానికి నాయకుడవుతానన్న కేసీఆర్ సొంత కాళ్లపై నిలబడలేకపోయారని ఎద్దేవా చేశారు. మునుగోడులో బీజేపీ బరితెగించిందని, రూ. వందల కోట్లు పంచిపెట్టి దేశంలో మునుగోడును తాగుబోతు నియోజకవర్గంగా నిలబెట్టారని మండిపడ్డారు. 20 రోజుల్లో రూ.300 కోట్ల మద్యం తాగించారని ఆరోపించారు. చుక్క మందు పోయకుండా కాంగ్రెస్ 24వేల ఓట్లు పొందడం గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ను మూడో స్థానానికి నెట్టేయడానికి బీజేపీ జాతీయస్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు తిష్ట వేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈసీ అవసరం తేలిపోయింది! తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయిందని మోదీ ప్రకటించడం దిగజారుడుకు పరాకాష్ట అని రేవంత్రెడ్డి మండిపడ్డారు. ‘ఓటమిని సమీక్షించుకోకుండా కాంగ్రెస్ సఫా అయిందని మోదీ సంబరపడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మిత్రులే అని మోదీ ప్రకటనతో మరో సారి నిరూపితమైంది. బీజేపీ, టీఆర్ఎస్లది మిత్రభేదమే.. శత్రుభేదం కాదు. దేశానికి ఎన్నికల సంఘం అవసరం లేదని మును గోడు ఉప ఎన్నికతో తేలిపోయింది’ అని పేర్కొన్నారు. మునుగోడు ఫలితాలపై తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాదని, ఏఐసీసీ ఆదేశాల ప్రకారం టీపీసీసీ ముందుకెళ్తుందన్నారు. గవర్నర్ సందేహా లను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అదే సమయంలో ప్రతీది గవ ర్నర్ రాజకీయ కోణంలో చూడాల్సిన అవస రంలేదని పేర్కొన్నారు. పోలీసులు రహస్య కెమెరాలతో చిత్రీకరించిన ఫాంహౌజ్ వీడి యోలు ప్రగతిభవన్లో ఎందుకున్నాయని ప్రశ్నించారు. తెలంగాణలో భారత్ జోడో యాత్రలో రాహుల్ను ప్రజలు అక్కున చేర్చు కున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఈ యాత్ర తో రాహుల్ నూతన శకానికి తెర లేపారని, దేశం ప్రమాదకర స్థితిలోకి పోతున్న సమ యంలో రాహుల్ భరోసాగా కనిపించారన్నా రు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నా ఫోన్లూ ట్యాపింగ్.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
సాక్షి కార్టూన్ 10-11-2022
సాక్షి కార్టూన్ 10-11-2022 -
సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు
సంస్థాన్ నారాయణపురం, చండూరు: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన కేసీఆర్కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్, నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని శేరిగూడెం గ్రామాల్లో శనివారం రేణుకాచౌదరి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’’కేసీఆర్.. నీకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకో.. పిచ్చి వేషాలు మా దగ్గర కాదు.. నీ పప్పులు ఉడకవు’’ అంటూ హెచ్చరించారు. పాల్వాయి స్రవంతి చేతికి ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గం తమ్ముడి కోసం అంట.. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ని ఉద్దేశించి విమర్శించారు. చదవండి: సుప్రీం జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలి -
KTR: బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జ్షీట్.. ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేశారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్. మునుగోడులో అసాధారణ పరిస్థితులు కన్పిస్తున్నాయని చెప్పారు. 8 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పి ఉపఎన్నికలో ప్రజలను ఓట్లు అడుగుతున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరోసిస్ సమస్యపై ఆ పార్టీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కమలం పార్టీ ఏం చేసిందో, ఏం చేస్తుందో చెప్పకుండా సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారని ఆరోపించారు. చేనేత, ఖాదీపై పన్ను వేసిన తొలి ప్రధాని ఆయనే అని విమర్శలకు ఎక్కుపెట్టారు. ఫ్లోరిసిస్ సమస్యపై మొదటి ఛార్జ్షీట్, చేనేత, ఖాదీపై జీఎస్టీకి వ్యతిరేకంగా రెండో ఛార్జ్షీట్, రైతుల మోటార్లకు మీటర్లపై మూడో ఛార్జ్షీట్, నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయంపై నాలుగో ఛార్జ్షీట్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఐదో ఛార్జ్షీట్ వేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మునుగోడు ప్రజలందరి తరఫున బీజేపీపై ఈ ఛార్జ్షీట్ను వేస్తున్నట్లు తెలిపారు. మోదీ మోసం చేశారు.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోదీ యువతను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. ఉచిత పథకాలంటూ దాడి చేసి సంక్షేమ పథకాలకు సమాధి కడతారా అని ప్రశ్నించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం నయవంచన చేసిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనకుండా కుటిల రాజకీయం చేసిన మోదీ రైతు విరోధి అని మండిపడ్డారు. మోదీ హయాంలో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైందని కేటీఆర్ ఆరోపించారు. బేచో ఇండియా అంటూ ప్రభుత్వ రంగ సంస్థల్ని క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కార్పోరేట్లకు కానుకలు ఇస్తూ సామాన్యులను పన్నులతో బీజేపీ వేధిస్తోందన్నారు. చదవండి: ఈ టైంలో వద్దు.. మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు..! -
నందకుమార్తో పరిచయాలు ఉన్నాయి.. కానీ: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో ఎవరైనా చేరవచ్చని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చిన వారినైనా చేర్చుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. నందకుమార్తో తమకు పరిచయాలు ఉన్నాయి కానీ ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే ఏంటి.. పోతే ఏంటని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ విమానం కొంటున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నించారంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై మరోసారి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే. వేరే పార్టీ నుండి వచ్చిన వారిని మంత్రులు చేశారు. బీఎస్పీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదువులు ఇచ్చారు. కాంగ్రెస్కు చెందిన 12 మందిని టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కట్టుకథలు అల్లారు. ముందు రూ. 100 కోట్లు.. ఆ తర్వాత రూ. 15 కోట్లు అన్నారు. ఆ నలుగురు మా పార్టీలో చేరితే ప్రభుత్వం పడిపోతుందా?. నందకుమార్ తెలుసు కానీ నా అనుచరుడు కాదు. ఆయన ఎంపీ సంతోష్కు సన్నిహితుడు. కేసీఆర్ ప్రెస్మీట్ ఢిల్లీలో కాకుంటే లండన్లో పెట్టుకోవచ్చు.’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సెటైర్లు వేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్.. యాదాద్రిలో హైటెన్షన్ -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు నలుగురు పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టా రనడానికి, ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఫామ్హౌజ్ వ్యవహారంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని.. ఈ తతంగం మొత్తాన్ని బయటపెట్టేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రలోభాల పర్వాన్ని ఆసాంతం పరిశీలిస్తున్నారని, త్వరలోనే జాతీయ మీడియా ముందుకు తీసుకెళ్లనున్నారని పేర్కొంటున్నాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. టీఆర్ఎస్ ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకున్నాకే మాట్లాడాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దల ప్రమే యం ఉన్నట్టు రూఢీ చేసే సమాచారం సదరు స్వామీజీల ఫోన్లలో దొరికిందని అంటున్నాయి. ఫామ్హౌజ్లో రికార్డయిన ఆడియో, వీడియో ఫుటేజీలోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్రను రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని.. వాటిలోని సమాచారాన్ని రూఢీ చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ బండారాన్ని బయటపెట్టాలని కేసీఆర్ భావిస్తు న్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? నిందితులను రిమాండ్కు పంపకముందే మీడియాతో మాట్లాడితే పోలీసు విచారణను ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చే అవకా శం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్తున్నా యి. బీజేపీ ఎదురుదాడి వలలో చిక్కుకోకుండా ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెనుక బాగోతాన్ని ఆధారాలతో సహా జాతీయ మీడియా ముందు బయట పెట్టాలని సీఎం నిర్ణయించినట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. స్వామీజీల ఫోన్లలో కీలక సమాచారం తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా నిందితులు నందకుమార్, ఇద్దరు స్వామీజీలు వెల్లడించారని సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు వివరించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు, రూ.400 కోట్ల ప్రలోభాలకే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని అంటున్నాయి. బీజేపీ కీలక నేత ఒకరు తమతో నేరుగా టచ్లో ఉన్నట్టు చెప్పారని.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బాధ్యత తమకు అప్పగించారని వారు చెప్పిన సంభాషణలు రికార్డు అయ్యాయని పేర్కొంటున్నాయి. కేంద్ర సంస్థల దుర్వినియోగం, తెలంగాణలోనూ వాటిని ఉసిగొల్పనున్న వైనానికి స్వామీజీల సంభాషణలు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నాయి. ప్రగతిభవన్లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్హౌజ్ ఘటనలో ప్రలోభాలకు గురైన ట్టుగా పేర్కొంటున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు(అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), బీరం హర్షవ ర్ధన్రెడ్డి(కొల్లాపూర్), పైలట్ రోహిత్రెడ్డి (తాండూరు) బుధవారం రాత్రి నుంచీ ప్రగ తిభవన్లోనే ఉండటం గమనార్హం. ఘటన తర్వాత వారు మీడియాకు అందుబాటులోకి రాలేదు. అయితే వారు ఫామ్హౌజ్లో బీజేపీ దూతలతో జరిగిన మంతనాలు, పోలీసుల రాక, భేటీకి సంబంధించిన ఆధారాలు తదితరాలపై సీఎం కేసీఆర్కు పూర్తి వివరాలు వెల్లడించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పదిరోజులుగా బేరసారాలు జరిగాయని.. భేటీ కోసం దీపావళి తర్వాత సమయాన్ని ఖరారు చేశారని వివరించారని అంటున్నాయి. చదవండి: ఫామ్హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్రెడ్డి కౌంటర్ ఎటాక్ ఈ సమయంలో ఆడియో, వీడియో ఫుటేజీల్లో నిక్షిప్తమైన సమాచారం గురించి కేసీఆర్ ఆరా తీశారని.. ప్రలోభాల పర్వంపై పూర్తి వివరాలను బయటపెట్టేదాకా మౌనం పాటించాలని ఆదేశించారని పేర్కొంటున్నాయి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మంత్రి హరీశ్రావు కూడా బుధవారం రాత్రి నుంచీ ప్రగతిభవన్లోనే ఉండిపోయారు. మంత్రి హరీశ్రావు మాత్రం గురువారం తెల్లవా రుజామున బయటికి వెళ్లి కాసేపటికే తిరిగి ప్రగతిభవన్కు చేరుకున్నారు. వారు ప్రలోభాల పర్వానికి సంబంధించిన ఆడి యో, వీడియో ఫుటేజీలను విశ్లేషించి.. ఆధా రాలను సిద్ధం చేసుకుంటున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నైతిక విలువలు లేకుండా పార్టీలో చేర్చుకున్నది మీరు
-
ఫామ్హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్రెడ్డి కౌంటర్ ఎటాక్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓటమి తప్పదని తెలిసి టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ఫామ్హౌజ్ ఘటన టీఆర్ఎస్ కుట్రగా వర్ణించారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన చరిత్ర టీఆర్ఎస్దేనని మండిపడ్డారు. ఫిరాయింపులకు పెద్ద పీట వేసింది కేసీఆర్.. ఫిరాయించిన వారికి మంత్రి పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు, రాజీనామాలు చేయించకుండా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. నైతిక విలువలు లేకుండా అనేకమందిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. తాము బ్రోకరిజం చేశామంటున్న ఇంద్రకరణ్రెడ్డికి ఏ పార్టీ నుంచి గెలిచారో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. మండలిలోని మొత్తం కాంగ్రెస్ నేతల్ని టీఆర్ఎస్ తమ పార్టీలోకి లాక్కుందని ప్రస్తావించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారని, ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను చేర్చుకోలేదా అని నిలదీశారు. అక్రమ కేసులు, రాజకీయ బెదిరింపులతో చేర్చుకున్నారని మండిపడ్డారు. తమకు ఆ అవసరం లేదని, 2023 వరకూ తాము వేచిచూడటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చదవండి: ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్ బీజేపీకి సంబంధం ఏమిటి ‘కల్వకుంట్ల కుటుంబం నుంచి సీఎం పదవి చేజారిపోతుందని భయం. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారని భయం. ఫామ్హౌజ్కు పోలీసులు రాకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పోస్టులు సిద్ధం మునుగోడులో బీజేపీ నేతలకు కేటీఆర్ ఫోన్ చేస్తే అది నైతికత. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఫామ్హౌజ్ ఘటనలో దొరికిన డబ్బులెంత? ఇప్పుడా డబ్బులు ఎటు పోయాయి. డబ్బుతో పట్టుకున్నామని చెబుతున్న వాళ్లతో బీజేపీకి సంబంధం ఏమిటి? నలుగురు ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా. వాళ్లేమైనా ప్రజాబలం ఉన్న నాయకులా. కొంతమంది పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టాలంటే మొదటి కేసు కేసీఆర్ పైనే పెట్టాలి. ఫామ్హౌజ్కు ఎందుకు పిలిచారు. అప్పుడే మా పార్టీలోకి రానిస్తాం వాళ్లకు వాళ్లే పిలుచుకున్నారు. వాళ్లకు వాళ్లు మొత్తం వ్యహారం నడిపించారు. దమ్ముంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. ఇది ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉన్న కేసు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో సానుభూతి కోసం ప్రయత్నాలు. ప్రధానిని తిడితేనే జాతీయ నేత అతవుతామని కేసీఆర్ భావిస్తున్నారు. 8 సంవత్సరాలలో ఒక్క అవినీతి మరక లేకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ. నాలుగు ఆర్లు మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే మధ్యవర్తులు అక్కర్లేదు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే మా పార్టీలోకి రానిస్తాం. టీఆర్ఎస్ నేతలు చాలా మందితో నందకుమార్ ఫోటోలు దిగారు. నాతో దిగిన ఫోటో చూపించి కిషన్ రెడ్డి మనిషి అంటే ఎలా;’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి?