Wasim Jaffer
-
కేఎల్ రాహుల్ అవుట్పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్ను అవుట్గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో తలమునకలైంది.అయితే, ఈ ఐదు మ్యాచ్ల కీలక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.శుబ్మన్ గిల్ స్థానంలో..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్మన్ గిల్ స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్కు జోడీగా కేఎల్ రాహుల్ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.కేరళకు చెందిన దేవ్దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.ఫస్ట్క్లాస్ కెరీర్లోనూఅయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో దేవ్దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్క్లాస్ కెరీర్లోనూ 24 ఏళ్ల పడిక్కల్కు మంచి రికార్డే ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!ఇప్పటి వరకు 40 మ్యాచ్లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్ను కూడా మిడిలార్డర్లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్కు తోడుగా కేఎల్ రాహుల్ను ఓపెనర్గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.ఓపెనర్గా రాహుల్ బెస్ట్కాగా టీమిండియా తరఫున ఓపెనర్గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు -
BGT: ఈసారి టీమిండియా గెలవడం కష్టమే.. అతడు లేడు కాబట్టి..
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.ఈసారి టీమిండియా గెలవడం కష్టమేఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్లు గెలిచింది.అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందిప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు.కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్తో సిరీస్లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్ -
Ind vs Ban: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్
బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఉందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ టీమిండియాకు సూచించాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ బంగ్లా ప్రమాదకర జట్టుగా మారుతోందని.. ముఖ్యంగా విదేశీ గడ్డపై గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నాడు. కాబట్టి ప్రత్యర్థిని పసికూనగా భావిస్తే మూల్యం చెల్లించే పరిస్థితి రావొచ్చని రోహిత్ సేనను హెచ్చరించాడు.రెండు మ్యాచ్ల సిరీస్కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనలిస్టులలో ఫేవరెట్గా ఉన్న భారత జట్టు.. గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగనుండగా.. టీమిండియా ఇప్పటికే అస్తశస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేనను ఢీకొట్టేందుకు బంగ్లాదేశ్ కూడా సిద్ధంగానే ఉంది.ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే.. కానీ ఇప్పుడుముఖ్యంగా పాకిస్తాన్ను వారి గడ్డపై టెస్టుల్లో తొలిసారి ఓడించడమే కాదు.. ఏకంగా క్లీన్స్వీప్ చేసిన జోష్లో ఉన్న నజ్ముల్ షాంటో బృందం.. భారత్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ జట్టు అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత మెరుగ్గా తయారవుతోంది. ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే ఆడగలరని వారికి పేరు ఉండేది. అయితే, గత కొంతకాలంగా విదేశాల్లోనూ బంగ్లా రాణిస్తోంది.కివీస్ గడ్డపై గెలిచిన ఘనతన్యూజిలాండ్ను న్యూజిలాండ్లో(2022, మౌంట్ మౌంగనూయ్), పాకిస్తాన్ను పాకిస్తాన్లో ఓడించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇప్పటికే ఇంటా బయటా తమను తాము నిరూపించుకున్నారు. జట్టులోని సీనియర్లు వారికి మార్గదర్శకులుగా ఉంటున్నారు. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ.. యువకులకు స్ఫూర్తినిస్తున్నారు.నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లుగత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన కోచ్ల ద్వారా కూడా బంగ్లాదేశ్ ఆట మెరుగుపడింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, నషీద్ రాణా, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్.. రాణిస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టు నలుగురైదుగురు ఫాస్ట్ బౌలర్లు గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు’’ అని వసీం జాఫర్ హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు. టీమిండియా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించాడు. చదవండి: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్డౌన్ బ్యాటర్గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్గా అలెన్ బోర్డర్ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్గా గిల్క్రిస్ట్కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్గా నిలిచి ఆల్టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
'టీమిండియా ఓడిపోయినందుకు బాధ లేదు.. కానీ అదొక్కటే సమస్య'
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్లో మాత్రం ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్లో భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకపై వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.తొలి వన్డేను టైగా ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. భారత హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్కు ఇదే తొలి సిరీస్ ఓటమి కాగా.. టీ20 వరల్డ్కప్ విజయం తర్వాత రోహిత్ శర్మకు కూడా మొదటి పరాజయం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్లో భారత్ ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోందని జాఫర్ అభిప్రాయపడ్డాడు."ఈ సిరీస్లో శ్రీలంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కచ్చితంగా ఈ సిరీస్ విజయానికి వారే అర్హులు. అయితే భారత్ సిరీస్ ఓడిపోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. ఆటలో గెలుపు ఓటములు సహజమే.కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇటువంటి ప్రదర్శన కనబరిచడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీకి ముందు భారత్ కేవలం మూడు వన్డేల మాత్రమే ఆడనుందని" ఎక్స్లో జాఫర్ రాసుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భారత్కు ఇంకా కేవలం మూడు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ భారత్ ఆడనుంది. -
పంజాబ్ హెడ్ కోచ్గా టీమిండియా మాజీ ఓపెనర్..
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్కోచ్గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ను పీసీఎ నియమించింది. ఈ విషయాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీకరించారు.కాగా పంజాబ్ హెడ్కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధరఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫర్ వైపే మొగ్గు చూపింది.రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్రమంలోనే జాఫర్ను మా జట్టు ప్రధాన కోచ్గా నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాము. భారత్ నుంచి అత్యుత్తమ టెస్టు ప్లేయర్లలో జాఫర్ ఒకడు. కాబట్టి అతడిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు హెడ్కోచ్ పనిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు మెంటార్, బ్యాటింగ్ కోచ్గా కూడా జాఫర్ తన సేవలను అందించాడు. -
T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొదటి బ్యాచ్లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు.మిగిలిన వాళ్లలో బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.రోహిత్కు జోడీగా కోహ్లి వస్తే బెటర్ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. వరల్డ్కప్ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కాగా మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ శర్మ వన్డౌన్లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఓపెనర్గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!‘‘వరల్డ్కప్ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్ యాదవ్) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి. నిజానికి రోహిత్ స్పిన్ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే వాళ్లు మిడిల్ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.అయితే, ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్లకు మాత్రమే ఈ ఓపెనింగ్ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024 -
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుస ఓటుములతో సతమతమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తున్నప్పటికి.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన వంతు న్యాయం చేస్తున్నాడు.కేకేఆర్తో మ్యాచ్లోనూ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వరల్డ్కప్-2024కు ముందు బుమ్రా సూపర్ ఫామ్లో ఉండటం భారత జట్టు కలిసిచ్చే ఆంశం.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు దాదాపు లేకపోవడంతో మిగిలిన మ్యాచ్లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.ఈ ఏడాది ఐపీఎల్లో మరో మ్యాచ్ తర్వాత ముంబై భావితవ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్లో ముంబై ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్రమిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం బెటర్. అది టీమిండియాకు బాగా కలిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్ఫోలో జాఫర్ పేర్కొన్నాడు. -
T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరింత పెంచేందుకు వరల్డ్కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుకు రానుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వికెట్ కీపర్ కోటాలోతన జట్టులో టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్లకు చోటిచ్చిన జాఫర్.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు స్థానం కల్పించాడు. కేఎల్ రాహుల్కు మాత్రం మొండిచేయి చూపాడు.ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను ఎంచుకున్న వసీం జాఫర్.. నయా ఫినిషర్ రింకూ సింగ్ను కూడా ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు ఈ టీమిండియా మాజీ క్రికెటర్ చోటిచ్చాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024కువసీం జాఫర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. -
ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: భారత మాజీ ఓపెనర్
#MSDhoni- IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటేనే కొత్త సారథి పని సులువు అవుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు (మార్చి 21).. ధోని కెప్టెన్సీని వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడని సీఎస్కే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తలా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని సంకేతాలు ఇచ్చింది. What it means! 🗣️💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/WCLqVI4xyU — Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024 అందుకు అనుగుణంగానే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ సైతం ధోని తాజా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ధోని ఆటగాడిగా కూడా రిటైర్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ఇంటర్వ్యూలో భాగంగా.. ధోని సీఎస్కే కెప్టెన్సీ వదిలేయడం గురించి ప్రస్తావించగా.. ‘‘ధోని కెప్టెన్గానే కాదు.. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ధోని ప్లేయర్గా ఉన్న జట్టును నాయకుడిగా ముందుకు నడిపించడం యువ ఆటగాడికి సాధ్యం కాదు. ఒకవేళ కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోని దానిని అంగీకరించవచ్చు లేదంటే వద్దని చెప్పవచ్చు. కాబట్టి ధోని మైదానంలో ఉండగా రుతురాజ్ గైక్వాడ్ సొంత నిర్ణయం తీసుకునేందుకు కచ్చితంగా ఇబ్బంది పడతాడు. అలా అయితే కెప్టెన్సీ కష్టం అంతేకాదు కొన్నిసార్లు తన నిర్ణయాలు అమలు చేయలేకపోవచ్చు కూడా! అప్పుడు కెప్టెన్సీ మరింత కష్టతరంగా మారుతుంది. అదే ధోని గనుక జట్టుతో లేకుంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. ధోని వారసుడిగా రుతురాజ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంటుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా 2022లో ధోని సారథిగా తప్పుకొని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్కే నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ.. ఆటగాడిగానూ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. మధ్యలోనే లీగ్ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఆ ఎడిషన్లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్కే.. 2023లో అనూహ్య రీతిలో పుంజుకుని చాంపియన్గా నిలిచింది. ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. ఇక శుక్రవారం (మార్చి 22) ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్లో తలపడనుంది. చదవండి: IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు! -
కిషన్ టీ20లకు పనికిరాడు.. ఆ యువ ఆటగాడికి ఛాన్స్ ఇవ్వండి!
గయానా వేదికగా ఆదివారం వెస్టిండీస్తో జరగనున్న రెండో టీ20లో అమీతుమీ తెల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో గెలిచి తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న విండీస్ మాత్రం.. అదే జోరును కనబరిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20కు ఇషాన్ కిషన్ స్ధానంలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్కు అవకాశం ఇవ్వాలని జాఫర్ సూచించాడు. కాగా విండీస్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన కిషన్.. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో మాత్రం నిరాశపరిచాడు. అయితే ఈ సిరీస్ మాత్రమే కాకుండా టీ20ల్లో అంత మంచి రికార్డు కిషన్కు లేదు. ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్లు ఆడిన కిషన్.. 25 కంటే తక్కువ సగటుతో 659 పరుగులు చేశాడు. "విండీస్తో రెండో టీ20లో యశస్వి జైస్వాల్ని చూడాలనుకుంటున్నాను. అతడు ఓపెనర్గా బరిలోకి దిగాలి. ఇషాన్ కిషన్ స్ధానంలో జైశ్వాల్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కిషన్ టీ20ల్లో పేలవ ఫామ్ను కనబరుస్తున్నాడు. గత 15 ఇన్నింగ్స్లలో అతడు 40 పరుగులు కూడా చేయలేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి అతడిని పక్కన పెడితే మంచింది. అయితే అతడు వన్డేల్లో మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ టీ20 అనేది భిన్నమైన ఫార్మాట్. అతడు ఐపీఎల్లో కూడా అంతగా రాణించలేకపోయాడు. జైశ్వాల్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్లో దుమ్మురేపాడు. అందుకే అతడు కచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి" అని జాఫర్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: #Alex Steele: 83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్ -
ఏదో క్లబ్గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా..
Wasim Jaffer On Tilak Varma’s batting performance on T20I debut: ‘‘అద్భుతంగా ఆడాడు. అతడి ఆటకు వంక పెట్టే అవకాశమే లేకుండా చేశాడు. ఏదో క్లబ్ గేమ్లోనో.. రాష్ట్రస్థాయి జట్టుకో ఆడుతున్నట్లు ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనివ్వలేదు. తనదైన శైలిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్లోనే ఇలా బెరుకు లేకుండా ఆడటం చూస్తుంటే మానసికంగా అతడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అర్థమవుతోంది. ఈ పిచ్పై మిగతా వాళ్లంతా విఫలమైన వేళ అతడు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆడాడు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించాడు. ఇంకాసేపు తిలక్ క్రీజులో ఉంటే భారత జట్టు తేలికగా మ్యాచ్ గెలిచేదని అభిప్రాయపడ్డాడు. మరో హైదరాబాదీ ఆగమనం ట్రినిడాడ్లోని బ్రియన్ లారా స్టేడియంలో టీమిండియా వెస్టిండీస్తో తొలి టీ20లో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా.. హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. విండీస్ విధించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక ‘స్టార్లు’ విఫలమైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి 3 బంతుల్లోనే రెండు సిక్సర్లతో అలరించాడు. జట్టులో అనుభవమున్న సీనియర్ ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అద్భుతమైన షాట్లు ఈ నేపథ్యంలో.. వసీం జాఫర్ మాట్లాడుతూ.. తిలక్ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఒకవేళ ఈ యువ బ్యాటర్ 50- 60 పరుగులు చేసి టీమిండియా గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తిలక్ అరంగేట్ర మ్యాచ్లో ఈ మేరకు రాణించడం జట్టుకు శుభసూచకమని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఓటమిపాలై.. కాగా రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో తిలక్ వర్మ హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక విండీస్తో తొలి టీ20లో ఓపెనర్లు ఇషాన్ కిషన్(6), శుబ్మన్ గిల్(3) సహా.. నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్య(21), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(19), సంజూ శాంసన్(12) చేతులెత్తేయడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆతిథ్య కరేబియన్ జట్టు 4 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్కు కూడా..! Takes a blinder. Hits back to back sixes to kick off his innings. A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSR — FanCode (@FanCode) August 3, 2023 -
రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..
Sreesanth Once Ate Two-Day Old Banana: ‘మానే కాక(రమేశ్ మానే) అప్పట్లో టీమిండియాతో ప్రయాణించేవాడు. మసాజ్ చేయడంతో పాటుగా పూజలు కూడా చేస్తుండేవాడు. నిజానికి శ్రీశాంత్కు ‘మూఢనమ్మకాలు’ ఎక్కువ. తనలాంటి ఫాస్ట్బౌలర్ను నేనైతే ఎప్పుడూ చూడలేదు. మానే కాక.. పూజ సమయంలో అగర్బత్తీలను అరటిపండుకు కుచ్చి నిలబెట్టేవాడు. రెండ్రోజులైనా అదే తిన్నాడు అయితే, శ్రీశాంత్ నమ్మకాల గురించి తెలిసిన ఓ క్రికెటర్ అతడిని ఆటపట్టించాలని భావించాడు. శ్రీశాంత్.. నువ్వు గనుక ఇప్పటికిప్పుడు అరటిపండు తింటే ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీస్తావు తెలుసా అని ఊరించాడు. అప్పటికే ఆ అగర్బత్తీలు పెట్టిన అరటిపండు అక్కడ పెట్టి రెండ్రోజులు అయింది. అయినా శ్రీశాంత్ దానిని తిన్నాడు. వికెట్లు తీయాలనే కోరికతో అలా చేశాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ గురించి చెప్పుకొచ్చాడు. జియో సినిమా షోలో భాగంగా.. టీమిండియా ఆటగాళ్ల వింత నమ్మకాల గురించి ప్రస్తావన రాగా 2006 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అందుకే అలా చేశాడు కాగా నాడు ఆ అరటిపండు తిన్న శ్రీశాంత్ అప్పటి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. జమైకాలో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా మొత్తంగా 49 పరుగులు ఇచ్చి ఈ మేరకు వికెట్లు పడగొట్టాడు. వాళ్లైతే ఆఖరికి లోదుస్తులు కూడా ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత క్రికెటర్లలో చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. రంజీ ఆడే రోజుల్లో కొంతమంది ఏదైనా ఒకరోజు ఐదు వికెట్లు తీస్తే.. ఆ బట్టలు.. ఆఖరికి లోదుస్తులు కూడా ఉతక్కుండా ఉంచుకునే వాళ్లని తెలిపాడు. అదృష్టం తమతో పాటు అలాగే అతుక్కుపోవాలని ఇలా చేసే వాళ్లని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ ఒక్కడికే కాకుండా చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్రో టీ10లీగ్తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు! -
ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడు! పర్లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితే..
Wasim Jaffer rates Shubman Gill's performances: వెస్టిండీస్తో సిరీస్లో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా తన ఆగమనాన్ని చాటగా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ సైతం తన మార్కు చూపించాడు. డొమినికాలో తొలి టెస్టులో యశస్వి 171 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విషయం తెలిసిందే. యశస్వి అలా.. ఇషాన్ ఇలా ఇక ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ తుపాన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. గిల్ మాత్రం విఫలం వీరిద్దరు ఇలా తమకు వచ్చిన మొదటి అవకాశాలను ఇలా సద్వినియోగం చేసుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా రెగ్యులర్ ఓపెనర్ అయిన శుబ్మన్ గిల్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏరికోరి మూడో స్థానంలో వచ్చిన అతడు రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్లో 6 పరుగులకే పెవిలియన్ చేరిన గిల్.. రెండో మ్యాచ్లో వరుసగా 10, 29(నాటౌట్) పరుగులు సాధించాడు. దీంతో అనవసరంగా మూడో స్థానంలో వచ్చి పిచ్చి ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడంటూ శుబ్మన్ గిల్పై విమర్శలు వస్తున్నాయి. 1-5.. ఎక్కడైనా ఆడగలడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. గిల్కు అండగా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 1-5 వరకు ఏ స్థానంలో అయినా ఆడగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ‘‘గిల్ మంచి బ్యాటర్. తనలాంటి ప్లేయర్ ఓపెనర్గా రాణించగలడు. ఐదో స్థానం వరకు ఎక్కడైనా సరే బ్యాటింగ్ చేయగలడు. అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అతడు మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టే విండీస్లో తను వన్డౌన్లో రావడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఒక్కోసారి 150 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి వెంటనే బ్యాటింగ్ చేయాలంటే ఓపెనర్లకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పదికి నాలుగు మార్కులు కానీ నంబర్ 3లో ఆడే వారికి కాస్త కుదురుకునే సమయం దొరుకుతుంది’’ అని వసీం జాఫర్ జియో సినిమా షోలో తన అభిప్రాయం పంచుకున్నాడు. కానీ, గిల్కు విండీస్ టూర్లో మాత్రం పదికి నాలుగు మార్కులు మాత్రమే వేస్తానని చెప్పడం విశేషం. అయితే, ఇది ఆరంభమే కాబట్టి గిల్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జాఫర్.. అతడికి కాస్త సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..! -
'అతడు వరల్డ్కప్లో అదరగొడతాడు.. కానీ అది ఒక్కటే డౌట్'
గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఆసియాకప్తో మైదానంలో అడుగుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అతడి ఫిట్నెస్కు సంబంధించి మెడికిల్ బులెటిన్ బీసీసీఐ విడుదల చేసింది. బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడాని, నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు జరగనుండడంతో బుమ్రా తిరిగి రావడం టీమిండియాకు ఎంతో అవసరం. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడని జాఫర్ జోస్యం చెప్పాడు. "జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్లో చాలా కీలకం. అతడు ప్రపంచకప్లో ముఖ్య పాత్ర పోషిస్తాడని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం డెత్ బౌలింగ్లో అతడు లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. అతడి సేవలను ఈ ఏడాది మొత్తం భారత్ కోల్పోయింది. బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అయితే అతడు తిరిగి వచ్చిన అదే వేగంతో బౌలింగ్ చేయగలడా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. కానీ బుమ్రా అదే స్పీడ్ను కొనసాగిస్తే అతడిని మించినవారే ఉండరు" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! టీమిండియా కెప్టెన్పై సీరియస్ -
'500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈతరం ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వెస్టిండీస్తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టు కోహ్లికి అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 500వ మ్యాచ్. టీమిండియా తరపున 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. సెంచరీల విషయంలో మాత్రం దిగ్గజం సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. విండీస్తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికి 76 పరుగులతో మంచి టచ్లోనే కనిపించాడు. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్లో కోహ్లి సెంచరీతో మెరుస్తాడేమో చూడాలి. ఇక కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంపై టీమిండియా మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించారు. ''ఆట పట్ల కోహ్లికున్న నిబద్ధత ఇవాళ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా చేసింది. వచ్చి 16 ఏళ్లు కావొస్తున్నా అదే ఫిట్నెస్ మెయింటేన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ 16 ఏళ్లలో కోహ్లి తనకు తానుగా తప్పుకున్నాడే తప్ప ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్కు దూరమైన సందర్భాలు లేవు. ఈతరం క్రికెటర్లలో గొప్ప ఆటగాడని కచ్చితంగా చెప్పగలను. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లికి కంగ్రాట్స్'' అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ''500వ అంతర్జాతీయ మ్యాచ్.. కోహ్లి ఖాతాలో మరో కలికితురాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కొందరికే ఇది సాధ్యమవుతుంది.. అందులో కోహ్లి ఒకడు. ఇదే ఫామ్ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ఓజా పేర్కొన్నాడు. ''క్రికెట్లో 500 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశం అందరికి రాదు. కానీ కోహ్లికి ఆ చాన్స్ వచ్చింది. బ్యాటర్గా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మంచి ఫిట్నెస్ కలిగి ఉన్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు బాదాడు. ఇది అతని క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పాన్ని సూచిస్తున్నాయి.'' అంటూ జాఫర్ తెలిపాడు. చదవండి: BAN W Vs IND W 2nd ODI: జెమీమా రోడ్రిగ్స్ ఆల్రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం -
'30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా'
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్కే ఐదోసారి చాంపియన్గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్లో చూసే అవకాశం ఉంది. ఇక ధోని బర్త్డే పురస్కరించుకొని టీమిండియా క్రికెటర్లు సహా పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ధోనితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ధోనికి "ముందు నా ప్రియ మిత్రుడు ఎంఎస్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను 2005లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ధోనీ టీమ్కు కొత్త. 2004 డిసెంబర్ లో జట్టులోకి వచ్చాడు. వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాడిని. మేము వెనుకాల కూర్చునే వాళ్లం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ఆర్పీ సింగ్ వెనుకాల సీట్లలో కూర్చునే వాళ్లం. అప్పట్లో మేమంతా వెనుకాల కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్లం. అతడు రైల్వేస్ లో పని చేసేవాడని మనందరికీ తెలుసు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం చాలా తిరిగేవాడు. అంత చేసినా ఆడే అవకాశం మాత్రం వచ్చేది కాదు. అప్పట్లో అతడు ఆ జాబ్ వదిలేశాడనుకుంటా. రూ.30 లక్షలు సంపాదించి తన జీవితం మొత్తం హాయిగా రాంచీలో గడిపేస్తానని.. ఎట్టిపరిస్థితుల్లో రాంచీ వదలనని చెప్పేవాడు. క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో రూ.30 లక్షలు సంపాదిస్తే చాలు.. నా జీవితం ప్రశాంతంగా గడిపేస్తా అనేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు" అని జాఫర్ వెల్లడించాడు. చదవండి: MS Dhoni: ధోని బర్త్డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్ -
ఆ నలుగురు ఎందుకు? ఓహో.. అందుకే వాళ్లను సెలక్ట్ చేయలేదా?: మాజీ బ్యాటర్
India West Indies tour 2023: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల వ్యవహారశైలిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ముఖ్యంగా విండీస్తో టెస్టు సిరీస్కు జట్టును ఎంపిక చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడనంత మాత్రాన రంజీల్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను పక్కన పెడతారా అని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విండీస్లో నెల రోజులు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టుకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో మరోసారి బిజీ కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్తో తలపడే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, రంజీల్లో అదరగొట్టిన ఆటగాళ్ల పేర్లను కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పట్ల వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టెస్టు జట్టు కూర్పుపై సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని విమర్శించాడు. నలుగురు ఓపెనర్లు ఎందుకు? ‘‘నలుగురు ఓపెనింగ్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటి? రోహిత్, శుబ్మన్, గైక్వాడ్, జైశ్వాల్ వీళ్లంతా ఓపెనర్లే! ఇలా చేసే బదులు సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేసి ఉంటే మిడిలార్డర్ పటిష్టమయ్యేది కదా? దేశవాళీ క్రికెట్లో అతడి ప్రదర్శన చూశాం కదా! ఓహో అందుకే వాళ్లను పక్కనపెట్టారా? ఇక అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ రంజీల్లో, ఇండియా- ఏ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. టెస్టు జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లు ఐపీఎల్ ఆడలేదన్న కారణంగా టీమిండియాకు ఎంపిక చేయరా? అకస్మాత్తుగా రుతురాజ్ టెస్టు జట్టులోకి ఎలా వచ్చాడు? దీన్ని బట్టే మీ దృష్టికోణం ఎలా ఉందో అర్థమవుతోంది’’అని వసీం జాఫర్ సెలక్టర్ల తీరును తూర్పారపట్టాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా విండీస్తో సిరీస్ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే రోహిత్ శర్మ డిప్యూటీగా ఎంపిక కాగా.. నయా వాల్గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. రంజీ ట్రోఫీ 2022-23లో అభిమన్యు, ప్రియాంక్ ఇలా బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 8 మ్యాచ్లలో 798 పరుగులు చేయగా.. గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ 5 మ్యాచ్లు ఆడి 583 పరుగులు సాధించాడు. ఇక ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 6 మ్యాచ్లలో కలిపి 556 పరుగులు చేశాడు. విండీస్తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN — Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023 -
విండీస్ టూర్లో ఫియర్లెస్ క్రికెట్ ఆడే యువకులకు చోటివ్వాలి: జాఫర్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు నుంచి కొంత మంది కొత్తముఖాలను చూసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు. విండీస్ పర్యటనలో ఫియర్లెస్ క్రికెట్ ఆడే యువకులకు జట్టులో చోటివ్వాలని జాఫర్ అభిప్రాయపడడ్డాడు. "టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి. ముఖ్యంగా వైట్బాల్ క్రికెట్లో మరింత దూకుడుగా ఆడాలి. ధైర్యంగా ఆడే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనం విజయాలు సాధిస్తాం. అదే విధంగా టీ20 క్రికెట్ జట్టులో యశస్వి జైస్వాల్ వంటి విధ్వంసకర ఆటగాడికి కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. భారత్కు రింకూ సింగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం జట్టులో లేడు కాబట్టి అతడి స్ధానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలి. అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు. నా వరకు అయితే విండీస్తో వన్డే సిరీస్కు సంజు శాంసన్కు చోటు దక్కే ఛాన్స్ ఉంది" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: అహ్మదాబాద్లో ఆడటానికి ఎందుకంత భయం.. దెయ్యం ఏమైనా ఉందా: పీసీబీపై అఫ్రిది ఫైర్ -
ఎడ్జ్బాస్టన్ పిచ్ హైవేలా ఉంది.. జాఫర్ సెటైరికల్ ట్వీట్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపాత్యం చెలాయిస్తోంది. బాజ్బాల్ అంటూ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్ను 393/8 వద్ద డిక్లెర్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు రెండో రోజు లంచ్ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్కు చేరారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్బాస్టన్ పిచ్ను చాలా ఫ్లాట్గా తాయారు చేశారని, బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఎడ్జ్బాస్టన్ పిచ్ను హైవేతో పోలుస్తూ జాఫర్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఎడ్జ్బాస్టన్ పిచ్ ఫోటోను షేర్చేస్తూ.. "పిచ్ను దగ్గరగా చూడండి అంటూ" ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. . జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ Closer look at the Edgbaston pitch #Ashes23 pic.twitter.com/0gNSMWdPim — Wasim Jaffer (@WasimJaffer14) June 16, 2023 -
జాఫర్కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్కార్డ్; భలే దొరికాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్కు వెళ్లే దారిలో ఎలిమినేటర్ను క్లియర్ చేసి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 26(శుక్రవారం) గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఆ మ్యాచ్లోనూ గెలిచి ఫైనల్లో సీఎస్కేను చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ముంబై గెలుపుకు ప్రధాన కారణం ఆకాశ్ మధ్వాల్. తన సంచలన బౌలింగ్తో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆకాశ్ మధ్వాల్ను ముంబై తమ ట్రంప్కార్డ్గా భలే ఉపయోగించుకుంది. అంతకముందు లీగ్ దశలోనూ ప్లేఆఫ్ చేరాలంటే ఎస్ఆర్హెచ్పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లనూ ఆకాశ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఏడు మ్యాచ్లాడిన ఆకాశ్ మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. యార్కర్ల కింగ్ బుమ్రా లేని లోటును మధ్వాల్ తీరుస్తూ రోహిత్కు అత్యంత నమ్మకమైన బౌలర్గా ఎదిగాడు. Photo: IPL Twitter ఎలిమినేటర్ లాంటి కీలక మ్యాచ్లో సత్తా చాటిన మధ్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. జాఫర్ వెలికితీసిన ఆణిముత్యం.. ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. యూపీ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. Photo: IPL Twitter ఇంజనీర్ నుంచి క్రికెటర్గా.. పంత్ పొరుగింట్లో నివాసం 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మధ్వాల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పొరుగింట్లోనే అతడు నివసిస్తుండటం విశేషం. వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కోసం.. ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. Photo: IPL Twitter ఆర్సీబీ వదిలేసింది.. ముంబై ఒడిసిపట్టింది 2021లోనే ఆకాశ్ ఐపీఎల్కు ఎంపికయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. 2022లో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్కు రీప్లేస్మెంట్గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. Photo: IPL Twitter ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్సీబీ ఆకాశ్కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా.. ముంబై మాత్రం ఆకాశ్ను ఆడించి ప్రయోజనం పొందింది. 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: #DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు! పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్
Bangladesh Clean Sweep England T20 Series 2023: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను బంగ్లాదేశ్ క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్లో షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి సిరీస్ను 3–0తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్కు ఇది రెండోసారి మాత్రమే కాగా మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక టి20 సిరీస్ను బంగ్లాదేశ్ క్లీన్స్వీప్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2012లో ఐర్లాండ్పై బంగ్లాదేశ్ తొలిసారి ఈ ఘనత సాధించింది. ఇక బంగ్లాదేశ్–ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక టి20 సిరీస్ జరగడం కూడా ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక టి20 సిరీస్ను 0–3తో కోల్పోవడం ఇది రెండోసారి మాత్రమే. అసలు ఈ మనిషి కనబడటం లేదే! 2014లో ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి ఇంగ్లండ్ 0–3తో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ను ఉద్దేశించి.. ‘‘చాలా రోజులు అవుతోంది.. అసలు ఈ మనిషి కనబడటం లేదే!’’ అన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా గతంలో టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత పిచ్లపై అవాకులు చెవాకులు పేలుతూ వాన్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వసీం జాఫర్- మైకేల్ వాన్ మధ్య ఓ రేంజ్లో ట్విటర్ వార్ జరిగింది. భారత జట్టును తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారీ మైకేల్కు అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడం వసీంకు అలవాటు. వైరల్ ట్వీట్ ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ ఊహించని రీతిలో దారుణంగా పరాభవం పాలుకావడం.. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి టీమిండియా వరుసగా నాలుగోసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో ఈ మేరకు వసీం.. వాన్కు కౌంటర్ వేశాడు. ‘లాంగ్ టైమ్ నో సీ’ అంటూ #BANvENG హ్యాష్ట్యాగ్ను జతచేశాడు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సరైన సమయంలో సరైన కౌంటర్ అంటూ వసీం జాఫర్ను ప్రశంసిస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇక బంగ్లా- ఇంగ్లండ్ టీ20 సిరీస్ మ్యాచ్ విషయంలో ఆఖరిదైన మూడో టి20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఓపెనర్ లిటన్ దాస్ (57 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... నజ్ముల్ (36 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడిపోయింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్లు), జోస్ బట్లర్ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లిటన్ దాస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... నజ్ముల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! ఖరీదైన 6 బెడ్ రూమ్ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..? Hello @MichaelVaughan, long time no see 😏 #BANvENG pic.twitter.com/3nimzfuHOw — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2023 -
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్, సూర్యకుమార్కు నో ఛాన్స్!
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఇరు జట్లు మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అంచనా వేశాడు. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్కు తను ఎంపిక చేసిన జట్టులో జాఫర్ చోటివ్వలేదు. రాహుల్ స్థానంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు, సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇచ్చాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరాడు. ఈ క్రమంలో అతడు ఢిల్లీ టెస్టు జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ కూడా దృవీకరించింది. ఇక రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచారు. రాహుల్ 20 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. సూర్య తన అరంగేట్ర టెస్టులో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరిని ఢిల్లీ టెస్టుకు దూరం పెట్టాలని పలువరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ కూడా తన అంచనా వేసిన జట్టులో వీరిద్దరికి చోటివ్వకపోవడం గమానార్హం. తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: West Indies: వెస్టిండీస్ టీ20 కెప్టెన్గా విధ్వంసకర వీరుడు.. -
ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని
నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్లు తమ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ నడ్డి విరిచారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో జడేజా ఐదు వికెట్లతో చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి మొత్తంగా 15 వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్లధ్య రెండోటెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది. ఇక టీమిండియా విజయం అనంతరం ఆసీస్ ఆటతీరును విమర్శిస్తూ.. అశ్విన్ను మెచ్చుకుంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టర్నింగ్ పిచ్ అంటూ కేవలం రెండు పదాలతో ట్వీట్ చేశాడు. ఒక వ్యక్తి వచ్చి లావుగా ఉన్న మనిషిని లగేజీ మూవింగ్ కన్వేయర్ బెల్ట్పై పడేయడం కనిపిస్తుంది. సదరు వ్యక్తి అందులో నుంచి బయటకు రాలేక సతమతమవుతాడు. టర్న్ అవుతున్న పిచ్పై టీమిండియా స్పిన్ దెబ్బకు ఆసీస్ పరిస్థితి కూడా ఇదే.. అని అర్థం వచ్చేలా ట్వీట్ ఉంది. ఐదు వికెట్లు తీసిన అశ్విన్కు కంగ్రాట్స్ అంటూ పేర్కొన్నాడు. ఈ విషయం పక్కనబెడితే. నాగ్పూర్ పిచ్పై క్రికెట్ ఆస్ట్రేలియా సహా అక్కడి మీడియా కోడై కూసింది. పిచ్ను టీమిండియా స్పిన్నర్లకు అనుకూలంగా మాత్రమే తయారు చేశారంటూ.. డాక్టర్డ్ పిచ్ అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అయితే మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించారో.. ఆసీస్ డెబ్యూ బౌలర్ టాడ్ మర్ఫీ కూడా అంతే చూపించాడు. అశ్విన్, జడేజాలు చెరో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో చెలరేగితే.. మర్ఫీ ఏడు వికెట్లతో అదరగొట్టాడు. పిచ్ స్పిన్కు అనుకూలమన్న మాట నిజమే కావొచ్చు కానీ ఓపికగా బ్యాటింగ్ చేస్తే పరుగులు వస్తాయని భారత బ్యాటర్లు నిరూపించారు. In short 😅 Congrats on another fifer @ashwinravi99 👏🏽 #INDvAUS pic.twitter.com/Z6bF5zvDZJ — Wasim Jaffer (@WasimJaffer14) February 11, 2023 -
BGT 2023: ఆసీస్తో తొలి టెస్ట్.. అక్షర్, సూర్యకుమార్లకు నో ఛాన్స్..!
Wasim Jaffer Playing XI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన ప్లేయింగ్ ఎలెవెన్ను ప్రకటించాడు. ఈ జట్టులో జాఫర్ రెండు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ ఊహించిన విధంగానే తొమ్మిది మందిని ఎంపిక చేసిన జాఫర్.. ఎన్నో అంచనాలను మోస్తున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్, టెస్ట్ అరంగేట్రంకు సిద్ధంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్లను బెంచ్కే పరిమితం చేశాడు. My India XI for First Test: 1. Rohit (c) 2. KL 3. Pujara 4. Virat 5. Shubman 6. Bharat (wk) 7. Jadeja 8. Ashwin 9. Kuldeep 10. Shami 11. Siraj Hard to leave out Axar but Kuldeep brings variety as a wrist spinner. What's your XI? #INDvAUS #BorderGavaskarTrophy — Wasim Jaffer (@WasimJaffer14) February 6, 2023 అక్షర్ను బెంచ్పై కూర్చొబెట్టడం కాస్త ఇబ్బందిగానే ఉందని కామెంట్ చేసిన జాఫర్.. సూర్యకుమార్ విషయాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్షర్కు బదులుగా తాను ఎంపిక చేసుకున్న కుల్దీప్ రిస్ట్ స్పిన్నర్గా వైవిధ్యాన్ని ప్రదర్శించగలడని జాఫర్ తన ఎంపికను సమర్ధించుకున్నాడు. బ్యాటింగ్ లైనప్ విషయంలోనూ జాఫర్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. యువ సంచలనం శుభ్మన్ గిల్ను ఓపెనర్గా కాకుండా ఐదో స్థానం కోసం ఎంపిక చేసుకున్నాడు. స్పెషలిస్ట్ వికెట్కీపర్ అవసరమని భావించిన జాఫర్.. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్కు తన ఓటు వేశాడు. భరత్కు స్థానం కల్పించడంతో సూర్యకుమార్ను తప్పించి ఉంటాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కాగా, గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్పూర్లో భారత్, బెంగళూరులో ఆసీస్ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్ గేమ్ను మొదలుపెట్టింది. సీఏ చేసిన 39 ఆలౌట్ వ్యాఖ్యలకు వసీం జాఫర్ తనదైన శైలీలో రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. భారత్-ఆసీస్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్లు గెలిచాయి. 5 సిరీస్లు డ్రాగా ముగిసాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
T20 WC: వచ్చే వరల్డ్కప్లో వాళ్లకు కోహ్లి, రోహిత్ అవసరం లేదు.. ఎందుకంటే?
T20 World Cup 2024- Virat Kohli- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 కెరీర్ గురించి మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్-2024లో హిట్మ్యాన్ ఆడే అవకాశం లేదని అంచనా వేశాడు. మాజీ సారథి విరాట్ కోహ్లి మాత్రం ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2022లో రోహిత్ కెప్టెన్సీలోని భారత జట్టు సెమీస్ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో వరుస విజయాలు నమోదు చేసినప్పటికీ.. మెగా టోర్నీలో మాత్రం ఫైనల్ చేరలేక చతికిలపడింది. హార్దిక్ సారథ్యంలో ఇక ఈ ఈవెంట్ తర్వాత పనిభారాన్ని తగ్గించే పేరిట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిస్తూ వస్తోంది మేనేజ్మెంట్. అదే సమయంలో శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులకు వరుస అవకాశాలు ఇస్తోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ప్రపంచకప్ నాటికి జట్టును పరిపుష్టం చేసే పనిలో ఉంది. వాళ్లకు రోహిత్, కోహ్లి అవసరం లేదు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. 35 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే తన టీ20 వరల్డ్కప్ ఆడేశాడని వ్యాఖ్యానించాడు. ఇక యువకులకు మార్గం సుగమం చేయాలని.. ఈ ఫార్మాట్లో వారికి మెరుగైన భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. అయితే, కోహ్లి మాత్రం టీ20లలో కొనసాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయన్నాడు. అంతేకాకుండా... ఇప్పటికే యువ క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడిన అనుభవం మెండుగా ఉందని.. కాబట్టి కోహ్లి, రోహిత్ల మార్గదర్శనం పెద్దగా వారికి అవసరం లేదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. అందుకే వీళ్లిద్దరు జట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉందని పేర్కొన్నాడు. కోహ్లి ఉంటాడు.. రోహిత్ కాదు ఓ యూట్యూబ్ చానెల్లో ఈ మేరకు అభిప్రాయాలు పంచుకున్న వసీం జాఫర్.. ‘‘శ్రీలంక, న్యూజిలాండ్ టీ20 సిరీస్లలో కూడా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. వీటి తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్.. ఆపై వన్డే వరల్డ్కప్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇలాంటి నిర్ణయాలు. ఇక ఆసీస్తో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయాలు పక్కనపెడితే.. ఇక టీ20 ఫార్మాట్.. ఇందులో భవిష్యత్ అంతా యువ ఆటగాళ్లదే. రోహిత్ శర్మ రానున్న టీ20 వరల్డ్కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. అయితే, విరాట్కు అవకాశం ఉంది. కానీ రోహిత్ విషయంలో అలా కాదు.. ఇప్పటికే అతడి వయసు 36 ఏళ్లు అనుకుంటా.. కాబట్టి తను మాత్రం కచ్చితంగా వచ్చే ఎడిషన్లో ఉండడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: Ind Vs Aus: అప్పుడు కోహ్లి లేడు! ఇప్పుడలా కాదు.. టీమిండియాను చూసి ఆసీస్ వణికిపోతోంది! నిదర్శనమిదే.. ILT20: ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్కు ఎంఐ ఎమిరేట్స్ -
IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’
న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరిచాడు. గతేడాది బంగ్లాదేశ్పై వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్కు శ్రీలంకతో పాటు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లకు భారత జట్టులో చోటు దక్కింది. అయితే శ్రీలంకతో సిరీస్లో కూడా కిషన్ తనదైన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన కిషన్ కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం కివీస్తో సిరీస్లో కూడా కేవలం 24 పరుగులు మాత్రమే సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి వన్డేలో కూడా కిషన్ తన ఆట తీరును మార్చుకోలేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఈ నేపథ్యంలో కిషన్పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వైట్బాల్ క్రికెట్లో కిషన్ నిలకడగా రాణించాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొవడంపై కూడా కిషన్ దృష్టిసారించాలని అతడు సూచించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో జాఫర్ మాట్లాడుతూ.. "లంక, న్యూజిలాండ్ సిరీస్లో కిషన్ నిరాశపరిచాడు. అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ నిలకడగా రాణించేందుకు ప్రయత్నం చేయాలి. అదే విధంగా కిషన్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఆ విభాగంలో అతడు మరింత రాటుదేలాలి. ఇక ఈ సిరీస్లో మిగితా ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్లో భారత్కు చాలా సానుకూలాంశాలు" ఉన్నాయి అని పేర్కొన్నాడు. చదవండి: WT20 WC 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్నెస్ టెస్టు పాస్ కాలేదని? -
ఉమ్రాన్ను తప్పించి జితేశ్ను తీసుకోండి! పృథ్వీ షా కంటే బెటర్!
India vs New Zealand T20 Series: ‘‘పేస్లో వైవిధ్యం చూపనంత వరకు ఉమ్రాన్ మాలిక్ ఈ ఫార్మాట్లో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. శుక్రవారం నాటి మ్యాచ్లో కూడా తను కట్టర్లు వేయాలని భావించినట్లు అనిపించింది. కానీ అలా చేయలేకపోయాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. న్యూజిలాండ్తో రాంచిలో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు ఒకే ఒక్క ఓవర్ వేసే అవకాశం వచ్చింది. దానిని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈ కశ్మీరీ ఎక్స్ప్రెస్. 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్ను తప్పించండి ఈ నేపథ్యంలో వసీం జాఫర్.. జట్టులో ఉమ్రాన్ మాలిక్ స్థానం గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. పేస్లో వైవిధ్యం చూపలేకపోతున్నాడని, రెండో టీ20లో తనను తప్పించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. అతడి స్థానంలో ఎక్స్ట్రా బ్యాటర్కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్రాన్తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. శివం మావికి కూడా 14 ఓవర్ వరకు బాల్ ఇవ్వలేదు. ఇద్దరు బౌలర్లతో కలిపి కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయిస్తున్నపుడు ఎక్స్ట్రా బ్యాటర్ను తీసుకోవచ్చు కదా! అతడే బెటర్ ఉమ్రాన్ను తప్పించి జితేశ్ శర్మ లేదంటే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి. ఇక నా అభిప్రాయం ప్రకారం.. వీరిద్దరిలో జితేశ్ బెటర్ ఆప్షన్. లోయర్ ఆర్డర్లో చక్కగా బ్యాటింగ్ చేయగలడు ’’అని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో సంజూ శాంసన్ స్థానంలో విదర్భ బ్యాటర్ జితేశ్ శర్మకు తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కివీస్తో టీ20 సిరీస్కూ ఎంపికైన 29 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు ఇంత వరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇక రాంచి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా లక్నోలో ఆదివారం న్యూజిలాండ్తో జరుగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. చదవండి: Umpire Marais Erasmus: బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? డబుల్ సెంచరీ ఓకే! టీ20లలో మరీ ఇంత ఘోరమా? అయినా ఇదెక్కడి న్యాయం -
రెండో వన్డేలోనూ ఉమ్రాన్కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా..
India vs New Zealand: న్యూజిలాండ్తో రెండో వన్డేలో కూడా టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు చోటు దక్కే అవకాశం లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. జట్టుకు ప్రస్తుతం ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆప్షన్లను పెంచుకునే క్రమంలో స్పిన్ లేదంటే పేస్ బౌలింగ్ చేయగల ఆల్రౌండర్లకే అవకాశం ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్.. ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, ఓ స్పిన్ ఆల్రౌండర్ సహా ఓ స్పిన్నర్, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్లతో పాటు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించింది. బౌలింగ్ విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండగా.. పేసర్లు షమీ, సిరాజ్ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శార్దూల్ ఠాకూర్కు అవకాశం ఇచ్చే క్రమంలో ఉమ్రాన్ను పక్కనపెట్టాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ రెండో వన్డేలో జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం ‘‘నాకు తెలిసి ఉమ్రాన్కు రెండో వన్డేలో కూడా ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ తను జట్టులోకి వచ్చినా శార్దూల్ ఠాకూర్ స్థానంలో మాత్రం వస్తాడనుకోను. నా అభిప్రాయం ప్రకారం.. జట్టులో శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం. ఎనిమిదో స్థానంలో తను బ్యాటింగ్ చేస్తాడు. ఇది జట్టుకు అవసరం. గత మ్యాచ్లో అతడు బాగానే బౌలింగ్ చేశాడు. అలెన్ వికెట్ సహా ఆఖర్లో యార్కర్తో బ్రేస్వెల్ను బౌల్డ్ చేయడం మనం చూశాం. తనకు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ఒక్కోసారి పరుగులు ధారాళంగా ఇవ్వొచ్చు... కానీ కచ్చితంగా వికెట్లు తీయగలడు. అంతేకాదు బ్యాట్తోనూ రాణించగలడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆల్రౌండర్లు కావాలి జట్టులో ఆల్రౌండర్లు ఎక్కువగా ఉంటే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో మూడో సీమర్ కచ్చితంగా ఆల్రౌండర్ అయి ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో శార్దూల్ రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. 7.2 ఓవర్ల బౌలింగ్లో 54 పరుగులు ఇచ్చాడు. ఏడు వైడ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయం ఖరారు చేశాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్లో భాగంగా మూడు పరుగులకే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాయ్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది. సిరీస్లో 1-0తో ముందంజలో ఉన్న టీమిండియా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్లు ఇలా..? -
న్యూజిలాండ్తో తొలి వన్డే... కుల్దీప్కు చోటు! చాహల్కు నో చాన్స్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో తొలి వన్డేలో భారత్ తలపడేందుకు సిద్దమైంది. ఈ కీలక పోరు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కివీస్తో తొలి వన్డేలో తలపడే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంచనా వేశాడు. తను అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్కు అవకాశం ఇచ్చాడు. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ను జాఫర్ ఎంపిక చేశాడు. అదే విధంగా ఐదో స్థానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కింది. ఇక ఆలౌరౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ను అతడు ఎంపికచేశాడు. ఇక ఈ జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్గా చాహల్ను కాదని కుల్దీప్ యాదవ్కు అతడు చోటిచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్ స్థానం దక్కించుకున్నారు. తొలి వన్డేకు వసీం జాఫర్ అంచనా వేసిన భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND Vs NZ: న్యూజిలాండ్తో తొలి పోరు.. భారత్ జోరు కొనసాగేనా? -
సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది.. ప్రతి 4-7 రోజులకోసారి వెటాడ్తది..!
Wasim Jaffer On Virat Kohli: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేల భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చేసిన కొన్ని ఆసక్తికర ట్వీట్లు ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వన్డేల్లో 46వ శతకాన్ని, ఓవరాల్గా 74వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకుని, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లిని ఉద్దేశిస్తూ జాఫర్ ఈ రకంగా ట్వీటాడు. "Tiger hunts every 4-7 days". Must be true as it's been 4 days since this knock 😉 #INDvSL https://t.co/OzhCRl7sGz — Wasim Jaffer (@WasimJaffer14) January 15, 2023 సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది, ఈ ఏడాది ఈ పులి వేట పెద్ద ఎత్తున సాగుతుంది.. పులి ఏరకంగా అయితే ప్రతి 4-7 రోజులకోసారి వేటాడ్తదో, కోహ్లి కూడా అదే గ్యాప్లో తన సెంచరీల దాహాన్ని తీర్చుకుంటాడు.. బహుపరాక్ అని అర్ధం వచ్చేలా జాఫర్ తన ట్వీట్ల ద్వారా ప్రత్యర్ధులను హెచ్చరించాడు. ఈ ట్వీట్లకు కోహ్లి ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతూ, కోహ్లి-పులి కామెంట్స్ను ఆస్వాధిస్తున్నారు. కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ (టీ20 ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్పై) పూర్తి చేసిన కోహ్లి, ఆ తర్వాత మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్పై వన్డే సెంచరీ, ఆతర్వాత మూడు వారాల బ్రేక్లో శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ, ఆతర్వాత నాలుగు రోజుల గ్యాప్లో మరో సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్ను అందుకున్న కింగ్ కోహ్లి.. గత 4 వన్డే ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు చేసి, కోహ్లి ఈజ్ బ్యాక్ అని చాటుకున్నాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ చూస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్లోనూ సెంచరీల మోత మోగడం ఖాయమని అర్ధమవుతుంది. -
హార్దిక్ ఇలా చేస్తాడనుకోలేదు! చెత్త బౌలింగ్.. ఆశ్చర్యపోయా..
India vs Sri Lanka, 2nd T20I: ‘‘డెత్ ఓవర్లలో హార్దిక్ బౌలింగ్ చేస్తాడనుకున్నా. మావి స్థానంలో తనే వస్తాడనుకున్నా. కానీ అలా జరుగలేదు. నిజానికి మావికి డెత్ ఓవర్లలో మెరుగైన రికార్డు లేదు. హార్దిక్కు అనుభవజ్ఞుడు. ఏదేమైనా ఆఖరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. శ్రీలంకతో పుణెలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పర్యాటక లంక 6 వికెట్ల నష్టపోయి 206 పరుగులు స్కోరు చేసింది. భారత బౌలర్లు తేలిపోవడంతో ఈ మేరకు భారీ లక్ష్యం విధించింది. అయితే, టార్గెట్ ఛేదించడంలో విఫలమైన హార్దిక్ సేన ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్.. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో బౌలర్ల సేవలను వాడుకునే క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. మావి స్థానంలో అతడే వస్తాడనుకున్నా! ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఆరో ఓవర్ తర్వాత తను బౌలింగ్ చేయడానికి రావడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నేనైతే అతడు మొదటి రెండు ఓవర్లు లేదంటే మిడిల్లో రెండు ఓవర్లు వేయడంతో పాటు... డెత్ ఓవర్లలో వస్తాడనుకున్నా. కానీ అలా చేయలేదు. అర్ష్దీప్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. నిజానికి శివం మావి మొదటి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో మ్యాచ్లో మొదట్లోనే అతడి చేతికి బంతిని ఇవ్వాల్సింది. అదే విధంగా బంతి కాస్త పాతబడిన తర్వాత అర్ష్దీప్తో మూడు లేదంటే నాలుగో ఓవర్ వేయించాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా లంకతో రెండో టీ20లో తమ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన మావి, ఉమ్రాన్(3/48) ఇద్దరే 101 పరుగులు సమర్పించుకోవడం విశేషం. చెత్త రికార్డు ఇక అర్ష్దీప్ కేవలం 2 ఓవర్ల స్పెల్ మాత్రమే వేసి 37 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు ఏకంగా 5 నోబాల్స్ వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రెండే ఓవర్లు వేసిన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 13 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్ తొలి ఓవర్, మూడో ఓవర్లో అతడు బౌల్ చేశాడు. ఇక గత మ్యాచ్లోనూ పాండ్యా ఆఖరి ఓవర్లో బంతిని అక్షర్ చేతికి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ICC ODI WC 2023: ఆ ఇద్దరు వరల్డ్కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా.. పంత్ ఉంటే.. Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్! -
Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం!
India vs Sri Lanka, 1st T20I: శ్రీలంకతో తొలి టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత తుది జట్టును అంచనా వేశాడు. వాంఖడే వేదికగా మంగళవారం జరుగనున్న మ్యాచ్లో శుబ్మన్ గిల్ టీ20 అరంగేట్రం ఖాయమని అభిప్రాయపడ్డాడు. యువ సంచలనం ఇషాన్ కిషన్కు జోడీగా గిల్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఇక స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్కు తన జట్టులో చోటివ్వని వసీం జాఫర్.. మరో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్, ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్లను ఎంపిక చేసుకున్నాడు. స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా సహా సీనియర్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో వన్డౌన్లో టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఐదో స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా వస్తే బాగుంటుందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ మాజీ ఓపెనర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 వసీం జాఫర్ భారత జట్టు: శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్. చదవండి: Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్గా Hardik Pandya: స్లెడ్జింగ్తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. My playing XI for tomorrow: 1. Gill 2. Ishan (wk) 3. SKY 4. Sanju 5. Hardik (c) 6. Hooda 7. Axar 8. Sundar 9. Harshal 10. Chahal 11. Arshdeep What's yours? #INDvSL — Wasim Jaffer (@WasimJaffer14) January 2, 2023 Lights 💡 Camera 📸 Action ⏳ Scenes from #TeamIndia's headshots session ahead of the T20I series 👌 👌#INDvSL | @mastercardindia pic.twitter.com/awWGh4eVZh — BCCI (@BCCI) January 3, 2023 -
Ind VS Ban: కోహ్లిని ఓపెనర్గా ఎందుకు పంపారో! అతడికి బదులు సుందర్ వెళ్తే..
India tour of Bangladesh, 2022 - 2nd ODI: బంగ్లాదేశ్తో రెండో వన్డేలో విరాట్ కోహ్లిని ఓపెనర్గా పంపడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విస్మయం వ్యక్తం చేశాడు. శిఖర్ ధావన్కు జోడీగా కేఎల్ రాహుల్ లేదంటే వాషింగ్టన్ సుందర్ను ఆడించాల్సిందని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్లో భాగంగా బుధవారం నాటి రెండో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. టాస్ ఓడి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా హిట్మ్యాన్ స్థానంలో విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేశాడు. ధావన్కు జోడీగా బరిలోకి దిగిన ఈ మాజీ సారథి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(82) అద్భుత ఇన్నింగ్స్కు తోడు అక్షర్ పటేల్(56) అర్ధ శతకంతో రాణించినా.. గాయం నొప్పిని పంటిబిగువన భరిస్తూ తొమ్మిదో స్థానంలో వచ్చి రోహిత్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలై సిరీస్ను 0-2తో చేజార్చుకుంది. ఆశ్చర్యపోయా.. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి బదులు వాషింగ్టన్ సుందర్ను ఓపెనర్గా పంపాల్సిందని పేర్కొన్నాడు. ‘‘అంతర్జాతీయ టీ20 క్రికెట్లో.. లీగ్ మ్యాచ్లలో విరాట్ కోహ్లి అప్పుడప్పుడూ ఓపెనర్గా వచ్చినా.. ఈసారి బంగ్లాతో మ్యాచ్లో మాత్రం అతడు ఓపెనింగ్ స్థానంలో రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎప్పటిలాగే రాహుల్ వస్తాడనుకున్నా. కోహ్లి ఎందుకు? సుందర్ను పంపినా ఎందుకంటే తను రెగ్యులర్ ఓపెనర్. ఒకవేళ ఈసారి ఐదో స్థానంలో రావాలనుకుంటే సుందర్ను ధావన్కు జోడీ చేయాల్సింది. తద్వారా తనకు అనుకూలమైన మూడో స్థానంలో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్ చేసే వీలుండేది. కానీ కోహ్లిని ప్రమోట్ చేయడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గందరగోళం ఏర్పడింది. వాషింగ్టన్ సుందర్ను ఓపెనర్గా పంపితే మెరుగైన ఫలితం ఉండేది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ నాలుగో స్థానంలో వచ్చి 11 పరుగులు చేశాడు. అయితే, బౌలింగ్లో మాత్రం 3 వికెట్ల(37/3)తో మెరిశాడు. చదవండి: Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్.. అయినా రోహిత్ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్మ్యాన్ మాత్రం.. Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... Ind A Vs Ban A: సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు -
జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే, మొదట వచ్చేది సంజూ పేరే..!
భారత తుది జట్టు కూర్పులో ఇటీవలి కాలంలో యువ ఆటగాడు సంజూ శాంసన్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని దేశ విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు. అసామనమైన ప్రతిభ, టెక్నిక్, ధాటిగా ఆడగల సామర్థ్యం పెట్టుకుని కూడా శాంసన్.. టీమిండియా ఆడిన చాలా మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమవుతున్నాడు. అతని ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో కేవలం 27 మ్యాచ్లు (11 వన్డేలు, 16 టీ20లు) మాత్రమే అడాడంటే, బీసీసీఐ అతనిపై ఏ రేంజ్లో చిన్న చూపు చూస్తుందోనన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అడపాదడపా అవకాశాలు వస్తే, అందులో రాణించినా ఆ మరుసటి మ్యాచ్లోనే రకరకాల కారణాలు చెప్పి సంజూని తుది జట్టు నుంచి తప్పించడం మేనేజ్మెంట్కు పరిపాటిగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ ఇందుకు తాజా ఉదాహరణ. సంజూకు అన్యాయం జరుగుతుందన్న విషయం.. బీసీసీఐ సహా యావత్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ విషయంపై ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు. ఈ విషయంపై జర్నలిస్ట్లు భారత టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ప్రశ్నిస్తే.. నా జట్టు నా ఇష్టమన్నది అతని నుంచి వచ్చిన సమాధానం. ఇదే విషయంపై వన్డే సారధి ధవన్ను ప్రశ్నించగా.. జట్టు సమతూకం, ఆరో బౌలర్ అవసరం అని పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. ఒకవేళ నిజంగా ఆరో బౌలర్ అవసరం అయితే, పేలవ ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ను తప్పించాలి కాని, శాంసన్ను తప్పించడమేంటని అని అభిమానులు అడిగితే స్పందించేవాడే కరువయ్యాడు. తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ప్రస్తావించాడు. భారత తుది జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే.. మొదటగా వచ్చే పేరు శాంసన్దేనని అన్నాడు. ఇది చాలా బాధాకరం. తనను జట్టు నుంచి ఎందుకు తప్పిస్తున్నారో కూడా తెలుసుకోలేని దుస్థితిలో శాంసన్ ఉన్నాడంటూ సానుభూతిని వ్యక్తం చేశాడు. శాంసన్ అద్భుతమైన ప్లేయర్ అని మేనేజ్మెంట్ కూడా తెలుసు, అయినా సరైన అవకాశాలు ఇవ్వకుండా అతని కెరీర్ను నాశనం చేస్తుందంటూ జాఫర్ ధ్వజమెత్తాడు. శాంసన్పై ఇంత చిన్నచూపు చూసే యాజమాన్యం పంత్ను మాత్రం ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్ధం కావట్లేదని అన్నాడు. రేపు (నవంబర్ 30) జరుగబోయే మూడో వన్డేలోనైనా మేనేజ్మెంట్ శాంసన్కు అవకాశం కల్పిస్తుందో లేదో వేచి చూడాలని తెలిపాడు. -
Ind Vs NZ: ఉమ్రాన్ బౌలింగ్లో వైవిధ్యం లేదు.. కాబట్టి: భారత మాజీ క్రికెటర్
New Zealand vs India, 1st ODI- Umran Malik: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ టీ20 ఫార్మాట్లో కంటే వన్డేల్లోనే ఎక్కువ ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా బంతులు విసరడంలో దిట్ట అయిన 23 ఏళ్ల ఉమ్రాన్ ఐర్లాండ్తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్తో సిరీస్ నేపథ్యంలో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కివీస్తో అరంగేట్ర మ్యాచ్లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేలకే సూట్ అవుతాడు! ఆరంభంలో బాగానే బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఉమ్రాన్ మాలిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఎంత ఎక్కువ సేపు సాగితే అంత ఎక్కువగా మన నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీ20ల కంటే కూడా వన్డేల్లో ఇలా బౌలింగ్ చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఆట గురించి మరింత ఎక్కువగా అవగాహన పెంచుకునే ఆస్కారం ఉంటుంది. నిజానికి ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్ కంటే కూడా వన్డేలకే ఎక్కువగా సూట్ అవుతాడు. ఐపీఎల్లో అతడి బౌలింగ్ను గమనించాం. నిజానికి అక్కడ(టీ20) తను వైవిధ్యం చూపలేకపోయాడు. సరైన లెంత్తో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే, వన్డే ఫార్మాట్లో తను ప్రయోగాలు చేసేందుకు, వైవిధ్యం ప్రదర్శించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. బౌలర్ల తప్పేం లేదు.. అర్ష్ భేష్ ఇక అర్ష్దీప్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆట తీరును మార్చుకోవండంలో అతడు దిట్ట. రోజురోజుకు నైపుణ్యాలు మెరుగుపరచుకుని మరింత రాటుదేలుతున్నాడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్తో మొదటి వన్డేలో అర్ష్ 8.1 ఓవర్లలో 68 పరుగులు ఇవ్వడం గమనార్హం. కాగా కివీస్తో మొదటి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంపై స్పందిస్తూ.. ‘‘నిజానికి ఆ పిచ్ రాను రాను బ్యాటర్లకు మరింతగా అనుకూలించింది. ముఖ్యంగా కివీస్ ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో భారత బౌలర్లకు మరింత కష్టతరంగా మారింది’’ అంటూ టీమిండియా బౌలర్లను వెనకేసుకొచ్చాడు. చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు FIFA WC 2022: అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా -
సంజూకు దక్కని చోటు.. జాఫర్ను దుమ్మెత్తిపోసిన అభిమానులు
టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం సంజూ శాంసన్ను ఎంపిక చేయకపోవడమే. అదేంటి సంజూను ఎంపిక చేయకపోతే జాఫర్ను ఎందుకు తిడుతున్నారన్న డౌట్ వస్తుందా.. అయితే ఈ వార్త చదివేయండి. ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టి20 సిరీస్ను ముగించుకున్న టీమిండియా రేపటి నుంచి(నవంబర్ 25) వన్డే సిరీస్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నాడు. అయితే మ్యాచ్కు తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై కొంత ఆసక్తి నెలకొంది. టి20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా టాలెంటెడ్ ప్లేయర్ సంజూ శాంసన్ను పూర్తిగా పక్కనబెట్టాడు. ఆడిన మూడు టి20ల్లో ఒక్కదానికి కూడా ఎంపిక చేయలేదు. దీంతో జట్టు మేనేజ్మెంట్ సహా పాండ్యాపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం పక్కనబెడితే తాజాగా జాఫర్.. నవంబర్ 25 న్యూజిలాండ్తో ఆడనున్న తొలి వన్డేకు 11 మందితో కూడిన తుది జట్టును ప్రకటించాడు. ఇందులో సంజూ శాంసన్కు చోటు ఇవ్వలేదు. ఇదే జాఫర్పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమైంది. తొలి వన్డేకు జాఫర్ ప్రకటించిన జట్టులో శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్ను ఓపెనర్లుగా ఏంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ను మూడో స్థానం, సూర్యకుమార్ యాదవ్కు నాలుగో స్థానం కేటాయించాడు. ఇక ఆల్రౌండర్ల కోటాలో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లకు అవకాశమిచ్చాడు. ఇక వికెట్ కీపర్గా జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ను ఎన్నుకున్నాడు. పేస్ బౌలర్లుగా దీపర్ చహర్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్లకు చోటు ఇచ్చాడు. తన ప్లేయింగ్ ఎలెవెన్ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ''ఈడెన్ పార్క్ బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి.. ఇక్కడ మణికట్టు స్పిన్నర్లు అవసరం ఉండదు.. అందుకే చహల్ను ఎంపిక చేయలేదు. సుందర్, హుడాలు తమ బౌలింగ్తో న్యూజిలాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అలాగే తొమ్మిదో స్థానంలో వచ్చే దీపక్ చహర్ బ్యాటింగ్ చేయగలడు'' అంటూ పేర్కొన్నాడు. జాఫర్ ప్లేయింగ్ ఎలెవెన్పై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ''సంజూ శాంసన్ను ఎందుకు పక్కనబెట్టారు''.. ''మొదటిసారి మీపై మాకు కోపం వస్తుంది.. తుది జట్టులో సంజూకు ఎందుకు చోటివ్వలేదు''.. ''అందరికి సంజూతోనే సమస్య.. అతని బ్యాటింగ్ సగటు.. స్ట్రైక్రేట్ చూసి మాట్లాడండి''.. ''సంజూకు ఎంతకాలం ఈ అన్యాయం'' అంటూ కామెంట్ చేశారు. జాఫర్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టు: ధావన్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ My XI for 1st ODI: Dhawan (C) Gill Iyer Pant (VC/WK) SKY Hooda Washi Shardul Chahar Arsh Umran No wrist spinners cos Eden Park has small boundaries. Backing Sundar & Hooda vs 4 NZ lefties. Bat deep with Chahar @ 9. ODIs at Eden park often decided by lower order camoes. #NZvIND — Wasim Jaffer (@WasimJaffer14) November 24, 2022 First time I am not happy about u .. How come u excluded Sanju in the 11 ??? — Jenis Jebaraj (@jenis_jebaraj) November 24, 2022 Why everyone has some problem with Samson they guy literally is battling with 50 avg and 110 strike rate — Raazi (@Rg86037221) November 24, 2022 చదవండి: టీ20 జట్టు కోచ్గా ద్రవిడ్ కంటే అతనే బెటర్..! FIFA WC: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక -
సూర్యకుమార్ యాదవ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన వసీం జాఫర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు తీవ్రంగా మనసు నొచ్చుకున్నారు. కొందరు బహిరంగంగా తమ బాధను వెల్లగక్కితే.. మరికొందరు పర్వాలేదులే అంటూ టీమిండియాను వెనకేసుకొచ్చారు. ఓటమి బాధను దిగమింగుకోలేక బాహాటంగా బాధను వ్యక్త పరిచిన వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఉన్నాడు. దాదాపుగా ప్రతి సందర్భంలో టీమిండియాను వెనకేసుకొచ్చే జాఫర్.. వరల్డ్కప్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాత్రం జట్టులో లోపాలను గట్టిగానే లేవనెత్తాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాలను ఘాటుగా విమర్శించిన జాఫర్.. ఆతర్వాత సెమీస్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేనందుకు భారత బౌలర్లను ఎండగట్టాడు. తాజాగా అతను టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను కూడా టార్గెట్ చేశాడు. Wasim Jaffer states Suryakumar Yadav couldn't live up to the expectations in big games via @BatBricks7 presents 'Run Ki Runneeti show.'#CricTracker #BatBricks7 #SuryakumarYadav #2020WorldCup pic.twitter.com/Q2C4GzCgaw — CricTracker (@Cricketracker) November 13, 2022 ప్రపంచకప్లో సూర్యకుమార్ 3 అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించినప్పటికీ, కీలక మ్యాచ్ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడంటూ స్కైను వేలెత్తి చూపాడు. సెమీస్ మ్యాచ్కు ముందు వరకు టీమిండియాపై పేలిన పాక్ మాజీలకు, ఇంగ్లండ్ మాజీలకు స్ట్రాంగ్ కౌంటర్లిచ్చిన జాఫర్ ఒక్కసారిగా ఇలా భారత ఆటగాళ్లను టార్గెట్ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జాఫర్కు ఏమైనా చిప్ దొబ్బందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ను టార్గెట్ చేసినప్పుడైతే.. అతని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొందరైతే.. జాఫర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు. జాఫర్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోహిత్ ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి, వచ్చే టీ20 వరల్డ్కప్లో అతను ఆడతాడనుకోవడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడంటున్నారు. టీమిండియా బౌలింగ్ కంటే పాక్ బౌలింగ్ బలంగా ఉందని జాఫర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు అర్ధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే భారత్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జాఫరే కాదు ఎవరిని అడిగినా చెబుతారు. ఇక, సూర్యకుమార్ విషయానికొస్తే.. మెగా టోర్నీలో 185కు పైగా స్ట్రయిక్ రేట్ కలిగిన స్కై.. పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో, డూ ఆర్ డై సెమీస్ మ్యాచ్లో, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేదన్నది బహిరంగ రహస్యమేనని జాఫర్ కామెంట్స్తో ఏకీభవిస్తున్నారు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు' -
'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అదే విధంగా టీ20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టుకు రోహిత్ ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది ప్రపంచకప్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం116 పరుగులు మాత్రమే చేశాడు. "టీ20 ప్రపంచకప్-2024కు ముందు చాలా మంది భారత సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రాబోయే టీ20 ప్రపంచకప్లో ఖచ్చితంగా ఆడడు. అతడు త్వరలో అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది" అని క్రిక్ ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: Pak Vs Eng: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం -
కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్
బంగ్లాదేశ్తో అఖరి హోరాహోరీగా జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లా బ్యాటర్ నూరల్ హసన్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వివాదాస్పద ఘటనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. జాఫర్ క్రిక్ ట్రాకర్తో మాట్లడూతూ.. "ఈ మ్యాచ్లో కోహ్లి చేసిన పనిని అంపైర్లు గుర్తించపోయినప్పటికీ.. గ్రౌండ్లో చాలా కెమెరాలు ఉన్నాయి. కానీ ఫీల్డ్లో ఏ ఆటగాడైనా అలా మొదటి సారి చేస్తే.. అంపైర్లు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తారు. రెండో సారి అదే తప్పు పునారావృతం అయితే అప్పుడు అంపైర్లు పెనాల్టీ విధిస్తారు. బహుశా భారత కెప్టెన్, కోహ్లికి కూడా అంపైర్లు ఈ మ్యాచ్లో వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చు. అదే విధంగా కోహ్లి చేసిన యాక్షన్ వాళ్ల బ్యాటర్లకు కూడా ఇటువంటి ఇబ్బంది కలగలేదు. అందుకే బంగ్లా బ్యాటర్లు కూడా ఎటువంటి అప్పీలు చేయలేదు. ఈ విషయంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు." అనిఅతడు పేర్కొన్నాడు. చదవండి: Kohli Fake Fielding: డిస్టర్బ్ అయినట్లు కనిపించలేదు.. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఇవ్వలేదు Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ -
WC 2022: టాప్ రన్ స్కోరర్, అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్.. ఎవరంటే!
ICC Mens T20 World Cup 2022: ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్లు.. మరోవైపు వర్షం కారణంగా డేంజర్ జోన్లో పడుతున్న జట్లు.. సూపర్-12లో ఇప్పటికే కొన్ని మ్యాచ్లు వాన వల్ల రద్దు కాగా.. వరణుడు ఎవరిని కరుణిస్తాడో.. ఎవరిని ముంచుతాడో తెలియని సందిగ్ద పరిస్థితి.. వెరసి టీ20 వరల్డ్కప్-2022 ఆసక్తికరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే వ్యక్తిగత ప్రదర్శనతో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్.. బౌలర్లు అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా ఫ్యాన్స్ను ఖుషీ చేస్తున్నారు. సూపర్-12 ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్లో కోహ్లి, పాండ్యా చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక నెదర్లాండ్స్తో మ్యాచ్లో కోహ్లి- సూర్య జోడీ.. సరేసరి. ఈ బ్యాటర్లు ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగగా.. పేసర్లు భువనేశ్వర్ కుమార్- అర్ష్దీప్ రాణించారు. ముఖ్యంగా భువీ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్ పరుగులు సమర్పించుకున్నప్పటికీ 2 వికెట్లు తీయగలిగాడు. వాళ్లిద్దరే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వరల్డ్కప్-2022 టోర్నీలో టాప్ రన్ స్కోరర్, అత్యధిక వికెట్లు తీసే ఆటగాళ్లను అంచనా వేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వసీం జాఫర్ను ఓ నెటిజన్ ఈ విషయం గురించి అడుగగా.. ‘‘విరాట్ కోహ్లి, అర్ష్దీప్ సింగ్’’ అంటూ వీళ్లిద్దరికీ దిష్టి తగలకూడదన్నట్లుగా ఓ ఎమోజీని జత చేశాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కోహ్లి 144 పరుగులు(82 నాటౌట్, 62 నాటౌట్) చేశాడు. ఇక అర్ష్దీప్ పాక్తో మ్యాచ్లో మూడు, నెదర్లాండ్స్తో మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు. చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? Ind Vs Ned: నాటి వరల్డ్కప్లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. -
మైకెల్ వాన్ను మళ్లీ ఆడేసుకున్న వసీం జాఫర్
టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12లో గ్రూఫ్-1లో ఇంగ్లండ్పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డక్వర్త్ లూయిస్ పద్దతి ఇంగ్లండ్ కొంపముంచింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి చేయాల్సినదానికంటే ఐదు పరుగులు తక్కువగా ఉండడంతో ఐర్లాండ్ను విజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో ఎప్పటినుంచో కోల్డ్వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో తరచుగా ఫన్నీవేలో కామెంట్స్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ విజయం సాధించాకా.. జాఫర్ వాన్ను ఉద్దేశించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్ల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఒకరు ఐర్లాండ్.. ఇంకొకరు ఇంగ్లండ్. ఇంతలో వీరి మధ్యకు ట్రిమ్మర్ తీసుకొని ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు డక్వర్త్ లూయిస్(డీఎల్ఎస్). మ్యాచ్కు వర్షం ఎలా అయితే అంతరాయం కలిగించిందో.. అచ్చం అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు సీరియస్గా ఫైట్ చేసుకుంటున్న సందర్భంలో సదరు డీఎల్ ఇంగ్లండ్కు సపోర్ట్ చేద్దామనుకుంటున్నాడు. కానీ చివర్లో ఫలితం తారుమారు కావడంతో ఇంగ్లండ్ వ్యక్తికే జట్టు తీసేస్తాడు. ఇక చివర్లో మ్యాచ్ సమ్మరీ ఇదే అంటూ క్యాప్షన్ జత చేసి మైకెల్ వాన్ ట్యాగ్ను జత చేశాడు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. మార్క్ వుడ్ (3/34), లివింగ్స్టోన్ (3/17), సామ్ కర్రన్ (2/31), స్టోక్స్ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్స్టోన్ (1 నాటౌట్) ఇంగ్లండ్కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ను విజేతగా ప్రకటించారు. చదవండి: 'కోహ్లి మమ్మల్ని కరుణిస్తాడనుకుంటున్నా' -
Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ!
India vs South Africa, 3rd ODI: ఇప్పటికే టీ20 సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్తో పోరాడుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో మంగళవారం ధావన్ సేనతో పోటీ పడుతోంది. కాగా ఈ మ్యాచ్లో ప్రొటిస్ జట్టుకు డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా తమ సారథిని మార్చడం ఇది మూడోసారి. ముచ్చటగా మూడో కెప్టెన్ మొదటి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా సారథ్యం వహించగా.. రెండో వన్డేలో కేశవ్ మహరాజ్ కెప్టెన్సీ చేశాడు. బవుమా అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం కాగా.. కేశవ్ మహరాజ్ సైతం విశ్రాంతి కోరుకున్నట్లు సమాచారం. దీంతో మిల్లర్ కెప్టెన్గా వచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో సౌతాఫ్రికా పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఒక్కో మ్యాచ్కు ఒక్కో కెప్టెన్ రావడం ఇదే మొదటిసారి. ఇక సౌతాఫ్రికా ఇలా కెప్టెన్లను మార్చడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘టాస్ సమయంలో.. ఒక్కో గేమ్లో సౌతాఫ్రికాకు ఒక్కో కెప్టెన్ వస్తున్నపుడు శిఖర్ ధావన్ పరిస్థితి ఇది’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. Shikhar Dhawan at the toss with a different SA captain every game 😄 #INDvSA pic.twitter.com/28iE883xSW — Wasim Jaffer (@WasimJaffer14) October 11, 2022 కుప్పకూలిన టాపార్డర్ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన మిల్లర్ బృందానికి ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ప్రొటిస్ టాపార్డర్ కుప్పకూలింది. క్లాసెన్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డరర్ పతనాన్ని శాసించాడు. దీంతో 27.1 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసి ప్రొటిస్ జట్టు ఆలౌట్ అయింది. చదవండి: Central Contract for 2022- 23: జాసన్ రాయ్కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు Women's Asia Cup 2022: డిఫెండింగ్ చాంపియన్ అవుట్! భారత్, పాక్, శ్రీలంకతో పాటు థాయ్లాండ్.. -
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను సైకిల్ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియోను జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. Italian cyclist Michael Guerra uses his knowledge of physics and aerodynamics to adopt a “plank” position and overtake his competitors. pic.twitter.com/EsRt16l2PT — Ian Fraser (@Ian_Fraser) September 27, 2022 Deepti Sharma nailed id today on field 😄 what she did it was heart breaking feeling for England . Superb #DeeptiSharma . Gore ko unki line se bahar jaane ki saja 😄🤣#ENGvsIND #womenscricket #JhulanGoswami #ODI pic.twitter.com/NKnoHhfRQD — Vishoka M🇮🇳 (@Vishokha) September 24, 2022 చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్ -
T20 WC 2022: మెగా ఈవెంట్లో పంత్ను ఆడించకపోవడమే మంచిది! ఎందుకంటే!
T20 World Cup 2022- Rishabh Pant: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ నేపథ్యంలో భారత జట్టులో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానం గురించి టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ను ఈ మెగా ఈవెంట్లో ఆడించకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అతడికి బదులు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ను జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్లు ఆడనుంది. దీంతో ఐసీసీ ఈవెంట్కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు దొరుకుతుంది. పంత్ ఆట అంత గొప్పగా ఏమీ లేదు! ఇక మంగళవారం మొహాలీ వేదికగా ఆసీస్తో తొలి టీ20 ఆరంభం నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో చర్చలో వసీం జాఫర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా.. ప్రపంచకప్లో భారత తుది జట్టు కూర్పుపై అభిప్రాయాలు పంచుకున్నాడు. వసీం జాఫర్ ‘‘రిషభ్ పంత్ను ఆడించాలా వద్దా అన్న విషయంపై యాజమాన్యం స్పష్టతకు రావాలి. నిజానికి టెస్టు, వన్డే మ్యాచ్లలో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత పంత సొంతం. కానీ అంతర్జాతీయ టీ20లలో పంత్ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ పంత్ కంటే దినేశ్ కార్తిక్ మెరుగ్గా రాణించాడు. నా అభిప్రాయం ప్రకారం.. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదంటే ఐదో స్థానానికి రిషభ్ పంత్ సూట్కాడు. ఓపెనర్గా పంపితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అందుకే అతడిని ఆడించకపోవడమే మంచిది! అయితే, పంత్కు ఈ టోర్నీలో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం జరగని పని. కాబట్టి పంత్ను ఈ వరల్డ్కప్లో ఆడించకపోవడమే ఉత్తమం. అతడి బదులు దినేశ్ కార్తిక్ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు. అక్షర్ విషయంలో ఎందుకో ఇలా? అదే విధంగా.. ‘‘మరో విషయం ఏమిటంటే.. అక్షర్ పటేల్ సైతం ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. కానీ ఎందుకో యాజమాన్యం అతడికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా మెగా ఈవెంట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీగా రానుండగా.. ప్రత్యామ్నాయ ఓపెనర్గా విరాట్ కోహ్లి ఉంటాడని.. భారత సారథి రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం CSA 2022 Auction- Kavya Maran: ఆ వేలంలో హైలెట్గా కావ్య.. ఎంఐతో పోటీపడి! యువ హిట్టర్ కోసం భారీ ధర! -
భారత్-పాక్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న బుడ్డోళ్లు
భారత్, పాక్ మ్యాచ్లో ఉండే హైవోల్టేజ్ ఎలా ఉంటుందో రెండు దేశాల అభిమానుల్లో ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. నరనరానా దేశభక్తి పొంగే మ్యాచ్ కావడంతో ఉత్కంఠతో పాటు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. పెద్దోళ్ల నుంచి బుడ్డోళ్ల వరకు ఇరు దేశాల అభిమానులు గెలుపు మాదంటే మాది అని కత్తులు దూసుకుంటారు. తాజాగా ఆసియాకప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ట్విటర్లో షేర్ చేసిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఆ వీడియోలో ఇద్దరు బుడ్డోళ్లు ఉంటారు. ఒకడు పాకిస్తాన్కు చెందినవాడు.. మరొక బుడ్డోడు టీమిండియాకు అభిమాని. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా-నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. వీరికి మధ్యలో ఉన్న ఒక వ్యక్తి వారిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ బుడ్డోళ్లు ఇద్దరు సదరు వ్యక్తిని కనీసం లెక్క కూడా చేయరు.. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుందని జాఫర్ భయ్యా చిన్న ఉదాహరణతో ఇలా వివరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆసియాకప్లో ఇప్పటివరకు ఇరుజట్లు 14 సార్లు తలపడితే 8సార్లు టీమిండియా, ఐదు సార్లు పాకిస్తాన్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక పాక్తో మ్యాచ్లో అందరి కళ్లు టీమిండియా మెషిన్ రన్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుండడం.. అతనికిది వందో టి20 కావడంతో కోహ్లిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాగా టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు. India and Pakistan fans on social media today 😄 #INDvsPAK #AsiaCup pic.twitter.com/8O6P24MrCT — Wasim Jaffer (@WasimJaffer14) August 28, 2022 చదవండి: Asia Cup IND Vs PAK: పాక్తో మ్యాచ్.. జోరుగా బెట్టింగ్లు, టీమిండియా గెలవాలని పూజలు Asia Cup 2022 Ind Vs Pak: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? -
పాకిస్తాన్తో తొలి మ్యాచ్.. దీపక్ హుడాకు నో ఛాన్స్! అశ్విన్కు కూడా!
Wasim Jaffer Picks India XI for Pakistan clash: ఆసియాకప్-2022లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఆదివారం తలపడనున్న సంగతి తెలిసిందే. దాయాదుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎంచుకున్నాడు. తన ప్రకటించిన జట్టులో ఓపెనర్లగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ను జాఫర్ ఎంపిక చేశాడు. ఆవే విధంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడో స్థానంలో అవకాశమిచ్చాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాకు అతడు చోటిచ్చాడు. ఇక ఆరో స్థానం కోసం దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ మద్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు జాఫర్ పేర్కొన్నాడు. ఒక వేళ పంత్ తుది జట్టులో ఉన్నట్లైతే ఖచ్చితంగా ఐదో స్ధానంలో బ్యాటింగ్ వస్తాడని జాఫర్ తెలిపాడు. ఇక తన ఎంచుకున్న జట్టులో ఫుల్టైమ్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజాకు స్ధానం కల్పించాడు. ఇక బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయి, చహల్, అర్ష్దీప్ సింగ్కు జాఫర్ చోటు ఇచ్చాడు. కాగా ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న దీపక్ హుడాను జాఫర్ ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరోవైపు వెటరన్ స్పిన్నర్ అశ్విన్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. పాక్తో మ్యాచ్కు జాఫర్ ఎంచుకున్న ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య, రిషభ్ పంత్/ దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్కుమార్, అర్ష్దీప్ సింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });చదవండి: Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్ ఆల్రౌండర్ -
CWG 2022- PV Sindhu: చాంపియన్లకే చాంపియన్.. ఈ ‘క్వీన్’ ముందు తలవంచాల్సిందే!
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీల్లో వరుస విజయాలు నమోదు చేస్తూ భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న ఈ తెలుగు తేజం గెలుపును యావత్ భారతావని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సింధు గెలుపును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చాంపియన్లకే చాంపియన్ ‘‘పీవీ సింధు చాంపియన్లకే చాంపియన్! ఎప్పటికప్పుడు తన ప్రతిభా పాటవాలను చాటుకుంటూనే ఉంది. ఆట పట్ల తన అంకితభావం, నిబద్ధత స్ఫూర్తిదాయకం. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన సింధుకు శుభాభినందనలు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ప్రధాని మోదీ సింధును విష్ చేశారు. అదే విధంగా కేంద్ర క్రీడా శాఖా మాజీ మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరన్ రిజిజు సైతం పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. సింధు విజయాన్ని కీర్తిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇక కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా సింధును సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పీవీ సింధును అభినందించారు. కాగా అపూర్వ విజయం నేపథ్యంలో పీవీ సింధు పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమ్రోగి పోతోంది. ఆమె రాణి.. తన ముందు తలవంచాల్సిందే! నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆమె ముందు మనం తలవంచాలా? అవును కచ్చితంగా.. ఎందుకంటే తను రాణి. గోల్డెన్ గర్ల్ సింధు.. నువ్వు భారతావనిని మరోసారి తలెత్తుకునేలా చేశావు’’ అంటూ విష్ చేశాడు. చదవండి: Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్మ్యాన్ ప్రోమో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The phenomenal @Pvsindhu1 is a champion of champions! She repeatedly shows what excellence is all about. Her dedication and commitment is awe-inspiring. Congratulations to her on winning the Gold medal at the CWG. Wishing her the best for her future endeavours. #Cheer4India pic.twitter.com/WVLeZNMnCG — Narendra Modi (@narendramodi) August 8, 2022 Pride of India, @Pvsindhu1 creates history by winning the Gold Medal in #CommonwealthGames2022 ! She won Bronze in Glasgow 2014, Silver in Gold Coast 2018 and now GOLD!! Congratulations Sindhu for making India proud once again! #Cheer4India 🇮🇳 #CWG2022 pic.twitter.com/El8YRUo5zT — Kiren Rijiju (@KirenRijiju) August 8, 2022 Should we bow? Yes, she's a Queen 🙌🏽 🏅 Congratulations to Golden girl @Pvsindhu1 you make India proud 🇮🇳 #CWG22india pic.twitter.com/mn1wgEkifH — Wasim Jaffer (@WasimJaffer14) August 8, 2022 The unstoppable #PVSindhu First Gold Medal for her in Commonwealth Games in Singles Event. She won the finals in style. The nation is applauding the untiring efforts of @Pvsindhu1. Heartiest congratulations to her. pic.twitter.com/52iQRUO4eT — Y. Satya Kumar (@satyakumar_y) August 8, 2022 -
'అంచనాలకు మించి.. అదే చేత్తో కోహినూర్ వజ్రాన్ని'
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు అంచనాలు మించి రాణిస్తున్నారు. ఇంతకముందు మనకు ఎన్నడూ రాని విభాగాల్లోనూ పతకాలు కొల్లగొడుతున్న ఆటగాళ్లు.. అచ్చొచ్చిన క్రీడల్లో స్వర్ణ పతకాలతో చెలరేగుతున్నారు. తొమ్మిది రోజులు ముగిసేసరికి భారత్ ఖాతాలో 40 పతకాలు ఉండగా.. అందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. కాగా ఇందులో 22 పతకాలు కేవలం రెండు క్రీడల్లోనే రావడం విశేషం. రెజ్లింగ్లో 12 పతకాలు రాగా.. వెయిట్లిఫ్టింగ్ విభాగంలో 10 పతకాలు వచ్చి చేరాయి. ఇంకో విశేషమేమిటంటే.. రెజ్లింగ్ విభాగంలో మనవాళ్లు 12 మంది పోటీ పడితే.. 12 మంది పతకాలు తేవడం విశేషం. అందులో భజరంగ్ పూనియా, రవి దహియా, వినేష్ పొగాట్, దీపక్ పూనియాలు స్వర్ణాలు గెలిచారు. ఇక పదోరోజు కూడా భారత్ ఖాతాలో దండిగానే పతకాలు వచ్చి చేరనున్నాయి. మరి సోమవారంతో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొడుతుందనేది వేచి చూడాలి. కాగా కామన్వెల్త్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పతకాల కోసం పోటీ పడడం ఆనందాన్ని కలిగిస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అంచనాలకు మంచి రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. అదే చేత్తో బ్రిటీష్ వాళ్లు పట్టుకెళ్లిన మన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకురండి'' అంటూ కామెంట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్తో పాటు వెస్టిండీస్ గడ్డపై రోహిత్ సేన టి20 సిరీస్ గెలవడంపై కూడా జాఫర్ ట్వీట్ చేశాడు.''విదేశీ గడ్డపై మరో సిరీస్ గెలిచినందుకు రోహిత్ సేనకు కంగ్రాట్స్. జట్టులో ఆటగాళ్లందరు ఒకరినొకరు సహకరించుకుంటూ బ్యాట్, బంతితో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వెల్డన్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా ఇవాళ విండీస్తో చివరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ను విజయంతో ముగించి సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. Indian athletes are doing so well at the Commonwealth Games that at this rate they might even bring the Kohinoor back 😄 #CWG2022 #IndiaAt75 — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 Congratulations @ImRo45 and Team India on another series win 👏🏽 Total team effort with both bat and ball with almost everyone contributing. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 DISTINGUISHED WRESTLER VINESH🥇 Watch moments from the medal ceremony. Our champ @Phogat_Vinesh Looked fantastic with 🥇 Proud of you Girl! #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @ddsportschannel @SonySportsNetwk @IndiaSports pic.twitter.com/8mocOYGxj9 — SAI Media (@Media_SAI) August 7, 2022 🇮🇳's Dhakad youth wrestler Naveen' s confidence is worth the applaud 👏 Watch moments from his medal🥇 ceremony 👇 Congratulations 👏 #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @IndiaSports @YASMinistry @CGI_Bghm pic.twitter.com/44XpKWcXYk — SAI Media (@Media_SAI) August 7, 2022 PLAYING FOR G🥇LD!!#Tokyo2020 Olympian and Gold🥇 Medalist at #B2022, @ravidahiya60 steals the show🤩 Watch his winning moment🏅 from yesterday's match👇#Cheer4India🇮🇳#India4CWG2022 🤟@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @IndiaSports @YASMinistry pic.twitter.com/oaZK41S6zr — SAI Media (@Media_SAI) August 7, 2022 చదవండి: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
మ్యాచ్ గెలవాలని.. ముందస్తు ప్లాన్ అయితే కాదుగా!
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్ ఏదో ఒక ఫన్నీ ట్వీట్తో అలరిస్తాడు. తాజాగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20పై జాఫర్ అదే తరహా ఫన్నీ ట్వీట్తో మెరిశాడు. కాగా మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల లగేజీ సకాలంలో చేరుకోలేకపోవడమే.'' ట్రినిడాడ్ నుంచి సెంట్కిట్స్కు ఆటగాళ్ల లగేజీలు ఇంకా చేరుకోలేదు. అందుకే మ్యాచ్ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించనున్నాం'' అంటూ విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనపై జాఫర్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ కెప్టెన్ నిలోలస్ పూరన్ను ఏదో విషయంలో ప్రశ్నిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..'' ముందస్తు ప్లాన్ అయితే కాదు కదా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ''మ్యాచ్ గెలవడానికి.. లగేజీ లేట్ కావడానికి మీరే పక్కా ప్లాన్ చేయలేదు కదా అని రోహిత్ పూరన్ ప్రశ్నించడం జాఫర్ చేసిన క్యాప్షన్కు అర్థం. జాఫర్ ట్వీట్ను నిజం చేస్తూ టీమిండియా కూడా ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. రెండో టి20లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ విజయంతో విండీస్ ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే జాఫర్ ఫన్నీ ట్వీట్ను సాకుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది. View this post on Instagram A post shared by Wasim Jaffer (@wasimjaffer14) చదవండి: SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్కు ఎంత కష్టం! Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్గా -
Ind Vs WI: అతడు వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ధావన్కు జోడీగా ఆడాలి!
India tour of West Indies, 2022: వెస్టిండీస్లో టీమిండియా పర్యటన నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్తో వన్డేల్లో అరంగేట్రం చేయాలని ఆకాంక్షించాడు. శిఖర్ ధావన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అర్హత రుతుకు ఉందని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు విండీస్కు చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ గతేడాది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్తో సిరీస్లో భాగంగా వన్డే జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రుతుకు ఇప్పటికైనా ఛాన్స్ ఇవ్వాలని వసీం జాఫర్ అన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘‘వెస్టిండీస్ సిరీస్లో రుతురాజ్కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం రావాలి. అతడు శిఖర్తో కలిసి ఓపెనింగ్ చేయాలి. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదురుతుంది. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో రుతు 5 ఇన్నింగ్స్లో 4 సెంచరీలు సాధించాడు. కాబట్టి తుదిజట్టులో చోటు దక్కించుకునే అర్హత అతడికి ఉంది’’ అని వసీం తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో రుతుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఇషాన్ కిషన్ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్ ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. 64 మ్యాచ్లలో వందకు పైగా స్ట్రైక్రేటుతో రుతు 3284 పరుగులు సాధించాడు. చదవండి: Rishabh Pant: పంత్ చూడటానికి బాగుంటాడు.. కాస్త బరువు తగ్గితే! కోట్లలో సంపాదించవచ్చు! India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! I think Ruturaj should make his ODI debut and open with Shikhar in the WI series. Ruturaj scored 4 tons in 5 inns in the Vijay Hazare Trophy, deserves a look in. Also left-right combo stays. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) July 21, 2022 -
ఇంగ్లండ్తో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్కు నో ఛాన్స్..!
ఇంగ్లండ్తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ఇప్పడు టీ20 సిరీస్కు సిద్దమైంది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా గురువారం జరగనుంది. ఇక రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగి భారత సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా తొలి టీ20కు కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు, ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్లో భాగమైన భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఐర్లాండ్తో తలపడిన భారత జట్టే తొలి టీ20లో బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టును ట్విటర్ వేదికగా జాఫర్ ప్రకటించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లను జాఫర్ ఎంపిక చేశాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో దీపక్ హుడా, నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్కు చోటిచ్చాడు. తన జట్టులో ఫినిషర్లుగా హార్ధిక్ పాండ్యా, కార్తీక్కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక పేస్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్,భువనేశ్వర్ కుమార్,ఆవేష్ ఖాన్లకు చోటు దక్కింది. స్పిన్నర్లుగా చాహల్, బిష్ణోయ్లను ఎంపిక చేశాడు. అతడు ఎంచుకున్న జట్టులో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు చోటు దక్కకపోవడం గమనార్హం. వసీం జాఫర్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ చదవండి: Sourav Ganguly Birthday: గంగూలీ బర్త్డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్! సచిన్తో ఫొటో.. వైరల్ -
'టెస్టుల్లో అతడికి సచిన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది'
టెస్టుల్లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు. మరో ఐదు ఆరేళ్ల పాటు ప్రస్తుత స్థాయిలో ఆడితే ఈ అరుదైన మైలురాయిని చేరుకోగలడని జాఫర్ తెలిపాడు. కాగా ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదు టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్,జానీ బెయిర్ స్టో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 31పరుగులు సాధించన రూట్.. రెండో ఇన్నింగ్స్లో 144 పరుగులతో చెలరేగాడు. ఇక ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో 737 పరుగులతో జో రూట్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే విధంగా స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా రూట్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్లో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. "రూట్కు ప్రస్తుతం కేవలం 31 ఏళ్లు మాత్రమే. కానీ ఇంగ్లండ్, ఆసీస్ క్రికెటర్లు త్వరగా తమ కెరీర్లను ముగిస్తూ ఉంటారు. అయితే అతడు మరో 5-6 ఏళ్లు క్రికెట్ ఆడితే సచిన్ రికార్డు బ్రేక్ చేయగలడు" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs ENG 1stT20: ఇంగ్లండ్తో తొలి టీ20.. భారత్ గెలవడం కష్టమే..! -
Ind Vs Eng: టీ20 సిరీస్.. పంత్ను ఓపెనర్గా పంపండి.. అప్పుడే!
India Vs England T20 Series: ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టును పరాజయంతో ముగించిన టీమిండియా గురువారం నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జూలై 7న ఇరు జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక ఇప్పటికే కోవిడ్ కారణంగా టెస్టు మ్యాచ్కు దూరమైన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ సిరీస్కు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్కు జోడీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను ఓపెనింగ్కు పంపాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ఓపెనర్గా పంత్ రాణించగలగడని అభిప్రాయపడ్డాడు. .@ImRo45 - out and about in the nets! 👏 👏 Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a — BCCI (@BCCI) July 4, 2022 ‘‘ఇంగ్లండ్తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా పెద్దలు.. రిషభ్ పంత్ను టీ20 మ్యాచ్లో ఓపెనర్గా పంపే విషయమై ఆలోచించాలి. ఓపెనర్గా అతడు సక్సెస్ అవుతాడని అనిపిస్తోంది’’ అని వసీం జాఫర్ ట్విటర్లో పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకై కూర్పు నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు సలహాలు ఇస్తున్న వేళ వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఇంత వరకు పంత్ ఎప్పుడూ ఓపెనర్గా బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే. సుమారు ఆరుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో అతడి సక్సెస్ రేటు ఎక్కువ. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్కు సారథిగా వ్యవహరించిన పంత్.. కెప్టెన్గా సఫలమైనా, బ్యాటర్గా విఫలమైన విషయం విదితమే. చదవండి: Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే! Ind Vs WI 2022: విండీస్తో సిరీస్.. శిఖర్ ధావన్కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్గా.. బీసీసీఐ ప్రకటన ICC Mens Test Rankings: దుమ్ములేపిన పంత్.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు.. ఇక బెయిర్స్టో.. Indian think tank should think about opening with Rishabh Pant in T20Is. I think that's the spot where he can blossom. #ENGvIND — Wasim Jaffer (@WasimJaffer14) July 6, 2022 -
Ind Vs Eng: కావాలని రెచ్చగొడితే ఇలాగే ఉంటది మరి.. నీకిది అవసరమా?
ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తులను రెచ్చగొడితే ఒక్కోసారి మనమే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అన్నాడు. స్లెడ్జింగ్ ఒక్కోసారి బ్యాక్ఫైర్ అవుతుందంటూ భారత క్రికెటర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో కోహ్లి, ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటివరకు ఆచితూచి ఆడిన బెయిర్ స్టో కోహ్లి తన నవ్వు, మాటలతో కవ్వించడంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 140 బంతుల్లోనే 106 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో శతకంతో రాణించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కోహ్లిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ‘‘నిజంగానే కోహ్లి స్లెడ్జింగ్ బెయిర్ స్టో దూకుడుకు కారణమైందా? అంటే అవుననే చెప్పొచ్చు. అంతవరకు జాగ్రత్తగా నెమ్మదిగా ఆడిన బెయిర్ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నిజానికి ఒకరిని కావాలని రెచ్చగొడితే ఒక్కోసారి మనకే బ్యాక్ఫైర్ అవుతుంది. ఏమో స్లెడ్జింగ్కు బదులిచ్చే క్రమంలో బెయిర్ స్టో మరింత దూకుడు ప్రదర్శించాడేమో?’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలింగ్ విభాగంపై జాఫర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇరు జట్ల బ్యాటర్లు మెరుగ్గానే రాణించారు. అయితే, భారత బౌలర్లు విజృంభించడం టీమిండియాకు కలిసొచ్చింది. సిరాజ్, బుమ్రా, షమీ అద్భుతంగా ఆడారు. ఇంగ్లండ్ను 284 పరుగులకే కట్టడి చేశారు’’ అని కితాబిచ్చాడు. కాగా బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 4, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్తో రాణించడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. చదవండి: Mohammed Siraj: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు! ఇక బుమ్రా.. It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
Ind Vs Eng: వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు!
India vs England 5th Test: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్కు ఓపెనర్గా అవకాశం వచ్చింది. అదే విధంగా చాలా కాలం తర్వాత తెలుగు క్రికెటర్ హనుమ విహారికి కూడా ఈ మ్యాచ్లో భాగంగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో గిల్ 17 పరుగులకు అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తరహాలో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన విహారి సైతం వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేశాడు. He is just so, so good 🥰 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/WlwQjxDxo6 — England Cricket (@englandcricket) July 3, 2022 ఇలా ఎడ్జ్బాస్టన్ టెస్టులో వీరిద్దరు విఫలం కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో పోటీకి వస్తున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని వీరిద్దరు ఉపయోగించుకోలేకపోయారని పెదవి విరిచాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘గిల్, విహారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చెప్పాలి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారు. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా తలుపులు తడుతున్నారు. 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం పోటీలో ఉన్నాడు. ఇలాంటపుడు వీరిద్దరు ఇలా నిరాశపరిచి జట్టులో పాతుకుపోయే అవకాశాన్ని కోల్పోయినట్లే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. జానీ బెయిర్ స్టో ఒక్కడిపైనే ఆధారపడితే కష్టమని.. జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా బ్యాట్ ఝులిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదో టెస్టులో భాగంగా టీమిండియా ఆదివారం(జూలై 3) మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కంటే 257 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 125/3 (45). చదవండి: ENG vs IND: కోహ్లి, బెయిర్ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్..! An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 -
మళ్లీ మొదలైన రగడ.. వాన్కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన వసీం జాఫర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ల మధ్య ట్విటర్ వార్ మళ్లీ మొదలైంది. ఇంగ్లండ్తో టీమిండియా సిరీస్ ప్రారంభానికి ముందు వీరిద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. తాజాగా జాఫర్ చేసిన ఓ ట్వీట్కు వాన్ కౌంటర్ ఇవ్వడంతో రగడ మొదలైంది. వాన్ కౌంటర్ ట్వీట్ను జాఫర్ తనదైన స్టైల్లో తిప్పికొట్టడంతో ట్విటర్ వార్ పతాక స్థాయికి చేరింది. జాఫర్-వాన్ల మధ్య జరుగుతున్న ఈ వార్ క్రికెట్ ఫాలోవర్స్కు కావాల్సిన మజాను అందిస్తుంది. జాఫర్-వాన్ల మధ్య వార్ ఎక్కడ మొదలైందంటే.. జాఫర్ జూన్ 21న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కూర్చొని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనిపై వాన్ స్పందిస్తూ.. నేను తొలి టెస్ట్ వికెట్ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా అంటూ జాఫర్ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన జాఫర్ తనదైన స్టైల్లో వాన్పై కౌంటర్ అటాక్ చేశాడు. Sun is shining, the weather is sweet @HomeOfCricket 😊 pic.twitter.com/ImwcAS5YYh — Wasim Jaffer (@WasimJaffer14) June 20, 2022 2007 ఇంగ్లండ్ టూర్లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఫొటోను పోస్ట్ చేస్తూ.. దీని 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను అంటూ వాన్కు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. జాఫర్ వాన్కు ఇచ్చిన ఈ స్ట్రోక్ టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. నిద్రపోయిన సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటదంటూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. Is it the 20th anniversary of my first Test wicket you are here for Wasim ? https://t.co/7Ul5Jw62ra — Michael Vaughan (@MichaelVaughan) June 20, 2022 Here for the 15th anniversary of this Michael 😄 #ENGvIND https://t.co/Qae4t8IRpf pic.twitter.com/gZC5ShGNwS — Wasim Jaffer (@WasimJaffer14) June 21, 2022 కాగా, ఇంగ్లండ్లో టీమిండియా చివరిసారి 2007లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ సిరీస్లో రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. ఆ సిరీస్లో టీమిండియా గెలిచిన నాటింగ్హమ్ టెస్ట్లో మైఖేల్ వాన్ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లండ్ను ఆదుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. ఆ మ్యాచ్లో జాఫర్ అర్ధ సెంచరీ సహా 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా ఆ అవకాశం వచ్చింది. గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్ల టెస్ట్ల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అప్పుడు రద్దైన ఐదో టెస్ట్ మ్యాచ్ను భారత్ జులై 1 నుంచి ఆడనుంది. ఈ మ్యాచ్ను టీమిండియా కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ విజయం సాధిస్తుంది. చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ స్పిన్నర్ -
అరుదైన రికార్డు.. సచిన్ సర్తో పాటు నా పేరు కూడా.. గర్వంగా ఉంది!
Ranji Trophy 2022- Mumbai: రంజీ ట్రోఫీ 2021-22 రెండో సెమీఫైనల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్. ఉత్తరప్రదేశ్తో జరిగిన ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 227 బంతుల్లో 100 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు.. రెండో ఇన్నింగ్స్లో 372 బంతుల్లో 181 పరుగులతో సత్తా చాటాడు. ఒకే మ్యాచ్లో ఇలా రెండు సెంచరీలు సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. చరిత్రకెక్కిన యశస్వి తద్వారా రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు యశస్వి జైశ్వాల్. ఒకే మ్యాచ్లో రెండు శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, వసీం జాఫర్ తదితరుల సరసన చేరాడు. సచిన్ సర్తో పాటు నా పేరు కూడా! ఈ విషయంపై స్పందించిన యశస్వి జైశ్వాల్.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఉన్న జాబితాలో తన పేరు కూడా చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్ సమయంలో రికార్డు గురించి తనకు అసలు అవగాహన లేదని, డ్రెసింగ్స్ రూమ్కి వెళ్లిన తర్వాత సహచర ఆటగాళ్లు చెప్పినపుడే ఈ విషయం తెలిసిందని పేర్కొన్నాడు. ఓపికగా వేచి చూశాను! ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో యశస్వి మాట్లాడుతూ.. ‘‘వికెట్ను బాగా అర్థం చేసుకున్నాను. కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించింది. పృథ్వీ అవుటైన తర్వాత ఆర్మాన్ జాఫర్తో చర్చించి ఎలా ఆడాలన్న అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా సరే.. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. నిజానికి సెంచరీ మార్కు చేరుకోవడానికి చాలా బంతులు తీసుకున్నానని తెలుసు. అయితే, క్రీజులో ఉండటమే అన్నింటి కంటే ముఖ్యమైనది అనిపించింది. అందుకే ఓపికగా ఎదురుచూశాను. నిజానికి ఈ మ్యాచ్లో నేను సాధించిన రికార్డు గురించి నాకు తెలియదు. డ్రెస్సింగ్ రూమ్కు రాగానే నా తోటి ఆటగాళ్లు దీని గురించి చెప్పారు. సచిన్ సర్, వసీం సర్, రోహిత్, అజింక్య వంటి దిగ్గజాల సరసన నా పేరు చూసుకోవడం నిజంగా నాకు గర్వకారణం’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 54వ బంతి వద్ద పరుగుల ఖాతా తెరిచిన యశస్వి.. ఆ తర్వాత అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 47వ సారి ముంబై ఈ క్రమంలో ముంబై మొదటి ఇన్నింగ్స్లో 393 పరుగులు చేయగా.. 4 వికెట్ల నష్టానికి 533 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఉత్తరప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 180కే ఆలౌట్ అయిన నేపథ్యంలో ముంబై ఫైనల్కు చేరుకుంది. ఇక ముంబై జట్టు రంజీ ట్రోఫీలో ఫైనల్ చేరడం ఇది 47వ సారి. ఇప్పటి వరకు 41 సార్లు విజేతగా నిలిచింది. జూన్ 22 నుంచి మధ్యప్రదేశ్తో ఈ సీజన్ ఫైనల్లో ముంబై తలపడనుంది. చదవండి: IRE vs IND: ఐర్లాండ్తో సిరీస్కు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్ -
'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
నెదర్లాండ్స్తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే. ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్తో జాఫర్ సెటైర్ వేశాడు. Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm — Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022 చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి పాక్ బౌలర్కు ఖరీదైన కారు గిఫ్ట్గా.. ఒక్కదానికే! -
'ప్రతీ మ్యాచ్లోనూ అతడు బౌలర్ల ట్రాప్లో పడుతున్నాడు'
టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ ఔట్ అవుతున్న తీరు కాస్త ఆందోళనకు గురి చేస్తుందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్లో పంత్ తీవ్రంగా నిరాశరుస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు సార్లు ఆఫ్-స్టంప్ వెలుపల వేసిన బంతులకే పంత్ తన వికెట్ను సమర్పించుకున్నాడు. 2022లో పంత్ 16 సార్లు ఔట్ కాగా.. అందులో 10 సార్లు వైడ్ ఆఫ్ స్టంప్ బంతులకే ఔట్ కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో కూడా పంత్ అదే రీతిలో పెవిలియన్కు చేరాడు. "అతడు వరుసగా అన్ని మ్యాచ్లో ఒకే విధంగా వికెట్ను కోల్పోతున్నాడు. బౌలర్లు అతడికి వైడ్ ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తున్నారు. అతడు ప్రతీ మ్యాచ్లోను బౌలర్ల ట్రాప్లో పడుతున్నాడు. అతడు రానున్న మ్యాచ్ల్లో అతడి బ్యాటింగ్ టెక్నిక్ను మార్చుకోవాలి" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో టి20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో 2-2తో సమంగా నిలిచింది. చదవండి: Rishabh Pant: రోజురోజుకు మరింత బలంగా.. పంత్కు పొంచి ఉన్న ప్రమాదం -
'ఏడాది వ్యవధిలో ఎంత మార్పు'.. కొత్త కెప్టెన్, కోచ్ అడుగుపెట్టిన వేళ
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ను సమస్యలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు విజయవంతమైన కెప్టెన్గా వెలిగిన జో రూట్.. గతేడాది మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో వంక పెట్టలేకున్నా.. కెప్టెన్సీలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. రూట్ కెప్టెన్సీలో గత 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. అది కూడా గతేడాది భారత్తో లీడ్స్లో జరిగిన టెస్టు మ్యాచ్. ఆ తర్వాత జరిగిన 12 టెస్టుల్లో ఆరింటిలో ఓడిపోయిన ఇంగ్లండ్ మరో ఆరింటిని డ్రా చేసుకుంది. ఇంగ్లండ్ వరుసగా ఓడిన టెస్టు సిరీస్ల్లో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్తో పాటు వెస్టిండీస్ సిరీస్లు ఉన్నాయి. దీంతో జట్టును మొత్తం ప్రక్షాళన చేయాల్సిందేనని అభిమానులు విమర్శలు కురిపించారు. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ రూట్ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త కెప్టెన్గా రావడం.. కొత్త కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్ అడుగుపెట్టడంతో ఇంగ్లండ్ దశ పూర్తిగా మారిపోయింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ వచ్చాకా ఇంగ్లండ్ టెస్టుల్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. అది ఏకపక్ష విజయాలు కావడం విశేషం. ఆరు నెలల క్రితం వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టు తాజాగా మాత్రం బలంగా తయారైంది. దానికి కొత్త కోచ్, కొత్త కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే అని పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ ఆటతీరుపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘సరిగ్గా ఏడాది క్రితం జూన్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో 75 ఓవర్లలో 273 పరుగుల టార్గెట్ని ఛేదించినలేక 70 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ని డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ 2022లో అదే న్యూజిలాండ్ 72 ఓవర్లలో 299 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే, దాన్ని 50 ఓవర్లలోనే ఛేదించేసింది... ఏడాదిలోనే మైండ్సెట్ ఎంతలా మారింది.. కొత్త కోచ్, కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే’ అంటూ తెలిపాడు. ఇక నాటింగ్హామ్లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్లతో సంచలన విజయం సాధించింది. 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి సెషన్లో ఇంగ్లండ్ విజయానికి 160 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. కానీ బెయిర్స్టో (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్స్లు), స్టోక్స్ (75 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసక బ్యాటింగ్తో ఇంగ్లండ్ విజయతీరాలకు చేరింది. June 2021: NZ set Eng 273 in 75 overs. Eng bat out a draw scoring 170/3 (70). June 2022: NZ set Eng 299 in 72 overs. Eng chase it down in 50 overs! What changed? Mindset. #ENGvNZ pic.twitter.com/zOMbJMB51I — Wasim Jaffer (@WasimJaffer14) June 14, 2022 We’ve just chased 299 in 50 overs in a Test match on day five 🤯 Scorecard & Videos: https://t.co/ffFnHnaIPX 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/EPG1oNUWuD — England Cricket (@englandcricket) June 14, 2022 చదవండి: 16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట.. టెస్టు క్రికెట్లో నయా రికార్డు 'సంజూ శాంసన్లో అదే పెద్ద మైనస్.. అందుకే'.. క్రికెట్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు -
'మ్యాచ్ టైట్ అయినప్పడు పంత్ ఒత్తిడికి గురవుతున్నాడు'
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడి సారథ్యంలోని టీమిండియా తొలి రెండు మ్యాచ్ల్లోను ఘోర పరాజాయం చవిచూసింది. ఇక మంగళవారం వైజాగ్ వేదికగా ప్రోటీస్తో జరగనున్న మూడో టీ20లో భారత్ చావోరేవో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ క్రమంలో పంత్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మ్యాచ్ క్లిష్టంగా మారినప్పుడు పంత్ కొంచెం ఒత్తిడికి గురవుతున్నాడు. "ఐపీఎల్లో కూడా ఇది మనం చూశాం. అతడు మరిన్ని మ్యాచ్లకు సారధిగా వ్యవహరిస్తే.. మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను. కాగా దాదాపు ఈ సిరీస్ భారత్ చేతుల నుంచి జారిపోయింది. ఎందుకంటే ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో వెనుకబడి ఉన్నాం. మూడు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్లో విజయం సాధించినా సిరీస్ వారి వశం అవుతోంది. ఇక రానున్న మ్యాచ్ల్లో టీమిండియా ఆద్భుతంగా ఆడాలి. . టాస్తో సంబంధం లేకుండా ఎప్పుడు బ్యాటింగ్ చేసినా భారీ స్కోర్ సాధించాలి" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత -
సర్ప్రైజ్ చేసిన హార్దిక్ పాండ్యా.. ఇది ఊహించలేదు అంటున్న ఫ్యాన్స్!
Hardik Pandya Favourite Cricketer: ‘‘సాధారణంగా ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రికెటర్లు ఉంటారు. నేను కూడా అంతే! జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లి, సచిన్ సర్ అంటే చాలా ఇష్టం. అయితే, ఎంతో మంది దిగ్గజాలు ఉన్నపుడు ఒకరిని ఎంచుకోవడం కష్టం. నాకైతే అత్యంత ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే మాత్రం వసీం జాఫర్ పేరు చెబుతాను’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన మనసులోని మాట బయటపెట్టాడు. తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పేరు చెప్పాడు. ఇక వసీం జాఫర్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేవాడన్న హార్దిక్.. మిగతా దిగ్గజాలతో పోలిస్తే ఆయనకు తన మనసులో అగ్రస్థానం ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నిజానికి ఆయన బ్యాటింగ్ను కాపీ కొట్టాలని ప్రయత్నించాను. కానీ, అతడి క్లాస్ను అందుకోలేకపోయాను’’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో అతడు స్థానం సంపాదించుకున్నాడు. ప్రొటిస్తో సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ను విజేతగా నిలిపిన కెప్టెన్ హార్దిక్పై ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వల్లే ఇక్కడిదాకా వచ్చానంటూ కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఈ క్రమంలో ఎస్జీ పాడ్కాస్ట్లో అతడి ఫేవరెట్ క్రికెటర్ ఎవరా అన్న ప్రశ్నకు వసీం జాఫర్ అని సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హార్దిక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ‘‘సచిన్, సెహ్వాగ్, ధోని.. కాదు వసీం జాఫర్.. సూపర్ భాయ్.. ఊహించలేదు.. నిజంగా మమ్మల్ని సర్ప్రైజ్ చేశావు. ’’ అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Who Is Wasim Jaffer: వసీం జాఫర్ ఎవరంటే? క్రికెట్ను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు వసీం జాఫర్. టీమిండియా మాజీ ఓపెనర్గా.. సమకాలీన క్రికెట్ సిరీస్ల మీద సోషల్ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసిరే వసీంకు ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య(901.2K) కూడా ఎక్కువే. మహారాష్ట్రకు చెందిన బ్యాటర్ వసీం జాఫర్ 2000- 2008 మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టు ప్రాతినిథ్యం వహించారు. మొత్తంగా 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశాడు. 2 వన్డేల్లో 10 పరుగులు సాధించారు. వసీం జాఫర్కు సచిన్, ద్రవిడ్, సెహ్వగ్, లక్ష్మణ్ వంటి మేటి బ్యాటర్లు సమకాలీనులు కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం ఆయనకు తిరుగులేదు. 260 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో ఏకంగా 19, 410 పరుగులు సాధించాడు. ఇందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉండటం విశేషం. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వసీం పేరు చరిత్రకెక్కింది. ఆటగాడిగానే కాకుండా కోచ్గానూ వసీం జాఫర్ సేవలు అందించాడు. 2020-2021 సీజన్లో ఉత్తరాఖండ్కు ఆయన కోచ్గా ఉన్నాడు. ఇక 2021 జూలైలో ఒడిశా జట్టు హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. చదవండి: Ind vs SA 3rd T20I- Visakhapatnam: హాట్కేకుల్లా అమ్ముడైన ఆన్లైన్ టికెట్లు.. ఆఫ్లైన్లో కొనాలంటే! -
అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మొదలైన తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలిరోజే 17 వికెట్లు కుప్పకూలాయి. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇరజట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 132 పరుగులకు చాప చుట్టేయగా.. ఆ తర్వాత ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. పిచ్ ఇలాగే ఉంటే మూడురోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశముంది. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు జరుగుతున్న లార్డ్స్ పిచ్ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ''లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో 17 వికెట్లు ఒకేరోజు కూలాయి.. బౌలర్ల స్కిల్ కనిపించింది. గతంలో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య అహ్మదాబాద్ టెస్టు(2021)లో మరి ఇదే స్థితి ఏర్పడింది. అప్పుడు పిచ్ను తప్పుబడుతూ కొందరు మొత్తుకున్నారు.. మరి ఇప్పుడేం మాట్లాడరా'' అంటూ చురకలంచటించాడు. అంతేకాదు లార్డ్స్ పిచ్ను ట్రోల్చేస్తూ.. సల్మాన్ నటించిన 'రెడీ' సినిమాలోని ''మైన్ కరూన్ తూ సాలా క్యారక్టెర్ దీలా హై'' అనే పాటను జతచేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2021లో టీమిండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ అహ్మదాబాద్ వేదికగా పింక్బాల్ టెస్టు(డే నైట్) ఆడింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలిరోజే 112 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ కూడా తొలి రోజే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 145 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా 22 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాధించింది. రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. టీమిండియా ముందు 49 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అలా పింక్బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు.. ఓవరాల్గా 11 వికెట్లు సాధించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ కూడా ఏడు వికెట్లు తీసి అక్షర్కు సహకరించాడు. అయితే ఈ టెస్టు ముగియగానే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ వరుస విమర్శలు సంధించాడు. ''నాసిరకం పిచ్ తయారు చేశారని.. ఇలాంటి పిచ్పై రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు'' అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. అయితే అప్పట్లో టీమిండియా అభిమానులు వాన్కు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. చదవండి: వారెవ్వా.. అరంగేట్రంలోనే అదుర్స్.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. When 17 wkts fall in a day at Lord's, talk is about skills of the bowlers. When 17 wkts fall in a day at Ahmedabad, talk is about conditions. #ENGvNZ pic.twitter.com/2sl4n26Cn3 — Wasim Jaffer (@WasimJaffer14) June 3, 2022 -
IPL: ఐపీఎల్ స్ట్రాంగెస్ట్ ఎలెవన్.. రోహిత్ శర్మకు అవమానం!
టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఐపీఎల్లో తన ఆల్టైమ్ ఫేవరెట్ జట్టును ప్రకటించాడు. తన జట్టుకు ఎంఎస్ ధోనిని కెప్టెన్గా ఎంచుకున్న జాఫర్.. క్రిస్గేల్, మలింగ వంటి దిగ్గజాలకు చోటిచ్చాడు. అదే విధంగా ఆల్రౌండర్లుగా ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యాకు తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభానికి ముందు వరుస వైఫల్యాలతో విమర్శలకు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు పూర్వవైభవం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022తో పాటు మెగా టోర్నీలో తమ ఆల్టైమ్ ఫేవరెట్ జట్లను మాజీ ఆటగాళ్లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా వసీం జాఫర్ క్రిక్ట్రాకర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఓపెనర్లుగా గేల్, కేఎల్ రాహుల్, వన్డౌన్లో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, ధోని.. ఆల్రౌండర్లుగా రసెల్, పాండ్యా.. బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్, అశ్విన్/చహల్, బుమ్రా, మలింగాకు తన జట్టులో స్థానం ఇచ్చాడు. అయితే, ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మకు మాత్రం వసీం చోటివ్వలేదు. వసీం జాఫర్ ఆల్టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్/యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Sachin Tendulkar Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..! -
IPL 2022: అతడు సూపర్.. అందుకు లక్నో పశ్చాత్తాపపడక తప్పదు!
IPL 2022 LSG Vs RCB: ‘‘ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్కు మంచి జట్లు దొరికాయి. ఈ రెండింటిలో పంజాబ్తో పోలిస్తే లక్నో మంచి ప్రదర్శన నమోదు చేసింది. సీజన్ ఆరంభంలోనే అదరగొట్టింది. చక్కగా ఆడింది. కానీ టాప్-2లో అడుగుపెట్టలేకపోయింది. ఇందుకు వారు పశ్చాత్తాపపడక తప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. కొత్త ఫ్రాంఛైజీ లక్నోను దురదృష్టం వెక్కిరించిందని టాప్-2లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నోకు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. రాహుల్ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్లలో లక్నో తొమ్మిదింట గెలిచి 18 పాయింట్లు సాధించింది. అయితే, నెట్రన్రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది. రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ నేరుగా క్వాలిఫైయర్-1కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఓడినప్పటికీ టైటిల్ రేసులో నిలిచే మరో అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన లక్నో బుధవారం నాటి మ్యాచ్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టాస్ మొదలు.. ఫీల్డింగ్ తప్పిదాలు, బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిని మూటగట్టుకుని ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఇక పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో పద్నాలుగింట ఏడు మ్యాచ్లు గెలిచి.. 14 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. Prior to the season, I expected LSG and PBKS both to go all the way with the squads they had. LSG did better comparatively, but the way they started the season and the kind of depth they had, they'll regret not finishing in the top 2. #LSGvRCB #IPL2022 — Wasim Jaffer (@WasimJaffer14) May 25, 2022 పాటిదార్ అద్భుతం చేశాడు! ఆర్సీబీని గెలిపించిన రజత్ పాటిదార్ను వసీం జాఫర్ ట్విటర్ వేదికగా ప్రశంసించాడు. ‘‘సూపర్స్టార్ల మధ్య ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకోవడం చాలా కష్టం. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి.. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి రజత్ పాటిదార్ ఈ విషయాన్ని సుసాధ్యం చేశాడు’’ అని కొనియాడాడు. It can be difficult for an uncapped player to create his own identity amidst the superstars, but Rajat has made the no.3 spot his own. Another fine knock under pressure tonight, well played 👏🏽 #LSGvRCB #IPL2022 pic.twitter.com/T5QiWoKWRX — Wasim Jaffer (@WasimJaffer14) May 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 -
Asia Cup, T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్కు చోటు!
Asia Cup and T20 World Cup 2022: ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు ఐసీసీ మెగా ఈవెంట్లు వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండుగే ముందుంది. ఆగష్టు- సెప్టెంబరులో ఆసియా కప్, అక్టోబరు- నవంబరులో పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్లో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, రాహుల త్రిపాఠి తమను తాము నిరూపించుకోవడం సహా హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్కుమార్, చహల్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తిక్ తిరిగి ఫామ్లోకి వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఈ రెండు మెగా టోర్నీలకు తన జట్టును ప్రకటించాడు. వసీం జాఫర్(ఫైల్ ఫొటో) క్రిక్ట్రాకర్ నాట్ జస్ట్ క్రికెట్ షో వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా తన తుదిజట్టులో యువ ఆటగాళ్లతో పాటు ఐపీఎల్-2022లో అదరగొట్టిన దినేశ్ కార్తిక్కు వసీం చోటునివ్వకపోవడం విశేషం. ఆసియా కప్, టీ20 వరల్డ్కప్నకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్: వసీం జాఫర్ తుది జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా. ఇతర సభ్యులు: రుతురాజ్ గైక్వాడ్, దినేశ్ కార్తిక్/సంజూ శాంసన్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ/దీపక్ చహర్. బ్యాకప్ ప్లేయర్లు: పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, టి. నటరాజన్. చదవండి👉🏾RCB Beat GT: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్.. ఇక ఢిల్లీ గెలిచిందో అంతే సంగతులు! చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్ ఇస్తే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"ఆ ముగ్గురికి భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం"
టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా.. ఈ సారి ఎలా రాణిస్తుందన్న ఆసక్తి ఇప్పటినుంచే అందరిలో నెలకొంది. టీ-20 ప్రపంచకప్కు ఇంకా 6 నెలల సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును క్రికెట్ నిపుణులు, మాజీలు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఆసియా కప్, టీ20 ప్రపంచకప్కు ఆల్ రౌండర్లను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఎంచుకున్నాడు. ఈ మెగా ఈవెంట్కు ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా,హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ను ఎంపిక చేశాడు. "హార్దిక్ పాండ్యా రెండు,మూడు ఓవర్లు వేయగలిగితే కచ్చితంగా అతడిని సెలెక్టర్లు ఎంపిక చేస్తారు. ఆల్ రౌండర్ విభాగంలో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ఆల్రౌండర్. కాబట్టి జడేజా కూడా టీ20 ప్రపంచకప్లో ఉంటాడని భావిస్తున్నాను. నేను జడేజాకు బ్యాకప్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేస్తాను. శార్దూల్ ఠాకూర్ను ఒక వేళ ఎంపిక చేసిన తుది జట్టులో చోటు దక్కడం కష్టం. రాహుల్ తెవాటియా కూడా టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉంది" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న కింగ్ ఖాన్ -
'ఇద్దరు చెత్తగా ఆడుతున్నారు.. ఈరోజైనా కనికరిస్తారా!
ఐపీఎల్ 2022లో భాగంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ తరపున కోహ్లి 9 మ్యాచ్ల్లో 128 పరుగులు చేయగా.. అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ 8 మ్యాచ్ల్లో 153 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరు తమ ఫేలవ ఫామ్తో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. తొలుత గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుండగా.. రాత్రి రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కనీసం ఈరోజైనా తాము ఆడే మ్యాచ్ల్లో కోహ్లి, రోహిత్లు స్కోర్లు చేస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. కోహ్లి, రోహిత్లనుద్దేశించి ట్విటర్లో సూపర్ మీమ్ పోస్ట్ చేశాడు. అందాజ్ అప్నా అప్నా సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని కోహ్లి, రోహిత్లను పోల్చాడు. ఆ సన్నివేశంలో షారుక్ ఖాన్, అమీర్ఖాన్లు కాఫీని పంచుకుంటారు. '' ఇవాళ కోహ్లి, రోహిత్లు తాము ఆడబోయే మ్యాచ్ల్లో స్కోర్లను చేయాలని ఆశిస్తున్నా. ఒకేరోజు వేర్వేరుగా వేర్వేరు మ్యాచ్ల్లో తలపడుతున్నారు. కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్కు ఇకనైనా పండగ ఇస్తారా'' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. With both of them in action, Kohli and Rohit fans today 😄 #GTvRCB #RRvMI #IPL2022 pic.twitter.com/bmxN4JbhPv — Wasim Jaffer (@WasimJaffer14) April 30, 2022 -
IPL 2022: ఆ ఇద్దరి అద్భుత ఫామ్.. ఇక టీమిండియాలో
IPL 2022 Kuldeep Yadav- Yuzvendra Chahal: టీమిండియా స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్- యజువేంద్ర చహల్ ఐపీఎల్-2022లో అదరగొడుతున్నారు. అత్యధిక వికెట్ వీరులకు ఇచ్చే పర్పుల్ క్యాప్ పోటీపడుతున్నారు.ఈ ఎడిషన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్, ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న కుల్దీప్ ఇద్దరూ ఎనిమిదేసి మ్యాచ్లు ఆడారు. చహల్ 18 వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. కుల్దీప్ 17 వికెట్లతో అతడి వెనకాలే ఉన్నాడు. కాగా కుల్-చాగా పేరొందిన ఈ రిస్ట్ స్పిన్నర్ ద్వయం ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టులో భాగమైన కుల్దీప్నకు అసలు ఎక్కువగా ఆడే అవకాశమే రాలేదు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్ 18 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో వీరిద్దరికి ఆయా ఫ్రాంఛైజీలు ఉద్వాసన పలికాయి. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా ఆర్సీబీతో అనుబంధం పెనవేసుకున్న చహల్ను ఆ ఫ్రాంఛైజీ వదిలేయడాన్ని అతడితో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ చహల్ కోసం పోటీపడి 6.50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా.. కుల్దీప్ యాదవ్ను ఢిల్లీ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వీరిద్దరు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో కుల్-చా అద్భుత ఫామ్ టీమిండియాకు సానుకూల అంశంగా పరిణమించింది. వీరిద్దరు ఇలాగే రాణిస్తే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చహల్, కుల్దీప్లను ట్విటర్ వేదికగా అభినందించాడు. ‘‘కఠిన పరిస్థితులు దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులను ఆపలేవు. అలాంటి వారిలో వీరిద్దరు కూడా ఉంటారు. కుల్-చా.. ఇద్దరూ ఫామ్లోకి రావడం భలే బాగుంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్తో గురువారం జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. చదవండి👉🏾 Rovman Powell Biography: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా! చదవండి👉🏾Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్ Tough times don't last tough people do. And these two are as tough as they come. So good to see KulCha back in form together 😊 #KKRvDC #IPL2022 pic.twitter.com/4bJTdTj8cI — Wasim Jaffer (@WasimJaffer14) April 28, 2022 Special celebration 🙌 Game-changing spell 🔥 The KulCha bond 🤗@kuldeepyadav & @Sakariya55 sum up @DelhiCapitals' winning return at Wankhede. 👌 👌 - By @28anand Full interview 🎥 🔽 #TATAIPL | #DCvKKR https://t.co/MSf5fwCf5R pic.twitter.com/X2NJp72rED — IndianPremierLeague (@IPL) April 29, 2022 -
IPL 2022: పంత్పై మాజీ క్రికెటర్ల విమర్శలు.. క్రీడాస్ఫూర్తిని మరిచావు!
IPL 2022 DC Vs RR No Ball Controversy: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో రాజుకున్న నో- బాల్ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్ పంత్, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకపోతే మంచిది. ఆటను సాగనివ్వాలి. అంపైర్లు కొన్నిసార్లు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు సమంజసం’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి, ఐపీఎల్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ పంత్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించాడు. ‘‘ఇది క్రికెట్.. ఫుట్బాల్ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘పంత్ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్ పంత్’’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా రాజస్తాన్తో మ్యాచ్లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్లో నాలుగో పరాజయం నమోదు చేసింది. చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్ Bad sportsman spirit on display by #DelhiCapitals Cricket is a game of gentlemen and this behaviour is completely unacceptable. #IPL20222 #DCvsRR — Mohammed Azharuddin (@azharflicks) April 22, 2022 Didn’t expect Pant could do that. Not cricket. #IPL20222 pic.twitter.com/ab5yRzDQqg — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 What is Pant thinking ? It’s a street game , calling his team back . pic.twitter.com/WDEZvpRnay — SKS (@TweetSailendra) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాట్స్మన్గా ఇరగదీస్తాడనుకుంటే పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో కోహ్లి గోల్డన్ డకౌట్గా వెనుదిరిగాడు. దుశ్మంత చమీర బౌలింగ్లో తన ఆఫ్స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టిన కోహ్లి దీపక్ హుడాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు కోహ్లి ఏడు మ్యాచ్లు కలిపి చేసిన పరుగులు 119 మాత్రమే. ఒక టాప్క్లాస్ బ్యాట్స్మన్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ను ఏ అభిమాని కోరుకోడు. అయితే కోహ్లికి దురదృష్టం రూపంలో మరో బ్యాడ్లక్ కూడా ఈ సీజన్లో అదనంగా వచ్చి చేరింది. అవవసర పరుగుకు యత్నించి రెండుసార్లు రనౌట్ కావడం.. ఒకసారి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వడం జరిగాయి. ఈ లెక్కన కోహ్లికి అదృష్టం ఆమడదూరంలో ఉందని క్లియర్గా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఐపీఎల్ 2022లో కోహ్లి ఎదుర్కొంటున్న పరిస్థితిని ఒక ఫోటో ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆ ఫోటోలో నాలుగు సందర్భాలు ఉన్నాయి. తొలి ఫోటోలో పడుకుందామంటే కళ్లకే వెళుతురు కొట్టడం.. రెండో ఫోటోలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేద్దామంటే డబ్బు మెషిన్లో ఇరుక్కొని చిరిగిన నోటు బయటికి రావడం.. ఇక మూడో ఫోటోలో.. ఊరించే కేక్ ముంద్ను తినలేని పరిస్థితి.. ఇక నాలుగో ఫోటో.. కోక్ తాగుదామంటే దాని మూత ఎలా తీయాలో అర్థం కాకపోవడం లాంటివి ఉన్నాయి. దీనర్థం కోహ్లి మంచిగా ఆడదామనుకుంటే ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడడం.. లేదంటే నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జాఫర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు Virat Kohli's luck these days: #LSGvRCB #IPL2022 pic.twitter.com/DZWKoP5u8n — Wasim Jaffer (@WasimJaffer14) April 19, 2022 -
'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్స్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా ఆదివారం సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్ లాగేసుకున్న విధానాన్ని జాఫర్ తనదైన శైలిలో వివరించాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఒక ఫేమస్ మీమ్ను జాఫర్ ఉపయోగించాడు. ఆ మీమ్ ఏంటంటే.. ఒక యువతి స్లీవ్లెస్ డ్రెస్తో రోడ్డుపై నిల్చొని తన బాయ్ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో ఒక 40 ఏళ్ల వ్యక్తి బుజాన సంచి తగిలించుకొని యువతికి ఎదురుగా వస్తాడు. కాగా ఆ యువతి 40 ఏళ్ల వ్యక్తికి హగ్ ఇచ్చినట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆ హగ్ తనకే ఇస్తుందేమోనని భ్రమపడి ఆమెను వాటేసుకుంటాడు.. కానీ ఆమె అతని వెనకాల ఉన్న తన బాయ్ఫ్రెండ్కు హగ్ ఇవ్వడానికి వెళుతుంది.. ఇది చూసిన ఆ 40 ఏళ్ల వ్యక్తి.. ''అరె.. మంచి చాన్స్ మిస్ అయిందే'' అన్నట్లుగా నాలుక కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ మీమ్ అప్పట్లో ట్రెండింగ్గా మారింది. తాజాగా ఇదే మీమ్ను సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్కు ఉపయోగించాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఒక దశలో గుజరాత్ 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఇక రెండో గెలుపు ఖాయమని సీఎస్కే భావించింది. కానీ మిల్లర్ ఒంటిచేత్తో మ్యాచ్ను సీఎస్కే నుంచి లాగేసుకున్నాడు. 94* పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్కు.. స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్(40) తోడవ్వడంతో మ్యాచ్ చేజారింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్థీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 73, రాయుడు 48, జడేజా 22* పరుగులతో రాణించారు. కాగా సీఎస్కేపై విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలవగా.. సీఎస్కే ఆరు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి.. మిగతా ఐదు ఓడి తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: IPL 2022: క్యాచ్ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన జడేజా.. వీడియో వైరల్ IPL 2022: కావ్యా మారన్.. ఆ నవ్వు ఇక ఆగేదే లే! This is exactly how Miller stole the win from CSK! #GTvCSK #IPL2022 pic.twitter.com/ASJHhBOytz — Wasim Jaffer (@WasimJaffer14) April 17, 2022 -
'ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు!'
టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఫన్నీ ట్వీట్స్ చేయడంలో ఎప్పుడు ముందు ఉంటాడు. ఐపీఎల్ 2022 జరుగుతుండడంతో ప్రస్తుతం వసీం జాఫర్ క్రికెట్ అనలిస్ట్గా బిజీ అయిపోయాడు. మ్యాచ్కు ముందు ఎవరు ఫెవరెట్ అనేది వివరిస్తున్న జాఫర్ తాజాగా ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు. విషయంలోకి వెళితే.. శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు పంజాబ్ కింగ్స్కు విదేశీ ఆటగాళ్ల సెలక్షన్ పెద్ద తలనొప్పిగా మారింది. కొత్తగా జానీ బెయిర్ స్టో రావడం.. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. కగిసో రబాడ, లియామ్ లివింగ్స్టోన్, బానుక రాజపక్స, ఓడియన్ స్మిత్, జాని బెయిర్ స్టో రూపంలో ఐదుగురు ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వసీం జాఫర్ హెరాపెరీ సినిమాలోని పాపులర్ సన్నివేశంతో పంజాబ్ జట్టును పోల్చాడు. ఆ సన్నివేశంలో ఒక కారులో వెనుక సీటులో నలుగురికి మాత్రమే అవకాశం ఉంది.. కానీ అందులో ఐదుగురు కూర్చోవాలని ప్రయత్నిస్తారు. దీంతో అందులో ఒక వ్యక్తి ప్రతీసారి కారు నుంచి కింద పడుతుంటాడు. అచ్చం పంజాబ్ కింగ్స్కు ఇదే పరిస్థితి ఎదురైంది. ''ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు'' అంటూ సెటైర్ వేశారు. జాఫర్ షేర్ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తుంది. చదవండి: Virat Kohli: ఎంత అందంగా గీశాడో.. కోహ్లి, అనుష్కల మతి పోవాల్సిందే! IPL 2022: బీసీసీఐ కొత్త నిబంధన.. తీవ్ర నిరాశలో అభిమానులు PBKS trying to fit Bairstow, Rabada, Livingstone, Rajapaksa and Odean Smith into the XI 😄 #PBKSvGT #IPL2022 pic.twitter.com/k0PQkYNhJ6 — Wasim Jaffer (@WasimJaffer14) April 8, 2022 -
LSG Vs DC: పంత్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే!
IPL 2022 LSG Vs DC: లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో పరాజయం పాలై ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ఐపీఎల్-2022లో భాగంగా గురువారం నాటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. లక్నో బ్యాటర్ క్వింటన్ డికాక్ ఒంటి చేత్తో తమ జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి కెప్టెన్సీపై పెదవి విరిచాడు. కీలక బౌలర్ అక్షర్ పటేల్ సేవలు పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడంటూ విమర్శించాడు. ముఖ్యంగా అక్షర్ను కాదని పార్ట్ టైమ్ బౌలర్ అయిన లలిత్ యాదవ్తో పూర్తి కోటా వేయించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. ఢిల్లీ సారథి చేసిన వ్యూహాత్మక తప్పిదంగా దీనిని జాఫర్ అభివర్ణించాడు. ఈ మేరకు వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో చర్చలో మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ అసలైన ట్రిక్ మిస్సయ్యాడు. పార్ట్ టైమ్ బౌలర్ లలిత్ యాదవ్తో నాలుగు ఓవర్లు వేయించాడు. కానీ అక్షర్ పటేల్ మాత్రం కేవలం రెండు ఓవర్లే వేశాడు. డికాక్ను అవుట్ చేయడానికి తను అస్త్రశస్త్రాలను ఉపయోగించి ఉండవచ్చు. నిజానికి అక్షర్ ఆ రెండు ఓవర్లు కూడా చాలా బాగా బౌల్ చేశాడు. కానీ తన పూర్తి కోటాను ఎందుకు పూర్తి చేయించలేదో నాకు అర్థం కాలేదు. నోబాల్స్ కారణంగా నోర్జేను పక్కన పెట్టారు. అలసు ఐదు నెలలుగా ఫామ్లో లేని, పరుగులు సమర్పించుకుంటున్న అతడితో ఎక్కువసేపు బౌలింగ్ చేయించడం ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. ఇక బ్యాటింగ్లో ఆర్డర్లో రోవ్మన్ పావెల్ను మూడో స్థానంలో పంపడం ఢిల్లీ జట్టు చేసిన అతిపెద్ద తప్పిదమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పావెల్ బదులు సర్ఫరాజ్ ఖాన్ను వన్డౌన్లో పంపాల్సిందని, అతడికి స్పిన్నర్లను ఎదుర్కోగల సత్తా ఉన్నందున ఢిల్లీ ఇంకాస్త ఎక్కువ స్కోరు చేయగలిగి ఉండేదని జాఫర్ పేర్కొన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక నోర్జే మాత్రం 2.2 ఓవర్లలోనే 35 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్రౌండర్ లలిత్ యాదవ్ 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటర్లలో పావెల్(3 పరుగులు) పూర్తిగా వైఫల్యం చెందగా.. ఐదోస్థానంలో బ్యాటింగ్కు దిగిన సర్ఫరాజ్ ఖాన్ 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: IPL 2022: 'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్?!' Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw — IndianPremierLeague (@IPL) April 7, 2022 -
ఆర్సీబీకి రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు వెన్నుపోటు!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అద్భుత విజయాలు సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్లో ఉండగా.. రెండు మ్యాచ్ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. మరి ఇవాళ జరిగే సమరంలో రాయల్స్ రాజసం చూపిస్తుందా.. లేక ఆర్సీబీ గెలుస్తుందా అనేది చూడాలి. కాగా ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూపర్ మీమ్తో రెచ్చొపోయాడు. గత సీజన్లో చహల్, పడిక్కల్లు ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం వారిద్దరు రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్నారు. ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా.. మహాభారతంలో అర్జున పాత్రతో చహల్, పడిక్కల్లను చూపుతూ... భీష్ముని పాత్రలో ఆర్సీబీని ఉంచి ఫోటో రిలీజ్ చేశాడు. ''చహల్, దేవదత్ పడిక్కల్ను చూస్తుంటే ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తున్నారంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన చహల్ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ అతన్ని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ తరపున చహల్ 2 మ్యాచ్ల్లో 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పడిక్కల్ కూడా ఆర్సీబీ తరపున ఐపీఎల్లో సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆర్సీబీ తరపున పడిక్కల్ కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. చదవండి: IPL 2022: 'ఎస్ఆర్హెచ్కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు' IPL 2022 RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఇలా! .@yuzi_chahal and @devdpd07 playing against RCB tonight. #RRvRCB #IPL2022 pic.twitter.com/QpteUJU6AY — Wasim Jaffer (@WasimJaffer14) April 5, 2022 -
IPL 2022: శ్రేయస్.. నితీశ్ చేతికి బంతి ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది.. ఏమిటో!
IPL 2022 RCB Vs KKR: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పెదవి విరిచాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఎదుర్కొనేందుకు వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పడుతున్న వేళ పార్ట్ టైమ్ స్పిన్నర్ నితీశ్ రాణాను ఎందుకు రంగంలోకి దించలేదని ప్రశ్నించాడు. పూర్తి స్థాయిలో ఫిట్గా లేని ఆండ్రీ రసెల్తో బౌలింగ్ చేయించే బదులు రానా చేతికి బంతిని ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో శ్రేయస్ బృందం పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ శ్రేయస్ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ తరఫున ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన రూథర్ఫర్డ్, షాబాజ్ అహ్మద్లకు బౌలింగ్ వేయించిన తీరును విమర్శించాడు. ‘ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నపుడు... వరుణ్ చక్రవర్తి వాళ్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ నితీశ్ రాణాతో బౌలింగ్ చేయించకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రసెల్ బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నపుడు రానాతో ఒకటి లేదంటే రెండు ఓవర్లు వేయించాల్సింది. అంతేకాదు వెంకటేశ్ అయ్యర్ను కూడా కాస్త ముందుగానే రంగంలోకి దించాల్సింది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్ వరుణ్ 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక రసెల్ 2.2 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమేశ్ యాదవ్కు రెండు, టిమ్ సౌథీకి మూడు, సునిల్ నరైన్కు ఒక వికెట్ దక్కాయి. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ స్కోర్లు: కేకేఆర్- 128 (18.5) ఆర్సీబీ- 132/7 (19.2) చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా హర్షల్ పటేల్ That's that from Match 6 of #TATAIPL. A nail-biter and @RCBTweets win by 3 wickets. Scorecard - https://t.co/BVieVfFKPu #RCBvKKR #TATAIPL pic.twitter.com/2PzouDTzsN — IndianPremierLeague (@IPL) March 30, 2022 -
మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్ వార్.. కత్తులు దూసుకున్న మాజీలు
Michael Vaughan VS Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ల మధ్య ట్విటర్ వార్ తారాస్థాయికి చేరింది. క్రికెట్కు సంబంధించి తరుచూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే ఈ మాజీలు తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దిగారు. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్కు ఎదురైన దారుణ పరాభవం (టీ20 సిరీస్తో పాటు టెస్ట్ సిరీస్లో ఓటమి) నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తొలుత వసీం జాఫర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. England 120 all out! What happened @MichaelVaughan was this Extras guy unavailable due to IPL or what? 😜 #WIvENG #IPL2022 pic.twitter.com/lSetnPSif5— Wasim Jaffer (@WasimJaffer14) March 27, 2022 ఈ ట్వీట్లో జాఫర్ ఇంగ్లండ్ను టార్గెట్ చేస్తూ వాన్కు చురకలు తగిలేలా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాకు సంబంధించిన ఫోటోను (జో రూట్ 1708 పరుగులు, రోరీ బర్న్స్ 530, ఎక్స్ట్రాలు 412) షేర్ చేస్తూ.. ఇంగ్లండ్ 120 ఆలౌట్! ఏమైంది వాన్..? ఈ ఎక్స్ట్రా రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్లో ఆడుతున్నాడా ఏంది..? అంటూ వాన్కు దిమ్మతిరిగిపోయే రేంజ్లో ట్వీట్ (పంచ్) చేశాడు. Wasim .. At the moment we are focusing on the Womens World Cup semis .. !!! 😜😜 https://t.co/ubwxORXKBU— Michael Vaughan (@MichaelVaughan) March 27, 2022 దీనికి మైకేల్ వాన్ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. వసీం.. ఈ సమయంలో మేము మహిళల ప్రపంచకప్ సెమీస్ (మహిళల వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టగా.. ఇంగ్లండ్ మాత్రం బంగ్లాదేశ్పై విజయం సాధించి సెమీస్కు చేరింది) మీద దృష్టి సారించాం అని బదులిచ్చాడు. ఈ ట్వీట్ చూసి చిర్రెత్తిపోయిన జాఫర్ వెంటనే మరో కౌంటరిస్తూ.. With just 1 win in last 17 Tests, not surprised you have given up on the men's team Michael 😜 #WIvENG #IPL2022 https://t.co/xXNO71RmeR— Wasim Jaffer (@WasimJaffer14) March 28, 2022 రూట్ సేన గత 17 టెస్ట్ల్లో ఒకే ఒక విజయం సాధించింది, ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన జట్టును ఎవరు మాత్రం పట్టించుకుంటారంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇందుకు వాన్ ఏ విధంగా స్పందించనున్నాడోనని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, విండీస్ పర్యటనలో ఇంగ్లండ్ 2-3 తేడాతో టీ20 సిరీస్ను, 0-1 తేడాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్లో రూట్ సేన రెండో ఇన్నింగ్స్లో 120కే ఆలౌట్ కావడంతో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. చదవండి: IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్ -
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన తప్పిదం ఇదే! వాళ్లను వదిలేసి.. ఇప్పుడిలా
ఐపీఎల్ సంగ్రామానికి మరి కొద్ది రోజుల్లో తెరలేవనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉంటే.. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహం సరిగా లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వారి విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవడంలో ఢిల్లీ విఫలమైందని అతడు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వీరిలో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ గాయం ఈ ఏడాది సీజన్కు కారణంగా దూరం కాగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. "ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పుడు వ్యూహాన్ని అనుసరించింది. వారు ఆటగాళ్లను అంతర్జాతీయ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాల్సింది. వేలంలో గరిష్టంగా 8 మంది విదేశీ క్రికెటర్లను చేసుకోనే అవకాశం ఉన్నప్పుడు.. ఢిల్లీ ఏడుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ అనుసరించబోయే వ్యూహం గురించి మాట్లాడుతూ.. ‘‘మన్దీప్ సింగ్ లేదా యశ్ ధూల్ ఢిల్లీ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో సర్ఫరాజ్ ఖాన్కు బ్యాటింగ్కు వస్తాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ స్ధానాన్ని అతడు భర్తీ చేయలేడు. ఇక కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. కానీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను విడుదల చేశారు. ఇంతకు ముందు జట్టులో అమిత్ మిశ్రా ఉన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ దూబే,లలిత్ యాదవ్ వంటి యువ స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. అయితే ధావన్, అయ్యర్, అశ్విన్ వంటి ఆటగాళ్లను వదిలి ఢిల్లీ తప్పు చేసింది" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: BAN vs SA: ఒకవైపు ఐపీఎల్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ ఆటగాళ్లు లేకుండానే!