womens singles
-
రష్మిక సంచలనం
ముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో భారత మూడో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనంతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 325వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ ఎలీనా ప్రిడాన్కినా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. రెండు ఏస్లు సంధించిన రష్మిక మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను ఒక్కసారి చేజార్చుకున్న రష్మిక ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో ప్రిడాన్కినా తన సర్వీస్ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం. భారత్కే చెందిన అంకిత రైనా, మాయ రేవతి రాజేశ్వరన్ కూడా తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్వాలిఫయర్ మాయ 6–4, 6–1తో ఇరీనా షైమనోవిచ్ (బెలారస్)పై, అంకిత రైనా 6–2, 6–2తో భారత్కే చెందిన వైష్ణవి అడ్కర్పై విజయం సాధించారు. -
టౌన్సెండ్ - సినియకోవా జోడీకి డబుల్స్ టైటిల్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో గతంలో ఒక్కసారి కూడా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయిన అమెరికా క్రీడాకారిణి టేలర్ టౌన్సెండ్ ఈసారి మాత్రం డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో జత కట్టి తన కెరీర్లో రెండోసారి గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ను దక్కించుకుంది.గత ఏడాది వింబుల్డన్ టోర్నీలో సినియకోవాతో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన టౌన్సెండ్ ఈసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ టౌన్సెండ్ృసినియకోవా ద్వయం 6-2, 6-7 (4/7), 6-3తో సె సు వె (చైనీస్ తైపీ)-ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జోడీపై గెలిచింది. టౌన్సెండ్-సినియకోవాలకు 8,10,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 4 కోట్ల 41 లక్షలు)... సె సు వెృఒస్టాపెంకోలకు 4,40,000 డాలర్లు (రూ. 2 కోట్ల 39 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. సినియకోవా కెరీర్లో ఇది 10వ గ్రాండ్స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో ఆమె బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి 2022, 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్లో... 2018, 2021 ఫ్రెంచ్ ఓపెన్లో... 2018, 2022 వింబుల్డన్ టోర్నీలో... 2022 యూఎస్ ఓపెన్లో... కోకో గాఫ్ (అమెరికా)తో కలిసి 2024 ఫ్రెంచ్ ఓపెన్లో... టౌన్సెండ్తో కలిసి 2024 వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ను సాధించింది. భళా బెర్నెట్... మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ జూనియర్ గ్రాండ్స్లామ్ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి స్విట్జర్లాండ్ ప్లేయర్గా హెన్రీ బెర్నెట్ గుర్తింపు పొందాడు. జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బెర్నెట్ 6-3, 6-4తో బెంజమిన్ విల్వెర్త్ (అమెరికా)పై విజయం సాధించాడు. గతంలో స్విట్జర్లాండ్ తరఫున జూనియర్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో హెయింజ్ గుంతార్ట్ (1976 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), రోజర్ ఫెడరర్ (1998 వింబుల్డన్), రోమన్ వాలెంట్ (2001 వింబుల్డన్), స్టానిస్లాస్ వావ్రింకా (2003 ఫ్రెంచ్ ఓపెన్), డొమినిక్ స్ట్రయికర్ (2020 ఫ్రెంచ్ ఓపెన్) విజేతలుగా నిలిచారు. -
సింధుకు షాక్
జకార్తా: ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు... ఇండోనేసియా మాస్టర్స్ –500 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ థుయి లిన్ నుయెన్ (వియత్నాం) 22–20, 21–12తో సింధుపై సంచలన విజయం సాధించింది.గతంలో సింధుతో ఆడిన రెండుసార్లూ (2022 సింగపూర్ ఓపెన్, 2023 ఆర్క్టిక్ ఓపెన్) ఓడిపోయిన నుయెన్ మూడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో స్కోరు 14–20 వద్ద నుయెన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్ను సొంతం చేసుకుంది. చేజేతులా తొలి గేమ్ను చేజార్చుకున్న సింధు రెండో గేమ్లో తడబడింది. ఆరంభంలోనే 1–6తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మహిళల సింగిల్స్లో పోటీపడ్డ ఇతర భారత క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్, రక్షిత శ్రీ, తాన్యా హేమంత్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఆకర్షి 10–21, 13–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 12–21, 5–21తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్జుంగ్ (ఇండోనేసియా) చేతిలో, తాన్యా 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో, రక్షిత శ్రీ 17–21, 19–21తో టొమోక మియకాజి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా–సుకిత్త (థాయ్లాండ్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 9–21, 13–21తో గ్రెగొరీ మేర్స్–జెన్నీ మేర్స్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓడిపోగా... ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 21–18, 21–14తో అద్నాన్ మౌలానా–ఇందా చాయసారి (ఇండోనేసియా) జోడీపై గెలిచింది. లక్ష్య సేన్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–9, 21–14తో ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో కిరణ్ జార్జి (భారత్) 12–21, 10–21తో హైక్ జిన్ జియోన్ (కొరియా) చేతిలో, ఆయుశ్ శెట్టి (భారత్) 19–21, 19–21తో షి యుకి (చైనా), ప్రియాన్షు (భారత్) 14–21, 21–13, 18–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
స్వియాటెక్ ఫటాఫట్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్కు చేరుకుంది. ఇవా లిస్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో స్వియాటెక్ మూడు ఏస్లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో రెండు గేమ్లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది. కీస్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది. సినెర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సినెర్ 14 ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. -
సింధు శుభారంభం
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–17, 21–15తో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్కే చెందిన వలిశెట్టి శ్రేయాన్షి, మాళవిక బన్సోద్, రక్షిత శ్రీ, అనుపమ ఉపాధ్యాయ్, తస్నిమ్ మీర్, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్, ఐరా శర్మ కూడా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్లో భారత క్రీడా కారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–12, 21–12తో ఆదిల్ (మలేసియా)పై, ప్రియాన్షు 21–13, 21–12తో కార్తికేయ (భారత్)పై గెలిచారు. భారత్కే చెందిన మైస్నం మెరాబా, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి, రిత్విక్ కూడా తొలి రౌండ్లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సింధు శుభారంభం
కుమమోటో: జపాన్ ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుసానన్ ఒంగ్మమ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–12, 21–8తో అలవోకగా గెలిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్న బుసానన్తో జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓవరాల్గా సింధు, బుసానన్ల మధ్య ఇది 20వ ముఖాముఖి పోరు కావడం విశేషం. సింధు ఏకంగా 19 సార్లు గెలుపొందగా... థాయ్లాండ్ ప్లేయర్ ఒక్కసారి మాత్రమే సింధును ఓడించింది. బుసానన్ ఆటతీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న సింధుకు తొలి గేమ్ ఆరంభంలో గట్టిపోటీ లభించింది. ఒకదశలో సింధు, బుసానన్ (11–10) మధ్య ఒక్క పాయింటే అంతరంగా నిలిచింది. అయితే నెమ్మదిగా సింధు జోరు పెంచగా... థాయ్లాండ్ ప్లేయర్ తడబడింది. స్కోరు 14–12 వద్ద సింధు చెలరేగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఏడు పాయింట్లతో అదరగొట్టిన సింధు తొలి గేమ్ను 21–12తో దక్కించుకుంది. రెండో గేమ్లోనూ ఆరంభంలో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. స్కోరు 5–4 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ స్కోరు 10–7 వద్ద సింధు వరుసగా 10 పాయింట్లు సంపాదించి 20–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ ఒక పాయింట్ సాధించిన వెంటనే సింధు కూడా ఒక పాయింట్ నెగ్గడంతో భారత స్టార్ విజయం ఖరారైంది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ తొలి రౌండ్లోనే ముగిసింది. భారత స్టార్ లక్ష్య సేన్ 74 నిమిషాల పోరులో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 17–21, 16–21తో ఓడిపోయాడు. గతంలో జున్ హావోపై మూడుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. -
కోకో గాఫ్దే చైనా ఓపెన్
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాది రెండో టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్ కోకో గాఫ్ చాంపియన్గా అవతరించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కోకో గాఫ్ 6–1, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. 76 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోకో ఆరు ఏస్లు సంధించింది. ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్విస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ముకోవాకు 5,85,000 డాలర్ల (రూ. 4 కోట్ల 91 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో గత 14 ఏళ్లలో ఈ టోర్నీ టైటిల్ సాధించిన పిన్న వయసు్కరాలిగా 20 ఏళ్ల కోకో గాఫ్ గుర్తింపు పొందింది. సెరెనా విలియమ్స్ (2004, 2013) తర్వాత చైనా ఓపెన్ సాధించిన రెండో అమెరికన్ ప్లేయర్గానూ కోకో గాఫ్ ఘనత వహించింది. ఓవరాల్గా కోకో కెరీర్లో ఇది ఎనిమిదో సింగిల్స్ టైటిల్. తాజా టైటిల్తో సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్కు అర్హత సాధించేందుకు కోకో గాఫ్ చేరువైంది. -
U S Open 2024: కోకో గాఫ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో కోకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్లు చేయడం గమనార్హం. కేవలం 14 విన్నర్స్ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
తొలి రౌండ్ దాటలేకపోయారు
యోకోహామా: భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్న ముగ్గురు భారత యువ క్రీడాకారిణులకు జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ నిరాశను మిగిల్చింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షట్లర్లు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అషి్మత చాలిహా తొలి రౌండ్ను దాటలేకపోయారు.అషి్మత 16–21, 12–21తో టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... మాళవిక 21–23, 19–21తో పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో... ఆకర్షి 13–21, 12–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ (భారత్) జోడీ 10–21, 18–21తో రెహాన్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. -
Wimbledon 2024: కోకో గాఫ్ పరాజయం
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) ఇంటిముఖం పట్టగా... తాజాగా ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) కూడా ఈ జాబితాలో చేరింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 20 ఏళ్ల కోకో గాఫ్కు వింబుల్డన్ టోర్నీ మరోసారి కలిసిరాలేదు. ఐదో ప్రయత్నంలోనూ ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేదు. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో ధాటికి కోకో గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఎమ్మా నవారో 6–4, 6–3తో కోకో గాఫ్ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెట్ వద్దకు దూసుకొచి్చన 9 సార్లూ పాయింట్లు నెగ్గిన నవారో ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–3, 3–0తో కలిన్స్కాయా (రష్యా; గాయంతో రెండో సెట్ మధ్యలో వైదొలిగింది)పై... 13వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–2, 6–3తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై... స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. నాలుగో సీడ్ జ్వెరెవ్కు షాక్ పురుషుల సింగిల్స్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3 గంటల 29 నిమిషాల్లో 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 6–3తో జ్వెరెవ్పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఎనిమిదో ప్రయత్నంలోనూ జ్వెరెవ్ వింబుల్డన్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఇటలీ ప్లేయర్ లొరెంజో ముసెట్టి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న పెరికార్డ్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 4–6, 6–3, 6–3, 6–2తో గెలిచాడు. -
French Open 2024: క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సబలెంకా 6–2, 6–3తో ఎమా నవారో (అమెరికా)పై, రిబాకినా 6–4, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 4–6, 6–0, 6–1తో ఎలీనా అవానెస్యాన్ (రష్యా)పై, మిరా ఆంద్రీవా 7–5, 6–2తో వర్వారా గ్రచెవా (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మెద్వెదెవ్కు చుక్కెదురు పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 4–6, 6–2, 6–1, 6–3తో మెద్వెదెవ్ను ఓడించి ఎనిమిదో ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
సబలెంకా బోణీ
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–2తో ఇరీకా ఆంద్రీవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సబలెంకా ప్రత్యర్థి సర్విస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.27 విన్నర్స్ కొట్టిన సబలెంకా నెట్ వద్ద 11 పాయింట్లు సాధించింది. ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఆడుతున్న ఈ బెలారస్ స్టార్ గత ఏడాది తొలిసారి సెమీఫైనల్కు చేరింది. మరోవైపు ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ మరియా సాకరి (గ్రీస్) వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. సాకరి 6–3, 4–6, 3–6తో వర్వరా గ్రెచెవా (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకరి ఆరు డబుల్ ఫాల్ట్లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), పదో సీడ్ దరియా కసత్కినా (రష్యా) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో రిబాకినా 6–2, 6–3తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై, కిన్వెన్ జెంగ్ 6–2, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్)పై, కసత్కినా 7–5, 6–1తో మగ్ధలీనా ఫ్రెచ్ (పోలాండ్)పై గెలుపొందారు. రూడ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2022, 2023 రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రూడ్ 6–3, 6–4, 6–3తో అల్వెస్ మెలెగిని (బ్రెజిల్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రూడ్ ప్రత్యర్థి సర్విస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 23 విన్నర్స్ కొట్టిన రూడ్ నెట్ వద్ద 10 పాయింట్లు సాధించాడు. వర్షం అంతరాయం కారణంగా మంగళవారం జరగాల్సిన కొన్ని మ్యాచ్లను వాయిదా వేశారు. ఇందులో భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ తొలి రౌండ్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. కార్నె వీడ్కోలు... ఈ టోర్నీతో ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ అలీజా కార్నె కెరీర్కు వీడ్కోలు పలికింది. కిన్వెన్ జెంగ్ చేతిలో మ్యాచ్ ముగిశాక ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు కార్నెను సన్మానించి చేసి వీడ్కోలు ట్రోఫీని అందజేశారు. 34 ఏళ్ల కార్నె అత్యధిక వరుస గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడిన మహిళా టెన్నిస్ ప్లేయర్గా గుర్తింపు పొందింది. కార్నె 2007 ఆ్రస్టేలియన్ ఓపెన్ నుంచి తాజా ఫ్రెంచ్ ఓపెన్ వరకు వరుసగా 69 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడింది. 2014 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో నాటి ప్రపంచ నంబర్వన్ సెరెనా విలియమ్స్ను ఓడించిన కార్నె 2022 ఆ్రస్టేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2009లో కెరీర్ బెస్ట్ 11వ ర్యాంక్ను అందుకున్న కార్నె తాజా ర్యాంకింగ్స్లో 106వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్పరంగా కార్నెకు నేరుగా ఫ్రెంచ్ ఓపెన్లో ఆడే అవకాశం రాకపోవడంతో నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. -
Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అషి్మత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సింధు 21–13, 12–21, 21–14తో ప్రపంచ 34వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)పై కష్టపడి గెలుపొందగా... ప్రపంచ 53వ ర్యాంకర్ అషి్మత 21–19, 16–21, 21–12తో ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 2022 ఇండియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన అష్మిత మళ్లీ రెండేళ్ల తర్వాత సూపర్–500 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. సిమ్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సింధు నిలకడలేమితో ఇబ్బంది పడింది. తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్లో తడబడింది. రెండుసార్లు వరుసగా ఐదు పాయింట్ల చొప్పున ప్రత్యరి్థకి కోల్పోయింది. అయితే నిర్ణాయక మూడో గేమ్లో గాడిలో పడిన సింధు స్కోరు 16–14 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి (భారత్) 13–21, 18–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్లో భారత పోరు ముగిసింది. ప్రిక్వార్టర్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 70 నిమిషాల్లో 18–21, 22–20, 14–21తో సుంగ్ షువో యున్–యు చెయున్ హుయ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోగా... రితిక–సిమ్రన్ జంట 17–21, 11–21తో పియర్లీ టాన్–థినా మురళీధరన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 9–21, 15–21తో టాప్ సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ ద్వయం 11–21, 9–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ హాన్ యువె (చైనా)తో సింధు; ఆరో సీడ్ జాంగ్ యి మాన్ (చైనా)తో అషి్మత తలపడతారు. -
సింధు శుభారంభం
బాసెల్ (స్విట్జర్లాండ్): మాజీ చాంపియన్ పీవీ సింధు స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–12, 21–13తో పోర్న్పిచా చొయ్కీవోంగ్ (థాయ్లాండ్)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ తొమోకా మియజకీతో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్లో మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. 2015లో స్విస్ ఓపెన్ విజేతగా నిలిచిన శ్రీకాంత్ 21–17, 21–18తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై నెగ్గగా... లక్ష్య సేన్ 21–19, 15–21, 21–11తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. తొలి రౌండ్లో అశి్వని–తనీషా ద్వయం 21–18, 12–21, 21–19తో మెలీసా పుస్పితాసారి–రేచల్ రోజ్ (ఇండోనేసియా) జంటపై... గాయత్రి–ట్రెసా జోడీ 21–15, 21–12తో అనీ జు–కెరీ జు (అమెరికా) ద్వయంపై గెలుపొందాయి. -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింధు ఏడో‘సారీ’...
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో భారత కథ ముగిసింది. భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గత ఐదేళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ కొరియా ప్లేయర్ ఆన్ సె యంగ్ చేతిలో సింధు వరుసగా ఏడోసారి ఓడిపోయింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింధు 19–21, 11–21తో ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ ఆన్ సె యంగ్ చేతిలో ఓటమి పాలైంది. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో ఆన్ సె యంగ్కు గట్టిపోటీనిచ్చిన సింధు రెండో గేమ్లో మాత్రం తడబడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 3,900 డాలర్ల (రూ. 3 లక్షల 23 వేలు) ప్రైజ్మనీతోపాటు 4800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రష్మిక సంచలనం
ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. ముంబైలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ప్రపంచ 374వ ర్యాంకర్ రష్మిక 6–3, 6–2తో ప్రపంచ 117వ ర్యాంకర్ వాలెంటిని గ్రామటికోపులు (గ్రీస్)ను బోల్తా కొట్టించింది. మొర్వాయోవా (స్లొవేకియా)తో నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో మ్యాచ్లో రష్మిక గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తుంది. -
స్వియాటెక్కు షాక్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 19 ఏళ్ల లిండా నొస్కోవా తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేసి నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్ను బోల్తా కొట్టించింది. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 50వ ర్యాంకర్ నొస్కోవా 3–6, 6–3, 6–4తో స్వియాటెక్ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. మాజీ చాంపియన్ అజరెంకా (బెలారస్), 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. -
Australian Open 2024: భళా బ్లింకోవా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఐదో రోజు గురువారం టాప్–10లోని ఇద్దరు క్రీడాకారిణులు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)... ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రస్తుతం టాప్–10లో నలుగురు క్రీడాకారిణులు టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మాత్రమే బరిలో నిలిచారు. 42 పాయింట్ల టైబ్రేక్... రష్యాకు చెందిన 25 ఏళ్ల అనా బ్లింకోవా 2 గంటల 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 6–4, 4–6, 7–6 (22/20)తో రిబాకినాపై గెలుపొందగా... క్లారా బురెల్ (ఫ్రాన్స్) 70 నిమిషాల్లో 6–4, 6–2తో పెగూలాను ఓడించి తమ కెరీర్లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. బ్లింకోవా–రిబాకినా మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నిర్ణాయక మూడో సెట్లో జరిగిన టైబ్రేక్ గ్రాండ్స్లామ్ టోరీ్నల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్గా నిలిచింది. 31 నిమిషాలపాటు సాగిన 42 పాయింట్ల టైబ్రేక్లో చివరకు బ్లింకోవా 22–20తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మూడో సెట్ ఏకంగా 93 నిమిషాలు సాగింది. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్లో లెసియా సురెంకో (ఉక్రెయిన్)–అనా బొగ్డాన్ (రొమేనియా) మధ్య మూడో రౌండ్ మ్యాచ్లోని మూడో సెట్లో టైబ్రేక్ 38 పాయింట్లపాటు జరిగింది. చివరకు సురెంకో ఈ టైబ్రేక్ను 20–18 పాయింట్లతో గెల్చుకుంది. రిబాకినాతో జరిగిన మ్యాచ్లో బ్లింకోవా ఏకంగా ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మరోవైపు రిబాకినా తొమ్మిదిసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా పదోసారి పరాజయం తప్పలేదు. శ్రమించి నెగ్గిన స్వియాటెక్ ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్ చేరడానికి 3 గంటల 14 నిమిషాలు శ్రమించింది. ఐదో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టిన స్వియాటెక్ రెండో రౌండ్లో 6–4, 3–6, 6–4తో 2022 రన్నరప్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్లో 14వ సీడ్ కసత్కినా 6–4, 3–6, 3–6తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) 4–6, 6–4, 4–6తో యాఫాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో 11వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–0, 3–6, 6–4తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా)పై, 12వ సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా) 6–3, 6–3తో కేటీ బుల్టర్ (బ్రిటన్)పై, 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో తొమోవా (బల్గేరియా)పై గెలిచారు. హోల్గర్ రూనెకు చుక్కెదురు పురుషుల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) రెండో రౌండ్లో ని్రష్కమించాడు. ఆర్థర్ కజాక్స్ (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–4, 4–6, 6–3తో రూనెపై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 6–3, 7–6 (7/3)తో సొనెగో (ఇటలీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 3–6, 4–6, 7–6 (7/5), 7–6 (10/7)తో లుకాస్ క్లీన్ (స్లొవేకియా)పై, 11వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 6–7 (5/7), 6–3, 3–6, 7–6 (10/7)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై కష్టపడి గెలిచారు. పోరాడి ఓడిన సుమిత్ నగాల్ భారత నంబర్వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్కు ఓవరాల్గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
అంకిత రైనా శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీ లో భారత స్టార్ అంకిత రైనా శుభారంభం చేసింది. మెల్బోర్న్లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 221వ ర్యాంకర్ అంకిత 6–4, 5–7, 7–6 (10/7)తో ప్రపంచ 158వ ర్యాంకర్ జెస్సికా బుజస్ మనెరో (స్పెయిన్)పై గెలిచింది. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇద్దరూ తమ సర్విస్లను ఎనిమిదిసార్లు కోల్పోయారు. నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్లో అంకిత పైచేయి సాధించి విజేతగా నిలిచింది. రెండో రౌండ్లో ప్రపంచ 132వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్)తో అంకిత తలపడుతుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో మనిక బత్రా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మనిక దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్కు, ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 82వ ర్యాంక్లో ఉంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21–11, 21–10తో ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది వెన్ చి సుపై సింధుకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్షిప్లో వెన్ చి సుపై సింధు వరుస గేముల్లో నెగ్గింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ థయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 15–21, 12–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 10–21, 20–22తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సబలెంకా vs కోకో గాఫ్
కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించేందుకు అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండో గ్రాండ్స్లామ్ ట్రోఫీ అందుకోవాలనే లక్ష్యంతో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో ఆరో సీడ్ కోకో గాఫ్ 6–4, 7–5తో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై... సబలెంకా 0–6, 7–6 (7/1), 7–6 (10/5)తో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలుపొందారు. భారత కాలమానం ప్రకారం నేడు అర్ధరాత్రి దాటాక గం. 1:30 నుంచి ఫైనల్ జరుగుతుంది. ముకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 19 ఏళ్ల కోకో గాఫ్ ప్రత్యర్థి సర్విస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ కీస్తో 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సబలెంకా తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయింది. రెండో గేమ్లో ఒకదశలో ఆమె 4–5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. తొమ్మిదో గేమ్లో కీస్ తన సర్విస్ను నిలబెట్టుకొని ఉంటే విజయం అందుకునేది. కానీ కీస్ సర్విస్ను సబలెంకా బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసి మ్యాచ్లో నిలిచింది. ఆ తర్వాత టైబ్రేక్లో పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడింది. ఈసారీ తేరుకొని స్కోరును 4–4తో సమం చేసింది. చివరకు టైబ్రేక్లోనూ ఆధిపత్యం కనబరిచి విజయాన్ని అందుకుంది. -
సుతీర్థ–ఐహిక జోడీ ఓటమి
ప్యాంగ్చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్ 9–11, 10–12, 5–11తో చైనా దిగ్గజం మా లాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సుతీర్థ 9–11, 6–11, 4–11తో ఒరావన్ పరానాంగ్ (థాయ్లాండ్) చేతిలో... ఐహిక ముఖర్జీ 11–2, 11–6, 8–11, 9–11, 3–11తో చెన్ జింగ్టాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ (భారత్) జోడీ 5–11, 11–13, 10–12తో మాన్యు వాంగ్–చెన్ మెంగ్ (చైనా) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్–మనుష్ షా (భారత్) జంట 5–11, 3–11, 5–11తో ఫాన్ జెన్డాంగ్–లిన్ గావోయువాన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టుకు ఆరో స్థానం లభించింది. -
గట్టెక్కిన జొకోవిచ్
న్యూయార్క్: కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్లో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన జొకోవిచ్కు మూడో రౌండ్లో తన దేశానికే చెందిన లాస్లో జెరె నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి రెండు సెట్లను చేజార్చుకున్న జొకోవిచ్ 2006 తర్వాత యూఎస్ ఓపెన్లో మూడో రౌండ్లోనే ఇంటిదారి పడతాడా అనే సందేహం కలిగింది. అయితే అపార అనుభవం కలిగిన ఈ మాజీ చాంపియన్ పట్టుదలతో పోరాడి తేరుకున్నాడు. వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని ఈ టోర్నీలో వరుసగా 16వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 4–6, 4–6, 6–1, 6–1, 6–3తో ప్రపంచ 38వ ర్యాంకర్ లాస్లో జెరెపై గెలుపొందాడు. ఈ పోరులో 12 ఏస్లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 32 సార్లు దూసుకొచ్చి 21 సార్లు పాయింట్లు గెలిచాడు. 34 విన్నర్స్ కొట్టిన అతను 36 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. మరోవైపు తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), పదో సీడ్ టియాఫో (అమెరికా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఫ్రిట్జ్ 6–1, 6–2, 6–0తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)పై, టియాఫో 4–6, 6–2, 6–3, 7–6 (8/6)తో 22వ సీడ్ మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గారు. నాలుగో సీడ్ రిబాకినాకు షాక్ మహిళల సింగిల్స్లో మరో సంచలనం నమోదైంది. గత ఏడాది వింబుల్డన్ చాంపియన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. 30వ సీడ్ సొరానా క్రిస్టియా (రొమేనియా) 2 గంటల 48 నిమిషాల్లో 6–3, 6–7 (6/8), 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాను బోల్తా కొట్టించి 15వ ప్రయత్నంలో యూఎస్ ఓపెన్లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్వన్, డెన్మార్క్ స్టార్ వొజ్నియాకి తన జోరు కొనసాగిస్తోంది. మూడో రౌండ్లో వొజ్నియాకి గంటా 58 నిమిషాల్లో 4–6, 6–3, 6–1తో జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)ను ఓడించి 2016 తర్వాత ఈ టోర్నీలో మరోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో గాఫ్ 3–6, 6–3, 6–0తో 32వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 13వ సీడ్ దరియా కసత్కినా (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. మూడో రౌండ్లో సబలెంకా 6–1, 6–1తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై, దరియా 6–3, 6–4తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై గెలిచారు. 8 గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ మ్యాచ్ల్లో తొలి రెండు సెట్లను కోల్పోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను దక్కించుకొని విజయం అందుకోవడం జొకోవిచ్కిది ఎనిమిదోసారి కావడం విశేషం. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్పై కూడా జొకోవిచ్ ఈ తరహాలోనే గెలిచాడు. -
సింధుకు చుక్కెదురు
కోపెన్హాగెన్ (డెన్మార్క్): ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో ఈ మాజీ చాంపియన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ఆమెకు ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్లో పోటీపడింది. ప్రతీసారి కనీసం క్వార్టర్ ఫైనలిస్ట్గా నిలిచిన ఆమె బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14–21, 14–21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. రెండు గేముల్లో కూడా ఆరంభంలో ప్రత్యర్థికంటే మెరుగ్గా, ప్రత్యర్థికి దీటుగా ఆడిన 16వ సీడ్ సింధు గేమ్ సాగే కొద్దీ డీలా పడటంతో వరుస గేముల్లోనే ఓడింది. రెండో గేమ్లో సింధు ఒకదశలో 9–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ జపాన్ షట్లర్ వరుసగా పాయింట్లు నెగ్గుకుంటూ రావడంతో మళ్లీ సింధు ఆధిక్యాన్ని, ఆ తర్వాత మ్యాచ్నే కోల్పోయింది. పురుషుల సింగిల్స్లో భారత స్టార్స్ ప్రణయ్, లక్ష్యసేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21–11, 21–12తో జియోన్ హ్యోక్ (కొరియా)పై, ప్రణయ్ 21–9, 21–14తో చికొ అర వర్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)తో ప్రణయ్; కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో లక్ష్య సేన్ తలపడతారు. -
సింధు ర్యాంక్లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు రెండు స్థానాలు పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్లో సింధు 17 నుంచి 15వ స్థానానికి చేరుకుంది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 9వ ర్యాంక్లో, లక్ష్య సేన్ 11వ ర్యాంకుల్లో కొనసాగుతుండగా...శ్రీకాంత్ ఒక స్థానం పడిపోయి 20వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
వింబుల్డన్కు ముందు అన్నీ అడ్డంకులే.. వండర్ వొండ్రుసోవా
అన్సీడెడ్...మణికట్టుకు రెండు శస్త్రచికిత్సలు...మెగా టోర్నీకి ముందు తప్పుకున్న స్పాన్సర్...వింబుల్డన్లో అడుగు పెట్టే సమయానికి మర్కెటా వొండ్రుసోవా పరిస్థితి ఇది. గ్రాస్ కోర్టు గ్రాండ్స్లామ్ ఈవెంట్లో గతంలో నాలుగు ప్రయత్నాల్లో రెండో రౌండ్ కూడా దాటలేకపోయింది... గత ఏడాది గాయంతో దూరమైన ఆమె ఈ సారీ మొదటి రౌండ్ దాటితే చాలనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగింది.. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఆమె అద్భుతం చేసింది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సంచలన విజయంతో చాంపియన్గా నిలిచింది. మహిళల విభాగం ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలుచుకున్న తొలి అన్సీడెడ్గా వొండ్రుసోవా నిలిచింది. మరో వైపు వింబుల్డన్లో వరుసగా రెండో ఏడాది రన్నరప్గానే పరిమితమై అన్స్ జబర్ కన్నీళ్లపర్యంతమైంది. లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్లో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 24 ఏళ్ల మర్కెటా వొండ్రుసోవా చాంపియన్గా ‘వీనస్ రోజ్వాటర్ డిష్’ను సగర్వంగా అందుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4 స్కోరుతో ఆరో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రుసోవా జోరు ముందు 6వ ర్యాంకర్ జబర్ నిలవలేకపోయింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన వొండ్రుసోవాకు ఇది మొదటి గ్రాండ్స్లామ్ టైటిల్ కాగా... గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్లలో ఓడిన జబర్ మూడో ప్రయత్నంలోనూ గ్రాండ్స్లామ్ విజేతగా నిలవలేకపోయింది. టైటిల్ సాధించిన వొండ్రుసోవాకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జబర్కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. నలుగురు గ్రాండ్స్లామ్ విజేతలు, వారిలో ముగ్గురు ప్రస్తుత టాప్–10 ప్లేయర్లను ఓడించి ఫైనల్ చేరిన జబర్పైనే అందరి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా శుభారంభం చేస్తూ తొలి సెట్లో ఆమె 2–0తో ముందంజ వేసింది. అయితే కోలుకున్న వొండ్రుసోవా 2–2తో స్కోరు సమం చేసింది. చక్కటి ఫోర్హ్యాండ్లలో మళ్లీ చెలరేగిన జబర్ ముందంజ వేస్తూ 4–2తో మళ్లీ ఆధిక్యం కనబర్చింది. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది. వరుస తప్పులతో జబర్ ఒత్తిడిలో పడిపోగా, దూకుడుగా ఆడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వరుసగా నాలుగు గేమ్లు గెలిచి 6–4తో తొలి సెట్ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో దాదాపు ఇదే ప్రదర్శన పునరావృతమైంది. అభిమానులు తనకు మద్దతు పలుకుతుండగా జబర్ 3–1తో దూసుకుపోయింది. అయితే బేస్లైన్ గేమ్తో ప్రశాంతంగా ఆడిన వొండ్రుసోవా 3–3కు, ఆపై 4–4కు స్కోరును చేర్చింది. తొమ్మిదో గేమ్లో పదే పదే నెట్పై ఆడి పాయింట్లు కోల్పోయిన జబర్ 4–5తో వెనుకబడింది. చివరి గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకోవడంలో వొండ్రుసోవా సఫలమై ఆనందంలో కోర్టుపై కుప్పకూలిపోయింది. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన జబర్ చేజేతులా తన ఓటమిని ఆహ్వానించింది. -
సింధు శుభారంభం
జకార్తా: థాయ్లాండ్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ టోర్నీలలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... ప్రతిషాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో మాత్రం తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. ఇండోనేసియా క్రీడాకారిణి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్జుంగ్పై సింధు వరుస గేముల్లో గెలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 21–19, 21–15తో మరిస్కాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు తొలి గేమ్లో గట్టిపోటీ లభించింది. ఆధిక్యం పలుమార్లు ఇద్దరితో దోబూచులాడింది. అయితే కీలకదశలో సింధు పైచేయి సాధించి తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలోనూ ఇద్దరూ ప్రతి పాయింట్కు హోరాహోరీగా పోరాడారు. సింధు స్కోరు 7–6 వద్ద మూడు పాయింట్లు నెగ్గి 10–6తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయిన సింధు మళ్లీ చెలరేగి ఈసారి వరుసగా ఆరు పాయింట్లు గెలుపొంది 16–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని సింధు విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది మరిస్కా చేతిలో స్పెయిన్ మాస్టర్స్, మలేసియా మాస్టర్స్ టోర్నీలలో ఓడిపోయిన సింధు ఆమెను ఈ సీజన్లో తొలిసారి ఓడించడం గమనార్హం. ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధుకు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. తై జు యింగ్తో ముఖాముఖి రికార్డులో సింధు 5–18తో వెనుకబడి ఉంది. 2019 ప్రపంచ చాంపియన్షిప్లో చివరిసారి తై జు యింగ్ను ఓడించిన సింధు ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్తో ఆడిన ఎనిమిది వరుస మ్యాచ్ల్లో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రణయ్ 50 నిమిషాల్లో 21–16, 21–14తో కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్, అంగుస్ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. సాత్విక్ జోడీ ముందంజ డబుల్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట గాయత్రి–ట్రెసా జాలీ 22–20, 12–21, 16–21తో ప్రపంచ 18వ ర్యాంక్ జోడీ రిన్ ఇవనాగ–కి నకనిషి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. క్రిస్టో పొపోవ్–తోమా పొపోవ్ (ఫ్రాన్స్)లతో జరిగిన మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తొలి గేమ్ను 21–12తో నెగ్గి రెండో గేమ్లో 11–7తో ఆధిక్యంలో ఉన్న దశలో పొపోవ్ బ్రదర్స్ గాయం కారణంగా వైదొలిగారు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్ (భారత్) ద్వయం 21–12, 6–21, 20–22తో ఎనిమిదో సీడ్ ఒన్జ్ యె సిన్–తియో ఈ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Spain Masters 2023 Final: సింధుకు నిరాశ
మాడ్రిడ్: ఈ ఏడాది ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచి తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా తున్జంగ్ (ఇండోనేసియా) కేవలం 29 నిమిషాల్లో 21–8, 21–8తో సింధును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏదశలోనూ మరిస్కాకు పోటీనివ్వలేకపోయింది. విన్నర్ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
WTT Singapore Smash Tourney 2023: ఆకుల శ్రీజకు నిరాశ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్కు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది. బుధవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ రెండో మ్యాచ్లో జాతీయ చాంపియన్ శ్రీజ 12–10, 6–11, 9–11, 3–11తో జూ చెన్హుయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ సూరావజ్జుల 11–4, 7–11, 10–12, 11–6, 11–8తో జేవియర్ డిక్సన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
German Open 2023: మెయిన్ ‘డ్రా’కు తస్నీమ్
ముల్హీమ్: జర్మన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్లో భారత జోడి సుమీత్ రెడ్డి – అశ్విని పొన్నప్ప ఆట ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లోనే సుమీత్ – అశ్విని 10–21, 12–21 తేడాతో స్కాట్లాండ్కు చెందిన ఆడమ్ హాల్ – జూలీ మాక్ఫెర్సన్ చేతిలో పరాజయంపాలయ్యారు. మరో వైపు మహిళల సింగిల్స్లో తస్నీమ్ మీర్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్లో తస్నీమ్ 24–22, 21–8 స్కోరుతో రాచెల్ దరాగ్ (ఐర్లాండ్)ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో మాత్రం శంకర్ ముత్తుసామి మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్లో ముత్తుసామి 21–23, 19–21తో రెస్కీ డ్వికాయో (అజర్బైజాన్) చేతిలో ఓడాడు. -
మాజీ నంబర్ వన్కు షాకిచ్చి రిబాకినా.. సునాయాసంగా సబలెంకా! ఫైనల్లో..
Elena Rybakina Vs Aryna Sabalenka In Final- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. గత ఏడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గి వెలుగులోకి వచ్చిన కజకిస్తాన్ అమ్మాయి ఎలీనా రిబాకినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్ చేరిన సబలెంకా (బెలారస్) మధ్య శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరు జరగనుంది. మాజీ నంబర్ వన్కు షాకిచ్చి గురువారం జరిగిన రెండు సెమీఫైనల్స్లో 22వ సీడ్ రిబాకినా 7–6 (7/4), 6–3తో 2012, 2013 చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించగా... ఐదో సీడ్ సబలెంకా 7–6 (7/1), 6–2తో అన్సీడెడ్ మగ్దా లీనెట్ (పోలాండ్)పై విజయం సాధించింది. కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న సబలెంకాకిది తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్ కానుండగా... రిబాకినా కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ టోర్నీలో తుది పోరుకు చేరింది. ఇక అజరెంకాతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రిబాకినా తొమ్మిది ఏస్లు, 30 విన్నర్స్ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు అజరెంకా మూడు ఏస్లు కొట్టి, ఆరు డబుల్ ఫాల్ట్లు, 27 అనవసర తప్పిదాలు చేసింది. అజరెంకా సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రిబాకినా తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయింది. సబలెంకా ముందు నిలవలేకపోయిన లీనెట్ తన కెరీర్లో 30వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన లీనెట్ కీలకపోరులో సబలెంకాకు సరైన సమాధానమివ్వలేకపోయింది. గంటా 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో లీనెట్ తొలి సెట్లో గట్టిపోటీనిచ్చినా రెండో సెట్లో డీలా పడింది. మ్యాచ్లో సబలెంకా ఆరు ఏస్లు సంధించడంతోపాటు ఏకంగా 33 విన్నర్స్ కొట్టింది. సబలెంకాదే పైచేయి మూడుసార్లు లీనెట్ సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా తన సర్వీస్ను ఒకసారి మాత్రమే చేజార్చుకుంది. గతంలో మూడుసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా నాలుగో ప్రయత్నంలో సఫలమై ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. రిబాకినాతో గతంలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే తన కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో ఖచనోవ్ (రష్యా)తో సిట్సిపాస్ (గ్రీస్)... టామీ పాల్ (అమెరికా)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
పదేళ్ల తర్వాత మళ్లీ సెమీస్లోకి
మెల్బోర్న్: తన పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజరెంకా పదేళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు అర్హత సాధించింది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ప్రపంచ 24వ ర్యాంకర్ అజరెంకా మూడోసారి సెమీఫైనల్కు చేరింది. 2012, 2013లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన అజరెంకా 2013లో ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్ చేరాక మరే గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అజరెంకా 6–4, 6–1తో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై అలవోకగా గెలిచింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో అజరెంకా 17 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–4తో 17వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించి సెమీస్లో అజరెంకాతో పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 18వ సీడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో సిట్సిపాస్ 6–3, 7–6 (7/2), 6–4తో లెహచ్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గగా... ఖచనోవ్ 7–6 (7/5), 6–3, 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సెబాస్టియన్ కోర్డా (అమెరికా) గాయంతో వైదొలిగాడు. ‘మిక్స్డ్’ సెమీస్లో సానియా–బోపన్న జోడీ సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్లో సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. సానియా–బోపన్నలతో ఆడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. -
సైనా నెహ్వాల్ పరాజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆట తొలి పోరులోనే ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21–13, 17–21, 19–21తో వ్యోనె లీ (జర్మనీ) చేతిలో ఓడింది. తొలి గేమ్ను గెలుచుకున్న సైనా, ఆ తర్వాత ప్రత్యర్థి ముందు నిలబడలేకపోయింది. మరో వైపు డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో కామన్వెల్త్ చాంపియన్స్, ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ జోడీ 19–21, 21–9, 21–13తో క్రిస్టో పొపొవ్–తొమా జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్) జంటపై గెలుపొందింది. తొలి గేమ్ను కోల్పోయిన భారత జోడీ తర్వాతి గేమ్లలో పుంజుకొంది. రెండో గేమ్ను చకచకా ముగించగా, నిర్ణాయక గేమ్లోనూ ఇదే ఆటతీరు కొనసాగించడంతో స్థానిక ఆటగాళ్లకు పరాజయం తప్పలేదు. ఒక గంటా 8 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ జోడీ తేలిపోయింది. అయితే మిక్స్డ్, మహిళల డబుల్స్లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. మహిళల డబుల్స్ మ్యాచ్లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట 21–23, 20–22తో ఆరో సీడ్ జాంగకొల్ఫన్ కిటితరకుల్–రవిండ ప్రజొంగ్జయ్ (థాయ్లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో జోడీ 13–21, 16–21తో జపాన్కు చెందిన క్యోహెయ్ యమషిత–నరు షినొయా జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్లోని సూరత్లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్లో రజతం... మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణకే చెందిన స్నేహిత్తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్షిప్లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్ను నిర్వహించారు. -
US Open 2022: అటు అన్స్...ఇటు ఇగా
న్యూయార్క్: ఈ సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్లో మహిళల సింగిల్స్లో కొత్త విజేతను చూడొచ్చు. ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఐదో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా) తొలిసారిగా యూఎస్ ఓపెన్లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్వన్ స్వియాటెక్ 3–6, 6–1, 6–4తో ఆరోసీడ్ అరియానా సబలెంక (బెలారస్)పై గెలుపొందగా, జబర్ 6–1, 6–3తో 17వ సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. శనివారం రాత్రి జరిగే ఫైనల్లో స్వియాటెక్తో జబర్ తలపడుతుంది. స్వియాటెక్కు యూఎస్ ఓపెన్ ఫైనల్ కొత్త కానీ... ఆమె ఖాతాలో రెండు గ్రాండ్స్లామ్ టైటిళ్లున్నాయి. 2020, 2022లలో ఈ పోలండ్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. మరో వైపు జబర్ ఈ సీజన్లో వరుసగా రెండో గ్రాండ్స్లామ్లో ఫైనల్ చేరింది. వింబుల్డన్లో రన్నరప్గా నిలిచిన ట్యునీషియా అమ్మాయి ఈ సారి ‘గ్రాండ్’ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. శ్రమించిన టాప్సీడ్... తొలి సెమీ ఫైనల్లో టాప్సీడ్ స్వియాటెక్కు ప్రత్యర్థి సబలెంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొదటి సెట్లో రెండుసార్లు సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంక అదే ఉత్సాహంతో సుదీర్ఘంగా జరిగిన ఐదో గేమ్ను గెలుచుకుంది. 8, 9 గేమ్లను చకచకా ముగించి తొలిసెట్ను వశం చేసుకుంది. తర్వాత రెండో సెట్లో స్వియాటెక్ పుంజుకోవడంతో సబలెంక చేతులెత్తేసింది. వరుస రెండు గేముల్ని అవలీలగా గెలుచుకున్న స్వియాటెక్కు మూడో గేమ్లో పోటీ ఎదురైంది. ఆ గేమ్ సబలెంక గెలిచినా... తదుపరి మూడు గేముల్లో తన రాకెట్ పదునేంటో చూపించిన స్వియాటెక్ 6–1తో సెట్ నెగ్గింది. నిర్ణాయక మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడిన సబలెంక 2–0తో ముందంజలో నిలిచింది. ఈ దశలో మూడు, నాలుగు గేముల్లో ఏస్లు, విన్నర్లు కొట్టిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ 2–2తో సమం చేసింది. ఆ తర్వాత రెండు గేముల్ని పట్టుదలగా ఆడిన బెలారస్ స్టార్ 4–2తో ఒత్తిడి పెంచింది. ఈ దశలో నంబర్వన్ తన అసలైన ప్రదర్శనతో వరుసగా నాలుగు గేములు గెలిచింది. 2 ఏస్లు సంధించిన స్వియాటెక్ 3 డబుల్ఫాల్ట్లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్లు కొట్టి ఏడుసార్లు డబుల్ఫాల్ట్లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెమీఫైనల్లో ఐదో సీడ్ జబర్ అలవోకగా ప్రత్యర్థి ఆటకట్టించింది. 8 ఏస్లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని జబర్ వరుస సెట్లలో కేవలం 66 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్ను ఏకపక్షంగా 21 విన్నర్లు కొట్టిన జబర్ 15 అనవసర తప్పిదాలు చేయగా, రెండు ఏస్లు సంధించిన గార్సియా, 23 అనవసర తప్పిదాలు చేసింది. -
తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్కు చేరిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్
మహిళల సింగిల్స్ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్ ఫైనల్కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్.. అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 6-3, 7-6 (7/4) తేడాతో విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు చేరింది. ఈ గేమ్ తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వియాటెక్.. రెండో గేమ్లో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో సెట్లో జెస్సికాను నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో స్వియాటెక్ పోరాడాల్సి వచ్చింది. చివరకు స్వియాటెక్.. జెస్సికాపై పైచేయి సాధించి గెలుపొందింది. సెమీస్లో స్వియాటెక్.. అరిన సబలెంకతో పోటీ పడనుంది. మరో సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా).. ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. ప్రపంచ 31వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)- ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో తొలి సెమీస్లో తలపడనున్నాడు. మరో సెమీస్ సమరంలో నంబర్ 3 ర్యాంకర్ కార్లోస్ అల్కరజ్.. ఫ్రాన్సిస్ టియోఫోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. చదవండి: US Open 2022: గార్సియా గర్జన.. సూపర్ ఫామ్ కంటిన్యూ -
ప్రపంచ నంబర్ వన్ షట్లర్గా భారత అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అండర్–19 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో కొత్త నంబర్వన్గా భారత్కు చెందిన అనుపమ ఉపాధ్యాయ అవతరించింది. హరియాణాలోని పంచ్కులాకు చెందిన 17 ఏళ్ల అనుపమ ఈ ఏడాది ఉగాండా, పోలాండ్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజేతగా నిలిచింది. టాప్ ర్యాంక్లో ఉన్న భారత్కే చెందిన తస్నిమ్ మీర్ను రెండో స్థానానికి నెట్టి అనుపమ అగ్రస్థానానికి చేరింది. భారత్కే చెందిన అన్వేష గౌడ ఆరో ర్యాంక్లో, ఉన్నతి హుడా తొమ్మిదో ర్యాంక్లో ఉన్నారు. బెంగళూరులోని ప్రకాశ్ పడుకోన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అనుపమ జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా నిలిచిన ఆరో భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందింది. గతంలో ఆదిత్య జోషి (2014), సిరిల్ వర్మ (2016), లక్ష్య సేన్ (2017), తస్నిమ్ (2022), శంకర్ సుబ్రమణియన్ (2022) ఈ ఘనత సాధించారు. -
Badminton World Championships 2022: సైనా ఓటమి.. టోర్నీ నుంచి అవుట్
Badminton World Championships: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రయాణం ముగిసింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ ఓటమి పాలైంది. థాయ్లాండ్కు చెందిన షట్లర్ బుసానన్ ఒంగ్బామ్రంగ్ఫాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నాలుగు నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్లో బుసానన్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. దీంతో మొదటి గేమ్ను సైనా 17-21తో కోల్పోయింది. అయితే, రెండో గేమ్లో పుంజుకున్న ఈ లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత 21-16తో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో మూడో గేమ్లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్లో అడుగుపెట్టింది. మరోవైపు.. సైనా ఇంటిబాట పట్టింది. ఇక అంతకుముందు మ్యాచ్లో సైనా.. హాంకాంగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చెయుంగ్ న్గన్ యిను 21-19, 21-9తో ఓడించి ప్రిక్వార్టర్స్ వరకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. పురుషుల డబుల్స్లో అన్సీడెడ్ భారత ప్లేయర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ తొలిసారిగా క్వార్టర్స్కు చేరుకున్నారు. అదే విధంగా చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. NZ vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన కివీస్! స్టార్ బౌలర్ వచ్చేశాడు! Despite her best efforts @NSaina falls short against WR-12 🇹🇭's Busanan Ongbamrungphan and ends her #BWFWorldChampionships2022 campaign in R16 💔 Well fought champ 🙌#BWFWorldChampionships#BWC2022#Tokyo2022#Badminton pic.twitter.com/gr04fcsgrQ — BAI Media (@BAI_Media) August 25, 2022 -
Cincinnati Open 2022: తొలి రౌండ్లోనే సెరెనాకు చుక్కెదురు
సిన్సినాటి: తన టెన్నిస్ కెరీర్ చరమాంకంలో ఉందని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ తన ఆటతీరుతో నిరూపించింది. ఇటీవల టొరంటో ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన 40 ఏళ్ల సెరెనా తాజాగా సిన్సినాటి ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 4–6, 0–6తో బ్రిటన్ టీనేజర్, గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను చేతిలో పరాజయం పాలైంది. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతానని ఇటీవల సెరెనా ఒక మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 1995లో ప్రొఫెషనల్గా మారిన సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. 19 ఏళ్ల రాడుకానుతో జరిగిన మ్యాచ్లో సెరెనా రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. సెరెనాపై ఒక సెట్ను 6–0తో గెలిచిన పదో ప్లేయర్గా రాడుకాను ఘనత వహించింది. 2017లో జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో చివరిసారి సెరెనా ఒక సెట్ను 0–6తో కోల్పోయింది. సిమోనా హలెప్ (రొమేనియా), అనాబెల్ మెదీనా గారిగెస్ (స్పెయిన్), వీనస్ విలియమ్స్ (అమెరికా), ప్యాటీ ష్నిదెర్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్ (బెల్జియం), జెలెనా జంకోవిచ్ (సెర్బియా), మేరీజో ఫెర్నాండెజ్ (అమెరికా), అలెక్సియా డెషామ్ బాలెరెట్ (ఫ్రాన్స్) కూడా సెరెనాపై ఒక సెట్ను 6–0తో గెలిచారు. -
Wimbledon 2022: నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
ఈసారి వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్లో కొత్త చాంపియన్ అవతరించనుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) నేడు జరిగే ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడనున్నారు. వీరిద్దరికిదే తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
Wimbledon 2022 Final: జబర్, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే!
Wimbledon 2022 Women's Singles Final- లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్లో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో అన్స్ జబర్ (ట్యునీషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) తలపడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర సృష్టిస్తారు. జబర్ గెలిస్తే ఆఫ్రికా ఖండంనుంచి గ్రాండ్స్లామ్ సాధించిన తొలి మహిళ అయ్యే అవకాశం ఉండగా...రిబాకినా విజేతగా నిలిస్తే కజకిస్తాన్ తరఫున గ్రాండ్స్లామ్ గెలిచిన తొలి మహిళగా నిలుస్తుంది. గురువారం జరిగిన తొలి సెమీస్లో మూడో సీడ్ జబర్ 6–2, 3–6, 6–1తో తత్యానా మారియా (జర్మనీ)పై విజయం సాధించింది. దూకుడుగా ఆడిన జబర్ తొలి సెట్ను అలవోకగా గెలుచుకుంది. అయితే రెండో సెట్లో 17 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన ఆమె సెట్ను కోల్పోయింది. నిర్ణాయక సెట్లో మాత్రం మారియాపై జబర్ పూర్తిగా పైచేయి సాధించింది. మాజీ చాంపియన్కు ఓటమి... మరో సెమీస్లో 23 ఏళ్ల కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా సత్తా చాటింది. 23 ఏళ్ల రిబాకినా తన రెండో వింబుల్డన్లోనే ఫైనల్ చేరింది. 76 నిమిషాల సాగిన సెమీస్లో రిబాకినా 6–3, 6–3తో 2019 వింబుల్డన్ విజేత సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. మాస్కోలో పుట్టి 2018 వరకు రష్యాకు ప్రాతినిధ్యం వహించిన రిబాకినా రష్యా ఆటగాళ్లపై వింబుల్డన్లో నిషేధం ఉన్న సమయంలో ఫైనల్కు చేరడం విశేషం. Rybakina roars onto the biggest stage The 23-year-old defeats Simona Halep 6-3, 6-3 to reach her first Grand Slam final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/u0jfhZlDEA — Wimbledon (@Wimbledon) July 7, 2022 "It's time to enjoy and really have fun on court" Elena Rybakina is excited to face @Ons_Jabeur in a Wimbledon final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/J0o9RlShFJ — Wimbledon (@Wimbledon) July 7, 2022 "I have no idea, I'm The Minister of Happiness" 😀 A very diplomatic answer from our first-time Wimbledon finalist, @Ons_Jabeur pic.twitter.com/ZPGFTE8WIY — Wimbledon (@Wimbledon) July 7, 2022 -
Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–13, 17–21, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ గెలుపుతో ఇటీవల ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీలో హి బింగ్ జియావో చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్ 21–16, 17–21, 14–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గతవారం మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలోనూ సైనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ ముందంజ పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో సాయిప్రణీత్ 21–8, 21–9తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై, కశ్యప్ 16–21, 21–16, 21–16తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–19, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. సమీర్ వర్మ 21–10, 12–21, 14–21తో నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 19–21, 21–18, 16–21తో ఫాబ్రియానా కుసుమ– అమాలియా ప్రాతవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Wimbledon 2022: 35వ ప్రయత్నంలో క్వార్టర్స్కు
లండన్: 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి తాత్యానా మరియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 34 ఏళ్ల తాత్యానా మరియా 5–7, 7–5, 7–5తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో మరియా తొలి సెట్ను కోల్పోయి రెండో సెట్లో 4–5 స్కోరు వద్ద తన సర్వీస్లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్లు సంధించిన మరియా తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. 2007 నుంచి ఇప్పటిదాకా 34 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో పోటీపడిన మరియా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో జూల్ నిమియర్ (జర్మనీ) 6–2, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై, మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలుపొంది తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. నాదల్ పదోసారి... పురుషుల సింగిల్స్లో రెండుసార్లు చాంపియన్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ పదోసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–2, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచాడు. ఐదో సీడ్ అల్కరాజ్ ఓటమి మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 1–6, 4–6, 7–6 (10/8), 3–6తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 6–4, 7–5, 6–4తో టామీ పాల్ (అమెరికా)పై గెలుపొందాడు. -
Wimbledon 2022: కార్నెట్ సంచలనం
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్లో ఫ్రాన్స్ అన్సీడెడ్ ప్లేయర్ అలైజ్ కార్నెట్ మహిళల సింగిల్స్లో పెను సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను మూడో రౌండ్లోనే కంగు తినిపించింది. వరుసగా 37 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని టాప్సీడ్, టోర్నీ హాట్ ఫేవరెట్ జైత్రయాత్రకు ప్రపంచ 37వ ర్యాంకర్ కార్నెట్ బ్రేకులేసింది. శనివారం జరిగిన పోరులో ఆమె 6–4, 6–2తో అలవోక విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2005 నుంచి గ్రాండ్స్లామ్ కెరీర్ను కొనసాగిస్తున్న ఫ్రాన్స్ వెటరన్ స్టార్ 2014లో కూడా ఇలాదే సెరెనా విలియమ్స్కు షాక్ ఇచ్చింది. అప్పటికే 17 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన టాప్సీడ్ సెరెనాను కార్నెట్ మూడో రౌండ్లో ఓడించింది. తాజా సంచలనంపై ఆమె మాట్లాడుతూ సెరెనా మ్యాచే గుర్తుకొచ్చిందని పేర్కొంది. మిగతా మ్యాచ్ల్లో 2018 వింబుల్డన్ చాంపియన్, 15వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 5–7తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓడగా, నాలుగో సీడ్ బడొసా (స్పెయిన్) 7–5, 7–6 (7/4)తో 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 11వ సీడ్ కొకొ గాఫ్ (అమెరికా)కు 6–7 (4/7), 6–2, 6–1తో 20వ సీడ్ అనిసిమోవా (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. 16వ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–1తో మగ్దలిన ఫ్రెచ్ (పోలండ్)పై నెగ్గింది. సెరెనాకు తొలిరౌండ్లోనే ఇంటిదారి చూపించిన హర్మొని టన్ (ఫ్రాన్స్) 6–1, 6–1తో బౌల్టర్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. -
French Open 2022: తిరుగు లేని స్వియాటెక్
పారిస్: జోరుమీదున్న పోలాండ్ ‘టాప్’స్టార్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లోనూ ఆమె రాకెట్కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆమె జైత్రయాత్రలో వరుసగా 34వ విజయం చేరింది. గురువారం జరిగిన పోరులో స్వియాటెక్ వరుస సెట్లలో 6–2, 6–1తో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. రోలాండ్ గారోస్లో 2020లో టైటిల్ సాధించిన స్వియాటెక్ తాజాగా మరో ట్రోఫీపై కన్నేసింది. రెండో సెమీస్లో అమెరికాకు చెందిన 18వ సీడ్ కోకో గౌఫ్ 6–3, 6–1తో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసాన్ను ఓడించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గౌఫ్తో స్వియాటెక్ తలపడనుంది. ప్రపంచ నంబర్వన్ దెబ్బకు... టాప్ సీడ్ స్వియాటెక్ ధాటికి రష్యన్ ప్రత్యర్థి నిలువలేకపోయింది. తొలిసెట్ ఆరంభంలో 18 నిమిషాలు మాత్రమే 2–2తో దీటు సాగిన మ్యాచ్ క్షణాల వ్యవధిలోనే ఏకపక్షంగా మారింది. వరుసగా రెండు గేముల్ని గెలిచిన స్వియాటెక్కు మూడో గేమ్లో ఆమె సర్వీస్ను బ్రేక్ చేసి కసత్కినా షాకిచ్చింది. నాలుగో గేమ్ను నిలబెట్టుకుంది. తర్వాత ప్రపంచ నంబర్వన్ దూకుడు పెంచింది. ఫోర్హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురులేని ఆధిక్యాన్ని సాధించింది. వరుసగా నాలుగు గేముల్ని నిమిషాల వ్యవధిలోనే ముగించింది. తొలిసెట్ గెలిచేందుకు 38 నిమిషాలు పట్టగా... రెండో సెట్లో స్వియాటెక్ జోరుకు 26 నిమిషాలే సరిపోయాయి. ఇందులో రష్యన్ ప్లేయర్ రెండో గేమ్లో మాత్రమే తన సర్వీస్ను నిలబెట్టుకుంటే... వరుసగా ఐదు గేముల్ని స్వియాటెక్ చకాచకా ముగించింది. 22 విన్నర్లు కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది. 10 విన్నర్స్కే పరిమితమైన కసత్కినా 24 అనవసర తప్పిదాలు చేసింది. తొలిసారి సెమీస్లో సిలిచ్ మారిన్ సిలిచ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 33 ఏళ్ల వయసులో ఎర్రమట్టి నేలలో అతని రాకెట్ గర్జించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ క్రొయేషియా ఆటగాడు ఏకంగా 33 ఏస్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ సమరంలో సిలిచ్ 5–7, 6–3, 6–4, 3–6, 7–6 (10/2)తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. 16 ఏళ్లుగా రోలండ్ గారోస్ బరిలోకి దిగుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా క్వార్టర్స్ (2017, 2018) దశనే దాటలేకపోయాడు. ఎనిమిదేళ్ల క్రితం 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన సిలిచ్ మధ్యలో 2017లో వింబుల్డన్, 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్లలో రన్నరప్గా నిలిచాడు. ఈ రెండు మినహా గ్రాండ్స్లామ్ సహా పలు మేజర్ టోర్నీల్లో సీడెడ్ ప్లేయర్గా దిగి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. పోరాడి ఓడిన బోపన్న జోడీ పురుషుల డబుల్స్లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్ల్లో సూపర్ టైబ్రేకర్లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్దాకా వచ్చింది. అయితే ఇందులో బోపన్న–మిడిల్కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్ పురుషుల డబుల్స్లో టైటిల్పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్లో ఫైనల్ చేరి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. నేడు పురుషుల సెమీ ఫైనల్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) X అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కాస్పర్ రూడ్ (నార్వే) Xమారిన్ సిలిచ్ (క్రొయేషియా) సా. గం. 6.15నుంచి సోనీలో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో 2020 చాంపియన్ స్వియాటెక్ 6–3, 7–5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై గెలిచి ఈ ఏడాది వరుసగా 31వ విజయాన్ని నమోదు చేసింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించారు. 28వ సీడ్ కమిలా జార్జి (ఇటలీ) 4–6, 6–1, 6–0తో సబలెంకాను ఓడించగా... వెరోనికా కుదెర్మెతోవా (రష్యా)తో జరిగిన మ్యాచ్లో బదోసా తొలి సెట్ను 3–6తో కోల్పోయి, రెండో సెట్లో 1–2తో వెనుబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. బదోసా, సబలెంకా ఓటమితో ఈ టోర్నీలో టాప్–10 క్రీడాకారిణుల్లో కేవలం స్వియాటెక్ మాత్రమే బరిలో మిగిలింది. బోపన్న జోడీ సంచలనం పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జంట 6–7 (5/7), 7–6 (7/3), 7–6 (12/10)తో రెండో సీడ్ మాట్ పావిచ్–నికోల్ మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. -
సంచలనాలతో షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. టోర్నీ మొదటి రోజు ఆదివారం మహిళల సింగిల్స్లో 2016 చాంపియన్, పదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిసియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 46వ ర్యాంకర్ కయా కనెపి (ఎస్టోనియా) 2–6, 6–3, 6–4తో పదో ర్యాంకర్ ముగురుజాను ఓడించగా... ప్రపంచ 52వ ర్యాంకర్ మాగ్దా లినెట్ (పోలాండ్) 3–6, 7–6 (7/4), 7–5తో ఆరో ర్యాంకర్ ఆన్స్ జెబర్పై విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకున్నారు. 2011 జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన ఆన్స్ జెబర్ ఇటీవల మాడ్రిడ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించడంతోపాటు ఇటాలియన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. క్లే కోర్టులపై 17 విజయాలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్న జెబర్ను ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్స్లో ఒకరిగా పరిగణించారు. అయితే మాగ్దా లినెట్తో 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జెబర్ 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్లో 2018, 2019 రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమై 194వ ర్యాంక్కు పడిపోయిన థీమ్ 3–6, 2–6, 4–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. -
సింధు... కాంస్యంతో సరి
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–13, 19–21, 16–21తో పోరాడి ఓడింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ను 13 నిమిషాల్లో సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో స్కోరు 19–19తో సమంగా ఉన్న కీలకదశలో సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో అకానె యామగుచి ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అకానె గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో ఓడిన సింధుకు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 43 వేలు) ప్రైజ్మనీ, 8,400 పాయింట్లు లభించాయి. ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత్కు లభించిన పతకాలు. ఈ ఆరూ కాంస్యాలే కావడం గమనార్హం. మీనా షా (1956) ఒకసారి... సైనా నెహ్వాల్ (2010, 2016, 2018) మూడుసార్లు... సింధు (2014, 2022) రెండుసార్లు కాంస్యాలు నెగ్గారు. -
Badminton Asia Championships: పతకానికి విజయం దూరంలో సింధు
మనీలా (ఫిలిప్పీన్స్): ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రెండో పతకం ఖరారు చేసుకోవడానికి భారత స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 100వ ర్యాంకర్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్)తో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–16తో విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 7–9తో వెనుకబడి ఉంది. సైనా, శ్రీకాంత్ పరాజయం భారత మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్లో సైనా 21–12, 7–21, 13–21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 21–17, 17–21తో ప్రపంచ 81వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–15తో అకీరా కోగా –తైచి సైటో (జపాన్) ద్వయంపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 18–21, 18–21తో తాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రిక్వార్టర్స్లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
కార్నెట్ పట్టు వీడని పోరాటం
మెల్బోర్న్: ఏళ్ల తరబడి టెన్నిస్ ఆడుతున్నా అందరి కళ్లలో పడని ఫ్రాన్స్ స్టార్ అలిజె కార్నెట్ ఇప్పుడు ఒక్క ప్రిక్వార్టర్స్ విజయంతో పతాక శీర్షికల్లో నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో 32 ఏళ్ల కార్నెట్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 15 ఏళ్ల ప్రాయంలో 2005 నుంచి గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడుతున్న ఈ ఫ్రాన్స్ స్టార్ గతంలో ఎప్పుడూ ప్రిక్వార్టర్స్ దశనే దాటలేకపోయింది. ఇప్పుడైతే ఏకంగా రెండుసార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్వన్, 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను కంగుతినిపించి మరీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కార్నెట్ 6–4, 3–6, 6–4తో హలెప్పై విజయం సాధించి తన 63వ గ్రాండ్స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. రెండో సీడ్ సబలెంకాకు షాక్ మరో ప్రిక్వార్టర్స్లో కూడా మరో అలుపెరగని క్రీడాకారిణి కయా కనెపి సంచలన విజయంతో క్వార్టర్స్ చేరింది. ఎస్తోనియాకు చెందిన 115వ ర్యాంకర్ కనెపి 5–7, 6–2, 7–6 (10/7)తో బెలారస్ స్టార్, రెండో సీడ్ సబలెంకాపై అద్భుత విజయం సాధించింది. 2007 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న కనెపి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కనెపి 15 ఏళ్ల కెరీర్లో మిగతా మూడు గ్రాండ్స్లామ్ ఈవెంట్లలో క్వార్టర్స్ చేరింది. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఈ ఏడాదే ఆ అవకాశం దక్కించుకుంది. మిగతా ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5–7, 6–3, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై, 27వ సీడ్ కొలిన్స్ (అమెరికా) 4–6, 6–4, 6–4తో 19వ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. చెమటోడ్చిన మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)కు అసాధారణ ప్రతిఘటన ఎదురైంది. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్లో మెద్వెదెవ్ 6–2, 7–6 (7/4), 6–7 (4/7), 7–5తో 70వ ర్యాంకర్ మ్యాక్సిమ్ క్రెస్సీ (అమెరికా)పై గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–4, 4–6, 6–3, 6–4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, 11వ సీడ్ సినెర్ (ఇటలీ) 7–6 (7/3), 6–3, 6–4తో డి మినార్ (ఆస్ట్రేలియా)పై, తొమ్మిదో సీడ్ అలియాసిమ్ (కెనడా) 2–6, 7–6 (9/7), 6–2, 7–6 (7/4)తో సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. -
సింధుకు నిరాశ
బాలి (ఇండోనేసియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇండో నేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో ప్రపంచ చాంపియన్ సింధు కథ సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 26 ఏళ్ల సింధు 21–15, 9–21, 14–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ను దక్కించుకున్నా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు. వరుసగా పదోసారి... మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట కూడా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ప్రపంచ నంబర్వన్ జోడీ మార్కస్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ 16–21, 18–21తో ఓటమి పాలైంది. గిడియోన్–కెవిన్ ద్వయం చేతిలో సాత్విక్–చిరాగ్లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం. -
సెమీస్లో సింధు
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 66 నిమిషాల్లో 14–21, 21–19, 21–14తో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో రచనోక్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 12–21, 8–21తో అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–19, 21–19తో గో జె ఫె–నూరూజుద్దీన్ (మలేసియా) జంటపై నెగ్గి సెమీఫైనల్కు చేరింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి సిక్కి–అశ్విని జంట అర్హత బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్కు భారత మహిళల డబుల్స్ జంట సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో బరిలోకి దిగనున్న తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా సిక్కి–అశ్విని గుర్తింపు పొందింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బాలిలో జరిగే ఈ టోర్నీకి మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైంది. -
సెమీస్లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–14తో బుసానన్ ఒంగ్బామ్రంగ్ఫన్ (థాయ్లాండ్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో సయాకా తకహాషి (జపాన్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 17–21, 15–21తో హెయో క్వాంగ్గీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–18, 18–21, 17–21తో ఆరోన్ చియా–సో వుయ్ యికి (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–9తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి గేమ్లో 0–5తో వెనుకబడిన సింధు అనంతరం తేరుకొని ఆ గేమ్ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గేమ్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్ (భారత్) 21–17, 21–13తో లో కీన్ య్యూ (సింగపూర్)పై నెగ్గాడు. హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్ నుంచి సమీర్ వర్మ (భారత్) గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప–సాత్విక సాయిరాజ్ 21–15, 17–21, 19–21తో రెండో సీడ్ మెలాటి ఒక్తవియాంటి–ప్రవీణ్ జొర్డాన్ (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
సింధు శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేయగా... మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. పురుషుల సింగిల్స్లో సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్, ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 21–18తో జూలీ దవాల్ జాకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. సయాకా తకహాషి (జపాన్)తో మ్యాచ్లో సైనా తొలి గేమ్ను 11–21తో కోల్పోయి రెండో గేమ్లో 2–9తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 22–20, 19–21తో పోరాడి ఓడిపోయాడు. మొమోటో చేతిలో శ్రీకాంత్కిది 14వ పరాజయం కావడం గమనార్హం. ఇతర మ్యాచ్ల్లో కశ్యప్ 17–21, 21–17, 11–21తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో... ప్రణయ్ 11–21, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్ 21–10, 21–16తో ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై, సౌరభ్ వర్మ 22–20, 21–19తో వైగోర్ కొహెలో (బ్రెజిల్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–19, 21–15తో మథియాస్ థైరి–మై సురో (డెన్మార్క్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో టాప్ సీడ్ లీ సోహీ–షిన్ సెయుంగ్చన్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 21–17, 21–13తో లీ హుయ్–యాంగ్ సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధుకు చుక్కెదురు
ఒడెన్స్: టోక్యో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 36 నిమిషాల్లో 11–21, 12–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది. ఆన్ సెయంగ్తో పోరులో సింధు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలుత సింధు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఆన్ సెయంగ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఆన్ సెయంగ్ వెనుదిరిగి చూడలేదు. ఇక రెండో గేమ్లోనూ ఆన్ సెయంగ్ జోరు కొనసాగింది. ఈ గేమ్లో ఒక్కసారి కూడా ఇద్దరు స్కోర్లు సమం కాకపోవడం ఆన్ సెయంగ్ ఆధిపత్యానికి నిదర్శనం. మరోవైపు టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ తొలి గేమ్ను 17–21తో చేజార్చుకున్నాక గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 12–21, 21–15తో బుసానన్ ఒంగ్బమృంగ్ఫాన్ (థాయ్లాండ్)పై పోరాడి గెలిచింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను సింధు సులభంగా చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్లో పుంజుకున్న బుసానన్ వరుసగా పాయింట్లను సాధిస్తూ సింధుపై ఆధిపత్యం ప్రదర్శించింది. దాంతో మ్యాచ్ మూడో గేమ్కు దారి తీసింది. ఇక్కడ లయను అందుకున్న సింధు గేమ్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్లకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21–23, 9–21తో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో, లక్ష్యసేన్ 15–21, 7–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 15–21, 15–21తో గో జె ఫీ–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంట చేతిలో ఓడగా... మరో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల 15–21, 21–17, 12–21తో ఫజార్ అల్ఫియాన్– మొహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత ద్వయం ధ్రువ కపిల–సిక్కి రెడ్డి 17–21, 21–19, 11–21తో తాంగ్ చున్మన్– త్సెయింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
సూపర్ లేలా... వరుసగా మూడో సంచలన విజయం
యూఎస్ ఓపెన్లో కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మహిళల సింగిల్స్లో 19 ఏళ్ల లేలా వరుసగా మూడో సంచలన విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), క్వాలిఫయర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) కూడా యూఎస్ ఓపెన్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. న్యూయార్క్: అనామక క్రీడాకారిణిగా యూఎస్ ఓపెన్లో అడుగుపెట్టిన కెనడా టీనేజర్ లేలా ఫెర్నాండెజ్ అద్భుత విజయాలతో వారం రోజుల్లోనే అందరూ తనవైపు దృష్టి సారించేలా చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 73వ ర్యాంకర్ లేలా 2 గంటల 24 నిమిషాల్లో 6–3, 3–6, 7–6 (7/5)తో ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకుంది. స్వితోలినాతో జరిగిన మ్యాచ్లో లేలా కీలక సందర్భాల్లో సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించింది. మ్యాచ్ మొత్తంలో ఒకే ఏస్ సంధించిన లేలా నెట్ వద్దకు 24 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలవడం విశేషం. క్రిచికోవా ఓటమి ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... క్వాలిఫయర్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–3, 6–4తో 11వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరిన తొలి క్వాలిఫయర్గా రాడుకాను చరిత్ర సృష్టించింది. ఫిలిక్స్ తొలిసారి... పురుషుల సింగిల్స్లో 12వ సీడ్ ఫిలిక్స్ ఉజెర్ అలియాసిమ్ తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోరీ్నలో సెమీఫైనల్కు చేరాడు. తద్వారా యూఎస్ ఓపెన్ టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్కు చేరిన తొలి కెనడా ప్లేయర్గా ఘనత వహించాడు. స్పెయిన్ టీనేజ్ సంచలనం కార్లోస్ అల్కారజ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల ఫిలిక్స్ తొలి సెట్ను 6–3తో సొంతం చేసుకొని, రెండో సెట్లో 3–1తో ఆధిక్యం సాధించాడు. ఈ దశలో అల్కారజ్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
బియాంక ఓటమి... మాజీ విజేతలెవరూ ఇక మిగల్లేదు!
న్యూయార్క్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. 2019 చాంపియన్ బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగడంతో మాజీ విజేతలెవరూ బరిలోకి మిగల్లేదు. 3 గంటల 29 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 17వ సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–7 (2/7), 7–6 (8/6), 6–3తో ఆరో సీడ్ బియాంకాపై విజయం సాధించింది. రెండో సెట్ టైబ్రేక్లో సాకరి మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. మరోవైపు సంచలనాలతో దూసుకొచ్చిన క్వాలిఫయర్, 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను (బ్రిటన్) తన దూకుడు కొనసాగిస్తూ క్వార్టర్స్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రాడుకాను 6–2, 6–1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)ను 56 నిమిషాల్లో చిత్తు చేసింది. మూడో రౌండ్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్వన్ యాష్లే బార్టీని ఓడించిన షెల్బీ ఈ మ్యాచ్లో బ్రిటన్ టీనేజర్ ధాటికి ఎదురునిలువలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో 11వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) 7–6 (14/12), 6–3తో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను, నాలుగో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–4తో 14వ సీడ్ పావ్లుచెంకోవా (రష్యా)ను ఓడించారు. క్వార్టర్ ఫైనల్స్లో టోక్యో ఒలింపిక్ చాంపియన్ బెన్చిచ్తో రాడుకాను; ప్లిస్కోవాతో సాకరి; స్వితోలినా (ఉక్రెయిన్)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా); సబలెంకా (బెలారస్) తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తలపడతారు. చదవండి: Us Open 2021: క్వార్టర్ ఫైనల్లోకి వరల్డ్ నంబర్వన్ జొకోవిచ్ -
బార్టీకి షెల్బీ షాక్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సొంత ప్రేక్షకుల నడుమ అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ అద్భుత ఆటతీరుతో యాష్లే బార్టీని బోల్తా కొట్టించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 43వ ర్యాం కర్ షెల్బీ రోజర్స్ 6–2, 1–6, 7–6 (7/5)తో యాష్లే బార్టీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిచింది. నిర్ణాయక మూడో సెట్లో షెల్బీ 2–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఎనిమిదో గేమ్లో బార్టీ తన సర్వీస్ను నిలబెట్టుకొని ఉంటే విజయాన్ని దక్కించుకునేది. కానీ షెల్బీ ధాటికి బార్టీ తొలుత ఎనిమిదో గేమ్లో, ఆ తర్వాత పదో గేమ్లో తన సరీ్వస్లను కోల్పోయింది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన షెల్బీ స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సరీ్వస్లను కాపాడుకోవడంతో చివరి సెట్ టైబ్రేక్కు దారి తీసింది. టైబ్రేక్లో 4–5తో వెనుకబడిన షెల్బీ వరుసగా మూడు పాయింట్లు గెలిచి బార్టీ కథ ముగించింది. ఎనిమిది డబుల్ ఫాల్ట్లు, 39 అనవసర తప్పిదాలు చేసిన బార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 12వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితం నమోదైంది. ఏడో సీడ్ షపోవలోవ్ (కెనడా) ఓటమి చవిచూడగా... టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. లాయిడ్ హ్యారిస్ (దక్షిణాఫ్రికా) 6–4, 6–4, 6–4తో షపోవలోవ్ను ఓడించగా... టాప్ సీడ్ జొకోవిచ్ 6–7 (4/7), 6–3, 6–3, 6–2తో నిషికోరి (జపాన్)పై, జ్వెరెవ్ 3–6, 6–2, 6–3, 6–1తో జాక్ సోక్ (అమెరికా)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జోడీ 6–3, 4–6, 6–4తో హుగో నిస్ (మొనాకో) –రిండెర్క్నిచ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. -
Paralympics 2021: చరిత్రకు చేరువలో...
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటివరకు భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా) వ్యక్తిగత విభాగాలలో స్వర్ణ పతకాలు గెలిచారు. విశ్వ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించేందుకు టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్కు స్వర్ణావకాశం దక్కింది. టోక్యో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్లాస్–4 మహిళల సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ ఫైనల్కు అర్హత సాధించింది. చైనా ప్లేయర్ యింగ్ జౌతో నేడు జరిగే తుది పోరులో భవీనా గెలిస్తే బంగారు పతకంతో కొత్త చరిత్ర లిఖిస్తుంది. టోక్యో: ఏమాత్రం అంచనాలు లేకుండా టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగిన భారత మహిళా టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ పసిడి కాంతులు విరజిమ్మేందుకు విజయం దూరంలో నిలిచింది. తొలిసారి విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న 34 ఏళ్ల ఈ గుజరాతీ మహిళ తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను బోల్తా కొట్టిస్తూ ఏకంగా పసిడి పతకం పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన క్లాస్–4 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భవీనా 7–11, 11–7, 11–4, 9–11, 11–8 తో 2012 లండన్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, 2014 ప్రపంచ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ మియావో జాంగ్ (చైనా)పై నెగ్గింది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే ఫైనల్లో చైనాకే చెందిన వరల్డ్ నంబర్వన్ యింగ్ జౌతో భవీనాబెన్ తలపడుతుంది. తుది పోరులో గెలిస్తే భవీనాబెన్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. రెండో సెమీఫైనల్లో యింగ్ జౌ 11–4, 11–3, 11–6తో జియోడాన్ జు (చైనా)పై గెలిచింది. చదవండి: వెర్స్టాపెన్ ‘పోల్’ సిక్సర్ లెక్క సరిచేసింది... గతంలో మియావో జాంగ్తో ఆడిన 11 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన భవీనాబెన్ ఈసారి మాత్రం అదరగొట్టింది. తొలి గేమ్ను కోల్పోయినా నిరాశ చెందకుండా ఆడిన భవీనా రెండో గేమ్ను, మూడో గేమ్ను సొంతం చేసుకొని 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్లో మియావో గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో గేమ్లో భవీనాబెన్ ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆడింది. 9–5తో ఆధిక్యంలోకి వచ్చి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే మియావో వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో ఆధిక్యాన్ని ఒక పాయింట్కు తగ్గించింది. అయితే కీలకదశలో భవీనాబెన్ నిగ్రహం కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చదవండి: మూడో టెస్టులో భారత్కు పరాభవం రాకేశ్ ముందంజ... మరోవైపు పురుషుల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. రాకేశ్ కుమార్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... శ్యామ్ సుందర్ స్వామి రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్లో ఆడిన రాకేశ్ కుమార్ 144–131తో కా చుయెన్ ఎన్గాయ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో శ్యామ్ 139–142తో మ్యాట్ స్టుట్జ్మన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రంజీత్ విఫలం... పురుషుల అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఎఫ్–57 కేటగిరీ లో భారత ప్లేయర్ రంజీత్ భాటి నిరాశపరిచాడు. రంజీత్ తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా సఫలం కాలేకపోయాడు. రంజీత్ ఆరు త్రోలూ ఫౌల్ కావడంతో ఫైనల్లో పాల్గొన్న 12 మందిలో అతను చివరి స్థానంలో నిలిచాడు. పతకం గురించి ఆలోచించకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతోనే నేను టోక్యో పారాలింపిక్స్ బరిలోకి దిగాను. వందశాతం శ్రమిస్తే తప్పకుండా పతకం వస్తుందని భావించాను. ఇదే ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోనూ పోరాడితే స్వర్ణం గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను. పోలియో కారణంగా నా కాళ్లు అచేతనంగా మారిపోయినా ఏనాడూ నేను దివ్యాంగురాలిననే ఆలోచన మనసులోకి రానీయలేదు. చైనా క్రీడాకారిణులను ఓడించడం అంత సులువు కాదని చెబుతుంటారు. కానీ పట్టుదలతో పోరాడితే ఎంతటి మేటి క్రీడాకారిణులనైనా ఓడించగలమని నిరూపించాను. –భవీనా పారాలింపిక్స్లో నేటి భారత షెడ్యూల్ మహిళల ఆర్చరీ కాంపౌండ్ ఎలిమినేషన్ రౌండ్: జ్యోతి X కెరీ (ఐర్లాండ్); ఉ. గం. 6:55 నుంచి మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్–4 సింగిల్స్ ఫైనల్: భవీనా X యింగ్ జౌ (చైనా); ఉ. గం. 7:15 నుంచి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ X థాయ్లాండ్; ఉదయం గం. 9 నుంచి అథ్లెటిక్స్ పురుషుల డిస్కస్ త్రో ఎఫ్–52 ఫైనల్: వినోద్ కుమార్; మధ్యాహ్నం గం. 3:54 నుంచి. అథ్లెటిక్స్ పురుషుల హైజంప్ ఎఫ్–47 ఫైనల్: నిశాద్, రామ్పాల్; మధ్యాహ్నం గం. 3:58 నుంచి. దూరదర్శన్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
PV Sindhu: స్వర్ణ, రజతాలకు సింధు దూరం
రియో ఒలింపిక్స్లో రజతం నుంచి టోక్యోలో స్వర్ణానికి... ఇదే లక్ష్యంతో ఒలింపిక్స్కు సిద్ధమైన ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు దురదృష్టవశాత్తూ ఆ అవకాశం దూరమైంది. తొలి నాలుగు మ్యాచ్లలో తిరుగులేని ఆటతో ఆశలు రేపిన సింధు జోరును వరల్డ్ నంబర్వన్ తై జు యింగ్ అడ్డుకుంది. మొదటి గేమ్ హోరాహోరీగా జరిగినా, రెండో గేమ్లో పూర్తిగా చైనీస్ తైపీ అమ్మాయి దూకుడు సాగింది. ఆమె ముందు నిలవలేకపోయిన భారత షట్లర్కు నిరాశ తప్పలేదు. అయితే మరో ఘనతను అందుకునేందుకు కాంస్యం రూపంలో సింధుకు అవకాశం ఉంది. నేడు మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్లో గెలిస్తే రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండో భారత ప్లేయర్గా, తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు నిలుస్తుంది. టోక్యో: ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్రీడాకారిణులు (బాంగ్ సూ హ్యూన్–కొరియా, జాంగ్ నింగ్–చైనా)లకు మాత్రమే రెండుసార్లు ఫైనల్ చేరిన ఘనత ఉంది. శనివారం తర్వాత పీవీ సింధు పేరు కూడా ఆ జాబితాలో చేరేది. కానీ ఆమె చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమితో అది సాధ్యం కాలేదు. సెమీఫైనల్లో తై జు 21–18, 21–12 తేడాతో సింధుపై విజయం సాధించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తెలుగమ్మాయి ప్రయత్నం గెలిచేందుకు సరిపోలేదు. ఓవరాల్గా వీరిద్దరు తలపడిన 19 మ్యాచ్లలో తై జు చేతిలో సింధుకు ఇది 14వ పరాజయం. ఈ ఓటమితో ఒలింపిక్స్లో తొలిసారి స్వర్ణం సాధించే అవకాశం కానీ, 2016 ‘రియో’లో సాధించిన రజత పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం గానీ సింధుకు లేకపోయింది. అయితే మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకునేందుకు ఆమె ప్రయత్నించనుంది. నేడు జరిగే ఈ మ్యాచ్లో హి బింగ్ జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) 21–16, 13–21, 21–12తో తన దేశానికే చెందిన హి బింగ్ జియావోపై గెలుపొందింది. సింధు, బింగ్ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్లు జరగ్గా... సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గారు. హోరాహోరీ నుంచి ఏకపక్షంగా... ఈ మ్యాచ్కు ముందు ఒక్క గేమ్ కూడా కోల్పోని సింధు సెమీస్లోనూ అదే ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టింది. సుదీర్ఘ ర్యాలీలతో గేమ్ మొదలైనా... కొన్ని చక్కటి స్మాష్లు కొట్టడంతో పాటు ప్రత్యర్థి సొంత తప్పిదాలను అవకాశంగా మలచుకున్న సింధు 7–3తో ఆపై 8–4తో ముందంజ వేసింది. విరామ సమయానికి 11–8తో ఆమె ఆధిక్యంలో నిలిచింది. అయితే ఒక్కసారిగా కోలుకున్న తై జు మూడు పాయింట్లు సాధించి 11–11తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ నువ్వా, నేనా అంటూ ప్రతీ పాయింట్ కోసం పోరాడటంతో స్కోరు 18–18కి చేరింది. క్వార్టర్స్లో యామగూచితో జరిగిన మ్యాచ్ రెండో గేమ్లో 18–20తో వెనుకబడి ఉన్న దశలో సింధు వరుసగా నాలుగు అద్భుత పాయింట్లు సాధించి మ్యాచ్ను గెలుచుకుంది. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. దాదాపు ఇదే స్థితిలో ఒక్కసారిగా చెలరేగిన తై వరుస పాయింట్లతో గేమ్ను గెలుచుకుంది. రెండో గేమ్ను తై జు శాసించింది. ఉత్సాహం పెరిగిన ఆమె సింధు డిఫెన్స్ లోపాలను సమర్థంగా వాడుకుంది. భారత ప్లేయర్ క్రాస్ కోర్ట్ స్మాష్లు గానీ రిటర్న్లు గానీ పని చేయలేదు. సగం గేమ్ ముగిసేసరికి 11–7తో ముందంజలో ఉన్న తై జు... ఆ తర్వాత మరింత వేగంగా దూసుకుపోయింది. తైపీ ప్లేయర్ జోరుకు సింధు వద్ద సమాధానం లేకపోయింది. మహిళల సింగిల్స్లో సుదీర్ఘ కాలం వరల్డ్ నంబర్వన్గా ఉన్న రికార్డుతో పాటు అత్యధికంగా 11 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్స్ తన పేరిటే ఉన్నా... తై జు ఇప్పటి వరకు ఒలింపిక్స్లో గానీ, వరల్డ్ చాంపియన్షిప్లోగానీ విజేతగా నిలవలేదు. తొలి ఒలింపిక్ పతకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఇప్పుడు ఆమె ముందు నిలిచింది. చాలా బాధగా ఉంది. ఇది సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి ఫలితం ఇంకా ఎక్కువ బాధిస్తోంది. అయితే నేను చివరి వరకు పోరాడుతూ శాయశక్తులా ప్రయత్నించాను. ఈ రోజు నాది కాదు. రెండో గేమ్లో నేను చాలా వెనుకబడ్డా పోరాడాను. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఆట మనకు అనుకూలంగా మారిపోవచ్చు. ఒలింపిక్స్ అంటే ఆఖరి పాయింట్ వరకు పోరాడాల్సిందే. నేను అదే పని చేశాను. ఆమె బలాలు ఏమిటో నాకు తెలుసు కాబట్టి సన్నద్ధమయ్యే వచ్చాను. అయితే సెమీఫైనల్ హోరాహోరీగా సాగడం సహజం. సులువైన పాయింట్లనేవి లభించవు. ఏం చేసినా నాకు గెలుపు దక్కలేదు. ఈ ఓటమి కొంత సమయం బాధిస్తూనే ఉంటుంది. కాస్త ప్రశాంతంగా కూర్చొని కాంస్య పతక మ్యాచ్ కోసం వ్యూహం రూపొందించుకుంటా. అంతా ముగిసిపోలేదు. నాకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. –పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో సింధు ఆట కొంత లయ తప్పినా ఆ వెంటనే కోలుకొని మళ్లీ బాగా ఆడగలిగింది. కానీ ఈ మ్యాచ్లో అది సాధ్యం కాలేదు. ఒక్కసారి వెనుకబడిన తర్వాత మళ్లీ లయ అందిపుచ్చుకోకపోతే ఇలాంటి కీలక మ్యాచ్లలో గెలవడం కష్టం. సింధుకు తై జు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ప్రతీ డ్రాప్ షాట్ తైపీ అమ్మాయికి పాయింట్లు అందించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడితే అలాంటి ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోవచ్చు కానీ అదీ జరగలేదు. మూడో స్థానం కోసం మ్యాచ్ ఆడాల్సి రావడం ఏ ప్లేయర్కైనా బాధ కలిగిస్తుంది. అయితే సింధు సెమీస్ ఫలితం గురించి ఆలోచించకుండా తాజాగా బరిలోకి దిగితే మంచిది. –పీవీ రమణ, సింధు తండ్రి -
టీటీ మూడో రౌండ్లో మనిక
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో మనిక బత్రా మూడో రౌండ్కు చేరగా.. పురుషుల ఈవెంట్ నుంచి సత్యన్ నిష్క్రమించాడు. రెండో రౌండ్లో 62వ ర్యాంకర్ మనిక 4–11, 4–11, 11–7, 12–10, 8–11, 11–5, 11–7తో 32వ ర్యాంకర్ పెసొస్కా (ఉక్రెయిన్) పై గెలిచింది. తన వ్యక్తిగత కోచ్కు మైదానంలో అందుబాటులో ఉండే అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోవడంతో మనిక కోచ్ లేకుండానే ఆడుతోంది. జట్టు హెడ్ కోచ్ సౌమ్యదీప్ రాయ్ నుంచి ఆమె సలహాలు తీసుకోవడానికి నిరాకరించింది. పురుషుల రెండో రౌండ్లో సత్యన్ 7–11, 11–7, 11–4, 11–5, 9–11, 10–12, 6–11తో సియు హంగ్ లమ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. -
Wimbledon: బార్టీ క్వీన్...
లండన్: పట్టుదలతో కష్టపడితే ఏనాటికైనా కలలు నిజమవుతాయని ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ నిరూపించింది. టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి ఒక్కసారైనా వింబుల్డన్ టైటిల్ సాధించాలని కలలు కన్నానని ఫైనల్కు ముందు బార్టీ తెలిపింది. ‘హౌస్ఫుల్’ సెంటర్ కోర్టులో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో 25 ఏళ్ల బార్టీ తన కలను నిజం చేసుకుంది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్గా అవతరించింది. విజేతగా నిలిచిన బార్టీకి 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. బార్టీ కెరీర్లో ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. మరోవైపు 29 ఏళ్ల ప్లిస్కోవాకు రెండోసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ప్లిస్కోవా రన్నరప్గా నిలిచింది. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్బాష్ మహిళల టి20 క్రికెట్ లీగ్లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్లో పునరాగమనం చేసింది. తొలి సెట్లో రెండో గేమ్లో, నాలుగో గేమ్లో ప్లిస్కోవా సర్వీస్లను బ్రేక్ చేసిన బార్టీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బార్టీ దూకుడు... ప్లిస్కోవా పేలవమైన ఆటతీరు చూశాక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఒక్క గేమ్ అయినా గెలుస్తాందా అనే అనుమానం కలిగింది. అయితే ప్లిస్కోవా ఆట నెమ్మదిగా గాడిలో పడటంతో ఐదో గేమ్లో ఆమె బార్టీ సర్వీస్ను బ్రేక్ చేసి తొలి గేమ్ గెలిచింది. ఆ వెంటనే ఆరో గేమ్లో ప్లిస్కోవా సర్వీస్ను బ్రేక్ చేసిన బార్టీ 5–1తో ముందంజ వేసింది. అదే జోరులో బార్టీ తొలి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో ప్లిస్కోవా తన లోపాలను సరిదిద్దుకొని బార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. పలుమార్లు స్కోరు సమమయ్యాక చివరికు సెట్ టైబ్రేక్ వరకు వెళ్లింది. టైబ్రేక్లో ప్లిస్కోవా పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లోని రెండో గేమ్లో ప్లిస్కోవా సర్వీస్ను బ్రేక్ చేసిన బార్టీ ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్లిస్కోవా కోలుకునే ప్రయత్నం చేసినా బార్టీ దూకుడైన ఆటముందు ఆమె నిలువలేకపోయింది. బార్టీ సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్లో ప్లిస్కోవా కొట్టిన బ్యాక్హాండ్ షాట్ నెట్కు తగలడంతో బార్టీ విజయం ఖాయమైంది. వింబుల్టన్లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణి బార్టీ. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు. ఫైనల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ శుక్రవారం రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అంతా అద్భుతంలా అనిపిస్తోంది. స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కలను మీరు మరింత ప్రత్యేకం చేశారు. –బార్టీ -
Stefanos Tsitsipas: సిట్సి‘పాస్’ కాలేదు
లండన్: మట్టి కోర్టులపై అదరగొట్టే గ్రీస్ యువ టెన్నిస్ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ పచ్చిక కోర్టులపై మాత్రం తడబడ్డాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మూడో సీడ్గా బరిలోకి దిగిన సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 57వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–3తో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ను ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో టాప్–5లోని ఆటగాడిపై నెగ్గడం టియాఫోకిదే తొలిసారి. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో టియాఫో తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 15 ఏస్లు సంధించిన సిట్సిపాస్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు. జేక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–2, 6–2తో గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఏకంగా 25 ఏస్లు సంధించాడు. మరో మ్యాచ్లో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–4, 6–1, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై నెగ్గాడు. స్లోన్ స్టీఫెన్స్ సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో 2011, 2014 చాంపియన్, పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 73వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 6–4తో క్విటోవాను ఓడించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో నికెలెస్కూ (రొమేనియా)పై, 11వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–0, 6–1తో ఫియోనా (ఫ్రాన్స్) పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–4తో సు వె సెయి (చైనీస్ తైపీ)పై, 23వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో స్వాన్ (బ్రిటన్)పై గెలిచారు. -
‘ఫ్రెంచ్’ రాణి ఎవరో?
అంచనాలకు అందనిరీతిలో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అన్సీడెడ్ బర్బోర క్రిచికోవా (చెక్ రిపబ్లిక్), 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరుకున్నారు. నేడు జరిగే ఫైనల్లో గెలిచిన వారు తమ కెరీర్లో తొలిసారి సింగిల్స్ గ్రాండ్స్లామ్ చాంపియన్గా అవతరిస్తారు. 29 ఏళ్ల పావ్లుచెంకోవా 51 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడాక తొలిసారి ‘గ్రాండ్’ ఫైనల్లోకి అడుగుపెట్టగా... ‘డబుల్స్ స్పెషలిస్ట్’ అయిన 25 ఏళ్ల క్రిచికోవా తన ఐదో గ్రాండ్స్లామ్ టోర్నీలో తొలిసారి సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరింది. క్రిచికోవాకు అరుదైన ‘డబుల్’ సాధించే అవకాశం కూడా ఉంది. ఆమె మహిళల డబుల్స్ విభాగంలోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో క్రిచికోవా–కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6–1, 6–2తో మాగ్దా లినెట్టి (పోలాండ్)–బెర్నార్డా పెరా (అమెరికా) జోడీపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో బెథానీ మాటెక్ (అమెరికా)– స్వియాటెక్ (పోలాండ్) జోడీతో క్రిచికోవా–సినియకోవా ద్వయం ఆడతుంది. 2000లో మేరీ పియర్స్ మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్లో ఒకే ఏడాది మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించింది. -
గ్రాండ్స్లామ్ కలకు... అడుగు దూరంలో
అసమాన ఆటతీరుతో ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తూ వచ్చిన పావ్లుచెంకోవా, మరియా సాకరి గ్రాండ్స్లామ్ టైటిల్ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీ ఫైనల్ సమరాల్లో తామర జిదాన్సెక్పై పావ్లుచెంకోవా....సాకరిపై క్రిచికోవాగెలిచి తమ కెరీర్ల్లో తొలి సారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకున్నారు. శనివారం జరిగే టైటిల్ పోరులో వీరిద్దరిలో ఎవరు గెలిచినా సరికొత్త గ్రాండ్ స్లామ్ విన్నర్గా నిలుస్తారు. పారిస్: దశాబ్ద కాలంగా గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొంటున్నా... ప్రస్తుతం జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్ ముందు వరకు ఎన్నడూ క్వార్టర్ ఫైనల్స్ దాటని రష్యా ప్లేయర్ అనస్తాసియా పావ్లుచెంకోవా అద్భుతం చేసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్లో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచి సెమీస్లోకి దూసుకెళ్లిన ఆమె... సెమీస్లో కూడా అదే దూకుడును కొనసాగించి కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం గంటా 34 నిమిషాల పాటు జరిగిన తొలి సెమీ ఫైనల్లో పావ్లుచెంకోవా 7–5, 6–3తో 85వ ర్యాంకర్ తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై గెలుపొందింది. వయసులో తనకన్నా ఆరేళ్లు చిన్నదైన జిదాన్సెక్తో ఆడిన మ్యాచ్లో 31వ సీడ్ పావ్లుచెంకోవా మ్యాచ్ ఆరంభంలో తడబడింది. తొలి సెట్లో 0–2తో వెనుకబడిన ఆమె... ఆ తర్వాత తేరుకొని స్కోర్ను 2–2తో సమం చేసింది. అనంతరం ఎనిమిదో గేమ్ను జిదాన్సెక్ సర్వ్ చేయగా... పావ్లుచెంకోవా ఒక దశలో 0–40తో వెనుకబడినా వరుసగా పాయింట్లు సాధించి 40–40తో ‘డ్యూస్’ చేసింది. అక్కడ తడబడిన జిదాన్సెక్ ఒక డబుల్ఫాల్ట్తో పాటు మరో అనవసర తప్పిదం చేసి సర్వీస్ను కోల్పోయింది. 11వ గేమ్లో ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసిన పావ్లుచెంకోవా... 12వ గేమ్లో తన సర్వీస్ను కాపాడుకొని సెట్ను సొం తం చేసుకుంది. రెండో సెట్లో జిదాన్సెక్ తేలిపోవడంతో మ్యాచ్ పావ్లుచెంకోవావశమైంది. హోరాహోరీ పోరు... అనంతరం హోరాహోరీగా జరిగిన మహిళల రెండో సెమీఫైనల్ మ్యాచ్లో బార్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 4–6, 9–7తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. తద్వారా తొలి సారి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్స్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్కు షాకిచ్చి న సాకరి మరోసారి తన జోరు ప్రదర్శించినా... క్రిచికోవా కూడా చెలరేగడంతో హోరాహోరీ పోరు సాగింది. ముఖ్యంగా చివరి సెట్లోనైతే ఇద్దరూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు 3 గంటల 18 నిమిషాల సమరం తర్వాత మ్యాచ్ ఫలితం రావడం విశేషం. ఫైనల్ కాని ఫైనల్... ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–7(5/7), 7–5తో తొమ్మిదో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్కు చేరడం జొకోవిచ్కు ఇది 11వసారి కాగా... ఓవరాల్గా అతనికిది 40వ గ్రాండ్స్లామ్ సెమీ ఫైనల్. అతను నేడు జరిగే పురుషుల సెమీఫైనల్లో నాదల్తో తాడో పేడో తేల్చుకోనున్నాడు. గత ఏడాది వీరిద్దరు ఫైనల్లో తలపడగా నాదల్ వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ సారి ఇద్దరు దిగ్గజాల మధ్య సెమీ ఫైనల్లోనే పోరు జరగనుంది. నేడు పురుషుల సెమీ ఫైనల్ అలెగ్జాండర్ జ్వెరెవ్ VxS స్టెఫనోస్ సిట్సిపాస్ నొవాక్ జొకోవిచ్ VxS రాఫెల్ నాదల్ సా.6.20నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
French Open: వీరోచిత పోరాటంతో...
ఆరుసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడిన రష్యా సీనియర్ ప్లేయర్ పావ్లుచెంకోవా... గ్రాండ్స్లామ్ టోర్నీలలో ఏనాడూ రెండో రౌండ్ దాటి ఎరుగని స్లొవేనియా అమ్మాయి తామర జిదాన్సెక్... అసమాన ఆటతీరును ప్రదర్శంచి తమ కలను నిజం చేసుకున్నారు. తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్లో జిదాన్సెక్ 2 గంటల 26 నిమిషాల్లో పౌలా బదోసపై... పావ్లుచెంకోవా 2 గంటల 33 నిమిషాల్లో ఇలెనా రిబాకినాపై పైచేయి సాధించి గురువారం జరిగే సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. పారిస్: ఒకవైపు అపార అనుభవజ్ఞురాలు... మరోవైపు అంతగా అనుభవంలేని అమ్మాయి... ఒకేరోజు తమ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. తుదికంటా పోరాడితే అనుకున్న ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు. ఆ ఇద్దరే అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా), తామర జిదాన్సెక్ (స్లొవేనియా). ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం ఈ ఇద్దరూ కళ్లు చెదిరే ఆటతో అందరి మనసులు గెల్చుకున్నారు. 31వ సీడ్, పావ్లుచెంకోవా 6–7 (2/7), 6–2, 9–7తో 21వ సీడ్ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్)పై... అన్సీడెడ్ జిదాన్సెక్ 7–5, 4–6, 8–6తో 33వ సీడ్ పౌలా బదోస (స్పెయిన్)పై విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నారు. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి గ్రాండ్స్లామ్ సెమీఫైనల్ కావడం విశేషం. పావ్లుచెంకోవా గతంలో ఆరుసార్లు క్వార్టర్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడి ఏడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించింది. నేడు జరిగే మరో రెండు క్వార్టర్ ఫైనల్స్లో అమెరికా టీనేజర్ కోకో గాఫ్తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్); డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో మరియా సాకరి (గ్రీస్) తలపడతారు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–3, 6–4తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)పై గెలిచింది. బ్రేక్ పాయింట్లు కాపాడుకొని... బదోసతో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 85వ ర్యాంకర్ జిదాన్సెక్ కీలకదశలో అద్భుతంగా ఆడి ఫలితాన్ని తనవైపునకు తిప్పుకుంది. తొలి సెట్లో ఒకదశలో 0–3తో వెనుకబడి ఆ తర్వాత పుంజుకొని సెట్ను నెగ్గిన జిదాన్సెక్ రెండో సెట్లో 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఆమె అనూహ్యంగా తడబడి బదోసాకు వరుసగా నాలుగు గేమ్లు కోల్పోయి సెట్ను సమర్పించుకుంది. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 6–6 వద్ద తన సర్వీస్లో 15–40తో రెండు బ్రేక్ పాయింట్లు కాచుకున్న జిదాన్సెక్ వరుసగా రెండు కళ్లు చెదిరే ఫోర్హ్యాండ్ షాట్లతో 40–40తో ‘డ్యూస్’ చేసింది. ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 7–6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం బదోస సర్వీస్ను కూడా బ్రేక్ చేసి జిదాన్సెక్ సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఓ గ్రాండ్స్లామ్ టోర్నీ లో సెమీఫైనల్ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ మొత్తంలో నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు నెగ్గిన జిదాన్సెక్ ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. అనుభవం కలిసొచ్చింది... రిబాకినాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పావ్లుచెంకోవా నెమ్మదిగా మ్యాచ్పై పట్టు సంపాదించింది. తొలి సెట్లో 1–4తో వెనుకబడినా... ఆ తర్వాత తేరుకొని స్కోరును 6–6తో సమం చేసింది. అయితే టైబ్రేక్లో రిబాకినా పైచేయి సాధించింది. రెండో సెట్లో పావ్లుచెంకోవా ఆరో గేమ్లో, ఎనిమిదో గేమ్లో రిబాకినా సర్వీస్ను బ్రేక్ చేసి 6–2తో సెట్ను దక్కించుకుంది. కెరీర్లో ఆడిన ఏడు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో మూడో రౌండ్ దాటి ఎరుగని రిబాకినా... 51 గ్రాండ్స్లామ్ టోర్నీ లు ఆడిన అనుభవమున్న పావ్లుచెంకోవా ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు అనుభవజ్ఞురాలైన పావ్లుచెంకోవా తన ఆధిపత్యాన్ని చాటుకొని విజయాన్ని దక్కించుకుంది. జ్వెరెవ్ తొలిసారి సెమీస్లో... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1తో ఫోకినా (స్పెయిన్)పై నెగ్గి తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. -
French Open: సోఫియాకు షాక్...
పారిస్: ఈసారి సీడెడ్ క్రీడాకారిణులకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ కలసి రావడంలేదు. తాజాగా మహిళల సింగిల్స్లో గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) కూడా ఇంటిముఖం పట్టింది. దాంతో క్వార్టర్ ఫైనల్ బరిలో టాప్–20లో కేవలం ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) 6–1, 6–3తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సోఫియా కెనిన్పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో సాకరి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 68 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సాకరి నాలుగు ఏస్లు సంధించడంతోపాటు కెనిన్ సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సోఫియా కెనిన్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 53 నిమిషాల్లోనే... మరోవైపు అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ కూడా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 17 ఏళ్ల గాఫ్ కేవలం 53 నిమిషాల్లో 6–3, 6–1తో 25వ సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)ను చిత్తుగా ఓడించింది. తద్వారా 2006 తర్వాత (నికోల్ వైదిసోవా; చెక్ రిపబ్లిక్–ఫ్రెంచ్ ఓపెన్) ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. జబర్తో మ్యాచ్లో గాఫ్ నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. తన సర్వీస్లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 2018 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తన కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో గాఫ్తో క్రిచికోవా ఆడుతుంది. నాదల్ 15వసారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 6–0తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలుపొందాడు. రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నాదల్ నాలుగు ఏస్లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 13 సార్లు నెట్వద్దకు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో బెరెటిని (ఇటలీ)తో జొకోవిచ్; ష్వార్ట్జ్మన్తో నాదల్; జ్వెరెవ్తో ఫొకినా; ఐదో సీడ్ సిట్సిపాస్తో రెండో సీడ్ మెద్వెదెవ్ తలపడతారు. గట్టెక్కిన జొకోవిచ్... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా) 15వసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న 19 ఏళ్ల ఇటలీ టీనేజర్ లొరెంజో ముజెత్తితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–7 (7/9), 6–7 (2/7), 6–1, 6–0, 4–0తో విజయం సాధించాడు. 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను కోల్పోయాడు. ఆ తర్వాత అతను అనూహ్యంగా తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచాడు. నిర్ణాయక చివరి సెట్లో సెర్బియా స్టార్ 4–0తో ఆధిక్యంలో ఉన్న దశలో లొరెంజో వెన్నునొప్పితో మ్యాచ్ నుంచి వైదొలి గాడు. దాంతో జొకోవిచ్ విజయం ఖాయైమంది. తొలి రెండు సెట్లు కోల్పోయాక గ్రాండ్స్లామ్ టోర్నీ మ్యాచ్లో జొకోవిచ్ గెలుపొందడం ఇది ఐదో సారి మాత్రమే. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1 తో నిషికోరి (జపాన్)పై... ఫొకినా (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–4తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై... పదో సీడ్ ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా) 7–6 (11/9), 6–4, 7–5తో లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. -
French Open 2021: టోర్నీ క్వార్టర్ ఫైనల్లో జిదాన్సెక్, బదోస, రిబాకినా
అందరి అంచనాలను తారుమారు చేస్తూ... తమ అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ... తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులను చిత్తు చేస్తూ... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంతర్జాతీయ టెన్నిస్లో అంతగా పేరొందని ముగ్గురు క్రీడాకారిణులు తామర జిదాన్సెక్, పౌలా బదోస, ఇలెనా రిబాకినా ఫ్రెంచ్ ఓపెన్లో ఘన విజయాలతో తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకోగా... 24వ గ్రాండ్స్లామ్ టైటిల్పై గురిపెట్టిన అమెరికా దిగ్గజం సెరెనా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. టైటిల్ ఫేవరెట్స్గా ఉన్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్, ప్రపంచ మాజీ నంబర్వన్ అజరెంకా (బెలారస్), 2019 రన్నరప్ మర్కెత వొంద్రుసొవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయారు. మరోవైపు ప్రపంచ 85వ ర్యాంకర్ తామర జిదాన్సెక్ (స్లొవేనియా)... ప్రపంచ 35వ ర్యాంకర్ పౌలా బదోస (స్పెయిన్)... ప్రపంచ 22వ ర్యాంకర్ ఇలెనా రిబాకినా (కజకిస్తాన్) తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... పదేళ్ల తర్వాత ప్రపంచ 32వ ర్యాంకర్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా) ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆదివారం జరిగిన నాలుగు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇలెనా రిబాకినా 6–3, 7–5తో అమెరికా స్టార్, ఏడో సీడ్ సెరెనా విలియమ్స్ను బోల్తా కొట్టించగా... పౌలా బదోస 6–4, 3–6, 6–2తో 20వ సీడ్, 2019 రన్నరప్ వొంద్రుసొవను ఇంటిముఖం పట్టించింది. తామర జిదాన్సెక్ 7–6 (7/4), 6–1తో 54వ ర్యాంకర్ సొరానా కిర్స్టియా (రొమేనియా)పై గెలుపొంది ఏదైనా గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మరో మ్యాచ్లో 31వ సీడ్ పావ్లుచెంకోవా 5–7, 6–3, 6–2తో 15వ సీడ్, రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన అజరెంకాను ఓడించింది. సెరెనాతో 77 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రిబాకినా తన ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు సాధించింది. మెద్వెదేవ్ మొదటిసారి... పురుషుల సింగిల్స్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ (రష్యా) 6–2, 6–1, 7–5తో 22వ సీడ్ గారిన్ (చిలీ)పై గెలిచి తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–2, 7–5తో 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్)పై నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో మార్సెలో అరెవాలో (ఎల్సాల్వడార్)–మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జోడీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–స్కుగోర్ (క్రొయేషియా) జంటకు వాకోవర్ లభించింది. దాంతో బోపన్న జంట క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
French Open 2021: స్వితోలినా ఇంటిముఖం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్–10 సీడెడ్ క్రీడాకారిణుల పరాజయపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు ఇంటిదారి పట్టగా... వారి సరసన తాజాగా ఐదో సీడ్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 33వ ర్యాంకర్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–2తో స్వితోలినాను ఓడించి వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో క్రిచికోవా నెట్వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు సాధించగా... స్వితోలినా సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/4), 6–0తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, నాలుగో సీడ్ సోఫియా (అమెరికా) 4–6, 6–4, 6–1తో పెగూలా (అమెరికా)పై, స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 7–5తో 18వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17వ సీడ్ సాకరి (గ్రీస్) 7–5, 6–7 (2/7), 6–2తో 14వ సీడ్ మెర్టెన్స్ (బెల్జియం) నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. వరుసగా 12వ ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా) వరుసగా 12వ ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–1, 6–4, 6–1తో బెరాన్కిస్ (లిథువేనియా)పై గెలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), పదో సీడ్ ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో నాదల్ 6–3, 6–3, 6–3తో కామరూన్ నోరి (బ్రిటన్)పై, సిట్సిపాస్ 5–7, 6–3, 7–6 (7/3), 6–1తో ఇస్నెర్ (అమెరికా)పై, ష్వార్ట్జ్మన్ 6–4, 6–2, 6–1తో ఫిలిప్ కోల్ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు. -
French Open 2021:సెరెనా శ్రమించి...
పారిస్: కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్పై గురి పెట్టిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో ఏడో సీడ్ సెరెనా మూడో రౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో సెరెనా 2 గంటల 3 నిమిషాల్లో 6–4, 5–7, 6–1తో ప్రపంచ 174వ ర్యాంకర్ మిహేలా బుజర్నెస్కూ (రొమేనియా)పై కష్టపడి గెలిచింది. ఈ మ్యాచ్లో ఐదు ఏస్లు సంధించిన సెరెనా, తన ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయింది. మరోవైపు పదో సీడ్ బెన్చిచ్ (స్విట్జర్లాండ్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బెన్చిచ్ 2–6, 2–6తో కసత్కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. జొకోవిచ్ శుభారంభం పురుషుల సింగిల్స్లో వరల్డ్ నంబర్వన్ జొకోవిచ్ తొలి రౌండ్లో 6–2, 6–4, 6–2తో సాండ్గ్రెన్ (అమెరికా)పై నెగ్గి శుభారంభం చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో సిట్సిపాస్ 6–3, 6–4, 6–3తో మార్టినెజ్ (స్పెయిన్)పై, జ్వెరెవ్ 7–6 (7/4), 6–3, 7–6 (7/1)తో గెలిచారు. 11వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) 3–6, 6–2, 3–6, 2–6తో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–డెల్బోనిస్ (అర్జెంటీనా) 6–3, 6–7 (11/13), 4–6తో డిమినార్–రూడ్ (ఆస్ట్రేలియా) చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అంకిత రైనా (భారత్)–లౌరెన్ (అమెరికా) 4–6, 4–6తో హర్డెక (చెక్ రిపబ్లిక్)–సిగెముండ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
ఆండ్రెస్కూ అవుట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ క్రీడాకారిణి బియాంక ఆండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. 3 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ 85వ ర్యాంకర్ తామర జిదాన్సెక్ (స్లొవేనియా) 6–7 (1/7), 7–6 (7/2), 9–7తో బియాంక ఆండ్రెస్కూపై అద్భుత విజయం సాధించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. గత రెండేళ్లలో జిదాన్సెక్ ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. జిదాన్సెక్తో జరిగిన మ్యాచ్లో బియాంక తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోవడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్లు, 63 అనవసర తప్పిదాలు చేసింది. స్వియాటెక్ ముందంజ... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తొలి రౌండ్లో 6–0, 7–5తో కాజా జువాన్ (స్లొవేనియా)పై... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 4–6, 6–3తో 2017 చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్ల్లో 16వ సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 1–6, 6–3, 4–6తో పొలానా హెర్కాగ్ (స్లొవేనియా) చేతిలో... 19వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–7 (5/7), 2–6తో సిర్స్టియా (రొమేనియా) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్లో రెండో ర్యాంకర్ మెద్వెదేవ్ (రష్యా)... స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ శుభా రంభం చేశారు. మెద్వెదేవ్ 6–3, 6–3, 7–5తో బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలిచి తొలిసారి రెండో రౌండ్కు చేరాడు. ఫెడరర్ 6–2, 6–4, 6–3తో ఇస్తోమిన్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. -
సెమీస్కు సెరెనా
మెల్బోర్న్: కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో పదో సీడ్ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో సెరెనా సెమీస్కు చేరడం ఇది తొమ్మిదోసారి. గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో 4 ఏస్లు సంధించిన ఆమె కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. సెమీఫైనల్లో మూడో సీడ్ నమోమి ఒసాకా (జపాన్)తో తలపడనుంది. మరో క్వార్టర్స్ మ్యాచ్లో ఒసాకా గంటా 6 నిమిషాల్లో 6–2, 6–2తో 71వ ర్యాంకర్ సెసువె (తైవాన్)పై సులువుగా గెలుపొంది సెరెనాతో పోరుకు సిద్ధమైంది. కరాత్సెవ్ సంచలనం పురుషుల విభాగంలో క్వాలిఫయర్, 114వ ర్యాంకర్ అస్లాన్ కరాత్సెవ్ మరో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. 2 గంటల 32 నిమిషాల పాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్లో కరాత్సెవ్ (రష్యా) 2–6, 6–4, 6–1, 6–2తో 18వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై నెగ్గి అరంగేట్ర గ్రాండ్స్లామ్ టోర్నీలోనే సెమీస్కు చేరిన ఆటగాడిగా ఘనత వహించాడు. ఈ మ్యాచ్లో 9 ఏస్లు సంధించిన కరాత్సెవ్ 6 డబుల్ఫాల్ట్లు చేశాడు. మరో క్వార్టర్స్ పోరులో టాప్ సీడ్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–7 (6/8), 6–2, 6–4, 7–6 (8/6)తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై శ్రమించి గెలుపొందాడు. ఈ మ్యాచ్ 3 గంటల 30 నిమిషాల పాటు సాగింది. సెమీస్లో జొకోవిచ్తో కరాత్సెవ్ తలపడనున్నాడు. -
ఒక్కడే మిగిలాడు
టాప్ సీడ్ సెర్బియన్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్లో నిష్క్రమించాడు. మూడో సీడ్ టెన్నిస్ స్టార్ ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టాడు. ఇక అందరికళ్లు రెండో సీడ్ నాదల్ మ్యాచ్పైనే పడ్డాయి. కానీ టాప్–3లో అతనొక్కడే నిలిచాడు. క్వార్టర్స్ అంచెదాటి సెమీఫైనల్ చేరాడు. ఇప్పటికే మూడు సార్లు (2010, 2013, 2017) చాంపియన్గా నిలిచిన ఈ స్పెయిన్ స్టార్ నాలుగో టైటిల్ వేటలో రెండడుగుల దూరంలో నిలిచాడు. న్యూయార్క్: టాప్–3లో ఒకే ఒక్కడి అడుగు సెమీస్లో పడింది. స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ ఈ సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. గురువారం జరిగిన పోరులో అతను 6–4, 7–5, 6–2తో అర్జెంటీనాకు చెందిన 20వ సీడ్ డీగో ష్వార్జ్మన్పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో నాదల్కు రెండో సెట్ మినహా ఎక్కడ పోటీ ఎదురవలేదు. ఆఖరి సెట్నైతే ఏకపక్షంగా ముగించేశాడు. 5 ఏస్లు సంధించిన నాదల్ ప్రత్యర్థి సర్వీస్ను 8 సార్లు బ్రేక్ చేశాడు. 39 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 35 విన్నర్స్ కొట్టాడు. 4 ఏస్లు సంధించిన ష్వార్జ్మన్... 37 అనవసర తప్పిదాలు చేశాడు. అవతలివైపు నాదల్ జోరుతో కేవలం 26 విన్నర్సే కొట్టగలిగాడు. గతేడాది కూడా ఈ టోర్నీలో సెమీస్ చేరిన నాదల్ ఓవరాల్గా గ్రాండ్స్లామ్ ఈవెంట్లలో 33 సార్లు సెమీఫైనల్ చేరాడు. ప్రస్తుతం అతని కంటే ముందు వరుసలో ఫెడరర్ (45), నొవాక్ జొకోవిచ్ (36) మాత్రమే ఉన్నారు. ఇక ఈ టోర్నీలో టైటిల్ నాదల్ చేతికే అందే అవకాశాలున్నాయి. సెమీస్ బరిలో నిలిచిన ఇతర ఆటగాళ్లెవరూ స్పానియార్డ్ జోరు ముందు నిలబడలేరు. దీంతో ఏదో సంచలనం జరిగితే తప్ప... ఈ టోర్నీలో నాదల్ చాంపియన్షిప్ను ఎవరూ అడ్డుకోలేరని చెప్పొచ్చు. 42 ఏళ్ల తర్వాత ఓ ఇటాలియన్ మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇటలీకి చెందిన 24వ సీడ్ మాటెయో బెరెటిని చెమటోడ్చి నెగ్గి సెమీస్ చేరాడు. మ్యాచ్ సాగే కొద్దీ పోటీ పెరిగిన ఈ పోరులో అతను 3–6, 6–3, 6–2, 3–6, 7–6 (7/5)తో ఫ్రాన్స్ ఆటగాడు, 13వ సీడ్ గేల్ మోన్ఫిల్స్పై విజయం సాధించాడు. సుమారు నాలుగు గంటల (3 గం. 57 ని.) పాటు ఐదు సెట్ల దాకా ఈ మ్యాచ్ సాగింది. ఈ విజయంతో 42 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి ఇటాలియన్గా బెరెటిని ఘనతకెక్కాడు. 1977లో కొరాడో బరజుటి సెమీస్ చేరిన తర్వాత మరో ఇటలీ ఆటగాడెవరూ యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్దాకా వెళ్లలేకపోయాడు. సెమీఫైనల్లో నాదల్తో బెరెటిని తలపడతాడు. కెనడా టీనేజ్ అమ్మాయి బియాంక అండ్రిస్కూ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్గా బరిలోకి దిగిన అండ్రిస్కూ 3–6, 6–2, 6–3తో బెల్జియంకు చెందిన ఎలైస్ మెర్టెన్స్ను ఓడించింది. తాజా ఫలితంతో దశాబ్దం తర్వాత యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరిన టీనేజ్ క్రీడాకారిణిగా (19 ఏళ్లు) ఆమె ఘనతకెక్కింది. 2009లో వోజ్నియాకి (డెన్మార్క్) ఈ ఘనత సాధించింది. -
సీడెడ్ ఆటగాళ్లకు షాక్
గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించాలంటే అత్యంత నిలకడగా ఆడటమే ప్రధానం. ఆ నిలకడ లేకపోతే ఆశించిన ఫలితాలు రాలేవు. భవిష్యత్లో ‘బిగ్ త్రీ’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ స్థానాలను భర్తీచేయగల సామర్థ్యమున్న ఆటగాళ్లుగా పేరొందిన డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్), కరెన్ ఖచనోవ్ (రష్యా) ఊహించని పరాజయాలు ఎదుర్కొన్నారు. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్లో టైటిల్ ఫేవరెట్స్ రేసులో ఉన్న ఈ ముగ్గురూ తొలి రౌండ్ అడ్డంకినే అధిగమించలేక ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2017 చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ప్రపంచ మాజీ నంబర్వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) కూడా తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సంచలనాల మోత మోగింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఒకేరోజు టాప్–10లోని నలుగురు ఆటగాళ్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), తొమ్మిదో సీడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా), పదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్లో 2017 చాంపియన్, 11వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), 2004 చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా), మాజీ నంబర్వన్ ప్లేయర్లు అజరెంకా (బెలారస్), 24వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా తొలి రౌండ్ను దాటలేకపోయారు. వరుసగా రెండేళ్లు ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన థీమ్ 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో 4–6, 6–3, 3–6, 2–6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోగా... అన్సీడెడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 3 గంటల 54 నిమిషాల పోరులో 6–4, 6–7 (5/7), 7–6 (7/5), 7–5తో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సిట్సిపాస్ను బోల్తా కొట్టించాడు. 216వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) 3 గంటల 51 నిమిషాల్లో 4–6, 7–5, 7–5, 4–6, 6–3తో ఖచనోవ్పై... కుకుష్కిన్ (కజకిస్తాన్) 3–6, 6–1, 6–3, 3–6, 6–3తో అగుట్పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఇతర మ్యాచ్ల్లో షపోవలోవ్ (కెనడా) 6–1, 6–1, 6–4తో 18వ సీడ్ అగుల్ (కెనడా)పై, అందుజార్ (స్పెయిన్) 3–6, 7–6 (7/1), 7–5, 5–7, 6–2తో 30వ సీడ్ ఎడ్మండ్ (బ్రిటన్)పై, సాండ్గ్రెన్ (అమెరికా) 1–6, 6–7 (2/7), 6–4, 7–6 (7/5), 7–5తో మాజీ ఐదో ర్యాంకర్ సోంగా (ఫ్రాన్స్)లపై గెలిచారు. నాదల్ శుభారంభం నాలుగో టైటిల్పై గురి పెట్టిన రెండో సీడ్ రాఫెల్ నాదల్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ఈ స్పెయిన్ స్టార్ 6–3, 6–2, 6–2తో మిల్మన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 6–3, 3–6, 4–6, 6–2తో ఆల్బోట్ (మాల్డోవా)పై అతికష్టమ్మీద గెలిచాడు. 14వ సీడ్ ఇస్నెర్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో లోపెజ్ (స్పెయిన్)పై, 28వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6–3, 7–6 (7/1), 6–4తో జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు. మూడో రౌండ్లో ప్లిస్కోవా మహిళల సింగిల్స్లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్లిస్కోవా 6–1, 6–4తో మరియం బోల్క్వాద్జె (జార్జియా)ను ఓడించింది. మరోవైపు నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మాజీ నంబర్వన్ వొజ్నియాకి (డెన్మార్క్) తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్ను దాటారు. హలెప్ 6–3, 3–6, 6–2తో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న అమెరికా అమ్మాయి నికోల్ గిబ్స్పై గెలుపొందగా... వొజ్నియాకి 1–6, 7–5, 6–3తో యాఫన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. క్వాలిఫయర్ కలిన్స్కాయ (రష్యా) 6–3, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ సబలెంకా (బెలారస్) 3–6, 6–3, 6–4తో అజరెంకాపై, రిస్కీ (అమెరికా) 2–6, 6–1, 6–3తో ముగురుజాపై, క్రిస్టీ ఆన్ (అమెరికా) 7–5, 6–2తో కుజ్నెత్సోవాపై సంచలన విజయాలు సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. అమెరికా టీనేజ్ సంచలనం, 15 ఏళ్ల కోరి గౌఫ్ 3–6, 6–2, 6–4తో పొటపోవా (రష్యా)ను ఓడించింది. -
సింధు సన్నాహాలకు సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వపరంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బుధవారం ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిశారు. తనకు వచ్చిన గోల్డ్ మెడల్ను కేసీఆర్కు సింధు చూపించింది. రెండు రాకెట్లను కూడా సీఎంకు బహూకరించింది. ఈ సందర్భంగా సింధుకు సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసింది. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యంకాదు’ అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ సహా సింధు భవిష్యత్తులో పాల్గొనే టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్ తదితరులు పాల్గొన్నారు. టోక్యోలో స్వర్ణం ఖాయం: గవర్నర్ నరసింహన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్లో ఆమె బంగారు పతకం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ప్రపంచ చాంపియన్గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్లో బంగారు పతకం సాధించిన మానసి జోషిలను బుధవారం గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ‘పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని సింధు, మానసి నిరూపించారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. వచ్చే ఏడాది ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి మళ్లీ రాజ్భవన్కు రావాలని కోరుకుంటున్నా’ అని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రపంచ చాంపియన్షిప్లో తాము నెగ్గిన స్వర్ణ పతకాలను గవర్నర్కు చూపిస్తున్న మానసి, సింధు