Aircel Maxis
-
ఎయిర్సెల్ అధినేత కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. టెలికమ్యూనికేషన్స్ నుంచి చమురు, గ్యాస్ వరకు విభిన్న రంగాల్లో ఈయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, అక్కడ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఆనంద కృష్ణన్ నిలిచారు. తన మృతిని ధ్రువీకరిస్తూ మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ చాలా సేవలందించారు. అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణన్ సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయం’ అని ఇబ్రహీం అన్నారు.ఎవరీ ఆనంద కృష్ణన్?మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని బ్రిక్ఫీల్డ్ ప్రాంతంలో కృష్ణన్ ఏప్రిల్ 1, 1938న జన్మించారు. కృష్ణన్ పూర్వీకులకు భారత్తో సంబంధం ఉంది. ఆనంద మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1964లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పట్టా పొందరు. తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి చాలా అభివృద్ధి చెందారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆనందకు ముగ్గురు సంతానం. తన కుమారుడు థాయిలాండ్లో బౌద్ధ సన్యాసిగా మారాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు అతని వ్యాపార నిర్వహణలో పాలుపంచుకోలేదు.ఐపీఎల్ టీమ్కు స్పాన్సర్గా కూడా..ఒకప్పుడు ఆనంద ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను స్పాన్సర్ చేశారు. గతంలో దక్షిణాదిలో కార్యకలాపాలు సాగించిన ఎయిర్సెల్ టెలికాం కంపెనీకి సారథ్యం వహించారు. ఫోర్బ్స్ ప్రకారం కృష్ణన్ ప్రముఖ డీల్ మేకర్లలో ఒకరిగా ఎదిగారు. చమురు వ్యాపారంలోకి ప్రవేశించే ముందు బిజినెస్ కన్సల్టెన్సీని స్థాపించారు. మల్టీమీడియా వెంచర్లను ప్రారంభించారు. మ్యాక్సిస్ బీహెచ్డీ అనే టెలికా కంపెనీని ఏర్పాటు చేశారు. ఆనంద కృష్ణన్ మలేషియాలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా నిలిచారు.అవినీతి ఆరోపణలు2006లో ఎయిర్సెల్పై మాక్సిస్ నియంత్రణ సాధిస్తుందని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి దేశంలోని పలు కంపెనీలు అభియోగాలు మోపడంతో కోర్టులో కేసు నడుస్తోంది.ఇదీ చదవండి: పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!ఆనంద స్థాపించిన కొన్ని ప్రముఖ కంపెనీలుఆస్ట్రో మలేషియా హోల్డింగ్స్: మలేషియాలో ప్రముఖ శాటిలైట్ టెలివిజన్ ప్రొవైడర్.బుమి అర్మడా: ఈ సంస్థ చమురు సర్వీస్ అందిస్తోంది.ఎయిర్ సెల్: ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్ గా వ్యవహరించిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఎయిర్ సెల్. -
దివాళా తీసిన ఈ కంపెనీ గుర్తుందా..? 3Gలో దీనిదే హవా!!
-
కేవలం రూ.3,400 కోట్లకే అమ్మించారు.. ఎయిర్సెల్ ఫౌండర్ ఆవేదన
రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు.అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్కాస్ట్ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. ‘రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్సెల్ రూ. 6,500 కోట్లు చెల్లించింది. 2012 నవంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 5 మిలియన్ల 3G వినియోగదారులను కలిగి ఉంది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ సెల్ 3జీ టారిఫ్ ను అప్పట్లో భారీగా తగ్గించింది. 2011లో భారతీ ఎయిర్టెల్తో కలిసి యాపిల్ ఐఫోన్ 4 లాంచ్ భాగస్వామి అయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్ సెల్ 2018 ఫిబ్రవరిలో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. 2006లో మాక్సిస్ బెర్హాద్ 74 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ సెల్ ను స్వాధీనం చేసుకుంది. 2011లో తన వాటాను మ్యాక్సిస్ బెర్హాద్ కు విక్రయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చిన్నకన్నన్ శివశంకరన్ ఆరోపించారు. -
ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. -
ఇదీ.. చిదంబరం చిట్టా
యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ... ఐఎన్ఎక్స్: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా! స్టార్ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్ఎక్స్ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్ఎక్స్ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్ ముఖర్జియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్ఎక్స్లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్ఎక్స్ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది. ఎయిర్సెల్– మాక్సిస్: అక్రమ అనుమతులు! ఎయిర్సెల్ మాక్సిస్ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్సెల్ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్ సంస్థ ఎయిర్సెల్లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 సార్లు చిదంబరానికి ఊరట ఐఎన్ఎక్స్, ఎయిర్సెల్, మాక్సిస్ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా. బెయిల్పై ఉన్న కార్తీ ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. పెండింగ్లో మరిన్ని కేసులు ► ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ► రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ ్చంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్) ఫిర్యాదు చేసింది. ► ఇక శారదా చిట్ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. ► బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్లో ఉంది. ► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్లో ఉంది. దాక్కోలేదు.. నిందితుడిని కాను న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు. కక్షగట్టారు: కాంగ్రెస్ చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహు ల్ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఓ ట్వీట్ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది. ‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్ ట్విట్టర్లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఇతర సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, శశి థరూర్ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. అరెస్ట్కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
చిదంబరానికి మధ్యంతర ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో అరెస్ట్ కాకుండా కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబారానికి మంజూరు చేసిన మధ్యంతర ఊరటను ఢిల్లీ కోర్టు గురువారం ఈ నెల 9 వరకూ పొడిగించింది. కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఎప్పుడు సమన్లు జారీ చేసినా చిదబంరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం విచారణకు హాజరవుతారని వారి న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. చిదంబరం మార్చి 2006లో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఎఫ్డీఐకి ఆమోద ముద్ర వేశారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించాల్సి ఉండగా, చిదంబరం ఆర్థిక మంత్రి హోదాలో విదేశీ సంస్ధకు ఎఫ్ఐపీబీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. రూ 3500 కోట్ల ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు రూ 305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ దర్యాప్తు సంస్ధలు చిదంబరం పాత్రపై దర్యాప్తు సాగిస్తున్నాయి. -
కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు కార్తీకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మే, జూన్ నెలల మధ్యలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతంలోవి కాకుండా పూచీకత్తు కింద మరో రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ కార్తీని ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులకు సంబంధించి సీబీఐ, ఈడీ సంస్థలు ప్రస్తుతం కార్తీని విచారిస్తున్నాయి. అయితే టోటస్ టెన్నిస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ల కోసం తాను అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు కార్తీ తెలిపారు. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా చిదంబరంను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి లభించింది. కేసులో సేకరించిన సాక్ష్యాధారాలను సమర్పించిన మీదట చిదంబరంపై న్యాయపరమైన చర్యలతో ముందుకెళ్లేందుకు గతంలో న్యాయమంత్రిత్వ శాఖను దర్యాప్తు సంస్ధ ఆశ్రయించిన సంగతి తెలసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కస్టడీ విచారణ అవసరమని సీబీఐ, ఈడీ ఈనెల 25న ఢిల్లీ హైకోర్టులో పేర్కొన్నాయి. కాగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన క్రమంలో తాజా పరిణామాలు ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చే క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు ముట్టాయని చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ ఆరోపిస్తోంది. -
‘ఎయిర్సెల్’ శివశంకరన్ ఆస్తులు అటాచ్
సాక్షి, చెన్నై: ‘ఎయిర్సెల్’ సంస్థ వ్యవస్థాపకుడు శివశంకరన్కు చెందిన చెన్నైలోని రూ.224 కోట్ల ఆస్తులను ఈడీ శనివారం అటాచ్ చేసింది. శివశంకరన్ కొంతకాలం క్రితం ఐడీబీఐ బ్యాంక్ నుంచి వ్యాపార నిమిత్తం రూ.600 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సొంత అప్పుల్ని తీర్చేందుకు వాడుకున్నాడు. వడ్డీ చెల్లించకపోవడంతో ఐడీబీఐ పలుమార్లు నోటీసులిచ్చింది. అసలు చెల్లించాలని ఒత్తిడి చేయగా శివశంకరన్ చేతులు ఎత్తేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఈడీ చెన్నైలో శివశంకరన్కు చెందిన రూ.224 కోట్ల విలువైన స్థిర, రూ.35 లక్షల చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
కార్తీ చిదంబరంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో విచారణ నిమిత్తం మార్చి తొలివారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. చట్టంతో చెలగాటమాడరాదని ఆయనను సర్వోన్నత న్యాయస్ధానం హెచ్చరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించే షరతుల్లో భాగంగా రూ పది కోట్లను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 21-28 తేదీల్లో తన ఫ్రాన్స్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కార్తీ గత ఏడాది నవంబర్లో అప్పీల్ చేశారు. ‘మీరు ఎక్కడికి వెళ్లదలుచుకుంటే అక్కడికి వెళ్లవచ్చు..ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.. అయితే చట్టంతో మాత్రం ఆడుకోవద్దు..విచారణకు సహకరించకుంటే మాత్రం తాము తీవ్ర చర్యలకు వెనుకాడబో’ మని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ కార్తీపై మండిపడింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో కార్తీ చిదంబరం మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్ధల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కార్తీ చిదంబరం ముడుపులు స్వీకరించారని దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. -
ఎయిర్సెల్ - మ్యాక్సిస్ కేసు : చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్ - మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు ఊరట లభించింది. వీరికి సీబీఐ, ఈడీ కేసుల్లో మధ్యంతర ఊరటను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 11 వరకూ పొడిగించింది. కేసుకు సంబంధించి మరిన్ని పత్రాలను సమీకరించేందుకు సమయం కావాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో మారిషస్ కంపెనీకి అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చట్టవిరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించారన్న సీబీఐ ఆరోపణలను నిరాధారమైనవని చిదంబరం కోర్టు ముందు పేర్కొన్నారు. కాగా దర్యాప్తుకు చిదంబరం ఎంతమాత్రం సహకరించడం లేదని ఆయన ముందుస్తు బెయిల్ పిటిషన్పై సీబీఐ వాదనలు వినిపిస్తూ తెలిపింది. -
చిదంబరానికి సీబీఐ షాక్
-
చిదంబరానికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు సీబీఐ సోమవారం పటియాలా హౌస్ కోర్టుకు తెలిపింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసు విచారణను చేపట్టిన ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఓపీ సైనీకి ఈ మేరకు సీబీఐ స్పష్టం చేసింది. చిదంబరంను ఈ వ్యవహారంలో ప్రాసిక్యూట్ చేసేందుకు దర్యాప్తు ఏజెన్సీ అనుమతించిన పత్రాలను సీబీఐ, ఈడీల తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితుల్లో ఆరుగురికి ప్రాసిక్యూషన్ అనుమతులు అవసరమని మెహతా తెలిపారు. మిగిలిన ఐదుగురు నిందితుల ప్రాసిక్యూషన్ కోసం అనుమతులు పొందే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నుంచి ఉపశమనం ఇస్తూ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు డిసెంబర్ 18 వరకూ కోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. కాగా, తనను కుట్రపూరితంగా అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని తనపై ఆరోపణలన్నీ కట్టుకథలుగా చిదంబరం కోర్టుకు నివేదించారు. -
చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి
న్యూడిల్లీ: ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో నిజాలు రాబట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించడం తప్పనిసరని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని ఓ కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ నేత అయిన చిదంబరం విచారణలో తమకు సహకరించడం లేదనీ, అన్నీ దాటవేత సమాధానాలిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ముందస్తు బెయిలు కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. అనేక మంది ప్రముఖులతో సంబంధాలు కలిగిన ఆయన అత్యంత శక్తిమంతుడనీ, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను నాశనం చేయతగ్గ వ్యక్తి కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వకూడదని ఈడీ వాదించింది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించకపోతే దర్యాప్తును నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంది. కాగా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అభ్యర్థనను ఈ ఏడాది మే 30న కోర్టు తొలిసారి మన్నించడం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు ఈ వెసులుబాటును కోర్టు పొడిగించింది. గత నెల 8న కూడా ఆయనకు నవంబర్ 1 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
చిదంబరం కస్టడీని కోరిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. ఈ కేసులో చిదంబరం కస్టడీ విచారణకు అనుమతించాలని బుధవారం ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టు ఎదుట ఈడీ తన స్పందనను తెలియచేస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వరాదని కోరింది. చిదంబరం తప్పించుకు తిరుగుతూ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించింది. కాగా, చిదంబరం బెయిల్ పిటిషన్పై గురువారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట వాదనలు కొనసాగనున్నాయి. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో అక్టోబర్ 8న చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను నవంబర్ 1 వరకూ అరెస్ట్ చేయరాదని ఇచ్చిన ఉత్తర్వులు ముగియడంతో కోర్టు తదుపరి ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. -
చిదంబరంపై ఈడీ చార్జిషీటు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఎయిర్సెల్–మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలు చేసింది. అనుమతులు ఇచ్చే విషయంలో విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కయ్యారని అందులో ఈడీ ఆరోపించింది. చిదంబరం కుమారుడు కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరన్ పేరును కూడా స్పెషల్ జడ్జి ఓపీ సైనీ ఎదుట సమర్పించిన ఆ చార్జిషీటులో ప్రస్తావించింది. అయితే సీబీఐ, ఈడీ ఆరోపణలను చిదంబరం, ఆయన కుమారుడు ఖండించారు. ఈ చార్జిషీటులో ఎయిర్సెల్ మాజీ సీఈవో వి.శ్రీనివాసన్, మాక్సిస్కు చెందిన ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్, ఆస్ట్రో ఆల్ ఏసియా నెట్వర్క్స్ మలేసియా, ఎయిర్సెల్ టెలీవెంచర్స్ లిమిటెడ్, మాక్సిస్ మొబైల్ సర్వీసెస్, బుమీ అర్మడా బెర్హాద్ పేర్లను కూడా పొందుపరిచారు. నవంబర్ 26న ఈ చార్జిషీటు విచారణకు రానుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇచ్చిన అనుమతులను 2006లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఆమోదం తెలిపారని, ఈ వ్యవహారంలో రూ.1.6 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఎయిర్సెల్ మాక్సిస్ కేసు : చిదంబరంపై చార్జిషీటు
సాక్షి, ముంబై: రూ. 3,500 కోట్ల ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. అంతేకాదు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన్ను ఎ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. చిదంబరంతోపాటు, ఆయర కుమారుడు కార్తీ చిదంబరం, ఎస్ భాస్కరన్ (కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్) వి. శ్రీనివాసన్ (ఎయిర్సెల్ మాజీ సీఈఓ), నాలుగు మాక్సిస్ కంపెనీలు సహా 9 మందిని నిందితులుగా ఈ సప్లిమెంటరీ చార్జ్షీట్లో చేర్చారు. ఈ కేసు ఢిల్లీ కోర్టు విచారణకు రానుంది. నవంబర్ 26న ఈ చార్జిషీటును విచారణకు స్వీకరించనున్నట్లు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఓపీ సైనీ చెప్పారు. అయితే ఈ కేసులోనవంబరు 29 వరకు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీని అరెస్ట్ చేయకూడదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి అక్టోబర్ 25 వరకే ఉన్నా.. ఇవాళ మరోసారి దానిని పొడిగించింది. సీబీఐ, ఈడీ తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. -
ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసు : చిదంబరం, కార్తీలకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో దర్యాప్తు సంస్థలు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను అరెస్ట్ చేయకుండా నవంబర్ 1 వరకూ మధ్యంతర రక్షణను ఢిల్లీ కోర్టు పొడిగించింది. నవంబర్ 1న తిరిగి కేసు విచారణను చేపడతామని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ వెల్లడించారు. చిదంబరం న్యాయవాదులు పీకే దూబే, అర్ష్దీప్ సింగ్ల అప్పీల్పై సవివర సమాధానం దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ, ఈడీల తరపు న్యాయవాదులు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, నితేష్ రాణాలు కోరారు. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో సీబీఐ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పేర్లను జులై 19న చార్జిషీట్లో పేర్కొంది. ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట సీబీఐ వీరిపై అనుబంధ చార్జిషీట్ను సైతం దాఖలు చేసింది. రూ 3500 కోట్ల ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ చిదంబరం పాత్రపై సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. -
సీబీఐ కావాలనే మీడియాకు లీకులిస్తోంది
న్యూఢిల్లీ: ‘ఎయిర్సెల్– మాక్సిస్’కేసులో సీబీఐ కావాలనే తనపై మీడియాకు లీకులిస్తూ న్యాయవ్యవస్థను ఎగతాళి చేస్తోందని కాంగ్రెస్ సీనియర్నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాదులు పీకే దుబే, అర్షదీప్ సింగ్లు వేసిన వ్యాజ్యాన్ని ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ షైని మంగళవారం విచారించారు. ఎయిర్సెల్–మాక్సిస్ కేసులో చిదంబరంపై కోర్టు విచారణ జరిపేందుకు సీబీఐకి ఆసక్తి లేదని, మీడియానే విచారణ జరిపేందుకు తన పిటిషనర్పై ఉద్దేశపూర్వకంగా లీకులు అందజేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ఇంతవరకూ చార్జిషీటును కూడా కోర్టుకు అందివ్వలేదని, ఆ కాపీని తమకు అనుకూలమైన మీడియాకు అందజేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. -
చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద చిదంబరం వాంగ్మూలం తీసుకున్నారు. ఒప్పందానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) అధికారుల వాంగ్మూలాల్ని ఈడీ రికార్డు చేసింది. ఆయన హయాంలో ఎయిర్సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతిచ్చేందుకు ఎఫ్ఐపీబీ అనుసరించిన ప్రమాణాలు, ఇతర అంశాలపై జూన్లో ప్రశ్నించారు. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్కి రూ.3,680 కోట్ల మేర ఎఫ్ఐపీబీ అనుమతులు జారీచేసింది. రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీనే అనుమతులివ్వాలి. చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి ఎలా అనుమతులిచ్చారనే విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. -
చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఆగస్ట్ 7 వరకూ పటియాలా హౌస్కోర్టు చిదంబరానికి మధ్యంతర ఊరట ఇవ్వగా, తాజాగా ఆయన ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు.గతంలో ఆయన ముందస్తు బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ జులై 10న ఈడీ బదులిచ్చింది. చిదంబరానికి ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు వెలుగుచూడటం సాధ్యం కాదని ఈడీ స్పష్టం చేసింది. మరోవైపు ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ సహా 18 మంది నిందితులపై జులై 19న సీబీఐ ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంల ముందస్తు బెయిల్ అప్పీల్ను పటియాలా హౌస్ కోర్టు విచారిస్తోంది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ కంపెనీకి 800 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,680 కోట్ల) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు జారీచేశారు. కానీ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులు రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేయగలిగారన్న విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. -
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
ఆ కేసులో చిదంబరానికి రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి ఊరట లభించింది. ఎయిర్సెల్- మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ జులై 10 వరకూ అరెస్ట్ చేయరాదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం పటియాలా హౌస్ కోర్టు ఆగస్ట్ 7 వరకూ పొడిగించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం తాజాగా అప్పీల్ చేసుకున్నారు. జులై 10న ఈ కేసులో ఈడీ కోర్టుకు సమగ్రంగా బదులిస్తూ చిదంబరం గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించింది. ముందస్తు బెయిల్ జారీ చేస్తే కేసులో వాస్తవాలను వెలికితీయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంటోంది.కాగా ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో సీబీఐ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ సహా 18 మంది నిందితులపై సీబీఐ తాజా చార్జిషీట్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చార్జిషీట్లో పలువురు ప్రస్తుత, పదవీవిరమణ చేసిన సీనియర్ అధికారుల పేర్లను సీబీఐ పొందుపరిచింది. -
సీబీఐ చార్జ్షీట్లో చిదంబరం, కార్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గురువారం అదనపు చార్జ్షీట్ను దాఖలుచేసింది. ఇందులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీతో పాటు 10 మంది ప్రభుత్వాధికారులు, ఆరు సంస్థలను చేర్చింది. వీరందరిపై నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, అధికార దుర్వినియోగంతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ కంపెనీకి 800 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,680 కోట్ల) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు జారీచేశారు. కానీ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులు రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేయగలిగారన్న విషయమై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ అనుమతులకు ప్రతిఫలంగా కార్తీకి సంబంధించిన కంపెనీలకు రూ.1.14 కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది. కాగా, ఈ చార్జ్షీట్పై జూలై 31న విచారణ జరుపుతానని ప్రత్యేక సీబీఐ జడ్జి ఓపీ సైనీ తెలిపారు. కేంద్రం ఒత్తిడితోనే తనతో పాటు నిజాయితీపరులైన ప్రభుత్వాధికారుల పేర్లతో సీబీఐ అర్థరహితమైన చార్జ్షీట్ దాఖలుచేసిందని చిదంబరం మండిపడ్డారు. -
ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మలుపు
-
కార్తీ చిదంబరానికి ఎదురు దెబ్బ?
-
కార్తీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో ఆయనపై ఈడీ తాజా చార్జిషీట్ను నమోదు చేసేందుకు సంసిద్ధమైంది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట తాజా అభియోగపత్రాన్ని ఈడీ నమోదు చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్లో కార్తీ చిదంబరం సహా ఇతరుల పాత్రను ఈ చార్జిషీట్లో ఈడీ ప్రముఖంగా ప్రస్తావిస్తుందని సమాచారం. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఈ కేసులో ఈడీ ఇప్పటికే కార్తీ చిదంబరాన్ని రెండు సార్లు ప్రశ్నించడంతో పాటు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోవైపు ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)2006లో గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై కార్తీని ఈడీ ప్రశ్నించింది. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించిన కొద్దిరోజులకే కార్తీకి చెందిన సంస్థగా భావిస్తున్న ఏఎస్సీపీఎల్కు ఎయిర్సెల్ టెలివెంచర్స్ లిమిటెడ్ రూ 26 లక్షలు చెల్లించడంపై ఈడీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. కార్తీపై తాజా చార్జిషీట్ ఎప్పుడో దాఖలు కావాల్సి ఉందని, చిదంబరానికి సన్నిహితులైన అధికారులు ఆయనకు సాయపడేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈడీ, సీబీఐలపై ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. -
చిదంబరానికి మరోసారి ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరంను మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి జూన్ 12న చిదంబరం వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు మరోసారి విచారణకు హాజరవ్వాలని ఈడీ సమన్లు జారీ చేసింది. 3,500 కోట్ల రూపాయల ఎయిర్సెల్ –మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంను ఈడీ విచారించింది. ఎయిర్సెల్- మ్యాక్సిస్కు సంబంధించి అంతభారీ మొత్తంలో ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంలో ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై.. అప్పటి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ) అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ ఆయనను ప్రశ్నించింది. జూలై 10 వరకు అరెస్టు చేయొద్దు ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేయకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో చిదంబరానికి ఊరట లభించింది. జూలై 10 వరకు చిదంబరంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. -
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి: చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బుధవారం ట్రయల్కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎయిర్సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు చిదంబరం తరఫున సీనియర్ లాయర్లు సిబల్, సింఘ్వీలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్సెల్–మాక్సిస్ రూ.3,500 కోట్ల ఒప్పందంలో, ఐఎన్ఎక్స్ మీడియాకు రూ.350 కోట్ల విదేశీ పెట్టుబడుల అనుమతుల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపణ. ఈ నేపథ్యంలో ఎయిర్సెల్–మాక్సిస్ కేసులో బుధవారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేయడంతో చిదంబరం ట్రయల్కోర్టును ఆశ్రయించారు. -
చిదంబరానికి ముందస్తు బెయిల్
న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కుంభకోణంలో తనను అరెస్ట్ చేయకుండా ఉండాలని చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సీబీఐ స్పెషల్ కోర్టు ఆమోదించింది. వచ్చే నెల అయిదు వరకు అంటే తదుపరి విచారణ వరకు చిదంబరాన్ని అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్ పిటీషన్ స్పందన తెలియజేయాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీచేసింది. చిదంబరం తరుఫున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. 800 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని చిదంబరంపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిలో కోట్ల రూపాయలు ముడుపులు తనయుడు కార్తీ చిదంబరానికి ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ మనీలాండరింగ్ ఆరోపణల కింద విచారిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్తీని సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. కార్తీకి చెందిన రూ.1.16 కోట్ల ఆస్తులను 2017 సెప్టెంబర్లో ఈడీ అటాచ్ చేసింది. గతేడాది డిసెంబర్లో కార్తీ చిదంబరానికి చెందిన సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు జరిపింది. కార్తీకి చెందిన ఢిల్లీ, చెన్నైలోని ప్రాపర్టీలపై కూడా దాడులు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తును జాప్యం చేస్తున్నాయని ఏజెన్సీలపై సుప్రీంకోర్టు మండిపడింది కూడా. -
ఎయిర్సెల్ కస్టమర్లకు గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ఎయిర్సెల్ వినియోగదారులకు ఊరటనిచ్చింది. ఎయిర్సెల్ కస్టమర్లకు చెందిన బ్యాలెన్స్ నగదును, సెక్యూరిటీ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఎయిర్సెల్ను ఆదేశించింది. ఈ విషయంలో వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ ఈ ఆదేశాలిచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ చందాదారులకు చెందిన బకాయిలు చెల్లించాలని పేర్కొంది. మార్చి 1 , 2017నుంచి మార్చి 18 2018 మధ్య ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈ చెల్లింపులకు సంబంధించి ప్రాంతాల వారీగా పూర్తి రిపోర్టును మే 10లోపు అందించాలని కూడా కోరింది. ఎయిర్సెల్ గ్రూప్ ఖాతాదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. టెలికాం చందాదారుల ప్రయోజనాన్ని కాపాడే క్రమంలో ఈ అదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది. ఎయిర్సెల్నుంచి పోర్ట్ అయిన ఖాతాలకు రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్ చేయాలని, ఈ సమాచారాన్ని వారికి ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులకు తెలియజేయాలని కోరింది. -
కార్తీ చిదంబరానికి మరో ఊరట
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఊరట లభించిన కార్తీ చిదంబరానికి, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో కూడా మరో ఊరట లభించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో ఏప్రిల్ 16 వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా.. స్పెషల్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైని, షరత్తులతో కూడిన ఈ ముందస్తు బెయిల్ను మంజూరు చేశారు. ఈ కేసులో ఎప్పుడు సమన్లు జారీచేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని జడ్జి తెలిపారు. కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ ఫిర్యాదులపై మూడు వారాల్లోగా స్పందించాలని సీబీఐ, ఈడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. 2006లో ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు అనుమతి ఇవ్వడానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ కేసు నమోదైంది. ఎఫ్ఐపీబీ అనుమతి కోసం కార్తీ చిదంబరం రూ.26 లక్షలను పుచ్చుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. నేడు గంట పాటు జరిగిన ఈ విచారణలో కార్తీ తరుఫున వాదించిన కపిల్ సిబాల్... ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో కార్తీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఎఫ్ఐపీబీ అధికారులు ఆయనకు తెలుసన్న రుజువులేమీ లేవన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిన్ననే(శుక్రవారమే) కార్తీకి బెయిల్ మంజూరైంది. -
‘2జీ’ జాప్యంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేసుల దర్యాప్తులో జాప్యాన్ని తప్పుపడుతూ సీబీఐ, ఈడీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2జీ, అందులో భాగమైన ఎయిర్సెల్–మాక్సిస్ ఒప్పందంలో అవకతవకలపై దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ముఖ్యమైన ఇలాంటి కేసుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘2జీ స్పెక్ట్రం, అనుబంధ కేసుల్లో దర్యాప్తు ముగించేందుకు ఎందుకింత జాప్యం జరుగుతోంది. 2010లో సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇంతవరకూ ఎందుకు విచారణ పూర్తి చేయలేదో చెప్పండి’ అని నిలదీసింది. కేసు దర్యాప్తు జాప్యం వెనుక ఏదైనా అదృశ్య శక్తి హస్తముందా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. ‘ ఈ కేసుతో సంబంధమున్న అందరిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరపండి. దర్యాప్తు తీరుపై అసంతృప్తిగా ఉన్నాం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘టెలికం మాజీ మంత్రి రాజాకి ప్రమేయమున్న 2జీ కేసులో నిందితుల్ని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అదేవిధంగా ఇతర అనుబంధ కేసుల్లో నిందితులపై ఆరోపణల్ని కూడా కొట్టివేశారు. కేవలం మలేసియా వ్యాపారవేత్త టీ ఆనంద కృష్ణన్కు ప్రమేయమున్న ఎయిర్సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తు మాత్రమే పెండింగ్లో ఉంది. అతను మలేసియాలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని భారత్కు రప్పించలేకపోయాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ... కేసు దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదిస్తూ.. ఎయిర్సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఇంతకముందే కోర్టు ఆదేశించిందని, అయితే కేసులోని ఒక నిందితుడి బెడ్రూంలో ఆ ఫైల్ ఉందని ఆరోపించారు. ఎయిర్సెల్–మాక్సిస్ కేసు నుంచి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్ పేర్లను ప్రత్యేక కోర్టు తప్పించినా.. ఒప్పందానికి ఎఫ్ఐపీబీ ఇచ్చిన అనుమతిపై మాత్రం సీబీఐ విచారణ కొనసాగుతోంది. -
కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ
-
కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎయిర్సెల్, మ్యాక్సిస్ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ(విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై సీబీఐ, ఈడీలు గత కొన్నేళ్ల నుంచి విచారణ చేస్తున్నాయి. ఈ విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిందేనని సుప్రీం గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందపు కేసు 2006 నాటిది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుతో పాటు కార్తి చిదంబరంపై ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులోనూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.600 కోట్లకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వాలంటే ఆ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించాలి. అయితే 2006లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.3,500 కోట్ల విలువైన ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ విషయమై సీబీఐ ఆర్థిక మంత్రికి రూ.600 కోట్లలోపు ఒప్పందాలకు అనుమతిచ్చే అధికారమే ఉందని, ఈ డీల్ అంతకుమించినదైనప్పటికీ ఎలా అనుమతిచ్చారంటూ సీబీఐ అప్పటి ఆర్థికమంత్రి చిందంబరాన్ని పలుమార్లు ప్రశ్నించింది. ఎయిర్సెల్కు ఎఫ్ఐపీబీ అనుమతి కోసం 2006 ఏప్రిల్ 11న రూ.26 లక్షల ముడుపులు కార్తి చిదంబరం పుచ్చుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. చిదంబరంతో పాటు కార్తిపై కూడా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తుండటంతో, ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీవ్ర ఉచ్చులో బిగుసుకుపోయిన కార్తికి ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. కార్తి బెయిల్పై మార్చి 15న విచారణ జరుగనుంది. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని, వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ కార్తి చిదంబరం కోరారు. అయితే కార్తీ వాదనను సీబీఐ కొట్టిపారేసింది. -
ఎయిర్సెల్ దివాలా!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో ఎయిర్సెల్ దివాలా ప్రకటించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కంపెనీ ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త సంస్థ (జియో) రాకతో పోటీ తీవ్రమవడం, చట్ట.. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, పెరిగిపోయిన రుణభారం, భారీ నష్టాలు మొదలైన వాటి కారణంగా ’వ్యాపారంపైనా, పరపతిపైనా గణనీయంగా ప్రతికూల ప్రభావం’ పడినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దివాలా చట్టం 2016లోని సెక్షన్ 10 కింద ఎయిర్సెల్ సెల్యులార్, డిష్నెట్ వైర్లెస్, ఎయిర్సెల్ లిమిటెడ్ సంస్థలు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ చేపట్టాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.. వైర్లెస్ వ్యాపారాన్ని ఇతర టెల్కోలో విలీనం చేయడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదని ఎయిర్సెల్ తెలిపింది. అటుపైన రుణపునర్వ్యవస్థీకరణ, నిధుల సమీకరణ అంశాలపై రుణదాతలు, షేర్హోల్డర్లతో సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదని వివరించింది. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ పథకం కూడా పనిచేయకపోవడంతో.. దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియ ఒక్కటే తగిన మార్గంగా విశ్వసిస్తున్నట్లు ఎయిర్సెల్ తెలిపింది. సీఐఆర్పీ అనేది.. కంపెనీని విక్రయించే ప్రక్రియ కాబోదని ఎయిర్సెల్ స్పష్టం చేసింది. ఉద్యోగులతో పాటు రుణదాతలు, సరఫరా సంస్థలు మొదలైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేలా మెరుగైన పరిష్కారమార్గాన్ని కనుగొనే ఉద్దేశంతోనే దీనివైపు మొగ్గు చూపినట్లు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామన్న ఎయిర్సెల్.. ’’ప్రస్తుత కష్టకాలంలో’’ తమకు మద్దతుగా నిలవాలంటూ కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది. మలేసియా కోటీశ్వరుడు ఆనంద్ కృష్ణన్ సంస్థ మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ .. 2005లో 1 బిలియన్ డాలర్లతో ఎయిర్సెల్లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎయిర్సెల్లో మ్యాక్సిస్కి 74 శాతం వాటా ఉండగా.. రూ. 15,500 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. -
అగమ్యగోచరంగా 5000 మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ : రుణభారంతో మూత పడే దిశగా వెళ్లిన ఎయిర్సెల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 5000 మందికి పైగా ఉద్యోగులకు ఈ కంపెనీ వార్నింగ్ ఇచ్చింది. తీవ్ర పోటీకర వాతావరణంలో నిధులు సమకూరడం క్లిష్టతరంగా మారిందని, ఈ క్రమంలో ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితుల్లో పడబోతున్నట్టు కంపెనీ హెచ్చరించింది. కొన్ని రోజుల నుంచి నిధులు సమకూరడం లేదని, ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాల నుంచే నిధులు రాబడుతున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కైజాద్ హేర్జీ చెప్పారు. మాతృ సంస్థ మ్యాక్సిస్కు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పోటీకర వాతావరణం తీవ్రంగా దెబ్బకొడుతోందని, రెవెన్యూలు, లాభాలు అన్నీ కొట్టుకుపోతున్నాయన్నారు. వచ్చే రోజుల్లో మరింత క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాబోతున్న క్లిష్టకర పరిస్థితుల్లో కంపెనీ పరిస్థితిని రివ్యూ చేయడానికి బోర్డు రీగ్రూప్ అవబోతుంది. పలువురు డైరెక్టర్లు కంపెనీ నుంచి వైదొలగడంతో, వారి స్థానంలో కంపెనీ బోర్డు సందీప్ వాట్స్, ప్రకాశ్ మిశ్రా, లక్ష్మి సుబ్రహ్మణ్యంను నియమించింది. వాటాదారులతో కూడా బోర్డు చర్చలు జరుపుతోంది. సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు కూడా రిపోర్టులు వస్తున్నాయి. తమ ఆర్థిక పరిస్థితితో లక్ష కొద్దీ కస్టమర్లు ప్రభావితమవుతారని హేర్జీ పేర్కొన్నారు. కంపెనీకి ప్రస్తుతం 85 మిలియన్ మంది కస్టమర్లున్నారు. ఆరు సర్కిళ్లలో సర్వీసులను కంపెనీ ఇటీవలే ఆపివేసింది. కాగ టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తూ.. 2016 సెప్టెంబర్లో చౌక చార్జీలతో రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చాక.. మూతబడుతున్న కంపెనీల్లో ఎయిర్సెల్ నాలుగోది కానుంది. జియో రాకతో టెలికం పరిశ్రమ ఆదాయాలు సగానికి పడిపోగా.. టారిఫ్లు సైతం గణనీయంగా క్షీణించాయి. -
మూతబడనున్న మరో టెల్కో
న్యూఢిల్లీ: రుణభారంతో మూతబడుతున్న టెలికం సంస్థల జాబితాలో తాజాగా ఎయిర్సెల్ కూడా చేరబోతోంది. సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయనుంది. మలేసియాకి చెందిన మాతృ సంస్థ మ్యాక్సిస్ గతంలో ఎయిర్సెల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,500 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ కోసం గతేడాది సెప్టెంబర్ నుంచి బ్యాంకులతో ఎయిర్సెల్ చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఫలితం కనిపించలేదని పేర్కొన్నాయి. వ్యాపారాన్ని నిర్వహించేందుకు కంపెనీ దగ్గర ప్రస్తుతం కనీస స్థాయిలో కూడా నిధులు లేవని, ఈ వారాంతంలో ఉద్యోగుల జీతాలను చెల్లించడం కూడా నిలిపివేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. భేటీ కానున్న బ్యాంకర్లు.. మొండిబాకీల వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, దివాలా చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే పలు రుణ పునర్వ్యవస్థీకరణ పథకాలను ఎత్తివేయడం సైతం ఎయిర్సెల్ తాజా పరిణామానికి కారణంగా మారాయి. సెప్టెంబర్ నుంచి ఎయిర్సెల్ బకాయిలను చెల్లించడం లేదు. తాజాగా మారిన నిబంధనల ప్రకారం ఎయిర్సెల్ రుణబకాయిలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కంపెనీ బోర్డును రద్దు చేసిన ఎయిర్సెల్ .. కొత్త బోర్డు ఏర్పాటు, దివాలా పిటిషన్ దాఖలుకి సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించేందుకు దివాలా చట్టం ప్రొఫెషనల్ను నియమించుకునే పనిలో ఉంది. మరికొద్ది రోజుల్లో ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేసుకోనుంది. ఈ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు చర్చించేందుకు బ్యాంకర్లు మంగళవారం భేటీ కానున్నట్లు సమాచారం. మలేసియాకి చెందిన మాతృసంస్థ మద్దతు ఉన్న కారణంగా ఎయిర్సెల్ నుంచి బకాయిలు రాబట్టుకోగలమని ఇటు బ్యాంకర్లు, అటు సరఫరా సంస్థలు కొంత ధీమాగా ఉన్నాయి. దాదాపు రూ. 500 కోట్ల దాకా నిధులు సర్దుబాటు చేస్తామని, వివిధ సర్కిల్స్లో లైసెన్సు ఫీజు కింద చెల్లించేందుకు అవసరమైతే మరో రూ. 500 కోట్ల దాకా సమకూరుస్తామని మ్యాక్సిస్ .. బ్యాంకర్లకు హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి నెలా రూ. 400 కోట్ల ఆదాయం.. కానీ... ఎయిర్సెల్ ఆదాయం ప్రతి నెలా సుమారు రూ. 400 కోట్ల మేర ఉంటోంది. ఇందులో రూ. 100 కోట్లు ఇతర ఆపరేటర్లకు కాల్ టర్మినేషన్ చార్జీల కింద చెల్లిస్తుండగా, మరో రూ. 280 కోట్లు వెండార్స్ మొదలైనవారికి చెల్లిస్తోంది. మిగతాది లైసెన్సు ఫీజులు, పన్నులు, వడ్డీల కింద కడుతోంది. అయితే, గత మూడు నెలలుగా రూ. 60 కోట్ల మేర బాకీ పడటంతో ఐడియా సెల్యులార్ ఇటీవలే ఎయిర్సెల్కి ఇంటర్కనెక్ట్ సర్వీసులను నిలిపివేసింది. ఇక మెరుగైన సర్కిల్స్పైనే దృష్టి పెట్టేందుకు ఎయిర్సెల్ సైతం ఇటీవల ఆరు సర్కిల్స్లో సేవలు నిలిపివేసింది. ఎయిర్సెల్ మూతబడితే 5,000 మంది ఉద్యోగులు, వెండార్స్.. జీటీఎల్ ఇన్ఫ్రా.. భారతి ఇన్ఫ్రాటెల్.. ఇండస్ టవర్స్.. ఏటీసీ వంటి టవర్ ఆపరేటింగ్ భాగస్వాములపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు బాకీలు రాబట్టుకోవడం కోసం ఎయిర్సెల్పై దావాలు కూడా వేశాయి. ఎరిక్సన్, నోకి యా, జెడ్టీఈ వంటి నెట్వర్క్ మేనేజ్మెంట్ సంస్థలు సెప్టెంబర్ నుంచి బకాయిల రికవరీపై చర్చలు జరుపుతున్నాయి. సెప్టెంబర్ నుంచి అవుట్సోర్సింగ్ టెక్నాలజీ, కాల్ సెంటర్ సర్వీస్ సంస్థలకు కూడా ఎయిర్సెల్ చెల్లింపులు జరపడం లేదు. జియో దెబ్బకి నాలుగోది.. టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తూ.. 2016 సెప్టెంబర్లో చౌక చార్జీలతో రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చాక.. మూతబడుతున్న కంపెనీల్లో ఎయిర్సెల్ నాలుగోది కానుంది. జియో రాకతో టెలికం పరిశ్రమ ఆదాయాలు సగానికి పడిపోగా.. టారిఫ్లు సైతం గణనీయంగా క్షీణించాయి. నార్వేకి చెందిన టెలినార్ తమ భారత వ్యాపార విభాగాన్ని మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్కి బదలాయిస్తోంది. భారతీ ఎయిర్టెల్ అటు టాటా టెలిసర్వీసెస్కి చెందిన వైర్లెస్ వ్యాపార విభాగాన్ని కూడా టేకోవర్ చేస్తోంది. మరోవైపు, రిలయన్స్ కమ్యూనికేషన్స్కి చెందిన వైర్లెస్ వ్యాపార విభాగానికి సంబంధించిన అసెట్స్ను జియో కొనుగోలు చేస్తోంది. జియో రావడానికి ముందు.. 2016 జూలై దాకా ఎయిర్సెల్ పరిస్థితి మెరుగ్గానే ఉండేది. త్రైమాసికంలో సుమారు రూ. 120 కోట్ల నిర్వహణ లాభం నమోదు చేసింది. కానీ సెప్టెంబర్లో జియో వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. క్రమంగా కస్టమర్స్ చేజారిపోయారు. డిసెంబర్ నాటికి యూజర్స్ సంఖ్య సుమారు 25 లక్షలు తగ్గి 8.5 కోట్లకు పరిమితమైంది. చార్జీలను సగానికన్నా తగ్గించినా కూడా పోటీ సంస్థ ఉచిత సేవల ముందు తట్టుకుని నిలబడే పరిస్థితి లేదని కంపెనీ వర్గాలు గతంలోనే పేర్కొన్నాయి. 2017 జూలైలో జియో చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టే నాటికి ఎయిర్సెల్ నిర్వహణ లాభం రూ. 5 కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఎయిర్సెల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య 79 శాతం నుంచి 57 శాతానికి, ప్రతి యూజర్పై సగటు ఆదాయం సగానికి క్షీణించాయి. ఇక త్రైమాసికాలవారీగా రూ. 120 కోట్ల నికర నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో దాదాపు అలాంటి పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతున్న మరో టెల్కో రిలయన్స్ కమ్యూనికేషన్స్తో విలీన చర్చలు ప్రారంభించింది ఎయిర్సెల్. కానీ అనుమతులు రావడంలో జాప్యాలు, ఎయిర్సెల్ స్పెక్ట్రం విక్రయానికి ప్రతికూలంగా న్యాయస్థానం ఆదేశాలు మొదలైనవి విలీన ప్రయత్నాలకు గండికొట్టాయి. -
ఎయిర్సెల్ యూజర్లకు ఐడియా షాక్
న్యూఢిల్లీ : ఎయిర్సెల్ యూజర్లకు ఐడియా సెల్యులార్ షాకిచ్చింది. బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్సెల్తో ఉన్న ఇంటర్కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఆ కంపెనీకి నోటీసులు పంపించినప్పటికీ స్పందించలేదని ఐడియా పేర్కొంది. ఎయిర్సెల్ ఈ బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాత ఇంటర్కనెక్ట్ సర్వీసులను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు తాము ఈ సర్వీసులను అందజేయమని వెల్లడించింది. అయితే ఎంతమొత్తంలో ఎయిర్సెల్ బాకీ పడి ఉందో ఐడియా తెలుపలేదు. '' బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్సెల్ లిమిటెడ్తో మా ఇంటర్కనెక్ట్ సర్వీసులను రద్దు చేస్తున్నాం'' అని ఐడియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 నవంబర్ నుంచి పలుమార్లు ఈ బకాయిలు చెల్లించాలని ఎయిర్సెల్ను కోరామని, కానీ ఆ ఆపరేటర్ బకాయిలు చెల్లించడంలో విఫలమైనట్టు పేర్కొంది. ఇంటర్కనెక్ట్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్సెల్ ఈ పేమెంట్లను చెల్లిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయంపై ఎయిర్సెల్ వెంటనే స్పందించలేదు. -
వచ్చే నెల 30 నుంచి ఎయిర్సెల్ సేవలు నిలిపివేత
న్యూఢిల్లీ: ఎయిర్సెల్ కంపెనీ ఆరు టెలికం సర్కిళ్లలో తన కార్యకలాపాలను వచ్చే నెల 30 నుంచి ఆపేయనున్నది. గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ టెలికం సర్కిళ్లలో జనవరి 30 నుంచి మొబైల్ సర్వీసులను నిలిపేస్తామని ఎయిర్సెల్ (ఎయిర్సెల్ లిమిటెడ్, డిష్నెట్ వైర్లెస్లను కలిపి ఎయిర్సెల్ గ్రూప్గా పరిగణిస్తారు)తెలిపింది. తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో వ్యాపారం నిర్వహించలేమంటూ ఈ ఆరు సర్కిళ్లలో లైసెన్స్లను సరెండర్ చేస్తున్నామని ఈ నెల 1నే ట్రాయ్కు ఎయిర్సెల్ తెలిపింది. కంపెనీ ఈ 6 సర్కిళ్లలో 40 లక్షల మందికి 2జీ సేవలందిస్తోంది. వినియోగదారులందరికీ, 30 రోజుల ముందుగానే ఈ విషయాన్ని వెల్లడించామని, అందరికీ యూనిక్ పోర్టింగ్ కోడ్స్ను పంపించామని వివరించింది. కాగా వేరే నెట్వర్క్ను మారాలనుకుంటున్న ఎయిర్సెల్ వినియోగదారుల అభ్యర్థనలను వచ్చే ఏడాది మార్చి 10 వరకూ అంగీకరించాలని ఇతర టెల్కోలను ట్రాయ్ ఆదేశించింది. -
రూ.104 ప్యాక్ : వన్ ఇయర్ వ్యాలిడిటీ
టెలికాం దిగ్గజాలకు షాకిస్తూ ఎయిర్సెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడాది కాలం పాటు వ్యాలిడిటీతో కొత్త వాయిస్ టారిఫ్ రూ.104ను ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్ కింద కాల్ రేట్లను నిమిషానికి 20 పైసలకి తగ్గించింది. ఈ తగ్గించిన రేట్లు ఎస్టీడీ, లోకల్ కాల్స్ అన్నింటికీ వర్తించనున్నట్టు పేర్కొంది. అమెజాన్తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని అపరిమిత కాలింగ్ ప్లాన్ రీఛార్జ్లపై క్యాష్బ్యాక్లను ప్రకటించిన అనంతరం ఈ కొత్త ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాక్ కేవలం ఢిల్లీ సర్కిల్లోని ఎయిర్సెల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. నిమిషానికి 20 పైసల టారిఫ్ను లాంచ్ చేయడంతో, కేవలం పాత కస్టమర్లతో తమ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా.. కొత్త టెలికాం యూజర్లు ఎయిర్సెల్ను ఎంపిక చేసుకునేలా చేయనున్నామని కంపెనీ నార్త్ రీజనల్ హెడ్ హరీష్ శర్మ చెప్పారు. అంతకముందు కూడా ఎయిర్సెల్ రూ.88తో వీక్ ప్లాన్ను లాంచ్ చేసింది. దీని కింద రోజుకు 1జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ను ఆఫర్ చేస్తోంది. 28 రోజుల కోసం రూ.199 ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఎయిర్సెల్ ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. టెలికాం దిగ్గజాల దెబ్బకు నష్టాల పాలైన ఎయిర్సెల్, ఆర్కామ్తో విలీనమవ్వాలని అనుకుంది. కానీ ఇటీవలే ఈ రెండు కంపెనీల విలీన చర్చలు సఫలమయ్యాయి. -
అపరిమిత కాలింగ్ ప్లాన్లపై క్యాష్బ్యాక్ ఆఫర్
ఎయిర్సెల్ తన అపరిమిత కాలింగ్ ప్లాన్లపై క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. అమెజాన్ పే బ్యాలెన్స్ వాడి పేమెంట్లను జరిపిన వారికి ఈ క్యాష్బ్యాక్లను అందించనున్నట్టు తెలిపింది. అమెజాన్.ఇన్, పే బ్యాలెన్స్ ద్వారా కొనుగోలు చేసిన ఎంపికచేసిన ఎయిర్సెల్ రీఛార్జ్లకు మాత్రమే ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.75 మేర క్యాష్బ్యాక్ అందించనున్నట్టు పేర్కొంది. అదనంగా రూ.146 ప్లాన్ను ఎయిర్సెల్ లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్ కింద 28 రోజుల పాటు 5జీబీ 3జీ, 2జీ డేటాను, అపరిమిత కాల్స్ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఎయిర్సెల్ మొబైల్ యాప్, అమెజాన్ ద్వారా తాము బెస్ట్ రీఛార్జ్లను ఆఫర్ చేయనున్నామని ఎయిర్సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ చెప్పారు. ఎయిర్సెల్ యాప్, అమెజాన్ పేపై ఈ విలువ ఆధారిత ఆఫర్లతో వినియోగదారులను ఆహ్లాదపరచడం మాత్రమే కాకుండా, తమ ఫోన్లలో లభించే డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని స్వీకరించి, ఆ స్థాయిలను పెంచాలని నిశ్చయించుకున్నారు. ఎయిర్సెల్తో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అమెజాన్ పేమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ జగనాథన్ చెప్పారు. కాగ, ఎయిర్సెల్కు, ఇతర టెల్కోలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి షాకిస్తూ తాజాగా త్రిపుల్ క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. రూ.399, ఆపై మొత్తాలపై రూ.2,599 విలువైన ప్రయోజనాలు తమ ప్రైమ్ యూజర్లకు అందించనున్నట్టు పేర్కొంది. -
చేసేదేమీ లేక మూసేస్తున్న ఎయిర్సెల్
ముంబై : రిలయన్స్ కమ్యూనికేషన్తో డీల్ రద్దై పోయింది. ఇంక చేసేదేమీ లేక, మెల్లమెల్లగా ఎయిర్సెల్ తన భారత ఆపరేషన్ల నుంచి వైదొలగాలని చూస్తోంది. ఫండ్స్ లోటు, ఎక్కువ రుణాల నేపథ్యంలో ఎయిర్సెల్ తన ఆపరేషన్లను మూసి వేయాలని చూస్తోంది. రిలయన్స్ కమ్యూనికేషన్తో విలీన డీల్ రద్దు అయిన తర్వాత ఎయిర్సెల్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తాను కలిగి ఉన్న స్పెక్ట్రమ్ను మినహాయించి ఎయిర్సెల్ ఓ ఒప్పందాన్ని రూపొందించుకోవాలని చూస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డీల్లో కంపెనీ తన వైర్లెస్ ఆస్తులను విక్రయించేయాలని చూస్తున్నట్టు తెలిసింది. అంతేకాక 89 మిలియన్ సబ్స్క్రైబర్లను కూడా దేశీయ అతిపెద్ద టెలికాం ప్లేయర్కు తరలించనుందట. తన 40వేల టవర్లను ఓ ప్రత్యేక సంస్థకు విక్రయించేయాలని చూస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ రుణం రూ.20వేల కోట్లు ఉంది. ఈ రుణాన్ని తగ్గించుకోవడం కోసం ఎయిర్సెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీకి కేవలం 2జీ, 3జీ స్పెక్ట్రమ్లు మాత్రమే ఉన్నాయి. 4జీ స్పెక్ట్రమ్ను లేదు. 17 సర్కిళ్లలో ఎయిర్సెల్ తన కార్యకలాపాలు సాగిస్తుండగా.. దానిలో 13 సర్కిళ్లు 3జీకి సంబంధించినవి. కంపెనీ ఎక్కువ రెవెన్యూలను తమిళనాడు నుంచి ఆర్జిస్తోంది. అంతకముందు ఎయిర్సెల్ తన 2జీ, 3జీ స్పెక్ట్రమ్ను విక్రయించాలని చూడగా.. వాటిని విక్రయించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. -
భారీగా పడిపోతున్న ఆర్కామ్
ముంబై : అసలకే నష్టాలతో ముప్పుతిప్పలు పడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్, మార్కెట్లోనూ అతలాకుతలమవుతోంది. ఎయిర్సెల్తో విలీన చర్చలు వీగిపోవడంతో, అనిల్ అంబానీకి చెందిన ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు 52 వారాల కనిష్టంలోకి పడిపోయాయి. ఓ వైపు మార్కెట్లు దూసుకుపోతుండగా.. ఆర్కామ్ మాత్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. మంగళవారం ఇంట్రాడేలో ఆర్కామ్ స్టాక్స్ 10 శాతానికి పైగా కిందకి పడిపోయాయి. ప్రస్తుతం ఆల్టైమ్ కనిష్ట స్థాయి రూ.17.35 వద్ద ఆర్కామ్ షేర్లు నమోదవుతున్నాయి. ఆర్కామ్-ఎయిర్సెల్ విలీన కథ కంచికి చేరడంతో నేటి మార్కెట్లో ఆర్కామ్ షేర్లకు ఈ పరిస్థితి తలెత్తింది. ఆర్కామ్, ఎయిర్సెల్ మొబైల్ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంలో విఫలం చెందిందని ఆర్కామ్ తన ప్రకటనలో తెలిపింది. విలీనం విషయమై గతేడాది సెప్టెంబర్లో ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ విలీనం ద్వారా రూ.45,000 కోట్ల రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్కామ్ భావించింది. ప్రస్తుతం ఈ విలీనం వీగిపోవడంతో, ఆర్కామ్ రుణాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాల్సి వస్తోంది. కాగ, నేటి ట్రేడింగ్లో మార్కెట్లు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే 300 పాయింట్లు ఎగిసిన మార్కెట్లు, ప్రస్తుతం సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంలో 31,476 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంలో 9844 వద్ద ట్రేడవుతోంది. -
ఆర్కామ్–ఎయిర్సెల్ విలీన ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఆర్కామ్–ఎయిర్సెల్ విలీనం కథ కంచికి చేరింది. విలీన ఒప్పందం కాలం చెల్లినట్టు రెండు కంపెనీలు ప్రకటించాయి. ‘‘ఆర్కామ్, ఎయిర్సెల్ మొబైల్ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంలో విఫలం చెందింది’’ అని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ప్రకటనలో తెలిపింది. విలీనం విషయమై గతేడాది సెప్టెంబర్లో ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. న్యాయ, నియంత్రణపరమైన అనిశ్చిత పరిస్థితులు, స్వార్థపూరిత శక్తుల జోక్యంతో ఒప్పందానికి ఆమోదం పొందడంలో జాప్యానికి కారణమయ్యిందని ఆర్కామ్ ఆరోపించింది. టెలికం రంగంలో విపరీతమైన పోటీకితోడు విధానపరమైన నూతన చర్యలతో ఈ రంగానికి రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడినట్టు పేర్కొంది. ఇలా ఎన్నో అంశాల కారణంగా విలీన ఒప్పందం గడువు తీరిపోయినట్టు వివరించింది. వాస్తవానికి ఈ విలీనం ద్వారా రూ.45,000 కోట్ల రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్కామ్ భావించింది. విలీనం సాకారం కాకపోవడంతో ఆదివారం సమావేశమైన ఆర్కామ్ బోర్డు రుణాలు తీర్చివేసేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించింది. -
కార్తీ చిదంబరానికి మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ సెల్ మాక్సిస్లో సీరియస్గా స్పందించిన ఈడీ కోటికిపైగా ఆస్తులను ఎటాచ్ చేసింది. ఎఫ్డీలు, బ్యాంక్ అకౌంట్లతోపాటు గుర్గావ్లో ఇంటిని సీజ్ చేసింది. కార్తీకి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఎటాచ్ చేసింది. ముఖ్యంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ASCPL) పేరుతో ఉన్న రూ. 26 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను,ఇతర రూ. 96లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. గుర్గావ్లోని ఇంటిని బినామీ పేరుతో నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. -
సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో
సాక్షి,న్యూఢిల్లీః ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ చిదంబరం నిరాకరించారు. 2006లో కార్తీ తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఓ విదేశీ పెట్టుబడి క్లియరెన్స్కు సంబంధించి ప్రశ్నించేందుకు హాజరుకావాలని ఆయనను సీబీఐ కోరింది. ఈ అంశంలో నిందితులపై ఆరోపణలను ప్రత్యేక కోర్టు తిరస్కరించిందని చెబుతూ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నిరాకరించారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ సమాచారాన్ని సీబీఐకి చేరవేశామని ఆయన న్యాయవాది అరుణ్ నటరాజన్ చెప్పారు. మరోవైపు రాజకీయ కోణంలోనే తమ కుమారుడిని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆరోపిస్తున్నారు. ఎఫ్ఐపీబీ అనుమతులు రొటీన్గా ఇచ్చేవేనని చెప్పారు. -
ఎయిర్సెల్ ఆఫర్: వారికి ఫ్రీ డేటా
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ ఎయిర్సెల్ తన పోస్టు పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్సెల్ యాప్ వాడుతూ యూజర్లు బిల్లును చెల్లిస్తే, 1జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. '' మీ బిల్లును ఎయిర్సెల్ యాప్పై ఆన్లైన్లో చెల్లించండి.. 1జీబీ డేటాను ఉచితంగా పొందండి'' అని ఎయిర్సెల్ తన ప్రకటనలో తెలిపింది. బిల్లు చెల్లింపులకు, అకౌంట్ను నిర్వహించడానికి వంటి పలు వాటికి ఎయిర్సెల్ యాప్ను వాడుకోవచ్చని చెప్పింది. ఇటీవలే భారత్ క్యూఆర్ కోడ్ ద్వారా 200 రూపాయల బిల్లు చెల్లిస్తే, 100 రూపాయల క్యాష్బ్యాక్ను అందించనున్నట్టు ఎయిర్సెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్తో ఎయిర్సెల్ విలీనం కాబోతుంది. దీనికి సంబంధించి గతనెలలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ నుంచి ఆమోదం కూడా లభించింది. రిలయన్స్ జియో రాకతో, టెలికాం కంపెనీలన్నీ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. తన కస్టమర్లను కాపాడుకోవడానికి సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. Everyone loves free goodies. Grab yours too. Pay your bill online on the Aircel app and get 1 GB data FREE. Visit: https://t.co/EY1wnsQcAO. pic.twitter.com/aydAvjruyy — Aircel (@Aircel) September 7, 2017 -
జియోకి డబుల్: ఎయిర్సెల్ రెండు సరికొత్త ప్లాన్స్
రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి బాగానే కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించాయి. తాజాగా ఎయిర్సెల్ కంపెనీ కూడా జియోకు కౌంటర్గా, అది ఆఫర్ చేసే దానికంటే రెండింతలు ఎక్కువ డేటాతో రెండు సరికొత్త ప్లాన్స్ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్లలో రోజుకు 2జీబీ డేటాను, అపరిమిత కాల్స్ను 84 రోజుల పాటు ఎయిర్సెల్ అందించనుంది. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కింద అందించే రూ.399 ప్లాన్కు సమానమైన వాలిడిటీలో ఈ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి ఒకటి ఈశాన్య దేశ ప్రజలకు రూ.419 ప్లాన్. మరొకటి జమ్మూకశ్మీర్ ప్రాంత ప్రజలకు రూ.449 ప్లాన్. అంతేకాక జమ్మూకశ్మీర్ సర్కిల్కు మరో ప్లాన్ రూ.229ను కూడా ఎయిర్సెల్ ఆవిష్కరించింది. ఈశాన్య దేశ ప్రజలకు ఎయిర్సెల్ అందించే రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ కింద రోజుకు 2జీబీ డేటా చొప్పున 84 రోజుల పాటు 168 జీబీ డేటాను వాడుకోవచ్చు. దీంతో పాటు అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ను ఈ ప్యాక్తో ఏ నెట్వర్క్కైనా చేసుకోవచ్చు. 3జీ లేదా 2జీ స్పీడులో ఈ ఇంటర్నెట్ను ఎయిర్సెల్ అందిస్తోంది. అదేవిధంగా జమ్మూకశ్మీర్ ప్రాంత ప్రజలకు అందించే రూ.449 ప్రీపెయిడ్ ప్యాక్లోనూ పైన పేర్కొన ప్రయోజనాలే అందుబాటులో ఉంటాయి. మరో ప్యాక్ రూ.229 కింద 84 రోజుల పాటు 84జీబీ డేటాను ఎయిర్సెల్ అందించనుంది. అంటే రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాలింగ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అయితే కేవలం ఎయిర్సెల్ నెట్వర్క్కు మాత్రమే కాల్స్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ ప్లాన్ కూడా 3జీ లేదా 2జీ స్పీడులో అందుబాటులో ఉంటుంది. తాము అందించే ఈ కొత్త ప్లాన్లు తమ కస్టమర్లు ముఖ్యంగా విద్యార్థులకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కు రోజంతా కనెక్ట్ అయి ఉండటానికి ఉపయోగపడతాయని ఉత్తర భారత సర్కిల్ రీజనల్ మేనేజర్ హరీష్ శర్మ చెప్పారు. ఉన్నతమైన విలువలో అంతరాయం లేని ఇంటర్నెట్ సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. కాగ, జియో ఆఫర్ చేసే రూ.399 ప్లాన్ కింద 84 రోజుల పాటు 84జీబీ డేటా మాత్రమే వాడుకోవడానికి వీలుంటుంది. రోజుకు 2జీబీ డేటా కావాలంటే రూ.509తో రీఛార్జ్ చేయించుకోవాలి. కానీ దీని వాలిడిటీ 56 రోజులు మాత్రమే. ఇది ప్రస్తుతం ఎయిర్సెల్ అందిస్తున్న ప్లాన్ల కంటే కూడా 28 రోజులు తక్కువ. -
జియో ఎఫెక్ట్: ఎయిర్సెల్ మరో కొత్త ఆఫర్
రిలయన్స్ జియో ఎఫెక్ట్తో ఎయిర్సెల్ మరోసారి తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం రోజు రూ.333తో కొత్త డేటా ప్లాన్ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తను ఆఫర్ చేసే ప్లాన్లతో ఎంతో ఉన్నతమైన ప్లాన్గా దీన్ని అభివర్ణించింది. ఎయిర్సెల్ అందిస్తున్న రూ.333 ప్యాక్పై యూజర్లు 30జీబీ 3జీ డేటాను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే దీనిపై ఎలాంటి రోజువారీ వాడక పరిమితులు లేవు. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం కర్ణాటక ప్రాంత ప్రజలకు మాత్రమే కంపెనీ ప్రకటించింది. ఇంకా అన్ని రాష్ట్ర కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం లేదు. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఉన్న ఎయిర్సెల్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఈ డేటా ప్లాన్ 3జీ స్పీడుకు మాత్రమే పరిమితం చేశామని కంపెనీ తెలిపింది. ఈ-రీఛార్జ్ ద్వారా లేదా USSD - 121333# కు డయల్ చేసి ఈ కొత్త ప్లాన్ను యూజర్లు యాక్టివేట్ చేసుకోవచ్చని చెప్పింది. గత వారమే ఈ టెలికాం కంపెనీ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.348 ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని 84 రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్సెల్ తాజాగా తీసుకొస్తున్న ఈ ప్యాక్లు ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్కు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. రూ.333 ప్లాన్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన కర్ణాటక ప్రాంత ఎయిర్సెల్ సర్కిల్ బిజినెస్ హెడ్ కన్వర్బీర్ సింగ్...తాము కొత్తగా తీసుకొచ్చిన రూ.333 డేటా రీఛార్జ్ ప్యాక్, తమ కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు లేని ఇంటర్నెట్ సేవలను ఎంతో ఉన్నతమైన విలువలతో అందిస్తుందని తెలిపారు. అన్వేషించలేని ప్రపంచ వీడియోలు, మ్యూజిక్, మూవీలు, ఎంటర్టైన్మెంట్లను ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఉత్తమమైన ప్లాన్గా చెప్పారు. -
జియోకు పోటీ: ఎయిర్సెల్ బంపర్ ఆఫర్
రెండు రోజుల క్రితమే రిలయన్స్ జియో తన కొత్త ప్లాన్లను ప్రకటించింది. అప్పుడే ప్రత్యర్థుల నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి జియో కొత్త ప్లాన్ రూ.399కు పోటీగా తమ ప్రీపెయిడ్ ప్యాక్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్సెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ రూ.348ను తమ యూజర్లకు అందిస్తున్నట్టు పేర్కొంది. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని 84రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ సెల్ తాజాగా ప్రకటించిన ఈ ప్యాక్, ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్కు గట్టిపోటీ ఇవ్వనుంది. జియో యూజర్లు కూడా తమ కొత్త ప్లాన్ కింద 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్లు వాడుకోవడానికి వీలుంది. ఎయిర్సెల్ కొత్త రీఛార్జ్ ప్యాక్ ఎఫ్ఆర్సీ 348 ప్రస్తుతం ఉత్తర యూపీలో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. ఈ ప్యాక్ కింద యూజర్లు ఏ నెట్వర్క్కైనా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్(లోకల్, ఎస్టీడీ) చేసుకోవచ్చు. ఎలాంటి డైలీ లేదా వీక్లి పరిమితులు లేవు. అయితే ఇంటర్నెట్ స్పీడు 3జీ మాత్రమే. అదే రిలయన్స్ జియో నెట్వర్క్పై అయితే 4జీ స్పీడును పొందవచ్చు. ఈ ప్యాక్ గురించి యూపీ(ఈస్ట్) సర్కిల్ బిజినెస్ హెడ్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ.. ''ఎఫ్ఆర్సీ 348 మార్కెట్లో ఇప్పటివరకున్న ఉత్తమమైన విలువ. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతుందనే బాధ అవసరం లేకుండా వీడియో చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్, వీడియోల స్ట్రీమింగ్, వాయిస్ కాల్స్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ ప్యాక్ను డిజైన్ చేసినట్టు చెప్పారు. కాగ, రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల నుంచి టారిఫ్ ప్లాన్లు అమలు చేయడం, ఆ తర్వాత ప్లాన్ల రేట్లను పెంచడం టెలికాం ఇండస్ట్రీకి సానుకూలంగా మారుతుందని విశ్లేషకులంటున్నారు. ప్రత్యర్థులు కూడా జియో రేట్లకు అనుగుణంగా తమ టారిఫ్ ప్లాన్లను పెంచుకోవడానికి వెసులుబాటు కలుగుతోందని చెప్పారు.. ఇన్నిరోజులు జియో దెబ్బకు ప్రత్యర్థులు హడలిపోయిన సంగతి తెలిసిందే. -
1జీబీ 3జీ డేటా ఫ్రీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ సేవల సంస్థఎయిర్సెల్ తారిఫ్వార్లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ అఫర్ చేసిన సంస్థ మరో ఆఫర్ను అందుబాటులో తెచ్చింది. రూ.50లకు పైన రీచార్జ్లపై 100ఎంబీ డేటా ఫ్రీ ఆఫర్ చేస్తోంది. 10 రోజుల వాటిడిటీతో రూ. 76 లకు 1 జీబీ 3జీ డేటాను అందించనుంది. అలాగే రూ.86 రీచార్జ్పై ఫుల్ టాక్ టైం ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు 100ఎంబీ డేటా ప్రీ. తమ మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ స్పెషల్ డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలను అందించనున్న బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. కస్టమర్ల డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో తమ యూజర్ల కోసం ఈ వాల్యూ ఆఫర్లను లాంచ్ చేసినట్టు ఎయిర్సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ప్రకటించారు. యాప్ ఆధారిత సేవల్లో భారీ విజయం సాధించామని, అలాగే కస్టమర్లకు నిరంతరాయంగా సేవల్ని అందించడంలో ఇవి సౌలభ్యంగా ఉన్నట్టు తెలిపారు. కాగా ఎయిర్సెల్ దేశవ్యాప్తంగా 13 సర్కిల్స్ లో 3జీ స్పెక్ట్రం సేవలను అందిస్తోంది. -
ఎయిర్ సెల్-మ్యాక్సిస్ డీల్పై స్పందించిన చిదంబరం
నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్ కు ఆమోదం తెలిపారని తనపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. సాధారణ వ్యాపారాలకు మాదిరిగానే ఎయిర్ సెల్- మ్యాక్సిస్ డీల్ కు ఆమోదముద్ర వేసినట్టు చిదంబరం మంగళవారం చెప్పారు. కాగ విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) నిబంధనల ఉల్లంఘనలో ఆర్థికమంత్రిగా చిదంబరం పాత్రపై దర్యాప్తు జరిపిన ఈడీ, ఆ నివేదికను నిన్న సుప్రీంకోర్టుకు అందజేసింది. ''ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో విదేశీ ఇన్వెస్ట్మెంట్ల విలువ బట్టి, ఎఫ్ఐపీబీ ఆ డీల్ ఆమోదం కోసం ఆర్థికమంత్రి ముందుకు తీసుకొచ్చింది. ఆర్థికమంత్రిగా నేను సాధారణ వ్యాపారాలకు ఆమోదం ఇచ్చిన మాదిరిగానే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను'' అని చిదంబరం చెప్పారు. ఎఫ్ఐపీబీలో ఐదుగురు సెక్రటరీలు ఉంటారని, వారు ఈ కేసులను పరిశీలించిన తర్వాతనే ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనేది ప్రతిపాదిస్తారని చిదంబరం నేటి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించే ప్రతిఒక్కరి దగ్గర్నుంచి సీబీఐ రిపోర్టు తీసుకుందని, సాధారణ వ్యాపారం మాదిరిగా ఆమోదం ఇవ్వడానికి ఆర్థికమంత్రికి సమర్థాధికారం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఇందులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్టు కోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన కోర్టు దర్యాప్తు స్థితిగతులపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. గరిష్టంగా రూ. 600 కోట్ల విలువైన ఎఫ్డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు. -
ఎయిర్సెల్ స్కాం: మౌనం వీడిన చిదంబరం!
ఎయిర్సెల్-మాక్సిస్ కుంభకోణంపై తాజాగా కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం స్పందించారు. ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందానికి సాధారణ ప్రక్రియలో భాగంగానే తాను అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. 'ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో విదేశీ పెట్టుబడుల విలువను పరిగణించి.. ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు) ఆర్థికమంత్రికి నివేదిక సమర్పించి.. ఆమోదం కోరుతుంది. ఒక ఆర్థికమంత్రిగా సాధారణ ప్రక్రియలో భాగంగానే నేను అనుమతి ఇచ్చాను' అని చిదంబరం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో వివిధ అంశాలపై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సీబీఐను సుప్రీంకోర్టు సోమవారం కోరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నేత, పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ తనకు సమాధానం ఇచ్చిందని, ఈ ఒప్పందానికి 2006లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ఇచ్చిన ఎఫ్ఐపీబీ అనుమతిని కూడా విచారిస్తున్నామని సీబీఐ స్పష్టం చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ఎఫ్ఐపీబీ అనుమతి ఇచ్చారని, ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందాన్ని నిజానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కు నివేదించాల్సి ఉండేదని స్వామి కోర్టులో వాదించారు. నిబంధనల ప్రకారం రూ. 600 కోట్ల పైచిలుకు విదేశీ పెట్టుబడుల వ్యవహారాలన్నింటినీ సీసీఈఏకు నివేదించాల్సి ఉంటుందని, కానీ రూ. 3,500 కోట్ల విలువచేసే ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందాన్ని సీసీఈఏకు నివేదించడానికి బదులు చిదంబరమే స్వయంగా ఆమోదం తెలిపారని స్వామి తప్పుబట్టారు. అయితే, ఈ వ్యవహారంలో తాను నిబంధనలన్నింటినీ పాటించినట్టు చిదంబరం తాజా ప్రకటనలో వివరణ ఇచ్చారు. -
చిక్కుల్లో చిదంబరం
- మ్యాక్సిస్లో ఆయన పాత్రపై ఈడీ నివేదిక - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మ్యా క్సిస్ వ్యవహారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం మెడకు తీవ్రంగానే చుట్టుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందానికి అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సోమవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) నిబంధనల ఉల్లంఘనలో ఆర్థికమంత్రిగా చిదంబరం పాత్రపై ఈడీ దర్యాప్తు జరిపింది. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఇందులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్టు కోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన కోర్టు దర్యాప్తు స్థితిగతులపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అయితే అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ అందుబాటులో లేనందున కేసు విచారణ మూడువారాలపాటు వాయిదా వేయాలన్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్, బీజేపీ ఎంపీ సుబ్రమణియం స్వామి మీడియాతో మాట్లాడుతూ ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసు నిందితుల నుంచి కార్తి ఖాతాలకు నిధులు బదిలీ అయినట్టు నిరూపించే ఆధారాలను దర్యాప్తు సంస్థలకు అందజేశానని వెల్లడించారు. ఈ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. గరిష్టంగా రూ. 600 కోట్ల విలువైన ఎఫ్డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు. -
చిదంబరానికి ఎయిర్ సెల్ షాక్!
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ వ్యవహారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పీచిదంబరం మెడకు తీవ్రంగానే చుట్టుకుంటోంది. ఒప్పదంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈడీ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు)ఎఫ్ఐపీబీ నిబంధనల ఉల్లంఘనలో ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై ఈడీ నివిదేకను సుప్రీంకు అందించింది. దీంతో దీనిపై తదుపరి విచారణను కోర్టు మే 2 వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ ఈ కేసులో చిదంబరం పాత్రపై విచారిస్తున్నట్టు కోర్టుకు వివరించింది. మరోవైపు ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీలాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో విచారణ జరపించాల్సిందిగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరిలో దీనిపై పూర్తి నివేదిక అందించించాల్సిందిగా స్వామిని కోరింది. 2016 నాటి ఈ కేసుకు కీలక సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మాక్సిస్ అనుబంధం సంస్థ గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది.. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఎఫ్ఐవివి అభ్యర్థనపై ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతులు మంజూరు చేశారు. అయితే నిబంధనలను విరుద్ధంగా ఎయిర్సెల్ మాక్సిస్ ఒప్పందం జరిగిందని బీజేపీ సీనియర్ సుబ్రమణియన్ స్వామి వాదిస్తున్నారు. 100 శాతం వాటా అనుమతిద్వారా మలేషియా సంస్థ మాక్సిస్ నుంచి కార్తీ చిదంబరానికి భారీ ముడుపులు ముట్టాయని స్వామి ఆరోపించారు. ప్రధానంగా 74శాతం సీలింగ్ ఉండగా ఎక్కువ పెట్టుబడులకు అనమతించారని, గరిష్టంగా రూ. 600 కోట్లు విలువైన ఎఫ్డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు. కాగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అయితే ఎయిర్సెల్ మాక్సిస్ ఒప్పందానికి అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చిదంబరం వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆర్కాం-ఎయిర్సెల్ విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) , ఎయిర్ సెల్విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైర్లెస్ బిజినెస్ను విడదీసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించినట్లు ఆర్కాం తెలిపింది. ఈ మేరకు పథకం యొక్క ఆమోదం కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ లో ఒక అప్లికేషన్ దాఖలు చేసినట్టు చెప్పింది. ప్రతిపాదిత బదలాయింపు ఇతర అవసరమైన ఆమోదం పొందాల్సి ఉందని ఆర్కాం పేర్కొంది. వైర్లెస్ బిజినెస్ను విడదీసి తద్వారా ఎయిర్సెల్ లిమిటెడ్, డిష్నెట్ వైర్లెస్ లిమిటెడ్లో విలీనం చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఈ విలీనం ప్రకారం ఏర్పడే కొత్త సంస్థలో ఆర్కాం, ఎయిర్ సెల్ సమ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే దాదాపు 28,000 కోట్ల రుణాన్ని కూడా ఆర్ కామ్, ఎయిర్సెల్ చెరి సగం భరించాలి. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న యోచనలో ఆర్కాం ఈ విలీనానికి శ్రీకారం చుట్టింది. -
‘ఎయిర్సెల్–మ్యాక్సిస్’ ఆధారాలివ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మ్యాక్సిస్ డీల్కు సంబంధించి తను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు సమర్పించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. 2006లో జరిగిన ఎయిర్సెల్–మ్యాక్సిస్ డీల్కు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బీ) అనుమతి ఇచ్చే విషయంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అక్రమాలకు పాల్పడ్డారని స్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. రూ.600 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ ఇచ్చి.. దాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు పంపేలా చేయడంలో చిదంబరం సూత్రధారి అంటూ స్వామి కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం చిదంబరం పాత్రపై ఆధారాలు రెండు వారాల్లో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. -
‘మనీల్యాండరింగ్’ కిందకు రాదు!
మారన్ సోదరుల కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో మారన్ సోదరులకు ప్రత్యేక న్యాయస్థానం విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ, సీబీఐ తరఫున ఈ కేసును వాదించడానికి నియమితులైన ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్పీపీ) ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దయానిధి మారన్ , కళానిధి మారన్ లకు బెయిల్ మంజూరు చేయడం, ఈ కేసుకు సంబంధించి జప్తు చేసిన రూ. 742 కోట్లను విడుదల చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అయితే ఈ కేసులో మనీల్యాండరింగ్కు సంబంధించిన ఆధారాలు ఏమీలేవని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో జప్తు చేసిన రూ. 742 కోట్లు నేర సంబంధిత ఆదాయం కిందకు రాదు. అందువల్ల మనీల్యాండరింగ్ ఏ మాత్రం కాదు’’ అని స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ లో అనేక లోపాలున్నాయని తెలిపింది. లోపాలను సరిచేసుకొని సరైన పిటిషన్ తో రావడానికి ఆనంద్ గ్రోవర్కు బుధవారం(8వ తేదీ) వరకు సమయమిచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా మారన్ సోదరులకు బెయిల్ మంజూరు చేయకూడదని, జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయకూడదనే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ కోసం ఎదురు చూడకుండా తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు గ్రోవర్ కోర్టుకు తెలిపారు. -
మారన్ బ్రదర్స్కు భారీ ఊరట
-
మారన్ సోదరులకు ఊరట
ఎయిర్సెల్–మాక్సిస్ కేసుల్లో అభియోగాలు కొట్టేసిన ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ: ఎయిర్సెల్ – మాక్సిస్ ఒప్పందా నికి సంబంధించిన కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , ఆయన సోదరు డు కళానిధి మారన్ కు ఊరట లభించింది. ఈ కేసులకు సంబంధించి వారిపై సీబీఐ, ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన అభియోగాలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కొట్టేసింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దయానిధి మారన్, కళానిధి మారన్ తో పాటు కళానిధి మారన్ భార్య కావేరీ కళానిధి, సౌత్ ఆసియా ఎంటర్టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, సన్ డైరెక్ట్ టీవీ ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీలకు విముక్తి లభించినట్లయింది. అయితే ఈ ఉత్తర్వులు మలేసియా జాతీయు లైన రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్కృష్ణన్ కు వర్తించవని, వారిపై విచారణను ప్రత్యేకంగా చేపట్టినందున ఈ ఉత్తర్వులు మారన్ సోదరులు మిగిలిన వారికి మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం చేసింది. ఎయిర్సెల్–మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి మారన్ సోదరులతో పాటు రాల్ఫ్ మార్షల్, టి.ఆనంద్కృష్ణన్ , సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్వర్క్స్, మాక్సిస్ కమ్యూనికేషన్స్ , సౌత్ ఏషియా ఎంటర్టైన్ మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, అదనపు కార్యదర్శి(టెలికాం) జేఎస్ శర్మపై సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిపై 120బీ(నేరపూరిత కుట్ర), ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. కేసు దర్యా ప్తు సమయంలో జేఎస్ శర్మ మరణించారు. ఈడీ కూడా మారన్ సోదరులతో పాటు కళానిధి మారన్ భార్య కావేరి, సౌత్ ఏషియా ఎఫ్ఎం లిమిటెడ్ ఎండీ కె.షణ్ముగం, ఎస్ఏఎఫ్ఎల్, సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. 2006లో మలేసియాకు చెందిన మ్యాక్సిస్కు ఎయిర్సెల్ను విక్రయిం చాలని దయానిధి ఆ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ ను ఒత్తిడి చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ ఆరోపిం చారు. అయితే ఈ ఆరోపణలను దయానిధి మారన్ తో పాటు మిగతా నిందితులు ఖండిం చారు. ఆరుగురు నిందితుల నుంచి వాంగ్మూ లం తీసుకున్న న్యాయస్థానం వీరిపై దాఖలైన అభియోగాలకు సంబంధించి సరైన సాక్ష్యా లు లేవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
మారన్ బ్రదర్స్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో 2 జీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మారన్ సోదరులకు ఊరట లభించింది. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు నిందితులందరికీ ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అవినీతి , మనీ లాండరింగ కేసులో మారన్ సోదరులపై ఉన్న అభియోగాలను కొట్టి వేసింది. వీరిపై సీబీఐ , ఈడీ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఈకీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్ సహా, ఆయన సోదరుడు కళానిధి మారన్, కళానిధి భార్య కావేరీ కళానిధి, సౌత్ ఆసియా ఎఫ్ ఎం లిమిటెడ్ ఎండీ, షణ్ముగం ఇతర రెండు (ఎస్ఏఎఫ్ఎల్ , సన్ డైరెక్ట్ టివీ ప్రెవేట్ లిమిటెడ్) కంపెనీలకు ఊరట కల్పించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన కేసుల నుంచి వీరికి విముక్తి కల్పించింది. ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి రెండు వేర్వేరు విషయాలను విన్న జరిగినది. యుపిఎ ప్రభుత్వం మంత్రిగా ఉన్న దయానిధి మారన్ తన పలుకుబడితో మలేషియా వ్యాపారవేత్త టి.ఎ. ఆనంద కృష్ణన్ కు సహాయం చేశారని సీబీఐ ఆరోపించింది. ఎయిర్ సెల్ లో అతిపెద్ద వాటాదారుడు శివశంకరన్ తో బలవంతంగా తన వాటాలను అమ్మించారని ఆరోపిస్తూ సీబీఐ చార్జ్ షీట దాఖలు చేసింది. మాక్సిస్ అనుబంధం సంస్థ అయిన గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది. దీనికిగాను దయానిధికి భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు స్పెషల్ కోర్టు ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. -
సుప్రీం స్టే పై స్పందించిన శివశంకరన్
న్యూఢిల్లీ:ఎయిర్సెల్-మాక్సిస్ కుంభకోణంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్నిఎయిర్సెల్ అసలు ప్రమోటర్ సి శివశంకర్ స్వాగతించారు. న్యాయవ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందనీ, సుప్రీం పరిశీలనను గౌరవిస్తామంటూ సంతోషం వ్యక్తంచేశారు. మలేషియా మాక్సిస్ గ్రూప్ మాక్సిస్ నుంచి ఎయిర్ సెల్ 2 జి లైసెన్సుల బదిలీ ఒప్పందంపై తాత్కాలిక స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మర్చంట్ బ్యాంకర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (ఎస్సీబీ)భారతీయ బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్ సెల్స్ యూజర్స్ ను టేక్ ఓవర్ చేసే కొనుగోలుదారుని చూడలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ను శివశంకర్ కోరారు. తద్వారా ఎయిర్ సెల్, శివ గ్రూపు బాకీల చెల్లింపునకు తోడ్పడాలని కోరారు. కాగా కావాలనే తన 2జి స్పెక్ట్రం లైసెన్సు తిరస్కరించారని చెన్నైలోని ఎయిర్ సెల్ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ అప్పట్లో ఆరోపించారు. అలాగే ఎయిర్ సెల్ కంపెనీని మలేసియాకి చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు గుప్పించారు. అయితే14 రకాల లైసెన్సులకోసం దరఖాస్తు చేసుకోగా వేటినీ పట్టించుకోలేదు. విసిగి పోయిన శివశంకరన్ డిసెంబరు 2006లో ఎయిర్ సెల్ కంపెనీలోని మెజారిటీ షేర్లను మాక్సిస్ కంపెనీకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎయిర్ సెల్ కి 14 లైసెన్సులూ వచ్చేశాయి. ఎయిర్ సెల్ కంపెనీని తనకు అమ్మేలా చేసినందుకు మాక్సిస్ కంపెనీ దయానిధి సోదరుని కంపెనీ సన్ డైరెక్ట్ కంపెనీలో రు.599.01 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా సీబీఐ నివేదించిన సంగతి తెలిసిందే. -
అంబానీకి షాకిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్పెక్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఆర్ కాం కి షాకిచ్చింది. మలేషియా కంపెనీ మాక్సిస్ నుంచి 2 జి లైసెన్స్ ను మరో టెలికం కంపెనీ బదిలీ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మనీ లాండరింగ్ కేసు కొనసాగుతుండగా నే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య ప్రతిపాదిత ఒప్పందంపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం నిందితులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు నలుగురూ స్పెషల్ కోర్టుముందు విధిగా హాజరు కావాలంటూ సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాపార వేత్త ఆనంద కృష్ణన్, మలేసియా సంస్థ మాక్సిస్ కు చెందిన అగస్టస్ రాల్ఫ్ మార్షల్, మరో ఇద్దరు జనవరి 27లోపు కోర్టుముందు హాజరు కావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణకు ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. విచారణకు ప్రమోటర్లు అంగీకరించకపోతే 2016లో ఎయిర్ సెల్ కు కేటాయించిన 2 జీ స్పెక్ట్రంను లైసెన్స్ ను సీజ్ చేయాలని తెలిపింది. నిందితులు కోర్టు ముందు హాజరు కాకపోతే 2 వారాల్లోగా దీన్ని విక్రయించాల్సిందిగా టెలికాం శాఖకు స్పష్టం చేసింది. అంతేకాదు ఈ లైసెన్సు ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ 2 జి లైసెన్స్ బదిలీ ద్వారా చందాదారుల ప్రతికూల ప్రభావాన్ని నివారించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా సంచలనం రేపిన ఎయిర్ సెల్ మాక్సిస్ కుంభకోణంలో 2014 ఆగస్టులో మారన్ సోదరులతో బాటు మలేసియా వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ మీద, మలేసియాకు చెందిన మరో వ్యక్తి అగస్టస్ రాల్ఫ్ మార్షల్ పైన, సన్ డైరెక్ట్, మాక్సిస్ కమ్యూనికేషన్, సౌత్ ఏషియా ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్ వర్క్ మీద సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్
ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ దూసుకువచ్చింది. వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్ చేసింది. ఏ నెట్వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ అందించే సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ. 23లతో మొదలయ్యే రీచార్జ్ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ23, రీఛార్జ్ పై వినియోగదారులు ఒక రోజు ఒక చెల్లుబాటుతో ఏ నెట్ వర్కుకైనా అపరిమిత స్థానిక , ఎస్టీడీ కాలింగ్ అవకాశాన్ని అందిస్తున్నట్టు ఎయిర్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ . 348 రీఛార్జ్ (స్థానిక మరియు ఎస్టీడీ) అంతటా ఉచిత కాల్స్ అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటూ 500 ఎంబీ 3జీ డేటా , 4జీ వినియోగదారులకు 1.5జీబీ 3జీ డేటా ఉచితంగా అందిస్తోంది.వాలిడిటీ 28 రోజులు. వినియోగదారులను సంతోషపెట్టేందుకు ఉచిత కాలింగ్, డాటా సదుపాయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఎయిర్సెల్ లిమిటెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ తెలిపారు. వినియోగదారులకు ఆహ్లాదం, కాల్ మరియు డేటా ప్రయోజనాలు అందించేందుకు , అందుబాటుధరల్లో ఆన్ లైన్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ రెండు పథకాలను లాంచ్ చేసినట్టు పేర్కొన్నారు. -
కేంద్ర మాజీ మంత్రిపై సీబీఐ చార్జ్ షీట్
చెన్నై: టెలికాం మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్లపై సీబీఐ అధికారులు చార్జ్ షీటు దాఖలుచేశారు. ప్రైవేట్ టీవీ(సన్ టీవీ నెట్ వర్క్) ఛానల్కు అక్రమంగా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు (ఎయిర్ సెల్-మాక్సిస్)ప్రొవైడ్ చేసిన కేసులో మారన్ సోదరులు నిందితులుగా ఉన్నారు. చెన్నైలోని స్పెషల్ కోర్టులో మారన్ సోదరులతో పాటు మరికొందరు నిందితులపై అవినీతి నిరోధక చట్టం పరిధికి లోబడి చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఫోర్జరీ చేశారని ఆరోపణలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఎలాంటి బిల్లులే లేకుండా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు ఇవ్వడం వల్ల బీఎస్ఎన్ఎల్ సంస్థతో పాటు చెన్నై, ఢిల్లీకి చెందిన ఎంటీఎన్ఎల్ టెలికాం కంపెనీలు 1.78కోట్లు నష్టపోయాయి. అయితే ఆ సమయంలో సన్ టీవీ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన కళానిధి మారన్ సహా ఆ టీవీ ఇద్దరు ఉన్నత అధికారులు, ఆయన అనుయాయుల పేర్లను చార్జ్షీటులో చేర్చినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లకు పైగా టెలికాం స్కామ్ కేసు విచారణ కొనసాగుతోంది. -
తమ్ముడు దూసుకొచ్చేశాడు
భారతదేశ టెలికాం రంగంలో మరో సంచలనానికి తెర లేచింది. దేశీయ టెలికాం రంగంలో అతి పెద్ద కార్పోరేట్ విలీనానికి ఇరు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న విలీనం అంశం చివరికి పట్టాలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ (57)కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లో ఎయిర్ సెల్ విలీనం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను బుధవారం వెల్లడించాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, మలేషియా మాక్సిస్ కమ్యూనికేషన్స్ రెండూ బోర్డు మరియు కమిటీలలో సమాన ప్రాతినిధ్యంతో 50 శాతం వాటాను కలిగి ఉండేలా డీల్ కుదుర్చుకున్నాయి. ఎయిర్ సెల్ ను విలీనం చేసుకోవడం ద్వారా 4జీ సేవల్లో తనదైన ముద్ర వేసి, భారత్ లో నంబర్ వన్ టెలికాం సంస్థగా ఆర్ కాం నిలిచేందుకు యోచిస్తోంది. అలాగే 'మెర్జ్ డ్ కో' పేరుతో ఈ సంస్థ ప్రాచుర్యం లోకి రానుంది. ఇది రూ .35,000 కోట్ల( 5.2 బిలియన్ డాలర్లు) నికర విలువతో, రూ 65,000 కోట్లు (9.7 బిలియన్ డాలర్లు ) విలువైన ఆస్తులు కలిగి ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ వైర్లెస్ బిజినెస్ను విడదీసి ఎయిర్సెల్లో విలీనం చేయనుంది. రెండు సంస్థలూ తమకు ఉన్న రూ. 14000 కోట్ల భారాన్ని నూతన సంస్థకు బదలాయిస్తాయి.. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పు రూ. 20 వేల కోట్ల వరకూ తగ్గనుంది. తాజా విలీనంతో 19 కోట్ల మంది ఖాతాదారులతో వాటాదారుల పరంగా మూడవ అతి పెద్ద టెలికాం సంస్థగా ఆర్ కాం అవతరించనుంది. అలాగే 2జీ, ౩జీ, 4జీ సేవలను అందించేందుకు ఆర్ కాంకు సులభం కానుంది. 9.87 కోట్ల చందాదారులతో ఆర్ కాం నాలగవ అతిపెద్ద సంస్థగా ఉండగా, ఎయిర్ సెల్ 8.8కోట్ల ఖాతాదారులతో ఆరవ స్థానంలో ఉంది. ప్రస్తుత ఈ ఒప్పందం ప్రకారం మరో ప్రముఖ టెల్కో ఐడియా ను వెనక్కి నెట్టి 'మెర్జ్ డ్ కో' మూడవ స్థానానికి ఎగ బాకనుంది. మార్కెట్ లీడర్ గా భారతి ఎయిర్ టెల్ ఉండగా, వోడాఫోన్ రెండవ స్థానంలో ఉంది. ఇరు సంస్థల వాటాదారుల గణనీయమైన దీర్ఘకాల విలువను సృష్టించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అనిల్ అంబానీ ప్రకటించారు. క్యాపిటల్ వ్యయం ( కేప్ఎక్స్), ఆపరేటింగ్ వ్యయం(ఓపెక్స్) రూ .20,000 కోట్లుగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉమ్మడి స్పెక్ట్రం ఒప్పందం 2033-35 వరకు అమల్లో ఉంటుందన్నారు. కాగా జియో సంచలనం తర్వాత టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇది మరింత కన్సాలిడేట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆర్ కాం జియో కి షాకిస్తుందా?
ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎయిర్ సెల్ , ఆర్ కాం విలీనానికి రంగం సిధ్దమైంది. అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్సెల్ సంస్థ విలీనంపై ఈ నెలలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న కోరికతో ఉన్న అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. బుధవారం జరగబోయే ఆర్ కాం బోర్డ్ సమావేశం అనంతరం ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు రూ. 14వేల కోట్ల వాటాల జారీ విధానం ద్వారా ఈ ఒప్పందం ఖరారు కానుంది. దీని ద్వారా 196 మిలియన్ల ఖాతాదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సమాచారం. ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఒక కొత్త బ్రాండ్ నేమ్ తో పనిచేయన్నాయి. ఎయిర్ సెల్,ఆర్ కాం సమాన భాగస్వామ్యంతో ఈ కొత్త సంస్థ పనిచేయనుంది. చెరి 580 మిలియన్ డాలర్ల పెట్టబడులతో 7600కోట్ల ఈక్విటీ పూల్ ను సాధించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్త కంపెనీ స్పెక్ట్రం లైసెన్స్ 800, 900,1800, 2100, 2300 ఎంహెచ్జె బాండ్ విడ్త్ తో ఉంటుందని అంచనా. అయితే ఈ వార్తలను ధృవీకరించడానికి ఇరు సంస్థలు నిరాకరించాయి. కాగా ఉచిత సేవలు, ఉచితరోమింగ్ అంటూ సంచలనంగా మార్కెట్ లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి పోటీగా ఆర్ కాం తాజాగా 40రూపాయలకే ఫుల్ టాక్ టైం, 1 జీబీ డాటా ఉచితంగా అందించే ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మూడవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ ఏర్పాటుపై కన్నేసిన అనిల్ ఆధ్వర్యంలోని ఆర్ కాం సోదరుడు ముకేష్ సొంతమైన జియోకి షాకిస్తుందా అనే అభిప్రాయం మార్కెట్ లో నెలకొంది. -
చిదంబరానికి మరిన్ని కష్టాలు
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరిన్ని కష్టాలు వస్తున్నాయి. ఆయన కుమారుడు, వ్యాపారవేత్త అయిన కార్తీ చిదంబరాన్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విచారణకు రావాల్సిందిగా ఎన్నిసార్లు పిలిచినా కార్తీ రాకపోవడంతో.. ఇక కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎయిర్సెల్ మాక్సిస్ డీల్ విషయమై ప్రశ్నించేందుకు ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని ఆయనను ఇప్పటికి మూడుసార్లు పిలిచారు. 2జీ స్కాంలో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎయిర్సెల్-మాక్సిస్ డీల్పై ఈడీ విచారణ సాగిస్తోంది. కార్తీ చిదంబరాన్ని విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికి మూడు సార్లు పిలిచింది. వ్యక్తిగతంగా హాజరు కావల్సిందేనంటూ మూడోసారి గట్టిగా చెప్పింది. అయినా కార్తీ మాత్రం విచారణకు రాలేదు. ఒకసారి మాత్రం.. అసలు తాను చేసిన తప్పేంటని కార్తీ అడిగినట్లు సమాచారం. ఇక కార్తీని అదుపులోకి తీసుకోవడం ఒక్కటే మార్గమని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. చిదంబరం భార్య నళినీ చిదంబరాన్ని కూడా గతవారం ఈడీ వర్గాలు మరో కేసులో ప్రశ్నించాయి. శారదా చిట్ఫండ్ స్కాంకు సంబంధించి కోల్కతాలోని ఈడీ కార్యాలయం ఆమెను విచారించింది. -
ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనంపై వచ్చే వారం ఒప్పందం!!
న్యూఢిల్లీ: ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్సెల్ల మధ్య వచ్చే వారంలో సంతకాలు జరిగే అవకాశముంది. ఈ రెండు కంపెనీల మధ్య టర్మ్ షీట్ ఖరారయ్యింది. ఆర్కామ్, ఎయిర్సెల్ కంపెనీల విలీనం విజయవంతమైతే మూడో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భవిస్తుంది. దీని యూజర్ల సంఖ్య 19.6 కోట్లకు పైగా చేరుతుంది. ఆర్కామ్, ఎయిర్సెల్ కంపెనీలు విలీన ఒప్పందంపై సంతకాలు చేస్తే.. తర్వాత ఈ విలీనాన్ని నియంత్రణ సంస్థల ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. విలీన ప్రక్రియ పూర్తికావడానికి 4-6 నెలల సమయం పట్టే అవకాశముంది. -
ఎయిర్సెల్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్
న్యూఢిల్లీ : 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టెలికాం ఆపరేటర్ ఎయిర్సెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. "ఎయిర్సెల్ కా ఆజాదీ ఆఫర్" పేరుతో అపరిమిత లోకల్ కాల్స్ను, డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ను వినియోగించుకోవడానికి కస్టమర్లు 123 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఎక్స్క్లూజివ్ డీల్ కేవలం ఒక్క రోజు మాత్రమే(ఆగస్టు 15) అందుబాటులో ఉండనుంది. 123 రూపాయల రీచార్జ్తో కస్టమర్లు అపరిమిత డౌన్లోడింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్, బ్రౌజింగ్ హెచ్డీ కంటెంట్, గేమింగ్, అన్లిమిటెడ్ టాకింగ్ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని ఎయిర్సెల్ తెలిపింది. "ఆజాదీ ఆఫర్"తో వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించనున్నట్టు ఎయిర్సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరల భారాన్ని తగ్గిస్తూ.. అపరిమితమైన సదుపాయాలను వినియోగదారుల ముందు ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్పెషల్ ప్రొడక్ట్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మొబైల్ బిల్లుల నుంచి కస్టమర్లకు పూర్తి స్వాతంత్య్రాన్ని కల్పిస్తుందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఎయిర్సెల్ కస్టమర్ల ముందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇటీవలే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కూడా తన కస్టమర్లకు ఆగస్టు 15న అన్ని మొబైల్స్కు, ల్యాండ్ లైన్కు అపరిమిత ఉచిత కాల్స్ను అందించనున్నట్టు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. . -
ఎయిర్సెల్ 7 సర్కిళ్లు ఎయిర్టెల్ సొంతం
భారతీ ఎయిర్టెల్, ఎయిర్సెల్ కు మధ్య మొత్తం ఏడు సర్కిళ్లలో స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్ కుదిరింది. ఒడిశాలోని ఎయిర్సెల్ 4 జీ ఎయిర్వేవ్స్కు సంబంధించిన స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఈ కొనుగోలుతో మొత్తం ఎయిర్సెల్ ఎనిమిది సర్కిళ్లలో ఏడింటినీ ఎయిర్టెలే నిర్వహించనుంది. తమిళనాడు(చెన్నైతో కలిపి), బీహార్, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిశా సర్కిళ్లలో పూర్తి 4జీ ఎయిర్వేవ్స్ హక్కులను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. గతనెలే టెలికాం సంస్థలు కుదుర్చుకోబోయే ఈ స్పెక్ట్రమ్ షేరింగ్ డీల్కు టెలికాం శాఖ నుంచి డీఓటీ నుంచి అనుమతి లభించింది. ఈ కొనుగోలు హక్కులతో ఎయిర్సెల్ కు చెందిన 20 మెగాహెడ్జ్ 2300 బ్యాండ్ బీడబ్ల్యూఏ స్పెక్ట్రమ్ హక్కులను ఎయిర్టెల్ వాడుకోనున్నట్టు బీఎస్ఈకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. ఒడిశా సర్కిల్ ప్రతిపాదన లావాదేవీలను విజయవంతంగా ముగించినట్టు ఎయిర్టెల్ తెలిపింది. స్పెక్ట్రమ్ ట్రేడింగ్ డీల్తో రూ.3500 కోట్లకు ఎయిర్సెల్ కు చెందిన ఎనిమిది సర్కిళ్ల 4జీ ఎయిర్వేవ్స్ను సొంతంచేసుకోబోతున్నామని భారతీ ఎయిర్టెల్ ఏప్రిల్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్టెల్, ఎయిర్సెల్ మధ్య జరిగిన ఈ స్పెక్ట్రమ్ డీల్ 2030 సెప్టెంబర్ 20 వరకు కొనసాగనుంది. -
ఎయిర్టెల్-ఎయిర్సెల్ స్పెక్ట్రమ్ ఒప్పందానికి ఆమోదం!
డీల్ విలువ రూ. 3,500 కోట్లు న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, ఎయిర్సెల్ల రూ.3,500 కోట్ల 4జీ స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ఒప్పందానికి టెలికం శాఖ ఆమోదం లభించిందని సమాచారం. అయితే ఈ విషయమై వ్యాఖ్యానించడానికి భారతీ ఎయిర్టెల్ నిరాకరించింది. ఎనిమిది టెలికం సర్కిళ్ల (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నైతో కలుపుకొని),బిహార్, జమ్ము అండ్ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య ప్రాంతం, ఒడిశా) ఎయిర్సెల్కు చెందిన 4జీ స్పెక్ట్రమ్ను ఉపయోగించుకునే హక్కులను రూ.3,500 కోట్లకు కొనుగోలు చేయడానికి భారత్ ఎయిర్టెల్ ఇంతకుముందు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక టెలికం సర్కిల్కు కేటాయించిన మొత్తం స్పెక్ట్రమ్లో ఏ కంపెనీకి 25 శాతానికి మించి స్పెక్ట్రమ్ ఉండకూడదు. ఒడిశా సర్కిల్లో అప్పటికే ఎయిర్టెల్కు కొంత స్పెక్ట్రమ్ ఉంది. ఒడిశా సర్కిల్లోని ఎయిర్సెల్ స్పెక్ట్రమ్ కొనుగోలు కారణంగా ఈ పరిమితిని మించిన స్పెక్ట్రమ్ భారతీ ఎయిర్టెల్కు ఉంటుంది. అదనంగా ఉన్న 1.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ ప్రభుత్వానికి అప్పగించిందని, దీంతో ఈ ఒప్పందం సాకారమైందని సమాచారం. కాగా ఎయిర్సెల్ స్పెక్ట్రమ్ను తక్షణం స్తంభింపజేయాలని ప్రశాంత్ భూషణ్ అనే ఉద్యమ న్యాయవాది ఈ నెల 8న సీబీఐ, ఈడీలకు ఒక లేఖ రాశారు. ఆర్కామ్, ఎయిర్టెల్లతో ఎయిర్సెల్ కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారమైతే, ఎయిర్సెల్ మాతృ కంపెనీ మ్యాక్సిస్ పారిపోతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. -
చిక్కుల్లో చిదంబరం తనయుడు కార్తి
చెన్నై : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కార్తి చిదంబరం మంగళవారం ఉదయం ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. కాగా 2006 సంవత్సరంలో మాక్సిస్ సంస్థ అక్రమంగా ఎయిర్ సెల్ లో 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ప్రత్యేక చొరవ తీసుకొని అనుమతిచ్చారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కార్తి చిదంబరంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖతో కలిసి అతడి ఆస్తులపై కూడా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
సుబ్రహ్మణ్య స్వామి కొత్త టార్గెట్స్ ఇవే!
న్యూఢిల్లీ: ట్విట్టర్లో వరుస విమర్శలు చేస్తూ సొంత పార్టీ బీజేపీని ఇరకాటంలో పడేసిన ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా పంథా మార్చారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై నేరుగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై పరోక్షంగా స్వామి చేసిన ఆరోపణలు బీజేపీలో గగ్గోలు రేపిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఒక వారంపాటు ట్విట్టర్కు కొంత దూరంగా ఉంటానని స్వామి తాజాగా ప్రకటించారు. ఈ వారం రోజుల్లో అయోధ్యలో రామాలయం, కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీ ప్రమేయమున్న నేషనల్ హెరాల్డ్, ఎయిర్సెల్-మాక్సిస్ కేసులపై దృష్టి పెడుతానని ఆయన తెలిపారు. అదేసమయంలో భారత జీడీపీ మీద ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాలను ఒకింత విస్మయపరిచింది. భారత జీడీపీ గణన, ఆర్బీఐ వడ్డీ రేట్లపై సామ్యూల్సన్-స్వామి థీయరీ వర్తింపజేసి విశ్లేషిస్తే.. అది పార్టీ వ్యతిరేక చర్య అంటూ మీడియా గగ్గోలు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. రామాలయం కేసు, నేషనల్ హెరాల్డ్, ఎయిర్సెల్ మాక్సిస్ , సీఎస్కే తదితర కేసులపై దృష్టి పెడుతున్నందున ట్విట్టర్లో పెద్దగా కనిపించకపోవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు. -
ఎయిర్సెల్ విలీనం 15 రోజుల్లో: ఆర్కామ్
అధిక స్పెక్ట్రమ్ ఉన్న కంపెనీగా విలీన సంస్థ న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్లో ఎయిర్ సెల్ విలీనం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ మేరకు ఎయిర్సెల్తో రెండు సార్లు చర్చలు జరిపామని, విలీన చర్చలు తుది దశకు చేరాయని, 10-15 రోజుల్లో ఎయిర్సెల్ విలీనాన్ని ప్రకటిస్తామని రిలయన్స్ కమ్యూనికేషన్స్ గురువారం వెల్లడించింది. ఎయిర్సెల్ వాటాదారులైన మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్, సింధ్య సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని వీలైనంత త్వరలో కుదుర్చుకుంటామని పేర్కొంది. ప్రభుత్వ సంస్థల, వాటాదారుల ఆమోదం పొం దాల్సి ఉందని వివరించింది. ఆర్కామ్లో ఎయిర్సెల్ విలీనమైతే, మొత్తం టెలికం పరిశ్రమకు కేటాయించిన స్పెక్ట్రమ్లో 19.3% ఈ విలీన సంస్థకు ఉంటుంది. దేశంలో ఇంత అధిక స్పెక్ట్రమ్ ఉండే కంపెనీ ఇదే. 2జీ, 3జీ, 4జీ సర్వీసులందజేయడానికి ఉపయోగపడే అన్ని రకాల బ్యాండ్ల స్పెక్ట్రమ్ ఈ సంస్థకు ఉంటుంది. రూ.25వేల కోట్ల వ్యాపారం.. విలీనం పూర్తయిన తొలి రోజు నుంచే రూ.25వేల కోట్ల వ్యాపారం ఈ విలీన సంస్థకు ఉంటుందని అంచనా. ఈ విలీన సంస్థ ఇబిట(క్యాష్ ఫ్లో) రూ.7,000 కోట్లు, వడ్డీ వ్యయాలు రూ.3,000 కోట్లు ఉంటాయని అంచనా. మార్చి నాటికి ఆర్కామ్ నికర రుణ భారం రూ.41,362 కోట్లుగా ఉంది. కాగా విలీన వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఆర్కామ్ షేర్ 4.1 శాతం లాభపడి రూ.49.7 వద్ద ముగిసింది. -
ఆర్కాం, ఎయిర్ సెల్ విలీనానికి రంగం సిద్ధం
ముంబై: అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్సెల్ సంస్థ విలీన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ తో ప్రతిపాదిత ఒప్పందం తొందర్లోనే పూర్తి కానుందని గురువారం ప్రకటించింది. ఈ విలీనాన్ని త్వరలో ప్రకటిస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో విలీనంపై ఎయిర్ సెల్ తో ఆర్కామ్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని తెలిపింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఎయిర్ సెల్ వాటాదారులైన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాడ్ అండ్ సింధ్య సెక్యూరిటీస్ , ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇండియన్ వైర్ లెస్ వ్యాపారంలో ఉమ్మడి వ్యాపారానికి ఒప్పందం కుదురుతుందనే ధీమాను వ్యక్తం చేసింది. డీల్ పూర్తి అయిన తర్వాత దీనికి సంబంధించిన లావాదేవీలను ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ఈ వార్తలతో మార్కెట్ల ఆర్ కాం షేర్ 6 శాతం లాభాలను నమోదు చేసింది. -
రంజాన్ కు ఎయిర్ సెల్ స్పెషల్ ఆఫర్స్
న్యూఢిల్లీ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎయిర్ సెల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్పెషల్ రంజాన్ ప్యాక్ కింద టాక్ టైమ్ లాభాలతో పాటు రాత్రిపూట వాయిస్ కాలింగ్ లో అత్యధిక రాయితీ టారిఫ్ లను కస్టమర్లకు ఆఫర్ చేయనున్నట్టు ఎయిర్ సెల్ తెలిపింది. ఢిల్లీలో ఎయిర్ సెల్ కొత్త ప్రొడక్ట్ కింద రూ.86 రీచార్జ్ కు రూ.86 ఫుల్ టాక్ టైమ్ ఆఫర్ ను అందిస్తోంది. దీంతో పాటు లోకల్, ఎస్ టీడీ కాలింగ్ కు రాత్రి 12 నుంచి ఉదయం 6గంటల వరకు నిమిషానికి 30 పైసల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ 12 రోజుల పాటు వాలిడిటీలో ఉంచింది. ఐఎస్ డీ కాలింగ్ కూడా రంజాన్ ప్యాక్ కింద ఆఫర్లను ప్రకటించింది. యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియాలకు సెకన్ కు 16 పైసలు, బంగ్లాదేశ్ కు సెకన్ కు 4పైసలు మాత్రమే చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. ఇఫ్తార్ అనంతరం, అదేవిధంగా తెల్లవారుజామున లోకల్, ఎస్ టీడీ, ఐఎస్ డీ కాల్స్ కోసం యూజర్లు అత్యధికంగా వాడుతుంటారని, వారికోసం స్పెషల్ గా రంజాన్ ప్యాక్ ను తీసుకొచ్చినట్టు ఎయిర్ సెల్ చెప్పింది. తమ కస్టమర్లకు రంజాన్ స్పెషల్ నెల అని, భారత్ లో, విదేశాల్లో స్నేహితులతో, కుటుంబసభ్యులతో వారు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారని ఎయిర్ సెల్ నార్త్ రీజనల్ బిజినెస్ హెడ్ హరీష్ శర్మ చెప్పారు. ఈ నెలలో రాత్రిపూట ఎక్కువగా కాల్స్ డేటా నమోదవుతుందని పేర్కొన్నారు. ఈ అవర్స్ లో చాలా రిటైల్ అవుట్ లెట్లు మూసేస్తారని, దానివల్ల బ్యాలెన్స్ అయిపోయి కస్టమర్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు సౌకర్యవంతంగా రంజాన్ ప్యాక్ కింద ఈ ఆఫర్లు ప్రకటించామని హరీష్ అన్నారు. -
ఇంకా 30 రోజులూ విలీన చర్చలే
ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్), ఎయిర్ సెల్ లు విలీనానికి సంబంధించి చర్చల గడువును మరో 30 రోజులు పొడిగించాయి. చర్చల గడువును పొడిగిస్తున్నట్టు రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ ప్రకటించింది. ఈ విలీన చర్చల గడువును పొడిగించడం ఇది రెండోసారి. మొదటిసారి మార్చి 22న విలీన చర్చల గడువును 60 రోజులుకు పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. మరింత గణనీయమైన పురోగతి కోసం ఆర్ కామ్, మాక్సిస్ కమ్యూనికేషన్ బెర్హడ్(ఎమ్ సీబీ), సింద్యా సెక్యురిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ సెల్ పెట్టుబడిదారులు పరస్పరం ఈ ప్రత్యేక సమయ వ్యవధిని 2016 జూన్ 22 వరకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్ కామ్ తెలిపింది. అయితే ఈ విలీన ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. షేర్ హోల్డింగ్ గురించి ప్రస్తుత చర్చలు జరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త సంస్థలో ఆర్ కామ్ ఎక్కువ షేరును ఆశిస్తున్నట్టు సమాచారం. ఆర్ కామ్ టవర్, ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను వదిలేసి, విలీన చర్చలను 90 రోజుల ప్ర్యతేక సమయ వ్యవధితో ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 22న ఈ కంపెనీలు ప్రకటించాయి. అయితే మార్చి 22న మరో 60 రోజులు ఈ విలీన చర్చల గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఆర్ కామ్, ఎయిర్ సెల్ చర్చలు సఫలమైతే, మొత్తం స్పెక్ట్రమ్ పరిశ్రమలో ఈ రెండు 19.3శాతం వాటాను కలిగి ఉంటాయి. 2జీ, 3జీ, 4జీ సర్వీసుల కొరుకు 800 ఎమ్ హెచ్ జడ్, 900ఎమ్ హెచ్ జడ్ ,1800ఎమ్ హెచ్ జడ్,2100ఎమ్ హెచ్ జడ్,2300 ఎమ్ హెచ్ జడ్ స్పెక్ట్రమ్ లను ఇవి పొందనున్నాయి.