aperc
-
రైతుల కోసమే 'సెకీ' విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఇటీవల ఆమోదించిన డిస్కంల ఆదాయ, అవసరాల నివేదికలో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ను ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అనుమతించింది. ఆ సందర్భంలోనే సెకీ ఒప్పందంపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించి, ఒప్పందాన్ని రద్దు చేసేందుకు తగిన కారణాలేమీ కనిపించడం లేదంటూ స్పష్టం చేసింది. దీంతో సెకీ ఒప్పందంపై కూటమి చేస్తున్న విమర్శలు, కరపత్రం రాసుకొచ్చిన కథనాలు అసత్యాలని తేలిపోయింది. తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే–2024 కూడా సెకీ ఒప్పందం గురించి మరింత స్పష్టత ఇచ్చింది. ‘వనరుల ప్రణాళిక’లో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అంగీకరించింది. 2024–25 నుంచి 2028–29 వరకు (5వ నియంత్రణ కాలం), 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకు ఏపీ ట్రాన్స్కో, డిస్కంలు సమర్పించిన విద్యుత్ వనరుల ప్రణాళికకు 2023 జూన్లో ఏపీఈఆర్సీ అనుమతినిచ్చిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఏ విధంగా వస్తుందనే వివరాలున్న వీటిలో ‘సెకీ’తో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందం కూడా ఉంది.అవే భవిష్యత్తుకు భరోసా..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 డిసెంబరులో విజయవాడ సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల (స్టేజ్–5) యూనిట్ ఉత్పత్తి ప్రారంభించిందని కూటమి సర్కారు తెలిపింది. ఈ కేంద్రం నుంచి 25 ఏళ్ల పాటు వంద శాతం విద్యుత్ కొనుగోలుకు ఏపీజెన్కో 2022 అక్టోబరులో ఒప్పందం కుదర్చుకుందని పేర్కొంది. ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింద్ధి. ఏపీ పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ) ప్రమోషన్ పాలసీ–2022 ద్వారా రాష్ట్రంలో 29 ప్రదేశాల్లో 33,240 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు టెక్నో–కమర్షియల్ ఫీజిబులిటీ రిపోర్ట్స్ సిద్ధం చేసినట్లు ఆర్థిక సర్వే సాక్షిగా తేటతెల్లమైంది. ఇది గత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం సూర్యఘర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది. ఆచరణలో మాత్రం పురోగతి సాధించడం లేదని సర్వే తేల్చిచెప్పింది. ఈ పథకానికి 3 డిస్కంలలో కలిపి 16,35,672 మంది చేత రిజిస్టర్ చేయించారు. వారిలో 9,79,665 మంది చేత దరఖాస్తులు పెట్టించారు. కేవలం 10,278 మందికే రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ అమర్చారు. పథకం అట్టర్ ఫ్లాప్ అని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. కేవలం గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన విద్యుత్ రంగ ప్రగతిని తమదిగా చెప్పుకొనే ప్రయత్నం మినహా ఆర్థిక సర్వే –2024లో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం విశేషం.‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెకీ)తో 7వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాను కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరా సంస్థ (ఏపీఆర్ఏపీఎస్సీవోఎం) పేరుతో ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం నియమించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ స్కీమ్ నుంచి 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) అనుమతి కోరాయి. దానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించింది’– ఏపీ సామాజిక ఆర్థిక సర్వేలో కూటమి ప్రభుత్వం -
‘ఏపీఈఆర్సీ సాక్షిగా రుజువైందిగా.. ఇప్పుడేమంటారు చంద్రబాబూ.?’’
నెల్లూరు: సెకీ(SECI) ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(APERC) చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. సెకీతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వార్తలు రాసిందని, ముందు చూపుతో వైఎస్ జగన్(YS Jagan) చేసిన ఒప్పందంతో రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్ లభించిందన్నారు.నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘ఏపీ(AP) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తక్కువ ధరకే విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. జగన్ కు మరక అంటించేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డిస్కమ్ లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదుజగన్ ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల ఆదాయం వస్తే.. చంద్రబాబు వల్ల 87వేల 500 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎల్లో మీడియాకు క్రెడిబులిటీ ఉంటే.. తప్పుడు రాతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్యుత్ రంగాన్ని చంద్రబాబునాయుడు తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై బురద చల్లుతున్నారు’అని ధ్వజమెత్తారు.కాగా, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్లీన్ చిట్ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్)లో ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ ‘సెకీ’ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్సీ పేర్కొంది.‘సెకీ’ ఒప్పందం సక్రమమే -
నిజం నిప్పులాంటిది జగన్ ఆరోజే చెప్పారు
-
సెకి సంక్రమమే.. ఏపీ ఈఆర్సీ క్లీన్ చిట్
-
‘సెకీ’ ఒప్పందం సక్రమమే
సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్ఏపై ఏపీఈఆర్సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ) జనరల్ నెట్వర్క్ యాక్సెన్ (జీఎన్ఏ) నిబంధనలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రకారం..‘సెకీ’ విద్యుత్కు అంతర్ రాష్ట్ర ప్రసార (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–ఐఎస్టీఎస్) చార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది.సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్కు ఎటువంటి కారణం కనిపించడం లేదు. – ఏపీఈఆర్సీసాక్షి, అమరావతి: రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్లీన్ చిట్ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్)లో ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ ‘సెకీ’ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళిక (పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్)లో చేర్చకపోవడానికి కమిషన్కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్ మార్జిన్ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సీఈఆర్సీ రూ.0.7 పైసల ట్రేడింగ్ మార్జిన్తో టారిఫ్ను ఇప్పటికే ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్ దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న ధర యూనిట్ రూ.2.49కే సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో సెకీ లాంటి పీఎస్ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్ చేస్తున్నట్లుగా సూమోటోగా కమిషన్ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరులో విద్యుత్ సేకరణకు డిస్కంలు కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్ను చేర్చడానికి కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని.. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే.. ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సిందే.. జుగల్ బందీలు.. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్నిబట్టి తేలిపోయింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది. అంటే తప్పులేదని ఒప్పుకున్నట్లేగాఅంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను (ఐఎస్టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్ను సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. తొలి ఏడాది 2024లో 3వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం 7వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4వేల మెగావాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లైంది!సంపద సృష్టించిందెవరు?.. గుదిబండ మోపిందెవరు?సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? చేసిన మంచిని దాచలేరు.. గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ సరఫరా అందించింది. అందుకుగానూ డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రెండు లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడు వాదోడుగా నిలిచింది. రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. విద్యుత్ రంగానికి, రైతన్నలకు ఇంత మంచి చేసిన వైఎస్ జగన్పై బురద చల్లుతూ సెకీ విద్యుత్ ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందని కూటమి నేతలు, కరపత్రికలు దు్రష్పచారం చేశాయి. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని విద్యుత్ నియంత్రణ మండలి తేల్చింది. ఇప్పుడేమంటారు బాబూ..?కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే జరిగింది. సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. దాన్ని రైతుల వ్యవసాయ అవసరాల కోసం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ధర అప్పటికి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ఈ ఒప్పందంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుబంధ కరపత్రిక ఈనాడు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాయి.అదానీపై అమెరికాలో ఏదో కేసు నమోదైందని, అందులో జగన్ పేరు ఉందని, లంచం తీసుకున్నారని నిరాధార కథనాలను వండి వార్చాయి. ఈనాడు, టీడీపీ అనుబంధ మీడియా రాసిన అసత్య కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రోద్బలంతో కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఊగిపోయారు. ఏకంగా జగన్పైనే కేసు పెట్టినట్లు నిందలేస్తూ ఆరోపణలు గుప్పించారు. సెకీ ఒప్పందానికి అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు రాదని, యూనిట్ రూ.2.49 కూడా ఎక్కువేనని, ప్రజలపై పాతికేళ్లలో రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమార్చేందుకు టీడీపీ కరపత్రికలు యత్నించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఇదే చంద్రబాబు గతంలో అత్యధిక ధరలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పడు మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొన్నారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారు. తాజాగా ఏపీఈఆర్సీ ఇచ్చిన స్పష్టత వాటికి చెంపపెట్టులా పరిణమించింది.ఎల్లో కరపత్రం.. ఎంత విషం చిమ్మిందో.. ఆరోపణ: సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణనిజం: సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం. కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్ ఆమోదంఆరోపణ: ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు నిజం: పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ’సెకీ’ఆరోపణ: సోలార్ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్ధిక భారం పడుతుంది.నిజం: ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. ఒప్పందం జరిగింది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కమ్ల మధ్య! ఇక లంచాలకు తావెక్కడ?రాష్ట్ర చరిత్రలోనే కారుచౌకరాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు ఇక లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? నేరుగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది?‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..» కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.» ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. » ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది. » రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. » ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?» టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందంæ జరిగితే.. యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్ దొరుకుతుంటే.. పైగా స్పెషల్ ఇన్సెంటివ్గా అంతరాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్ మోడల్ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్ఘడ్లకు సెకీ ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సింది పోయి బురద జల్లుతారా? మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబును మోయాలన్న తాపత్రయంతో... జగన్పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?. – ఎల్లో మీడియా దుష్ప్రచార కథనాలపై గతంలో వైఎస్ జగన్ వ్యాఖ్య -
అమరావతికి ఏపీఈఆర్సీ
-
అమరావతికి ‘ఏపీఈఆర్సీ’ తరలింపు!
సాక్షిప్రతినిధి కర్నూలు : ‘‘నాలుగు సందర్భాలు.. నాలుగు రకాల ప్రకటనలు..! నోరు ఒకటి చెబుతుంది.. చేతలు మరొకటి.. దేనిదోవ దానిదే..!’’ అన్నట్లుంది సీఎం చంద్రబాబు సర్కారు తీరు. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటు చేసిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పిన మూడు నెలలకే ఏపీఈఆర్సీ (రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి)ని అమరావతికి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు అనుకూల భవనాలను అత్యవసరంగా పరిశీలించి నివేదిక పంపాలంటూ ఈ నెల 29న కలెక్టర్ రంజిత్బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) లేఖ రాశారు. ఈ క్రమంలో ఏపీఈఆర్సీ భవనాలతోపాటు జగన్నాథగట్టుపైన నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ భవనాలు, నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని ఓ ప్రైవేట్ భవనాలను పరిశీలించి అధికార యంత్రాంగం నివేదిక పంపింది. ఈ మూడింటిలో ఏపీఈఆర్సీ భవనంపై హైకోర్టు బృందం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ నెల 6వతేదీన కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలించనుంది. కమిటీలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ రఘునందన్రావు, జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ బి.కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్నారు. రూ.25 కోట్లతో అత్యాధునికంగా.. కర్నూలులో ఏపీఈఆర్సీకి సొంత భవనాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.25 కోట్లతో అత్యాధునికంగా నిర్మించింది. ఇందులో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించడంతో పాటు ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిథి గృహాలను ఏర్పాటు చేశారు. గతేడాది మే 23న దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనం కావడం.. అన్ని వసతులు ఉండటం.. సిటీలోనే ఉన్నందున ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుందని దీన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం 2023 ఆగస్టు 18న ప్రారంభమైంది. నేషనల్ లా వర్సిటీ సంగతి ఏమిటి? వైజాగ్లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టుబట్టి కర్నూలులో మరో లా వర్సిటీని మంజూరు చేయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. కర్నూలులో 273 ఎకరాల్లో నిర్మించాలని భావించిన ‘జ్యుడీషియల్ సిటీ’లో 100 ఎకరాల్లో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావించింది. దీనికి రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి దీనికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. కర్నూలుతో సంబంధం లేకుండా అమరావతిలో మరొకటి నిర్మిస్తున్నారా? లేక కర్నూలు లా యూనివర్సిటీకి మంగళం పాడనున్నారా? అనేది స్పష్టత ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యూనివర్సిటీ పనుల్లో ఎలాంటి ముందడుగు లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా అమరావతికి తరలించడంతో పాటు లా వర్సిటీ నిర్మాణాన్ని పక్కనపెట్టనున్నట్లు స్పష్టమవుతోందని న్యాయవాదులు, అధికారవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీమ నుంచి అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. ఇంత మెజార్టీ కూటమికి ఇచ్చినందుకు కర్నూలుకు హైకోర్టును ఎత్తివేసి బెంచ్కు పరిమితం చేయడం, న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా తరలించడం ‘సీమ’కు చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని మండిపడుతున్నారు. ఏపీఈఆర్సీ భవనంలోనే హైకోర్టు బెంచ్..! హైకోర్టు బెంచ్ను ఏపీఈఆర్సీ భవనంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మూడు ప్రతిపాదనల్లో ఇదే ఉత్తమమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కర్నూలు సిటీ (కలెక్టరేట్) నుంచి జగన్నాథగట్టుపై ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ 17.5 కిలోమీటర్లు దూరంలో ఉంది. నన్నూరు టోల్ప్లాజా సమీపంలోని ప్రైవేట్ భవనం 11 కి.మీ. దూరంలో ఉంది. ఏపీఈఆర్సీ 3.5 కి.మీ. దూరంలో నగరానికి చేరువలో ఉన్నందున దీనివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.సీఎంగారూ.. ఇప్పుడేమంటారు? కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి ‘న్యాయ రాజధాని’గా అభివృద్ధి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంక్షించారు. అందులో భాగంగానే ఏపీఈఆర్సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టులను కర్నూలులో ఏర్పాటు చేశారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుపై మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా ఆ సంస్థలను అమరావతికి తరలించేలా నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం తెలిపింది. దీనిపై విపక్ష పార్టీలు, రాయల సీమ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో కర్నూలులో నెలకొల్పిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్లో అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు హైకోర్టు బెంచ్ను కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధపడటాన్ని బట్టి ఆ సంస్థను అమరావతికి తరలించడం లాంఛనమే అని స్పష్టమవుతోంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటైన తర్వాత మిగతా సంస్థలను కూడా అమరావతికి తరలించే అవకాశం ఉన్నట్లు కూటమి ప్రభుత్వం చర్యలు స్పష్టం చేస్తున్నాయి. » లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి చట్ట సవరణ చేస్తాం. ఆపై తరలింపు నోటిఫికేషన్ జారీ చేస్తాం’ – నవంబర్ 13న హైకోర్టుకు స్పష్టం చేసిన కూటమి ప్రభుత్వం. » ‘లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి. ఇప్పటికే నెలకొల్పిన సంస్థలను తరలించబోం. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్తో చర్చించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’ – నవంబర్ 15న మంత్రి టీజీ భరత్ ప్రకటన » ‘కర్నూలులో ఏర్పాటు చేసిన సంస్థలను అమరావతికి తరలించం. వాటిని అక్కడే ఉంచుతాం. హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం’ – గత నవంబర్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన » ‘ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తోంది. దిన్నెదేవరపాడు వద్ద నిర్మించిన ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలిస్తారు’ – తాజాగా న్యాయశాఖ మంత్రి ఫరూక్ వ్యాఖ్యలు -
హైకోర్టు పోయె.. బెంచ్ వచ్చె!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమవాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండికొట్టిన టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan mohan Reddy) ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు, ఏపీఈఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఆర్సీకి శాశ్వత భవనాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూల్లో బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూములు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్ రంజిత్ బాషాను హైకోర్టు(High Court) ఆదేశించింది.కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచేందుకు వీలుగా ఈ వివరాలను అందచేయాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరామ్ ఈ నెల 29న కలెక్టర్కు లేఖ రాశారు. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్ అండ్ బీ ఎస్ఈ, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ఈ బాధ్యతను అప్పగించగా.. కర్నూలులో మూడు భవనాలను ‘బెంచ్’ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు భవనం కోసం ప్రధానంగా ఏపీఈఆర్సీ భవనాన్ని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన మూడు భవనాల్లో ఇదే కొత్తది కావడం, ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇక్కడే హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తారనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. భవనాల గుర్తింపు కోసం ప్రభుత్వం కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మొత్తం మూడు భవనాలను సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏపీఈఆర్సీ భవనంతోపాటు జగన్నాథగట్టుపై నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ భవనం, హైదరాబాద్–చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ భవనం ఉన్నాయి. వీటి వివరాలను కలెక్టర్ గురువారం రిజిస్ట్రార్కు పంపినట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ను వివరణ కోరగా.. భవనాలను పరిశీలిస్తున్నామని, ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. కాగా, ఒకవేళ జగన్నాథ గట్టుపై ఉన్న భవనాలను హైకోర్టు బెంచ్(High Court Bench) కోసం ప్రతిపాదిస్తే అక్కడున్న క్లస్టర్ యూనివర్సిటీని సిల్వర్ జూబ్లీ కాలేజీ భవనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంతో ఏపీఈఆర్సీని అమరావతికి తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తీర్మానం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ఆమోదిస్తూ గతేడాది అక్టోబర్లో రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అటు తరువాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేసే నిమిత్తం ఫుల్ కోర్టుకు నివేదించాలని కోరుతూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బెంచ్ ఏర్పాటుపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కమిటీని నియమించారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఫుల్కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటు ఓ కొలిక్కి వస్తుంది.15 మంది న్యాయమూర్తుల కేటాయింపు?కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తరువాత జిల్లాల వారీగా దాఖలైన కేసుల గణాంకాలను హైకోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. హైకోర్టులో మొత్తం కేసుల్లో 40 శాతం రాయలసీమ జిల్లాల నుంచే దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా కర్నూలులో ఏర్పాటయ్యే శాశ్వత బెంచ్ న్యాయమూర్తుల సంఖ్యను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 40 శాతం కేసులు రాయలసీమ నుంచి దాఖలవుతున్నందున మొత్తం 37 మంది న్యాయమూర్తుల్లో అందుకు అనుగుణంగా 15 మందిని కర్నూలు(Kurnool) బెంచ్కు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 22 మంది న్యాయమూర్తులు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్లో న్యాయమూర్తులుగా కొనసాగే వీలుంది. ఈ క్రమంలోనే కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ కర్నూలు కలెక్టర్కు హైకోర్టు లేఖ రాసినట్లు భావిస్తున్నారు.కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు?ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి రాయలసీమ జిల్లాలతో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు, న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు వెళ్లాలంటే తమకు నేరుగా రైలు సౌకర్యం లేదని, రోడ్డు ద్వారా వెళ్లాలంటే కనీసం 7 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఇరు జిల్లాల వారు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరి అభ్యంతరాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. -
కరెంటు మరింత ఖరీదు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల భారాన్ని మోపింది. ఈ చార్జీలను ప్రతి నెలా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది చాలదన్నట్లు కూటమిలో భాగమైన బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కొత్త దారిలో ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమవుతోంది. దానిని నేరుగా కాకుండా పరోక్షంగా వేస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రజల కరెంటు బిల్లు మరింతగా పెంచేలా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సాయపడుతోంది.కొత్త పేరుతో కొత్త చార్జీవిద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన దానికంటే అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొంటున్నాయి. ఈ విద్యుత్తు కొనుగోలుకయ్యే అదనపు ఖర్చును ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. గతంలో ఈ చార్జీలను ఏడాది చివరిలో మదించి, ఒకే సారి వేసేవి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నిబంధనలు (రెగ్యులేషన్స్) 2005కు సవసరణ చేసి వాటిని ప్రతి నెలా వసూలు చేసుకునే వి«ధానాన్ని తెచ్చింది. ఎప్పుడు చేసిన ఖర్చును అప్పుడే మరుసటి నెల బిల్లులో యూనిట్పై గరిష్టంగా రూ.0.50 చొప్పున వసూలు చేసుకొనేలా ఏపీఈఆర్సీ కూడా చట్టంలో మార్పులు చేసింది. ఏడాదికోసారి కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రూ అప్ను లెక్కించేలా సవరణలు చేసింది. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ‘ఇంధన సర్దుబాటు సర్చార్జి’ పేరుతో కొత్త వడ్డనకు శ్రీకారం చుట్టింది.రెండు విధాలుగా వడ్డనడిస్కంలు ఆర్ధిక స్థిరత్వం కోసం వినియోగదారుల నుంచి నెలవారీ బిల్లులతో పాటుగా ఇంధన సర్దుబాటు సర్చార్జీని కూడా వసూలు చేసుకోవడానికి కేంద్రం విద్యుత్ చట్టంలోని నిబంధనల్లో సవరణలకు ముసాయిదాను రూపొందించింది. గడిచిన మూడేళ్లలో సర్దుబాటు చార్జీల సగటును తీసుకుని ఈ సర్చార్జీని ఏపీఈఆర్సీ నిర్ణయించాలని చెప్పింది. దానిని ఏడాదికోసారి నిర్ణయించే టారిఫ్ ఆర్డర్తో కలిపి ప్రకటించాలని సూచించింది. తద్వారా సర్దుబాటు చార్జీల లెక్కలతో సంబంధం లేకుండా ప్రజలపై సర్చార్జీల రూపంలో వచ్చి పడుతుంది. ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీని కూడా ఎఫ్పీపీఏ సర్దుబాటుకు డిస్కంలు వాడుకోవచ్చని, వినియోగదారుల నుంచి వసూలు చేసేంతవరకూ వేచి చూడాల్సిన అవసరం ఉండదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారటీ (సీఈఏ) వివరించింది. అది కూడా సరిపోకపోతే నిర్దిష్ట శాతంలో కొంత వరకూ చార్జీలను వేసి నెల నెలా కూడా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 15 వరకూ ముసాయిదాపై అన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు, సూచనలను కేంద్రం స్వీకరించింది. వాటిని పరిశీలించి త్వరలోనే ఈ చార్జీల వసూలుపై కొత్త నిబంధనలను ప్రకటించనుంది. -
ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు చార్జీలా?
సాక్షి, అమరావతి/కర్నూలు (సెంట్రల్): ‘ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువుకు ఒక ధర నిర్ణయించి విక్రయిస్తారు. దాని తయారీకి అయిన విద్యుత్ ఖర్చు సహా అన్ని ఖర్చులూ అందులో ఉంటాయి. వినియోగదారుడు ఆ రేటు చెల్లించి వస్తువు కొంటాడు. కొన్ని నెలల తర్వాత ఆ వస్తువు తయారు చేస్తున్న రోజుల్లో వాడిన విద్యుత్తుకు అదనపు చార్జీ చెల్లించాలంటున్నారు. అదెలా సాధ్యం? ప్రభుత్వం అడిగినట్లు మేం కూడా వస్తువు కొన్న వాళ్ల దగ్గరకు వెళ్లి అప్పుడు మీరు కొన్న టీవీకి అదనపు డబ్బులు ఇమ్మని అడిగితే ఇస్తారా? అర్ధం లేని చార్జీలతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి. సర్దుబాటు చార్జీలను వెంటనే రద్దు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కర్నూలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో పారిశ్రామికవేత్తలు కరాఖండిగా చెప్పారు. ప్రజలు కూడా విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంధన సర్దుబాటు చార్జీలకు అంతమనేదే లేదా? అంటూ అనంతపురానికి చెందిన చంద్రశేఖర్ సహా పలువురు నిలదీశారు. పెంచిన చార్జీలు ప్రజలు కాదు.. ప్రభుత్వమే భరించాలని అందరూ స్పష్టం చేశారు. మూడు రోజుల్లో 94 అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రూ.15,485 కోట్లకు సమర్పించిన 2025–26 ఆరి్థక సంవత్సరం ఆదాయ అవసరాల నివేదికలపై ఏపీఈఆర్సీ ఏపీఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్, సభ్యుడు పీవీఆర్ రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో, శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపారు. మధ్యాహ్నం వరకూ అభ్యంతరాలను వినిపించడానికి ఎంచుకున్నవారికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆన్లైన్లో లేదా సమీపంలోని డిస్కం సర్కిల్, డివిజన్ కార్యాలయాల నుంచి మాట్లాడేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించారు. ఈ మూడు రోజుల్లో వివిధ వర్గాలకు చెందిన 94 మంది వారి అభ్యంతరాలను మండలి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల అభ్యంతరాలపై డిస్కంల సీఎండీలు వివరణ ఇచ్చారు. ఏపీఈఆర్సీ, ఇంధనశాఖ విరుద్ధ ప్రకటనలు టారిఫ్ పెంపుదలపై డిస్కంలు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని, అయితే వారు చూపించిన రెవెన్యూలోటు రూ. 14,683 కోట్లను ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ తెలిపారు. అయితే ఇంధనశాఖ మాత్రం రెవెన్యూ లోటు తాము భరిస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు కట్టుబడి ఉన్నామని, తద్వారా డిస్కంల రెవెన్యూ లోటు తగ్గించేందుకు మాత్రమే సాయపడతామని చెప్పినట్లు ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డి వెల్లడించారు. ప్రజల అభ్యంతరాలు, డిస్కంల వివరణను పరిశీలించి ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ఆర్డర్ను ఖరారు చేస్తామని చైర్మన్ చెప్పారు.»పారిశ్రామిక విద్యుత్ (హెచ్టీ) వినియోగదారులు ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ఆడిట్ నివేదికలు సమర్పిస్తాయి. ఏడాది ముగిసిన తరువాత పాత వినియోగంపై అదనంగా బిల్లులు వేస్తే చెల్లించడం ఎలా సాధ్యం? – అమర్రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ప్రతినిధి కుమార్ రాజా » ట్రూ అప్ చార్జీలు న్యాయ సూత్రాలకు విరుద్ధం. అదనపు చార్జీలు వేయడంపై ఉన్న శ్రద్ధ నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంలో కనిపించడంలేదు. విద్యుత్ లైన్లు తెగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పాతపడ్డ లైన్లను మార్చడంలేదు. – కడప జిల్లా కమలాపురానికి చెందిన అశోక్కుమార్రెడ్డి » ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులోనే ఉండాలి. పీక్ లోడ్ అవర్స్ కింద రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. అది కాకుండా అదనంగా 4 రకాల చార్జీలు వేస్తున్నారు. ఏది ఎందుకో తెలియడంలేదు. – కర్నూలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి రామచంద్రారెడ్డివామపక్షాల ఆందోళనమరోవైపు కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో విద్యుత్ టారిఫ్లపై బహిరంగ విచారణ సమయంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి ఒకేసారి రూ.15 వేల కోట్ల భారం మోపుతున్నారని వామపక్షాలు మండిపడ్డాయి. ప్రజలపై అదనపు విద్యుత్ భారాలు వేయొద్దని, ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టవద్దని డిమాండ్ చేశాయి. సీపీఎం నాయకుడు, ఎండీ ఆనందబాబు, సీపీఐ నాయకుడు పి.రామకృష్ణారెడ్డి, సీపీఐ (ఎంఎల్) నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. -
విద్యుత్ ఛార్జీల పెంపుపై APERC ప్రజాభిప్రాయ సేకరణ
-
విద్యుత్ ప్రమాదాలపై ఏపీఈఆర్సీ ఆందోళన
సాక్షి, అమరావతి/కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో ఇటీవల విద్యుత్ ప్రమాదాల సంఖ్య పెరగడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. సక్రమమైన విద్యుత్ పంపిణీతో పాటు భద్రతా చర్యలను పెంచాలని విద్యుత్ సంస్థలను ఆదేశించింది. శనివారం కర్నూలులో ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కో–ఆర్డినేషన్ ఫోరం సమావేశంలో 2024–25 నుంచి 2028–29 వరకు 5వ నియంత్రణ కాలానికి సంబంధించిన రాష్ట్ర విద్యుత్ ప్రణాళికను ఆమోదించారు. ఈ సందర్భంగా ఏపీఈఆర్సీ ఇన్చార్జ్ చైర్మన్, సాంకేతిక సభ్యుడు ఠాకూర్ రామసింగ్ మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టేలా చూడాలని.. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం అందించాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. రబీ పంటల సీజన్తో పాటు వేసవిలో వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం విద్యుత్ పంపిణీ సంస్థల్లో పెండింగ్లో ఉన్న సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.10,800 మెగావాట్ల అదనపు లోడ్..రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024ను రాష్ట్ర విద్యుత్ ప్రణాళికలో చేర్చాలని ఏపీ ట్రాన్స్కోను ఏపీఈఆర్సీ గత సమావేశంలో ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్కో తగిన మార్పులు చేసి ఈ సమావేశంలో ప్రవేశపెట్టింది. గతంలో కమిషన్ ఉత్తర్వులిచ్చిన రిసోర్స్ ప్లాన్లో ఇప్పటికే పరిగణించిన లోడ్కు అదనంగా 10,800 మెగావాట్ల వరకు లోడ్ పెరుగుతుందని ట్రాన్స్కో అందులో పేర్కొంది. ఈ ప్రణాళికలను ప్రచురించడానికి ఫోరం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్, ఏపీఈఆర్సీ ఫైనాన్స్ మెంటర్ పీవీఆర్ రెడ్డి, డిస్కంల సీఎండీలు సంతోషరావు, రవి, పృథ్వీతేజ్, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
295 ఫిర్యాదుల్లో 266 పరిష్కారం
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)కు 2022–23లో 295 ఫిర్యాదులు అందగా.. వాటిలో 266 అదే ఏడాదిలో పరిష్కారమయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వెల్లడించింది. మండలి కార్యకలాపాలకు సంబంధించి 2022–23 ఆరి్థక సంవత్సరం నివేదికను ఏపీఈఆర్సీ సోమవారం విడుదల చేసింది. ఆ ఏడాదిలో సీజీఆర్ఎఫ్తో ఏపీఈపీడీసీఎల్లో 75 సార్లు, ఏపీఎస్పీడీసీఎల్లో 51 సార్లు, ఏపీసీపీడీసీఎల్లో 13 సార్లు సమావేశమైనట్లు తెలిపింది. ఏపీఈపీడీసీఎల్కు రూ.33,500 జరిమానా కూడా విధించినట్లు పేర్కొంది. విద్యుత్ అంబుడ్స్మెన్కు వచి్చన 29 ఫిర్యాదుల్లో 28 పరిష్కరించినట్లు వివరించింది. స్టాండర్డ్స్ ఆఫ్ ఫెర్ఫార్మెన్స్ (ఎస్వోపీ)లో డిస్కంలు విఫలమైన కేసుల్లో జరిమానా విధించినట్లు తెలిపింది. ఆ ఏడాది 48 కేసులను విచారించి ఆదేశాలు వెలువరించినట్లు తెలిపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అమోదించినట్లు వెల్లడించింది. మండలి ఖర్చులు, ఆదాయాలు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
AP: డిస్కంల లోటు రూ.14,683.24 కోట్లు
సాక్షి, అమరావతి: వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరానికి ఆదాయం, రాబడికి మధ్య వ్యత్యాసం రూ.14,683.24 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు ఆదాయ, అవసరాలు (ఏఆర్ఆర్), ప్రతిపాదిత టారిఫ్ (ఎఫ్పీటీ) నివేదికలను అంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఆ ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ తన వెబ్సైట్లో శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంచింది. డిస్కంలు పేర్కొన్న లెక్కల ప్రకారం.. వచ్చే ఏడాది మొత్తం రూ.58,868.52 కోట్ల వ్యయం అయితే, టారిఫ్ యేతర ఆదాయ మొత్తాలను కలుపుకుని విద్యుత్ విక్రయం ద్వారా రూ.44,185.28 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాయి. ఫలితంగా రూ.14,683.24 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. అదేవిధంగా 75,926.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం జరుగుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25 (73,053.78 మిలియన్ యూనిట్లు) కంటే 3.93 శాతం ఎక్కువని డిస్కంలు నివేదికలో చెప్పాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11,299.49 మిలియన్ యూనిట్ల కంటే 14.4 శాతం ఎక్కువగా 12,927 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేశాయి. ప్రస్తుత టారిఫ్ ప్రకారం డిస్కంల ఆదాయ అంతరాన్ని తీర్చడానికి వచ్చే ఏడాది మొత్తం రూ.14,683.24 కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన సబ్సిడీ (రూ.13,769.85 కోట్లు) కంటే ఇది 6.6 శాతం పెరిగింది. విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్కు రూ.4.80 అవుతుందని నివేదికలో పొందుపరిచాయి. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 10.03 శాతంగా ప్రతిపాదించాయి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం యూనిట్ కు రూ.7.75 పేర్కొనగా.. రాబడి మాత్రం యూనిట్కు రూ.5.82 ఉంటుందని డిస్కంలు భావిస్తున్నాయి. డిస్కంలు ఇచ్చిన ఈ ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి టారిఫ్ ప్రకటిస్తుంది. కొత్త టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. -
నిన్న సర్దుబాటు చార్జీలు.. రేపు అసలు బాదుడు
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు సిద్ధమవుతోంది. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది.ఈ మేరకు 2025–26 సంవత్సరానికి ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్)ను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి శనివారం అందజేశాయి. ఈ నివేదికలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపడుతుంది. అనంతరం టారిఫ్ (ధర) ప్రకటిస్తుంది. దాని ప్రకారం వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తాయి.ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే. వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు. 2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. అంతా గోప్యంఏపీఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్లో ఏముందో డిస్కంలు బయటకు చెప్పడంలేదు. శనివారంతో గడువు ముగుస్తున్నందున సాంకేతికంగా నివేదిక సమర్పించామని, పూర్తి నివేదిక సోమవారం ఇస్తామంటూ తప్పించుకుంటున్నాయి. ఏఆర్ఆర్లు సమర్పించారని, వాటిని పరిశీలించి, ప్రజల ముందుంచడానికి కొద్ది రోజులు పడుతుందని ఏపీఈఆర్సీ చెబుతోంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీలు భారీగా వేయడంతో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. టారిఫ్ కూడా పెంచితే మరింత ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిస్కంలతో వినియోగదారులను ఏమార్చేలా ప్రతిపాదనలు ఇప్పించినట్లు సమాచారం. చార్జీల పెంపు ప్రత్యక్షంగా పెంచడం కుదరకపోతే గతంలో చంద్రబాబు హయాంలో చేసినట్లుగానే ఇప్పుడూ స్లాబులు మార్చి, వినియోగదారులను ఏమార్చి బిల్లులు పెరిగేలా డిస్కంలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. -
AP: బాదుడే.. బాదుడు.. ఇప్పుడు రూ. 9,412 కోట్లు
సాక్షి, అమరావతి/కర్నూలు న్యూసిటీ: కూటమి పాలనలో ప్రజలపై రెండో సారి భారీ విద్యుత్ చార్జీల భారం పడింది. రూ.9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్కు రూ.0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుంచే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకే రాష్ట్ర ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. ఈ చార్జీలను యూనిట్కు రూ.1.27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా చార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు రూ.2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన రూ.6.072.86 కోట్లు, తాజాగా వసూలు చేస్తున్న రూ.9,412.50 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల భారం ప్రజలపై మోపింది. రూ.0.92 వరకూ అదనం 2023–24 సంవత్సరానికి రూ.12,844.88 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు డిస్కంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో రూ.3,432.38 కోట్లు తగ్గించి, రూ.9,412.50 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్కు దాదాపు రూ.0.91, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.0.92, ఏపీఈపీడీసీఎల్లో పరిధిలో రూ.0.90 చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకోమని డిస్కంలకు ఏపీఈఆర్సీ చెప్పింది. మాట మార్చడం.. మాట తప్పడమే బాబు నైజం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవలి ఎన్నికల్లో ఆయనిచ్చిన సూపర్ సిక్స్ హామీలు, కరెంటు చార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగులో తొక్కేసి ఆయన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకొని గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందంటూ అబద్ధాలాడేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఐదు నెలలు తిరక్కుండానే చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పాను’ అంటూ నాలుక మడతెట్టేశారు. విద్యుత్ చార్జీలపై బాబు వంచనకు మచ్చు తునకలు కొన్ని.. 19 మార్చి 2019, కడప : కరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలూ ఇస్తున్నాం. భవిష్యత్లో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 27 మే 2020, టీడీపీ మహానాడు : కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే.. మీరు (జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. 10 ఆగస్ట్ 2022, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించే వాళ్లం. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. 16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం : తమ్ముళ్లూ.. ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా? ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడైనా కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2 ఆగస్ట్, 2023, పులివెందుల : కరెంట్ చార్జీలను పెంచను.. తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. వినూత్న ఆలోచనతో 2000లో కరెంట్ సంస్కరణలు తెచ్చి 2004కు మిగులు విద్యుత్ తెచ్చా. ఎండతో కరెంటు వస్తుంది. సోలార్ నేనే తీసుకొచ్చా. రూ.14 ఉండే కరెంటు రూ.2కు వచ్చి0ది. ఎండతో, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రూ.2 నుంచి రూ.3కే కరెంట్ వస్తుంది. రానున్న ఐదేళ్లలో కరెంట్ చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తెస్తా. గ్రిడ్కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. 16 ఆగస్ట్ 2023, విజన్ డాక్యుమెంట్ విడుదల, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తి విధానాలతో యూనిట్ ధర రూ.8 నుంచి రూ.2కు పడిపోయింది. హైడ్రోజన్, అమ్మోనియా హబ్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. 4 మార్చి 2024, పెనుగొండ : ఎవరి మార్కు ఎంత అని అడుగుతున్నాడు.. నేను చెబుతున్నా జగన్.. నీ మార్కు తెలుసుకో. రూ.200 ఉండే కరెంటు బిల్లు రూ.800 చేయడం నీ మార్కు. కరెంటు చార్జీల బాదుడు నీ మార్కు. నేడు ఏఆర్ఆర్ సమర్పించనున్న డిస్కంలు 2025–26 సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్, రిటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) శనివారం ఏపీఈఆర్సీకి సమర్పించనున్నాయి. తమ పరిధిలోని నివేదికలతో డిస్కంల సీఎండీలు ఏపీఈఆర్సీ ముందు హాజరుకానున్నారు. -
AP: షాక్ల మీద షాక్!
‘‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంది.. కూటమి ప్రభుత్వం వస్తే చార్జీల భారం తగ్గిస్తాం.. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచం’’ అని ఎన్నికలకు ముందు ప్రతి సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ‘‘అబ్బే.. చెప్పినవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది? చార్జీలు పెంచకపోతే డిస్కంలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? డబ్బులు ఊరకే రావు. ‘సర్దుబాటు’ పేరుతో ఎంత కావాలో అంత ప్రజల నుంచే పిండుకోండి. ఇదేంటని ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం వల్లే చార్జీలు పెరిగాయని అబద్ధమైనా సరే గట్టిగా దబాయించి చెప్పండి. ఒకటికి పదిసార్లు మన మీడియాలో కథనాలు రాయండి. అప్పటికీ సర్దుకోకపోతే నేనే ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేస్తాను’’ అని అంతర్గతంగా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు కోలుకోలేని విధంగా షాక్ల మీద షాక్.సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు వరుసగా విద్యుత్ షాక్లు ఇస్తోంది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ఈ నెల బిల్లు నుంచే వేస్తున్న ప్రభుత్వం, వచ్చే నెల నుంచి ప్రజల మీద మరో రూ.11,826.15 కోట్ల భారం మోపనుంది. ఈ మేరకు 2023–24 సంవత్సరానికి ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీల (ఎఫ్పీపీసీఏ)కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, ఏవైనా సూచనలు చేయాలనుకున్నా తమకు నేరుగా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ ఈ నెల 19వ తేదీలోగా తెలియజేయాలని మండలి కోరింది. అనంతరం ఓ వారం రోజుల్లోనే ట్రూ అప్ చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఆ వెంటనే డిసెంబర్ నెల నుంచే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చార్జీలను వేసే అవకాశం ఉంది.గరిష్టంగా యూనిట్కు రూ.3 భారం ఈ ఏడాది జూన్ నాటికే 2023–24 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలు యూనిట్కు రూ.0.40 చొప్పున ఇప్పటి వరకు దాదాపు రూ.3,752.55 వేల కోట్లు వసూలు చేశామని డిస్కంలు వెల్లడించాయి. మిగిలిన రూ.8,073.60 కోట్ల చార్జీలను బిల్లుల్లో అదనంగా కలిపేందుకు ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు పంపించాయని తెలిపాయి. అయితే ఈసారి వాస్తవ విద్యుత్ కొనుగోలు ఖర్చు, అనుమతించిన ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని డిస్కంలు భారీగా చూపించాయి. అది మూడు డిస్కంలలోనూ కనిష్టంగా రూ.1.02 నుంచి గరిష్టంగా రూ.2.50 వరకు ఉంది. దీన్ని బట్టి యూనిట్కు ఎంత వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతిస్తుందనేది ఈ నెలాఖరులోగా తేలుతుంది. ఈ నెల నుంచి యూనిట్పై సగటున పడుతున్న రూ.1.27కి వచ్చే నెల నుంచి పడే చార్జీలను కలుపుకుంటే మొత్తంగా యూనిట్కు రూ.3 చొప్పున అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు డబుల్ కానున్నాయని, ఎక్కువ విద్యుత్ వాడే వాళ్లకు అంతకంటే ఎక్కువ భారం కానున్నాయని స్పష్టమవుతోంది. (నవంబర్ నెలలో వాడిన కరెంట్కు డిసెంబర్ మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.6,072.86 కోట్ల భారం పడుతుంది. డిసెంబర్లో వాడిన కరెంట్కు జనవరి మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.11,826.15 కోట్ల భారం అదనంగా కలుస్తుంది.) -
జగన్ సర్కారు పూర్తి స్వేచ్ఛనిచ్చింది
‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్చేచ్ఛనిచ్చింది. అందువల్లనే గత ఐదేళ్లలో అనేక లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగాం. 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేయగలిగాం’ అని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. 2019 అక్టోబర్ 30న ఏపీఈఆర్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏపీఈఆర్సీ విజయాలు, ఎదురైన అవరోధాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ⇒ ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాం. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు అందులో డిస్కం తప్పిదం ఉన్నా లేకున్నా కూడా బాధితులకు పరిహారం అందేలా నిబంధనలు రూపొందించాం. ⇒ మూడు గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ (రెస్కో)ల వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసి.. వాటిని డిస్కంల్లో విలీనం చెయ్యాలనే సాహసోపేత ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లింపులు ఆలస్యమైతే డిస్కంలు సర్ఛార్జీ వసూలు చేసుకునే అవకాశం కల్పించడమనేది దేశంలో మరెక్కడా లేదు. ⇒ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను శాశ్వతంగా అందించే ఆలోచనలో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని ముందుకు తీసుకెళ్లాం. వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ⇒ వచ్చే ఐదేళ్లు విద్యుత్ సంస్థల బలోపేతానికి, కొత్త సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణానికి జాప్యం లేకుండా అనుమతులిచ్చాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు లక్ష్యాలను చేరలేకపోతే వాటి స్థిర చార్జీలలోనే కోత ఉండేది. పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం వాటికి పెనాల్టీలూ వేస్తున్నాం. ప్రతి ఏటా గడువులోగా రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వులు విడుదల చేశాం. ⇒ ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఇప్పటివరకు అదనపు సర్చార్జీ ప్రతిపాదనలను ఆమోదించలేదు. రైస్ మిల్లులు, పల్వరైజర్ పరిశ్రమలకు 150 హెచ్పీ లోడు వరకు ఎల్టీ టారిఫ్ ద్వారా విద్యుత్ వాడుకొనే అవకాశం కల్పించాం. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు అవకాశమిచ్చాం. విద్యుత్ సంస్థల ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు పెన్షన్ ట్రస్ట్లకు నిర్దేశిత మొత్తాలను నిరీ్ణత సమయంలో ఖచ్చితంగా జమ చేయాలని ఆదేశించాం. ⇒ అవసరం మేరకు బహిరంగ మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే విద్యుత్ను సేకరించేలా చేశాం. తద్వారా 2020–21లో దాదాపు రూ.4,700 కోట్లు ట్రూ డౌన్ చేసి ఆ మొత్తాన్ని చరిత్రలో తొలిసారిగా వినియోగదారులకు బిల్లుల్లో వెనక్కి ఇప్పించాం. మనం రూపొందించిన పునరుద్ధరణీయ ఇంధన విధానం నమూనా నిబంధనలు దేశానికి ఆదర్శమయ్యాయి. వినియోగదారులకు సమాచారంలో పారదర్శకతను పెంచాం. ⇒ గృహ విద్యుత్ వినియోగదారుల మూడు కేటగిరీలని ఒకే గ్రూపు చేయడం ద్వారా బిల్లుల భారం తగ్గించాం. ఆదాయ పన్ను చెల్లింపుదారు అనే నిబంధన తొలగించి ప్రతి రైతును ఉచిత విద్యుత్ కేటగిరీ కిందకు తెచ్చాం. గృహ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిస్కంలు చేసిన సింగల్ పాయింట్ బిల్లింగ్ ప్రతిపాదనలను తిరస్కరించాం. -
బాబు మార్కు ‘షాక్’!
సాక్షి, అమరావతి: జనం భయపడినట్లుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే చేసింది. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయం.. వేయం.. అని చెబుతూనే భారీగా వడ్డిస్తోంది. చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇచ్చిన మాట తప్పి ఏకంగా రూ.6,072.86 కోట్ల సర్దు బాటు చార్జీల షాక్ ఇచ్చింది. ప్రతి యూనిట్పై గరిష్టంగా రూ.1.58.. 15 నెలల పాటు ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న నాలుగున్నరేళ్లు ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వమే భరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. స్పందించని ప్రభుత్వం ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదించాయి. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్విసుల నుంచి రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్విసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్విసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థల (ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేసుకుంటామని అడిగాయి. ప్రతి నెల ఒక్కో బిల్లుపైనా యూనిట్కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 75 శాతం భారం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ నెల 18న బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే ఈ చార్జీలను భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఆ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజుల పాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసింది. చార్జీలు భరించేందుకు కూటమి సర్కారు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రూ.6,072.86 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఇందులో రైతులు, వివిధ వర్గాల వారికి ఉచితంగా, సబ్సిడీగా ఇచ్చిన విద్యుత్పై దాదాపు రూ.1,400 కోట్లు భారం పడనుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది. ప్రభుత్వం నుంచి ఆ మేరకు వస్తే మిగిలిన రూ.4,672.86 కోట్లు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమీద డిస్కంలు అడిగిన దానిలో రూ.2,042 కోట్లు తక్కువకు అనుమతించామని మండలి తెలిపింది. గతం అంతా షాక్ల చరిత్రే » చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అనేది మరోసారి రుజువైంది. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు పాపాల వల్లే ప్రజలపై చార్జీల భారం పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచమని ప్రకటించారు. కానీ ఆ మాట తప్పడానికి ఐదు నెలలు కూడా పట్టలేదు. » చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారు. గతంలో ఏపీఈఆర్సీని తప్పుదోవ పట్టించారు. డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు సమర్పించకుండా అడ్డుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. అదే విధంగా 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. »గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత టీడీపీ హయాంలో ఉండేది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేసేది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి, అధిక భారం వేసే విధానాన్ని టీడీపీ సర్కారే గతంలో అమలు చేసింది. » అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు చంద్రబాబు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే పాతికేళ్లు వేయాల్సి వస్తోంది. -
నమ్మి ఓటేస్తే కరెంట్ షాకులా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు ) ప్రతిపాదించిన రూ.8,113.60 కోట్ల ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) చార్జీల భారంపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కర్నూలులో మండలి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 12 మంది సాధారణ ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థల ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు ఓటేసి అధికారంలోకి తెస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు గాలికి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ చార్జీలు వద్దంటూ సీపీఎం నేతలు విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నా నిర్వహించారు. అభ్యంతరాలపై డిస్కమ్ల నుంచి ఏపీఈఆర్సీ వివరణ కోరనుంది. సమాధానాలు రాగానే వారం రోజుల్లోగా చార్జీలపై మండలి నిర్ణయం తీసుకుంటుంది.బాబు పాలనంటేనే ’షాక్’లు..టీడీపీ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60కి పెరిగింది. అంటే 41.04 శాతం పెరిగింది. 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం టీడీపీ హయాంలో అమలైంది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేశారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులు మార్చి అధిక భారం మోపే విధానాన్ని గతంలో టీడీపీ సర్కారు అమలు చేసింది. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను నాడు చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్నారు. ఫలితంగా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే వేస్తున్నారు. అనుమతిస్తే భారం ఇలా..డిస్కమ్ల ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం లభిస్తే గృహ విద్యుత్ వినియోగదారులపై రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులపై రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్వీసులపై రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసులపై రూ.669 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్పై రూ.547 కోట్లకుపైగా విద్యుత్ బిల్లుల భారం పడనుంది. ప్రతి నెల ఒక్కో బిల్లుపై యూనిట్కు రూ.1.27 చొప్పున అదనంగా చార్జీలు వేస్తారు. ఒక వేళ ప్రజలపై భారం మోపేందుకు ఏపీఈఆర్సీ అనుమతించకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.8,113.60 కోట్లలో 75 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, ప్రజలపైనే ఆ భారాన్ని మోపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ట్రూ అప్ చార్జీల వడ్డనపై ఏపీఈఆర్సీలో విచారణ సర్దుబాటు పేరుతో రూ.8,114 కోట్ల బాదుడుపై నివేదిక సిద్ధం చేసిన డిస్కమ్లు కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల వడ్డనపై ఏపీ డిస్కంలు సిద్ధం చేసిన నివేదికపై వచి్చన అభ్యంతరాలపై ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగులేటరీ కమిషన్)లో విచారణ జరిగింది. శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో మొదటిసారి ఇంధన సర్దుబాటు చార్జీలపై చైర్మన్ నాగార్జునరెడ్డి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ అభ్యంతరాలు/సలహాలు స్వీకరించారు. ఇటీవల డిస్కమ్లు రూ.8,114 కోట్ల ఇంధన సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీకి నివేదించాయి. ఈ క్రమంలో వచి్చన అభ్యంతరాలు, సలహాలపై విచారణ జరిగింది. దాదాపు 14 సంస్థలు / మంది అభ్యంతరాలు, సలహాలు ఇచ్చారు. త్వరలోనే ఇంధన సర్దుబాటు చార్జీలపై ఈఆర్సీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
డిస్కంలు చెప్పాయి.. ఈఆర్సీ నిర్ణయించింది
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలానికి టారిఫ్ నిర్ణయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోని పరిశ్రమలకు ఊరట లభించలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెప్పిన దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆ టారిఫ్ని నిర్ణయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరం వరకు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు, బగాస్సే(చెరకు పిప్పి) విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఖర్చుల ఆధారంగా ఏపీఈఆర్సీ ధరలను సమీక్షించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు 26 ఉన్నాయి. వీటిలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.965 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. బయోమాస్ బేస్డ్ పరిశ్రమల నుంచి 171.25 మెగావాట్లు, బగాస్సే పరిశ్రమల నుంచి 206.95 మెగావాట్లు చొప్పున విద్యుత్ వస్తోంది. వీటికి గతంతో 2019–20 నుంచి 2023–24 వరకు నిర్ణయించిన టారిఫ్ ప్రస్తుతం అమలులో ఉంది. టారిఫ్ను నిర్ణయించినప్పుడే వార్షిక ఇంధన ధర 5 శాతం పెరుగుదలతో లెక్కిస్తారు. ఈ లెక్కన 2023–24కి ఇంధన ధరలు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల యూనిట్కు రూ. 5.80, బగాస్సేకి యూనిట్ రూ. 3.82 చొప్పున అమలు చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన ధరలను ఆమోదించాలని లేదా 2023–24కి ఆమోదించిన అదే ధరలను కొనసాగించాలని డిస్కంలు మండలిని కోరాయి. పరిశ్రమల నిర్వాహకులు ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వెల్లడించాలనుకుంటే దానికి కూడా కమిషన్ అవకాశం కల్పించింది. కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, దానికి తోడు డీజిల్ ధరలు భారీగా పెరిగినందున ఖర్చులు విపరీతంగా ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు ఏపీఈఆర్సీకి మొరపెట్టుకున్నారు. తాము కోలుకోవాలంటే యూనిట్ విద్యుత్ను కనీసం రూ. 8 నుంచి రూ. 15కు విక్రయించేలా అనుమతించాలని కోరారు. కానీ దానికి డిస్కంలు అంగీకరించలేదు. దీంతో దాదాపుగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలకే 2024–29 నియంత్రణ కాలానికి ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. -
ఆ లెక్కలూ చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసే కొనుగోళ్ల విషయంలో ఇకపై అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ డిస్కంలు తాము పరికరాలను కొనే ముందు, లేదా ఆ తర్వాత టెండర్ వివరాలను ఏపీఈఆర్సీకి పంపిస్తున్నాయి. కానీ ఆ టెండర్తో కొంటున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇతర సామాగ్రి వంటి ధరలను విడివిడిగా వెల్లడించడం లేదు. ఇకపై ప్రతి పరికరానికి సంబంధించి ధరల జాబితాను మండలికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ, సేకరణ, ప్రసార ప్రణాళికలపై ఏపీఈఆర్సీ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా 2024–25 నుంచి 2028–29 (5వ నియంత్రణ కాలం) వరకూ, 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకూ విద్యుత్ ప్రణాళికలను డిస్కంలు, ఏపీ ట్రాన్స్కో ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వాటిపై విచారణ జరిపిన మండలి ప్రతిపాదనల్లో చాలావరకు తిరస్కరించింది. కొన్నిటికి మాత్రమే అనుమతినిచ్చింది. మరికొన్నిటిపై మరింత సమాచారం కావాలని అడిగింది. అందులో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల అంశం ఒకటి. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. అలాగే వినియోగదారులకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. అదీగాక ఇందుకు అయ్యే ఖర్చును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ఏపీఈఆర్సీ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే జగనన్న కాలనీల విద్యుద్దీకరణకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే, తాను ఆమోదించిన విలువల కంటే డిస్కంలు లెక్కల్లో చూపించిన వ్యయం ఎక్కువ అని గుర్తించిన ఏపీఈఆర్సీ తాజా ఆర్డర్లో గతంలో ఆమోదించిన విలువలకే ఓకే చెప్పింది. అలాగే విద్యుత్ కొనుగోళ్ల అంచనాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున.. దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించింది. -
మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఈఆర్సీ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు, విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, చార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను ఏపీఈఆర్సీ ‘నియంత్రణ’ పేరుతో రూపొందించింది. గతేడాది డ్రాఫ్ట్ రూపంలో తీసుకువచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న ఏపీఈఆర్సీ... వీటికి ఆమోదం తెలిపింది. దేశంలో 2070కి కర్భన ఉద్గారాలను నెట్జీరో స్థాయికి తీసుకురావాలని, ఇందుకోసం 2030కి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పాలన్న కేంద్రం లక్ష్యానికి కూడా ఈ నిబంధనలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ పేర్కొంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లు, డిస్కంలకు ఈ ‘నియంత్రణ’ వర్తిస్తుంది.ఇవీ నిబంధనలు... » గ్రీన్ ఎనర్జీ నూతన నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్ను పొందడానికి దివాలా తీసిన, డిస్కంలకు రెండు నెలలు కంటే ఎక్కువకాలం బకాయిలు ఉన్న, అనధికారికంగా విద్యుత్ వినియోగం, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్లో ఉన్న సంస్థలకు అర్హత లేదు. » అర్హులైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ను మంజూరు చేయడానికి (ఏపీఎస్ఎల్డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. » దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం ఏపీ ట్రాన్స్కో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్కు అన్ని దరఖాస్తులు నేరుగా రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి.» సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్కు సంబంధించిన మొత్తం çసమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలు(జనరేటర్ల)కు కనెక్టివిటీ మంజూరు చేస్తారు.» ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, ఉత్తత్పి సంస్థలు, ఒప్పందాలు, ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్ను పొందడం కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాల్లో పేర్కొన్న విధంగానే చార్జీలు వర్తిస్తాయి.» గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్ చార్జీలు, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్చార్జీలు, స్టాండ్బై చార్జీలు, బ్యాంకింగ్, రియాక్టివ్ ఎనర్జీ చార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు.» 2032 డిసెంబర్ లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్చార్జ్ వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యస్థ కాలవ్యవధిలో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. బ్యాంకింగ్ నెలవారీ బిల్లింగ్ సైకిల్ ఆధారంగా ఉండాలి. -
‘సెకీ’ ఒప్పందానికి ‘ఏపీఈఆర్సీ’ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ను సరఫరా చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో చేసుకున్న త్రైపాక్షిక (ట్రై పార్టీ) ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 3 వేల మెగావాట్లు, 2025 అక్టోబర్ నుంచి మరో 3 వేల మెగావాట్లు, 2026 అక్టోబర్ నుంచి మరో వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ నుంచి మూడు విడతల్లో మొత్తం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం, మూడు డిస్కంలు 2021 డిసెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. సోలార్ పవర్ డెవలపర్లు రాజస్థాన్లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల నుంచి ఈ విద్యుత్ సేకరణ కోసం లెవలైజ్డ్ టారిఫ్ 25 సంవత్సరాలకు ట్రేడింగ్ మార్జిన్తో సహా యూనిట్కు రూ.2.49 చొప్పున చెల్లించేందుకు కూడా ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈ సేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీంతో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెకీ ద్వారా సౌర విద్యుత్ కొనుగోలుకు చట్టబద్ధంగా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. ఒప్పందంతో ప్రయోజనాలు ఇలా రాత్రనక, పగలనకా రైతులు పొలాల్లో విద్యుత్ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. వ్యవసాయానికి విద్యుత్ను తమ హక్కుగా రైతులు భావించేలా చర్యలు చేపడుతూ, రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్ను సమకూరుస్తోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకుండా, వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని 2024 నుండి దాదాపు 19 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక డిస్కమ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ద్వారా ఈ విద్యుత్తు అందించాలని నిర్ణయించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలోని యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకొంటే సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు 25 సంవత్సరాలు చెల్లించాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టులు కడితే వాటికి విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు దానికి కావలసిన అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య తేడా ఉంటుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్ధ్యాన్ని బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువ అవుతుంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ, ఆ ప్రతిపాదన విరమించుకొని సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. -
జూన్ నుంచి కర్నూలులోనే ‘ఏపీఈఆర్సీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు జూన్ 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీఈఆర్సీని అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఆ తర్వాత విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఈ భవనం జూన్ నెలకల్లా అందుబాటులోకి వస్తుండటంతో ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలించేందుకు ఫైళ్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించింది. వారి ఫోన్ నంబర్లను కూడా సిబ్బందికి ఇచి్చంది. మూడు ప్రాంతాల్లోనూ మండలి పని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం ఉంది. అంతకు ముందు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల, బహిరంగ విచారణ వంటివి నిర్వహించేవారు. ఇటీవల 2024–25 ఏడాదికి టారిఫ్ ఆర్డర్ను విజయవాడలో ఏపీఈఆర్సీ విడుదల చేసింది. ఈ విధంగా మూడు ప్రాంతాల్లోనూ మండలి విస్తరిస్తోంది. -
విద్యుత్ చార్జీల పెంపుపై విశాఖలో ప్రజాభిప్రాయ సేకరణ
-
కరెంటు చార్జీలు పెరగవు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త! 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్లనే కొనసాగిస్తున్నట్లు మూడు డిస్కమ్లు తెలిపాయి. సోమవారం విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్కో, జెన్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలిరోజు 17 మంది అభిప్రాయాలు తెలియచేశారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సెక్రటరీ డి.రమణయ్యశెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన డిస్కమ్లకు ‘ఏ’ గ్రేడ్: జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి డిస్కమ్లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాం. దేశవ్యాప్తంగా 2022–23 వినియోగదారుల సేవల్లో ఏడు డిస్కమ్లకు ఏ గ్రేడ్ రేటింగ్ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కమ్లే కావడం గర్వకారణం. రాష్ట్రంలో దాదాపు 1.8 కోట్ల వినియోగదారులకు సంబంధించి కేవలం 220 ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. డిస్కమ్లకు 50 శాతం పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉండగా అధిక భాగం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా సమకూరుతోంది. కోవిడ్ తర్వాత మార్కెట్ ధరలు అసాధారణంగా పెరిగాయి. కొన్నిసార్లు యూనిట్ రూ.10 సీలింగ్ రేట్కు కూడా విద్యుత్ లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది యూనిట్ రూ.16 సీలింగ్ రేటుగా విక్రయించిన సందర్భాలున్నాయి. డిస్కమ్లకు చెల్లింపులను హేతుబద్ధం చేస్తూ మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ పాలసీని ఆమోదించాం. ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినియోగదారులకు పూర్తి పారదర్శంగా సేవలందించేందుకు ఈఆర్సీ నిరంతరం శ్రమిస్తోంది. వినియోగదారులపై భారం లేదు: పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఈపీడీసీఎల్ పరిధిలో 2017–18లో 18,351 మిలియన్ యూనిట్లు విద్యుత్ అమ్మకాలు జరగగా ప్రస్తుతం 27,864 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2017–18లో పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉండగా ప్రస్తుతం 5.31 శాతానికి తగ్గాయి. సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.21,161.86 కోట్లుగా అంచనా వేశాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం మోపకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లకు ప్రస్తుతం ఉన్న స్టేషన్ల నిర్వహణ రాయితీని ఎత్తివేయాలని, రైల్వేకు అందిస్తున్న విద్యుత్ చార్జీలపై యూనిట్కు రూ.1 చొప్పున పెంచాలని నిర్ణయించాం. గ్రీన్ పవర్ టారిఫ్ ప్రీమియం అన్ని కేటగిరీల వినియోగదారులకు 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదించాం. దీని ద్వారా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా 2023–24లో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేస్తాం. 2024–25లో ఏపీఈపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం రూ.17,854.16 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం రూ.100.44 కోట్లు ► ప్రతిపాదిత ఫుల్ కాస్ట్ రికవరీ నుంచి ఆదాయం– రూ.3207.27 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.21,161.86 కోట్లు ► సమగ్ర అంచనా వ్యయం– రూ.21,161.86 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు సున్నా. పాత టారిఫ్లే: కె.సంతోషరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎస్పీడీసీఎల్ పరిధిలో పంపిణీ నష్టాలను 26.84 శాతం నుంచి గతేడాది నవంబర్ నాటికి 8.21 శాతం తగ్గించాం. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ 2004–05లో రూ.334 కోట్లు నుంచి 2023–24లో రూ.5195.98 కోట్లకు పెరిగింది. నవరత్నాల పథకంలో భాగంగా వ్యవసాయ, ఆక్వా రైతులు, బడుగు బలహీనవర్గాలకు చెందిన 19,26,467 మంది వినియోగదారులకు రూ.4,605.31 కోట్లను రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ టారిఫ్ షెడ్యూల్ని 2024–25లోనూ కొనసాగిస్తాం. రెండు మూడు స్వల్ప మార్పులున్నా అవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. 2024–25 ఏపీఎస్పీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.15,175.75 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం– రూ.7521.03 కోట్లు ► క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ నుంచి రాబడి – రూ.142.46 కోట్లు ► ఆర్ఈసీ నుంచి ఆదాయం– రూ.20 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.22,859.24 కోట్లు ► సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.22859.24 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా భారం లేకుండా ప్రతిపాదనలు: కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్ పరిధిలో కొత్తగా రూ.172 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు 54 వరకూ నిర్మాణ పనులు చేపట్టగా 43 సబ్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్వీడీఎస్ పథకం ద్వారా డిస్కమ్ పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1696.59 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం లేకుండా ప్రతిపాదనలు రూపొందించాం. 2024–25 ఏపీసీపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.9090.61 కోట్లు టారిఫ్ కాని ఆదాయం – రూన.392.52 కోట్లు క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ నుంచి రాబడి – రూ.21.53 కోట్లు ప్రతిపాదిత టారిఫ్ ద్వారా ఆదాయం అంచనా– రూ.50.73 కోట్లు ఫుల్కాస్ట్ రికవరీ టారిఫ్ నుంచి ఆదాయం– రూ.2996.53 కోట్లు ప్రస్తుత టారిఫ్ వద్ద రెవిన్యూ లోటు– రూ. –3047.26 కోట్లు సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.12,551.92 కోట్లు ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా ► రూ.15,729 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు: కేవీఎన్ చక్రధర్బాబు, ఏపీ జెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ మూడు డిస్కమ్ల పరిధిలో ఏపీ ట్రాన్స్కో నాలుగో నియంత్రణ కాలంలో మంచి విజయాలను నమోదు చేసింది. 2018–19లో 3.10 శాతం సరఫరా నష్టాలుండగా 2023–24 నాటికి 2.75 శాతానికి తగ్గింది. వచ్చే ఐదేళ్లలో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ ఐదేళ్ల కాలంలో ఉత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీ అవార్డు, ఫాల్కన్ మీడియా, ఎనర్జియా ఫౌండేషన్ నేషనల్ అవార్డు 2023 ద్వారా టాప్ స్టేట్ యుటిలిటీ అవార్డు సొంతం చేసుకున్నాం. రాబోయే ఐదేళ్లలో మూడు డిస్కమ్ల పరిధిలో 400 కేవీ సబ్స్టేషన్లు 7, 220 కేవీ సబ్స్టేషన్లు 23, 132 కేవీ సబ్స్టేషన్లు 41 నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రానున్న ఐదేళ్లకు గాను రూ.15,729.4 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు తయారు చేశాం. -
‘థర్మల్’ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశంలో కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా రానున్న కాలంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచుకుని.. థర్మల్ విద్యుత్ను తగ్గించుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితం అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రిజర్వు షట్ డౌన్ (ఉత్పత్తి తగ్గింపు)పై విధివిధానాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కూడా ప్రకటించింది. పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదని, గ్రిడ్కు ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తే అప్పుడు థర్మల్ యూనిట్లు షట్డౌన్ చేయవచ్చని ఏపీ ఈఆర్సీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకస్మాత్తుగా విద్యుత్ డిమాండ్ పడిపోయినప్పుడు కూడా ఉత్పత్తి తగ్గించవచ్చని పేర్కొంది. తక్కువ ధరకు విద్యుత్ అందించే ఉత్పత్తి సంస్థలకు మొదట ప్రాధాన్యం ఇచ్చేలా కొన్ని యూనిట్లను రిజర్వు షట్ డౌన్ చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని అత్యవసరంగా తగ్గించాల్సిన ఆవçశ్యకత రాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ ఈ నెల 20న వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. 2024లో 17 థర్మల్ ప్లాంట్లు భవిష్యత్లో పెరుగనున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకోవాలంటే పునరుత్పాదక ఇంధనంతో పాటు శిలాజ ఇంధన ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా గుర్తించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే సోలార్, విండ్, హైడల్ కలిపి ఉండే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంధన రంగంలో ఏపీ చర్యలను ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రశంసించిన కేంద్రం రాష్ట్రం బాటలోనే నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2024లో దేశంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకంటే ఎక్కువ ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నివేదిక అంచనా వేసింది. 2031–32కి ఇది 366.39 గిగావాట్లకు పెరుగుతుందని చెప్పింది. 2041–42కి 574.68 గిగావాట్లకు పెరగొచ్చనే అంచనాతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు అనివార్యమైంది. దీంతో 2024లో 17 గిగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, తర్వాత మరో 33 గిగావాట్ల ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇలా దాదాపు రూ.7.28 లక్షల కోట్ల పెట్టుబడితో 91 థర్మల్ ప్లాంట్లు స్థాపించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఆదర్శంగా ఏపీ ఏపీ గ్రిడ్ డిమాండ్ గతేడాది రోజుకు 190 మిలియన్ యూనిట్ల నుంచి 200 మిలియన్ యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 220 నుంచి 245 మిలియన్ యూనిట్లు రికార్డయ్యింది. అయినప్పటికీ విద్యుత్ కొరత లేకుండా సరఫరా చేయడంలో థర్మల్ కేంద్రాలు కీలక భూమిక పోషించాయి. ఎన్టీటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే.. ఈ ఏడాదిలో 75.83 శాతానికి పెరిగింది. అలాగే గతేడాది ఎన్టీపీఎస్ స్టేజ్–4 యూనిట్ హీట్ రేట్ 2,517 కిలో వాట్ అవర్ నుంచి 2,436 తగ్గింది. అదేవిధంగా 2022–23లో ఎంవీఆర్ ఆర్టీపీపీ స్టేషన్ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యుత్తమ థర్మల్ ప్లాంట్గా ఆర్టీపీపీ గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) తన అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ పీడీసీఎల్)తో కలిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే కృష్ణపఛిట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా ఎన్టీటీపీఎస్లో 8వ యూనిట్ సీవోడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. -
Fact Check: కరెంటుపై ‘కట్టు’ కథ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా పరిపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఈనాడు మరో తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ఇంధన సర్దుబాటు చార్జీ అంటే వినియోగదారులకు సంబంధం లేని ఖర్చు అన్నట్లు.., అయినా రూ.7,200 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమైపోయినట్లు కుట్రకు తెరలేపింది. యూనిట్కు మరో రూ.1.10 పైసలు ట్రూ అప్ చార్జీ అదనంగా పెరగనుందంటూ గురువారం ఓ ఊహాజనిత కథనాన్ని అడ్డగోలుగా అచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇంకా ఆమోదమే తెలపని నివేదికల ఆధారంగా వినియోగదారులను భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఇలాంటి అబద్దాలను ప్రజలు నమ్మరని మర్చిపోయింది. రామోజీ రాతల్లో రాయని వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ► కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా 2021–22 నుంచి విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు త్వరితగతిన జరగడానికి అప్పటివరకు అమలులో ఉన్న వార్షిక ట్రూ అప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీలు అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారమే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా నిబంధనలను రూపొందించింది. ► ట్రూ అప్ చార్జీలు, సర్చార్జీలు పరిమిత కాలానికి విధిస్తారు. శాశ్వతంగా రెగ్యులర్ చార్జీల మాదిరిగా బిల్లులో కలపరు. విద్యుత్ కొనుగోలు కాకుండా డిస్కంల నిర్వహణకు జరిగిన వాస్తవ వ్యయానికి, అనుమతించిన వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూ అప్ చార్జీల రూపంలో ఏపీఈఆర్సీ నిర్ణయించిన ప్రకారమే విధిస్తున్నారు. ► 2021–22 సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి డిస్కంలు రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ వాటిపై సమగ్ర బహిరంగ విచారణ, సమీక్ష జరిపి రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది. ఈ చార్జీలు 2022 ఏప్రిల్ నుంచి ఏడాది పాటు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. 2014–15 నుంచి 2018–19 వరకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదికలు పంపించాయి. అందులో నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలు దాదాపు రూ.3,976 కోట్లుగా ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ భాగం రూ.2,135 కోట్లు, సీపీడీసీఎల్ భాగం రూ.1,232 కోట్లు, ఈపీడీసీఎల్ భాగం రూ.609 కోట్లు. కాగా ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం నిమిత్తం ఈ ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. ► ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నుంచి నెల వారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ఒక నెల సర్దుబాటు చార్జీ ఆ తరువాత రెండో నెలలో అమలులోకి వస్తుంది. ఆ విధంగా ఈ ఏడాది ఆగస్టు నెల ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీ అక్టోబర్ బిల్లులో అంటే ప్రస్తుత నెల బిల్లులో వసూలు చేస్తున్నారు. ► నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరడం, థర్మల్ కేంద్రాలలో 20 నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకు పెరిగింది. అయినా కమిషన్ ఆదేశాల మేరకు డిస్కంలు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. ► 2022–23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ కింద డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనల్లో ఎంత వసూలుకు అనుమతించాలనేది బహిరంగ విచారణ అనంతరం ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది. మండలి నిర్ణయించిన ప్రకారమే డిస్కంలు వసూలు చేస్తాయి. డిస్కంలను నష్టాల్లోకి నెట్టిన టీడీపీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక ఆర్థిక సంవత్సరం ఆదాయ, అవసరాల నివేదికలను అంతకు ముందు సంవత్సరం సెప్టెంబర్ నెల నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా తయారుచేస్తాయి. అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్య పడదు. ఆర్థిక సంవత్సరం జరుగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులు ఉంటాయి. అవి సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు డిస్కంలకు ఉంటుంది. కానీ 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల సుడిగుండంలోకి నెట్టేసింది. 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను కూడా ఏపీఈఆర్సీకి సమర్పించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా, అదనంగా నిధులు విడుదల చేస్తూ డిస్కంలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండి, మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4,800 కోట్లను 2022–23 టారిఫ్లో డిస్కంలు తగ్గించాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
విద్యుత్ వినియోగానికి పరిమితులు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు సోమవారం ప్రకటించాయి. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్ని రంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించాయి. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్ షెడ్డింగ్గానీ లేదు. సెప్టెంబర్ 1న రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్–సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిగా విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు అభ్యర్థన పంపించాయి. ఆ అభ్యర్థన మేరకు ఈనెల 5 నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ పరిమితులు విధించవచ్చని కమిషన్ అనుమతించింది. తగ్గిన డిమాండ్తో పరిశ్రమలకు ఊరట రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడనం కారణంగా పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్ కొరత లేదు. విద్యుత్ సౌధలో సోమవారం ట్రాన్స్కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. ట్రాన్స్కో, జెన్కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిగా తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడినందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం కలగదని ఈ సమీక్షలో అభిప్రాయానికి వచ్చారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి అమలు నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాయి. మెరుగుపడిన సరఫరా పరిస్థితి కారణంగా.. కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో పరిమితి–నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయాన్ని కమిషన్కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. రోజుకి 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి యూనిట్కు రూ.9.10 వెచ్చించి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య–పారిశ్రావిుక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్గానీ, విద్యుత్ వాడకంలో పరిమితులుగానీ లేవని తెలియజేస్తున్నాం. – కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
విద్యుత్ వాహనాలదే భవిష్యత్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో 22 వేల విద్యుత్ వాహనాలుండగా.. 2034 నాటికి ఆ సంఖ్య 10.56 లక్షలకు చేరుకోనుందని రాష్ట్ర విద్యుత్ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) వెల్లడించింది. 2024–25లో 52,334 టూ వీలర్, 6,951 త్రీ వీలర్, 9,318 ఫోర్ వీలర్, 239 గూడ్స్, 133 విద్యుత్ బస్సులు రోడ్లెక్కుతాయని పేర్కొంది. అంటే మొత్తం వాహనాల సంఖ్య 68,975కు పెరుగుతుంది. 2034 నాటికి 10,56,617 విద్యుత్ వాహనాలను ప్రజలు వినియోగిస్తారని వెల్లడించింది. ఈవీల సంఖ్యతో పాటు వాటి చార్జింగ్కు వాడే విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరగనుంది. 2022లో 16 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం.. 2034 నాటికి 677 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఏపీఈఆర్సీ పేర్కొంది. ‘ఈవీలకు’ ప్రభుత్వ ప్రోత్సాహం.. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తోంది. డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈవీలు కొనుగోలుచేసిన వారికి రాయితీలు కూడా వస్తాయని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 9 శాతం వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర చోట్ల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 4 వేల ప్రాంతాలను ఇప్పటికే గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యేలా వీటిని అందుబాటులోకి తెస్తోంది. -
సోలార్ పవర్ ఉత్పత్తికి కొత్త నిబంధనలు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ రూఫ్టాప్ సిస్టంను మరింతగా విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కొత్త నిబంధనలు రూపొందించింది. వాటితో సమగ్ర గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ రెగ్యులేషన్–2023ను ప్రతిపాదించింది. సోలార్ రూఫ్టాప్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. రాష్ట్రంలోని డిస్కంల పరిధిలో ఇన్స్టాల్ చేసిన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేని అన్ని గ్రిడ్–ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఇవీ నిబంధనలు ♦ సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకునేవారికి డిస్కంలు నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కల్పించాలి. ♦ గృహవిద్యుత్ వినియోగదారులు ఏర్పాటుచేసే రూఫ్టాప్ సిస్టమ్ ప్రాజెక్టు నుంచి 25 ఏళ్ల పాటు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ తీసుకునేలా డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి. ♦ ఇంటరాక్టివ్ రూఫ్టాప్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుకు అర్హత ఉంది. ♦ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసినవారే దాన్ని సురక్షితంగా చూసుకోవాలి. ఆపరేషన్, నిర్వహణ బాధ్యత వహించాలి. ♦ ప్రమాదంగానీ, పంపిణీ వ్యవస్థకు ఏదైనా నష్టంగానీ వాటిల్లినప్పుడు తమ నెట్వర్క్ నుంచి సోలార్ నెట్వర్క్ను డిస్కనెక్ట్ చేసే హక్కు డిస్కంలకు ఉంటుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా రూఫ్టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తే ఆ ఒప్పందం కాపీని డిస్కంలకు ఇవ్వాలి. ♦ అన్ని లిమిటెడ్ కంపెనీలు, ప్రభుత్వసంస్థలు, వ్యక్తులు, సంఘాలు, వినియోగదారులు సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ ఏర్పాటుకు అర్హులే. ఎవరు ఎక్కడైనా పెట్టుకుని విద్యుత్ను వాడుకోవచ్చు, విక్రయించవచ్చు. -
గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ విని యోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వినియోగ దారు లకు ‘గ్రీన్ స్టార్స్’ ఇవ్వనున్నారు. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత నిబంధనలు 2022 కు మొదటి సవరణను(రెగ్యులేషన్ 6 ఆఫ్ 2023) ను ఏపీఈఆర్సీ ప్రతిపాదించింది. గ్రీన్ ఎనర్జీ కోసం వార్షిక ప్రాతి పదికన గ్రీన్ స్టార్స్ రేటింగ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని సూచించింది. దీని ప్రకారం ఏటా పునరు త్పాదక విద్యుత్ను 100% వినియోగిస్తే 5 స్టార్స్, 75% వాడితే 4 స్టార్స్, 50% కొంటే 3 గ్రీన్ స్టార్స్ లభించనున్నాయి. నెల మొత్తం వినియోగం ఆధారంగా అటువంటి ఆకుపచ్చ నక్షత్రాలు వారి నెలవారీ బిల్లులలో కూడా సూచిస్తారు. ప్రతినెలా డిజిటల్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. దీనిపై అభిప్రాయాలను వెల్లడించాల్సింగా డిస్కంలను కమిషన్ కోరింది. విద్యుత్ చట్టం, 2003 ప్రకారం..2024–25 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాలనుకునే వినియో గదారులు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీకి 3 నెలల ముందు డిస్కంలకు తమ అభ్యర్థ నలను సమర్పించాలని ఏపీఈఆర్సీ చెప్పింది. -
కర్నూలుకు ‘ఏపీఈఆర్సీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కార్యకలాపాలు ఇకపై కర్నూలు జిల్లా నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 82(3), కేంద్ర చట్టం నెం 36 (2003) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.8లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం కర్నూలులో ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు వెలువడ్డా హైదరాబాద్ కేంద్రంగానే పని చేస్తోంది. కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్ ఆర్డర్(విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల లాంటి కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి నిర్వహిస్తోంది. తాజా ఆదేశాలతో ఏపీఈఆర్సీ కర్నూలులో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏపీఈఆర్సీకి చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, లీగల్ కన్సల్టెంట్, ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. ‘ఏపీఈఆర్సీ’ ఏం చేస్తుందంటే? విద్యుత్ చట్టం సెక్షన్ 86 ద్వారా కమిషన్కు పలు విధులను నిర్దేశించారు. విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం లాంటి కీలక బాధ్యతలను మండలి నిర్వర్తిస్తుంది. విద్యుత్తు అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తేవడం లాంటివి చేపడుతుంది. పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు జారీ చేస్తుంది. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతం ఉండాలో నిర్ణయిస్తుంది. డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్య వివాదాలపై విచారణ జరిపి పరిష్కరిస్తుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం లాంటివి కమిషన్ ప్రధాన విధులుగా నిర్దేశించారు. -
విద్యుత్ భారం లేనట్లే.. పెరగని గృహ వినియోగ ఛార్జీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వినియోగదారులపై ఈసారి ఎలాంటి విద్యుత్ భారం పడలేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఛార్జీలు మినహా ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీఈఆర్సీ నిర్ణయించిన ఆదాయ అంతరం మొత్తంలో రూ.10,135 కోట్లను సబ్సిడీ రూపంలో డిస్కంలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది చాలా సంతోషకరమన్నారు. నగరంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకుర్ రామ్సింగ్, ఎ.రాజగోపాల్రెడ్డిలతో కలిసి విద్యుత్ టారిఫ్ చార్జీలను నాగార్జునరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్ క్రమబద్ధీకరణకు సబ్సిడీ.. ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగింపుతో పాటు ఎస్సీ, ఎస్టీ, నాయీ బ్రాహ్మణులకు, ఆక్వా రైతుల వినియోగదారులతో పాటు గృహ వినియోగదారులకు టారిఫ్ను క్రమబద్ధీకరించడానికి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ గృహ వినియోగదారులకు సబ్సిడీని ఇచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.52,590.70 కోట్ల మొత్తంతో ఆదాయ అవసరాలను ఏపీఈఆర్సీకీ సమర్పించాయని.. అందులో రూ.49,267.36 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపిందన్నారు. విద్యుత్ అమ్మకాలు, కొనుగోలు అవసరాలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు విద్యుత్ పంపిణీ సంస్థల అంచనాల కంటే తక్కువగా వుండడంతో ఏపీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత పరిశ్రమ, పిండిమిల్లులకు ఊరట ఇక పవర్లూమ్ వినియోగదారులకు కేవీఏహెచ్ (కిలోవోల్ట్ యాంపియర్ అవర్స్) బిల్లింగ్ మినహాయింపు ఇచ్చినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. చేనేత కార్మిక వర్గాలు, పిండి మిల్లుల విద్యుత్ వినియోగదారుల అభ్యర్థనల మేరకు 10 హెచ్పీ వరకు కేవీఏహెచ్ బిల్లింగ్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, గతేడాదిలో ఒక్కసారే వున్న ఆఫ్–సీజన్ ఎంపికను ఈ ఏడాదికి రెండుసార్లుగా మార్చామన్నారు. ఇప్పటివరకు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో హెచ్టీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ డిమాండ్ చార్జీలను వసూలుచేయడం లేదన్నారు. ఈ ఏడాదిలో రూ.475 చొప్పున చెల్లించాల్సి వుంటుందన్నారు. సోలార్ రైతులకు సమస్యలొస్తే.. ఉచిత విద్యుత్ సోలార్ పంపుసెట్లను వాడుతున్న రైతులకు సోలార్ విద్యుత్ వినియోగంలో సమస్యలు ఎదురైతే ప్రభుత్వ విధానం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు వారికి ఉచిత విద్యుత్ను పంపిణీ చేయాలని ఆదేశించినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. అంతేకాక.. సోలార్ రూఫ్టాప్ నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను డిస్కమ్లు ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యుత్ ఆదా అంశానికి సంబంధించి గృహ వినియోగదారులకు ఎల్ఈడీ, ట్యూబ్లైట్లు, బీఎల్డీసీ (బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్) సీలింగ్ ఫ్యాన్లు, సూపర్ ఎఫీషియెంట్ ఎయిర్ కండిషనర్లు వంటి ఇంధన ఉపకరణాల విక్రయాల పైలట్ ప్రాజెక్టును ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్లో అలసత్వం వహిస్తే చర్యలు రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అలసత్వం వహిస్తే డిస్కమ్ అధికారులపై చర్యలు తప్పవని నాగార్జునరెడ్డి హెచ్చరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు సంబంధించి విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల సంతృప్తిని సమీక్షించేందుకు జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్ను విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వెబ్సైట్లో పొందుపరచడంతో పాటు వివరాలను ఏపీఈఆరీ్సకి సమర్పించాలని ఆదేశించామన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని.. అది చట్టపరిధిలోని అంశమని ఆయన స్పష్టంచేశారు. -
విద్యుత్ పీపీఏల టారిఫ్: ఇక ఇదే రేటు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. యూనిట్ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్కు రూ.3.43 ఇవ్వాలని విండ్ పవర్ జనరేటర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇరవై ఏళ్ల తరువాత మీ ఇష్టం విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పవన విద్యుత్ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకు యూనిట్కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ ఇవ్వాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఈఆర్సీ టారిఫ్ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆ తరువాత పదేళ్లకు టారిఫ్ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్సీ.. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పవన విద్యుత్ టారిఫ్ యూనిట్కు రూ.2.64 గా నిర్థారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. పవన విద్యుత్కు అనుకూలంగా రాష్ట్రం కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయి వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది. రాష్ట్రంలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశవ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. -
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.. మీరేమంటారు?
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల (టారిఫ్) సవరణపై ఈనెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాన్యులపై ఎటువంటి విద్యుత్ చార్జీల భారం వేయకుండా విద్యుత్ చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2023–24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ) అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గతేడాది నవంబర్ 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిపై ఈసారి కూడా గతేడాది లాగానే విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, కార్యదర్శి, సభ్యులు, రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కంల అధికారులు ఈ విచారణలో పాల్గొననున్నారు. జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజులు ఉదయం గం.10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను మండలికి తెలపవచ్చు. అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ, ఈఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజలు తమ సమీపంలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందు నమోదు చేసుకున్న వారి నుంచి, తరువాత నమోదు చేసుకోని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెరగవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2023–24 ఆర్థిక సంవత్సరానికి చేసిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల ప్రతిపాదనల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు, వాణిజ్య అవసరాలకు, సాధారణ పరిశ్రమల రంగానికి, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీల పెంపుదల లేదని రాష్ట్ర ఇంధన శాఖ స్పష్టంచేసింది. ‘సాక్షి’ ప్రతినిధికి గురువారం ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు చేసిన టారిఫ్ ప్రతిపాదనల సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గతనెల 30న సమర్పించాయి. వాటి ప్రతులు ఏపీఈఆర్సీ, పంపిణీ సంస్థల వెబ్సైట్లలో ఉన్నాయి. నివేదిక ప్రతులు డిస్కంల ప్రధాన కార్యాలయంలోను, సర్కిల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల్లో ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సరఫరా సేవా ఖర్చు నిర్దేశిత యూనిట్ ఖర్చు రూ.6.98 కన్నా రూ.0.70æ పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ఆ భారాన్ని ఏ వర్గంపైనా వేయడంలేదు. జనం నెత్తిన రూ.13,487.54 కోట్లు భారం పడుతోందని పచ్చ పత్రికలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అది పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ ఆవశ్యకతకు, ప్రస్తుతం టారిఫ్, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య వుండే వ్యత్యాసం మాత్రమే. ఇదంతా ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై మోపడం జరగదు. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయం తీసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, ఇతర రాయతీల ద్వారా ఈ ఆదాయ అంతరాన్ని విద్యుత్ సంస్థలు పూడ్చుకుంటాయి. చార్జీల వసూలు ద్వారా నష్టాల భర్తీ జరగదు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అంటే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం, ఆక్వా రంగం.. తదితరులకు అందించే విద్యుత్ రాయితీల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,123 కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఏపీఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటగిరి వారీగా, శ్లాబుల వారీగా ప్రస్తుతం అమలులో వున్న ధరలనే ప్రతిపాదిస్తూ (ఇప్పటికే రాయితీ పొందుతున్న ఎనర్జి ఇంటెన్సివ్ పరిశ్రమలకు మినహా) నివేదిక ఇచ్చారు. అంతేగానీ, నష్టాలను చార్జీల వసూలుతో భర్తీ చేసుకుంటామని ఎక్కడా ప్రతిపాదించలేదు. వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదన చాలా గోప్యంగా ఉంచారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. డిస్కంల వారీగా సేవా ఖర్చు ఇక డిస్కంల కొనుగోలు వ్యయంపై వేర్వేరు గణాంకాలు సమర్పించాయనడం సరైంది కాదు. పంపిణీ సంస్థ సేవా ఖర్చు (కాస్ట్ అఫ్ సర్వీస్)లో వివిధ భాగాలు అంటే.. విద్యుత్ కొనుగోలు వ్యయం, ప్రసార, పంపిణీ నష్టాలు, నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతు ఖర్చులు మొదలైనవి ఒక్కో డిస్కంలో ఒక్కో విధంగా ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంలకు విద్యుత్ కొనుగోలు వ్యయం, మొత్తం సేవా ఖర్చు–కాస్ట్ అఫ్ సర్వీస్ ప్రతీ యూనిట్కు ఇలా వున్నాయి.. (రూ.లలో) -
ప్రజలపై పైసా భారం లేకుండా స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అవాస్తవం మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్లతో ప్రయోజనం స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ -
సహజ వెలుగులను ఇలా కొనండి
సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్ సంస్థలు వినియోగించే విద్యుత్లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ఏపీఈఆర్సీకి మరిన్ని అధికారాలు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అధికారాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు డిస్కంలకు మార్గం సుగమం చేస్తూ మరో గెజిట్ ఇచ్చింది. వాస్తవానికి ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం విద్యుత్ చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో గెజిట్ రూపంలో వీటిని తెచ్చింది. విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ నియమావళిని సవరించింది. ఈ నెల 21 నుంచే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు గల ఏపీఈఆర్సీకి ప్రస్తుతం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏడాదికోసారి ఆదాయ, వ్యయాల నివేదిక (ఏఆర్ఆర్)లను సమర్పిస్తున్నాయి. ఆ నివేదికలపై బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మరుసటి ఏడాది విద్యుత్ చార్జీల (టారిఫ్) పెంపును మండలి నిర్ణయిస్తుంటుంది. డిస్కంలు మధ్యంతరంగా సమర్పించే ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలపై అవసరానికి అనుగుణంగా అనుమతులు జారీ చేస్తుంటుంది. విద్యుత్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంటుంది. కేంద్రం ఇచ్చిన తాజా గెజిట్ ప్రకారం విద్యుత్ కొనుగోలు, పంపిణీ వివరాలు, ఆదాయ వ్యయాలు, రాయితీల గణాంకాలు వంటి నివేదికలను ప్రతి డిస్కం మూడు నెలలకోసారి ఏపీఈఆర్సీకి సమర్పించాలి. వీటిని విద్యుత్ నియంత్రణ మండలి క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ధారించుకున్న తరువాత నెల రోజుల్లోగా కేంద్రానికి పంపించాలి. అలాగే ఇప్పుడు చేస్తున్నట్లుగానే విద్యుత్ చార్జీల సవరణ ఆదేశాలు కూడా సకాలంలోనే చేయాలి. ఇందుకోసం డిస్కంలు సమరి్పంచే లెక్కలు వాస్తవమో కాదో తేల్చాల్సిన బాధ్యత మండలిపై ఉంటుంది. దీంతో ఏపీఈఆర్సీ మరింత అప్రమత్తంగా, కఠినంగానూ వ్యవహరించాల్సి ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘హిందూజా’, డిస్కంల వివాదం పరిష్కారం
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎన్పీసీఎల్), డిస్కంల మధ్య నడుస్తున్న వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పరిష్కరించింది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఇరు వర్గాలకు ఇబ్బంది లేని విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సమీపంలోని పాలవలసలో హెచ్ఎన్పీసీఎల్కు 1,040 మెగావాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ఉంది. దీని నుంచి విద్యుత్ కొనుగోలుకు 1992లో ఏపీ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం 1994లో 30 ఏళ్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. 1996లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల డిస్కంలకు, హెచ్ఎన్పీసీఎల్కు మధ్య వివాదం తలెత్తింది. తమకు అవసరం లేకపోయినా ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ను ఎందుకు తీసుకోవాలని, పీపీఏను పునఃసమీక్షించాలని డిస్కంలు పట్టుబట్టాయి. దీంతో 1998లో మరోసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. మరోవైపు సంస్థ మూలధనం రూ.7,758 కోట్లుగా ఏపీఈఆర్సీకి హెచ్ఎన్పీసీఎల్ చూపించింది. దీనిపై విచారణ చేపట్టిన మండలి హెచ్ఎన్పీసీఎల్ చెబుతున్న మూలధనంలో రూ.5,810.75 కోట్లకు ఆమోదం తెలిపింది. పాతికేళ్లకే ఒప్పందం కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తాజా అనుమతులను ఇవ్వడం ఆపివేసింది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న పారిస్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్ఎన్పీసీఎల్కు డిస్కంలకు మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని 30 సంవత్సరాలకు బదులుగా ప్రాజెక్ట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తేదీ నుండి 25 సంవత్సరాలుగా ఏపీఈఆర్సీ నిర్ణయించింది. హిందూజా పవర్ యూనిట్ ధర రూ.3.98 గా తేల్చింది. అంతేకాకుండా గత ఆరేళ్లలో హెచ్ఎన్పీసీఎల్కు డిస్కంలు చెల్లించిన అడ్హాక్ టారిఫ్లను తుది టారిఫ్లుగా పరిగణించామని, కంపెనీ ఎలాంటి బకాయిలను వసూలు చేయడానికి వీల్లేదని చెప్పింది. తద్వారా డిస్కంలపై అదనపు భారం పడకుండా కాపాడింది. విద్యుత్ కొనుగోలు చార్జీ(ట్రూ అప్) భారం పడకుండా ప్రజలకు మేలు చేసింది. అయితే డిస్కంలకు విద్యుత్ అవసరం లేనప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ విక్రయించుకునేందుకు సంస్థకు అనుమతినిచ్చింది. -
విద్యుత్ రంగాన్ని వెంటాడుతున్న ‘బాబు’ తప్పులు.. రూ.3 వేల కోట్ల భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ అధిక ధరలకు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా.. ట్రూ అప్ చార్జీలపై తప్పుడు నివేదికలిచ్చి డిస్కంలను అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వ తప్పిదాలు విద్యుత్ రంగాన్ని ఇప్పటికీ కకావికలం చేస్తూనే ఉన్నాయి. అప్పుడు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే రూ.వేల కోట్లను డిస్కంలు వెచ్చిస్తున్నాయి. చంద్రబాబు ఘనకార్యాల వల్ల మరింత అప్పుల పాలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఈ పరిస్థితి నుంచి విద్యుత్ రంగాన్ని బయటపడేయడానికి కృషి చేస్తోంది. అనేక సంస్కరణలు, పొదుపు చర్యల ద్వారా అనవసర ఖర్చులు తగ్గించడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటోంది. అప్పట్లోనే భారీ అప్పులు టీడీపీ ప్రభుత్వం హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధర (యూనిట్ రూ.4.84 చొప్పున)లకు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా రూ.3 వేల కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత విలువ ఆధారంగా ఈ మొత్తం భారం రూ.35,000 కోట్లకు పైనే. టీడీపీ హయాంలో 2014లో రూ.29,703 కోట్లు ఉన్న విద్యుత్ రంగం మొత్తం అప్పులు 2019 నాటికి రూ.68,596 కోట్లకు చేరాయి. ఇవికాకుండా పవర్ జనరేటర్లకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుండి రూ.21,540.96 కోట్లకు పెరిగాయి. వడ్డీల కోసమే కొత్త అప్పు చంద్రబాబు మిగిల్చిన అప్పుల వల్ల ఇప్పుడు విద్యుత్ సంస్థలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థలు లాభాల్లోనే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లను డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఆ నష్టంలో కొంత పూడ్చుకుందామని డిస్కంలు ట్రూ అప్ చార్జీల ద్వారా చేసిన ప్రయత్నాన్నీ కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా రూ.38,836 కోట్ల రుణాలను ఆర్థిక సంస్థల నుండి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది. ఫలితంగా 2020–21లో ఏపీఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.31,346 కోట్లలో డిస్కంలు రూ.26,421 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి. తద్వారా రూ.4,925 కోట్లు మిగిల్చాయి. ఆదుకుంటూ.. ఆర్ధిక సాయం రాష్ట్రంలో 22.43 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకూ, దోభీ ఘాట్లు, క్షౌ రశాలలు, స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకూ ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఆక్వా రంగం అభివృద్ధి కోసం 61 వేల ఆక్వా రైతులకు సబ్సిడీ రేట్లకు విద్యుత్ అందిస్తోంది. వైఎస్సార్ జలకళ ద్వారా 6,669 బోర్ వెల్స్కు రూ.180 కోట్లు వెచ్చిస్తోంది. 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు ఉచితంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. రానున్న 30 ఏళ్ల వరకూ దీనిని కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. డిస్కంలపై విద్యుత్ కొనుగోలు భారం తగ్గించేందుకు 33,240 మెగావాట్ల సామర్థ్యం గల 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆదుకోవడానికి కేవలం మూడేళ్లలోనే దాదాపు రూ.40 వేల కోట్లు సాయం అందించింది. -
ఆర్ఈసీఎస్ ఎండీపై క్రిమినల్ కేసు పెట్టండి
సాక్షి, అమరావతి: రూరల్ ఎలక్ట్రిక్ కో–ఆపరేటివ్ సొసైటీ (ఆర్ఈసీఎస్)ల్లో అధికార దుర్వినియోగం, అనధికారికంగా బిల్లుల వసూలు తదితర ఆరోపణలపై విచారణకు హాజరు కాని అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఈమేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఈసీఎస్లలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, అనధికారికంగా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి ఆర్ఈసీఎస్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న వైనాన్ని సూమోటోగా స్వీకరించిన ఏపీఈఆర్సీ.. ఈ నెల 13న విచారణకు రావాలని ఎండీ రామకృష్ణంరాజుకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన బుధవారం విచారణకు హాజరు కాలేదు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, డాక్టర్లు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, విచారణకు హాజరు కాలేనని తెలుపుతూ డాక్టర్ సర్టిఫికెట్తో పాటు లేఖను మెయిల్ ద్వారా కమిషన్కు పంపారు. విచారణకు హాజరుకాకుండా ఉండేందుకే వెన్నునొప్పిని సాకుగా చూపించారని ఏపీఈఆర్సీ భావించింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎండీపై చట్టపరంగా క్రిమినల్ కేసు పెట్టాలని బుధవారం విచారణకు హాజరైన ఈపీడీసీఎల్ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేష్కుమార్ను ఆదేశించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఈసీఎస్లో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అనకాపల్లి, చీపురుపల్లి ఆర్ఈసీఎస్లపై పూర్తి స్థాయి నివేదికలతో ఈ నెల 20న మరోసారి హైదరాబాద్లోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో విచారణకు రావాలని ఎస్ఈని ఆదేశించింది. అదే రోజు ఎండీ కూడా వ్యక్తిగతంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. మేం ఆదేశించినా ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదు నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అనకాపల్లి, చీపురుపల్లి ఆర్ఈసీఎస్లపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఎస్ఈ సురేష్కుమార్ వెంటనే అఫిడవిట్ దాఖలు చేశారు. అనకాపల్లి ఆర్ఈసీఎస్కు లైసెన్స్ మినహాయింపు గడువు ముగియగా, గతేడాది మార్చి 25న దానిని స్వాధీనం చేసుకోవాలని ఈపీడీసీఎల్కు ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసిందని ఎస్ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలోనే బిల్లింగ్ జరుగుతుతోందని తెలిపారు. కానీ జూన్ మొదటి వారంలో ఆర్ఈసీఎస్ మే నెల బిల్లులు జారీ చేసి దాదాపు రూ.9 కోట్లు వసూలు చేసిందన్నారు. బిల్లులు వసూలు చేయవద్దని తాము జూన్ 1న, 3న నోటీసులు జారీ చేశామని వివరించారు. అయినప్పటికీ ఆర్ఈసీఎస్ వసూళ్లు ఆపలేదన్నారు. వినియోగదారుల నుంచి సేకరించిన మొత్తాలను వెంటనే ఈపీడీసీఎల్కు పంపాలని కోరుతూ జూన్19న, 22న, 23న లేఖలు పంపినప్పటికీ స్పందన లేదన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన రూ.9 కోట్లను వెంటనే రికవరీ చేస్తామని, అనకాపల్లి ఆర్ఈసీఎస్ ఎండీపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామని ఎస్ఈ అఫిడవిట్లో తెలిపినట్లు విద్యుత్ నియంత్రణ మండలి వెల్లడించింది. -
AP: భలే చాన్స్.. విద్యుత్ బకాయిలకు వన్ టైమ్ సెటిల్మెంట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) పరిధిలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నీటిపారుదల శాఖ, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాల మేరకు వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా సర్ చార్జీలు లేకుండా విద్యుత్ బకాయిలు చెల్లించవచ్చని డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ.. వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 10వ తేదీలోగా బకాయిలను పూర్తిగా చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలకు మాత్రమే సర్ చార్జీ నుంచి మినహాయింపు లభిస్తుందని చెప్పారు. డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నిరీ్ణత సమయంలో బకాయిలను చెల్లించకపోతే సర్ చార్జీలు కట్టాల్సివస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆరి్థకంగా నిలదొక్కుకునేందుకు వీలుగా వినియోగదారులు బకాయిలను చెల్లించాలని, లేదంటే విద్యుత్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పరిశ్రమల నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఊరట కలిగించింది. రాష్ట్రంలో నిర్వహణ భారమై మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్ సర్వీసును తిరిగి ఇచ్చేందుకు కనిష్ట చార్జీలను వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఏపీఈఆర్సీ ఆదేశించింది. ఈ నిబంధన వచ్చే మార్చి 31 వరకు అమలులో ఉంటుందంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణ విధానం అమలుపై మూడు నెలలకోసారి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. చదవండి: AP: ‘అంగన్వాడీ’ల ఆధునికీకరణ ఓ పరిశ్రమ విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కొంతకాలం నడిచి, మూతపడితే మూడు నెలల పాటు కనీస చార్జీల రూపంలో బిల్లు జారీ అవుతుంది. తరువాత ఆ బిల్లూ నిలిపేస్తారు. కొన్నేళ్ల తరువాత పరిస్థితులు చక్కబడి పరిశ్రమను తిరిగి తెరవాలనుకున్నప్పుడు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సి ఉంటుంది. అప్పుడు మూతపడ్డ రోజులన్నిటికీ కనీస చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా అలా చేయరు. తొలి మూడునెలలకు మాత్రమే కట్టించుకుని మళ్లీ సర్వీసును ఇచ్చేస్తారు. అయితే పరిశ్రమ మూతపడే సమయానికి ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలు వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఏపీఈఆర్సీ ద్వారా డిస్కంలు అందిస్తున్న ఈ వెసులుబాటు ప్రయోజనం కలిగించనుంది. -
పరిశ్రమలకు 'పవర్' ఫుల్
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై విధించిన అన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఇంకా కొనసాగుతున్నా, రాష్ట్రంలో నిత్యం 195.26 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొన్నప్పటికీ పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచే పరిశ్రమలపై ఆంక్షల ఎత్తివేత వర్తిస్తుందని ఏపీఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. బొగ్గు కొరత, ఎండలతో.. వేసవి ఉష్ణోగ్రతల ప్రభావంతో గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 235 మిలియన్ యూనిట్లకు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్ విద్యుదుత్పత్తిలో సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పవర్ ఎక్ఛ్సేంజీల్లో యూనిట్ ధర రూ.16 నుంచి రూ.20 వరకూ పెరిగింది. ఫలితంగా సరఫరా తగ్గి కోతలు అనివార్యమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల విద్యుత్ వినియోగంపై నియంత్రణ విధించాల్సి వచ్చింది. డిస్కమ్ల అభ్యర్ధన మేరకు పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తూ ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో.. మే 9న పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసి ప్రభుత్వం ఊరట కలిగించింది. నిరంతరం నడిచే పరిశ్రమలు 70 శాతం విద్యుత్ వాడుకోవడానికి అనుమతిచ్చింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ ఈ నెల 13న ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 15 తరువాత పరిశ్రమలపై ఆంక్షలను పొడిగించలేదు. పరిశ్రమలకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ను అందించాలని, ఆంక్షలను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల విద్యుత్తు సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని ఆంక్షలు, నియంత్రణలను తొలగించడంతో పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ఊరట లభించింది. వ్యవసాయం, గృహ విద్యుత్ అవసరాలకు కోతలు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా జరుగుతోంది. -
AP: పరిశ్రమలకు భారీ ఊరట.. ఆంక్షలు ఎత్తివేత
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ ఆంక్షల నుంచి భారీ ఊరట లభించింది. పగటిపూట నడిచే పరిశ్రమలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 235 మిలియన్ యూనిట్ల నుండి 161 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్టుగానే పరిశ్రమలకు ఆంక్షల నుంచి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి మాట నిలుపుకుంది. చదవండి: ఏపీకి మరో ఎక్స్ప్రెస్ హైవే.. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అభ్యర్థన మేరకు పరిశ్రమలపై ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏపీఈఆర్సీ ఆంక్షలు విధించింది. తొలుత వారంలో ఒక రోజు పవర్ హాలిడేతో పాటు, విద్యుత్ వినియోగంలో 50 శాతానికే అనుమతించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆంక్షలను సడలించింది. తాజా ఆదేశాల ప్రకారం.. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ డిమాండ్లో 70 శాతం వినియోగించుకోవచ్చు. మిగతా సమయంలో 60 శాతం వాడుకోవాలి. పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్హాలిడేను మూడు రోజుల క్రితమే తొలగించగా, రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత ఎటువంటి షిఫ్టులకు అనుమతిలేదని నిబంధనలు విధించింది. తాజాగా వాటిని కూడా తొలగించి, పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగించుకొనే అవకాశం కల్పించింది. -
సాగు, ఇళ్లకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరెంట్ కష్టాలు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్ను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది. ఇక పరిశ్రమలు మాత్రం ఇంధన శాఖ విధించిన ఆంక్షలను మరికొన్నాళ్లు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వతేదీ వరకు పరిశ్రమలు, హెచ్టీ సర్వీసుల విద్యుత్ వినియోగంపై పరిమితులను పొడిగించేందుకు డిస్కమ్లు చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించింది. డిస్కమ్లు ఏప్రిల్ 8వతేదీ నుంచి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రతతో.. రాష్ట్రంలో తాజాగా రోజూ 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మే నెల మొదటి వారానికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి కొంతమేర కరెంట్ అందుబాటులోకి వస్తుందని భావించినా ఎండల కారణంగా ఏమాత్రం వినియోగం తగ్గలేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు కోసం రోజూ రూ.37.73 కోట్లు ఖర్చు చేస్తోంది. సగం తగ్గించుకుంటే.. గృహ, వ్యవసాయ సర్వీసులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలపై ఆంక్షలు కొనసాగించాల్సి వస్తోందని ఇంధనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ప్రతి రోజూ 50 శాతం మాత్రమే వినియోగించాలని, మిగతా పరిశ్రమలు వారంలో ఒకరోజు పవర్ హాలిడే పాటించాలని నిబంధనలు విధించారు. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా విద్యుత్తు వాడకాన్ని 50 శాతం మేర తగ్గించుకోవాలని, ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్వాహకులు, సంఘాల అభ్యర్థన మేరకు కొన్నిటికి మినహాయింపులు, చార్జీల నుంచి వెసులుబాటును ఏపీఈఆర్సీ కల్పించింది. పవర్ హాలిడే ఇలా ► ఏపీఎస్పీడీసీఎల్లో పరిధిలోని తిరుపతిలో శుక్రవారం, హిందుపురం డివిజన్లో శనివారం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సోమవారం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మంగళవారం, నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లలో బుధవారం, పుత్తూరు డివిజన్లో గురువారం పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్నట్టు సీఎండీ హెచ్.హరనాధరావు తెలిపారు. ► ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖ జోన్–11 డివిజన్లో శుక్రవారం, జోన్–1, జోన్–3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లలో శనివారం, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లలో గురువారం పవర్ హాలిడే ప్రకటించినట్లు సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ► ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరులో శుక్రవారం, విజయవాడలోని గుణదల, మాచర్ల, కందుకూరులో శనివారం, విజయవాడ గ్రామీణ, గుంటూరు–1 టౌన్, మార్కాపురం, చీరాలలో సోమవారం, మచిలీపట్నం, బాపట్ల, అద్దంకిలో మంగళవారం, విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతిలో బుధవారం, గుడివాడ, నరసరావుపేట, దర్శిలో గురువారం పవర్ హాలిడే విధిస్తున్నామని సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్యాంపు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రస్తుతం హైదరాబాద్ రెడ్హిల్స్లోని సింగరేణి భవన్ నుంచే ఏపీఈఆర్సీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారిఫ్పై కూడా విశాఖపట్నం నుంచే ఆన్లైన్ ద్వారా ఏపీఈఆర్సీ విచారణ జరిపింది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే ఇక్కడి నుంచి ఈఆర్సీ ఏడాదిలో కొద్దిరోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్రంగంలో విద్యుత్ చార్జీల నిర్ణయంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఈఆర్సీ పాత్ర కీలకమైంది. అటువంటి ఈఆర్సీ క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటైతే.. విశాఖ కాస్తా విద్యుత్రంగ కార్యకలాపాలకు వేదికగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పరిశ్రమలకు విద్యుత్ సడలింపులు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ వినియోగ పరిమితులను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం సడలించింది. ఈ మేరకు వివిధ పారిశ్రామికవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. హెచ్టీ సర్వీసుల వినియోగదారులకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. దీనికి అవసరమైన నిరభ్యంతర పత్రం కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. అలాగే మార్కెట్లో కొనే విద్యుత్పై క్రాస్–సబ్సిడీ సర్చార్జ్, అదనపు సర్చార్జ్ల నుంచి మినహాయింపునిచ్చింది. అదేవిధంగా పరిమితులు అమలులో ఉన్నంతవరకు కనీస చార్జీలు వర్తించవని.. వాస్తవ వినియోగంపైనే డిమాండ్ చార్జీలు విధించాలని డిస్కంలకు స్పష్టం చేసింది. వినియోగదారులు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ను పొందే విషయంలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా నెలవారీ కోటా పూర్తి చేసిన తర్వాత మాత్రమే పరిమితుల ప్రకారం జరిమానాలు విధించాలి. డిస్కమ్ల అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వినియోగం రోజుకి 209 మిలియన్ యూనిట్లు ఉంది. దీనిలో థర్మల్ 70 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు 38 మి.యూ, హైడ్రో 6 మి.యూ, గ్యాస్, సెయిల్ 8 మి.యూ, పవన విద్యుత్ కంపెనీలు 16 మి.యూ, సౌర విద్యుత్ కంపెనీలు 25 మి.యూ, హిందుజా 12 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 0.04 మిలియన్ యూనిట్ల చొప్పున అందిస్తున్నాయి. ఇప్పటికీ పవర్ ఎక్ఛ్సేంజ్ల నుంచి 34 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తే తప్ప డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ నెల 30 వరకు పరిశ్రమలు, హెచ్టీ సర్వీసులపై విధించిన పరిమితులను పొడిగించాలని డిస్కమ్లు చేసిన అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. పరిమితుల వల్ల 290 మిలియన్ యూనిట్లు ఆదా.. దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ, గృహావసరాలకు కోతలు లేకుండా సరఫరా అందించడం కోసం ఈ నెల 8 నుంచి పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు అమలులోకి వచ్చాయి. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే 290 మిలియన్ యూనిట్లను ఆదా చేసి గృహావసరాలకు నిరంతరం, వ్యవసాయావసరాలకు 7 గంటలు విద్యుత్ను అందించారు. ఇంకా కొరత ఉండటం, పంటలకు విద్యుత్ అవసరం వంటి కారణాలతో పరిమితులను మరికొన్ని రోజులు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు నిరంతరం నడిచే పరిశ్రమలు రోజులో వాడే విద్యుత్ వినియోగంలో 50 శాతం వరకు వాడుకోవచ్చు. మిగతా పరిశ్రమలకు వారంలో ఒక రోజు (వారాంతపు సెలవు కాకుండా) పవర్ హాలిడే అమలు జరుగుతుంది. అయితే ప్రజాప్రయోజనాల దృష్ట్యా దాదాపు 22 పరిశ్రమలు, హెచ్టీ సర్వీసులకు ఈ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. -
పరిశ్రమలకు 'పరిమితి'పై త్వరలో సడలింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విధించిన పరిమితి, నియంత్రణ చర్యలు సాధ్యమైనంత త్వరగా సడలించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. డిస్కంలు జరిమానా చార్జీలను ఆదాయ వనరుగా చూడకూడదని, నిబంధనల అమలుకు వాటిని ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతల నుంచి ఉపశమనం కలిగించడం కోసం పరిశ్రమలపై ఇటీవల విధించిన ఆంక్షలపై కమిషన్ సభ్యులు పి.రాజగోపాల్ రెడ్డి, ఠాకూర్ రామ సింగ్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్, మూడు డిస్కంల సీఎండీలతో ఏపీఈఆర్సీ చైర్మన్ బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లను బలోపేతం చేయడం, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల రికవరీకి సంబంధించిన సమస్యలపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా, రాష్ట్ర్రంలో బొగ్గు కొరత, దానిని అధిగమించేందుకు తీసుకుంటున్న పలు చర్యలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ వివరించారు. ఏ ధరకైనా విద్యుత్ కొనుగోలు చేసి, అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. విద్యుత్ రంగం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని, అనవసర పెట్టుబడులు మానుకోవాలని సూచించారు. సకాలంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, పునరుద్ధరణకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ, ఈ విషయంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పనితీరు బాగోని ఏ డిస్కంను కమిషన్ ఉపేక్షించేది లేదని చైర్మన్ హెచ్చరించారు. ఊరట ఇలా.. ► విద్యుత్ ఆంక్షల అమలు కాలంలో క్రాస్ సబ్సిడీ సర్చార్జి ఉండదు. ► కాంట్రాక్ట్ చేసిన డిమాండ్పై కాకుండా పరిమితం చేసిన డిమాండ్పై మాత్రమే డిమాండ్ చార్జీలు. ► ఏప్రిల్ 15 నుంచి మాత్రమే జరిమానా చార్జీల విధింపు. ► ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగం ఉన్న వినియోగదారులకు నెలవారీ విద్యుత్ కోటా పూర్తయ్యాకే జరిమానా. ► ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఓపెన్ యాక్సెస్ లభ్యత కోసం నిరభ్యంతర పత్రం జారీ. -
విద్యుత్ ఆంక్షలకు మినహాయింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి పరిశ్రమలకు అమలుచేస్తున్న ఆంక్షలపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూనే పలు పరిశ్రమలు, హెచ్టీ వినియోగదారులకు వాటి నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమలపై అదనపు చార్జీలు విధించడానికి అనుమతిస్తూ, తద్వారా విద్యుత్ డిమాండ్ను సమతుల్యం చేసి, కోతలు పెరగకుండా చర్యలు చేపట్టింది. ఈనెల 22 వరకూ ఆంక్షలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత ప్రభావం రాష్ట్రంపైనా పడిన విషయం తెలిసిందే. రోజుకు సగటున 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఇందులో కనీసం 40 మిలియన్ యూనిట్లు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కానీ, అక్కడ తీవ్రపోటీతో విద్యుత్ దొరకడంలేదు. ఈ నేపథ్యంలో.. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు నివారించడానికి పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. ఇక నిరంతరం విద్యుత్ వాడే పరిశ్రమలు తమ వినియోగంలో 50 శాతం తగ్గించుకుని, మిగతా సగంతో నడుపుకునే అవకాశం కల్పించారు. అంతేకాక.. పగటిపూట నడిచే ఇతర పరిశ్రమలు వారాంతపు సెలవుతో పాటు ఈనెల 22 వరకూ మరోరోజు విద్యుత్ వినియోగించడం కుదరదు. ఈనెల 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా ఇలా డిస్కంలు తాము తీసుకున్న నిర్ణయాన్ని, అందుకు దారితీసిన పరిస్థితులను ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకువెళ్లాయి. వాటిని పరిశీలించిన మండలి.. పవర్ హాలిడే, ఇతర నిబంధలను సమర్థిస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 22 విభాగాలకు మాత్రం వీటి నుంచి మినహాయించాలని సూచించింది. అదే విధంగా.. ఈ నిబంధనలను పరిశ్రమలు ఖచ్చితంగా పాటించేలా చేసేందుకు డిస్కంలు చేపట్టిన చర్యలకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఇకపై పరిశ్రమలు పవర్ హాలిడే, ఇతర నిబంధనలను అతిక్రమించి విద్యుత్ వినియోగిస్తే వాటిపై డిమాండ్ చార్జీలు విధిస్తారు. అవి ప్రస్తుత ధరలకు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పవర్ హాలిడే రోజు విద్యుత్ వాడితే ఒకటిన్నర రెట్లు ఎనర్జీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్యలవల్ల పరిశ్రమలు నిబంధనల మేరకే విద్యుత్ వినియోగిస్తాయి. దీనివల్ల సగటున రోజుకు పరిశ్రమల నుంచి ఆదా అవుతున్న 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ను గృహ, వ్యవసాయ అవసరాలకు మళ్లించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మినహాయింపు పొందిన పరిశ్రమలు, హెచ్టీ సర్వీసులు.. ► ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ► ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ► వార్తాపత్రికల ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ► పోర్టులు, ఏఐఆర్, దూరదర్శన్ ► విమానాశ్రయాలు, విమానయాన సంబంధిత సేవలు ► డెయిరీలు, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు ► ఐస్క్రీమ్ తయారీ పరిశ్రమలు ► కేంద్ర ప్రభుత్వ ఆర్ అండ్ డీ యూనిట్లు ► నీటిపారుదల నిర్మాణ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా ► నావల్ డాక్యార్డ్, విశాఖపట్నం ► చమురు అన్వేషణ సర్వీస్ కనెక్షన్లు, చమురు శుద్ధి కర్మాగారాలు ► రైల్వే ట్రాక్షన్, రైల్వే వర్క్షాప్లు, గూడ్స్ షెడ్లు, రైల్వేస్టేషన్లు ► ఆసుపత్రులు ► పోలీస్స్టేషన్లు, అగ్నిమాపక స్టేషన్లు ► రక్షణ సంస్థలు ► వీధి దీపాలు ► తాగునీటి సరఫరా పథకాలు ► నీటి పనులు, నీటి పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు ► మతపరమైన ప్రదేశాలు ► యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ► మెడికల్ ఆక్సిజన్ తయారీ కర్మాగారాలు -
చార్జీల పెంపు స్వల్పమే
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు కరెంట్ చార్జీలు ఆంధ్రప్రదేశ్లోనే అతి తక్కువని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. కామన్ టెలిస్కోపిక్ విధానం ప్రకారం సామాన్యులపై భారం లేకుండా విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కొత్త టారిఫ్ ప్రకటించిందని చెప్పారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇకపైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు చార్జీలు ఏపీలోనే తక్కువ. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వారు మొత్తం గృహ వినియోగదారుల్లో 50 శాతం వరకు ఉంటారు. ► టెలిస్కోపిక్ విధానంలో 0–30 యూనిట్లకు విద్యుత్ చార్జీల పెంపు చాలా స్వల్పం. ప్రజల వినతి మేరకే ఏపీఈఆర్సీ ఈ శ్లాబ్లను తెచ్చింది. ► తెలంగాణలో తాజాగా రూ.5,600 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచగా ఆంధ్రప్రదేశ్లో పెంపుదల రూ.1,400 కోట్లు మాత్రమే ఉంది. ► ట్రూ అప్ చార్జీలను మూడో త్రైమాసికంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.3,368 కోట్లు, ఏపీఈపీడీసీఎల్లో రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. రూ.3,977 కోట్ల సర్దుబాటు మొత్తంలో వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల రాయితీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,066.54 కోట్ల భారాన్ని భరిస్తుండగా మిగతాది మాత్రమే ఇతర వినియోగదారుల నుంచి పంపిణీ సంస్థలు వసూలు చేయాలని మండలి ఆదేశించింది. అది కూడా వినియోగదారుల వాస్తవ వినియోగం ఆధారంగా యూనిట్కు ఏపీఎస్పీడీసీఎల్ రూ.0.23, ఏపీసీపీడీసీఎల్ రూ.0.22, ఏపీఈపీడీసీఎల్ రూ.0.07 చొప్పున మాత్రమే విధించాలని నిర్దేశించింది. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లో ఆగస్టు 1వ తేదీ నుంచి 36 నెలలు, ఏపీఈపీడీసీఎల్ 18 నెలల వాయిదాలలో వసూలు చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రూఅప్ వసూలు రూ.700 కోట్లు మాత్రమే. గత సర్కారు ట్రూ అప్ ఫైల్ చేయకపోవడం పెనుభారంగా పరిణమించింది. ► 2022–23లో మొత్తం ఆదాయ అవసరం రూ.45,398.66 కోట్లుగా డిస్కమ్లు అంచనా వేశాయి. ఇందులో రూ.11,123.21 కోట్లను ఉచిత విద్యుత్, సబ్సిడీల కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో 20.76 లక్షల మంది వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఏమాత్రం ఉండదు. మూడు పంపిణీ సంస్థల సగటు విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్కు రూ.6.82 నుంచి రూ.6.98కు పెరిగింది. ► రాష్ట్రంలో 74 శాతం విద్యుత్ థర్మల్ ద్వారా ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. మనకు బొగ్గు గనులు లేకపోవడంతో మహానది (ఒడిశా), సింగరేణి కాలరీస్(తెలంగాణ)పై ఆధారపడి కొనుగోలు చేస్తున్నాం. బొగ్గు రేట్లు, రవాణా చార్జీల పెరుగుదల కారణంగా ఏటా 14 శాతం ఉత్పత్తి వ్యయం అధికం అవుతోంది. నిజానికి దీని కారణంగానే విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చింది. గుదిబండల్లా పీపీఏలు గత సర్కారు హయాంలో కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలపై అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సగటు విద్యుత్ కొనుగోలు రేటు కంటే అధిక ధరలకు 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుందని పీపీఏల రద్దు వల్ల చార్జీలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. ఆ పీపీఏలను రద్దు చేయలేదని, ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆయా కంపెనీలకు సూచించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్ రంగంలో రూ.68 వేల కోట్లకుపైగా అప్పులు, రూ.21 వేల కోట్లకుపైగా బిల్లుల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. 2014 నాటికి విద్యుత్తు సంస్థలు రూ.29,703 కోట్ల మేర అప్పుల్లో ఉండగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.68,596 కోట్లకు పెరగడంతో నష్టాలతో దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణలతోపాటు పొదుపు చర్యలను సమర్థంగా అమలు చేయడం, ఆర్థికంగా చేయూత ద్వారా డిస్కమ్లను ఆదుకున్నట్లు చెప్పారు. గత సర్కారు ట్రూ అప్ చార్జీలను ఫైల్ చేయకుండా వ్యవస్థలను అడ్డదిడ్డంగా మేనేజ్ చేయడం వల్లే అప్పులు ఆ స్థాయికి పెరిగాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకాల కారణంగా విద్యుత్తు రంగం కుప్పకూలే పరిస్థితి నెలకొనడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు అందించే వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. -
విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంపు
సాక్షి, అమరావతి: ఇటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే అటు డిస్కమ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 2022–23 రిటైల్ విద్యుత్ సరఫరా ధరలను సవరించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చార్జీలను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి గృహ విద్యుత్ వినియోగదారులపై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం తిరుపతిలో వెల్లడించారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా సగటున 3.26 శాతం పెరిగిన చార్జీల కారణంగా మూడు డిస్కమ్లకు ఏటా దాదాపు రూ.1,400 కోట్ల రాబడి అదనంగా సమకూరనుంది. ఏప్రిల్ 1వతేదీ నుంచి ఈ చార్జీలు అమలులోకి రానున్నాయి. కామన్ టెలిస్కోపిక్ విధానం డొమెస్టిక్ కేటగిరీలో ఉన్న మూడు గ్రూపులను కామన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్తో ఒకే గ్రూపుగా కమిషన్ తాజాగా విలీనం చేసింది. ఈ విధానంలో వినియోగదారుడు తక్కువ స్లాబ్లో చేసిన వినియోగానికి సంబంధిత తక్కువ స్లాబ్ టారిఫ్లో బిల్ వేస్తారు. పేద గృహ వినియోగదారుల కోసం 0–30 యూనిట్ల కొత్త స్లాబ్ను ప్రవేశపెట్టారు. దీనివల్ల యూనిట్లు పెరిగినప్పటికీ స్లాబుల ప్రకారమే బిల్లు పడుతుంది. కమర్షియల్ 2 కేటగిరీ కింద ఉన్న మైనర్, మేజర్ సబ్ కేటగిరీలను విలీనం చేయడంతో నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వినియోగదారులకు ఎనర్జీ ఛార్జీలు తగ్గుతాయి. గృహ విద్యుత్ టారిఫ్ను స్వల్పంగా పెంచినా వీరిలో 90 శాతం మంది సగటు సరఫరా వ్యయం యూనిట్ రూ.6.98 కంటే తక్కువ టారిఫ్లోకి వస్తారు. 75 యూనిట్ల వరకు వినియోగానికి సంబంధించి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వినియోగదారుల సంఖ్య మొత్తం గృహ వినియోగదారుల సంఖ్యలో 50 శాతం ఉంటుంది. వీరికి డిస్కమ్లు కొనుగోలు ధర కంటే తక్కువకే విద్యుత్ను సరఫరా చేస్తాయి. కామన్ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్కు రూ. 8.75 చొప్పున పడుతుంది. ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొదటి 50 యూనిట్లకు యూనిట్కు రూ.2.65, తర్వాత 50 యూనిట్లకు రూ.3.35, ఆ తర్వాత 100 యూనిట్లకు రూ.5.40, చివరి 50 యూనిట్లకు రూ.7.10 చొప్పున పడుతుంది. ఈ లెక్కన మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే. పరిశ్రమలకు ‘టైమ్ ఆఫ్ డే’ రాయితీలు టీఓడీ చార్జీలు పగలు 0.75 పైసలు తగ్గించడం ద్వారా పగటిపూట మాత్రమే పనిచేసే అధిక శాతం పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. పౌల్ట్రీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లకు రాయితీ టారిఫ్, ఆక్వా, పౌల్ట్రీ హేచరీలకు టీఓడీ నుంచి మినహాయింపునిచ్చారు. 2 కిలోవాట్ కంటే తక్కువ, 2 కిలోవాట్ కంటే ఎక్కువ కనెక్టెడ్ లోడ్ కలిగిన మతపరమైన ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని టారిఫ్ను కిలోవాట్కు ప్రస్తుతం ఉన్న రూ.4.80 నుంచి రూ.3.85కు మండలి తగ్గించింది. గోశాలలకు వర్తించే టారిఫ్ను కూడా ఇదే ప్రకారం కుదించారు. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు.. గ్రిడ్ సపోర్ట్ చార్జీలను పునరుద్ధరించాలని డిస్కమ్లు కోరగా కిలోవాట్కి రూ.15 నుంచి రూ.50 వరకు విధించడం ద్వారా సంబంధిత విద్యుదుత్పత్తిదారులకు ఊరట కల్పించారు. ఓ కేటగిరిలోని పారిశ్రామిక వినియోగదారులపై ఓల్టేజ్ సర్చార్జీ విధించాలన్న డిస్కమ్ల ప్రతిపాదనను మండలి అంగీకరించలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా 132 కేవీ కంటే 220 కేవీ ఓల్టేజీ వినియోగదారులకు 0.5 పైసలు తక్కువ టారిఫ్ను మండలి నిర్ణయించింది. పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్కు సంబంధించి విద్యుత్ పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఖర్చులను రూ.3,368, రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే 2022–23లో వినియోగదారుల నుంచి రూ.2,910.74 కోట్ల కంటే తక్కువ మొత్తం మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ వసూలు మొదలవుతుంది. సరఫరా వ్యాపారం సర్దుబాటు ఖర్చులకు సంబంధించి 3వ నియంత్రణ కాలానికి రూ.492 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే ఏపీ ట్రాన్స్కోకు రానున్న పాయింట్ ఆఫ్ కనెక్షన్ (పీఓసీ) ఛార్జీల నుంచి దీన్ని సర్దుబాటు చేయాలని ఆదేశించడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు పోర్టల్ వినియోగదారులు అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకునేందుకు పంపిణీ సంస్థల వెబ్సైట్లలో సౌకర్యాన్ని కల్పించాలని మండలి ఆదేశించింది. పైలట్ ప్రాజెక్ట్లకు రూ.3 కోట్లు విద్యుత్ పొదుపు ఉపకరణాలు, సౌర విద్యుత్తుతో వ్యవసాయం మొదలైన ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టడానికి నెలలోగా తమ బకాయిల నుంచి రూ.కోటి చొప్పున ఏపీసీడ్కోకు మూడు డిస్కంలు మొత్తం రూ.3 కోట్లు విడుదల చేయాలని మండలి ఆదేశించింది. అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయం తిరుపతి రూరల్: వినియోగదారులకు ఊరట కల్పించటంతోపాటు డిస్కంలకు ఆర్థిక భరోసా కల్పించేలా విద్యుత్ టారిఫ్లను ఆమోదించినట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనెట్ హాలులో ఆయన విద్యుత్ టారిఫ్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి టారిఫ్ ప్రకటించినట్లు తెలిపారు. గతంలో ఉన్న మూడు రకాల శ్లాబ్లను ఎత్తివేసి అందరికీ ఉపయోగపడేలా కొత్తగా కామన్ టెలిస్కోపిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఫంక్షన్ హాళ్లు తెరవకున్నా గతంలో నెలకు కిలోవాట్కు విధించిన రూ.100 కనీస చార్జీల్ని ఎత్తివేశామన్నారు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్కు రూ.6.70 ధరను కొనసాగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్సింగ్, రాజగోపాల్రెడ్డి, డిస్కమ్ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, సంతోషరావు పాల్గొన్నారు. -
విద్యుత్ ఛార్జీల పెంపునకు ఏపీఈఆర్సీ ప్రతిపాదనలు
సాక్షి, తిరుపతి: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలు తెలిపింది. ఈ సందర్భంగా తిరుపతిలో విద్యుత్ చార్జీల టారిఫ్ను పీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్లను తీసుకొచ్చినట్లు తెలిపారు ధరలు పెంచడం బాధాకరంగా ఉన్నా తప్పడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. 20 ఏళ్ల తరువాత విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి పోవడంతోనే చార్జీలు పెంచి వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. కాగా ఏపీఈఆర్సీ ప్రతిపాదనల ప్రకారం.. 30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు, 31- 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంపు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు, 400 యూనిట్కు 55పైసల పెంపుకు ప్రతిపాదించాయి. -
సామాన్యుడిపై భారం లేకుండా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గతేడాది అక్టోబర్లో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సమర్పించిన 2022–23 అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్) ప్రతిపాదనలపై బుధవారం నిర్ణయం వెలువడనుంది. డిస్కంలు చేసిన ప్రతిపాదనల్లో పేద, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారంలేదు. పైగా గతంలో కంటే తక్కువ రేట్లు వసూలుచేస్తామని తెలిపాయి. దానికి తగ్గట్లుగానే ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తిరుపతి వేదికగా బుధవారం కొత్త టారిఫ్ను ప్రకటించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన డిస్కంలను గట్టెక్కించడంతో పాటు సామాన్యులపై అధిక భారంలేకుండా చార్జీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పేద, మధ్య తరగతికి ఊరట డిస్కంల ప్రతిపాదనల ప్రకారం.. ► నెలవారీ వినియోగం 30 యూనిట్ల వరకు ఉన్న గృహ విద్యుత్ వినియోగదారులకు ఏ విధమైన పెంపులేదు. ► 31–75 యూనిట్లు ఉన్న వినియోగదారులకు చాలా స్వల్పంగా అంటే కేవలం యూనిట్కు 20 పైసలు పెంచాలని మాత్రమే డిస్కంలు ప్రతిపాదించాయి. ► నెలవారీ వినియోగం 201–300 మధ్య చార్జీలు యూనిట్కు రూ.0.10 పైసలు, 301–400 మధ్య రూ.0.45 పైసలు, 401–500 మధ్య ఒక రూపాయి తగ్గించగా, 500 యూనిట్లు మించిన వినియోగానికి రూ.2.45 చొప్పున తగ్గిస్తూ ప్రతిపాదించాయి. ► వీటిపై విశాఖపట్నంలో ఏపీఈఆర్సీ ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టింది. ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు పెరగడం, విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోవడం, రుణాలు కూడా తీసుకోలేనంతగా వాటి రుణ పరిమితులు దాటిపోవడం, వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా అధిక రేట్లతో పీపీఏల ద్వారా విద్యుత్ కొనుగోలు వంటివన్నీ కలిసి డిస్కంలను 2019 నాటికే నడిరోడ్డున నిలబెట్టేశాయి. 2014–19 మధ్య రాష్ట్రంలో 30,742 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ను బ్యాక్డౌన్ చేసిన గత టీడీపీ ప్రభుత్వం.. తనకు నచ్చిన కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఆదాయ, వ్యయాల మధ్య తేడా (రెవెన్యూ గ్యాప్) 24.18 శాతం పెరిగింది. వినియోగదారులకు సరఫరా చేసిన విద్యుత్ సరాసరి వ్యయం యూనిట్కు రూ.6.92 ఉండగా, దానిపై విద్యుత్ సంస్థలకు వచ్చేది యూనిట్కు రూ.5.25 మాత్రమే. అంటే యూనిట్కు రూ.1.67 లోటు ఉంది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నాయి. మనుగడ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ విద్యుత్ సంస్థలు తేరుకోలేకపోతున్నాయి. రుణాలిచ్చిన సంస్థల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ లోటును కొంతైనా పూడ్చకపోతే విద్యుత్ సంస్థల మనుగడ కష్టం. – జె. పద్మజనార్ధనరెడ్డి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ మన రాష్ట్రంలోనే తక్కువ పేదలను మినహాయించి మిగిలిన వినియోగదారులకు సంబంధించిన విద్యుత్ చార్జీలపై ప్రతిపాదనలనే ఏపీఈఆర్సీకి సమర్పించాం. జాతీయ స్థాయిలో విద్యుత్ చార్జీలను పోల్చిచూస్తే ఏపీలోనే తక్కువ ధరలతో గృహ విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. – కె. సంతోషరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఖర్చులు పెరిగిపోయాయి గృహ విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, విద్యుత్ కొనుగోలు, నిర్వహణ వ్యయం ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. దానిని టారిఫ్తో భర్తీచేయాలి. – హెచ్.హరనాథరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ -
విద్యుత్ ధరలపై ఆచితూచి అడుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ధరలపై పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొనుగోలు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంధన శాఖ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో విద్యుత్ కొనుగోలు జరిగిన ఖర్చునే ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు (ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్) ప్రతిపాదనలు సమర్పించాయి. హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా.. పంపిణీ సంస్థలు దీర్ఘకాలిక, స్పల్పకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ను కొనుగోలు చేస్తుంటాయి. ఇలా కొనే విద్యుత్ ధరలు ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా ఉంటాయి. పలు ఉత్పత్తి సంస్థలు యూనిట్ ధరను రూ.5.54 వరకూ నిర్ణయించి అమ్ముతున్నాయి. హైడల్ విద్యుత్ యూనిట్ రూ.1.58 పైసలకే లభిస్తుంది. కానీ.. దీని లభ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో డిమాండ్కు సరిపడా విద్యుత్ను ఎక్కువ ధర చెల్లించైనా సమకూర్చుకుని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత డిస్కంలపై ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా ఎక్కడ విద్యుత్ దొరికితే అక్కడ కొనుగోలు చేస్తున్నాయి. 23న ఏపీ ఈఆర్సీ విచారణ ఇలా కొన్న విద్యుత్ సగటు వ్యయం ఈపీడీసీఎల్ యూనిట్ రూ.4.51గా, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.4.53గా నిర్ధారించాయి. తాము కొంటున్న విద్యుత్ ధరలను సంస్థల వారీగా కూడా డిస్కంలు ఏపీ ఈఆర్సీకి నివేదించాయి. ఈ మొత్తం కొనుగోలు ఖర్చులకు 2021–22 ఏడాది కూడా అనుమతించాల్సిందిగా మండలిని కోరాయి. డిస్కంలు సమర్పించిన లెక్కలు, ప్రతిపాదనలపై మార్చి 23న ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ లోగా ఎవరైనా తమ అభ్యంతరాలను, సూచనలను ఏపీ ఈఆర్సీ ఈ మెయిల్ commn& secy@aperc.inకు పంపవచ్చు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మండలి విచారణ చేపడుతుంది. -
నిరంతరం సలహాలు, సూచనల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఏడాదికి ఒకసారి టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఎవరైనా వినియోగదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఏడాదిలో ఎప్పుడైనా అందించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. 365 రోజులు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి, సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్), టారిఫ్లపై ఆన్లైన్ ద్వారా ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిపై సమీక్షించేందుకు నిర్వహించిన స్టేట్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. -
విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,925 కోట్లను ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ సౌధలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ రూ.31,346 కోట్ల వ్యయానికి అనుమతి ఇవ్వగా మన డిస్కంలు రూ.26,421 కోట్లను మాత్రమే ఖర్చు చేశాయని చెప్పారు. ఆదా అయిన రూ.4,925 కోట్లలో రూ.3,373 కోట్లను వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా ట్రూ డౌన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం వల్ల్ల దాదాపు 18.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ.7,714.21 కోట్ల సబ్సిడీ అందించడంతోపాటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను 2024 నుంచి దశలవారీగా కొనుగోలు చేయాలని భావిస్తోందని చెప్పారు. దేశంలోనే తొలి సాంకేతికత విద్యుత్ డిమాండ్ను ఒకరోజు ముందుగానే అంచనా వేసేందుకు ‘డే ఎ హెడ్ ఎలక్ట్రిసిటీ ఫోర్ కాస్టింగ్ మోడల్’ను మన విద్యుత్ సంస్థలు రూపొందించాయని శ్రీకాంత్ తెలిపారు. ఆర్టి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేసే ఈ వ్యవస్థ దేశంలోనే మొదటిదని, దీనివల్ల విద్యుత్ సరఫరా, గ్రిడ్ నిర్వహణ వంటి అంశాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు గత ఏడాది 7.50 శాతం ఉండగా, 2021–22లో ఇప్పటివరకు 5 శాతానికి తగ్గాయని చెప్పారు. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా.. 2021–22 నవంబర్ నాటికి 11 శాతానికి తగ్గించగలిగామన్నారు. కాగా, విద్యుత్ సౌధలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
అక్కడి నుంచే చెప్పండి
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల(టారిఫ్)పై ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) ప్రజాభిప్రాయాన్ని బహిరంగ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేకరించనుంది. ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. సదస్సుల్లో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, పి.రాజగోపాల్తో పాటు రాష్ట్ర ఇంధన శాఖ, మూడు డిస్కంల అధికారులు పాల్గొంటారు. 2022–23 సంవత్సరానికి ‘ఏఆర్ఆర్’ సమర్పణ తక్కువ విద్యుత్ వినియోగించే వారిపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించే విధంగా చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022–23 ఆర్థిక సంవత్సర రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ), అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గత ఏడాది డిసెంబర్ 13న ఏపీ ఈఆర్సీకి సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో మార్పులను చేయాల్సిన అవసరాన్ని ఇందులో వివరించాయి. వివిధ మార్గాల ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేయాల్సి ఉందని వెల్లడించాయి. మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేశాయి. పరిశ్రమలకు నాన్ పీక్ అవర్స్లో టైం ఆఫ్ ది డే (టీఓడీ) పేరుతో యూనిట్కు 50 పైసల చొప్పున రాయితీ ఇచ్చేందుకు డిస్కంలు ప్రతిపాదించాయి. అవసరమైతే ఇదే విధానాన్ని గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని తెలిపాయి. కాగా, ఏపీ ఈఆర్సీ నిలిపివేసిన 2014–2019 ట్రూ అప్ చార్జీలను తిరిగి వసూలు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. కరోనా కారణంగా.. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్కు సంబంధించిన బహిరంగ విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ నుంచే జరుపనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిరోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను నియంత్రణ మండలి స్వీకరిస్తుంది. విశాఖ వెళ్లక్కర్లేదు ఏపీఈఆర్సీకి విద్యుత్ చార్జీలపై అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వారు విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ (ఎస్ఈ ఆఫీస్), డివిజన్ కార్యాలయం (డీఈ ఆఫీస్) ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు చెప్పవచ్చు. ప్రతిరోజు ముందుగానే నమోదు చేసుకున్న వారి నుంచి అభ్యంతరాలు విన్న తరువాత, నమోదు చేసుకోని వారు మాట్లాడేందుకు ఏపీ ఈఆర్సీ అనుమతిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు ‘సాక్షి’కి చెప్పారు. -
AP: పరిశ్రమలకు ‘పవర్’ రాయితీ!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చులో మిగిలిన మొత్తాన్ని ట్రూ డౌన్ చార్జీల పేరుతో వినియోగదారులకు తొలిసారిగా 2021లో రూ.125 కోట్లు వెనక్కిచ్చిన రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022లో అమలయ్యేలా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. విద్యుత్ డిమాండ్లేని సమయాల్లో భారీ పరిశ్రమలకు వినియోగించిన విద్యుత్పై యూనిట్కు రూ.0.50 పైసల చొప్పున ప్రత్యేక రాయితీ ఇస్తామంటున్నాయి. డిమాండ్ లేని వేళలు.. 2006లో డిస్కంలు.. డిమాండ్ను బట్టి విద్యుత్ చార్జీల విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. సా.6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సరఫరా చేసే విద్యుత్పై టైం ఆఫ్ ది డే (టీఓడీ) టారిఫ్ పేరుతో చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఇందులో కొన్ని మార్పులు చేస్తూ.. డిమాండ్ లేని వేళలు ఉ.10 గంటల నుంచి మ.3 గంటల వరకు, అదే విధంగా రాత్రి 12 గంటల నుంచి ఉ.6 గంటల వరకు వినియోగించే విద్యుత్పై రిబేట్ ఇవ్వాలనేది డిస్కంల ఆలోచన. అంతేకాక.. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ డిమాండ్ లేని వేళల్లో రాయితీ ఇవ్వడానికీ సంసిద్ధంగా ఉన్నాయి. సమతూకం కోసమే.. విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంట్ కొనుగోలు కోసం విద్యుదుత్పత్తి సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ప్రకారం రోజులో కొన్ని గంటలకు అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేయాలంటే కుదరదు. 24 గంటల చొప్పున సరఫరా తీసుకోవాల్సిందే. దీనివల్ల డిమాండ్ లేని వేళల్లో కూడా జెన్కోలకు చెల్లించే చార్జీలు భారంగా మారుతున్నాయి. అదే విధంగా పీక్ అవర్స్లో ఒకేసారి అందరూ విద్యుత్ వినియోగించడంవల్ల గ్రిడ్పై భారం పడి తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రెండిటినీ సమతుల్యం చేయడానికి డిస్కంలు పరిశ్రమల్లో విద్యుత్ వినియోగాన్ని రాత్రివేళ ప్రోత్సహించాలని భావిస్తున్నాయి. దీనివల్ల పీక్ అవర్స్లో లోడ్ తగ్గుతుంది. పరిశ్రమలు ఏ, బీ, సీ షిఫ్టుల్లో పనిచేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం పెరగడంవల్ల డిస్కంలకు బిల్లుల రూపంలో ఆదాయం వస్తుంది. దీంతో జెన్కోలకు చెల్లించే చార్జీల్లో సమతూకం వస్తుంది. ఈ నెలలోనే విచారణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి 2022–23 ఆర్థిక సంవత్సర వార్షిక సగటు ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు గత డిసెంబర్లో కొన్ని ప్రతిపాదనలు సూచించాయి. వీటిల్లో టీఓడీ కూడా ఒకటి. ఏఆర్ఆర్పై ఈ నెల 24, 25, 27 తేదీల్లో ఏపీఈఆర్సీ విశాఖపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, మార్చి చివరి వారంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏఆర్ఆర్ అమల్లోకి వస్తుంది. – కె. సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విద్యుత్ కొనుగోలు లెక్కలు సిద్ధం
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు 2017 నుంచి 2020 వరకు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చుల లెక్కలను సమర్పించేందుకు అనుమతి ఇ వ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) కోరాయి. 2017–18 సంవత్సరంలో చేసిన ఖర్చును 2018–19 సంవత్సరానికి, 2018–19లో చేసిన ఖర్చును 2019–20కి అన్వయించమని విజ్ఞప్తి చేశాయి. యూనిట్కు రూ.3.68 నుంచి రూ.4.62 వరకు వెచ్చించినట్లు ఈపీడీసీఎల్, రూ.3.68 నుంచి రూ.4.63 వెచ్చించినట్లు ఎస్పీడీసీఎల్ వెల్లడించాయి. వీటి ఆధారంగా పూర్తిస్థాయిలో ‘పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్’ గణాంకాలను సమర్పిస్తామని తెలిపాయి. డిస్కంలు చెప్పిన ధరలపై అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఏపీఈఆర్సీ వివిధ వర్గాల విద్యుత్ వినియోగదారులను కోరింది. డిస్కంల ప్రతిపాదనలపై ఫిబ్రవరి 2వ తేదీన వర్చువల్గా విచారించనున్నట్లు తెలిపింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలకు అవకాశం! ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్ ఎల్డీసీ) ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్–2006కి సంబంధించి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలుకు అవకాశం కల్పించేలా వీటిని రూపొందించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిబంధనలతోనే ఏపీఈఆర్సీ నడుస్తోంది. నియామకాలు, కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేయాల్సి ఉంది. కేంద్ర విద్యుత్ చట్టం–2003 ప్రకారం నిబంధనలు తయారు చేస్తున్నట్లు ఏపీఈఆర్సీ గతంలోనే తెలిపింది. తాజాగా డిస్కంలకు సంబంధించి రెగ్యులేషన్స్లోని 7వ నిబంధనను సవరించాలని ఏపీఎస్ఎల్డీసీ కోరింది. దీనివల్ల డిస్కంలు పరస్పరం తమ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు విద్యుత్ కొనుగోలులో జరిగే ఆలస్యాన్ని అరికట్టవచ్చు. దీనికి సంబంధించిన ప్రతిదీ లోడ్ డిస్పాచ్ సెంటర్కు తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సవరణపై జనవరి 12వ తేదీలోగా ప్రజలు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలపాలని ఏపీఈఆర్సీ కోరింది. అనంతరం కొత్త రెగ్యులేషన్స్ను ప్రకటించనుంది. -
వాయిదాల్లో విద్యుత్ ఆదా పరికరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వృథాను అరికట్టి, వినియోగదారులకు బిల్లులు తగ్గించడంలో తోడ్పడడంతో పాటు ప్రజలకు, పర్యావరణానికి మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ రంగం అడుగులు వేస్తున్నాయి. తాజాగా విద్యుత్ పొదుపు కోసం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నడుం బిగించింది. విదేశాల్లో విజయవంతమైన ‘ఆన్ బిల్ ఫైనాన్సింగ్’ విధానాన్ని రాష్ట్రానికి సరిపడేలా రూపొందించాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)ను ఏపీఈఆర్సీ బుధవారం ఆదేశించింది. ఈ మోడల్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అందజేసే మార్గాలపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. దీనిపై మూడు వారాలలోపు అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరింది. ఉత్పత్తి చేయలేకపోయినా ఆదా చేయగలం.. రాష్ట్రంలో విద్యుత్ రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించామని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈఆర్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడారు. ఒకరు ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయినా, ఒక యూనిట్ పొదుపు చేయగలరని, ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే 2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టేనని నాగార్జునరెడ్డి వివరించారు. వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన చౌక విద్యుత్ను అందజేయడం వల్ల వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తుందని, దానికోసం ఏపీఈఆర్సీ, విద్యుత్ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. వినియోగదారుల ఇష్టం.. ‘ఆన్ బిల్ ఫైనాన్సింగ్’ విధానంలో భాగంగా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్), వస్తు ఉత్పత్తి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. వాటి సహకారంతో వినియోగదారులకు ఇంధన సామర్థ్యం కలిగిన ఆధునిక గృహోపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటారు. అలాగే వినియోగదారులు తమ నెల వారీ విద్యుత్ బిల్లుల ద్వారా తాము తీసుకున్న వస్తువులకు తిరిగి చెల్లింపులు చేస్తారు. పరికరాల వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది కాబట్టి బిల్లులు కొంత మేర ఆదా అవుతాయి. ఫలితంగా వినియోగదారులపై వాయిదా భారం అంతగా పడదు. పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి స్మార్ట్ గ్రిడ్లపై పడే అధిక లోడును కొంతమేర నివారించవచ్చని ఏపీఈఆర్సీ వివరించింది. అయితే ఇంధన సామర్థ్య గృహోపకరణాలు ఉపయోగించడం అనేది వినియోగదారులు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఎవరినీ బలవంతం చేయడం జరగదు. అలాగే వారు చెల్లించే వాయిదాలు నేరుగా వస్తు ఉత్పత్తి దారులకు వెళతాయని మండలి స్పష్టం చేసింది. -
పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయం
సాక్షి, అమరావతి: పేద ప్రజలపై ఎటువంటి భారం లేకుండా, విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఎఆర్ఆర్), రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ)ను సోమవారం ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సమక్షంలో తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్)ల సీఎండీలు కె.సంతోషరావు, హెచ్. హరనాధరావు, జె.పద్మాజనార్ధనరెడ్డిలు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్లకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్ఆర్) నివేదికలను అందజేశారు. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో ఈ సారి మార్పులు చేశారు. ఇకపై గృహ విద్యుత్ 0–30 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్కు రూ.1.45 పైసలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 31–75 వరకు రూ.2.80 పైసలు, 0–100 వరకు రూ.4, 101–200 వరకు రూ.5, 201–300 వరకు రూ.7, 300 యూనిట్ల పైన రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం 301–400 యూనిట్లు వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 వరకూ రూ.8.50 పైసలు, ఆ పైన రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధిస్తున్నారు. తాజా ప్రతిపాదనల్లో ఇవి కొంతవరకూ తగ్గించడం ఊరట కలిగిస్తోంది. అదే విధంగా వాణిజ్య విద్యుత్ టారిఫ్లను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు. 0–50 యూనిట్లు వాడే వారికి యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్టీల టారిఫ్లలో మార్పు లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామన్నారు. హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే చార్జీలను పెంచాలని అడగలేదు. పరిశ్రమలకు విధించే టారిఫ్లపైనా మార్పు లేదు. ఇలా అన్ని వర్గాల వారిపైనా భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. సరాసరి విద్యుత్ సరఫరా వ్యయం రూ.6.58 పైసలుగా తేల్చాయి. కొత్త టారిఫ్ల ప్రకారం విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి తేవాలనుకుంటున్నట్లు డిస్కంలు మండలికి తెలిపాయి. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి వివిధ మార్గాల ద్వారా 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం రూ.40,962.4 కోట్లు ఉంటే ఖర్చు రూ.41,220.99 కోట్లు ఉంది. రూ.258.59 కోట్ల వ్యత్యాసం ఉంది. 2022–23లో మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేయగా లోటు వచ్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెబుతూ నికర ఆర్థిక లోటును 0 గా చూపించాయి. అయితే 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపాయి. ఇవి కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021–22లో ఇప్పటి వరకూ రూ.13,560 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివరించాయి. విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చులు గడిచిన ఏడేళ్లలో రూ.25,595 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఆగస్టులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నివేదిక ప్రకారం 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై దేశంలోనే అత్యంత తక్కువ చార్జీ ఏపీలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాయి. మిగిలితే వినియోగదారులకు ఇస్తున్నాం 2014–15 నుంచి 2018–19 వరకూ ఆమోదించిన ట్రూఅప్ చార్జీలను ఏపీఈఆర్సీ నిలిపివేసింది. తిరిగి వాటి వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. చార్జీలు వసూలు చేయడమే కాకుండా మిగిలితే తిరిగి వినియోగదారులకు ఇస్తున్నామని, ఈ విధంగా 2022లో ట్రూ డౌన్ రూ.3,373 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చుల ట్రూ డౌన్ రూ.4,761 కోట్లు, ఆదాయ లోటు రూ.3,685 కోట్లు, అదనపు ఖర్చు రూ.183 కోట్లు, 2021కి అదనపు ఆదాయ లోటు ట్రూ అప్ రూ.2,480 కోట్లు చొప్పున లెక్క గట్టాయి. ఈ అంశాలన్నింటిపైనా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించి, తగిన నిర్ణయాన్ని వెలువరిస్తుంది. -
ట్రూఅప్కు తాత్కాలిక బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూ అప్)కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలను ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల చార్జీలతో కలిపి సెప్టెంబరు, అక్టోబరు నెలల బిల్లుల్లో వసూలు చేశారు. దీంతో డిస్కంలు తమ నష్టాల్ని కొంత మేర భర్తీ చేసుకోగలిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడంతో ఈ నెల విద్యుత్ బిల్లులు (అక్టోబరు చార్జీలు) ట్రూఅప్ చార్జీ లేకుండానే వినియోగదారులకు అందాయి. రెండు నెలలు వసూలు 2014–15 ఆర్థిక సవంత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఏపీఈఆర్సీ రూ.3,669 కోట్ల వసూలుకు ఆగస్టులో అనుమతినిచ్చింది. సెప్టెంబర్, అక్టోబరు నెలల బిల్లుల్లో ఆ మేరకు డిస్కంలు చార్జీలు విధించాయి. వీటిపై పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఉత్తర్వులను నిలిపివేసి మళ్లీ విచారణ చేపట్టింది. అక్టోబర్ 19న ఒకసారి, నవంబర్ 1న మరోసారి అభిప్రాయ సేకరణ జరిపింది. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో డిస్కంలు నవంబర్ నెల బిల్లు.. అంటే అక్టోబర్ నెల వినియోగానికి ట్రూ అప్ చార్జీలు వేయలేదు. ఫలితంగా రెండు డిస్కంల పరిధిలోని దాదాపు 1.27 కోట్ల విద్యుత్ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్కు రూ.0.45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున చార్జీలు తగ్గాయి. సాధారణ వినియోగానికే బిల్లు పడింది. ఈ నెల 24న మరోసారి విచారణ మరోవైపు 2019–20 ఆర్ధిక సంవత్సరానికి ఏపీఈపీడీసీఎల్ రూ.701.28 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.1,841.58 కోట్లు చొప్పున మొత్తం రూ.2,542.86 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతి కోరుతూ ఏపీఈఆర్సీకి పిటిషన్లు దాఖలు చేశాయి. అదే విధంగా 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య రూ.528.71 కోట్ల ట్రాన్స్మిషన్ బిజినెస్ ట్రూ అప్ చార్జీల వసూలు పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీట్రాన్స్కో) సమర్పించింది. వీటన్నిటిపైనా ఏపీఈఆర్సీ ఈనెల 24న ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనుంది. వీటితో కలిపి, ఇప్పటికే విచారణ పూర్తయిన ట్రూ అప్ చార్జీల్లో ఎంత వసూలు చేయాలనేది ఏపీఈఆర్సీ నిర్ణయంపై అధారపడి ఉంది. -
విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
-
AP: సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి
-
AP: సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి
సాక్షి, అమరావతి: సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయనుంది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు కొనుగోలు చేయనుంది. 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించేలా ప్రభుత్వ ప్రణాళిక రూపొందించనుంది. ఈఆర్సీ ఆమోదించడంతో త్వరలో సెకితో ఎంవోయూ కుదుర్చుకోనుంది. 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. -
ఐదేళ్ల ‘ట్రూ అప్’పై విచారణ
సాక్షి, అమరావతి: ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల వసూలు సబబేనని కొందరు, ఆ భారం ప్రజలపై వేయరాదని మరికొందరు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సూచించారు. రాష్ట్ర ప్రజలపై సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల నుంచి మొదలుపెట్టిన ఐదేళ్ల ఇంధన సర్దుబాటు చార్జీలపై ఏపీఈఆర్సీ సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించింది. 2014–15 నుంచి 2018–19 వరకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలు, వాస్తవ ఖర్చుల ఆధారంగా రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మండలిని కోరాయి. దీన్లో రూ.3,669 కోట్ల వసూలుకు అనుమతి ఇస్తూ ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఉత్తర్వులిచ్చింది. ట్రూ అప్ చార్జీలపై ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని, అవగాహన కల్పించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను సుమోటోగా తీసుకున్న ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేసి, ట్రూఅప్ చార్జీలపై ప్రజల అభిప్రాయాలు మరోసారి సేకరించాలని నిర్ణయించింది. గతనెల 19న నిర్వహించిన విచారణలో 86 మంది అభిప్రాయాలు వెల్లడించారు. సోమవారం ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి పారిశ్రామిక, వాణిజ్య, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించారు. 45 మంది విచారణకు హాజరుకాగా 15 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. ట్రూ అప్ చార్జీలు విధించడాన్ని కొందరు సమర్థించారు. విచారణలో ఏపీఈఆర్సీ సభ్యులు రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామాసింగ్, కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థలు చట్టాన్ని అనుసరించాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు చట్టం పరిధిలోనే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి చెప్పారు. విద్యుత్ చట్టం–2003 సెక్షన్ 88 ప్రకారం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంతోపాటు వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలపై ఉందని గుర్తుచేశారు. వర్చువల్గా సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు ఏపీఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్రెడ్డి, ఠాకూర్ రామసింగ్ హైదరాబాద్లోని కార్యాలయం నుంచి, సలహామండలిలోని 16 మంది సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరిచేందుకు పౌరసేవల ప్రమాణాలను (ఎస్వోపీని) సవరించినట్లు తెలిపారు. దీనివల్ల కొన్ని సేవల వైఫల్యంపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు డిస్కంలు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్సీ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. డిస్కంలు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమంగా ప్రయోజనాలు అందించాలని ఆయన సూచించారు. సేవా ఖర్చు తగ్గింపు, విద్యుత్ కొనుగోళ్ల క్రమబద్ధీకరణ, మెరుగుపరచడం, డిస్కంల పనితీరు, ప్రజల సమర్థమైన భాగస్వామ్యం, నియంత్రణ నిర్ణయ ప్రక్రియ, విద్యుత్ లైన్లు పంట చేలపై నుంచి వేయాల్సి వచ్చినపుడు రైతులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సభ్యుల సూచనలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు. -
ప్రజాప్రయోజనాలకే పెద్దపీట
సాక్షి, అమరావతి: వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి, డిస్కంల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2015–2019 మధ్య కాలానికి రూ.3,669 కోట్ల సర్దుబాటు చార్జీ (ట్రూ అప్)ల వసూలుకు అనుమతి ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కంలు ఆర్థికంగా సంక్షోభంలో ఉండటం రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిదికాదని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందుబాటు ధరల్లోనే సరఫరా చేస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని, ఫలితంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తు లక్ష్యాలు, సవాళ్లను సమర్థంగా అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీతో కలిసి పనిచేయాలని సూచించారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, విద్యుత్తు సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన సర్దుబాటు చార్జీల్లో మూడోవంతును రాష్ట్ర ప్రభుత్వమే (రైతులు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలు తదితరుల తరఫున) భరించాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 1.86 కోట్ల మంది వినియోగదారుల్లో దాదాపు 40 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీతో లబ్ధి పొందుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వివిధ వర్గాల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన 1,657 కోట్ల రూపాయలను సెక్షన్ 65 ప్రకారం అర్హులైన 23 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలివ్వడానికి 2021–22 టారిఫ్ ఆర్డర్లో తొలిసారిగా అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్కంల నుంచి విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని తెలిపారు. విద్యుత్ రంగంలో సగటు వినియోగదారుడికి నాణ్యమైన, నమ్మకమైన, మెరుగైన కరెంటు సరఫరా 24 గంటలు అందించడంతోపాటు వారి శ్రేయస్సు, అభివృద్ధి తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. ఇందుకోసం డిస్కంలకు ఆర్థిక సామర్థ్యం , సుస్థిరత అత్యవసరమని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇచ్చింనట్లు ఆయన తెలిపారు. నేడు సలహా మండలి సమావేశం డిస్కంలను బలోపేతం చేయడంతోపాటు వాటి పనితీరును మెరుగుపరిచి వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీఈఆర్సీ ఇందులో భాగంగా సోమవారం సలహా మండలి సమావేశం నిర్వహిస్తోంది. ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే సగటు ఖర్చు తగ్గించడం, విద్యుత్ కొనుగోళ్లను క్రమబద్ధీకరించడం, డిస్కంల పనితీరును మెరుగుపర్చడం, డిమాండ్ నిర్వహణ–ఇంధన సంరక్షణ–సామర్థ్యానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు 16 మంది, ఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్రెడ్డి, ఠాకూర్రామ్సింగ్, డిస్కంల సీఎండీలు, విద్యుత్శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. -
సర్దుబాటు చార్జీలు శాశ్వతం కాదు
సాక్షి, అమరావతి: సర్దుబాటు చార్జీలు శాశ్వత ప్రాతిపదికగా విద్యుత్ బిల్లులలో విధించరని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రూ అప్ చార్జీలనేవి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిర్ధేశించిన కాలానికి మాత్రమే బిల్లులలో ప్రత్యేకంగా వేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత నిర్దేశిత సర్దుబాటు చార్జీలు ఏపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం 2022 మార్చి నెల వరకు మాత్రమే వసూలు చేస్తారని, ఈ ఎనిమిది నెలల తర్వాత ఉండవని శ్రీకాంత్ వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ► ఇంధన – విద్యుత్ సేకరణ వ్యయ సర్దుబాటు చార్జీ (త్రైమాసిక సర్దుబాటు చార్జీ) ప్రతి త్రైమాసికానికి వేర్వేరుగా మదింపు చేస్తారు. క్రిందటి త్రైమాసికంలో వేసిన చార్జీ మరుసటి త్రైమాసికానికి కలపరు. ► త్రైమాసికం–1లో అదనపు ఖర్చు రూ.100 కోట్లు అయ్యి, విద్యుత్ వినియోగం 12,000 మిలియన్ యూనిట్లు ఉంటే, సర్దుబాటు చార్జీ యూనిట్కు 8 పైసలు అవుతుంది. తర్వాతి త్రైమాసికంలో అదనపు వ్యయం రూ.200 కోట్లు ఉంటే అదే వినియోగానికి సర్దుబాటు చార్జీ యూనిట్కు 16 పైసలు అవుతుంది. ఈ లెక్కన మొదటి త్రైమాసికం చార్జీ 8 పైసలు కలుపుకుని 24 పైసలు అవ్వదు. ► విద్యుత్ సంస్థలకు మూడు నెలలకొకసారి సర్దుబాటు చేసే వెసులుబాటు 2012 వరకు (త్రైమాసిక ఇంధన సర్ చార్జీ నియమావళి) అమలులో ఉండేది. ఆ తర్వాత వార్షిక విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు నియమావళి అందుబాటులోకి వచ్చింది. ► విద్యుత్ పంపిణీ సంస్థలు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ సరఫరా కోసం చేసిన వాస్తవ అదనపు ఖర్చులకు రూ.2,500 కోట్లు సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా గతేడాది డిసెంబర్లోనే ప్రతిపాదనలను సమర్పించారు. ఆ సంవత్సరాలకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదన పంపలేదు. ► 2019–20లో సర్దుబాటు ప్రతిపాదనలకు 2019 ఫిబ్రవరిలో, విద్యుత్ కేంద్రాల వారీగా అంచనా వేసిన ఇంధన (బొగ్గు, గ్యాస్) చార్జీలు పెరిగిపోవటమే ప్రాథమిక కారణం. ఈ వ్యయం పెరుగుదల 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాలకు దాదాపు రూ.0.77/యూనిట్, కృష్ణపట్నంకు రూ 0.46/యూనిట్, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకు రూ.0.84/యూనిట్, స్వతంత్ర విద్యుత్ కేంద్రాలకు రూ .0.69/యూనిట్, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు రూ. 0.56/యూనిట్ గా ఉంది. -
‘సర్దుబాటు’ పాపం గత సర్కారుదే
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థల బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల వాటిపై అదనపు ఖర్చుల భారం భారీగా పెరిగింది. ఐదేళ్లలో విద్యుత్ రంగం అప్పులు రెట్టింపై రూ.31,648 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పొదుపు చర్యలు, విద్యుత్తు కొనుగోళ్లలో ఆదా ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే గత సర్కారు నిర్వాకాల కారణంగా జరిగిన అప్పుల నుంచి బయటపడేందుకు ‘సర్దుబాటు’ చేసుకోక తప్పని పరిస్థితి డిస్కంలకు ఏర్పడింది. కానీ అవి నివేదించిన వ్యయంలో దాదాపు సగానికి మాత్రమే అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ప్రజలపై పెనుభారం పడరాదని.. 2014 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 మధ్య కాలానికి విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలను వాస్తవ ఖర్చుల ఆధారంగా సర్దుబాటు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం చేయలేదు. దీంతో రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లు ఏపీఈఆర్సీని కోరాయి. నిజానికి ఇదేమీ వాటి వాస్తవ ఖర్చు కాదు. రెండు డిస్కంల వాస్తవ ఖర్చు రూ.25,952 కోట్లుగా ఉన్నప్పటికీ అవి రూ.7,224 కోట్లు మాత్రమే అడిగాయి. అయితే అంత మొత్తాన్ని అనుమతిస్తే ప్రజలపై ఒకేసారి భారం పడుతుందనే ఉద్దేశంతో ఏపీఈఆర్సీ అందులో సగం మొత్తాన్ని తిరస్కరించింది. పీఆర్సీ, వడ్డీలు, ఇతర ఖర్చులు.. డిస్కంల వినతిపై కొద్ది నెలలుగా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఆడిట్ పద్దుల ఆధారంగా డిస్కంలు కోరిన దానిలో దాదాపు సగం అంటే రూ.3,669 కోట్లు వసూలుకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి ఈ మొత్తంలో రూ.3,100 కోట్లు పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) వల్ల అదనపు ఖర్చులు కాగా వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.569 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం అదనపు వ్యయాన్ని సెప్టెంబర్ విద్యుత్ బిల్లు నుంచి ప్రారంభించి ఎనిమిది నెలల పాటు ఏపీఈపీడీసీఎల్లో యూనిట్కు 45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్కు రూ.1.27 చొప్పున ట్రూఅప్ పేరిట సర్దుబాటు చేయనున్నారు. 2019 ఏప్రిల్ 1 తరువాత కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ట్రూ అప్ వర్తించదు ఐదేళ్లలో సర్దుబాటు చేయకపోవడంతో... ‘సర్దుబాటు వ్యయం అనేది ఏటా జరగాలి. ఎప్పటికప్పుడు జరిగితే ప్రజలపై పడే భారం చాలా తక్కువ. కానీ 2014 నుంచి 2019 వరకూ అలా జరగకపోవడంతో డిస్కంల అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికైనా సర్దుబాటు చేయకపోతే వాటి మనుగడ కష్టమవుతుంది. ఇందులో వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా రూ.913 కోట్ల అదనపు సర్దుబాటు వ్యయాన్ని అప్పటి సబ్సిడీ విధానాల ప్రకారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి రూ.27,240 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. అంటే రెండున్నరేళ్లలో కేవలం రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి పెరిగాయి. -
అసత్య కథనాలతో దుష్ప్రచారం: ఆదా.. కానరాదా?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లపై కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్య కథనాలు ప్రచురించడాన్ని ఇంధనశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పీపీఏలున్న విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరాలో కోత పెట్టినప్పటికీ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి నెల రోజుల్లో రూ.22.7 కోట్లు లాభం చేకూర్చామని స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా డిస్కమ్లకు రూ.48 కోట్లు నష్టం వాటిల్లిందంటూ వాస్తవ విరుద్ధ కథనాలు ప్రచురించారని ఇంధనశాఖ పేర్కొంది. విద్యుత్ కొనుగోళ్లను కట్టడి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని, దీన్ని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గుర్తు చేశారు. ఏపీఈఆర్సీ నిరంతర పర్యవేక్షణ.. నిజానికి విద్యుత్ కొనుగోళ్లపై గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చౌక విద్యుత్నే సాధ్యమైనంత వరకూ కొనుగోలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరంతరం పర్యవేక్షిస్తోంది. గతేడాది డిసెంబర్ 17 నుంచి జనవరి 15వ తేదీ వరకూ జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వివరాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విశ్లేషించింది. బొగ్గు కొరత, కోవిడ్, ఇతర కారణాలు.. ఈ నెల రోజుల వ్యవధిలో ఏపీ విద్యుత్ సంస్థలు 894.1 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశాయి. రాష్ట్ర డిస్కమ్లు కొన్ని చౌకగా విద్యుత్ అందించే ఉత్పత్తి కేంద్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రకారం వీటి ద్వారా డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకూ 3,289.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ యూనిట్ రూ.3.13 చొప్పున డిస్కమ్లకు అందాలి. అయితే ఆయా కేంద్రాల్లో బొగ్గు కొరత, కోవిడ్ ప్రభావం, ఇతర కారణాల వల్ల ముందు రోజు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2,470.79 మిలియన్ యూనిట్లే విద్యుత్ ఇస్తామని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. కానీ వాస్తవంగా విద్యుత్ అందించే రోజుకు రీ షెడ్యూల్ చేసుకుని చివరకు 2,253.27 ఎంయూలే ఇచ్చాయి. 818.5 ఎంయూల విద్యుత్ను అందించలేకపోయాయి. లేని విద్యుత్ ఎలా కొంటారు? పీపీఏల ప్రకారం 818.5 ఎంయూల కొరత ఏర్పడటంతో పీపీఏలున్న ఇతర ఉత్పత్తిదారుల నుంచి అదనంగా విద్యుత్ తీసుకోవాలి. అయితే వాటి దగ్గర ఆ సమయంలో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.68 ఉంది. కానీ మార్కెట్లో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.38 చొప్పున మాత్రమే ఉంది. అంటే ప్రతీ యూనిట్కు సంస్థ 30 పైసల చొప్పున, మొత్తం రూ. 24.6 కోట్లు ఆదా చేసింది. ఇందులో గ్రిడ్ బ్యాలన్స్ కోసం రూ.1.9 కోట్లు తీసివేసినా... రూ.22.7 కోట్లు ఈ నెలలోనే విద్యుత్ కొనుగోళ్లలో ఆదా అయింది. కానీ ఒక వర్గం మీడియా మాత్రం పీపీఏ సంస్థల నుంచే ఈ విద్యుత్ కొంటే నష్టం రాదని అసత్యాలు ప్రచారం చేసింది. అసలు వాళ్ల దగ్గర విద్యుత్ లేనప్పుడు ఎలా కొనుగోలు చేస్తామని విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ.. – శ్రీకాంత్ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి) ఒప్పందం చేసుకున్న సంస్థలు విద్యుత్ ఇవ్వకపోతే మార్కెట్లో విద్యుత్ కొనక తప్పదు. లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడతాయి. కొనే విద్యుత్ను పీపీఏ సంస్థల నుంచే తీసుకోవాలనే వాదన సత్యదూరం. అసలు తమ దగ్గర విద్యుత్ లేదని వారే ప్రకటించినప్పుడు ఇక తక్కువ ధరకు వాళ్లు ఎలా ఇస్తారు? విద్యుత్ కొనగోళ్లను దారికి తేవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. నష్టమని మేం చెప్పలేదే? – జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ ఛైర్మన్ విద్యుత్ కొనుగోళ్లు మరింత పారదర్శంగా ఉండాలని కమిషన్ కోరుకుంటోంది. ఇందులో భాగంగానే వాస్తవాలు తెలుసుకునేందుకు డిస్కమ్ల నుంచి వివరణ కోరాం. అంతేతప్ప మార్కెట్ నుంచి విద్యుత్ కొనడం వల్ల డిస్కమ్లకు నష్టం వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదు. డిస్కమ్లు పంపే వివరాలను కమిషన్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా జరిగే వ్యవహారం. -
విద్యుత్ సేవల్లో విఫలమైతే జరిమానా
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థలు ఇక నుంచి మరింత జవాబుదారీతనంతో వ్యవహరించనున్నాయి. వినియోగదారులకు ఏమాత్రం అసౌకర్యం కలిగించినా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున బాధ్యతాయుతంగా మెలగనున్నాయి. వివరంగా చెప్పాలంటే తమ తప్పును ఒప్పుకుని మరీ వినియోగదారుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా చట్టానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఊపిరి పోసింది. విద్యుత్ వినియోగదారులకు బ్రహ్మాస్త్రం లాంటి ఈ సంస్కరణలను అధికారిక గెజిట్లో కూడా ప్రకటించినట్టు ఏపీఈఆర్సీ ఆదివారం మీడియాకు తెలిపింది. ఇది ఈ నెల 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది. మరో కీలక విషయం ఏమిటంటే దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో నివేదికను ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది. కనెక్షన్ తప్పుగా తొలగిస్తే.. నిజానికి విద్యుత్ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు గతంలోనే చట్టాలొచ్చినా విద్యుత్ సంస్థలు పెడచెవిన పెట్టడంతో పరిహారం కోరే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోందని ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని భావించిన కమిషన్ బలమైన చట్టాలకు పదును పెట్టినట్లు వెల్లడించింది. ► ఇక నుంచి విద్యుత్ సంస్థలకు సంబంధించి ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అందుబాటులో ఉండాలి. దీనివల్ల కరెంట్ పోతే తక్షణమే ఫిర్యాదు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ వ్యవస్థ ఇప్పటివరకూ సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులున్నాయి. ► ఎవరైనా కొత్త కనెక్షన్, అదనపు లోడ్ కోరితే విద్యుత్ సంస్థలు తక్షణమే తగిన సమాచారం అందించాలి. నిర్ణీత గడువులోగా డిమాండ్ను నెరవేర్చాలి. ► సర్వీస్ కనెక్షన్ను తప్పుగా తొలగించినా, కనెక్షన్ తొలగించకుండా తిరిగి కనెక్షన్ చార్జీలు వసూలు చేసినా సర్వీసు వైఫల్యం కింద పరిగణించాలి. ఇది క్షమించరాని నేరంగా విద్యుత్ సంస్థలు గుర్తించి తక్షణమే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. ప్రతి మూడు నెలలకు నివేదిక.. విద్యుత్ సేవల్లో లోపం కారణంగా చెల్లించిన జరిమానా వివరాలను ఇక మీదట ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి స్వయంగా పరిశీలిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వివరాలను పంపాలని గెజిట్లో పేర్కొంది. వైఫల్యానికి కారణాలను కూడా కమిషన్కు వెల్లడించాలి. కారణాలు సహేతుకం కాదని భావిస్తే పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించే వీలుంది. విపత్తుల సమయంలోనూ.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సేవలకు అంతరాయాలు కలగడం సహజం. అయితే సేవల పునరుద్ధరణ ఏ తేదీన జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ పంపిణీ సంస్థలు బహిరంగ ప్రకటన జారీ చేయాలని కమిషన్ పేర్కొంది. చెప్పిన తేదీలోగా విద్యుత్ ఇవ్వకపోతే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. సేవలు కొనసాగించలేని స్థితిని సహేతుకమని కమిషన్ భావిస్తే పరిహారం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. విప్లవాత్మక సంస్కరణలు.. ‘ఇవి విప్లవాత్మక సంస్కరణలు. డిస్కమ్లు సేవలపై మరింత దృష్టి పెడతాయని ఆశిస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవాలని డిస్కమ్లను ఆదేశించాం. పంపిణీ సంస్థల పనితీరు సమాచారాన్ని కమిషన్ సమీక్షించి వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టింది. మరింత మేలైన సేవలు అందించేందుకే ఈ ప్రయత్నం’’. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి,ఏపీఈఆర్సీ చైర్మన్ -
చార్జీల షాకుల్లేవ్
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ చార్జీల భారం సామాన్య ప్రజలపై పడకుండా.. వినియోగదారుల ఆకాంక్షలు, పంపిణీ సంస్థల ఆర్థిక అవసరాల్ని సమన్వయం చేస్తూ 2021–22 రిటైల్ సరఫరా ధరల్ని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) బుధవారం విడుదల చేసింది. ఇకపై కనీస చార్జీల భారం గృహ వినియోగదారులపై పడకుండా, రైతులకు ఉచిత విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తూ, కుల వృత్తులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కొనసాగిస్తూ రూపొందించిన కొత్త టారిఫ్ నేటి నుంచి అమల్లోకి రానుందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వరుసగా రెండోసారి ప్రజలపై భారం మోపకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్తు టారిఫ్లను విడుదల చేసింది. కోవిడ్–19 కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ సామాన్యులపై భారం మోపకుండా టారిఫ్లను ప్రకటించి మరోసారి ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంది. రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా... గృహ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2021–22 కొత్త టారిఫ్ని ప్రకటించింది. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామసింగ్, పి.రాజగోపాల్ కొత్త టారిఫ్ని విడుదల చేశారు. టారిఫ్ వివరాల్ని జస్టిస్ నాగార్జునరెడ్డి మీడియాకు వివరించారు. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ రూ.11,741.18 కోట్ల లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్సీకీ నివేదించాయన్నారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం నికరలోటు రూ.7433.80 కోట్లుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులు, ప్రభుత్వంపై రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా నివారించినట్లు వివరించారు. 2021–22 ఆదాయ అంతరాన్ని నిర్ధారించే సమయంలో 2014–15, 2016–17, 2018–19 వరకూ నిర్ణయించిన రూ.3,013 కోట్ల ట్రూఅప్, గత ఆర్థిక సంవత్సర ట్రూడౌన్ సర్దుబాటు కింద రూ.3,373 కోట్లని కూడా పరిగణలోకి తీసుకొని నికరలోటుని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మీ సెల్వరాజన్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జే.పద్మజనార్థనరెడ్డి, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్లు కే.రాజబాపయ్య, బి.రమేష్ప్రసాద్తో పాటు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల భారాన్ని మోస్తున్న ప్రభుత్వం కొత్త టారిఫ్లకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోసేందుకు అంగీకరించింది. వ్యవసాయ ఉచిత విద్యుత్కు సంబంధించి 2021–22లో రూ.7,297.08 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వం భరించనుంది. కార్పొరేటేతర రైతులు, చెరకు క్రషింగ్, గ్రామీణ మొక్కల పెంపక కేంద్రాలు, దోభీ ఘాట్లు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హమైనవని ఏపీఈఆర్సీ సూచించింది. ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65లోకి.. ఈసారి తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. వివిధ వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్ కారణంగా ప్రభుత్వంపై రూ.1657.56 కోట్ల భారం పడుతోంది. దీన్ని భరించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. హరిజన, గిరిజన నివాస సముదాయాలు, తండాల్లో నివసించే గృహ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. రజక సంఘం నడుపుతున్న బీపీఎల్ లాండ్రీలకు నెలకు 150 యూనిట్లు ఉచితం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఎంబీసీ), స్వర్ణకారులు, చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు, నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మరోవైపు యూనిఫాం ధరలతో ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఏకరీతి ధరలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనివల్ల ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గృహ వినియోగదారులకు రాయితీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాయితీల భారం రూ.136.72 కోట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్, రాయితీలు అందించడం ద్వారా ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,091.36 కోట్ల భారం పడనుంది. ఆక్వా సాగుదారుల మోముల్లో వెలుగులు.. చేపల, రొయ్యల చెరువుల వినియోగదారులకు గతంలో క్రాస్సబ్సిడీ యూనిట్ రాయితీ ధర రూ.3.85 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.2.35కి తగ్గించారు. అంటే యూనిట్పై రూ.1.50 వరకూ తగ్గింది. ఆక్వా హేచరీస్, చేపలు, రొయ్యల దాణా కేంద్రాలు, కోడి పిల్లల తయారీ, కోళ్ల దాణా తయారీ కేంద్రాల్ని ఇండస్ట్రీస్ జనరల్ కేటగిరిలో విలీనం చేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్థనని ఏపీఈఆర్సీ అంగీకరించింది. ఇప్పటి వరకూ వీరంతా ఇండస్ట్రీస్ కేటగిరీలో బిల్లులు చెల్లించేవారు. ఇకపై వారంతా టీఓడీ పీక్, ఆఫ్–పీక్ ధరలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్వతంత్ర ఎల్టీ కనెక్షన్లు కలిగి, జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న చేపలు, రొయ్యల చెరువులు, కోళ్ల పెంపకం, పాడి క్షేత్రాలు, సొంత దాణా తయారీ కేంద్రాలకు చెందిన వారంతా ఇకపై యూనిట్కు రూ.5.25, కిలోవాట్కు రూ.75 మాత్రమే చెల్లించేలా కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఇండస్ట్రీస్ (జనరల్) కేటగిరీలోని హెచ్టీ వినియోగదారులకు లోడ్ కారక ప్రోత్సాహక పథకాన్ని ఉపసంహరించుకోవాలన్న డిస్కమ్ల ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. గృహ వినియోగదారులపై భారం లేకుండా... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి గృహ వినియోదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం మోపకుండా టారిఫ్లను విడుదల చేసింది. ఇప్పటివరకూ కనీస ఛార్జీలుగా రూ.50 నుంచి రూ.150 వరకు వసూలు చేసేవారు. ఇకపై ఈ భారం ఉండదు. కనీస ధరలకు బదులుగా కిలోవాట్కు రూ.10 వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక ఎల్టీ వినియోగదారుడు మూడు నెలల పాటు ఇంట్లో లేకపోయినా నెలకు కనీసం రూ.50 చొప్పున రూ.150 బిల్లు కట్టాల్సి వచ్చేది. ఇకపై నెలకు రూ.10 చొప్పున రూ.30 చెల్లిస్తే సరిపోతుంది. సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించారు. అపార్ట్మెంట్లులో ఒకే పాయింట్ వద్ద అధిక వోల్టేజీ (హెచ్టీ) కనెక్షన్ల కింద ధరలు వసూలు చేయాలన్న పంపిణీ సంస్థల ప్రతిపాదనల్ని ఏపీఈఆర్సీ తిరస్కరించింది. అపార్ట్మెంట్లలో ఎక్కువగా నివసించే మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని నివారించేందుకు డిస్కమ్ల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఇక ఫంక్షన్ హాళ్లలో గతంలో నెలకు కిలోవాట్కు రూ.100 చెల్లించాల్సి ఉండేది. ఇకపై యూనిట్ల కింద చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఆఫ్–పీక్ టీవోడీ(టైమ్ ఆఫ్డే) సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ఉండగా దీన్ని ఉదయం రూ.8 గంటల వరకూ మార్చాలన్న ప్రతిపాదనని తిరస్కరించారు. 2 గంటలు తగ్గిస్తే గృహ వినియోగదారులకు నష్టం వాటిల్లే అవకాశాలున్నందున డిస్కమ్ల ప్రతిపాదనని ఏపీఈఆర్సీ తోసిపుచ్చింది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేలా.. పర్యావరణ పరిరక్షణకు ఏపీఈఆర్సీ పెద్దపీట వేసింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ విద్యుత్ ధరని ఒక్క పైసా కూడా పెంచకుండా ఈ ఏడాదీ రూ.6.70గానే కొనసాగిస్తోంది. వినియోగదారులకు సేవలందించే చార్జింగ్ కేంద్రాల నుంచి 90 శాతం మాత్రమే డిస్కమ్లు తీసుకోవాలని, మిగిలిన 10 శాతం చార్జింగ్ కేంద్రాల నిర్వహణకు విడిచిపెట్టాలని సూచించింది. పునరుత్పాదక విద్యుత్ని ప్రోత్సహించేలా కూడా రాయితీలు ప్రకటించింది. పవన, సౌర విద్యుత్కు పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తింపజేశారు. ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య చర్యల్ని ప్రోత్సహించేందుకు ఏపీ రాష్ట్ర విద్యుత్ సమర్థత అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఈఈడీసీవో)కు నిధులు మంజూరు చేశారు. పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థ మొత్తం ఎపీఎస్పీడీసీఎల్ పరిధిలోనే ఉండటంతో మిగిలిన సంస్థలపై ఆ లోటు తొలగించేందుకు సరికొత్త నిర్ణయాన్ని అమలు చేస్తోంది. పునరుత్పాదక విద్యుత్ ధ్రువీకరణ పత్రాలు(ఆర్ఈసీ) రూపంలో వినియోగదారులపై భారం పడకుండా మిగులు విద్యుత్ని ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ నుంచి యూనిట్ రూ.2.43 / రూ.2.44 చొప్పున కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. 150 హెచ్పీ వరకూ ఎల్టీ రైస్ మిల్లులే... గత సంవత్సరం టారిఫ్లో రైస్ మిల్లులు, పల్వరైజర్లకు టారిఫ్లలో వెసులుబాటు కల్పించారు. 100 హార్స్ పవర్ వరకు ఎల్టీ వినియోగదారులుగా, అంతకు మించితే హెచ్టీ వినియోగదారులుగా పరిగణిస్తారు. అయితే దీన్ని మార్చాలని వినతులు వెల్లువెత్తడంతో 100 హెచ్పీ బదులు 150 హెచ్పీ వరకూ ఎల్టీ ధరలు, 150 హెచ్పీ దాటితే హెచ్టీ కింద పరిగణించాలని నిర్ణయించారు. అయితే ఇది పూర్తి ఆప్షనల్ విధానంగా నిర్థరించారు. 2020 జూన్ 30లోపు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా మంది మిల్లర్లు కరోనా కారణంగా మార్చుకోలేకపోయామని చెప్పడంతో ఈ గడువుని ఈ ఏడాది జూన్ 30 వరకూ పొడిగించినట్లు ఏపీఈఆర్సీ ప్రకటించింది. ఒకసారి మార్పు చేసుకున్నాక తిరిగి మళ్లీ మార్చుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే మిల్లులు సర్వీస్ శాంక్షన్ చేసే సమయంలోనే ఆప్షన్లు తెలియజేయాలని సూచించింది. కొనుగోలు, అమ్మకానికి స్పెషల్ సెల్... రియల్ టైమ్ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకానికి సంబంధించి ప్రతి డిస్కమ్లో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ 24 గంటలూ పర్యవేక్షించేలా సెల్ పనిచేయాలని సూచించింది. దీనిద్వారా జాతీయ స్థాయిలో తక్కువ ధరకు విద్యుత్ అమ్మకానికి వచ్చినప్పుడు కొనుగోలు చేసేలా, ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించేలా అవకాశాలు మెరుగుపడి డిస్కమ్లు లాభాల బాట పట్టే అవకాశాలున్నాయి. రెస్కోలు.. డిస్కమ్ల పరిధిలోకి ఇకపై గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల(రెస్కోలు)ను సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆధీనంలోకి తీసుకోవాలని విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. విద్యుత్ పంపిణీ లైసెన్సులు, మినహాయింపుల విషయంలో రెస్కోలు విఫలమవ్వడంతో వినియోగదారులు ఇబ్బందుల పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. రాయచోటి, కదిరి రెస్కోలని ఆయా డిస్కమ్లు విలీనం చేసుకున్నాయని, అనకాపల్లి, కుప్పం రెస్కోలు కూడా తాత్కాలికంగా డిస్కమ్లు ఆధీనంలోకి రానున్నాయని వెల్లడించారు. బిల్లుల వెనుక రాయితీ వివరాలు – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ ‘సగటు వినియోగదారులపై రూపాయి భారం లేకుండా కొత్త టారిఫ్ తయారు చేశాం. విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పడకుండా, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యుత్తు టారిఫ్లు రూపొందించడం కత్తిమీద సామే అయినా విజయవంతంగా పూర్తి చేశాం. ప్రభుత్వం వేల కోట్ల రూపాయిల రాయితీలు అందిస్తోంది. అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్ బిల్లుల వెనకవైపు ప్రతి యూనిట్ సేవా వ్యయం(కాస్ట్ ఆఫ్ సర్వీస్), క్రాస్ రాయితీ, ప్రభుత్వ రాయితీ మొదలైన వివరాల్ని పొందుపరచాలని డిస్కమ్లకు సూచించాం. తొలిసారిగా వర్చువల్ విధానంలో బహిరంగ విచారణ చేపట్టాం. ఆత్మకూరు లాంటి వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూడా ఈ విచారణలో పాల్గొనడం విశేషం. బహిరంగ విచారణ అనంతరం అన్ని అభ్యంతరాల్ని నిశితంగా పరిశీలించి టారిఫ్లు తయారు చేశాం’ – ప్రకటనల హోర్డింగ్స్కు రూ.12.25, ఫంక్షన్ హాల్స్కు రూ.12.25, విద్యుత్ వాహనాలకు రూ.6.70 చొప్పున యూనిట్కు ఛార్జ్ పడనుంది. – పరిశ్రమలకు 75 కేవీ వరకు రూ.6.70, సీజనల్ పరిశ్రమలకు(75 కేవీ) రూ.7.45గా నిర్ణయించారు. – వీధి దీపాలు, సుజల స్రవంతి, సీపీడబ్ల్యూస్, పీడబ్ల్యూఎస్కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు. ఏపీలోనే చీప్ – కోవిడ్ వెంటాడినా సామాన్యులకు తాకని షాక్ సాక్షి, అమరావతి: కరోనా కారణంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పురోగతి దెబ్బతిన్నా పేదలపై ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పడనివ్వలేదు. ఏపీఈఆర్సీ ప్రకటించిన విద్యుత్ టారిఫ్ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 21 రాష్ట్రాలతో పోలిస్తే నెలకు 50 యూనిట్ల వరకూ వాడే పేద వర్గాలకు ఏపీలోనే భారీ సబ్సిడీతో విద్యుత్ (యూనిట్ రూ. 1.45కు) అందుతుండటం గమనార్హం. అదే బిహార్లో యూనిట్ రూ. 6.15 వరకు విద్యుత్ టారిఫ్ ఉంది. 200 యూనిట్లు వాడే వినియోగదారులకు కూడా ఏపీలో ఇప్పటికీ యూనిట్ రూ. 3.60కే విద్యుత్ అందుతోంది. ఇదే శ్లాబులో మహారాష్ట్ర యూనిట్ రూ.8.33 చొప్పున వసూలు చేస్తోంది. మరోవైపు ఏపీలో పాత స్టాటిక్ విధానాన్ని ఎత్తివేసి డైనమిక్ విధానం బిల్లింగ్ అమలులోకి తెచ్చారు. దీనివల్ల వినియోగం ఉన్నప్పుడు మాత్రమే శ్లాబులు మారే అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడవున ఎక్కువ టారిఫ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా పేదలకు విద్యుత్ భారం కారాదన్న విధానానికి అనుగుణంగానే ఏపీఈఆర్సీ కసరత్తు చేసి సత్ఫలితాలు సాధించింది. -
‘గృహ వినియోగదారుడికి ఇకపై కనీస చార్జీలుండవు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) బుధవారం 2021–22కి విద్యుత్ టారిఫ్ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గనున్నట్లు పేర్కొంది. పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తించనుంది. ఈ సందర్భంగా ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. కులవృత్తుల వారికిచ్చే ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్నారు. కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రూ.1,657 కోట్ల భారం పడుతుందని, రైతుల ఉచిత విద్యుత్కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ► గృహ వినియోగదారుడికి ఇకపై కనీస ఛార్జీలు ఉండవు ► ఛార్జీల స్థానంలో కిలోవాట్కు రూ.10 చెల్లిస్తే చాలు ► ఫంక్షన్హాళ్లకు కూడా ఇకపై నిర్ధిష్ట ఛార్జీలు ఉండవు ► పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చాం ► గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► రజక సంఘం నడుపుతున్న లాండరీలకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ► బీపీఎల్ పరిధిలోని స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► బీపీఎల్లో ఉన్న ఎంబీసీ వర్గాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► యూనిట్ రూ.2.35 పైసలకే ఆక్వారైతులకు రాయితీపై విద్యుత్ ► సబ్సిడీ విద్యుత్ కోసం ప్రభుత్వంపై రూ.9,091.36 కోట్లు భారం పడనున్నట్లు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. చదవండి: నేడు విద్యుత్ టారిఫ్ ప్రకటన: కీలక విషయాలు -
Andhra Pradesh: నేడు విద్యుత్ టారిఫ్ ప్రకటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) బుధవారం 2021–22కి విద్యుత్ టారిఫ్ను ప్రకటించనుంది. ఈ మేరకు విశాఖపట్నంలోని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు టారిఫ్ ఆర్డర్ను వెల్లడిస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఏడాది పాటు కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. వాస్తవానికి.. వారం క్రితమే తిరుపతిలో టారిఫ్ ఆర్డర్ ఇవ్వాలని భావించినా తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాయిదా వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని విశాఖ కేంద్రంగా టారిఫ్ ఆర్డర్ ఇవ్వాలని కమిషన్ వర్గాలు నిర్ణయించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇది రెండో టారిఫ్ ఆర్డర్. డిస్కమ్లు (విద్యుత్ పంపిణీ సంస్థలు) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గతేడాది ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి భారం వేయలేదు. వ్యవసాయ విద్యుత్కు మునుపెన్నడూ లేని విధంగా రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చి ఆదుకుంది. చరిత్రలో తొలిసారిగా గృహవిద్యుత్ వినియోగదారులకు రూ.1,700 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ఆర్థిక లోటులో సింహభాగం ప్రభుత్వమే భరించడంతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడలేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.44,030.08 కోట్ల రెవెన్యూ అవసరమని ఏపీ డిస్కమ్లు గతేడాది నవంబర్లో ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. ప్రస్తుతం టారిఫ్ రూపంలో రూ.30,769.13 కోట్లు రెవెన్యూ వస్తోందని, రూ.13,260.95 కోట్లు ఆర్థిక లోటు ఉండే వీలుందని పేర్కొన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనాతో డిస్కమ్లు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. లాక్డౌన్ వల్ల రూ.11,524.08 కోట్ల మేర ఆర్థిక వనరులు తగ్గాయి. డిస్కమ్ల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రజలు, వివిధ సంఘాల నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి, ప్రభుత్వ సబ్సిడీని పరిగణనలోనికి తీసుకుని 2021–22కి టారిఫ్ ఆర్డర్ ఇవ్వనుంది. ఈసారి కూడా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి విద్యుత్ షాక్ ఉండబోదని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
పట్టుబట్టిన రాష్ట్రం.. చేజిక్కిన 'పవర్'
సాక్షి, అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించే కేంద్ర విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రం చేసిన ఒత్తిడి ఫలించింది. కీలకమైన విద్యుత్ ధరల నియంత్రణాధికారం తమ గుప్పిట్లోకి తీసుకునే ఆలోచనను విరమించుకుంది. రాష్ట్రాలకే ఈ అధికారం ఉండేలా ముసాయిదాలో మార్పు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని కొనసాగించేందుకు వీలుగా కేంద్రం ఓ మెట్టు దిగింది. సవరించిన ముసాయిదాపై బుధవారం కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు అన్ని రాష్ట్రాల విద్యుత్ అధికారులతో చర్చించనున్నారు. తాజా నిర్ణయం వల్ల ప్రజలపై ఇష్టానుసారం విద్యుత్ చార్జీల భారం పడకుండా నియంత్రించే వీలుంది. ముందే స్పందించిన ఏపీ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా చట్ట సవరణకు ముసాయిదా ప్రతిని గత ఏడాది రాష్ట్రాలకు పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ధరలను నిర్ణయించే అధికారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ఉంటుంది. దీన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నది సంస్కరణల్లో ఒక అంశం. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. డిస్కమ్లు అందించే విద్యుత్ వినియోగదారుడికి చేరడానికి యూనిట్కు రూ.6 పైనే అవుతుంది. ఇంత భారం పేద, మధ్య తరగతిపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా 2020–21లో రూ.1700 కోట్లు గృహ విద్యుత్కు సబ్సిడీ ఇచ్చింది. రైతన్నకు 9 గంటల పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి ఏకంగా దాదాపు రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోకెళ్తే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఏపీ స్ఫూర్తితోనే ఇతర రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ముసాయిదాపై నేడు చర్చ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. అయితే, ఏపీఈఆర్సీలోనూ తమూ ఒక సభ్యుడిని నియమించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీనికి తోడు డిస్కమ్లు, విద్యుత్ ఉత్పత్తిదారులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటును సూచిస్తోంది. ఈ ప్రతిపాదనను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్పత్తి ధరను ఖరారు చేసేది రాష్ట్రాలైనప్పుడు ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉంటే సమస్యలొస్తాయని రాష్ట్రాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపే చర్చలు కీలకం కాబోతున్నాయి. ఏపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రానికి స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చాలని నిర్ణయంచుకున్నట్టు విద్యుత్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
‘విద్యుత్’ పనులన్నీ ఆన్లైన్
సాక్షి, అమరావతి: పవర్ సెక్టార్లో ఆన్లైన్ జోరు పెరిగింది. సమీక్షలు, సంప్రదింపులు, సమావేశాలు, విద్యుత్ కొనుగోళ్లు అన్నీ హైటెక్ పద్ధతుల్లోనే నడుస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను విద్యుత్ సౌధలో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆరునెలల నుంచి ఆన్లైన్ ద్వారానే ప్రజాభిప్రాయాలు సేకరిస్తోంది. డిస్కమ్లు వచ్చే ఏడాదికి వార్షిక ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్ఆర్లు) సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి విద్యుత్ సౌధకు, ఏపీఈఆర్సీకి వచ్చే సందర్శకుల సంఖ్య 75 శాతం తగ్గింది. ► విద్యుత్ సంస్థల్లో రోజూ ఉదయం విద్యుత్ సమీక్ష జరుగుతుంది. విద్యుత్ లభ్యత, డిమాండ్, థర్మల్ యూనిట్లలో బొగ్గు నిల్వలు, బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు ఇలా ముఖ్యమైన అంశాలను ఇంధనశాఖ కార్యదర్శి సమీక్షిస్తారు. గతంలో అందుబాటులో ఉన్న అధికారులంతా ఆయన ఆఫీసుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్ల్లోనే సమీక్షిస్తున్నారు. ► ఎస్ఎల్డీసీ ఇచ్చే విద్యుత్ నివేదిక ఆధారంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ఆర్డర్లు కూడా ఈ–ఆఫీసు ద్వారానే సాగుతున్నాయి. ► విజిటర్స్ను కలిసే వెసులుబాటు చాలావరకు తగ్గించారు. అనుమతి తీసుకున్న విజిటర్స్ను కూడా ఫోన్లోనే సంప్రదిస్తున్నారు. లేదా ఆన్లైన్ ద్వారా సంప్రదిస్తే అవసరమైన సమాచారం ఇస్తున్నారు. ► కోల్ ఇండియా, కేంద్ర ఇంధనశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులకు జూమ్ యాప్, గూగుల్ మీట్ ఉపయోగిస్తున్నారు. ► కాంట్రాక్టు సంస్థలు, బొగ్గు రవాణా సంస్థలతో సమావేశాలకు జూమ్ యాప్, అంతర్గత సమావేశాలకు మైక్రోసాఫ్ట్ టీం యాప్ ఉపయోగిస్తున్నారు. ► ఇంటర్నెట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ (టీఎల్ఎస్) ఎన్క్రిప్షన్ భద్రత ఉండటం వల్ల ఈ యాప్లన్నీ సురక్షితమైనవేనని అధికారులు తెలిపారు. అవసరమైన మేర మాత్రమే వ్యక్తులు గ్రూప్లోకి వచ్చే వీలుంటుందని, పాస్వర్డ్, యూజర్ ఐడీ అన్నీ అడ్మిన్ వద్దే ఉంటాయని సాంకేతిక నిపుణులు తెలిపారు. ► గోప్యత పాటించాల్సిన కొన్ని కీలకమైన సమావేశాల్లో అత్యంత భద్రత చర్యలు తీసుకున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు. -
ఐదేళ్ల ట్రూ–అప్ రూ.19,604 కోట్లు
సాక్షి, అమరావతి: గత సర్కారు నిర్వాకాల ఫలితంగా ఐదేళ్లకు సంబంధించి రూ.19,604 కోట్ల మేర ట్రూ–అప్ విద్యుత్తు చార్జీల భారాన్ని మోపేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని డిస్కమ్లు అనుమతి కోరడంపై ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత మొత్తాన్ని, అదికూడా గత సర్కారు పాలన ముగిసిన తరువాత కమిషన్ ముందుకు తేవడాన్ని అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రూ–అప్ అంత ఎందుకైంది? ఎప్పటికప్పుడు గత కమిషన్ ముందుకు ఎందుకు తేలేదు? ఏపీఈఆర్సీ నిర్ణయించిన దానికన్నా ఎక్కువ వ్యయం చేయాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రూ–అప్ అంటే? ► విద్యుత్ పంపిణీ సంస్థలు ఏటా వార్షిక ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్ఆర్) ఏపీఈఆర్సీకి సమర్పిస్తాయి. వచ్చే ఏడాదిలో పెరిగే వ్యయం, రెవెన్యూ తేడా, లోటు ఎలా భర్తీ చేసుకోవాలో పేర్కొంటాయి. ► డిస్కమ్ల ఏఆర్ఆర్లను పరిశీలించాక కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. నిర్వహణ వ్యయం దేనికి ఎంత ఉండాలనేది సూచిస్తుంది. ► 2014–15 నుంచి 2018–19 వరకూ గత సర్కారు కమిషన్ సూచించిన దానికన్నా అధికంగా ఖర్చు చేసింది. ఇలా చేసిన వ్యయానికి కారణాలు వివరిస్తూ ప్రతి సంవత్సరం అదనపు ఖర్చుగా చూపించాలి. దీన్నే ట్రూ–అప్ అంటారు. దిగిపోయే ముందు.... ► గత ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ను ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తూ కమిషన్ నిర్దేశించిన పరిమితి దాటిపోయింది. ఫలితంగా ప్రతి సంవత్సరం వాస్తవ ఖర్చులో భారీగా తేడా వచ్చింది. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ కొనుగోలు ధర కమిషన్ నిర్ణయించిన దానికన్నా రూ.9,598 కోట్లు ఖర్చు పెట్టారు. రావాల్సిన దానికన్నా రూ.5,259 కోట్లు తక్కువ రెవెన్యూ వచ్చింది. ఏటా వడ్డీలు, కొత్త ట్రూ–అప్ రూపంలో రూ.4,747 కోట్లు వెరసి రూ.19,604 కోట్ల ట్రూ–అప్ ఇప్పుడు కమిషన్ ముందుకొచ్చింది. ► ట్రూ–అప్పై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో డిస్కమ్లు ఎందుకిలా చేశాయి? అనుమతి లేకుండా అధిక రేట్లకు విద్యుత్ ఎందుకు కొన్నాయి? ఇంత మొత్తాన్ని కమిషన్ దృష్టికి ఏటా ఎందుకు తేలేదు? అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. -
ప్రైవేట్ విద్యుత్తు సంస్థలకు ఏపీఈఆర్సీ షాక్!
సాక్షి, అమరావతి: ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో కీలక తీర్పు వెలువరించింది. పెరిగిన గ్యాస్ ధరల ఆధారంగా రెండేళ్ల కాలానికి అదనపు చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రం, శ్రీవత్సవ వేసిన పిటిషన్ను కమిషన్ తోసిపుచ్చింది. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వంలో సభ్యులు పి.రాజగోపాల్రెడ్డి, ఠాకూర్ రామ్సింగ్ వెలువరించిన తీర్పును కమిషన్ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి. కమిషన్ ఆమోదం లేకున్నా.. ► 2018–19, 2019–20లో పెరిగిన గ్యాస్ ధరల ఆధారంగా అదనపు చర వ్యయం ఇవ్వాలని విద్యుదుత్పత్తి సంస్థలు కమిషన్ను ఆశ్రయించాయి. ప్రైవేట్ సంస్థల వాదనపై డిస్కమ్లు, విద్యుత్ రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ల్యాంకో, స్పెక్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 2016లో, శ్రీవత్సవ పీపీఏ గడువు 2018లోనే ముగిసినా మళ్లీ కుదుర్చుకోవాలని ఆ సంస్థలు పట్టుబట్టాయి. కమిషన్ నుంచి దీనికి ఆమోదం లేకున్నా గత సర్కారు స్వల్పకాలిక పద్ధతిలో వాటి నుంచి విద్యుత్ తీసుకుంది. ► ల్యాంకోకు యూనిట్కు రూ.3.29, మిగతా వాటికి యూనిట్కు రూ. 3.31 చొప్పున చెల్లించగా కేవలం కొన్ని నెలలకే తీసుకునే ఈ విద్యుత్కు నిర్ణయించిన ధరలే వర్తిస్తాయని విద్యుత్ చట్టాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండటం, మార్కెట్లో అంతకన్నా చౌకగా లభిస్తుండటంతో ఈ ఏడాది కమిషన్ ప్రైవేట్ గ్యాస్ పవర్ను అనుమతించలేదు. కోవిడ్ కాలంలో చౌకగా విద్యుత్ తీసుకోవడానికి కేవలం ఆరు నెలలకే కమిషన్ ఒప్పుకుంది. అదనపు చర వ్యయంతో భారీ భారం... ► 2018–19, 2019–20లో గ్యాస్ ధరలు స్వల్పంగా పెరగడంతో ఆ మేరకు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలు కోరాయి. ల్యాంకో విద్యుదుత్పత్తి సామర్థ్యం 355 మెగావాట్లు కాగా, స్పెక్ట్రం 208 మెగావాట్లు, శ్రీవత్సవ 17 మెగావాట్లుగా ఉంది. వీటి నుంచి రెండేళ్లలో సుమారు 4 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను డిస్కమ్లు తీసుకున్నాయి. ప్రైవేట్ సంస్థలు కోరినట్లుగా అదనపు చర వ్యయం చెల్లిస్తే డిస్కమ్లపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుంది. స్వల్పకాలిక పీపీఏలకూ అదనంగా ఎలాంటి ఖర్చులు అడిగే హక్కు లేదన్న డిస్కమ్ల వాదనతో కమిషన్ ఏకీభవించింది. నిపుణుల వాదనలూ పరిగణలోకి తీసుకుంటూ పిటిషనర్లైన ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థల వాదనను తోసిపుచ్చింది. -
స్వల్పకాలిక విద్యుత్ రేట్లు తగ్గింపు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించింది. మార్కెట్ రేట్లకు అనుగుణంగా వాటి ధరలను తగ్గించింది. ఫలితంగా డిస్కమ్లకు రూ.60 కోట్ల మేర ఆదా అవుతుందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. ► గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రంతో ఏపీ డిస్కమ్లకు ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2016తోనే ముగిసింది. అయినప్పటికీ పాత ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా పాత ధరలతోనే విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ల్యాంకోకు యూనిట్కు రూ.3.29, స్పెక్ట్రంకు యూనిట్కు రూ.3.31 చొప్పున డిస్కమ్లు చెల్లిస్తున్నాయి. ► అయితే, ఈ ఏడాది రెండు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు కమిషన్ అనుమతించలేదు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండటం, ఆ రెండు సంస్థల కన్నా మార్కెట్లో తక్కువకే విద్యుత్ లభిస్తుండటమే కారణంగా ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ► లాక్డౌన్ కాలంలో బొగ్గు సమస్య రావచ్చని భావించిన డిస్కమ్లు గ్యాస్ విద్యుత్ను తీసుకోవాలని కోరడంతో ఏప్రిల్, మే నెలలకు కమిషన్ అనుమతించింది. అయితే వారం రోజుల్లోనే ప్రపంచ మార్కెట్లో గ్యాస్ రేట్లు తగ్గాయి. దీంతో జూన్ నుంచి విద్యుత్ తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. ఒకవేళ తీసుకుంటే, స్పెక్ట్రంకు యూనిట్కు రూ.3.31కి బదులు రూ. 2.71, ల్యాంకోకు రూ.3.29కి బదులు యూనిట్కు రూ.2.69 చొప్పున చెల్లించాలని డిస్కమ్లను ఆదేశిస్తూ టారిఫ్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకే అనుమతించింది. ► అక్టోబర్, నవంబర్ నెలల్లో తదుపరి సంవత్సరానికి అవసరమైన వార్షిక, ఆదాయ అవసర నివేదికలను డిస్కమ్లు రూపొందిస్తాయి. అప్పుడు ఈ రెండు సంస్థల నుంచి విద్యుత్ తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాయి. ► సెప్టెంబర్ వరకూ తీసుకునే ఈ విద్యుత్ దాదాపు వెయ్యి మిలియన్ యూనిట్లు ఉంటుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. కమిషన్ తగ్గించిన రేట్ల వల్ల విద్యుత్ సంస్థలకు యూనిట్కు 60 పైసల చొప్పున, మొత్తం రూ.60 కోట్లు ఆదా అవుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
వాడిన విద్యుత్కే బిల్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేట్లు పెరిగి, ఎక్కువ బిల్లులు వచ్చాయన్నది వదంతులేనన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీసినా... బిల్లింగ్ మాత్రం ఏ నెలకానెలే చేశామని తెలిపారు. బిల్లింగ్ చేసిన విధానాన్ని ఆయన సోమవారం మీడియాకు వెల్లడించారు. ► ప్రతి 30 రోజులకోసారి తీసే మీటర్ రీడింగ్ లాక్డౌన్ కారణంగా 60 రోజులకు (మార్చి, ఏప్రిల్ వినియోగం) తీశాం. ► ఏప్రిల్ 1 నుంచి ఏపీఈఆర్సీ ప్రకటించిన కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చిలో 10న రీడింగ్ తీయడం వల్ల మిగిలిన 21 రోజులనే లెక్కలోకి తీసుకున్నాం. అంటే రీడింగ్ తీసిన 60 రోజులలో 21 రోజులు మార్చి నెలకు, మిగిలినవి ఏప్రిల్లోకి విభజించాం. ► 75 యూనిట్లలోపు వినియోగం ఉంటే ఏ కేటగిరీలోనే ఉంటారు. 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉంటే బీ కేటగిరీ కిందే లెక్కిస్తారు. ఆ పైన వినియోగం ఉన్న వాళ్లే కేటగిరీ సీలోకి వెళ్తారు. 500 యూనిట్లుపైన వినియోగం ఉన్నవాళ్లకు మాత్రం ఈ ఏడాది యూనిట్కు 90 పైసలు పెంచారు. కాబట్టి తక్కువ వినియోగం ఉన్న వారికి ఎలాంటి అదనపు భారం పడే వీలే లేదు. ► గత ఐదేళ్ల విద్యుత్ వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ప్రతీ ఏడాది మార్చి నెలలో 46 శాతం, ఏప్రిల్లో 54 శాతం విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈసారి లాక్డౌన్ వల్ల ప్రతీ ఒక్కరూ గృహాలకే పరిమితం కావడంతో వినియోగం అంచనాలకు మించి పెరిగింది. ఫలితంగా యూనిట్లు పెరిగి శ్లాబులూ మారాయి. అంతే తప్ప రెండు నెలల రీడింగ్ వల్ల ఏ మార్పూ రాలేదు. -
గత నెల ఎంత వస్తే అంతే కట్టండి!
సాక్షి, అమరావతి: మార్చి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులే ఏప్రిల్ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్లో కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మార్చి (ఫిబ్రవరి వినియోగం)లో వచ్చిన కరెంట్ బిల్లే ఏప్రిల్కూ వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చారు. సమయం మరో 2 గంటలైనా పెంచండి ప్రభుత్వానికి పౌల్ట్రీ రైతుల విన్నపం సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను సడలించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మరో రెండు గంటల పాటు చికెన్ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్, ఏపీ రైతు సంఘాలు కోరాయి. (కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు) -
పేదలపై భారం పడదు
సాక్షి, అమరావతి: పేదలపై పైసా కూడా భారం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కొత్త విద్యుత్ టారిఫ్ అమలులోకి రానుంది. 2020–21 టారిఫ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఫిబ్రవరిలోనే వెలువరించింది. గత ఐదేళ్లుగా అనుసరించిన టారిఫ్కు ఇది పూర్తి భిన్నంగా ఉంది. దొడ్డిదారిన ప్రజలపై భారం మోపే విధానాలకు కమిషన్ స్వస్తి పలికింది. ప్రజలకు ఊరట.. సర్కారుపైనే భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పైసా కూడా భారం పడరాదని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కమ్లకు ఈసారి రూ.10,060.63 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ వినియోగానికి రూ.1,707.07 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ► విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధిక భారం మోపే విధానాన్ని గత సర్కారు ఐదేళ్లుగా అమలు చేసింది. దీన్ని ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారు. ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేస్తారు. దీనివల్ల 50 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. ► రాష్ట్రంలోని 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారుల్లో నెలకు 50 యూనిట్లు వినియోగించేవారు దాదాపు 50.90 లక్షల మంది ఉన్నారు. వీరి బిల్లు ఇప్పుడు (యూనిట్ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50కి మించదు. ► ఇక నెలకు 51–75 యూనిట్లు విద్యుత్ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు ఉంది. వీరికి గతంలో రూ.137.50 చొప్పున బిల్లు వస్తుండగా ఇప్పుడు కూడా అంతే రానుంది. (50 యూనిట్ల వరకూ యూనిట్ రూ.1.45 చొప్పున లెక్కిస్తారు. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్ రూ.2.60 చొప్పున చెల్లించాలి). తద్వారా దాదాపు 74 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్ బిల్లు పెరిగే ప్రసక్తి ఉండదు. ► వినియోగం నెలకు 75 యూనిట్లు దాటిన వారికి కొత్త టారిఫ్ ప్రకారం బిల్లు తగ్గే వీలుంది. గతంలో 75 యూనిట్లు దాటితే ‘సి’ కేటగిరీ కింద పరిగణించేవారు. అంటే ఏడాదికి 900 యూనిట్లకు బదులు అదనంగా ఒక్కయూనిట్ వాడినా కేటగిరీ మారతారు. ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే వస్తుంది కాబట్టి చాలామందికి కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉంది. ► 101–200 యూనిట్ల విద్యుత్తు వినియోగించేవారు రాష్ట్రంలో 37.28 లక్షల మందే ఉన్నారు. 201–225 యూనిట్ల వాడకం ఉన్న వారు కేవలం 6.28 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వినియోగం తగ్గితే వీరు కూడా తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. ప్రజాభిప్రాయం మేరకే.. ‘విద్యుత్ బిల్లుల భారం ప్రజలపై పడకూడదన్న ప్రభుత్వ విధానం మేరకు టారిఫ్ ఆర్డర్ రూపొందించాం. ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. ఏడాదిలో క్రితం టారిఫ్ను లెక్కలోకి తీసుకుని సంవత్సరం పొడవునా బిల్లుల మోత ఏమిటని ప్రజలు ప్రశ్నించారు. అందుకే ఇలాంటి పద్ధతులను తొలగించాం. అన్ని వర్గాలకు ఊరట కల్పించేలా టారిఫ్ ప్రకటించాం. లాక్డౌన్ సమయంలోనూ ప్రజలపై భారం లేకుండా చేయగలిగామనే సంతృప్తి ఉంది’ -
మండు వేసవిలోనూ కోతల్లేకుండా విద్యుత్
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. నిర్విరామంగా నడిచే ఫ్యాన్లు ఏసీలతో డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. దానితో పాటే విద్యుత్ కోతలూ పెరిగిపోతాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ శాఖ విలవిల్లాడిపోతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత వెచ్చించి కరెంటు కొనేస్తుంది. యూనిట్కు రూ.7 వెచ్చించి కొన్న సందర్భాలూ ఉన్నాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి, ఆ భారాన్నంతా విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై వేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇదే. ఈ పరిస్థితిని నివారించలేమా? విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిచోటా ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలపై నయా పైసా అదనపు భారం పడకుండా, విద్యుత్ కోతలనే మాటే విన్పించకుండా చూడాలని ఆదేశించింది. సవాల్గా తీసుకున్న విద్యుత్ అధికారులు మంచి ముందస్తు ప్రణాళిక తయారు చేశారు. అవసరమైన విద్యుత్ను అతి తక్కువకే కొనేందుకు రూపొందించిన ప్లాన్కు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈసారి రోజుకు 200 ఎంయూలకు పైనే డిమాండ్? ఈ ఏడాది వేసవిలో మునుపెన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా. విద్యుత్ ఉపకరణాలు పెరగడం, కొత్త కనెక్షన్లు రావడం, మార్కెట్ సర్వే ఆధారంగా అధికారులు ఈ అభిప్రాయానికొచ్చారు. ఇదివరకు మండు వేసవిలోనూ గరిష్టంగా రోజుకు 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే నమోదైంది. కానీ ఈసారి మార్చి–మే మధ్య రోజుకు సగటున 200 ఎంయూలపైనే విద్యుత్ వాడకం ఉండొచ్చని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అధికారి ఒకరు చెప్పారు. అదే సమయంలో రోజుకు సగటున గరిష్టంగా 163 ఎంయూల విద్యుత్ లభ్యత మాత్రమే ఉండొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గాను పోటీ బిడ్డింగ్కు వెళ్లేందుకు విద్యుత్ అధికారులు రోడ్మ్యాప్ వేశారు. విద్యుత్ కోతల్లేకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరహా ముందస్తు కసరత్తు గతంలో ఎప్పుడూ జరగలేదని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముందే పోటీ బిడ్డింగ్తో ప్రయోజనం గతంలో అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనేవాళ్లు. దీంతో విపరీతమైన రేట్లు ఉండేవి. ఇప్పుడలా కాదు. వచ్చే మూడు నెలలకు ఎంతకావాలో అంతకు ముందే ఓపెన్ టెండర్లు పిలుస్తున్నారు. పోటీ బిడ్డింగ్లో ఎలాంటి అక్రమాలకూ తావుండదు. పైగా పోటీ కారణంగా అతి తక్కువకే విద్యుత్ లభిస్తుంది. మార్కెట్ అంచనాలను బట్టి ట్రాన్స్మిషన్, పవర్ గ్రిడ్ చార్జీలవంటివన్నీ కలిపినా.. మార్చి, ఏప్రిల్, మే నెలలో స్వల్పకాలిక కొనుగోళ్ల కింద యూనిట్ రూ.4.05కే లభిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలపై భారం పడకుండా కొనుగోళ్లకు అనుమతి మార్చి–మే మధ్య విద్యుత్ లభ్యత, డిమాండ్ మధ్య ఉన్న తేడా భర్తీ విషయం డిస్కమ్లు కమిషన్ దృష్టికి తెచ్చాయి. దీన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి డిస్కమ్లు ప్రతిపాదించిన దానిలో 85 శాతం కొనుగోళ్లకు అనుమతించాం. ముందస్తు కొనుగోళ్లతో ఇప్పటి కన్నా చౌకగా విద్యుత్ లభిస్తుందని విద్యుత్శాఖ పేర్కొంది. అందువల్ల ప్రజలపై కూడా భారం పడదనే ఉద్దేశంతో స్వల్పకాలిక కొనుగోళ్లకు అనుమతించాం. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి (ఏపీఈఆర్సీ చైర్మన్) కోతలు లేకుండా చేయడానికే వేసవిని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేసింది. విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం పడకూడదనే ఓపెన్ బిడ్డింగ్కు వెళ్తున్నాం. తద్వారా యూనిట్ రూ.4.05కు లభిస్తుంది. నిజానికి ఈ ధర ఇప్పుడు మేం కొంటున్న అన్ని రకాల విద్యుత్ ధరల కన్నా తక్కువే. – శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి -
వచ్చేస్తోంది ‘సమస్త్’
సాక్షి, అమరావతి: కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టడం, కోతలను నివారించడం లక్ష్యంగా సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. షెడ్యూలింగ్, అక్కౌంటింగ్, మీటరింగ్ అండ్ సెటిల్మెంట్ అఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఎలక్ట్రిసిటీ (సమస్త్) టెక్నాలజీని మరో రెండు నెలల్లో ఆచరణలోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. మరోవారం రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ), రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ఆధ్వర్యంలో సమస్త్ పనిచేస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనల మార్పు కోసం విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీ ఎదుట పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ‘సమస్త్’ ప్రయోజనాలేంటి? - టూల్స్ డేటా టెలీమీటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్తో పాటు అత్యాధునిక పరిజ్ఞానం అనుసంధానమై ఉంటుంది. - దీనివల్ల ప్రతి సెకనుకూ ఎంత విద్యుత్ లభ్యత ఉంది? 24 గంటల్లో లభ్యత ఎలా ఉంటుంది? తేడా ఎంత? ఎంత జరిమానా విధించాలి? ఎంత బిల్లు వస్తుంది? అనే విషయాలు ఆన్లైన్ ద్వారానే రికార్డవుతాయి. - ఇదంతా ఉత్పత్తిదారుడికి, విద్యుత్ సంస్థలకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. - విద్యుత్ కొరత ఉంటే తక్షణమే కొనుగోలు చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమవుతాయి. - ఆన్లైన్ విధానం తప్పించుకునేందుకు వీల్లేదు. కోర్టులను ఆశ్రయించినా శాస్త్రీయ సమాచారం ఆధారంగా వాస్తవాన్ని తేలికగా గుర్తించే వీలుంది. ఎప్పటికప్పుడు లభ్యత వివరాలు కచ్చితమైన విద్యుత్ లభ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ‘సమస్త్’తో సాధ్యమవుతుంది. ముందే అంచనాలు రూపొందించుకోవడం, అవసరమైన విద్యుత్ను ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు డిస్కమ్లకు వీలు కలుగుతుంది. పంపిణీ సంస్థలను ముప్పుతిప్పలు పెడుతున్న సౌర, పవన విద్యుత్ సమస్యలకు ఈ టెక్నాలజీ ద్వారా చెక్ పెట్టవచ్చని ట్రాన్స్కో వర్గాలు భావిస్తున్నాయి. ఉత్పత్తితో పాటు విద్యుత్ డిమాండ్నూ ఆన్లైన్ ద్వారా ముందే రికార్డు చేస్తారు కాబట్టి విద్యుదుత్పత్తిదారుడు ముందు పేర్కొన్నట్టు విద్యుత్ ఇవ్వకపోయినా, అనుకున్నదానికన్నా ఎక్కువగా అందించి గ్రిడ్కు ఇబ్బంది కలిగించినా విద్యుత్ సంస్థలు పక్కాగా లెక్కలు చూపించి అపరాధ రుసుము విధించే వీలుంది. నాణ్యత పెరుగుతుంది.. – చక్రధర్బాబు, ట్రాన్స్కో జేఎండీ ‘సమస్త్ అమలులోకి వస్తే విద్యుత్ సంస్థల నాణ్యత రెట్టింపు అవుతుంది. పవన, సౌర విద్యుదుత్పత్తిలో తేడాలను కచ్చితంగా గుర్తించవచ్చు. గ్రిడ్ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఆకస్మిక విద్యుత్తు కోతలకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. పీక్ అవర్స్లోనూ చౌకగా విద్యుత్తు తీసుకునే వీలుంటుంది. ఉత్తరప్రదేశ్ ఇప్పటికే ఈ తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చి మంచి ఫలితాలు సాధిస్తోంది’ ఇప్పుడు ఏం జరుగుతోంది? రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు 430 మంది ఉత్పత్తిదారులు విద్యుత్ అందిస్తున్నారు. వీరి ద్వారా వచ్చే విద్యుత్ ఎంత అనేది ముందే తెలియచేయాలి. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) విద్యుత్ డిమాండ్ను అంచనా వేసి లభ్యత, డిమాండ్ల మధ్య తేడాను తెలియజేస్తుంది. లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య విభాగం వెంటనే మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తుంది. ఒకవేళ డిమాండ్ తక్కువగా, ఉత్పత్తి ఎక్కువ ఉంటే ఖరీదు ఎక్కువగా ఉన్న విద్యుత్ ఉత్పత్తికి కోత పెడతారు. ఉత్పత్తిదారులు ఎస్ఎల్డీసీకి ఎంత విద్యుత్ ఇస్తామనేది ఒక రోజు ముందే వెల్లడించాలి. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులు ముందు రోజు చెప్పినదానికి, మర్నాడు వాస్తవంగా అందించే విద్యుత్కు మధ్య భారీ తేడాలుంటున్నాయి. అప్పటికప్పుడు విద్యుత్ కొనుగోలుకు వెళ్లడం వల్ల ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్పత్తిదారుడి అంచనా, వాస్తవంగా ఇచ్చిన విద్యుత్ మధ్య తేడా ఇప్పటిదాకా మాన్యువల్ విధానంలో నమోదవుతోంది. తేడా ఉన్నప్పుడు ఉత్పత్తిదారులకు డిస్కమ్లు జరిమానా విధిస్తాయి. అయితే అంతా మాన్యువల్గా జరగడం వల్ల జరిమానాలను వ్యతిరేకిస్తూ ఉత్పత్తిదారులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా జరిమానాలను డిస్కమ్లు రాబట్టేందుకు వీలు లేకుండా ఉంది. సమస్త్ బృందం ఇదీ.. - అనుభవజ్ఞులైన ఇద్దరు చార్టర్డ్ అక్కౌంటెంట్లు - గణాంక నిపుణుడు - ప్రాజెక్ట్ మేనేజర్ - మరో ఆరుగురు సభ్యులు -
ప్రజల ముంగిట ఫిర్యాదు బాక్సులు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళన మొదలైంది. క్షేత్రస్థాయి నుంచి అవినీతి నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు విద్యుత్తు శాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం తెలిపారు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వినియోగదారులు కమిషన్ దృష్టికి పలు అంశాలను తెచ్చారు. కొత్త కనెక్షన్లు, తప్పుగా ముద్రించిన విద్యుత్తు బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునేందుకు వినియోగదారులు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. లో వోల్టేజీ, వేలాడే విద్యుత్ తీగలతో సమస్యలు ఎదురవుతున్నట్లు ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చారు. దీనిపై కిందిస్థాయి సిబ్బంది వెంటనే స్పందించడం లేదనే ఫిర్యాదులందాయి. సిబ్బంది అవినీతి వ్యవహారాలపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ కమిషన్ చర్యలు చేపట్టింది. ఫిర్యాదు బాక్సులు ఇలా... ►ప్రతి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అడిషనల్ డివిజినల్ ఇంజనీర్ (ఏడీఈ), జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తారు. ►ఫిర్యాదు బాక్సుల తాళాలు పై అధికారుల వద్ద మాత్రమే ఉండాలని నిబంధన విధించారు. ►ప్రతి నెల మొదటి తారీఖున ఫిర్యాదు బాక్సులను తెరిచి వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలి. ►ఫిర్యాదు వివరాలు ఉన్నతాధికారులకూ వెళ్తాయి. ►ఫిర్యాదును గుర్తించిన 48 గంటల్లోగా పరిష్కారం చూపించాలి. అది కూడా సంస్థ వెబ్సైట్లో పేర్కొనాలి. ►ఫిర్యాదు చేసే వ్యక్తులు కరెంట్ బిల్లు, పూర్తి వివరాలను అందులో పొందుపర్చాలి. ►అవసరమైతే జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకూ ఫిర్యాదులు పంపవచ్చు. ►ఫిర్యాదు బాక్సులపై అన్ని విద్యుత్ సంస్థల వెబ్పోర్టర్లలో ప్రజలకు అర్థమయ్యేలా వివరాలు వెల్లడించాలి. ►అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించకపోయినా, లంచాల కోసం వేధించినా ఫిర్యాదు చేయవచ్చు. కఠిన చర్యలుంటాయి ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై ప్రతి మూడు నెలలకోసారి ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. ఫిర్యాదుల వివరాలు, అపరిష్కృతంగా ఉంటే కారణాలను వెల్లడించాలి. ఏపీఈఆర్సీ ఈ వ్యవస్థను స్వయంగా పర్యవేక్షిస్తుంది. మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినా, విద్యుత్ వినియోగదారులను లంచాల కోసం వేధించినా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్ వ్యవస్థ తమదనే భావన ప్రజలకు కల్పించడం కోసమే సరికొత్త చర్యలు చేపట్టాం. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ -
పేదోడి కరెంట్ బిల్లు పైసా పెరగదు
సాక్షి, అమరావతి: పేదలు, అల్పాదాయ వర్గాల కరెంట్ బిల్లులు ఈ ఏడాది పైసా కూడా పెరిగే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలపై పడే రూ.10,060.63 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ.1,707.07 కోట్లను గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందన్నారు. ఇంతకాలం రకరకాల పద్ధతుల్లో ఉన్న పరోక్ష విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల కోరిక మేరకు ఎత్తేశామని చెప్పారు. కొత్త టారిఫ్ రూపకల్పనలో కమిషన్ పాత్రపై జస్టిస్ నాగార్జునరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పెంచలేదు.. తగ్గేలా చేశాం రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడకం ఉన్నవారు 50.90 లక్షల మంది. వీరికి గతంలోనూ, ఇప్పుడూ వచ్చే కరెంట్ బిల్లు (యూనిట్ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50. ఇక నెలకు 51–75 యూనిట్ల విద్యుత్ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు. వీరికి గతంలో రూ. 137.50 బిల్లు వచ్చేది.. ఇప్పుడూ అంతే. (50 యూనిట్ల వరకూ యూనిట్ రూ.1.45.. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్ రూ.2.60 చొప్పున). అంటే.. దాదాపు 74 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్ బిల్లు పెరిగే ప్రసక్తే లేదు. నెలకు 75 యూనిట్లు దాటిన వారి విషయంలో బిల్లు స్వల్పంగా పెరిగినట్టే ఉన్నా.. గతంలోని పరోక్ష విధానాన్ని విశ్లేషించి చూస్తే వారిలో సగం మందికి కరెంట్ బిల్లులు తగ్గే వీలుంది. ఏ విధంగా అంటే.. 100 యూనిట్ల వరకూ పాత బిల్లు ప్రకారం.. (0–50 వరకూ యూనిట్ రూ.1.45... 51–100 వరకూ యూనిట్కు రూ.2.60 చొప్పున) నెలకు రూ.202.50 వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. (0–100 వరకూ యూనిట్ రూ.2.60 చొప్పున) రూ.260 బిల్లు వస్తుంది. అంటే.. రూ. 57.50 పెరిగినట్టు కనిపించినా వాస్తవంలో ఇది తగ్గుతుంది. మారిన శ్లాబ్ ప్రకారం ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే కాబట్టి కరెంట్ బిల్లులు తగ్గుతాయి. నెలకు 101–200 యూనిట్లు వాడే వాళ్లు రాష్ట్రంలో 37.28 లక్షల మంది ఉన్నారు. 201–225 యూనిట్లు వాడేవారు 6.28 లక్షల మంది. వీరి వినియోగం తగ్గితే తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. కాబట్టి పేద వర్గాలపై ఎంతమాత్రం భారం పడలేదు. 500 యూనిట్లపైన వాడేవారు 1.35 లక్షల మంది ఉన్నారు. అధిక సంపన్నులైన వీరికి పెరిగింది కేవలం యూనిట్కు రూ.90 పైసలే. గత ఐదేళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే ఉచిత కరెంటు, తదితరాలకు డిస్కమ్లు భరించే భారాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వాటికి ఇవ్వాలి. అయితే.. 2015–16లో రూ.3,600 కోట్ల సబ్సిడీకి రూ.3,186 కోట్లు, 2016–17లో రూ.3,951 కోట్లకు రూ.2,923 కోట్లు, 2017–18లో రూ.3,700 కోట్లకు.. రూ.2750 కోట్లు, 2018–19లో రూ.6,030 కోట్లకు రూ.1,250 కోట్లు, 2019–20లో రూ.8,255 కోట్లకు రూ.4,667 కోట్లు మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇతరత్రా పేరుకు పోయి.. అప్పులు చేసిన డిస్కమ్లు వడ్డీలకే నెలకు రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి వస్తోంది. పరిశ్రమలకు చేయూత.. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వ పథకాల కోసం నాణ్యమైన బియ్యం ఆడించే రైసు మిల్లులకు వినియోగం లోడ్ పరిమితిని వంద నుంచి 150 హెచ్పీకి పెంచాం. అనేక పరిశ్రమలకు లోడ్ఫ్యాక్టర్ ఇన్సెంటివ్స్ (ఎక్కువ వినియోగానికి రాయితీలు) కొనసాగిస్తున్నాం. ఫెర్రో అల్లాయిస్ను బతికించేందుకు 85 శాతం లోడ్ ఫ్యాక్టర్ నిబంధనల ప్రతిపాదనను పక్కనపెట్టాం. కుటీర పరిశ్రమలపై కెపాసిటర్లు లేవని విద్యుత్ సిబ్బంది వేసే జరిమానాలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాం. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు నూతన టారిఫ్ వల్ల భారీ ప్రయోజనం కలుగుతుంది. ఏ లాభాపేక్ష లేని ఈ సంస్థలను వాణిజ్య కేటగిరీలోంచి తీసేశాం. విద్యుత్ సంస్థలను ప్రజలకు చేరువ చేయాలన్న కమిషన్ ఆలోచనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ, గతంలో లేని విధంగా గృహ విద్యుత్ వినియోగ సబ్సిడీ రూ.1,707.07 కోట్లు ఇచ్చింది. దీనికి వ్యవసాయ సబ్సిడీ (రూ.8,353.58 కోట్లు) కలిపితే మొత్తం ఇచ్చింది రూ.10,060.63 కోట్లు. -
విద్యుత్ చార్జీలు ప్రకటించిన ఏపీఈఆర్సీ
సాక్షి, అమరావతి: ప్రజలపై ఏమాత్రం విద్యుత్ ఛార్జీల భారం వేయకుండా.. పెంచాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2020–21 సంవత్సరానికి గాను కొత్త విద్యుత్ చార్జీలను సోమవారం ప్రకటించింది. సవరించిన టారిఫ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. హైదరాబాద్లోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రఘు, రామ్మోహన్ కొత్త టారిఫ్ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. 99 శాతం విద్యుత్ వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా, విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టం వాటిల్లకుండా టారిఫ్ను రూపొందించామన్నారు. డిస్కమ్ల ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన అంశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై పడాల్సిన భారాన్నంతా సర్కారే భరిస్తోంది. ప్రభుత్వం డిస్కమ్లకు ఉదారంగా పెద్దఎత్తున సబ్సిడీ ఇవ్వడంవల్లే పేదలపై భారం పడలేదని నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కమ్లు తమ వార్షిక ఆదాయ అవసరాలను రూ.14,349.07 కోట్లుగా చూపించాయని, దీన్ని కమిషన్ మదించి రూ.12,954.11 కోట్లుగా తేల్చిందన్నారు. ఇందులో రూ.2,893.48 కోట్ల మేర వివిధ రూపాల్లో డిస్కమ్లు సమకూర్చుకునేలా అవకాశం కల్పించామన్నారు. మిగిలిన రూ.10,060.63 కోట్లలో.. వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం రూ.8,353.58 కోట్లు.. ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ప్రకటించిన సబ్సిడీ (రూ.7,064.27)తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఆయనన్నారు. అలాగే, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గృహ విద్యుత్ వినియోగదారుల తరఫున రూ.1,707.07 కోట్లు సబ్సిడీ ఇవ్వడంవల్ల పేదలపై ఏమాత్రం భారం పడకుండా టారిఫ్ ఇవ్వగలిగినట్లు నాగార్జునరెడ్డి వెల్లడించారు. (చదవండి: వ్యవ'సాయం'.. విప్లవాత్మకం) జిమ్మిక్కులు.. దొడ్డిదారి వడ్డనకు స్వస్తి ► గత టీడీపీ ప్రభుత్వం అనేక దొడ్డిదారి మార్గాల్లో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపింది. ఇందులో శ్లాబుల వర్గీకరణ ఒకటి. గత ఏడాది వినియోగాన్ని కొలమానంగా తీసుకుని ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక విద్యుత్ భారం మోపేవారు. ఉదా.. గత ఏడాది విద్యుత్ వినియోగం 600 దాటి 601కి చేరితే.. ప్రస్తుత విద్యుత్ టారిఫ్లో 0–50 యూనిట్లకు యూనిట్కు రూ.1.45 బదులు రూ.2.60 వసూలు చేసేవారు. ఇలాంటి పరోక్ష పద్ధతులకు ప్రస్తుత కమిషన్ స్వస్తి పలికింది. ►అలాగే, సంపన్న వర్గాలకు (500 యూనిట్లు దాటితే) యూనిట్కు కేవలం 90 పైసలు పెంచింది. (రూ.9.05 నుంచి 9.95 చేసింది). ఇలాంటి వారు రాష్ట్రంలో 1,43,65,000 మంది ఉన్నారు. ఈ పెంపువల్ల వచ్చే ఆదాయం గరిష్టంగా రూ.50 కోట్లు మాత్రమే. అంటే.. 1.45 కోట్ల మందిపై పైసా కూడా భారం పడదు. పరిశ్రమలకు ఫుల్ పవర్ ఏపీలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా విద్యుత్ టారిఫ్లో ఆ రంగానికి పెద్దపీట వేశారు. విద్యుత్ బిల్లుల భారం పడకుండా సమతుల్యం పాటించడం విశేషం. ఎలాగంటే.. ► లాభాపేక్ష లేని ప్రభుత్వ విద్యాలయాలు, ఆసుపత్రులను వాణిజ్య కేటగిరీ నుంచి హెచ్టీలోని సాధారణ కేటగిరీలో చేర్చారు. దీనివల్ల టైమ్ ఆఫ్ డే (పీక్.. నాన్ పీక్ అవర్స్లో వేర్వేరు ధరలు) ధరల నుంచి తప్పించారు. ► దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. ► రైల్వేలకు వర్తించే ధరలను యూనిట్కు రూ.6.50 చొప్పున డిస్కమ్లు ప్రతిపాదిస్తే.. కమిషన్ దాన్ని రూ.5.50కు పరిమితంచేసింది. ► విద్యుత్ వాహనాల యూనిట్ ప్రతిపాదిత ధరను రూ.12.25 నుంచి రూ. 6.70కి తగ్గించారు. ► అత్యధికంగా విద్యుత్ వాడకం ఉండే పరిశ్రమలకు రాయితీలుంటాయి. రైస్, పల్వరైజింగ్ మిల్లుల లోడ్ను 100 హెచ్పి నుంచి 150 హెచ్పికి పెంచారు. పరిశ్రమల్లో కాంట్రాక్టు డిమాండ్ కన్నా ఎక్కువ లోడ్ ఉంటే వేసే అపరాధ రుసుము ప్రతిపాదనలను కమిషన్ తిరస్కరించింది. కెపాసిటర్ సర్ ఛార్జీలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంవల్ల చిన్న తరహా వినియోగదారులకు ఊరట కల్పించారు. ► 5 కోట్లకు మించి ఏ పనులు చేపట్టాలన్నా ట్రాన్స్కో, డిస్కమ్లు ఇక మీదట ఏపీఈఆర్సీ అనుమతి తీసుకోవాల్సిందే. ► వ్యవసాయ భూముల్లో విద్యుత్ లైన్లు వేసేప్పుడు పరిహారం తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ► చివరగా.. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొత్తగా పీపీఏలు చేసుకునే డిస్కమ్ల ప్రతిపాదనను ఏపీపీఆర్సీ తిరస్కరించింది. ఐదేళ్లుగా బాదుడే బాదుడు.. 2004 నుంచి 2009 వరకూ సీఎంగా ఉన్న వైఎస్సార్ హయాంలో విద్యుత్ ఛార్జీలు ఒక్కపైసా పెరగలేదు. అంతకుముందు 2003 వరకూ రైతులపై ఉన్న విద్యుత్ బకాయిలను కూడా వైఎస్ సర్కార్ రద్దు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. మూడుసార్లు ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఈ భారం రూ.2,178 కోట్లు. ఇది కాకుండా శ్లాబుల వర్గీకరణ, డిమాండ్ ఛార్జీల పేరుతో సాధారణ వినియోగదారులపైనే కాదు.. పరిశ్రమలపైనా పెద్దఎత్తున పరోక్షంగా విద్యుత్ భారం మోపింది. ఇది దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుంది. వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రజలపై పడిన విద్యుత్ ఛార్జీల భారం రూ.5వేల కోట్లపైనే. కానీ, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఒక్కపైసా పేదలపై భారం పడకుండా విద్యుత్ టారిఫ్ ప్రకటించడం విశేషం. -
అందుబాటు ధరల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదికలపై మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందుబాటు ధరల్లో అందించాలన్నదే ఏపీఈఆర్సీ లక్ష్యమని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకే ఏపీఈఆర్సీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్రజలపై భారం లేని టారిఫ్ అవసరమని వెల్లడించారు. అలాగే డిస్కంల ఆర్థిక పరిపుష్టిని పరిగణనలోనికి తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని మెరుగుపర్చి సుస్థిరత సాధించడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. కొనుగోలు వ్యయం తగ్గింపుపై దృష్టి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై ఏపీఈఆర్సీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. బొగ్గు, జల, పవన, సౌర విద్యుత్ వంటి వాటి విషయంలో హేతుబద్ధత, సాంకేతికత, మార్కెట్ ట్రెండ్ను పరిగణనలోనికి తీసుకుంటామని వివరించారు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలు నిర్వహణ వ్యయం తగ్గించడంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం వ్యయంపై విచక్షణతో కూడిన అదుపు ఉంచడంతోపాటు అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఏపీఈఆర్సీ ఇప్పటికే డిస్కంలను కోరిందని గుర్తుచేశారు. వినియోగదారులే కేంద్ర బిందువు ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు సేవల్లో నాణ్యత, విశ్వసనీయత కూడా ముఖ్యమని జస్టిస్ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ టారిఫ్లకు సంబంధించిన కసరత్తులో వినియోగదారులే కేంద్రబిందువుగా ఉంటారని వివరించారు. పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన విద్యుత్ నివేదికలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 8న ఏలూరు, 9న విజయవాడ, 10న కడప, 11న తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా విద్యుత్ ఉన్నతాధికారులు ఏపీఈఆర్సీకి అందుబాటులో ఉండాలని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశాలు జారీ చేశారు. -
'పవర్' ఫుల్ డిమాండ్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరగబోతోంది. ఈ ఏడాది (2019–2020) విద్యుత్ డిమాండ్ 68 వేల మిలియన్ యూనిట్లుగా ఉంది. 2023–24కు ఇది దాదాపు లక్ష మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) అంచనా వేశాయి. పగటిపూటే 9 గంటలు వ్యవసాయ విద్యుత్ అందించడం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఏటా పెంచాలని నిర్ణయించడం, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం ఏటా 20 శాతం పైబడి పెరిగే అవకాశం ఉండటంతో ఐదేళ్లలో వినియోగం ఇప్పుడు ఉన్నదాని కంటే 32 వేల మిలియన్ యూనిట్లు అధికంగా ఉండొచ్చని లెక్కగట్టాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కమ్లు అంచనాల (ఫోర్కాస్ట్)ను సమర్పించాయి. అందుబాటులోకి కొత్త ప్లాంట్లు కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో నిర్మాణ దశలో ఉన్న 1600 మెగావాట్ల (ఒక్కొక్కటి 800 మెగావాట్లు) థర్మల్ ప్లాంట్లు 2020లో అందుబాటులోకి వస్తాయి. 2021 నాటికి పోలవరం జల విద్యుత్ కేంద్రాల్లో కొంత ఉత్పత్తిలోకి రావచ్చని భావిస్తున్నారు. అప్పర్ సీలేరులో రివర్స్ పంపింగ్ విధానంలో జల విద్యుత్ కేంద్రం ప్రతిపాదన దశలో ఉంది. మరో రెండేళ్లలో ఇది పూర్తి అవుతుందని అంచనా వేశారు. అదేవిధంగా రాష్ట్రంలో న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ విద్యుత్ కోసం 10 వేల మెగావాట్లతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తోంది. ఈ అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో జెన్కో కీలక భూమిక పోషించే వీలుంది. ఫలితంగా వినియోగదారులకు చౌకగా విద్యుత్ లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీ జెన్కో స్పీడ్.. విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు ఏపీ జెన్కో సన్నద్ధమవుతోంది. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లు చౌకగా లభించే ఏపీ జెన్కో ఉత్పత్తిని పెంచాలని, ఇదే క్రమంలో ప్రైవేటు విద్యుత్ను తగ్గించాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం (2019–20)లో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4621.75 మెగావాట్లుగా ఉంది. 2023–24 నాటికి దీన్ని 6117.75 మెగావాట్లకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అదేవిధంగా జల విద్యుత్ను ప్రస్తుతమున్న 1755.86 మెగావాట్ల నుంచి 2023–24లో 2706.26 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకెళ్తారు. బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ లభించినప్పుడు జెన్కో థర్మల్ ఉత్పత్తికి విరామం ఇవ్వాలని, మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పుడు జెన్కో ఉత్పత్తిని వాడుకోవాలని ప్రణాళికలో పేర్కొన్నారు. -
విద్యుత్ చార్జీలు పెంచొద్దు
సాక్షి, అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చార్జీలు పెంచొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, వినియోగదారులపై భారం పడకుండా చూడాలని సీఎం సూచించినట్టు తెలిపారు. ఏపీ డిస్కమ్లు బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి 2020ృ21 వార్షిక ఆదాయ అవసర నివేదిక సమర్పించనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాదికి కావాల్సిన ఆదాయ, ఖర్చు వివరాలను ఏటా డిసెంబర్ మొదటి వారం కల్లా డిస్కమ్లు ఏపీఈఆర్సీకి సమర్పించాలి. దీనిపై కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, మార్చి 31 నాటికి కొత్త టారిఫ్ ఆర్డర్ను ప్రకటిస్తుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ప్రాతిపదికన రెండు డిస్కమ్లు వచ్చే ఏడాదికి రూ.47 వేల కోట్ల రెవెన్యూ అవసరమని లెక్కగట్టాయి. ఇందులో ప్రస్తుత టారిఫ్ ప్రకారం రూ.30 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని పేర్కొన్నాయి. మిగిలిన రూ.17 కోట్ల ఆర్థిక లోటును భర్తీ చేయాల్సి ఉందని కమిషన్కు స్పష్టం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2017 వరకూ ఏటా విద్యుత్ చార్జీలు పెరిగాయి. అయితే, ఈసారి ఒక్క పైసా కూడా చార్జీలు పెంచకుండా ప్రభుత్వం ముందే ఆదేశాలు ఇవ్వడం విశేషం. -
అవసరానికి మించి కొనుగోలు చేశారు
సాక్షి, అమరావతి: అవసరానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్ల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టపోతాయని గతంలోనే డిస్కమ్లు స్పష్టంగా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందని తొలిదశలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు, అయినప్పటికీ వీటిని అనుమతించడం వల్లే పంపిణీ సంస్థలు ఈ ఐదేళ్లలో భారీగా నష్టాన్ని మూటగట్టుకున్నాయని వివరించారు. రాష్ట్ర విద్యుత్రంగ పరిస్థితిపై ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి బుధవారం హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితి, ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, విద్యుత్ కొనుగోళ్ల గురించి ఆయనకు విద్యుత్ అధికారులు వివరించారు. కేంద్రం పెట్టిన లక్ష్యానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లు జరిగాయంటూ.. 2015–16లో 5 శాతం లక్ష్యమైతే 5.59 శాతం, 2016–17లో 8.6 శాతం కొనుగోలు చేశారని, 2017–18లో 9 శాతం తీసుకోవాల్సి ఉంటే 19 శాతం తీసుకున్నారని, 2018–19లో 11 శాతం లక్ష్యానికిగాను ఏకంగా 23.4 శాతం ప్రైవేటు పవన, సౌర విద్యుత్ తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 2015–16 నుంచి 2018–19 నాటికి విద్యుత్ సంస్థలపై రూ.5,497 కోట్ల అధిక భారం పడిందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు(ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లు) రూ.65 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు. 2016–17లో అధిక రేట్లకు 10,478 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారని, చౌకగా లభించే థర్మల్ విద్యుదుత్పత్తిని 2017–18లో 12,014 మిలియన్ యూనిట్లు, 2018–19లో 7,628 మిలియన్ యూనిట్ల మేరకు తగ్గించినందువల్ల విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందంటూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాన్ని ఏపీఈఆర్సీ ముందు పెట్టారు. గడచిన ఐదేళ్లలో కమిషన్ అనుమతించిన దానికన్నా అధికంగా విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని, ఆ మొత్తాన్ని(ట్రూ–అప్) కమిషన్కు సమర్పించలేదని, ఈ లోటును పూడ్చడానికి అడ్డగోలుగా అప్పులు చేసిన విషయాన్ని వారు వివరించారు. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. అవినీతిని అరికట్టాలి ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థల్లో అవినీతికి కళ్లెం వేయాలని డిస్కమ్ల సీఎండీలకు ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి సూచించారు. గ్రీవెన్స్ సెల్కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పురోగతిని వివరించాలని కోరారు. విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. కమిషన్ పెట్టిన పరిమితికి మించి అయ్యే ఖర్చు(ట్రూ ఆప్)ను ఎప్పటికప్పుడు ఏపీఈఆర్సీకి సమర్పించాలన్నారు. విద్యుత్రంగ వాస్తవ పరిస్థితిని ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశాన్ని జనవరిలో నిర్వహించాలని, ఇకపై ప్రతీ మూడు నెలలకోసారి ఈ భేటీని ఏర్పాటు చేయాలని కమిషన్ చైర్మన్ సూచించినట్టు చెప్పారు. రబీ సీజన్, వేసవిలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారన్నారు. సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు రఘు, రామ్మోహన్, ట్రాన్స్కో జేఎండీ చక్రధర్బాబు, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి, హరినాథ్ పాల్గొన్నారు. -
ఏపీఈఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్పర్సన్గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డిని గవర్నర్, ముఖ్యమంత్రి.. సన్మానించారు. పలు జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ బి.శేషశయనరెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ శంకరనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అనిల్కుమార్, ట్రాన్స్కో సీఎండీ శ్రీకాంత్, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, మాజీ అడ్వొకేట్ జనరల్ సీవీ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరికి మర్యాదపూర్వక ఫోన్ చేశారు. దీంతో ఆయన జస్టిస్ నాగార్జునరెడ్డిని హైకోర్టుకు ఆహ్వానించారు. నాగార్జునరెడ్డి గౌరవార్థం హైకోర్టులోనే తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులందరూ హాజరయ్యారు. దుర్గమ్మ సేవలో ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్పర్సన్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ నాగార్జునరెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో ఎంవీ సురేష్బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
-
ఏపీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ ప్రమాణ స్వీకరం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డికి గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్తో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, ట్రాన్స్కో సీఎండీ నాగుపల్లి శ్రీకాంత్, విద్యుత్శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వడ్డీల కోసం.. అప్పులు
సాక్షి, అమరావతి: అప్పు తీర్చడం మాట దేవుడెరుగు! అప్పుపై వడ్డీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే? గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇదే. ఫలితంగా ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కోలుకోలేని అప్పుల్లోకెళ్లాయి. గత ఐదేళ్లుగా విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి అంతా సవ్యంగా ఉందంటూ టీడీపీ సర్కారు చేసిన ప్రచారం ఉత్తదేనని తేలిపోతోంది. వాస్తవ గణాంకాలను గత సర్కారు ఏనాడూ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందుంచలేదు. తాజాగా అధికారులు చిట్టా తిరగేస్తే కళ్లు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. వాస్తవాలు కప్పిపుచ్చి.. ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టి టీడీపీ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా తెచ్చిన అప్పులకు ఏటా రూ.550 కోట్లు వడ్డీనే చెల్లించాల్సి వస్తోంది. ఈ వడ్డీ కోసం కూడా మళ్లీ అప్పులకు వెళ్లడం గత ప్రభుత్వ హయాంలో కనిపిస్తోంది. రోజువారీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లు వెల్లడవుతోంది. ఇవన్నీ కమిషన్ ముందుంచాలి. కానీ గత ఐదేళ్లుగా కమిషన్కు వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టారు. ఐదేళ్లలో రూ.5,838 కోట్ల అప్పు రాష్ట్ర విభజన నాటికి ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.2,998 కోట్ల పెట్టుబడి అప్పు (ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం), రూ.7,698 కోట్ల రోజువారీ అప్పు (వర్కింగ్ క్యాపిటల్) ఉంది. మొత్తం కలిపి అప్పు రూ.10,696 కోట్లుగా ఉంది. 2019 మార్చి నాటికి రూ.ఇది 16,534 కోట్లకు చేరింది. అంటే ఈ ఐదేళ్లల్లో రూ.5,838 కోట్లు కొత్తగా అప్పు చేశారు. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ రూ.7,698 కోట్ల నుంచి రూ.10,354 కోట్లకు పెరిగింది. గత ఐదేళ్లల్లో మూడుసార్లు ప్రత్యక్షంగా విద్యుత్ చార్జీల భారం మోపారు. శ్లాబుల వర్గీకరణతో ఎక్కువ మందికి అధిక విద్యుత్ చార్జీలు పడేలా పరోక్ష భారం వేశారు. దాదాపు రూ.5 వేల కోట్ల మేర ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే డిస్కమ్ల అప్పులన్నీ తీరి లాభాల్లో ఉండాలి. కానీ ఊహించని స్థాయిలో అప్పులు పెరిగాయి. కమిషన్ ముందుకు వాస్తవాలు ఏటా విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కమ్ల వాస్తవ ఆర్థిక పురోగతిని వివరించాలి. ఇలా చేయడం వల్ల అప్పులెందుకు చేస్తున్నారనే విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్ల కోసమే గత సర్కార్ ఎడాపెడా అప్పులు చేసిందనే నిజం బయటకొస్తుంది. ఈ కారణంగా వాస్తవ ఆర్థిక పరిస్థితిని కమిషన్ ముందుకు తేకపోవడంతో ప్రస్తుతం రూ.16 వేల కోట్లకు పైగా అప్పు కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని కమిషన్ ముందుంచాలని విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే వార్షిక ఆదాయ అవసర నివేదికలపై కసరత్తు చేపట్టారు. ఇక మీదట అప్పులను తగ్గించుకుని ఉన్నవాటి నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా తోడ్పాటు ఇస్తుందని అధికారులు ఆ«శిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఖరీదుతో విద్యుత్ కొనుగోళ్లను ఆపేశారు. పవన, సౌర విద్యుత్ ధరలను పునఃసమీక్షించే దిశగా కసరత్తు మొదలు పెట్టారు. బొగ్గు, ఇతర కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టి అనవసర ఖర్చులను తగ్గిస్తున్నారు. వీలైనంత వరకూ డిస్కమ్లను అప్పుల నుంచి ఒడ్డున పడేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. సకాలంలో ఏఆర్ఆర్లు: శ్రీకాంత్ (ఇంధనశాఖ కార్యదర్శి) డిస్కమ్ల ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలను సకాలంలో ఏపీఈఆర్సీ ముందుంచుతామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. అప్పులకు వడ్డీలు చెల్లించడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని, దీని నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. విద్యుత్ సంస్థల్లో ఇప్పటికే ఆర్థిక నియంత్రణ కొనసాగుతోందని, రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టుల్లో ప్రజాధనం ఆదా చేస్తున్నామన్నారు. -
దోపిడీకి ‘పవర్’ఫుల్ బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల పేరిట సాగుతున్న దోపిడీకి కళ్లెం వేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ప్రజలకు చౌకైన విద్యుత్ ఇవ్వాలన్న సర్కారు లక్ష్యానికి అత్యున్నత న్యాయస్థానం తీర్పు బలాన్నిచ్చింది. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి(ఏపీఈఆర్సీ) అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిపుణులు స్వాగతిస్తున్నారు. ఆరు నెలల్లో కమిషన్ విచారణ పూర్తయి, కొత్త టారిఫ్ ఇచ్చే వరకూ పవన విద్యుత్ ధర యూనిట్కు రూ.2.43 చొప్పున చెల్లించాలని సూచిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఏపీఈఆర్సీ ముందు తమ వాదన బలంగా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం సూచించిన దానికన్నా అధికంగా కొనుగోలు గత ప్రభుత్వం పవన విద్యుత్కు అత్యధిక ధర చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో పవన విద్యుత్ కొనుగోలును ప్రోత్సహించింది. దీనికోసం తక్కువ ధరకు లభించే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్కు సైతం కోత పెట్టారు. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లను అడ్డగోలుగా ప్రోత్సహించడం వల్ల గత ఐదేళ్లలో విద్యుత్ సంస్థలపై(డిస్కంలు) రూ.5,497.3 కోట్ల అదనపు భారం పడింది. మార్కెట్లో థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.4.20కే లభిస్తోంది. కానీ, పవన విద్యుత్ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో పవన, సౌర విద్యుత్ కలిపి 13,142 మిలియన్ యూనిట్లు ఉంటోంది. ఇందులో పవన విద్యుత్ వాటా 9,000 మిలియన్ యూనిట్లు. పవన విద్యుత్ అంశంలో ఎవరి పాత్ర ఎంత? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రైవేటు విద్యుత్ దోపిడీ నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రైవేటు సంస్థల నుంచి కరెంటు కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీలోనే పవన విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. కరెంటు కొనుగోళ్ల పేరిట సాగుతున్న దోపిడీని అరికట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను పవన విద్యుత్ ఉత్పత్తిదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర స్థాయిలో రాష్ట్రానికి లేఖలు రాయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టులో ప్రభుత్వం బలమైన వాదనలు విన్పించగలిగింది. పవన విద్యుత్ వల్ల వినియోగదారులకు జరిగే నష్టమేంటో చెప్పడంలో సఫలమైంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి విద్యుత్ అధికారులతో భేటీ అయ్యారు. పవన విద్యుత్ విషయంలో శాస్త్రీయ వాదనను ఏపీఈఆర్సీ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పరిమితికి మించి పవన విద్యుత్ను ప్రోత్సహించడంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలోనూ ఆయన విచారణ చేపట్టారు. ఇప్పటికే కొందరు అధికారులకు సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. అధికారులపై ఎవరి ఒత్తిడి పనిచేసిందనే విషయాలను రాబడుతున్నారు. న్యాయ విచారణ చేపట్టాలి ‘‘హైకోర్టు తీర్పు హర్షణీయం. కాంపిటీటివ్ బిడ్డింగ్కు వెళ్లకుండా యూనిట్ రూ.4.84 చొప్పున జనరిక్ టారిఫ్ ఇవ్వడానికి ఏపీఈఆర్సీ ఎందుకు సాహసిందనేది తేల్చాల్సి ఉంది. దీని వెనుక ఎవరికి ఎలాంటి మేలు జరిగింది? అనేది బయటపడాలి. గత ఐదేళ్లలో జరిగిన పవన విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ చేపట్టాలి.’’ – వేణుగోపాల్, విద్యుత్ రంగ విశ్లేషకులు వినియోగదారులకు మేలు ‘‘పవన విద్యుత్ ధరను యూనిట్కు రూ.2.43కు తగ్గిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది. విద్యుత్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం సాహసోపేతంగా అడుగులు వేయడం అభినందనీయం’’ – వేదవ్యాస్, ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీపీఏలను తప్పకుండా సమీక్షించాలి ‘‘విద్యుత్ సంస్థలను బతికించాలన్న నిజాయతీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. పవన విద్యుత్ ధరలను సమీక్షించాలన్న ఆలోచనను ప్రజల కోణం నుంచి చూడాలి. కేంద్రంతో సహా ఎవరు అడ్డుపడ్డా ప్రజలకు నష్టమే. అవసరం ఉందా లేదా అనేది చూడకుండా, వ్యక్తుల అవసరాల కోసమే చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) తప్పకుండా సమీక్షించాలి. – టీవీ రావు, జన విజ్ఞాన వేదిక, జాతీయ ప్రధాన కార్యదర్శి -
ప్రతీ ప్రాజెక్టులోనూ ముడుపులే..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతీ విద్యుత్ ప్రాజెక్టులోనూ అవినీతి వరదలై పారిందనే విమర్శలొచ్చాయి. 2015లో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు (టాటాకు), నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు(బీజీఆర్) 800 మెగావాట్ల విస్తరణ కాంట్రాక్టుల్లో రూ.2,600 కోట్ల మేర ఎక్కువ అంచనాలు వేసి దోచుకున్నట్టు తీవ్ర ఆరోపణలొచ్చాయి. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మెగావాట్ రూ.5.8 కోట్లకే ఈపీసీ కాంట్రాక్టులు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇదే తరహా ప్రాజెక్టులకు ఏకంగా మెగావాట్కు రూ.6.2 కోట్ల మేర కట్టబెట్టింది. పైగా ఈ రెండు సంస్థలకే కాంట్రాక్టులు ఇచ్చేందుకు వారికి అనుకూలంగా నిబంధనలు పెట్టడం విమర్శలకు దారి తీసింది. అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఏర్పాటు చేసిన 500 మెగావాట్ల సోలార్ కాంట్రాక్టు పనుల్లోనూ రూ.500 కోట్ల మేర చేతివాటం బహిర్గతమైంది. ఇక్కడ ఎన్టీపీసీ నిబంధనలకు విరుద్ధంగా మూడు కాంట్రాక్టు సంస్థలకు అధిక రేట్లకు కాంట్రాక్టు ఇవ్వడంపై పలు విమర్శలొచ్చాయి. ట్రాన్స్కో విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల ఏర్పాట్లలో అంతులేని అవినీతి తేటతెల్లమైంది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. నన్నూరు–జమ్మలమడుగు 400 కేవీ లైన్కు సంబంధించి రాయి పడినట్టు టాటా సంస్థ తప్పుడు బిల్లులు పెట్టింది. ఇందులో జరిగిన రూ.10 కోట్ల అవినీతిలో పెద్దల భాగస్వామ్యం ఉందని విజిలెన్స్ విభాగం కూడా నిర్థారించింది. ప్రైవేటు పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి వరదపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ లేకున్నా 2 వేల మెగావాట్ల పవన, సౌర విద్యుత్ను ఏకంగా 25 ఏళ్లకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, దీనివల్ల రూ.35 వేల కోట్ల నష్టం జరుగుతుందని విద్యుత్ వర్గాలు ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు. మొదట్లో ఈ విద్యుత్ వద్దంటూ అభ్యంతరం చెప్పిన ప్రభుత్వం.. కేవలం మూడు నెలల్లోనే మళ్లీ కావాలని ఏపీఈఆర్సీకి తెలపడం విశేషం. ముఖ్యమంత్రితో రాయబారం జరిగిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. -
విచారణ అధికారం సీఈఆర్సీకే ఉంది..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్ పంపిణీ సంస్థలు, విద్యుత్ ఉత్పాదన సంస్థల మధ్య నెలకొన్న వివాదాలపై విచారణ జరిపే అధికార పరిధి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) లేదా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) లేదా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)లలో ఎవరికి ఉందన్న అంశంపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. మూడేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థలు, విద్యుత్ ఉత్పాదన సంస్థల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం సీఈఆర్సీకే ఉందని తేల్చి చెప్పింది. వివాదాలకు సంబంధించి ఏపీఈఆర్సీ, టీఎస్ఈఆర్సీలు వేర్వేరుగా జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అలాగే సీఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇదీ వివాదం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెలుపల, లోపల ఉన్న పలు విద్యుత్ ఉత్పాదన, పంపిణీ సంస్థలు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్ఈబీ)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నాయి. 2006–13 మధ్య కాలంలో ఉత్పాదన, పంపిణీ సంస్థల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజనకు ముందు ఈ వివాదాలపై ఏపీఈఆర్సీ విచారణ చేపట్టింది. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో తెలంగాణ టీఎస్ఈఆర్సీని ఏర్పాటు చేసింది. ఏపీ కూడా పాత ఈఆర్సీ స్థానంలో కొత్త ఈఆర్సీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పీపీఏ వివాదాలకు సంబంధించిన కేసులను ఎవరు విచారించాలన్న అంశంపై ఏపీఈఆర్సీ, టీఎస్ఈఆర్సీ, విద్యుత్ పంపిణీ, ఉత్పాదన సంస్థల మధ్య వివాదం చెలరేగింది. ఇది సీఈఆర్సీకి చేరింది. ఈ వివాదంపై విచారణ జరిపే పరిధి తమకే ఉందని సీఈఆర్సీ 2015లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఏపీఈఆర్సీ, టీఎస్ఈఆర్సీ జారీ చేసిన పలు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా దాఖలైన మొత్తం 16 పిటిషన్లపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. సీఈఆర్సీ వాదనే సబబు.. ‘ఒకే అంశంపై ఏక కాలంలో విచారణ జరిపే పరిధి విద్యుత్ నియంత్రణ మండళ్లకు లేదు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే అంశాలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల పరిధిలోకి రావు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విద్యుత్ ఉత్పాదన, అమ్మకం ఉమ్మడి పథకమైంది. రాష్ట్ర విభజనకు ముందు ఆ వివాదాలపై ఏపీఈఆర్సీకి విచారణాధికారం ఉండేది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లు ఏపీకి వెళ్లగా, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లు తెలంగాణకు వచ్చాయి. దీంతో ఈ వివాదాలన్నీ అంతర్రాష్ట్ర వివాదాలయ్యా యి. కాబట్టి ఈ వివాదాలకు సంబంధించిన ఏపీఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు కావు. టీఎస్ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులు కూడా చెల్లుబాటు కావు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను టీఆఎస్ఈఆర్సీ రెండు భాగాలుగా విభజించింది. ఒక భాగం వివాదాలను తాను నిర్ణయిస్తే, మరో భాగం వివాదాలను మరో రాష్ట్రం నిర్ణయిస్తుందని భావించింది. ఏపీఈఆర్సీ ఏపీ పునర్విభజన చట్టం కింద తనకు మిగిలిన అధికారాలను బట్టి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతోంది. టీఎస్ఈఆర్సీ వివాదాన్ని రెండు భాగాలుగా విభజించి, ఆ మేర ఉత్తర్వులు జారీ చేసినట్లు వాదిస్తోంది. వాస్తవానికి ఈ రెండూ వాదనలు తప్పు. ఈ మొత్తం వ్యవహారం రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి వాటిపై విచారణ జరిపే అధికార పరిధి తమకే ఉందన్న సీఈఆర్సీ వాదనే సరైంది. అందువల్ల ఏపీఈఆర్సీ, టీఎస్ఈఆర్సీలు తమ ముందున్న కేసులన్నింటినీ సీఈఆర్సీకి బదలాయించాలి’అని ధర్మాసనం పేర్కొంది. -
కొత్త రకం కరెంట్ 'షాక్'
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ తన ఇంటికి 2002లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. అప్పుడున్న ఉపకరణాల ప్రకారం ఆయన ఇంటికి ఒక కిలోవాట్ విద్యుత్ లోడు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. కూలర్లు, ఫ్రిజ్, మోటార్.. ఇలా క్రమంగా అనేక ఉపకరణాలు ఇంట్లో చేరాయి. దీంతో కరెంట్ బిల్లు అనేక రెట్లు పెరిగింది. అయితే, ఇప్పుడు విద్యుత్ అధికారులొచ్చి.. నీ వాడకం లోడ్ మూడు కిలో వాట్లు దాటిందంటున్నారు. నెల రోజుల్లో రూ.1800 అపరాధ రుసుం కట్టాలని చెప్పారు. లేకుంటే రూ.10 వేలకు పైగా ఫైన్ తప్పదని హెచ్చరించారు. తిరుపతి పట్టణం తిరుచానూరులోని సంజయ్ ఇంటికి 2001లో విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అప్పట్లో నెలకు రూ.50 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.700 వరకూ వస్తోంది. లోడ్ నాలుగు రెట్లు పెరిగిందని అధికారులు అంటున్నారు. కిలోవాట్కు రూ.600 చొప్పున.. 4 రెట్లు జరిమానా కట్టాలని తెలిపారు. లేదంటే నెల తర్వాత ఫైన్ తప్పదని హెచ్చరించారట. .. ఈ ఇద్దరే కాదు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల విద్యుత్ వినియోగదారులకు ఇదే షాక్. అదనపు లోడ్ పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ వసూళ్లకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి కూడా లభించింది. దీంతో అదనపు లోడ్ను బలవంతంగా వసూలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించబోతున్నారు. నెల రోజుల వ్యవధిలో ప్రస్తుత లోడ్ను వినియోగదారులే స్వచ్ఛందంగా ప్రకటించాలని.. లేనిపక్షంలో గడువు ముగిశాక, తనిఖీలు చేసి, భారీగా జరిమానాలు విధించే వీలుందని చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రతీ విద్యుత్ వినియోగదారుడు ఉన్నట్టుండి అదనంగా రూ.1200 నుంచి రూ.3 వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 48 లక్షల మంది పేదలకు సగటున రూ.600 వరకూ భారంపడే వీలుంది. ఏంటీ అదనపు లోడ్? చాలామంది విద్యుత్ వినియోగదారులు రెండు దశాబ్దాల క్రితమే కరెంట్ కనెక్షన్లు తీసుకున్నారు. అప్పట్లో మహా అయితే నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, చిన్నాచితకా విద్యుత్ ఉపకరణాలుండేవి. ఒక బల్బు 100 వాట్లు.. ఫ్యాన్ 70 వాట్లు.. ఇతర ఉపకరణాలన్నీ కలుపుకున్నా మొత్తం వాడకం 500 వాట్ల కన్నా ఎక్కువ ఉండదు. వీటిని పరిగణలోనికి తీసుకుని ఆ ఇంటికి విద్యుత్ లోడ్ ఒక కిలోవాట్ (వెయ్యి వాల్టులు) ఉంటుందని లెక్కగట్టారు. కాలక్రమంలో ఫ్రిజ్, మిక్సీ, కుక్కర్, వాషింగ్ మిషన్, వాటర్ హీటర్, గీజర్, ఏసీ, 1 హెచ్పి మోటర్.. ఇలా అనేకం ఇంట్లో చేరాయి. నిజానికి ఇవన్నీ వాడటంవల్ల ప్రతీనెలా కరెంట్ బిల్లూ పెరుగుతోంది. కరెంట్ వాడకం పెరిగే కొద్దీ శ్లాబుల పేరుతో బిల్లూ పెరుగుతుంది. అంతిమంగా సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా నెలకు రూ. 500పైన కరెంట్ బిల్లు రావడం మామూలైంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. వాడే ప్రతీ ఉపకరణాన్ని పరిగణలోనికి తీసుకుని లోడ్ను లెక్కిస్తున్నారు. మీరు కనెక్షన్ తీసుకున్నప్పుడు కిలోవాట్ లోడ్కే అనుమతి తీసుకున్నారని, ఇప్పుడు నాలుగు కిలోవాట్ల లోడ్ వాడుతున్నారని అధికారులు అంటున్నారు. ఇది విద్యుత్ చట్టానికి వ్యతిరేకమని.. దీనికి జరిమానా చెల్లించాలనేది విద్యుత్ పంపిణీ సంస్థల వాదన. ఇదే విషయాన్ని ఏపీఈఆర్సీ ముందూ విన్పించి అనుమతి తీసుకున్నారు. బిల్లు కట్టినా.. నేరస్తులేనా? విద్యుత్ వినియోగదారుడు ప్రతీనెలా వాడుకునే కరెంట్కు బిల్లు చెల్లిస్తున్నాడు. అతనికి అది మాత్రమే తెలుసు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు లోడ్ ఎంత? ఇప్పుడెంత పెరిగిందనేది ఎవరికీ తెలియదు. వాడకం పెరిగింది. బిల్లు పెరిగింది. అదే కట్టామని వినియోగదారులు అంటున్నారు. ఇంకా ఈ లోడ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఉన్నట్టుండి అదనపు లోడ్ అంటూ విరుచుకుపడటంతో వినియోగదారులు విస్తుబోతున్నారు. స్మార్ట్ మీటర్తో ఇట్టే పట్టేస్తారు.. ప్రస్తుతం గృహ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తున్నారు. దానిని మీటర్ స్క్రీన్కు చూపిస్తే బిల్లు జనరేట్ అవుతోంది. నెల రోజుల్లో ఎక్కువ లోడ్ ఎప్పుడు వినియోగించుకుంటే దాన్నే పరిగణనలోకి తీసుకుని అదనపు లోడ్ను నిర్ణయించనున్నారు. నెలలో ఏ ఒక్క రోజైనా తాము తీసుకున్న ఒక కిలోవాట్ లోడ్ కన్నా అదనపు లోడ్తో విద్యుత్ను వినియోగించుకుంటే అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుందని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 1.25 కోట్ల గృహ వినియోగదారులకు సరాసరి ఒక కిలోవాట్ చొప్పున అదనపు లోడ్ను క్రమబద్ధీకరించినా కిలోవాట్కు రూ.600 చొప్పున రూ.750కోట్లు విద్యుత్ సంస్థలకు ఆదాయం రానుంది. -
రూ.6,030 కోట్ల లోటు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.6,030 కోట్ల లోటు ఉంటుందని ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అంచనా వేసింది. విద్యుత్తు సరఫరా చార్జీల టారిఫ్ ఉత్తర్వులను మంగళవారం హైదరాబాద్లో ఏపీఈఆర్సీ విడుదల చేసింది. వివరాలను ఏపీఈఆర్సీ సభ్యులు పి.రఘు, పి.రామ్మోహన్తో కలసి చైర్మన్ జస్టిస్ జి.భవానీప్రసాద్లు మీడియా సమావేశంలో వివరించారు. ‘‘వచ్చే ఆర్థిక సంవత్సరం(2018–19)లో రూ.7,983 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు గతేడాది డిసెంబర్ 1న నివేదికలు సమర్పించాయి. వీటిని విశ్లేషించాక వార్షిక లోటు రూ.6,030 కోట్లు ఉంటుందని (డిస్కంలు సమర్పించిన దానిలో రూ.1,953 కోట్లు తగ్గించి) ఏపీఈఆర్సీ అంచనా వేసింది. డిస్కంల లోటును వివరిస్తూ సబ్సిడీగా ఎంత భరిస్తుందో తెలపాలంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించాం. మొత్తం రూ.6,030 కోట్ల లోటును సబ్సిడీ రూపంలో ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరం అమల్లో ఉన్న విద్యుత్తు చార్జీలు, ఇతర రుసుములనే 2018–19లోనూ కొనసాగించాలని నిర్ణయించి ఉత్తర్వులిచ్చాం’ అని జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. టారిఫ్ ఉత్తర్వుల్లోని ముఖ్యమైన అంశాలు... - ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులతో సమానంగా నర్సరీ రైతులకు కూడా వచ్చే సంవత్సరం నుంచి ఉచిత విద్యుత్ వర్తిస్తుంది. నర్సరీలవారు చెల్లించాల్సిన బకాయిల రద్దు. ఇందుకోసమయ్యే రూ.4 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. - వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్. - 2017–18లో రూ.3,700 కోట్లుగా ఉన్న సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.6,030.17 కోట్లకు పెరుగుతుంది. - రాత్రి 10 నుంచి ఉదయం 6 దాకా హెచ్టీ పరిశ్రమలు వాడే విద్యుత్కు యూనిట్కు రూ.1 చొప్పున రాయితీ. - ఆక్వా మేత కలుపు కర్మాగారాలకు రాయితీ టారిఫ్ యూనిట్కు రూ.4.89 ఉంటుంది. - ప్రింటింగ్ ప్రెస్లను 2011–12 నుంచి ఎల్టీ–2 వాణిజ్య కేటగిరీగా పేర్కొన్నప్పటికీ ఎల్టీ–3 పరిశ్రమల కేటగిరీ కింద బిల్లులు జారీ చేశారు. ఇప్పుడు పొరపాటు గుర్తించి ఎల్టీ వాణిజ్య కేటగిరీ కింద ఆరేళ్ల బకాయిలు చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. ఇది సరికానందున పునఃపరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని ఏపీఈఆర్సీ డిస్కంలను ఆదేశించింది. - స్మార్ట్ మీటర్లు సొంతంగా అమర్చుకునే గృహ వినియోగదారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు వాడుకునే విద్యుత్కు యూనిట్కు రూపాయి తగ్గింపు. - తక్షణావసరాలకు విద్యుత్ కొనాలంటే కారణాలతో వెంటనే మండలికి తెలపాలని ఆదేశాలు జారీ. స్వల్పకాలిక కొనుగోళ్లను కనీస స్థాయికి పరిమితం చేయాలని, దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్లను క్రమపద్ధతిలో నియంత్రించాలని స్పష్టీకరణ. హెచ్టీ లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్లపై త్వరలో నిర్ణయం.. గతంలో హెచ్టీ లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్లు ఉండేవి. 2010–11లో పవర్ కట్స్, ఇతర కారణాలవల్ల లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్లు రద్దు చేశారు. దీనిని మళ్లీ పునరుద్ధరిద్దామా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అభిప్రాయాలతో నివేదిక సమర్పించాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
చౌక వద్దు.. వృథాయే ముద్దు
సాక్షి, అమరావతి: అవసరం లేకపోయినా మార్కెట్కి వెళ్లి ఏమన్నా కొనుక్కొచ్చేస్తామా? అదీ పక్క షాపులో తక్కువకే దొరుకుతున్నా రెట్టింపు కన్నా ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేస్తామా? అసలు అలా కొనుక్కురావద్దని కుటుంబంలో తీర్మానించుకున్నాక కూడా కొంటున్నామంటే అర్ధమేమిటి? ఏదో మతలబు ఉందనేగా అర్ధం.. ఇలా చేస్తే మనలని ఏమంటారు. అదే ఒక రాష్ట్రప్రభుత్వం వేల కోట్లరూపాయల విలువ చేసే వ్యవహారాలను ఇలా నడుపుతున్నదనుకోండి దానినేమంటారు? పవనవిద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్రప్రభుత్వ తీరు చూసిన వారు నివ్వెరపోతున్నారు. నష్టదాయకం కాబట్టి పవన ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు’ వద్దని విద్యుత్ నిపుణులు ప్రభుత్వానికి 03.03.2017న లిఖితపూర్వకంగా నివేదించారు. అప్పటికి రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ అది తాత్కాలికమేనని తర్వాత తెలిసింది. అంతా సద్దుమణిగాక పవన విద్యుత్ పీపీఏలకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. అదీ రెట్టింపుకన్నా అధికధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్లో తక్కువకే పవనవిద్యుత్ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్ కొరత ఉందా అంటే లేదు. సమీప భవిష్యత్లో కొరత వచ్చే సూచనలూ లేవు. అయినా ఈ అడ్డగోలు కొనుగోలు ఒప్పందాల వెనక ఉన్న మతలబేమిటి? 41 పీపీఏలకు ఆమోదం.. విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 41 పీపీఏలకు అనుమతిం చింది. రాష్ట్రంలో విద్యుత్కు డిమాండ్ ఏమాత్రం పెరగలేదు. కొరతనేదే లేదు. అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్గా ఇలా పవన విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధం కావటంపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దీనివల్ల పెద్దఎత్తున భారం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఇంధన శాఖ మనసు మార్చుకుని కొనుగోలుకు పచ్చజెండా ఊపడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని వినిపిస్తోంది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పొరుగున ఉన్న కర్నాటక సహా అనేక రాష్ట్రాలు ఇలాంటి నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. యూనిట్ రూ.2.43కే అందుబాటులో ఉన్నా... మన రాష్ట్రంలో పవన విద్యుత్ ఏడాదికి 6 వేల మిలియన్ యూనిట్లకుపైగా ఉత్పత్తి అవుతోంది. వాస్తవానికి 2014 తర్వాత పవన విద్యుత్ ఉత్పత్తిలో పోటీ వచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. గుజరాత్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఇటీవల ఓపెన్ బిడ్డింగ్కి పిలవగా పవన విద్యుత్ యూనిట్ రూ. 2.43 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేపీ ఎనర్జీ లిమిటెడ్ రూ. 2.43 కే సరఫరా చేస్తామని ముందుకొచ్చాయి. అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశం ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ. 4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు తాజా పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్కు రూ.2.41 చొప్పున అధికంగా చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు íసిద్ధమైందన్నమాట. అదనంగా దోచిపెట్టేది రూ. 11,625 కోట్లు.. ఈ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. 41 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తారు. ఒక్కో మెగావాట్కు 2.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. 840 మెగావాట్లకు 1,932 మిలియన్ యూనిట్ల విద్యుత్ను డిస్కమ్లకు ప్రైవేట్ సంస్థలు అంటగడతాయి. ఒక్కో యూనిట్కు అదనంగా రూ. 2.41 చెల్లించటం ద్వారా 1,932 మిలియన్ యూనిట్లకు ఏటా రూ. 465 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 465 కోట్లు అంటే.. 25 ఏళ్లకు చెల్లించే అదనపు వ్యయం రూ.11,625 కోట్లు అన్నమాటేగా.. భారీగా ముట్టిన ముడుపులు? ఎలాంటి బిడ్డింగ్లు లేకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు రూ. 11,625 కోట్లు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎందుకు సిద్ధమౌతోంది? దీని వెనక భారీగా ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందని వినిపిస్తోంది. విద్యుత్ ఉత్పత్తిదారులు ముఖ్యమంత్రిని కలిసిన తరువాత ప్రైవేట్ పవన విద్యుత్తు కొనుగోలుకు అంగీకరించటం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అసలు అదనపు విద్యుత్ అవసరమేమిటి? రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్ యూనిట్లు దాటలేదు. 2018–19పై కూడా డిస్కమ్లు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్ యూనిట్ల అవసరం ఉంటుందని అతిగా అంచనా వేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్ను తట్టుకునేందుకు ఏపీ జెన్కో థర్మల్, హైడల్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే థర్మల్ ద్వారా 96 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 48 మిలియన్ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్ ద్వారా 17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. వీటి ద్వారా యూనిట్ విద్యుత్తు సగటున రూ. 3.50 లోపే లభిస్తుంది. డిమాండ్ కన్నా ఇంకా ఐదు మిలియన్ యూనిట్లు మిగులు ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు డిమాండ్ లేకుండా విద్యుత్తు కొనుగోలు చేసి ఏం చేస్తారనే ప్రశ్నకు జవాబు లేదు. రైటప్లు 1.. ఏపీఈఆర్సీ ఉత్తర్వులో పీపీఏలు కుదిరినట్లు తెలిపే భాగాలు.. 2. పవన విద్యుత్ పీపీఏలను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ 03.03,2017న ఏపీఈఆర్సీ సెక్రటరీకి ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ నుంచి అందిన లేఖ. 3. పవన విద్యుత్ డెవలపర్లతో పీపీఏలు కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ నుంచి ఏపీఈఆర్సీ సెక్రటరీకి అందిన లేఖ 4. గుజరాత్లో పవన విద్యుత్ ధరలు భారీగా తగ్గిపోయాయని 21.12.2017న వచ్చిన వార్తా కథనం. -
మధ్యతరగతికి షాక్ఇచ్చిన చంద్రబాబు
-
మధ్యతరగతికి కరెంట్ షాక్
రూ.800 కోట్ల విద్యుత్ చార్జీల వడ్డన - 2017–18కి కొత్త టారిఫ్ విడుదల - పరిశ్రమలపై ఫిక్స్డ్ చార్జీల భారం - నేటి నుంచే పెరిగిన చార్జీలు అమలు - చంద్రబాబు హయాంలో మూడోసారి చార్జీల పెంపు - మూడేళ్లలో రూ.5 వేల కోట్ల బాదుడు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా విద్యుత్ చార్జీలు పెంచింది. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా చేసుకుంది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పరిశ్రమలకు ఫిక్స్డ్ చార్జీలు రెట్టింపు చేసింది. చిరు వ్యాపారులు, వాణిజ్య వర్గాలకూ భారీగా వడ్డించింది. మొత్తం మీద రూ.800 కోట్ల అదనపు భారం మోపింది. కొత్తగా పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెరగడం ఇది మూడోసారి. ఈ మూడేళ్ళలో సుమారు రూ.2 వేల కోట్లు ప్రత్యక్షంగా వడ్డించారు. మరో రూ.3 వేల కోట్ల మేరకు ప్రజలపై దొడ్డిదారిన భారం మోపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్లో 2017–18 సంవత్సరానికి కొత్త టారిఫ్ను ప్రకటించింది. వాస్తవానికి టారిఫ్ ఆర్డర్ వారం రోజుల క్రితమే తయారైంది. శాసనసభలో విపక్షం చార్జీల పెంపుపై తప్పకుండా నిలదీస్తుందనే ఉద్దేశంతో శుక్రవారం శాసనసభ వాయిదా పడిన వెనువెంటనే చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు. 2017–18లో రూ.8,065 కోట్ల ఆర్థిక లోటును విద్యుత్ పంపిణీ సంస్థలు సూచించాయి. ఈ మొత్తంలో రూ.1,111 కోట్లు ప్రజల నుంచి చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని, రూ.6,954 కోట్లు సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించాయి. అయితే ప్రభుత్వం సబ్సిడీగా కేవలం రూ.3,700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. అయితే డిస్కమ్లు ప్రతిపాదించిన మొత్తంలో ఏపీఈఆర్సీ కొంత కోత విధించింది. ప్రత్యక్షంగా చార్జీల రూపంలో రూ.800 కోట్ల మేర రాబట్టుకునేందుకే అనుమతించింది. అయితే పరిశ్రమలు, వాణిజ్యవర్గాలపై పెరిగే విద్యుత్ చార్జీల భారం..పరోక్షంగా సర్వీస్ చార్జీల రూపంలో పేద, మధ్యతరగతి వర్గాలపై అదనంగా పడనుంది. 225 యూనిట్లు దాటితే బాదుడే! గృహ విద్యుత్ వినియోగం నెలకు 225 యూనిట్లు దాటితే బిల్లు మోత మోగుతుంది. ఏడాదికి 2,700 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉన్నవారిని గ్రూప్ సీ కేటగిరీ కిందకొచ్చారు. మధ్యతరగతి వర్గం వారు ఏడాదికి 2,700 యూనిట్లకు మించి అంటే నెలకు 225 యూనిట్లకు మించే వినియోగించే అవకాశం ఉంది. వీరికి తొలుత ప్రతి 50 యూనిట్లకు, తర్వాత ప్రతి వంద యూనిట్లకు విద్యుత్ చార్జీ మారుతుంది. ఉదాహరణకు నెలకు 500 యూనిట్లు విద్యుత్ వినియోగం ఉందనుకుంటే, 0–50 యూనిట్లకు రూ. 2.68 ఉంటుంది. ఇది 401 నుంచి 500 యూనిట్లకు వెళ్తే యూనిట్ రూ. 9.06 చొప్పున వసూలు చేస్తారు. మధ్యతరగతి విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వారి నుంచి అధిక ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే సాధారణ వినియోగాన్ని లెక్కిస్తే... ఆరు బల్బులకు నెలకు 60 యూనిట్లు, నాలుగు సీలింగ్ ఫ్యాన్లకు 50 యూనిట్లు, వాషింగ్ మిషన్కు 50 యూనిట్లు, మిక్సీకి 40, వాటర్ పంపుకు 132 యూనిట్లు విద్యుత్ వినియోగం ఉంటుంది. దీనికే 332 యూనిట్లు అవుతుంది. వేసవి కాలంలో ఏసీ, కూలర్ వినియోగిస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన దాదాపు 50 లక్షల మధ్యతరగతి, కిందిస్థాయి మధ్య తరగతి వర్గాలపై భారీగా విద్యుత్ చార్జీలు పడే వీలుంది. దీనికి తోడు ఈ కేటగిరీకి నెలకు రూ.10 కస్టమర్ చార్జీ కూడా విధించారు. మొత్తం మీద ఈ వర్గానికి 3 శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచారు. పరిశ్రమలపై ఫిక్స్డ్ భారం పరిశ్రమలపై పరోక్ష భారం మోపారు. ప్రతి కిలోవాట్కు కేవలం రూ.200 ఉన్న ఫిక్స్డ్ చార్జీని రూ.475కు పెంచారు. దీనివల్ల పరిశ్రమలపై కోట్ల రూపాయల్లో అదనపు భారం పడే వీలుంది. వాస్తవానికి ఇప్పటికే పరిశ్రమలు వాడినా, వాడకున్నా ఏడాదికి 6,750 యూనిట్లకు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మోపిన అదనపు భారం వల్ల విద్యుత్ చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ ప్రధాన వనరుగా నడిచే పరిశ్రమలు ఇప్పటికే చాలావరకు మూత పడ్డాయి. తాజాగా పెంచిన విద్యుత్ చార్జీల వల్ల పరిశ్రమలపై ఆర్థిక భారం మరింత పెరిగే వీలుందని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. అక్వా, పౌల్ట్రీ, చెరకు క్రషింగ్, పుట్టగొడుగులు, ఫ్లోరీ కల్చర్కు కూడా 3 శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచారు. మూడేళ్ళుగా బాదుడే బాదుడు.... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ళుగా ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. 2015–16లో రూ. 984 కోట్ల మేర ప్రజలపై భారం మోపారు. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో 2016–17లో సర్కారు దొంగదెబ్బ తీసింది. ప్రత్యక్షంగా రూ.242 కోట్ల భారం మోపి, శ్లాబుల వర్గీకరణతో మరో రూ.1,200 కోట్లు దొడ్డిదారిన ప్రజల జేబుకు చిల్లు పెట్టింది. తాజాగా రూ. 800 కోట్ల భారం వేసింది. పరోక్షంగా ఫిక్స్డ్ చార్జీల రూపంలో రూ.1,800 కోట్ల భారం మోపింది. పెంపు అనివార్యం: భవానీ ప్రసాద్ విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమని ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ అన్నారు. అయితే 92 శాతం వినియోగదారులపై పెంపు ప్రభావం ఉండదన్నారు. కమిషన్ కార్యాలయంలో టారిఫ్ విడుదల సందర్భంగా ఏపీఈఆర్సీ సభ్యులు రఘు, రామ్మోహన్తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన ఖర్చులో కోత పెట్టామని, 510 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు అవసరం లేదని కమిషన్ భావించినట్టు తెలిపారు. తద్వారా రూ.2,300 కోట్ల అదనపు ఖర్చును నియంత్రించామన్నారు. కమిషన్ జాయింట్ డైరెక్టర్ బి.రామారావు ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. టారిఫ్ విడుదల సందర్భంగా కమిషన్ సిబ్బంది ఆయనకు నివాళులర్పించారు. -
జాతీయ జెండాకు అవమానం
– ఏపీ ఈఆర్సీ వాహనానికి తలకిందులుగా అమర్చిన జాతీయ జెండా కర్నూలు (రాజ్విహార్): జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఏపీ ఈఆర్సీ చైర్మన్ వాహనానికి జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటు చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఎస్పీడీసీఎల్ డిస్కం ఇచ్చిన నివేదికలపై గురువారం స్థానిక విద్యుత్ భవన్లో ఏపీ ఈఆర్సీ బృందం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ జి. భవానీప్రసాద్కు సమకూర్చిన ఇన్నోవా వాహనానికి జాతీయ జెండాను తలకిందులుగా ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ ఈఆర్సీ చైర్మన్గా ఉన్న ఆయన వాహనానికి జెండాను ఏర్పాటు చేయడంలో స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను అవమానించడం సరికాదని చర్చించుకున్నారు. చివరకు సాయంత్రం గమనించి అధికారులు హడావిడిగా జెండాను సరిచేశారు. -
వాయిదా పద్థతిలో ఫైవ్స్టార్ ఫ్యాన్లు
- పెలైట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా - లక్ష ఫ్యాన్ల పంపిణీ.. ఒక్కొక్కటీ రూ.1,400 - ఏపీఈఆర్సీ అనుమతి కోరిన ఎస్పీడీసీఎల్ హైదరాబాద్: ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు వాయిదాల పద్ధతిలో 5 స్టార్ ఫ్యాన్లు ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా గుర్తించి, తొలుత ఇక్కడ లక్ష ఫ్యాన్లు అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సోమవారం కోరింది. సంస్థ ప్రతినిధులు ఫ్యాన్ల అమ్మకాలకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించారు. ఏపీఈఆర్సీ అనుమతి రావడంతోనే ఫ్యాన్ల అమ్మకాలు మొదలుపెడతామని అధికారులు తెలిపారు. ఇంధన పొదుపులో భాగంగా కేంద్ర ఇంధన పొదుపు సంస్థ (ఈఈఎస్ఎల్) కృష్ణా జిల్లాకు లక్ష ఫ్యాన్లు అందిస్తోంది. టెండర్ల ద్వారా ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. ఒక్కో ఫ్యాన్ ఖరీదు రూ.1,400. వీటిని 24 నెలల సులభవాయిదాల్లో వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు సుమారు రూ.60 వరకూ ఇన్స్టాల్మెంట్గా వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని నెలవారీ విద్యుత్ బిల్లులో కలుపుతారు. ఒకవేళ వినియోగదారుడు వాయిదాల పద్ధతి అవసరం లేదనుకుంటే, రూ.1,260 కే ఫ్యాన్ను అందజేస్తారు. బజాజ్, ఉషా ఫ్యాన్లను పంపిణీ చేయబోతున్నట్టు ఏపీఈఆర్సీకి ఎస్పీడీసీఎల్ తెలిపింది. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసే వాయిదా సొమ్మును పంపిణీ సంస్థ నేరుగా ఈఈఎస్ఎల్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్క నెలలో వాయిదా చెల్లించకపోయినా వినియోగదారుడి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. డిస్కమ్ల అయిష్టత ఫ్యాన్ల పంపిణీ పథకంపై విద్యుత్ పంపిణీ సంస్థలు అయిష్టంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సిబ్బంది కొరత వెంటాడుతుంటే, ఫ్యాన్ల అమ్మకాల కోసం దుకాణాలు తెరవాల్సిన పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఫ్యాన్లను ఈఈఎస్ఎల్ నేరుగా విద్యుత్ సెక్షన్ కార్యాలయాలకు పంపుతుంది. ఒకవేళ అవి పనిచేయకపోయినా, చెడిపోయినా తాము బాధ్యత వహించలేమని పేర్కొంటున్నారు. వినియోగదారుడు నేరుగా ఈఈఎస్ఎల్తో సంప్రదించాల్సిరావడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక ఇందుకు సంబంధించిన రికార్డులు నిర్వహించడం కూడా సమస్యేనని, క్షేత్రస్థాయి సిబ్బంది నాణ్యతలేని ఫ్యాన్లు అందించినా నియంత్రించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బలవంతంగా దీన్ని తమపై రుద్దుతోందని విద్యుత్ అధికారులు వాపోతున్నారు. -
చెరో సగం పంచుకున్నారు..!
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పుల పంపిణీ వివాదం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాయి. విభజన చట్టాలన్నీ పక్కన పెట్టి నీకు సగం.. నాకు సగం అన్నట్లుగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్సీ ఆస్తులను పంచేసుకున్నాయి. అంతటితో ఆగకుండా ఉమ్మడి ఖాతాలో ఉన్న రూ.12 కోట్ల డిపాజిట్లను చెరిసగం పంపిణీ చేసుకునేందుకు తెలంగాణ ఆర్థిక శాఖను అనుమతి కోరాయి. దీంతో ఈ నిర్వాకం బయటపడింది. ఏపీఈఆర్సీ నుంచి అందిన ఈ లేఖను చూసి ఆర్థిక శాఖ అధికారులు బిత్తరపోయారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి. అందుకు భిన్నంగా ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆస్తులు పంచుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీఈఆర్సీ రెండుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ఏర్పడింది. విద్యుత్తు వివాదాలు తారాస్థాయికి చేరిన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వీటికి కమిషన్లను నియమించాయి. ప్రస్తుతం ఏపీఈఆర్సీకి జస్టిస్ భవానీప్రసాద్ చైర్మన్గా, టీఎస్ఈఆర్సీకి ఇస్మాయిల్ అలీఖాన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వీరికి జ్యుడీషియల్ అధికారాలున్నాయి. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఉన్న ఏపీఈఆర్సీ కార్యాలయం విభజన అనంతరం.. చెరో ఫ్లోర్ను, చెరి సగం ఫర్నిచర్ను, ఉద్యోగులను పంచుకున్నాయి. వివాదాలు, విభేదాలేమీ లేకుండా సామరస్యపూర్వకంగా టీఎస్ఈఆర్సీ, ఏపీఈఆర్సీలు ఆస్తులు పంచుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం పూర్తిగా పక్కదారి పట్టింది. జనాభా ప్రకారం పంచుకుంటే ఆస్తుల్లోనూ.. అప్పుల్లోనూ తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్కు 58 శాతం వాటా రావాల్సి ఉంది. ఏపీఈఆర్సీకి అప్పుల భారం లేనందున కేవలం ఆస్తులను చెరి సమానంగా పంచుకున్నట్లు అర్థమవుతోంది. కానీ.. ఎవరి ఇష్టారాజ్యంగా వారు ఆస్తులను పంచుకుంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. చట్టాన్ని పక్కనబెట్టి రెండు రాష్ట్రాల ఈఆర్సీలు ఆస్తులు పంచుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీఈఆర్సీ ఖాతాలో ప్రస్తుతం రూ.12 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము సామరస్యంగా వీటిని చెరిసగం పంచుకున్నామని.. ఆమోదించాలని ఏపీఈఆర్సీ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఈ లెక్కన చెరో రూ.ఆరు కోట్లు పంపిణీ జరగాలి. విభజన చట్టంలోని జనాభా శాతం ప్రకారం పంపిణీ జరిగితే.. తెలంగాణకు రూ. 5.76 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ. 6.24 కోట్లు దక్కుతాయి. ఈ లెక్కన ఫిప్టీ.. ఫిప్టీ చొప్పున పంచుకుంటేనే తెలంగాణకు లాభమనిపిస్తోంది. కానీ.. ఆ మాత్రం దానికి ఆశ పడితే తెలంగాణ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పసిగట్టారు. ఏపీఈఆర్సీలో ఆస్తులను చెరిసగం పంచుకున్నారనే ఒక్క నిర్ణయాన్ని వేలెత్తి చూపించి.. వేలాది కోట్ల అప్పులను సైతం అదే పద్ధతిన పంచుకోవాలని ఏపీ ప్రభుత్వం తిరకాసు పెట్టే ప్రమాదం ఉందని అప్రమత్తమయ్యారు. ఏపీఈఆర్సీ పంపించిన ఫైలును తిప్పిపంపారు. -
ప్రజలపై విద్యుత్ భారం!
రూ. 5,868 కోట్ల వసూలుకు సర్కారు సిద్ధం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ‘ట్రూ-అప్’ చార్జీల పేరుతో ఏకంగా రూ.5,868 కోట్ల మేరకు జనంపై భారం వేసేందుకు కసరత్తు చేస్తోంది. దక్షిణ (ఎస్పీడీసీఎల్), తూర్పు (ఈపీడీసీఎల్) ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఎదుట పిటిషన్లు దాఖలు చేశాయి. ఇటీవలి ఈఆర్సీ సమన్వయ కమిటీ సమావేశంలో డిస్కమ్ల సీఎండీలు ప్రధానంగా దీనిపైనే పట్టుబట్టారు. గడచిన ఐదేళ్ల ట్రూ ఆప్ చార్జీలను వడ్డీతో సహా ప్రజల నుంచి వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఏపీఈఆర్సీ అనుమతిస్తే వచ్చే ఏడాది విద్యుత్ బిల్లులు బాంబుల్లా పేలనున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. ట్రూ అప్ తరహా వసూలు ప్రతిపాదనలను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల వద్ద సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఎస్ఏ) వసూలు చేశాయి. న్యాయస్థానం సర్దుబాటు చార్జీలను తప్పుబట్టింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన బాబు సర్కార్ గత ఏప్రిల్లో ఏకంగా రూ.941 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది. తాజాగా ట్రూ అప్ చార్జీలకు సిద్ధమవుతోంది.దీంతో విద్యుత్ బిల్లులు ఐదారు రెట్లు పెరుగుతాయని అధికారుల మాట. ప్రతిపాదిత మొత్తం ఖర్చుకన్నా అదనంగా అయ్యే వ్యయాన్ని (కమిషన్ అమోదించిన, వాస్తవ ఖర్చుకు మధ్య తేడా) రాబట్టుకోవడాన్ని ట్రూ అప్గా పేర్కొంటారు. -
మా కరెంటులో తెలంగాణకు వాటా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో తెలంగాణకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది! ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తయ్యే విద్యుత్లో తెలంగాణకు వాటా ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది! ఏపీఈఆర్సీకి తాజాగా సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కమ్లు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కృష్ణపట్నం తదితర కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటును తెలంగాణకు ఇచ్చేది లేదని ఇప్పటిదాకా ఏపీ వాదిస్తుండటం, దీనిపై న్యాయ పోరాటానికి తెలంగాణ సిద్ధమవడం, పీపీఏల వివాద పరిష్కారానికి నీరజా మాథుర్ కమిటీ వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తామంటూ ఏకంగా ఏఆర్ఆర్లో ఏపీ డిస్కంలు పొందుపరచడం రాష్ట్రానికి సానుకూల పరిణామమని నిపుణులు అంటున్నారు. ఏం జరిగింది? రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ప్రభుత్వం జీవో నంబర్ 20 ద్వారా విద్యుదుత్పత్తిని పంపిణీ చేసింది. తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం కేటాయించారు. విభజన తర్వాత అప్పటికి ఉమ్మడిగానే ఉన్న ఏపీఈఆర్సీ పీపీఏలపై తీర్పు చెప్పింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం పీపీఏ మినహా మిగతా అన్ని పీపీఏలనూ ఆమోదించినట్టుగానే భావించాలని కేంద్రానికి తెలిపింది. కానీ ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టాక కొత్త వివాదానికి తెర తీశారు. పాత ఈఆర్సీ ఆదేశాలు చెల్లవని, రాష్ట్రంలో ఉత్పత్తయ్యే కరెంటంతా తమకే దక్కుతుందని వాదించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. పీపీఏలను ఏపీ అంగీకరించకపోవడం వల్ల తమకు 462 మెగావాట్ల వాటా రాకుండా పోతుందని, కృష్ణపట్నం, హిందూజా వాటాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ కరెంటులో తెలంగాణకు వాటా ఇస్తామని ఏఆర్ఆర్లోనే డిస్కంలు తాజాగా పేర్కొనడం కోర్టులో కూడా తెలంగాణ వాదనకు బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అలాగే కృష్ణపట్నం కరెంటులోనూ తెలంగాణ తన వాటాను మరింత గట్టిగా డిమాండ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీపీఏలు ఆమోదం పొందలేదని ఏపీ ప్రభుత్వం కోర్టులో వాదించినా అది నిలబడబోదని అభిప్రాయపడుతున్నారు. -
ఏపీఈఆర్సీకి ఇద్దరు సభ్యులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సభ్యులుగా డాక్టర్ పెర్వెల రఘు, పెండ్యాల రామ్మోహన్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరూ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతార ని పేర్కొంది. రఘు 1979లో ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేశారు. తాజాగా ఆదాయం పన్నుశాఖ ముఖ్య కమిషనర్గా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. అంతకు ముందు ఆయన చెన్నై, హైదరాబాద్, గుంటూరు తిరుచ్చీ, అహ్మదాబాద్, ముంబై ప్రాంతాల్లో ఐటీ అదనపు కమిషనర్గా, డిప్యూటీ కమిషనర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. రామ్మోహన్ ప్రస్తుతం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) డెరైక్టర్గా పనిచేస్తున్నారు. విశాఖపట్టణం జిల్లాకు చెందిన ఈయన ఈఎంసీ డిజైన్ ఆఫ్ ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్లో పీహెచ్డీ చేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో సహాయ ఇంజనీర్గా చేశారు. ఏడీ, డీఈ, జీఎం, సీజీఎం, డెరైక్టర్గా అంచెలంచెలుగా ఎదిగారు. -
విద్యుత్లో మరో పేచీ!
తెలంగాణ డిస్కమ్లకు నోటీసులిచ్చిన ఏపీఈఆర్సీ ఉమ్మడి రాష్ట్రంలోని అంశాలపై వివరణ కోరిన సంస్థ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య ఇప్పటికే పలు రకాల వివాదాలు కొనసాగుతుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో జగడానికి తెరలేపింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పలు రకాల కేసులకు సంబంధించి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన అంశాలతోపాటు ఏపీఈఆర్సీలో పెండింగ్లో ఉన్న ల్యాంకో విద్యుత్ సంస్థ స్థాపిత సామర్థ్యం, దానికి చెల్లించాల్సిన బకాయిల అంశం, అలాగే స్పెక్ట్రమ్ పవర్కు సంబంధించి నాఫ్తాతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి తదితర 60కిపైగా అంశాలపై ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసి, దానికి చైర్మన్, ఇద్దరు సభ్యులను కూడా నియమించింది. అదే ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్క చైర్మన్ను మాత్రమే నియమించింది. కమిషన్లో సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన సభ్యులను నియమించాల్సి ఉన్నా ఇంకా ఆ పని చేయలేదు. కానీ ఏపీఈఆర్సీ పలు కీలకమైన సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించి దాదాపు 60కి కేసుల నోటీసులను తెలంగాణ డిస్కమ్లకు జారీ చేసింది. వాస్తవంగా తెలంగాణ ఏర్పడి ఆరు నెలలు కావడమేకాక. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరును కూడా టీఎస్ఎస్పీడీసీఎల్గా మార్చింది. కానీ ఏపీఈఆర్సీ నోటీసులను ఏపీసీపీడీసీఎల్ పేరుతో ఇవ్వడం గమనార్హం. అయితే తెలంగాణ రాష్ట్రంలోని డిస్కమ్లకు నోటీసులు జారీ చేసే అధికారం పొరుగు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్రాష్ట్ర వివాదాలు ఉంటే వాటిని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి చూసుకుంటుందని, అంతే తప్ప మరో రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థకు నోటీసులు ఎలా జారీ చేస్తారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
విభజనతో ఏపీ ఈఆర్సీ ఉనికి కోల్పోయింది
-
జీఎంఆర్కు ఈఆర్సీ షాక్!
సాక్షి, హైదరాబాద్: జీఎంఆర్కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు ఈఆర్సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు రాజగోపాల్రెడ్డి, అశోకాచారిలు శనివారం ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయంలోని సెజ్ ప్రాంతానికి ప్రైవేటుగా విద్యుత్ను పంపిణీ చేసుకుంటామని, ఇందుకోసం లెసైన్సు ఇవ్వాలని ఈఆర్సీని జీఎంఆర్ కోరింది. అయితే ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలంటే విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14లో కొన్ని నిబంధనలున్నాయని.. ఈ నిబంధనలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ లేదని డిస్కంలు వాదించాయి. ఈ వాదనతో ఈఆర్సీ ఏకీభవించింది. సెక్షన్ 14 ప్రకారం ఏ కంపెనీకైనా విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాలంటే.. విద్యుత్ పంపిణీ చేసే ప్రాంత కనీస పరిధి మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ లేదా రెవెన్యూ జిల్లా (ఆపరేషన్ సర్కిల్) అయి ఉండాలి. అలాగైతేనే విద్యుత్ పంపిణీ లెసైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక కంపెనీకి ఇవ్వకూడదని ఈ సెక్షన్లో స్పష్టంగా ఉంది. ఇందుకు పూర్తి భిన్నంగా కేవలం ఎయిర్పోర్టు ప్రాంతానికి మాత్రమే విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇవ్వాలని జీఎంఆర్ కోరింది. -
ఆరు నెలల వరకూ ప్రస్తుత ఈఆర్సీనే!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)నే ఇరు రాష్ట్రాలకు జూన్ 2 తర్వాత కూడా ఉమ్మడి ఈఆర్సీగా కొనసాగనుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జూన్ 2 నుంచి ఆరు నెలల పాటు ఉమ్మడి ఈఆర్సీగా వ్యవహరించేందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్ను మార్చనున్నట్టు ఈఆర్సీ కార్యదర్శి మనోహర్ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఈ నెల 22వ తేదీలోగా తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆ ప్రకటనలో కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లోగా తెలంగాణకు ప్రత్యేక ఈఆర్సీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే, అప్పటివరకు ప్రస్తుతం ఉన్న ఈఆర్సీనే ఉమ్మడిగా ఇరు రాష్ట్రాలకు కొనసాగుతుందని చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదని ఈఆర్సీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈఆర్సీ రెగ్యులేషన్స్ను ఇందుకు అనుగుణంగా మార్చుతున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రస్తుతానికి పాత విద్యుత్ చార్జీలే: ఈఆర్సీ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల మోత తాత్కాలికంగా వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఈఆర్సీ కార్యదర్శి మనోహర్రాజు శనివారం ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ టారిఫ్ను ఈఆర్సీ నిర్ణయించి ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ చార్జీల మోతను ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం కూడా కోడ్ ఉన్నందున ఏ కేటగిరీ వినియోగదారులకు (రైతులు, గృహ తదితర) ఎంతమేరకు సబ్సిడీ ఇస్తామనే విషయాన్ని పేర్కొనలేమని ఈఆర్సీకి తెలిపింది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలే అమలవుతాయని ఈఆర్సీ స్పష్టం చేసింది. అదేవిధంగా ట్రాన్స్కోకు చెందిన విద్యుత్ సరఫరా చార్జీలు, సాంప్రదాయక ఇంధన వనరుల అస్థిర చార్జీల(వేరియబుల్ కాస్ట్)తోపాటు క్రాస్సబ్సిడీ సర్చార్జీలకు సంబంధించి కూడా తదుపరి ఆదేశాలు వెలువడేవరకూ ప్రస్తుత చార్జీలే అమలవుతాయని ఈఆర్సీ తెలిపింది. కాగా ఎన్నికల కోడ్ ముగిశాక.. అంటే మే 20 తర్వాత ఏ క్షణంలోనైనా విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశముంది. -
జేబుకు చిల్లు 5,600 కోట్లు
-
జేబుకు చిల్లు 5,600 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1 నుంచి కొత్త కరెంటు చార్జీల మోత మోగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం నాలుగేళ్లుగా ఏటా విద్యుత్ చార్జీలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగించనుంది. స్లాబుల మాయూజాలంతో వినియోగదారుల జేబుకు భారీయెత్తున చిల్లు పెట్టనుంది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ఏకంగా సుమారు రూ.5,600 కోట్ల కరెంటు చార్జీల భారం పడనుంది. కేవలం గృహ వినియోగదారులపైనే ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా భారం పడనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ప్రధానంగా గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చార్జీలు పెంచనుంది. నెలకు 150 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు భారీ బిల్లు షాక్ ఇవ్వనుంది. వీరికి ఆయూ స్లాబుల మేరకు యూనిట్కు 50 పైసల నుంచి రూ.1.78 వరకూ చార్జీ పెరగనుంది. నెలకు 150 యూనిట్లకుపైబడి వినియోగించే కేటగిరీ వారికి ఇప్పటికే అధిక చార్జీలు ఉండటం వల్ల ఈసారి వారిపై కాస్త కరుణ చూపినట్లు సమాచారం. ఇక చిన్నతరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలు, ఫెర్రో అల్లాయ్స్ యూనిట్లకు సగటున 50 పైసల నుంచి 75 పైసల మేరకు చార్జీలు పెరగనున్నట్టు తెలిసింది. అదేవిధంగా వాణిజ్య సంస్థలు, మల్టీప్లెక్స్లు, హోర్డింగ్లకు కూడా ప్రస్తుత చార్జీల కంటే సగటున 50 పైసల మేరకు చార్జీలు పెరగనున్నారుు. 24న కొత్త టారిఫ్ ఆదేశాలు! వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5,600 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను పెంచడంతో పాటు సుమారు రూ.6,500 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించే విషయమై అభిప్రాయాన్ని తెలియజేయూలంటూ ఈఆర్సీ గురువారం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనశాఖకు చేరిన ఈ లేఖపై గవర్నర్ సమీక్ష అనంతరం ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ నెల 24న ఈఆర్సీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ను ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తారుు. అయితే విద్యుత్ చార్జీల పెంపునకు కోడ్ కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందా? లేదా? అనే విషయమై స్పష్టత లేదు. ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతివ్వకుంటే కోడ్ ముగిసేవరకు అంటే మే నెలాఖరు వరకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే అమలయ్యేలా ఈఆర్సీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్రంగ నిపుణులు మాత్రం ఎన్నికల సంఘం వ్యతిరేకించే అవకాశం లేదనే అంటున్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలోనూ విద్యుత్ చార్జీలను ఈఆర్సీ నిర్ణయించిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. పేదలు, మధ్యతరగతే సమిధలు! గృహ వినియోగదారులకు గతంలో 100 యూనిట్లుగా ఉన్న స్లాబును కాస్తా 50 యూనిట్లుగా విభజించి చార్జీలను పెంచిన ప్రభుత్వం.. ఈసారి దాన్నీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఎల్టీ-1 కిందకు వచ్చే గృహ వినియోగదారులను ఎల్టీ 1(ఏ) నుంచి 1(డీ) వరకూ విభజించింది. ప్రతి కేటగిరీలో చార్జీలను వేర్వేరుగా నిర్ణయించింది. దీనితో ఒక స్లాబు దాటి మరో స్లాబులోకి వెళితే చాలు చార్జీల మోత మోగిపోనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించినట్టైతే దాన్ని ఎల్టీ-1(ఏ) కేటగిరీగా నిర్ణయించింది. వీరికి ప్రస్తుతమున్న యూనిట్ చార్జీని రూ.1.45 నుంచి రూ.1.95కు పెంచింది. అంటే 50 పైసలు పెంచిందన్నమాట. ఇక 100 యూనిట్ల వరకు వినియోగిస్తే ఎల్టీ1(బీ)గా నిర్ణయించి మొదటి 50 యూనిట్లకు రూ.3.10 చొప్పున 51-100 యూనిట్లకు రూ.3.75 చొప్పున వసూలు చేయనుంది. 150 యూనిట్ల వరకు వాడితే ఎల్టీ1(సీ) తొలి 50 యూనిట్లకు రూ.3.10, 51-100 యూనిట్లకు రూ.3.75, 101-150 యూనిట్లకు రూ.5.38 చొప్పున వసూలు చేయనున్నారు. అయితే 150 యూనిట్లకు పైగా వినియోగించే వారిపై (ఎల్టీ1(డీ) కేటగిరీ మాత్రం కాస్త కరుణ చూపారు. వీరికి యూనిట్కు సగటున 25 నుంచి 35 పైసల మేరకు పెరిగినట్టు సమాచారం. ఎందుకంటే.. ఒక యూనిట్ను ఉత్పత్తి చేసి వినియోగదారులకు సరఫరా చేసేందుకు అయ్యే సగటు వ్యయం కంటే 20 శాతానికి మించి టారిఫ్ ఉండకూడదని జాతీయ టారిఫ్ విధానం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ కేటగిరీ వారికి పెద్దగా విద్యుత్ చార్జీలను పెంచకూడదని ఈఆర్సీ భావించినట్టు తెలిసింది. మరోవైపు చిన్న, భారీ, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు కూడా కొత్త చార్జీల షాక్ తగలనుంది. స్థానిక సంస్థలకు మరిన్ని ఇక్కట్లు ఇప్పటికే అనేక పంచాయతీలు, మునిసిపాలిటీలు విద్యుత్ చార్జీలు బకాయిపడి ఉన్నాయి. ఫలితంగా విద్యుత్ సంస్థలు వాటికి కనెక్షన్ కట్ చేస్తున్నాయి. తాజాగా పెరగనున్న చార్జీలు స్థానిక సంస్థలపై మోయలేని భారంగా పరిణమించనున్నారుు. దీంతో వీధుల్లో చీకట్లు అలుముకోవడంతో పాటు, తాగునీటి సరఫరాకూ ఇబ్బందులు ఏర్పడనున్నారుు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని వినియోగదారులపైనే నెట్టే అవకాశం ఉంది. దీంతో తాగునీటి చార్జీలూ పెరిగే ప్రమాదం పొంచి ఉంది. వీధి దీపాలకు యూనిట్ విద్యుత్ చార్జీ సగటున 40 పైసల మేర కు, తాగునీటి సరఫరాకు 50 పైసల నుంచి రూపాయి వరకూ పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వివరించాయి. -
పవర్ మొత్తం ‘కేంద్రం’ గుప్పెట్లోనే!
-
పవర్ మొత్తం ‘కేంద్రం’ గుప్పెట్లోనే!
సాక్షి, హైదరాబాద్: విభజన అనంతరం రాష్ట్ర విద్యుత్తు రంగంపై రెండు రాష్ట్రాలకూ అధికారాలు లేకుండాపోబోతున్నాయి. విచిత్రంగా అనిపించినా కేంద్ర విద్యుత్తు చట్టం ఇలాగే చెబుతోంది. విభజన తర్వాత అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతంలోని ఏ విద్యుత్ ప్లాంటు ధరను నిర్ణయించాలన్నా... ఏవైనా వివాదాలు తలెత్తినా పరిష్కరించుకునేందుకు ఢిల్లీకి పరుగెత్తాల్సిందే. రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాల్లో ఏర్పడే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఈఆర్సీ), ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లు కేవలం పేరుకే పరిమితం కానున్నాయి. కేవలం ఏడాదికి ఒకసారి విద్యుత్ చార్జీల నిర్ణయానికి మాత్రమే పరిమితం కావాల్సి రానుంది. అదెలాగంటే... రాష్ట్ర విభజన అనంతరం కూడా జెన్కోతో పాటు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కొనసాగుతాయని బిల్లులో కేంద్రం పేర్కొంది. పీపీఏ మేరకే ఇరు ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపింది. దీంతో తెలంగాణలో ఉన్న విద్యుత్ ప్లాంటు నుంచి తెలంగాణతో పాటు సీమాంధ్రకు కూడా యథావిధిగా కేటాయింపుల మేరకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నమాట. అంటే ఒకే విద్యుత్ ప్లాంటు నుంచి విభజన తర్వాత 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ్హ ఒక విద్యుత్ ప్లాంటు నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరిగితే... సదరు ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే యూనిట్ విద్యుత్ ధరతో పాటు అన్ని అంశాలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) పరిశీలిస్తుంది. ్హ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీపీసీ ప్లాంట్ల నుంచి అనేక రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అందుకే ఎన్టీపీసీ యూనిట్ల విద్యుత్ ధరను సీఈఆర్సీ నిర్ణయిస్తుంది. ఈ ప్లాంట్లపై ఆయా రాష్ట్రాల్లోని ఈఆర్సీలకు ఎటువంటి అధికారం ఉండదు. తద్వారా ఇటు తెలంగాణ కానీ అటు సీమాంధ్రలోని ఏ విద్యుత్ ప్లాంటు యూనిట్ ధరతో పాటు ఏ ఇతర వివాదం తలెత్తినా పరిష్కరించే అధికారం సీఈఆర్సీకే ఉంటుంది. ఫలితంగా టీఈఆర్సీ, ఏపీఈఆర్సీలు కేవలం పేరుకే మనుగడలో ఉండనున్నాయి. పీపీఏలు ముగిసేవరకూ పరిస్థితి ఇంతే. అంటే రాబోయే 25-30 ఏళ్ల వరకూ వీటి అధికార పరిధి నామమాత్రమే. ఏడాదికి ఒకసారి విద్యుత్ చార్జీలను మాత్రమే ఇవి నిర్ణయించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లోపు 2రాష్ట్రాలకు వేర్వేరు ఈఆర్సీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు మాత్రమే ప్రస్తుతం ఉన్న ఏపీఈఆర్సీ మనుగడలో ఉండనుంది. అయితే ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లపై ఆ రాష్ట్రంలోని ఈఆర్సీలకే అధికారాలు ఉండాలంటే... కేంద్ర విద్యుత్ చట్టంలో సవరణలు చేయాలి. పార్లమెంటుకు మాత్రమే ఈ అధికారం ఉంది. -
విద్యుత్చార్జీల పిడుగు
-
విద్యుత్చార్జీల పిడుగు 9,320 కోట్లు
* పేదలు, మధ్యతరగతి వర్గాలే సర్కారు టార్గెట్ * అదనపు రాబడికి డిస్కంల ప్రతిపాదనలు * 2014-15కు ఈఆర్సీకి ఆదాయ, వ్యయ నివేదికల సమర్పణ * బడ్డీకొట్ల నుంచి పరిశ్రమల వరకు అన్ని కేటగిరీలకూ షాకులు * గృహ వినియోగదారులపై ఎక్కువ భారం.. * రూ. 2,456 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధం * స్లాబులు విభజించి వాయించారు.. సగటున 31% పెంపు * 50 యూనిట్లలోపు వారిపైనా.. రైతులకూ పరోక్ష వడ్డన * వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలు! సాక్షి, హైదరాబాద్: 2.23 కోట్లు - ఇది విద్యుత్ చార్జీల పెంపుభారం పడుతున్న వినియోగదారుల సంఖ్య. 9,320 కోట్లు - కొత్త విద్యుత్ చార్జీల పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయదలచుకున్న మొత్తం. గత నాలుగేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించనుంది. అయితే ఈసారి గృహాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు అనే తేడా లేకుండా (ఉచిత విద్యుత్ మినహా) అన్ని కేటగిరీలనూ, రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులెవర్నీ వదలకుండా చార్జీలు పెంచేందుకు సిద్ధమయింది. ముఖ్యంగా గృహవినియోగదారులకు భారీ షాకులిచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ఏకంగా రూ.9,320 కోట్ల మేరకు అదనపు విద్యుత్ చార్జీల భారం మోపే దిశలో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2014-15కు సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లను బుధవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. చార్జీల పెంపులో ఏ ఒక్కరినీ మినహాయించకుండా అందరికీ షాక్లు ఇస్తూ ‘సమన్యాయం’ పాటించింది. గృహ వినియోగదారులు, చిన్న చిన్న బడ్డీ కొట్లు మొదలుకుని చిన్న, పెద్ద పరిశ్రమలతో పాటు తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మరమగ్గాలు, బొమ్మల తయారీ వంటి కాటేజీ పరిశ్రమలపైనా చార్జీల భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్న రైతులనూ ప్రభుత్వం వదల్లేదు. యూనిట్కు పైసా చొప్పున కస్టమర్ చార్జీల రూపంలో వసూలు చేయనునుంది. ఫిక్స్డ్, డిమాండ్, కస్టమర్ చార్జీల రూపంలో పరోక్షంగానూ వాయించేందుకు సిద్ధమైంది. ఇక కొత్తగా ‘హార్మోనిక్ సర్చార్జీ’ పేరుతో పరిశ్రమల నుంచి నెల మొత్తం విద్యుత్ చార్జీలో 25 శాతం అదనంగా వసూలు చేయనుంది. ఇక గృహ వినియోగదారులకు సగటున రూ.1.20 మేరకు చార్జీలు పెంచింది. అయితే 150 యూనిట్లు దాటి వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రం ఏకంగా రూ.4.87 వరకు చార్జీల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు రూ.52,753 కోట్ల ఆదాయం అవసరమని తేలగా... ప్రస్తుత విద్యుత్ చార్జీల వల్ల కేవలం రూ.36,344 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని డిస్కంలు అంచనా వేశాయి. మిగిలిన రూ.16,409 కోట్లలో ఉచిత విద్యుత్తో పాటు ఇతర వర్గాల సబ్సిడీ కోసం రూ. 7,089 కోట్లను సబ్సిడీగా భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన రూ.9,320 కోట్లను ప్రజలను బాది వసూలు చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే డిస్కంలు చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి. జనవరిలో బహిరంగ విచారణ అనంతరం మార్చి మూడో వారంలో ఈఆర్సీ తుది ఆదేశాలు జారీ చేయనుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తాయి. బడ్డీ కొట్టైనా నడ్డి విరుగుతుంది పొట్ట కూటి కోసం చిన్న చిన్న టీస్టాళ్లు, జిరాక్స్ సెంటర్లు, బడ్డీ కొట్లను నడుపుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. లో-టెన్షన్ (ఎల్టీ) -2 కేటగిరీ కిందకు వచ్చే వీటి విద్యుత్ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. వీరికి విద్యుత్ చార్జీలను యూనిట్కు ఏకంగా రూపాయి మేరకు పెంచుతూ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. వాస్తవానికి వీటికి ఇప్పటికే విద్యుత్ చార్జీలు భారీగా ఉన్నాయి. నెలకు 50 యూనిట్లలోపు వినియోగించే వారు ఇప్పటికే యూనిట్కు రూ.5.40 చొప్పున చెల్లిస్తున్నారు. దీనిని రూ.6.40కి పెంచారు. ఇక 50 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 50 యూనిట్లకు ప్రస్తుతం రూ.6.63 చెల్లిస్తుండగా ఇక నుంచి రూ.7.63 చెల్లించాల్సి రానుంది. 51-100 యూనిట్ల వారికి రూ.7.38 నుంచి రూ.8.38కి, 101-300 వరకు రూ.8.13 నుంచి రూ.9.13కు, 301-500 యూనిట్లకు రూ.8.63 నుంచి రూ.9.63కు 500 యూనిట్లు దాటితే రూ.9.13 నుంచి ఏకంగా కూ.10.13కు చార్జీలు పెంచారు. కుటీర పరిశ్రమలు ఇక కుదేలు రాష్ట్రంలో విద్యుత్ కోతల దెబ్బకు కుటీర పరిశ్రమలు ఇప్పటికే కునారిల్లుతున్నాయి. మరమగ్గ కార్మికులు ఆత్మహత్యల బాటపడుతున్నారు. గత ఏడాదిలో కుటీర పరిశ్రమలకు ఏకంగా 66 శాతం మేరకు చార్జీలను పెంచిన ప్రభుత్వం ఈసారీ వదల్లేదు. వీటికి చార్జీలను యూనిట్కు 67 పైసల మేరకు పెంచింది. వ్యవసాయాధారిత పరిశ్రమలకూ షాక్నిచ్చింది. ఉప్పుకయ్యలు, గ్రామీణ నర్సరీలను కూడా కాటేజీ పరిశ్రమల కేటగిరీలోకి మార్చి... యూనిట్ విద్యుత్ చార్జీలను 72 పైసల మేరకు పెంచింది. పుట్టగొడుగులు, చేపలు,రొయ్యల పెంపకం, కుందేళ్ల పెంపకం, ఫ్లోరీ కల్చర్కు కూడా షాక్లు ఇచ్చింది. కేవలం కోళ్ల పరిశ్రమకు మాత్రమే చార్జీలను తగ్గించింది. ఇక వీధుల్లో చీకట్లే రాష్ట్రవ్యాప్తంగా అనేక పంచాయతీలు, మునిసిపాలిటీలు ఇప్పటికే విద్యుత్ బిల్లులు బకాయిపడి ఉన్నాయి. దీంతో డిస్కంలు కనెక్షన్లు కట్ చేస్తున్నాయి. తాజాగా పెరగనున్న చార్జీలతో ఇక వీధుల్లో చీకట్లే మిగలనున్నాయి. తాగునీటి సరఫరాకూ ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అనేక పంచాయతీల్లో తాగునీటి విద్యుత్ కనెక్షన్లకూ బకాయిల భారం వెన్నాడుతోంది. దీంతో తాగునీటికి కూడా కొన్ని పంచాయతీలల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. వీధి దీపాలకు యూనిట్ విద్యుత్ చార్జీలు 0.38 నుంచి 0.93 రూపాయల మేరకు పెరగగా, తాగునీటి సరఫరాకు రూ. 1.29 నుంచి రూ.1.43 వరకు పెరిగాయి. పరిశ్రమలకు పెను ముప్పు గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న విద్యుత్ కోతలతో రాష్ట్రంలో పారిశ్రామికరంగం పెనుప్రమాదంలో పడింది. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. వందలాది పరిశ్రమలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారిపోయాయి. కొన్ని పరిశ్రమల ముందు టు-లెట్ బోర్డులు వెలిశాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాదిలో కూడా పరిశ్రమలను ప్రభుత్వం వదల్లేదు. యూనిట్కు 28 పైసల నుంచి 51 పైసల వరకూ పెంచింది. చెరకు క్రషింగ్ యూనిట్లకైతే ఏకంగా యూనిట్ చార్జీని రూ.4.63 నుంచి రూ.7.03కి అంటే ఏకంగా రూ.2.40 పెంచింది. భారీ పరిశ్రమలకూ ప్రభుత్వం భారీగానే షాక్లు ఇచ్చిం ది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను కూడా హెచ్టీ-1 కేటగిరీలోకి చేర్చుతూ ప్రతిపాదనలు సమర్పించిన ప్రభుత్వం... వీటి విద్యుత్ చార్జీలను యూనిట్కు 83 పైసల వరకు పెంచింది. ఇక భారీ వాణిజ్య సంస్థ లు, మల్టీప్లెక్స్లు, విమానయాన సంస్థలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు కూడా యూనిట్కు 50 పైసల చొప్పున చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. పరోక్ష చార్జీలూ పెరిగాయ్ విద్యుత్ చార్జీల పెంపుతో ప్రత్యక్షంగా చెల్లించే విద్యుత్ చార్జీలతో పాటు డిమాండ్, ఫిక్స్డ్, కస్టమర్ వంటి పరోక్షచార్జీలనూ ఎల్టీ-2 కేటగిరీలోని చిన్న చిన్న వాణిజ్య సంస్థలు ప్రస్తుతం కిలోవాట్కు రూ.50 చెల్లిస్తుండగా... ఇక నుంచి రూ.100 చెల్లించాల్సి రానుంది. ఎల్టీ కేటగిరీలోని పరిశ్రమలు, సీజనల్ పరిశ్రమలకు కూడా కిలోవాట్కు రూ.50 నుంచి రూ.100కు పెంచారు. చెరకు క్రషింగ్ యూనిట్లకు ఫిక్స్డ్ చార్జీలు కిలోవాట్కు రూ.20 నుంచి రూ.60కి పెరగనున్నాయి. కాటేజీ పరిశ్రమలకు రూ.20 నుంచి రూ. 40కు పెంచేందుకు ప్రతిపాదించాయి. పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఒక హెచ్పీకి ప్రస్తుతం ఫిక్స్డ్ చార్జీలు రూ.30 చెల్లిస్తుండగా... వీటిని రూ.60కి పెంచారు. భారీ పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు కేవీఏకు రూ. 350 నుంచి ఏకంగా రూ. 600కు పెంచారు. అంటే కేవీఏకు ఏకంగా రూ. 250 పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. కస్టమర్ చార్జీలు కూడా పెరగనున్నాయి. పేదలు, మధ్యతరగతే సమిధలు..! ప్రతిపాదిత విద్యుత్ చార్జీలను గమనిస్తే ప్రభుత్వం గృహ వినియోగదారులపై కక్ష కట్టిందా అన్పించక మానదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా విపరీతంగా చార్జీలు పెంచేసింది. గృహ వినియోగదారులకు 100 యూనిట్లకు ఉన్న స్లాబును 50 యూనిట్లుగా విభజించి గతంలో చార్జీలను పెంచిన ప్రభుత్వం... ఈసారి దాన్నీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఎల్టీ-1 కిందకు వచ్చే గృహ వినియోగదారులను ఎల్టీ 1(ఏ) నుంచి 1 (డీ) వరకూ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ప్రతి కేటగిరీలో చార్జీలను వేర్వేరుగా నిర్ణయించింది. నెలకు 50 యూనిట్లలోపు వినియోగించేవారిని ఎల్టీ-1(ఏ) కేటగిరీ కింద చేర్చింది. వీరికి చార్జీలను యూనిట్కు రూ.1.45 నుంచి రూ.1.95కు పెంచింది. అంటే 50 పైసలు పెంచిందన్నమాట. ఇక 100 యూనిట్లు వినియోగించేవారిని ఎల్టీ1(బీ) కింద చేర్చి మొదటి 50 యూనిట్లకు రూ.2.60 చొప్పున 51-100 యూనిట్లకు రూ.3.25 చొప్పున వసూలు చేయనుంది. ఇక 150 యూనిట్లు వాడితే తొలి 50 యూనిట్లకు రూ. 3.10, 51-100 యూనిట్లకు రూ.3.75, 101-150 యూనిట్లకు రూ.5.38 చొప్పున వసూలు చేయూలని నిర్ణయించింది. ఇక నెలకు 150 యూనిట్లు దాటితే మాత్రం నడ్డి విరిగేలా వడ్డించేందుకు సర్కారు సిద్ధమైంది. మొదటి 200 యూనిట్లకు యూనిట్కు ఏకంగా రూ.6.32 చొప్పున, 201-250 యూనిట్లకు రూ.6.94, 251-300కు రూ.7.55, 301-400కు రూ.8.16, 401-500 యూనిట్లకు ఏకంగా రూ.8.77 చొప్పున వసూలు చేయనుంది. ఇక 500 యూనిట్లు దాటితే యూనిట్కు రూ.9.38 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ విధంగా కేటగిరీలను విభజించి వాయించడం ద్వారా ఒక్క గృహ వినియోగదారుల నుంచే రూ.2,456 కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది. 200 యూనిట్లైతే రెట్టింపు చార్జీ! 112.6% మేర పెంపు గృహ వినియోగదారులకు చార్జీల పెంపులో ప్రభుత్వం ప్రధానంగా పేదలు, మధ్యతరగతి వర్గాలనే లక్ష్యంగా చేసుకుంది. సుమారు 2 కోట్ల గృహ వినియోగదారుల్లో ఈ వర్గాలకు చెందిన కోటిన్నర మందిని లక్ష్యంగా చేసుకుని చార్జీలను భారీగా పెంచింది. ప్రధానంగా 200 యూనిట్లలోపు వినియోగించే పేద, మధ్యతరగతి వారిని భారీగా బాదేసింది. తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలు పరిశీలిస్తే... 50 యూనిట్ల వారు ప్రస్తుతం నెలకు రూ.72.50 చెల్లిస్తుంటే (ఇతర చార్జీలను మినహాయించి) తాజా ప్రతిపాదనలతో రూ.97.50 మేరకు చెల్లించాల్సి రానుంది. అంటే 34% మేరకు చార్జీలను పెంచారన్నమాట. ఇక 100 యూనిట్లలోపు వినియోగించే వారికి ఏకంగా 69% పెంచగా... 200 యూనిట్లు వినియోగించే మధ్యతరగతి వారి నెల బిల్లు ఏకంగా రూ.600 నుంచి రూ.1276 (112.6%)కు పెరగనుంది. అదే పెద్దల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. 500 యూనిట్లు వాడే వినియోగదారులు ప్రస్తుతం రూ.3,007 చెల్లిస్తుండగా... ఈ మొత్తం కేవలం రూ.3,693.50కు మాత్రమే పెరగనుంది. అంటే పెరుగుదల శాతం 26.92 మాత్రమే. -
‘ఈఆర్సీ’ పోస్టు మనవారికి దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక పోస్టుల భర్తీ అంశంలో మరోసారి రాష్ట్ర, రాష్ట్రేతర అధికారుల సమస్య తెరమీదకు వచ్చింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్గా రాష్ట్రానికి చెందిన అధికారినే ఎంపిక చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు రాష్ట్రేతర కేడర్కు చెందిన అధికారులకే దక్కింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి కూడా రాష్ట్రేతర వ్యక్తికే దక్కింది. ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టును కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులకే ఇస్తున్నారంటూ ఇప్పటికే రాష్ట్ర ఐఏఎస్లు మండిపడుతున్నారు. ఈ పోస్టింగుల వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు సీఎంతో కూడా సమావేశమయ్యారు. తాజాగా ఏపీఈఆర్సీ చైర్మన్ ఎంపిక అంశం తెరపైకి వచ్చింది. ఈఆర్సీ చైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ.. మంగళవారం (3వ తేదీ) సమావేశం కానుంది. ఈ పోస్టు కోసం పలువురు సీనియర్ ఐఏఎస్లతో పాటు ఇటీవలి వరకూ ఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్గా ఉన్న శేఖర్రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. కానీ, రేసులో ప్రధానంగా ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.సాహూ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి భాస్కర్ ఉన్నారు. ఇందులో సాహూ ఒడిశాకు చెందినవారు. భాస్కర్ కర్ణాటకకు చెందిన అధికారి. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పోస్టులన్నీ రాష్ట్రేతర అధికారులకే ఇస్తున్న నేపథ్యంలో.. ఈఆర్సీ చైర్మన్ పోస్టును రాష్ట్రానికి చెందిన అధికారులకే ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ఈఆర్సీ సభ్యుడి (ఫైనాన్స్) ఎంపిక కోసం కూడా ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం ఒకే సభ్యుడు ఉండడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. -
సెలవుల్లోనైనా పనిచేయాల్సిందే!
ఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ రంజాన్, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఉద్యోగులకు మాత్రం రంజాన్, ఆదివారం కూడా సెలవులు ఉండటం లేదు. ఈ సెలవు రోజుల్లో కూడా పనిచేయాలని మౌఖిక ఆదేశాలు జారీ కావడమే ఇందుకు కారణం. ఈఆర్సీ ఇంచార్జి చైర్మన్గా శేఖర్రెడ్డి ఈ నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా పనిచేయాలంటూ ఆదేశాలు జారీకావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ల పెట్టుబడి వ్యయం పెంపుతోపాటు మరికొన్ని ప్రైవేట్ ప్లాంట్లకు అనుకూలంగా కీలక నిర్ణయాలు వెలువరించేందుకు ఈ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఆర్సీ పనితీరు కొంతకాలంగా తీవ్ర విమర్శల పాలవుతోంది. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే సంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ప్లాంట్ల యూనిట్ ధరలను పెంచుతూ గత నెలలో ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే విద్యుత్ పంపిణీని ప్రైవేట్పరం చేసేందుకు ఎవరికీ తెలియకుండా విచారణ నిర్వహించారు. దీనిపై విమర్శలు రావడంతో హడావుడిగా రెగ్యులేషన్స్ రూపొందించడం ఈఆర్సీ పనితీరుపై సందేహాలు వ్యక్తమయ్యే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈఆర్సీ కేవలం ఇద్దరితోనే నడుస్తోంది. ఇన్చార్జి చైర్మన్ పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ కొత్త చైర్మన్ను ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రభుత్వం నియమించలేదు. దీంతో ఈ నెల 14 నుంచి కేవలం ఒక సభ్యునితోనే ఈఆర్సీ కొనసాగనుంది. ఫలితంగా ఈఆర్సీకి ఎలాంటి ఆదేశాలు జారీచేసే అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో సెలవు దినాల్లో కూడా పనిచేయాలంటూ మౌఖిక ఆదేశాలివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.