Contractor
-
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు
సాక్షి, అమరావతి: ఏ పనికైనా అంచనా వ్యయం రూ.కోటి కంటే ఎక్కువ ఉంటే సంబంధిత కాంట్రాక్టర్కు 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొబిలైజైషన్ అడ్వాన్స్ను రద్దు చేస్తూ 2019 డిసెంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వుల(జీవో 83)ను రద్దు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు (జీవో 57) జారీ చేశారు. 2014–19 తరహాలోనే అయిన వారికి, అధిక ధరలకు పనులను కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్లను ముట్టజెప్పి.. వాటిని కమీషన్లుగా వసూలు చేసుకుని ఖజానాను దోచేసేందుకు ప్రభుత్వ పెద్దలు మళ్లీ తెర తీశారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టెండర్ వ్యవస్థను నీరుగార్చి.. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అంచనా వ్యయం కంటే అధిక ధరలకు పనులు కట్టబెట్టేవారు. వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ముట్టజెప్పి.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకుందని ఇంజినీరింగ్ నిపుణులు అప్పట్లో ఆరోపించారు. అంచనా విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.20 వేల కోట్లకుపైగా భారం పడిందని అప్పట్లో లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో 2019 మే 30న అధికారంలోకి వచి్చన వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసింది. రూ.వంద కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనుల టెండర్ షెడ్యూల్ను జ్యుడీíÙయల్ ప్రివ్యూకు పంపి ఆమోదం తీసుకున్న తర్వాతే టెండర్లు పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది. రూ.కోటి అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు పిలవాలని నిర్దేశించింది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలన్న నిబంధనను రద్దు చేసింది. 2019 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి వరకూ నిర్వహించిన టెండర్లలో అంచనా వ్యయం కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే జ్యుడీíÙయల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడం గమనార్హం. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్కుమార్ సత్పతి, చేతన్కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
సాక్షి,విశాఖ: సీబీఐ వలకి అవినీతి అధికారి అడ్డంగా దొరికి పోయారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.వాల్తేరు డివిజన్ డీఅర్ఎంగా సౌరభ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సౌరబ్కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.పక్కా సమాచారంతో కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఈ మేకప్ ఆర్టిస్ట్ చాలా కాస్టీ..! రోజుకు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
-
Maharashtra: శివాజీ విగ్రహ కాంట్రాక్టర్పై లుక్అవుట్ నోటీసులు
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇప్పటికే విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని ప్రతిపక్షాలు పడిపడుతున్నాయి.తాజాగా ఈ ఘటనకు సంబంధించి శివాజీ విగ్రహ కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై సింధుదుర్గ్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపడానికి అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు పంపినట్లు పోలిసులు తెలిపారు. ఠాణెకు చెందిన జైదీప్ ఆప్టే ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఇక.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. రాజ్కోట్ కోటలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. -
బొజ్జ గణపయ్యా...పొట్ట నింపవయ్యా!
కడప కల్చరల్: మరో మూడు వారాల్లో శ్రావణ మాసం ముగిసి భాద్రపదం వస్తుంది. సందుగొందుల్లో సైతం గణపయ్య విగ్రహాలు వెలుస్తాయి. ఏటా నెలరోజుల ముందే ఊరిబయట విగ్రహాల తయారీ మొదలవుతుంది. రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాల తయారీదారులు వచ్చి అక్కడి నుంచి తెచ్చుకున్న సామగ్రితోపాటు స్థానికంగా లభించే సామగ్రితో విగ్రహాలు తయారు చేస్తారు. ఊరి బయట పెద్ద టెంట్లు వేసుకుని కుటుంబాలతో గడుపుతారు. ఒకటి, రెండు నెలలపాటు తయారు చేసిన విగ్రహాలను అమ్ముకుని సంతృప్తిగా తిరిగి తమ ప్రాంతానికి వెళతారు. కానీ ఈ సంవత్సరం పరిస్థితి కొద్దిగా మారింది. స్థానికంగా ఉండే పెట్టుబడిదారులు ముందే ముడి విగ్రహాలను తెచ్చిపెట్టుకుని రాజస్తానీ కళాకారులకు కాంట్రాక్టుపై రంగులు పూసే పని అప్పగించారు. సదరు పెట్టుబడి పెట్టిన స్థానికులే విగ్రహాలకు అడ్వాన్సులు తీసుకుని ప్రజలు కోరిన తేదికి విగ్రహాలను సిద్ధం చేయాలని కళాకారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలస్యమైతే కూలీ తగ్గుతుందన్న భయంతో కళాకారులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కడప నగరంతోపాటు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల శివార్లలో పెద్ద టెంట్లు వేసుకుని గణపయ్య విగ్రహాలను తయారు చేస్తున్నారు. నిజానికి విగ్రహాల వ్యాపారం నిన్న, మొన్నటివరకు కళాకారుల ద్వారానే జరిగేది. ప్రస్తుతం పెట్టుబడి దారులు రంగప్రవేశం చేశాక కళాకా రులంతా కూలీలుగా మారారు. తయారీదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లే విగ్రహాలకు ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. ఐదు అడుగుల విగ్రహం రూ. 8–10 వేలకు విక్రయిస్తున్నారు. 13 అడుగుల భారీ విగ్రహం రూ. 50–60 వేలకు ఇస్తున్నారు. తాము మాత్రం ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకుంటూ కళాకారులకు కూలీ మాత్ర మే ఇస్తున్నారు. సీజన్ పోతే ఈ ఆదాయం కూడా ఉండదంటూ కళాకారులు వచ్చిన కాడికే తీసుకుంటున్నారు. -
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్ఎస్లో ఓ ఉపాధ్యాయుడు.. -
ఎవరికీ పట్టని ప్రాణాలు
జానెడు పొట్ట కోసం ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి దూరతీరాలకు పోయి కాయకష్టం చేసే వారు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు. మహానగరాల్లో రాళ్లెత్తే కూలీలుగా, క్వారీల్లో గనుల్లో చెమటోడ్చే కార్మికులుగా, భారీ భవంతులకు కాపలాదార్లుగా, స్థానికులు చేయసాహసించని అనేక ప్రమాదకరమైన పనులను తప్పనిసరిగా తలకెత్తుకుని ప్రాణాలు పణంగా పెట్టే బడుగుజీవులుగా వీరు అందరికీ సుపరిచితులే. కానీ భద్రత, ఆరోగ్యం వంటివి వీరికెప్పుడూ ఆమడదూరమే. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా అర్ధాకలితో కాలం గడిపే అలాంటి అభాగ్యులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) విడుదల చేసిన నివేదిక దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడించింది. పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని, వ్యాధుల బారినపడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 30 లక్షలమంది కన్నుమూస్తున్నారని ఆ నివేదిక అంచనా. కార్మికుల ఉసురుతీస్తున్న పది రకాల కారణాలను ఆ నివేదిక గుర్తించింది. సుదీర్ఘమైన పనిగంటలు (వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ) కార్మికుల మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని, ఆ కేటగిరీలో ఏటా మరణిస్తున్నవారు 7,44,924 మంది అని తేల్చింది. ఆ తర్వాత స్థానం సూక్ష్మ ధూళి కణాలు, పొగలు, వాయువులది. వాటి బారినపడి మర ణించేవారు ఏటా 4,50,381 మంది అని లెక్కేసింది. ఇవిగాక నికెల్, ఆర్సెనిక్, డీజిల్ కాలుష్యం, సిలికా, ఆస్బెస్టాస్ తదితరాల వల్ల మరో 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో 63 శాతం ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల్లోనే వుంటున్నాయని వివరించింది. వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణరంగం వగైరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభ మైన నాలుగురోజుల సదస్సు సందర్భంగా ఐఎల్ఓ ఈ నివేదిక వెలువరించింది. మనవరకూ తీసుకుంటే జనాభాలో మూడోవంతు మంది వలసబాట పడుతున్నారు. వీరంతా పల్లెటూళ్లను వదిలి పట్టణాలకూ, నగరాలకూ వలసపోయేవారే. ఇలాంటివారు ఎలాంటి గుర్తింపూ లేకుండా బతుకులీడుస్తున్నారు. వారికి ఓటు హక్కుండదు. రేషన్ కార్డు వుండదు గనుక చవగ్గా సరుకులు లభించవు. స్థానికతకు అవకాశం లేదు గనుక వారి హక్కుల కోసం, పని పరిస్థితుల మెరుగు కోసం పోరాడే సంస్థలుండవు. అసంఘటిత రంగ కార్మికులుగా కనీసం చట్టప్రకారం దక్కాల్సినవి వారికి ఎప్పుడూ దూరమే. జ్వరమో, మరే వ్యాధో ముంచుకొచ్చినా చూసే దిక్కుండదు. ఇలాంటి అభాగ్యులకు కుటుంబాలుంటే ఈ కష్టాలన్నీ మరిన్ని రెట్లు ఎక్కువ. ఈ కార్మికుల కాంట్రాక్టర్లు సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీ ఛత్రఛాయలో వుంటారు గనుక అధికారులు వారి జోలికి పోవటానికి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికి సాహసించరు. మెరుగైన సాంకేతికత లున్న యంత్ర సామగ్రి లభ్యమవుతున్నా వాటిపై పెట్టుబడులు పెట్టడం దండగన్న భావనతో ఈ కార్మికులతోనే అన్నీ చేయిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవటం లేదా అంగవికలురు కావటం రివాజు. ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై ఏటా 3,63,283 మంది కార్మికులు మరణిస్తున్నారని ఐఎల్ఓ నివేదిక చెబుతోంది. మన దేశంలో 2017–2020 మధ్య సగటున రోజూ ముగ్గురు కార్మికులు ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. ఇవన్నీ రిజిస్టరయిన ఫ్యాక్టరీలకు సంబంధించినవి. అసంఘటిత రంగంలో సంభవించే మరణాలకు అరకొర డేటాయే వుంటుంది. సాధారణంగా ఆ రంగంలో సంభ వించే చాలా మరణాలు సహజ మరణాల ఖాతాలోకి పోతుంటాయి. వైద్యులు కూడా వారికి సహకరిస్తుంటారు. అసంఘటిత రంగ కార్మికులు చేసే వెట్టిచాకిరీ అపారమైన సంపద సృష్టిస్తోంది. కానీ ఆ సంపద సృష్టికర్తలు అనామకులుగా మిగిలిపోతున్నారు. ముగిసిపోతున్నారు. అంతర్జాతీయంగా నిబంధనలు లేవని కాదు. పని పరిస్థితుల్లో భద్రత, ఆరోగ్యం వంటి అంశా లపై ఐఎల్ఓ రూపొందించిన అంతర్జాతీయ ఒడంబడికను 187 సభ్య దేశాల్లో కేవలం 79 దేశాలు ఆమోదించాయి. కనీసం అందుకు సంబంధించిన నియమ నిబంధనలకైనా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపలేదు. అందుకు కేవలం 62 దేశాలు మాత్రమే సమ్మతించాయి. ఈ రెండు ఒడంబడి కలకూ మన దేశం ఆమడ దూరంలో వుంది. వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటో, అందులో పొంచివుండే ప్రమాదాలేమిటో బయటివారికన్నా కార్మికులకే ఎక్కువ తెలుస్తుంది. కనీసం అవి బయటివారు తెలుసుకోవటానికైనా కార్మికులకు సంఘాలుండాలి. వారి తరఫున గట్టిగా ప్రశ్నించే నేతలుండాలి. కానీ మన దేశం వరకూ చూస్తే కార్మిక సంస్కరణల పేరిట తీసుకొచ్చిన కొత్త చట్టాలు అలాంటి అవకాశాలను మరింత నీరుగార్చాయి. ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, వివక్ష, అధిక పనిగంటలు వంటివన్నీ అసంఘటిత రంగ కార్మికులకు శాపాలవుతున్నాయి. రిజిస్టరైన ఫ్యాక్టరీల్లోనే తప్పుడు లెక్కలు చూపించి కార్మికుల భద్రతకు సంబంధించిన కమిటీల ఏర్పాటు,లైంగిక వివక్ష నిర్మూలన తదితరాలను ఎగ్గొడుతున్నారు. ఇక ఎవరికీ పట్టని అసంఘటితరంగ కార్మికుల గురించి చెప్పేదేముంది? సిడ్నీలో సాగుతున్న సదస్సులో 127 దేశాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. 30 గోష్ఠులు, ఆరు సాంకేతిక సదస్సులు కూడా వుంటాయంటున్నారు. కనీసం ఈ సదస్సు తర్వాతనైనా కార్మికుల భద్రతకు ముప్పుగా పరిణమించిన సమస్యలను నివారించటానికి పకడ్బందీ విధానాలు రూపొందించటం తమ బాధ్యతగా ప్రభు త్వాలు గుర్తించాలి. -
పోలవరం కాంట్రాక్టర్ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
పూడూరులో పిల్లర్ స్థాయి దాటని ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం..
పూడూరు: మండల కేంద్రంలో పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల పనులు ముందకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. పూడూరు మండలానికి 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. పూడూరు, మన్నేగుడ, మీర్జాపూర్ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. పూడూరులోని శ్మశానవాటిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పిల్లర్లకే పనులు పరిమితమయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 3,873 డబుల్ ఇళ్లు మంజూరయ్యాయి. సగానికిపైగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించగా, మరి కొన్ని ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా పూడూరులో 50 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదుల పనులు పూర్తయి పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. పరిగి నియోజకవర్గానికి 680 ఇళ్లు మంజూరు కాగా పరిగి, దోమ, కులకచర్ల, గండ్వీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో డబుల్ ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. నిధులు లేని కారణంగానే కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. పనులు వేగవంతం చేస్తాం పూడూరులో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ప్రస్తుతం బిల్లులు వచ్చాయి. పనుల వేగం పెంచి త్వరలో పూర్తయ్యేలా చూస్తాం. – మహేశ్, ఆర్అండ్బీ ఏఈ -
కార్పెట్పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు..
-
Video: కార్పెట్పై తారు రోడ్డు.. చేత్తో ఎత్తిన గ్రామస్తులు
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. తారు రోడ్డును కొంతమంది వ్యక్తులు ఒట్టి చేతులతో అమాంతం ఎత్తేశారు. కొత్తగా వేసిన రోడ్డు అట్టముక్కలా పైకి రావడం విచిత్రంగా మారింది. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్) కింద ఈ రహదారిని నిర్మించారు. అయితే రోడ్డు మీద కార్పెట్ను బేస్లాగా పరిచి దానిపై తారు రోడ్డు వేశారు. స్థానిక కాంట్రాక్టర్ ఈ రహదారిని నిర్మించారు. దీనిని గుర్తించిన గ్రామస్థులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బోగస్ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్షానికి ఈ పనులు సాక్ష్యంగా నిలిచాయని మండిపడ్డారు. రోడ్డు వేసి నాలుగు రోజులు అవుతుందని.. ఈ విధంగా లేచిపోయే రోడ్లను గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.రాత్రికి రాత్రి ఇలాంటి రోడ్లు వేసి.. చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దీనిని ఆమోదించిన ఇంజనీర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టర్ మాటలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అతడు పేర్కొన్నాడు. రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెబుతున్నాడు. మొత్తానికి ఫేక్ రోడ్డుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్తో భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది. అయినా ఇప్పటికీ పలు గ్రామాల్లో సరైన రోడ్లు లేకపోవడం గమనార్హం. చదవండి: పసిప్రాయంలో రాసిన ఉత్తరం 15 ఏళ్లుగా వెంటాడుతూ... -
ఇదేనా రోడ్డు? దీనిపై కారు నడిపి చూపించండి.. కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే ఫైర్!
ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్ల పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాజెక్ట్ కోట్లలో ఉంటుంది గానీ నాణ్యత పరంగా మాత్రం తేలిపోతుంది. ఈ తరహా ఘటన ఉత్తరప్రదేశ్లోని ఓ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కనీసం ఆరు నెలలు కూడా కాకుండానే వేసిన రోడ్డు నాశనం అయ్యింది.ఆ రోడ్డు నాణ్యతను చెక్ చేసిన ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జఖానియన్ ప్రాంతంలోని జంగీపూర్-బహరియాబాద్-యూసుఫ్పూర్లను కలుపుతూ 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే నిర్మాణం విషయంలో రోడ్డు నాణ్యత కాంట్రాక్టర్ గాలికి వదిలిశాడు. భారతీయ సమాజ్ పార్టీకి చెందిన సుహెల్దేవ్ శాసనసభ్యుడు బెదిరామ్ ఆ రోడ్డుకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే ఆ రోడ్డు పరిశీలినకు వెళ్లి.. దాని నాణ్యతను చూసి షాకయ్యాడు. సాధారణంగా తారు రోడ్డు అంటే టన్నుల బరువున్న వాహనాలు ప్రయాణించిన తట్టుకుని నిలబడాలి. అయితే ఆ రోడ్డు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కాలు పెట్టినా కదిలిపోతోంది. దీంతో ఎమ్మెల్యే కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై స్పందిస్తూ.. "నేను రోడ్డు నాణ్యత పరిశీలనకు వెళ్లిన సమయలో అక్కడ పిడబ్ల్యుడి (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) అధికారి ఎవరూ లేరు. నేను కాంట్రాక్టర్తో ఈ సమస్యను లేవనెత్తాను. పిడబ్ల్యుడి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాను, రహదారిని ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని వాళ్లతో చెప్పాను. ఈ రోడ్డు మరి దారుణంగా ఉంది, దీని నిర్మించి కనీసం ఆరు నెలలు కూడా మించలేదని ఫైర్ అయ్యారు. అయితే ఆ రాష్ట్రంలో నాసిరకం రోడ్లు వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు. @ACOUPPolice Corruption in road construction Jakhiniya Ghazipur UP pic.twitter.com/d9bT5rP4BX — Sanjay Singh (@SANJAYK98610543) March 30, 2023 -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగొచ్చు
కీవ్: ఏడాది క్రితం మొదలైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగే అవకాశాలున్నాయని ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్, వాగ్నర్ గ్రూప్ యజమాని యెవ్గెనీ ప్రిగోజిన్ అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రిగోజిన్కు చెందిన ప్రైవేట్ సైన్యం రష్యా మిలటరీతో కలిసి ఉక్రెయిన్లో యుద్ధం చేస్తోంది. శుక్రవారం ఓ వీడియో ఇంటర్వ్యూలో ప్రిగోజిన్.. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు రష్యాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా వేశారు. నీపర్ నదికి తూర్పు వైపునున్న విస్తార ప్రాంతంపై పట్టు సాధించాలంటే మాత్రం రష్యాకు మూడేళ్ల వరకు సమయం తీసుకుంటుందని అన్నారు. కంచుకోటలాంటి డొనెట్స్క్లోని బఖ్ముత్లో ఉక్రెయిన్ దళాలతో తమ గ్రూప్ శ్రేణులు భీకర పోరాటం సాగిస్తున్నాయని చెప్పారు. తమ ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు కొనసాగుతుందని రష్యా కూడా చెబుతుండటం గమనార్హం. రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ కేటరింగ్ కాంట్రాక్టులు చేసే ప్రిగోజిన్కు ‘పుతిన్ వంటమనిషి’గా పేరుంది. శనివారం ఒడెసాలో వ్యూహాత్మక రైల్వే వంతెనను రష్యాకు చెందిన సీ డ్రోన్ దాడితో పేల్చేస్తున్న వీడియో ఒకటి రష్యా మిలటరీ బ్లాగర్లు విడుదల చేశారు. దీనిని ఇరు దేశాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్చూర్లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
కర్నాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. బీజేపీ ప్రభుత్వమే కారణమా?
కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు బిల్లులు క్లియర్ కాకపోయిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య సందర్భంగా తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ టీఎన్ ప్రసాద్(50) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ కింద రూ.16 కోట్ల విలువైన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రసాద్ చేపట్టారు. అయితే బిల్లుల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో, అప్పులు చెల్లించకలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉందని చెప్పారు. మరోవైపు.. ప్రసాద్ మృతిపై కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని బలరాం చెప్పుకొచ్చారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్లో ఆలస్యం వల్ల తాను మనోవేదనకు గురవుతున్నట్టు తనతో చర్చించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో కర్నాటకలోని బీజేపీ సర్కార్పై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు పాస్ కావంటూ కొందరు కాంట్రాక్టర్లతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
కాంట్రాక్టర్ మోసం చేశాడని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
చైతన్యపురి: పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికిలోనైన ఓ సబ్ కాంట్రాక్టర్ కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీతారాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఖమ్మం, ప్రశాంత్నగర్కు చెందిన చండ్ర శశికుమార్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేసేవాడు. హైదరాబాద్ పంజగుట్టకు చెందిన కాంట్రాక్టర్ జీవీ ప్రతాప్రెడ్డి కంపెనీ డైరెక్టర్ జీవీ దినేష్రెడ్డి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులను శశికుమార్ తీసుకున్నాడు. ఇందుకు సంబందించి సుమారు రూ.2 కోట్లు బిల్లులు రావాలని వెంటనే తనకు డబ్బులు ఇవ్వాలని దినేష్రెడ్డిని ఫోన్లో అడిగాడు. అయితే అతను స్పందించకపోవటంతో ఆదివారం శశికుమార్ తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్కు వచ్చి దిల్సుఖ్నగర్లోని గణేష్ లాడ్జిలో దిగారు. బుధవారం ఖమ్మంలో ఉంటున్న తన బావమరిది సురేష్కు ఫోన్ చేసి తామంతా సూసైడ్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో సురేష్ సరూర్నగర్ పోలీసులకు సమాచారం అందించాడు. లాడ్జికి వెళ్లిన పోలీసులకు అప్పటికే అపస్మారకస్థితిలో అప్పటికే నిద్రమాత్రలు మింగి శశికుమార్, శ్వేత అపస్మారక పరిస్థితిలో కనిపించారు. ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకుని ఉన్నారు. వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వటంతో వారు క్షేమంగా ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 8 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం సెల్ఫోన్లో సూసైడ్ చేసుకోవడానికి కారణాలను వివరిస్తూ వీడియో రికార్డు చేసినట్లు గుర్తించారు. అందులో తనకు రావాల్సిన, ఇవ్వాల్సిన డబ్బుల వివరాలు కూడా శశికుమార్ వివరించాడు. కాంట్రాక్టర్ తనపై మధిర పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు పెట్టాడని, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా తమను బెదిరిస్తున్నాడని, తాను అన్ని వివరాలు రాశానని వాటి ఆధారంగా అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
విచారణ జరుగుతోంది, తొందరెందుకు? విపక్షాలపై సీఎం ఫైర్
బెంగళూరు: కే.ఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేసేది, లేనిది విచారణ అధికారుల నిర్ణయమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన శనివారం హంపీ సమీపంలోని కన్నడ విశ్వ విద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి జార్జ్పై వచ్చిన ఆరోపణలపై అప్పటి సీఎం ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేయించలేదని ప్రశ్నించారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకలా మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మంచిది కాదన్నారు. సంతోష్ పాటిల్ గదిలో క్రిమిసంహారక మందు దొరకడంతో విచారణ జరుగుతోందన్నారు. కాగా హొసపేటెలో బీజేపీ కార్యనిర్వాహక సభ భారీఎత్తున నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది? కాంగ్రెస్ హస్తం ఉందేమో ? సాక్షి,బళ్లారి/హొసపేట: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే వారి హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్ కటిల్ పేర్కొన్నారు. శనివారం ఆయన హొసపేటలో విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్ ఆత్మహత్య వెనుక మహానాయకుడు హస్తం ఉందని చర్చసాగుతోందని, ఆ దిశగా దర్యాప్తు కూడా చేయిస్తామన్నారు. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని రాద్ధాంతం చేస్తున్నారని, ఎవరిని అరెస్ట్ చేయాలో చట్టం చూసుకుంటుందన్నారు. -
కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది?
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్పాటిల్ ఆత్మహత్య చేసుకోవడానికి పంటల తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందు మోనోక్రోటోఫాస్ తాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సంతోష్పాటిల్ చిక్కమగళూరు వద్ద కైమర అనే గ్రామంలో 4 రోజుల పాటు ఒక హోంస్టేలో మకాం వేశాడు. ఆ తరువాత ఉడుపిలో లాడ్జి గది తీసుకున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. హోం స్టేలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ హుషారుగా ఉన్నాడని, వెళ్లేటప్పుడు అక్కడ కుక్కలకు బిస్కెట్లు వేశాడని తెలిసింది. హోం స్టే, లాడ్జి వద్ద సీసీ కెమెరాల చిత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ముగ్గురు ఎవరని ఆరా తీశారు. ఈశ్వరప్ప అరెస్ట్కు కాంగ్రెస్ ధర్నాలు.. శివాజీనగర: కాంట్రాక్టర్ కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శనివారం నుంచి వారంరోజుల ఆందోళన ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల 9 బృందాలుగా ఏర్పడి వివిధ జిల్లా, తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేశారు. పాటిల్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఈశ్వరప్పను అరెస్టు చేసి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర జిల్లా వ్యాప్తిలో ధర్నా నిర్వహించారు. మంత్రిమండలి నుంచి తొలగింపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో మంత్రి పదవికి కే.ఎస్.ఈశ్వరప్ప రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన ఆ లేఖను సీఎం బొమ్మైకి ఇవ్వగా, అటు నుంచి గవర్నర్ గెహ్లాట్కు పంపారు. ఆ మేరకు ఈశ్వరప్పను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలిచ్చారు. -
కాంట్రాక్టర్ ఆత్మహత్యపై స్పందించిన మంత్రి..‘ రాజీనామా చేసే ప్రసక్తే లేదు’
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ను తను ఇప్పటి వరకు కలవలేదని కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ మరణానికి తను బాధ్యుడిని కాదని అన్నారు. కాగా బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి ఈశ్వరప్ప కమీషన్లు అడిగారని కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. తాజాగా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. నేను ఇప్పటి వరకు కాంట్రాక్టర్ను చూడలేదు, కలవలేదు. కేంద్రానికి రాసిన ఆ లేఖను మా శాఖకు పంపించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమాధానమిచ్చారు. అయితే పాటిల్కు సివిల్ పనులు అప్పగించినట్లు ఎలాంటి రికార్డ్ లేదు. అలాగే పేమెంట్ గురించి కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిస్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రిని కోరాను’ అని ఈశ్వరప్ప తెలిపారు. సంబంధిత వార్త: సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం కాగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ లాడ్జీలో మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణానికి ముందు తన చావుకు ఈశ్వరప్పే కారణమని, అతనికి శిక్ష పడాలని.. స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసెజ్లు పంపారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కోరారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. దీంతో ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంతోష్ పాటిల్ ఆరోపణలపై పరువు నష్టం కేసు కూడా వేసినట్లు తెలిపారు. -
కుమార్ వర్మ మరో దందా!... కాంట్రాక్టర్నూ వదల్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు, మణికొండ వాసి నుంచి రూ.1.08 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్ సర్ఫేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుడు కుమార్ శ్రీనివాస్ పెనుమత్స వర్మ అలియాస్ కుమార్ వర్మ మరో దందా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ను రూ.కోటి మేర మోసం చేసినట్లు జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన సదరు క్లాస్–1 కాంట్రాక్టర్ 2015 తర్వాత కాంట్రాక్టులకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఓ స్నేహితుడి ద్వారా కుమార్ వర్మ పరిచయమయ్యాడు. తాను పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తుంటానని, ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన మనుషులను సరఫరా చేయాల్సిందిగా కుమార్ వర్మ కోరడంతో బాధితుడు అంగీకరించాడు. తొలి నెల రోజులు చేసే పనులన్నీ ట్రైనింగ్ కిందికి వస్తామని, ఆపై డబ్బు చెల్లిస్తానంటూ కుమార్ వర్మ చెప్పగా ఈయన అంగీకరించారు. ఎలాంటి వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా, ఒప్పందపత్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు చెన్నైలోనూ పలు పనులు చేయించారు. ప్రతి నెలా దాదాపు రూ.6 లక్షల చొప్పున రూ.20 లక్షల వరకు బాధితుడు మనుషులకు చెల్లించాడు. ఈ కాలంలో కేవలం కొంత మాత్రమే బిల్లుల రూపంలో కుమార్ వర్మ చెల్లించాడు. ఇదిలా ఉండగా... 2020లో లాక్డౌన్ అమలులోకి రావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ప్రారంభమైన తర్వాత తాను పూర్తిగా నష్టపోయానంటూ చెప్పిన కుమార్ వర్మ అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేనన్నాడు. ఆపై చేసే పనులకు మాత్రం ప్రతి నెలా చెల్లిస్తానంటూ బాధితుడితో మరికొన్ని పనులు చేయించాడు. మొత్తం రూ.కోటికి పైగా పనులు చేయించిన తర్వాత కూడా కేవలం రూ.17 లక్షలే చెల్లించాడు. మిగిలింది ప్రవాస భారతీయుడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇస్తానన్నాడు. కొన్నాళ్లకు బాధితుడు ఆరా తీయగా ప్రవాస భారతీయుడి నుంచి రూ.7 కోట్లు స్వాహా చేశాడని, వివిధ పనులకు సంబంధించిన మొత్తం నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయుడి కేసులో కుమార్ వర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో వర్మతో పాటు అనూష రాజ్, నాగేంద్ర మహేష్ జనార్దన, కర్ణ మహేంద్ర రాజ్, అకౌంటెంట్ ప్రసన్న కుమార్ సైతం నిందితులుగా ఉన్నారు. వీరి పాత్రపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు అందుబాటులో లేరని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కొంపముంచిన ప్రకటన! 20 రోజులు.. రూ.11.26 లక్షలు) -
సామాన్య భక్తురాలిగా వచ్చి.. కాంట్రాక్టర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని..
సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు వాహనాల పార్కింగ్ పేరిట దోపిడీకి గురవుతున్న వైనంపై వచ్చిన ఫిర్యాదులపై ఈవో రమాదేవి స్పందించారు. గురువారం ఉదయం సామాన్య భక్తురాలిగా వచ్చిన ఈవో పార్కింగ్ టెండర్ కాంట్రాక్టర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వేములవాడలో రాజన్న ఆలయ టీటీడీ ధర్మశాలల పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకునేందుకు రూ.30 పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్ రూ.100 వసూలు చేస్తున్నట్లు ఈవో రమాదేవికి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం సామన్య భక్తురాలిగా ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఈవో రూ.100 పార్కింగ్ ఫీజు చెల్లించి, కాంట్రాక్టర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఈవో రమాదేవి మాట్లాడుతూ.. పబ్బ లచ్చయ్య, పబ్బ శ్రీనాథ్లకు చెందిన పార్కింగ్ ఫీజు, టెంకాయ టెండర్లను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు ఉచిత పార్కింగ్, నాంపల్లి గుట్టపైకి ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్ రూ.30కి బదులు రూ.100 వసూలు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు టీటీడీ ధర్మశాలల ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.30 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ దేవస్థానం అధికారులు ముద్రించిన రూ.30 టికెట్ల స్థానంలో రూ.100 టికెట్లు ముద్రించి అందినంత దండుకుంటున్నారు. టెంకాయ టెండర్ రద్దు భక్తులకు ఉచితంగా టెంకాయకొట్టే నిబంధనలు అమలులో ఉండగా, రాజన్న ఆలయంలో భక్తుల నుంచి బలవంతంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ఈవో గురువారం గుర్తించారు. వెంటనే సంబంధిత టెండర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ డబ్బులు ఇవ్వవద్దని కోరారు. చదవండి: కరీంనగర్: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు -
అనంతలో ఘోర ప్రమాదం.. వాగులో దూసుకెళ్లిన కారు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విడపనల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వాగులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ తీసిన గుంతలో కారు చిక్కుకుంది. కారులో ఐదుగురు ఉన్నట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్.. -
‘శ్రీలక్ష్మి’ నీ మహిమలూ..! తప్పు అధికారులది.. శిక్ష కొనుగోలుదారులకు
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి విల్లా కొనాలనుకున్నాడు. మల్లంపేటలో ఓ ప్రాజెక్ట్ను చూశాడు. నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాడు. బ్యాంక్ రుణం వస్తుందా అని ఆరా తీశాడు. తక్కువ ధర, నచ్చిన చోటు కావటంతో కొనుగోలు చేసేశాడు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. బ్యాంక్కు రెండు ఈఎంఐలు కూడా చెల్లించేశాడు. ఇక గృహ ప్రవేశం చేయడమే తరువాయి! కానీ అకస్మాత్తుగా మున్సిపల్ అధికారులు వచ్చి తన విల్లాకు ‘ఇది అక్రమ నిర్మాణం’ అని ఫ్లెక్సీ తగిలించిపోయారు. అసలేం జరుగుతుందో బాధితుడికి అర్థం కాలేదు. అనుమతి పత్రాలున్నాయి.. రిజిస్ట్రేషన్ అయిపోయింది.. బ్యాంక్లోనూ మంజూరు చేసింది కదా అని నెత్తీ నోరూ బాదుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోనీ, సదరు యజమాని దగ్గరికి వెళ్దామంటే.. ఆ బిల్డర్ విదేశాలకు చెక్కేశాడు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఓ విల్లా యజమానిది.. ఇలా ఒకరో ఇద్దరో కాదు మల్లంపేటలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లా ప్రాజెక్ట్ బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఆక్రమించి.. రహదారిగా చేసి.. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ పరిధిలోని 170/3,170/4,170/5 సర్వే నంబర్లలోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భూమి పలువురి చేతులు మారి.. కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. మూడేళ్ల క్రితం 3.20 ఎకరాల స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఆ సంస్థ.. 6,418 చదరపు గజాలలో 35 విల్లాలు, 5,394 చదరపు గజాలలో మరో 30 విల్లాల నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆశ్చర్యకర విషయమేంటంటే.. సదరు భూమి మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్లోనే లేదు. అయినా సరే హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేసింది. పైపెచ్చు ఈ వెంచర్కు రహదారి కూడా లేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రహదారిగా మలచడం గమనార్హం. నకిలీ అనుమతులు సృష్టించి.. 2018లో మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. దీన్నే అవకాశంగా మలుచుకున్న నిర్మాణ సంస్థ.. గ్రామ పంచాయతీ అనుమతి పత్రాలు సృష్టించి అక్రమంగా 260 విల్లాలను నిర్మించింది. హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన 65 విల్లాలకు పక్కనే మరో 15 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఆనుకొని కొత్త చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో అప్పటి మల్లంపేట పంచాయతీ కార్యదర్శులు 260 విల్లాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు పత్రాలను సృష్టించారు. ఇందులో 40 విల్లాలు చెరువు బఫర్జోన్లో ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ సంయుక్త సర్వే చేసినప్పటికీ, ఈ నివేదికను స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం. చెరువులోకి మురుగు చెరువుకు ఆనుకుని ఉన్న 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్లో విల్లాలతో పాటు నిర్మాణ వ్యర్థాలతో ఏకంగా రోడ్డును ఏర్పాటు చేసింది. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి విల్లా నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. విల్లాల మధ్య అంతర్గత రోడ్లు 30 అడుగుల వెడల్పు లేవు. పైగా మురుగు నీరంతా కొత్త చెరువులో కలిసే విధంగా డ్రైయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్కు విద్యుత్ శాఖ అధికారులు భూగర్భ కేబుల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వ్యవహారం జరుగుతున్నా నాలుగేళ్లుగా ఏ ఒక్క అధికారి నోరుమెదపలేందంటే ఈ వ్యవహారం వెనుక ఉన్న ‘పెద్దలు’ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గుట్టు రట్టయిందిలా.. విల్లాల అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ హరీష్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీపీఓ రమణ మూర్తి, డీఎల్పీఓ స్మిత క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఆయా విల్లాలను దుండిగల్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. బఫర్ జోన్లో ఉన్న విల్లాలను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు ఉపక్రమించగా.. నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకోవటం కొసమెరుపు. -
బ్లాక్మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్గా మారారని, మంత్రి మల్లారెడ్డి మొదలుకుని అనేక కాంట్రాక్టు సంస్థలవారు ఆయన బ్లాక్మెయిలింగ్ దందాను చెప్తారని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ(పీయూసీ) చైర్మన్ జీవన్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలసి మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి గాడ్ఫాదర్ చంద్ర బాబు కూడా తమను ఏమీ చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ డ్రగ్స్కు చిరునామాగా మారిందనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తోందని, అక్కడి ముఖ్య మం త్రులు తాగుబోతులా? అని జీవన్రెడ్డి ప్రశ్నిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు జనం లేక పొరుగు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తరహాలో కులవృత్తులకు ఏ ఇతర ముఖ్యమంత్రీ న్యాయం చేయలేదని ఎగ్గె మల్లేశం అన్నారు. చదవండి: తగ్గేదేలే.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ -
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్నకు చెందిన సురేష్బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్మాల్కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నీలోఫర్ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేష్బాబు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రి ఫుడ్ కాంట్రాక్టర్ కోడూరి సురేష్బాబు పోలీసులు అరెస్ట్ చేశారు. పేషెంట్లకు ఇచ్చే డైట్ బిల్స్లో సురేష్బాబు అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఇందులో రూ.కోటి 20లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. నీలోఫర్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొంపముంచిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..
సాక్షి, ఖానాపురం(వరంగల్) : జాతీయ రహదారి పనుల్లో ఎడతెగని జాప్యం, కాంట్రాక్టర్ నిర్లక్షం వెరసి ఓ కుటుంబాన్ని పోషించే యువకుడు మృత్యువాత పడ్డాడు. తండ్రి లేని లోటు తీరుస్తూ హమాలీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న యువకుడు మృతి చెందడం వి షాదాన్ని నింపింది. వరంగల్ రూరల్ జిల్లా ఖానా పురం మండలంలోని బుధరావుపేట శివారులో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంధువు మృతి చెందడంతో... మహబూబాబాద్ పత్తిపాకకు చెందిన ఎల్పుగొండ సాయిరాం(22) వ్యవసాయ మార్కెట్లో హమాలీగా పని చేస్తున్నాడు. వరంగల్లో తమ బంధువు మృతి చెందగా తన స్నేహితులు శరత్, సుమంత్తో కలిసి బుధవారం ఉదయం వెళ్లిన ఆయన దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాక ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. ఖానాపురం మీదుగా రాత్రి 7 గంటల సమయంలో మహబూబాబాద్కు వెళ్తున్నారు. కాగా, బుధరావుపేట శివారులో జాతీయ రహదారి పనుల్లో భాగంగా సుమారు రెండేళ్లుగా కల్వర్టు(బ్రిడ్జి) నిర్మాణ పనులు జరుగుంతడగా, ఎలాంటి హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో పనులను గుర్తించని యువకులు కల్వర్టును ఢీకొని గుంతలో పడిపోయారు. దీంతో సాయిరాం అక్కడికక్కడే మృతి చెందగా శరత్, సుమన్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఎవరూ చూడకపోవడంతో రాత్రంతా అదే గుంతలో అపస్మారక స్థితిలో ఉన్నారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి శరత్, సుమన్ను నర్సంపేట ఆస్పత్రికి తరలించి వెళ్లిపోయారు. అయితే అదే గుంతలో మరొకరు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకునేసరికి సాయిరాం మృతి చెంది ఉన్నాడు. బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే సాయిరాం మృతి చెందాడని ఆరోపిస్తూ మంగళవారిపేట, బుధరావుపేట గ్రామాలకు చెందిన గ్రామస్తులతో పాటు మృతుడి బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనందునే ప్రమాదం జరిగినందున, యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ సతీష్బాబు, ఎస్సైలు సాయిబాబు, బండారి వెంకటేశ్వర్లు చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కాంట్రాక్టర్లు శ్రీనివాసరావు, సందీప్రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి సోదరుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు -
Mission Kakatiya: అంతా మాఇష్టం.. రూ.137.46 కోట్ల నిధులు ‘నీళ్ల ’పాలు..
‘పక్క చిత్రం సిరిసిల్ల పట్టణ శివారులోని చంద్రంపేట ఈదుల చెరువు. మిషన్కాకతీయ మొదటి దశలో రూ.40 లక్షలతో చెరువులో పూడికతీసి, కట్టను బలోపేతం చేసి మత్తడి నిర్మించాల్సి ఉంది. చెరువులో మట్టితీసి కొంతమేరకు కట్టపై పోసి, మత్తడి కట్టారు. కట్టపై మొరం పోశారు. ఇది రికార్డుల్లో నమోదైన వివరాలు. కానీ ఇదే చెరువులో ఉపాధిహామీ పథకంలో గత ఏడేళ్లుగా స్థానిక కూలీలు మట్టిని తీశారు. ఉపాధిహామీ పథకంలో కూలీలు తవ్విపోసిన మట్టిగుంతలనూ సైతం మిషన్కాకతీయలో రికార్డు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని నొక్కేశారు. ఇప్పుడు వర్షాలు పడడంతో చెరువులో నీరు చేరింది. మిషన్ కాకతీయలో చేసిన పనులకు లెక్కలు లేకుండా పోయాయి. రికార్డుల్లో మాత్రం పూడిక మట్టి తీసినట్లుగా నమోదు చేసి బిల్లు చెల్లించారు. ఇప్పుడెవరైనా పనుల లెక్కలు చూద్దామంటే నిండిన చెరువులోనే లెక్కలన్నీ పూడుకుపోయాయి.’ ‘ఇది ముస్తాబాద్లోని పెద్ద చెరువు. దీని ఆయకట్టు 400 ఎకరాలు. 2016లో మిషన్కాకతీయలో భాగంగా చెరువుకు రూ.35 లక్షలతో మరమ్మతులు చేశారు. పనులు చేసిన ఆరు నెలలకే 2016 సెప్టెంబర్లో వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. కాంట్రాక్టర్ల నాసిరకం పనులకు ముస్తాబాద్ పెద్ద చెరువు ఉదాహరణగా నిలుస్తుందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మళ్లీ ఇదే పెద్ద చెరువును రూ.6 కోట్లతో గండిని పూడ్చి మినీట్యాంక్బండ్గా అభివృద్ధి చేశారు. ఇప్పుడు నిండిన నీటితో ముస్తాబాద్ పెద్ద చెరువు కళకళలాడుతోంది.’ సాక్షి, సిరిసిల్ల: పూడుకుపోయిన చెరువులు, కుంటల్లో మట్టిని తొలగించి, కట్టలను బలోపేతం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్కాకతీయ (మన ఊరు.. మన చెరువు)కు శ్రీకారం చుట్టింది. దశలవారీగా జిల్లాలోని చెరువులను బలోపేతం చేసి ఆయకట్టుకు నీరందించాలని, భూగర్భ జలాల పెంపునకు చెరువులు దోహదపడతాయని ఆశించింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్లుగా మారారు. చెరువుల్లో పూడిక తీ యకుండానే తీసినట్లుగా రికార్డులు చేశారు. కొన్ని పనుల్లో నాణ్యత లోపించింది. మొక్కుబడిగా పనులు చేసి ప్రజాధనాన్ని నొక్కేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఒక్కటై లక్ష్యాన్ని నీరుగారించారు. మిషన్కాకతీయ బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారులను ఏకంగా అవినీతి నిరో ధకశాఖకు పట్టించే స్థాయికి చేరింది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ కాకతీయ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. పనుల ఆనవాళ్లు.. నీళ్లపాలు జిల్లాలో మిషన్కాకతీయ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు, చెరువును బాగుచేసే పనిని పొందడం, అధికారులతో ఒప్పందం చేసుకుని పనులు చేయకుండా జాప్యం చేశారు. మరోవైపు గతంలో ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను రికార్డు చేయించుకుని ప్రజాధనాన్ని దండుకున్నారు. కాంట్రాక్టర్లు ఎక్కువ మంది అధికార పార్టీ నేతలే కావడంతో ఇరిగేషన్ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ చెరువుల్లో పనులను తనిఖీ చేస్తామన్నా నీటితో నిండడంతో పూడిక తీసిన ఆనవాళ్లు.. నీటి అడుగున కనిపించకుండా పోయాయి. మొక్కుబడి పనులతో ఆయకట్టు రైతులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. మి షన్కాకతీయ జిల్లాలో స్లోగా సాగింది. మరోవైపు ఇంకా పనులు పెండింగ్లో ఉండడం గమనార్హం. జిల్లాలో కేటాయింపులు ఇలా.. మొదటి దశ: జిల్లాలోని 104 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.20.13 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19.98 కోట్లు ఖర్చు చేసి 12,982.39 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేసినట్లు రికార్డులు చేశారు. రెండో దశ: 117 చెరువులను బాగుచేసేందుకు రూ.85.23 కోట్లు కేటాయించారు. ఇందులో 105 చెరువులకు రూ.53.10 కోట్లు ఖర్చు చేశారు. 8,789 ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు రికార్డులు చేశారు. మూడో దశ: 69 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.24.20 కోట్లు కేటాయించారు. ఇందులో 68 చెరువుల్లో పనులు ప్రారంభించి 57 చోట్ల పూర్తి చేశారు. రూ.11.76 కోట్లు ఖర్చు చేసి 12,791 ఎకరాలకు మేలు జరిగినట్లు స్పష్టం చేశారు. నాలుగో దశ: జిల్లాలో 46 సాగునీటి వనరులను బాగు చేసేందుకు రూ.7.90 కోట్లు కేటాయించారు. 22 చెరువుల్లో రూ.2.98 కోట్లు ఖర్చు చేశారు. 3,714 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలిగినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. సగం పనులు కూడా చేయలేదు మాది ఇల్లంతకుంట మండలం అనంతారం. మా పెద్ద చెరువులో సగం పనులు కూడా చేయలేదు. పూడిక తీయలేదు. కట్టను బందవత్తు చేయలేదు. తూము, మత్తడి దెబ్బతిన్నాయి. చెరువులోని నీరు లీకేజీ అవుతుంది. పూడిక తీస్తే నీళ్లు బాగా ఉండేవి. మిషన్ కాకతీయ పనులు మధ్యలోనే వదిలేసి పోయిండ్రు. – అక్కెం రామస్వామి, రైతు, అనంతారం చెరువును లోతు చేయాలి మాది కోనరావుపేట మండలం వెంకట్రావుపేట. మా కేశవరావు చెరువును లోతు చేయాలే. మిషన్ కాకతీయలో పనులు చేసినా.. అవి పూర్తి స్థాయిలో జరగలేదు. మత్తడి అలాగే ఉంది. గుట్టల ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో పూడికి వచ్చి చేరుతుంది. పూడికతీసి లోతు చేస్తే చెరువుతో రైతులకు మేలు జరుగుతుంది. – బైరగోని సురేశ్గౌడ్, వెంకట్రావుపేట కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చాం జిల్లాలో పనులు చేయకుండా మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్లకు అనేకసార్లు నోటీసులు జారీ చేశాం. జిల్లాలో ఇంకా 48 చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. పనులు జరిగిన మేరకు రికార్డులు అయ్యాయి. కాంట్రాక్టర్లకు పేమెంట్ సరిగా రావడం లేదు. తెగిపోయిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేస్తాం. – అమరేందర్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ -
పంజగుట్ట వంతెన నిర్మాణంలో జాప్యం.. రూ.లక్ష జరిమానా
సాక్షి, బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తాలో పాదచారుల వంతెన నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తవుతుందని ఇంజనీర్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది లాక్డౌన్ సమయంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అడుగడుగునా పైప్లైన్లు అడ్డురావడం ఆటంకంగా మారింది. ఆరు వారాల్లో పూర్తి కావాల్సిన పనులు ఏడాదిన్నర గడిచినా పిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్కు లిక్విడిటీ డ్యామేజ్ కింద రూ.లక్ష జరిమానా విధించారు. సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో ఈ జరిమానా విధించినట్లు ఇంజనీర్లు తెలిపారు. -
వైరల్ వీడియో: కాంట్రాక్టర్ని బురద నీటిలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే
-
Viral Video : మాట వినలేదని కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే దాడి
ముంబై : డ్రైనేజీ పనులు సరిగా చేయలేదని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టరుపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. వర్షం కారణంగా నిలిచిన వరద నీటిలో కూర్చోబెట్టారు. పక్కనున్న చెత్తను తీసి కాంట్రాక్టరు నెత్తిన వేశారు. శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే సమక్షంలోనే ఈ అమానవీయ ఘటన జరిగింది. ముంబైలో చండీవలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైనేజీపై రగడ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరం నీట మునిగింది. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారింది. దీంతో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చండీవలి ప్రాంతంలో డ్రైనేజీ నీరు తొలగించాలంటూ పదిహేను రోజుల కిందట ఆ ఏరియా కాంట్రాక్టర్ని ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆదేశించారు. పరిష్కరించలేదు రెండు వారాలు గడిచినా కాంట్రాక్టరు సమస్యను పరిష్కరించలేదు. దీంతో శివసేన కార్యకర్తలే అక్కడ బురద, చెత్తను తొలగించి వర్షపు నీరు పోయేలా పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టరు అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా దాడి కాంట్రాక్టరును చూడగానే ఎమ్మెల్యే, అతని అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బురదలో కూర్చోవాలంటూ ఒత్తిడి చేశారు.... చివరకు బురద నీటిలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అక్కడున్న చెత్తను తెచ్చి అతని తలపై , ఒంటిపై వేశారు. తప్పు జరిగిందని వేడుకున్నా ... వినకుండా దుర్భాషలాడారు. కాంట్రాక్టరు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదు. అందువల్లే ఇలాంటి చర్యకు పాల్పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే దిలీప్ పాండే వివరణ ఇచ్చారు. ఇదే నీతి మీకు వర్తిస్తుందా ? కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే జరిపిన దాడిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టరు తరహాలోనే పనులు చేయని ప్రజాప్రతినిధులను కూడా శిక్షించాలంటూ మెజారీటీ ప్రజలు డిమాండ్ చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లను శిక్షించాల్సందేనంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా...తప్పులను సరిదిద్దేందుకు చాలా మర్గాలు ఉన్నాయని, ఇలాంటి అమానవీయ శిక్షలు సరికాదని మరికొందరు అన్నారు. చదవండి: ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం ! -
నక్సల్స్ ఘాతుకం: కాంట్రాక్టర్ దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టు నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్ను దారుణంగా హత్య చేసిన నక్సల్స్ అదే సమయంలో అక్కడే గల విలువైన వాహనాలను దహనం చేశారు. సుక్మా జిల్లా మాథిలి పోలీస్స్టేషన్ పరిధిలోని గోలియాగూడలో నక్సలైట్లు ఈ బీభత్స ఘటనకు పాల్పడ్డారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వచ్చిన మావోయిస్టులు తొలుత మూడు వాహనాలకు నిప్పటించారు. ఆ తర్వాత అక్కడే ఉండి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ను చంపారు. నిన్న సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తమ సహచరున్ని పోలీసులు కాల్చి చంపారనే ఆగ్రహంతో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికంగా భీతావహాన్ని కలిగించిన ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. -
అంతే వీరు.. మారదు తీరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కూన రవికుమార్ సోదరుడిలో కనీసం మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో ఆయన వేసిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కొత్త రోడ్డు కొన్నాళ్లకే పా డైపోతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం పూర్తి స్థాయి నాణ్య తా ప్రమాణాలతో మళ్లీ వేయాల్సి ఉంటుంది. కానీ వారి అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదన్నట్టుగా మరమ్మతుల్లో కూ డా నాసిరకం పనులే చేపట్టారు. వీరి పనితనం వల్ల రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు జనాలను వెక్కిరించేదిగా తయారైంది. విపత్తు నివారణ పథకం కింద పొందూరు మండలం కింతలి–బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్హెచ్–5 వరకు 4.75 కిలోమీటర్ల తారు రోడ్డు వేసే కాంట్రాక్ట్ను టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ సోద రుడు, విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేత కేవీ సత్యనారాయణ దక్కించుకున్నారు. రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు కొన్నాళ్లకే శిథిలమైపోయింది. గునపాలతో పెకిలించినట్టుగా ధ్వంసమైపోయింది. ఇదే విషయమై ఆగస్టు 31వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘రోడ్డు శిథిలం–అవినీతి పదిలం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. మరమ్మతు పనుల్లోనూ.. ‘సాక్షి’లో కథనం వచ్చాక హుటాహుటిన కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఆ రోడ్డు వద్దకు చేరుకుని, శిథిలమైన రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేపట్టేందుకు చర్య లు తీసుకున్నారు. దీంతో ఆ రోడ్డుకు మంచి రోజులొస్తాయని, తమ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశపడ్డారు. కానీ కాంట్రాక్టర్ అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదు. ఎక్కడైతే రోడ్డు శిథిలమై కుంగిపోయిందో అక్కడే మట్టితో కప్పి మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవంగా రోడ్డు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం వేసిన రోడ్డు పాడైతే దాన్ని పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇక్కడ మట్టితో మమ అనిపించేశారు. ఇంకేముంది ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ రోడ్డు కుంగిపోయింది. వేసిన మట్టి కొట్టుకుపోతోంది. చేసిన ప్యా చ్ వర్క్ కూడా పనికి రాకుండా పోయింది. మరమ్మతుల్లో కూడా నాసిరకం పనులే చేశారు. ఫలితంగా ఆ రోడ్డు అక్క రకు రాకుండా పోతోంది. చెప్పేందుకే నీతులు చేసేవన్నీ అవినీతి పనులే అని మరోసారి నిరూపించుకున్నారు. టీడీ పీ హయాంలో జరిగిన నీరు చెట్టు పనులు మాదిరిగానే రోడ్డు పనులు చేపట్టి కోట్లాది రూపాయలకు కన్నం పెట్టేసిన ఘనుడిగా మరోసారి నిలిచిపోయారు. వెక్కిరిస్తున్న ‘కూన’ వేసిన రోడ్డు కూన రవికుమార్ సోదరుడు కె.వి.సత్యనారాయణ వేసిన రోడ్డు ఇప్పుడందర్ని వెక్కిరించేలా ఉంది. అటుగా వెళ్లిన వారంతా ఆ రోడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోట్లాది రూపాయలతో వేసిన రోడ్డుకు ఈ పరిస్థితేంటని అవాక్కవుతున్నారు. అధికారంలో ఉన్నంతవరకు అడిగే వారు లేక ఇష్టారాజ్యమైపోయిందని, ఇప్పుడైనా నాణ్యమైన పనులు చేపట్టి, కోట్లాది రూపాయలకు ఫలితం వచ్చేలా చూడాల్సింది పోయి అదే అడ్డదార్లు తొక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంజనీరింగ్ అధికారులు సైతం నాసిరకం మరమ్మతు పనులపై అభ్యంతరం తెలపకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. -
చేపల మార్కెట్లో రివాల్వర్తో బెదిరింపు..
-
ఒకే కాంట్రాక్టర్కు 4,769 పనులు!
►మెదక్ జిల్లా తూప్రాన్లోని 2 ట్రాన్స్ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్కు చెల్లించారు. ►మహబూబ్నగర్ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్కు రూ. 71,750 చెల్లించారు. ►సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్కు రూ. 82,360 చెల్లించారు. ►పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్కు రూ. 84,840 చెల్లించారు. ►నామినేషన్ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్బుక్ లైవ్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏడీఈ) కోటేశ్వర్రావు బహిర్గతం చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ ఏడీఈగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్ నిర్వహించి టీఎస్ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్ చేయడంతో ఇది ఫేస్బుక్లో వైరల్గా మారింది. యాజమాన్యం అండదండలతోనే... వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్ ఎలక్ట్రికల్స్ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్రావు బయటపెట్టారు. ఎస్ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు. రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్ ఒకే డివిజన్ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రబ్యూషన్ బడ్జెట్ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 700 శాతం వరకు రేట్ల పెంపు... కోటేశ్వర్రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో కేసు... టీఎస్ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
కాంట్రాక్టర్ మాయాజాలం
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): ఏపీఈపీడీసీఎల్లో ఆయనో మానవ వనరులను సరఫరా చేసే కాంట్రాక్టర్.. 2014 వరకు సాధారణ వ్యక్తి.. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ట్రాన్స్కోలో చక్రం తిప్పాడు. అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకుని ఉన్నతాధికారుల్ని వలలో వేసుకున్నాడు. నూతనంగా ఏర్పాటు చేసే సబ్స్టేషన్లలో ఉద్యోగాలు వేయిస్తానని ఉద్యోగ స్థాయిని బట్టి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు వెలుగులోకి రావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని కాంట్రాక్టు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. ఉద్యోగుల ‘స్పందన’లో శుక్రవారం బాధితులు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కు వినతి పత్రాన్ని అందజేయడంతో ఇది చర్చనీయాంశమైంది. ఒక కాంట్రాక్టర్ వల్ల తాము ఏ విధంగా ఇబ్బందులు పటుతున్నదీ వారు జిల్లా ఉన్నతాధికారి వద్ద వాపోయారు. వివరాల్లోకి వెళితే ...ఎన్.స్వామినాయుడు ఎంఎస్ సాయి మణికంఠ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. 2012 వరకు విద్యుత్ రంగ సంస్థలో ఏపీ ట్రాన్స్కో 139/33 కేవీ డీజీఎన్పీ(చావుల మదుం సమీపంలో ఉన్న) సబ్ స్టేషన్లో సబ్ ఇంజినీర్(హైస్కిల్డ్)గా పార్ట్టైం సూపర్వైజర్గా పని చేసేవాడు. ఆ తరువాత ఉద్యోగం మానేసి రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ డిప్లమా సర్టిఫికెట్ సంపాదించి కాంట్రాక్టర్ అవతార మెత్తాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి అప్పటి మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అండతో ఏపీఈపీడీసీఎల్లో చక్రం తిప్పాడు. అప్పట్లో అవుట్ సోర్సింగ్లో పనిచేసే వారిని పర్మినెంట్ చేసేవారు. ఖాళీ అయిన స్థానాల్లో అవుట్ సోర్సింగ్లో కొత్తవారిని నియమించేవారు. ఈమేరకు ఉద్యోగాలు వేయించేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా విజయనగరం జిల్లాలో 200 ఖాళీలను భర్తీ చేశాడని చెబుతున్నారు. విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి అని చెప్పుకుంటున్నారు. అప్పట్లో ట్రాన్స్కో, ఏపీఈపీడీసీఎల్ సంస్థల్లో కొందరు అధికారుల సహకారంతో రూ.వందల కోట్లు ఆర్జించాడని బాహటంగానే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్లాయనే వాదన ఉంది. కారుణ్యం లేదు... జిల్లాలోని నర్సీపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్స్టేషన్లో వేరొక కాంట్రాక్టర్ 11 మందిని కారుణ్య నియామకాలు చేపట్టారు. నెల రోజుల తరువాత గ్లోబల్ టెండర్ విధానంలో స్వామి నాయుడుకు ఆ కాంట్రాక్టు టెండర్ బదాలాయించారు. గతంలో జరిపిన కారుణ్య నియామకాల ద్వారా చేరిన వారిని భయాందోళనలకు గురిచేసి తొలగించేశారు. స్థానిక మంత్రి అయ్యన్నపాత్రుడుతో కుమ్మక్కయి ఒక్కో ఉద్యోగానికి రూ.7లక్షలకు అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా నర్సింగబిల్లి సబ్ స్టేషన్లో 11 మందిని నియమించారు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ సహకారంతో గతంలో నియమించిన వారిని తొలగించి కొత్తవారిని చేర్చారు. ఇది అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులతో భయపెట్టారు. ఈ అరాచకాలను తట్టకోలేక దేవీప్రసాద్ అనే స్కిల్డ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు... వీరు చేసిన అవకతవకలు బయటపడడంతో పశ్చిమగోదావరి జిల్లాలో టెండర్లను రద్దు చేస్తూ ఈపీడీసీఎల్ సీజీఎం–ఓ అండ్ సీఎస్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. తాడేపల్లి డివిజన్లో టెండర్ రద్దు చేస్తూ 2019 జూన్ 15న బ్లాక్లిస్టులో పెట్టారు. ఈ వ్యక్తి కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని తిరిగి టెండర్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామినాయుడు అరాచకాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బాధితులు కోరుతున్నారు. ఈమేరకు ‘స్పందన’ కార్యక్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి... ఇటీవల 2018–19లో 132/33 కేవి సబ్స్టేషన్లలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించి కారుణ్య నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారంలోనూ అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. వాచ్మన్ ఉద్యోగానికి రూ.5లక్షలు, ఐటీఐ చేసిన వారికి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి రూ.10లక్షలు, డిప్లమా చేసిన వారికి రూ.9లక్షలు వంతున వసూలు చేశారనే వాదన ఉంది. అరాచకాలపై విచారణ జరపాలి కాంట్రాక్టర్ చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ జరపాలి. చాలా చోట్ల ఉద్యాలు వేయిస్తామని నమ్మించి మా లాంటి నిరుద్యోగుల నుంచి లక్షల్లో దోచుకున్నాడు. పాత ఉద్యోగుల్ని రాజకీయం చేసి తొలగించేలా చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రమేయం ఉంది. – ఎం.కృష్ణ, అనకాపల్లి -
మట్టిని దోచేశారు
సాక్షి, పరకాల: మిషన్ కాకతీయ పనులను అడ్డం పెట్టుకొని సంబంధిత కాంట్రాక్టర్లు అడ్డగోలుగా చెరువు మట్టిని మాయం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్ పరకాల పెద్దచెరువు మట్టిని తరలిస్తు దర్జాగా అమ్మేసుకుంటున్నాడు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువు కట్ట మరమతులు చేపట్టడంతో పాటు చెరువులోని నల్లమట్టిని రైతుల అవసరాలకు తరలించాల్సి ఉండగా కాంట్రాక్టర్ మొరం తవ్వకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒకవైపు అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండగా లక్షలాది రూపాయాల విలువ చేసే చెరువు మొరాన్ని మూడు నెలలుగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. తన అనుచరులకు చెందిన 5 జేసీబీ వాహనాలు, 50 ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు మొరం తరలిస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పుకు మొరం మట్టికి రూ.500 నుంచి రూ.600 వరకు, నల్లమట్టికి రూ.250 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా చెరువు నుంచి వందలాది ట్రిప్పుల మొరం మాయమైంది. కట్ట మరమతులకు నాలుగైదు ట్రాక్టర్లను వినియోగించి మిగతాదంతా పట్టణ ప్రజల ఇళ్ల నిర్మాణ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తుంది. పట్టణంలో ఖాళీ స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న ప్లాట్లు చెరువుమట్టితో దర్శనమిస్తున్నాయి.ఓ జేసీబీ యాజమాని ఇదే అదనుగా భావించి తనకు సంబంధించిన ఎకరం ప్లాటుకు 500 ట్రాక్టర్ ట్రిప్పుల మట్టిని తరలించడం చూస్తుంటే మట్టిదందా ఎంత జోరుగా సాగుతుందో స్పష్టం అవుతుంది. మిషన్ కాకతీయ పథకం పేరిట ఒకవైపు బిల్లులు తీసుకుంటూనే మరోవైపు చెరువు మట్టిని అమ్ముకుంటున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. చెరువు అంతా గుంతలమయం వాస్తవానికి మిషన్ కాకతీయలో భాగంగా చెరువులో ఒకే మాదిరిగా తవ్వకాలు చేయాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ తనకు మొరం లభించిన చోటల్లా జల్లెడ పట్టినట్లు తవ్వేస్తున్నాడు. దీంతో చెరువులో భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షకాలంలో చెరువులో నీరు ఎక్కడిక్కడే నిలిచిపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు, ప్రజలు ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎక్కువగోతులు ఉండడం వల్ల చెరువు నీరు తూము వద్దకు చెరుకోకుండా దూరంగానే నిలిచిపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు లేకపోలేదు. కట్టమరమతులో నాణ్యత లోపం చెరువు కట్ట పనుల్లో నాణ్యత కరువైంది. కట్టను వెడల్పు చేయడానికి కాంట్రాక్టర్ గతంలో ఉన్న కట్ట మట్టిని సగభాగం వరకు తొలగించి మళ్లీ చెరువు మొరం మట్టిని పోయిస్తున్నాడు. అయితే గట్టిపడిన కట్టను తొలగించి మళ్లీ పనులు చేపట్టడం వెనుక కాంట్రాక్టర్ కక్కుర్తి స్పష్టం అవుతుంది. ముఖ్యనేత పేరిట మట్టిదందా నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పుకుంటూ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నాడు. పరకాల మండలంలోని నాగారంతో పాటు ఇతర చెరువుల్లో నిబంధనలకు విరుద్దంగా మట్టి తవ్వకాలు కొనసాగుతోన్నాయి. ప్రతిపక్షపార్టీల నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తరలింపును ఆపేసినట్లు సమాచారం. నేడు మళ్లీ అదే బాటలో పెద్ద చెరువు కాంట్రాక్టర్ నియోజకవర్గ ముఖ్యనేతకు అనుచరుడిగా చెప్పుకుంటూ చెరువు మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న చెరువు మట్టిని అడ్డుకోవాలని లేనట్లయితే చెరువులో నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీఐఏ గూఢచారికి ఇరాన్ ఉరిశిక్ష
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న జలాల్ హాజీ జవెర్ అనే రక్షణశాఖ కాంట్రాక్టర్ను ఉరితీసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) కోసం ఇతను పనిచేసేవాడని వెల్లడించింది. పక్కా సాక్ష్యాధారాలతో జలాల్ను పట్టుకున్నామనీ, అతని ఇంట్లో ఇరాన్ రక్షణశాఖకు సంబంధించి కీలక పత్రాలు, నిఘాపరికరాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. జలాల్ను ఇరాన్ మిలటరీ కోర్టు దోషిగా తేల్చి ందనీ, ఆయనకు కరాజ్ నగరంలోని రాజయ్ షాహ్ర్ జైలులో మరణశిక్షను అమలుచేశామని చెప్పింది. జలాల్తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ నేరానికి ఆయన మాజీ భార్యకు 15 ఏళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఎటుదారితీస్తుందో అని ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. -
సిఐ చాంబర్లో కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు
-
బొల్లినేనికి బంపరాఫర్
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టులో కాకర్ల గ్యాప్ పనుల్లో సీఎం చంద్రబాబు సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ సంస్థకు రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు చెప్పడం ఆలస్యం.. ఆయన సూచనలు పాటిస్తూ ఆగమేఘాలపై సదరు కాంట్రాక్టర్కు బంపర్ ఆఫర్ కింద ఈ అ‘ధన’పు సొమ్ము మంజూరు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీపీ) మౌలిక సూత్రాల్ని తుంగలో తొక్కేశారు. డిజైన్ మారడం వల్ల కాంట్రాక్టర్ అదనపు పనులు చేయాల్సి వచ్చిందని.. ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించాల్సి వస్తోందంటూ ఉత్తర్వుల్లో సమర్థించుకోవడం గమనార్హం. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా కాంట్రాక్టర్కు అదనపు లబ్ధి చేకూర్చుతూ ఇలా ఉత్తర్వులు జారీ చేయడాన్ని జలవనరుల శాఖ వర్గాలే తప్పుపడుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా కాకర్ల గ్యాప్ను పూడ్చటం ద్వారా ఎన్వోఎఫ్ డ్యామ్ నిర్మించి.. దాని ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు పనుల్ని రూ.206.80 కోట్లకు ఎస్సీఎల్–బీఎస్పీసీఎల్(జేవీ) 2005లో దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం మూడేళ్లలో పనులు పూర్తి కావాలి. కానీ పనులు పూర్తి చేయకపోవడంతో గడువు మరో రెండేళ్లు పొడిగించారు. అయినా పనులు పూర్తి చేయలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బొల్లినేని శీనయ్యకు చెందిన బీఎస్పీసీఎల్పై అమితప్రేమ చూపింది. డిజైన్ మారడంతో 30 కాంక్రీట్ నిర్మాణాల స్థానంలో 48 నిర్మించాల్సి వస్తోందని.. ఆ మేరకు అదనపు బిల్లులివ్వాలని ఆ సంస్థ 2015లో సర్కార్కు ప్రతిపాదనలు పంపింది. ఈపీసీ విధానానికి ఇది విరుద్ధమని జలవనరులశాఖ అధికారులు తోసిపుచ్చారు. అయితే సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో జిల్లా స్థాయి స్టాండింగ్ కమిటీ(డీఎల్ఎస్సీ), స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ)లకు ఈ ప్రతిపాదనలను పంపారు. ఆ కమిటీల్లోని అధికారులపై ఒత్తిడి తెచ్చి అదనపు బిల్లుల మంజూరుచేసేలా ప్రతిపాదన చేయించారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రతిపాదనను ఆమోదించడానికి ఇంటర్నల్ బెంచ్మార్క్ కమిటీ(ఐబీఎం) తిరస్కరిస్తూ వచ్చింది. ఐబీఎం కమిటీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అదనపు నిధులిచ్చే ప్రతిపాదనపై చంద్రబాబు ఆమోదముద్ర వేయించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టర్కు అదనపు లబ్ధి కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయకూడదు. కానీ సీఎం సూచనల మేరకు బొల్లినేనికి రూ.36.40 కోట్ల అదనపు ప్రయోజనం చేకూర్చుతూ ఉత్తర్వులు జారీ చేసేశారు. -
కనిపించని కేజీహెచ్ నీడ
విశాఖ సిటీ: ఈ మధ్యన వచ్చిన నెపోలియన్ సినిమాలో హీరో నా నీడపోయింది సార్ అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తాడు. సరిగా ఇదే తరహాలో కేజీహెచ్ సిబ్బంది ఆస్పత్రిలో ఈ రోజు ‘షాడో’ కనిపించలేదుగా అంటూ గుసగుసలాడుకున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఆస్పత్రిని, సూపరింటెండెంట్ని అంటిపెట్టుకుని ఉండే సదరు ‘ఖాన్’ట్రాక్టు ఉద్యోగి ఆదివారం ప్రచురితమైన సాక్షి కథనంతో కేజీహెచ్ ఛాయల్లోకి రాలేదు. ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి వచ్చినసూపరింటెండెంట్.. ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కేజీహెచ్పై పెత్తనం చెలాయిస్తున్న అనధికారి ఖాన్ వ్యవహార శైలిపై సాక్షి దినపత్రికలో ‘కేజీహెచ్కు నీడ.. పీడ’ శీర్షికన ప్రచురితమైన కథనంతో కింగ్జార్జి ఆస్పత్రిలో కలకలం రేగింది. ప్రతిరోజూ సిబ్బంది, వైద్యాధికారులపై పెత్తనం చెలాయించే సదరు సూపరింటెండెంట్ షాడో ఆదివారం మాత్రం కానరాలేదు. ఈ రోజు ప్రశాంతంగా పని చెయ్యగలుగుతున్నామని పలువురు వైద్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. మరోవైపు ఏదైనా అత్యవసర సేవలు, ముఖ్య కార్యక్రమాలైతే తప్ప ఆదివారం ఆస్పత్రికి రాని సూపరింటెండెంట్ ఆదివారం ఉదయం 9 గంటలకే కేజీహెచ్కు వచ్చేశారు. ఇది ఆస్పత్రిలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఖాన్’ట్రాక్టు ఉద్యోగిగా ఐడీ కార్డు హల్చల్ ఇదంతా ఒకెత్తయితే ఇన్నాళ్లూ అనధికారికంగానే ఆస్పత్రిలో చలామణి అయిన షాడో ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. కానీ సాక్షి కథనం ప్రచురితమైన తర్వాత ఆయన కేజీహెచ్లోని ఓ విభాగంలో ‘ఖాన్’ట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఐడీ కార్డు హల్చల్ చేసింది. ఇది నిజమైనదా ఉన్నఫలంగా తయారు చేసిందా అనే విషయంపై మాత్రం కేజీహెచ్ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. అయితే శానిటేషన్ ఏజెన్సీ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి సూపరింటెండెంట్ కారులో తిరుగుతూ ఆయన చాంబర్ చుట్టు పక్కలా కనిపించే పని ఏముంటుందని కేజీహెచ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏ1 కాంట్రాక్టు ఉద్యోగే ఎ.ఖాన్ అనే వ్యక్తి ఎ1 ఔట్సోర్సింగ్ శానిటేషన్ ఏజెన్సీలో వర్క్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున ఓ ప్రకటనలో తెలిపారు. కేజీహెచ్లో జరిగే వివిధ పనులకు సంబంధించిన పర్యవేక్షణ చూస్తారని పేర్కొన్నారు. పరిపాలన పరమైన విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఖాన్పై ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన కథనంపై విచారణ చేపట్టి సదరు వ్యక్తిపైనా, సంస్థపైనా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎలుకల కోసం రూ.8.4 కోట్లు
సాక్షి, అమరావతి: రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా? అన్నట్లుగా ప్రభుత్వం తల్చుకుంటే కాంట్రాక్టరుకు ఎలాగైనా లబ్ధి చేకూర్చవచ్చని నిరూపిస్తోంది. ఎలుకలను పట్టుకోవడాన్ని సైతం ఆదాయ వనరుగా మార్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ ముఖ్యనేతకు దగ్గరి బంధువు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దాసుపత్రుల్లో ఎలుకలు, కీటకాల నిర్మూలన పేరుతో ఏడాది వ్యవధిలో రూ.8.4 కోట్లు చెల్లించడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. బోనులో ఎలుకలు పడకున్నా కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం డబ్బులు చేరాయని విమర్శిస్తున్నారు. గత రెండేళ్లలో ఎలుకలు పట్టినందుకు సదరు కాంట్రాక్టరుకు సుమారు రూ.17 కోట్ల వరకూ చెల్లించారు. టీడీపీ ముఖ్యనేతకు ఈ కాంట్రాక్టర్ సమీప బంధువు కావడం గమనార్హం. పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ పేరుతో పని చేయకపోయినా కాంట్రాక్టర్కు భారీ లబ్ధి చేకూరుస్తున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. నెలకు రూ.70 లక్షలు... రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు, అనుబంధంగా బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో పారిశుధ్యం, కీటకాల నియంత్రణ, సెక్యూరిటీ సర్వీసులు గతంలో ఒకే కాంట్రాక్టరు కింద ఉండేవి. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన ఘటన అనంతరం పారిశుధ్యం నుంచి కీటకాల నియంత్రణను తొలగించారు. దీనికోసం ప్రత్యేకంగా టెండర్లు నిర్వహించి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. కీటకాల నియంత్రణకు సగటున రూ.70 లక్షలు చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.8.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, బల్లులు, పాములు యధేచ్ఛగా సంచరిస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో ఆస్పత్రిలో నలుగురు సిబ్బందితో తూతూమంత్రంగా నీళ్ల మందు పిచికారీ చేస్తూ కీటకాలను నియంత్రించినట్లు నెలవారీ బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. గుంటూరు, విశాఖపట్నం ఆస్పత్రుల్లో నెలకు రూ.7 లక్షలకు పైగా చెల్లిస్తున్నా కనీసం పది ఎలుకలను కూడా పట్టడం లేదని సిబ్బంది పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్లలోకి ఎలుకలు చొరబడుతుండటంతో రోగులు హడలిపోతున్నారు. -
‘పది వేలు ఇస్తేనే సంతకం పెడతా’
బిచ్కుంద(జుక్కల్): ప్రజాసేవకు నిలయమైన ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం జరిగింది. మండల కేంద్రంలోని తహసీల్లో మంగళవారం ఓ కాంట్రాక్టర్ బ్లేడ్తో చేతులు, మెడ కోసికుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. డీటీ ప్రవీణ్ కుమార్ హజ్గుల్ జీపీ ప్రత్యేకాధికారిగా ఉన్నారు. గ్రామంలో విష్ణు మానిక్ నాయక్ సీసీ రోడ్డు పనులు చేశారు. రూ.45 వేలు బిల్లు వచ్చింది. చెక్కుపై సంతకం కోసం ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రూ.10 వేలు లంచం ఇవ్వాలని వారం రోజుల నుంచి వేధింస్తున్నాడు. దీంతో కాంట్రాక్టర్ విష్ణు మనస్తాపం చెంది మంగళవారం తహసీల్ కార్యాలయంలో బ్లేడ్తో చేతులు, మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎంబీ రికార్డులో వందశాతం పనులు హజ్గుల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.2 లక్షల 40 వేలు సీసీ రోడ్డు వేశారు. వంద శాతం పనులు పూర్తయ్యాయి. పంచాయతి రాజ్ శాఖ అధికారులు ఎంబీ రికార్డు చేసి రూ. 45 వేలను పీఆర్ శాఖ జీపీ ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్(ఎఫ్టీవో)ను జీపీ కార్యదర్శి చూసుకొని అన్ని సక్రమంగా ఉన్నాయని క్యాష్ బుక్లో ఎంట్రీ చేసి రూ.45 వేల చెక్కును కాంట్రాక్టర్ విష్ణుకు రాసి ఇచ్చారు. చెక్కుపై ప్రత్యేకాధికారి, డీటీ ప్రవీణ్ కుమార్ సంతకం ఉండాలి. వారం నుంచి సంతకం కోసం తహసీల్ చుట్టూ విష్ణు తిరుగుతున్నాడు. రూ.10 వేలు లంచం ఇస్తేనే సంతకం పెడతానని డీటీ వేధిస్తున్నాడని బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వలేను. ఇది చివరి బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా భార్య బంగారు పుస్తే, నగలు అమ్ముకొని సీసీ వేశానని మొరపెట్టుకొని రెండు కాళ్లు పట్టుకున్నా వినడం లేదన్నాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఘటనతో తహసీల్దార్, ఎంపీడీవో డీటీపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే బాధితుడి చెక్కుపై సంతకం చేశారు. కార్యాలయం ఎదుట గిజనుల ఆందోళన బిచ్కుందకు చెందిన కాంట్రాక్టర్ విష్ణు మానిక్ నాయక్ను లంచం ఇవ్వాలని డీటీ వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులకు తెలియడంతో భద్రాల్ తండా గిరిజనులు తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తం కారుతున్న విష్ణును ఆస్పత్రికి తరలించారు. కార్యాలయం ఎదుట ధర్నా చేసి డీటీని నిలదీశారు. వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గాంధారిలో కూడా అక్రమాలకు పాల్పడి బదిలీపై బిచ్కుంద వచ్చి అవినీతికి పాల్పడుతున్నారని డీటీపై కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. ఈ ఘటనపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సాయిబాబా అన్నారు. -
‘రామానాయుడు బెదిరించారు’
సాక్షి, పాలకొల్లు: ఇరిగేషన్ పనుల్లో 20 శాతం కమీషన్ ఇవ్వలేదని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరించి తనపై తప్పుడు కేసు పెట్టించారని కాంట్రాక్టర్ పృథ్విరాజ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిప్రకాష్ను కలిసి ఎమ్మెల్యే రామానాయుడు, సీఐ కృష్ణకుమార్పై పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు. కమీషన్ ఇవ్వటంలేదని తన బిల్లులు నిలుపుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కాంట్రాక్టు పనులు చేయకుండా చేస్తానని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పాలకొల్లు పోలీస్ స్టేషన్కు తనను పిలిపించి సీఐ కృష్ణకుమార్ తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి తన తండ్రికి కూడా ఫోన్లు చేసి హెచ్చరించారని వాపోయారు. తనను బెరిరించిన ఎమ్మెల్యే రామానాయుడు, తప్పుడు కేసులు నమోదు చేసిన సీఐ కృష్ణకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నరసాపురం డీఎస్పీని కలవాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేస్తానని ఎస్పీ హామీయిచ్చినట్టు పృథ్విరాజ్ తెలిపారు. -
కమీషన్ కోసం టీడీపీ ఎమ్మెల్యే వేదిస్తున్నారు
-
స్వామీ.. ఏమిటీ దోపిడీ!
మంత్రాలయం: స్వామీ నిన్ను కొలవని వారికి నీవంటే భయం.. నిన్ను కొలిచే వారికి నీవంటే భక్తి.. నీ భక్తులను మోసం చేసేవారికి నీ సన్నిధి ఓ వ్యాపార కేంద్రం. ఇక్కడ రావాల్సింది అధికారులకు వస్తోంది. కావాల్సిన దానికి మించి కాంట్రాక్టర్కు మిగులుతోంది. దేవుని సాక్షిగా రూ.కోట్లలో అవినీతి పర్వం దర్జాగా సాగిపోతోంది. ఏటా దోపిడీ విలువ అక్షరాల కోటి రూపాయలు. ఈ సొమ్మంతా భక్తుల నుంచి దోచుకుంటున్నదే. ప్రముఖ ఉరుకుంద నృసింహ ఈరన్న స్వామి పుణ్య క్షేత్రంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఏటా చేస్తున్న దగా ఇదీ. దోపిడీ లీలలు కన్నామంటే కళ్లు తిరిగాల్సిందే. ఇదిగో దోపిడీ బాగోతం. నారీకేళాల సమర్పణ 14 లక్షలు పుణ్యక్షేత్రంలో ఏటా శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ సోమ, గురు, శనివారాలు భక్తుల రద్దీ ఉంటుంది. నెలలో దాదాపు 10 లక్షల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. అందులో ఎంతలేదన్న 7 లక్షల మంది భక్తులు జోడు టెంకాయలు స్వామికి సమర్పిస్తారు. ఈ లెక్కన క్షేత్రంలో అమ్ముడు పోయే టెంకాయలు 14 లక్షలు. టెంకాయలు ప్రతి భక్తుడూ ఇక్కడే కొనుగోలు చేస్తారు. టెంకాయల సమర్పణకు ఎలాంటి టిక్కెట్ లేకున్నా కొట్టే అర్చకులకు జోడికి రూ.10 ఇచ్చుకుంటారు. వాస్తవ ఖర్చు.. టెండర్దారులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఇక్కడకు టెంకాయలు తీసుకువస్తారు. అక్కడ పెద్దసైజు టెంకాయ రూ.15, మధ్య సైజు టెంకాయ రూ.14, చిన్నసైజు రూ.10–12 ధర పలుకుతోంది. ఉరుకుంద క్షేత్రంలో మధ్యసైజు టెంకాయలు విక్రయిస్తారు. ఉత్సవాలకు 56 లారీల్లో (10 టైర్లు) టెంకాయలు దిగుమతి చేసుకుంటారు. ఒక్కో లారీలో 25 వేలు మధ్య సైజు టెంకాయలు లోడింగ్ అవుతోంది. ఒక్క లారీ బాడుగ అక్కడి నుంచి ఉరుకుందకు రూ.24 వేలు. బాడుగతో కలిపి లారీ టెంకాయలు రూ.3.74 లక్షలు. 56 లారీల టెంకాయలు విలువ రూ.1.96 కోట్లు. అందుకు లారీల బాడుగ మొత్తం రూ.13.44 లక్షలు. అంతా కలిపి కాంట్రాక్టర్ 56 లారీల సరుకు తెప్పించేందుకు గానూ రూ.2.09,44,000 వెచ్చిస్తారు. దోపిడీ తతంగం.. ఈఏడాది ఆదోనికి చెందిన మోహన్ అనే వ్యక్తి టెంకాయల టెండర్ కైవసం చేసుకున్నారు. రూ.90.90 లక్షలకు టెండర్ పాడారు. జోడి టెంకాయలను భక్తులకు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. 14 లక్షల టెంకాయలకుగానూ కాంట్రాక్టర్ ధర ప్రకారం వచ్చే మొత్తం రూ.4.90కోట్లు. అందులో ఆయన వెచ్చించిన నగదు రూ.2.09 కోట్లు. టెండర్ చెల్లింపు (రూ90.90 లక్షలు)తో కలిపి ఖర్చు రూ.3 కోట్లు అవుతోంది. భక్తులు సమర్పించిన టెంకాయలో అర చిప్ప కాంట్రాక్టర్కే సంబంధం. బయట మార్కెట్లో ఒక్కో చిప్ప ధర రూ.3లు. 14 లక్షల చిప్పలకుగానూ రూ.42 లక్షలు వస్తోంది. టెంకాయ కొట్టుకు 100 టెంకాయలు వేసేందుకు చేసే వసూలు 100. టెంకాయలకు రూ.60. ఈ లెక్కన వచ్చే ఆదాయం రూ.8.40 లక్షలు. అదనపు రేటు, చిప్పల విలువ కలిపి ఆయనకు నికరంగా మిగులు రూ.5,40,40,000. అందులో వెచ్చించి న ఖర్చు, టెండర్ నగదు తీసివేయగా దోపిడీ విలువ రూ.1.49 కోట్లు. ఇదీ ముమ్మాటికీ భక్తుల నుంచి దోచుకున్న సొమ్ము. అంతా కుమ్మక్కు.. ఏటా శ్రావణమాసంలో జరుగుతున్న దోపిడీ ఇది. కిందిస్థాయి నుంచి పైస్థాయి దేవదాయ శాఖాధికారులకు తెలిసిన విషయమే. ఇంతగా భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అటు దేవుడికి శఠగోపం, భక్తుల నెత్తిన టెంకాయ కొడుతున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అవినీతి సొమ్మును పంచుకు తింటున్నారు. భక్తులు ఎంతగా అరిచి గీపెట్టుకున్నా క్షేత్రం అధికారుల్లో చలనం లేదు. కారణం ఎవరికి ముట్టాల్సింది వారికి ముడుతోంది. ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు ఉన్నా ఫలితం శూన్యం. భక్తుల గోడు పట్టించుకునే పాపాన పోలేదు. నిలువు దోపిడీని అరికట్టి భక్తుల జేబులకు కన్నాలు వేయడం మానుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఇటీవల ఈఓ రామ్ప్రసాద్ అడుగగా అధిక ధరలకు విక్రయించకుండా తగ్గించే ప్రయత్నం చేస్తామని సెలవిచ్చారు. -
రూ.215 కోట్ల నగదు, బంగారం సీజ్
సాక్షి ప్రతినిధి, చెన్నై : జాతీయ రహదారి పనులతో వేల కోట్లకు పడగెత్తిన తమిళనాడులోని కాంట్రాక్టరు సెయ్యాదురై, ఆయన కుమారుల ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మూడోరోజూ తనిఖీల పర్వం కొనసాగింది. ఈ మూడురోజుల్లో రూ.215 కోట్ల నగదు, బంగారం, వజ్రాలు, వీవీఐపీల పేర్లతో కూడిన డైరీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలోని ఇద్దరు మంత్రుల అండదండలతో వేల కోట్ల రూపాయల రహదారి పనులు చేపట్టిన సెయ్యాదురై, ఆయన నలుగురు కుమారులకు చెందిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 ఇళ్లు, కార్యాలయాలపై ఈనెల 16న ప్రారంభించిన ఐటీ దాడుల్లో అధికారులే బిత్తరపోయేలా నగదు, స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. రామనాథపురంలో జిల్లా కముదిలోని ఇంటి గోడలో ఒక రహస్య అరను గుర్తించి బద్దలు కొట్టగా విలువైన పత్రాలు దొరికాయి. 15 బ్యాంకు లాకర్లను అధికారులు సీజ్ చేశారు. అలాగే బుధవారం చెన్నై మైలాపూరులోని సెయ్యాదురై కుమారుడు నాగరాజ్ సహయకుని ఇంటిలో తనిఖీలు నిర్వహించి మూటలకొద్దీ నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
కాంట్రాక్టర్పై ఐటీ దాడి:160 కోట్లు నగదు స్వాధీనం
-
అన్నీ ఒకరికేనా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీరు–చెట్టు పనులను అప్పగించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్ల వ్యవహార శైలి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే మింగుడు పడటం లేదు. నియోజకవర్గానికి వచ్చిన పనులన్నీ గంపగుత్తగా ఒకే కాంట్రాక్టర్కు అప్పగిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో ఏకంగా రూ.48 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టర్కు అప్పగించారు. 8 శాతం కమీషన్ తీసుకుని ఈ పనులను కట్టబెట్టినట్టు సమాచారం. అంటే రూ.48 కోట్ల పనులకు గాను ఏకంగా రూ.3.84 కోట్ల కమీషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు. పార్టీని, నేతను నమ్ముకుని ఉంటే తమకు మాత్రం పనులు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద చెక్డ్యాంల నిర్మాణ పనులే అధికంగా మంజూరయ్యాయి. దీంతో సదరు కాంట్రాక్టర్ ఇంకా పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది. చెక్డ్యాం పనుల్లో భారీగా ఆదాయం ఉండకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కమీషన్ ఇంతేనా? నీరు–చెట్టు పథకం కింద జిల్లావ్యాప్తంగా భారీగా పనులు మంజూరవుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.868 కోట్ల పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికభాగం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఈ పనులన్నింటిలోనూ 12 నుంచి 22 శాతం వరకు అధికార పార్టీ నేతలు కమీషన్లు దండుకున్నారు. ఇక్కడ ప్రధానంగా పూడికతీత పనులు కావడంతో భారీగా కమీషన్లు వస్తున్నాయి. అయితే.. ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో చెక్డ్యాంల నిర్మాణ పనులు మంజూరు కావడంతో అంతగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీనికితోడు పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పూడికతీత పనుల్లో ఇందుకు భిన్నం. కొన్నిచోట్ల గతంలో ఉపాధి హామీ కింద చేసిన పనులనే చూపి.. మరికొన్ని చోట్ల నామమాత్రంగా చేపట్టి మొత్తం బిల్లు తీసేసుకుంటున్నారు. దీంతో ఏకంగా 22 శాతం వరకూ కమీషన్లు అక్కడి అధికార పార్టీ నేతలకు ముట్టజెప్పారు. అయితే, తనకు కేవలం 8 శాతం కమీషన్ కావడంపై సదరు నేత మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనని శోధించే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఎక్కడైనా చెరువులున్నాయా? నీరు–చెట్టు కింద నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఎక్కువగా పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులన్నీ సులభతరం కావడంతో కాంట్రాక్టర్లకు అధిక ఆదాయం ఉంటోంది. దీంతో అధికారపార్టీ నేతలకు ఇచ్చే కమీషన్ కూడా ఎక్కువగా ఉంటోంది. అదే చెక్డ్యాం పనుల్లో తమకు పెద్దగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీంతో పూడికతీత పనులకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యనేత సోదరుడు ఇన్చార్జ్గా ఉన్న నియోజకవర్గంలో మాత్రం చెక్డ్యాంల పనులను తీసుకున్న కాంట్రాక్టర్ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనంటూ వెతికే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏవైనా చెరువులు కనిపిస్తే చెక్డ్యాంల నిర్మాణం కాకుండా ఈ పనులను చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. -
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కాంట్రాక్టర్ దురుసు ప్రవర్తన
అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అడ్డదిడ్డంగా పనులు చేస్తుండటాన్ని నిలదీసిన వారిపై కాంట్రాక్ట్ పనులు చేస్తున్న నేత దౌర్జన్యానికి దిగుతున్నారు. మహిళా కార్పొరేటర్ అన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అంతటితే ఆగకుండా దాడికి యత్నించాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా.. కాంట్రాక్టర్కే వత్తాసు పలకడం విమర్శలకు తావిచ్చింది. అనంతపురం న్యూసిటీ: ప్రహరీగోడ నిర్మాణం కోసం అనుమతి లేకుండా జేసీబీతో గుంతలు తీయరాదని అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ బోయ గిరిజమ్మపై టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్చౌదరి దురుసుగా వ్యవహరించాడు. మూడవ డివిజన్ పరిధిలోని వైఎస్సార్ నగరపాలక ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణాన్ని రూ.40 లక్షల వ్యయంతో ఎస్.వి. ఇన్ఫ్రా కంపెనీ చేపడుతోంది. సోమవారం ఉదయం కాంట్రాక్టర్ శ్రీనివాస్ చౌదరి జేసీబీని తెప్పించి గుంతలు తీయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని ఈఈ దుశ్యంత్, డీఈ సుధారాణికి కార్పొరేటర్ గిరిజమ్మ ఫిర్యాదు చేశారు. జేసీబీతో గుంతలు తీస్తే తరగతి గదులు దెబ్బతింటాయని, అధికారుల అనుమతి లేకుండా ఏ విధంగా చేస్తారంటూ కాంట్రాక్టర్ను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన కాంట్రాక్టర్ శ్రీనివాస్చౌదరి ‘కార్పొరేటర్ అయితే మీ ఇంట్లో చూసుకో. ఇక్కడకు వచ్చి అతి చేయవద్దు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. పనులు ఆపండి అని వర్క్ఇన్స్పెక్టర్లు ఆదేశించినా పట్టించుకోలేదు. చివరకు కార్పొరేటర్పై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న డివిజన్ ప్రజలు రత్నమ్మ, లలిత, లక్ష్మి, మణి అక్కడికి చేరుకుని కాంట్రాక్టర్ను చుట్టుముట్టి నిలదీయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితులపై పోలీసుల మండిపాటు కార్పొరేటర్ గిరిజమ్మ, డివిజన్ మహిళలను దూషించి, దురుసుగా వ్యవహరించిన కాంట్రాక్టర్కే వన్టౌన్ పోలీసులు వత్తాసు పలికారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోండి అని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కార్పొరేటర్, మహిళలపై ‘మీరు అసలు ఇక్కడకు ఎందుకొచ్చారు’ అంటూ సీఐ విజయభాస్కర్గౌడ్ మండిపడ్డారు. మఫ్టీలో ఉన్న జయరాం అనే కానిస్టేబుల్ అయితే ‘ఏం.. ఎక్కువ మాట్లాడుతున్నారంటూ’ మహిళలపై వీరంగం వేశాడు. చివరకు ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లను ఆరా తీయగా తామొచ్చేసరికి పనులు జరుగుతున్నాయని, నిబంధనలకనుగుణంగా మాన్యువల్గా గుంతలు(ట్రెంచ్) తీయాలని కాంట్రాక్టర్కు చెప్పినట్లు సీఐకు తెలిపారు. -
దారి దోపిడీ
పైచిత్రంలోని రోడ్డు ద్వారకాతిరుమల మండలంలోని రామసింగవరంలో వేసిన సిమెంటు రోడ్డు. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పాకిరం వెంకటరత్నం ఇంటి వరకు దాదాపు 50 మీటర్ల దూరం సీసీ రోడ్డును ఐదు నెలల కిత్రం నిర్మించారు. ఇలా గ్రామంలో రూ.50లక్షల వ్యయంతో పలు చోట్ల రోడ్లు వేశారు. 20ఏళ్లకుపైగా ఉండాల్సిన రోడ్లు నాణ్యత లేక కుంగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో కాంట్రాక్టు తీసుకుని వీటిని వేశారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే వేసిన ఐదు నెలలకే ఛిద్రమయ్యాయి. దేవరపల్లి/ద్వారకాతిరుమల/గోపాలపురం: జాతీయ ఉపాధి హామీ పథకం, పంచా యతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధులతో గ్రామాల్లో నిర్మించిన రోడ్లకు అవినీతి తూట్లు పడుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు బినామీ కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతూ రోడ్ల నిర్మాణంలో దోపిడీకి పాల్పడుతున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఐదునెలలు తిరగకుండానే.. గోపాలపురం నియోజకవర్గంలో అత్యధికంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. నిబంధనల ప్రకారం సిమెంట్ రోడ్డు సుమారు 20 ఏళ్ల నుంచి 25ఏళ్లు ఉండాలి. అయితే ప్రస్తుతం వేస్తున్న రోడ్లు ఐదునెలలు కాకుండానే పగుళ్లు తీసి శి«థిలమవుతున్నాయి. గోపాలపురం పంచాయతీరాజ్ సబ్డివిజనల్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరులమ మండలాల్లో 2017–18 సంవత్సరానికి సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.250 కోట్ల ఉపాధి హామీ, పంచాయతీ నిధులు మంజూరు చేశారు. వీటితో 87,151 మీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు సుమారురూ.150 కోట్లతో 29,099 మీటర్ల పొడవున రోడ్లు నిర్మించారు. అయితే వేసిన రోడ్లు పలు గ్రామాల్లో బీటలు తీశాయి. దీంతో సిమెంట్ రోడ్ల కంటే మట్టిదారులు నయమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇవిగో నిదర్శనాలు - దేవరపల్లిలో ఆరు సిమెంట్ రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. బాలదుర్గమ్మ ఆలయ ప్రాంతంలో గత ఏడాది సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి కాలువ ఇసుక వాడుతున్నారని, స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టరు మిగిలిన రోడ్లను ఆపేశారు. - దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, సంగాయగూడెంలో గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు చేయకుండానే గత ఏడాది మార్చిలో అధికారపార్టీ నేతల అండతో బిల్లులు చేయించుకుని జేబులు నింపుకున్నారు. సుమారు రూ. 10 లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు ఆగమేఘాలపై రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు. - ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో 5 నెలల క్రితం నిర్మించిన అంబేడ్కర్ సెంటర్ రోడ్డు అప్పుడే ధ్వంసమైంది. ఎంపీపీ పాఠశాల వెనుక రోడ్డూ దెబ్బతింది. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు కావడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. - మద్దులగూడెంలో ఇటీవల సర్పంచ్ కట్టూరి స్వర్ణలత భర్త చంటిబాబు 7వ వార్డులో సీసీ రోడ్డు నిర్మిస్తుండగా, ఒక వార్డు సభ్యురాలు భర్త దానంపూడి భుజంగరావు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని గొడవకు దిగారు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరూ అధికార పార్టీ వారే కావడం విశేషం. - దేవినేనివారిగూడెంలో రోడ్లు నిర్మించిన కొద్దిరోజులకే బీటలు వారాయి. - గోపాలపురం మండలం గోపవరంలో టీడీపీ నాయకుడు చేపట్టిన రోడ్లు నిర్మించిన రెండు నెలలకే గోతులు పడ్డాయి. - వాదాలకుంట, జగన్నాథపురం, భీమోలు, చిట్యాల, గోపాలపురంలలో టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు మాత్రమే సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అవకతవకలపై విచారణ చేపట్టాలి గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్డు వేసిన రెండు నెలలకే పాడయ్యాయి. కాంట్రాక్టర్లను అడిగితే కమీషన్లే ఇవ్వాలా రోడ్డు నాణ్యతే పాటించాలా అని అంటున్నారు. సిమెంట్ రోడ్ల కన్నా గ్రావెల్రోడ్లు నయంగా ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారపార్టీ నాయకులే కాంట్రాక్టర్లవుతున్నారు. – కాకులపాటి వెంకట్రావు, భీమోలు రోడ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటా ఇటీవలే డివిజినల్ ఇంజినీరింగ్ అధికారిగా బదిలీపై వచ్చా. నాణ్యత లేకపోవడం వల్ల శిథిలమైన రోడ్లను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటా. రోడ్డు వేసిన కాంట్రక్టర్తో మళ్లీ మరమ్మతులు చేయిస్తా. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. – కె. భద్రానాయక్, డీఈఈ, పంచాయతీరాజ్ -
బలిపశువు
‘‘నమస్కారం సార్’’ అన్న పిలుపుతో న్యూస్ పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా ఇరవై ఏళ్ల కుర్రాడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. ఎగాదిగా చూసి ఏమిటన్నట్లుగా తలెగరేశాను. ‘‘పనేదైనా ఉంటే ఇప్పించండి సార్! చాలాదూరం నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. పదో తరగతి వరకూ చదివా. మా ఊర్లో పంటలు లేక పనులు లేక కరువు వచ్చి ఇట్లా వచ్చాను సార్..’’ గడగడా అప్పజెప్పేశాడు. ‘‘ఇప్పుడు అన్సీజన్. పనులేవీ లేవు కదయ్యా!’’ అని నేను అంటుండగానే, ‘‘సార్సార్ నాతో పాటు ఊర్లో అమ్మ, నాన్న, తమ్ముడు బతకాలి. మీరేం పని చెప్పినా చేస్తా’’ అంటూ ప్రాధేయపడ్డాడు. మొన్నరాత్రి ఒక పనిగురించి యాదగిరి నావద్దకు వచ్చి వెళ్లిన సంగతి గుర్తుకువచ్చింది. మరొకమారు వాడిని తేరిపార చూశాను. పనికొచ్చేటట్లే ఉన్నాడనిపించింది. ‘‘ఏం పేరు నీది?’’ అడిగాను. పని దొరికిందనుకున్నాడో ఏమో వాడి ముఖం ఒక్కసారి వెలిగిపోయింది. ‘‘నా పేరు కురుమూర్తి సార్. పాలమూరు పక్క పల్లె సార్ మాది’’ అన్నాడు వాడు. ‘‘ప్రస్తుతానికి పనులేవీ లేవు. నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నా. వంటమనిషి ఊరెళ్లాడు. వాడు వచ్చేవరకూ ఇంట్లో పనులు చూసుకో’’ అని చెప్పి మళ్లీ పేపర్లో తల దూర్చాను. మంచి హుషారైన కుర్రాడి మాదిరి ఉన్నాడు. చేతి సంచి మూల ఉంచి చీపురు అందుకొని వెంటనే పనిలోకి దిగిపోయాడు. లేబరు కాంట్రాక్టరుగా గత ఐదారు సంవత్సరాలనుండి శ్రీశైలం అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో ఉంటున్నాను. ఫారెస్టులో రోడ్లు వెయ్యడానికి, చెక్ డ్యాములు కట్టడానికి, ఇంకా అటవీ ఉత్పత్తులు సేకరించడానికి, కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు నన్ను కలుస్తుంటారు. వాళ్లకు తగిన పనివాళ్లను సప్లై చేయడం నా పని. ఇక్కడి గిరిజనుల్లో నాకు మంచి పరిచయాలున్నాయి కాబట్టి పనులకు మనుషులను పంపడం పెద్ద కష్టం కాదు. పైగా వాళ్లు నిరక్ష్యరాస్యులు. కూలీగా ఎంత ఇస్తే అంత కళ్లకద్దుకొని మరీ తీసుకుపోతారు. అందువల్ల నా సంపాదన బాగానే ఉంటున్నది. మొన్నరాత్రి యాదగిరి చెప్పిన పనిగురించే ఆలోచిస్తూ ఉన్నాను. డబ్బు కూడా బాగానే ముట్టేటట్లుంది. ఎటొచ్చీ చేద్దామా, వద్దా అనే డైలమాలోనే ఉన్నాను. వీడ్ని చూసిన తర్వాత చాలాసేపు ఆలోచించి పనిలోకి దిగుదామని నిర్ణయించుకున్నాను. వెంటనే మనిషిచేత నా సమ్మతి తెలియజేస్తూ యాదగిరికి కబురంపాను. ఒక నెలరోజులు గడిచాయి. అనుకున్నరోజు మనిషి వచ్చి అడ్వాన్సు ఇచ్చి ఆరోజు రాత్రి చేయవలసిన పనిగురించి వివరంగా చెప్పి వెళ్లిపోయాడు. కురుమూర్తిని పిలిచాను. ‘‘ఇదిగో నీ నెల జీతం. వెంటనే ఇంటికి మనీయార్డరు చేసి రాత్రికి రెడీగా ఉండు. అడవిలో కొంచెం పని ఉంది. వెళ్లి వద్దాం’’ అని అడ్వాన్సుగా ఇచ్చిన కట్టలో కొన్ని నోట్లు తీసి అందించాను. అంత డబ్బు ఇస్తానని ఊహించనివాడు కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాడు. ‘‘ఊ! తీసుకో. రాత్రికి స్పెషల్ భోజనం ఇద్దరికీ చెయ్యి..’’ అనగానే ‘‘అట్లాగే సార్’’ అని నోట్లందుకొని సంబరపడిపోతూ దండం పెట్టి వెళ్లిపోయాడు. రాత్రి పదిన్నర కావస్తున్నది. అమావాస్య చీకటి. మోటార్ సైకిల్ మీద కురుమూర్తిని ఎక్కించుకొని బయలుదేరాను. పదికిలోమీటర్లు మెయిన్ రోడ్డు మీద ప్రయాణించి తరువాత ఫారెస్టులోని డొంక రోడ్లోకి తిప్పాను. బాటకిరువైపులా ముళ్ల పొదలు. కొంచెం పక్కకి పోయినా పంక్చరు పడ్డం ఖాయం. అలవాటైన దోవ కాబట్టి జంకు లేకుండా ముందుకుపోతున్నాను. వెనుక కురుమూర్తి మంచి హుషారు మీద ఉన్నట్లున్నాడు. బయలుదేరేముందు నాతోపాటే భోజనం చెయ్యమన్నాను. నేను వేసుకునే లాల్చీ పైజామా ఒక జత ఇచ్చి వేసుకొనమన్నాను. మొహమాటపడుతూనే వేసుకొని తయారయ్యాడు. దోవలో వాడి అమ్మా నాన్నల గురించి, తమ్ముడి గురించి, మధ్యలో నా మంచితనం గురించి పొగుడుతూ చాలాసేపు చెప్పాడు. ‘‘ఇంకా ఎంతదూరం పోవాలి సార్’’ మాటల మధ్యలో అన్నాడు వాడు. ‘‘ఇదుగో వచ్చేశాం. ఆ కనబడే మంట దగ్గరకే’’ అన్నాను. ఒక వంద గజాల దూరంలోనే బండి ఆపి ఇద్దరం తుప్పల్ని, పొదలను తప్పుకుంటూ మెల్లగా అక్కడికి చేరుకున్నాం. దూరంనించి మంట చిన్నదిగానే కనిపించినా, దగ్గరికి వెళ్లేసరికి చాలా పెద్ద సైజులో మండుతున్నది. పక్కనే పెద్ద పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టు. కింద పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసిన పెద్ద పీట, పెద్ద సైజు చెక్కమొద్దు, ఇంకా పూలు, నిమ్మకాయలు తదితర పూజా ద్రవ్యాలు ఉన్నాయి. మంట ఎదురుగా బుర్రమీసాలు, నిలువు బొట్టు, ఎర్రటి పంచెకట్టు, బానపొట్ట భుజంపైన తెల్లకండువాతో భయంకరమైన మనిషి కళ్లుమూసుకు కూర్చొని మంత్రాలు బిగ్గరగా జపిస్తున్నాడు. మేము ఇంకొంచెం దగ్గరికి వెళ్లేసరికి యాదగిరి ఎదురొచ్చాడు. ‘‘రా అన్నా! అంతా రెడీయేనా?’’ అన్నాడు, కురుమూర్తిని ఎగాదిగా చూస్తూ. ‘‘సరిగ్గా టైముకు వచ్చామా?’’ అడిగాను వాచీని మంట వెలుగులో చూసుకుంటూ. ‘‘ఆ! అయిపోవచ్చింది. కాసేపు కూర్చోండి..’’ అని ఒక బండ చూపించి వెనక్కు వెళ్లిపోయాడు. ‘‘కూర్చోవోయ్’’ అని కురుమూర్తికి చెప్పి బండమీద ఊది చతికిలబడ్డాను. వాడు కూర్చోకుండా చేతులు కట్టుకు నిలబడి జరిగే తంతుని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఈ యాదగిరి నాకు రెండు నెల్ల క్రితమే పరిచయమయ్యాడు. పని గురించి మొదట మాట్లాడింది, తరువాత అడ్వాన్సు ఇచ్చి వెళ్లిందీ ఇతనే. మొదట్లో ఈ పని నావల్ల కాదు అని చెప్పినా రేటు పెంచి నా చేత ఒప్పించాడు. మంచి పట్టుదల మనిషి. పని ఏ విధంగానైనా చేయించి సాధించాలనే టైపు వ్యక్తి. ఇంతలో ఏవో మాటలు విన్పించడంతో అటు చూశాను. చీకట్లో గమనించలేదు కానీ అక్కడ ఇంకా ఇద్దరు మనుషులు ఉన్నారు. యాదగిరి వాళ్లతో ఏదో మాట్లాడుతూ మళ్లీ మావైపొచ్చాడు. వాళ్లు చేతులు కట్టుకుని అతణ్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. మావద్దకి వచ్చేటప్పటికి మాటలు ఆపేశారు. అపుడు గమనించాను వాళ్లని. క్రూరమృగాల మాదిరి పచ్చిరక్తం తాగే రాక్షసుల్లా ఉన్నారు. కట్ బనియన్ ధరించి అడ్డు పంచలతో ఉన్నారు. మా సమీపానికి వచ్చేసరికి బ్రాందీ వాసన గుప్పుమంది. ఇంతలో అగ్నిగుండం దగ్గరి మాంత్రికుడు నెమ్మదిగా కళ్లు తెరిచి మంటలోకి ఏవో రసాయనాలు చల్లి మరింత ప్రజ్వలింపజేశాడు. ఈసారి పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్యలో ఆపి, యాదగిరి వైపు తిరిగి ‘‘పశువు సిద్ధమేనా?’’ అని బిగ్గరగా అరిచాడు. యాదగిరి అతడి వద్దకు వడివడిగా వెళ్లి నెమ్మదిగా ఏదో మాట్లాడి, ఇటు తిరిగి తన మనుషులకు సైగ చేశాడు. వాళ్లు వెంటనే కురుమూర్తిపైకి ఉరికి పారిపోకుండా చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. కురుమూర్తికి అప్పుడర్థమైనట్లుంది, పశువంటే ఎవరో. మరుక్షణమే వాళ్ల పట్టునుండి గింజుకుంటూ ‘‘బాబూ నన్ను వదలండి. సార్ వీళ్లను వదలమని చెప్పండి మీ కాల్మొక్కుతా. బుద్ధిలేక మీకాడ పనికొచ్చినా, మీ పని వద్దు, జీతం వద్దు. నన్నొదలండి. సార్ వదలమని చెప్పండి..’’ అని పెద్దగా ఏడుస్తూ అరవసాగాడు. యాదగిరి మనుషులు ఇవేమీ పట్టించుకోకుండా వాణ్ని మాంత్రికుడి దగ్గరకు ఈడ్చుకు వెళ్లారు. మాంత్రికుడు నిర్వికారంగా వాడి మొఖానికి పసుపు రాసి, కుంకుమతో నిలువుబొట్టు పెట్టి బలికి సిద్ధం చేయసాగాడు. ఈ మధ్యలో యాదగిరి నా వద్దకు వచ్చి ‘‘ఇదుగో అన్నా! బ్యాలెన్సు డబ్బు..’’ అని జేబునుండి తీసి నాకందించాడు. ‘‘ఇక నువ్వు వెళ్లే పనైతే పోవచ్చు..’’ అన్నాడు. నేను డబ్బు జేబులో వేసుకొని ఏమీ మాట్లాడకుండా అటువైపు చూడ్డం గమనించి ‘‘సరే భయం లేకపోతే కాసేపు ఉండివెళ్లు..’’ అని తిరిగి వెళ్లిపోయాడు. కురుమూర్తి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. అరిచి అరిచి గొంతు రాసిపోయింది. ‘‘అన్నా! నన్ను వదిలెయ్యి. దేవుడా రక్షించు. బాబూ నన్ను చంపొద్దు..’’ అని మాంత్రికుడికి దండం పెట్టి పెద్దగా విలపించసాగాడు. ఇవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్న మాంత్రికుడు జోడించిన వాడి చేతులు చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి చేతులను విడదీసి పరిశీలించి పెద్దగా ‘‘ఒరేయ్ యాదగిరీ! వీడు బలికి పనికి రాడ్రా.. చూడు వీడి చేతికి ఆరు వేళ్లున్నై..’’ అని అరిచాడు. ఈలోపల నేను కూడా అటు దగ్గరగా వెళ్లి చూశాను. నిజమే వాడి కుడి చేతికి మాత్రం ఆరువేళ్లున్నాయి. యాదగిరి కూడా వచ్చి చూశాడు. ‘‘ముందే చూసుకొని రావొద్దా? మూర్ఖులారా? ఈ యాగం అసంపూర్తిగా ఆగిపోయిందో మీ కోర్కెల మాట అటుంచి సర్వం నాశనమైపోతారు జాగ్రత్త’’ అని రంకెలు వేయడం మొదలుపెట్టాడు. యాదగిరి ఖిన్నుడైపోయినట్లు కనిపించాడు. ఒక నిమిషం దీర్ఘంగా ఆలోచించి మాంత్రికుణ్ని పక్కకు తీసుకెళ్లి ఏదో సర్దుబాటు చేస్తున్నట్లు కనిపించాడు. ప్లానంతా అప్సెట్ అయ్యేసరికి నాకు చాలా నిరాశ అనిపించింది. డబ్బు వచ్చినట్లే వచ్చి జారిపోయింది. ఇప్పుడీ కురుమూర్తి గాడిని ఏం చెయ్యాలి? బెదిరించి పంపేద్దామా? లేక ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామా? ఫ్రీగా వదిలేస్తే విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయా? అని రకరకాల ఆలోచనలతో ఉన్న నాకు హఠాత్తుగా పక్కన ఏదో అలికిడి అయ్యేసరికి ఉలిక్కిపడి అటు చూశాను. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. యాదగిరి మనుషులు తమ ఉక్కు పిడికిళ్లతో నా జబ్బలు వడిసి పట్టుకున్నారు. ఒక్కసారిగా షాకైపోయాను. వడిగా మాంత్రికుడి వద్దకు ఈడ్చుకువెళ్లి ఎదురుగా నిలబెట్టారు. వాడు నా కాళ్లు చేతులు, ముఖం పట్టి పట్టి చూసి చుట్టూ తిరిగి పరిశీలించి ‘‘ఫర్వాలేదు, పనికొస్తాడు. సమయం కావస్తున్నది. పశువును పక్కన నిలబెట్టండి. పిలుస్తాను.’’ అని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నాకు అప్పుడర్థమైంది.. మాంత్రికుడు, యాదగిరిల మధ్య జరిగిన సంభాషణ ఫలితం నన్ను కొత్త బలిపశువుగా మార్చిందని. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. విపరీతమైన భయంతో నిలబడలేకపోతున్నాను. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. అరిచినా ప్రయోజనం ఉండదు. ఈ కీకారణ్యంలో అర్ధరాత్రి నా కేకలు విని కాపాడే నా«థుడెవరుంటారు? వళ్లంతా చెమటతో ముద్దగా తడిచిపోయింది. ఇంతలో యాదగిరి ఎదురుగా వచ్చి తలదించుకొని ‘‘నన్ను క్షమించన్నా! ఇంతకంటే వేరే గత్యంతరం లేదు. పని మధ్యలో ఆగిపోతే మాతో పాటు తను కూడా చస్తానని మాంత్రికుడు గట్టిగా చెబుతున్నాడు. పైగా టైమ్ కూడా లేదు వేరే మనిషిని చూసుకోవడానికి..’’ అని నా లాల్చీ జేబులో డబ్బు తనే తీశాడు. ‘‘ఒరేయ్! ఇలారా..’’ అని కురుమూర్తిని పిలిచాడు. వాడికి భయంతో పారిపోవడానికి కూడా చేతకాలేదు. వంగి దండం పెడుతూ వచ్చాడు. ‘‘ఇదుగో! ఈ డబ్బు తీసుకొని పారిపో. ఎక్కడైనా ఇక్కడి సంగతులు చెప్పావో.. ఖబడ్దార్’’ అంటూ డబ్బులు ఇవ్వబోగా, ‘‘నాకే పైసలు వద్దు సార్. నన్ను వదిలేయండి. ఈ జన్మలో ఇటుకేసి రాను..’’ అని యాదగిరి కాళ్లకు మొక్కి, లేచి నావైపు జాలిగా చూసి పరిగెత్తుతూ చీకట్లో కలిసిపోయాడు. నాకంతా ట్రాన్స్లో ఉన్నట్లుంది. ఎవరూ నన్ను రక్షించలేరు అన్న నిర్ణయానికి వచ్చేసి చావు కోసం మానసికంగా సిద్ధపడసాగాను. అలసటతో కనురెప్పలు వాలిపొయ్యాయి. ముఖంమీద ఏవో లేపనాలు పులుముతున్నట్లున్నారు. చేతులు వెనక్కి విరిచి పట్టుకొని చెక్క మొద్దు మీద కాబోలు తల ఆనించి పట్టుకున్నారు. నాకు ప్రతిఘటించే శక్తి ఎప్పుడో పోయింది. వాళ్లు ఎటుతిప్పితే అటు తిరుగుతున్నాను. రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా ముఖానికి వేడి సెగ తగిలింది. కళ్లు తెరుద్దామనుకొనేంతలో మెడ మీద చురుక్కుమనిపించింది. వెంటనే కళ్లముందు శాశ్వతంగా చీకటి తెర దిగిపోయింది. ఆర్.వి.శివప్రసాద్ -
హాస్టల్ మెస్పైనా జీఎస్టీ వడ్డన
సాక్షి, న్యూఢిల్లీ : విద్యార్ధులు, సిబ్బందికి ఆహారం సమకూర్చే మెస్ల పైనా జీఎస్టీ వర్తింపచేశారు. విద్యాసంస్థల్లో మెస్ ఎవరు ఏర్పాటు చేశారనే దానితో సంబంధం లేకుండా వీటిపై 5 శాతం జీఎస్టీ చార్జ్ చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాలేజ్ హాస్టల్ మెస్లకు సంబంధించి జీఎస్టీ వివరాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఈ మేరకు వివరణ ఇచ్చింది. మెస్లు, క్యాంటిన్లపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం జీఎస్టీ విధిస్తారని పేర్కొంది. ఈ మెస్ లేదా క్యాంటిన్ను ఆయా విద్యా సంస్థలే నిర్వహిస్తున్నాయా, బయటి వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చారా అనే అంశంతో సంబంధం లేకుండా ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
పిట్ట గుడ్లు కావు.. కోడిగుడ్లే!
పెద్దపల్లి: పక్క ఫొటో చూశారా? అరచేతిలో 9 కోడిగుడ్లు కనిపిస్తున్నాయి. చాలా మంది పిట్టగుడ్లుగానే భావించొచ్చు.. కానీ అవి కోడిగుడ్లే. అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రా క్టర్ సరఫరా చేస్తున్న గుడ్లు ఒక్క బుక్కతో నమలకుండానే మింగే సైజులో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పిట్టగుడ్డు మాదిరిగా చిన్నగా ఉన్న కోడిగుడ్లు ఇస్తున్నారు. జిల్లాలోని 305 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చిన్న పిల్లల కోసం కాంట్రాక్టర్ ద్వారా గుడ్లను సరఫరా చేస్తోంది. భోజనంతోపాటు చిన్న పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఒక కోడిగుడ్డును అందిస్తున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో గత కొద్ది రోజులుగా చిన్నసైజు గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐడీసీఎస్ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారంటున్నారు. కాంట్రాక్టర్ సీల్ టెండర్ ద్వారా గతంలో రూ.3కే ఒక కోడిగుడ్డు అందిస్తామంటూ టెండర్ పొందాడు. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్లు అంగన్వాడీ కేంద్రానికి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. రిటేల్ కోడిగుడ్లకు రూ.6: రెండేళ్ల క్రితం టెండర్ ద్వారా రూ.3కే కోడిగుడ్లను సరఫరా చేస్తామని కాంట్రాక్ట్ పొందిన వారు ప్రస్తుతం ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఎదురవుతున్న నష్టాల నుంచి బయట పడేందుకు చిన్న సైజు కోడిగుడ్లను తెప్పిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారులు ఈ విషయాన్ని గమనించి అక్కడక్కడ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించడంతో కొన్నిచోట్ల చిన్నసైజు కోడిగుడ్లనే అంటగడుతున్నట్లు తెలిసింది. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో పలువురు తల్లులు చిన్నసైజు కోడిగుడ్లను సాక్షికి చూపిస్తూ ఇది ఒక్క బుక్కకు కూడా సరిపోదని, అలాంటప్పుడు కోడిగుడ్లను అం్దదించడం దేనికని ప్రశ్నిస్తున్నారు. చిన్న సైజు గుడ్లను తిరస్కరించండి – సుభద్ర, సీడీపీవో, పెద్దపల్లి అంగన్వాడీ కేంద్రాలకు చిన్నసైజు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు అక్కడక్కడ తమ దృష్టికి తెచ్చారు.దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. చిన్నసైజు కోడిగుడ్లు తెచ్చిన కాంట్రాక్టర్ల నుంచి తీసుకోవద్దని, వాటిని తిరస్కరించాలని సూచించాం. అంగన్వాడీ టీచర్లు దీనికి బాధ్యులవుతారు. -
అదానీకి మరోషాక్
సాక్షి, ముంబై: భారత్లో అతిపెద్ద ఓడరేవుల నిర్వహణ సంస్థ అదానీ పోర్ట్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాలో చేపట్టిన కార్మైకేల్ బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో మరోసారి అదానీకి భంగపాటు తప్పలేదు. ఆస్ట్రేలియాలోని డోనర్ ఈడీఐ లిమిటెడ్కు చెందిన ప్రాజెక్టును వదులుకుంటున్నట్టు ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు అదానీ, డోర్ కంపెనీలు వెల్లడించాయి. వివాదాస్పద బొగ్గుగని ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్టు సోమవారం వెల్లడించింది. దీంతో దీర్ఘకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న కార్మైకేల్ గనికి తాజాగా మరో షాక్ తగిలింది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 16.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రుణాలను పొందడంలో విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు, చైనా బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు నో చెప్పాయి. ఇక చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో దీంతో అదానీ ఆశలు వదులకుంది. కాగా 16,500 కోట్ల డాలర్ల విలువైన కార్మైకేల్ ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనుల్లో ఒకటి. అయితే అంతర్జాతీయ బ్యాంకులు సహా, చైనాకు చెందిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఈ ప్రాజెక్టుకు రుణాన్ని నిరాకరించాయి. మరోవైపు స్థానికులు, పర్యావరణవేత్తలు, పలు సామాజిక సంఘాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది. -
ఇంటికి పిలిచి..చెంపచెళ్లు..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: క్రషర్ యజమానులు, కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం అంశం ఎమ్మెల్యే ఒకరిపై దాడి చేసే వరకు వెళ్లింది. పలువురు కాంట్రాక్టర్ల ఎదుటే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఓ గుత్తేదారుపై చేయిచేసుకున్నాడు. మాట్లాడుతున్న క్రమంలో జరిగిన దాడితో సదరు కాంట్రాక్టర్ నిర్ఘాంతపోయాడు. అయితే బాధిత కాంట్రాక్టర్ కుటుంబానికి రాజకీయాలతో సంబంధాలు ఉండడం వల్ల ఇరువర్గాల మధ్య వివాదం పెద్దదిగా మారింది. చివరికి ఇంటెలిజినెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక సైతం తయారు చేశాయి. స్టోన్ క్రషర్ల విషయంలో వివాదం.. స్టోన్ క్రషర్ల విషయంలో తలెత్తిన వివాదం కాంట్రాక్టర్పై దాడికి కారణమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న స్టోన్క్రషర్లు, హాట్మిక్స్, రెడిమిక్స్ ప్లాంట్ల నిర్వహణతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందంటూ కొంద రు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే సమయంలో క్రషర్ల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న స్టోన్క్రషర్ కార్యకలా పాలు నిలిపేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాలుష్య నియం త్రణ, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగించాలంటూ తీర్పు వెలువరించడంతో స్టోన్క్రషర్లు మూతపడ్డాయి. దాదాపు నెలరోజులుగా ఈ పరిస్థితి కొసాగుతుండగా.. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ నడుస్తుండడంతో ఇతర యజమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు యజమానులు ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో ఎమ్మెల్యేకు చెందిన క్రషర్ విషయం ప్రస్తావనకు వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ క్రషర్ యజమాని, మరో క్రషర్ యజమాని (ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు)తో ఫోన్లో ఆవేదన వ్యక్తం చేస్తూ అధికార ఎమ్మెల్యే క్రషర్ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంటే మనకు ఈ ఇబ్బందు లేంటి. మనల్ని వాడు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆయన పని చల్లగా చేసుకుంటున్నాడు. ఇదేం పద్ధతి. మనం మాత్రం ఏ పాపం చేశాం’ అంటూ ఓ క్రషర్ యాజమాని వ్యాఖ్యానించాడు. ఫోన్లో జరిగిన ఈ సంభాషణను మాజీ ఎమ్మెల్యే సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లి అందరం ఇబ్బందిపడుతున్నామని వివరిస్తూనే ఫోన్ సంభాషణను వినిపించాడు. దీంతో ఎమ్మెల్యేకు కోపమొచ్చి ఆయన్ను తీసుకురా అని చెప్పాడు. మెరుపుదాడి.. ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన సదరు కాంట్రాక్టర్కు రాజకీయ నేపథ్యం ఉంది. అతడి కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. దీంతో ఇరువురి మధ్య కాంప్రమైజ్ కోసం ఎమ్మెల్యే ఇంట్లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు యజ మానులు, కాంట్రాక్టర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే సోదరుడు, ఫోన్లో మాట్లాడిన క్రషర్ యజమానిని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనపైనే వాఖ్యలు చేస్తావా, వాడు.. వీడు అంటావా అని క్రషర్ యజమానిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క ఉదుటన లేచి కాంట్రాక్టర్పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆర్థిక, అంగబలం పుష్కలంగా ఉన్న తనపై ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఆ నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. సమస్య పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తే కొత్త సమస్య ఎదురుకావడంతో క్రషర్ యజమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం చినికిచినికి గాలివానలా మారడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేతో దాడికి గురైన వ్యక్తికి ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యలతోనూ దగ్గరి పరిచయాలు ఉండడంతో విషయం హైదరాబాద్కు వరకు చేరింది. అసలు ఏం జరిగిందో తెలియజేయాలంటూ అక్కడి నుంచి ఇంటలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. చివరికి ఈ అంశానికి ముగింపు ఎలా ఉంటుందనేది రాజకీయ, కాంట్రాక్టర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
నడిరోడ్డుపై బూటుకాలుతో తన్నుకుంటూ..
సాక్షి, అనంతపురం: అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. బిల్లు చేయలేదన్న కోపాన్ని కాంట్రాక్టర్ ఓ డీఈపై చూపించాడు. సోమవారం రాత్రి నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే బూటుకాలితో డీఈని కొట్టడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప అండదండలతోనే కాంట్రాక్టర్ రెచ్చిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. కాంట్రాక్టర్ నరసింహారెడ్డి మద్యం మత్తులో సోమవారం నగరపాలక సంస్థలో నానా హంగామా చేశాడు. స్వీపింగ్ మిషన్ సెకండ్ పేమెంట్ బిల్లుకు సంబంధించి సంతకం చేయాలని ఏఈ మహదేవ ప్రసాద్కు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి అల్టిమేటం జారీ చేశాడు. అందుకు ఏఈ మహదేవప్రసాద్ నిరాకరించడంతో నీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న డీఈ కిష్టప్ప వారిని వారించారు. చివరకు కాంట్రాక్టర్ను అతనితో వచ్చిన ఇద్దరు పోకిరీలను అక్కడి నుంచి అధికారులు పంపిచేశారు. దారికాచి దాడి కాంట్రాక్టర్... డీఈ కిష్టప్పపై దారికాచి దాడి చేశాడు. డీఈ కిష్టప్ప.. కార్పొరేటర్ పద్మావతి సంతాప సభ అయ్యాక ఇంటికి బయలుదేరారు. డీఈని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి తన అనుచరులతో కారులో ఫాలో చేస్తూ వచ్చారు. నగరంలోని నామా టవర్స్ సమీపంలోకి రాగానే డీఈ టూవీలర్ వాహనాన్ని కారుతో తగిలించి వెళ్లిపోయారు. డీఈ తేరుకునే లోపే కాంట్రాక్టర్ జారుకున్నాడు. డీఈ... కాంట్రాక్టర్ కారును ఫాలో చేశారు. రఘువీరా కాంప్లెక్స్ వెనుకవైపు వీధిలోకి వెళ్లగా... అక్కడ కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని డీఈ కిష్టప్ప నిలదీశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నరసింహారెడ్డి డీఈ కిష్టప్పపై బూటుకాలితో దాడి చేశాడు. వన్టౌన్లో ఫిర్యాదు డీఈపై దాడి చేయడాన్ని నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఈ నాగమోహన్ డీఈలు షుకూర్, నరసింహారెడ్డి, ఏఈ మహదేవప్రసాద్ కాంట్రాక్టర్పై వన్టౌన్ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ డీఈకు మద్దతుగా వచ్చారు. (పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న డీఈ కిష్టప్ప, ఏఈ మహదేవప్రసాద్, వైఎస్సార్ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ) ఆది నుంచి వివాదమే..! స్వీపింగ్ మిషన్ కొనుగోలు ఆది నుంచి వివాదాస్పదంగా మారింది. 2015లో అప్పటి కమిషనర్ రూ. 33 లక్షలతో స్వీపింగ్ మిషన్ను కొనుగోలు చేశారు. అనంతపురం రోడ్లపై స్వీపింగ్ మిషన్ పని చేయదని అన్ని వర్గాల నుంచి పూర్తీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. 2016లో కమి షనర్గా ఉన్న సురేంద్రబాబు స్వీపింగ్ మిషన్ను వ్యతిరేకించారు. అది అసెంబుల్ సెట్ అని, జేఎన్టీయూ అధికారులతో సర్టిఫై చేశాకే బిల్లు చేస్తామని తేల్చి చెప్పారు. స్వీపింగ్ మిషన్ సరిగా లేకపోవడంతో వెనక్కు పంపామని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పలుమార్లు చెప్పారు. స్వీపింగ్ మిషన్పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, మేయర్ ఇప్పుడు మొదటి పేమెంట్ కింద కాంట్రాక్టర్కు రూ.24 లక్షలు చెల్లిస్తే మిన్నకుండిపోయారు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వీపింగ్ మిషన్ మెయిన్టైనెన్స్ నెలకు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. ప్రతి నెలా రూ లక్షల్లో ప్రజాధనం లూటీ అవుతుందని సాక్షాత్తు పలువురు అధికారులే వాపోతున్నారు. పోలీసుల అదుపులో కాంట్రాక్టర్ నగర పాలక సంస్థ డీఈ కిష్టప్పపై దాడికి పాల్పడిన కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని వన్టౌన్న్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. డీఈతో పాటు మేయర్ స్వరూప వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి దాడికి పాల్పడిన కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జీ సీఐ కృష్ణమోహన్ను కలిసి డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన వన్టౌన్ పోలీసులు కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకొని వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు ఇంకా దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. -
నడిరోడ్డుపై బూటుకాలుతో తన్నుకుంటూ..
-
ప్రభుత్వస్థలాన్నే కబ్జా చేశారు
-
ఇదేం చోద్యం..!
♦ ప్రభుత్వ పనుల కోసమని చెప్పి సిమెంట్ తెప్పించిన కాంట్రాక్టర్ ♦ సొంత పనుల కోసం గోదాంకు తరలించే యత్నం ♦ విషయం తెలిసి గోదాం వద్దకు వెళ్లిన మీడియా ♦ లోడు దించకుండా నిలిపేసిన లారీ ♦ మేము ఇండెంట్ పెట్టలేదంటున్న పంచాయతీరాజ్ అధికారులు విజయనగరం ఫోర్ట్: ఆయన ఓ కాంట్రాక్టర్. ప్రభుత్వ పనులు చేయిస్తానని చెప్పి ఆ రేటుకు దాదాపు 700 బస్తాల సిమెంట్ను తెప్పించుకున్నాడు. కానీ ప్రభుత్వ పనులకు వినియోగించేందుకు కాకుండా సొంత గోదాములో దించేందుకు ప్రయత్నిస్తుంటే విషయం మీడియాకు తెలిసి పలువురు మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో సిమెంట్ను దించకుండా అలాగే లారీల్లో వదిలేశారు. లారీ సిబ్బందిని లోడుకు సంబంధించిన బిల్లులు చూపించాలని అడిగితే గుమస్తా పట్టుకెళ్లి పోయినట్లు బదులిచ్చారు. ఈ తతంగం అంతా శనివారం, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నివాసం ఎదురుగా ఉన్న రైల్వే క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గోదాం వద్ద జరిగింది. గుంకలా, ద్వారపూడి గ్రామాల్లో సీసీ రోడ్ల కోసమని..! సదరు కాంట్రాక్టర్ మండలంలోని గుంకలా, ద్వారపూడి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం కోసమని నాగార్జున కంపెనీ చెందిన దాదాపు 700 సిమెంట్ బస్తాలను తెప్పించారు. వాస్తవానికి ప్రభుత్వ పనుల కోసమైతే కంపెనీలు రూ.240కే సిమెంట్ బస్తాను ఇవ్వాలి. స్లాగ్ సిమెంట్ను రూ.230కు, ఓపీసీ గ్రేడ్ సిమెంట్ అయితే రూ.240కు ప్రభుత్వ పనులకు కంపెనీలు ఇస్తున్నాయి. కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం సిమెంట్ బస్తా ధర రూ.330 నుంచి రూ.340గా ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు బస్తా సిమెంట్కు రూ.100 వరకు మిగులుతుంది. దాదాపు 700 బస్తాలకు రూ.70వేల వరకు ఆ కాంట్రాక్టర్ మిగిలించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉండడంతో కొన్ని సిమెంట్ కంపెనీలకు చెందిన సిబ్బందితో, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ పనుల పేరు చెప్పి తక్కువ ధరకే సిమెంట్ను తెప్పించుకుంటున్నారు. అసలు నిబంధన ఇదీ.. ప్రభుత్వ పనులకు సిమెంట్ కావాలంటే స్థానిక సర్పంచ్ ఎన్ని బస్తాల సిమెంట్ అవసరమో వాటికి డీడీ తీసీ పంచాయతీరాజ్ ఈఈకు ఇవ్వాలి. ఈఈ ఇన్ని బస్తాల సిమెంట్ అవసరం అని ఇండెంట్ పెడతారు. సంబంధిత కంపెనీలు సిమెంట్ను సరఫరా చేస్తారు. సిమెంట్ వచ్చిన తర్వాత డెలివరీ బిల్లుపై మండల ఇంజినీర్ సంతకం చేయాలి. కానీ శనివారం జిల్లాకు వచ్చిన సిమెంట్ లోడు అసలు పంచాయతీ రాజ్ అధికారులు ఇండెంటే పెట్టకుండా వచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. -
చెట్ల కిందనే పాఠాలు!
► బిల్లులు రాక గదికి తాళాలు వేసిన కాంట్రాక్టర్ ! ► ఆరుబయట కూర్చుంటున్న విద్యార్థులు ► పట్టించుకోని ఉన్నతాధికారులు ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఇల్లందకుంట: ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపంగా మారింది. బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విసుగెత్తిన ఓ కాంట్రాక్టర్ అదనపు తరగతిగదులకు తాళం వేయడంతో విద్యార్థులకు చెట్లే దిక్కయ్యాయి. చేసేదేమిలేక ఉపాధ్యాయులు సైతం చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.28.61లక్షలతో.. ఇల్లందకుంట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.28.61లక్షల నిధులు మంజూరు చేసింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేశాడు. ఈ విద్యాసంవత్సరం అదనపు తరగతి గదులకు మారేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు బిల్లులు రాలేవంటూ కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారని ప్రధానోపాద్యాయుడు సాంబయ్య తెలిపారు. చేసేదేమి లేక చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు. వెనుదిరుగుతున్న తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వచ్చి ఇక్కడి విద్యార్థుల చెట్ల కింద కూర్చోవడాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ తాళం వేయడం, ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులకు నివేదించాం డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారు. ఈ విషయంతోపాటు విద్యార్థులు చెట్ల కింద కూర్చుంటున్న విషాయన్ని సైతం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం కూలిపోయిన తరగతిగదులలో కొందరు, మరికొందరు చెట్లకింద కూర్చుంటున్నారు. కాంట్రాక్టర్కు సైతం చాలాసార్లు ఫోన్ చేశాం. ఆయన స్పందించడం లేదు. – సాంబయ్య, ప్రధానోపాధ్యాయుడు -
భవనంపై నుంచి కింద పడి..
యువకుడి మృతి - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని న్యూ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సుంకన్న గౌండా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య శ్యామలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు నల్లబోతుల సురేష్(21) నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ కాలేజిలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో గతంలో సెంట్రింగ్ పనికి వెళ్లేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనితో పాటు ఎలక్ట్రికల్ పనులు నేర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న గైనకాలజీ విభాగం(ఎంసీహెచ్ భవనం)లో ఐదో అంతస్తు నిర్మాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అందరూ పని ముగించుకుని కిందకు దిగారు. చీకటి పడటంతో సురేష్ సైతం కిందకు దిగే ప్రయత్నం చేస్తుండగా అదుపు తప్పి ఐదో అంతస్తు నుంచి కిందకు పడ్డాడు. వెంటనే తలపగలి అక్కడికక్కడే అతను మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. కాలేజికి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో మేనమామ ఊరికి వెళ్తానని సురేష్ చెప్పినా ఈ రోజు ఒక్కరోజు వెళ్లిరా అని తాను పంపించడంతోనే పనికి వచ్చి ఇలా మృత్యువుపాలయ్యాడని తల్లి శ్యామలమ్మ కన్నీటి పర్యంతమైంది. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ సౌకర్యాలు కల్పించక పోవడంతో యువకుడు చీకట్లో కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి ఏడు గంటల సమయంలో చీకటి పడటం, లైట్లు ఏర్పాటు చేకపోవడంతో ప్రమాదం జరిగింది. -
ముడుపులకు మూల్యం
ముడుపులకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రతి బిల్లుకు డబ్బులు వసూలు చేస్తున్నందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పర్సెంటేజీల పేరిట వేధింపులకు తగిన శాస్తి జరిగింది. ప్రజోపయోగానికి రోడ్డు నిర్మించేందుకు లంచాలు చెల్లించాలి. ఆ పని దక్కించుకోవడానికి పర్సంటేజీలు ఇవ్వాలి. ఇక పని పూర్తి చేశాక ఆ కాంట్రాక్టర్కు దక్కిందేమిటి. కడుపు మండిన ఓ కాంట్రాక్టర్ వేధిస్తున్న ఇంజినీరింగ్ అధికారిని అవినీతి నిరోధక శాఖకు పట్టించారు. ఏసీబీకి చిక్కిన ఇంజినీరింగ్ అధికారి ఎంబుక్లో నమోదు చేసేందుకు రూ. 20వేలు డిమాండ్ కడుపుమండి ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ సాక్షి ప్రతినిధి, విజయనగరం :పర్సంటేజీలు, ముడుపులు ఇచ్చుకోలేక చిన్నపాటి కాంట్రాక్టర్లు చితికిపోతున్నారు. సహనం ఉన్న వాళ్లు భరిస్తున్నారు. తట్టుకోలేని వాళ్లు అవినీతికి పాల్పడుతున్న వారికి తిరిగి బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడా విధంగానే సాలూరు మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఎంబుక్లో రికార్డు చేసేందుకు చిన్నపాటి కాంట్రాక్టర్ నుంచి రూ. 20వేలు లంచం తీసుకుని విజయనగరం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పబ్లిక్గా దొరికిపోయారు. పని చేతికొచ్చిన దగ్గరి నుంచే ముడుపులే పనులు మంజూరైన దగ్గరి నుంచి చేపట్టిన వరకు అడ్డుగోలు కార్యక్రమమే. నామినేటేడ్ పద్ధతిలో మంజూరైన పనులను సంబంధిత సర్పంచ్లు, నీటి సంఘాల అధ్యక్షులు చేపట్టాల్సి ఉంది. కొందరు అధికార పార్టీ నేతలు కష్టపడకుండానే సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో మంజూరైన పనులను పర్సంటేజీకి చిన్నపాటి కాంట్రాక్టర్లకు అమ్మేస్తున్నారు. నాలుగు డబ్బులొస్తాయని ఆశపడి కాంట్రాక్టర్లు ఏదో ఒక రకంగా పని కానిచ్చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు మామూళ్లు ఇక సర్పంచ్లనుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను ఇంజినీరింగ్ అధికారులు వదలడంలేదు. తమకు రావల్సినవి ఇచ్చేయాల్సేందంటూ పర్సంటేజీలు తీసుకుంటున్నారు. కొందరు పని విలువలో 10నుంచి 12శాతం తీసుకుంటుండగా, మరికొందరు 15శాతం వరకు గుంజేస్తున్నారు. ఇరిగేషన్ పనుల్లోనైతే 20శాతం వరకు లాగేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు వాటితో సంతృప్తి చెందడం లేదు. ఎంబుక్లో రికార్డు చేసిన ప్రతీసారి పిండేస్తున్నారు. అప్పుడు కూడా తమను సంతృప్తి పరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడా రకంగా ఇవ్వలేకే సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన కాంట్రాక్టర్ బి.సూర్యనారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వ్యూహాత్మకంగా ఎంబుక్ రికార్డు చేసేందుకు డబ్బులు అడిగిన మండల ఇంజినీరింగ్ అధికారి రాంగోపాల్రెడ్డిని బుక్ చేయించారు. పట్టు బడేంతవరకు తొందరే బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రాంగోపాల్రెడ్డి వ్యవహారం చూస్తే లంచం సొమ్ము కోసం తానెంత ఆత్రుత పడ్డాడన్నది స్పష్టమవుతుంది. రూ. 5లక్షల విలువైన సీసీ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రూ. 3.50లక్షల బిల్లు చేసేశారు. మిగతా రూ. లక్షా 50వేలు బిల్లు కోసం రూ. 20వేలు డిమాండ్ చేశారు. లంచమిస్తేనే ఎంబుక్ రికార్డు చేస్తానని మొండికేయడంతో కాంట్రాక్టర్ సూర్యనారాయణ మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి ప్రణాళిక ప్రకారం అడిగినంత ఇస్తామంటూ ఇంజినీరింగ్ అధికారికి చెప్పించారు. బుధవారం తెల్లవారు జామునుంచి లంచం సొమ్ము కోసం ఇంజినీరింగ్ అధికారి తెగ ఆరాట పడ్డారు. ఉదయం 7.30గంటలకు కాంట్రాక్టర్కు ఫోన్ చేసి సాలూరు రావడం లేదని... కలెక్టరేట్లో సమావేశం ఉందని... ఇక్కడికొచ్చి ఇవ్వాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మళ్లీ 9గంటలకు ఫోన్ చేసి వస్తున్నావా...అని అడిగారు. 9.30గంటలకు మరోసారి ఎక్కడున్నావని అడిగారు. 10గంటలకు ఫోన్ చేసి కలెక్టరేట్ వద్దకు వచ్చేశానని, తెలిపారు. ఇదిగో వచ్చేస్తున్నానంటూ కాంట్రాక్టర్ సూర్యనారాయణ ఏసీబీ అధికారులను వెంటబెట్టుకుని కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. ఆ పక్కనే చెట్లు కింద ఉన్న ఇంజినీరింగ్ అధికారిని కలిశారు. లంచం సొమ్మును ఇచ్చేందుకు ప్రయత్నించగా తన బ్యాగ్లో పెట్టాలని ఇంజనీరింగ్ అధికారి కోరారు. కానీ, కాంట్రాక్టర్ బ్యాగ్లో పెట్టకుండా నేరుగా చేతికిచ్చాడు. అదే అదనుగా మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పబ్లిక్గా పట్టుకున్నారు. వెంటనే కారులోకి ఎక్కించి, విచారించారు. మీడియా కంట పడకుండా గంటన్నరకు పైగా కారులోనే ఇంజనీరింగ్ అధికారి ఉండిపోయారు. కొసమెరుపు ఏంటంటే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్ అధికారికి మరో రెండేళ్లే సర్వీసు ఉంది. దాడుల్లో విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి, సీఐలు రమేష్, లక్మోజులు పాల్గొన్నారు. -
అటకెక్కిన కాకినాడ కెనాల్ రోడ్డు విస్తరణ
-
టన్నెల్ పనుల తనిఖీ
అవుకు: గాలేరు–నగరి సుజల స్రవంతి పనుల్లో భాగంగా అవుకు టన్నెల్ (ప్యాకేజ్ నంబర్–30) నిర్మాణ పనులను సీఈ నారాయణరెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలతో పాటు కాంట్రాక్టర్ల పై ఒత్తిడి పెంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అవుకు టన్నెల్ పనుల్లో ఒక సొరంగం 300 మీటర్లు మేర ఫాల్ట్జోన్ ఉందని, దీంతో రైట్ డైవర్స్న్లో దాదాపు 394 మీటర్లలో మరో టన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం 100 మీటర్ల పనులు మాత్రమే పెండింగ్లో ఉందని,రోజుకు 10 మీటర్ల తగ్గకుండా చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ నెల చివరినాటికి ఒక సొరంగం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ సూర్య కుమార్, ఈఈ పాపారావు, డీఈలు మనోహర్ రాజు, శివప్రసాద్, మురళీకృష్ట, క్యాలిటీ కంట్రోల్ డీఈ చిదంబర్ రెడ్డి, టన్నెల్ జీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
నీ వ్యాపారం పచ్చగుండా!
నా వద్దే కంకర కొనాలి! – సిమెంట్ కంపెనీలకు, కాంట్రాక్టర్లకు బెదిరింపులు – అధికార పార్టీ ఎమ్మెల్యే దాదాగిరి – రెండో ప్లాంట్ ఏర్పాటుకూ సన్నాహాలు – ఓర్వకల్లు వద్ద ఇప్పటికే పనులు మంచి పనులు చేయాలి. ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి. చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలి. ఇదీ ఒకప్పటి రాజకీయ నేతల మదిలోని మాట. ఇప్పుడు ఇలాంటి నేతలు నూటికో.. కోటికో ఒక్కరు. నాయకుడు కావడమే తరువాయి.. ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిపాస్తులు వెనకేసుకోవడంపైనే దృష్టి. తాజాగా ఓ అధికార పార్టీ నేత తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రాజకీయాలను వేదికగా చేసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు తాపత్రయపడుతున్నారు. వీరిలో కొందరు మరో అడుగు ముందుకేసి ఎదుటివాళ్ల ఇళ్లనూ సర్దేసే పనిలో పడ్డారు. ఈ కోవలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఎవరు ఏ పనిచేయాలన్నా.. ఎవరికి కంకర కావాలన్నా తన నుంచే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఒక సిమెంటు కంపెనీ రైల్వే సైడింగ్ పనులు చేపడుతోంది. ఈ పనులకూ సదరు ఎమ్మెల్యేకు చెందిన కంకర మిషన్ నుంచే సిమెంటు కంపెనీ కాస్తా కంకర కొనుగోలు చేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో తిప్పలు తప్పవంటూ హెచ్చరించడంతో సిమెంటు కంపెనీ యాజమాన్యం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా తన నియోజకవర్గ పరిధిలో ఏ కాంట్రాక్టర్ పనిచేయాలన్నా.. అవసరమైన కంకరను తన వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీచేశారు. భలేగా ఉంది బిజినెస్.. ఏదైనా వ్యాపారం చేయాలంటే అందుకు మార్కెటింగ్ ఎంతో కీలకం. అయితే, ఇక్కడ అధికారం ఉండటమే మార్కెటింగ్గా మారింది. అందుకే ఏ మాత్రం కష్టపడకుండా నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టర్ పనిచేసినా.. ఏ సిమెంటు కంపెనీ పనులు చేసినా ఈయనకు చెందిన ప్లాంటు నుంచే కంకరను కొనుగోలు చేయాల్సి వస్తోంది. త్వరలో ఇదే నియోజకవర్గంలోని మిగిలిన సిమెంటు కంపెనీలు కూడా రైల్వే సైడింగ్ పనులు చేసుకోవాల్సి ఉంది. దీంతో ఈ కంపెనీలు కూడా తప్పనిసరిగా సదరు ఎమ్మెల్యే నుంచే కంకరను కొనుగోలు చేయాల్సి రానుంది. ఇక రోడ్ల పనులు చేపట్టే కాంట్రాక్టర్లు సైతం ఈయన ప్లాంటు నుంచే కంకర కొనాల్సిన పరిస్థితి. ఫలితంగా ప్లాంటులో తయారైన కంకరకు డిమాండ్ పరంగా ఇబ్బందులేమీ లేవు. ఈ నేపథ్యంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రణాళిక వేసుకున్నారు. ఓర్వకల్లులో రెండో ప్లాంటు ఇప్పటికే తన నియోజకవర్గంలో ఉన్న కంకర తయారీ ప్లాంటుకు గిరాకీ ఉండటంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు ఎమ్మెల్యే సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఓర్వకల్లులో రెండో ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఓర్వకల్లును పారిశ్రామిక హబ్గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా పనులు ప్రారంభించకపోయినా రానున్న రోజుల్లో ఒకటో, రెండో పరిశ్రమలు పనులు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీకి స్థలం కేటాయించింది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీకి కూడా జగన్నాథగట్టు వద్ద స్థలాన్ని కేటాయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో అటు ఉర్దూ యూనివర్సిటీ, ఇటు ట్రిపుల్ ఐటీ క్లాసులను సొంత క్యాంపస్లలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కంకర ప్లాంటును ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా తన ప్లాంటు నుంచే కంకరను కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలోచనగా ఉంది. మొత్తం మీద అటు రాజకీయం.. ఇటు వ్యాపారం మేళవింపుతో మిగిలిన ఎమ్మెల్యేల కంటే ఈయన కాస్త దూసుకుపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. -
కాంట్రాక్టర్ను జైలులో పెట్టండి..
వన్టౌన్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ బాబు.ఏ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ను జైలులో పెట్టాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేసి డబ్బులు కాజేయాలని చూస్తే ఊరుకుంటామనుకుంటున్నారా...అంటూ తీవ్రంగా హెచ్చరించారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అందులో భాగంగా 1800 మరుగుదొడ్ల ఏర్పాటుకు పూనేకు చెందిన లాల్జీ అనే కాంట్రాక్టర్ రూ.రెండు కోట్లకు కాంట్రాక్ట్ పొందాడు. నగరంలో వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, నిర్వహణ వారే చూడాలి. ఆ సంస్థ మరుగుదొడ్ల నిర్వహణలో పూర్తిగా విఫలం చెందింది. దానిపై కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్కు వివరించారు. ఆయన స్వయంగా పరిశీలించి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ చంద్రుడు, సబ్కలెక్టర్ సృజన, ఇతర అధికారులు దుర్గాఘాట్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్లో సమావేశమయ్యారు. కమిషనర్ కాంట్రాక్టర్ను పిలిపించి జిల్లా కలెక్టర్ ముందు నిలబెట్టాడు. కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పని చేయకుండా డబ్బులో కాజేయాలని చూస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. అటువంటి ట్రిక్లు ఎక్కడైనా జరుగుతాయోమో.. ఈ జిల్లాలో జరగదంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న డీఎస్పీని కార్పొరేషన్ వారు ఫిర్యాదు చేస్తారని, కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయాలంటూ సూచించారు. -
నాణ్యతకు తిలోదకాలు
బెల్లంపల్లి : నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడంతో నిర్మించిన నెల రోజుల్లోనే రహదారి గుంతలమయంగా మారింది. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గుత్తేదారు నాణ్యతగా నిర్మించకపోవడంతో బీటీ రహదారి చెదిరిపోయి గుంతలు పడుతున్నాయి. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం భీమిని మండలంలో ఇటీవల నిర్మించిన ఓ బీటీ రోడ్డు నాణ్యత ప్రమాణాలను వెక్కిరించే రీతిలో తయారైంది. రూ.4.36 కోట్లతో.. భీమిని మండలం ముత్తాపూర్ గ్రామ క్రాస్ రోడ్డు నుంచి మెట్పల్లి గ్రామం వరకు కొన్నాళ్ల నుంచి గ్రామీణులకు సరైన రోడ్డు సదుపాయం లేకుండా పోయింది. కంకర రోడ్డుపై రాకపోకలు సాగించడానికి ఏళ్ల తరబడి నుంచి గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఆ రోడ్డును బీటీగా మార్చడానికిSఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయా గ్రామాల మధ్య ఉన్న 9.2 కిలోమీటర్ల పరిధిలో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.36 కోట్ల నిధులను మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు గత నెల( జూన్)లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇన్నాళ్లు గతుకుల రోడ్లతో ఎన్నో అవస్థలు పడ్డ తమకు ఇక కొత్త రోడ్డు నిర్మాణంతో కష్టాలు కడతేరినట్లేనని ఆ ప్రాంతాల ప్రజలు ఎంతగానో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. సరిగ్గా నెల రోజులు కూడా తిరక్క ముందే రోడ్డుపై వేసిన బీటీ చెదిరిపోయింది. అడుగుకో గుంత... కొత్తగా నిర్మించిన రహదారి బీటితో తళతళ మెరిసిపోవాల్సి ఉండగా కళావిహీనంగా మారింది. 9 కిలోమీటర్ల పొడవున అడుగుకో గుంత ఏర్పడి అధ్వానంగా తయారైంది. చాలా మట్టుకు కొత్తగా వేసిన బీటి చెదిరిపోయి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. అనేక చోట్ల పగుళ్లు తేలింది. కొన్ని చోట్ల రహదారి కోతకు గురైంది. రోడ్డుపై కనీసం అర ఇంచు మందం డాంబర్ లేకుండా పోయిందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లేక.. రూ. కోట్ల అంచనాతో చేపట్టిన రహదారి నిర్మాణం సక్రమంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవల్సిన బాధ్యత సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులపై ఉంటుంది. ఆగమేఘాల మీద, సరైన పద్ధతులు పాటించకుండా రోడ్డు నిర్మాణం జరిగిన∙ఇంజినీరింగ్ అధికారులు పట్టింపు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికైనా రోడ్డు పునఃనిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామీణులు కోరుతున్నారు. బిల్లులు చెల్లించలేదు – రాంచందర్, ఏఈ పంచాయతీరాజ్, భీమిని ముత్తాపూర్ – మెట్పల్లి ప్రధాన రహదారి నిర్మించిన గుత్తేదారుకు ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. ఐదేళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా గుత్తేదారుపైనే ఉంటాయి. ప్రస్తుతం బీటి చెదిరిపోయి రోడ్డుపై గుంతలు పడ్డాయి. నాణ్యతగా నిర్మించని గుత్తేదారుకు లీగల్ నోటీసులు ఇచ్చాం. రోడ్డు దుస్థితిని ఉన్నతాధికారుల దష్టికి ఈపాటికే తీసుకెళ్లాను. రోడ్డు పునఃనిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం. -
పుణ్యకాలంలో పాపకార్యం
పుష్కరాల భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు నాసిరకంగా మరుగుదొడ్లు నిర్మించిన కాంట్రాక్టర్ పెనమలూరు : మండలంలో పుష్కరాల పనులు ఫార్సుగా మారాయి. తాజాగా మరుగుదొడ్ల అద్దె బాగోతం వెలుగులోకి వచ్చింది. పచ్చనేతల అండదండటతో మరుగుదొడ్లనూ వదలకుండా కాసులు దండుకునే పనిలో పడ్డారు కాంట్రాక్టర్లు. పుష్కరాలకు అద్దె మరుగుదొడ్లు ఏర్పాటు చేసి రూ.11 లక్షలు స్వాహాకు చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేశారు. పెనమలూరు మండలంలో యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, కాసరనేనివారిపాలెం గ్రామాల్లో ఘాట్లు ఉన్నాయి. పుష్కరాల యాత్రికుల కోసం ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను ఆర్డబ్ల్యూఎస్ శాఖ తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టింది. అద్దె డబ్బుతో శాశ్వతంగా నిర్మించొచ్చు పుష్కర ఘాట్ల వద్ద కాంట్రాక్టర్ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మరుగుదొడ్డికి రోజుకు అద్దె రూ 2200. పెనమలూరు మండలంలో యనమలకుదురులో 20 మరుగుదొడ్లు, పెదపులిపాకలో 10, చోడవరంలో 10, కాసరనేనివారిపాలెంలో నాలుగు కలిపి మొత్తం 44 మరుగుదొడ్లు నిర్మించారు. ఈ మరుగుదొడ్లకు 44 రోజులకుగాను అద్దె రూ.11,61,600. ఈ లెక్కన ఒక్కో మరుగుదొడ్డికి రూ 26,400 ప్రభుత్వం చెల్లించాలి. విజయవాడ నగరంలో ఏసీ గది రోజుకు రూ.1500 ఉంటుంది. కానీ తాత్కాలిక మరుగుదొడ్డి అద్దె మాత్రం దీనికంటే ఎక్కువ. దీన్ని చూసిన వారు పుష్కరాల పనులనూ అక్రమార్కులు వదలడం లేదని విమర్శిస్తున్నారు. వాస్తవంగా అద్దె బదులుగా ఈ సొమ్ముతో ఇక్కడ సామూహిక మరుగుదొడ్లు నిర్మించవచ్చు. గాలి వస్తే పడడం ఖాయం కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఇరుకుగా చిన్నపాటి గాలి వస్తే పడిపోయేలా ఉన్నాయి. కేవలం రేకులతో సన్నని ఇనుక కమ్మెలతో వీటిని నిర్మించారు. భారీ ఖాయంగల వ్యక్తులు ఈ మరుగుదొడ్డిలోకి వెళ్లడం కష్టమే. తాత్కాలిక మరుగుదొడ్లకు పైకప్పు లేదు. వర్షం కురిస్తే భక్తుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇలాంటి వారికి లక్షల రూపాలయ అద్దె చెల్లించడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వమే చెప్పాలి. -
సివిల్ సప్లయ్ స్టేజ్–1 కాంట్రాక్టర్కు మంత్రి బినామీ
- ఎఫ్సీఐ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర - ఆందోళన చేస్తాం: తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం : పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆశాఖ స్టేజ్–1 కాంట్రాక్ట్కు బినామీగా వ్యవహరిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల స్టేజ్–1 కాంట్రాక్ట్లన్నీ మంత్రి, టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఎఫ్సీఐ గోదాముల నుంచి కాకుండా వేర్హౌస్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు ఆహారధాన్యాలు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. భారత ఆ హార సంస్థ (ఎఫ్సీఐ)కు ప్రతి జిల్లాలోనూ గోదాములు ఉన్నాయన్నారు. జిల్లాలో జంగాలపల్లి, తిమ్మనచెర్లలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాలలోని వేర్హౌస్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మరోవైపు ఎఫ్సీఐ గోదాముల్లో పని చేస్తున్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. కందుకూరులోనే దాదాపు 400 మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రామగిరి మండలంలో గనులు మూసివేసి 3 వేల కుటుంబాలు రోడ్డున పడేలా చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదేనన్నారు. ఎస్కేయూలో పని 400 మంది ఫ్రీఫుడ్ కార్మికులను తొలిగించారన్నారు. వేలాది మంది ఆరోగ్యమిత్రలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి మేట్లు, ఆదర్శరైతులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలిగించారన్నారు. ఆత్మకూరు మండలం బి. యాలేరులో చెరువు ఆక్రమణతో 400 వాల్మీకి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. సమావేశంలో యువజన విభాగం అనంతపురం రూరల్ మండలం అధ్యక్షుడు కట్టకిందపల్లి వరప్రసాద్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
యువనేత కక్కుర్తి
► వేంకటేశ్వరస్వామి వారి పనుల్లోనూ కమీషన్ డిమాండ్ ► సొమ్ము ఇవ్వలేదని నిర్మాణ పనులు నిలిపివేత ► కూలీలను పోలీస్స్టేషన్కు తరలించి కాంట్రాక్టర్కు బెదిరింపు ► నరసరావుపేటలో పెచ్చుమీరిన టీడీపీ యువనేత ఆగడాలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా ఉంది ఆ యువనేత తీరు. దశాబ్ద కాలం తర్వాత అధికారం రావడంతో తనివి తీరా దోచుకోవాలనే ప్రణాళికలో భాగంగా ఇప్పటికే తన హవా సాగిస్తున్నారు. రెండేళ్లుగా రెండు నియోజకవర్గాల్లో అన్నీ తానై నడిపిస్తున్నారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు, పంచాయితీలు చేస్తూ అందినకాడికి దోపిడీ చేస్తున్నారు. తాజాగా దేవుడి సొమ్ముపై కూడా ఆ నేత కన్ను పడింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా వ్యూహాన్ని రచించాడు. కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదనే సాకుతో పనులు నిలిపివేసి తన ప్రతాపాన్ని చూపించాడు. సాక్షాత్తూ వేంకటేశ్వరుని నిధులతో చేపట్టిన పనుల్లోనూ వాటా కోరటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : నరసరావుపేటలో యువనేత ఆగడాలకు అంతులేకుండా పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కోటప్పకొండ దిగువన దాదాపు రూ.6 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం, వేదపాఠశాలను నిర్మిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. కోట్లాది రూపాయల పనులు జరుగుతుండడంతో టీడీపీ యువనేత తనదైన శైలిలో కాంట్రాక్టర్లను కమీషన్ డిమాండ్ చేశారు. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపించినా యువనేత వైఖరి కారణంగా ముందుకు రాలేదు. పనులు నిలిపివేత..... కొన్ని నెలల తర్వాత గుంటూరుకు చెందిన కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారు. కొద్ది రోజులకే అధికార పార్టీ యువనేత పనులను నిలిపి వేయించాడు. తన కమీషన్ ఇచ్చిన తరువాతే పనులు చేయాలని స్పష్టం చేశాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పోలీస్స్టేషన్కు తరలించి కాంట్రాక్టర్ను బెదిరించారు. యాత్రికుల వసతి గృహం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ నుంచే రూ.25 లక్షలు డిమాండ్ చేయగా ఆ సమయంలో రూ.5 లక్షలు కాంట్రాక్టర్ చెల్లించినట్టు తెలిసింది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. నెల రోజుల్లో పూర్తికావస్తుండటంతో తనకు రావాల్సిన కమీషన్ కోసం యువనేత మరోసారి బెదరింపులకు దిగాడు. పోలీసుస్టేషన్కు కూలీల తరలింపు... శనివారం నిర్మాణ పనుల్లో ఉన్న 9మంది కూలీలను పోలీసులు తీసుకెళ్లారు. కాంట్రాక్టర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆదివారం మధ్నాహ్నం వరకు స్టేషన్లోనే వారిని ఉంచినట్టు సమాచారం. భోజనాలకు బయటకు పంపగా వారు పరారైనట్టు తెలిసింది. సాక్షాత్తూ త్రికోటేశ్వర స్వామి సన్నిదిలో శ్రీ వేంకటేశ్వరుని నిధులతో జరుగుతున్న పనుల్లో కూడా కమీషన్ కోసం యువనేత కక్కుర్తిపడటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. కూలీలను తీసుకొచ్చిన దానిపై రూరల్ ఎస్ఐ జేసీహెచ్ వెంకటేశ్వర్లను వివరణ అడగ్గా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా వారిని స్టేషన్కు తీసుకువచ్చినట్టు చెప్పడం విశేషం. -
నెల్లూరులోనూ బురిడీబాబా లీలలు
► పలువురిని మోసగించిన వైనం ► పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోన్న బాధితులు ► ఆరా తీస్తున్న పోలీసులు నెల్లూరు (క్రైమ్) : లక్ష్మీపూజల పేరిట డబ్బులు రెట్టింపు చేస్తామని ప్రజలను బురిడీ కొట్టిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మోస్ట్వాంటెండ్గా మారిన బుడ్డప్పగారి శివ అలియాస్ సూర్యా అలియాస్ స్వామి మోసాలు జిల్లాలోనూ అనేకం ఉన్నాయి. 2014లో జూన్ 8వ తేదీన మాగుంట లేఅవుట్లోని పావని అపార్ట్మెంట్లో ఆనందరెడ్డి ఇంట్లో రూ. 40 లక్షలతో ఉడాయించాడు. ఈ ఘటనపై అప్పట్లో నెల్లూరు నాల్గోనగర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడి కోసం నెల్లూరు, తిరుపతి పోలీసులు విసృ్తత గాలిస్తుండగా అదే ఏడాది ఆగస్టు 22వ తేదీన అలిపిరి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి కరకంబాడి వద్ద బురిడీబాబాను, అతని అనుచరుడు దామోదర్ను అరెస్ట్ చేసి రూ.80 లక్షల నగదు, కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జైలుకు పంపారు. అప్పటి నుంచి అతను కొంతకాలం కనుమరుగయ్యారు. తాజాగా హైదారాబాద్కు చెందిన లైఫ్స్టైల్ అధినేత మధుసూదన్రెడ్డిని సుమారు రూ. 1.30 కోట్లు బురిడీకొట్టించడంతో అక్కడి టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం శివను బెంగళూరులో అరెస్ట్ చేశారు. జిల్లాలో అనేక మోసాలు బురిడీ బాబా శివకు నెల్లూరు జిల్లాలోని పలువురుతో భారీ పరిచయాలు ఉన్నాయి. వారి ఆధారంగా సంపన్న వర్గాలకు చెందిన పలువురుని పూజల పేరిట మోసగించినట్లు తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ను పూజల పేరిట రూ. 80 లక్షల వరకు మోసగించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువుపోతుందోనని విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఇటీవల పూజల పేరిట రూ. 40 గ్రాముల బంగారు, రూ. 40 వేల నగదుతో పూజారి ఉడాయించిన సంఘటనపై ఒకటో నగర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తాజా ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసులు బురిడీబాబా మోసాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. -
కాంట్రాక్టర్ పేరుతో డబ్బు వసూళ్లు
గన్ఫౌండ్రీ (హైదరాబాద్) : సివిల్ కాంట్రాక్టర్గా చెప్పుకుంటూ అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని అఫ్జల్గంజ్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఎస్సై కిషన్ కథనం ప్రకారం.. గౌలిగూడకు చెందిన సుబ్రహ్మణ్య రాజు సివిల్ కాంట్రాక్టర్ అవతారమెత్తి అపార్ట్మెంట్లు, ఇండ్లు నిర్మించి ఇస్తానని పలువురి వద్ద అడ్వాన్స్గా డబ్బులు తీసుకున్నాడు. కొంతమేర పనులు చేసినట్లు చూపి రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. ఎవరైనా నిలదీస్తే వారిపై కోర్టు, హెచ్ఆర్సిల్లో భార్యతో కేసులు వేయించి భయపెడుతున్నాడు. ఈ నేపధ్యంలో గౌలిగూడ బస్డిపో సమీపంలో ఉండే అశోక్ వద్ద ఇంటి నిర్మాణం కోసం రూ.40 లక్షలకు మాట్లాడుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. పిల్లర్ల వరకు నిర్మాణం చేపట్టి నిలిపివేశాడు. అలాగే మరో వ్యాపారి వద్ద ఇంటి నిర్మాణానికి రూ.27లక్షలకు మాట్లాడుకొని, రూ.9 లక్షలు అడ్వాన్స్గా తీసుకోని మొదటి అంతస్తు వరకు నిర్మించి నిలిపివేశాడు. వీరు నగదు తిరిగి ఇవ్వాలని కోరగా వాయిదాలు పెడుతున్నాడు. దీంతో బాధితులు అఫ్జల్గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు సుబ్రహ్మణ్యరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
‘ఆ కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు పెట్టండి’
హైదరాబాద్: సుల్తాన్బజార్లో ఇద్దరు అడ్డా కూలీల మృతికి కారణమైన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనపైన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బోర్డు ఎండీ లోకేష్తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి జాగ్రత్తలతో యంత్రాల సాయంతో డ్రైనేజీ శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. -
జేసీబీ దహనం: మావోయిస్టుల చర్యేనా?
కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో జరిగిన వరుస ఘటనలు మావోయిస్టుల సంచారంపై అనుమానాలు కలిగిస్తున్నాయి. సోమవారం రాత్రి మండలంలోని రామన్నపేట శివారులో ఒక కాంట్రాక్టర్కు చెందిన జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు కాలబెట్టారు. దాదాపు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ జేసీబీని ఇక్కడ గుట్టను తవ్వేందుకు వాడుతున్నారు. ఇదే విధంగా ఇటీవల మరిమడ్ల గ్రామంలోని సెల్ఫోన్ టవర్ను కూడా కాలబెట్టారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ఇది మావోయిస్టుల పనిగా అనుమానిస్తున్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి.. పసి ప్రాణం బలి
రెడీమిక్స్ ప్లాంట్ కోసం తవ్విన 40 అడుగుల గోతిలో పడి మృతి కన్నవారికి కడుపుకోత విజయవాడ (పటమట) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ పసివాడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఏపీఐఐసీ కాలనీలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ రెడీమిక్స్ తయారీ కోసం ప్లాంట్ను ప్రాజెక్టుకు పక్కనే ఉన్న మరో స్థలంలో ఏర్పాటు చేశారు. రెడీమిక్స్ తయారీలో వచ్చే నీటిని పంపేందుకు 40 అడుగుల మేర భారీ గొయ్యి తీశారు. దాని చుట్టూ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. ఈ నేపథ్యంలో కాలనీ వాసి ఆఫ్రిన్ ఏకైక కుమారుడు అజారుద్దీన్ (8) సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆడుకుంటూ ఆ గొయ్యిలో పడిపోయాడు. బాలుడితో ఉన్న పిల్లలు వెంటనే అతని తల్లికి సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో గొయ్యిలో పడిన బాలుడిని వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. బాలుడి తండ్రి సిజారుద్దీన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. తల్లి ఆఫ్రిన్ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. బాలుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. స్థానికుల ఆందోళన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. కాలనీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. విష యం తెలుసుకున్న మేయర్ కోనేరు శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇదేమి న్యాయం ?
అభివృద్ధి పనుల పేరుతో పేదల భూములపై కన్ను తమదాకా వస్తే మాత్రం వ్యతిరేకం తెలుగు తమ్ముళ్ల ద్వంద్వనీతి శాంతిపురం: ‘అభివృద్ధి చేయాలంటే భూమి కావాలి.. రైతులు సహకరిం చాలి.. పరిశ్రమలు, ప్రాజెక్టులు గాలిలో కట్టలేం. భూములు ఇవ్వబోమంటే ఎలా?’ టీడీపీ నాయకుల నోట తరచూ దొర్లుతున్న మాటలివి. గతంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణ, ఇప్పు డు హంద్రీ-నీవా కాలువ సర్వేల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఈ మాటలను పదేపదే వల్లెవేశారు. రైతులు భూములు వదులుకుని సహకరించాలని ఎవరికి వారు బాకా ఊదారు. విమానాశ్రయం పేరుతో కడపల్లి పంచాయతీలో దాదాపు వెయ్యి కుటుంబాల భూములు లాక్కునేందుకు విఫలయుత్నం చేశారు. ఏకంగా కొంపలు కూల్చి, గ్రామాలను ఖాళీ చేయించటానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రాంత ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు.ఇప్పటికీ ఇక్కడి రైతుల తీరును తప్పు పడుతూనే ఉన్నా రు. విమానాలు రాకుండా చేశారనే నింద లు మోపుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇంకో పక్కన తమ భూముల్లో అరచేతి వెడల్పుతో భూమి పోతుందన్నా అరచి గగ్గోలు పెడుతున్నారు. రోడ్డుకు అడ్డు శాంతిపురం నుంచి వెంకటేపల్లి మీదుగా కేజీఎఫ్ వెళ్లే రోడ్డులో బోయనపల్లి క్రాసు నుంచి సిద్దామారు సమీపానికి లింక్ రోడ్డు ఉంది. మట్టి రోడ్డుగా ఉన్న దీన్ని తారు రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పంచాయతీ రాజ్శాఖ ద్వారా రూ.26 లక్షలు మంజూరు చేసింది. పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఒక పైపున ట్రెంచి కొట్టి వెడల్పు చేసే పనులు ప్రారంభించారు. కానీ మరో వైపున పనులు ప్రారంభించగానే అక్కడ భూములు ఉన్న ప్రముఖ తెలుగుదేశం నాయుకుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తవు భూముల్లో వేలు పెట్టకుండా అవతలే రోడ్డు పనులు చేసుకోవాలని హుకుం జారీ చేశారు. ఎలాగోలా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ భావించినా భూములు కోల్పోయిన వారిలో కొందరు ఎదురు తిరిగారు. తవు భూముల పరిధిలో రోడ్డు వెడల్పు కోసం తవ్విన ట్రెంచ్లను పూడ్చివేశారు. దీంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయూరుు. పరాయి రైతుల భూములను అభివృద్ధికి ఇవ్వాలని నీతులు చెబుతున్న బడా నాయకుడు ఇప్పుడు ఇంట్లో వాళ్లకు అవే నీతులు చెప్పాలని స్థానికు లు తలంటుతున్నారు. ఈ వ్యవహారంపై పీఆర్ ఏఈ హరినాథ్ వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని చెప్పారు. హంద్రీ-నీవాకూ అడ్డే శ్యాటిలైట్ సర్వే ఆధారంగా పొలాల్లో అడ్డగోలుగా కాలువ తవ్వకాలకు రాళ్లు నాటినా, తమకు కనీస సమాచారం లేకున్నా చాలా మంది రైతులు కిమ్మనకుండా ఉన్నారు. వీరిలో సర్వం కోల్పోయే వారు, ఉన్న భూముల మధ్య నుంచి కాలువ పోతే ఇరువైపులా అడుగుల వెడల్పుతో సాగు భూమి మిగిలే వారు ఉన్నారు. కానీ తమ ప్రాంతానికి నీళ్లు రావాలన్న ఆశతో కన్నీటిని గుండెల్లో దాచుకున్నారు. అయితే సిద్దామారు వద్ద టీడీపీ ప్రజాప్రతినిధి కుటుంబం మాత్రం తమ భూముల్లో కాలువకు ససేమిరా అంటోంది. సర్వే బృందం రాళ్లు నాటకుండా అడ్డుకుంటోంది. అధికారులు, నాయకులు రెండు రోజుల పాటు చేసిన దౌత్యాలన్నీ విఫలమయ్యాయి. సోమవారం తాను వచ్చి చూస్తానని సదరు ప్రజాప్రతినిధి చెప్పటంతో ఆయన కోసం ఎదరుచూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరూ భూములు ఇచ్చేయండని అంటున్న అధికారపార్టీ నాయకులు తమ భూముల్లో నామ మాత్రంగా పోయినా సహించలేక పోతున్నారు. ఈ తీరును సామాన్యులతో పాటు అధికార పార్టీ శ్రేణులు కూడా తప్పుబడుతున్నారు. నిత్యం సీఎం నామజపం చేస్తూ బతుకుతున్న నాయకులు ముందుగా తమ భూములు వదులుకుని మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నారు. -
కాంట్రాక్టర్ నుంచి దొంగగా...
* పోలీసుల కళ్లుగప్పి మూడుసార్లు పరారీ * పట్టుబడ్డ ఘరానా దొంగ శ్రీనివాస్ సాక్షి, సిటీబ్యూరో: సివిల్ కాంట్రాక్టులు చేసి ఓ వ్యక్తి ఆర్థికంగా నష్టపోయాడు... జల్సాలకు అలవాటుపడి హంతకుడిగా మారాడు....తర్వాత చైన్ స్నాచింగ్లు మొదలెట్టాడు... ఈ కేసుల్లో అరెస్టయి మూడుసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. చివరకు మాదాపూర్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో శనివారం సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్కుమార్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్ఆర్ కడప జిల్లా రామాపురం మండలం నల్లకుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కడపలో ఐటీఐ వరకు చదివాడు. 2006 వరకు సివిల్ కాంట్రాక్టర్ గా పని చేసి ఆర్థికంగా నష్టపోయాడు. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీహరితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. శ్రీహరి ప్రోద్భలంతో అర్షద్ ఆలీ, శేఖర్, చక్రధర్, శ్రీనివాస్ రెడ్డి, దొరరెడ్డి, ప్రసన్నలక్ష్మీతో కలిసి సాయిరెడ్డి అనే వ్యక్తిని హతమార్చారు. ఈ కేసులో అరెస్టయి జైలుకెళ్లి బెయిల్పై వచ్చిన శ్రీనివాస్కి పశ్చిమగోదావరి చేబ్రోలుకు చెందిన రఘురామ్ అనే చైన్స్నాచర్తో స్నేహం ఏర్పడింది. 2007లో వీరిద్దరూ కలిసి చైన్స్నాచింగ్లు చేశారు. నిడదవోలు పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపారు. 2009లో బయటికొచ్చిన వీరు కాకినాడలో మళ్లీ గొలుసు చోరీలు మొదలెట్టారు. మూడుసార్లు పరారీ... 2013లో తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే నిడదవోలు ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. మళ్లీ రఘురాంతో కలిసి కాకినాడలో చైన్ స్నాచింగ్లు చేశాడు. పోలీసులకు చిక్కి 2014లో రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లాడు. మళ్లీ రాజమండ్రి ఎస్కార్ట్ పోలీసుల నుంచి తప్పించుకొని విజయవాడ హనుమాన్ జంక్షన్ పోలీసులకు పట్టుబడ్డాడు. మళ్లీ రాజమండ్రి జైలుకు చేరిన ఇతనికి వైజాగ్కు చెందిన శివ(రాత్రి ఇళ్లల్లో చోరీలు చేస్తాడు)తో స్నేహం ఏర్పడింది. 2015లో శ్రీనివాస్ రాజమండ్రి పోలీసుల నుంచి తప్పించుకొని హైదరాబాద్కు మకాం మార్చాడు. 2015 సెప్టెంబర్లో జైలు నుంచి విడుదలైన శివ శంకర్తో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధితో పాటు ఆరు జిల్లాల్లో రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు చేశాడు. సైబరాబాద్లో 8 దొంగతనాలకు పాల్పడ్డాడు. అలాగే ఇతనిపై అనంతపురంలో ఒకటి, చిత్తూరులో రెండు, గుంటూరులో ఒకటి, నెల్లూరులో రెండు, ప్రకాశంలో రెండు కేసులున్నాయి. అయితే మాదాపూర్ సీసీఎస్ పోలీసులు అందిన పక్కా సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ హరిశ్చంద్ర రెడ్డి నేతృత్వంలోని బృందం కేపీహెచ్బీ సమీపంలోని నిజామ్పేటలో నిందితుడు శ్రీనివాస్ను శనివారం పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. మరో దొంగ శివ శంకర్ పరారీలో ఉన్నాడు. -
మద్యం దుకాణాన్ని అడ్డుకున్న మహిళలు
రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన మద్యం దుకాణం ఏర్పాటును మహిళలు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామానికి మద్యం దుకాణం మంజూరైంది. దీనిని దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు పక్కన గుడి, బడికి సమీపంలోనే దుకాణాన్ని ఏర్పాటు చేయటానికి పనులు ప్రారంభించాడు. ఇది తెలిసిన గ్రామస్తులు మహిళలు సుమారు 200 మంది దుకాణం నిర్మాణానికి తవ్విన పునాది గుంతలను పూడ్చివేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
బొమ్మ పిస్టల్తో బెదిరించి..
హైదరాబాద్ : డబ్బు డిమాండ్ చేస్తూ బొమ్మ పిస్టల్తో బెదిరించి బిల్డర్ను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడో దుండగుడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం....జూబ్లీహిల్స్ రోడ్నెం-10లో బంజారాహిల్స్ రోడ్నెం-12కు చెందిన బిల్డర్ మనీష్ అగర్వాల్ ఇల్లు నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుండగా ముసుగు ధరించి వచ్చిన ఓ దుండగుడు ఆయనకు పిస్టల్ ఎక్కుపెట్టి డబ్బు డిమాండ్ చేస్తూ తనతో రావాలని కిడ్నాప్కు యత్నించాడు. ఈ దృశ్యం చూసి అక్కడే పని చేస్తున్న కార్మికులంతా పెద్దగా అరుస్తూ పరుగు పరుగున అతని వద్దకు వచ్చారు. ఒక్కసారిగా 30 మంది వర్కర్లు పరిగెత్తుకు రావడంతో దుండగుడు మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీశాడు. డైమండ్ హౌస్ వద్ద ఆటో ఎక్కి పరారవుతున్న క్రమంలో పిస్టల్ కిందపడి రెండు ముక్కలైంది. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. బిల్డర్ వద్ద రూ.25 లక్షల వరకు డిమాండ్ చేసేందుకు నిందితుడు వచ్చాడని ఇవ్వకపోతే కిడ్నాప్ చేయడమే లక్ష్యంగా పథకం వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బొమ్మ పిస్టల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టిసీమలో మరో మోసం
-
ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నా..!
విద్యార్థుల సమక్షంలోనే ఒప్పుకున్న కాంట్రాక్టర్ జేఎన్టీయూ మెస్ నిర్వహణపై విద్యార్థుల ఆందోళన మెదక్(పుల్కల్): సుల్తాన్పూర్ జేఎన్టీయూలో మెస్ నిర్వహణకుగాను కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి తాను ఎమ్మెల్యేకు నెలకు రూ.50 వేల కమీషన్ ఇస్తున్నానంటూ విద్యార్థుల సమక్షంలోనే పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తమ వద్ద మెస్ బిల్లులు వసూలు చేస్తూ నాణ్యమైన భోజనం పెట్టకుండా ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తే తమ కేం సంబంధంమంటూ కాంట్రాక్టర్ను నిలదీసి, మంగళవారం రాత్రి మరోమారు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదు రోజులుగా జేఎన్టీయులో మెస్ నిర్వహణ సక్రమంగా లేదంటూ మంగళవారం నుంచి విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో క్యాంపస్ ప్రిన్సిపాల్ కాంట్రాక్టర్ను మార్చి కొత్త వారిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. దీంతో బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ వచ్చి అన్నం బాగానే ఉందని విద్యార్థులే ఉద్దేశ పూర్వకంగా గొడవలు చేస్తున్నారన్నారు. దీంతో విద్యార్థులు తాము మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తుంటే ఉద్దేశపూర్వకంగా గొడవలు చేస్తున్నామంటారా.. ఓ సారి మీరే అన్నం తిని చూడండంటూ కాంట్రాక్టర్ను నిలదీశారు. సెలవులో వెళ్లినా మొత్తం మెస్ చార్జీలు చెల్లించాల్సిందే.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల నుంచి నెలకు రూ.2,400 లను మెస్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ టెండర్ సమయంలో పేర్కొన్న మాదిరిగా మెనూ ఇవ్వడం లేదు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, సాయంత్ర భోజనం పెట్టాలి. సెలవుపై మూడు రోజులకు మించి వెళ్తే అట్టి డబ్బులను నెలవారీగా డబ్బులు చెల్లించే సమయంలో మినహాయించి ఇవ్వాలి. అయితే ఇక్కడి ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ కుమ్మక్కై సెలవుపై వెళ్లినా.. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయి మెస్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు పీడీని, కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే వారివద్ద సమాధానం లేదు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మంచి భోజనం పెట్టకుంటే కాంట్రాక్టు రద్దు చేయండి: ఎమ్మెల్యే మెస్ నిర్వహణ సక్రమంగా లేకపోతే కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేసి కాంట్రాక్టును రద్దుచేయాలని ఎమ్మెల్యే బాబూమోహన్ జేఎన్టీయూ ప్రిన్సిపాల్ను ఆదేశించారు. మెస్ కాంట్రాక్టర్ నెలకు రూ.50వేల మామూళ్లు ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణపై ఎమ్మెల్యేను వివరణ కోరగా తాను ఎవరివద్దా డబ్బులు తీసుకోలేదని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే నోటీసులు జారీ చేసి టెండర్ను రద్దుచేయాలని సూచించారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు విద్యుత్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెరిగాయి. కనీస మూలవేతనంపై 12 శాతం ప్రత్యేక అలవెన్స్ను గత మే 1 నుంచి చెల్లించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కార్మికులు గత ఏప్రిల్ 27 నుంచి మే 13 వరకు సమ్మె నిర్వహిం చారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ విద్యుత్ సంస్థలు.. కార్మిక జేఏసీతో గత నెల 13న ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో కార్మికులు సమ్మె వీడి విధుల్లోకి చేరారు. ఈ మేరకు ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందే కార్మికులకు చెల్లించే ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేశారు. కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న సొమ్మునే బీమా ప్రీమియం గా చెల్లించాలని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు ఉండదని హామీ ఇచ్చారు. ఇకపై కార్మికులను కాంట్రాక్టర్లు నేరుగా తొలగించకుండా నిబంధనలు తెచ్చారు. సంబంధిత అధికారి రాతపూర్వకంగా ఆ ప్రక్రియను జరపాల్సి ఉంటుంది. కార్మికుల పనుల ను కాంట్రాక్టర్లే పర్యవేక్షిస్తారు. కార్మికచట్టాల మేర కు కార్మికుల రికార్డులను సైతం కాంట్రాక్టర్లు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జీవో 3 ప్రకారం వేతనాలు చెల్లిస్తుండగా, జీవో 11 ఆధారంగా చెల్లించే విషయాన్ని పరిశీలిస్తామనే హామీ ప్రస్తావన ఉత్తర్వుల్లో లేదు. 12 శాతం ప్రత్యేక అలవెన్స్తో ఒనగూరే ప్రయోజనమేమీ లేదని కార్మిక నేతలు నాగరాజు, సాయిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
వెతలు పట్టేదెవరికి!
దుర్భరంగా ‘సఫాయి’ బతుకులు ఈఎస్ఐ డబ్బులు కట్...అయినా అందని వైద్యం అమలు కాని కనీస వేతన చట్టం సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘స్వచ్ఛ భారత్- స్వచ్ఛ తెలంగాణ’ ఇప్పుడివి సెలబ్రిటీ పదాలు. పీఏం మోదీ, సీఎం కేసీఆర్... స్వయంగా చీపురు పట్టి ఊడ్చేస్తున్నారు. కాలనీలు పరిశుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదంతో దూసుకుపోతున్నారు. కానీ... సఫాయి కర్మచారుల కష్టం తెలిసిందెందరికి! వారి బాధలు పట్టిందెవరికి! తెలంగాణ తొలి అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ‘సాక్షి’ వారి జీవితాల్లోకి తొంగి చూసింది. సూర్యుని కంటే ముందే నిద్ర లేచి... పట్టణాన్ని శుభ్రం చేసే వారి ఇళ్లల్లో ఇంకా వెలుగులు చిమ్మలేదు. అర్థాకలి, జబ్బులతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్న దయనీయ స్థితి వారిది... జిల్లా వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాల చట్టాలు వర్తించడం లేదు. ఇందుకు అధికారులు... కాంట్రాక్టకు తొత్తులుగా మారడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం రూ.7,300 ఇవ్వాలి. కానీ రూ.6,300 మాత్రమే చెల్లిస్తూ వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో 115 మంది కాంట్రాక్ట్, 44 మంది రెగ్యులర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో జిల్లా కలెక్టర్తో పాటు జేసీ, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ నివాసాలలో విధులు నిర్వర్తిస్తున్నవారూ ఉన్నారు. అందని సాయం... కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడమే కాదు... వారికి అందాల్సిన సదుపాయాలను సైతం దూరం చేస్తున్నారు. వీరి వేతనంలో నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ కోసం కొంత మొత్తం కట్ అయితే అవుతుంది గానీ... అవి వారి అక్కౌంట్లలో జమ అవ్వడం లేదు. ఫలితంగా... విధిగా నెలనెలా డబ్బు చెల్లిస్తున్నా ఈఎస్ఈ కార్డు పనిచేయడం లేదు. అనారోగ్యం పాలయినప్పుడు ఈ కార్డు ఉపయోగపడక... ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేక... ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక ఏడాదిలోనే వివిధ కారణాలతో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. కానీ ఏ ఒక్కరికీ పరిహారం కానీ, ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం గానీ అందలేదు. సీఎం ఇలాఖాలోనూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నగర పంచాయతీలో 130 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా... కార్మికుల పీఎఫ్ సొమ్ము ఇంత వరకు వారి ఖాతాలో జమ చేయలేదు. వేతనంలో రూ.7,100 మాత్రమే కార్మికులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నగర పంచాయతీలో 101 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్లో... మెదక్ మున్సిపాల్టీలో 115 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వీరికి కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు విఫలమయ్యారు. ఈఎస్ఐ, పీఎఫ్ కార్డులున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. జహీరాబాద్లో... జహీరాబాద్ మున్సిపాలిటీలో 99 మంది కాంట్రాక్ట్ కార్మికులతో పాటు 33 మంది రెగ్యులర్ కార్మికులున్నారు. కానీ వీరికి వేతనం రూ.7,300కు గానూ రూ.6,900 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ పేరిట వేతనంలో కోతలు పెట్టినా... ఖాతాల్లో జమ కావడం లేదు. సదాశివపేటలో... సదాశివపేట మున్సిపాలిటీలో 108 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. ఇక్కడా అదే పరిస్థితి. నిబంధనల ప్రకారం వేతనం కార్మికులకు అందడం లేదు. జోగిపేటలో... జోగిపేట నగర పంచాయతీలో 73 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. ఇక్కడా కనీస వేతనాల్లో కొంత మొత్తం కోత వేస్తున్నారు. మొత్తంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీలతో పాటు 2 నగర పంచాయతీలలో కనీస వేతనాల చట్టంతో పాటు కార్మికులకు సబ్బులు, నూనెలు, బ్లౌజ్లు ఏటా అందించాల్సి ఉన్నా ఎక్కడా ఆ ఊసే లేదు. వారి పాపం... వీరికి శాపం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా వైద్యం పొందే అర్హతను కార్మికులు కోల్పోతున్నారు. నెలనెలా కార్మికులు ఈఎస్ఐ చెల్లిస్తున్నా... అది సంబంధిత ఖాతాల్లోకి వెళ్లకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఉదాహరణకు సంగారెడ్డి మున్సిపాలిటీలోని 115 మంది కాంట్రాక్టు కార్మికులు ఒక్కోరు నెలకు రూ.125 చొప్పున ఈఎస్ఐ కింద చెల్లిస్తున్నారు. కానీ... ఈ ఒక్క ప్రాంతం నుంచే రెండేళ్లుగా ఆ శాఖకు సుమారు రూ.10 లక్షలు బకాయి ఉంది. ఇక మిగిలిన ప్రాంతాలు కూడా లెక్కిస్తే... కార్మికులను కాంట్రాక్టర్లు, అధికారులు ఎంతగా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. పోరాడి సాధించుకున్న హక్కును అధికారులు.. కార్మికులను అందకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈఎస్ఐ బాకాయిలను చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. వైద్యం అందడం లేదు - కార్మికుడు రాజు విధి నిర్వహణలో భాగంగా రాజీవ్ పార్క్లో పనిచేస్తున్న క్రమంలో గాజు సీసా ముక్క కాలుకు గుచ్చుకుంది. దీంతో ఇన్ఫెక్షన్ సోకి కాలంతా వాపు వచ్చింది. ఈఎస్ఐ కార్డు తీసుకుని ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ డాక్టర్లు కార్డు పనిచేయదన్నారు. చేసేది లేక వెనక్కి వచ్చా. ఈ విషయంపై కమిషనర్ను అడిగితే... తాను డబ్బులు చెల్లించినా ఎందుకు వైద్యం చేయడం లేదో తెలియడం లేదంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఈఎస్ఐ అధికారులకు తెలుపగా మున్సిపల్ నుంచి ఈఎస్ఐ ఖాతాలో డబ్బులు జమ చేయని కారణంగా మా కార్డులు పనిచేయడం లేదని తెలిపారు. ఏది ఏమైనా మాకైతే వైద్యం దక్కడం లేదు. రెండు నెలలుగా తిరుగుతున్న - కార్మికుడు శ్రీనివాస్ మున్సిపల్లో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నా. రెండు నెలల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చింది. వైద్యం కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. మీ కార్డులు చెల్లవంటూ అక్కడి వైద్యులు చెప్పారు. ఎందుకు చెల్లవని అడిగితే... ఈ కార్డులపై డబ్బులు చెల్లించలేదని సమాధానమిచ్చారు. స్వచ్ఛ తెలంగాణ భారం ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం భారం కార్మికులపైనే పడుతోంది. అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది. కానీ అధికారులు మాత్రం... మున్సిపల్ కార్మికులను ఒకే వార్డులోకి తీసుకెళ్లి పనిచేయిస్తున్నారు. ఫలితంగా ఈ కార్యక్రమంతో పనిభారం పెరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రామవరప్పాడు ఫ్లై ఓవర్ పూర్తిచేయండి
- ఈ ఏడాదిలోనే అన్ని పనులు అయిపోవాలి - ‘ఇన్నర్' కాంట్రాక్టర్లకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశం - సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తానని హామీ సాక్షి, విజయవాడ బ్యూరో : ఇన్నర్ రింగురోడ్డులో భాగంగా రామవరప్పాడు వైపు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలని సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఇంకా ఆలస్యమైతే సహించేది లేదని, చర్య తీసుకోవడానికి వెనుకాడనని హెచ్చరించారు. నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణ పనులను ఆయన పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి సమీక్షించారు. ఫ్లైవోవర్ నిర్మాణం చేపట్టిన ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిపించి పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. రింగురోడ్డులో నున్న వైపు ఉన్న భాగం పనులు 85 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. రామవరప్పాడు వైపు పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయని, ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. భూసేకరణ సమస్యతోపాటు ఫ్లైవోవర్ పనులు చేపట్టడానికి సరైన అప్రోచ్ రోడ్లు లేవని, అడ్డదిడ్డంగా భవనాలుండటం వల్ల ఇబ్బందులున్నాయని వారు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ నోట్ చేసుకున్న కమిషనర్ వాటి గురించి జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్తో చర్చించారు. అనంతరం నెలరోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు ఎప్పటికి పూర్తవుతాయి, ఏవిధంగా చేస్తారు, దానికి ప్రణాళిక ఏమిటనే దానిపై షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది జనవరికి పనులు పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ చెప్పడంతో అందుకు కమిషనర్ అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే పనులు పూర్తి చేయాలని, అందుకు ప్రణాళిక రూపొందించుకుని షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించారు. శనివారానికి షెడ్యూల్ ఇస్తానని కాంట్రాక్టర్ చెప్పారు. ఇకపై ప్రతి 15 రోజులకోసారి ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణ పనులను సమీక్షించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ యుటిలిటీస్ డెరైక్టర్ కాశీవిశ్వేశ్వరరావు, అధికారులు మోహనరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
తోడేస్తున్నారు..
- నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు - సాయంత్రం ఆరు తర్వాతా కొనసాగింపు - పట్టించుకోని టీఎస్ఎండీసీ అధికారులు - సర్కారు ఇసుక క్వారీలో ఇష్టారాజ్యం.. - పుష్కరాల పనుల్లో నాణ్యతాలోపం - స్నానఘట్టాల క్యూరింగ్కు నీటి కొరత - అధికారుల పర్యవేక్షణ కరువు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇసుక అక్రమ రవాణాకు చెక్పెట్టడమే కాకుండా, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన సర్కారు క్వారీలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నీల్వాయి ఇసుక రీచ్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ రీచ్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కోరోజు అర్ధరాత్రి వరకూ తవ్వకాలు సాగుతున్నాయి. అక్రమ తవ్వకాలను అరికట్టాలని నీల్వాయి గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేశారంటే ఇసుక ఏ స్థాయిలో తోడేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నీల్వాయి వాగులో 1.92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుకునేందుకు భూగర్భ గనుల శాఖ టీఎస్ఎండీసీ(ప్రభుత్వ రంగ సంస్థ)కి లీజుకు ఇచ్చింది. ఈ రీచ్ నుంచి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేశారు. టీఎస్ఎండీసీ ఈ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక విక్రయాలు చేపడుతోంది. ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.550 చొప్పున విక్రయిస్తోంది. నీల్వాయి వాగులో ఇసుకను తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా ఆ ఇసుకను స్టాక్ పాయింట్కు తరలించడం, స్టాక్పాయింట్ నుంచి ఇసుకను లారీల్లో నింపే పనుల కోసం టీఎస్ఎండీసీ టెండర్లు పిలిచింది. అతి తక్కువకు కోట్ చేసిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్కు ఈ కాంట్రాక్టు దక్కింది. ఇసుకను తవ్వి.. లారీల్లో లోడు చేసినందుకు సదరు కాంట్రాక్టరుకు ఒక్కో క్యూబిక్ మీటరుకు రూ.156 చొప్పున టీఎస్ఎండీసీ చెల్లిస్తోంది. ఒప్పందం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ ఒక్కో రోజు రాత్రి పది గంటల వరకు కూడా యథేచ్ఛగాఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని నీల్వాయి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకున్న ఇసుక క్వారీల్లో అక్రమ తవ్వకాలు జరగడం సర్వ సాధారణం. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వమే నిర్వహిస్తున్న క్వారీల్లోనే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. టీఎస్ఎండీసీ వైఖరిపై విమర్శలు.. స్వయంగా సర్కారు సంస్థ నిర్వహిస్తున్న క్వారీలో అక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్ఎండీసీ అధికారులకు ఉంటుంది. కానీ ఈ సంస్థ అధికారులు సదరు కాంట్రాక్టరును వెనుకేసుకు రావడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. ఇసుక కొనుగోలు చేసేందుకు వచ్చిన లారీలకు వెయిటింగ్ పడుతుందనే ఉద్దేశంతో ఒక్కో రోజు రాత్రి వరకు ఇసుక తవ్వకాలు జరపాల్సి వస్తోందని టీఎస్ఎండీసీ అధికారులు కాంట్రాక్టరుకు వెనుకేసుకొస్తున్నారు. వర్షం పడిన రోజు, ఆలస్యంగా తవ్వకాలు ప్రారంభమైన రోజు రాత్రి వరకు ఇసుక తవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు. టీఎస్ఎండీసీ బాధ్యత వహిస్తుంది.. ప్రదీప్, మైనింగ్ ఏడీ లీజు ఒప్పందం ప్రకారం రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరపరాదు. టీఎస్ఎండీసీకి లీజుకు ఇచ్చిన నీల్వాయి రీచ్లో ఇసుక తవ్వకాలకు ఆ సంస్థనే బాధ్యత వహిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడితే ఆ సంస్థపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. -
రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్ మృతి
శింగరాయకొండ: ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన దర్శి రత్నం(61) క్లాస్-1 కాంట్రాక్టర్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులను కలిసేందుకని కారులో నెల్లూరు వెళ్తుండగా శింగరాయకొండ సమీపంలోని కలికివాయి గ్రామం వద్దఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రగాయాలపాలుకాగా, రత్నం అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుడిని శింగరాయకొండ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
నకిలీ రసీదులు.. రెట్టింపు వసూళ్లు!
- ఆశీలు వసూలులో కాంట్రాక్టర్ నిర్వాకం - రాజాం నగర పంచాయతీలో దందా - నిత్య దోపిడీకి గురవుతున్న వ్యాపారులు, వాహనదారులు - కమిషనర్కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం - దాంతో కలెక్టర్ను ఆశ్రయించిన స్థానికులు రాజాం : కాంట్రాక్టర్ అత్యాశకు పోతున్నాడు. కమిషనర్ స్పందించడం లేదు. ఇంకేముంది.. వ్యాపారులు, వాహనాల యజమానులు నిత్యం దోపిడీకి గురవుతున్నారు. ఇదంతా రాజాం నగర పంచాయతీ పరిధిలో ఆశీలు వసూళ్లలో జరుగుతున్న తంతు. ఆశీలు కాంట్రాక్టర్ నకిలీ బిల్లులు ముద్రించి వాహనాలు, షాపుల నుంచి నిర్ణీత రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. నగర పంచాయతీ మార్కెట్లలో షాపులు, వాహనాలు, వ్యాపారుల నుంచి రోజువారీ ఆశీలు వసూలుకు ప్రతి ఏటా వేలం పాట నిర్వహిస్తుంటారు. నగర పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి రూ.6 లక్షల వరకు పాట వెళ్లేది. అయితే ఆదాయం పెంచుకోవాలన్న ఉద్దేశంతో అధికారులు పార్కింగ్, షాపుల ఫీజులను 100 నుంచి 150 శాతం వరకు పెంచి 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆశీలు వేలం నిర్వహించారు. పట్టణానికి చెందిన ముతికి వెంకట్రావు అనే వ్యక్తి రూ.15 లక్షలకు ఆశీలు కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్తక, వ్యాపార సముదాయాలు, వాహనదారుల నుంచి ఆశీలు వసూలు ప్రారంభించారు. అయితే నగర పంచాయతీ గెజిట్లో పేర్కొన్న రేట్ల ప్రకారమే వసూలు చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ రసీదులు ముద్రించారు. రసీదులపై నగర పంచాయతీ సీలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈయన ఇస్తున్న రసీదులపై దొంగ ముద్రలు కనిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక లారీకి గెజిట్ ప్రకారం రూ.83 ఆశీలు వసూలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు రసీదులు కూడా చూపించారు. అదేవిధంగా షాపులు, ఇతర తోపుడు బళ్లు, చిరువ్యాపారుల నుంచి నిర్ణీత ఫీజు కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ సంపాదనే తక్కువని.. అందులోనూ దోపిడీకి పాల్పడితే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తీరుకు నిరసనగా పారంకోటి సుధ, ఆశపు సూర్యం, పల్ల అప్పలనాయుడు, వంజరాపు రాము తదితరులు ఇటీవల నగర పంచాయతీ కమిషనర్ సింహాచలాన్ని కలిసి పిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని కమిషనర్ వారికి చెప్పారు. అయినా వసూళ్లు ఆగకపోవడంతో బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
రైల్వే టెండర్లలో అపశ్రుతి
సిండి కేట్ను విఫలం చేశాడని కాంట్రాక్టర్పై దాడి రైల్వేలో పనులకు నిర్వహించిన టెండర్లకు సంబంధించిన వ్యవహారం ఓ కాంట్రాక్టర్పై దాడికి దారితీసింది. సిండికెట్గా మారి తక్కువకు టెండర్ దక్కించుకోవాలని పలువురు కాంట్రాక్టర్లు వ్యూహం పన్నారు. అయితే ఓ కాంట్రాక్టర్ ఈ విషయం తెలియక విడిగా టెండ ర్ దాఖలు చేశారు. దీంతో మరికొందరు అదే బాట పట్టారు. తమ వ్యూహం దెబ్బతినడానికి కారణమయ్యాడని కొందరు ఆ కాంట్రాక్టర్పై దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కేసు నమోదు అయింది. గుంతకల్లు: గుంతకల్లు డివిజన్ పరిధిలోని రేణిగుంట రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం నం-01 నుంచి 05ల మధ్య క్లీనింగ్ పనులకు కోటి 91 లక్షల వ్యయ అంచనాలతో రెండేళ్ల కాలపరిమితితో టెండర్లు నిర్వహించారు. ఈ పనులకు హైదరాబాద్, గుంతకల్లు, కడప, రేణిగుంట, ఆదోని తదితర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు టెండరును దక్కించుకోవడానికి శతవిధాల యత్నించారు. ఈ క్రమంలోనే వీరంతా సిండికేట్గా ఏర్పడి గుడ్విల్ మాట్లాడుకున్నారు. అయితే హైదరాబాద్కు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ప్రతినిధి లక్ష్మీరెడి ఇదే పనికి షెడ్యూల్ దాఖలు చేశారు. సిండికేట్గా ఏర్పడిన కాంట్రాక్టర్లు ఈ విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఎవరికివారు తమ తమ షెడ్యూళ్లను దాఖలు చేశారు. దీంతో ఈ పనికి పోటీ ఏర్పడింది. సిండికేట్ యత్నం వీగడానికి కారణమైన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ప్రతినిధి లక్ష్మీరెడ్డిపై మధ్యాహ్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాంట్రాక్టర్ లక్ష్మీరెడ్డి ముఖంపై రక్తగాయాలయ్యాయి. వన్టౌన్ ఎస్ఐ బీవీ నగేష్బాబు తమ సిబ్బందితో రైల్వే డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడు లక్ష్మీరెడ్డిని ఆరా తీయగా దాడి చేసిందెవరో తెలియదని, తనకు ఈ ప్రాంతం కొత్త అని సమాధానమిచ్చినట్లు ఎస్ఐ చెప్పారు. కాంట్రాక్టర్పై దాడి హేయం అని, ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఓబీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి, కాంట్రాక్టర్ గాలి మల్లికార్జున ఈ సందర్భంగా ఎస్ఐను కోరారు. బాధిత కాంట్రాక్టర్ లక్ష్మీరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. -
ప్రాణాలతో చెలగాటం
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారారుు. సంబంధిత కాంట్రాక్టర్ నిబంధనలకు నీళ్లొదిలి పనులు సులువుగా జరిగేందుకు జిలెటిన్స్టిక్స్ వినియోగిస్తున్న విషయం శుక్రవారం బయటపడింది. డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం కోసం స్టిక్స్ పేల్చి మట్టిని పెకిలించి దానిని పొక్లెరుునర్తో తొలగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై పట్టపగలు పేలుడు పదార్థాలు ఉపయోగించడం వల్ల ప్రజలకు ప్రమాదం పొంచివుంది. అరుునప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. త్రుటితప్పిన పెను ప్రమాదం.. కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తా నుంచి చొప్పదండి రోడ్డులో భూగర్భ డ్రైనేజీ ని ర్మాణ పనుల కోసం క్రేన్ సహాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో భూగర్భంలో అమర్చిన జిలెటిన్స్టిక్స్ ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలారుు. అదే సమయంలో బైక్పై భార్య, ఇద్దరు చిన్నారులతో వెళ్తున్న తీగలగుట్టపల్లికి చెందిన శ్రీనివాస్ భారీ శబ్దంతో భూమి కంపించినట్టు కావడంతో ఉలిక్కిపడి బైక్ అదుపుతప్పి కిందపడిపోయూడు. వాహనంపై ఉన్న అతని భార్య, చిన్నారులు లాహ్యప్రియ(3), సిద్దార్థ (10నెలలు)లకు నేల ఒరుసుకుపోరుు కళ్లు, నుదురు భాగంలో తీవ్రగాయూలయ్యూరుు. శ్రీనివాస్ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న భార్య ఇద్దరు పిల్లలతో ఆసుపత్రికి చేరుకుంది. చికిత్స చేరుుంచుకున్న అనంతరం శ్రీనివాస్ భార్యాపిల్లలతో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వారిని స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ సహకారంతో నగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేరుుంచారు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓవైపు ప్రమాదం.. మరోవైపు పేలుళ్లు.. ప్రమాదం జరిగినపుడు స్పందించాల్సిన కాంట్రాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ప్రమాదం జరిగి చిన్నారులు కొట్టుమిట్టాడుతుంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది వెంటనే మళ్లీ జిలెటిన్స్టిక్స్ పేల్చి పనులు చేసుకున్నారని స్థానికులు తెలిపారు. తమ పిల్లలకు తీవ్రగాయాలయ్యాయని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ దంపతులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. అండర్గ్రౌండ్ డ్రైనేజీ తవ్వకాల్లో జిలెటిన్స్టిక్స్గానీ, ఇతర పేలుడు పదార్థాలుగానీ వాడరాదు. నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న క్వారీలు, భావుల తవ్వకాల్లో మాత్రమే మందుగుండు సామగ్రిని అధికారుల అనుమతితో వినియోగించాలని నిబంధనలున్నారుు. అండర్గ్రౌండ్ తవ్వకాల్లో మ్యాన్పవర్తోపాటు పనిముట్లు, యంత్రాలు మాత్రమే వినియోగించాలి. ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో ఆర్అండ్బీ, విద్యుత్శాఖ, కార్పొరేషన్ సహకారం అందించాలని, ప్రజలకు ఇబ్బందులు జరిగితే వెంటనే చర్యలు చేపట్టాలని ఈనెల 9న నిర్వహించిన అభివృద్ధి సమన్వయ కమిటీ సమీక్ష సమావేశంలో కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ నగరంలోని జనమ్మర్ధ ప్రదేశాల్లో, అదీ పట్టపగలు పేలుళ్లు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తవ్వకాలు జరుపుతున్న ప్రదేశంలో ప్రమాద హెచ్చరికలు తెలిపే బోర్డులు, రెడ్ రిబ్బన్ వంటివి కూడా ఏర్పాటు చేయకపోవడం వారి నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయూలని సూచిస్తే.. మీ పని మీరు చూసుకోండి అన్నారని కార్పొరేటర్ రాపర్తి విజయ తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు, కాంట్రాక్టర్పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
అమ్మ రానేలేదు.. పాపా ఏడుపాపలేదు...
ఏమైందీ కమ్యూనిస్టులకి? తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది ఈ కమ్యూనిస్టులేనా? స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చాయని చెప్పుకుం టున్న భరత భూమిలో అదీ తెలంగాణ పోరు గడ్డపై కాంట్రాక్టర్ దాష్టీకానికి పసి పిల్ల పాలకోసం ఏడ్చి ఏడ్చి కన్నుమూయడమా? ఇంతటి దారుణం హైటెక్ నగరంగా చెప్పుకునే హైదరాబాద్కు పట్టు మని వంద కిలోమీటర్ల దూరం కూడా లేని మెదక్ జిల్లాలో జరిగింది. ఆనాడు ముసునూరు దేశ్ము ఖ్ను తలపించిన ఇప్పటి నయా కాంట్రాక్టర్ ఘాతుకం పట్ల కమ్యూనిస్టులు స్పందించాల్సిన తీరు ఇదేనా? ‘అమ్మనూ రమ్మని, పాలిచ్చి పొమ్మని.. కాకితోనే కబురంపాను.. కబురు అందలేదో, కామందు పంపలేదో.. అమ్మ రానేలేదు.. పాపా ఏడుపాపలేదు.. ’ అంటూ ఓ యధార్ధ సంఘటనతో జనాన్ని చైతన్య పరిచి ఓ చేత్తో వడిశెల, మరో చేత్తో తుపాకీ పట్టించిన ఎర్రదళాలు నేడు ఏమయ్యాయి. మెదక్ జిల్లా హత్నూరు మండలం తుర్కలఖాన్ పూర్లో ఇటీవల ఆర్నెల్ల పసిగుడ్డు పాలకి ఏడ్చిఏడ్చి చచ్చిపోతే నాగరిక సమాజం, పౌర సమాజం నుంచి వచ్చిన స్పందన నామమాత్రం. అన్యాయాన్ని ఎది రించే గొంతుకలు సైతం ఎందుకు పూడుకుపోయాయి? నాడు నైజాం పాలనకు ఏమాత్రం తీసి పోని ఇంతటి ఘాతుకం స్వతంత్ర తెలంగాణలో జరిగితే ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయమని ప్రశ్నించిన పార్టీ నేతలు లేకపోవడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు. అన్యాయాన్ని ఎదిరించేందుకు అన్నలొస్తారని, ఉపరితల కమ్యూనిస్టులు ఊతమిస్తారని గర్భశోకంతో ఉన్న ఆ మాతృమూర్తి ఎదురుచూడకపోయినా నా లాంటి వాళ్లు చాలా మంది ఆతృత పడ్డారు. ముసునూరు దేశ్ముఖ్ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన కమ్యూనిస్టులు ఇంతటి అన్యాయాన్ని చూస్తూ ఊరకుండరని ఆశించా. అన్యాయాన్ని వేనోళ్ల తెగనాడుతున్న నేటి తరం నేతలు నిలదీ స్తారని ఎదురుచూశా. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఎవ్వరూ అడక్కుండానే స్వచ్ఛందంగా కేసులు నమోదు చేసి నివేదికలు పంపమని కోరే మానవ హక్కులు ఏమయ్యాయో, కూలీల బాగో గులు చూసే కార్మిక శాఖ ఎక్కడ కళ్లు మూసు కుందో, లేనిపోని వ్యవహారాలపై నానా హంగామా చేసే బాలల సంఘాలు ఎందుకు మౌనం దాల్చా యో అర్ధం కావడం లేదు. బిడ్డ చచ్చిపోయిన వెం టనే హడావిడిగా పూడ్చివేయించి ఆ కూలీల జం టను స్వస్థలమైన మహబూబ్నగర్కు పంపిన ఆ కాంట్రాక్టర్ క్రూరత్వాన్ని ఇంతవరకు పాలకులు కనీ సం ఖండించకపోవడం దురదృష్టకరం. ఆ కాం ట్రాక్టర్తో పని చేయిస్తున్న ఆ ఫార్మా కంపెనీ ఇంత వరకు ఆ ఘటనపై స్పందించకపోవడం వెనుక ఏ మతలబు దాగి ఉంది? జిల్లా రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటుంటే వాళ్లను నిలదీయాల్సిన పెద్దలు ఇంతవరకు నోరు మెదపకపోవడం, ఆ ఘటనపై నిజనిర్ధారణకు పూనుకోకపోవడం దేనికి సంకేతం. అందువల్ల ముఖ్యమంత్రిగారూ, కమ్యూనిస్టుల కొడవళ్లు మొద్దుబారిపోయాయి. ఆనాటి పోరాట పటిమ కలికానికి కూడా కానరాకుండా పోయింది. ముఖ స్తుతి పోరాటాలకు అలవాటు పడిన వీరిని వదిలేసి కనీసం మీరైనా స్పందించండి. ఆ కాంట్రాక్టర్ ధర్మ రాజు అధర్మంగా, అన్యాయంగా, అమానుషంగా ప్రవర్తించారని ప్రకటించండి. నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన ఆ కాం ట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించి మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించండి. ఎ.ప్రదీప్ హైదరాబాద్ -
కాటికి పంపిన కాంట్రాక్టర్!
-
కాంట్రాక్టు రద్దు చేస్తాం
►మూడు రోజుల్లో పనులు ప్రారంభించాలి ►జెడ్పీ భవన నిర్మాణంలో నిర్లక్ష్యం సహించేది లేదు ►జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ భవన నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. మూడు రోజుల్లో పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు.శుక్రవారం తన ఛాంబర్లో జెడ్పీ నిర్మాణ పనులు, పంచాయతీ రోడ్ల అభివృద్ధిపై సమీక్షించారు. రూ.10 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన జిల్లా పరిషత్ సముదాయ పనులు మూడేళ్లుగా ఎందుకు ముందుకు సాగడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు చేయకపోవడంపై కాంట్రాక్టర్పై తీవ్రంగా మండిపడ్డ సునీత.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తానని హెచ్చరించారు. జిల్లాకు మంజూరైన రూ.220 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లను త్వరితగతిన ఖరారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ జాన్మిల్టన్, జెడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఆర్ ఈఈలు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోటకు బీటలు
కాంట్రాక్టర్ నిర్వాకంతో నిలిచిపోయిన పనులు ధర పెంచాలని పదేపదే అదే నిర్వాకం టీడీపీ మనిషి కావడంతో చర్యలు శూన్యం గత టీడీపీ హయాంలోనూ అదే పరిస్థితి వైఎస్ హయాంలో నిధుల వరద.. పనులు చకచకా అనంతరం పరిస్థితి మళ్లీ మొదటికి.. కొండలా పెరుగుతున్న అంచనా వ్యయం శిథిలమవుతున్న నిర్మాణాలు, యంత్రాలు కొండల మధ్య సహజసిద్ధంగా ఊరుతున్న జలాన్ని ఒడిసిపట్టి బంధిస్తే.. బీడు భూములు జలకళ సంతరించుకుంటాయన్నది దశాబ్దాలుగా రైతులు కంటున్న కల. దాన్ని సాకారం చేయడానికి రూపుదిద్దుకున్నదే జంపరకోట జలాశయం ప్రతిపాదన. 1988లోనే శంకుస్థాపన రాయి పడిన ఈ ప్రాజెక్టుకు దివంగత వై.ఎస్. హయాంలో మంచిరోజులు వచ్చాయి. నిధులు పారాయి.. పనులు చకచకా సాగాయి. ఆయన తదనంతరం ప్రాజెక్టు కథ మళ్లీ మొదటికొచ్చింది. రేట్లు పెంచాలంటూ కాంట్రాక్టర్ మొండికేయడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి కాంగ్రెస్, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాల ఉదాసీనత నిర్మాణం పూర్తి కాకుండానే జంపరకోటను శిథిల స్థితికి తీసుకొచ్చింది. రైతులకు తీరని వ్యథ మిగిల్చింది. పాలకొండ:జంపరకోట రిజర్వాయర్ కోసం దశాబ్దాల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పాలకొండ మండల శివారు ప్రాంత రైతులకు ప్రభుత్వాల వైఖరి నిరాశ కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెలుగుదేశం నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవడం మానేశారు. నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోగా.. ఉన్న కట్టడాలతోపాటు యంత్రాలు శిథిలమవుతున్నాయి. 1988లో శంకుస్థాపన పాలకొండ మండల శివారు ప్రాంతంలో కొండల మధ్య సహజసిద్ధమైన ఊట జలం పుష్కలంగా లభిస్తోంది. వృథాగా పోతున్న ఆ ఊట జలానికి అడ్డుకట్ట వేసి కొండల మధ్య రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే సాగునీటికి నోచుకోక బీళ్లుగా మారిన భూములను సస్యశ్యామలం చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. జంపరకోట గ్రామం వద్ద అడ్డుకట్ట వేసి 2,700 ఎకరాలకు నీరందించాలన్న ప్రతిపాదన రూపుదిద్దుకుంది. అదే జంపరకోట జలాశయం. పరిపాలన అనుమతులు కూడా లభించడంతో ఈ ప్రాజెక్టుకు 1988లో శంకుస్థాపన రాయి వేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు రకరకాల అవాంతరాలతో ఆగుతూ.. సాగుతూ.. దశాబ్దాల తరబడి కొనసాగుతూ.. గత కొన్నేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. మొదట్లో దీనికి రూ. 2 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అయితే జాప్యం కారణంగా అంచనా వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతూ ప్రస్తుతం రూ.50 కోట్లకు చేరుకుంది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అనుచరుడే కాంట్రాక్టర్గా వ్యవహరించారు. ఆయన అర్ధంతరంగా పనులు నిలిపివేసినా.. అధికార పార్టీ అండదండలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. వైఎస్ చొరవతో చకచకా.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి హోదాలో 2006-07లో ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన రైతులు అవస్థలను కళ్లారా చూశారు..విన్నారు. జంపరకోట సమీపంలోని ఎం.సింగుపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన రైతుల గోడు విని యుద్ధప్రాతిపదికన జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటూ జలయజ్ఞంలో దీనికి చోటు కల్పించి రూ.15 కోట్లు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. భూములు కోల్పోయిన గిరిజనులు పరిహారం కోసం అడ్డుతగలడంతో మళ్లీ వైఎస్సే చొరవ తీసుకొని రూ.30 లక్షల పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయించి, అడ్డంకులు తొలగించారు. దాంతో ఇక నిర్మాణం పూర్తి అవుతుందని, తమ భూములు జలకళ సంతరించుకుంటాయని ఆశించిన రైతులకు ఊహించని శరాఘాతం తగిలింది. వైఎస్ హఠాన్మరణం, అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. అదే సమయంలో కాంట్రాక్టర్ మరోమారు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ పనులు నిలిపివేశారు. పట్టించుకోని టీడీపీ సర్కారు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రైతుల అవసరాన్ని గమనించి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జంపరకోట నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచాయి. అయినా చంద్రబాబు హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. బడ్జెట్లో చోటు కల్పించకపోగా ప్రాజెక్టుకు సంబంధించి కనీసం ప్రకటన కూడా చేయకపోవడం రైతులను అసంతృప్తికి గురి చేసింది. మరోవైపు జంపరకోట చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు ఏటా సాగునీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పంట చివరి దశలో నీరందక ఎండిపోతుండడంతో అప్పుల పాలవుతున్నారు. కొండల నుంచి వచ్చే నీరు కళ్ల ముందే వృథాగా పోతున్నా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. కాంట్రాక్టరే అడ్డంకి మాటిమాటికీ పనులు నిలిచిపోవడానికి కాంట్రాక్టరే కారణంగా నిలుస్తున్నా.. అతగాడు టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో చర్యలు తీసుకునేవారు లేరు. మూడు వైపులా కొండ ఉన్నందున మిగిలిన ఒకవపు తాత్కాలికంగా గట్టు వేసినా రైతుల కష్టాలు తీరుతాయన్న విషయాన్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. గట్టును పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో దానితోపాటు ఇప్పటివరకు జరిగిన పనులు, యంత్రాలు శిథిలమవుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణానికి ఇతరత్రా ఎలాంటి అడ్డంకులు లేవు. కాంట్రాక్టర్ను బాధ్యుడిని చేస్తే పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప జంపరకోట నిర్మాణం పూర్తి కాదు. -
బిగుస్తున్న ఉచ్చు !
సాక్షి ప్రతినిధి, అనంతపురం : పెనుకొండ ప్రమాదానికి కాంట్రాక్టర్ తప్పిదమే ప్రధాన కారణమని నివేదికలు తేల్చాయి. ప్రమాదంపై ఇప్పటి వరకు 9 విభాగాల నుంచి నివేదికలు సిద్ధమయ్యాయి. దాదాపు అన్ని నివేదిలకలూ కాంట్రాక్టర్ తప్పిదాన్ని సవివరంగా ఎత్తి చూపాయి. కాంట్రాక్టర్ను కాపాడేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ అంశంలో కోర్టులు కూడా నేరుగా ప్రశ్నించడంతో ఘటనకు బాధ్యులైన వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెనుకొండ-మడకశిర రోడ్డు మార్గంలో ఈనెల 7న ‘పల్లెవెలుగు’ బస్సు ప్రమాద ఘటనలో 16మంది చనిపోగా, మరో 60మంది గాయపడ్డారు. అందులో 35 మందికి తీవ్ర బిగుస్తున్న ఉచ్చు ! గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 13 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే...కాంట్రాక్టర్, ఆర్అండ్బీ, ఆర్టీసీ...వెరసి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో? ప్రజా జీవితాలపై ఎంత చిన్నచూపు ఉందో స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా రవాణ శాఖ మంత్రి శిద్ధారాఘరావు ‘డ్రైవర్ మద్యం తాగి బస్సు నడపడంతోనే ప్రమాదం జరిగింద’ని తీర్పు ఇవ్వడం, కాంట్రాక్టర్ తప్పిదంపై పల్లెత్తు మాట అనకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో ప్రజా, హక్కుల సంఘాలు జోక్యం చేసుకున్నాయి. చివరకు కోర్టులు కూడా సుమోటోగా కేసును స్వీకరించి బాధ్యులకు నోటీసులు జారీ చేశాయి. ఇప్పటి వరకూ 9 విచారణ నివేదికలు ప్రమాదం జరిగినప్పటి నుండి ఇప్పటి దాకా ప్రభుత్వానికి, మానహక్కుల కమిషన్కు 9 నివేదికలు అందాయి. ఇందులో తొలుత జిల్లా రవాణశాఖ, ఆర్టీసీ, అర్అండ్బీ ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. వీటితో పాటు పోలీసులు కూడా నివేదికను పంపారు. ఆపై న్యాయసేవాసదన్ కార్యదర్శి టీ.వీ సుబ్బారావు ఘటనపై విచారణ చేపట్టి మరో నివేదికను సిద్ధం చేశారు. వీటితో పాటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, మానవ హక్కుల వేదిక, పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి నేతలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ నివేదికను రూపొందించి రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు నివేదించారు. దాదాపు అన్ని నివేదికల్లోనూ ప్రమాదానికి ప్రథమ కారణం కాంట్రాక్టరే అని తేల్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విచారణ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న వారితో పాటు మావటూరు, నాగలూరు, బండ్లపల్లి, ఇతర గ్రామాల్లోని బాధిత కుటుంబాలను కలిసి ఆయూ సంఘాల వారు వివరాలు సేకరించారు. ప్రమాదంపై సాంకేతిక అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మంత్రులు తప్పు డ్రైవర్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తేల్చారు. అగ్రిమెంట్లో సూచించిన నిబంధనలను కాంట్రాక్టర్ పాటించలేదని కూడా నివేదిలో పేర్కొన్నారు. ప్రహారీగోడ, రేడియం స్టిక్కర్లు, అప్రోచ్ రోడ్డు, ఉన్న రోడ్డుకు రక్షణగా బండరాళ్లు, బారికేడ్లు ఉంచడంతో పాటు చాలా తప్పిదాలు కాంట్రాక్టర్ చేశాడని పేర్కొన్నారు. పనులు చేస్తోంది జిల్లాకు చెందిన ఓ మంత్రి బంధువులు కావడంతో ఆర్అండ్బీ అధికారులు కూడా నిస్తేజంగా వ్యవహరించారన్నారు. అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని ఈ తప్పులో వీరి బాధ్యత కూడా తీవ్రమైందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ను తప్పించేందుకే అధికారులపై చర్యలు ఘటనకు బాధ్యులను చేస్తూ ఆర్అండ్బీ ఏఈఈ, డీఈతో పాటు ఆర్టీసీ డీఎంపై సస్పెన్షన్ వేటు వేశారు. వాస్తవానికి ఈ ముగ్గురు నెలకిందట బాధ్యతలు తీసుకున్న అధికారులే. ఒకవేళ ఘటనకు బాధ్యులుగా తేల్చాల్సి వస్తే... ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులు పనులు చేస్తున్న ప్రదేశాన్ని ఎందుకు సందర్శించలేదు? సందర్శిస్తే ఇప్పుడు కన్పిస్తున్న తప్పులు అప్పుడు ఎందుకు కన్పించలేదు? ఒకవేళ అధికారులను బాధ్యులను చేయాల్సి వస్తే కొత్తగా వచ్చిన వారిపై కాకుండా జిల్లా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యులైన వారిని వదిలి, కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆ ముగ్గురిని బలిచేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారుల తప్పే ప్రధానం కాబట్టి, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులైన వారు ఎంతపెద్దవారైనా వదలకుండా చర్యలు తీసుకోవాలని నివేదికల్లో సూచించారు. మంత్రి రక్షిస్తారనే ఆశతో.. ఈ ఘటనలో కాంట్రాక్టర్తో పాటు ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈలపై వేటు పడే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో వీరంతా ఈ ఘటనకు కింది స్థాయి అధికారులను బాధ్యులను చేసి తాము బయటపడేలా ప్రణాళిక రచించారు. దాన్ని జిల్లాలో ఓ మంత్రి కనుసన్నల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. తమను ఎలాగైనా మంత్రి రక్షిస్తారనే ఆశతో ధైర్యంగా ఉన్నారు. పరిహారంపై కూడా విమర్శలు ప్రమాదంలో 16 మంది చనిపోతే అందులో 13 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులు. భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించి, కుటుంబానికి అండగా నిలేచేవారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని కూడా ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేశారు. అలాగే ప్రజా సంఘాల నేతలు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. -
‘చెత్త’ పనికి రూ. లక్ష లంచం
రూ.50 వే లకు కుదిరిన బేరం డబ్బు తీసుకుంటూ పట్టుబడ్డ మార్కెటింగ్శాఖ అధికారులు చాదర్ఘాట్: కూరగాయల మార్కెట్ నుంచి చెత్త తరలింపు పని అనుమతి (వర్క్ అలాట్మెంట్) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు మార్కెటింగ్శాఖ అధికారులు ఏసీబీ(అవినీతి నిరోధకశాఖ)కి పట్టుబడ్డారు. బుధవారం ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ (ఎస్జీఎస్) కల్పన గుడిమల్కాపూర్ మార్కెట్లోని చెత్త తరలింపునకు సంబంధిత కాంట్రాక్టర్ రాంబాబు నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఈనెల 22న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఎస్జీఎస్ను పట్టుకొనేందుకు పథకం వేశారు. కాంట్రాక్టర్ రాంబాబు ఇచ్చిన లంచం డబ్బును సీనియర్ అసిస్టెంట్ మహేశ్ ద్వారా ఎస్జీఎస్ కల్పన తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం పట్టుకుంది. కల్పన, మహేష్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లంచం డబ్బు రూ. 50 వేలను స్వాధీనం చేసుకుంది. విచారణ అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఇదే సమయంలో దోమలగూడలో ఉన్న కల్పన ఇంటి వద్ద కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడుల్లో సీఐలు మంజుల, సుదర్శన్రెడ్డి, రాజేశ్, ఎస్ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు. -
ఇంకా డ్రెడ్జింగ్ ఎందుకో?
సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవి నాటికి హుస్సేన్సాగర్ను ప్రక్షాళన చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనకు... ప్రస్తుతం నెక్లెస్ రోడ్డులోని నాలా ముఖద్వారాల వద్ద పూడికతీత పనులకు ఏమాత్రం పొంతన కుదరట్లేదు. సాగర్ను సుందర జలాశయంగా మార్చేందుకు పకడ్బందీ బృహత్తర ప్రణాళికకు ఒక వైపు ప్రభుత్వం తెరతీస్తుంటే... మరో వైపు హెచ్ఎండీఏ అరకొరగా పూడికతీత పనులు నిర్వహిస్తుండటంలో అర్థం లేదన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్న సాకుతో హెచ్ఎండీఏ అధికారులు సాగర్లో డ్రెడ్జింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పూడికతీత పనులకు సుమారు రూ.19 కోట్లు కాంట్రాక్టర్కు చెల్లించిన అధికారులు మరో రూ.10కోట్ల వరకు ప్రజాధనం వృథాకు సన్నాహాలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాగర్ను కాలుష్య కాసారంలా మారుస్తున్న పికెట్ నాలా, బంజారా నాలా, బల్కాపూర్ నాలా, కూకట్పల్లి నాలాల ద్వారా నిత్యం 380-420ఎంఎల్డీల మురుగు నీరు కలుస్తోంది. వీటి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు రెండేళ్ల క్రితం రూ.43 కోట్ల అంచనాలతో హెచ్ఎండీఏ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించింది. కూకట్పల్లి తప్ప మిగతా 3 నాలాల వద్ద సుమారు 7 లక్షల క్యూ.మీ. పూడిక తొలగించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు 1.90 వేల క్యూ.మీ. మాత్రమే తొలగించగలిగారు. సాగర్ నుంచి తీసిన వ్యర్థాలను సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్ యార్డుకు పైపుల ద్వారా తరలించి... అక్కడి పాండ్స్లో ఎండబెట్టాక లారీల ద్వారా గాజులరామారంలోని క్యారీపిట్స్లోకి తరలిస్తున్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పూడిక తీత పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. తాజాగా సాగర్ను ఖాళీ చేసి పూడికను తొలగించాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో డ్రెడ్జింగ్ను నిలిపేయాల్సి ఉంది. దీనితో తమకు సంబంధం లేదన్నట్టుగా హెచ్ఎండీఏ పనులు కొనసాగిస్తోంది. ఇప్పటికే నిర్ణీత గడువు ముగిసినందున ...కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని రుణదాత జైకాకు తెలిపి...పూడిక తీతను నిలిపివేయకపోతే రూ.10 కోట్ల వరకూవృథా ఖాయమని కొందరు అధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం సాగర్నే ప్రక్షాళన చేస్తున్నప్పుడు... ఇక నాలాల వద్ద పూడికతీత పేరుతో నిధులు వృథా చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారుల స్వప్రయోజనాలకే డ్రెడ్జింగ్ పనులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆ కాంట్రాక్టర్పై అంత ప్రేమ ఎందుకో?
* మురికినీటి తరలింపులో నిబంధనలు ఉల్లంఘన * ఏడాదికి రూ.52లక్షలు అప్పనంగా చెల్లింపు * దోచిపెడుతున్న ట్రిపుల్ఐటీ అధికారులు నూజివీడు : నూజివీడు ట్రిపుల్ఐటీలో శుద్ధిచేసిన మురికినీటిని బయటకు తరలించేందుకు ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్కు సంబంధిత అధికారులు అప్పనంగా లక్షలాది రూపాయలను దోచిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ట్రిపుల్ఐటీలో విద్యార్థులు, సిబ్బంది వారి అవసరాలకు ఉపయోగించగా వచ్చే మురుగునీటిని ట్రిపుల్ఐటీలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ(సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధిచేసినప్పటికీ... ఇంకా కొన్ని మలినాలు మిగిలి ఉన్న నీటిని కాంట్రాక్టు పొందిన వ్యక్తి జనావాసాలు లేని బయట దూరప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించాల్సి ఉంది. అయితే ఈ నీటిని దూర ప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించకుండానే కాంట్రాక్టర్కు అప్పనంగా నెలకు రూ. 4.40 లక్షలు ట్రిపుల్ఐటీ అధికారులు అందజేస్తున్నారని తెలుస్తోంది. ట్రిపుల్ఐటీలో విద్యనభ్యసిస్తున్న 7వేల మంది విద్యార్థుల అవసరాలకు, మెస్లలో వాడిన నీటిని శుద్ధిచేసి వెలుపలికి పంపించేందుకు ఆవరణలోనే ఎస్టీపీని నిర్మించారు. అయితే దీనినుంచి నీటిని వెలుపలికి పంపేందుకు ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోజుకు వచ్చే దాదాపు 12లక్షల లీటర్ల నీటిని బయటకు తరలించేందుకు ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ పనిని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ రోజుకారోజు ట్యాంకర్లలో ఈ నీటిని తీసుకెళ్లి ఊరివెలుపల తోటలలోనో, వాగులలోనే పారబోసి రావాలి. దీనికి గానూ వెయ్యి లీటర్లకు రూ.12.20పైసల చొప్పున చెల్లించేటట్లు టెండర్ల ప్రక్రియ ద్వారా మూడేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టర్ నీటిని ట్యాంకర్లలో తరలించకుండా మోటర్లతో నీళ్ల ట్యూబ్ల ద్వారా ట్రిపుల్ఐటీని ఆనుకుని ఉన్న రాజీవ్స్వగృహకు కేటాయించిన స్థలంలో వదిలేస్తున్నారు. అంతేగాకుండా ప్రతిరోజూ రాత్రిపూట ట్రిపుల్ఐటీని ఆనుకుని ఉన్న గొడుగువారిగూడెం గ్రామం పైకి ఈ నీటిని వదిలేస్తున్నాడు. ఈ విషయం తెలిసినా ట్రిపుల్ ఐటీ అధికారులు కాంట్రాక్టర్కు నెలకు రూ4.40లక్షలు చెల్లించేస్తున్నారు. ట్యూబ్లతో బయటకు తరలించేటప్పుడు కాంట్రాక్టర్కు ఏ విధంగా బిల్లు చెల్లిస్తున్నారో అంతుబట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు మురుగునీరు గ్రామంలోకి వస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు ఉధృతమై తాము గ్రామంలో నివశించలేకపోతున్నామని గొడుగువారిగూడెం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీ మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా కాలం గుడుపుతున్న అధికారుల వైఖరికి నిరసనగా ఈనెల మొదటి వారంలో నిర్వహించిన జన్మభూమి వార్డు సభను సైతం గ్రామస్తులు అడ్డుకుని అధికారులను నిలదీశారు. కాంట్రాక్టు ముగిసినా రెండేళ్లుగా ఈ కాంట్రాక్టరే... ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసి రెండేళ్లవుతున్నా మరళా టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్కే గడువు పొడిగిస్తూ వస్తున్నారు. పోటీవస్తే ఎవరైనా ఇంతకన్నా తక్కువకు టెండర్ వేస్తే ట్రిపుల్ఐటీకి డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పొడిగించారనేది బహిరంగ రహస్యమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు పిలిచాం నేను కొత్తగా వచ్చా. గతంలో ఎందుకు పొడిగించారో తెలియదు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించాం. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్ వస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. మురికినీరు వదిలేస్తున్నారని గొడుగువారిగూడెం గ్రామస్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. - కే హనుమంతరావు, ఇన్చార్జి డెరైక్టర్ -
ఎంజీఎం ఆస్పత్రి సమస్యలతో..
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్లకు అధికారులే తలొగ్గాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి రోజుకు వేలాది మంది రోగులు వచ్చే పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాలది కీలక పాత్ర. ప్రధాన గేట్లు, వార్డుల వద్ద రోగులతోపాటు వారి వెంట వచ్చే బంధువులను నియంత్రించాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిపై ఉంది. అదేవిధంగా.. ఎప్పటికప్పుడు పరిశుభ్రత చర్యలు చేపట్టడంలో శానిటేషన్ విభాగానిదీ పెద్ద పాత్రే. అలాంటి ప్రధానమైన రెండు విభాగాలు సమస్యలకు నిలయంగా మారారు. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తగా.. ఏజెన్సీ కాంట్రాక్టర్లదే హవా నడుస్తోంది. పలువురు అధికారుల నిర్లక్ష్యం.. మామూళ్ల జబ్బు ఏజెన్సీలకు వరాలు కురిపిస్తున్నారుు. రోగులకు అత్యవసర సమయూల్లో వైద్య పరికరాలు అమర్చే ‘ఇంప్లాంట్స్’ టెండర్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. టెండర్ల ప్రక్రియ వివాదంగా మారడంపై ఆస్పత్రి వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. అవినీతి అధికారులు కొందరు ధనదాహంతో తప్పులు చేసి.. కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేలా వారికి పరోక్షంగా మేలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. కొందరు ఉద్యోగులు ఏకంగా బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎంజీఎం ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో సాగుతున్న పలు పనులు నాసిరకంగా మారాయి. కాంట్రాక్టర్కు ఆరేళ్లుగా సెక్యూరిటీ.. ఎంజీఎంలోని సెక్యూరిటీ విభాగం జైహింద్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఆస్పత్రిలో సుమారు పదేళ్లుగా సదరు కాంట్రాక్టర్ తిష్టవేశాడు. ఆరేళ్లుగా టెండర్ లేకుండానే కోర్టు వివాదాలతో నెట్టుకుంటూ వస్తున్నాడు. టెండర్ల విషయంలో అధికారుల చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ.. కోర్టుకు వెళ్తూ స్టే తెచ్చుకోవడం సెక్యూరిటీ కాంట్రాక్టర్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా ఆస్పత్రిలోని అధికారులను శాసిస్తూ యథేచ్ఛగా టెండర్ను కొనసాగిస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. ఎంజీఎం సెక్యూరిటీ విభాగ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వ అధికారులకు అప్పగించాలి. కానీ.. ఏడాదిగా సెక్యూరిటీ సూపర్వైజర్ను నియమించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. వేతనాలివ్వకుండా.. ఎంజీఎంలో మూడు విడతల్లో సుమారు 105 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించాలి. వీరందరికి ఈఎస్ఐ, ఈపీఎఫ్తో కలుపుకుని ఒక్కొక్కరికి రూ.7 వేల వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కాంట్రాక్టర్ మాత్రం ఒక్కొక్కరికి రూ.4 వేలకు మించకుండా వేతనాలిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో బడ్జెట్ రావడం లేదంటూ ఒక్కో సెక్యూరిటీ గార్డుకు సుమారుగా 8 నెలల వేతనం చెల్లించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది.. అటెండెంట్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రోగుల వెంట వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. ఎంజీఎం రికార్డుల్లో 105 మంది సెక్యూరిటీ సిబ్బందిని చూపిస్తున్నా... వాస్తవంగా 60 మంది సిబ్బందితో పనిచేయిస్తున్నట్లు సమాచారం. మిగిలిన వారికి సంబంధించిన వేతనాన్ని దర్జాగా దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లేబర్ అధికారులకు ఫిర్యాదు అందినా.. సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకునేందుకు వారు జంకుతున్నట్లు తెలిసింది. శానిటేషన్లో తప్పని తిప్పలు బోధన ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్లను ఒకే కాంట్రాక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచడం పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సెక్యూరిటీ, శానిటేషన్ను ఒకే కాంట్రాక్టర్కు ఎలా అప్పగిస్తారని సెక్యూరిటీ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. శానిటేషన్ టెండర్ కొలిక్కిరాకపోవడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ పర్యవేక్షణ లో విభాగం కొనసాగుతోంది. అరుుతే.. మెడికల్ విభాగంలో శానిటేషన్ కార్మికుల వేతనాలకు సంబంధించి చిక్కులు వచ్చారుు. పెరిగిన జీతాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి బడ్జెట్కు రాకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. దీంతో పరిపాలనాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల ఆందోళనతో చివరకు వారు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, పెంచిన వేతనాలు ఇస్తామనే హామీ ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ‘ఇంప్లాంట్స్’ కొలిక్కి వచ్చేనా? ఎంజీఎం ఆస్పత్రిలో ఇంప్లాంట్స్ టెండర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదంగా మారాయి. 4 నెలల క్రితం ఎంజీఎం అధికారులు ఇంప్లాంట్స్కు టెండర్లు పిలిచారు. ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. ఇందులో కొన్నేళ్లుగా ఆస్పత్రిలో కొనసాగుతున్న కాంట్రాక్టర్తోపాటు కొత్తగా మరో కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేశారు. పాత కాంట్రాక్టర్ కంటే టెండర్లలో పాల్గొన్న కొత్త కాంట్రాక్టర్ తక్కువ రేటుకు కోట్ చేశారు. నిబంధనల ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ టెండర్లు దాఖలైనప్పుడే వీటిని తెరుస్తామని అధికారులు వాయిదా వేశారు. చివరకు జాయింట్ కలెక్టర్ అనుమతితో వీటిని తెరిచారు. ఎక్కువ రేట్ కోడింగ్ చేసిన కాంట్రాక్టర్కు 316 ఎల్వీఎం సర్టిఫికెట్ ఉందని పేర్కొంటూ.. కొన్నేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్కు టెండర్ కట్టబెట్టేలా పలువురు అధికారులు పావులు కదిపారు. చివరకు ఆ కాంట్రాక్టర్కు 316 ఎల్వీఎం సర్టిఫికెట్ లేదని తేలింది. ఈ టెండర్ల ప్రక్రియ వివాదంగా మారి కలకలం రేగడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ మొత్తానికే వాటిని రద్దు చేశారు. త్వరలోనే పారదర్శకంగా ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ.. 50 రోజులుగా పాత కాంట్రాక్టరుతోనే ఇంప్లాంట్స్ పరికరాలను ఆస్పత్రికి సరఫరా చేయించుకుంటున్నారు. -
ధరల సర్దుబాటుకు అఖిలపక్షం ఓకే
ఎస్ఎల్బీసీపై ఏకాభిప్రాయం ప్రస్తుత కాంట్రాక్టర్ చేతనే పనులు చేయించేందుకు అంగీకారం రూ. 750 కోట్ల చెల్లింపుపై సభానాయకులతో నేడు మరోభేటీ సాక్షి, హైదరాబాద్: sశ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగ పనుల తవ్వకాన్ని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్తోనే కొనసాగించేందుకు అన్ని పార్టీలు తమ సమ్మతి తెలిపాయి. కాంట్రాక్టర్ ఆర్థికపరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ ధరలు సర్దుబాటు చేసేందుకు అంగీకరించాయి. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేసేలా అన్నిచర్యలు తీసుకోవాలని సూచించాయి. అయితే ధరలు ఎలా ఉండాలన్న దానిపై మాత్రం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై శుక్రవారం మరోమారు అన్నిపార్టీల సభానాయకులతో, కాంట్రాక్టర్తో కలిపి సమవేశం నిర్వహించి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం సంకల్పించింది. శుక్రవారం నాటి నిర్ణయానికి అనుగుణంగా ఎస్ఎల్బీసీ పనులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్నగర్లోని మన్నెవారిపల్లె వరకు 43.89కిలోమీటర్ల తవ్వాల్సిన సొరంగ మార్గంలో ఇప్పటిరవకు 24 కిలోమీటర్లు పూర్తికాగా మరో 19.8కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. అయితే ఆర్థికభారం కారణంగా సొరంగం పనులను ముందుకు తీసుకెళ్లడం తనకు కష్టంగా మారిందని, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా తనకు రూ.750 కోట్లవరకు ఎస్కలేషన్ చెల్లింపులతో పాటు, మరో రూ.150కోట్లు అడ్వాన్స్గా ఇవ్వాలని కోరుతున్న విషయం విదితమే. బుధవారం సభలో చేసిన ప్రకటన మేరకు పనుల కొనసాగింపు, కాంట్రాక్టర్కు ఆర్థికఇబ్బందులపై గురువారం అసెంబ్లీ కమిటీహాల్లో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. దీనికి ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, మంత్రులు టి.హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, జిల్లా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, పద్మావతి, ప్రభాకర్రెడ్డి, గొంగిడి సునీత, శేఖర్రెడ్డి, కిశోర్,బాలరాజులతో పాటు బీజేపీ తరఫున ఎన్వీవీఎస్ ప్రభాకర్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు ప్రాజెక్టు పనులు, కాంట్రాక్టర్ కోరుతున్న ధరల సర్దుబాటు అంశాలపై చర్చించారు. కాంట్రాక్టర్ను మారిస్తే రూ.5,800 కోట్ల భారం దీనిపై మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన పనులను గణాంకాలతో వివరించారు. మరో 20 కిలోమీటర్ల సొరంగం తవ్వకానికి రెండేళ్లకు మించి పట్టేలా ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించినా నిర్ణీత గడువులో పని పూర్తికావడం అసాధ్యమన్నారు. కొత్త కాంటారక్టర్కు పనులు అప్పగించిన పక్షంలో ప్రాజెక్టుపై మరో రూ.5,800ల కోట్ల భారం పడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలో తెలపాలని పార్టీల అభిప్రాయాలను కోరారు. దీనిపై అన్నిపార్టీలు దాదాపు ఒకే విధంగా స్పందించాయి. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్తోనే పనులు కొనసాగించాలని సూచించాయి. అదే సమయంలో 2005లో పనులు చేపట్టే సమయంలో సిమెంట్, స్టీలు, ఇంధన ధరలు ప్రస్తుత ధరలకు చాలా వ్యత్యాసం ఉందని, ఈ దృష్ట్యా కాంట్రాక్టర్ కోరుతున్న విధంగా ధరల సర్దుబాటు సబబే అన్న భావన వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసు మేరకు 5 శాతం పైన పెరిగిన ధరలను సవరించేందుకు అంగీకారం తెలిపాయి. అయితే కాంట్రాక్టర్ కోరుతున్న ధరల సర్దుబాటు విలువ సుమారు రూ.750 కోట్లవరకు ఉన్నందున దీనిపై ఎలాంటి నిర్ణయం చేయాలన్న దానిపై శుక్రవారం మరోమారు కాంట్రాక్టర్ సమక్షంలో పార్టీ సభా నాయకులతో చర్చిద్దామని నిర్ణయించారు. వీటితో పాటే కొందరు ఎమ్మెల్యేలు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం ఎత్తిపోతల పనులు సత్వరమే పూర్తిచేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని సమావేశం అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మీడియాకు తెలిపారు. -
టార్పాలిన్.. సొమ్ము తినేసెన్
* రూ.42 లక్షలకు రెక్కలు * అస్మదీయుల కోసం అధికారుల ఆరాటం ఏలూరు సిటీ : ఒక వస్తువు కొనాలంటే ఎవరైనా ఏం చేస్తారు. ఆ వస్తువు ధర ఏ దుకాణంలో ఎంత ఉందో వాకబు చేస్తారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో చూస్తారు. అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అత్తసొమ్ము అల్లుడి దానం చేసిన చందంగా ఏకంగా రూ.42 లక్షలను తమ వారి జేబుల్లో వేసేందుకు సిద్ధమైపోయారు. ఇదీ అవినీతి అసలు కథ ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆయా కేంద్రాలకు ప్లాస్టిక్ టార్పాలిన్స్ సమకూర్చాలని నిర్ణయించింది. ఇక్కడే అధికారులు తమ చేతివాటాన్ని పక్కాగా ప్రదర్శించారు. మార్కెట్లో నాణ్యమైన ప్లాస్టిక్ టార్పాలిన్ రూ.4,200కు లభిస్తోంది. అధికారులు మాత్రం ఏకంగా దానిధర రూ.5,500కు కోట్ చేసిన టెండరుదారుడికి కాంట్రాక్టు కట్టబెట్టారు. గతంలోనూ ఇంతకంటే తక్కువ ధరకే ఓ కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయగా, కుదరదని చెప్పి దాన్ని రద్దు చేశారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకే తొలి టెండర్ను రద్దుచేసి రెండోసారి టెండర్లు పిలిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3,264 ప్లాస్టిక్ టార్పాలిన్స్ అవసరం ఉంది. ఇది ఒక్కొక్కటి 129 సైజులో ఉండాలని నిర్దేశించారు. నాణ్యతతో కూడిన ఈ సైజు టార్పాలిన్ ధర మార్కెట్లో రూ.4,200 ఉంది. వీటి కొనుగోలు కోసం సివిల్ సప్లైస్, మార్కెటింగ్, తూనికలు-కొలతలు, డీఆర్డీఏ అధికారుల ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. అక్టోబర్ 30న తొలిసారి టెండర్లు పిలవగా 10 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు దాఖలు చేశారు. ఒంగోలుకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్కు రూ.4,908 ధర కోట్ చేస్తూ టెండర్ సమర్పించారు. అధికారులు ఆ ధర అధికమంటూ దానిని రద్దు చేశారు. ఈనెల 11న మరోసారి టెండర్లు పిలవగా, ఐదుగురు దరఖాస్తులు సమర్పించారు. వారిలో యూనివర్సల్ ట్రేడర్స్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్ను రూ.4,600కు, అమలాపురానికి చెందిన రుద్ర ఏజెన్సీస్ రూ.5,500కు సరఫరా చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నాయి. అయితే, అధికారులు రూ.5,500 ధరను కోట్ చేసిన రుద్ర ఏజెన్సీస్ టెండర్ను ఆమోదించారు. మార్కెట్లో రూ.4200లకే దొరుకుతున్న టార్పాలిన్ను కాంట్రాక్టర్ నుంచి రూ.5,500కు కొనేందుకు నిర్ణయించడం ద్వారా ఒక్కో టార్పాలిన్పై అదనంగా రూ.1,300 చొప్పున రూ.42 లక్షలను గోల్మాల్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మార్కెటింగ్ ఏడీ కిషోర్ను వివరణ కోరగా, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ఆధారంగా వాటర్ ప్రూఫ్ టార్పాలిన్ కావాలని సివిల్ సప్లైస్ అధికారులు చెప్పారన్నారు. జిల్లా అధికారుల సమక్షంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించామని, ఇందులో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. -
అసోంలో ఏపీ కాంట్రాక్టర్ కిడ్నాప్
-
అసోంలో ఏపీ కాంట్రాక్టర్ కిడ్నాప్
బోడో మిలిటెంట్ల దుశ్చర్య భయాందోళనలో కుటుంబ సభ్యులు హైదరాబాద్/కడప/రామాపురం: అసోం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కిడ్నాప్నకు గురయ్యారు. దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన పప్పిరెడ్డి మేహ శ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసినట్లు అతడి బంధువులు తెలిపారు. క్లాస్వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి హసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్గా కూడా పనిచేశారు. గత మూడేళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాంకీ టవర్స ఈ-బ్లాక్ ఫ్లాట్ న ంబర్ 1607లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్ఎఫ్ (రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్గా పనులు చేయిస్తున్నారు. అసోం రాష్ట్రం దివాస్ జిల్లాలో రూ.45 కోట్లతో 70 కిలోమీటర్ల వరకు రోడ్డుపనులు ఆయన పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. కాగా, అక్కడ ఇటీవల కురిసిన వర్షాలకు చేసిన నిర్మాణాలన్నీ కొట్టుకుపోవడంతో పనులకు సంబంధిన బిల్లులు ఆగిపోయాయి. దీంతో తిరిగి నిర్మాణ పనులు పర్యవే క్షించేందుకు మహేశ్వరరెడ్డి సైట్ ఇంజనీర్తో కలసి ఆదివారం ఉదయం 5.30 గంటలకు బైక్ మీద డిమహసవో జిల్లా లుమ్డింగ్లోని గెస్ట్హౌస్ సమీపంలోని సైట్కు వెళ్లాడు. ఈ క్రమంలో హత్కళి గ్రామం సమీపంలో ఐదుగురు వ్యక్తులు వారి బైక్ను ఆపి మహేశ్వరరెడ్డి, సైట్ ఇంజనీర్ను తమతోపాటు తీసుకెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక సైట్ ఇంజనీర్ను వదిలిపెట్టారు. మహేశ్వరరెడ్డి కిడ్నాప్ ఉదంతం తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ చేసిన వారి నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు అసోం పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్ డీసీపీ కార్తికేయ డిమహసవో ఎస్పీ ప్రసాద్ జంధ్యాలతో మాట్లాడారు. మహేశ్వరరెడ్డిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, తన భర్తను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ, అసోం ప్రభుత్వాలకు మహేశ్వరరెడ్డి భార్య సుభద్రమ్మ విజ్ఞప్తి చేసింది. గత నెల 28న తన భర్త అసోం వెళ్లాడని, శనివారం రాత్రి ఫోన్ చేసి రెండు రోజుల్లో వస్తానని చెప్పినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. బాధితులకు ఎమ్మెల్యే శ్రీకాంత్రె డ్డి పరామర్శ వైఎస్సార్సీపీ నేత, రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి కిడ్నాప్నకు గురైన మహేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదివారం సాయంత్రం రాంకీటవర్స్కు వెళ్లి మహేశ్వర్రెడ్డి భార్య సుభద్రమ్మ, కూతురు నిశితలకు ైధైర్యం చెప్పారు. అసోం ప్రిన్సిపల్ సెక్రటరీ భానుతో మాట్లాడానని.. ఇప్పటికే ఆర్మీ అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. నేడు కేంద్ర హోం మంత్రి దృష్టికి కిడ్నాప్ వ్యవహారం చొరవ చూపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలోనే ఉండి పర్యవేక్షించాల్సిందిగా ఎంపీలకు ఆదేశం సాక్షి ప్రతినిధి, కడప : కాంట్రాక్టర్ పి.మహేశ్వరరెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనుంది. మహేశ్వరరెడ్డి కిడ్నాప్ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకున్న కడప మేయర్ సురేష్బాబు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిలు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి ఎంపీ అవినాష్రెడ్డి తదితరులు పలు సమస్యలపై కేంద్ర హోంమంత్రిని కలసి బయటకు వచ్చారు. ఆ తర్వాత వీరికి విషయం తెలియడంతో సోమవారం మరోమారు హోంమంత్రిని కలసి కిడ్నాప్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కాగా, ఎంపీలు అవినాష్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి బృందాన్ని ఢిల్లీలోనే ఉండాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిసింది. వీరు కేంద్ర హోం మంత్రిని కలసి కిడ్నాప్ విషయంపై చర్చించి కాంట్రాక్టర్ విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అలాగే అసోం ముఖ్యమంత్రితో కూడా ఈ విషయంపై మాట్లాడాలని వారు విన్నవించనున్నారు. ఈ మేరకు కడప నగర మేయర్ సురేష్బాబు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
బొక్కలవాగును తోడేస్తున్నారు..!
మంథని : మంథనిని ఆనుకుని ప్రవహించే బొక్కలవాగు నుంచి ఇసుకను తోడేస్తున్నారు. గోదావరి, మానేరు నదుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా కలెక్టర్ ఆదేశాలు జారీచేయగా.. ఆయా డివిజన్లలోని ఆర్డీవోలు స్పెషల్ డ్రైవ్ పెట్టి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. అరుుతే మంథనిలో ప్లడ్బ్యాంకు అభివృద్ధి పనుల పేరిట కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వాగులో ఇసుకను పొక్లెరుునర్తో తోడి గుట్టలను తలపించేలా నిల్వచేశాడు. స్థానిక అవసరాలకు కూడా వాగు ఇసుకను వాడేందుకు భవన నిర్మాణ యజమానులు ముందుకు రారు. మట్టితో కూడిన ఇసుక ఉండడంతో పగుళ్లు ఏర్పడి భవనాలు నాణ్యత దెబ్బతింటుందని దీనికి ప్రధాన కారణం. ఫ్లడ్ బ్యాంకు నిర్మాణానికి వాగు ఇసుకనే వినియోగించేలా అధికారులు అగ్రిమెంట్లో చేర్చడం విమర్శలకు తావిస్తోంది. పైగా ఈ ఇసుక నాణ్యతతో కూడిందా, ఫ్లడ్ బ్యాంకు అభివృద్ధి పనులకు వినియోగించొచ్చా.. అనే విషయాన్ని సాయిల్ టెస్టు నుంచి నిర్ధారణ కాకముందే కాంట్రాక్టర్ పెద్దఎత్తున ఇసుక తోడి నిల్వచేసుంటే.. ఇరిగేషన్ అధికారులు అడ్డుచెప్పకపోవడం గమనార్హం. రూ.28 కోట్లతో చేపడుతున్న మినీ ట్యాంకుబండ్ నిర్మాణానికి మట్టితో కూడిన నాసిరకం ఇసుక వాడితే ఎంత కాలం నిలుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఐబీ డీఈ రమేశ్బాబు మాట్లాడుతూ సాయిల్ టెస్టు తర్వాత ఇసుక అక్కరకు వస్తేనే కాంట్రాక్టర్ వినియోగించేలా చూస్తామని, లేకపోతే నిరాకరిస్తామని చెప్పారు. -
ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా?
అధికారులు కుమ్మక్కయ్యారు. వారు చేసే పనికి ఐఏ‘ఎస్’ అండగా నిలబడ్డారు. బల్దియాలో ఇక అడ్డేముంది? నిబంధనలతో పనేముంది? అర్హతలు లేకున్నా నచ్చిన కాంట్రాక్టర్కు పనులు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అదేదో లక్ష, రెండు లక్షల విలువ చేసే పనులకున్నారా? అట్లా భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఏకంగా 10 కోట్ల విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టర్కు అప్పగించే దస్త్రంపై సంతకం చేశారు. అందుకు ప్రతిఫలంగా అధికారులకు ఎంత ముట్టిందనేది మాత్రం రహస్యమే. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆనోటా ఈనోటా పడి తీరా టెండర్ అక్రమాల గుట్టు రట్టవడంతో కంగుతిన్న అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. రాజీమార్గం కోసం అమాత్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఈ టెండర్ అక్రమాల కహానీ, అర్హతలేని కాంట్రాక్టర్తో అధికారుల కుమ్మక్కు, వారికి అండగా బల్దియా కమిషనర్ సాగించిన బాగోతమేమిటో పరిశీలిద్దాం. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో సుమారు వెయ్యిమంది కాంట్రాక్టు కార్మికుల నియామకానికి ప్రతి పాదనలను సిద్ధం చేసిన అధికారులు జూలై 30న టెండర్లను ఆహ్వానించారు. రూ.9.8 కోట్ల అంచనా తో కూడిన ఈ టెండర్లో పాల్గొనేందుకు సంస్థలు 19 రకాల ధువ్రీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా, అందులో 14 పత్రాలను తప్పనిసరి (మాండేటరీ)గా సమర్పించాలనే నిబంధనలను పొందుపరిచారు. వీటిలో క్లాస్-4 రిజిస్ట్రేషన్, ఈఎండీ, ఏపీటీఎస్ ట్రాన్సాక్షన్ ఫీజు, రూ.లక్ష అదనపు సెక్యూరిటీ డిపాజిట్, వ్యాట్ డాక్యుమెంట్, ఈపీఎఫ్, ఈఎస్ఐ తోపాటు జూన్ నెల వరకు పీఎఫ్, ఈఎస్ఐ క్లియరెన్స్ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి నిబంధనల్లో ఉన్నా యి. ఆగస్టు 18న టెక్నికల్ బిడ్ తెరిచి ఒక్కో పనికి 8నుంచి 10షెడ్యూళ్లు దాఖలైనట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటినే ప్రెజ్ బిడ్లో తెరవాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి టెండర్లను నెలరోజుల పాటు డౌన్లోడ్ చేసేందుకే సమయం తీసుకున్నారు. తప్పనిసరి అర్హతలివి.. మొత్తం 8కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. తక్కువ మొత్తానికి కోట్ చేసిన శ్రీరాజరాజేశ్వరి వీఎల్సీసీఎస్ లిమిటెడ్ అనే సంస్థను సక్సెస్ఫుల్ బిడ్డర్గా ఎంపిక చేశారు. ఇంతవరకు బాగా నే ఉన్నా.. సదరు సంస్థకు టెండర్లో పాల్గొనే అర్హత పత్రాలే లేకపోవడం గమనార్హం. తప్పనిసరిగా పేర్కొన్న 14 పత్రాల్లో కీలకమైన ఈపీఎఫ్, ఈఎస్ఐ, టర్నోవర్ వంటి పత్రాలనూ ఆ కాంట్రా క్టు సంస్థ సమర్పించలేదు. అర్హతలేకున్నా.. అప్పగింత అర్హత లేని ఈ సంస్థకు ఏకంగా రూ.10 కోట్ల కాంట్రాక్టును అప్పనంగా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘అసలే అర్హతల్లేవు... అందులోనూ మ్యాన్పవర్ సరఫరాలోనూ పెద్దగా అనుభవం లేకున్నా కార్మికుల నియామకపు పనులు అప్పగించేందుకు అధికారులు ఉత్సాహం చూపడంలో మతలబు ఏమిటి?’ అని మిగిలిన కాంట్రాక్టర్లంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పత్రాలను తరువాత ఎప్పుడైనా సమర్పించే అవకాశం సదరు సంస్థకు ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘కరీంనగర్లో మొత్తం 125 కాంట్రాక్టు సంస్థలున్నా అర్హతల్లేవనే కారణంతో అందులో సింహభాగం టెండర్లలో పాల్గొనలేదు. ఆ సంస్థకు ఇచ్చినట్లు వెసులుబాటు ఇస్తే కనీసం వంద కాంట్రాక్టు సంస్థలు కూడా అందులో పాల్గొనేవి కదా?’ అని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉన్నా అంతకం టే తక్కువకు టెండరు వేసిన సంస్థకు పనులు ఎట్లా అప్పగిస్తారని, అలాంట ప్పుడు తమ పరిస్థితేమిటని కార్మికులు వాపోతున్నారు. ‘నిబంధనలు రూపొం దించి టెండర్లు అప్లోడ్ అయ్యాక అనుకూలమైన వారి కోసం మార్చడం ఎంతవరకు సమంజసం? తప్పనిసరి అర్హతలను మార్చే అధికారం బల్దియా కమిషనర్కు సైతం లేదు. అయినా తుంగలో తొక్కారంటే దీనివెనుక పెద్ద మతలబే ఉంది’ అని సంస్థలోని ఉద్యోగులూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా? మొదట శ్రీరాజరాజేశ్వర సంస్థకు టెండర్లలో పాల్గొనే అర్హత లేని ఫైలుపై సంతకాలు చేసిన అధికారులు... ఆ తరువాత అదే సంస్థకు రూ.10 కోట్ల పనుల అప్పగించేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. అందుకోసం మాండేటరీ నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు ఫైలు సిద్ధం చేస్తే దానిపై బల్దియా కమిషనర్ అయిన ఐఏఎస్ శ్రీకేశ్ లట్కర్ సం తకం చేయడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఐఏఎస్ అయితే నిబంధన లు వర్తించవన్నట్లుగా గుడ్డిగా సంతకం చేయడమేంటని, తప్పులు సరిదిద్దాల్సి న కమిషనరే తప్పు చేస్తే బల్దియా అక్రమాలను అడ్డుకునేదెవరని ప్రశ్నిస్తున్నా రు. ఈ బాగోతంలో బల్దియా ఎస్ఈ, ఈఈ అసలు సూత్రధారులనే ఆరోపణలూ విన్పిస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర సంస్థకు కనీస అర్హతల్లేనందున సదరు దస్త్రంపై తాను మాత్రం సంతకం చేయబోనని డెప్యూటీ ఈఈ సంపత్రావు తెగేసి చెప్పినప్పటికీ, పక్కనపెట్టి సదరు సంస్థకు పనులు అప్పగించడం విశేషం. రాజీకి అధికారుల పాట్లు టెండర్ అక్రమాల బాగోతం బట్టబయలవడంతో బల్దియా కమిషనర్ సహా సదరు అధికారులంతా రాజీ యత్నాలు ప్రారంభించారు. నగర మేయర్, కార్పొరేటర్ల వద్దకు వెళ్లి పొరపాటైందని, దీనిని ఇంతటితో వదిలేయాలని ప్రాధేయపడుతున్నారు. బల్దియా కమిషనర్ శ్రీకేష్ లట్కర్ సైతం ‘ఇందులో నా తప్పేమీ లేదు. కిందిస్థాయి అధికారులు రూపొం దించిన ఫైలుపై చూసుకోకుండా సంత కం చేశాను’ అని రాజీ బేరానికి వస్తున్నట్లు తెలిసింది. మరోవైపు టెండర్ బాగోతంపై నగర మేయర్ రవీందర్సింగ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మకు కమలాకర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. అదే సమయంలో మేయర్ సైతం కమిషన ర్ సహా బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. -
ఎన్పీడీసీఎల్ ఏడీఈకి ఏసీబీ షాక్
గోదావరిఖని : బిల్లుల క్లియరెన్స్కు కాంట్రాక్టర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ గోదావరిఖని ఏరియా ఎన్పీడీసీఎల్ ఏడీఈ(ఎలక్ట్రికల్) గౌతం మధుసూదన్ ఏసీబీకి చిక్కాడు. రామగుండం ఈస్ట్, వెస్ట్, మేడిపల్లి డివిజన్ల పరిధిలో ఇంట్లో ఉన్న విద్యుత్ మీటర్లను బయట పెట్టించేందుకు ఫెర్నిత్ ఎలక్ట్రికల్ వర్క్కు చెందిన సుధమల్ల శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. మూడు డివిజన్ల పరిధిలోని 1,620 విద్యుత్ మీటర్లను ఇంట్లో నుంచి బయటకు మార్పు చేయించారు. ఇందుకు సంబంధించి మొత్తం రూ.3.24 లక్షల బిల్లు అయింది. ఈ బిల్లుల చెల్లింపునకు ఆయా డివిజన్ల ఏఈలు సంతకాలు చేయగా... దానిని పరిశీలించి ఏడీఈ గౌతం మధుసూదన్ కూడా సంతకం చేసి ఆ ఫైల్ను డీఈ పరిశీలనకు పంపాల్సి ఉంటుంది. అయితే నాలుగు నెలలుగా ఫైల్ తన వద్దనే పెట్టుకుని లంచం కోసం కాంట్రాక్టర్ శ్రీనివాస్ను ఇబ్బంది పెట్టాడు. దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏడీఈ కార్యాలయంలో శ్రీనివాస్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ మంగళవారం ఏడీఈని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని, గతంలో అతడిపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేస్తామని చెప్పారు. కాగా, మంచిర్యాల పట్టణంలోని గోసేవా మండల్ రోడ్డులో గల ఏడీఈ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి సోదాలు నిర్వహించారు. -
జీతాల్లేకుండా ఎట్లా బతకాలి?
తాండూరు: ‘ఆస్పత్రి శుభ్రంగా లేకపోతే దూషిస్తారు. కానీ ఆరు నెలలుగా మాకు జీతాలు రాకుంటే ఎవరికీ పట్టింపు లేదు. కాంట్రాక్టర్ను అడిగితే పైనుంచి రావడం లేదంటారు. ఆస్పత్రి అధికారులకు మొరపెట్టుకుంటే ఫలితం లేదు. నెలలుగా జీతాలు రాకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. పూట గడటమే కష్టంగా మారింది. రెండు రోజుల్లోపు మా జీతాలు మొత్తం చెల్లించకపోతే ఆస్పత్రి ఎదుటే మందు తాగి సచ్చిపోతాం’ అంటూ తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి కాంట్రాక్ట్ పారిశద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ హనుమంతరావు వచ్చారన్న విషయం తెలుసుకున్న కార్మికులు ఆయన వద్దకు వచ్చి తమ బాధలను వివరించారు. రూ.3,500 అరకొర జీతంలో నెలలుగా జాప్యం జరిగితే ఏం తిని బతకాలి సార్ అంటూ నిలదీశారు. ‘ఇచ్చే జీతంలో పీఎఫ్ పేరుతో రూ.500 కోత విధిస్తారు. కానీ నాలుగేళ్లుగా మా పీఎఫ్ డబ్బులు ఎక్కడున్నాయో తెలియదు. దసరా పండుగ వస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పండగను ఎలా జరుపుకోవాలి’ అంటూ మహిళా కార్మికులు ధ్వజ మెత్తారు. ఈ విషయం తెలుసుకున్న ము న్సిపల్ కౌన్సిలర్ లింగదళ్లి రవికుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సమన్వయకర్త హనుమంతరావు,సూపరింటెండెంట్ వెంకటరమణప్పలతో మా ట్లాడారు. ఇన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. రెండు రోజుల్లోపు రెండు నెలల జీతాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీనికి కార్మికులు అంగీకరించలేదు. రెండు నెలల జీతాలు తమకు అవసరం లేదని, మొత్తం కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సంబంధిత ఏజెన్సీ, కాంట్రాక్టర్తో మాట్లాడి జీతాలు, పీఎఫ్ డబ్బుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సమన్వయకర్త సమాధానం ఇచ్చారు. సోమవారానికల్లా జీతాల సమస్య పరిష్కరించాలని కార్మికులు స్పష్టం చేసి వెళ్లిపోయారు. -
‘ట్రబుల్ రన్!
గద్వాల: సుమారు రెండొందల గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఉద్ధేశించిన జూరాల భారీ తాగునీటి పథకం బాలారిష్టాలను దాటడం లేదు. ట్రయల్న్ ్రదశలోనే అడ్డుంకులు ఎదురవుతున్నాయి. నీటిని పంపింగ్ చేసే సమయంలో ఒత్తిడికి పైపులు పగిలిపోవడం.. మళ్లీ వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చడం.. అవీ పగిలిపోవడం వంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు చివరి అవకాశమిచ్చారు. ఇది ఈ మేరకు ఫలిస్తుందో చూడాలి! గద్వాల డివిజన్లోని 184 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో సుమారు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం జూరాల భారీ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. కాగా, పనులు పూర్తిచేసుకొని 2012 ఆగస్టులో మొదటిదశలో ప్రధాన పంప్హౌస్ నుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు గ్రావిటీ జలశయం వరకు ట్రయల్న్ ్ర ర్వహించారు. ప్రక్రియ ప్రారంభమైందోలేదో ప్రధానలైన్కు అడుగడుగునా లీకేజీ ఏర్పడ్డాయి. దీంతో పథకం ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. స్పందించిన ఉన్నతాధికారులు పైపులను మార్చేసి డీఐ పైప్లను అమర్చారు. ఎలాగోలా కొండగట్టుపైకి నీళ్లు ఎక్కించారు కానీ గ్రామాలకు పంపిణీ లైన్లద్వారా అందించే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇలా ఇప్పటివరకు ఏ ఒక్కగ్రామానికి నీళ్లివ్వలేకపోయారు. ఈ పరంపరలో టెస్టింగ్లను ప్రతి 500 మీటర్లకు ఒకచోట నిర్వహించాలని ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్టర్కు చివరి అవకాశమిచ్చారు. గత జూలైలో టెస్టింగులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. ఒకచోట నిర్వహించిన టెస్టు సఫలమైనా..మరో రెండుచోట్ల విఫలమైంది. దీంతో నెలరోజుల క్రితం కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. స్థానిక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయానికి లేఖలను రాశారు. రూ.80కోట్లు మట్టిపాలు! జూరాల భారీ తాగునీటి పథకం నిర్మాణం, పైప్లైన్ల ఏర్పాటుకు ఇప్పటివరకు దాదాపు రూ.80కోట్లు ఖర్చుచేశారు. మొదట శంకుస్థాపన సమయంలో హడ్కో ద్వారా రూ.35కోట్లు మంజూరుచేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులను ఇతర పథకాల ద్వారా సమకూరుస్తూ వచ్చింది. తద్వారా ఫిల్టర్బెడ్స్, జూరాల రిజర్వాయర్లోని ఇంటెక్వెల్, కొండగట్టుపై గ్రావిటీ జలాశయాన్ని నిర్మించారు. కేవలం పైప్లైన్లలో నీటిఒత్తిడిని తట్టుకోలేని ఫైబర్ పైపులు వేయడంతో మొత్తం పథకం లక్ష్యం మట్టిపాలైంది. ఉన్నతాధికారులకు లేఖ రాశాం : ఈఈ మేఘారెడ్డి భారీ తాగునీటి పథకంలో పంపిణీ లైన్లలో టెస్టింగ్లు నిర్వహించాలని అనుమతించగా, కాంట్రాక్టర్ పనులను చేయకుండా నిలిపివేసిన విషయమై చర్యల కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్ నుంచి గ్రామాలకు తాగునీటిని అందించే డిస్ట్రిబ్యూషన్ లైన్లలో లీకేజీల కారణంగా సమస్య ఉత్పన్నమైంది. ఉన్నతాధికారుల నిర్ణయంపై తదుపరి కార్యాచరణ ఉంటుంది. -
‘శివ' శివా..!
ప్రకాశ్నగర్ (రాజమండ్రి) : రాజమండ్రి నగర పాలక సంస్థ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ యార్లగడ్డ శివశంకరరావు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమ్మయ్య నాయుడు అనే మున్సిపల్ కాంట్రాక్టర్ గత మార్చి 30న జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా బారికేడ్ల ఎక్స్టెన్షన్ కాంట్రాక్టు పొందాడు. అందుకు సంబంధించిన రూ.4.64 లక్షల బిల్లు మంజూరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు సంతకాలు చేశారు. ఆ మొత్తాన్ని మంజూరు చేయాలంటే తనకు రూ.30 వేలు ఇవ్వాలని శివశంకరరావు డిమాండ్ చేశారు. రూ.20 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన తమ్మయ్యనాయుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు పన్నిన పథకం ప్రకారం.. వారు రంగు పూసి ఇచ్చిన రూ.20 వేల నగదును తమ్మయ్యనాయుడు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నగర పాలక సంస్థ కార్యాలయంలోని శివశంకరరావు చాంబర్కు వెళ్లి ఇచ్చాడు. ఆ సొమ్మును ప్యాంటు జేబులో పెట్టుకున్న శివశంకరరావు తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి, తిరిగి లోపలికి వెళ్లి ఫైలు కింద పెట్టారు. వెంటనే ఏసీబీ అధికారులు లోపలికి వెళ్లి అతడి చేతులు పరిశీలించగా నోట్లకు పూసిన రంగు అంటుకుని ఉంది. దాంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ్మయ్యనాయుడికి మంజూరు చేయాల్సిన రూ.4.64 లక్షలకు సంబంధించి ఫైలును, శివశంకరరావు తీసుకున్న రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శివశంకరరావును ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. లంచం ఇస్తేనే బిల్లు మంజూరు.. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ శివశంకరరావు లంచం ఇస్తే తప్ప ఏ బిల్లూ మంజూరు చేయరని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు. తనకు ఇవ్వాల్సిన బిల్లును మంజూరు చేయకుండా నాలుగు నెలలుగా తిప్పించుకుంటున్నారని, ఆయనకు లంచం ఇవ్వడం ఇష్టం లేకే ఏసీబీని ఆశ్రయించానని తమ్మయ్యనాయుడు చెప్పారు. తాను తనకు ఇవ్వాల్సిన రూ.60 వేల బిల్లును సంవత్సరకాలంగా మంజూరు చేయడం లేదని కాంట్రాక్టు పద్ధతిపై నగర పాలక సంస్థకు కార్లను సరఫరా చేసే కేపీఆర్ విఠల్ ఆరోపించారు. శివశంకర్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని కోన కిషోర్కుమార్ గౌడ్ అనే మరో కాంట్రాక్టర్ చెప్పారు. నగరపాలక సంస్థ కాంట్రాక్టులు దక్కాలన్నా, బిల్లులు మంజూరు కావాలన్నా తన కుమార్తెను కారులో వివిధ ప్రాంతాల్లో జరిగే పరీక్షలకు తీసుకువెళ్లాలని రూట్ మ్యాప్తో సహా నిర్దేశించారని ఆరోపించారు. చేసేది లేక ఇండికా కారులో గుడివాడ, తెనాలి వంటి ప్రాంతాలకు ఆయన కుమార్తెను పరీక్షలకు తీసుకు వెళ్లినట్టు చెప్పారు. ప్రతి రూ.లక్ష బిల్లుకు రూ.250 చొప్పున ఇవ్వాల్సిందేనని శివశంకరరావు అందరు కాంట్రాక్టర్లనూ ఆదేశించారని ఆరోపించారు. -
గన్తో బెదిరించిన కాంగ్రెస్ నేత
-
ఇదో ‘దారి’ దోపిడీ
సాక్షి, కాకినాడ :పేదలకు చేరాల్సిన కిలో రూపాయి బియ్యంలో ప్రతి బస్తాపైనా అక్రమార్కులు పందికొక్కుల్లా ఎగబడుతున్నారు. కిలోలుకిలోలుగా బొక్కిన బియ్యం టన్నులకు చేరగా రీ సైక్లింగ్ చేసి, బహిరంగ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చీకటిదందా వెనుక అధికార తెలుగుదేశం నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏడీబీ రోడ్లో తరుగుతో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం సరఫరా కాంట్రాక్టర్ టీడీపీ ప్రజాప్రతినిధి కావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.జిల్లాలో తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ, రచ్చబండ కార్డులు 15,28,598 ఉండగా, నెలనెలా 2,560 రేషన్షాపుల ద్వారా బియ్యం, పంచదార, పప్పు, కిరోసిన్ తదితర నిత్యావసరాలు పంపిణీ చేస్తుంటారు. కిలో రూపాయి బియ్యం కింద ప్రతి నెలా 18 వేల టన్నులు ఇస్తుంటారు. ఈ బియ్యం ఎఫ్సీఐ గోడౌన్స్ నుంచి మండల స్థాయిల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సరఫరా చేస్తారు. గోడౌన్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు స్టేజ్-1 కాంట్రాక్టర్, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు స్టేజ్-2 కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. గోడౌన్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు చేరేలోపు వంద, రెండువందల గ్రాముల తరుగు రావడం సహజం. కానీ జిల్లాలో రేషన్ డీలర్ల పరిస్థితి ఁసంచి లాభం చిల్లుకు చెల్లురూ. అన్నట్టు తయారైంది. వందకేజీల బస్తాకు రెండు నుంచి ఐదు కిలోల వరకు తరుగు వస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు. ఇలా ప్రతి బస్తాకు వచ్చే తరుగు లెక్కిస్తే జిల్లాలో వందల టన్నులవుతోంది. ఈ బాగోతం ఎప్పటి నుంచో సాగుతున్నా అధికారులు 60 టన్నులకు 18 క్వింటాళ్ల తరుగుకాగా పలువురు డీలర్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పెద్దాపురం వద్ద ఏడీబీ రోడ్లో ఈనెల ఒకటిన సుమారు 60 టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలిస్తున్న ఏడులారీలపై జేసీ ఆదేశాల మేరకు పౌరసరఫరాల సిబ్బంది ఆకస్మిక దాడి చేశారు. స్టాక్ రికార్డులు, లోడును పోల్చితే రికార్డుల్లో ఉండాల్సిన బియ్యం కంటే 18 క్వింటాళ్లు తక్కువున్నట్టు గుర్తించి విస్తుపోయారు. బియ్యంతో సహా లారీలను సీజ్ చేసి, లారీ డ్రైవర్లతో పాటు స్టేజ్-1 కాంట్రాక్టర్పై 6ఏ కేసు నమోదు చేశారు. ఆ కాంట్రాక్టర్ మరెవరో కాదు టీడీపీకి చెందిన తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్. ఆయన గత కొన్నేళ్లుగా జిల్లాలో ఎఫ్సీఐ గోడౌన్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా చేసే స్టేజ్-1 కాంట్రాక్టర్గా ఉన్నారు. స్టేజ్-1లోనే కాక స్టేజ్-2లోనూ తరుగుదగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. 60 టన్నుల లోడులోనే 18 క్వింటాళ్ల తరుగు వచ్చిందంటే ఇక ప్రతి నెలా రేషన్షాపులకు సరఫరా చేసే 18 వేల టన్నుల బియ్యంలో ఏ స్థాయిలో తరుగు వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ప్రతి నెలా వందల క్వింటాళ్ల బియ్యం పక్క దారి పడుతూనే ఉందని తాజాఘటన ద్వారా మరోసారి తేటతెల్లమైంది. ఎవరికీ అనుమానం రాకుండా మార్గమధ్యంలోనే హుక్లతో పొడిచి ఒక్కో బస్తా నుంచి రెండు నుంచి ఐదు కిలోలకు తక్కువ కాకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఇన్నాళ్లూ వినిపించిన ఆరోపణలకు ఈ తాజా ఘటన బలం చేకూర్చింది. రీ సైక్లింగ్తో రూ.కోట్ల ఆర్జన పక్కదారి పట్టించిన బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తూ దొడ్డిదారిన బహిరంగ మార్కెట్లో కిలో రూ.15కు తక్కువ కాకుండా విక్రయిస్తూ కోట్లు కూడగట్టుకుంటున్నట్టు ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు క్రమం తప్పకుండా మామూళ్లు వెళ్తుండడం వలనే ఈ అక్రమార్కులపై అధికారులు ఇన్నాళ్లూ ఉదాసీనంగా వ్యవహరించే వారంటున్నారు. కొంతమంది డ్రైవర్లు తమకు తెలియకుండా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని, తమ ప్రమేయం లేదంటూ సదరు కాంట్రాక్టర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్నతస్థాయిలో వస్తున్న ఒత్తిళ్ల మేరకు ఆ కాంట్రాక్టర్ పేరును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెల్సింది. ఇకనైనా బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు ఎఫ్సీఐ గోడౌన్ల నుంచి కార్డుదారులకు చేరే వరకు సక్రమంగానే రవాణా అవుతున్నాయా లేక పక్కదారి పడుతున్నాయా అన్న దాని నిరంతరనిఘా వేయాల్సిన అవసరం ఉంది. -
మండల పరిషత్ లో ప్రలోభాల పర్వం
మండల పరిషత్ పీఠాలు దక్కించుకోవటానికి అధికార తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. గెలుపు అవకాశం లేని కొన్ని మండలాల్లో తెరచాటు రాజకీయాలు సాగిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు దిగటం, కొందరిని ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేయటం, మరికొందరిని ఓటింగ్కు రాకుండా చేయటం కోసం ఆర్థిక సర్దుబాటు చేయటం వంటి నీచ రాజకీయాలు చేస్తూ పల్లె రాజకీయాలను కలుషితం చేస్తోంది. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం సాగుతోంది. సాక్షి, విజయవాడ/మచిలీపట్నం : జిల్లాలో ఎంపీటీసీ స్థానాలను అధికార పార్టీకి పోటాపోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జిల్లాలోని 49 మండలాల్లో మొత్తం 812 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అధికార టీడీపీ 468 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 328 స్థానాలు గెలుచుకుంది. రెండు పార్టీలూ దాదాపు 15 మండలాల్లో మెజార్టీకి దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పరిషత్ అధ్యక్ష పదవులే లక్ష్యంగా బరితెగించి ప్రలోభాలకు తెరతీసింది. స్వతంత్ర అభ్యర్థుల్ని భారీ మొత్తానికి కొనుగోలు చేయటంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు వల విసురుతోంది. దీంతో పల్లెల్లో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నియోజకవర్గాల్లో ఈ ప్రలోభాలు సాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెండు రాజకీయ పార్టీలూ ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు విప్ను కూడా తీసుకోకుండా టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారు. జిల్లాలో ప్రధానంగా అవనిగడ్డ, గన్నవరం, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రలోభాలు ఇలా... పెడన మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆరు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోగా నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. స్థానిక టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి నందిగామ ఎంపీటీసీ జన్ను భూలక్ష్మితో టీడీపీకి ఓటు వేయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మరో ఎంపీటీసీ కోసం అన్వేషిస్తున్నారు. ఉయ్యూరు మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 5 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు టీడీపీ, రెండు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఇద్దరు స్వతంత్రులు వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు వారిని తమవైపు తిప్పుకొనే యత్నాల్లో నిమగ్నమయ్యారు. బాపులపాడు మండలంలో 24 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు చెరో 12 స్థానాలు గెలుపొందాయి. ఈ క్రమంలో రెండు రాజకీయ పార్టీలు విప్లు జారీ చేశాయి. వీరవల్లి ఎంపీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మాచినేని లలిత పార్టీ విప్ను తీసుకోలేదు. మరోవైపు టీడీపీ నేతలు ఇక్కడ ప్రలోభాల పర్వం సాగిస్తున్నారు. అవనిగడ్డలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాలుగు స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్, ఐదు స్థానాలు టీడీపీ దక్కించుకున్నాయి. మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ స్వతంత్రుల కొనుగోలుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మొవ్వలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8, టీడీపీ 6, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. ఈ క్రమంలో కోసూరు ఎంపీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కిలారపు మంగమ్మను ప్రలోభాలకు గురిచేశారు. దీంతో ఆమె గురువారం సాయంత్రం టీడీపీలో చేరింది. ఎంపీపీల ఎన్నిక నేడే జిల్లాలోని 49 మండల పరిషత్ల పాలకవర్గాలు నేడు కొలువు తీరనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 26 మండలాల్లో టీడీపీ పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు పూర్తి మెజార్టీని సాధించింది. వైఎస్సార్ సీపీ 13 మండలాల్లో పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు మండల పరిషత్ పాలకవర్గాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ ఎంపీటీసీ సభ్యులకు విప్లు జారీ చేశాయి. అధికారపక్షమైన టీడీపీ వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులకు వల వేసి వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. క్యాంపు రాజకీయాలు నడుపుతూ ఎంపీటీసీ సభ్యులకు విప్ ఇచ్చే అవకాశం లేకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. మండల పరిషత్లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొనటంతో టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతలు ఎంపీటీసీ సభ్యులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. -
డీటీసీ ఆదేశాలు బేఖాతర్
- హెచ్ఎస్ఆర్ ప్లేట్ల ప్రక్రియ ఆపాలని ఆదేశం - కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ తిమ్మాపూర్ : రవాణా శాఖ జిల్లా డెప్యుటీ ట్రాన్స్పోర్టు కమిషనర్(డీటీసీ) ఆదేశాలను హై సెక్యురిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల(హెచ్ఎస్ఆర్పీ) కాంట్రాక్టర్ బేఖాతరు చేస్తున్నారు. ఇటీవల కార్యాలయ ఆవరణలో హెచ్ఎస్ఆర్పీ ప్రక్రియను కాంట్రాక్టర్ ప్రారంభించగా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు రేడియం షాపుల యజమానులు ఆపాలని డీటీసీని కలిశారు. ఇతర జిల్లాల్లో ప్రారంభించకుండా కేవలం కరీంనగర్లోనే ప్రారంభించడంపై అభ్యంతరాలు తెలిపారు. దీనిపై డీటీసీ స్పందిస్తూ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రారంభించిన తర్వాతనే కరీంనగర్లో ప్రారంభించాలని ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్ ప్రతి రోజూ కార్యాలయ ఆవరణలో కౌంటర్ ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. హెచ్ఎస్ఆర్పీకి సంబంధించి నోడల్ ఆఫీసర్ ఆర్టీవో దుర్గప్రమీలకు తెలియకుండానే ప్రారంభించడం విమర్శలకు దారితీస్తోంది. జోనల్ ఆఫీసు వరంగల్లో ప్రారంభించే వరకు ఇక్కడ తాత్కాలికంగా హెచ్ఎస్ఆర్ ప్లేట్ల ఆర్డర్లు తీసుకోవడం ఆపాలని ఆర్టీవో కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆర్డర్లు తీసుకోవడం లేదని కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు. తెలంగాణలో ఏపీ జీవో... వాహనదారులు హెచ్ఎస్ఆర్ ప్లేట్లను వాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 110 జారీ చేసినా జిల్లాలో అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి జీవో పేరిట ఇప్పుడు సంబంధిత కాంట్రాక్టర్ హెచ్ఎస్ఆర్ ప్లేట్ల కౌంటర్ను ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిన తర్వాత కౌంటర్ను ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. ఆంధ్ర అధికారులున్నందునే అప్పటి జీవోను ఇప్పుడు అమలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పైప్లైన్ టెండర్ల తకరారు
కాలం చెల్లిన చెక్కులిచ్చిన కాంట్రాక్టర్ టెండర్ ఖరారు చేసిన అధికారులు నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మచిలీపట్నం టౌన్, న్యూస్లైన్ : స్థానిక బైపాస్రోడ్లో పైప్లైన్ నిర్మాణ పనుల బండారం బట్టబయలయ్యింది. పైప్లైన్ నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ ఈ నెల ఆరో తేదీ శుక్రవారం సాక్షిలో ‘నిబంధనలకు విరుద్ధంగా పైప్లైన్ నిర్మాణం’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ పనులకు సంబంధించిన వివరాల ఫైల్ను తమకు చూపాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రెండు రోజులుగా కమిషనర్ను కలసి డిమాండ్ చేశారు. రెండు రోజులుగా సంబధిత గుమస్తా నవప్రకాష్ సెలవులో ఉన్నాడంటూ ఇంజినీరింగ్ అధికారులు దాటవేస్తూ వచ్చారు. శనివారం ఈ పైప్లైన్ పనులకు సంబంధించిన టెండర్ఫైల్ను చూపుతామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. దీంతో కౌన్సిలర్లు శనివారం కమిషనర్ ఛాంబర్కు వెళ్లి ఫైల్ తెప్పించి చూపాలని కోరారు. దీంతో ఆయన ఫైల్ను తెప్పించారు. ఈ ఫైల్ను కౌన్సిలర్లు పరిశీలించగా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. స్థానిక శ్రీనివాసనగర్లోని సంపు నుంచి బైపాస్ రోడ్లోని సర్కిల్ వరకూ 250 మీటర్ల మేర రూ.3.60 లక్షలతో నూతన హెచ్డీపీఈ పైప్లైన్ను ఏర్పాటు చేసేందుకు అర్జెంట్ షార్ట్టెండర్ను 2014 మార్చి 10వ తేదీన పిలిచారు. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు డొక్కు వీర్రాజు, డొక్కు రమేష్కుమార్ మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. వీరిద్దరిలో వీర్రాజు రెండు శాతం తక్కువకు పనులు చేసేందుకు టెండర్ వేసి పనులను దక్కించుకున్నాడు. కాగా ఈ పనులను దక్కించుకున్న వీర్రాజు టెండర్ ధరావతును డీడీ రూపంలో టెండర్ పిలిచిన తేదీ తర్వాత తేదీతో ఇవ్వాల్సి ఉంది. అయితే వీర్రాజు 2013 డిసెంబర్ 5వ తేదీన తీసిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులను టెండర్కు జతచేశాడు. అయితే ఈ టెండర్ షెడ్యూల్కు ధరావతు డీడీలను జత చేయాల్సి ఉండగా చెల్లని చెక్కులు ఇచ్చాడు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, లంకా సూరిబాబు, షేక్ అచ్చేబాలు కమిషనర్, ఏఈ రాంపరసాద్, గుమస్తా నవప్రకాష్ను నిలదీశారు. ఇన్ని లోపాలు ఉండగా ఈ టెండర్ను ఎలా పరిగఱణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ సర్టిఫికెట్ ఫోర్స్లో లేని రమేష్కుమార్ వేసిన టెండర్ను ఎలా పరిగణనలోకి తీసుకున్నారని నిలదీశారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రకటనలను ఏ పత్రికలోనూ, ఆన్లైన్లో ఈ- ప్రొక్యూర్మెంట్ ద్వారాను పిలువకుండానే టెండర్లు ఎలా ఆమోదించారని, అలాగే మినిట్స్ పుస్తకంలో ఈ పని వివరాలు నమోదే చేయకుండా ఎలా పని చేయిస్తున్నారని వారు ప్రశ్నించారు. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ టెండర్ను ఎందుకు పెట్టారని, బైపాస్ రోడ్లో ఎన్నో యేళ్లుగా పైప్లైన్ లీకవుతుంటే ఈ పనులు ఇప్పుడే ఇంత అడ్డగోలుగా ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఒక వేళ అంత అవసరం అనుకుంటే చిన్న పనే కాబట్టి ఈ పనిని శాఖా పరంగానే ఎందుకు చేయలేకపోయారని అడిగారు. మెదటి సారి తప్పు తమ దృష్టికి వచ్చింది కాబట్టి సిబ్బంది తప్పైపోయింది అని ఒప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని లేకుంటే తప్పులు రుజువైనందున సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్ను డిమాండ్ చేశారు. రెండు రోజులుగా టెండర్ ఫైల్ చూపుతామని హామీ ఇచ్చిన ఎంఈ గద్దె ప్రదీప్కుమార్ శనివారం లేకపోవడాన్ని కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ అంశంపై స్పందించిన కమిషనర్ మారుతీదివాకర్ మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించిన టెండర్ఫైల్ల్లో లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే మున్సిపాలిటీకి చెందిన ధనం మాత్రం వృథాకాలేదన్నారు.సోమవారం సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కమిషనర్ను కలసిన కౌన్సిలర్లలో మీర్ అస్గర్అలీ, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్లాల్, శీలం బాబ్జీ, ధనికొండ నాగమల్లేశ్వరి, బందెల కవిత, మట్టా తులసి, కే లీలాకుమారి తదితరులు ఉన్నారు. -
ఆస్పత్రిలో ఆకలిమంటలు
జబ్బు నయంచేసుకోవాలని రోగులు సర్కార్ ఆస్పత్రికెళితే అక్కడ కొత్తరోగం వచ్చేట్టుంది. ఏది పెట్టినా తింటారులే అనే నిర్లక్ష్యంతో నాణ్యతలేని టిఫిన్, భోజనం వడ్డిస్తూ రోగుల కడుపు మాడ్చుతున్నారు. నాణ్యతను పరిశీలించాల్సినఆస్పత్రి వర్గాలు పట్టించుకోవడంలేదు. సర్కార్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చేదంతా నిరుపేదలే. బయట ఆహారం కొని తినలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఇచ్చే నాసిరకం తిండి తినలేక ఆకలితో కడుపుమాడ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న దీనావస్థలివీ. చిత్తూరు (క్రైమ్),న్యూస్లైన్: చిత్తూరులోని 300 పడకల ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీల నుంచి సీరియస్ కేసులను ఇక్కడికి రెఫర్ చేస్తుం టారు. వీరుగాక ఆస్పత్రికి రోజూ 1000 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఆపరేషన్లు, ప్రాణాంతక జబ్బులతో పాటు డెలివరీ కేసులవారు 3 నుంచి 15 రోజుల పాటు ఆరోగ్యం కుదుటపడేవరకు ఆస్పత్రిలోనే చికిత్సపొందుతారు. వీరు ఆస్పత్రిలో అడ్మిట్టయినప్పటినుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు పౌష్టికాహారం అందివ్వాలి. ఈ క్రమంలో టిఫిన్, భోజనం, పండ్లు, పాలు, కోడిగుడ్డు సరఫరా చేసే బాధ్యతను కాంట్రాక్టర్కు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఉదయం నీళ్లపాలు, రాళ్లులాంటి గట్టి ఇడ్లీలు, నీళ్ల సాంబారు, ఉడికీ ఉడకని అన్నం మెతుకులను వడ్డిస్తున్నారు. ఈ ఆహారం తింటున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. నాణ్యతలేని ఆహారం గురించి నిర్వాహకులను ప్రశ్నిస్తే రోగులపై తిరగబడుతున్నారు. పెట్టేది ఇంతే ... ఎవరికైనా చెప్పుకోండి... ఏం భయం లేదు అంటున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ సరఫరాచేసే భోజనాన్ని ఆస్పత్రి అధికారి పరీక్షించి నాణ్యతను నిర్ధారించిన తరువాతే రోగులకు వడ్డించాలి. నాణ్యతలో తేడా వస్తే కాంట్రాక్టర్ను హెచ్చరించాలి. లేదా ఆ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలి. అయితే ఫుడ్ క్వాలిటీని పరీక్షించాల్సిన ఆస్పత్రి అధికారి ఇవన్నీ పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో కాంట్రాక్టర్ ఏది వడ్డిస్తే అది తినాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతిరోజూ రోగులకు అరటిపండు, ఆరంజ్, ఆపిల్ తదితర పండ్లలో ఏదో ఒకటి అందించాల్సివున్నా రోగులకు పంపిణీ చేయడంలేదు. భోజనం అధ్వానం ఆపరేషన్ చేసుకుని వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నా. ప్రతిరోజూ 6 నుంచి 10 మాత్రలు మింగుతుండటంతో కడుపులో చాలా మంటగా ఉంది. ఇక్కడ వడ్డిస్తున్న భోజనం తింటే కడుపుమంటతో పాటు భరించలేని కడుపునొప్పి వస్తోంది. నాసిరకం భోజనం ఇస్తుండడంతో త్వరగా కోలుకోలేకపోతున్నాం. -అర్జునయ్య, నలగాంపల్లె, బంగారుపాళెం మండలం దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు ఇడ్లీ గట్టిగా ఉందని, పాలు నీళ్లుగా ఉన్నాయని అడిగితే దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించారు. వారం రోజుల నుంచి ఫుడ్ కాంట్రాక్టర్ ఇచ్చే పాలు, టిఫిన్, భోజనం కిందపడేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పండ్లు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ తీరుపై విచారణ చేసి రోగులకు న్యాయం చేసేలా అధికారులు చొరవచూపాలి. -శ్రీనివాసులు, దిగువ కామినేపల్లె, ఐరాల మండలం రోగులపై తిరగబడితే చర్యలు తీసుకుంటాం రోగులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కచ్చితంగా మెనూ ప్రకారం అందించాలి. నాణ్యత లేదని ప్రశ్నించిన రోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఫుడ్ కాంట్రాక్టర్పై ఉంది. అలాకాకుండా రోగులపైనే విరుచుకుపడటం.. ఎవరికైనా చెప్పుకో అనడం సరికాదు. ఈ విషయంపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటాం. -సరళమ్మ, డీసీహెచ్ఎస్. -
నిమ్స్ గతి ఇంతే!
బీబీనగర్లో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తుల నిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసింది. చిన్నపాటి వర్షానికే స్లాబుల నుంచి నీరు కారుతుండడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్ అప్పుడే పాడవడంతో నిర్మాణ పనులు, నిధుల మంజూరులో అనేక అక్రమాలు జరిగినట్లు, విలువైన టైల్స్, ఫర్నిచర్ కూడా మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పనులు చాలా వరకు లోపభూయిష్టంగా ఉన్నట్లు నిర్ధారించిన విజిలెన్స్ కమిషన్ ఆ మేరకు నివేదిక కూడా అందజేసింది. కాంట్రాక్టర్ కొత్త పేచీ.. ఇదే సమయంలో బకాయి చెల్లిస్తే కానీ, మిగిలిన పనులు పూర్తి చేయబోమని కాంట్రాక్టర్ పేచీపెట్టారు. పనులను మధ్యలోనే నిలిపేశారు. నిమ్స్ డెరైక్టర్గా డాక్టర్ నరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీబీనగర్ నిమ్స్ నిర్మాణ పనులను సమీక్షించారు. తొలి దశలో భాగంగా 200 పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని భావించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ.60 కోట్లు మంజూరు చేసింది. చేసిన పనికంటే ఎక్కువ చెల్లింపు.. మధ్యలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని సదరు కాంట్రాక్టర్ను డెరైక్టర్ నరేంద్రనాథ్ కోరగా, పెండింగ్ బకాయితో పాటు ముందస్తుగా మరో రూ.6 కోట్లు చెల్లిస్తేనే మిగిలిన పనులు పూర్తి చే స్తామని స్పష్టం చేయడంతో ఇదే అంశంపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తై పనులు, చేసిన చెల్లింపులపై అధ్యయనం చేయించాలని భావించింది. ఆ మేరకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్చీఫ్ కొండలరావు నేతృత్వంలోని ముగ్గురు రిైటె ర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు మాసాలు శ్రమించి నిర్మాణానికి సంబంధించిన పనులను కాంట్రాక్టర్ సమక్షంలోనే పరిశీలించింది. చేసిన పనికంటే కాంట్రాక్టర్కు అధికంగా చెల్లించినట్లు స్పష్టంచేసింది. ఈ విషయంపై సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం కొసమెరుపు. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే... స్థానికుల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తొలివిడతగా 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని భావిం చారు. ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనర ల్ మెడిసిన్, జనరల్ సర్జరీలాంటి వివిధ విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్స్రే, సీటీ, ఎంఆర్ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 6 నెలలు పడుతుంది.. నిర్మాణ పనుల్లో చాలా లోపాలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా అందజేసింది. గతంలో పని చేసిన కొంత మంది అధికారులు చేసిన పనికంటే అదనంగా కాంట్రాక్టర్కు చెల్లించినట్లు కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరితే చేయని పనులకు ముందే డబ్బు చెల్లించాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ పేచీ పెడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కాంట్రాక్టర్తో చర్చించాం. ఎంత చెప్పినా వినకుండా ఆయన కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్తో మళ్లీ చర్చించి ఓ నిర్ణ యం తీసుకుంటాం. ప్రస్తుతం పనులు ప్రారంభిస్తే కానీ మరో6 నెలల తర్వాత సేవలు అందుబాటులోకి రాని దుస్థితి. - డాక్టర్ నరేంద్రనాథ్, డెరైక్టర్ నిమ్స్ -
ఎన్పీడీసీఎల్ తీరే వేరయా!
పనులు చేయలేదని కాంట్రాక్టర్కు నోటీసులు బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరిక అయినా.. అతడికే మరో పని అప్పగింత పద్ధతి మార్చుకోని సదరు కాంట్రాక్టు సంస్థ మొదలుకాని రూ.4 కోట్ల పనులు తలపట్టుకుంటున్న ఉన్నతాధికారులు హన్మకొండ, న్యూస్లైన్ : చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు ఉంది... ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారుల తీరు. ఆ కాంట్రాక్టర్ పది లక్షల రూపాయల పని చేయలేడని తెలిసీ.. అతడికే మళ్లీ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఆయన పద్ధతి మార్చుకోకపోవడం... పనులు ముందుకు సాగకపోవడంతో సదరు అధికారులు ఏం చేయూలో తోచక తలపట్టుకుంటున్నారు. తమ మీదకు వస్తుందనే కారణంతో సదరు కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెడుతున్నట్లు నోటీసులు జారీ చేసి చేతులుదులుపుకున్నారు. ఇది ఎన్పీడీసీఎల్లో వివాదంగా మారడమే కాకుండా... ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే పనులు చేయడు మొర్రో అంటూ కన్స్ట్రక్షన్ విభాగం అధికారులు నెత్తీనోరూ బాదుకున్నా... ఆయ న్ను తీసుకొచ్చి అందలమెక్కించడమెందుకు... ఆ తర్వాత తలపట్టకోవడం ఎందుకని విమర్శిస్తున్నారు. అసలేమిటంటే... ఎన్పీడీసీఎల్లో హైవోల్టేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టం (హెచ్వీడీఎస్) పనుల్లో భాగంగా హైదరాబాద్కు చెందిన యూడబ్ల్యూటీ సంస్థకు రూ. 40 లక్షల పనులు అప్పగించారు. అంతకుముందు ఖమ్మంలో ఈ సంస్థ పలు పనులు చేసింది. చా లా నిర్లక్ష్యంగా... ఆలస్యంగా పను లు చేయడం తో సదరు కాంట్రాక్టర్పై ఉన్నతాధికారులకు అక్కడి అధికారులు ఫిర్యాదు చేశారు. అంతేకా దు... పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ రెండేళ్ల కిందట మొదలుపెట్టిన పనులు ఇంకా ముం దుకు సాగడం లేదు. ఈ సం స్థ పరిధిలో చేస్తు న్న పనులన్నీ ఇలాగే ఆలస్యమవుతున్నాయి. అధికారులు నోటీసులివ్వడం.. అవి అందిన వారం రోజులు ఏదో పని చేయడం... బిల్లు తీసుకోవ డం... పనులు ఆపేయడం పరిపాటి గా మారింది. అయినప్పటికీ ఆ సంస్థపై ఎన్పీడీసీఎల్ అధికారులు మళ్లీ మక్కువ చూపించారు. వరంగల్ సర్కిల్ పరిధిలో సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సంబంధించి ధరలు పెంచాలని బె ట్టు చేస్తున్న స్థానిక కాంట్రాక్టర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశం తో యూడబ్ల్యూటీ సంస్థ ప్రతినిధులను పిలిచి మరీ.. అందలమెక్కించారు. ఆ సంస్థతో ఈ ఏడాది ఏ ప్రిల్లో టెండర్ వేయించి ఏకంగా రూ. 4 కోట్ల పని అ ప్పగిం చారు. ఒక్క ప్యాకేజీ (4 సబ్స్టేషన్లు) పనులను క ట్టబెట్టారు. కానీ... ఇప్పటివరకు ఒక్క పనీ మొదలుకాలేదు. ఇప్పుడిలా... సబ్స్టేషన్ల కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత.. అధికారులకు పాత పనులు గుర్తుకొచ్చారుు. రెండేళ్ల క్రితం యూడబ్ల్యూటీ సంస్థ చేపట్టిన హెచ్వీడీఎస్ పనులు పూర్తికాకపోవడంపై నో టీసులు జారీ చేశారు. బ్లాక్లిస్టులో ఎందుకు పెట్టరాదని పేర్కొంటూ నెలరోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని 20 రోజుల క్రితం నోటీసులి చ్చారు. గడువు దాటినా... సదరు కాంట్రాక్టర్ ఇప్పటివరకూ సమాధానం ఇవ్వకపోవడం గ మనార్హం. అయినా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అటవీశాఖకు టోపీ!
భద్రాచలం, న్యూస్లైన్: తునికాకు సేకరణ టెండర్లు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ బినామీ వ్యక్తుల పేరుతో నకిలీ బాండ్లను సృష్టించి అటవీశాఖకు కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.1.38 కోట్ల విలువైన డిపాజిట్లను కోల్కతలోని ఓ బ్యాంకులో తెరిచినట్లు చూపించి ఆ శాఖాధికారులకు బురిడీ కొట్లాడు. అటవీశాఖలోని కొంతమంది అధికారుల అండదండలతోనే ఈ మొత్తం వ్యవహారం సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటవీశాఖలో తొలిసారిగా జరిగినట్లు చెబుతున్న ఈ మాయాజాలం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే... భద్రాచలం నార్త్ డివిజన్లోని ఆర్లగూడెం, సౌత్ డివిజన్లోని ఏడుగురాళ్లపల్లి యూనిట్ పరిధిలో 2012 సంవత్సరానికి సంబంధించి తునికాకు సేకరణ టెండర్లను వరంగల్ జిల్లాలోని రేగొండ మండ లానికి చెందిన ఓ నలుగురు వ్యక్తులు దక్కించుకున్నారు. అప్పట్లో ఓ పేరుమోసిన తునికాకు కాంట్రాక్టర్.. నలుగుర్ని బినామీలుగా పెట్టుకొని తనికాకు సేకరించారు. భద్రాచలం సౌత్, నార్త్ డివిజన్లలో నాణ్యమైన తునికాకు లభిస్తుంది. ప్రతియేటా లక్ష్యానికి మించి ఆకు సేకరించేది ఈ యూనిట్లలో మాత్రమే. రూ.1.38 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ను అటవీశాఖకు పూచీకత్తుగా పెట్టారు. సదరు కాంట్రాక్టర్లు పెట్టిన ఎఫ్డీఆర్లు నకిలీవని తేలడంతో తేరుకున్న అటవీశాఖాధికారులు దీనిపై ఉన్నతాధికారులకు నివేదించారు. వెలుగులోకి వచ్చింది ఇలా.. 2012 సంవత్సరంలో ఏడుగురాళ్లపల్లి, ఆర్లగూడెం యూనిట్ పరిధిలో కొంత తునికాకు మిగిలిపోయింది. దానిని భద్రాచలం గోదాంల్లోనే నిల్వ చేశారు. అమ్ముడుపోని తునికాకుకు ఇచ్చిన డిపాజిట్లను రెన్యువల్ చేయాలని సదరు కాంట్రాక్టర్లు అటవీశాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే డీఎఫ్వోలకు ఈ బాండ్లపై అనుమానం వచ్చి వీటిని తీసిన కోల్కతలోని బ్యాంకు అధికారులకు నిర్ధారణ కోసం పంపించారు. అవి నకిలీవని తేలింది. కాంట్రాక్టర్లు తమను మోసిగించినట్లుగా భావించిన భద్రాచలం నార్త్, సౌత్ డీఎఫ్వోలు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అటవీశాఖాధికారుల సహకారంతో వరంగల్ జిల్లాలోని రేగొండ మండలానికి చెందిన బినామీ కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు భార్యభర్తలున్నట్లు సమాచారం. రెండేళ్ల పాటు ఏం చేసినట్లు.. బినామీ పేర్లతో కాంట్రాక్టులు దక్కించుకొని కోట్లలో నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చినా అటవీ శాఖాధికారులు వీటిని గుర్తించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏదైనా కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నప్పుడు పూచీకత్తుగా సమర్పించిన డీడీ లేదా ఎఫ్డీఆర్లను సదరు శాఖాధికారులు నిర్ధారించుకోవాలి. 2012లో వీటిని కాంట్రాక్టర్లు అటవీశాఖకు అందజేసినా..సదరు అధికారులు ఎఫ్డీఆర్లను నిర్ధారించుకోవడం కోసం కోల్కతలోని బ్యాంకు అధికారులకు భద్రాచలం కార్యాలయం నుంచి లేఖలు పంపారని సమాచారం. కోల్కతలోని బ్యాంకు అధికారులు ఇవన్నీ సక్రమమేనని భద్రాచలం అటవీశాఖ అధికారులకు లేఖ పంపారు. ఈ లేఖల పరంపరను గమనించిన ప్రస్తుత అధికారులు అన్నీ నకిలీ పత్రాలేనని గుర్తించినట్లు తెలిసింది. ఈ తతంగమంతా అప్పటి అధికారులకు తెలియకుండానే జరిగిందా? ఒకవేళ తెలిస్తే ఎందుకు ధ్రువీకరించలేకపోయారు? ఇలాంటి సవాలక్ష సందేహాలెన్నో వస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం : రాజశేఖర్రావు, నార్త్ డీఎఫ్వో, భద్రాచలం ఫిక్స్డ్ డిపాజిట్లను రెన్యువల్ చేసే క్రమంలో బ్యాంకు అధికారులకు పంపించాం. అప్పుడే అవి నకిలీవని తేలింది. అవి ఇచ్చిన కాంట్రాక్టర్లపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. వారి విచారణలోనే వాస్తవాలు వెల్లడవుతాయి. విచారణ వేగవంతం చేశాం : ప్రకాష్రెడ్డి, ఏఎస్పీ, భద్రాచలం అటవీశాఖాధికారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించాం. ఎఫ్డీఆర్లు వాస్తవమైనవేనని కోల్కతలోని బ్యాంకు అధికారుల నుంచి కూడా లేఖలు ఉన్నాయి. అవికూడా నకిలీగా తేలటంతో దీనిలో బ్యాంకు అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. -
గోడ రేపిన చిచ్చు
ఇంటికి దారి మూసేశారని మనస్తాపం యువకుని ఆత్మహత్యా యత్నం చావుబతుకుల్లో ఉన్నా దారివ్వని వైనం! రావికమతం, న్యూస్లైన్ : తన ఇంటికి రహదారి సౌకర్యం లేకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నారంటూ మనస్థాపం చెందిన ఇంటి యజమాని కుమారుడు శానాపతి కిశోర్ (31) బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. చావుబతుకుల్లో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేందుకూ ఆ గోడపై నుంచి వెళ్లనీయకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రావికమతం నడిబొడ్డున బుధవారం జరిగిన సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. రావికమతం మండల పరిషత్ ప్రహరీని ఆనుకుని పడమరభాగంలో శానాపతి శ్యామల అనే ఆమె కొన్నేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నారు. భర్త, పిల్లలతో నివాసం ఉంటున్నారు. సర్వే నంబరు 106/1లో ఉన్న ఈ స్థలంలో ఈశాన్య భాగంలో నర్సీపట్నం-భీమునిపట్నం రహదారి ఉంది. వీరి ఇంటికీ, బీఎన్ రోడ్డుకు మధ్య కొంత ప్రభుత్వ స్థలం ఉంది. శ్యామల ఇంటికి అదే రహదారిగా ఉండేది. ఆ ఖాళీ స్థలాన్ని ఒక సామాజిక భవనం నిర్మాణానికి స్థానిక సంఘాల సభ్యులు మంజూరు చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వివాదం కోర్టుకు కూడా వెళ్లింది. పరిస్థితి ఇలా ఉంటే, మంగళ, బుధవారాల్లో ఆయా సంఘాల సభ్యులు ఆ స్థలంలో ప్రహరీ నిర్మించారు. శ్యామల ఇంటికి రహదారిలేకుండా పోయింది. దీంతో తమ ఇంటిలోనే తాము గృహ నిర్మాణంలో ఉన్నామంటూ శ్యామల కుమారుడు కిశోర్ తీవ్ర ఆవేదనకు లోనై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు వచ్చి కిశోర్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఎత్తై గోడ నిర్మించడం, పైగా ఆ గోడపై నుంచి తరలించవద్దంటూ పలువురు అడ్డుకోవడంతో చివరకు అపస్మారక స్థితిలోఉన్న కిశోర్ను మండల పరిషత్ గోడపై నుంచి అతిప్రయాసతో దాటించి 108లో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారు అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. అధికారుల విచారణ ఈ సంఘటనపై తహశీల్దార్ రోజా, రావికమతం ఎస్ఐ సురేష్కుమార్ రావికమతం వచ్చి ఇరువర్గాలనూ విచారించారు. జిల్లా కలెక్టర్ తమకు మూడున్నర సెంట్లు స్థలం కేటాయించారని, తమ స్థలంలో నిర్మాణం చేపట్టామని, తమకు అన్ని ఆధారాలున్నాయని పలువురు సంఘ సభ్యులు వారికి వివరించారు. ఆస్పత్రికి తీసుకుకువెళ్లడాన్ని మాత్రం అడ్డుకోలేదన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఎన్నికలయ్యే వరకూ ఏవిధమైన పనులూ చేయవద్దని వారు ఇరువర్గాలకూ హెచ్చరించారు. -
కొండంత నష్టం
దుర్గగుడికి లక్షలు ఎగ్గొడుతున్న కాంట్రాక్టర్లు కొమ్ముకాస్తున్న లీగల్ విభాగం సిబ్బంది భారీగా చేతులు మారుతున్న సొమ్ము పట్టించుకోని ఉన్నతాధికారులు ఇంద్రకీలాద్రిపై కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. వారికి అధికారులు, సిబ్బంది తొత్తులుగా మారి అమ్మవారి ఆదాయానికి లక్షల్లో నష్టం వస్తున్నా పట్టించుకోవడం లేదు. దేవస్థానానికి లక్షలాది రూపాయలు ఎలా ఎగ్గొట్టొచ్చో లీజెస్, లీగల్ విభాగాల సిబ్బందే చెబుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు అమ్మవారికి లక్షల రూపాయల నష్టం చేకూర్చగా.. తాజాగా మరో కేసు వెలుగుచూసింది. సాక్షి, విజయవాడ : గత ఏడాది చెప్పుల స్టాండ్కు జరిగిన వేలంపాటలో రూ.62 లక్షలకు టెండర్ను ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. 2013 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు చెప్పుల స్టాండ్ అద్దెకిచ్చారు. వేలంలో టెండర్ దక్కగానే సగం, ఆరు నెలలలోపు మిగిలిన సగం చెల్లించాల్సి ఉంది. తొలుత ఆ కాంట్రాక్టర్ రూ.32 లక్షలు చెల్లించారు. మిగతా సొమ్ము ఇంకా చెల్లించలేదు. వచ్చే నెల 31వ తేదీతో కాంట్రాక్టు ముగుస్తుంది. వాస్తవానికి గత సెప్టెంబర్ నెలాఖారులోగా రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టు కాలపరిమితికి రెండు నెలలే వ్యవధే ఉండడంతో దేవస్థానానికి రూ.30 లక్షలు చెల్లించడానికి ఆ కాంట్రాక్టర్ సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది. లీజెస్, లీగల్ విభాగంలోని అవినీతి అధికారులు, సిబ్బంది వల్లనే నాలుగు నెలలుగా లీజు చెల్లించకుండా కాంట్రాక్టర్ కొనసాగాడని బహిరంగ విమర్శలు వస్తున్నాయి. బ్యాంకు గ్యారెంటీ ఇవ్వని చీరల కాంట్రాక్టర్ అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను తీసుకునేందుకు గత ఏడాది నవంబర్లో వేలం జరిగింది. నగరానికి చెందిన మరో కాంట్రాక్టర్ రూ.1.85 కోట్లకు కాంట్రాక్టు ద క్కించుకున్నారు. ఇందులో రూ.95 లక్షలు వెంటనే చెల్లించారు. మిగిలిన మొత్తానికి బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. అయితే ఇప్పటికీ ఇవ్వలేదని సమాచారం. రూ.90 లక్షలకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకుండా ఉండేందుకు నెలకు రూ.2 లక్షలు లీజెస్, లీగల్ సెక్షన్ సిబ్బందికి మామూళ్లుగా ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా క్లోక్ రూమ్కు టెండర్లు పిలిచారు. ఆ కాంట్రాక్టర్ అధికారులకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకుండా మామూళ్లు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దుకాణాల లీజు చెల్లించడం లేదు.. గతంలో టోల్గేట్ కాంట్రాక్టర్ ఒకరు దేవస్థానానికి రూ.25 లక్షలు ఎగనామం పెట్టగా, క్లోక్రూమ్ కాంట్రాక్టు తీసుకున్న ఒకరు రూ.3.5 లక్షలు ఎగ్గొట్టారు. దే వస్థానం పరిధిలో 25 వరకు దుకాణాలున్నాయి. ఒక్కొక్కదానికి సుమారుగా రూ.50 వేలు నెలసరి అద్దె చెల్లించాల్సి ఉంది. అయితే ఆ అద్దె కూడా చెల్లించకుండా కోర్టులో కాంట్రాక్టర్లు కేసు వేశారు. కొన్ని దుకాణాల కాంట్రాక్టర్లు నెలకు రూ.2 లక్షలకు సబ్లీజుకు కూడా ఇచ్చేశారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి కూడా దుకాణం ఉండడం విశేషం. ఒకవైపు నెలకు రెండు లక్షలు అప్పనంగా వస్తున్నా, మరోవైపు అమ్మవారి దేవస్థానానికి చెల్లించడానికి వీరి మనసొప్పడం లేదు. అధికారులు లీజు చెల్లించాలని నోటీసు ఇవ్వగానే కోర్టుకు వెళ్లడం కాంట్రాక్టర్లకు పరిపాటైంది. ఇంటిదొంగలున్నారు.. దేవస్థానం లీగల్, లీజెస్ విభాగంలో పనిచేసే కొంతమంది సిబ్బంది కాంట్రాక్టర్లు నుంచి లక్షలు రూపాయలు లంచాలుగా తీసుకుని దేవస్థానానికి డబ్బు ఏ విధంగా ఎగ్గొట్టవచ్చో సలహాలు ఇస్తున్నారు. హైదరాబాద్లో ఏ న్యాయవాదిని సంప్రదించాలి, కేసు ఏ విధంగా వేయాలో సూచిస్తున్నారు. గతంలో కాంట్రాక్టర్లు వేసిన కేసుల వివరాలు, కోర్టు ఇచ్చిన తీర్పు పాఠం కూడా వీరే అందిస్తారని సీనియర్ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తరువాత కాంట్రాక్టర్కు అనుకూలంగా వీరే నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు ఇస్తార ని సమాచారం. లీగల్ సెక్షన్ను సమూలంగా ప్రక్షాళన చేస్తే కాని అమ్మవారి ఆదాయం పెరగదు. చర్యలుంటాయి.. నేను ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చెప్పుల స్టాండ్ కాంట్రాక్టర్ బకాయి ఉన్నట్లు తెలుసుకుని అతడికి లీగల్ నోటీసు ఇచ్చి బకాయి రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించా. చీరల కాంట్రాక్టర్ నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని చెప్పాను. సకాలంలో లీజులు వసూలుచేయని వారిపై చర్యలు తీసుకుంటాం. -వి.త్రినాథరావు, ఇన్చార్జి ఈవో -
ఆ కాంట్రాక్టరంటే ‘ఆరో’ప్రాణం!
‘పులిచింతల’ నిర్మాణ గడువును ఆరోసారి పొడిగించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్పై ప్రభుత్వం ప్రత్యేక ప్రేమ చూపుతోంది. గత డిసెంబర్లోనే నిర్మాణ గడువు ముగిసినప్పటికీ మళ్లీ మార్చి వరకు గడువు పొడిగించింది. పులిచింతల గడువు పెరగడం ఇది ఆరోసారి. సీఎం గత నెలలోనే ప్రాజెక్టును ప్రారంభించి, అదనపు నిధులు ఇవ్వడానికీ ముందుకొచ్చారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో మంత్రి సుదర్శన్రెడ్డి గడువును పొడిగించారు. నిజానికి ఈ ప్రాజెక్టు మూడేళ్ల కిందటే పూర్తి కావాలి. కేవలం చీఫ్ ఇంజనీరు లేఖ ఆధారంగా: ప్రాజెక్టు నిర్మాణ గడువును పొడిగించాలంటే ప్రత్యేక పద్ధతి పాటించాలి. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు గడువు పెంపును ప్రతిపాదిస్తే, ఇంజనీర్ల కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. అప్పుడు గడువు పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరిస్తుంది. అయితే పులిచింతల విషయంలో ఈ ప్రక్రియను పక్కన పెట్టారు. చీఫ్ ఇంజనీరు లేఖ ఆధారంగా మంత్రి గడువు పెంపునకు ఆమో దం తెలిపారు. కాగా, అదనపు నిధుల కోసం కాంట్రాక్టరే నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అదన పు చెల్లింపులను చేసింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని కూడా గతంలో ప్రకటించింది. అయితే ఆచరణలో మాత్రం మాట నిలబెట్టుకోలేదు. -
‘కలుగొట్ల’...ఎప్పట్లా..!
ముఫ్పైఏళ్లుగా తపిస్తుంటే ఏర్పాటైన పథకం. పనులు పూర్తయితే ఇంకేం నీటి కష్టాలు తీరినట్లే అనుకున్నారు అలంపూర్ చౌరస్తా వాసులు. కాంట్రాక్టర్ మాత్రం పైపు లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. దీనితో నీటికి పాత పాటే. అదీ ఇబ్బందుల మధ్యే. ఇప్పుడు కలుషిత జలాలే గత్యంతరం. ఈ అవస్థలు తీర్చే మార్గం కోసం నిరీక్షిస్తున్నారు. నీటి పరీక్షకు తట్టుకోలేక పోతున్నారు. అలంపూర్, న్యూస్లైన్ : ఎన్నో విన్నపాల ఫలితంగా రూపుదిద్దుకున్న కలుగొట్ల తాగునీటి పథకం పూర్తయినా ఇళ్లకు కనెక్షన్లు ఇ వ్వకపోవడంతో అసలు ఉద్దేశం ఆమడ దూ రంలోనే ఉండి పోయింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ పనులైతే పూర్తి చేశారు. కానీ కొత్త పైప్లైన్లకు కనెక్షన్ ఇచ్చి దాని ద్వార నీటిని సరఫ రా చేయాల్సిన బాద్యతలను విస్మరించారు. దీంతో ఎప్పటిలాగే అలంపూర్ చౌరస్తా ప్రజలు, ప్రయాణీకులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు సరఫరా అవుతున్న నల్లా ద్వార నీళ్లు తెచ్చుకుందామని ఆశించినా పైప్లైన్ లీకేజితో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచింది. నిర్వహణ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో చివరకు పుల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్పందించి లీకేజిలకుకక మరమ్మత్తులు చేపట్టడంతో స్థానికులకు ఊరట లభించింది. కానీ కలుషిత నీటి బాధలు మాత్రం ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రూ. 6.50 లక్షలతో అదనపు పైప్లైన్ నియోజకవర్గ కేంద్ర బిందువుగా జాతీయరహదారి అడ్డాగా ఉన్న అలంపూర్ చౌరస్తాకు కలుగొట్ల తాగునీటి పథకం నుంచి తాగునీ టిని అందిస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం నాలుగు రోడ్ల కూడలిలో ఒక్క వైపు మాత్ర నల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో మిగిలిన కాలనీలకు నీటి సరఫరా లేక నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మిగిలిన రోడ్లలోని కాలనీలకు తాగునీటిని అందించడానికి అనువుగా వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.6.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు రోడ్ల కూడలిలోని కాలనీలకు నీటి సరఫరా నిమిత్తం 428 మీటర్ల పైప్లైన్ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న పాత పైప్లైన్ నుంచి కనెక్షన్ ఇస్తే మిగిలిన కాలనీలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్ సాకులను చూపుతూ కనెక్షన్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. అటకెక్కిన బోరు మోటారు ప్రతిపాదన : అలంపూర్ చౌరస్తాలో పథకం నుంచి నీటి సరఫరా నిలిచిన సమయాల్లో ప్రత్యేక నిధులతో ప్రత్యాయ్నాంగా బోరు మోటారు వేయాల్సి ఉంది. ఇక్కడ ఫోరైడ్ నీళ్లు పడుతాయని బోరు వేసే ప్రతిపాదనను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే వేసవిలో స్థానికులకు తాగునీటి కష్టాలు తప్పవని అందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చౌరస్తాకు సమీపంలోనే ఎక్కడో ఒక చోట బోరు మోటారు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే నీటి కోసం చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపును పరిశీలించిన జేఈ గత కొంత కాలంగా కలుషిత నీరు సరఫరా అవుతోందని, కొత్త పెప్లైన్కు కనెక్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆర్డబ్లుఎస్ జేఈ కృష్ణయ్య మంగళవారం అలంపూర్ చౌరస్తాలో చేసిన పైప్లైన్ పనులను పరిశీలించారు. సంపులో కలుషితమైన నీటి గురించి స్థానికులు వివరించారు. సంపు భూమికి సమాంతరంగా ఉండంతో కప్పలు, ఇతర జంతువుల కళేబరాలు, పురుగులు అందులో పడి నీరు కలుషిత మవుతున్నట్లు వెల్లడించారు. పాత పైప్లైన్ లీకేజిల కారణంగా గత ఐదు రోజులుగా నీళ్లు బందయినా నిర్వాహకులు పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి నిరంతరంగా నీటి సరఫరా చేయాలని కోరారు. -
‘టెయిల్పాండ్’ పనులకు ఆటంకం
అడవిదేవులల్లి(దామరచర్ల), న్యూస్లైన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో మండలంలోని అడవిదేవులపల్లి గ్రామశివారులో చేపట్టిన టెయిల్పాండ్ ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. డ్యాంపై నుంచి సుమారు 10ఫీట్ల ఎత్తులో వరద పోటెత్తడంతో చేపట్టిన పనులన్నీ దెబ్బతిన్నాయి. నాగార్జునసాగర్ డ్యాంకు దిగువన 21 కిలోమీటర్ల దూరంలో మండలంలోని అడవిదేవులపల్లి గ్రామ శివారులో రూ.474 కోట్ల తో టెయిల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను 2006లో చేపట్టారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా వంతెన నిరించాల్సి ఉంది. 20 పిల్లర్లు, 21 గేట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు 2009లో పూర్తికావాలి. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కొంత మేర పనిచేశాడు. నిధులు సరిపోవడంలేదని వీటిని పెంచితేనే కొనసాగిస్తామని 2012 అక్టోబర్లో పనులు నిలిపివేశాడు. రూ.700కోట్లు కేటాయిస్తేనే పనులు చేపడతామన్నాడు. దీంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ చేసిన ప్రతిపాదనకు జెన్కో అధికారులు అంగీకరించడంతో 2013 మేలో తిరిగి పను లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 21క్రస్ట్గేట్లకు గాను 8 గేట్లు పూర్తయ్యాయి. 20 పిల్లర్ల పనులు పూర్తిచేశారు. ప్రాజెక్టుపై వంతెన పనులు కొనసాగుతున్నాయి. 50మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కూలిన కాపర్ డ్యాం నైరుతి రుతుపవనాల వల్ల కురిసిన వర్షాల కారణంగా నాగార్జునసాగర్ డ్యాం నిండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 1న టెయిల్పాండ్ ప్రాజెక్టు వరద తాకిడికి గురికావడంతో పనులకు ఆటం కలిగింది. అలాగే ఇటీవల తుపాను వల్ల కురిసిన వర్షంకారణంగా కూడా భారీ వరదలు వచ్చాయి. డ్యాంపై నుంచి సుమారు 8ఫీట్ల ఎత్తులో నీరు ప్రవహించింది. అయితే సుమారు 100 రోజుల నుంచి పనులు నిలిచిపోయాయి. అయితే కృష్ణానదిలోని నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన కాపర్డ్యాం ఎగువ, దిగువ భాగాల్లో కొంత కూలిపోయింది. అలాగే డ్యాం దిగువన వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరదల వల్ల కొట్టుకుపోయింది. భారీ క్రేన్ వరదల తాకిడికి ధ్వంసమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కొట్టుకుపోయింది. ఇదిలా ఉండగా వరద తాకిడికి గురై కూలిపోయిన కాపర్డ్యాం పనులు, ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా వారం రోజుల్లో ప్రాజెక్టు పనులు పునఃప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఏడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం - పీడీవీఎల్ కుమార్, ప్రాజెక్టు ఎస్ఈ డ్యాం నిర్మాణ పనులను 2014 జూలై 31నాటికి పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ పీడీవీఎల్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. 21 క్రస్ట్గేట్లలో 8 గేట్లు పూర్తికాగా 13గేట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టుపై వంతెన నిర్మాణ పనుల వేగవంతంగా చేపడతామన్నారు. వంతెనపై 20 వెంట్లలో 12 వెంట్లు పూర్తయినట్లు చెప్పారు. -
జిలెటిన్ స్టిక్స్ పేలి.. ముగ్గురు చిన్నారులకు గాయాలు
నవాబుపేట, న్యూస్లైన్: జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు బాలురు గాయపడ్డారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన శనివారం నవాబుపేట మండల పరిధిలోని కేశవపల్లి తండాలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపల్లి తండా నవాబుపేట -వికారాబాద్ ప్రధాన మార్గంలో ఉంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్కు మంజీరా నీళ్ల తరలింపు కోసం రెండో విడత పైపులైన్ పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ చేస్తోంది. ఈ క్రమంలో వారం క్రితం కేశవపల్లి తండాగుండా పైపులైన్ వేసే క్రమంలో బ్లాస్టింగ్ చేశారు. ఘటనా స్థలంలో కొన్ని జిలెటిన్ స్టిక్స్ అలాగే మిగిలిపోయాయి. శనివారం గ్రామానికి చెందిన చిన్నారులు నవీన్(10), సాయి(10), గోబ్రానాయక్ కొడుకు మధు(8)లు బ్లాస్టింగ్ చేసిన స్థలంలో ఆడుకుంటున్నారు. పిల్లలకు జిలెటిన్ స్టిక్స్ తీగలు లభించడంతో వాటిని గ్రామంలోకి తీసుకెళ్లి ఆడుకుంటున్నారు. బాలురు జిలెటిన్ స్టిక్స్ తీగలను రాళ్లకు రాపిడి చేయడంతో అవి శబ్ధంతో పేలిపోయాయి. దీంతో భూమిపై ఉన్న ఇసుక, చిన్నరాళ్లు ఎగిరి ముగ్గురు పిల్లలకు బలంగా తగిలాయి. ప్రమాదంలో ముగ్గురు బాలురు గాయపడ్డారు. గ మనించిన గ్రామస్తులు వెంటనే వారిని వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సాయి, నవీన్లకు తల్లిదండ్రులు లేరు. సాయి వికారాబాద్లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్నాడు. దసరా పండగకు అవ్వ కమలమ్మ వద్దకు వచ్చాడు. నవీన్ పెద్దమ్మ రుక్కిబాయి వద్ద ఉంటున్నాడు. పిల్లలకు పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. తల్లిదండ్రులు లేని సాయి, నవీన్లను చూసి అ య్యో.. పాపం అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఎస్ఐ లింగయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే.. ప్రధాన రోడ్డుకు అతి సమీపంలో బ్లాస్టింగులు చేస్తున్నా పైపులైన్ కాంట్రాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలంలో మిగిలిన జిలెటిన్ స్టిక్స్ను అలాగే వదిలేయడంతో ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వెలగని వీధి దీపాలు
సాక్షి, ముంబై: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలుగులు విరజిమ్మటం లేదు. వీటి బాధ్యతలను పర్యవేక్షించే కాంట్రాక్టర్ కాల పరిమితి ముగిసిందని పట్టించుకోకవడంతో అనేక ప్రాంతా లు అంధకారమయంగా మారాయి. గణేశ్ ఉత్సవాల వేడుకలు కూడా చీకట్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నా రు. రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. కొలాబా, సైన్-మాహిమ్లోని దాదాపు 416 వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్ట్ గడువు ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ముగిసింది. దీంతో ఆ తర్వాత వీధి దీపాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బెస్ట్ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఈ 416 వీధి దీపాల నిర్వహణ బాధ్యత 2012 సెప్టెంబర్ నుంచి 2013 ఆగస్టు 31 వరకు ఉంది. అయితే కాంట్రాక్ట్ గడువును పునరుద్దరించే ప్రక్రియ సుదీర్ఘమైనది. చాలా ఆమోదాలు అవసరం ఉండడంతో దీని గడువు పునరుద్ధరించలేకపోయారు. బెస్ట్ సంస్థ దాదాపు 39, 700 వీధి దీపాలను నిర్వహిస్తోంది. అయితే ఇందు లో చాలా వీధి దీపాలు కొత్తవి. ఇందులో 416 వీధి దీపాల కాంట్రాక్టు గడువు ఆగస్టులో ముగిసింది. అయితే గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఈ వీధులు ప్రకాశవంతంగా కనిపించాలని స్థానికులు పేర్కొం టున్నారు. అయితే వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి నెలకొని ఉంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వీధి దీపాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెస్ట్ అధికార ప్రతినిధి తంబోలి అన్నా రు. కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతను అప్పగించేవరకు పాత కాంట్రాక్టర్లే నిర్వహణ బాధ్యతను చూసుకుంటారని పేర్కొన్నారు. బెస్ట్ సంస్థ వీధి దీపాలకు బదులుగా ఎల్ఈడీ ల్యాంప్లను ఉపయోగించాల నే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీంతో కనీసం 40 శాతం విద్యుత్ ఆదా ఆవుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో కణేకల్లు ట్రాన్స్కో ఏఈ
ఉరవకొండ, న్యూస్లైన్ : ట్రాన్స్కో కణేకల్లు మండల అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) లక్ష్మిరెడ్డి శనివారం ఉరవకొండలో కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నారుు. అనంతపురం జిల్లా కణేకల్లు వుండలం ఎర్రగుడికి చెందిన అవుర్నాథ్ ట్రాన్స్కో కాంట్రాక్టర్. ఈయన కణేకల్లు వుండల పరిధిలో నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించారు. ఇందుకు సంబంధించి రూ.6 లక్షల బిల్లులు రావాల్సివుంది. ఎం.బుక్లో సంతకాల కోసం ఏఈ లక్ష్మిరెడ్డి వద్దకు వెళ్లగా రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇవ్వలేనని, రూ.15 వేలు ఇవ్వగలనని ఆయన అన్నారు. అయితే..లంచం ఇచ్చి బిల్లులు చేయించుకోవడం ఇష్టలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏఈని వల పన్ని పట్టుకోవడానికి వారు పథకం రూపొందించారు. అందులో భాగంగా శనివారం ఉరవకొండలోని ట్రాన్స్కో ఏడీఈ కార్యాలయుం వద్ద కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీతో పాటు సీఐలు గిరిధర్, ప్రభాకర్ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఏసీబీకి దొరికిన ట్రాన్స్కో ఏఈల్లో లక్ష్మిరెడ్డి రెండోవాడు. జనవరి 16న ఉరవకొండ ఏఈ వుహేష్ కూడా విద్యుత్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వుూడేళ్ల నుంచి కణేకల్లు మండలంలో పనిచేస్తున్న ఏఈ ఉరవకొండలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. -
పాత కక్షలతోనే కాంట్రాక్టర్ హత్య
జిన్నారం, న్యూస్లైన్ :పాత కక్షల కారణంగానే కాంట్రాక్టర్ గోగుల హన్మంతు హత్యకు గురైనట్లు రామచంద్రాపురం డీఎస్పీ మధుసూదన్రెడ్డి, సీఐ శ్రీనివాస్లు తెలిపారు. బుధవారం వారు బొల్లారం పోలీస్స్టేషన్లో హత్యకు గల కారణాలను విలేకరులకు వెల్లడించారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం గ్రామానికి చెందిన గోగుల హన్మంతు కొన్నేళ్లుగా బొల్లారంలో నివాసం ఉంటూ కాంట్రాక్టు పనులను చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే బొల్లారంలోనే నివాసముంటున్న అల్లుడు వేముల యాదయ్యతో హన్మంతుకు తరచూ గొడవ లు జరుగుతుండేవి. దీంతో ఏడాది క్రితం హన్మంతుపై హత్యాయత్నానికి యాదయ్య ఒడిగట్టాడు. చేసేది లేక హన్మంతు హైదరాబాద్లోని ఉప్పల్కు మారాడు. ఎప్పటికైనా తనను యాదయ్య చంపుతాడని హన్మంతు భయపడేవాడు. ఈ క్రమంలో యాదయ్యను చంపాలంటూ తన స్నేహితుడైన రాజుతో రూ. 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బు కూడా యాదయ్యకు ఇచ్చేశాడు. ఈ డబ్బుతో రాజు ఓ ఎయిర్ తుపాకీ తీసుకువచ్చి యాదయ్యను చంపుతానని నమ్మించాడు. అయితే నెల రోజులవుతున్నా యాదయ్యను ఎందుకు చంపటం లేదని రాజును హన్మంతు నిలదీశాడు. ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. దీంతో రాజు విసుగు చెంది విషయాన్ని యాదయ్యకు వివరించాడు. హన్మంతును చంపేస్తే నేనే నీకు రూ. 12 లక్షలు ఇస్తానని యాదయ్య, రాజుకు చెప్పాడు. దీంతో ఇద్దరి మద్య ఒప్పందం కుదిరింది. యాదయ్యను చంపానని రాజు.. హన్మంతును నమ్మించాడు. ఓ నాలుగు రోజులు మాకు రక్షణ కావాలని రాజు, హన్మంతును కోరాడు. దీంతో వారిని సిద్దిపేట శివారులోని ఓ ఫాంహౌస్లో ఉంచాడు. రాజుతో పాటు ఆయన స్నేహితులు గోలేటి రమేష్రెడి ్డ(మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామం), మల్లిక సంజీవరెడ్డి (వరంగల్ జిల్లా మద్దూర్ గ్రామం), నర్సింలు (సుల్తాన్పూర్)లు కూడా సిద్దిపేటకు వచ్చారు. యాదయ్య మృతదేహం ఎక్కడ ఉందో నాకు చూపించాలని హన్మంతు రాజును కోరారు. సుల్తాన్పూర్ శివారులోని ఓ ఫౌంల్ట్రీఫాంవద్ద యాదగిరి మృతదేహం ఉందని రాజు నమ్మించి హన్మంతును అక్కడకు తీసుకువ చ్చాడు. తీరా ఫాంహౌస్ వద్ద యాదయ్య మృతదేహం లేకపోవటంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు, అతని స్నేహితులు కలిసి హన్మంతు మెడకు ఉరేసి చంపారు. హన్మంతుకు చెందిన బొలేరో వాహనంలో అతని మృతదేహాన్ని ఉంచి, రింగు రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో భాగంగా హన్మంతు హత్యకు కారణమైన ఐదుగురిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మధుసూధన్రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి ఓ ఎయిర్తుపాకీ, రూ. 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
కాంట్రాక్టర్ దారుణ హత్య
జిన్నారం, న్యూస్లైన్ : కాంట్రాక్టర్ను ప్రత్యర్థులు తాడు తో ఉరేసి చంపి మృతదేహంతో పాటు బొలేరో వాహనాన్ని ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి కిందకు తోసేసిన సంఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. రామచంద్రాపురం డీఎస్పీ మధుసూదన్రెడ్డి, సీఐ శ్రీనివాస్ల కథనం మేరకు.. వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గోగుల హన్మంతు(40) భార్య, ముగ్గురి పిల్లలతో బతుకుదెరువు నిమిత్తం పదేళ్ల క్రితం మండలంలోని బొల్లారానికి వలస వచ్చారు. స్థానికంగా ఐడీఏ కాలనీలో నివాసం ఉంటూ సివిల్ కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. అయితే ఏడాది క్రితం బంధువులతో వచ్చిన గొడవల కారణంగా ఇటీవల హైదరాబాద్లోని ఉప్పల్ టెలిఫోన్ కాలనీకి మకాం మార్చాడు. హన్మంతు సివిల్ కాంట్రాక్ట్తో పాటు మట్టి వ్యాపారంతో పాటు జేసీబీ అద్దెకు ఇచ్చేవాడు. ఐడీఏ బొల్లారం, ఉప్పల్, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నాడు. అయితే సిద్దిపేటలోని సైట్లో వాటర్ పైప్లైన్ పగలడంతో మరమ్మతులకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి నుంచి తన బొలేరో(ఏపీ 23 ఎస్ 3232) వాహనంలో బయలుదేరాడు. రాత్రి 8 గంటలకు భార్య ఇద్దమ్మకు ఫోన్ చేసి సామగ్రితో సిద్దిపేటకు వెళుతున్నానని, రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా.. స్థానికులు శుక్రవారం ఉదయం 6 గంటలకు బొలే రో వాహనంలో వ్యక్తి మరణించి ఉన్నాడని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మధుసూదన్రెడ్డి, క్లూస్ టీమ్లు పరిశీలించారు. పాత కక్షల కారణంగానే తమ బంధువులే నా భర్తను హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఇద్దమ్మ ఆరోపించారు. మా నాన్న చనిపోలేదని, బతి కే ఉంటాడు అంటూ కూతుళ్లు నాగలక్ష్మి, నాగజ్యోతి, కుమారుడు నాగరాజు విలపించడం కలిచివేసింది. హన్మంతు భార్య ఇద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
కాంట్రాక్టర్ దారుణ హత్య
జిన్నారం, న్యూస్లైన్ : కాంట్రాక్టర్ను ప్రత్యర్థులు తాడు తో ఉరేసి చంపి మృతదేహంతో పాటు బొలేరో వాహనాన్ని ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి కిందకు తోసేసిన సంఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. రామచంద్రాపురం డీఎస్పీ మధుసూదన్రెడ్డి, సీఐ శ్రీనివాస్ల కథనం మేరకు.. వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గోగుల హన్మంతు(40) భార్య, ముగ్గురి పిల్లలతో బతుకుదెరువు నిమిత్తం పదేళ్ల క్రితం మండలంలోని బొల్లారానికి వలస వచ్చారు. స్థానికంగా ఐడీఏ కాలనీలో నివాసం ఉంటూ సివిల్ కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. అయితే ఏడాది క్రితం బంధువులతో వచ్చిన గొడవల కారణంగా ఇటీవల హైదరాబాద్లోని ఉప్పల్ టెలిఫోన్ కాలనీకి మకాం మార్చాడు. హన్మంతు సివిల్ కాంట్రాక్ట్తో పాటు మట్టి వ్యాపారంతో పాటు జేసీబీ అద్దెకు ఇచ్చేవాడు. ఐడీఏ బొల్లారం, ఉప్పల్, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నాడు. అయితే సిద్దిపేటలోని సైట్లో వాటర్ పైప్లైన్ పగలడంతో మరమ్మతులకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి నుంచి తన బొలేరో(ఏపీ 23 ఎస్ 3232) వాహనంలో బయలుదేరాడు. రాత్రి 8 గంటలకు భార్య ఇద్దమ్మకు ఫోన్ చేసి సామగ్రితో సిద్దిపేటకు వెళుతున్నానని, రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా.. స్థానికులు శుక్రవారం ఉదయం 6 గంటలకు బొలే రో వాహనంలో వ్యక్తి మరణించి ఉన్నాడని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మధుసూదన్రెడ్డి, క్లూస్ టీమ్లు పరిశీలించారు. పాత కక్షల కారణంగానే తమ బంధువులే నా భర్తను హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఇద్దమ్మ ఆరోపించారు. మా నాన్న చనిపోలేదని, బతి కే ఉంటాడు అంటూ కూతుళ్లు నాగలక్ష్మి, నాగజ్యోతి, కుమారుడు నాగరాజు విలపించడం కలిచివేసింది. హన్మంతు భార్య ఇద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
మంజూరు చేరోడ్ల నిధులు గుంతల పాలు!
సాక్షి, ముంబై: నగరంలో రోడ్ల మరమ్మతుల కోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా నిరుపయోగంగానే మారుతున్నాయి. బీఎంసీ పరిధిలో రోడ్లన్నింటినీ కాంక్రీట్ సిమెంట్(సీసీ) రోడ్లుగా మార్చాలని పరిపాలనా విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. కాని ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి తారురోడ్ల ఏర్పాటుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..నగర రహదారులను 1990 నుంచి సీసీ రోడ్లుగా మార్చడం ప్రారంభించారు. ప్రతీ యేటా 250 కి.మీ. సీసీ రోడ్లుగా మార్చాలని బీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం పనులు వేగంగా చేపట్టినట్లయితే నగరవాసులకు ప్రస్తుతం గుంతల సమస్య ఉండేదికాదేమో.. కాని బీఎంసీ అధికారులు సీసీ రోడ్ల పనులను పట్టించుకోకుండా తారు రోడ్ల నిర్మాణంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో ముంబైకర్లకు గుంతల బెడద తప్పడం లేదు. బీఎంసీ పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఏటా 250 కి.మీ. రోడ్లు సీసీగా తయారుకావాలి. కాని 1990 నుంచి ఇప్పటివరకు కేవలం 760 కి.మీ. మేర రోడ్లు సీసీగా మార్చారు. అంటే ఏడాదికి సుమారు 30 కి.మీ. రోడ్లు మాత్రమే సీసీ రోడ్లుగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ యేడు 433 కి.మీ. మేర రోడ్లను తారురోడ్లుగా మార్చాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అందుకు రూ.561 కోట్లు మంజూరు చేసింది. కాని ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు కాంట్రాక్టర్లు చేపట్టిన నాసి రకం పనులను బట్టబయలు చేస్తున్నాయి. సాధారణంగా తారు రోడ్ల జీవితకాలం ఏడేళ్లు ఉంటుంది. కాని ఇప్పుడు నిర్మిస్తున్న తారురోడ్లు ఒక ఏడాది కూడా మన్నికగా ఉండడం లేదు. గుంతలు పూడ్చేందుకు కోల్డ్ మిక్స్ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగిస్తున్నప్పటికీ ఫలితం ఉండటంలేదు. సీసీ రోడ్లు వేస్తే కొన్నేళ్ల వరకు వాటి వైపు చూడాల్సిన పనిలేదు. అదే తారు రోడ్లు వేస్తే ఏటా వర్షా కాలానికి ముందు, తర్వాత కూడా టెండర్లు ఆహ్వానించవచ్చు. తమకు ఎక్కువ శాతం కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్కు ఈ పనుల బాధ్యతలు కట్టబెట్టవచ్చనే ఉద్దేశంతోనే బీఎంసీ అధికారులు తారురోడ్ల నిర్మాణంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
కేంద్రీయ విద్యాలయ పనులు నెలరోజుల్లో పూర్తి చేయాలి
కడప కలెక్టరేట్, న్యూస్లైన్ :కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ శశిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం కడప నగరంలోని సింగపూర్ టౌన్షిప్ సమీపాన ఉన్న కేంద్రీయ విద్యాలయ భవనాలను, సిబ్బంది నివాస గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్యామ్సుందర్రావు విద్యాలయ భవన నిర్మాణాల గురించి కలెక్టర్కు వివరించారు. తమ విద్యాలయంలో 390 మంది విద్యార్థులున్నారని, రిమ్స్లో సమీపంలో 13.2 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.8.32కోట్లతో పనులు చేపట్టిందని పేర్కొన్నారు. కోల్కతకు చెందిన హిందూస్థాన్ స్టీల్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్కు పనులు అప్పగించామని, ఇప్పటి వరకు రూ.7.09కోట్లు ఖర్చు చేశారని వివరించారు. కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయని, నిర్మాణ వ్యయంలో 5శాతం అంటే రూ.40లక్షల నిధులను నిబంధనల మేరకు తమ వద్దే ఉంచామన్నారు. భవన నిర్మాణాలు పూర్తయి తమకు అప్పగించిన తర్వాత ఆ నిధులను కాంట్రాక్టర్కు చెల్లిస్తామని చెప్పారు. ఇందుకు కలెక్టర్ శశిధర్ స్పందించి ఏజెన్సీ హెచ్ఎస్సీఎల్ మేనేజర్తో మాట్లాడుతూ భవన నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని ప్రశ్నించారు. ఇందుకు మేనేజర్ బదులిస్తూ మిగిలిన నిధులు మంజూరు చేస్తే రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు. దీంతో ప్రిన్సిపాల్, ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భవన నిర్మాణం సక్రమంగా జరిగిందో లేదో సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులైన ఆర్అండ్బీ ఈఈ, పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ అధిపతి వచ్చే మంగళవారం తనిఖీ చేస్తారన్నారు. వారికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాాజేందర్సింగ్, విజయ్కుమార్రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ అధిపతి రాఘవరెడ్డి, రహదారులు, భవనాల శాఖ డీఈఈ ప్రభాకర్ పాల్గొన్నారు.