Cyber attacks
-
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్పోర్ట్లు, క్రెడిట్ కార్డ్లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
సైబర్.. సైరన్..!
పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు(Cyber Crime) సైతం పెచ్చుమీరుతున్నాయి. రోజుకొక మోసంతో కేటుగాళ్లు కోట్లలో కొళ్లగొడుతున్నారు. ఒకరికి ఒకరు కనిపించకుండా, ముఖ పరిచయం లేకపోయినా లింక్ సిస్టమ్లా వీళ్లు పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్న వర్గాలు, యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయక ప్రజలంతా వీరి బాధితులే. సెల్లో లింకే కదా అని క్లిక్ చేస్తే మిమ్మల్ని బుక్ చేస్తారు. ఇలాంటి మోసాలతో రూ.లక్షలు పోగొట్టుకుని పరువు సమస్యతో పోలీసులకు ఫిర్యాదులివ్వలేక అనేకమంది సతమతం అవుతున్నారు. ఈ సైబర్ నేరాలపై అవగాహనకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్అందమైన వల.. చిక్కారో విలవిలమనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పద్ధతి ఎక్స్టార్సన్. అలాగే అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు దోచుకోవడం సెక్స్టార్సన్. వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ (డేటింగ్ యాప్), ఇన్స్ట్రాగామ్ (Instagram) వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా మనలో ఉండే బలహీనతలను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు సెక్స్టార్సన్ పద్ధతిలో మోసాలు చేస్తుంటారు. వీరు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల నుంచి నెట్వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతుండటం విశేషం. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు.ఎలా చేస్తారంటే.. సైబర్ కేటుగాళ్లు అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ (ఇతర యాప్స్) ఐడీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్.. అలా నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఆ తర్వాత వాట్సాప్లో వ్యక్తిగత సమాచారం (వ్యక్తిది) తెలుసుకుని అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునేవరకు కథ తీసుకెళ్తారు. అనంతరం చాట్ నుంచి వీడియో కాల్స్లోకి లాగి అవతలివైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్చాట్లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్లో పెడతామని బెదిరిస్తారు.అప్రమత్తతే ఆయుధం » సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్లో తక్షణమే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలి. » www.cybercrime.gov.in పోర్టల్లో ఆన్లైన్ ఫిర్యాదివ్వాలి. సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి ఖాతాలను ఫ్రీజ్ చేయించాలి. పరిధి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. » ఎవరైనా బ్యాంకులో మ్యూల్ ఖాతా తమకు తెలియకుండా వేరే వ్యక్తులు తెరవాలనుకుంటే వెంటనే 1930 సైబర్ సెల్కు ఫిర్యాదు చేయాలి. అంతేకాక ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కు బదిలీ చేస్తే ఖాతాదారులను అప్రమత్తం చేయాలి. ఈ మోసాలు పరిశీలిస్తే.. » శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి తనకున్న బలహీనతతో ఫేస్బుక్లో అమ్మా యి పరిచయం కాగానే మాటామాటా కలిపాడు. ఆమె కూడా వీడియో కాల్ మాట్లాడటం, న్యూడ్ గా కనిపించడంతో తనూ న్యూడ్గా మారి కొంతకాలం ఆనందం పొందాడు. అక్కడికి కొద్దిరో జులకు ఆ అమ్మాయి న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ భయపెట్టి రూ.5 లక్షలు కావా లని బ్లాక్ మెయిల్ చేసింది. బయట తెలిస్తే పరు వు పోతుందని చేసేదేమీలేక డబ్బులు వేసేశాడు. » జిల్లాలోని ఒక ప్రముఖ వైద్యుడు తెలియని లింక్ క్లిక్ చేయడంతో హాయ్ అని ఓ అమ్మాయి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. రిప్లయ్ ఇవ్వడంతో న్యూడ్ వీడియో కాల్స్ తరచూ చేసేది. అక్కడికి కొద్దిరోజులకు వీడియోలు బయటపెడతామంటూ, డిజిటల్ అరెస్టు అవుతావంటూ ఢిల్లీ పోలీస్ సెటప్తో కొందరు వ్యక్తులు స్కైప్కాల్లో దర్శనమవ్వడంతో వాళ్లడిగిన రూ.18.50 లక్షలు చదివించేశారు. » శ్రీకాకుళం రూరల్ మండలంలో సంపన్న వర్గానికి చెందిన ఓ వృద్ధుడు అశ్లీల వీడియోలు చూసే అలవాటుండడంతో అందులో ఓ మెసేజ్ రావడంతో ఆన్సర్ చేశాడు. ఓ ఇద్దరు యువతుల ముఖాలతో ఉన్న పురుషులు వీడియో కాల్లో కనిపించి వృద్ధునికి మత్తెక్కే మాటలతో మైమరిపించగా వృద్ధుడు న్యూడ్గా మారాడు. తక్షణమే ఆ వీడియోలు వృద్ధునికి పంపించి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా. రూ.6 లక్షల వరకు సమర్పించేశాడు. » ఇదే తరహాలో ఏఐ సాయంతో జిల్లాలో ఓ మహిళా అధికారికి మోసం చేసే క్రమంలో ఆమె అప్రమత్తం అవ్వడంతో త్రుటిలో సైబర్ ఉచ్చునుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండాలి ఏ బ్యాంకు కూడా ఆన్లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింక్లు ఓపెన్ చేయరాదు. వాళ్లు మన ఫోన్ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత మాయం చేస్తారు. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. ఎప్పటికప్పుడు మన ఖాతాను పరిశీలిస్తుండాలి. సెక్స్టార్షన్కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడి పరువు సమస్యతో ఫిర్యాదు చేయకపోతే సైబర్ నేరగాళ్లకు మీరే బలమైన ఆయుధాన్ని ఇచ్చిన వారవుతారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే ఆపద నుంచి బయటపడవచ్చు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా -
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్కాల్స్ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
4.5 లక్షల ‘మ్యూల్’ ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం
సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణంI4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్లో 7,000 (సిండికేట్ బ్యాంక్తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్లో 6,000, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. -
సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్వేర్ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఎదురవుతున్న సవాళ్లు..ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్లు, వైరస్లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కొత్త అప్డేట్.. యాపిల్లో అదిరిపోయే ఫీచర్!రక్షణ వ్యవస్థలపై ఫోకస్ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.సైబర్ నేరాల లెక్కలివీ..వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది. -
బ్రిక్స్ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్ దాడి
మాస్కో: రష్యాలోని కజాన్లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.‘‘రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై ఈ బుధవారం ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్టాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది. అయితే బుధవారం చేసిన సైబర్ దాడి మాత్రం చాలా తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా మాస్కో ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్ 22-24 తేదీల్లో రష్యాలోని కజాన్లో జరుపుతోంది.Russian Foreign Ministry suffers ‘unprecedented’ #cyberattack - spox ZakharovaSpecialists are working to restore the functionality of the Russian Foreign Ministry's website after a large-scale DDoS attack, ministry spokesperson Maria Zakharova told TASS.The attack...RTNews pic.twitter.com/RS2ilmEhVJ— TifaniesweTs (@TifaniesweTs) October 23, 2024 రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.చదవండి: PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు -
టెక్ హైరింగ్లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘తప్పు జరిగింది..క్షమించండి’
సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ యూఎస్ ప్రతినిధుల సభ సబ్కమిటీ ముందు క్షమాపణలు చెప్పారు. జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్లో కలిగిన అంతరాయం గుర్తుంది కదా. అందుకు సంబంధించి సెక్యూరిటీ సేవలందించిన క్రౌడ్స్ట్రైక్ సంస్థ ప్రతినిధులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం యూఎస్ ప్రతినిధుల సభ సబ్కమిటీ ముందుకు వచ్చింది. దాంతో క్రౌడ్స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ క్షమాపణలు కోరారు.మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘జులైలో జరిగిన సంఘటనకు సైబర్ అటాక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణం కాదు. కొత్త థ్రెట్ డిటెక్షన్ కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేస్తున్నపుడు ఫాల్కన్ సెన్సార్ రూల్స్ ఇంజిన్ తప్పుగా కమ్యూనికేట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ అప్డేట్ వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాల్లో సెన్సార్లు సరిగా పనిచేయలేదు. తిరిగి కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేసేంతవరకు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి యూఎస్ సైబర్సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సబ్కమిటీ ముందు విచారణ జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చాం. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: టెలిగ్రామ్లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!జులై 19న సంభవించిన ఈ అంతరాయంతో విమానయాన సంస్థలు, బ్యాంకులు, హెల్త్కేర్, మీడియా, హాస్పిటాలిటీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ప్రభావితం చెందాయి. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గ్లోబల్గా దాదాపు 85 లక్షల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాలపై దీని ప్రభావం పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దానివల్ల 13 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. -
శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్గా డూప్లికేట్ వెబ్సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారక వెబ్సైట్ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి.. “వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది. మీరు వెంటనే మా ఫోన్ నంబర్కు ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించండి. ఆ తర్వాత మీ గది బుకింగ్ డిటెయిల్స్ పంపిస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేట్ సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు. పేమెంట్ అంతా ఆన్లైన్ గేట్వే ద్వారానే జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో ఆర్జితసేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ (మల్లన్న స్పర్శ దర్శనం) టికెట్లను వందశాతం ఆన్లైన్ చేసింది. అలాగే వసతి గదులను సైతం ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. ఇదే ఆసరాగా సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. ఏపీ టూరిజంకూ తప్పని బెడద భక్తుల సౌకర్యార్థం వీఐపీ కాటేజీలు, గణేశ సదన్, మల్లికార్జున సదన్, గంగా–గౌరీ సదన్, కుమార సదన్, పాతాళేశ్వరసదన్ తదితర పేర్లతో వసతి గదులను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. వీటి బుకింగ్ విషయంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించింది. సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి దేవస్థానం వసతి గదుల పేర్లతో సమానంగా నకిలీ వెబ్సైట్లు తయారుచేసి వాటి ద్వారా భక్తులను మోసం చేస్తున్నారు. కేవలం దేవస్థానానికి మాత్రమే కాకుండా శ్రీశైలంలో ఉన్న ఏపీ టూరిజం, శ్రీశైలంలోని ప్రైవేట్ సత్రాలకు సైతం ఫేక్ వెబ్సైట్ల బెడద తప్పడం లేదు. ఆయా సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించి డబ్బు చెల్లించిన భక్తులు శ్రీశైలం వచ్చి సదరు సంస్థ రిసెప్షన్లో వారికి వచి్చన మెసేజ్ను చూపించగా అది ఫేక్ అని తేలిపోతుండటంతో లబోదిబో మంటున్నారు. ఆ తర్వాత గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సైబర్క్రైం పోలీసులు నకిలీ ఐడీలపై విచారణ చేయగా రాజస్థాన్, జైపూర్ వాటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అసలైన వెబ్సైట్లను గుర్తించండిలా.. శ్రీశైల దేవస్థానం అధికారికంగా www.srisailadevasthanam.org (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్జీ) వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు, వసతి గదులు పొందవచ్చు. అలాగే aptemples.ap.gov.in (ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్) ద్వారా కూడా లాగిన్ అయి శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్లి తమకు కావాల్సిన సేవలను, వసతి గదులను పొందవచ్చు.అలాగే srisailadevasthanam (శ్రీశైలదేవస్థానం) మొబైల్ యాప్ను ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని తద్వారా ఆయా సేవలను పొందవచ్చు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కంప్యూటర్పై పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే స్వయంగా వసతి, ఆర్జిత సేవా టికెట్లను పొందాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయించి ఆయా సేవలను పొందితే ఫేక్ ఐడీల బారిన పడకుండా ఉండవచ్చు. – డి.పెద్దిరాజు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
లావోస్లో సైబర్ బానిసలు..
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్కు చేరుకొని, సైబర్ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్లో బొకియో ప్రావిన్స్లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటైన సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచ్చులోకి యువత ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్ నేరగాళ్లు లావోస్కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్లలో, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. జాబ్ ఆఫర్ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు ఉద్యోగాల కోసం లావోస్ వెళ్లి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో లావోస్లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్ రప్పించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుండడంపై లావోస్ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భారత్, యూఎస్ కంపెనీల సర్వర్లపై చైనా దాడి?
చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ ఇండియాతోపాటు అమెరికాలోని కొన్ని కంపెనీల సర్వర్లపై దాడికి పాల్పడినట్లు లుమెన్ టెక్నాలజీస్కు చెందిన బ్లాక్ లోటస్ ల్యాబ్స్లోని భద్రతా పరిశోధకులు తెలిపారు. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం వోల్ట్ టైఫూన్ అని పిలువబడే చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ అమెరికా, ఇండియాలోని ఇంటర్నెట్ కంపెనీలపై దాడికి పాల్పడింది. అందుకోసం కాలిఫోర్నియాకు చెందిన వెర్సా నెట్వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ సాఫ్ట్వేర్లోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.చైనీస్ గ్రూప్ చేసిన ఈ సైబర్ దాడివల్ల అమెరికాకు చెందిన నాలుగు ఇంటర్నెట్ కంపెనీలు, భారత్లోకి ఒక కంపెనీ ప్రభావితం చెందినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీలు నెట్వర్క్ కాన్ఫిగరేషన్ల నిర్వహణకు సహాయపడే వెర్సా నెట్వర్క్ల సాఫ్ట్వేర్లో లోపం కనుగొన్నారు. గతంలో వెర్సా బగ్ను గుర్తించి జూన్ 2023లో పరిష్కారాన్ని విడుదల చేసినప్పటికీ, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల తిరిగి దాడికి గురయ్యాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ సర్వర్లు యూఎస్లోని నీటి వసతి, పవర్ గ్రిడ్ వంటి కీలక సేవలందించే సాఫ్ట్వేర్లలో చొరబడ్డాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వోల్ట్ టైఫూన్ నిజానికి ‘డార్క్ పవర్’ అని పిలువబడే ఒక క్రిమినల్ గ్రూప్ అని, దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సైబర్అటాక్ల పేరుతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. -
పని ప్రదేశమే ప్రాణాంతకమైతే?
ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన అనేక కథనాలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం మునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్ లో కూడా జరుగుతోంది. ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కలవరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి ఎంతమాత్రమూ వీలు లేదు. మార్పు ఇప్పటికే మొదలు కావాల్సింది!ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో ఇటీవలి కేసు... మహిళల భద్రత విషయంలో ఉన్న సమస్యల తీవ్రతనూ, అత్యంత సురక్షితంగా భావించే పరిస రాలలో కూడా వారు ఎదుర్కొంటున్న సర్వవ్యాప్త హింసనూ గుర్తు చేస్తోంది.శిక్షణలో ఉన్న ఒక యువ వైద్యురాలు అనేక గంటలపాటు విధి నిర్వహణను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, తగిన భద్రత ఉంటుందని భావించిన ఆసుపత్రి ఆవరణలోనే ఆమెపై లైంగికదాడి జరిపి హత్య చేశారు. ఈ భయానక నేరం ఒక విడి సంఘటన కాదు. మన సమాజంలోని ప్రతి అంశంలోనూ విస్తరిస్తున్న, మహిళ లపై హింసకు సంబంధించిన విస్తృతమైన అంటువ్యాధిలో ఇదొక భాగం. ఒకే వారంలో మహిళలపై అత్యాచారం, దాడి, హింసకు సంబంధించిన వార్తలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి కథనం అంతకుమునుపటి కథనం కంటే మరింతగా కలవరపెడుతోంది. ఇవి వార్తలలోని కేవలం పాదసూచికలు కాదు. సగం జనాభా భద్రత విషయంలో విఫలమైన సమాజంపై ఇవి స్పష్టమైన నేరారోపణలు. మహిళలపై హింస నేడు చీకటి సందుల్లోనే కాకుండా పని స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఆన్లైన్లో కూడా జరుగుతోంది.మహిళలపై నేరాలు దారుణంగా పెరుగుతున్నాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’(ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క 2022లోనే 4,45,256 కేసులు నమోదయ్యాయి. ఇది ప్రతి గంటకు దాదాపు 51 ఎఫ్ఐఆర్లకు సమానం. 2020, 2021 సంవత్సరాల నుంచి భయంకరమైన పెరుగుదలను ఈ డేటా వెల్లడిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు మహిళలపై నేరాల రేటు 66.4గా ఉంది. అయితే ‘క్రైమ్ ఇన్ ఇండియా 2022’ నివేదిక ప్రకారం, అలాంటి కేసులలో ఛార్జ్షీట్ రేటు 75.8గా నమోదైంది. నమోదైన మొత్తం కేసులలో, 18.7 శాతం వరకు మహిళలపై దౌర్జన్యానికి పాల్పడే ఉద్దేశ్యంతో దాడికి పాల్పడినవే. కాగా 7.1 శాతం అత్యాచారం కేసులుగా నమోదయ్యాయి. ఈ భయంకరమైన గణాంకాలు వాస్తవ ఘటనల్లో అతి చిన్న భాగాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. భయం, అవమానం లేదా సామాజిక ఒత్తిడి కారణంగా అసంఖ్యాకమైన కేసులు వెలుగులోకే రావు.మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ హింసాత్మక చర్యలు ఆకస్మికంగా సంభవిస్తున్నవి కావు. జీవితంలోని ప్రతి అంశంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన అసమానతలను ఇవి ప్రతిబింబిస్తాయి. స్త్రీలు సరుకులుగా కుదించబడినప్పుడు, హింస అనేది రోజు వారీ సంఘటనగా మారుతుంది. ఈ హింస భౌతిక దాడికి మాత్రమే పరిమితమైనది కాదు; ఇది ఆర్థికపరమైన, భావోద్వేగపరమైన వేధింపు వరకు విస్తరించింది. ముఖ్యంగా పని స్థలాల్లో అధికార చలన సూత్రాలు తరచూ మహిళలకు వ్యతిరేకంగా ఉంటాయి.సాధారణంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టంగా పిలుస్తున్న, ‘‘పనిస్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం, 2013’ వంటి చట్టాలను మహిళల రక్షణ కోసం రూపొందించారు. కానీ వాస్తవికత దానికి భిన్నమైన చిత్రాన్ని చూపు తోంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించినప్పటికీ, ఈ కమిటీల నిర్మాణం సహజంగానే లోప భూయిష్టంగా ఉంది.అదే సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులతోపాటు ఒక ఎన్జీవో లేదా అలాంటి సంస్థకు చెందిన బయటి సభ్యులతో కూడిన ఈ కమిటీలు, బాధితురాలికి న్యాయం చేయడం కంటే కూడా కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికే తరచుగా ప్రాధాన్యత ఇస్తాయి. అధికారిక చలనసూత్రాలు (కమిటీ సభ్యులు కంపెనీలో స్వార్థ ప్రయో జనాలను కలిగి ఉండవచ్చు) నిజమైన విచారణను, జవాబుదారీ తనాన్ని నిరుత్సాహపరిచే వాతావరణాన్ని సృష్టిస్తాయి.అయితే ఈ సవాళ్లు నేడు పని స్థలాలను దాటి విస్తరించాయి. ప్రారంభంలో అవకాశాలు, అనుసంధానం కోసం ఉద్దేశించిన ఇంట ర్నెట్, ఇప్పుడు మహిళలకు సంబంధించిన కొత్త యుద్ధభూమిగా మారింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021లో సైబర్ క్రైమ్ సంఘటనల సంఖ్య 2019తో పోలిస్తే 18.4 శాతం పెరిగింది. మహిళలను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు గణనీయంగా 28 శాతానికి పెరిగాయి. 2021లో నమోదైన 52,974 సైబర్ నేరాల్లో 10,730 అంటే 20.2 శాతం మహిళలపై నేరాల కేసులు. వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం వంటి వాటి నుండి ప్రతీకారం తీర్చుకునే పోర్న్, ఆన్ లైన్ వేధింపుల వరకు, పాత రకాల హింసలను కొనసాగించడానికి డిజిటల్ రంగం కొత్త మార్గాలను అందిస్తోంది.ఇంటర్నెట్లో అజ్ఞాతంగా ఉండటం అనేది నేరస్థులకు ధైర్యాన్నిస్తుంది. కాగా, కఠినమైన సైబర్ చట్టాలు లేకపోవడం, చట్టపరమైన సహాయం నెమ్మదిగా ఉండటం బాధితులకు హాని చేస్తున్నాయి.మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము? ప్రస్తుత పరిస్థితులు కాగితంపై ఉన్న చట్టాలకూ, ఆచరణలో వాటి అమలుకూ మధ్య కల వరపెడుతున్న అనుసంధాన లేమిని వెల్లడిస్తున్నాయి. లైంగికదాడి కేసులలో 95 శాతం అపరిష్కృతంగా ఉంటున్నాయని ‘ఎన్ సీఆర్బీ’ 2021 నివేదిక నొక్కి చెబుతోంది. ఈ గణాంకాలు స్త్రీల దుఃస్థితి పట్ల వ్యవస్థ అలసత్వంతో పాటు, తరచుగా ఉదాసీనతను కూడా సూచిస్తు న్నాయి. న్యాయ విచారణలో జాప్యం, సానుభూతి లేని పరిపాలనా వ్యవస్థ అనేవి బాధితులు ముందుకు రాకుండా వారిని మరింత నిరుత్సాహపరుస్తాయి.లైంగిక వేధింపుల నిరోధక చట్టం, దానిని పోలి ఉండే ఇతర చట్టాలు అవసరమైనప్పటికీ, అవి సరిపోవు. హాని సంభవించిన తర్వాత మాత్రమే సమస్యను పరిష్కరిస్తాయి. పైగా పనికి సంబంధించిన దైహిక, లింగ స్వభావాన్ని సవాలు చేయడంలో విఫలమవు తాయి. ఇది మహిళలకు మొదటి దశలోనే హాని చేస్తుంది. కాబట్టి నిష్పాక్షికత, న్యాయబద్ధతను నిర్ధారించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూర్పు విషయంలో పునః మూల్యాంకనంతో ప్రారంభించి, తక్షణ సంస్కరణలు అవసరం. సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించి, అది కొనసాగేలా చూడడం యజమానుల బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే వారిపై కఠినమైన జరిమానాలు విధించాలి.ఇది చట్టపరమైన వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక వైఫల్యం కూడా! సమానత్వం కోసం మాత్రమే కాకుండా ప్రాథమిక గౌరవం కోసం పోరాడుతుండే మహిళలు తరచుగా బాధామయ జీవితాల్లో నిశ్శబ్ద శృంఖలాల పాలవుతుంటారు. ప్రతీకారం, ఉద్యోగ నష్టం, వ్యక్తిత్వ హననాల భయం చాలామందిని నోరు విప్పకుండా చేస్తుంది. ఇది శిక్ష పడుతుందనే భయం లేని సంస్కృతి వృద్ధి చెందడానికి వీలు కలిగిస్తుంది. అధికార శక్తులు దోపిడీకి పాల్పడుతూనే ఉండటం, బాధితులు తరచుగా ఎటువంటి సహాయం లేకుండా మిగిలిపోవడం అనేది ఒక విష వలయం.చట్టపరమైన రక్షణలు, పెరుగుతున్న అవగాహన పురోగతిని సూచిస్తున్నప్పటికీ, సంఖ్యలు మాత్రం మరో కథను చెబుతున్నాయి. అది ఆచరణలో కంటే సిద్ధాంతంలోనే ఎక్కువగా ఉనికిలో ఉంటున్న చట్టాలతోపాటు, ప్రతి మలుపులోనూ మహిళల విలువను తగ్గించే సామాజిక వ్యవస్థ వైఫల్య గాథ. ఈ గాథలు చీకట్లోనే మగ్గిపోవడానికి వీలు లేదు. అవి మన శ్రద్ధను, మన ఆగ్రహాన్ని, మరీ ముఖ్యంగా మన చర్యను డిమాండ్ చేస్తున్నాయి. మార్పు ఎప్పుడో మొదలు కావాల్సింది!వి. విజయ సాయి రెడ్డి వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు;వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్పూర్లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్కు వాట్సాప్ ద్వారా మిస్డ్కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్ను సైబర్నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్ను సైబర్నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్ను హెచ్చరిస్తాం. ఐఫోన్ను సైబర్భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
Microsoft: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్ గ్రూప్లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ ఒక నివేదికలో వెల్లడించింది. సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్కు చెందిన ‘థ్రెట్ ఇంటెలిజెన్స్’ అధ్యయనం నిర్వహించింది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో చైనా సైబర్ గ్రూప్లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేలి్చచెప్పింది. ► చైనాకు చెందిన ఫ్లాక్స్ టైఫNన్ అనే సైబర్ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది. ► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్ ఇండియా వంటి కార్పొరేట్ సంస్థల ఆఫీసులను టార్గెట్ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్ గ్రూప్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది. ► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్హబ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ► మయన్మార్లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్–1376 అనే సైబర్ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది. ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్ఫేక్ కంటెంట్పై చర్చించారు. ► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్ గుర్తించింది. -
ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు కృత్రిమ మేధను వాడుతున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించి.. సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనేది వారి ఆలోచన. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అండతో నేరాలకు పాల్పడుతున్నవారికి అదే ఆయుధంతో చెక్ పెట్టనున్నారు. ప్రత్యేక ముఠాలు ఏర్పాటు సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవి సామాన్యులనే కాదు పోలీసులనూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎన్ని రకాలుగా చైతన్యపరుస్తున్నా.. నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి మరీ.. ఇక్కడి వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్ కాల్తో బురిడీ కొట్టించి.. ఖాతాలో ఉన్న సొత్తు అంతా ఊడ్చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో సిమ్కార్డులు తీసుకొని, బోగస్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి.. కొల్లగొడుతున్నారు. ఒక్కో నేరగాడు వందల సంఖ్యలో సిమ్కార్డులు సమకూర్చుకుంటున్నాడు. సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా ముఠాలే ఉన్నాయి. నిరక్షరాస్యులు, నిరుద్యోగులను నమ్మించి.. బ్యాంకు ఖాతా వాడుకునేందుకు అనుమతి ఇస్తే మంచి కమీషన్ ఇస్తామని ఆశపెడుతున్నారు. బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాల్లోకి, వాటిలో నుంచి వేరే ఖాతాలోకి మార్చి.. డ్రా చేసుకుంటున్నారు. కష్టమ్మీద ఆచూకీ కనిపెట్టినా.. నేరగాళ్ల ఆచూకీని పోలీసులు అతికష్టమ్మీద కనిపెట్టినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు వాడుతున్న సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి.. వాటిని రద్దు చేయించగలిగితే వారిని కట్టడి చేయచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్కార్డు లేకపోతే మోసం చేసేందుకు కాల్ చేయలేరు. బ్యాంకు ఖాతా లేకపోతే మళ్లించిన డబ్బు దోచుకోలేరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్ల సిమ్కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 28,610 సిమ్కార్డులను బ్లాక్ చేయించగలిగారు. వాటిని వాడిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్ను గుర్తించి, వాటిని కూడా బ్లాక్ చేయిస్తున్నారు. దాదాపు 2 వేల బ్యాంకు ఖాతాలనూ రద్దు చేయించారు. తమకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఇవన్నీ చేయించారు. ప్రక్షాళన షురూ.. సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి. బాధితులకు వచ్చిన ఫోన్ కాల్స్, డబ్బు మళ్లించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇక్కడ నమోదవుతుంటాయి. ఈ సమాచారంతోపాటు బ్యాంకింగ్ డేటా ఆధారంగా అనుమానాస్పద ఖాతాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం కృత్రిమమేధ సాయం తీసుకోనున్నారు. ఇదీ చదవండి: బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..? చాలాకాలంగా పనిచేయని బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయినా, ఒక ఖాతాలోకి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బు జమ అవుతున్నా అటువంటి వాటిని గుర్తించి, ఆయా బ్యాంకులను అప్రమత్తం చేయనున్నారు. అలాగే సిమ్కార్డుల విషయంలో సర్వీస్ ప్రొవైడర్లను ఇప్పటికే అప్రమత్తం చేశారు. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా లింక్లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఆన్లైన్లో ఆవులు.. ఊరించిన ఆఫర్.. తీరా చూస్తే..
ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లు ఊరిస్తుంటాయి.. ముందూ వెనక ఆలోచించకుండా నచ్చిన ఐటమ్ బుక్ చేసేస్తుంటారు. ఓ లాటరీ తగిలిందంటే లేదా ఓ ఆఫర్ ఇస్తున్నారంటే ఎందుకు, ఏంటి, ఎలా అన్న కనీస ఆలోచన లేకుండా సంబంధిత లింక్పై క్లిక్ చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తీర ఏదైనా లింక్పై క్లిక్ చేసి సైబర్ సేరస్థుల ఉచ్చులో చిక్కుకుంటారు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది భారత్ డిజిటల్ రంగంలో పురోగమిస్తోంది. గాడ్జెట్ల నుంచి కిరాణా సామగ్రి వరకు అన్నీ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దాంతో విక్రయదారులు కస్టమర్లను ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. స్మార్ట్పోన్లు వచ్చినప్పటి నుంచి చదువు ఉన్నవారు, లేనివారనే తేడా లేకుండా వాటిని ఉపయోగించి ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామందికి సైబర్నేరాలకు సంబంధించిన అవగాహనలేక కొందరు నేరస్థుల చేతుల్లో బలవుతున్నారు. తాజాగా గుర్గావ్కు చెందిన ఒక పాడి రైతు ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేయాలనుకుని సైబర్ నేరస్థులకు చిక్కి మోసపోయిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్లోని పాండాలాలో నివసిస్తున్న సుఖ్బీర్(50) అనే పాడి రైతు ఆవులను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆఫ్లైన్ రేట్లతో పోలిస్తే ఆన్లైన్లో భారీ రాయితీ ఉండడం గమనించాడు. దాంతో ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి మోసపోయాడు. ఈ మేరకు తన తండ్రి డబ్బు పోగొట్టుకున్న సంఘటనను తన కుమారుడు ప్రవీణ్ (30) వివరించాడు. ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్బీర్ నిత్యం పర్వీన్ ఫోన్ను ఉపయోగించేవాడు. యూట్యూబ్ వీడియోలను చూసేవాడు. గూగుల్లోని ఓ వెబ్సైట్లో ఆవులను చాలా తక్కువ ధరకు రూ.95,000కు అందజేస్తుందని గ్రహించాడు. ఇది సాధారణ ఆఫ్లైన్ ధరతో పోలిస్తే చాలా తక్కువని తెలుసుకున్నాడు. ఆన్లైన్లో ఆవులకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆవుల కోసం ఆరాతీస్తున్న విషయాన్ని తెలుసుకున్న సైబర్ సేరస్థులు ఫోన్ నంబర్ ద్వారా వాట్సప్లో ఆవుల ఫోటోలను పంపడం ప్రారంభించారు. మొదట ఒక్కో ఆవు ధర రూ.35,000 అని పేర్కొన్నారు. నాలుగు ఆవులను కొనుగోలు చేసేందుకు సుఖ్బీర్ ఆసక్తి చూపగా, గోశాల కింద ఆవులను రిజిస్టర్ చేస్తామని అబద్ధపు హామీ ఇచ్చారు. పైగా ధరను రూ.95,000కు తగ్గించారు. దాంతో అది నమ్మి ప్రవీణ్ తండ్రి జనవరి 19, 20 రోజుల్లో మొత్తం రూ.22,999 నగదు వారికి పంపించాడు. స్కామర్లు ముందుగా నిర్ణయించిన దానికంటే మరింత అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆవులను పంపించలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన సుఖ్బీర్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420 కింద ఫిర్యాదు చేశాడు. ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. ఆన్లైన్ మోసాలకు బలవకుండా ఉండాలంటే కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా లింకులపై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. మీకు తెలియని వాటిని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే షాపింగ్ చేయడం ఉత్తమం. అడ్రస్ బార్లో https (http కాదు) ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. ఆఫర్లు ఉన్నాయంటూ కనిపించే నకిలీ వెబ్సైట్ల జోలికివెళ్లొద్దు. ఈ కామర్స్ వెబ్సైట్కు సంబంధించిన లాగిన్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ధర, డెలివరీ డేట్ లాంటి కొన్ని వివరాలు చూసి.. పేమెంట్ చేసేయకూడదు. ఆ ప్రోడెక్ట్ ఎప్పుడొస్తుంది, దాని ఎక్స్ఛేంజ్ పాలసీ, రిటర్న్ పాలసీ లాంటివి కూడా చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంత కఠినంగా ఉంటే.. అంత మంచిది అని చెబుతుంటారు. -
‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు..
నిత్యం కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైళ్లను వినియోగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లుంటాయి. అసలు వేర్ అంటే ఏమిటో తెలుసా.. సాధనమని అర్థం. కంప్యూటర్లో మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్ వంటి భాగాలన్నీ హార్డ్వేర్లు. ఈ హార్డ్వేర్లను పనిచేయించేవి సాఫ్ట్వేర్లు. ఈ సాఫ్ట్వేర్ల్లో చాలారకాలు ఉంటాయి. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాన్సమ్వేర్ ఇది హానికర సాఫ్ట్వేర్. పీసీలో ఇన్స్టాల్ అయ్యి, లోపలి భాగాలను ఎన్క్రిప్ట్ చేస్తుంది. పరికరాన్ని, డేటాను తిరిగి వినియోగించుకోనీయకుండా చేస్తుంది. రాన్సమ్ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. మనకు సంబంధించిన ఏ వివరాలు కనిపించవు. రాన్సమ్వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్/ యాంటీ మాల్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు. స్పైవేర్ ఇదొక మాల్వేర్. ఒకసారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్లైన్ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్వేర్’ అంటారు. ఇవి డౌన్లోడ్ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్స్టాల్ అవుతాయి. ఈమెయిల్ ఐడీలు, వెబ్సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్ ద్వారా థర్డ్ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్, పాస్వర్డ్ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్వేర్లను ‘కీలాగర్స్’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్ స్టోరేజినీ, నెట్వర్క్ ట్రాఫిక్నూ వాడుకుంటాయి. నాగ్వేర్ ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్, నోటిఫికేషన్ మెసేజ్లతో లేదా కొత్త విండో ఓపెన్ చేస్తుండడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్పేజీ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నామనుకోండి. ఏదో యాప్లో రిజిస్టర్ చేసుకోవాలని న్యూవిండోలో అడగొచ్చు. ప్రోగ్రామ్ను లోడ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్వేర్ను అన్ఇన్స్టాల్ చేయటం ఉత్తమం. ఇదీ చదవండి: పేటీఎంపై నిషేధం.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు క్రాప్వేర్ ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ముందే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్వేర్ను ఇన్స్టాల్ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్ స్పేస్ను వాడుకున్నా క్రాప్వేర్ హాని చేయదు. -
వాట్సప్లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. దానికితోడు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. సామాన్యులు, చదువురానివారు, బాగా చదువుకున్నవారు, పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు సైబర్దాడికి బలవుతున్నవారే. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం వాట్సప్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాక దాదాపు గరిష్ఠకాలం వాట్సప్లోనే గడుపుతుంటాం. అందులో వివిధ వ్యక్తులతో అన్ని వివరాలు చర్చించుకుంటాం. గోప్యంగా ఉండాల్సిన చాలా వివరాలు స్కామర్లు తెలుసుకుని ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మనల్ని వేదిస్తే చాల ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సప్కాల్స్తో జాగ్రత్త.. తెలియని నంబర్ల నుంచి సైబర్ నేరస్థులు నేరుగా కాకుండా వాట్సప్లో మిస్డ్ కాల్ చేస్తుంటారు. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేసేంతవరకు రింగ్ అవుతుంది కదా. ఈ స్పామ్ కాల్స్ రెండు మూడు రింగ్ల తరువాత కాల్ కట్ అవుతుంది. అన్నోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఈ విషయాన్ని గ్రహించాలని చెబుతున్నారు. హ్యాకర్స్ యాక్టివ్ వినియోగదారులను గుర్తించేందుకు ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రిసెర్చ్(బీపీఆర్డీ) పేర్కొంది. నిరుద్యోగులకు ఎర.. ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఒక సమస్య అయితే. వారిని సైబర్ నేరస్థులు ట్రాప్ చేసి వేదింపులకు గురిచేయడం మరో సమస్యగా మారుతుంది. నిరుద్యోగులకు గుర్తించి స్కామర్లు వారికి వాట్సప్లో మెసేజ్లు పంపుతారు. అప్పటికే ఎన్నో ఒత్తిడులతో ఉన్న నిరుద్యోగులు వాటిని నమ్మి వాటికి రిప్లై ఇస్తున్నారు. దాంతో మన ఫోన్లోని వివరాలు వారికి చేరుతున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరిట విభిన్ని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరమై వివరాలు పంపించాల్సి వస్తే క్రెడబిలిటీ ఉన్న ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే వీలైతే నేరుగా వెళ్లి కలిసి సదరు కంపెనీలతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు చోరీ.. వాట్సప్లో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్లో భాగంగా తమ స్క్రీన్ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం ఖాతాలోని డబ్బు కొల్లగొడుతున్నారు. ఇదీ చదవండి: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ట్రేడింగ్ సలహాలతో.. కరోనా తర్వాత మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో ఆ లాభాలు చూపించి సామాన్యులకు ఎరవేస్తున్నారు. ట్రేడింగ్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్లో మెసేజ్లు చేస్తున్నారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో లేని అనధికారిక అప్లికేషన్ లింక్లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు కొట్టేస్తున్నారు. -
PM Narendra Modi: దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు. -
మైక్రోసాఫ్ట్లో సైబర్ దాడుల కలకలం!
మైక్రోసాఫ్ట్లో సైబర్ దాడుల కలకలం రేపుతున్నాయి. రష్యాకు చెందిన హ్యాకర్లు తమ సంస్థపై సైబర్ దాడులు చేశారంటూ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన చేసింది. జనవరి 12న రష్యా హ్యాకర్స్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ సిస్టమ్స్పై దాడులు చేసి ఈమెయిల్స్ను దొంగిలించారు. వాటి సాయంతో సిబ్బంది అకౌంట్లలోని పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రష్యాలో సుపరిచితమైన హ్యాకింగ్ గ్రూప్స్ నోబెలియం, మిడ్నైట్ బ్లిజార్డ్ సభ్యులు నవంబర్ 2023 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థపై ‘పాస్వర్డ్ స్ప్రే అటాక్స్’ పాల్పడినట్లు తన బ్లాగ్లో పేర్కొంది. సంస్థకు చెందిన కంప్యూటర్లపై సైబర్ దాడులే లక్ష్యంగా ఒకే పాస్వర్డ్ను పలు మార్లు ఉపయోగించడంతో హ్యాకింగ్ సాధ్యమైనట్లు వెల్లడించింది. అయితే రష్యన్ గ్రూప్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ఇమెయిల్ అకౌంట్స్ను చాలా తక్కువ శాతం యాక్సెస్ చేయగలిగింది. ఆ ఈమెయిల్స్లో సీనియర్ లీడర్షిప్ టీమ్ సభ్యులు, సైబర్ సెక్యూరిటీ, లీగల్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని మైక్రోసాఫ్ట్ నిర్ధారించింది. మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ బృందం హ్యాకర్స్ దాడులు ఎందుకు చేశారో ఆరా తీసింది. ఇందులో రష్యన్ హ్యాకర్స్ గ్రూప్ మిడ్నైట్ బ్లిజార్డ్ గురించి సమాచారం ఉన్న ఈమెయిల్స్ సేకరించే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
‘డిజిటల్ అరెస్ట్’ గురించి తెలుసా..?
పదేళ్ల కిందట క్రైమ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా.. క్రైమ్ జరిగేతీరు, దాని విధానం, రూపం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి షాపింగ్ చేయటం తెలిసిందే. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించి, డబ్బు లాగడం మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం..డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. అయితే తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే.. సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఇలాంటిదే. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్ అరెస్ట్’. డిజిటల్ అరెస్ట్ కొత్త సైబర్ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం. నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్ను ట్రాన్స్ఫర్ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్ కాల్ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక గానీ కాల్ కట్ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. మరేం చేయాలంటే.. భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్ స్టేషన్కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు. -
రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
సైబర్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేస్తున్నారు. రుణయాప్ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే.. వస్తువులు విక్రయిస్తామంటూ.. ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటూ.. మోసగాళ్లు పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. పార్సిళ్ల పేరుతో.. సైబర్ నేరస్థులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. అప్గ్రేడ్ చేస్తామంటూ.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు. -
ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే..
సైబర్ నేరస్థులు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అదే కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఆసక్తి. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. కానీ ప్రస్తుతం అధికారికంగా విడుదలైన తర్వాతే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే భావనతో ఇతర ప్లాట్ఫామ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. అలా జనాలు చేస్తున్న ప్రయత్నాలే సైబర్ నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇదీ చదవండి: ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..! సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్లో ఫ్రీ డౌన్ లోడ్ అనే లింక్లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే పాప్అప్ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్ల ద్వారా వచ్చే యాప్లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. -
ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు.. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి. 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది. దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి. 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి. టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది. ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ.. రిస్క్ మేనేజ్మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది. -
వ్యక్తిగత డేటా చౌర్యం సంగతే తెలియడం లేదు
న్యూఢిల్లీ: సైబర్ దాడుల బారిన పడినవారిలో చాలా మందికి తమ వ్యక్తిగత డేటా చోరీకి గురైన సంగతే తెలియడం లేదు. ప్రతి ముగ్గురిలో ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్ తరఫున వేక్ఫీల్డ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కనీసం 500 మందికి పైబడి సిబ్బంది ఉన్న 1,600 పైగా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. గత 30 ఏళ్లుగా సైబర్ దాడులను నివారించడంపైనే పరిశ్రమ ఎక్కువగా దృష్టి పెడుతోందని రుబ్రిక్ సీఈవో బిపుల్ సిన్హా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు తప్పకుండా జరిగే అవకాశాలే ఉన్నాయని భావించి, వాటిని దీటుగా ఎదుర్కొనే సన్నద్ధతను సాధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా సైబర్ పరిశ్రమ ఏడాదికి 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తోంది. అయితే, రుబ్రిక్ జీరో ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరి డేటా చౌర్యానికి గురవ్వడమే కాకుండా ఆ విషయం వారికి కనీసం తెలియకపోవడమనేది ఆందోళనకర విషయం‘ అని సిన్హా పేర్కొన్నారు. నివేదికకు సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► ఈ ఏడాది జూన్ 30–జులై 11 మధ్య కాలంలో 10 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ► నివేదిక ప్రకారం సగం పైగా సంస్థల్లో (53 శాతం) గతేడాది కీలకమైన సమాచారం చోరీకి గురైంది. ప్రతి ఆరు కంపెనీల్లో ఒక సంస్థ (16 శాతం) పలు దఫాలుగా సైబర్ దాడులతో నష్టపోయింది. ► దేశీయంగా ఐటీ లీడర్లలో 49 శాతం మంది .. తమ సంస్థ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్లు అభిప్రాయపడ్డారు. వచ్చే 12 నెలల్లో తమ సంస్థల్లో కీలక డేటా చోరీకి గురయ్యే రిస్కులు అత్యధికంగా ఉన్నాయని 30 శాతం మంది తెలిపారు. ► సాధారణంగా కంపెనీల్లో డేటా గత 18 నెలల్లో మొత్తం మీద 42 శాతం పెరిగింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్ (సాస్) రూపంలో డేటా 145 శాతం, క్లౌడ్లో (73 శాతం), సంస్థ భౌతిక కార్యాలయాల్లో 20 శాతం మేర పెరిగింది. ► ఒక సాధారణ సంస్థ భద్రపర్చుకోవాల్సిన డేటా వచ్చే ఏడాదిలో 100 బీఈటీబీ (బ్యాక్–ఎండ్ టెరాబైట్)కి పెరుగుతుందని, వచ్చే అయిదేళ్లలో 7 రెట్లు వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది. ► డేటా వృద్ధితో సమానంగా రిస్కులను ఎదుర్కొనేలా డేటా భద్రతను పెంచుకోలేకపోతున్నట్లు 34 శాతం మంది దేశీ ఐటీ లీడర్లు తెలిపారు. కీలకమైన డేటాను కాపాడుకోవడంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం సానుకూల ప్రభావం చూపగలదని 54 శాతం దేశీ కంపెనీలు భావిస్తుండగా, ఏఐ ఎటువంటి ప్రభావం చూపదని 24 శాతం సంస్థలు భావిస్తున్నాయి. -
70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. అసలు కారణం అదే..
మొబైల్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటే ఆన్లైన్ మోసాలు అదే స్థాయిలో హెచ్చవుతున్నాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలపై చర్చించిన సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని జోషి సూచించారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తూ, మోసాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని చెప్పారు. ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి, నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలలో ఈ సమావేశంలో చర్చించారు. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ఈ సమావేశంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) నమోదు చేసిన తాజా గణాంకాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ వివరించింది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ విభాగం, టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో డిజిటల్ మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
తాజ్ హోటల్స్పై సైబర్ అటాక్ - ప్రమాదంలో 15 లక్షల మంది డేటా!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ 'ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా'(ఐసీబీసీ) మీద జరిగిన సైబర్ దాడి మరువకముందే.. టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్ గ్రూప్పై సైబర్ అటాక్ జరిగినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 2023 నవంబర్ 5న తాజ్ హోటల్ గ్రూప్పై సైబర్ అటాక్ జరిగినట్లు, తాజ్ హోటల్కు చెందిన సుమారు 15 లక్షల మంది డేటాను హ్యాక్ చేసినట్లు తెలిసింది. నిందితులు ఈ డేటాను తిరిగి ఇవ్వాలంటే 5000 డాలర్లు డిమాండ్ చేస్తూ కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని.. దీనిపైనా సమగ్ర పరిశీలను జరుగుతోందని, డేటా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. Dnacookies అనే పేరుతో హ్యాకర్లు కస్టమర్ల డేటాను హ్యాక్ చేసినట్లు, ఇప్పటికి ఈ డేటాను ఎవరికీ ఇవ్వలేదని వెల్లడించారు. కస్టమర్ ఐడీ, అడ్రస్ వంటి ఇతర వ్యక్తిగత సమాచారాలను వారు హ్యాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కస్టమర్ డేటా 2014 నుంచి 2020 వరకు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. ఈ సంఘటనపై ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్) ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి కారకులైన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అధికారులకు కూడా ఇప్పటికే తెలియజేసినట్లు స్పష్టం చేశారు. -
ఐటీ పరిశ్రమలో డేటా భద్రత డొల్లేనా..?
న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమలో డేటా భద్రత అంతంత మాత్రమేనా..? అమెరికాకు చెందిన డేటా సెక్యూరిటీ సంస్థ ‘రుబ్రిక్’ నిర్వహించిన సర్వేలో ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెప్పిన మాటలు వింటే నిజమేనని అనిపిస్తోంది. తమ కంపెనీ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్టు భారత్లో 49 శాతం ఐటీ కంపెనీలు చెప్పడం గమనార్హం. తమ వ్యాపార డేటాపై సైబర్ దాడులు జరిగినట్టు పేరొందిన బ్రాండ్లు ప్రస్తావించాయి. అంతేకాదు వచ్చే 12 నెలల కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయే రిస్క్ అధికంగా ఉందని 30 శాతం సంస్థలు చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సంస్థలకు గాను ఒక సంస్థ గడిచిన ఏడాది కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయినట్టు చెప్పడం గమనార్హం. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్, భారత్లో ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 11 మధ్య ఈ సర్వే జరిగింది. గడిచిన ఏడాది కాలంలో ఒకటికి మించిన సార్లు డేటా చోరీ జరిగినట్టు ప్రతి ఆరు సంస్థలకు గాను ఒకటి చెప్పింది. డేటా భద్రత విషయంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ అధ్యయనం మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది. కృత్రిమ మేథ (ఏఐ)తోపాటు క్లౌడ్ అధునాతన సైబర్ భద్రత విషయంలో అవకాశాలు కల్పిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. దాడులను ఎదుర్కొనే సన్నద్ధత భారత్లో 54 శాతం ఐటీ కంపెనీలు సైబర్ నేరస్థుల చర్యలు తమ సంస్థ డేటాకు రిస్్కగా పేర్కొన్నాయి. వీటిలో 34 శాతం సంస్థలు సైబర్ దాడుల రిస్్కను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. ఏఐను అమలు చేయడం వల్ల సున్నిత డేటాను కాపాడుకోవచ్చని 54 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఎలాంటి ప్రభావం చూపించదని 24 శాతం కంపెనీలు అభిప్రాయం తెలియజేశాయి. ‘‘డేటా చోరీ వ్యాపారాలను నిరీ్వర్యం చేయగలదు. అందుకని డేటాను కాపాడుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. అది సైబర్ దాడులను కాచుకుని వ్యాపారం స్థిరంగా కొనసాగేలా ఉండాలి’’అని రుబ్రిక్ జీరో ల్యాబ్స్ హెడ్స్టీవెన్ స్టోన్ పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్ అటాక్
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీరంగం దూసుకుపోతోంది. దానికితోడు మోసాలూ అదే మాదిరి పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి దిగ్గజ సంస్థల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన చైనాకు చెందిన ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ)పై సైబర్దాడి జరిగినట్లు సమాచారం. ఆ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న అమెరికాలోని ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే సైబర్ దాడిని వెంటనే గుర్తించినట్లు ఐసీబీసీ తెలిపింది. ఈ దాడి ఎవరు చేశారనే విషయాలను వెల్లడించలేదు. దీనిపై పూర్తి విచారణ జరగాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సైట్లను పునరుద్ధరించేందుకు తమ భద్రతా నిపుణుల బృందం పనిచేస్తుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన యూఎస్ ట్రెజరీ ట్రేడ్లు, గురువారం నాటి స్వల్పకాల రుణాలైన రెపో ఫైనాన్సింగ్ ట్రేడ్లను విజయవంతంగా క్లియర్ చేసినట్లు ఐసీబీసీ చెప్పింది. అయితే ఈసైబర్దాడికి సంబంధించి ఫెడరల్ రెగ్యులేటర్లతో పాటు ఆర్థిక రంగ నిపుణులతో నిత్యం పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం వివరించింది. చైనాతో సంబంధం లేకుండా యూఎస్ కార్యకలాపాలు స్వతంత్రంగా జరుగుతాయని ఐసీబీసీ వెల్లడించింది. మార్కెట్పై ఈ ఘటన పరిమిత ప్రభావాన్ని చూపినట్లు బ్రోకర్ డీలర్ కర్వేచర్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్క్రిమ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ సైబర్దాడి తర్వాత ఐసీబీసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం సైబర్దాడికి ఉపయోగించిన సాఫ్ట్వేర్ వివరాలు లభించినట్లు సమాచారం. స్వీడిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రూసెక్ వ్యవస్థాపకుడు మార్కస్ ముర్రే మాట్లాడుతూ ఈ దాడికి లాక్బిట్ 3.0 అనే రాన్సమ్వేర్ను ఉపయోగించారని చెప్పారు. ఈ రకమైన రాన్సమ్వేర్ అనేక మార్గాల్లో సంస్థలోని సాఫ్ట్వేర్లో ప్రవేశించే అవకాశం ఉందని ముర్రే అన్నారు. ఉదాహరణకు ఎవరైనా ఈమెయిల్లోని స్పామ్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఇది సాఫ్ట్వేర్లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడం దీని లక్ష్యమన్నారు. ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి లాక్బిట్ 3.0 ప్రతిదశలో మాల్వేర్కు ప్రత్యేకమైన పాస్వర్డ్ అవసరం ఉంటుంది. అది చేధించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ లాక్బిట్ 3.0ని ‘రూపాలు మారుస్తూ తప్పించుకునేది’గా భావిస్తారు. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన అన్ని రాన్సమ్వేర్ దాడుల్లో 28శాతం లాక్బిట్ ద్వారా జరిగినవేనని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫ్లాష్పాయింట్ నివేదిక చెబుతుంది. -
సైబర్ బాధిత దేశాల్లో భారత్ టాప్
సాక్షి, అమరావతి: భారత్లోని ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ ప్రైవేటు కంపెనీలపై విదేశాల నుంచి సైబర్ దాడులు అంతకంతకూ అధికమవుతున్నాయి. విదేశాల నుంచి సైబర్ దాడులు జరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 2021 నుంచి 2023 మధ్య కాలంలో భారత్లోని సంస్థలపై సైబర్ దాడులు 278 శాతం పెరిగాయని సింగపూర్కు చెందిన అంతర్జాతీయ సైబర్ భద్రతా సంస్థ ‘సైఫిర్మా’ తాజా నివేదిక వెల్లడించింది. గతంలో పాకిస్తాన్ నుంచి భారత్పై సైబర్ దాడులు ఎక్కువగా జరగగా.. ప్రస్తుతం చైనా నుంచి అత్యధికంగా దాడులకు పాల్పడుతున్నారని ఆ నివేదిక తెలిపింది. అందులోనూ చైనా ప్రభుత్వ సంస్థల కేంద్రంగానే.. భారతీయ సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడటం గమనార్హం. భారత్పై అత్యధికంగా సైబర్ దాడులకు పాల్పడుతున్న దేశాల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో రష్యా, ఉత్తర కొరియా ఉన్నాయి. భారత్లోని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలపై సైబర్ దాడుల్లో.. 72 శాతం విదేశాల్లోని ప్రభుత్వ సంస్థల కేంద్రంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలే ప్రధాన లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా గత మూడేళ్లలో 13 శాతం సైబర్దాడులు భారతీయ సంస్థలు, కంపెనీలపైనే జరిగాయి. అమెరికా 9.6 శాతంతో రెండో స్థానంలో, ఇండోనేసియా 9.3 శాతంతో మూడో స్థానంలో, చైనా 4.5 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి. అలాగే భారత్లోని ప్రభుత్వ సంస్థలపై 20.4 శాతం, ఐటీ–బీపీవో కంపెనీలపై 14.3 శాతం, ఉత్పాదక సంస్థలపై 11.6 శాతం, వైద్య సంస్థలపై 10 శాతం, విద్యా సంస్థలపై 10 శాతం, ఆన్లైన్ రిటైల్ సంస్థలపై 9.8 శాతం, బ్యాంకింగ్ రంగ సంస్థలపై 9.5 శాతం, ఆటోమొబైల్ రంగ సంస్థలపై 8.3 శాతం, ఎయిర్లైన్ కంపెనీలపై 6.1 శాతం మేర సైబర్ దాడులు జరిగాయని నివేదిక వెల్లడించింది. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్లో సైబర్ దాడుల కలకలం
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్లో కలకలం రేగింది. నవంబర్ 3న అమెరికా ఇన్ఫోసిస్ యూనిట్ ‘ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్’ (ims)లో సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థలోని కొన్ని యాప్స్, కంప్యూటర్లు తీరు సరిగా లేదని తెలిపింది. అయితే, సంస్థలో ఏం జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమస్యను పరిష్కరించడానికి సైబర్ సెక్యూరిటీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామని, సిస్టమ్లు, డేటాపై ఎంతమేరకు ప్రభావం చూపిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్న ఇన్ఫోసిస్ వెల్లడించింది. సమస్యను పరిష్కరిస్తాం ‘డేటా రక్షణ,సైబర్ సెక్యూరిటీ మాకు అత్యంత ముఖ్యమైనవి. మేము దీన్ని త్వరగా పరిష్కరించడానికి ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల ప్రొవైడర్తో కలిసి పని చేస్తున్నాము. సిస్టమ్లు, డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందనే అంశాన్ని నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తును కూడా ప్రారంభించాము’ అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో ఇన్ఫోసిస్ పేర్కొంది. సోఫియాలో ఇన్ఫోసిస్ ఇదిలా ఉండగా, ఇన్ఫోసిస్ ఐరోపాలో కొనసాగుతున్న వృద్ధిలో భాగంగా బల్గేరియాలోని సోఫియాలో ఇన్ఫోసిస్ కొత్త కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. త్వదారా 500 మందికి ఉద్యగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పింది. కొత్త ఉద్యోగులను ఆకర్షించేలా రీ-స్కిల్ చేయడానికి, అప్ స్కిల్ చేయడానికి ఇన్ఫోసిస్ను అనుమతిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కంపెనీలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఐవోటీ, 5జీ, ఇతర ఐటీ ప్రొడక్ట్ల విభాగాల్లో పనిచేయనున్నారు. చదవండి👉 కెనడాకి బైబై చెబుతున్న భారతీయులు.. కారణం ఇదే? -
వారానికి జరిగే సైబర్ అటాక్లు ఎన్నంటే..
భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్పుర్లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్పుర్కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
సైబర్ బీమాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ బీమాకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్లో సైబర్ బీమా మార్కెట్ పరిమాణం 50–60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది. ‘సైబర్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్ వంటి డిజిటైజేషన్ అధికంగా ఉండే విభాగాలు సైబర్ క్రిమినల్స్కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది. పలువురు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ (రిస్క్ అడ్వైజరీ) ఆనంద్ వెంకట్రామన్ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రాబోయే మూడేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు. ► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్ ఇన్ఫ్రా బడ్జెట్లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ► దేశీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్ .. కఠినతరమైన సైబర్ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి. ► సైబర్ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి. ► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా కంపెనీలు కృషి చేయాలి. ► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి. -
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
Netflix Alert: మీకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉందా?
అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా మారిన డార్క్ వెబ్లో భారతీయుల వినియోగించే అమెజాన్ ఓటీటీ ఐడీ, పాస్వర్డ్లతో పాటు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ కార్డులను విచ్చల విడిగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అనుమానిత పాకిస్తాన్ హ్యాకర్ దాదాపు 5 వేల మంది భారత పౌరుల డేటాను డార్క్ వెబ్లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. హ్యాకర్ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానెల్లలో భారత పౌరుల ఐడెంటిటి కార్డులను విక్రయించడమే కాకుండా ఫోరమ్లలోని సమాచారాన్ని బహిరంగంగా లీక్ చేశాడు. దీంతో వేలాది భారతీయులు సైబర్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు తెలిపాయి. నిందితుడు డార్క్ వెబ్లోని పాకిస్తాన్ ఫోరమ్లో దేశీయ సమాచారాన్ని షేర్ చేశాడు. డేటాను అమ్మేందుకు కొనుగోలు దారులతో ఉర్దూలో సంభాషించాడని, సదరు నేరస్తుడి ప్రొఫైల్లో పాకిస్తాన్ జెండా ఉందని ఇంటెలిజెన్స్ నిపుణులు గుర్తించారు. ఆ హ్యాకర్ తీరును రోజుల తరబడి ట్రాక్ చేసిన తర్వాత భారత్కు చెందిన ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థల డేటా సైతం సేకరించినట్లు తేలింది. ఈ లీక్ గురించి హ్యాకర్ సీఈఆర్టీ -ఇన్, యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ను కూడా హెచ్చరించినట్లు వెల్లడైంది. డేటాను సేకరించిన హ్యాకర్ డార్క్ వెబ్లో అదనంగా 4వేల ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు,డ్రైవింగ్ లైసెన్స్లు బహిరంగంగా లీక్ అయినట్లు నివేదిక సూచిస్తుంది. అదే వ్యక్తి పాస్వర్డ్లతో సహా పెద్ద సంఖ్యలో నెట్ఫ్లిక్స్ ఖాతా వివరాలను, అంతర్జాతీయ గుర్తింపు పత్రాలను కూడా ఈ డార్క్ వెబ్లో షేర్ చేసిన దర్యాప్తులో వెల్లడైంది. -
గూగుల్ ఫారమ్ ఫిల్ చేస్తున్నారా?..6 లక్షల మంది భారతీయులపై హ్యాకర్ల పంజా!
పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గత నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్కు చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు డార్క్వెబ్లో అమ్మకానికి పెట్టారు. తాజాగా భారత్కు చెందిన మరో 6 లక్షల మంది పర్సనల్ డేటాను బోట్ మార్కెట్(ఆన్లైన్ మార్కెట్ ప్లేస్) లో అమ్ముకున్నట్లు తేలింది. పలు నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఆ డేటాను బోట్ మార్కెట్లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. 2018 నుండి ప్రపంచంలో అతి పెద్ద వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ కు చెందిన లూథూనియా నార్డ్ సెక్యూరిటీ రీసెర్చ్ బోట్ మార్కెట్ను ట్రాక్ చేసింది. 2018లో తొలిసారి బోట్ మార్కెట్ విడుదలైంది. నాటి నుంచి ఆ మార్కెట్ పనితీరుపై నార్డ్ వీపీఎన్ దృష్టిసారించగా..యూజర్ల వివరాలు బోట్ మార్కెట్లో లభ్యమవుతున్నట్లు గుర్తించింది. తన రిసెర్చ్లో భాగంగా ప్రధానమైన జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీ బోట్ మార్కెట్లతో పాటు దొంగిలించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాగిన్ ఐడీలు ఉన్నట్లు చెప్పింది. రూ.490కే నాటి నుంచి బోట్ మాల్వేర్ సాయంతో హ్యాకర్స్ యూజర్లు వినియోగిస్తున్న ఫోన్, ల్యాప్ట్యాప్, పర్సనల్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్ల నుంచి వారి లాగిన్ ఐడీలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్ షాట్లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాల్ని తస్కరించారు. ఒక్కో యూజర్ డేటాను రూ.490కి అమ్ముకున్నట్లు తేలింది. ఆటో ఫామ్స్ ఫిల్ చేస్తున్నారా? ఆటో ఫామ్స్ అంటే? ఏదైనా సంస్థ తన ప్రొడక్ట్ ఎలా ఉందో తెలిపేలా లేదంటే.. ఏదైనా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే ముందుకు గూగుల్ ఫారమ్స్ తరహాలో ఆటో ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫారమ్ ఫిల్ చేసిన యూజర్ల డేటా 667 మిలియన్ కుకీస్, 81వేల డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, 5లక్షల 38 ఆటో ఫారమ్స్ ఫిల్స్, భారీ ఎత్తున స్క్రీన్ షాట్లు, వెబ్ క్యామ్ స్నాప్ల నుంచి డేటాను సేకరించినట్లు నార్డ్ వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ తెలిపారు. డార్క్ వెబ్ వర్సెస్ బోట్ మార్కెట్ డార్క్ వెబ్ మార్కెట్ల కంటే బోట్ మార్కెట్లు విభిన్నంగా ఉంటాయి. బోట్ మార్కెట్లు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి ఒక్క డివైజ్ ద్వారా భారీ మొత్తంలో డేటాను సేకరిస్తాయని బ్రీడిస్ అన్నారు. ఐసీఎంఆర్పై 6వేల సార్లు దాడులు వాట్సాప్ తర్వాత దేశంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు.ఐసీఎంఆర్ వెబ్సైట్పై సుమారు 6వేల సార్లు దాడి చేశారు. విఫలమయ్యారు. పటిష్ట భద్రత కారణంగా సైబర్ నేరస్తుల ఐసీఎంఆర్ వైబ్ సైట్ నుంచి డేటాను పొందలేకపోయారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
సైబర్ దాడులను ఎదుర్కొనే కొత్త వ్యవస్థలు
బెంగళూరు: సైబర్ దాడులను అధిగమించే వ్యవస్థలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే మార్చి నాటికి కొత్త వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని సెబీ చైర్పర్సన్ మాధవి పురి తెలిపారు. సైబర్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నట్టు ఆమె తెలిపారు. సంక్షోభం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే చక్కని ప్రణాళికను స్టాక్ ఎక్సే్ఛేంజ్లు, డిపాజిటరీలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఏదో సాధారణ ప్రామాణిక విపత్తు రికవరీ ప్రణాళికలు అన్నవి కేవలం లొకేషన్ డౌన్టైమ్, హార్డ్వేర్, నెట్వర్క్ బ్రేక్డౌన్లనే పరిగణనలోకి తీసుకుంటాయి. సాఫ్ట్వేర్ బ్రేక్డౌన్, సమస్య విస్తరణను కాదు. సైబర్ దాడిలో సాఫ్ట్వేర్పైనే ప్రభావం పడుతుంది. దాంతో విపత్తు రికవరీ సైట్ కూడా ప్రభావానికి గురవుతుంది. దీనిపైనే మా ఆందోళన అంతా. అందుకే దేశంలోని రెండు పెద్ద స్టాక్ ఎకేŠస్ఛ్ంజ్లు అయిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తగిన భద్రతా వ్యవస్థలను అమల్లో పెట్టేలా చర్యలను సెబీ తీసుకుంది’’అని మాధవి వివరించారు. ప్రస్తుతం ఈ పని పురోగతిలో ఉందంటూ, ఇది వచ్చే మార్చి నాటికి పనిచేయడం మొదలు పెడుతుందన్నారు. ‘‘ప్రతిపాదిత యంత్రాంగంలో ప్రతి క్లయింట్కు సంబంధించి అన్ని రకాల పొజిషన్లు, తనఖా తదితర వివరాలన్నీ ‘ఏ’ ఎక్సే్ఛేంజ్ (ఆన్లైన్)లో ఉంటాయి. ఈ డేటా అంతా కూడా వెళ్లి ఎక్సే్ఛేంజ్ ‘బీ’ లోని స్టోరేజ్ బాక్స్లో (డేటా సెంటర్) ఎప్పటికప్పుడు నిల్వ అవుతుంటుంది. ఒకవేళ ఎక్సే్ఛేంజ్ ఏ బ్రేక్డౌన్ అయితే, అది సాఫ్ట్వేర్ దాడి (సైబర్ దాడి) అని సెబీ నిర్ధారిస్తే.. అప్పుడు ఎక్సేంజ్ బీలో డేటా అప్లోడ్ అయ్యే బటన్ను సెబీ ప్రెస్ చేస్తుంది’’అని సెబీ చైర్పర్సన్ వివరించారు. -
టాటా కంపెనీపై సైబర్ దాడి కలకలం
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మౌలిక సదుపాయాలు .. సైబర్ దాడికి గురయ్యాయి. దీంతో కొన్ని ఐటీ సిస్టమ్స్పై ప్రభావం పడిందని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. సిస్టమ్స్ను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించింది. కీలకమైన అన్ని సిస్టమ్లు యథాప్రకారం పని చేస్తున్నాయని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులు, కస్టమర్లు వినియోగించే పోర్టల్స్, టచ్ పాయింట్లపై కొన్ని పరిమితులు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను వదలని సైబర్ నేరగాళ్లు
-
సైబర్ దాడులు: సెబీ తాజా ఆదేశాలు
న్యూఢిల్లీ: అన్ని రకాల సైబర్ దాడులపై స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు ఆరు గంటల్లోగా నివేదించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశించింది. సైబర్ దాడులు, బెదిరింపులు, అతిక్రమణల సంబంధిత సంఘటనలను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం అందించ వలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై నిర్దేశిత సమయంలోగా స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సెబీకి తెలియజేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి అంశాలపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్)కు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సమయానుగుణంగా వెల్లడించవలసి ఉంటుందని తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో సెబీ పేర్కొంది. వీటికి అదనంగా నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్(ఎన్సీఐఐపీసీ) రక్షణాత్మక వ్యవస్థగా గుర్తించిన స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పారి్టసిపెంట్లు సైతం సైబర్ దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందించవలసి ఉంటుంది. ఎన్సీఐఐపీసీకి నివేదించవలసిందిగా సెబీ వివరించింది. పార్శ్వనాథ్కు చెక్ లిస్టింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో సెక్యూరిటీ మార్కెట్ల నుంచి రియల్టీ రంగ కంపెనీ పార్శ్వనాథ్ డెవలపర్స్ను సెబీ ఆరు నెలలపాటు నిషేధించింది. అంతేకాకుండా రూ. 15 లక్షల జరిమానా సైతం విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాల్సింది ఆదేశించింది. కాంట్రాక్టర్లు, సబ్కాంట్రాక్టర్ల లెడ్జర్ ఖాతాలలో ఔట్స్టాండింగ్ మొత్తాలపై ప్రొవిజన్లు చేపట్టడంలో వైఫల్యానికి సెబీ చర్యలు చేపట్టింది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టుల విషయంలో అకౌంటింగ్ ప్రమాణాలను పాటించకపోవడంపై కొరడా ఝళిపించింది. కోటక్ ఏఎంసీకి సెబీ జరిమానా ఎస్సెల్ గ్రూపు కంపెనీల పెట్టుబడుల కేసు ఎస్సెల్ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటక్ ఏఎంసీ, సంస్థ ఉద్యోగులకు సెబీ రూ.1.6 కోట్ల పెనాల్టీలను విధించింది. కోటక్ ఏఎంసీ ఎండీ నీలేష్ షా, కోటక్ ఏఎంసీ ఫండ్ మేనేజర్లు లక్ష్మీ అయ్యర్, దీపక్ అగర్వాల్, అభిషేక్ బిసేన్, కాంప్లియన్స్ ఆఫీసర్ జాలీభట్, నాడు పెట్టుబడుల నిర్ణయాలను ఆమోదించిన ఇన్వెస్ట్ కమిటీ సభ్యుడు గౌరంగ్షాలను 45 రోజుల్లోగా పెనాల్టీ చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. కోటక్ ఏఎంసీ ఆరు డెట్ పథకాల తరఫున ఎస్సెల్ గ్రూపు రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి గడువు 2019 ఏప్రిల్, మే నెలల్లో ముగిసింది. ఎస్సెల్ గ్రూపు పీకల్లోతు రుణ సంక్షోభంలో జారిపోవడంతో, ఆ గ్రూపు ప్రమోటర్లు, సంస్థలతో కోటక్ ఏఎంసీ ఒక ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల రుణ పత్రాలకు 2019 సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అప్పటివరకు ఆరు కోటక్ డెట్ పథకాల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా సెబీ పరిగణించింది. -
నూపుర్ శర్మ వ్యాఖ్యలు.. భారత్పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్సైట్లు హ్యాక్
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. ఇజ్రాయిల్లోని భారత ఎంబసీతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎక్స్టెన్షన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. దాదాపు 70 వెబ్సైట్లను, పోర్టల్స్ను హ్యాక్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్ వంటి ప్రముఖ సంస్థల వెబ్సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చదవండి: ప్రవక్తపై కామెంట్లు: మా బాస్ను మధ్యలోకి లాగి బద్నాం చేయకండి! -
ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని.. డబ్బులు కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పేజీ సంస్థకు చెందిన సర్వర్ను హ్యాక్ చేసిన దినేష్ దాని పూల్ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు కాజేయడంతో విషయం పోలీసుల వరకు వచ్చి చిక్కాడు. అదే ఓ హ్యాకర్ ఏదైనా పేమెంట్ గేట్వే సంస్థ లేదా ప్రైవేట్ బ్యాంక్ సర్వర్ను టార్గెట్ చేసి, దాని కస్టమర్ల ఖాతాల నుంచి రూ.10 చొప్పున కాజేస్తే అసలు బయటకే రాదు. సునామీ ఎటాక్స్గా పిలిచే ఈ తరహా సైబర్ దాడులు ఇటీవల పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హ్యాకర్లలో ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని, ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని, డార్క్వెబ్లో సాఫ్ట్వేర్లు ఖరీదు చేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆందోళన కలిగించే ఈ అంశంపై దృష్టి పెట్టి సైబర్ నిఘా ముమ్మరం చేశామని పేర్కొంటున్నారు. ఎప్పుడూ పెద్ద మొత్తాల జోలికి పోరు.. సర్వర్లోకి ప్రవేశించే హ్యాకర్లు ఆయా సంస్థల పూల్ ఖాతాలకు యాక్సెస్ చేస్తారు. అక్కడ నుంచి ఒకేసారి పెద్ద మొత్తాలు కాజేస్తే విషయం కేసుల వరకు వెళ్లి వీళ్లు చిక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యాకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మొత్తాల జోలికి వెళ్లట్లేదు. ప్రధానంగా ఆయా సంస్థల వినియోగదారుల ఖాతాలను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో ఖాతా నుంచి, ఒక్కో దఫా కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.5 మాత్రమే కాజేస్తారు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాల్లోనివి తాము తెరిచిన వర్చువల్ ఖాతాల్లోకి మళ్లించి బిట్కాయిన్స్గా మార్చేస్తారు. గమనించినా ఫిర్యాదు చేయరనే... ఖాతాదారుల నగదు కాజేస్తున్న హ్యాకర్లు ఆ లావాదేవీకి సంబంధించిన అలెర్ట్ కూడా వారికి వెళ్లకుండా సర్వర్లోనే మ్యానేజ్ చేస్తున్నారు. ఫలితంగా తన ఖాతా నుంచి ఈ మొత్తం పోయిందనే విషయం కస్టమర్లు గుర్తించలేరు. రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు.. ఇలా రౌండ్ ఫిగర్ నగదు ఉన్న వాటి ఖాతాల జోలికి హ్యాకర్లు వెళ్లరు. అయినప్పటికీ వినియోగదారుడు నగదు పోయినట్లు గుర్తించినా చిన్నమొత్తం కావడంతో ఫిర్యాదు వరకు వెళ్లరు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాలను టార్గెట్ చేస్తున్న హ్యాకర్కి చేరే మొత్తం మాత్రం భారీగానే ఉంటుంది. తన చేతిలో ఉన్న డబ్బు ఖర్చయ్యే వరకు లేదా విషయం ఖాతాదారుడు మర్చిపోతాడని భావించే కాలం వరకు ఈ సునామీ ఎటాక్ చేసిన హ్యాకర్ మరో ప్రయత్నం చేయరు. ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా.. నగరానికి చెందిన అనేక మంది ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులు హ్యాకర్లుగా మారారు. వివిధ రకాలైన యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ అంశాల ఆధారంగా హ్యాకింగ్పై పట్టు సాధిస్తున్నారు. ఇది చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్స్ను డార్క్వెబ్లో ఖరీదు చేస్తున్నారు. టార్గెట్ చేసిన సంస్థ సర్వర్ను హ్యాక్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ఐపీలను వాడుతున్నారు. వీటి ఆధారంగా ఆ సంస్థ సర్వర్లోకి ప్రవేశిస్తున్నారు. వాటి ఫైర్ వాల్స్ బలహీనంగా ఉండటం, సైబర్ సెక్యూరిటీలో లోపాలు వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. (క్లిక్: మ్యాట్రిమొనిలో ఎన్నారై పేరుతో మోసం! చివరకు..) బిల్లుల చెల్లింపులోనూ గోల్మాల్... ఈ సునామీ ఎటాక్స్ చేసే హ్యాకర్లు ‘బిల్లు చెల్లింపు’లోనూ గోల్మాల్స్ చేస్తుంటారు. వివిధ పోస్టు పెయిడ్ సేవలు పొందే పరియస్తులైన కస్టమర్ల కోసమే కమీషన్లు తీసుకుని ఈ పని చేస్తుంటారు. బ్రాండ్ బ్యాండ్ సహా వివిధ సేవలకు అందించే సంస్థలు తమ ఖాతాదారుడికి ప్రతి నెలా బిల్లు పంపిస్తుంటాయి. దీని చెల్లింపులు అతడు ఆన్లైన్లో చేస్తుంటాడు. రూ.10 వేల బిల్లు ఉంటే రూ.1000 తీసుకుని ‘మాఫీ’ చేయడం హ్యాకర్ పని. వినియోగదారుడి నుంచి ఈ మొత్తం కమీషన్గా తీసుకునే సునామీ హ్యాకర్ ఆ సంస్థ సర్వర్ను హ్యాక్ చేసి, బిల్లు మొత్తం క్లియర్ అయినట్లు సున్నాగా మార్చేస్తుంటాడు. ఇది కేవలం పరిచయస్తులైన వారితో కుమ్మక్కై చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. హ్యాకింగ్ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించలేకపోతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్: హైఫై ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!) -
నాటో, తూర్పు ఐరోపా దేశాలపై పరోక్ష దాడులకు దిగిన రష్యా..!
గత కొన్ని వారాల నుంచి ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా, రెండూ దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. అయితే, ఇలాంటి సమయంలో రష్యా పరోక్షంగా నాటోపై దాడులు చేసేందుకు సిద్ద పడినట్లు సమాచారం. రష్యా హ్యాకర్లు ఇటీవల నాటో నెట్వర్క్, కొన్ని తూర్పు ఐరోపా దేశాల సైనిక దళాలలకి చెందిన భద్రత వ్యవస్థపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ బుధవారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. "కోల్డ్ రివర్/కాలిస్టో" అనే రష్యన్ హ్యకర్ గ్రూప్ ఏ దేశ మిలిటరీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు అని "Credential Phishing Campaigns" నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. హ్యాకర్లు కొత్తగా క్రియేట్ చేసిన జీమెయిల్ ఖాతాలను ఉపయోగించి నాన్-గూగుల్ ఖాతాలకు ఈ ప్రచారాలను పంపారని, అందువల్ల ఈ ప్రచారాలు ఎంత వరకు విజయవంతం అయ్యాయో అనేది పూర్తిగా తెలియదని ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదికపై నాటో ఇంకా స్పందించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని రష్యా నిర్ణయం తీసుకున్న తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై భారీగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయితే, అప్పటి నుంచి పాశ్చాత్య దేశాలపై రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ దాడుల ఆరోపణలను ఖండించింది. నాటో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఈ బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు నాటి గూగుల్ నివేదిక తెలిపింది. (చదవండి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారత్ వృద్ధికి ఇండియా రేటింగ్స్ కోత!) -
హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్సైట్లు డౌన్.!
మునుపెన్నడూ లేని విధంగా రష్యన్ ప్రభుత్వ వెబ్సైట్లు సైబర్ దాడులను ఎదుర్కొంటున్నాయి. విదేశీ వెబ్ ట్రాఫిక్'ను ఫిల్టర్ చేయడానికి సాంకేతిక నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి సమస్య కొలిక్కి రావడం లేదు. ఉక్రెయిన్లో జరిగిన సంఘటనల వల్ల రష్యన్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. రష్యా దేశానికి చెందిన ప్రధాన ప్రభుత్వ స్బెర్ బ్యాంక్ సైబర్ దాడులను ఎదుర్కొంది. సైబర్ దాడులు పెరగడంతో ప్రస్తుత పరిస్థితులను అదుపు చేయడానికి మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని తెలిపింది. "ఇంతకు ముందు గరిష్ట సమయాల్లో వస్తున్న 500 గిగాబైట్ల ట్రాఫిక్ కంటే ఇప్పుడు 1 టెరాబైట్ ట్రాఫిక్ వస్తున్నట్లు" మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఇంతకు ముందు ఎదుర్కొన్న సైబర్ దాడుల కంటే ఇది రెండు నుంచి మూడు రెట్లు శక్తివంతమైనది" అని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు రష్యా నిషేదం విధించడంతో ఇప్పుడు ఆ దేశం ఒంటరిగా మారింది. ఈ సైబర్ దాడులను ఎదుర్కోవడానికి డిజిటల్ మంత్రిత్వ శాఖ ఆ దేశ ఐటీ కంపెనీలకు గ్రాంట్ల రూపంలో రూ.14 బిలియన్లు (సుమారు రూ.1,000 కోట్లు) కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఇంటర్ ఫ్యాక్స్ నివేదించింది. కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్కు మద్దతుగా ‘అనానమస్’ గ్రూప్ రష్యాపై ‘సైబర్ వార్’ ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా విధ్వంసానికి ప్రతిస్పందనగా తాము పదుల కొద్దీ రష్యన్ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ‘అనానమస్’ గ్రూప్ పేరిట సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. (చదవండి: ఉద్యోగులకు శుభవార్త..రూ.5 లక్షల నుంచి రూ.75లక్షల వరకు రుణాలు!) -
సొంత దేశంలోనే వ్లాదిమిర్ పుతిన్కు చుక్కలు చూపిస్తున్నారు!!ఉక్రెయిన్ జోలికెళ్తే అంతే!
ఉక్రెయిన్ జోలికొస్తే రష్యాను అది చేస్తాం. ఇది చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ జో బైడెన్ హెచ్చరికలు మాటల వరికే పరిమితం కావడంతో ఉక్రెయన్ మద్దతుగా రష్యన్ హ్యాకర్లు రంగంలోకి దిగారు. సొంత దేశంపై అనానమస్ పేరిట సైబర్ యుద్ధం ప్రకటించి ఆదేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్కు చుక్కలు చూపిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా ప్రకారం..రష్యా ప్రభుత్వానికి చెందిన వెబ్సైట్లను హ్యాకింగ్ చేయడం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అంతర్జాతీయ టెలివిజన్ నెట్వర్క్ను హ్యాకర్లు తమ స్వాధీనం చేస్తున్నారు. ఉక్రెయిన్పై చేస్తున్న రష్యా దాడికి నిరసనగా విదేశీ ప్రభుత్వ ఖాతాలను యాక్సెస్ చేయడంలో కీరోల్ ప్లే చేసిన అనానమస్ హ్యాకర్స్ గ్రూప్ రష్యాపై సైబర్వార్ చేస్తున్నట్లు హెచ్చరించింది. హెచ్చరికలు జారీచేసిన కొద్ది నిమిషాల్లోనే రష్యా ప్రభుత్వ వెబ్సైట్లు, క్రెమ్లిన్, డూమా, రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలక వెబ్సైట్ లు హ్యాకింగ్కు గురయ్యాయి. దీంతో రష్యా ప్రభుత్వ కార్యకాలపాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అదే సమయంలో ప్రభుత్వానికి చెందిన సైబర్ నిపుణులు.. హ్యాకింగ్ ను ఛేదిస్తున్నారు. హ్యాకర్లు చేస్తున్న సైబర్ దాడులతో వెబ్సైట్లు నెమ్మదించాయని, సోషల్ మీడియా నెట్వర్క్ లు సైతం స్తంభించాయని యూజర్లు తెలిపారు. రాత్రి నుంచి కొనసాగుతున్న విధ్వంసం ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా దండయాత్ర కొనసాగుతుంది. యుద్ధవిమానాలు, క్షిపణులతో రష్యా ఆర్మీ విరుచుకుపడుతోంది. మెలిటోపోల్ నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కీవ్ సిటీపై రెండు మిసైల్ దాడులు జరుగాయి. కీలక ఆర్మీ బేస్డ్ క్యాంప్ పైన రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. రష్యా దాడుల్ని ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. రాత్రి నుంచి జరుగుతున్న విధ్వంసంలో ఇప్పటి వరకు 38పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. -
మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?!
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రకటించింది. ఉక్రెయిన్కు మూడువైపుల బలగాల్ని మోహరించింది. ఉక్రెయిన్కు సరిహద్దులకు యుద్ధ ట్యాంక్లను పంపించింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలకు తమ బలగాల్ని పంపిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మరో ప్రమాదం అంచున పడినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈఎస్ఈటీ నివేదిక ప్రకారం..ఉక్రెయిన్ను టార్గెట్ చేస్తూ ఆ దేశ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన కంప్యూటర్లలో ప్రమాదకరమైన వైరస్ను పంపినట్లు తేలింది. గత రెండు నెలలుగా దేశంలోని వందలాది కంప్యూటర్లలో ఈ వైరస్ను ఇన్స్టాల్ చేసినట్లు వెల్లడించింది. ఈ వైరస్ సాయంతో హ్యాకర్లు ఉక్రెయిన్ కు సంబంధించిన దేశ అంతర్గత మిలటరీ రహస్యాలు, ఇరుదేశాలతో ఉన్న సత్సంబంధాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. మరోవైపు రష్యా తన సరిహద్దుల చుట్టూ దళాలను మోహరించడంతో ఉక్రెయిన్ ఇప్పటికే గత కొన్ని వారాలుగా హ్యాకర్ల బారిన పడుతోంది. ఈ వారం మాస్కో తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు దళాలను ఆదేశించిన తర్వాత పూర్తి స్థాయి హ్యాకింగ్ భయాలు పెరిగాయి. దీంతో వైరస్ దాడుల్ని ఎవరు చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా హెర్మెటికా డిజిటల్ లిమిటెడ్ అనే కంపెనీకి జారీ చేసిన సర్టిఫికెట్ తో వైపింగ్ సాఫ్ట్వేర్ సాయంతో హ్యాకింగ్ కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు. అయితే దాదాపు ఏడాది క్రితం సైప్రియాట్ రాజధాని నికోసియాలో ఏర్పాటు చేసిన హెర్మెటికా సంస్థ గురించి ఆరా తీయగా.. ఆ కంపెనీ వివరాలు కానీ, వెబ్సైట్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైరస్ ఎలా పనిచేస్తుంది? టెక్ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఉక్రెయిన్ కంప్యూటర్లపై దాడి చేసిన సాఫ్ట్వేర్...కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లోని మొత్తం డేటాను చదవలేని విధంగా అందించడం, స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్లో స్టోర్ చేసిన డేటాను యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ పనిచేస్తుండగా.. హానికరమైన ప్రోగ్రామ్ను కంప్యూటర్ల నుంచి వేరు చేసేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు పోటీ పడుతున్నారు. మాకేం సంబంధంలేదు ఉక్రెయిన్పై జరుగుతున్న సైబర్ దాడులపై ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో రష్యా సైబర్ దాడులకు పాల్పడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ ఆరోపణల్ని ఖండించింది. -
ఉక్రెయిన్పై రష్యా ‘ప్లాన్ సీ’ దాడులు?
Russia Ukraine Conflict: ఒకవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్, పుతిన్ నడుమ చర్యలపై రష్యా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్పినట్లు.. ఇరు దేశాల అధ్యక్షుల నడుమ ఫేస్ టు ఫేస్ చర్చలు ఉండబోవని, కేవలం ఉక్రెయిన్ అంశం ఆధారంగా ‘భద్రత, యూరప్లో వ్యూహాత్మక స్థిరత్వం’ కోసం ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధుల మధ్య మాత్రమే భేటీ జరగొచ్చని పేర్కొంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఇంకా ఆవరించే ఉండగా.. తాజాగా ఉక్రెయిన్ అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా ప్లాన్ సీ తరహా దాడులకు సిద్ధమైనట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్లాన్ సీ అంటే ఏంటో కాదు.. సీ అంటే సైబర్ దాడులు. రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా భారీ ఎత్తున్న సైబర్ ఎటాక్లు జరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం ఈ దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలను అప్రమత్తం చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. అయితే రష్యా, ఉక్రెయిన్పై సైబర్ దాడులకు పాల్పడడం కొత్తేం కాదు. కానీ, సరిహద్దు పరిణామాల తర్వాత ఉక్రెయిన్లో సైబర్ దాడులు పెరిగిపోయాయి. ఈ దాడుల వెనుక రష్యానే ఉందని ఉక్రెయిన్ ఆరోపిస్తూ వస్తోంది కూడా. అయితే మాస్కో అధికారులు మాత్రం ఆ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని సైబర్ సెక్యూరిటీ సీఈఆర్టీ-యూఏ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ బ్యాంకింగ్తో పాటు రక్షణ వ్యవస్థకు కూడా ముప్పు పొంచి ఉందని వారించింది ఆ ఏజెన్సీ. ఉక్రెయిన్ ఆక్రమణకు సిద్ధపడిన నేపథ్యంలో.. ముందుగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని రష్యా భావిస్తున్నట్లు పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజధాని కీవ్లో ఉన్న ప్రముఖ బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలను మాస్కో ప్రభుత్వ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. గతవారం ఉక్రెయిన్ రక్షణ విభాగపు వెబ్సైట్, పలు బ్యాంకుల వెబ్సైట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన టెర్మినల్ సేవలకు విఘాతం ఏర్పడింది. దీని వెనుక మాస్కో హ్యాకర్ల హస్తం ఉందనేది ఉక్రెయిన్ ఆరోపణ. ఇప్పటికే యుద్ధవాతావరణంతో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుదేలు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు సరిహద్దులో పరిస్థితులు చల్లారినట్లే కనిపిస్తున్నప్పటికీ.. పశ్చిమ భాగంలో మోహరింపులు, వేర్పాటువాదుల నుంచి ఉక్రెయిన్పై దాడులు, ప్రతిగా ఉక్రెయిన్ జరుపుతున్న దాడుల్లో రష్యాకు ఆస్తి నష్టం వాటిల్లుతుండడం లాంటి పరిణామాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా.. రష్యా భూభాగంలో ఉక్రెయిన్కు చెందిన ఐదుగురు విధ్వంసకారులను హతమార్చినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. సంబంధిత వార్త: భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్లో చుక్కలు.. పరిస్థితి చెయ్యి దాటిందా? -
అణు, మిసైల్ ప్రోగ్రాంలకు నిధుల కోసం... ఉత్తర కొరియా సైబర్ దాడులు
ఐరాస: అణు, మిసైల్ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. సైబర్ స్పెషలిస్టులను ఉటంకిస్తూ ఐరాస నిపుణుల ప్యానల్ సోమవారం ఈ మేరకు వెల్లడించింది. ‘‘ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని మూడు క్రిప్టో ఎక్స్చేంజీల నుంచి 2020 నుంచి 2021 మధ్య కనీసం 5 కోట్ల డాలర్లను ఉత్తర కొరియా కొట్టేసింది. అలాగే వాటిపై ఏడుసార్లు సైబర్ దాడులకు తెగబడి 40 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీనీ దొంగిలించింది. ఆ సంస్థల ఇంటర్నెట్ కనెక్టెడ్హాట్ వాలెట్ల నుంచి మాల్వేర్, ఫిషింగ్, కోడ్ ఎక్స్ప్లాయిట్స్, ఇతర అధునాతన సోషల్ ఇంజనీరింగ్ మార్గాల్లో కాజేసిన ఈ నిధులను డీపీఆర్కే నియంత్రిత అడ్రస్లకు తరలిస్తోంది. తర్వాత పకడ్బందీ మనీ లాండరింగ్ ప్రకియ ద్వారా క్రిప్టో కరెన్సీని సొమ్ము చేసుకుంటోంది’’ అని ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఈ ప్యానెల్ వివరించింది. డీపీఆర్కే అంటే డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. 2019–2020 మధ్య కూడా సైబర్ దాడుల ద్వారా 32 కోట్ల డాలర్లకు పైగా ఉత్తర కొరియా కొట్టేసిందని ఏడాది కిందే ఈ ప్యానెల్ ఆరోపించింది. నిషేధాలను ఉల్లంఘిస్తూ అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉందని తాజా రిపోర్టులో పేర్కొంది. ‘‘అణు పరీక్షల్లాంటివి జరిపినట్టు ఆధారాల్లేకున్నా కీలకమైన యురేనియం, ఫ్లూటోనియం తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్ల ప్రయోగంపై విధించుకున్న నాలుగేళ్ల స్వీయ నిషేధాన్ని పక్కన పెడతామని కొరియా ఇటీవల హెచ్చరిస్తూ వస్తుండటం తెలిసిందే. -
నేనూ ట్రోలింగ్కు గురయ్యా.. పీవీ సింధు కీలక వ్యాఖ్యలు
PV Sindhu Comments On Cyber Bullying And Trolling: సైబర్ నేరాలపై మహిళలు, పిల్లలను చైతన్య పరిచేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత స్టార్ షట్లర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీవీ సింధు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను చాలా సందర్భాల్లో ట్రోలింగ్కు, సైబర్ బుల్లియింగ్కు గురయ్యానని ఆమె వెల్లడించారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని, మహిళలు, పిల్లలు కూడా ఇలాంటి సందర్భాల్లో అధైర్యపడకుండా పోలీసుల సహకారంతో సైబర్ అటాక్లకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్ నేరాలు భారీగా పెరిగాయని, ఇందులో ప్రధానంగా మహిళలు, పిల్లలే బలవుతున్నారని వాపోయారు. ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో తల్లిదండ్రులు నిరంతరం పిల్లలను గమనిస్తూ ఉండాలని, వారు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వాటిని అధిగమించేందుకు అందుకు తగిన చైతన్యం వారిలో నింపాలని సూచించారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ లాగే, సైబర్ మోసాలకు సైబర్ వారియర్లు ఉన్నారనే విషయాన్ని గుర్తించాలని కోరారు. సైబర్ నేరాల బారిన పడిన వారు నిస్సంకోచంగా సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఐజీ బి సుమతి పాల్గొన్నారు. చదవండి: అంపైర్ను బూతులు తిట్టిన స్టార్ ప్లేయర్కు భారీ జరిమానా -
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్లైన్. -
హైటెక్ ఘరానా మోసగాళ్లు..! నమ్మించి సింపుల్గా రూ. 58 వేల కోట్లు స్వాహా..!
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. ఈ ఏడాదిలో క్రిప్టోకరెన్సీల మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరిగింది. పలు కొత్త క్రిప్టోకరెన్సీలు కూడా పుట్టుకొచ్చాయి. 2021లో క్రిప్టోలపై ఎంత ఆదరణను నోచుకుందంటే రగ్ పుల్స్(సైబర్ నేరస్తులు) సింపుల్గా లక్షలాది మంది ఇన్వెస్టర్లను నమ్మించి గొంతుకోశారు. ఈ ఏడాదిలో సుమారు అనేక స్కామ్ల ద్వారా రగ్ పుల్స్ ఏకంగా 7.7 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 58,697 కోట్లు)ను కాజేశారని డిజిటల్ కరెన్సీ పరిశోధన సంస్థ చైనాలిసిస్ వెల్లడిచింది. చదవండి: ఇది నిజమా? జూదాన్ని చట్టబద్ధం చేస్తే భారీ ఆదాయం! గత ఏడాదితో పోలిస్తే అధికం..! నకిలీ క్రిప్టో టోకెన్లను సృష్టించి ఆయా ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో లాగేశారు రగ్పుల్స్. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టో స్కామ్స్ 2021లో 81 శాతం మేర పెరిగాయని చైనాలిసిన్ పేర్కొంది. నకిలీ క్రిప్టోకరెన్సీలతో పలు ఇన్వెస్టర్లకు భారీ దెబ్బ తగలడంతో డిజిటల్ కరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు ఒక్కింతా జంకుతున్నారని చైనాలిసిస్ వెల్లడించింది. స్క్విడ్ గేమ్ పేరుతో ఇన్వెస్టర్లకు కుచ్చు టోపి..! ఈ ఏడాది నవంబర్లో వచ్చిన స్క్విడ్గేమ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను నోచుకుంది. స్క్విడ్ గేమ్ నుంచి ప్రేరణ పొందిన రగ్పుల్స్ స్క్విడ్గేమ్ అనే క్రిప్టో టోకెన్ను ప్రవేశపెట్టారు. ఈ టోకెన్పై ఇన్వెస్టర్లు ఏగబడ్డారు. అదును చూసుకొని రాత్రికి రాత్రే ఈ క్రిప్టోకరెన్సీ కనుమరుగైంది. ఈ టోకెన్తో సుమారు దాదాపు $3.3 మిలియన్లు (దాదాపు రూ. 22 కోట్లు)ను కాజేశారు. అసలు ఎవరీ రగ్పుల్స్..? రగ్ పుల్స్ సింపుల్గా చెప్పలాంటే..క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సైబర్ నేరస్తులు. వీరు హైటెక్ ఘరానా మోసగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోపై వస్తోన్న ఆదరణను క్యాష్ చేసుకునే వారు. వీరు హైటెక్ డెవలపర్లు, డిజిటల్ కరెన్సీలో పలు టోకెన్లను సృష్టించి...వాటిపై ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగేలా చేసి అదును చూసుకొని ఇన్వెస్టర్లు పెట్టిన మొత్తం పెట్టుబడిని క్షణాల్లో ఉడ్చేశారు. సాధారణంగా వికేంద్రీకృత ఫైనాన్స్ (DeFi)లో రగ్ పుల్స్ ఎక్కువగా కనిపిస్తారు. చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..! -
అమ్మ బాబోయ్..మెయిల్స్ పంపిస్తున్నారు, దర్జాగా కోట్లు నొక్కేస్తున్నారు..!
బనశంకరి: పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థల ఈమెయిల్స్ను పోలిన నకిలీ ఈమెయిల్స్ రూపొందించి వాటి ద్వారా తప్పుడు సమాచారం పంపి కోట్ల రూపాయలను సైబర్ ముఠాలు దోచుకుంటున్నాయి. బెంగళూరులో ఇటువంటి వంచక మెసేజ్లను నమ్మి అనేక కంపనీలు డబ్బు కోల్పోతున్నాయి. ఇలా ఐదు ప్రముఖ కంపెనీలు నగరంలోని సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. కాంటినెంటల్, ఫ్యూచర్రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, అద్విక్ ఆటో, ఇతర కంపెనీలు ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఎలా జరుగుతుందంటే తాము ముడిసరుకులను ఒక సంస్థ నుంచి తెప్పించుకుంటామని ఓ బాధిత కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈమెయిల్, బ్యాంకు అకౌంట్ల ద్వారా లావాదేవీలను నిర్వహిస్తుంటామని చెప్పారు. తమకు సరుకులను సరఫరా చేసే సంస్థ ఇటీవల నగదు జమచేయాలని ఈ మెయిల్ చేసిందని, వారు సూచించిన ఖాతాల్లోకి రూ.60 లక్షలను పంపామని తెలిపారు. కానీ అది కంపెనీకి చెందిన మెయిల్, అకౌంటు కాదని, సైబర్ నేరగాళ్లు తప్పుడు ఈమెయిల్ ద్వారా తమ డబ్బును కొట్టేశారని వాపోయారు. రూ.34 లక్షలు ఒక సంస్థ, రూ.2 లక్షలు మరో సంస్థ ఇలాగే మోసపోయాయి. కొద్దిరోజుల తరువాత కంపెనీ వారిని సంప్రదించగా, తమకు ఏ డబ్బూ అందలేదని చెప్పారన్నారు. దాదాపు ప్రతి సంస్థదీ ఇదే సమస్య. జాగ్రత్తలు పాటించాలి కంపెనీల మధ్య సాగే ఈమెయిళ్లను హ్యాక్ చేయడమో, లేదా ఇంటి దొంగల ద్వారా మెయిల్ ఐడీలను కనుక్కుని, అచ్చం అటువంటి ఈమెయిల్నే క్రియేట్ చేస్తారు. తద్వారా బురిడీ కొట్టిస్తారని పోలీసులు తెలిపారు. ఈమెయిల్పైనే ఆధారపడకుండా వీడియో కాన్ఫరెన్స్లు, ఫోన్లలో మాట్లాడుకుని నిర్ధారించుకోవాలని, ఆ తరువాతే నగదు లావాదేవీలు జరడం సురక్షితమని సూచించారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..! వాటితో జాగ్రత్త..!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులను హెచ్చరించింది. ఎస్బీఐకు చెందిన కస్టమర్ కేర్ నంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులకు వెల్లడించింది. తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లతో మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఖాతాదారులను ఎస్బీఐ పేర్కొంది. చదవండి: రిలయన్స్తో డీల్ క్యాన్సల్..! భారత్ను వదులుకునే ప్రసక్తే లేదు...! సైబర్ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ..కస్టమర్ కేర్ నంబర్ల సహాయంతో ఖాతాదారుల నుంచి డబ్బులను సేకరిస్తోన్నట్లు ఎస్బీఐ గుర్తించింది. ఖాతాదారుల వ్యక్తిగత డేటాను సైబర్ నేరస్తుల చేతిలో పెడితే భారీగా ప్రమాదం అవకాశం ఉందని ఎస్బీఐ పేర్కొంది. కాగా ఎస్బీఐ తాజాగా ఇలాంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎస్బీఐ తన ట్విట్లో...‘మోసపూరిత కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రత్తగా ఉండండి. సరైన కస్టమర్ కేర్ నంబరు కోసం దయచేసి ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించండి. మీ ఖాతాకు సంబంధించిన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దునని’ పేర్కొంది. Beware of fraudulent customer care numbers. Please refer to the official website of SBI for correct customer care numbers. Refrain from sharing confidential banking information with anyone.#CyberSafety #CyberCrime #Fraud #BankSafe #SafeWithSBI pic.twitter.com/70Sw7bIuvo — State Bank of India (@TheOfficialSBI) November 21, 2021 చదవండి: అరె డాల్ఫిన్లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది -
భారత్ కేంద్రంగా ఇరాన్ హ్యాకర్లు భారీ కుట్ర!
న్యూఢిల్లీ: గత కొంత కాలం క్రితం చైనా హ్యాకర్లు ఇండియాలోని కొన్ని సంస్థలు హ్యాక్ చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఇరాన్ హ్యాకర్లు భారతదేశంలోని ఐటీ సేవల సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఐటీ సంస్థలను హెచ్చరించింది. జూలై 2021కి ముందు దేశంలో ఉన్న చిన్న కంపెనీలను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు ఇప్పుడు టెక్ దిగ్గజ కంపెనీలను సిద్దం అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. గతంతో పోలిస్తే దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు తెలిపింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న 40 కంటే ఎక్కువ ఐటీ కంపెనీలకు 1,600 నోటిఫికేషన్లను జారీ చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2020లో కంపెనీ జారీ చేసిన 48 నోటిఫికేషన్ల కంటే ఇది చాలా ఎక్కువ. “ఇరానియన్ హ్యాకర్లు దృష్టి ముఖ్యంగా గత ఆరు నెలల్లో పుంజుకున్న ఐటీ రంగం మీద ఉంది. మా నోటిఫికేషన్లలో దాదాపు 10-13% గత ఆరు నెలల్లో ఇరాన్ హ్యాకర్లకు సంబంధించినవే. అంతకు ముందు ఆరు నెలల్లోని రెండున్నర శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ” అని కంపెనీ తెలిపింది. (చదవండి: ఎలన్ మస్క్ ఆపసోపాలు, టిమ్ కుక్ అప్పుడే ప్రకటించేశాడు..?!) టెక్ దిగ్గజాలపై సైబర్ దాడులు ఈ హ్యాకర్లు ఇజ్రాయెల్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పాటు భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి" సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు మధ్యకాలంలో ఇరానియన్ హ్యాకర్లు భారతదేశంలోని కంపెనీలతో రాజీ చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సెంటర్, మైక్రోసాఫ్ట్ డీజిటల్ సెక్యూరిటీ యూనిట్ పేర్కొంది. ఇతర దేశాల అనుబంధ సంస్థలు, ఖాతాదారుల ఖాతాలను పరోక్షంగా అనుమతి పొందడం కోసం భారతీయ ఐటీ సంస్థలపై ఆకస్మిక దాడులకు చేసేందుకు సిద్దం అయినట్లు కంపెనీ ఊహించింది. భారతీయ ఐటీ సంస్థలు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు బ్యాకెండ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి. భారీగా మొబైల్ దాడులు "ఇటువంటి దాడులు ముఖ్యంగా వారికి లాభదాయకంగా ఉంటాయి. దాడి చేసేవారికి ఈ డేటా చాలా విలువైనది, ఎందుకంటే పెద్ద సంఖ్యలో వినియోగదారుల ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీల మీద దాడులు చేసే అవకాశం ఉన్నట్లు" అని భద్రతా సంస్థ కాస్పెర్స్కీ ఈ వారం ప్రారంభంలో ఒక నివేదికలో తెలిపింది. "అలాగే, రికార్డు స్థాయి సైబర్-దాడులతో ప్రపంచంలో అలజడి సృష్టించవచ్చు, ఎక్కువ సంఖ్యలో రాన్సమ్ వేర్ మొబైల్ దాడుల జరగవచ్చు" అని భద్రతా సంస్థ చెక్పాయింట్ రీసెర్చ్లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మాయా హోరోవిట్జ్ అన్నారు. (చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!) -
నోర్టన్ ల్యాబ్స్ హెచ్చరిక! ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతులు
బెంగళూరు: సెలవుల సీజన్లో టెక్ సపోర్ట్ స్కాములు మరింతగా పెరగనున్నాయి. అలాగే షాపింగ్, విరాళాల సేకరణ రూపంలో ఫిషింగ్ దాడుల ముప్పు కూడా పొంచి ఉందని నోర్టన్ ల్యాబ్స్ హెచ్చరించింది. ఇటీవల ఆ సంస్థ రూపొందించిన వినియోగదారుల సైబర్ భద్రత నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పేరొందిన టెక్నాలజీ కంపెనీల నుంచి వచ్చినట్లుగా అనిపించే 1.23 కోట్ల పైచిలుకు మోసపూరిత టెక్ సపోర్ట్ యూఆర్ఎల్స్ను బ్లాక్ చేసినట్లుగా నోర్టన్ తెలిపింది. 1.72 కోట్ల సైబరు దాడులు కరోనా వైరస్ సంక్షోభ సమయంలో వినియోగదారులు తమ ఉద్యోగ విధులను, కుటుంబ బాధ్యతల నిర్వహణకు డివైజ్లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడంతో టెక్ సపోర్ట్ స్కాముల బెడద మరింత పెరిగిందని వివరించింది. గత త్రైమాసికంలో కేవలం భారత్లోనే 1,72,14,929 పైచిలుకు సైబర్ దాడులను తాము అడ్డుకోగలిగినట్లు పేర్కొంది. భయాన్ని పెంచి వినియోగదారుల్లో భయం, అనిశ్చితి, సందేహాలు రేకెత్తించడంలో టెక్ సపోర్ట్ స్కాములు.. అత్యంత సమర్ధమంతంగా పనిచేస్తాయని వివరించింది. తమ సైబర్ భద్రతకు పెను ముప్పు ఉందని వినియోగదారులను ఇవి భయపెట్టగలవని పేర్కొంది. ఫిషింగ్ దాడుల్లో భాగంగా సిసలైన బ్యాంకు పోర్టల్స్గా భ్రమింపచేసే వెబ్సైట్ల లింకులను పంపించి, ఆయా బ్యాంకుల కస్టమర్లను నేరగాళ్లు ఏమారుస్తున్నారని వివరించింది. వారి వివరాలను తస్కరించి, మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. క్రెడిట్ కార్డుల స్థాయిలో భద్రత ఉండని గిఫ్ట్ కార్డులకు ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉండవచ్చని నోర్టన్ వివరించింది. చదవండి:4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్: సైబర్ఎక్స్9 -
అలా చేస్తే పెను ముప్పే..! తీవ్రంగా హెచ్చరించిన ఆపిల్..!
అమెరికా, ఇతర దేశాల్లో గూగుల్, ఆపిల్ వంటి టెక్ కంపెనీలు గూత్తాధిపత్యాన్ని తగ్గించేలా ఆయా దేశాలు పలు కఠిన చట్టాలను తెస్తున్నాయి. యూరోపియన్ దేశాలు(ఈయూ) దిగ్గజ టెక్ కంపెనీలపై తీవ్రంగా వ్యవహరిస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రించేందుకు ఇప్పటికే పలు చట్టాలను తీసుకువచ్చాయి. కాగా ఈ చట్టాలను ఆపిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చదవండి: ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...! అలా చేస్తే పెనుముప్పే...! టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రణలో భాగంగా ఈయూ దేశాలు ఆపిల్ ప్లే స్టోర్పై భారీ షరతులను పెట్టాయి.ప్లే స్టోర్ యాప్స్లో ఇతర సైడ్ లోడింగ్ యాప్స్(థర్డ్పార్టీ యాప్స్)కు వీలు కల్పిస్తూ ఈయూ చట్టం చేసింది. దీనిపై ఆపిల్ ఈయూ దేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. థర్డ్పార్టీ యాప్స్ను ప్లే స్టోర్లోకి ఆలో చేస్తే యూజర్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరించింది. సైడ్ లోడింగ్ యాప్స్తో జరిగే నష్టాల నివేదికను బుధవారం రోజున ఆపిల్ విడుదల చేసింది. మాల్వేర్ దాడులతో యూజర్ల ప్రైవసీ, భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆపిల్ వెల్లడించింది. ప్లే స్టోర్పై ఈయూ విధించిన రూల్స్ను కాస్త సులభతరం చేయాలని ఆపిల్ విన్నవించింది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్పార్టీ యాప్స్తో సుమారు 60 లక్షల యూజర్ల స్మార్ట్ఫోన్స్ సైబర్ దాడులకు ప్రభావితమయ్యాయని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్స్కై పేర్కొంది. ముందే హెచ్చరించిన టిమ్ కుక్..! గతంలో ఈయూ తెచ్చిన చట్టాలపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పూర్తిగా వ్యతిరేకించాడు. సైడ్లోడింగ్ యాప్స్తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్ఫుల్గా ఈ థర్డ్పార్టీ యాప్స్ను ఇన్స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోఏస్ ప్లాట్ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్లో ఉంచుతామని వివరించాడు. చదవండి: తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..! -
ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!
Thousands Of Gamers Targeted In A New Cyberattack: మన నిత్యజీవితంలో స్మార్ట్ఫోన్స్, ఇంటర్నెట్ ఓక భాగమైపోయింది. చౌక ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ రాకతో తరుచూ ఆన్లైన్లో ఉంటూ..ఎప్పుడు ఎదో ఒక అంశంపై బ్రౌజ్ చేస్తు కాలక్షేపం చేస్తున్నాం. దీంతో ఇంటర్నెట్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. అదేస్థాయిలో సైబర్ నేరస్తులు యూజర్లపై దాడిచేస్తున్నారు. హ్యకర్లు కూడా కొత్త పుంతలను తొక్కుతూ...రకరకాలుగా దాడులకు పాల్పడుతున్నారు. సైబర్ నేరస్తులు రూట్ మార్చి గేమ్స్ ఆడే వారిపై విరుచుకుపడుతున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై పరిశోధకులు తన నివేదికలో వెల్లడించారు. చదవండి: Xiaomi: బెల్ట్తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..! ఆన్లైన్ గేమ్స్ ఆడే వారేలక్ష్యంగా దాడులు..! సైబర్ నేరగాళ్లు బ్లడీస్టీలర్ అని పిలువబడే కొత్త మాల్వేర్తో ఎక్కువగా గేమర్స్ను, వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని కాస్పర్ స్కై పేర్కొంది. బ్లడీస్టీలర్ మాల్వేర్తో సెషన్ డేటా , పాస్వర్డ్స్, కుకీ ఎక్స్ఫిల్ట్రేషన్ను హ్యకర్లు పొందుతున్నట్లు కాస్పర్స్కై పేర్కొంది. ఆన్లైన్ గేమ్స్ ఆడే యూజర్ల బ్యాంక్ కార్డ్ వివరాలను, బ్రౌజర్ ఆటోఫిల్డేటా, స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్ల నుంచి స్క్రీన్ షాట్లను హ్యాకర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. కాస్పర్ స్కై నివేదిక ప్రకారం... ఎపిక్ గేమ్స్, స్టీమ్, ఆరిజిన్, గాగ్. కామ్(GOG.com), బెథెస్డా, టెలిగ్రామ్, వైమ్ వరల్డ్ వంటి ఫ్లాట్ఫామ్స్ యూజర్ల సెషన్ వివరాలను హ్యకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన జీటీఏ ఫైవ్, ఫార్ట్నైట్, బ్యాటిల్ ఫీల్డ్,ఫిఫా 2022 గేమ్స్ ఉన్నాయి. రష్యన్ ఫోరమ్లో బ్లడీస్టీలర్ అనే మాల్వేర్ తొలిసారిగా మార్చి 2021లో కాస్పర్స్కై గుర్తించింది. ఈ మాల్వేర్ సహాయంతో గేమర్స్ నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజర్ల నుంచి డబ్బులను వసూలు చేస్తోన్నట్లు కాస్పర్స్కై పేర్కొంది. చదవండి: జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
వీటి కోసం గూగుల్లో వెతికితే ప్రమాదమే..!
ప్రస్తుత కాలంలో ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా మనకు గూగులే దిక్కు. ఈ 4జీ యుగంలో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు.. ఫోన్లోనే భూగోళాన్ని చుట్టేస్తున్నారు. అయితే గూగుల్ సెర్చ్ లో ఏది వెతికినా దొరికేస్తుందని మనకు తెలుసు. కానీ, కొన్నింటి సమాచారం గూగుల్లో వెతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ కి సంభందించి, కస్టమర్ కేర్ నంబర్లు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇలాంటి నంబర్ల కోసం సెర్చ్ చేయక పోవడమే మంచిది. తెలియకుండా సెర్చ్ చేస్తే అనవసరంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కే ప్రమాదం ఉంటుంది. సైబరాబాద్ పరిధిలో 1395 కేసుల్లో ఇలాంటి మోసాలే ఎక్కువగా ఉన్నాయి. 189 కేసుల్లో బాధితులు రూ.1.01 కోట్ల డబ్బులు పోగొట్టుకున్నారు. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఫుడ్ డెలివరీ యాప్లు, ట్రావెల్స్, కొరియర్, గూగుల్పే, ఫోన్పే, పేటీఎం వంటి సంస్థలకు చెందిన కస్టమర్ కేర్ నంబర్లు కోసం చాలానే మంది సర్చ్ చేస్తున్నారు. అయితే, సైబర్ మోసగాళ్లు గూగుల్ యాడ్స్ కొనుగోలు చేసి నకిలీ వివరాలను పోస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే, గూగుల్ సర్చ్ ఇంజిన్(ఎస్ఈఓ) ద్వారా సైబర్ నెరగాళ్లు వారి పేర్కొన్న మొబైల్ నెంబర్ మొదట వచ్చే విధంగా చేస్తున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) అందుకే గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి సంస్థకు వెబ్సైట్ లేదా యాప్ ఉంటుంది. అక్కడి నుంచే తీసుకోవాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఇటువంటి మోసల గురుంచి బ్యాంకులు తమ ఖాతాదారులును అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇలాంటి స్కామ్స్ గురించి కొద్ది రోజుల క్రితం వినియోగదారులను హెచ్చరిస్తూ ఒక వీడియోను ట్వీట్ చేసింది. మీరు చూడండి. Beware of fraudulent customer care numbers. Please refer to the official website of SBI for correct customer care numbers. Refrain from sharing confidential banking information with anyone.#CyberSafety #CyberCrime #Fraud #BankSafe #SafeWithSBI pic.twitter.com/Q0hbUYjAud — State Bank of India (@TheOfficialSBI) September 18, 2021 -
ఐక్యరాజ్య సమితికి సైబర్ సెగ, కీలక సమాచారం హ్యాక్!
ఐక్యరాజ్య సమితిపై సైబర్ ఎటాక్ జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వర్లకు ఉండే రక్షణ వ్యవస్థలను హ్యకర్లు చేధించారు. పలు దేశాల మధ్య జరిగిన చర్చలు, లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అవును నిజమే గుర్తు తెలియని హ్యాకర్లు ఐక్యరాజ్య సమితికి సంబంధించి పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యక్ చేశారని యూఎన సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో హ్యకింగ్ జరిగినట్టు గుర్తించామని, దీనికిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. హ్యకింగ్ ఇలా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనే దానిపై విచారణ కొనసాగుతోంది. యూన్కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉద్యోగికి చెందిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా హ్యకర్లు యూఎన్ సిస్టమ్స్తో అనుసంధానమైనట్టు గుర్తించారు. ఆగస్టు వరకు యూఎన్కి సంబంధించిన సిస్టమ్స్తో యాక్సెస్ సాధించిన హ్యకర్లు ఏప్రిల్ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించారు. అయితే వారు ఏ సమాచారం తస్కరించారు. అందులో భద్రతాపరంగా కీలకమైనవి ఏమైనా ఉన్నాయా ? అనే అంశాలను గుర్తించే పనిలో యూఎన్ భద్రతా సిబ్బంది ఉన్నారు. చదవండి: అశ్లీల వీడియోలకు పరోక్ష కారణం?.. ఎఫ్బీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు -
సురక్షిత డిజిటల్ విధానాలు రూపొందించాలి - బ్రిక్స్ నివేదిక
ముంబై: సంబంధిత వర్గాల నమ్మకం చూరగొనేలా, సభ్య దేశాల్లో అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చేలా సురక్షితమైన డిజిటల్ వ్యవస్థాను రూపొందించాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ కూటమి ఒక నివేదికలో పేర్కొంది. బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండో సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ పలు నివేదికలను ఆవిష్కరించింది. వీటిని బ్రిక్స్ సభ్య దేశాల సెంట్రల్ బ్యాంకులు రూపొందించాయి. బ్రిక్స్ దేశాల్లో డిజిటల్ ఆర్థిక సేవల పరిధి విస్తరణ (డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్–డీఎఫ్ఐ) నివేదికను ఆర్బీఐ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. కోవిడ్–19 మహమ్మారి రాకతో డీఎఫ్ఐపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం పెరిగిందని నివేదిక వివరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ సైబర్ దాడులు, ఆన్లైన్ మోసాలు వంటి సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల కూటమిని బ్రిక్స్గా వ్యవహరిస్తున్నారు. చదవండి: Cryptocurrency: ఆర్బీఐ ఆందోళన.. నిర్ణయం కేంద్రం పరిధిలో -
డీమార్ట్ పేరిట ఘరానా మోసం, లింక్ ఓపెన్ చేశారో అంతే!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. నకిలీ యాప్స్, క్లోన్ వెబ్సైట్ల పేరుతో సైబర్ నేరస్థులు అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాట్సాప్లో కూడా నకిలీ వెబ్సైట్ల లింకుల బెడద ఎక్కువగానే ఉంది. సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సారి రిటైల్ సూపర్ మార్కెట్ల దిగ్గజం డీమార్ట్ రూపంలో సైబర్ నేరస్థులు విరుచుకుపడుతున్నారు. చదవండి: Ola Electric: మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్...! డీమార్ట్ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ లింక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్ తన ట్విట్లో పేర్కొంది. నకిలీ లింక్పై క్లిక్ చేసినప్పుడు, స్పిన్ వీల్ ఉన్న థర్డ్ పార్టీ వెబ్సైట్కు ప్రజలు మళ్లీంచబడతారు. మీరు సుమారు రూ. 10,000 వరకు బహుమతి కార్డులను గెలుచుకోవడానికి స్పీన్ వీల్ తిప్పమని అడుగుతుంది. మీరు వీల్ను స్పిన్ చేసిన వెంటనే'ఉచిత బహుమతి'తో మరొక లింక్ ఓపెన్ అవుతోంది. గిఫ్ట్ను క్లెయిమ్ చేయడానికి 'ఉచిత బహుమతి' పోటీని ఇతర స్నేహితులతో పంచుకోవాలని మిమ్మల్ని అడుగుతుంది.ఆయా లింక్లను ఓపెన్ చేస్తే సైబర్నేరస్తులు ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. బీ అలర్ట్.. ఈ లింక్ ఓపెన్ చేయవద్దు.#DMart pic.twitter.com/x9XmqHzWqO — Economic Offences Wing Cyberabad (@EOWCyberabad) August 21, 2021 (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్బెజోస్...!) -
ఈ వెబ్సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!
సాక్షి, హైదరాబాద్: గత కొంతకాలంగా సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్, వెబ్సైట్ల పేరుతో ప్రజలకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ఫోన్లలోకి నకిలీ వెబ్సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్లను సామాన్య ప్రజలకు సైబర్ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్సైట్లను, ఇతర లింక్ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, EZ ప్లాన్, సన్ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్ల పెంపు తప్పనిసరి కానుందా..!) -
మీరు వాట్సాప్ వాడుతున్నారా..అయితే జాగ్రత్త!
కరోనావైరస్ రాకతో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలు గణనీయంగా పెరిగాయి. కేవైసీ అప్డైట్ పేరిట బ్యాంకు ఖాతాదారులపై సైబర్ నేరస్తులు విరుచుకుపడుతున్నారు. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న హాకర్లు కొంత పుంతలు తొక్కుతున్నారు. తాజాగా వాట్సాప్ యాప్ ద్వారా సైబర్నేరస్తులు తెరపైకి మరో కొత్త స్కామ్ను తెచ్చారు. ఆన్లైన్ ఆర్డర్స్ పేరిట వాట్సాప్ యూజర్లకు హానికరమైన లింక్లను హాకర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా లింకులను ఓపెన్చేయగానే యూజర్లకు చెందిన బ్యాంకు బ్యాలెన్స్ను హకర్లు ఊడ్చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి. తాజాగా రష్యాకు చెందిన సైబర్సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై ఆన్లైన్ డెలివరీ పేరిట వాట్సాప్ యాప్కు వస్తోన్న సందేశాలపై యూజర్లను హెచ్చరించింది. వాట్సాప్ మెసేజ్లను చేస్తున్న ఆయా హాకర్లు ఆన్లైన్ డెలివరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్గా పనిచేసిన వారుగా ఉన్నారని కాస్పర్స్కై పరిశోధకులు వెల్లడించారు. ఆయా ఆన్లైన్ డెలివరీ సంస్థలు అందించే వస్తువులను వాట్సాప్ ద్వారా యూజర్లకు పంపుతూ పేమెంట్ చేసే సమయంలో వారి బ్యాంకు వివరాలను పూర్తిగా తెలుసుకోని యూజర్ల బ్యాంకు బ్యాలెన్స్ను ఊడ్చేస్తున్నట్లు కాస్పర్స్కై పేర్కొంది. వాట్సాప్కు వచ్చే ఆన్లైన్ డెలివరీ సంస్థల లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని కాస్పర్స్కై యూజర్లకు హెచ్చరించింది. హాకర్లు నకిలీ వైబ్సైట్ లింక్లను పంపుతూ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపింది. సరైన వెబ్సైట్ చిరునామా లేదా అనుమానాస్పదంగా అనిపించే ఏదైనా లింక్పై ఎప్పటికీ క్లిక్ చేయకూడదని వాట్సాస్ యూజర్లను కాస్పర్స్కై పేర్కొంది. -
Cyberattacks: ఒకే సంస్ధపై సగటున వారానికి 1,738 సార్లు..!
ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలల్లో పలు సంస్థలపై సైబర్దాడులు గణనీయంగా 29 శాతానికి పెరిగాయి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో సైబర్దాడులు అధికంగా జరిగాయి. యూఎస్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలు సైబర్దాడులకు గురైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ తెలిపింది. ఈ ఏడాదిలో ఆయా సంస్థలపై రాన్సమ్వేర్ దాడుల సంఖ్య 93 శాతం పెరిగిందని చెక్ పాయింట్ పేర్కొంది. చెక్పాయింట్ తన 'సైబర్ ఎటాక్ ట్రెండ్స్: 2021 మిడ్-ఇయర్ రిపోర్ట్' ను గురువారం విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో భాగంగా ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య రంగం, క్లిష్టమైన మౌలిక సదుపాయాలతో సహా అన్ని రంగాల్లోని సంస్థలపై సైబర్దాడులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. టార్గెట్ భారత్ ..! యూఎస్లో17 శాతం మేర సగటున వారానికి 443 సార్లు సైబర్దాడులు జరిగాయి. ముఖ్యంగా యూరప్లో సైబర్దాడులు 27 శాతం పెరుగుదల ఉండగా, లాటిన్ అమెరికాలో వృద్ధి 19 శాతం నమోదైంది. చెక్పాయింట్ తన నివేదిక భారత్పై జరిగిన సైబర్దాడులు ఒక్కింతా విస్మయానికి గురిచేసేలా ఉంది. భారత్కు చెందిన ఒక సంస్థపై గత ఆరునెలల్లో సగటున వారానికి 1,738 సార్లు దాడులను ఎదుర్కొన్నట్లు చెక్పాయింట్ పేర్కొంది. భారత్లో విద్య, పరిశోధన, ప్రభుత్వ, సైనిక, భీమా, చట్టపరమైన, తయారీ రంగాలకు చెందిన, ఆరోగ్య రంగాలకు చెందిన సంస్థలపై గణనీయంగా సైబర్దాడులు జరిగినట్లు చెక్పాయింట్ వెల్లడించింది. హాకర్లకు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే సైబర్దాడులకు భారత్ కీలక లక్ష్యంగా నిలుస్తోందని చెక్పాయింట్ పేర్కొంది. మరింత భీకరమైన దాడులు..! ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్వేర్ దాడుల్లో కూడా గణనీయమైన పురోగతి ఉందని చెక్పాయింట్ తెలిపింది. పలు సంస్థల ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించి, ఆయా సంస్థలు హాకర్లు అడిగినంతా డబ్బు చెల్లించకపోతే బహిరంగంగా డేటాను విడుదల చేస్తామని బెదిరింపులకు రాన్సమ్ వేర్ పాల్పడుతుంది. ఈ ఏడాదిలో రాన్సమ్ వేర్ సోలార్ విండ్స్ సప్లై చెయిన్స్ను లక్ష్యంగా చేసుకొని భారీగా సైబర్దాడులను నిర్వహించాయి. రాన్సమ్వేర్ దాడులను మరింత పెంచడానికి హాకర్లు కొత్త గ్రూప్లను ఏర్పాటు చేయనున్నట్లు చెక్పాయింట్ పేర్కొంది. భవిష్యత్తులో రాన్సమ్వేర్ దాడులు మరింత భీకరంగా ఉంటాయని చెక్పాయింట్ తన నివేదికలో తెలిపింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..!
ప్రభుత్వ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులను హెచ్చరించింది. బ్యాంకు ఖాతాదారులకు పలు బూటకపు మెసేజ్లను వారి మొబైల్ నంబర్లకు, ఈ-మెయిల్ అకౌంట్లకు సైబర్ నేరస్థులు పంపుతుంటారు. ఒక వేళ ఫోన్లకు, ఈ-మెయిల్కు వచ్చే మెసేజ్లను నమ్మితే అంతే సంగతులు...! ఖాతాదారుల అకౌంట్లలోని డబ్బులను సైబర్ నేరస్థులు సమస్తం ఉడ్చేస్తారు. తన ఖాతాదారులను అప్రమత్తం చేయడానికి ఎస్బీఐ పలు సూచనలను చేసింది. బూటకపు మెసేజ్లు, ఇతర ఫిషింగ్ మోసాల నుంచి ఎప్పటికప్పుడు ఎస్బీఐ తన ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఎస్బీఐ తన ఖాతాదారులకు బూటకపు మేసేజ్లను గుర్తించడంలో పలు సూచనలు చేసింది. ఖాతాదారులకు వచ్చే సందేశాలు బ్యాంకు పంపిందా లేదా.. అనే విషయాన్ని ఏలా ధృవీకరించాలనే విషయాన్ని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ తన ఖాతాదారులకు కేవలం ‘SBI/SB’ అనే షార్ట్కోడ్స్ను ఉపయోగించి మాత్రమే మొబైల్ నంబర్కు మేసేజ్లను పంపుతుందని ట్విటర్లో పేర్కొంది. ఉదాహరణకు SBIBNK, SBIINB, SBIPSG, SBIYONO లాంటి మేసేజ్లు బ్యాంకు పంపినట్లుగా ఖాతాదారులు ధృవీకరించాలని ఎస్బీఐ పేర్కొంది. ఇతర గుర్తుతెలియని మెసేజ్లను అసలు ఒపెన్ చేయకుండా ఉండడమే మంచిదని ఎస్బీఐ పేర్కొంది. Always check who's behind the door before letting anyone in. Here is your key to safety.#SafeWithSBI #CyberSafety #StayAlert #StaySafe #SBI #StateBankOfIndia pic.twitter.com/6FbFgP6Y2t — State Bank of India (@TheOfficialSBI) July 27, 2021 -
చైనాకు చెక్పెట్టేందుకు సిద్ధమైన బైడెన్ ప్రభుత్వం
వాషింగ్టన్: ప్రపంచంలోని మిత్రదేశాలతో కలిసి చైనాకు చెక్పెట్టాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల చైనా సైబర్దాడులపై పలు దేశాలతో కలిసి అమెరికా ఆరోపణలు చేసింది. ఈయూ, నాటో సహా పలు దేశాలు సోమ వారం చైనాపై సైబర్దాడుల అంశంలో అమెరికా తో కలిసి ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. చైనాను అడ్డుకునేందుకు అందరితో కలిసి పనిచేయడమే తమ వ్యూహమని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే తొలిసారి నాటో చైనాకు వ్యతిరేకంగా సైబర్దాడులపై ఆరోపణ చేసిందని, పలు దేశాలు సైతం ఈ విషయంలో ముందుకువచ్చి చైనాను విమర్శించాయని తెలిపాయి. ఇలాంటి అనైతిక సైబర్ దాడులు కేవలం అమెరికానే కాకుండా పలు దేశాలను ఇబ్బంది పెడుతున్నా యని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ జెన్సాకి చెప్పారు. అందువల్ల వీటి నివారణకు మిత్రులతో కలిసి చర్యలు చేపడతామని చెప్పారు. సైబర్ దాడుల అంశంలో రష్యా, చైనాలకు బేధం ఉందన్నారు. అవసరమైనప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రూపులు కడితే బెదిరేది లేదు!: చైనా బీజింగ్: తమపై నిరాధార ఆరోపణలు మోపేందుకు పలు దేశాలతో అమెరికా గ్రూపులు కడుతోందని, తమపై ఇలా బురద జల్లడం మానుకోవాలని చైనా హెచ్చరించింది. అంతర్జాతీయ సైబర్ కుట్ర చేసారంటూ తనపై అమెరికా, నాటో కూటమి చేసిన ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. యూఎస్ ప్రోత్సాహంతోనే నాటో సైబర్ స్పేస్ను యుద్ధభూమిగా మార్చిందని, దీనివల్ల సైబర్ ఆయుధాల పోటీ పెరిగిందని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్ విమర్శించారు. పలు దేశాల్లో జరిగిన సైబర్ దాడులపై యూకే, ఆస్ట్రేలియా, కెనడా, నాటో దేశాలు, జపాన్, న్యూజిలాండ్తో కలిసి యూఎస్ సోమవారం చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది. క్రిమినల్ హ్యాకర్లతో చైనాకు అధికారిక సంబంధాలున్నాయని విమర్శించింది. ఇవన్నీ నిరాధారాలని లిజియన్ తోసిపుచ్చారు. సైబర్ దాడులను తాము ప్రోత్సహించమన్నారు. సైబర్ దాడులకు నాటోనే కారణమని దుయ్యబట్టారు. ఆరోపణలపై యూఎస్ చూపుతున్న ఆధారాలు సంపూర్ణంగా లేవన్నారు. నిజానికి ప్రపంచంలో అమెరికానే అతిపెద్ద సైబర్దాడుల కర్తని ఆరోపించారు. తమ దేశంపై జరుపుతున్న ఇలాంటి హ్యాకింగ్ దాడులను ఆపాలని అమెరికా, దాని మిత్రదేశాలను చైనా హెచ్చరించింది. ఇలాంటి దాడులు అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
పెరుగుతున్న సైబర్ దాడులతో రిస్క్
ముంబై: కరోనా రెండో విడత భారత్పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. అయితే మే చివరి నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు చెప్పారు. పెరుగుతున్న డేటా తస్కరణ, సైబర్ దాడుల సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘2020–21 రెండో అర్ధ భాగంలో కోలుకున్న దేశ ఆర్థిక వ్యవస్థపై.. 2021 ఏప్రిల్, మే నెలల్లో తిరిగి ప్రభావం పడింది. కరోనా వైరస్ కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంగా నియంత్రణలోకి రావడం వల్ల మే చివరి నుంచి, జూన్ వరకు కార్యకలాపాల్లో పురోగతి నెలకొంది’’ అంటూ ఆర్బీఐ రూపొందించిన ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్)లో శక్తికాంతదాస్ ప్రస్తావించారు. ఎన్పీఏలు పెరగొచ్చు.. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) 2021 మార్చి నాటికి 7.5 శాతం వద్దే స్థిరంగా, ఆరు నెలల ముందునాటి మాదిరే ఉన్నట్టు ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ తెలిపింది. అయితే 2022 మార్చి నాటికి ఇవి 9.8 శాతానికి పెరిగే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఇది కూడా కనీస అంచనాలేనని.. పరిస్థితులు మరీ ప్రతికూలంగా మారితే స్థూల ఎన్పీఏలు 11.22 శాతానికి కూడా పెరిగిపోవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2021 మార్చి నాటికి 9.54 శాతంగా ఉంటే.. 2022 మార్చి నాటికి 12.52 శాతానికి చేరొచ్చని పేర్కొంది. అయితే, ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఎఫ్ఎస్ఆర్లో బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2022 మార్చి నాటికి 13.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేయడం గమనార్హం. బ్యాంకుల వద్ద తగినంత నిధులున్నట్టు ఈ నివేదిక తాజాగా పేర్కొంది. ఆర్థిక సంస్థల బ్యాలన్స్ షీట్లపై ప్రభావం గతంలో వేసిన స్థాయిలో ఉండకపోవచ్చని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. తాము ప్రకటించిన చర్యలు పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాలిస్తేనే వాస్తవ ప్రభావం ఎంతన్నది తెలుస్తుందన్నారు. ఆర్థిక స్థిరత్వమే తమ ప్రాధాన్యంగా చెప్పారు. రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై దృష్టి రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై ఎక్కువ ప్రభావం ఉందంటూ వీటిపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎఫ్ఎస్ఆర్ బ్యాంకులకు సూచించింది. అనుకూల మార్కెట్ పరిస్థితులు ఏర్పడితే మూలధన నిధులను పెంచుకోవాలని కోరింది. చదవండి : జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు! -
సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్!
కరోనా మహమ్మరి వల్ల డిజిటల్ వినియోగం విపరీతంగా పెరగింది. అందుకే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన సామాన్య ప్రజానీకం నుంచి సెలిబ్రిటీలు వరకు వీటి బారిన పడుతున్నారు. అంతేగాక ఈ సైబర్ వలలో అనేక దేశాల కూడా చిక్కుకుంటున్నాయి. ఇప్పుడు ఒక దేశం సైబర్ పరంగా ఎంత సురక్షితంగా ఉంటే అంత బలమైనది అని అర్ధం. భవిష్యత్ లో జరగబోయే యుద్దాలు ఎక్కువగా సైబర్ యుద్దాలే అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటువంటి సమయంలో దేశాలు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎంత శక్తివంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి లండన్ కు చెందిన థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్ఎస్) చేసిన ఒక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో వాటి సామర్థ్యాలకు అనుగుణంగా దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. సైబర్ శక్తి పరంగా భారతదేశం థర్డ్ టైర్ లో ఉంది. భారతదేశంతో పాటు ఇండోనేషియా, జపాన్, మలేషియా, ఉత్తర కొరియా, ఇరాన్, వియత్నాం వంటి దేశాలు ఈ టైర్ లో ఉన్నాయి. ఇక సెకండ్ టైర్ లో మన శత్రు దేశం చైనా, రష్యా, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి దేశాలు ఉన్నాయి. టాప్ టైర్ లో కేవలం ఒకే ఒక దేశం అమెరికా మాత్రమే ఉంది. ఐఐఎస్ఎస్ లో సైబర్ స్పేస్ నిపుణుడైన గ్రెగ్ ఆస్టిన్ మాట్లాడుతూ..ప్రస్తుత ఆన్ లైన్ గూఢచర్యం చాలా శక్తివంతమైనది. ఆర్ధికంగా వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశం, జపాన్ వంటి శక్తివంతమైన దేశాలు థర్డ్ టైర్ లో ఉండటం ఆశ్చర్యం అని ఆయన అన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా వంటి చిన్న దేశాలు అత్యాధునిక సైబర్ నైపుణ్యాలను కలిగి ఉన్నాయి. అంతేగాక, ఈ నివేదిక చైనా సైబర్ శక్తి సామర్ధ్యాలు బయట ప్రపంచం అనుకున్నంత రితలో లేవని పేర్కొంది. పేలవమైన భద్రత, బలహీనమైన ఇంటెలిజెన్స్ విశ్లేషణ కారణంగా సైబర్ శక్తిలో చైనా వెనుకబడినట్లు వెల్లడించింది. మరో దశాబ్దం పాటు చైనా సైబర్ పవర్ పరంగా అమెరికా సామర్థ్యాలను చేరుకోలేదని అంచనా వేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం చైనా, రష్యా వంటి దేశాలు ఆన్ లైన్ గూఢచర్యం, మేధో సంపత్తిలో తప్పుడు సమాచార ప్రచారాలతో సహా అభ్యంతరకరమైన సైబర్ కార్యకలాపాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. కానీ సైబర్ భద్రత విషయానికి వస్తే వారు అమెరికా కంటే వెనుక ఉన్నట్లు పేర్కొంది. డీజిటల్ ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్ధ్యాలు, ఇంటెలిజెన్స్ పరిపక్వత, భద్రతా విధులు, సైనిక సైబర్ శక్తి సామర్థ్యాల ఆధారంగా ఐఐఎస్ఎస్ ఈ దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్! -
రెండేళ్లలో 15 లక్షల సైబర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండేళ్లలో(2019–2020) దేశవ్యాప్తంగా 15.5 లక్షల సైబర్ సెక్యూరిటీ దాడులు సంభవించాయని, ఒక్క 2020లోనే 11.58 లక్షల సమస్యలు నమోదయ్యాయని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ ప్రమాదాలపై జాతీయ స్థాయిలో సీఈఆర్టీ-ఇన్(ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) పరిశోధన చేస్తుందని హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రాతపూర్వక సమాధానంలో తెలిపారు. 2020 ఐటీ చట్టం సెక్షన్ 70బీ నిబంధనల ప్రకారం ఈ సంస్థ వ్యవహరిస్తుందన్నారు. 2019లో 3.95 లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు జరిగాయన్నారు. ఆయా రంగాల్లో మాల్వేర్ ప్రమాదాల గురించి సిట్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్స్, థ్రెట్ ఇంటిలిజెన్స్ సోర్సుల నుంచి సీఈఆర్టీ సమాచారం సేకరిస్తుందన్నారు. ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఘటన సంస్థ దృష్టికి రాగానే సదరు వ్యవస్థను హెచ్చరించి తగిన సలహాలిస్తుందని, తదుపరి చర్యల కోసం ఆయా విభాగాలకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు సమాచారమందిస్తుందని తెలిపారు. -
కార్డులు, ఖాతాలు భద్రంగా ఉన్నాయా?
మొబైల్ ఫోన్ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్ సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. ఈ కామర్స్ షాపింగ్ కూడా మొబైల్ ఫోన్ల నుంచే ఎక్కువగా కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు కానీయండి.. వినోదం, షాపింగ్, విద్య ఇలా ఒకటేమిటి ఎన్నో అవసరాల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడడం పట్టణ, నగర జీవనంలో భాగంగా మారిపోయింది. దీంతో సమాచారానికి భద్రతా రిస్క్ నెలకొంది. మొబైల్ ఫోన్ అయినా, కంప్యూటర్ అయినా.. సైబర్ నేరగాళ్లు కీలక సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. కనుక వినియోగదారులుగా మన బ్యాంకు ఖాతాలు, కార్డులు, ఫోన్లు, వ్యాలెట్లకు తగినంత భద్రత ఉందా? అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటీవలే ఓ ఈ కామర్స్ పోర్టల్కు సంబంధించి 2 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. వెంటనే డార్క్ వెబ్లో ఈ వివరాలను అమ్మకానికి పెట్టడం కూడా జరిగిపోయింది. అదే విధంగా ఈ ఏడాది ఆగస్ట్లో 3,69,000 బ్యాంకింగ్ ఖాతాదారుల వివరాలను చోరీ చేసే ప్రయత్నం చోటు చేసుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాయే హ్యాకింగ్కు గురైందంటే సామాన్యుల ఖాతాలకు రక్షణ ఏ పాటిది? ఈ ఉదాహరణలన్నీ కూడా డిజిటల్ వేదికలపై మన సమాచారం చోరీకి గురికాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసేవే. కవరేజీ అన్నింటికీ కాదు.. ఉద్దేశపూర్వక, నేరపూరిత, మోసపూరిత తదితర చర్యలకు పాలసీ కవరేజీ ఉండదు. అలాగే, ఈ ప్లాన్లు పాలసీదారులకు అయ్యే గాయాలకు గానీ, మానసిక, భావోద్వేగ ఇబ్బందులు తదితర వాటికి పరిహారం ఇవ్వవు. కంప్యూటర్లు, పరికరాలకు వాటిల్లే నష్టానికీ పరిహారం రాకపోవచ్చు. కనుక పాలసీ డాక్యుమెంట్ను ముందే పూర్తిగా చదవడం అవసరం. క్లెయిమ్ ప్రక్రియ ఇతర సాధారణ బీమా పాలసీల మాదిరే క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. పోలీసు లేదా సైబర్ సెల్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని, దానిని క్లెయిమ్ ఫామ్కు జత చేసి బీమా కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. లావాదేవీలకు సంబంధించిన రుజువులను కూడా చూపించాలి. సైబర్ దాడి లేదా చోరీ జరిగిన వెంటనే బీమా సంస్థకు ఫోన్ రూపంలో లేదా ఈ మెయిల్ ద్వారా వెంటనే తెలియజేయడం మంచిది. కస్టమర్లు తమ సంస్థ పోర్టల్పై క్లెయిమ్ నమోదు చేసుకోవచ్చని లేదా కస్టమర్కేర్ విభాగానికి సమాచారం తెలియజేయవచ్చ ని ఐసీఐసీఐ లాంబార్డ్కు చెందిన సంజయ్దత్తా సూచించారు. క్లెయిమ్స్ మేనేజర్, సైబర్ నిపుణులు ఈ విషయంలో పాలసీదారుకు అవసరమైన సహకారాన్ని అందిస్తారని చెప్పారు. రక్షణ కావాల్సిందే.. స్మార్ట్ పరికరాలను వాడే వారిలో అధిక శాతం మందికి.. మాల్వేర్, ఫైర్వాల్స్ విషయంలో రక్షణ గురించి అవగాహన లేదు. కార్యాలయాల్లో మనం వినియోగించే పరికరాలకు ఎక్కువ భద్రతే ఉంటుంది. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇంటి నుంచే పని విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) పెరిగిపోయింది. అందుకే ఇటీవలి కాలంలో సైబర్ ఇన్సూరెన్స్కు ఆదరణ పెరుగుతోంది. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండివిడ్యువల్ సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం వివరాలు కోరే వారు 2020–21తొలి 6 నెలల్లో 20% అధికంగా ఉన్నట్టు కంపెనీ తెలియజేసింది. ఇక ఫ్యూచర్ జన రాలి ఇండియా ఇన్సూరెన్స్ సైబర్ పాలసీలకూ డిమాండ్ 30–40% అధికమైంది. ‘‘సైబర్ దాడుల నుంచి సైబర్ ఇన్సూరెన్స్ మీకు రక్షణ ఇవ్వదు. కాకపోతే ఈ తరహా సైబర్ దాడుల కారణంగా మీకు వాటిల్లే నష్టానికి పరిహారాన్ని అందించే విధంగా ఉంటుంది. కీలకమైన సమాచారాన్ని చోరీ చేసినా, దుర్వినియోగం చేసినా లేక మీ ప్రతిష్టకు నష్టం కలుగజేసినా కవరేజీనిస్తుంది’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు. పాలసీ తీసుకునే ముందు ► రిస్క్ల మదింపు: ఆన్లైన్లో సైబర్ రిస్క్ ఏ స్థాయిలో ఉంది? డిజిటల్ లావాదేవీలను ఏ స్థాయిలో చేస్తున్నారు.. ఎన్ని రోజులకోసారి లేదా రోజువారీగా చేస్తున్నారా అన్నది పరిశీలించాలి. అదే విధంగా సోషల్ మీడియా ఖాతాల వినియోగం, డిజిటల్ లాకర్లు, డిజిటల్ స్టోరేజీలను కూడా వాడుతున్నారేమో చూసుకోవాలి. ► సరైన కవరేజీ: మీకున్న రిస్క్ స్థాయిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత అవసరమైనంత కవరేజీతో పాలసీని తీసుకోవాలి. సాధారణంగా సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వ్యక్తులకు అయితే రూ.50వేల నుంచి రూ.2 కోట్ల వరకు కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. ► సరైన సంస్థ: మీ అవసరాలన్నింటికీ కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం అయితే.. ఆ పాలసీని ఏ బీమా సంస్థ నుంచి తీసుకోవాలన్నది కూడా చాలా కీలకం అవుతుంది. ఇందుకోసం బీమా సంస్థ చెల్లింపుల చరిత్ర మంచిగా ఉన్నదా, లేదా అన్నది పరిశీలించాలి. తక్కువ చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి పాలసీని తీసుకుంటే.. ఆ తర్వాత మీకు క్లెయిమ్ అవసరం ఏర్పడినప్పుడు సమస్యలు ఎదురుకావచ్చు. ► సరైన కవరేజీలు: మీరు తీసుకునే పాలసీ సమగ్ర కవరేజీతో కూడిన ప్లాన్ అయి ఉండాలి. అందులో అవసరమైన కవరేజీలు అన్నీ ఉండేలా చూసుకోవాలి. సరైన కవరేజీ సైబర్ ఇన్సూరెన్స్ అన్నది.. సైబర్ దాడి లేదా సమాచార చోరీ అనంతరం అవసరమైన న్యాయ, రక్షణ, విచారణ ఖర్చులను చెల్లిస్తుంది. కోర్టు విచారణకు హాజరు అయ్యేందుకు ఖర్చులను కూడా చెల్లిస్తుంది. చోరీకి గురైన డేటాను తిరిగి పొందడంతోపాటు, ఇన్స్టాలేషన్కు అయ్యే వ్యయాలను కూడా చెల్లిస్తుంది. గోప్యత, సమాచార ఉల్లంఘనల్లో మూడో పక్షానికి వాటిల్లే నష్టానికి కూడా పరిహారం అందిస్తుంది. అంతేకాదు ఆర్థికంగా ఏర్పడే నష్టాన్ని కూడా (మీరు తీసుకున్న కవరేజీకి లోబడి) భర్తీ చేస్తుంది. ‘‘కరోనా మహమ్మారి సమయంలో చాలా వరకు సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నమూనాను అనుసరించాయి. దీంతో సంస్థలు తమ ఐటీ అప్లికేషన్ల సేవలను, డేటాబేస్లను క్లౌడ్ ప్లాట్ఫామ్లపైకి మళ్లించడంతో సైబర్ దాడుల రిస్క్ పెరిగింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు ఉపయోగించే నెట్వర్క్లు పూర్తి స్థాయి రక్షణతో ఉన్నవి కావు. దీంతో సైబర్ దాడుల బారిన పడే రిస్క్ ఎక్కువైంది’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్రైటింగ్, క్లెయిమ్స్, రీఇన్సూరెన్స్ చీఫ్ సంజయ్దత్తా వివరించారు. వీటిని మర్చిపోవద్దు.. సైబర్ బీమా తీసుకుంటే చాలులే అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. ప్రతీ ఒక్కరూ తమకంటూ ఉన్న రిస్క్లు ఏవేవి? అన్నది పరిశీలించుకుని, వాటికి కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవడం కీలకం అవుతుంది. అంతేకాదు, అవసరమైన యాడాన్ కవరేజీలను కూడా జోడించుకోవాలి. ఇందులో ముఖ్యంగా రిస్క్ పరిమాణాన్ని అంచనా వేయాలి. ఇందుకుగాను ఇంటర్నెట్ వేదికపై ఎంత విలువ మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నదీ చూడాల్సి ఉంటుంది. తరచూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ను, అదే విధంగా కార్డు చెల్లింపులు, ఈ వ్యాలెట్లను వినియోగించే వారు అయితే సైబర్ ఇన్సూరెన్స్ను తప్పకుండా తీసుకోవడం మంచిదని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీరాజ్ దేశ్పాండే సూచించారు. రక్షణ చర్యలు సైబర్ బీమా తీసుకోవడం ఒక విధమైన రక్షణ అయితే.. మరోవైపు ఈ సైబర్ దాడుల బారిన పడకుండా మనవంతు రక్షణ చర్యలు తీసుకోవడం కూడా అవసరమే. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► కంప్యూటర్కు రక్షణ: మొదటగా చేయాల్సింది ఇదే. కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే వారు తప్పకుండా యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కువ రక్షణనిచ్చే సాఫ్ట్వేర్ను ఎంచుకోవాలి. దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేసుకోవాలి. ► పటిష్ట పాస్వర్డ్లు: కొంత మంది అయితే పాస్వర్డ్లను ఎప్పటికీ మార్చకుండా వాటినే వినియోగిస్తుంటారు. కానీ ఇది చాలా రిస్క్తో కూడినది. పాస్వర్డ్లను ఇంకొకరు సులభంగా ఊహించే విధంగా ఉండకుండా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. పాస్వర్డ్లో నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు తప్పక ఉండాలి. ఎప్పటికప్పుడు పాస్వర్డ్లను మార్చుకుంటూ ఉండాలి. ► సోషల్ మీడియా ఖాతాలకు రక్షణ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై మీ ప్రొఫైల్ను ప్రైవేటు అకౌంట్స్ కోసమే అని ఎంచుకోవాలి. దాంతో మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే వాటిని చూడగలరు. అకౌంట్ను ప్రైవేటుగా ఎంచుకునే ఆప్షన్ అన్ని ప్లాట్ఫామ్లపైనా ఉంది. ► ఫిషింగ్ ఈమెయిల్స్తో జాగ్రత్త: ఈ మెయిల్స్కు వచ్చే ప్రతీ సందేశంపైనా క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసే ముందు సోర్స్ చూడాలి. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలిసిన వేదిక నుంచేనా అన్నది పరిశీలించుకోవాలి. బహుమతులు, మంచి ఆఫర్లు అంటూ తెలియని వేదికలు, కొత్త వేదికల నుంచి వచ్చే మెయిల్స్ను కూడా ముట్టుకోకుండా ఉండడమే మంచిది ► డేటా రక్షణ: మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్కు ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు బ్యాకప్ కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. ► మొబైల్ ఫోన్కు రక్షణ: మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు కూడా మంచి యాంటీ వైరస్ అవసరం ఎంతో ఉంది. -
కోవిడ్, సైబర్ దాడులు, సమాచార మోసాలు..
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్, సైబర్ దాడులు, సమాచార మోసాలు ప్రధాన ముప్పుగా భారత కంపెనీలు భావిస్తున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ బ్రోకర్ మార్స, రిస్క్ మేనేజ్మెంట్ సొసైటీ రిమ్స్ చేపట్టిన ఈ అధ్యయనంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు, సీనియర్ రిస్క్ నిపుణులు 231మంది పాలుపంచుకున్నారు. అధ్యయనం ప్రకారం.. సాధారణ స్థితికి చేరుకోవడంతోపాటు మహమ్మారి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కోగలమన్న గొప్ప ఆశావాదం కంపెనీల్లో ఉంది. సైబర్ దాడులు, సమాచార మోసాలు భారత్లో రిస్క్ ప్రొఫెషనల్స్ ముందున్న ప్రధాన ఆందోళన. 63 శాతం మంది కోవిడ్, 56 శాతం సైబర్ దాడులు, 36 శాతం సమాచార మోసాలు, దొంగతనం, 33 శాతం అత్యవసర మౌలిక వసతుల విఫలం, 31 శాతం ఆర్థిక సంక్షోభం, 25 శాతం మంది తీవ్రమైన వాతావరణ సంఘటనలు ప్రధాన ముప్పుగా తెలిపారు. మహమ్మారి కారణంగా కార్యాలయం వెలుపల పని చేయడం తప్పనిసరి అయిందని, దీంతో సైబర్ దాడులకు గురయ్యే అవకాశాలు పెరిగాయని 85 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
కరెంట్కూ సైబర్ షాక్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యవస్థకూ సైబర్ ముప్పు పొంచి ఉందని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రోజన్స్ తదితర వైరస్లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇటీవల చైనాతో సరిహద్దుల వెం బడి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కేంద్రం సూచనలివీ... ► విద్యుత్ సరఫరా వ్యవస్థ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల పరికరాలు, విడిభాగాల్లో మాల్వేర్/ట్రొజన్స్/సైబర్ ముప్పు ఉందా అని పరీక్షించించాలి. ఇవి భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ► కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గుర్తించిన సరి్టఫైడ్ ల్యాబ్లలో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలి. ► చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాల నుంచి లేదా ఆయా దేశాల వ్యక్తుల యాజమాన్యంలోని కంపెనీ ల నుంచి పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. ► ఈ దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో ఏవైనా పరికరాలను దిగుమతి చేసుకుంటే వాటిని సర్టిఫైడ్ ల్యాబ్లలో పరీక్షించాలి. ► విదేశాల నుంచి విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకొని వినియోగిస్తున్నా, ఇతర వస్తువుల తయారీ/అసెంబ్లింగ్కు వాటిని వినియోగించినా, విద్యుత్ సరఫరా వ్యవస్థలో వాడినా ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలి. ► కేంద్ర జాబితాలోని దేశాల నుంచి గత జూలై 7కి ముందు విద్యుత్ పరికరాలు, విడిభాగాల దిగుమతి కోసం వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే ఆ పరికరాలు వచి్చన వెంటనే పరీక్షలు నిర్వహించాలి. ► విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)పై ఈ పరికరాలు సైబర్ భద్రతతోపాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి ముప్పు కలిగించే అవకాశం లేదని ధ్రువీకరించుకోవాలి. చైనా నుంచి భారత్కు దిగుమతుల్లో విద్యుత్ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్మార్ట్ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. చైనాతో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దేశం నుంచి దిగుమతులపై నియంత్రణ విధించింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ల తయారీలో వినియోగించే విడిభాగాల దిగుమతి నిలిచిపోయి రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ల కొరత ఏర్పడింది. రైతులతోపాటు కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేయలేక డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విద్యుదుత్పత్తి కేంద్రాల, గ్రిడ్ నిర్వహణ ఆటోమేషన్ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లతో నడిచే కం ప్యూటర్/ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో అవసరాలకు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్ను అనుక్షణం నియంత్రిస్తుం టారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ఏవైనా మాల్వేర్/వైరస్ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి వ్యవస్థలను ముష్కరులు హైజాక్ చేసి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహ రించే అవకాశాలుంటాయి. దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినా, వ్యూహాత్మకమైన దేశ భద్రతావ్యవస్థలు పనిచేయకుండా హైజాకర్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. -
డాక్టర్ రెడ్డీస్పై సైబర్ దాడి
-
డాక్టర్ రెడ్డీస్పై సైబర్ దాడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్వర్క్ సిస్టమ్ను సంస్థ సమీక్షిస్తోంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్లోని ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ప్రభావం లేదు.. సైబర్ అటాక్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్ సర్వీసులను ఐసోలేట్ చేశామని బీఎస్ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముకేశ్ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఔషధ రంగంలో మార్కెట్ విలువ పరంగా భారత్లో డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ రెండవ స్థానంలో ఉంది. సంస్థ దేశంలో 17 తయారీ ప్లాంట్లు, ఆరు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆరు తయారీ ప్లాంట్లు, మూడు ఆర్అండ్డీ సెంటర్లు ఉన్నాయి. కాగా, గురువారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.46 శాతం (రూ.23.30) తగ్గి రూ.5,023.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.4,832.40కి చేరి తిరిగి పుంజుకుంది. సైబర్ సెక్యూరిటీకి కంపెనీల ప్రాధాన్యం: సిస్కో బెంగళూరు: కరోనా వైరస్ పరిణామాలతో వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మళ్లుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సిస్కో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి సమస్యలు ప్రారంభమైనప్పట్నుంచీ సైబర్ దాడులు జరగడం లేదా హెచ్చరికలు వచ్చిన ఉదంతాలు 25 శాతం పైగా పెరిగాయని సుమారు 73 శాతం దేశీ సంస్థలు వెల్లడించాయి. సుమారు మూడింట రెండొంతుల సంస్థలు (65 శాతం) రిమోట్ వర్కింగ్కు వీలుగా పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. ఐటీ రంగంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే 3,000 పైచిలుకు సంస్థలపై సిస్కో ఈ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ విధానం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పటిష్టమైన సైబర్సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయని, క్లౌడ్ సెక్యూరిటీపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సిస్కో ఇండియా డైరెక్టర్ రామన్ తెలిపారు. -
పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..
ఢిల్లీ : టిక్టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీపై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే అలీ ఎక్స్ప్రెస్, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్లపై భారత్ నిషేదం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గాల్వన్ లోయల్ భారత్-చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటి నుంచి చైనాకు చెందిన యాప్లపై ప్రత్యేక దృష్టి సారించిన నిఘా వర్గాలు ఇప్పటికే టిక్టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్లను నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ భద్రతకు ముప్పు కలిగేంచాలా మరో 275 చైనా యాప్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. (సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్! ) నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. ఈ యాప్ బ్యాన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. చైనాకు చెందిన అన్నిటెక్ కంపెనీలు.. ప్రభుత్వం ఏ సమాచారాన్ని కోరానా ఇవ్వాల్సిందిగా 2017 నాటి చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై డ్రాగన్ నియంత్రణ ఉండే ఆస్కారం ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే దీనిపై భారత్ను అనుసరించి చైనా యాప్లను నిషేదించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ముదిరిన దౌత్య యుద్ధం: కీలక పరిణామం) -
వణికిన ట్విట్టర్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్గేట్స్తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. బిట్కాయిన్ వాలెట్లోకి లక్షకు పైగా డాలర్లు సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్కాయిన్ వాలెట్లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యం త భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ట్వీట్ చేశారు. ఎలా హ్యాక్ చేశారంటే బిట్కాయిన్ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్వర్డ్లు తెలుసుకొని మెసేజ్లు పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.