hotel
-
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ (ఫొటోలు)
-
పెరుగుతున్న ఫ్లైట్లు, హోటళ్ల బుకింగ్స్.. కారణం..
సాక్షి, బిజినెస్ డెస్క్ : మహా కుంభ మేళా హడావిడి ముగిసిన తర్వాత పర్యాటకానికి హోలీ పండుగ రూపంలో మరో కొత్త దన్ను దొరికింది. శుక్రవారం నాడు హోలీ కావడంతో సుదీర్ఘ వారాంతపు సెలవులొస్తున్న నేపథ్యంలో టూరిజానికి డిమాండ్ పెరిగింది. వివిధ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల డేటా ప్రకారం గత సీజన్తో పోలిస్తే ఫ్లయిట్ బుకింగ్స్ 25–30 శాతం ఎగిశాయి. అలాగే హోటల్ బుకింగ్స్ కూడా 20–30 శాతం పెరిగాయి.ఇక వీటితో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చార్జీలు సైతం పెరిగాయి. దేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు సగటున 12–18 శాతం, అంతర్జాతీయ రూట్లలో చార్జీలు 8–14 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో వీలైనంత ముందుగా ట్రావెల్ ప్రణాళికలు వేసుకోవాలంటూ కస్టమర్లకు సూచిస్తున్నట్లు వివరించాయి. లగ్జరీ హోటళ్లలో టారిఫ్లు జూమ్.. ఇక హోటళ్ల విషయం తీసుకుంటే, సాధారణ వీకెండ్ బుకింగ్స్తో పోల్చినప్పుడు లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల్లో గదుల రేట్లు 30–40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అదే స్టాండర్డ్ హోటళ్లలో చూస్తే ధరల పెరుగుదల 15–20 శాతం మేర ఉన్నట్లు వివరించాయి. జైపూర్, ఉదయ్పూర్, వారణాసి, గోవా, అలీబాగ్, లోనావాలా, రిషికేష్, కూర్గ్, కేరళ వంటి డెస్టినేషన్లలో హోటల్ గదుల బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి.కుటుంబాలు, ఫ్రెండ్స్ బృందాలు ఎక్కువగా ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రీమియం రిసార్టులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ ప్రాపర్టీలు, ప్రైవేట్ విల్లాల బుకింగ్స్ సాధారణ వీకెండ్స్తో పోలిస్తే 40–50 శాతం పెరిగాయి. రాజస్థాన్, గోవాతో పాటు ప్రధాన మెట్రోలకు సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లలో చాలా మటుకు ప్రీమియం, లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 70–80 శాతం బుక్ అయిపోయాయి.కొన్ని రిసార్టుల్లో ఇప్పటికే ఆక్యుపెన్సీ పూర్తి స్థాయికి చేరినట్లు జోస్టెల్ సంస్థ వివరించింది. కాక్స్ అండ్ కింగ్స్ ప్రకారం జైపూర్, వారణాసి, రిషికేష్, గోవాలాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్కి భారీ డిమాండ్ నెలకొంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్లాంటివి ఫేవరెట్ డెస్టినేషన్లుగా ఉంటున్నాయి. ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్లు..హోలీ అనంతరం కూడా ప్రయాణాలకు డిమాండ్ భారీగా పడిపోకుండా విమానయాన సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్, ఇండిగో తదితర సంస్థలు పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డేటా ప్రకారం ఫిబ్రవరి ఆఖరు వారంలో నమోదైన 5.2 లక్షల మంది రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య మార్చి తొలి రెండు వారాల్లో సుమారు 4.8 లక్షల ప్యాసింజర్లకు పడిపోయినప్పటికీ.. వార్షికంగా చూస్తే మాత్రం మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. -
తిరుపతి: హోటల్లో కుప్పకూలిన పైకప్పు
సాక్షి, తిరుపతి: నగరంలోని బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పైకప్పు కూలింది. రూమ్ నంబర్ 314లో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాటర్ బాటిల్పై రూ.7 అదనం.. 27 లక్షల ఫైన్ విధించిన కన్జ్యూమర్ కోర్టు
సాక్షి,అమరావతి : కాకినాడ వినియోగదారులు కోర్టు కీలక తీర్పును వెలవరించింది. ఓ కస్టమర్ నుంచి ఒక్కో వాటర్ బాటిల్పై అదనంగా రూ.7వసూలు చేసినందుకు గాను హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్కు రూ.27లక్షల 27వేలు పెనాల్టీ విధించింది.వివరాల్లోకి వెళితే.. 2023 డిసెంబర్ 8న హైదరాబాద్ బోడుప్పల్లోని ఓ హోటల్లో ఓ మహిళ మూడు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేశారు. అయితే, తాను కొనుగోలు చేసిన ఒక్కో వాటర్ బాటిల్ ధరపై అదనంగా రూ.7వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ మహిళ సదరు హోటల్ నిర్వాకంపై కాకినాడ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు.మహిళ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ కాకినాడ వినియోదారుల కోర్టు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో హోటల్పై కాకినాడ వినియోగదారుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటల్ యాజమాన్యానికి రూ.27లక్షల 27వేలు ఫైన్ విధించింది. రూ.27 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, ఫిర్యాదు చేసిన మహిళకు రూ.25000, కోర్టుకి రూ2000 చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
పంజాగుట్ట షాన్బాగ్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాన్బాగ్ హోటల్లోని ఐదో అంతస్తులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.కాగా, పుప్పాలగూడ పాషా కాలనీలో నిన్న(శుక్రవారం) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన విషాదాన్ని నింపింది.స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. -
విశాఖలోని హోటల్ డాడీ గ్రాండ్ లో అగ్నిప్రమాదం
-
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
‘ముంతాజ్’ అనుమతులు రద్దు చేయాలి
తిరుపతి కల్చరల్: అలిపిరికి సమీపంలో టీటీడీకి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో సాధువులు, మఠ, పీఠాధిపతులు పెద్ద ఎత్తున బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు సమీపంలో ముంతాజ్ హోటల్కు అనుమతి ఇవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరమన్నారు. తాము అధికారంలోకి వస్తే తిరుమలను ప్రక్షాళన చేసి ధర్మాన్ని కాపాడతామని నాడు చంద్రబాబు ప్రకటించారని, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మ రక్షణే లక్ష్యం, సనాతన ధర్మ రక్షణ బోర్డు తెస్తాం అంటూ ప్రగల్భాలు పలికారన్నారు. వీరిని నమ్మి తాము ధర్మ రక్షణ కోసం మద్దతు పలికామని చెప్పారు. టూరిజం మంత్రిగా జనసేన పార్టీ నేత ఉండడంతో ముంతాజ్ హోటల్కు అనుమతుల వెనుక జనసేన హస్తం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుని ముంతాజ్ హోటల్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసన దీక్షను ఆమరణదీక్షగా కొనసాగిస్తూ తమ ప్రాణాలైనా ఇవ్వడానికి తాము సిద్ధమని హెచ్చరించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!
కోట్లు ఖరీదు చేసే హోటల్ కచ్చితంగా అంతకు మించిన ధరలో అమ్ముడుపోతుంది. అది పక్కా..!. పోనీ అలా కాదనుకుంటే.. కనీసం దాని విలువకు దగ్గరదగ్గరగా లేదా కొద్దిపాటి తేడాతో మంచి ధరలోనే అమ్ముడవుతుంది. కానీ ఇక్కడ కోట్లు ఖరీదు చేసే హోటల్ జస్ట్ వందల రూపాయల్లోనే అమ్ముడైతే..ఎవ్వరికైనా ఏంటిది అనే డౌటు వచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు అంత తెలివతక్కువగా ఎవడ్రా అమ్మింది అనుకుంటారు. కానీ అలా ఎందుకు అమ్ముతున్నారో వింటే శెభాష్ అని ప్రశంసించకుండా ఉండలేరు.ఇంతకీ అమ్మడానికి కారణం ఏంటంటే..అమెరికా కొలరాడోలోని డెన్వర్లో మాజీస్టే ఇన్ మోటెల్ హోటల్ విలువ ఏకంగా రూ. 75 కోట్లు ఉంటుంది. అంత ఖరీదుకే డెన్వర్ నగరం ఈ హోటల్ని కొనుగోలు చేసింది కూడా. అయితే ప్రస్తుతం దాన్ని నగరం కొద్దిపటి మరమత్తులు చేసి అమ్మేయాలనుకుంది. ఎంతకో తెలిస్తే కంగుతింటారు. కేవలం రూ. 875లకే అమ్మేస్తారట. కానీ వాళ్లుపెట్టే షరతులకు అంగీకరిస్తే అంత తక్కువ ధరలో అంత ఖరీదు చేసే హోటల్ని సొంత చేసుకోగలరని చెబుతున్నారు డెన్వర్ నగరం డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్బరీ. ఆ షరతులేంటంటే..దీన్ని 99 ఏళ్లపాటు ఆదాయ నిరోధిక గృహంగా ఉంచాలట. అలాగే నిరాశ్రయులకు సహాయ గృహంగా ఉండాలనే షరతులకు అంగీకరిస్తే గనుక ఈ హోటల్ని తక్కువ ధరకే అమ్ముతామని చెప్పారు డెన్వర్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్బరీ. ఈ హోటల్ని పునరుద్ధరించి నిరాశ్రయలుకు నివాసంగా మారుస్తున్నాని అంగీకరిస్తేనే.. ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేయగలరన్నారు. మరీ ఇంతకు ఎవరూ దీన్ని పునరుద్ధరించి కొనుగోలు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది అందుకోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు వుడ్బరీ. ఆ ప్రతిపాదిత డెవలప్పర్ ఆమోదం నగర్ కౌన్సిలో చేతిలో ఉంటుందట. నిరాశ్రయులైనవారికి చక్కటి వసతిని కల్పించడమే లక్ష్యంగా ఈ వినూత్న డీల్ని తీసుకొచ్చినట్లు వివరించారు వుడ్బరీ. అంతేగాదు భవనాన్ని యథాతథంగా అమ్ముతామని కూడా చెబుతున్నారు. మరీ ఎవరు దీన్ని కొని ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకుంటారనేది వేచి చేసి చూడాల్సిందే. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
టర్కీలోని ఒక రిసార్ట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య టర్కీలోని ఒక స్కీ రిసార్ట్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. 32 మంది గాయాలపాలయ్యారు. అతికష్టం మీద అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బోలు ప్రావిన్స్లోని కర్తల్కాయ రిసార్ట్లోని ఒక రెస్టారెంట్లో రాత్రిపూట మంటలు చెలరేగాయని టర్కీ మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. భయంతో భవనం నుంచి దూకి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ అబ్దుల్ అజీజ్ అయిదిన్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్లో 234 మంది అతిథులు బస చేస్తున్నారని, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు చెలరేగినప్పుడు తాను నిద్రలో ఉన్నానని, అయితే ప్రమాదాన్ని గుర్తించి, భవనం నుండి తప్పించుకోగలిగానని హోటల్ సిబ్బంది నెక్మీ కెప్సెట్టుటన్ తెలిపారు. తాను బయటపడ్డాక 20 మంది అతిథులు హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు సహాయం అందించానని తెలిపారు.హోటల్ బయట ఉన్న కలప కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కర్తాల్కాయ అనేది ఇస్తాంబుల్కు తూర్పున 300 కిలోమీటర్లు (186 మైళ్ళు) దూరంలో ఉన్న కొరోగ్లు పర్వతాలలోని స్కీ రిసార్ట్. 30 అగ్నిమాపక యంత్రాలు, 28 అంబులెన్స్లతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ? -
New Year 2025 : ఒక్కో హోటల్ ఒక్కో తీరు..ఆహా.. ఏమి రుచి!
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేది ఏడాది ముగింపు సెలబ్రేషన్స్.. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి పండగ.. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ హోటల్ యాజమాన్యాలు ప్రత్యేక రుచులను సిద్ధం చేస్తున్నాయి. సాధారణ రెసిపీలకు భిన్నంగా సంప్రదాయ, గ్రామీణ, స్థానిక, అంతర్జాతీయ వంటకాలను మరోమారు పరిచయం చేస్తున్నాయి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఆహారం వేగంగా తినడం, పానీయాలు త్వరగా తాగడం, ఇతర వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. ఒక్కో హోటల్లో ఒక్కో రకం.. మినీ భారత దేశంగా ఖ్యాతిగాంచిన భాగ్యనగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1.5 కోట్ల మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా విభిన్నమైన ఆహారపు అలవాట్లు వారి సొంతం. ఒక్కో ప్రాంతంలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఒక్కో విధంగా ఉంటాయి. దీనికి అనుగుణంగానే నగరంలోని పలు హోటల్స్ సైతం ప్రాంతీయ అభిరుచులకు తగ్గట్లుగా ప్రత్యేకించి చెఫ్లను తెప్పించి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో హోటల్లో ఒక్కో రకమైన మెనూ ప్రత్యక్షం అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకించి బర్గర్ ఈటింగ్, పానీపూరీ, జూస్ స్పీడ్ డ్రింకింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. -
బ్రాండెడ్ హోటల్స్కు భలే డిమాండ్
బ్రాండెడ్ హోటల్స్లో విడిది చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. డిమాండ్ బలంగా ఉండడంతో బ్రాండెడ్ హోటల్స్(Hotels) పరిశ్రమ ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–12 శాతం మేర అధికంగా నమోదవుతుందని క్రిసిల్(Crisil) రేటింగ్స్ నివేదిక తెలిపింది. దేశీయంగా విహార, వ్యాపార ప్రయాణాలు ప్రధానంగా బ్రాండెడ్ హోటళ్ల డిమాండ్ను పెంచుతున్నాయని, ఇక ఎంఐసీ విభాగంలో (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) వృద్ధి, విదేశీ పర్యాటకుల సందర్శనలు పుంజుకోవడం పరిశ్రమ ఆదాయానికి మద్దతునివ్వనున్నట్టు వివరించింది.బ్రాండెడ్ హోటల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం సైతం 17 శాతం మేర వృద్ధిని నమోదు చేయడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి హోటళ్లలో రూమ్ల పెరుగుదల వేగాన్ని అందుకున్నట్టు తెలిపింది. అస్సెట్ లైట్ (సొంతంగా కాకుండా లీజు విధానంలో) నమూనాలో ఇక ముందూ కొత్త గదుల చేరిక వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది. దీంతో ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద కొత్త గదుల లభ్యత 20 శాతం మించుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–9 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరాలో 11–12 శాతం మేర కొత్త గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. బ్రాండెడ్ హోటళ్ల నిర్వహణ మార్జిన్ 100–150 బేసిస్ పాయింట్లు మేర ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మెరుగుపడుతుందని అంచనా వేసింది. బలమైన నగదు ప్రవాహాలు, అస్సెట్ లైట్ నమూనాలో విస్తరణ, తగినంత మూలధనం సమీకరణతో బ్రాండెడ్ హోటళ్ల రుణ భారం నియంత్రిత స్థాయిలోనే కొనసాగుతుందని పేర్కొంది. ఇది ఆయా హోటళ్ల రుణ పరపతిని బలోపేతం చేస్తుందని తెలిపింది.రూమ్ రేట్లు అప్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాండెడ్ హోటళ్ల సగటు రూమ్ రేట్లు (ARR) 6–7 శాతం మేర పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే ఏడాది 3–4 శాతం పెరుగుదలకు పరిమితం అవుతుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో అదనపు గదులు అందుబాటులోకి రావడం ఇందుకు కారణంగా తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11–12 శాతం చొప్పున ఆదాయంలో వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. విహార, వ్యాపార పర్యటనల్లో ఏడు ప్రధాన నగరాలు 25 శాతం వాటా ఆక్రమిస్తాయని.. మిగిలిన మేర ఆధ్యాత్మిక పర్యాటక రూపంలో ఉంటుందని తెలిపింది.ఇదీ చదవండి: నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధిఆక్యుపెన్సీ ఎలా ఉంటుందంటే..‘నాన్ మెట్రో(Non Metro) నగరాల్లో, విహార గమ్యస్థానాల్లో హోటల్ పరిశ్రమ కార్యకలాపాలు ఎక్కువగా విస్తరణకు నోచుకుంటున్నాయి. దీంతో కొత్త గదుల చేరికలో 60–65 శాతం మేర ఇక్కడే ఉండనుంది. అది కూడా అస్సెట్ లైట్ నమూనాలో కావడంతో, పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం కూడా ఉండదు’ అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ పల్లవి సింఘ్ తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త గదులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, అదే సమయంలో ఆక్యుపెన్సీ (రూముల వినియోగం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 74–75 శాతం స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అది ఈ ఏడాది కంటే 1–1.5% తక్కువగా ఉంటుందని పేర్కొంది. వ్యయాలను సమర్థవంతంగా నియంత్రించడం, టెక్నాలజీ, మానవ వనరుల మెరుగైన వినియోగం, అస్సెట్ లైట్ విధానం ఫలితంగా పరిశ్రమ ఎబిటా మార్జిన్ 1–1.5% పెరిగి 2024–25లో 33–34 శాతానికి చేరవచ్చన్నది క్రిసిల్ అంచనా. -
ఓయో రూమ్స్ బుకింగ్స్లో హైదరాబాద్ టాప్
సాక్షి, హైదరాబాద్: రాకపోకలతో కిక్కిరిసిపోతున్న మన హైదరాబాద్.. హోటల్ బుకింగ్స్లోనూ టాప్గా నిలుస్తోంది. మెట్రో నగరాలన్నింటి కన్నా మిన్నగా మన నగరం అత్యధిక బుకింగ్స్ సాధిస్తోంది. ఈ విషయాన్ని లీజ్, ఫ్రాంచైజీ మోడల్స్లో గదులు అద్దెకు ఇచ్చే ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో తాజాగా విడుదల చేసిన ట్రావెలోపీడియా 2024’ వార్షిక నివేదిక వెల్లడిస్తోంది. నివేదిక వెల్లడించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు.. వరుసగా రెండో ఏడాదీ మనమే.. గతేడాది కూడా మన నగరం అత్యధికంగా బుకింగ్స్ కలిగిన నగరంగా నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు బుకింగ్లలో అగ్రస్థానాలను పొందగా, విచిత్రంగా ముంబై బుకింగ్స్లో దిగజారింది. దీనికి కారణం ముంబైకి వెళ్లే పర్యాటకులు ఆ నగరానికి సమీప ప్రాంతాల్లోని విశ్రాంతికి, విహారానికి అనువుగా ఉండే ప్రదేశాలను ల్లో ఉండేందుకు ఇష్టపడటమేనని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ టాప్.. దేశంలోకెల్లా ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా నిలిచింది. పూరి, వారణాసి, హరిద్వార్ తీర్థయాత్రల రంగానికి నాయకత్వం వహించడంతో, ఆధ్యాతి్మక పర్యాటకం భారతదేశ పర్యాటకానికి ప్రధాన చోదకశక్తిగా ఉందని నివేదిక పేర్కొంది. డియోఘర్, పళని, గోవర్ధన్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపించింది. ఇది గతంలో అంతగా తెలియని ఆధ్యాత్మిక ప్రదేశాలపై పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తోంది. విహారం.. వ్యాపారం.. విశ్రాంతి, విహారాలతో పాటు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ప్రయాణాల్లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదల చూసింది. ప్రయాణికుల సంఖ్యాపరంగా చూస్తే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వరుసగా తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. బీహార్లోని పాటా్న, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కర్ణాటకలోని హుబ్లీ వంటి చిన్న పట్టణాలు ఈ ఏడాది అద్భుతమైన వృద్ధితో బుకింగ్లు 48 శాతం పెంచుకున్నాయి. జైపూర్, గోవా, పాండిచ్చేరి, మైసూర్ అగ్ర పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.మళ్లీ మనమే.. -
కోడిపుంజులాంటి హోటల్..!
రాజసంగా నిలుచున్న కోడిపుంజును చూశారు కదూ! ఇది కోడి గౌరవార్థం నిలిపిన విగ్రహమేమీ కాదు. ఇది హోటల్ భవంతి. కోడిపుంజు ఆకారంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భవంతిగా ఇది గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ భవంతి ఎత్తు 114.7 అడుగులు. ఫిలిప్పీన్స్లోని నెగ్రోస్ నగరంలో ఉందిది.నిలువెత్తు కోడిపుంజులాంటి ఈ హోటల్ భవనంలో సమస్త సౌకర్యాలతో కూడిన 15 ఎయిర్ కండిషన్డ్ గదులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్ స్థానిక సంస్కృతిలో కోడిపుంజుకు విశేష ప్రాధాన్యముందని, ఆ ఒక్క కారణమే కాకుండా, జనాల దృష్టిని ఆకట్టుకునేందుకు కోడిపుంజు ఆకారంలో ఈ భవంతిని నిర్మించామని ఈ హోటల్ యజమాని రికార్డో కానో గ్వాపో తెలిపారు. ఈ హోటల్ పేరు ‘కాంప్యూస్టోహాన్ హైలాండ్ రిసార్ట్’. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు!
ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్కి లేదా సంక్రాంతి వెకేషన్కి ప్లాన్ చేసుకోండి. -
HYD: హోటల్లో భారీ పేలుడు.. బస్తీలో ఎగిరిపడ్డ బండ రాళ్లు
సాక్షి,హైదరాబాద్:జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ వన్లోని ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం(నవంబర్ 10) తెల్లవారుజామున 4 గంటలకు పేలుడు జరిగింది. హోటల్ కిచెన్లో ఉన్న రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. పేలుడు ధాటికి హోటల్ ప్రహరీ గోడ ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు రాళ్ళు ఎగిరి పడి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి. రాళ్లు పడడంతో బస్తీలో ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.పేలుడు ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం -
‘బిర్యానీలో ఈగ’ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
సాక్షి, నల్గొండ జిల్లా: చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో విలేజ్ ఆర్గానిక్ హోటల్ బిర్యానీలో ఈగ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫుల్లుగా తిని బిల్లు ఎగ్గొట్టేందుకు బిర్యానీలో ఈగ అంటూ నలుగురు బ్యాచ్ నాటకం ఆడారు. తినడం పూర్తయ్యాక పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన నూనెలో ఫ్రై చేసిన ఈగను బిర్యానీలో పెట్టారు. ఆ తర్వాత బిర్యానీలో ఈగ అంటూ నాటకానికి తెరలేపారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించారు. వాట్సాప్ గ్రూపులో వీడియోను ఆ బ్యాచ్ షేర్ చేసింది.హోటల్ పై విమర్శలు రావడంతో సిబ్బంది... సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఈగను బయటకు తీసి బిర్యానీ వేసి కలుపుతున్నట్లు ఫుటేజీలో స్పష్టమైంది. గతంలోనూ పలు హోటల్స్ లో ఇదే రకంగా నాటకాలు ఆడినట్లు బ్యాచ్పై ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట సమీపంలో ఓ ప్రముఖ హోటల్లోనూ ఇదేవిధంగా బిల్లు ఎగ్గొట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘వారి పేర్లు డైరీలో రాసి పెట్టుకుంటున్నాం’ -
వామ్మో..! రాను రాను హోటల్లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!
బెంగళూరులోని ఒక హోటల్లోకి అడుగు పెట్టిన అనన్య నారంగ్కు రిసెప్షనిస్ట్ స్వాగతం పలికింది. అనన్యలో షాక్లాంటి ఆశ్చర్యం. ‘ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది!’ అనే కదా మీ డౌటు. అయితే సదరు ఈ రిసెప్షనిస్ట్ సాధారణ రిసెప్షనిస్ట్ కాదు... వర్చువల్ రిసెప్షనిస్ట్!‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో వర్చువల్ రిసెప్షనిస్ట్’ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన దేశంలో నవీన సాంకేతికత గురించి వివరంగా మాట్లాడుకునేలా చేస్తోంది. ‘సాంకేతికత సహాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులను ఏకకాలంలో సమన్వయం చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో తప్ప మన దేశంలో ఎక్కడా ఇలాంటి దృశ్యం కనిపించదు’ అంటూ ఈ ‘వర్చువల్ రిసెప్షనిస్ట్’ ఫొటోని షేర్ చేసింది అనన్య. ‘ఎంత సాంకేతిక ప్రగతి’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘అబ్బబ్బే! ఇదేం ప్రగతి. అందమైన మానవ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి, వర్చువల్ రిసెప్షనిస్ట్ స్వాగతం పలకడానికి చా...లా తేడా ఉంటుంది’ అనే వాళ్లే ఎక్కువ! (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
ఫుడ్ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్
ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్ హింగాన్గావ్లో చోటుచేసుకుంది.కంటైనర్తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్ గోకుల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.ఇంతలో డ్రైవర్ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews (Source: Third Party)(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA— Press Trust of India (@PTI_News) September 7, 2024 -
ఫుడ్ లవర్స్ అడ్డా.. హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హోటల్ తాజ్ డక్కన్ వేదికగా జరిగిన 3వ ఎడిషన్ హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమంలో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఫుడ్ గ్రాఫ్లో నగరాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర బ్రాండ్లకు 50 పురస్కారాలను ప్రదానం చేసింది.కంట్రీ ఓవెన్ ఫౌండర్ డాక్టర్ సుధాకర్ రావు, వివేరా హోటల్స్ చైర్మన్ సద్ది వెంకట్రెడ్డిలకు లెజెండ్ అవార్డులను అందజేసింది. ‘హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్. నగరవాసులు ఫుడ్ను ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు’అని ఆమె అన్నారు. తనకు కట్టీ దాల్ చావల్ ఫేవరేట్ ఫుడ్ అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణ నిహారిక సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్పాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా సీఈవో లయన్ డాక్టర్ వై.కిరణ్, జెమిని ఎడిబుల్స్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్రెడ్డి, విమల ఫీడ్స్ మధుసూదన్రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
HYD: ‘ప్యారడైజ్’ హోటల్లో మంటలు
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు హోటల్కు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనేదానిని పరిశీలించారు. -
హోటల్పై కుప్పకూలిన హెలికాప్టర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని పర్యాటక పట్టణం కెయిన్స్లోని ఓ హోటల్పై హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం(ఆగస్టు12) తెల్లవారుజామున ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెలికాప్టర్ కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లోని వందల మందిని అక్కడినుంచి తరలించినట్లు క్వీన్స్లాండ్ పోలీసులు తెలిపారు. హెలికాప్టర్ కూలడం కారణంగా హోటల్లో ఉన్న వారెవరూ గాయపడలేదని చెప్పారు. హోటల్పై రెండు హెలికాప్టర్లు ల్యాండవుతుండగా వాటిలో ఒకటి క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపారు. హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయమై ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించింది. -
భలే మంచి దొంగ
-
ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు!
మార్కాపురం: హోటల్కు వెళ్లి సర్వర్తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కె.మహేష్రెడ్డి ఇడ్లీ తిన్నాడు. హోటల్ బాయ్ అంజి బిల్లు కట్టాలని కోరగా మహేష్ దాడికి దిగాడు. అడ్డుకోబోయిన హోటల్ సిబ్బంది పరమేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిపైనా మహేష్ దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
`ఆ ఇంట్లో బసచేసిన వారికి రాత్రి వేళ' ఆమె..
అదో చిన్న హిల్ స్టేషన్ . పశ్చిమ బెంగాల్, కాలింపోంగ్లోని దర్పిన్ దారా పర్వతం మీద పదహారు ఎకరాల ఎస్టేట్. 1930లో ఇద్దరు బ్రిటిష్ ధనవంతులు.. తమ పిల్లలకు వివాహం చేసి.. బంధుత్వం కలుపుకున్నారట. ఆ సందర్భంగానే అక్కడ ఇల్లు కట్టించి దాన్ని.. ఆ నూతన దంపతులకు బహుమతిగా ఇచ్చారట. అయితే ఆ దంపతులకు వారసులు లేకపోవడంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ఆస్తిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.1962లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనారోగ్యం పాలైన తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వ విశ్రాంతి గృహంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే, నెహ్రూ ఆకస్మిక మరణం కారణంగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. 1975లో ‘పశ్చిమ బెంగాల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ’ ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇదంతా చరిత్ర. ప్రస్తుతం ఈ ఇల్లు.. ఒక హోటల్గా.. పర్యాటకులకు వింత అనుభూతుల్ని పంచుతోంది.ఆ ఇంటి యజమాని పేరు ‘జూట్ బేరన్ జార్జ్ మోర్గాన్’ అని.. అతడు తన భార్య లేడీ మోర్గాన్ను ఎంతగానో ప్రేమించేవాడని.. ఆమె మరణం తర్వాత.. ఆమె ఆత్మ అదే ఇంట్లో ఉండిపోయిందని చెబుతుంటారు. మిసెస్ మోర్గాన్ ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ ఇంట్లో బసచేసిన వారికి రాత్రి వేళ.. ఆమె హైహీల్స్ వేసుకుని మెట్లు దిగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుందట. పైగా ఆ పరిసరాల్లో ఏవో గుసగుసలు వణికిస్తాయట.బయట నుంచి చూడటానికి ఆ ఇల్లు.. పచ్చటి తీగలు అల్లుకుని.. ప్రకృతి అందాల్లో కలగలిసిపోయినట్టు ఉంటుంది. అటుగా వెళ్లిన పర్యాటకులకు హడలెత్తించే కథలను కలబోసి చెబుతుంది. టూరిస్ట్ ప్లేస్గా మారినప్పటి నుంచి ఈ భవనం చుట్టూ అనేక చెట్లు, మరిన్ని కట్టడాలు పుట్టుకొచ్చాయి. చిన్నచిన్న కాటేజ్లను నిర్మించారు.బాలీవుడ్ నటులు సైతం ఇక్కడ బసచేశారట. థ్రిల్ కోరుకునేవారు, సాహసికులు.. ఇక్కడి అందాలతో పాటు లేడీ మోర్గాన్ అడుగుల సవ్వడిని వినడానికి ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటున్నారట. మరి నిజంగానే అక్కడ అంతుచిక్కని శక్తి ఉందా? ఉన్నపళంగా వినిపిస్తున్న గుబులురేపే ఆ అలికిడి.. లేడీ మోర్గాన్ ఉనికికి నిదర్శనమా? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
హోటల్ బిజినెస్ డల్
సాక్షి, హైదరాబాద్: హోటల్ ఫుడ్పై వినియోగదారుల్లో నమ్మకం పోయింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నాసిరకం ఆహారం అందిస్తున్నాయని తేలడంతో బయటి ఆహారం తినడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ఫుడ్సేఫ్టీ అధికారుల అంచనా ప్రకారం ఈ దాడుల అనంతరం ఏకంగా 30 శాతం హోటల్ బిజినెస్ తగ్గింది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల ద్వారా ఫుడ్ డెలివరీ కూడా భారీగా తగ్గిందని తెలుస్తోంది. ఆన్లైన్ డెలివరీల ద్వారా మరింత నాసిరకం ఫుడ్ సరఫరా ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీల్లో చాలా వరకు పరిశుభ్రతలోపం, ఆహార పదార్థాల్లో నాణ్యత లేమి స్పష్టంగా కనిపించినట్టు సమాచారం. పాడైపోయి, కాలంచెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దాడుల్లో పేరుమోసిన హోటళ్లు, బేకరీలు, ఐస్క్రీం సెంటర్లున్నాయి. ప్రముఖ హోటళ్లలో పాడైపోయిన ఆహారపదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదు. ఫుడ్సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలోని టాస్్కఫోర్స్ బృందాలు విడుదల చేసిన జాబితా ప్రకారం క్రీమ్స్టోన్, న్యాచురల్స్ ఐస్క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సీ, రోస్టరీ కాఫీహౌస్, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్టౌన్ బ్రూపబ్, మాకౌ కిచెన్ అండ్ బార్, ఎయిర్లైవ్, టాకోబెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్ జో, ఖాన్సాబ్, హోటల్ సుఖ్సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, రెస్ట్ ఓ బార్ వంటి అనేక హోటళ్లు, బేకరీలు ఉన్నాయి. వాటిల్లో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పదార్థాలతో వండటం వంటి వాటిని గుర్తించారు. రోజుల తరబడిగా నిల్వ ఉంచిన మాంసంతో వండటం వంటివీ గుర్తించారు. హైదరాబాద్లో సగం హోటళ్లలో నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని, అపరిశుభ్రమైన కిచెన్ వంటివి ఉన్నాయని నిర్థారించారు. కేసులు పెట్టి జరిమానాలు విధించడంతోపాటు శుభ్రత, నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు నేరుగా హాటల్కు లేదా రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారుల కంటే, ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేలింది. ఆన్లైన్ డెలివరీ సంస్థల ద్వారా అత్యంత నాసిరకమైన ఫుడ్ వినియోగదారులకు సరఫరా చేశారని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.దాడులేనా.. సీజ్ చేయరా...? ఫుడ్సేఫ్టీ అధికారులు దాడులు చేసి ప్రజల్లో ఒకరకమైన భయం సృష్టించారు. అయితే కుటుంబసభ్యులతో సరదాగానో లేదా అవసరంరీత్యానో హాటళ్లకు వెళ్లే వినియోగదారులకు భరోసా కలి్పంచడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల సమయంలో కుళ్లిపోయిన మాంసం, పాడైపోయిన ఆహారం వంటివి గుర్తించినా, తక్షణమే ఆయా హోటళ్లను ఎందుకు సీజ్ చేయడం లేదని వినియోగదారులు ప్రశి్నస్తున్నారు. కేవలం కేసులు పెట్టి వదిలేయడం, పద్ధతి మార్చుకోవాలని సమయం ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనమని వాపోతున్నారు. భరోసా కలి్పంచకపోతే ఎలా? హోటళ్లపై దాడులు చేశాక, వాటిపై తక్షణ చర్యలు తీసుకోకపోతే మార్పు రాదు. హోటళ్లలో ధైర్యంగా తినేలా వినియోగదారులకు భరోసా కలి్పంచాల్సిన బాధ్యత అధికారులతోపాటు హోటల్ యజమానులపైనా ఉంది. వేలాది రూపాయలు వసూలు చేసే పెద్ద హోటళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్ చేసే అధికారం ఉంటుంది. అవసరమైతే కిచెన్లోకి వెళ్లి చూసేలా వెసులుబాటు ఉండాలి. లేదంటే ఓపెన్ కిచెన్ కానీ, సీసీ టీవీ కెమెరాల ద్వారా కిచెన్లో ఉండే పదార్థాలు, వండే విధానం వంటి వాటిని తినేవారు నేరుగా స్క్రీన్పై చూసే వెసులుబాటు కలి్పంచాలి. శ్రీనివాస్ శెట్టి, హైదరాబాద్సీజ్ చేసే అధికారం మాకు లేదు హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేశాక. వాటిని సీజ్ చేసే అధికారం మాకు లేదు. కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం వరకే మాపని. అయితే తక్షణమే సీజ్ చేసే అధికారం పురపాలకశాఖకు ఉంటుంది. వినియోగదారుల్లో అవగాహన కలి్పస్తున్నాం. హోటల్, రెస్టారెంట్ల యజమానులను పిలిపించి నిబంధనలు పాటించాలని ఆదేశిస్తున్నాం. – ఆర్వీ కర్ణన్, కమిషనర్, ఫుడ్ సేఫ్టీపెద్ద హోటళ్లే ఇలా చేయడం విస్మయం కలిగిస్తుంది పెద్ద హోటళ్లే నాసిరకం ఫుడ్ పెట్టడంతో డాక్టర్లతో సహా వినియోగదారులంతా విస్మయానికి గురయ్యారు. వీకెండ్లో కుటుంబాలతో వెళాదామనుకునే వారికి షాక్ ఇచ్చారు. నాసిరకం, కలర్స్ వాడిన ఆహారం, కుళ్లిపోయిన మాంసం, అపరిశుభ్రత వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆహార ప్రియులకు భరోసా కలి్పంచాలి. – డాక్టర్ అనిల్కుమార్ మన్నవ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి -
బిర్యానీ తిని ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో
-
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పూర్తిగా గడ్డకట్టిన మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ఫిన్లండ్లోని కెమీ నగరంలో ఉంది. దీనిని తొలిసారిగా 1996లో ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే ఈ హోటల్కు మూడు లక్షల మంది అతిథులు వచ్చారు. ఫిన్లండ్లో ఏటా ఏప్రిల్ వరకు శీతకాలం ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు గడ్డకట్టే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఏటా శీతకాలంలో ఈ హోటల్ను నిర్మించి, అతిథులకు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి మొదలయ్యాక ఈ మంచు అంతా కరిగిపోతుంది. దాదాపు ఇరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో ఒక ప్రార్థనా మందిరం, రెస్టారెంట్ సహా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని టేబుళ్లు, కుర్చీలు, మంచాలు కూడా మంచుతో తయారు చేసినవే! వీటిపైన ధ్రువపు జింకల చర్మంతో సీట్లు, పరుపులు ఏర్పాటు చేస్తారు. ఇందులోని రెస్టారెంట్లో విందు భోజనాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..) -
ట్రాన్స్జెండర్కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్జండర్ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
బెంగళూరు హోటల్లో ఉజ్బెక్ మహిళ హత్య
బనశంకరి: బెంగళూరులోని ఓ హోటల్లో విదేశీ మహిళ హత్యకు గురయ్యారు. శేషాద్రిపురం పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. ఉజ్బెకిస్తాన్కు చెందిన జరీనా (37) వ్యాపార వీసాపై నాలుగు రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం శేషాద్రిపురంలో ఓ హోటల్ రెండో అంతస్తు గదిలో బస చేశారు. బుధవారం రాత్రి 10:30 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచి్చన హోటల్ సిబ్బంది మాస్టర్ కీ ద్వారా తెలుపు తెరిచారు. లోపల చూడగా జరీనా విగతజీవిగా కనిపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆధారాలు సేకరించి, సీసీ ఫుటేజీ, సెల్ కాల్డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎవరో గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
హిల్థ్రిల్ హోటల్! పర్వతారోహణ అనుభవం లేనివారు ఇక్కడికి చేరుకోలేరు..
అప్పుడప్పుడు కొన్ని వింతలను, అద్భుతాలను, విచిత్రాలను, సౌందర్యాలను చూస్తూంటాం. కానీ అవన్నీ ఒకేదగ్గర కనిపించాలంటే ఇక్కడికి వెళ్లాలేమో..! ఈ ఫొటోలో కనిపిస్తున్న పర్వతం కేవలం పర్వతం కాదు, ఇదొక అధునాతన హోటల్. చిలీలోని హుయిలో హుయిలో అభయారణ్యంలో పటగోనీయా పర్వతశ్రేణుల్లోని ఒక పర్వతాన్ని ఇలా హోటల్గా మార్చారు. సాహసయాత్రికులకు, పర్వతారోహకులకు విడిది కేంద్రంలా దీనిని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ‘మౌంటెయిన్ మేజికా’ అనే ఈ హోటల్కు చేరుకోవాలంటే, వేలాడే వంతెన తప్ప వేరే మార్గమేదీ లేదు. తగిన శారీరక దారుఢ్యం, పర్వతారోహణ అనుభవం లేనివారు ఇందులోకి అడుగుపెట్టలేరు. దట్టమైన అడవి మధ్యనున్న ఈ హోటల్లో బసచేసే వారికి కిటికీల్లోంచి చూస్తే ఎటుచూసినా ప్రకృతి పచ్చదనం, చుట్టుపక్కల పర్వతాల నుంచి కిందకు దూకే జలపాతాలు కనువిందు చేస్తాయి. ఈ హోటల్లో 108 గదులు, రెస్టారెంట్, స్పా, స్విమింగ్ పూల్ వంటి వసతులు ఉన్నాయి. ఇందులో బస చేయడానికి రోజుకు 215 డాలర్లు (రూ.17,882) ఖర్చవుతుంది. ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు.. -
రామేశ్వరం కేఫ్లో జరిగింది బాంబు పేలుళ్లే
-
అడుగడుగునా అవమానించే హోటల్కు జనం క్యూ!
అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే రూ 20 వేలు చెల్లించాలి. ఈ హోటల్లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది. ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్కు తాను ఏమి చేయాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు. ‘డైలీ మెయిల్’లోని ఒక కథనం ప్రకారం రోజుకు రూ.20 వేలు ఛార్జ్ చేసే ఈ హోటల్లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు. టవల్స్, టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు. హోటల్లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే, హోటల్ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు. చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో. లండన్లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది. -
ఒక రోజు అద్దెతో ఐదేళ్లు తిష్ట.. న్యూయార్క్ హోటల్లో వింతవైనం!
సాధారణంగా ఎవరైనా ఏదైనా హోటల్లో బస చేయానుకుంటే ఒక రోజో, రెండు రోజులో ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా హోటల్లో ఐదు సంవత్సరాలు గడిపాడు.. అది కూడా అద్దె లేకుండా.. నమ్మశక్యం కాని ఈ నిజం వెనుకనున్న కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం మిక్కీ బారెటో(48) న్యూయార్క్లోని మాన్హాటన్లో ఉన్న ఒక హోటల్కు తానే యజమానినని చెప్పుకుంటూ ఐదేళ్లుగా అద్దె చెల్లించకుండా అందులోనే ఉంటున్నాడు. ఈ వ్యవహారంలో తప్పుడు ఆస్తుల రికార్డులు సృష్టించినందుకు తాజాగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 1930లో నిర్మితమైన ఈ వెయ్యి గదుల ఆర్ట్ డెకో న్యూయార్కర్ హోటల్లో ఐదేళ్ల క్రితం మిక్కీ బారెట్తో పాటు అతని ప్రియురాలు 200 డాలర్లకు (రూ. 16,500) ఒక గదిని బుక్ చేసుకున్నారు. మిక్కీ లాస్ ఏంజిల్స్ నుండి న్యూయార్క్కు వచ్చినప్పుడు తన ప్రియురాలిలో కలిసి ఈ గదిలో దిగాడు. తరువాత హోటల్ గదుల బుకింగ్ చట్టానికి సంబంధించిన అక్రమాల గురించి మిక్కీ తన ప్రియురాలికి చెప్పాడు. ఎవరైనా 1969 కి ముందు నిర్మించిన భవనంలో ఒకే గదిలో నివసిస్తున్నట్లయితే, వారు ఆరు నెలల లీజు కింద గదిని తీసుకోవచ్చు. హోటల్లో ఒక రాత్రి బస చేసేందుకు డబ్బులు చెల్లించిన తరువాత గదిని లీజుకు అడిగాడు. అయితే దీనికి హోటల్ యాజమాన్యం నిరాకరించింది. మిక్కీ ఈ విషయమై కోర్టును ఆశ్రయించాడు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి ఇందుకు అనుమతించకపోవడంతో, మిక్కీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించాడు. ఈ కేసులో విజయం సాధించిన మిక్కీకి బస చేసేందుకు హోటల్ గదిని ఇవ్వాలని, తాళం చెవిని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2019 నుంచి 2023, జూలై వరకు అద్దె చెల్లించకుండా అదే హోటల్లో నివసిస్తున్నాడు. అయితే 2019లో ఒక నకిలీ అగ్రిమెంట్ లెటర్ను సృష్టించి, తానే హోటల్ యజమానినని ప్రకటించుకున్నాడు. తరువాత హోటల్ గదుల అద్దెను వసూలు చేయడం మొదలుపెట్టాడు. అనంతరం హోటల్ పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి, నగదు తనకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నించాడు. తాజాగా అతనిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. అయితే తాను హోటల్ నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మిక్కీ ఒక ప్రకటనలో తెలిపాడు. -
Kruger National Park: ట్రైన్ రిసార్ట్
చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు. గైడ్ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుమారి ఆంటీ హోటల్ రీ ఓపెన్
హైదరాబాద్: ఎట్టకేలకు కుమారి ఆంటీ హోటల్ తెరుచుకుంది. ఐటీ కారిడార్లో కోహినూర్ హోటల్ ఎదురుగా ట్రాఫిక్జాం నెలకొనడంతో కుమారి ఆంటీ హోటల్ను ఇటీవల రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ హోటల్ తొలగింపు వైరల్ కావడంతో సీఎం కార్యాలయం స్పందించింది. ఈ హోటల్ను అదే స్థలంలో నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించడంతో వివాదానికి తెరపడింది. -
రైల్విలాస్: అప్పట్లో రైల్వేస్టేషన్.. ఇప్పుడు హోటల్
ప్రపంచంలోని పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కళకళలాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వేస్టేషన్నే హోటల్గా మార్చేశారు. ఇది ఇంగ్లండ్లోని పెట్వర్త్లో ఉంది. మిడ్ ససెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వేస్టేషన్ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది, ప్రయాణికుల వసతి కోసం స్టేషన్కు ఆనుకునే ‘రైల్వే ఇన్’ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలందించిన పెట్వర్త్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపి వేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతీ గతీ లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వేస్టేషన్కు మరమ్మతులు జరిపి, 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో రెండు గదులను హోటల్ గదుల్లా మార్చి, అతిథులకు బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి, స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ‘ద ఓల్డ్ రైల్వేస్టేషన్’ పేరుతో పూర్తిస్థాయి హోటల్గా మార్చారు. -
దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్లో ఈ ఘటన జరిగింది. గౌరవ్ కటియార్(29) సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు -
కలకత్తా యువతులతో వ్యభిచారం
అబిడ్స్: కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అబిడ్స్ ఫార్చూన్ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు, యువతులు, విటులను నగర టాస్్కఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. హైటెక్ తరహాలో అందరి కళ్లుగప్పి వ్యభిచారం నిర్వహిస్తున్న వారందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అఖిలేష్ (36) (అఖిలేష్ ఫహిల్వాన్) అనే వ్యక్తి అబిడ్స్లో ఫార్చూన్ లాడ్జిని కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న నగర సెంట్రల్జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. లాడ్జి యజమాని అఖిలే‹Ù, మేనేజర్ రఘుపతి, 16 మంది యువతులు, 6 మంది విటులను అరెస్టు చేశారు. వీరిలో యువతులను తుక్కుగూడలోని రెస్క్యూహోమ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నర్సింహరాజు తెలిపారు. మిగతా వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసును అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నయా ఆతిథ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆతిథ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఆతిథ్య’ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత హోటళ్లను ఆధునికీకరించేందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు రూ.140 కోట్లతో తొలి దశలో 16 హోటళ్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో అనుభవజు్ఞలైన అర్కిటెక్చర్లతో హోటళ్లకు హంగులు అద్దుతోంది. విశాఖ నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఈ–టెండరింగ్ ప్రక్రియ ద్వారా హరిత హోటళ్ల అప్గ్రేడ్, పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 16 హోటళ్ల పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. విశాఖలోని యాత్రీనివాస్ హోటల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అరకులోని హరిత వ్యాలీ రిసార్టు, నెల్లూరు, ద్వారకాతిరుమలలోని హోటళ్ల పనులు చేపట్టేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. మరో వారంలోగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని టైడా జంగిల్ బెల్స్ రిసార్టు, విజయపురిసౌత్, శ్రీశైలం, సూర్యలంక, కడప, అరకులోని మయూరి, హార్సిలీహిల్స్, కర్నూలు, గండికోట హోటళ్లతో పాటు నెల్లూరు మైపాడు బీచ్ రిసార్టు, దిండి కోకోనట్ రిసార్టు, అనంతగిరి హిల్ రిసార్టులకు టెండర్లు పిలవనుంది. అత్యాధునిక సౌకర్యాలతో.. ఆతిథ్య రంగంలోని ప్రైవేటు హోటళ్లకు దీటుగా ఏపీటీæడీసీ హరిత హోటళ్లను తీర్చిదిద్దుతోంది. ప్రతి హోటల్లో లగ్జరీ ఫర్నీచర్ నుంచి గోడలకు పెయింటింగ్, ఇంటీరియర్పై ప్రత్యేక దృష్టి సారించారు. రెస్టారెంట్, స్పా, మోడ్రన్ జిమ్, స్విమ్మిగ్ పూల్, సావనీర్ షాపు, మినీ బ్యాంకెట్/సమా వేశ మందిరం, టెర్రాస్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, టీవీ యూనిట్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఉడెన్ ర్యాక్స్, టేబుల్ విత్ మిర్రర్, లైటింగ్, డ్రై–వెట్ ఏరియా ఉండేలా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది. పార్కింగ్ సౌకర్యం, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనాన్ని పెంచనుంది. పులివెందులలో 4స్టార్ హోటల్ పులివెందులలో రూ.23.50 కోట్లతో 4స్టార్ హోటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన 1.71 ఎకరాల్లోని ఓ భవనాన్ని గుర్తించి కొనుగోలు చేసింది. ఇందులో వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్ (క్లబ్ హౌస్), జిమ్, పిల్లల ఆటస్థలం, ఎలివేటర్స్, సరై్వలెన్స్ సిస్టమ్, సౌర విద్యుత్ స్టేషన్తో పాటు ఇతర ముఖ్యమైన మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. సౌకర్యాల కల్పనలో రాజీపడం పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తొలుత హరిత హోటళ్లను అప్గ్రేడ్ చేస్తున్నాం. అత్యధిక పర్యాటకులు వచ్చే హోటళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తున్నాం. దశల వారీ అన్ని హోటళ్లలో మార్పులు చేస్తాం. నాణ్యమైన సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. స్టార్ హోటళ్లకు దీటుగానే మా రిసార్టులు, హోటళ్లను తీర్చిదిద్దుతాం – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణీత కాల వ్యవధిలో.. హోటళ్ల ఆధునికీకరణలో భాగంగా ఈ–టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు, అనుభవం కలిగిన ఆర్కిటెక్చర్ల సమన్వయంతో పని చేస్తున్నాం. సుదీర్ఘ అధ్యయనం తర్వాతే ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాం. పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. అనుకున్న కాల వ్యవధిలో పూర్తి స్థాయిలో హోటళ్లను అప్గ్రేడ్ చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – మల్రెడ్డి, ఈడీ (ప్రాజెక్ట్స్), పర్యాటకాభివృద్ధి సంస్థ -
బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు
-
బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హోటల్లో మంటలు చెలరేగాయి. పార్కింగ్లోని మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో.. కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్ హోటళ్లు!
అయోధ్యలో నూతన రామమందిరం రాకతోనే పలు ప్రాజెక్టులు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. అయోధ్యలో నూతన రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పుడు దేశంలోనే అత్యంత విలాసవంతమైన తొలి సెవెన్ స్టార్ హోటల్ను అయోధ్యలో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విలాసవంతమైన హోటల్ విదేశీయులకు, ప్రముఖులకు అనువైన వసతిని అందించనుంది. ఇక్కడ విశేషమేమంటే ఈ సెవెన్ స్టార్ హోటల్లో కేవలం శాకాహారం మాత్రమే అందించనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలో రామమందిర సందర్శనకు పర్యాటకుల రద్దీ అధికంగా ఉండనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు ఈ ప్రాంతంలో స్థార్ హోటళ్లను నిర్మించేందుకు నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. జనవరి 22 నుంచి అయోధ్యలో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. సెవెన్ స్టార్ హోటల్తో పాటు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మరో ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించనున్నదని తెలుస్తోంది. దీనితో పాటు పలు చిన్న హోటళ్ళు కూడా ఇక్కడ ప్రారంభంకానున్నాయి. ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ సంస్థ జనవరి 22న ‘ది సరయూ’ ప్రాజెక్ట్ను ప్రారంభించనుంది. 45 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో నది ఒడ్డున విలాసవంతమైన హోటల్ కూడా నిర్మితం కానుంది. ఇక్కడ పలు ఇళ్లు కూడా నిర్మించనున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఇక్కడ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని రూ. 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే అయోధ్యలో త్వరలో నిర్మితమయ్యే విలాసవంతమైన హోటళ్లు ముంబై, ఢిల్లీలలోని స్టార్ హోటళ్లను తలదన్నేలా ఉండనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: అయోధ్య రామాలయం రెడీ -
అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి?
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుక జనవరి 22న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తూ వారికి లేఖలు పంపారు. అయితే జనవరి 22 నాటికి అయోధ్యకు చేరుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? విమాన టిక్కెట్లు, హోటల్ గదుల ఛార్జీలు ఎలా ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈజ్ మై ట్రిప్, థామస్ కుక్, ఎస్ఓటీసీ తదితర ట్రావెల్ సంస్థలు.. అయోధ్యలో జరిగే వేడుకకు హాజరయ్యేందుకు చాలామంది ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏడు వేల మందికి ఆహ్వానాలు పంపించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఉన్నారు. ‘థామస్ కుక్’, ‘ఎస్ఓటీసీ’ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుండి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధరలు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకూ చేరుకున్నాయి. ఇతర సమయాల కంటే ప్రస్తుతం విమాన ఛార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. సోమవారం మేక్ మై ట్రిప్లో జనవరి 20న ముంబై నుంచి అయోధ్యకు వెళ్లేందుకు వన్వే ఫ్లైట్ టికెట్ రూ.17,900 నుంచి రూ.24,600 వరకూ ఉంది. అదే సమయంలో జనవరి 21 నాన్స్టాప్ విమానానికి రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్కతా నుంచి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధర రూ.19,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుండి అయోధ్యకు వెళ్లాలనుకుంటే జనవరి 20కి రూ. 23,152 నుండి రూ. 32,855 వరకు విమాన టిక్కెట్ల ధర ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈజ్ మై ట్రిప్ పేర్కొన్న వివరాల ప్రకారం అయోధ్య రామాలయ ప్రారంబోత్సవానికి దాదాపు ఏడువేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈనెల 22 తరువాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుండి 100 శాతానికి చేరుకుంది. ఫలితంగా కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేలు వరకూ చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి పూట లక్నో లేదా ప్రయాగ్రాజ్లో బస చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న రామ్లల్లా పవిత్రోత్సవం జరగనుంది. ఈ నేపధ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయ్యాయి. హోటల్ రూమ్ బుకింగ్ ధర గతంలో కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలో 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజు రూమ్ బుకింగ్ లక్ష రూపాయల వరకూ చేరింది. రామ్లల్లా పవిత్రోత్సవం రోజున మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్ల ధరలను అమాంతం పెంచేశారు. హోటల్ అయోధ్య ప్యాలెస్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు రూ. 18,500 పలుకుతోంది. సాధారణంగా ఇక్కడ గది అద్దె రూ. 3,700. ది రామాయణ హోటల్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె రూ. 40 వేలు. 2023లో దీని అద్దె రూ. 14,900గా ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో ప్రస్తుతం ఒకరోజు అద్దె దాదాపు రూ.70, 500. గత ఏడాది జనవరిలో ఇక్కడ గది అద్దె రూ. 16,800గా ఉండేది. మీడియాకు అందిన వివరాల ప్రకారం అయోధ్యలోని రామాయణ్ హోటల్లోని గదుల బుకింగ్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయింది. ఈ హోటల్లోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఈ హోటల్లో గది అద్దె రోజుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్లోని విలాసవంతమైన గది ఒకరోజు అద్దె లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. ఈ హోటల్లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. గతంలో ఈ హోటల్లో గది అద్దె కనీసంగా రూ.7,500 ఉండేది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమక్షంలో అయోధ్యలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయోధ్యలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామని, దానిలో శాకాహారం అందిస్తామని యూపీ సీఎం యోగి తెలిపారు. అలాగే ప్రతీయేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితమే జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతోందని అన్నారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే ఉత్సవం వెలుగుల పండుగ దీపావళిలా ఉంటుందని అన్నారు. అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటిలో ఒకటి కేవలం శాకాహారం అందించే సెవెన్ స్టార్ హోటల్ అని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో చర్చించామని అన్నారు. అయోధ్యకు దేశంలోని నలుమూలల నుంచి రోడ్డు, విమాన, రైలు కనెక్టివిటీ ఏర్పడిందన్నారు. వీధి వ్యాపారుల వ్యాపార నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అయోధ్యలో గ్రీన్ కారిడార్ నిర్మిస్తామని, రామభక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత రామ నవమికి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా వేయగా, ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయోధ్యకు వచ్చే రామభక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం! -
Ex-Model Divya Pahuja: గురుగ్రామ్లోని హోటల్లో మాజీ మోడల్ దారుణ హత్య
హర్యానాలోని గురుగ్రామ్లో ఘోరం జరిగింది. ఓ హోటల్లో గదిలో 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలని మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు. నిందితుడిని సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్గా తేల్చారు. అబిజిత్తోపాటు అతడి హోటల్లో పనిచేసే మరో ఇద్దరు ప్రకాశ్, ఇంద్రజ్లను గురుగ్రామ్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దివ్య హత్యకు స్కెచ్ వేసిన అభిజిత్ ఆమె మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా పడేసేదుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. హత్య ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అభిజిత్, యువతి, మరో వ్యక్తి జనవరి రెండో తేదిన హోల్ రిసెప్షన్ వద్దకు రావడం కనిపిస్తుంది. అక్కడి నుంచి రూమ్ నెంబర్111కు వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రాత్రి అభిజిత్ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తోంది. హోటల్ నుంచి బీఎండబ్ల్యూ కారులో పారిపోవడం రికార్డయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2016లో గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. అయితే గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్, అభిజీత్తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కాగా 2016 ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్లో బెయిల్పై విడుదలైంది. -
బిజినెస్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ భూమిక చావ్లా. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. అనంతరం మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా చేసిన భామ.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్తో మెప్పిస్తోంది. ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్కు అక్కగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తోన్న ఎమర్జన్సీ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే భూమిక చావ్లా.. తాజాగా వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా పంచుకుంది. గోవాలో కొత్త హోటల్ను ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నటికి అభినందనలు తెలుపుతున్నారు. భూమిక హోటల్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) -
హిమాచల్కు టూరిస్టుల తాకిడి!
హిమాచల్ ప్రదేశ్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది. ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
జస్ట్ హెయిర్ డ్రైయర్ ఉపయోగించినందుకు.. ఏకంగా రూ. 78 వేలు..!
కొన్నిసార్లు స్టార్ హోటళ్లు, లగ్జరీ హోటళ్లు విలాసవంతంగా ఉంటాయని ఒక్కసారి అయినా స్టే చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆ హోటళ్లలో కొంతమంది కస్టమర్లకు ఎదరైన చేదు అనుభవాలు వింటే దెబ్బకు ఆ ఆలోచన కూడా చేయరు. అసలు వాటి వైపుకి వెళ్లే యత్నం కూడా చేయరు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలాంటి దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మళ్లీ హోటల్లో స్టే చేయాలంటేనే భయపడింది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియాలోని పెర్త్కి చెందిన ఒక మహిళ నోవాటెల్ పెర్త్ లాంగ్లీ హోటల్లో బస చేసింది. ఆమెకి కింగ్స్ పార్క్లో మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంగీత కచేరి ఉంది. అందుకోసం ఆ మహిళ ఈ నోవాటెల్లో బస చేసింది. అయితే ఆ మహిళ తన ప్రదర్శనకు వెళ్లే ముందు గదిలో స్నానం చేసి డ్రైయర్ని ఉపయోగించి జుట్టుని ఆరబెట్టుకుంది. అయితే దుస్తులు మార్చకోక మునుపే ఆమె డోర్ వెలుపలే అగ్నిమాపక సిబ్బంది కాచుకున్నారు. ఆ డ్రైయర్ని ఉపయోగించడంతో ఎమర్జెన్సీ అలారం మోగడంతో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ఈ తతంగం అంతా చూసి ఆ మహిళ షాకయ్యింది. అయితే సదరు మహిళ కాస్త తమాయించుకుని వాళ్లకి క్షమాపణ చెప్పడమే గాక వారిని కంగారు పెట్టించినందుకు డబ్బులు కూడా కట్టింది. అంతవరకు బాగానే ఉంది. సదరు హోటల్ కూడా ఆమె నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే ఆమెను షాక్కి గురి చేసింది. అయితే ఆమె హోటల్ నుంచి వెళ్లేటప్పుడూ ఇదంతా గమనించలేదు. ఆ తర్వాత తన బ్యాంక్ ఎకౌంట్ చెక్ చేయగా కేవలం డ్రైయర్ ఉపయోగించినందుకు ఏకంగా రూ. 78 వేలు బిల్లు వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆమె కంగుతింది. ఏంటీది అని కంగారు పడి వెంటనే సదరు హోటల్కి ఫోన్ చేయగా, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగేలా చేశారు అందుకని అంటూ ఏవేవో సమాధానాలు ఇచ్చారు హోటల్ సిబ్బంది. పైగా ఆమె ఫోన్కాల్స్ని రిసీవ్ చేయకుండా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. ఇక లాభం లేదనుకుని మేనేజర్కి ఇమెయిల్స్ అదేపనిగా పెట్టడంతో ఎట్టకేలకు సదరు హోటల్ మేనేజర్ ఆమె డబ్బులు వాపసు చేశాడు. ఇలాంటి వింత ఘటనే చైనాలో కూడా జరిగింది. ఓ మహిళ హోటల్లో రెండు రోజులు బస చేసేందుకు రూమ్ని బుక్ చేసుకుంది. అయితే జస్ట్ రెండు సార్లు స్నానం చేసిందని అదనంగా రూ. 28,850 వసూలు చేయడంతో విస్తుపోయింది సదరు మహిళ. (చదవండి: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే..మగవాళ్లు డ్రింక్ చేయకూడదట! అధ్యయనంలో షాకింగ్ విషయాలు) -
వెజ్ ప్లేట్ రూ.30.3 .. నాన్ వెజ్ రూ.61.2
హోటల్లో ఫుడ్ ఆరగిస్తే.. వేలకు వేలు బిల్లు కడుతుంటాం. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా వందల్లోనే మొదలవుతుంది. మరి మన ఇంట్లోనే వండుకుంటే.. ఎంత ఖర్చవుతుంది? నిజానికి బాగా తక్కువే. అందులోనూ సీజన్ను బట్టి, కూరగాయలు, చికెన్, మటన్, ఇతర మాంసాహార ధరలను బట్టి ఖర్చు మారిపోతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత క్రిసిల్ సంస్థ.. వంటల్లో వాడే సరుకుల ధరల ఆధారంగా.. ఇంట్లో వండుకునే ఒక్కో ప్లేట్ ఆహారానికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలు వేసింది. దాదాపు ఏడాదిన్నర కాలంలో నెలనెలా సరుకుల ధరలను పరిశీలించి.. సగటు థాలీ (ప్లేట్ భోజనం) ఖర్చు ఎంతెంత అన్న లెక్కలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. టమాటాలు, ఉల్లి ధరలే కీలకం: క్రిసిల్ సంస్థ వివిధ రకాల మాంసంతోపాటు వంటల్లో వాడే పప్పులు, కూరగాయలు, నూనెలు, మసాలాల ఖర్చునూ కలిపి భోజనం తయారీకి అయ్యే ఖర్చును లెక్కించింది. వంట చేసేందుకు అయ్యే గ్యాస్ ఖర్చునూ కలిపింది. అయితే ప్రధానంగా ఇటీవలి కాలంలో టమాటా, ఉల్లి ధరలు బాగా పెరిగిపోవడం, తర్వాత తగ్గడం నేపథ్యంలో సగటు థాలీ ఖర్చులోనూ హెచ్చుతగ్గులు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని నలుమూలలా ఉన్న రాష్ట్రాల నుంచి ధరల వివరాలు తీసుకుని, సగటు ధరలతో ఈ అంచనాలు వేసినట్టు తెలిపింది. ఎలాగైతేనేం హోటల్లో ఫుడ్డు తినేకంటే ఇంట్లో వండుకుంటే బాగా డబ్బులు మిగులుతాయనీ నివేదిక చెప్పినట్టే మరి! -
అప్పట్లో జైలు.. త్వరలోనే విలాసవంతమైన హోటల్గా..!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సువిశాల భవంతి ఆరేళ్ల కిందటి వరకు జైలుగా ఉండేది. దీనిని 2017 మార్చిలో మూసివేశారు. ఇప్పుడు దీనిని పర్యాటకులకు బస కల్పించే హోటల్గా మారుస్తున్నారు. జపాన్లో హోన్షు దీవిలోని నారా నగరంలో ఉన్న ఈ జైలు బాల నేరస్థుల కారాగారంగా ఉండేది. దాదాపు 115 ఏళ్ల పాటు ఇది బాల నేరస్థుల కారాగారంగానే కొనసాగింది. ఖైదీలు బాగా తగ్గిపోవడంతో జపాన్ ప్రభుత్వం ఈ జైలును మూసివేసింది. ప్రభుత్వం నుంచి దీనిని ఇటీవల హోషినో రిసార్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. పర్యాటకులను ఆకట్టుకునేలా దీనిని హోటల్గా మార్చడానికి సన్నాహాలు ప్రారంభించింది. జైలు నిర్మాణాన్ని పెద్దగా మార్చకుండానే, ఇందులో పర్యాటకులకు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. అతిథులకు జైలులో బస చేసిన అనుభూతి కలిగించడానికి అనువుగా దీని మౌలిక నిర్మాణంలో మార్పులేవీ చేయడం లేదని, అదనంగా ఆధునిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని హోషినో రిసార్ట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ అసాకో సాటో మీడియాకు చెప్పారు. ఇందులో 48 మంది అతిథులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, హోటల్గా మారుస్తున్న జైలు ప్రాంగణంలోని గార్డ్స్ క్వార్టర్లు యథాతథంగా ఉంటాయని, వాటిలో గార్డులు ఎప్పటి మాదిరిగానే ఉంటారని తెలిపారు. ఈ ప్రాంగణంలో రెస్టారెంట్, మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని 2026 నాటికి ప్రారంభించనున్నట్లు చెప్పారు. (చదవండి: పిల్లల గణతంత్ర ప్రపంచం!) -
ఇదో అద్భుత హెటల్: ఇక్కడ అన్నీ ఉంటాయి,, కానీ..!
ఇండోనేషియాలోని ఒక అద్భుతం కట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్యంత తక్కువ స్థలంలో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఒక హోటల్ ఇపుడు హాట్ టాపిక్. సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్లో ఉన్న ‘‘పిటురూమ్స్’’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థలంలో నిర్మించిన అతి పెద్ద భవంతిగా రికార్డు సాధించింది. ఇండోనేషియా ఆర్కిటెక్ట్ ఆరీ ఇంద్ర, సహబత్ సెలోజెనే రూపొందించిన అతి సన్నని హెటల్ కేవలం 110 ఇంచుల వెడల్పు అంటే నమ్ముతారా. కాని ఇదే నిజం. సలాటిగా 2022లో నిర్మితమైన ఈ హోటల్ గరిష్ట ఎత్తు 17 మీ (55 అడుగులు) పొడవు 9.5 మీ (31 అడుగులు). ఇంటీరియర్ లేఅవుట్ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. మొత్తం ఏడు దులు, ఒక చిన్న లాంజ్, ఒక ఎంట్రన్స్ లాబీ, భవనం పైభాగంలో చిన్న అవుట్డోర్ టెర్రస్ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. హోటల్ గదులు మధ్య క్రిస్క్రాసింగ్ మెట్లు, వస్తువులు, ఇంకా వికలాంగుల కోసం చిన్న ఎలివేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ఏడు గదులలో ఒక్కోటి ఒక్కో రంగులో ఒక్కో ధీమ్తో ఉంటాయి. డబుల్ బెడ్, టీవీ, షవర్, సింక్ , టాయిలెట్తో కూడిన బాత్రూమ్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. కేవలం 9.1 x 9.8 x 7.8 అడుగులతో కాంపాక్ట్ రూమ్స్లో అన్ని ఎమినిటీస్, ఇంటీరియర్తో, వివిధ ఒరిజినల్ ఆర్ట్వర్క్లతో, విభిన్న థీమ్తో, ప్రతీమూల ఒక పెర్సనల్ టచ్తో అత్భుతమైన అనుభవాన్నిస్తుందని సహబత్ సెలోజీని తెలిపారు. ఈ కాంపాక్ట్ రూములను కలిపేలా ఫ్లోటింగ్ స్టెప్స్, 90 సెంటీమీటర్ల (2.9 అడుగుల) నారో క్యారిడార్లు కారిడార్తో ఫ్లోరింగ్గా అమర్చినట్టు తెలిపారు. ధర ఎంతో తెలుసా? జపనీస్ భాషలో పిటూ అంటే ఏడు అని అర్థం. సెంట్రల్ జావాలో ఉన్న హోటల్లో ఏడు గదులు ఉండడంతో పిటూరూమ్స్ అని పిలుస్తారట. మరి ఈ PituRoomsలో ఒక రాత్రి బస చేయాలనుకుంటే ఒక్కో రాత్రికి సుమారు రూ. 5వేలు ఖర్చు అవుతుంది. -
హోటల్ అద్దెలు పైపైకి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం, క్రిస్మస్, పెద్ద సంఖ్యలో వివాహాలు ఇవన్నీ కలసి హోటళ్ల ధరలను పెంచేస్తున్నాయి. వేడుకలు చేసుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్లలో గదుల ధరలు గణనీయంగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, సదస్సులు హోటళ్ల ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకోవాలి. కార్పొరేట్ బుకింగ్లు ఒకవైపు, మరోవైపు జీ20 దేశాల సద స్సు, ఐసీసీ ప్రపంచకప్ వంటివి కొన్ని పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్ను అమాంతం పెంచేశాయి. అవే రేట్లు కొనసాగేందుకు లేదా మరింత పెరిగేందుకు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు, ఏడాది ముగింపులో వేడుకలు తోడయ్యాయని చెప్పుకోవాలి. హోటళ్లలో వందల సంఖ్యలో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్లు నమోదైనట్టు యజమానులు చెబుతున్నారు. దేశీ యంగా పర్యాటకుల సంఖ్య పెరగడం కూడా క్రిస్మస్–న్యూ ఇయర్ సందర్భంగా రేట్ల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే బుకింగ్లు అన్నీ పూర్తయిపోయాయి. ఉదయ్పూర్లోని హోటల్ లీలా ప్యాలెస్లో క్రిస్మస్ సందర్భంగా ఒక రాత్రి విడిదికి రూ.1,06,200గా (బుకింగ్ డాట్కామ్) ఉంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఒక రాత్రి విడిదికి రూ.1,64,919 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అనూహ్యం రాజస్థాన్లో ఫోర్ట్ బర్వారా ప్రాపర్టీని నిర్వహించే ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈవో అఖిల్ అరోరా సైతం డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది రేట్లు పెరిగేందుకు దారితీసింది. గతేడాదితో పోలిస్తే రేట్లు 10–15 శాతం మేర పెరిగాయి. సిక్స్సెన్స్ ఫోర్ట్ బర్వారా, జానా, కంట్రీ ఇన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ తదితర మా హోటళ్లలో అతిథుల కోసం అద్భుతమైన వేడుకలకు ఏర్పాట్లు చేశాం. కనుక వీలైనంత ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు’’అని అరోరా తెలిపారు. ఉదయ్పూర్లోని ఎట్ అకార్ అగ్జరీ హోటల్ ర్యాఫెల్స్ లో రోజువారీ ధరలు సగటున 24 శాతం మేర పెరిగాయి. గడిచిన ఆరు నెలల కాలంలో రేట్లు పెరిగినట్టు 49 శాతం మేర హోటల్ యాజమాన్యాలు తెలిపాయి. గోవా, పుదుచ్చేరి, ఊటీ క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. -
కారులోనే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మళయాల నటుడు
కొచ్చి: పాపులర్ మళయాల నటుడు వినోద్ థామస్(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.కేరళలోని పంపడిలోని ఓ హోటల్లో పార్క్ చేసి ఉన్న కారులో ఆయన చనిపోయి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. చాలా సేపటి నుంచి హోటల్ ఆవరణలో ఉన్న కారులో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వచ్చి చూశామని పోలీసులు చెప్పారు. హోటల్కు చేరుకున్న వెంటనే కారులో పడి ఉన్న వినోద్ థామస్ను ఆస్పత్రికి తరలించామని, అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు తెలిపారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించామన్నారు. అయ్యప్పనుమ్ కోష్యుమ్, నథోలి, ఒరు చెరియ మీనల్ల, ఒరు వంత్ పాతాయా, హ్యాప్పీ వెడ్డింగ్, జూన్ లాంటి పాపులర్ సినిమాల్లో వినోద్ థామస్ నటింంచారు. ఇందులో అయ్యప్పనుమ్ కోష్యుమ్ అనే చిత్రం తెలుగులో భీమ్లానాయక్ పేరుతో రీమేక్ చేశారు. ఇదీచదవండి.. ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్ను గెలిపించమ్మా’ -
క్రికెట్ వరల్డ్కప్ రోజున ఉచిత వసతి! ఎక్కడంటే..
ప్రపంచకప్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరిగబోయే అహ్మదాబాద్లో రద్దీ నెలకొంది. ప్రధానంగా మ్యాచ్ జరిగే నరేంద్రమోదీ స్టేడియం పరిసరాల్లోని హోటళ్లు మ్యాచ్ వీక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి వసతి కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా అహ్మదాబాద్లోని వేక్ఫిట్ మ్యాట్రెస్ సొల్యూషన్స్ కంపెనీ తమ స్టోర్లో ఉచిత బసను పొందేందుకు క్రికెట్ అభిమానులకు అవకాశం కల్పిస్తోంది. క్రికెట్ అభిమానుల కోసం అహ్మదాబాద్లోని సర్ఖేజ్-గాంధీనగర్లో ఉన్న బోడక్దేవ్ అవుట్లెట్లో ప్రపంచ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఉచిత బస ఏర్పాటు చేసినట్లు వేక్ఫీట్ ప్రకటించింది. అయితే ఇందుకోసం అభిమానులు ముందుగా తమ వెబ్సైట్లో మ్యాచ్ టికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలను కంపెనీకి ఈమెయిల్ చేయాలి. నవంబర్ 19, ఉదయం 11లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ తెలిపింది. క్రికెట్ అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన వేక్ఫిట్ మ్యాట్రెస్ను తయారుచేస్తోంది. 2016లో స్థాపించిన ఈ కంపెనీ ఈ రంగంలో 30-40 శాతం మార్కెట్ను సొంతం చేసుకుందని సమాచారం. -
బిల్లు ఎగ్గొడదామని చూశారు..కెమెరాకి చిక్కారు..
-
ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(94) మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంతో కన్నుమూశారు. 2002లో అతను తన తండ్రి మోహన్ సింగ్ ఒబెరాయ్ మరణం తర్వాత ఐఈహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2013 వరకు సంస్థ సీఈఓగా కొనసాగారు. మే 2022 వరకు పృథ్వీ రాజ్ సింగ్ ఈఐహెచ్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తన పదవిని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన మేనల్లుడు అర్జున్ సింగ్ ఒబెరాయ్ను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమించారు. ఒబెరాయ్ ఆరోగ్యం కోసం ఎక్కువ సమయం కేటాయించేవారని ఆయన కుమారుడు ఒబెరాయ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబెరాయ్ తెలిపారు. పృథ్వీ రాజ్ సింగ్ ఇండియా, యూకే, స్విట్జర్లాండ్లో చదువు పూర్తిచేశారు. 1967లో దిల్లీలో ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ని స్థాపించారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో చేసిన సేవలకు గాను 2008లో ఒబెరాయ్కు పద్మవిభూషణ్ లభించింది. 2008లో బిజినెస్మ్యాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. లగ్జరీ హోటళ్లలో కలిస్తున్న వసతులకుగాను 2010లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. నవంబర్ 2010లో కార్పొరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకున్నారు. ఫిబ్రవరి 2013లో ది ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ద్వారా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. 2015లో సీఎన్బీసీ టాప్ 15 భారతీయ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా ఎంపికయ్యారు. -
దారుణం: హోటల్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అమానవీయ ఘటన జరిగింది. హోటల్లో పనిచేసే యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మద్యం తాగించి, ఆమెపై కిరాతకంగా దాడి చేశారు. యువతిని గదిలోకి లోక్కెళుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి తాజ్గంజ్ పోలీస్ స్టేషన్కి ఓ యువతి కాల్ చేసి రోదిస్తూ విషయం తెలిపింది. పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే గాయాలపాలైన యువతి దారుణాన్ని పోలీసులకు తెలిపింది. యువతి హోటల్లో ఏడాదిన్నరగా ఉద్యోగిగా పనిచేస్తోంది. శనివారం అర్ధరాత్రి యువతి స్నేహితురాలు బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. మద్యం మత్తులో వారితోపాటే ఉన్న మరో నలుగురు యువకులు బాధితురాల్ని ఓ గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ యువతి కాపాడండి అంటూ కేకలు పెడుతున్న ఓ వీడియో పోలీసులకు చిక్కింది. అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన తనపై ఆ యువకులు దాడి చేశారని బాధితురాలు తెలిపింది. గాజు గ్లాస్తో తలపై కొట్టారని వాపోయింది. ఇంతకు ముందు తీసిన తన అభ్యంతరకర వీడియోను బయటపెడతామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో నలుగురు యువకులు, ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
హోటల్కు వచ్చిన మహిళకు చేదు అనుభవం
అమెరికాకు చెందిన ఒక గమ్మత్తయిన వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని రిట్జ్-కార్ల్టన్ హోటల్లో పనిచేసే ఓ ఉద్యోగి అదే హోటల్లో బస చేసేందుకు వచ్చిన ఒక మహిళకు వీర్యం కలిపిన నీటిని ఇచ్చాడు. ఆమె ఆ నీటిని తాగినప్పుడు, ఆ రుచి కొత్తగా అనిపించింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె ఆ హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఆ నీటికి ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా, అందులో వీర్యం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ, ఆమె భర్త సదరు హోటల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితునిపై తక్షణంచర్యలు చేపట్టి, హోటల్ యాజమాన్యం నుంచి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరుతోంది. జేన్, జాన్ డో దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడానికి ఒక హోటల్కి వెళ్లారు. రిట్జ్-కార్ల్టన్ హోటల్లో తనకు ఫైవ్ స్టార్ హోటల్ తరహా స్వాగతం లభించిందని జేన్ తెలిపింది. అనంతరం హోటల్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఆమె వాటర్ బాటిల్ ఆర్డర్ చేసింది. దీంతో ఒక మగ ఉద్యోగి ఐదు వాటర్ బాటిళ్లను వారి గదిలోకి తెచ్చి, వారికి ఇచ్చి వెళ్లిపోయాడు. తరువాత వారంతా నిద్రపోయారు. అర్ధరాత్రి దాహం వేయడంతో ఆమె ఆ బాటిల్లోని నీటిని తాగింది. అయితే ఈ నీటి రుచి కొత్తగా అనిపించడంతో ఆమె భర్తను నిద్ర నుంచి లేపి, విషయం చెప్పింది. దీంతో వారు ఈ విషయమై ముందుగా హోటల్ యాజమాన్యానికి, తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ హోటల్ ఉద్యోగి ఇచ్చిన నీటిని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. ఈ నీటిలో వీర్యం కలిసిందని నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఆ మహిళ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ అకృత్యానికి పాల్పడిన హోటల్ ఉద్యోగిపై ఇంకా చర్యలు తీసుకోలేదని, అతనికి త్వరగా శిక్ష పడకపోతే ఇలాంటి పనులను కొనసాగిస్తాడని అన్నారు. ఇది కూడా చదవండి: కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది! -
రోడ్డు కోసమని రోడ్డున పడేస్తున్నారు...
నారాయణ్పేట్: కేంద్ర ప్రభుత్వం మహబూబ్నగర్– చించోలి రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించింది. బెంగుళూరు– ముంబాయి మధ్య జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకలి వరకు ఉన్న 192 కి.మీ., మేర రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించడానికి గతేడాది రూ.703 కోట్లు మంజూరయ్యాయి. తెలంగాణలో మూడు జిల్లాలను కలుపుతూ వెళ్తున్న ఈ రోడ్డును 167 జాతీయ రహదారిగా గుర్తించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా భూత్పూర్ నుంచి దుద్యాల వరకు ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించగా.. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల బీటీ వేయగా.. అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణం దాదాపుగా పూర్తిచేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు తొలగిస్తుండటంతో గూడు కోల్పోవడమే కాక.. పలువురి ఉపాధికి ఎసరు వచ్చింది. దీంతో జాతీయ రహదారి వచ్చిందని సంతోషపడాలో.. లేక తమ గూడు చెదిరిందని బాధపడాలో అర్థం కాక గొడోమంటున్నారు. 400 ఇళ్ల వరకు.. 5 మండలాల్లోని 17 గ్రామాల్లో 50 ఫీట్లలోపు ఉన్న 400 ఇళ్ల వరకు తొలగిస్తుండడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చివేస్తుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం సైతం లేకపోవడం.. అటు ప్రభుత్వం వేరే దారి చూపకపోవడంతో రోడ్డుపాలవుతున్నారు. 50 ఫీట్లలోపు ఉన్న ఇళ్లకు, వ్యవసాయ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వమని అధికారులు తేల్చిచెప్పారు. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు కేవలం 100 మాత్రమే 50 ఫీట్ల బయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి మాత్రమే పరిహారం ఇస్తామనడంతో బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. 81.5 ఎకరాల భూమి.. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు 60 కి.మీ., రోడ్డు విస్తరణకు గాను 81.5 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 5 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 547 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ పొలాలతోపాటు ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో బాధితుల వారిగా ఎవరి భూమి, ఇల్లు ఎంతెంత పోతుంది అని గతేడాది అక్టోబర్లోనే అధికారులు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చారు. ఇళ్లు, భూ నిర్వాసితులకు కలిపి పరిహారం ఇవ్వడానికి రూ.135 కోట్లు కేటాయించారు. అయితే పనులు ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేకపోయారు. ఇటీవల రంగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి పరిహారం చెల్లించాలని విస్తరణ పనులు అడ్డుకున్నారు. హోటల్ పోయింది.. గండేడ్లో మంచి అడ్డా దొరకడంతో తాత్కాలికంగా షెడ్డు వేసుకొని హోటల్ నిర్వహిస్తున్నా. నిత్యం రూ.2–3 వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు దాన్ని తీసేయమంటున్నారు. హోటల్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఇంటిల్లిపాది దానిపైనే ఆధారపడ్డాం. కనీసం ఇంకోచోట బతికే పరిస్థితి లేకపోవడంతో ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. – ఆంజనేయులు, చెన్నాయిపల్లి ఒక్క గదే మిగిలింది.. నాకు మూడు షెట్టర్లు, రెండు గదులు ఉండగా.. ఒక్క దాంట్లో మొబైల్ షాపు పెట్టుకొని మిగతావి అద్దెకు ఇచ్చాం. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. అధికారులు వచ్చి రెండు రోజుల్లో మార్కింగ్ చేసిన వరకు తీసేయాలని.. లేదంటే జేసీబీతో కూల్చేస్తామన్నారు. అలా చేస్తే మొత్తం పోతుందని సొంతంగా కూల్చేయడం వల్ల ఒక్క గది మిగిలింది. – ఇజాజ్ హుస్సేన్, మహమ్మదాబాద్ పనులు జరుగుతున్నాయి.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 50 ఫీట్ల లోపు ఉన్నవాటికి ఎలాంటి పరిహారం ఇవ్వం. ఇక భూమి పోతున్న నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించి బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకున్నారు. ఎవరికి ఎంతెంత రావాలో నిర్ణయించారు. నిర్వాసితులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చాకే పనులు చేపడతాం. ప్రభుత్వ భూములు ఉన్నచోట పనులు జరుగుతున్నాయి. – రమేష్, డీఈ, నేషనల్ హైవే సల్కర్పేట్కు చెందిన గిరమోని రవికుమార్కు 37 గుంటల తరిపొలం ఉండగా జాతీయ రహదారి నిర్మాణంతో మొత్తం పోతుంది. అయితే భాగాలు పంచుకోవడం మూలంగా ఇతని ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ వేరే వారి పేరిట ఉండడంతో పరిహారం అందడం కష్టంగా ఉంది. అటు భూమి పోవడమే కాక.. ఇటు పరిహారం అందే పరిస్థితి లేకపోవడంతో అయోమయంలో పడ్డాడు. దాదాపు 25 ఏళ్లుగా అదే భూమిని నమ్ముకున్నాడు. రోడ్డు విస్తరణ కారణంగా సర్వం కోల్పోతున్నాడు. జానంపల్లికి చెందిన చెన్నారం వెంకటయ్య ఆర్సీసీ ఇల్లు నిర్మించుకొని అందులోనే హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చి కూల్చివేస్తామని చెప్పారు. ఆ తర్వాత జేసీబీతో మార్కింగ్ ఇచ్చిన వరకు ఇల్లు కూల్చివేయడంతో ప్రస్తుతం ఒక్క గోడ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం అతనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. ఉపాధి కూ డా పోవడంతో బతుకు భారంగా మారింది. ఉపాధికి ఎసరు.. చాలా గ్రామాల్లో రోడ్డుకిరువైపులా పలు రకాల దుకాణాలు నిర్వహిస్తున్నారు. కిరాణం, మెకానిక్, జిరాక్స్, ఫర్టిలైజర్, మెడికల్ షాపు, హాస్పిటల్, హోటళ్లతో జీవనం సాగిస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ పేరిట ఇవన్నీ తొలగిస్తుండడంతో వారంతా ఉపాధి కోల్పోతున్నారు. మహమ్మదాబాద్లో రోడ్డుకిరువైపులా కనుచూపు మేర కనీసం ఒక్క టీ షాపు కూడా లేదు. రోజూవేలు సంపాదించే వారు కనీసం రూ.100 కూడా వచ్చే పరిస్థితి లేక.. కుటుంబాలు ఎలా పోషించాలో అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ప్రపంచంలోనే ఇలాంటి హోటల్ ఎక్కడా లేదు.. అంత స్పెషల్ ఏంటంటే..
ప్రపంచంలో అక్కడక్కడా కాలంచెల్లిన బోయింగ్ విమానాల్లో నడిపే హోటళ్లు ఉన్నాయి. అయితే, టర్కీలో మాత్రం ఏకంగా విమానం ఆకారంలోనే నిర్మించిన విలాసవంతమైన హోటల్ ఉంది. ప్రపంచంలో ఇలాంటి హోటల్ ఇదొక్కటే! ప్రైవేట్ బీచ్, ఒక ‘పెద్దలకు మాత్రమే’ స్విమ్మింగ్పూల్ సహా నాలుగు స్విమ్మింగ్పూల్స్, ఒక ఆక్వా పార్క్ ఈ హోటల్ ప్రత్యేకతలు. టర్కీలోని అంతాల్యా నగరానికి చేరువలోని లారా సముద్రతీరం వద్దనున్న ఈ హోటల్ పేరు ‘కాంకోర్డ్ డీలక్స్ రిసార్ట్’. అంతాల్యా విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనున్న ఈ హోటల్ టర్కీలో పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ హోటల్లో పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేకమైన కిడ్స్ క్లబ్, మినీ గోల్ఫ్కోర్స్, టెన్నిస్ కోర్ట్ తదితరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో విందు వినోదాల కోసం పన్నెండు రెస్టారెంట్లు, పదహారు బార్లు కూడా ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఇందులో ఒకరోజు బస చేసేందుకు 73 పౌండ్లు (రూ.7,245) మాత్రమే! -
ఆ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!
ఈ ఫొటో కొంచెం వింతగా కనిపిస్తోంది కదూ! ఇది జపాన్లోని ఒక క్యాప్సూల్ హోటల్లోనిది. జపాన్లో ఇలాంటి హోటళ్లు చాలానే ఉంటాయి. ఈ హోటళ్లలో మనుషులు బస చేయడానికి గదులు కాదు, గూళ్లు ఉంటాయి. ఈ గూళ్లలోనే వస్తువులు పెట్టుకోవడానికి తగిన సౌకర్యాలు కూడా ఉంటాయి. రైళ్లలోని బెర్తుల మాదిరిగా ఒకదానిపైన మరొకటి, ఒకదాని పక్కన మరొకటి– ఇలా ఒక్కో హోటల్లోను వందలాది గూళ్లు కనిపిస్తాయి. చౌక ధరల్లో వసతి సౌకర్యం కోరుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. ఇలాంటి క్యాప్సూల్ హోటళ్లు జపాన్లో నలభై ఏళ్లకు పైగానే నడుస్తున్నాయి. జపాన్లోని తొలి క్యాప్సూల్ హోటల్ 1979లో ప్రారంభమైనప్పుడు కొంత వింతగా చూసేవారు. తర్వాతి కాలంలో ఇలాంటి హోటళ్లు విరివిగా ఏర్పడటంతో జనాలు అలవాటుపడిపోయారు. (చదవండి: ఏడాదికి ఒక్కరోజే ఆ గ్రామంలోకి ఎంట్రీ! ఎందుకంటే..) -
విజయవాడ : హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
వరల్డ్ టూరిజంలో ఏపీకి ప్రత్యేక స్థానం రావాలి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ను సీఎం జగన్ ప్రారంభించారు. హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, హోటల్ హయత్ ప్లేస్ ఛైర్మన్ ఆర్ వీరా స్వామి, ఉన్నతాధికారులు, పలువులు ఇతర ప్రజా ప్రతినిధులు.పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►హయత్ ఛైర్మన్ వీరస్వామి, హయత్ ఇంటర్నేషనల్ ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్ సాయికార్తీక్లతో పాటె ఈ ప్రాజెక్టులో మమేకమైన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు సీఎం జగన్ ►విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్, ప్రముఖ హోటల్స్ వచ్చి... ఆంధ్రరాష్ట్రం కూడా గ్లోబల్ ఫ్లాట్ఫాంమీద, ప్రపంచ పర్యాటక మ్యాప్లో ఒక ప్రత్యేకమైన స్ధానం పొందాలని... మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చాం. మంచి టూరిజం పాలసీని తీసుకునిరావడమే కాకుండా.. మంచి చైన్ హోటల్స్ను కూడా ప్రోత్సహిస్తూ వచ్చాం. ►ఒబెరాయ్తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక మ్యాప్లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ►ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారందరికీ ఇలాంటి ప్రోత్సహకాలిచ్చి ఏపీని వరల్డ్ టూరిజం మ్యాప్లో పెట్టేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ►విజయవాడ నగరంలో మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ హోటల్స్ ఇంకా రావాలని, ఇవి రాష్ట్ర మంతటా విస్తరించాలని మనసారా కోరుకుంటున్నాను. -
కోట్లకు పడగలెత్తిన దొంగ.. నేపాల్లో హోటల్, యూపీలో గెస్ట్హౌస్, లక్నోలో ఇల్లు..
దేశరాజధాని ఢిల్లీ పోలీసులు ఇటీవల ఒక దొంగను పట్టుకున్నారు. ఇతను పోలీసుల కన్నుగప్పి చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఈ దొంగ తన దొంగసొమ్ముతో ఢిల్లీ మొదలుకొని నేపాల్ వరకూ పలు ఆస్తులను కూడబెట్టాడు. ఈ దొంగ.. ఢిల్లీలో ఒంటరిగా 200కు పైగా చోరీలు చేశాడు. ఇతనిని పోలీసులు వివిధ పేర్లతో తొమ్మిదిసార్లు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగ తన భార్య పేరుతో సిద్ధార్థనగర్లో గెస్ట్హౌస్, తన పేరుతో నేపాల్లో ఒక హోటల్ కొనుగోలు చేశాడు. అలాగే లక్నో, ఢిల్లీలలోనూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. 2001 నుంచి 2023 వరకూ ఈ దొంగపై 15కు పైగా నేరపూరిత కేసులు నమోదయ్యాయి. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం మోడల్ టౌన్ పోలీసులు ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో కోటీశ్వరుడైన ఒక హోటల్ వ్యాపారిని అరెస్టు చేశారు. అతనిని మనోజ్చౌబేగా గుర్తించారు. అతను గడచిన 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతనొక్కడే 200కుపైగా చోరీలు చేశాడని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ చౌబే(45) కుటుంబం యూపీలోని సిద్దార్థనగర్లో ఉండేది. తరువాత వారి కుటుంబం నేపాల్కు తరలివెళ్లింది. మనోజ్ 1997లో ఢిల్లీ వచ్చాడు. కీర్తినగర్ పోలీస్స్టేషన్లో క్యాంటీన్ నిర్వహించాడు. క్యాంటీన్లో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు మొదలుపెట్టాడు. భారీ మొత్తంలో సొమ్ము పోగేశాక గ్రామానికి వెళ్లిపోతుండేవాడు. ఈ చోరీ సొమ్ముతో మనోజ్ నేపాల్లో హోటల్ ఏర్పాటు చేశాడు. ఈ సమయంలోనే యూపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలో తాను ఢిల్లీలో పార్కింగ్ కంట్రాక్టు పనులు చేస్తుంటానని తెలిపాడు. ఇందుకోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లవలసి ఉంటుందని నమ్మబలికాడు. మనోజ్ను తాజగా అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా? -
చీమల చట్నీ-గోంగూర, తింటారు నోరూర! తేడా వస్తే చీమల చికిత్స కూడా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్చేస్తే చాలు టేబుల్పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది. వలస ఆదివాసీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. గోంగూర.. పండుగే.. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే.. మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు. ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. చీమల చట్నీకి జీఐ ట్యాగ్.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం. జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది. – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) -
గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ!
మండే వేసవిలో లగ్జరీ ఏసీ హోటల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు? ఆఫీస్కి వెళ్లేందుకు చెమటలు కక్కుతూ ప్రయాణించాల్సిన పనిలేదు. ఆఫీస్ క్యాంపస్లోని హోటల్లోనే మకాం. అయితే ఈ ఆఫర్ గూగుల్ ఉద్యోగులకు మాత్రమే. వర్క్ ఫ్రం హోమ్కి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్కు రప్పించడానికి గూగుల్ వేసిన కొత్త ఎత్తుగడ ఇది. గూగుల్ ఫుల్టైమ్ ఉద్యోగులు క్యాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని క్యాంపస్ హోటల్లో ఒక రోజుకు 99 డాలర్లకే రూమ్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సమ్మర్ స్పెషల్ ఆఫర్ అంటూ దీన్ని పేర్కొన్నట్లు ‘సీఎన్బీసీ’ నివేదించింది. గూగుల్ ఉద్యగులు హైబ్రిడ్ వర్క్ప్లేస్కి మారడాన్ని సులభతరం చేసేలా సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అమలు అవుతుంది. అయితే హోటల్లో బస చేసేందుకు అయ్యే మొత్తాన్ని తమ పర్సనల్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఉద్యోగులే భరించుకోవాలి. ఆ మొత్తాన్ని కంపెనీ రీయింబర్స్ చేయదు. ఎందుకంటే ఇది అన్అప్రూవ్డ్ బిజినెస్ ట్రావెల్ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది. ఉదయం హడావుడిగా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఓ గంట ఎక్కువగా నిద్ర పోవచ్చు. మధ్యలో రూమ్కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ లేదా వర్కవుట్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ పూర్తయ్యాక హోటల్ టాప్ డెక్కి వెళ్లి ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఈ ఆఫర్కు సంబంధించిన ప్రకటన చెబుతోంది. గూగుల్ యాజమాన్యంలోని ఈ హోటల్ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గత సంవత్సరం ప్రారంభించిన కొత్త క్యాంపస్లో ఉంది. 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్కు ఆనుకుని ఉంది. ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న 4,000 మంది ఉద్యోగులకు ఇక్కడ వసతి కల్పించే సామర్థ్యం ఉందని దీని ప్రారంభం సందర్భంగా కంపెనీ పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా ఉంటాయి. చాలా టెక్ కంపెనీల కార్యాలయాలతో పాటు టెక్ పరిశ్రమ ఉద్యగులు ఇక్కడ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడున్న కార్పొరేట్ కార్యాలయాలు చాలా గూగుల్ యాజమాన్యంలోనివో లేకుంటే లీజ్కు తీసుకున్నవో ఉంటాయి. కంపెనీకి చెందిన హోటళ్లలో ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు తరచూ ఇస్తుంటామని గూగుల్ ప్రతినిధి తెలిపారు. Google Jobs Cut 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే.. -
ఈ హోటల్లో ఫ్రీగా నచ్చినంత తినొచ్చు.. కానీ ఓ కండిషన్
ఈ హోటల్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వండి.. కడుపు నిండా తినండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు! అవును మీరు కరెక్ట్గానే చదివారు. తిన్నంత తిని డబ్బులు వద్దు అంటున్నారు అని సంతోషపడిపోకండి! ఎందుకంటే డబ్బులకు బదులు ప్లాస్టిక్ ఇవ్వాలండోయ్. ప్లాస్టిక్పై నిషేధం విధించినప్పటికీ... ప్లాస్టిక్ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడంలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు... గుజరాత్లోని జునాఘడ్కు కలెక్టర్గా పనిచేస్తోన్న రచిత్ రాజ్ ‘ప్రకృతి’ పేరిట సరికొత్త కాన్సెప్ట్తో ప్లాస్టిక్ కేఫ్ను గతేడాది జూన్ ముఫ్పైన ప్రారంభించారు. ఈ కేఫ్ను ఓం శాంతి అనే సెల్ఫ్హెల్ప్ గ్రూప్నకు చెందిన రేఖా బెన్ నడిపిస్తోంది. ఇది సోంపు, నిమ్మకాయ షర్బత్, ఇడ్లీ, పోహా, డోక్లా, మేథీ థోక్లా, గుజరాతీ థాళీలను అందిస్తోంది. వీటిలో ద్రవాహారం కావాలంటే అరకేజీ, ఆహార పదార్థాలు కావాలంటే కేజీ ప్లాస్టిక్ ఇస్తే సరిపోతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉన్న కస్టమర్లు ఈ కేఫ్కు ఎగబడి వస్తున్నారు. తరచు వచ్చే కస్టమర్లతో పాటు, పబ్లిక్ హాలిడేస్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కేఫ్ లోనేగాక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లలో సైతం కేఫ్ ఆర్డర్లు అందిస్తోంది. ప్లాస్టిక్ మనీతో... ప్లాస్టిక్ను ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ... ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడం లేదు. దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రచిత్ రాజ్ టీమ్ ప్లాస్టిక్ మనీ కేఫ్ను ప్రారంభించింది. ప్లాస్టిక్ వాడకంపై ఆసక్తి తగ్గించి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడం, రసాయన ఎరువులు వాడకుండా పండించిన ఆహారాన్నే ప్రజలకు అందించడం , సెల్ఫ్హెల్ప్ గ్రూపు మహిళలతో వీటిని నిర్వహించడమే లక్ష్యంతో ప్లాస్టిక్మనీతో ఈ కేఫ్ను నడిపిస్తున్నారు. ఆదాయం... ఆరోగ్యం.... డబ్బులకు బదులుగా తీసుకునే ప్లాస్టిక్ను రీసైక్లింగ్కు పంపించి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. సహజసిద్ధ ఎరువులతో పండించిన ఆహారం అందించి ఆరోగ్యం కాపాడుతూ, రసాయనాలు లేని పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. సెల్ఫ్హెల్ప్ గ్రూపుల ద్వారా ఈ కేఫ్లను నడిపించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేఫ్లో ఆహార పదార్థాలను మట్టి పాత్రల్లో వడ్డిస్తూ ఇటు ప్రజల ఆరోగ్యంతో పాటు, అటు పర్యావరణాన్నీ పరిరక్షిస్తున్నారు. ఇలాంటి కేఫ్లు మరిన్ని ఏర్పాటైతే ప్లాస్టిక్ భూతాన్ని సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు ఈ కేఫ్ను ప్రశంసిస్తున్నవారు. -
కట్టప్పా కమాన్... ఇదిగో బాహుబలి థాలీ
చెన్నైలోని పొన్నుస్వామి హోటల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘బాహుబలి థాలీ’ సోషల్ మీడియా స్టార్మ్గా మారింది. ‘మీలో బాహుబలి థాలీని టచ్ చేసే వీరుడు ఎవరు?’ అని ఒక నెటిజనుడు కామెంట్ పెట్టాడు. ట్విట్టర్ యూజర్ అనంత్ రూపన్గూడి ‘బాహుబలి థాలి’ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు థాలీ భారీ ప్లేట్ను కస్టమర్ల దగ్గరకు తీసుకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి.... ‘నోరూరుతోంది సుమీ!’ అని లొట్టలు వేస్తున్న వారితో పాటు– ‘ఇది గుడ్ ఐడియా కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఫుడ్ వేస్టేజీ’ అని విమర్శించిన వారు ఉన్నారు. ఇంతకీ బాహుబలి థాలి ధర ఎంతనుకుంటున్నారు? కేవలం రూ.1399 ప్లస్ జీఎస్టీ మాత్రమే! -
బర్త్డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టూ జుట్టూ పట్టుకున్న యువతులు!
ఘనంగా బర్త్డే పార్టీ చేసుకుందామనుకున్న అమ్మాయిల బృందం ఒక హోటల్కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిలో ఆ యువతులు ఎలా గొడవ పడ్డానేది కనిపిస్తోంది. ఈ ఉదంతం అమెరికాలో చోటుచేసుకుంది. ఈ వీడియోను విక్టర్ క్రిస్టియన్ పేరుతో టిక్టాక్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎంతో ఫన్నీగా కనిపిస్తున్న ఈ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు తావిస్తోంది. కొంతమంది యువతులు భోజనం టేబుల్ వద్ద గొడవపడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్వైటీ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన బర్త్డే సందర్భంగా స్నేహితురాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే బిల్లు రూ. 3 లక్షలు($4,600) దాటడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఇంతలో ఒక యువతి ఈ భారీ బిల్లును సమానంగా పంచుకుని, ఎవరి పేమెంట్ వారు చేసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చింది. అయితే ఈ సూచన మిగిలిన స్నేహితురాళ్లకు ఏమాత్రం నచ్చలేదు. ఈ యువతుల వివాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన 28 ఏళ్ల విక్టర్ కూడా ఆ పార్టీలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే మా స్నేహం మునుపటిలా లేదు. అయితే త్వరలోనే ఇది సమసిపోతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీలో తాను స్ప్రైట్, కలామారి ఆర్డర్ చేశానని, వాటి ధర 25 డాలర్ల కన్నా తక్కువేనని, పార్టీలోని మిగిలినవారు ఖరీదైన ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారని తెలిపింది. తాను బిల్లు షేర్ చేసేందుకు ఇష్టపడలేదని, ఎందుకంటే తాను తక్కువ ఆహారపదార్థాలనే ఆర్డర్ చేశానని తెలిపింది. ఇతరుల బిల్లు నేనెందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. ఎవరు బర్త్డే పార్టీ ఇచ్చారో వారే బిల్లు చెల్లించాలని విక్టర్ డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ప్రాంక్ అని అంటున్నారు. కొందరు ఆహారం ఆర్డర్ చేసేముందే బ్లిలు గురించి ఆలోచించాలని అంటుండగా, మరికొందరు డైనింగ్ టేబుల్ను క్రీడల మైదానంగా చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి I went to a birthday dinner — and fought over splitting the $4.6K bill https://t.co/48P3UB3oAs pic.twitter.com/LPdjcBE55i — New York Post (@nypost) July 19, 2023 -
ఈ వీడియో చూస్తే.. రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఆర్డర్ చేయరు!
ఇంటి వంట ఎంత రుచి, శుచిగా ఉన్నా రెస్టారెంట్లను అప్పుడప్పుడు సందర్శించాల్సిందే. ఇదే ప్రస్తుత ట్రెండ్. కొన్ని పుడ్ ఐటమ్స్ ఫలానా రెస్టారెంట్లో బాగుంది అని తెలిస్తే చాలు.. క్యూలో ఉండి ఆ వంటకాన్ని ఇంటికి తెచ్చుకోవడమో, లేదా అక్కడే తినడమో చేస్తుంటారు. రెస్టారెంట్లో పుడ్ అనగానే రుచి వరకు ఓకే గానీ నాణ్యత విషయంలో మాత్రం అంతంత మాత్రమేనన్న ఘటనలు బోలెడు ఉన్నాయి. ఇక వెజ్ పరిస్థితి ఎలా ఉన్నా నాన్వెజ్ వంటకాల విషయంలో మాత్రం కొన్ని రెస్టారెంట్లు క్వాలిటీ పరంగా షాక్లు ఇస్తూనే ఉంటాయి. తాజాగా పంజాబ్లోని లుధియానాలో ఓ కస్టమర్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చికెన్ కర్రీలో ఎలుకలుంటాయ్ వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి లుధియానాలోని ప్రకాష్ ధాబాకు వెళ్లాడు. వెయిటర్ తన వద్దకు రాగానే.. ఆ వ్యక్తి తనకు నచ్చిన చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. కాసేపు అనంతరం ఆర్డర్ తన టేబుల్ ముందుకు వచ్చింది. ఇక ఆకలిగా ఉన్న ఆ కస్టమర్.. ఓ పట్టు పట్టాలని తినేందుకు రెడీ అయ్యాడు. అంతలో చికెన్ గ్రేవీలో ఎలుక కనిపించింది. చికెన్ ముక్క అనుకుని గబుక్కున నోట్లో వేసుకుందామని చూసిన ఆ కస్టమర్ దెబ్బకు హడలిపోయాడు. సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. వాళ్లు పట్టించుకోకపోవడమే కాకుండా.. అసలు తమది తప్పే కాదన్నట్టుగా మాట్లాడారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కస్టమర్. ఆ వీడియోలో.. "ప్రకాష్ ధాబా లూథియానా. ఇండియా చికెన్ కర్రీలో ఎలుకను వడ్డించండి. రెస్టారెంట్ యజమాని ఫుడ్ ఇన్స్పెక్టర్కి లంచం ఇవ్వడంతో ఇంత స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారా ??? అనేక భారతీయ రెస్టారెంట్లలోని కిచెన్లో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి" అని పోస్ట్ కింద క్యాప్షన్తో షేర్ చేశారు. ఇదిలా ఉండగా రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ కస్టమర్ కావాలనే తమ హోటల్ గుడ్ విల్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కస్టమర్కే సపోర్ట్ చేశారు. అంత పెద్ద తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారా అంటూ మండి పడుతున్నారు. ఇంకొందరు...అసలు ఆ రెస్టారెంట్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసేయాలని ఫైర్ అవుతున్నారు. లుధియానాలో ఇదేం కొత్త కాదు. చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Parkash dhaba Ludhiana. India Serve rat in chicken curry. Restaurant owner bribe the food inspector and go free??? Very poor standards in Kitchen of many Indian restaurants. Be aware . pic.twitter.com/chIV59tbq5 — NC (@NrIndiapolo) July 3, 2023 -
ఉప్పుతో హోటల్ని కట్టించారు.. వర్షం వచ్చినా కరిగిపోదు
ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి. కొన్ని సహజసిద్ధంగా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడితే, మరికొన్ని మానవ నిర్మితాలు అని చెప్పొచ్చు. అలాంటి వాటిలో ఈ హోటల్ కూడా ఒకటి. సాధారణంగా మట్టితో, సిమెంట్తో భవానలు నిర్మిస్తారు. కానీ ఈ హోటల్ నిర్మాణం మాత్రం పూర్తిగా ఉప్పుతో బిల్డ్ చేశారు. హోటల్లోని గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతోనే కట్టించారు. ఉప్పు అంటే నీళ్లలో కరిగిపోతుంది కదా అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అలా జరగకుండా పకడ్భందీగా ఈ హోటల్ను నిర్మించారు. మరి ఈ వింతైన హోటల్ ఎక్కడుంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. హోటల్ అంటే కాస్ట్లీగా ఉంటే సరిపోదు, ఇలా డిఫరెంట్గా కూడా ఉండాలి అనుకున్నారేమో ఏకంగా నిర్మాణం మొత్తం ఉప్పుతో కట్టించి చూపరులను ఆకర్షిస్తున్నారు. ఇది బొలీవియాలో ఉంది. అక్కడ ఉన్న ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రదేశాల్లో ఈ హోటల్ కూడా ఒకటి. ‘పాలాసియో డి సాల్’ పేరుతో ఉన్న ఈ హోటల్ను పూర్తిగా ఉప్పుతో కట్టించారు. ఈ భవనంలో 12 గదులు, డైనింగ్ హాల్స్, గోల్ఫ్కోర్స్లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పు తోనే తయారు చేశారు.దీంతో హోటల్ మొత్తం తెల్లగా మెరుస్తూ చూపరులను భలే కనువిందు చేస్తుంది. ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్గ్లాస్తో ప్యాక్ చేశారు. దీనివల్ల లోపలికి గాలి, నీరు చొరబడదు. డిఫరెంట్ థీమ్తో ఉన్న ఈ హోటల్ను చూసేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. -
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు..
కర్ణాటక: జిల్లాలోని ముళబాగిలు తాలూకా కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు వద్ద హైటెక్ వేశ్యావాటికపై ముళబాగిలు పోలీసులు దాడి జరిపి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారు కాగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కార్యాచరణలో 6 మంది మహిళలను రక్షించారు. కార్యాచరణపై కోలారు జిల్లా ఎస్పీ ఎం నారాయణ వివరాలు అందించారు. ఈ మహిళలను హైదరాబాద్కు చెందిన విజయ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రెస్టారెంట్ యజమానులతో కలిసి వేశ్యావాటికను నడుపుతున్నాడని తెలిపారు. ఘటనకు సంబంధించి మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్ యజమాని, మేనేజర్, సప్లయర్, రిసెప్షనిస్ట్, మహిళలను తీసుకొచ్చిన ఏజెంట్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏజెంట్ విజయ్, మంజునాథ్, అంజప్ప, సతీష్లను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రెస్టారెంట్ యజమాని చంద్రహాస్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దాడి సమయంలో రూ.5,56,300 నగదు, రూ.2 కోట్ల విలువ చేసే 10 కార్లు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ వేశ్యావాటికతో పాటు డ్యాన్స్ కూడా ఆడించేవారని తెలిపారు. విజయవాడ, చిత్తూరు, విశాఖ పట్టణం నుంచి మహిళలను తీసుకువచ్చే వారని తెలిసిందన్నారు. సతీష్ అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేశాడని, మహిళలంతా 20, 21, 23, 24 ఏళ్ల వయసు వారేనని, వారిని సఖి సాంత్వన కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముళబాగిలు తాలూకా హెచ్.బయప్పనహళ్లి సమీపంలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్టులో రాక్ వ్యాలీ బార్ అండ్ రెస్టారెంట్ గదుల్లో మహిళలను ఉంచి వేశ్యావాటికను నిర్వహిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని రచించి దాడులు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. -
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
అమర్నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు బయలుదేరే భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్ అమర్నాథ్ యాత్రికులకు ఒక శుభవార్త తెలిపింది. అమర్నాథ్ యాత్రికులకు ప్రయాణ సమయాన ఇబ్బందులను దూరం చేస్తే వార్త ఇది. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగించనుంది. అమర్నాథ్ యాత్ర చేసేవారు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే వారికి భారీ రాయితీ లభించనుంది. ఈ విషయాన్ని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్(ఏజేహెచ్ఎల్ఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్ములో బసచేసే అమర్నాథ్ యాత్రికులు ఇక్కడి హోటల్స్ను ముందుగానే బుక్ చేసుకుంటే 30 శాతం రాయితీ అందించనున్నట్లు ఏజేహెచ్ఎల్ఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పవన్గుప్తా మాట్లాడుతూ తాము సదుద్దేశంతో అమర్నాథ్ యాత్రికులలో ఇక్కడి హోటల్స్లో బసచేసేవారికి 30 శాతం రాయితీ అందజేస్తున్నట్లు తెలిపారు. తద్వారా అమర్నాథ్ యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందన్నారు. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ గుహ దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల నడుమ, సమద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 62 రోజుల తీర్థయాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. వాటిలో ఒకటి అనంత్నాగ్ జిల్లాలో 48 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. మరొకటి బందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనేవారు జూన్ 30 నాటికి జమ్మునకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈసారి అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తుల వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: ‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ! -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం
భూమికి దిగువన అద్భుతాలు ఉంటాయని, వాటిని చూస్తే ఎంతో ఆశ్యర్యం కలుగుతుందనే విషయం మీకు తెలుసా? పైగా అక్కడ నివాసయోగ్యానికి అనువైన సకల సౌకర్యాలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అరుదైన ప్రత్యేకతల కారణంగా ఒక హోటల్ చర్చల్లో నిలిచింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటంటే ఈ హోటల్ భూమికి 1,375 అడుగులు(419 మీటర్లు) లోతున ఉంది. దీనిలో బస చేసేందుకు విలాసవంతమైన గదులు, పసందైన ఆహార పానీయాలు అందుబాటులో ఉన్నాయి. కపుల్స్ కోసం ప్రత్యేకమైన గదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ హోటల్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ అండర్గ్రౌండ్ హోటల్ బ్రిటన్లో ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇది ప్రపంచంలోనే.. భూమికి అత్యంత లోతున ఉన్న హోటల్గా పేరొందింది. ఇది నార్త్వేల్స్లోని స్నోడోనియా పర్వతాలపై భూమికి 419 మీటర్ల దిగువన ఉంది. దీనిలో 4 పర్సనల్ ట్విన్-బెడ్ క్యాబిన్తో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అయితే ఈ హోటల్లోని గదులను శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. హోటల్కు చేరుకునేందుకు ట్రెక్కింగ్ ఈ హోటల్కు వెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సివుంటుంది. కొన్ని గంటల పాటు ట్రెక్కింగ్ చేసిన తరువాతనే ఈ హోటల్కు చేరుకోగలుగుతారు. ఈ మార్గంలో జలపాతాలు, అందమైన కొండలు, ఎగుడుదిగుడు రహదారులు, సొరంగమార్గాలు మొదలైనవి ఉంటాయి. ఈ హోటల్కు వెళ్లేవారికి ఒక గైడ్ తోడుగా ఉంటాడు. ఆయన హోటల్లో స్టే చేసేవారిని అందమైన మార్గం గుండా తీసుకువెళతారు. ఈ ప్రయాణం సాగించేవారికి హార్నర్స్ రోప్, హెల్మెట్, బూట్లు, లైటు మొదలైనవి అవసరం అవుతాయి. ఎంట్రీ గేటు వద్ద.. ఈ హాటల్కు వెళ్లే మార్గంలో పలు కళాఖండాలు కనిపిస్తాయి. ముందుకు సాగుతున్నప్పుడు వీటి గురించి గైడ్ వివరిస్తాడు. చివరగా హోటల్ ఎంట్రీలో ఒక పెద్ద ఇనుప తలుపు కనిపిస్తుంది. లోనికి ప్రవేశించగానే వెల్కమ్ డ్రింక్, స్నాక్స్తో స్వాగత సత్కారం లభిస్తుంది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉంటుంది. హోటల్ బుకింగ్ ధర ఎంతంటే.. గో బిలో అనే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్ క్యాబిన్ బుకింగ్ ధర రూ. 36,000. గుహ రూము బుకింగ్కు రూ. 57,000 వెచ్చించాల్సి ఉంటుంది. దీనిలో టీ, టిఫిన్ ఖర్చులు కలిసి ఉంటాయి. డైలీ స్టార్ స్యూస్ వెబ్సైట్తో ఈ హోటల్ మేనేజర్ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చే అతిథులు ఇక్కడి ఏర్పాట్లను ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడ బస చేసేవారికి మంచి నిద్ర పడుతుంది. ఇక్కడికి వచ్చేవారు అన్నిరకాల ఆందోళనలను విడిచి పెట్టి, ప్రశాంతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. అందుకే ఈ హోటల్కు ‘డీప్ స్లీప్’ అనే పేరుపెట్టామన్నారు. ఈ హోటల్లో చిన్నచిన్న క్యాబిన్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని రాళ్ల మధ్యలో రూపొందించారు. ఇక గదుల విషయానికి వస్తే అవి గుహలను పోలివుంటాయి. వీటిలో పెద్దసైజు బెడ్లను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ.. -
ప్రపంచంలోనే నంబర్వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా?
ముంబై: హోటల్స్ ర్యాంకింగ్కు సంబంధించిన ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ (2023)లో జైపూర్కి చెందిన రాంబాగ్ ప్యాలెస్ ప్రపంచంలోనే నంబర్ వన్ హోటల్గా నిల్చింది. 1835 నాటి ఈ ప్యాలెస్ను ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్సీఎల్) హోటల్గా తీర్చిదిద్ది, నిర్వహిస్తోంది. దీన్ని ’జ్యుయల్ ఆఫ్ జైపూర్’గా కూడా వ్యవహరిస్తుంటారు. ట్రావెల్ సైట్ ట్రిప్అడ్వైజర్ వార్షికంగా ప్రకటించే.. పర్యాటకులు మెచ్చిన హోటల్స్ జాబితాలో మాల్దీవులకు చెందిన ఓజెన్ రిజర్వ్ బాలిఫుషి, బ్రెజిల్లోని హోటల్ కోలీన్ డి ఫ్రాన్స్ రెండు, మూడో స్థానాల్లో నిల్చాయి. తమ పోర్టల్లో నమోదైన 12 నెలల డేటా (2022 జనవరి 1 నుంచి – డిసెంబర్ 31 వరకు) విశ్లేషణ ఆధారంగా ట్రిప్అడ్వైజర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. భారత్లోని టాప్ 10 హోటల్స్ ఇవే.. రాంబాగ్ ప్యాలెస్ - జైపూర్ తాజ్ కృష్ణ - హైదరాబాద్ వెస్టిన్ గోవా - గోవా బ్లాంకెట్ హోటల్ అండ్ స్పా - పల్లివాసల్ చండీస్ విండీ వుడ్స్ - చితిరపురం జేడబ్ల్యూ మారియట్ హోటల్ పూణే - పూణే షెరటన్ గ్రాండ్ చెన్నై రిసార్ట్ అండ్ స్పా - చెన్నై కోర్ట్ యార్డ్ అమృత్సర్ - అమృత్సర్ జేడబ్ల్యూ మారియట్ హోటల్ బెంగళూరు - బెంగళూరు లీలా ప్యాలెస్ ఉదయపూర్ - ఉదయపూర్ ఇదీ చదవండి: ఎల్ఐసీకి మంచి రోజులు.. అదానీ గ్రూప్లో పెట్టుబడులకు పెరిగిన విలువ -
Gachibowli హోటల్లో.. పంజాబ్, పశ్చిమ బెంగాల్ యువతులతో...
హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్పై దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అంజయ్యనగర్లోని రాయల్ పామ్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు యాంటీ హ్యుమన్ ట్రాకింగ్ యూనిట్ మాదాపూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందానికి సమాచారం అందింది. దీంతో ఈ బృందం హోటల్లోని 208, 406లపై దాడులు చేశారు. పంజాబ్, పశి్చమబెంగాల్ యువతులతో జార్కండుకు చెందిన ఆర్గనైజర్ విజయకుమార్, సబ్ ఆర్గనైజర్ అలీవర్డాంగ్లు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడు విజయకుమార్ పరారవగా డాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో రెండు స్మార్ట్ ఫోన్లు, ఆరు కండోమ్లు, రూ.670 నగదు, ఒక డైరీ, రెండు గదుల తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హోటల్లో దోశలు వేసిన ప్రియాంక గాంధీ
-
‘స్పేస్’లో ఇళ్లకు రిహార్సల్గా భూమిపై త్రీడీ ప్రింటింగ్ హోటల్
ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో విశాలమైన హోటల్ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? భవిష్యత్తుకు బాటలు వేసేలా.. మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఏమిటీ హోటల్ ప్రత్యేకతలు? ► ఈ హోటల్లో త్రీడీ విధానంలో ప్రింట్ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్ పూల్, స్పా, ఆరుబయట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. ► దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్లు, బాత్రూమ్లతో ఆ ఇళ్లు ఉంటాయి. ► గుండ్రటి నిర్మాణాలు, డోమ్లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్లు, టేబుల్స్ వంటి కొంత ఫర్నిచర్ను కూడా త్రీడీ విధానంలోనే ప్రింట్ చేయనున్నారు. ► చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపోయేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. ► ఎడారిలో క్యాంపింగ్ సైట్గా ఉన్న ప్రాంతంలో ప్రింట్ చేస్తున్న ఈ హోటల్కు ‘ఎల్ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్ హోటల్ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. ► ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ ‘బిగ్ (బ్జర్కే ఇంగెల్స్ గ్రూప్)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్ సంస్థ త్రీడీ ప్రింటింగ్తో నిర్మాణాలు చేపట్టనుంది. ఇక్కడ చేసి.. చూపించి.. ‘‘చంద్రుడు, మార్స్పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ – ‘ఐకాన్’ సహ వ్యవస్థాపకుడు జేసన్ బల్లార్డ్, హోటల్ యజమాని లిజ్ లాంబర్ట్ –సాక్షి సెంట్రల్ డెస్క్ -
నటి సూసైడ్ కేసు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
భోజ్పురి నటి ఇటీవల వారణాసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు ముందే ఓ వీడియో సాంగ్ను కూడా రిలీజ్ చేసింది. అయితే నటి ఆత్మహత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సూసైడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన హోటల్ సీసీటీవీ ఫుటేజ్లో మరో వ్యక్తి కూడా నటితో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అతను ఎవరన్నదానిపై ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మార్చి 26న ఆకాంక్ష తన హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. ఇప్పటికే ఆమె సూసైడ్ చేసుకున్న రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె హోటల్ గదిలో 17 నిమిషాల పాటు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మిస్టరీ మ్యాన్ ఆకాంక్షతో పాటే ఉన్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అతని ముఖం ఆ వీడియో ఫుటేజీలో తగినంత స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కాగా.. ఆకాంక్ష దుబే 'లైక్ హూన్ మై నాలైక్ నహిన్' చిత్రం షూటింగ్ కోసం వారణాసిలోని ఒక హోటల్లో బస చేసింది. ప్రియుడిపై కేసు నమోదు ఆకాంక్ష మరణానంతరం ఆమె ప్రియుడు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె తల్లి కేసు పెట్టింది. సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని, అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి తన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుంచి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Exclusive CCTV footage of Bhojpuri actress Akanksha Dubey surfaced, in the video the actress is seen with Sandeep Singh. Look #AkanshaDubey #AkanshaDubeySuicide #CCTVFootage #bhojpuriactress https://t.co/b9kotfX75c pic.twitter.com/fbtQzCitSr — Siraj Noorani (@sirajnoorani) March 31, 2023 -
ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బొప్పాయి ట్రీ హోటల్లో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఆరు అంతస్తుల హోటల్ ఎగిసిపడిన మంటలను సిబ్బంది ఆర్పేందుకు యత్నించినా నియంత్రణలోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఆరో అంతస్తులో వ్యక్తులు చిక్కుకుపోవడంతో వారిని నిచ్చెన, బెడ్షీట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని రక్షించారు. హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో మంటలు భవనాన్ని చుట్టుముట్టిన్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పొగ భవనాన్ని కమ్మేయడంతో ఊపిరాడక పలువురు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ముమ్మరంగా సహాయం చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు Fire at a multi-storeyed hotel in Rau area of Indore was triggered possibly from hotel's kitchen this morning. Fire brigade and SDERF personnel evacuated 35 plus staff and guests, many of them through the windows. @NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/gQAtXV7wOR — Anuraag Singh (@anuraag_niebpl) March 29, 2023 (చదవండి: కాంగ్రెస్ కుట్రలో రాహుల్ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్) -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువనటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శనివారం కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరవకముందే మరో నటి సూసైడ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భోజ్పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసిలోని ఓ హోటల్లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనతో భోజ్పురి చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం నటి వయస్సు 25 సంవత్సరాలు. కొన్ని గంటల ముందే సాంగ్ రిలీజ్ ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. తరచుగా ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జన్మించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష ఇన్స్టాగ్రామ్లో రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటించింది. తన సహనటుడు సమర్ సింగ్తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆకాంక్ష 2018లో డిప్రెషన్తో బాధపడి.. కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె 17 ఏళ్ల వయసులోనే మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆకాంక్ష ముజ్సే షాదీ కరోగి (భోజ్పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్ట్లలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Prashant Photography Deoria (@prashant_photography_deoria) -
Hyderabad:హోటల్ ఫుడ్ తిని 16 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మాషా అల్లా హోటల్లో ఆహారం తిని 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన వారిలో 12 మంది కోలుకోగా మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సనత్నగర్లోని మాషా అల్లా హోటల్లో బుధవారం రాత్రి 16 మంది మటన్ మండీ తిన్నారు. ఆ తరువాత అస్వస్థతకు గురయ్యారు. వివరాలు సేకరిస్తున్న ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీవెంకాలు దీంతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శ్రీవెంకాలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ను సీజ్ చేశారు. -
హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్గా ఏం చేశాడంటే!
దక్షిణాదిలో ప్రజలు తమ టిఫిన్ సెక్షన్లో ఎక్కువగా తినే వంటకాల జాబితాలలో మసాల దోస ఖచ్చితంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే దోసలందు మసాల దోస టేస్ట్ వేరయా అన్నట్లు ..దాని తిని ఆశ్వాదించాల్సిందే తప్ప మాటలతో చెప్పలేము. అంతటి ప్రాముఖ్యమున్న వంటకానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి ఆకలి వేసి ముంబైలోని కృష్ణ ఛాయా హోటల్కు వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాల దోస ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత వెయిటర్ తన ఆర్డర్ను తీసుకువచ్చి ఇచ్చాడు. అయితే అది చూసి సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే.. తాను ఆర్డర్ చేసిన మసాలా దోశను.. మసాలా విడిగా, దోశను విడిగా సర్వ్ చేశాడు ఆ వెయిటర్. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి సాంబర్, చట్నీతో దోశ తిని సరిపెట్టుకున్నాడు. మరి మిగిలిన మసాలాను ఏం చేశాడన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. తన ట్వీట్లో.. "నేను ఒక ఫుడ్ బ్లాగర్ని. నిన్న కృష్ణ ఛాయా దగ్గర మసాలా దోసె ఆర్డర్ చేసాను. లోపల ఏం జరిగిందో తెలియదు గానీ వాళ్ళు మసాల దోసకు బదులుగా.. దోస విడిగా, మసాలా విడివిడిగా సర్వ్ చేశారు. నేను దోసె తిన్నాను. విడిగా ఇచ్చిన మసాలాను ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్లో ఉంచాను. ఆ తర్వాత రోజు దాచిన మసాలతో నా ఇంట్లో మసాల దోశ చేసుకుని తిన్నాను. టెస్ట్ ఓహోహో!" అని మసాల దోశ ఫోటోని షేర్ చేశాడు. ఆ వ్యక్తి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అతని క్రియేటివికి ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపించారు. Main bhi food blogger. I ordered a masala dosa from Krishna Chhaya yesterday. They sent the dosa and masala separately. I ate the dosa. Refrigerated the masala. And made my own masala dosas at home today. Ohoho! pic.twitter.com/Xbxvw4E1Ms — Ramki (@ramkid) March 19, 2023 -
మండి బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత.. కారణం అదేనా?
మెదక్: ఓ హోటల్లో బిర్యాని తినడంతో పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన పవన్, అరవింద్, మహేందర్ ఈనెల 18వ తేదీ రాత్రి నర్సాపూర్లోని ఓ మండి హోటల్లో మండి బిర్యాని పార్శిల్ తీసుకెళ్లి తిన్నారు. అలగే నర్సాపూర్కు చెందిన అజీజ్ మరో ఆరుగురు మిత్రులతో కలిసి అదే మండి హోటల్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఇదిలాఉండగా నర్సాపూర్కు చెందిన మహేశ్, షకీల్, నాని కూడా అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు కావడంతో మహేశ్ ఆదివారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మిగిలిన వారు ఇంటి వద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మీర్జానజీంబేగ్ను అడగ్గా ఫుడ్ పాయిజన్తో వారికి వాంతులు విరేచనాలు అయ్యాయని చెప్పారు. శాంపిల్స్ సేకరణ నర్సాపూర్లోని మన్నత్ అరేబియన్ మండి హోటల్ నుంచి పలు శాఖల అధికారులు శాంపిల్స్ సేకరించినట్లు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత తెలిపారు. మన్నత్ మండి హోటల్ బిర్యాని తిన్న పలువురు యువకులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, వైద ఆరోగ్య శాఖ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయనిర్మల, మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్ తదితరులు మంగళవారం హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ హోటల్లో వాడుతున్న పదార్థాలను పరిశీలించడంతో పాటు కొన్ని శాంపిల్స్ సేకరించారు. తాము సేకరించిన శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతామని, ఆ నివేదికలు వచి్చన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోటల్లో అధికారులు కలియ తిరిగారు. -
హీరో కానున్న హోటల్ నిర్వాహకుడు.. ఏకంగా పాన్ ఇండియా మూవీ
తమిళ సినిమా: ప్రతిభను వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయని మరోసారి రుజువైంది. ఎక్కడో ఢిల్లీలో ఓ హోటల్ను నిర్వహిస్తున్న సురేష్ కుమార్ అనే తమిళ యువకుడిని సినిమాలో హీరోగా నటించే అవకాశం వరింంది. ఈయన ఎన్నం అళగానాల్ ఎల్లామ్ అళగాగుం అనే పాన్ ఇండియా చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ శరవణ భవ మూవీస్ పతాకంపై ఎస్పీ రామమూర్తి నాలుగు భాషల్లో నిర్మించనున్నారు. రాజా పాండురంగన్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు పయనంగళ్ తొడరుమ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. నటుడు అరుళ్ దాస్, నటి షకీలా, ముల్లై కోదండం, మారన్, సురేష్ కుమార్, సతీష్ కుమార్, స్వాతి, అలీషా తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. ఓ క్లిష్టమైన సమస్యలో చిక్కుకున్న కథానాయక కుటుంబాన్ని కాపాడడానికి వెళ్లిన నలుగురు యువకులు కూడా ఆ సమస్యలో ఇరుక్కుంటారన్నారు. అందులోం వారు ఎలా బయటపడ్డారు అన్నదే చిత్రకథ అని చెప్పారు. చిత్ర షూటింగ్ లోకేషన్ ఎంపిక కోసం తాను నిర్మాత ఢిల్లీకి వెళ్లామని అక్కడ ఒక హోటల్లో భోజనం చేస్తుండగా ఆ హోటల్ నిర్వాహకుడు సురేష్ కుమార్ చలాకిగా వచ్చిన కస్టమర్లతో ప్రవర్తించే తీరు ఆకట్టుకోవడంతో తనను హీరో పాత్రకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. త్వరలో ప్రారంభించనున్న ఈ చిత్రం షటింగ్ను వేలర్, కాట్పాడి, చిత్తూరు, మైసర్, ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి కిరణ్ రాజ్ సంగీతాన్ని, రమేష్ చాయాగ్రహణం అందించనున్నట్లు పేర్కొన్నారు. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ట్రైన్ హోటల్స్!
సాక్షి, చెన్నై: వృథాగా ఉన్న రైలు బోగీలను హోటళ్లుగా మార్చేందుకు దక్షిణ రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తొలి విడతలో మూడు చోట్ల ట్రైన్ హోటళ్లు ఏర్పాటు చేయనుంది. వివరాలు.. దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై సెంట్రల్ స్టేషన్కు రోజూ వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సరైన హోటళ్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ప్రయాణికులను ఆకర్షించే విధంగా వృథాగా ఉన్న బోగీల్లో హోటళ్ల ఏర్పాటపై దృష్టి సారించింది. ఈ హోటళ్ల నిర్వహణ ప్రైవేటు సిబ్బందికి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా దక్షిణ రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. ఇప్పటికే అనేక చోట్ల నగరాల్లో ప్రైవేటు హోటళ్లు రైళ్ల తరహాలో సెట్టింగ్ లు, పెయింటింగ్స్తో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అయితే, రైల్వే యంత్రాంగం నిజమైన రైలు బోగీలను హోటళ్లుగా మార్చనుండడం విశేషం. రైలులో ప్రయాణిస్తూ ఆహారాన్ని తింటున్నామనే అనుభూతిని కలిగించేలా.. ఆయా బోగీలలో ప్రత్యేక డిజైన్లు, సీట్లను ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి టెండర్ల ద్వారా ఈ హోటళ్లను త్వరలో కేటాయించనున్నారు. 24 గంటల పాటూ ఇవి సేవలు అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. ఒకే సమయంలో ఓ బోగీలో 40 మంది కూర్చుని ఆహారం తినేందుకు తగినట్లు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో చెన్నై సెంట్రల్, పెరంబూరు, కాటాన్ కొళ్తూరు స్టేషన్లలో ఈ రైలు బోగీల హోటళ్లకు ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహా్వనించనున్నారు. చదవండి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ! -
Sheybarah Resort: భూతల స్వర్గం!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సౌదీ అరేబియాలో నిర్మితమవుతున్న రిసార్ట్ హోటల్. సౌదీ ప్రధాన భూభాగానికి ఆవల షాబారా దీవిలో తయారవుతోంది. ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సంస్థ ‘షాబారా రిసార్ట్’ పేరుతో నిర్మిస్తున్న ఈ హోటల్ వచ్చే ఏడాది నుంచి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ హోటల్ను నిర్మిస్తున్న దీవిలోని పరిసరాలు, హోటల్లోని సౌకర్యాలు చూస్తే ఎవరైనా దీనిని భూతల స్వర్గంగానే భావిస్తారని డెవలపర్స్ సంస్థ చెబుతోంది. అంతేకాదు, ఇది ‘మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్’ అని ఊదరగొడుతోంది కూడా! షాబారా దీవిలోని చుట్టూ దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల నడుమ దీనిని అధునాతన హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. షాబారా దీవి తీరానికి చేరువలోని రంగురంగుల పగడపు దిబ్బలు కూడా ఇక్కడి నుంచి చూసే అతిథులకు కనువిందు చేస్తాయి. ఈ హోటల్లో 260 మంది సిబ్బంది సేవలందిస్తారు. ఇది ఏకకాలంలో 140 మంది అతిథులకు వసతి కల్పించనుంది. జీవవైవిధ్యాన్ని కాపాడేలా ఈ హోటల్ను తీర్చిదిద్దుతున్నామని ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సీఈవో జాన్ పగానో చెబుతున్నారు. పర్యావరణానికి ఏమాత్రం చేటు కలిగించని విధంగా పూర్తిగా సౌరవిద్యుత్తును ఉపయోగించుకునేలా దీనిని నిర్మిస్తున్నామని, ఇది సౌదీ పర్యాటకరంగం భవిష్యత్తునే మార్చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఈజ్ మై ట్రిప్ చేతికి ‘చెకిన్’
హైదరాబాద్: ఆన్లైన్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అయిన ఈజ్మైట్రిప్ ‘చెకిన్’ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. చెకిన్ అన్నది పర్యాటకులు ఎలాంటి బేరమాడే అవసరం లేకుండా హోటల్ బుకింగ్లపై డిస్కౌంట్కు వీలు కల్పించే రియల్టైమ్ మార్కెట్ ప్లేస్. ఆల్గోరిథమ్ ఆధారితంగా టాప్–5 హోటల్ చెకిన్ ఆఫర్లను ఇది అందించగలదు. చెల్లింపులు మాత్రం హోటల్ వద్దే చేయవచ్చు. మరోవైపు చెకిన్ యాప్ యాక్సెస్ను హోటల్ వారికి ఈజ్మైట్రిప్ అందించనుంది. దీని ద్వారా వారు ఎప్పటికప్పుడు త మ బుకింగ్లు, డిమాండ్ తీరును తెలుసుకుని, ధరలను నియంత్రించుకోవచ్చని ఈజ్మైట్రిప్ తెలిపింది. తద్వారా తమ ప్రాపర్టీలను వేగంగా విక్రయించుకోగలరని (బుకింగ్లు) పేర్కొంది. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
ఆతిథ్య రంగానికి ఇన్ఫ్రా హోదా: హోటల్స్ యాజమాన్యాల డిమాండ్
ఆతిథ్య రంగం (హోటల్స్) తమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక రంగం) హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల ఆర్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ నిబంధనల కింద దీర్ఘకాలానికి నిధులను పొందే వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. పర్యాటకం, హాస్పిటాలిటీకి (ఆతిథ్యం) పరిశ్రమ హోదాను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినప్పటికీ.. కావాల్సిన ప్రోత్సాహకాలు, అధికారాలు ఈ రంగానికి రావడం లేదని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్హెచ్ఆర్ఏఐ) ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్బీఐ నిబంధనల కింద దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు పరిశ్రమకు భారత ప్రభుత్వం ద్వారా మౌలిక రంగం హోదా కావాలని ఎఫ్హెచ్ఆర్ఏఐ సెక్రటరీ జనరల్ జైసన్ చాకో పేర్కొన్నారు. దీనివల్ల నాణ్యమైన వసతి సదుపాయాల సరఫరా పెరుగుతుందని, దేశీ, అంతర్జాతీయ పర్యాటకుల డిమాండ్ను పెంచుతుందని చాకో అభిప్రాయపడ్డారు. పర్యాటకాన్ని జాతీయ ఏజెండాగా మార్చేందుకు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఆతిథ్యాన్ని చేర్చాలని పరిశ్రమ కోరింది. దేశంలో ఆతిథ్య పరిశ్రమ సమగ్రాభివృద్ధికి వీలుగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, అమలుకు గాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. వచ్చే బడ్జెట్లో కనీస ప్రత్యామ్నాయ పన్ను విషయంలో 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు వెసులుబాటు కల్పించాలని పశ్చిమ భారత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రదీప్ షెట్టీ డిమాండ్ చేశారు. దీనివల్ల పన్నుల భారం తగ్గి, హోటల్ పరిశ్రమకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా?
ఫొటోల్లో కనిపిస్తున్న భవంతిని చూడండి. ఇది పూర్తిగా మృణ్మయ భవనం. అంటే మట్టితో నిర్మించిన భవంతి. ఇదొక హోటల్. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మగళూరులో ఉంది. ఈ హోటల్ గదుల్లో ఏసీలు ఉండవు. ఇందులో ఇంకో విశేషమూ ఉంది. నిల్వచేసిన వాననీటినే అన్ని అవసరాలకూ ఉపయోగిస్తారు. చివరకు తాగడానికి కూడా ఆ నీరే విద్యుత్తు అవసరాల కోసం ఇందులో పూర్తిగా సౌరవిద్యుత్తునే వినియోగిస్తారు. పర్యావరణానికి ఏమాత్రం చేటుచేయని రీతిలో అధునాతనంగా రూపొందించిన ఈ హోటల్ రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ పద్ధతులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకుంటోంది. భారతదేశంలోని వాయుకాలుష్యంలో దాదాపు 30 శాతం భవన నిర్మాణాల కారణంగా సంభవిస్తున్నదే! నిర్మాణం కారణంగా కాలుష్యం వ్యాపించకుండా, పర్యావరణహితంగా ఉండేలా చిక్మగళూరులో ‘శూన్యత’ హోటల్ నిర్మాణం జరిగింది. ఈ హోటల్ ప్రాంగణం లోపలి నివాస గృహ సముదాయం కూడా పర్యావరణ అనుకూలమైనదే కావడం విశేషం. ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ను రెండేళ్ల కిందట కొద్దిపాటి సిమెంటు, కాంక్రీటుతో తయారుచేసిన ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. విద్యుత్తు కోసం సౌరఫలకాలను అమర్చారు. నీటి సరఫరా కోసం వాననీటి సేకరణ వ్యవస్థను, ప్రాంగణాన్ని చల్లగా ఉంచేందుకు మట్టి సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ హోటల్ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని చాలావరకు స్థానికంగానే సమకూర్చుకున్నారు. నిర్మాణ సమయంలో ఒక్క నీటిచుక్క కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదంతా లోకేశ్ గుంజుగ్నూర్ అనే యువ పర్యావరణ ప్రేమికుడికి వచ్చిన ఆలోచన! ఈ హోటల్ యజమాని ఆయనే! కొ న్నేళ్ల కిందట లోకేశ్ తాను పుట్టిపెరిగిన చిక్మగళూరులో ఖాళీ భూమిని కొనుగోలు చేశారు. పట్టణం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్కడ ఒక రిసార్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అదే ‘మడ్ హోటల్’గా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. రిసార్ట్ను ప్రారంభించాలనుకున్నప్పుడు లోకేశ్ తన హోటల్ ప్రత్యేకంగా, పర్యావరణ అనుకూలంగా ఉండాలని భావించారు. నిర్మాణపరంగా కూడా పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలనే ఉపయోగించాలని అనుకున్నారు. భవిష్యత్తులో భవనాన్ని కూల్చేసినా, ఆ పదార్థాలు మళ్లీ భూమిలోనే కలిసిపోయేలా ఉండాలని భావించారు. అమెరికాలోని మయామీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన లోకేశ్కు ఇంత పచ్చని ఆలోచన రావడమే గొప్ప! ఆ ఆలోచనే ‘శూన్యత మడ్హోటల్’గా రూపుదాల్చింది. ఈ హోటల్ నిర్మాణం కోసం లోకేశ్ మొదట బెంగళూరులోని ‘డిజైన్ కచేరీ’ అనే ఆర్కిటెక్చర్ సంస్థను, పుదుచ్చేరి దగ్గరి ప్రకృతి ఆశ్రమం ‘ఆరోవిల్’లో శిక్షణ పొందిన పునీత్ అనే యువ సివిల్ ఇంజినీరును సంప్రదించారు. వారి సహకారంతో లోకేశ్ తన కలల కట్టడాన్ని సాకారం చేసుకోగలిగారు. హోటల్ నిర్మాణానికి రంగంలోకి దిగిన నిపుణుల బృందం మొదట ఇటుకల తయారీ ప్రారంభించింది. నేలను సమం చేయడానికి తొలగించిన మట్టితోనే ఇటుకలను తయారు చేశారు. చుట్టుపక్కల పదిహేను మైళ్ల వ్యాసార్ధంలోని ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి నిర్మాణానికి ఉపయోగించడంతో రవాణా ఖర్చులు, కాలుష్యం చాలావరకు తగ్గాయి. స్థానికంగా లభించే సున్నపు రాయిని, ఐదు శాతం కంటే తక్కువ మోతాదులో సిమెంటును కలిపి ఇటుకలను తయారు చేసుకున్నారు. ఈ పనులన్నీ నిర్మాణ స్థలంలోనే జరిగాయి. మిక్సింగ్ మెషిన్ నడిచేందుకు, ఇతర పరికరాలను నడిపేందుకు కావలసిన విద్యుత్తు కోసం అక్కడే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్మరశ్మి పుష్కలంగా ఉండే వేసవిలో ఈ పనులు జరిగాయి. నిర్మాణం ఎత్తు లేపడానికి, ఎత్తుకు తగినట్లుగా దన్నుగా అమర్చే ఉక్కు సామగ్రిని నివారించడానికి నిర్మాణ బృందం లోడ్బేరింగ్ నిర్మాణ పద్ధతిని అనుసరించింది. దీనివల్ల నిర్మాణం బరువు పైకప్పు నుంచి గోడలకు, పునాదులకు బదిలీ అవుతుంది. ఉక్కు ఉత్పాదన విస్తారంగా లేని కాలంలో పాత భవనాల నిర్మాణాల కోసం ఈ పద్ధతినే ఉపయోగించేవారు. ఇక సీలింగ్ కోసం కొబ్బరి చిప్పలు, పాట్ ఫిల్లర్లను ఎంచుకున్నారు. ఈ ఫిల్లర్లు పై అంతస్తుకు దృఢమైన ఫ్లోరింగ్గా పనిచేయడమే కాకుండా, గదులను కళాత్మకంగా, చల్లగా ఉంచుతాయి. ఇది హోటల్ కావడం వల్ల ఇక్కడకు వచ్చే అతిథులకు అన్నివిధాలా అనుకూలంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన అంశం. వేసవిలో చిక్మగళూరు వాతావరణం వెచ్చగా ఉంటుంది. పరిసరాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు ఉంటుంది. కాబట్టి గదులను చల్లగా ఉంచడానికి ఎయిర్కండిషన్ బదులు సహజ శీతలీకరణ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ విధానంలో భవనం కింద పది అడుగుల మేర పెద్ద పీవీసీ పైపును అమర్చారు. ఇది బయటి గాలికి శీతలీకరణ పైపుగా పనిచేస్తుంది. పైపుగుండా గాలి వెళుతున్నప్పుడు చల్లబడుతుంది. తర్వాత వివిధ మార్గాల ద్వారా ప్రాంగణంలోని పదకొండు గదుల్లోకి ప్రసరిస్తుంది. గదుల లోపల కూడా అక్కడి వెచ్చని గాలిని బయటకు పంపేందుకు పైకప్పులకు చిమ్నీలు ఉంటాయి. ఈ వ్యవస్థ కారణంగా బయటి వాతావరణం ఎలా ఉన్నా, గదుల్లోని ఉష్ణోగ్రత 18–25 డిగ్రీల మధ్యనే ఉంటుంది. ఇదిలా ఉంటే, మంచినీటి కోసం వాననీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా 50వేల లీటర్ల ట్యాంకును నిర్మించుకున్నారు. దీని నిర్మాణం పైభాగంలో కాకుండా, భూగర్భంలో చేపట్టారు. ఈ నీటిని శుద్ధి చేసి, హోటల్కు వచ్చే అతిథులకు తాగునీరుగాను, ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు సరఫరా చేస్తున్నారు. వంటా వార్పులకు కూడా ఇదే నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ హోటల్లో ప్లాస్టిక్ను అసలు వాడరు. అతిథులకు స్టీల్ బాటిళ్లలోనే నీరు అందిస్తారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానంలో నిర్మించిన ఈ హోటల్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ∙రాచకొండ శ్రీనివాస్ -
హోటల్లో నాగుపాము హల్చల్.. భయంతో కస్టమర్ల పరుగులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ పాము హల్చల్ చేసింది. తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లోని వంట గదిలోకి 5 అడుగుల పొడవైన పాము ప్రవేశించింది. నాగుపామును గుర్తించిన సిబ్బంది, కస్టమర్లు భయంతో హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హాటల్లోని వంటగదిలో దాక్కున్న పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్! -
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం
-
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ ధ్వంసం..ఏకంగా 60 డైనమైట్లతో ..
సాక్షి, ఇండోర్: మధ్యప్రదేశ్ అధికారులు సాగర్ నగర్లో ఉన్న బీజేపీ నాయకుడు మిశ్రీ చంద్ర గుప్తా అక్రమ హోటల్ని కూల్చేసింది. చంద్ర గుప్తా అతని కుటుంబ సభ్యులపై డిసెంబర్ 22న జగదీష్ యాదవ్ అనే వ్యక్తిని ఎస్యూవీతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయమై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు. అయితే దర్యాప్తులో చంద్ర గుప్తా పేరిట ఉన్న హోటల్ అక్రమంగా కట్టిందని అధికారులు గుర్తించారు. దీంతో.. ఇండోర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ జైరామ్ ప్యాలస్ని సుమారు 60 డైనమైట్లను ఉపయోగించి కూల్చేసినట్లు సమాచారం. సెకండ్ల వ్యవధిలో నేలమట్టం అయ్యింది ఆ హోటల్. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సాగర్జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య స్వయంగా కూల్చివేత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్ను నిలిపేశారు. అలాగే హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివశించే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం భవనం మాత్రమే కూలిందని కలెక్టర్ ఆర్య ప్రకటించారు. హత్యకు గురైన జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. కిరణ్ యాదవ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్ర గుప్తా భార్య మీనాను సుమారు 83 ఓట్ల ఆధిక్యంతో ఓడించడం గమనార్హం. #WATCH | MP | Police razed illegal hotel of suspended BJP leader Mishri Chand Gupta after public protest over Jagdish Yadav murder case in Sagar "There has been no loss of any kind. Only the building was demolished," said Collector Deepak Arya (03.01) pic.twitter.com/VsAbVhRGi8 — ANI (@ANI) January 4, 2023 (చదవండి: గిరిజనుడికి అన్యాయం.. తప్పుడు రేప్ కేసులో జైలు శిక్ష.. సర్కార్పై పదివేల కోట్లకు దావా) -
కంబోడియా క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం
-
క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
దక్షిణ ఆసియా దేశం కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. పయోపెట్లోని గ్రాండ్ డైమెండ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నీ కీలక భారీగా ఎగిసిపడ్డాయి. వందల మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ మంటలు ఆర్పేందుకు రెండు గంటలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో మొత్తం 400 మంది క్యాసినోలో ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరైతే అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు వెళ్తున్నా ప్రాణభయంతో ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ప్రమాద సమయంలో విదేశీయులు కూడా లోపల ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 360 మంది అత్యవసర సిబ్బంది, 11 ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే న్యూఇయర్ సందర్భంగా భారీ విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
తనతో రాత్రి గడిపేందుకు ఒప్పుకోలేదని ప్రియురాలిని చంపిన ప్రియుడు
వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం పేరుతో పలువురు హద్దుమీరుతున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం అనంతరం ఇలాంటి కోవకే చెందిన మరిన్ని ఘటనలు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా తనతో కలిసి రాత్రి హోటల్లో గడిపేందుకు నిరాకరించిందని ప్రియురాలిని హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘోర ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్పట్కు చెందిన రచన(44) ఓప్రైవేటు కంపెనీలో క్లర్క్గా పనిచేస్తోంది. భర్త రాజ్ కుమార్ కూలీ పనులు చేస్తుంటాడు. అయితే రచనకు గత కొన్ని నెలలుగా బిహార్ రాష్ట్రంలోని భోజ్పూర్కు చెందిన వ్యక్తితో(34) పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 23న మీరట్లో కలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అక్కడే హోటల్లో రెండు రాత్రులు బస చేసిన తర్వాత ఆదివారం సాయంత్రం ఘాజియాబాద్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మహిళ తన ప్రియుడు గౌతమ్ కలిసి హోటల్లో దిగారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు గౌతమ్ హోటల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. హోటల్ హౌజ్ కీపింగ్ సిబ్బంది మధ్యాహ్నం గదిలోకి వెళ్లి చూడగా రచన విగత జీవిగా కనిపించింది. వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బృందం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రచన మృతిపై భర్తకు సమాచారం ఇచ్చి.. ఘటనపై విచారణ ప్రారంభించారు. చదవండి: Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు గౌతమ్ను మురాద్నగర్లోని గంగ కెనాల్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. గత నాలుగు నెలలుగా రచనతో పరిచయం ఉందని అతడు వెల్లడించాడు. హోటల్లో తనతో కలిసి రాత్రి ఉండేందకు ఒప్పుకోలేదని, ఇంటికి వెళ్తానని పట్టుపట్టడంతో.. ఆవేశంతో గొంతు నులిమి చంపినట్లు గౌతమ్ అంగీకరించినట్లు న్నట్లు మురాదాబాద్ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రే రచనను హత్య చేసి ఆ రాత్రంతా అదే గదిలో గడిపినట్లు తేలింది. ఐపీసీ సెక్షన్ 302, 506 సెక్షన్ల ప్రకారం హంతకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి డిసెంబర్ 23న ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు రచన భర్త తెలిపారు. ‘అదే రోజు రాత్రి 8 గంటల వరకు రచన ఇంటికి రాకపోయే సరికి నేను కాల్ చేశాను. ఆఫీస్లో మీటింగ్ ఉంది ఆలస్యం అవుతుందని చెప్పింది. కానీ రాత్రి 11 గంటల వరకు కూడా ఆమె రాకపోవడంతో మళ్ల ఫోన్ చేయగా స్వీచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తన ఆఫీస్కు వెళ్లాను. తను ఆ రోజు అసలు ఆఫీస్కే రాలేదని అప్పుడే తెలిసింది. డిసెంబర్ 25న ఉదయం 5గంటలకు తనే కాల్ చేసి ఇంటికి వస్తున్నట్లు తెలిపింది. కానీ ఎక్కడుందో వెల్లడించలేదు. అదే రోజు రాత్రి 10 గంటలకు మళ్లీ ఫోన్ చేసి ఘజియాబాద్లోని హోటల్లో ఉన్నట్లు, తనను గౌతమ్ ఇంటికి రానివ్వడం లేదని చెప్పి సాయం చేయాలని కోరింది. ఆమె కోసం వెతుకుతుండగానే సోమవారం మధ్యాహ్నం పోలీసులు కాల్ చేసి రచన చనిపోయినట్లు తెలిపారు’ అని భర్త రాజ్ కుమార్ తెలిపాడు. -
రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో..
రాయగడ(భువనేశ్వర్): పట్టణంలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్లో ఓ విదేశీయుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రష్యాకు చెందిన వ్లాదిమర్ బిదానోబ్(61)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీఓ దేవజ్యోతి దాస్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే... ఈనెల 21న రష్యాకు చెందిన నలుగురు పర్యాటకులు ఒడిశాలోని దారింగిబడి నుంచి రాయగడలో పర్యటించేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారి వెంట వచ్చిన గైడ్ స్థానిక సాయి ఇంటర్నేషనల్ హోటల్లో వసతి సౌకర్యం కల్పించారు. గురువారం రాత్రి వ్లాదిమర్తో పాటు అతనితో వచ్చిన మరో విదేశీయుడు కలిసి ఒకే గదిలో మద్యం సేవించారు. అయితే తెల్లవారు లేచి చూసేసరికి వ్లాదిమర్ మృతి చెందడంతో హోటల్ మేనేజర్కు విషయాన్ని తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమా? లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్డీపీఓ దాస్ మీడియాతో మాట్లాడుతూ విదేశీయుడి మృతికి సంబంధించి నియమాల ప్రకారం సమాచారాన్ని రష్యా రాయబార కార్యాలయానికి విషయం చేరవేశామని తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నట్ల తెలిసిందని, మిగతా సమాచారం అందాల్సి ఉందని వివరించారు. చదవండి: షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది? -
చికెన్ రోల్ లేదని.. హోటల్కు నిప్పు
సాక్షి, బనశంకరి: చికెన్ రోల్ ఇవ్వలేదని హోటల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన బెంగళూరు హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి హనుమంతనగర కుమార్ హోటల్కు రౌడీషీటర్ దేవరాజ్, ఇద్దరు అనుచరులు వెళ్లారు. తినడానికి చికెన్రోల్ కావాలని సిబ్బందిని అడిగారు. సమయం ముగిసింది, హోటల్ మూసేస్తున్నాం, ఈ రోజు మెనులో చికెన్రోల్ లేదని వారు చెప్పారు. దీంతో దేవరాజ్, అతని అనుచరులు సిబ్బందితో గొడవకు దిగారు. మద్యం మత్తులో ఉన్న వారిని హోటల్ సిబ్బంది చితకబాది బయటికి గెంటేసి హోటల్ తలుపులు వేశారు. పెట్రోలు పోసి నిప్పు దేవరాజ్ అనుచరులు సమీప పెట్రోల్బంక్కు వెళ్లి రెండు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి హోటల్ సిబ్బంది గది మీద పోసి నిప్పుపెట్టారు. మంటలు వ్యాపించగానే సిబ్బంది బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. తలుపు, కిటికీ కాలిపోయింది. హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా దేవరాజ్, గణేశ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. (చదవండి: జికా వైరస్ కలకలం.. కర్ణాటకలో తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్) -
కె.జి.యఫ్ హోటల్.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్గా అవతారం ఎత్తి..
సాక్షి, గోవా: గత 15 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతన్న హత్య కేసు నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో పుర్బా మేదినీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఏప్రిల్ 23, 2005న గోవాలోని కరంజాలెం వద్ద అల్టినో నివాసి గాడ్విన్ డీఎస్లీవా అనే వ్యక్తిని రుడాల్ గోమ్స్, జాక్సన్ డాడెల్ అనే వ్యక్తులు హత్య చేశారు. అనంతరం వారిని పనాజీ పోలీసులు అరెస్టు చేసి సెషన్స్ కోర్టు ముందు హాజరుపర్చగా...కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. ఐతే ఆ ఇద్దరు వ్యక్తులు శిక్ష పడక మునుపే జ్యుడిషియల్ కస్టడీ ఉన్న మిగతా 12 మంది ఇతర నిందితులతో కలిసి జైలు గేటును తెరిచి గార్డులపై దాడి చేసి పరారయ్యారు. ఐతే అప్పటి నుంచి ఆ నిందితుల్లో జాక్సన్ డాడెల్ అనే వ్యక్తి ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఐతే అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు బృందానికి కోల్కతాకు 200 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్ జాక్సన్ డాడెల్ ఉన్నట్లు సమాచారం అందింది. నిందితుడు పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా పట్టణంలోని ఓ హోటల్లో ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఐతే నిందితుడు పేరు మార్చుకుని, తాను జైలు నుంచి తప్పించుకున్న తేదీనే పుట్టినరోజు తేదీగా మార్చకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ సూరజ్ నేతృత్వంలోని గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం మార్గోవ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. (చదవండి: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలి: శ్రద్ధా తండ్రి) -
ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సుప్రసిద్ధ సంస్థ అశోక్ హోటల్ అంచనా విలువను ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆస్తుల మానిటైజేషన్లో భాగంగా ఢిల్లీలోని కీలక ప్రాంతంలోగల అశోక్ హోటల్కు రూ. 7,049 కోట్ల సంకేత విలువను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 25 ఎకరాలలో విస్తరించిన ఈ ఆస్తి విక్రయాన్ని పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టనుంది. పెట్టుబడిదారులతో చర్చలు(ఇన్వెస్టర్ కన్సల్టేషన్) ఇప్పటికే ప్రారంభంకాగా.. క్యాబినెట్ నోట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆస్తుల మానిటైజేషన్(ఎన్ఎంపీ) జాబితాలో అశోక్ హోటల్, సమీపాన గల సామ్రాట్సహా టూరిజం అభివృద్ధి కార్పొరేషన్కు చెందిన 8 ఆస్తులున్నాయి. 2021 ఆగస్ట్లోనే సీతారామన్ నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల విలువైన ఎన్ఎంపీ కార్యాచరణకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా విభిన్న మౌలిక రంగ ఆస్తుల విలువను అన్లాక్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ. 33,422 కోట్లు మౌలిక సంబంధ శాఖలతో చర్చల ద్వారా నీతి ఆయోగ్ ఎన్ఎంపీ నివేదికను రూపొందించింది. ఈ నెల 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్తో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎన్ఎంపీ పురోగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 33,422 కోట్ల విలువైన ఎన్ఎంపీని సాధించింది. 2021-22లో ప్రభుత్వం రూ. లక్ష కోట్ల లావాదేవీలు పూర్తిచేయడం ద్వారా తొలి ఏడాది లక్ష్యం రూ. 88,000 కోట్లను అధిగమించడం గమనార్హం! -
విరాట్కోహ్లీకి చేదు అనుభవం
-
ముంబై హోటల్లో మోడల్ ఆత్మహత్య.. నేను సంతోషంగా లేనంటూ..
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో మోడల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అంధేరీ ప్రాంతంలోని ఓ హోట్ల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. మృతురాలిని ఆకాంక్ష మోహన్గా(30) గుర్తించారు, వివరాలు.. మోడల్ ఆకాంక్ష బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్లో చెక్ ఇన్ అయ్యింది. రాత్రికి 8 గంటలకు డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. అయితే గురువారం హౌస్ కీపింగ్ సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా ఆమె తలుపు తీయలేదు. దీంతో హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. హోటల్కు చేరుకున్న పోలీసులు మాస్టర్ కీతో గదిని తెరిచి చూడగా మోడల్ మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. మృతదేహం వద్ద పోలీసులు సుసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ‘నన్ను క్షమించండి. నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా లేను. నాకు ప్రశాంతత కావాలి" అని నోట్ లో రాసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. చదవండి: ఏవో చెత్త బుద్ధి.. మహిళల ఫొటోలు తీసి ‘ఈమె ఎలా ఉంది’ అంటూ -
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
గాజు సీసాల్లోనే నీళ్లు!
పర్యావరణ పరిరక్షణతో పాటూ ప్లాస్టిక్ ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని నివారించే దిశగా నగరంలోని హోటల్స్లో పలు మార్పు చేర్పులు చేపట్టారు. ఇందులో భాగంగా హోటల్లో తాగునీటిని అందించడానికి వినియోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో గాజు సీసాలను వినియోగించాలని నిర్ణయించారు. నగరంలోని ఆతిథ్యరంగంలో మంచి మార్పునకు ఇది దోహదం చేయనుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హోటళ్లలో అతిథులకు ప్లాస్టిక్ సీసాల్లో నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి కొత్తగా మార్చి వినియోగించలేక పోవడం ఒక ఎత్తయితే మరోవైపు వినియోగించిన వాటిని ధ్వంసం చేయడం కూడా ఎంతో క్లిష్టమైన, కష్టసాధ్యమైన పని. దీంతో ఇవి తీవ్రస్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి గాజు బాటిళ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ బాటిళ్లను వాడేసినప్పటికీ తిరిగి మళ్లీ వినియోగించడం సాధ్యమవుతుండడంతో సిటీలోని కొన్ని హోటల్స్ వీటినే ఎంచుకుంటున్నాయి. ఆటోమేటిక్గా.. ఆరోగ్యకరంగా.. దీని కోసం తక్కువ మానవ ప్రమేయంతో పూర్తిగా ఆటోమేటిక్గా నడిచే ఓ అత్యాధునిక వాటర్ ప్లాంట్ను హోటల్స్లో అమర్చుకుంటున్నారు. తద్వారా హోటల్ అవసరాలకు సరిపడా పూర్తిగా శుభ్రపరచబడిన ఆల్కలైన్ మినరల్ వాటర్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వీరు చెబుతున్నారు. పూర్తి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యంత్రం తన ఫిల్టర్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తూ అత్యంత శుభ్రమైన తాగు నీటిని అందిస్తుంది. ఇలా తయారు చేసిన తాగు నీటిని మళ్లీ తిరిగి వినియోగించే వీలున్న రీ యూజబుల్ గాజు సీసాల ద్వారా అతిథులకు అందజేస్తున్నారు. నాలుగు దశలలో ఈ వాటర్ ప్లాంట్ పని చేస్తుంది. ముందుగా సాధారణ తాగు నీటిని పూర్తిగా శుభ్రపరచి సురక్షితమైన ఆల్కలైన్ మినరల్ వాటర్గా తయారు చేస్తుంది. అనంతరం యంత్రంలో ప్రవేశ పెట్టిన తాగునీటి గాజు సీసాలను పరిశుభ్రపరచి, పూర్తిగా పొడిగా మార్చిన తర్వాత వాటిలో ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ను నింపుతారు. ఇలా నింపిన గ్లాసు బాటిల్స్ను హోటల్లోని గెస్ట్ రూమ్లు ఇతరత్రా ప్రదేశాలలో తాగు నీటిగా వినియోగించడానికి అందిస్తారు. రోజుకు 1500 బాటిళ్ల నీరు ఉత్పత్తి... ఆకార్ హోటల్స్ గ్రూప్ పూర్తి పర్యావరణ హితంగా హోటల్స్ను మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్లాస్టిక్ బాటిళ్ల నివారణకు గాను మా హోటల్లో సరికొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా రోజూ 1500 గ్లాసు బాటిళ్ల నీటిని అంటే సుమారు 300 లీటర్లను అతిథులకు సరఫరా చేయవచ్చు. అలానే కాలం చెల్లిన వాటిని రీ సైకిల్ చేసి సరికొత్త బాటిళ్ల తయారీలో వినియోగించవచ్చు. –సౌమిత్రి పహారి, జీఎం, హోటల్ మెర్క్యుర్ హైదరాబాద్ కెసీపీ (చదవండి: రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు) -
రూబీ కేసులో పోలీసులు దూకుడు.. ఫామ్ హౌస్లో నిందితులు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నలుగురు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రంజిత్ సింగ్, సుమిత్ సింగ్తోపాటు మేనేజర్, సూపర్వైజర్ ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు మేడ్చల్ ఫాంహౌస్లో తలదాచుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. అంతటా నిర్లక్ష్యమే.. భవన నిర్మాణ లోపాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణలో పొరపాట్లు ఘోర ప్రమాదానికి కారణలయ్యాయి. మంటలు చెలరేగినప్పుడు.. ఫోమ్ సిలిండర్లు ఉపయోగించి సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేసినా అవి పని చేయలేదు. ఇలాంటి బ్యాటరీ ప్రమాదాలు సంభవించినప్పుడు నీటి బదులు.. వాడాల్సిన ఏబీసీ పౌడర్ అందుబాటులో లేదు. ద్వారాలు లేవు.. సెల్లార్ను పార్కింగ్కోసం కాఉండా కమర్సియల్ కార్యకలాపాలకు వాడారు. అసలు లాడ్జి ఎన్వోసీ కూడా సరిగా లేకపోవడం, అధికారులు స్పందన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఇక, అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. -
రూబీ లాడ్జి: విజయవాడవాసి హరీష్ మృతి.. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరి
సాక్షి, విజయవాడ: సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మృతుల్లో విజయవాడకు చెందిన హరీష్ కూడా ఉన్నారు. దీంతో, విజయవాడలో హరీష్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ దురదృష్టకర ఘటనపై హరీష్ కుటుంబ సభ్యులు స్పందించారు. హరీష్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు ట్రైనింగ్ ఉందని హరీష్ ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వెళ్లారు. మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పారు. ఎంటెక్, ఎంబీఏ చేసిన మొదట కోస్టల్ బ్యాంక్లో ఉద్యోగం చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ.. ఎస్వీటీ బ్యాంకులో ఉద్యోగం రావడంతో ట్రైనింగ్ కోసం వెళ్లాడు. నిన్న హరీష్ ఫ్రెండ్ ఫోన్ చేసిన తను ఉన్న హోటల్లో మంటలు వస్తున్నాయని చెప్పాడు. రాత్రంతా మేము టెన్షన్ పడుతుండగా.. తెల్లవారుజామున 3 గంటలకు హరీష్ గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడని హైదరాబాద్లో ఉన్న తన ఫ్రెండ్ ఫొటో తీసి పంపించాడు. హరీష్కు ఇద్దరు పిల్లలున్నారు. చిన్న బాబు.. 10 రోజుల క్రితమే జన్మించాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆవేదనకు గురిచేస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. -
కొత్త సేవలను ప్రారంభించిన ఫ్లిప్కార్ట్.. ఆఫర్లు, డిస్కౌంట్ల విషయంలో తగ్గేదేలే!
ఎప్పటికప్పుడు వస్తువలపై ఆఫర్లు, డిస్కౌంట్లతో ప్రజలను ఆకట్టుకుంటూ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతోంది ప్రముఖ సంస్థ ఫ్లిప్కార్ట్. తాజాగా తన కస్లమర్ల కోసం మరో సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. గతేడాది తాను కొనుగోలు చేసిన ట్రావెల్ వెబ్సైట్ క్లియర్ట్రిప్(Cleartrip) భాగస్వామ్యంతో ఫ్లిప్కార్ట్ హోటల్స్ (Flipkart Hotels) పేరిట హోటల్ బుకింగ్ సేవను కొత్తగా ప్రారంభించింది. తద్వారా ట్రావెల్ విభాగంలోనూ అడుగుపెట్టింది. ఫ్లిప్కార్ట్లో సుమారు 3 లక్షల దేశీయ, అంతర్జాతీయ హోటళ్లలో సమాచారం ఉందని, వీటి ద్వారా తమ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. తన కస్టమర్ల కోసం ట్రావెల్, బుకింగ్స్కు సంబంధించి కొత్త ఆఫర్లతో పాటు, ఈఎంఐ (EMI) ఆప్షన్లు, ఫ్రెండ్లీ బడ్జెట్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. కొవిడ్ ఆంక్షలు ముగిసినప్పటి నుంచి దేశంలో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత రెండేళ్లలో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో ఈ రంగం మెరుగైన వృద్ధినే సాధించింది. రానున్న రోజుల్లో ఈ పరిశ్రమ మరింత మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంచనా. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఫ్లిప్కార్ట్ ప్రయత్నిస్తోంది. చదవండి: మీ భవిష్యత్తుకు భరోసా.. ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ, బెనిఫిట్స్ కూడా బాగున్నాయ్ -
ఇదీ ఆకాశహర్మ్యమే..కానీ మనుషుల కోసం కాదు..
పైన చెప్పుకున్నట్లు ఇదీ ఆకాశహర్మ్యమే.. ఉన్నది కూడా చైనాలోనే.. అయితే.. మన కోసం కాదు.. స్టార్ హోటల్ను తలపిస్తున్న ఈ 26 అంతస్తుల భవనాన్ని పందుల కోసం నిర్మిస్తున్నారు. షాక్ అవ్వాల్సిన పని లేదు. నిజమే.. పందుల పెంపకం కోసం ఇంత పెద్ద భవనం నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి. చైనాలో ప్రధాన ఆహారమైన పోర్క్ ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలాంటి భవనాల్లో పందులను పెంచుతున్నారు. ఆఫ్రికాలో స్వైన్ఫ్లూ తరువాత.. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా, ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో ఫార్మింగ్కు అనుమతించింది. మొదట రెండు మూడు అంతస్తులతో మొదలైన ఈ ఫార్మింగ్ ఇప్పుడిలా 26 అంతస్తులకు చేరింది. అక్కడి పందులకు యంత్రాలే ఆహారాన్ని సరఫరాచేస్తాయి. గాలి శుద్ధీకరణ, ఇన్ఫెక్షన్స్ సోకకుండా పద్ధతులు, పందుల వ్యర్థాలతో బయోగ్యాస్ ప్లాంట్, దాన్నుంచే విద్యుత్ ఉత్పత్తి ఇలా అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం ప్రారంభమైతే నెలకు 54వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నులు పోర్క్ ఉత్పత్తి చేయనుంది. గతంలో యూరప్లోనూ ఇలాంటి నిర్మాణాలున్నా.. వివిధ కారణాలతో చాలా మూతపడ్డాయి. ఉన్న ఒకటి అరా మూడంతస్తులకు మించలేదు. చదవండి: మీ కోసం తెచ్చిన కేక్ పక్కోడు కట్ చేస్తే?.. అచ్చం ఇలాగే ఉంటుంది కదూ! -
ఫుడ్కోర్టులో ‘గుడ్డు’ వివాదం
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగర పార్కు లేఔట్ ప్రధాన రోడ్డులో వెజ్ ఫుడ్ కోర్టు (శాఖాహార)లో గుడ్లకు సంబంధించిన ఆహార విక్రయంపై గొడవ జరిగింది. వ్యాపారస్తులు బాహాబాహీకి కూడా దిగాల్సి వచ్చింది. శనివారం వెజ్ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించారు. దీనికి కొందరు మరికొందరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వెజ్ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు అవకాశం లేదని గొడవకు దిగారు. ఇదే విషయంపై శివమొగ్గ మహానగర పాలికెకు కొందరు ఫిర్యాదు చేశారు. చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి.. -
HYD: మందుబాబుల హల్చల్.. హోటల్లో రచ్చ రచ్చ
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్లోని కూకట్పల్లిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్లో తాగిన మత్తులో ఐదుగురు మందుబాబులు రెచ్చిపోయారు. హోటల్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి.. కూర్చీలతో దాడులు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. పాపారాయుడు నగర్లోని కేవీ టిఫిన్ సెంటర్ ఎదుట మందుబాబులు.. సతీష్ అనే వ్యక్తితో గొడవకు దిగారు. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లోకి ప్రవేశించి గొడవపడ్డారు. దీంతో, వారిని బయటకు వెళ్లాలని హోటల్ యజమాని, సిబ్బంది కోరగా.. వారితో కూడా మందుబాబులు గొడవకు దిగి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. కాగా, మందుబాబుల వీరంగం.. హోటల్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది కూడా చదవండి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. -
‘చుక్కలు’ చూపించే హోటల్
ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం... గ్రాండ్ పేరెంట్స్తో కథలు చెప్పించుకోవడం... 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్లోని ఓ హోటల్. దాని పేరు నల్ స్టెర్న్ హోటల్ (జీరో స్టార్ హోటల్). దీని ప్రత్యేకత ఏంటంటే... ఒక ప్లాట్ఫామ్ మీద డబుల్ కాట్బెడ్, అటూఇటూ ల్యాంప్స్. అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండబోదు. హోటలియర్ డానియేల్ కార్బొనియెర్ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్ ఆర్టిస్టులు ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు...’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్ బ్రదర్స్. వచ్చిన అతిథులకు ప్రపంచంలో ఉన్న సమస్యలు ప్రత్యేకించి... వాతావరణంలో వస్తున్న మార్పులు, యుద్ధం, మాయమవుతున్న మానవత్వం వంటివన్నీ భూమికెంత నష్టం చేస్తున్నాయో తెలియజెప్పడమే ఈ ‘జీరో స్టార్ హోటల్స్’ లక్ష్యమని చెబుతున్నారు. ఇక హోటల్లో ఒక నైట్ స్టే చేయాలంటే.. దాదాపు రూ. 27 వేలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రింక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ పక్కన, మరో వైన్యార్డ్లో, పిక్చర్స్క్వేర్ కొండ పక్కన వీటిని ఏర్పాటు చేశారు. -
బసేరా హోటల్లో అశ్లీల నృత్యాలు
-
కడుపునిండా తినండి బాబూ!
రెస్టారెంట్, ఫుడ్ కోర్టులలో కడుపునిండా భోంచేయాలంటే .. కనీసం రూ.200 పైనే వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ వెరైటీ రుచులతో పుల్మీల్స్ ప్లేట్ తీసుకుంటే... హోటల్ ఉన్న ప్రాంతం, దానికి ఉన్న పాపులారిటిని బట్టి ప్లేటు రేటు ఉంటుంది. కొన్ని సార్లు పేరున్న రెస్టారెంట్లలో తిన్నప్పటికీ, భోజనం అంతరుచిగా ఉండదు. ఇలాంటి హోటల్స్ ఉన్న ఈ రోజుల్లో తిన్నంత అన్నం, ఐదారు రకాల కూరలతో కడుపునిండా పెడుతున్నారు. ఎంతో రుచికరమైన భోజనం పెడుతూ నామమాత్రము ధర రూ.50 ఫుల్మీల్స్ అందిస్తున్నారు ఓ జంట. ఇంత తక్కువకు భోజనం పెడుతున్నారంటే ఏదో చారిటీ సంస్థో అనుకుంటే పొరపడినట్లే. ఒంట్లో జవసత్వాలు నీరసించినప్పటికీ కొన్నేళ్లుగా ఎంతో ప్రేమగా వండి వారుస్తూ వేలమంది మన్ననలు పొందుతున్నారు ఈ అజ్జా అజ్టీలు. కర్ణాటకలోని మణిపాల్కు చెందిన వృద్ధ దంపతులే అజ్జా అజ్టీలు. రాజగోపాల్ నగర్ రోడ్లోని హోటల్ గణేష్ ప్రసాద్ (అజ్జా అజ్జీ మానే)ను 1951 నుంచి ఈ దంపతులు నడుపుతున్నారు. శాకాహార భోజనాన్ని అరిటాకు వేసి వడ్డించడాన్ని గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా పాటిస్తున్నారు. అరిటాకు వేసి అన్నం, పప్పు, వేపుడు కూరలు, పచ్చడి, సలాడ్, రసం, పెరుగు పెడతారు. ఇవన్నీ బయట హోటల్లో తినాలంటే కనీసం రెండువందల రూపాయలైనా చెల్లించాలి. కానీ వీరు కేవలం యాభైరూపాయలకే భోజనం పెడుతూ కడుపు నింపుతున్నారు. ఇక్కడ పెట్టే భోజనం రుచిగా, శుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి ఇష్టంగా తింటున్నారు. ఇంట్లో వండిన వంట, తక్కువ రేటు, ప్రేమగా వడ్డిస్తుండడంతో ఈ హోటల్కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికంగా అంతా అజ్జాఅజ్జీ మానే అని పిలుచుకుంటుంటారు. వయసులో పెద్ద వాళ్లు కావడంతో కస్టమర్లకు ఆ దంపతులు తల్లిదండ్రులుగా, బామ్మ తాతయ్యలు వండిపెట్టినట్లుగా భావించి ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వారు అనుకున్న దానిని కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల గురించి ఇటీవల రక్షిత్ రాయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అజ్జాఅజ్జీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నారు. వీరి సేవాగుణం గురించి తెలిసిన నెటిజన్లు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఎర్రావారిపాళెం(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా బావుందని చెప్పారు. చదవండి: జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా.. ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ అవ్వను అడిగారు. తనకు చూపు తక్కువని ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
వాట్ యాన్ ఐడియా.. లారీ కాదండోయ్.. ఫైవ్ స్టార్ స్టైల్ హోటల్!
సాక్షి, కోదాడరూరల్(నల్గొండ) : వారికొచ్చిన ఓ ఐడియాతో లారీని ఫైవ్స్టార్ లుక్లో హోటల్గా తయారు చేశారు.. ఇద్దరు వ్యక్తులు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శివ అతని స్నేహితుడు యశ్వంత్ పాత లారీని కొనుగోలు చేసి దానిని ప్రయాణికులను, ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి హోటల్గా మార్చారు. దానిని హైదరాబాద్ విజయవాడ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్రోడ్లో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం టిఫిన్, ఫాస్ట్ ఫుడ్తో పాటు పలు రకాల టీలు, కాఫీలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే రెస్టారెంట్ తరహాలో రూపొందించి అన్ని రకాల తినుబండారాలు అందిస్తామని అంటున్నారు. ఈ హోటల్ రహదారిపై వచ్చిపోయే ప్రయాణికులు వాహనాలను నిలిపి ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు చిన్న ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో రోడ్డు వెంట పెట్టి హోటల్స్ నిర్వహించడం చూశాము కానీ ఈ తరహాలో చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. -
13.5 సెకన్లలో ఫుడ్ సర్వ్ చేసే హోటల్.. ఎక్కడో తెలుసా?
ఏది కావాలంటే దానిని క్షణాల్లో ప్రత్యక్షం చేసే అక్షయ పాత్ర గురించి పురాణాల్లో వినే ఉంటారు. కానీ, ఆహార పదార్థం పేరు చెప్పగానే క్షణాల్లో మీ టేబుల్ మీద ఉంచే హోటల్ గురించి విన్నారా? మెక్సికోలో ఇలాంటి హోటలే ఒకటి ఉంది. పేరు ‘కర్నే గారిబాల్డీ’ ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఫుడ్ సర్వ్ చేసే హోటల్. ఆర్డర్ ఇచ్చిన 13.5 సెకన్లలో ఆహారాన్ని సర్వ్ చేసి ఈ మధ్యనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే, వంటగది నుంచి కస్టమర్ టేబుల్ మీదకు చేర్చడానికి గరిష్ఠంగా 15 సెకన్ల కంటే ఆలస్యం అవదు. దాదాపు 1996 నుంచి ఈ హోటల్ అత్యంత వేగంగా సర్వ్ చేస్తూనే ఉందట. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి చాలా మంది పెద్ద పెద్ద ఆర్డర్లు ఇస్తూ విఫలయత్నం చేశారు. ‘సాధారణంగా మెక్సికన్ వంటకాలు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే, ఆ ఆలస్యం ఆహారాన్ని అందించడంలో ఉండకూడదనుకున్నాం. ఇందుకు మా సిబ్బంది కూడా తోడ్పడటంతో ఈ రికార్డు సాధించగలిగాం’ అని చీఫ్ మేనేజర్ డేనియల్ ఫ్లోర్స్ తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి హోటల్ మన ప్రాంతంలో కూడా ఉంటే భలే బాగుండు కదా! -
చాలా అమర్యాదగా ప్రవర్తించారు: హీరోయిన్కు చేదు అనుభవం
ఒక్క వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. 'ఒరు ఆడార్ లవ్' సినిమాలో కన్ను కొట్టే సీన్తో ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి పలు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమెకు ఓ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చెప్పుకొచ్చింది. 'ఫెర్న్ గొరెగావ్ హోటల్లో నేను బస చేశాను. ఈ హోటల్ పాలసీ ఏంటంటే.. బయట ఫుడ్ను లోనికి అస్సలు అనుమతించరు. ఎందుకంటే అతిథులు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. నాకీ సంగతి తెలియదు. షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోటల్కు వచ్చాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే? హోటల్ బుకింగ్, రిజిస్ట్రేషన్.. అన్నీ ప్రొడక్షన్ కంపెనీ వాళ్లే చేస్తారు, ఆర్టిస్టులకు సంబంధం ఉండదు' 'నేను ఎంతో మర్యాదగా వారిని వేడుకున్నా.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. ఎందుకంటే డబ్బులు పెట్టి ఫుడ్ కొన్నాను, పైగా నాకు దాన్ని పారేయడం ఇష్టం లేదు అని! కానీ వాళ్లు వినిపించుకుంటేగా.. ఆ ఫుడ్ను బయటే వదిలేయాలంటూ పెద్ద సీన్ చేశారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. చాలా అమర్యాదగా ప్రవర్తించారు.. దీంతో బయట చలిలో భోజనం చేయాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చిందీ ప్రియా వారియర్. -
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభించిన సీఎం జగన్
-
ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగర్లోని ఐటీసీ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. అందులో ఒకటిగా గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్ను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తోందని సీఎం చెప్పారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: AP: మిడిల్క్లాస్కి జాక్'ప్లాట్' -
భలే ఉన్నాయ్.. తాబేళ్లు కావు, హోటల్ భవనాలు
ఏరియల్ వ్యూలో తీసిన ఫొటో ఇది. ఇందులో తాబేళ్లు వరుసగా కొలువుదీరినట్లు కనిపిస్తోంది కదూ! ఇవి తాబేళ్లు కావు, హోటల్ భవనాలు. థాయ్లాండ్లోని హువాహిన్ ప్రాంతంలో ఉన్న ఖావో తావో రిజర్వాయర్లో ఇలా తాబేలు ఆకారంలో నీటిలో తేలియాడే హోటల్ భవంతులను నిర్మించారు. (క్లిక్: సగం కొట్టేసిన బిల్డింగ్లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!) పూర్తిగా వెదురుతోను, స్థానికంగా దొరికే ప్రకృతిసిద్ధమైన నిర్మాణ పదార్థాలతో వీటిని నిర్మించారు. ఈ హోటల్ భవంతుల్లో బస చేయడానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. డెర్సిన్ స్టూడియో కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్ సారావుత్ జాన్సెంగ్ ఆరామ్ ఎంతో శ్రమించి, ఈ కూర్మహర్మ్యాలకు రూపకల్పన చేశారు. (చదవండి: ప్రపంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!) -
ఆర్జీవీ పేరుతో హోటల్.. షాక్ అయిన వర్మ
Fan of Ram Gopal Varma Started Food Business On His Name: అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. కొందరు ఫ్లెక్సీలు కట్టి, పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటే, మరికొందరేమో టాటూలు వేయించుకొని సంబరపడతారు. కానీ తాజాగా ఓ అభిమాని మాత్రం తన ఫేవరెట్ సెలబ్రిటీ పేరు మీద ఏకంగా హౌటల్ పెట్టుకొని ఫేమస్ అయ్యాడు. ఇంతకీ అతను ఎవరి అభిమానో తెలుసా?.. తరచూ వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వీరాభిమాని. అతని తల్లి, సోదరుడు ఇలా ఇంటిల్లిపాది రామ్గోపాల్ వర్మకు అభిమానులే. ఆయన ఫిలాసఫీకు ఫిదా అయినవారే. ఆ అభిమానంతోనే ఆర్జీవీ పేరుతో హోటల్ పెట్టారు. హోటల్ నిండా ఆర్జీవీ చెప్పిన కొటేషన్లు, ఫోటోలు, పోస్టర్లే కనిపిస్తాయి. రామ్ గోపాల్ వర్మ పుణ్మమా అని వ్యాపారం కూడా బాగా నడస్తుందట. త్వరలోనే మరిన్ని బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. కాగా తన పేరు మీద హోటల్ ఏర్పాటు చేయడంపై ఆర్జీవీ సైతం స్పందించాడు. నా పేరుతో హోటల్ ఉందంటే చచ్చిపోయినట్లు అనిపిస్తుంది అని తనదైన స్టైల్లో ట్వీట్ చేశాడు. ఇక ఆర్జీవీ పేరుతో ఉన్న హోటల్ స్థానికంగా తెగ పాపులర్ అవుతుంది. అక్కడి వంటకాలను రుచి చూడాలనుకుంటే మాత్రం మీరు తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంక గ్రామానికి వెళ్లాల్సిందే. -
సముద్రంలో ఫ్లోటింగ్ ప్యాలెస్.. చుట్టూ విల్లాలు.. వెకేషన్ అదిరిపోద్దంతే!
చాలా మంది ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెకేషన్కు వెళ్తుంటారు. కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లాంటి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతాలకైతే మరీ మరీ ఇష్టపడి వెళ్తారు. ఇలాంటి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన ఫ్లోటింగ్ ప్యాలెస్ రెడీ కాబోతోంది. అది కూడా సముద్రంలో. అలా ఇలా కాదు.. నీటిపై తేలేలా 156 రూములతో నిర్మితమవుతోంది. ప్యాలెస్ ఒక్కటే కాదండోయ్.. దాని చుట్టూ విల్లాలు కూడా సిద్ధం కాబోతున్నాయి. అవి కూడా నీటిపై తేలేవే. అలా సముద్రాన్ని చుట్టొద్దామనుకుంటే ఆ విల్లాలే ప్యాలెస్ నుంచి విడిపోయి బోట్లలా మారిపోతాయి. అలా తిరిగొచ్చాక షిప్లు కదా ‘డాక్’ అయినట్టు ఆ పెద్ద ప్యాలెస్కు అతుక్కుపోతాయి. వినడానికి భలేగా ఉన్నా, వెంటనే చూడాలనేలా ఊరిసున్నా ఈ ప్యాలెస్ హోటల్ దుబాయ్లో జుమెయ్రా బీచ్కు దగ్గర్లో నిర్మితమవుతోంది. 2023లో అందుబాటులోకి రానుంది. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ బోట్లు, హెలికాప్టర్ల ద్వారా ప్యాలెస్ను చేరుకోవచ్చు. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ ఏర్పాటు చేశారు. తేలాడే హెలిప్యాడ్ను కూడా నిర్మించబోతున్నారు. ప్రధాన ప్యాలెస్ 4 భాగాలుగా ఉంటుంది. వాటిని మధ్యలో ఉండే గ్లాస్ పిరమిడ్ కలుపుతుంది. ప్యాలెస్లో రెస్టారెంట్, బార్, స్పా, పూల్స్, బొటీక్స్ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. విల్లాల్లో ఉండే వాళ్లు కూడా ఈ సౌకర్యాలు పొందవచ్చు. ప్యాలెస్ను, విల్లాలను నీటిపై తేలేలా ఎలా నిర్మిస్తున్నారో వెల్లడించలేదు. ప్యాలెస్ ఓపెనింగ్ తేదీ.. అందులోని రూమ్లు, సర్వీసుల ధరలు కూడా చెప్పలేదు. చదవండి: పాపికొండల సోయగాలు.. నదీ విహారం విల్లాల్లో ఏమేముంటాయ్? తేలియాడే ఆ పెద్ద ప్యాలెస్ చుట్టూ 12 విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కోటి రెండంతస్తులు ఉంటుంది. 1, 4 బెడ్రూమ్ల గదులతో పాటు పైన టెర్రస్.. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంతేకాదు.. విల్లాలను పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. వాటిల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్లో గాని, విల్లాలో గాని ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవచ్చు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కేపీహెచ్బీలో దారుణం: ప్రాణం తీసిన ఆకలి
సాక్షి, కేపీహెచ్బీకాలనీ (హైదరాబాద్): ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి జరగడంతో మృతి చెందిన ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ కిషన్ కుమార్ వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (32), భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్లో ఉంటూ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో జేఎన్టీయూహెచ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లర్లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ పుట్టిన రోజు వేడుకలు సిబ్బందితో కలిసి చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వమంటూ రాజేశ్ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. దొంగగా పొరబడి వాళ్లంతా అతన్ని చితకబాది వెళ్లిపోయారు. రాత్రంతా అక్కడే స్పృహ లేకుండా పడిఉన్న రాజేష్ను.. గురువారం ఉదయం హోటల్ సిబ్బంది గుర్తించారు. ఒరిస్సాలోని రాజేష్ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలుపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్ మృతి చెందాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలిసింది. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
‘అవ్వ’ హోటల్.. రూ. 25కే మీల్స్.. ఎక్కడో తెలుసా?
‘అవ్వ కావాలా.. బువ్వ కావాలా ఏదో ఒకటి ఎంచుకోమనే పదాన్ని సర్వసాధారణంగా క్లిష్ట సమస్యలొచ్చినప్పుడు వాడుతుంటాం.. కాకపోతే కర్నూలు నగర పాతబస్తీలో మాత్రం అవ్వే స్వయంగా బువ్వ వడ్డిస్తుంది. తన హోటల్లో సన్న బియ్యంతో చేసిన అన్నం, పప్పు, సాంబారు, కర్రి, పచ్చడి, మజ్జిగ మధ్యాహ్న భోజనంగా అందిస్తోంది. బయటి హోటళ్లలో మీల్స్ రూ. 60 నుంచి రూ. 90లకు విక్రయిస్తున్న ఈ కాలంలో అవ్వ వద్ద రూ.25ల ధరకే లభిస్తుండటం విశేషం. ఆశ్చర్యం వేస్తోంది కదూ! ఇది వాస్తవం. కడుపు మాడ్చుకునే నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈమె ఇలాంటి పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇప్పటినుంచి కాదు.. ఓ పదహైదేళ్ల నుంచి! అలాగని ఆమె గొప్ప ధనవంతురాలేమీ కాదు.. ఆస్తిపాస్తులు అసలే లేవు. ఓ సామాన్యురాలే. ఆకలిబాధేమిటో ఆకలిగొన్నవారికే తెలుస్తుందనే అనుభవాన్ని ఆమె స్వయంగా చవిచూసింది. భర్త మరణంతో తెలిసొచ్చిన ఆకలిబాధ.. ఈ అవ్వ పేరు కురువ లక్ష్మీదేవి. ఈమె భర్త కె.తిప్పన్న. సేంద్రీయ ఎరువుల వ్యాపారం చేసేవాడు. పశువుల పేడను ఆర్డరిచ్చిన రైతుల చేన్లకు లారీలో తరలించేవాడు. వీరిరువురికి యాభైఐదు ఏళ్ల క్రితం వివాహం అయింది. ఓ ఐదేళ్లకు కుమారుడు (కె.మద్దయ్య) పుట్టాడు. పెళ్లి చేసుకున్న పదేళ్లూ ఆ దంపతులు సుఖంగానే ఉన్నారు. అప్పటివరకు ఆకలి బాధేంటో అవ్వకు తెలీదు. విధి వక్రించడంతో ఆమెకు భర్త వియోగం కలిగింది. అప్పటినుంచి ఆ కుటుంబానికి అధోగతి పట్టింది. అప్పట్లో బుధవారపేట బ్రిడ్జీ స్థానంలో హంద్రీ నదిలో గచ్చు (ఇసుక, సున్నం, నీరు కలిపిన మిశ్రమం) గానుగలు ఉండేవి. ఇంటిగోడల నిర్మాణానికి, ప్లాస్టిరింగ్కు గచ్చునే వాడేవారు. అవ్వ మారెమ్మ గానుగలో పని కుదుర్చుకుంది. రాత్రింబవళ్లు కష్టపడినా కూలీడబ్బులు వారానికి రూ.50 మాత్రమే లభించేది. పెద్దపడఖానాలోని తన ఇరుకింటిలోనే జీవనం గడిపేది. వర్షానికి కారుతున్నా మరమ్మతులకు డబ్బులుండేవి కావు. కనీసం టీ తాగడానికి పది పైసలు ఉండేవి కావు. ఇంతటి ఆర్థిక కష్టాన్ని సైతం ఆమె ఎదురీదుతూ కుమారుడిని ఏడో తరగతి దాకా చదివించుకుంది. కొన్నాళ్లకు గానుగలకు డిమాండ్ పడిపోయింది. ఈమె ఉపాధి కోల్పోయింది. బొంగుల బజార్లోని జైనమందిరంలో నెలకు రూ. 900ల చొప్పున పని కుదుర్చుకుంది. అక్కడ పదహైదేళ్లు పనిచేస్తే జైనమత పెద్దలు జీతాన్ని రూ. 1500లకు పెంచారు.1994లో కుమారుడికి నగరానికే చెందిన సుభద్రతో పెళ్లి చేసింది. హమాలీల ఆకలిబాధలు కలచివేశాయి.. అవ్వ మండీబజార్లో రూ.600తో ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుంది. కుమారుని సాయంతో మొదట ఉగ్గాని, బజ్జి వంటి టిఫిన్ పదార్థాలను విక్రయిస్తుండేది. మండీబజార్కు దూర ప్రాంతాల నుంచి సరుకుల లారీలు వస్తుంటాయి. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన హమాలీలు లారీల్లోంచి సరుకుల బస్తాలు దింపుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోంచేయడానికి ఇళ్ల వద్ద నుంచి చద్దిమూట తెచ్చుకునే వారు. తెల్లవారు జామునే వారు తెచ్చుకున్న అన్నం పాచిపోయేది. పప్పు వాసనకొట్టేది. చేతిలో డబ్బులేక వారు బజ్జీ తిని కాలం వెళ్లబోసుకునే వారు. మధ్యాహ్నం పూట వారి ఆకలి నకనకలను అవ్వ అతి సమీపం నుంచి చూసింది. ఏదోరీతిలో వారికి సాయం చేయాలనే సంకల్పానికి వచ్చింది. తను బజ్జీలమ్మే గదిలోనే సన్నబియ్యంతో అన్నం తయారు చేసి రూ. 10కే విక్రయించింది. ధర చౌకగా ఉండటం వల్ల హమాలీలు రాసాగారు. అన్నంతో పాటు పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగలను వడ్డించింది. నష్టం కలిగించిన వరద.. 2009లో నగరానికి వరదలు వచ్చాయి. వరద ప్రభావంతో నిల్వ ఉంచుకున్న కొన్ని బియ్యం బస్తాలు, బ్యాళ్లు వంటివి పాడైపోయాయి. పుంజుకోవడానికి సమయం పట్టింది. అయినా అవ్వ అధైర్య పడలేదు. అన్నం వడ్డింపునకు అంతరాయం కలిగించలేదు. భోజన ధరను రూ. 15కు పెంచారు. స్థలం చాలడం లేదని 2014లో ఎదురుగా ఉండే షాపులోకి షిఫ్ట్ అయ్యారు. కొడుకు, కోడలు అవ్వకు తోడుగా నిలిచారు.హమాలీలతో పాటు షాపుల్లో పనిచేసే గుమస్తాలు, పనిమీద నగరానికి వచ్చిన బాటసారులు, నిరుపేదలు అందరు రాసాగారు. ఆమె అన్నానికి క్రమేపీ గిరాకీ పెరిగింది. భోజన సరఫరా వేళలను పెంచుతూ ఈ ప్రక్రియను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. బియ్యం ధర కేజీ రూ. 50 ఉండే ప్రస్తుత రోజుల్లోనూ అవ్వ రూ.25కే భోజనం వడ్డిస్తుండటం గమనార్హం. రైతుబజార్ రైతులకూ ఉపయోగకరమే.. నగరంలోని సీక్యాంప్ రైతుబజార్కు కూరగాయలు తెచ్చే గ్రామీణ రైతులు తెల్లవారు జామునే సరుకులతో బయలుదేరి వస్తారు. వారు చద్దిమూట తెచ్చుకున్నా పాచిపోతుంటుంది. ఇక్కడ అవ్వ హోటల్ ఉందనే విషయం తెలుసుకుని వారూ ఉపయోగించుకుంటున్నారు. పేద సాదలే కాకుండా ఒకసారి రుచి చూసిన వారు మళ్లీమళ్లీ వస్తున్నారు. సేవతో సంతృప్తి: కురువ లక్ష్మీదేవి (అవ్వ) కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట నిజం. మేం కుటుంబ సభ్యులంతా కలిసి అన్నం పెట్టే మహాయజ్ఙాన్ని నడిపిస్తున్నాం. మేమే స్వయంగా నిర్వహించుకుంటాం కాబట్టి మాకు పనివాళ్ల అవసరం ఉండదు. వేతనాల చెల్లింపుల ఖర్చు అసలే ఉండదు. బియ్యం లూజుగా కొంటే ధర ఎక్కువ. మేం ఒకేసారి ఐదారు బస్తాలు కొనేస్తాం. చౌకధరకు లభిస్తాయి. బ్యాళ్లు, నూనె వంటి ఇతర వస్తువులను కూడా టోకులో కొంటున్నాం. లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో (అంటే తక్కువ లాభంతో) పనిచేస్తున్నాం. పేదలకు సైతం కడుపు నింపుకునే అవకాశం కల్పించినందుకు నాకు, మా కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తోంది. ఇటీవలే కంటి ఆపరేషన్ చేసుకున్నా ఇంట్లో ఉండలేకపోయా. నా పేరుతోనే హోటల్ నడుస్తుంది – కాబట్టి పనిలోకి వెంటనే వచ్చేశా. పడిదెంపాడు నుంచి వచ్చా: నాగరాజు, రైతు నేను పండించిన కూరగాయలను పడిదెంపాడు నుంచి తెచ్చా. నేను, నా భార్య ఉదయం నుంచి సాయంత్రం దాకా సీక్యాంప్ రైతుబజార్లో కూరగాయలు విక్రయించుకుని ఊరికి వెళుతుంటాం. మేం తెచ్చే కూరగాయలపై వచ్చే లాభం అంతంత మాత్రమే. హోటల్ భోజనం తినేంత స్థోమత ఉండదు. రోజూ మధ్యాహ్నం అవ్వ హోటల్కు వచ్చి తింటా. నా భార్యకు పార్సిల్ తీసుకెళతా. గోకులపాడు నుంచి వచ్చా: మద్దిలేటి, హమాలీ ఇక్కడ మండీబజార్లో హమాలీ పని చేయడానికి నేను ఎ.గోకులపాడు గ్రామం నుంచి వచ్చా. హమాలీ కార్మికుల ఒప్పందం ప్రకారం మాకు 24 గంటల షిఫ్ట్ ఉంటుంది. ఇరవైనాలుగు గంటల కాల వ్యవధిలో మూడుసార్లు తినాల్సి వస్తుంది. మధ్యాహ్న భోజనం మాత్రం అవ్వ వద్ద తిని. మిగతా వేళల్లో టిఫిన్లతో గడుపుతుంటా. గొందిపర్ల నుంచి వచ్చా: రాజు, హమాలీ నేను హమాలీ పనిచేస్తుంటా. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే లారీల లోడ్ దింపడం, ఎక్కించడం నా పని. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి వస్తా. భోజనం తెచ్చుకుంటే చెడిపోద్ది. అవ్వ హోటల్ నాకు వరం. రూ.25 ఇచ్చి కడుపునిండా భోజనం చేస్తాను. ఇలాంటి హోటల్ లేకపోయింటే మా లాంటి పేదలు ఎనభై రూపాయలు చెల్లించుకోలేక పస్తులుండాల్సి వచ్చేది. -
చుక్కలు చూడాలా? అయితే ఆ హోటల్కి వెళ్లాల్సిందే..!
చుక్కలు చూస్తూ విహారయాత్రను ఆనందించాలని అనుకుంటూన్నారా! అయితే, తప్పకుండా ఈ హోటల్కు వెళ్లాల్సిందే! సుమారు సముద్ర మట్టానికి సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ హోటల్ రాత్రి వేళల్లోనే కాదు, బస కోసం అయ్యే బిల్లులోనూ పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. అలస్కాలోని డాన్ షెల్డన్ యాంఫిథియేటర్ శిఖరంపై ఉన్న ‘షెల్డన్ షాలెట్’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది. ఒక జంట మూడురోజులు బస చేయాలంటే రూ. 26 లక్షలు ఖర్చు చేయాలి. కేవలం పదిమందికి మాత్రమే వసతి కల్పిస్తారు. ఇక్కడకు చేరుకోవాలంటే వాయుమార్గం ఒక్కటే దిక్కు. ఇందుకోసం హోటల్ యాజమాన్యం కొన్ని ప్రైవేటు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు రుచికరమైన ఆహారం, అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపలవేట వంటి పలు వినోద కార్యక్రమాలనూ అందిస్తోంది. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..! ) ఓ కల.. నిజానికి.. ఈ నిర్మాణం వెనుక ఓ చిన్న కథ ఉంది. హోటల్ యజమానులైన రాబర్ట్, కేన్ల తల్లిదండ్రులు ప్రశాంతమైన, అద్భుతమైన ఓ యాత్రను కోరుకున్నారు. ఈ విషయం ఆ అన్నదమ్ములకు వారు మరణించిన తర్వాత తెలిసింది. సుమారు దశాబ్దం పాటు శ్రమించి, హోటల్ నిర్మాణానికి అనుమతి పొందారు. చుట్టూ పర్వతాలు, చక్కటి వాతావరణం, ఎటు చూసినా ప్రశాంతత ప్రతిబింబించేలా చేశారు. అలా వారి తల్లిదండ్రులు కోరుకున్న ఆనందాన్ని కొంతమందికైనా పంచే ప్రయత్నమే ఈ ‘షెల్డన్ షాలెట్’. బాగుంది కదూ! మీరు కూడా మీ జోడీతో జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటే రెడీ అయిపోండి..కాకపోతే, కాస్త ఖర్చు అవుతుంది మరి! -
హోటల్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో విషాదం చోటుచేసుకుంది. బోరజ్ ప్రాంతంలోని ఒక హోటల్లో సిలెండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా హోటల్ అంతా మంటలు వ్యాపించాయి. కాగా, అప్రమత్తమైన హోటల్ యజమాని వెంటనే బయటకు పరుగులు తీశాడు. హోటల్లో కస్టమర్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది డ్రమ్లోని నీళ్లతో మంటలను ఆర్పుతున్నారు. తమకు రోజు అన్నంపెట్టే హోటల్ అగ్నిప్రమాదానికి గురవ్వడం చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
హోటల్లో రహస్యంగా పెళ్లి.. కారులో బలవంతంగా ఎక్కించుకుని..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు.. మంచి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ సైట్లపై ఆధారపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక బిజినెస్గా మారింది. అయితే, కొందరు కేటుగాళ్లు సైట్లలో నకిలీ ఫ్రోఫైళ్లను సృష్టించి ఎదుటివారిని మోసం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా మనం వార్తల్లో చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెల్గాంకు కుంపాత్గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి.. మ్యాట్రిమోనియల్ వేదికగా ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఆమెతో రోజు చాట్ చేసేవాడు. ఆ నిందితుడు తాను.. ఒక ఆర్మీ ఆఫీసర్ అని చెప్పుకున్నాడు. నిందితుడి మాయమాటలు నమ్మిన సదరు యువతి.. అతని మాయలో పడిపోయింది. ఆ తర్వాత.. వీరు గత నవంబరు 18న బెంగళూరులోని ఒక ఆలయంలో కలిశారు. అప్పుడు ప్రశాంత్ పాటిల్ ఆర్మీ దుస్తుల్లో వచ్చాడు. వీరిద్దరు స్థానికంగా ఉన్న ఒక లాడ్జీలో పెళ్లి చేసుకున్నారు. కాగా, వివాహం గురించి ఎవరికి చెప్పనని యువకుడు.. వాగ్దానం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతిని కారులో ఎక్కించుకుని.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. కొన్ని రోజులకు యువతి ఫోన్ను బ్లాక్లో పెట్టేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ప్రశాంత్ పాటిల్ ఆన్సర్ చేయలేదు. దీంతో యువతి తాను.. మోసపోయినట్లు గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రశాంత్ పాటిల్పై 2018 నుంచి పూనా, లాతూర్, అహ్మద్ నగర్లలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుడు.. మ్యాట్రిమోనియల్ వేదికగా చాలా మంది యువతులను మోసం చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడిపై పలుసెక్షన్ల కింద కేసులను నమోదుచేసిన పోలీసులు స్థానిక కోర్టులో హజరుపర్చారు. -
ఇడ్లీ పార్సిల్లో కప్ప కలకలం.. హోటల్ యజమానికి చూపిస్తే..
సాక్షి,తిరువొత్తియూరు(చెన్నై): తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి తీసుకున్న ఇడ్లీ పార్సిల్లో కప్ప కళేబరం ఉండడం సంచలనం కలిగించింది. కుంభకోణం మాదాపురికి చెందిన మురుగేష్ గుండె చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని బంధువు శనివారం సమీపంలోని ఒక హోటల్లో ఇడ్లీ పార్సిల్ తీసుకువెళ్లాడు. ప్యాకెట్ విప్పి చూడగా ఇడ్లీ లోపల కప్ప మృతి చెంది ఉంది. దాన్ని బంధువులు హోటల్ యజమానికి చూపించారు. హోటల్లో ఉన్న ఇడ్లీ పిండిని కింద పడేశారు. హోటల్ యజమాని హోటల్కు తాళం వేసి పరారయ్యాడు. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన సెల్ ఫోన్లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో వైరల్ అయింది. సదస్సు విజయవంతం కొరుక్కుపేట: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వడపళని క్యాంపస్(చెన్నై), లింకన్ యూనివర్సి టీ కాలేజ్ మలేషియా ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజ్మెంట్ (ఐసీఈఏబీఎం 2021) అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా జరిగింది. ఎస్ఆర్ఎం వడపళని క్యాంపస్ సీఈటీ విభాగం డీన్ డాక్టర్ సి.వి.జయకుమార్, కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ సుభశ్రీ నటరాజన్ నేతృత్వం వహించారు. ప్యూర్టో రికో విశ్వవిద్యాలయం యూఎస్ఏ ప్రొఫెసర్ జస్టిన్ పాల్, సీవీఆర్ డీఈచెన్నై డైరెక్టర్ వి.బాలమురుగన్, ప్రొఫెసర్ శ్యామ్ బహదూర్ మేనేజ్మెంట్ టెక్నాలజీపై ప్రసంగించారు. -
పోలీసుల నిర్వాకం.. స్పాసెంటర్ యువతులను బయటకు లాక్కొచ్చి..
చంఢీఘడ్: హర్యానాలోని రేవారిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు.. ఇద్దరు యువతుల పట్ల అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గత గురువారం (నవంబరు25).. కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్ర, అతని మిత్రుడు ధర్మేంద్ర స్థానికంగా ఉన్న స్పా మసాజ్ సెంటర్పై దాడిచేశారు. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువతులను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వారి వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో వారిని ఒక హోటల్కు తరలించారు. ముగ్గురు పోలీసులు కలిసి యువతులపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్పాసెంటర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జమ్ముకశ్మీర్లో చిక్కుకున్న 120 మంది సిక్కోలు యాత్రికులు
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నుంచి సింధు పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసులకు చేదు అనుభవం ఎదురైంది. మైసూర్కు చెందిన అకుల్ ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధులు.. శ్రీకాకుళం స్థానికులను టూరిజం పేరుతో యాత్రకు తీసుకెళ్లారు. ఒక్కొ కపుల్ నుంచి 60 వేలను ట్రావెల్ సిబ్బంది వసూలుచేశారు. ఈ క్రమంలో 120 మంది యాత్రికులు జమ్ముకశ్మీర్లోని కట్రా వద్ద హోటల్కి చేరుకున్నారు. ఆ తర్వాత.. ట్రావెల్ సిబ్బంది యాత్రికులను అక్కడ వదిలేసి పరారయ్యారు. దీంతో హోటల్ వారు డబ్బులు కట్టాలని 120 మంది యాత్రికులు నిర్భందించారు. ప్రతి ఒక్కరు.. తలా పదివేలు కట్టాలంటూ యాత్రికులను హోటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో యాత్రికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రికులలో ఎక్కువగా.. పాలకొండ, నరసన్నపేట గ్రామానికి చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు. -
తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..
సాక్షి, చెన్నై(తమిళనాడు): పవిత్రమైన వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యులు అపవిత్ర చేష్టలకు పాల్పడ్డారు. సాటి మహిళా వైద్యురాళ్లపై అత్యారానికి పాల్పడ్డారు. వీడియో తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చివరికి విధుల నుంచి డిస్మిస్ అయ్యి కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. కరోనా సమయంలో చాలా మంది వైద్యులు స్టార్ హోటల్లో 15 రోజుల క్వారంటైన్ను గడిపారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యురాళ్లు చెన్నై టీ నగర్లోని ఒక స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. అదే హోటల్లో క్వారంటైన్లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్రాజ్ (28) ఇద్దరు మహిళా వైద్యురాళ్ల గదిలోకి ప్రవేశించారు. హతమారుస్తామని బెదిరించి అత్యారానికి పాల్పడ్డారు. వీడియో తీసి పలుమార్లు లైంగికదాడులకు పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నగర పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్.. చెన్నై తేనాంపేట మహిళా పోలీస్లతో విచారణ జరిపించారు. ప్రాథమికంగా నేరం నిర్ధారణ కావడంతో వైద్యులు వెట్రిసెల్వన్, మోహన్రాజ్లను గురువారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా ఆరోగ్య, సంక్షేమశాఖ శుక్రవారం డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..
దెయ్యాల గురించి మనం సినిమాల్లో లేక ఎవరైనా చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్లోని ఓ హోటల్లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే...సోమర్సెట్ కౌంటీలోని ఇల్మిన్స్టర్ ప్రాంతంలోగల ష్రబ్బరీ హోటల్లో అతిథులు అదృశ్య శక్తుల అడుగుల చప్పుడు, తల వెంట్రుకలు లాగడం, రిసెప్షన్లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్లు వినబడుతున్నాయంటూ భయాందోళనకు గురౌతున్నారంటూ.. ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్కు ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు. అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ..." మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమెరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం. అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి మా జుట్టును పైకి లాగినట్లుగా, ఎవరో తమను తాకిన అనుభూతి కలిగింది. అంతేకాదు మేము కొన్ని వికృత ఆకారాలను చూశాం’ అని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజబెత్ కావడం. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) -
ఓవైపు ఎల్ఎల్బీ చదువుకుంటూనే.. పరాటాలమ్మాయ్!!
మగవాళ్లు ఎంతో సులభంగా చేసే పరాటాను డిగ్రీ చదువుతోన్న 23 ఏళ్ల అమ్మాయి అలవోకగా చేసేస్తోంది. హోటల్ నడుపుతోన్న కుటుంబానికి సాయం చేసేందుకు కేరళకు చెందిన అనశ్వర పదేళ్ల వయసు నుంచే పరాటాలు తయారు చేస్తూ, మరోపక్క కాలేజికి వెళ్లి శ్రద్ధగా చదువుకుంటోంది. కేరళలోని ఎరుమెలి గ్రామానికి చెందిన అనశ్వర, ఆల్ అజర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ ఫైనలియర్ చదువుతోంది. తన రోజు వారి సమయంలో సగభాగాన్ని చదువుకు, మరికొంత భాగాన్ని తన కుటుంబం నడుపుతున్న ‘హోటల్ ఆర్యా’’లో పనిచేయడానికి కేటాయిస్తోంది. శబరిమల వెళ్లేదారిలో కురువమూజి జంక్షన్లో ఉన్న ఈ హోటల్ను యాభై ఏళ్ల క్రితం అనశ్వర అమ్మమ్మ, తాతయ్యలు నారాయణి కుట్టప్పన్లు ప్రారంభించారు. వాళ్ల తరువాత గత ముప్ఫై ఏళ్లుగా అనశ్వర అమ్మ, పిన్ని సత్య కుట్టప్పన్లు హోటల్ను నిర్వహిస్తున్నారు. వీరికి హోటల్ పనుల్లో అనశ్వర చేదోడు వాదోడుగా ఉంటోంది. చదవండి: నోరూరించే ఫిష్ కట్లెట్ విత్ రైస్, ఆనియన్ చికెన్ రింగ్స్ తయారీ..కొంచెం వెరైటీగా! పదేళ్ల వయసులోనే అనశ్వర... అమ్మ పరాటాలు ఎలా చేస్తుందో ఆసక్తిగా గమనించేది. పిండిని గుండ్రంగా ఉండలు చేసే టెక్నిక్ను తన కజిన్ నుంచి నేర్చుకుని పరాటాలు ఫర్ఫెక్ట్గా చేయడం మొదలు పెట్టింది. అప్పటినుంచి దాదాపు 13 ఏళ్లుగా రోజుకు దాదాపు రెండు వందల పరాటాలు చేస్తోంది. వేగంగా చక్కగా పరాటాలు చేయడంతో అనశ్వరని అందరూ ముద్దుగా ‘పరాటా’ అని పిలుస్తున్నారు. ఉదయం ఏడున్నర నుంచి అమ్మకు పరాటాలు చేయడంలో సాయంచేసి, తరువాత కాలేజికి వెళ్తుంది. కాలేజి నుంచి వచ్చాక మళ్లీ అమ్మకు భోజనం తయారీలో సాయం చేస్తుంది. హోటల్లో పనిచేయడానికి పనివాళ్లు ఎవరూ లేకుండా కుటుంబ సభ్యులే చూసుకోవడం విశేషం. అనశ్వర పరాటాల గురించి తెలిసిన స్నేహితులు కూడా వాటిని రుచిచూసేందుకు హోటల్కు వస్తుంటారు. పరాటాలు రుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబకి ఆర్డర్లు చేయడం, కస్టమర్ల కోరిక మేరకు డోర్ డెలివరి కూడా చేయడం విశేషం. ‘‘పరాటాలు చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ పని చేయడానికి సిగ్గుపడను. భవిష్యత్లో చెఫ్ అయ్యే ఆలోచనలు ప్రస్తుతానికి ఏమిలేవు. తాతయ్యల కాలం నాటి హోటల్ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్లో ఎల్ఎల్ఎమ్ తర్వాత, పీహెచ్డీ చేస్తాను’’ అని అనశ్వర చెప్పింది. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
వెంటనే అక్కడి నుంచి వెళ్లండి.. యూఎస్, బ్రిటన్ పౌరులకు హెచ్చరిక
కాబుల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ నగరంలోని హోటళ్లలో ఉన్న తమ దేశీయుల్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ఇటీవల ఐసీసీ గ్రూప్ మసీదులో దాడికి పాల్పడిన నేపథ్యంలో ఉగ్రముప్పు పొంచి ఉందని, ఆ ప్రాంతంలోని హోటళ్లకు దూరంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. భవిష్యత్తులోనూ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని.. సెరెనా హోటల్తోపాటు ఆ పరిసరాల్లో ఉంటున్న అమెరికన్లు తక్షణమే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలంటూ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం కూడా.. ‘ ఆ ప్రాంతంలో పెరిగిన ప్రమాదాల నేపథ్యంలో, అక్కడ హోటళ్లలో, ముఖ్యంగా కాబూల్లో సెరెనా హోటల్ వంటివాటిలో అసలు ఉండకూడదని సూచనలు చేసింది. ( చదవండి: Afghanistan: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ ) సెరెనా హాటలోనే ఎందుకంటే కాబుల్లోని సెరెనా హోటల్లో విదేశీయులు ఎక్కువ బస చేస్తుంటారు. గతంలో తాలిబన్లు దీనిపై రెండుసార్లు దాడులకు కూడా పాల్పడ్డారు. 2008లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించారు. అలాగే 2014 అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా మరోసారి దాడి జరగగా.. నలుగురు యువకులు హోటల్లోకి చొచ్చుకెళ్లి, కాల్పులు జరిపారు. ఈ దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పాత్రికేయుడు, అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. అఫ్గన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి, చాలా మంది విదేశీయులు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే కొంతమంది పాత్రికేయులు, సహాయక కార్మికులు మాత్రమే ఇప్పటికీ కాబుల్లో ఉంటున్నారు. తాలిబన్లు అఫ్గన్ను చేజిక్కించుకుని, ఇస్లామిక్ ఎమిరేట్గా ప్రకటించినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నాలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చదవండి: అమేజింగ్ హోటల్! హర్ష్గోయెంకా పోస్ట్ చేసిన హోటల్, ఎలా ఉందో చూడండి -
మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది
ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తింటుంటే బోర్ కొట్టడం ఖాయం. అందుకే రోజూ కొత్త కొత్త వంటలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల సోషల్మీడియలో కొత్త వంటకాల హవా పెరిగిందనే చెప్పాలి. పిజ్జా అంటే తెలియని వాళ్లే కాదు తినని వాళ్లు కూడా ఉండరేమో, అంతలా నచ్చుతుంది మనకి ఆ వంటకం. ఇక ఇందులో బోలెడు వెరైటీలు కూడా ఉన్నాయి. అయితే మనం రెగ్యులర్గా తినే విదేశీ పిజ్జా లాంటిది కాకుండా చిన్న మట్టి కప్పులో అదిరపోయే పిజ్జాను తయారు చేస్తామంటున్నారు సూరత్కు చెందిన ఫుడ్ స్టాల్. తాజాగా ఆ పిజ్జా మేకింగ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అందులో మొక్కజొన్న, టమాటా, వెన్న, సాస్ వంటివి కుండలో వేసి... మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసి... ముంత పిజ్జాను తయారుచేస్తున్నారు. దానికే కుల్లడ్ పిజ్జా లేదా కుల్హడ్ పిజ్జా అనే పేరు పెట్టారు. కుల్లడ్ అంటే మట్టితో చేసిన పాత్ర అని అర్థం. ఈ పిజ్జాని తయారీని ఓ వీడియోలో చిత్రీకరించగా దాన్ని ఆమ్చీ ముంబై ఛానెల్ సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది నెటింట చక్కర్లు కొడుతూ నెటిజన్ల నోరూరిస్తోంది. చదవండి: బిల్ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్ చూసి షాక్ అయ్యాడు! -
బిల్ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్ చూసి షాక్ అయ్యాడు!
సోషల్మీడియాలో యూజర్ల సంఖ్య పెరిగినప్పటి నుంచి కాస్త డిఫెరెంట్గా ఎక్కడ ఏం జరిగినా అది వైరల్గా మారుతోంది. ఈ క్రమంలోనే పలు వీడియోలు, ఫోటోలతో కొందరు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం హోటల్కి వెళ్లడం, ఆర్డర్ ఇస్తే సర్వర్ పుడ్ తీసుకురావడం సహజమే. కానీ ఓ వ్యక్తి బిల్ వెరైటీగా కట్టడంతో అంతే వెరైటీగా ఆ హోటల్ సిబ్బంది ఆర్డర్ తెచ్చి ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తికి ఆకలి వేయడంతో అతనికి సమీపంలోని రెస్టారెంట్కు వెళ్లి సాండ్విచ్ ఆర్డర్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది గానీ బిల్ దగ్గరకు వచ్చే సరికి.. అతని దగ్గర అన్నీ చిల్లర నాణేలే ఉన్నాయి. వాటిని ఇవ్వాలా వద్దా అనుకుంటూనే చివరికి బిల్గా చిల్లరనే ఇచ్చాడు. కాసేపటి తర్వాత సాండ్విచ్ ఆర్డర్ రానే వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేసి చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ సాండ్విచ్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉన్నాయి. చిల్లర నాణేలను బిల్గా కట్టాడని ఆ రెస్టారెంట్ సిబ్బంది కూడా సాండ్విచ్ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆర్డర్ను డెలివరీ చేశాడు. ఆ ఫోటోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. Had a message off one of the lads this morning says “Some lad who works in Jag paid for his scran with all 10p’s this morning. This is how his butty was when he opened it” 🤣🤣🤣 pic.twitter.com/qfsdgW8jP9 Darren Turley (@DarrenTurley5) September 23, 2021 చదవండి: Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..! -
కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ చరిత్రలు చూసే ఉంటాం. ఒళ్లుగగుర్పొడిచే సైకో కిల్లర్స్ కథనాలూ చదివే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పుకునే కథలో కిల్లర్ మనిషి కాదు, ఒక కుర్చీ. అవును.. ఆ కుర్చీలో ముచ్చటపడి కూర్చున్నా.. పంతం పట్టి కూర్చున్నా మరణం మాత్రం తప్పదు. ఎంతటి వీరుడైనా ఆ కుర్చీలో కూర్చుంటే కోరి గండం తెచ్చుకున్నట్లే. ప్రమాదం ఎటునుంచైనా వస్తుంది. కబళించే తీరుతుంది. అందులో కుర్చున్నవారికి ఆ రోజు గడవదు. మరో రోజు ఉండదు. వందలమంది ప్రాణాలు తీసిన ‘బస్బే స్టూప్ చైర్’ చరిత్రను వణికించిన ఓ మిస్టరీ.. 17వ శతాబ్దంలో థామస్ బస్బే అనే ఓ చిల్లర దొంగ అమితంగా ఇష్టపడిన ఈ కుర్చి.. అతడి మరణానంతరం అందులో కూర్చున్నవారి ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఈ కుర్చీ చరిత్ర తెలియాలంటే.. ముందుగా థామస్ బస్బే కథ తెలుసుకోవాలి. ఇంగ్లాండ్లోని నార్త్ యార్క్షైర్లోని త్రిస్క్ అనే ప్రాంతంలో నివాసముండే డానియల్ ఔటీ కుమార్తె ఎలిజిబెత్ ఔటీని పెళ్లి చేసుకున్నాడు థామస్ బస్బే. డానియల్ ఔటీ.. ఓ దొంగ కావడంతో అల్లుడు థామస్ కూడా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. కొంతకాలం సాఫీగా సాగిన బస్బే కాపురంలో విభేదాలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న డానియల్ కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేయాలని.. బస్బే ఇంటికొచ్చాడు. మామగారు వచ్చిన కాసేపటికి ఇంటికి చేరుకున్న బస్బే.. తన మామ తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చోవడం చూసి ఆవేశంతో రగిలిపోయాడు. ఆ కోపంతోనే డానియల్ని చంపేశాడు బస్బే. నేరనిర్ధారణతో 1706లో అతనికి ఉరిశిక్ష ఖరారైంది. దాంతో ఎలిజబెత్.. థామస్ బస్బే ఇంటిని ఖాళీ చేసి.. ఫర్నీచర్ మొత్తం ఓ హోటల్కు అమ్మేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది. ఉరి శిక్షపడిన థామస్ బస్బే చివరి కోరికగా తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చుంటానని కోరాడు. దాంతో ఉరి తీయడానికి ముందు పోలీసులు బస్బేని ఆ హోటల్కి తీసుకెళ్లారు. ఆ కుర్చీలో కాసేపు కూర్చుని చాలా భావోద్వేగానికి గురయ్యాడట థామస్ బస్బే. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం అతడిని ఉరి తీశారు. కథ అక్కడే ఆరంభమైంది. బస్బే చివరి కోరిక తెలుసుకున్న జనం.. ఆ కుర్చీని చూడటానికి హోటల్కి ఎగబడటం మొదలుపెట్టారు. ఆ క్రేజ్ను సొమ్ము చేసుకోవాలని భావించిన హోటల్ యాజమాన్యం.. హోటల్కి ‘ద బస్బే స్టూప్ ఇన్’ అని పేరు మార్చింది. దాంతో హోటల్కి జనాలు క్యూకట్టారు. ఆ కుర్చీలో కూర్చుని బస చేసి.. గొప్పగా చెప్పుకునేవారు. అయితే అలా కూర్చున్నవారంతా ఏదో కారణంతో చనిపోసాగారు. తొలుత ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు సైనికులు ఆ హోటల్లోనే తలదాచుకున్నారు. వారంతా బస్బే కుర్చీలో కుర్చొన్నవారే. ఆ మరునాడే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని కొందరు భావిస్తే.. కొందరు మాత్రం ఇదంతా కుర్చీ పనే అంటూ వాదించారు. అది కుర్చీ కాదు బస్బే ఆత్మ అంటూ నమ్మడం మొదలుపెట్టారు. 1894లో వరుస మరణాలు వారి వాదనను బలపరచాయి. హోటల్ లాభార్జనవైపు నడవడంతో అందులో పబ్ కూడా పెట్టింది యాజమాన్యం. కుర్చీని హోటల్ నుంచి పబ్లోకి మార్చారు. ఆ కుర్చీలో కుర్చుని మద్యం తాగిన ఓ వ్యక్తి మరునాడు హోటల్ వెనుకవైపు స్తంభానికి శవమై వేలాడాడు. అది ఆత్మహత్యని భావించేవారికంటే.. కుర్చీ చంపేసిందనే వారి సంఖ్య రెట్టింపయ్యింది. ఆ ప్రచారం కూడా హోటల్కు లాభాలనే తెచ్చిపెట్టింది. కొందరు ఔత్సాహికులు ఆ కుర్చీతో ‘డేర్’ గేమ్’ ఆడటం మొదలుపెట్టారు. సాహసవీరులు అందులో కూర్చోవడానికి పోటీపడేవారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విందులో ఇద్దరు సైనికులు పందెం కాసి మరీ ఆ కుర్చీలో కూర్చున్నారు. చివరికి వారిద్దరూ కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత నుంచి హోటల్కి చెడ్డపేరు రావడం మొదలైంది. దాంతో హోటల్ యజమాని టోనీ ఎర్న్షా ఇకపై అందులో ఎవరూ కుర్చోకూడదని కుర్చీని హోటల్ సెల్లార్లోకి మార్పించాడు. అయితే, ఓ రోజు హోటల్కు సామాన్లు తీసుకొచ్చిన ఓ డ్రైవర్.. సెల్లార్లో ఉన్న ఆ కుర్చీలో కుర్చున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఎర్న్షా ఆ కుర్చీని స్థానిక త్రిస్క్ మ్యూజియానికి అప్పగించేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుర్చీలో కూర్చోకూడదనే ఉద్దేశంతో కుర్చీని నేలపైన ఉంచకుండా గోడకు వేలాడదీశారు. దాని కింద ఆ కుర్చీ ఎంత ప్రమాదకరమో తెలుపుతూ మొత్తం హిస్టరీ వివరంగా రాశారు కూడా. అందులో ‘కుర్చీని కనీసం ముట్టుకొనే సాహసం కూడా చెయ్యొద్ద’నే హెచ్చరికా ఉంటుంది. మ్యూజియంలో ఉన్నది అసలు కుర్చీ కాదా? అయితే మ్యూజియంలో ఉన్న ఆ కుర్చీ బెస్బే ఉరి సమయంలో కుర్చున్న అసలు కుర్చీ కాదని, ఈ డమ్మీ కుర్చీ కేవలం 138 ఏళ్ల కిందటిదేనని, 1840లో తయారుచేసినదని చెప్పుకొచ్చాడు ఫర్నీచర్ హిస్టోరియన్ ఆడమ్ బావెట్. అతను చెప్పిందే నిజమైతే.. ఎందరో ప్రాణాలు తీసేసిన బెస్బే అసలు కుర్చీ ఏమైనట్లు? హోటల్ నిర్వాహకులు అసలు కుర్చీని దాచిపెట్టారా? అనేది నేటికీ తేలలేదు. చదవండి: ముఖం తేటగా కనిపించాలంటే.. ఈ కొద్దిపాటి మార్పులు అవసరం..! -
హౌస్ కీపర్ బెనర్జీ కెమెరా పెట్టిన రోజే దొరికేసాడు
-
టిఫిన్ హోటల్కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు
చింతలపూడి/ఏలూరు (ఆర్ఆర్ పేట): పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని ఒక చిన్న హోటల్ యజమానికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. పట్టణానికి చెందిన సాయి నాగమణి కొత్త బస్టాండ్ సమీపంలో టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు ఆమె చేతిలో పెట్టడంతో నివ్వెరపోయారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం అధికారులు రంగంలోకి దిగి బిల్లును సరిచేశారు. సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని సరిచేసినట్లు ట్రాన్స్కో ఏఈ శంకర్రావు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినియోగదారునికి కొత్త బిల్లు అందజేస్తామన్నారు. నిర్లక్ష్యంపై చర్యలు.. విద్యుత్ మీటర్లకు రీడింగ్ సమయంలో అప్పుడప్పుడు మీటర్లలో గానీ, మీటర్ రీడింగ్ మెషీన్లో గానీ సాంకేతిక లోపాల కారణంగా బిల్లులో సమస్యలు వస్తాయని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.జనార్ధనరావు స్పష్టం చేశారు. ఈనెల 7న చింతలపూడి సెక్షన్లో గత నెలలో మార్చిన మీటర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారుని బిల్లులో భారీ మొత్తం నమోదైందన్నారు. ఈ విషయం అక్కడి ఏఈ దృష్టికి రాగా బుధవారం తిరిగి రీడింగ్ తీసి బిల్లును సరిదిద్దినట్లు వెల్లడించారు. బిల్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీటర్ రీడర్ ప్రభాకర్ను విధుల నుంచి తొలగించామని, చింతలపూడి ఏఈని సస్పెండ్ చేశామని వివరించారు. ఇవీ చదవండి: మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..
పెద్దాపురం: ఈ రోజుల్లో రూపాయి పెట్టి ఏం కొనుక్కోవచ్చో ఠక్కుమని చెప్పండి.. కాస్త ఆలోచించారు కదూ.. రూపాయి పెడితే ఓ చిన్న చాక్లెట్టో, ఓ బిస్కెట్టో కొనుకోవచ్చు అని అనుకుంటున్నారా? నిజమే.. కానీ ఆ హోటల్లో రూపాయికి 3 చట్నీలతో ఇడ్లీ వస్తుంది. ఏంటి రూపాయికి ఇడ్లీయా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. రాజమహేంద్రవరం–కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆర్బీ కొత్తూరు గ్రామం వస్తుంది. పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ (రాంబాబు), రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్క రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు బజ్జీ కూడా ఒక్క రూపాయే. ఊళ్లోని ఇతర హోటళ్లు అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు. క్రమేపీ సరుకుల ధరలు పెరగడంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. రాంబాబు హోటల్లో రుచికే కాదు శుచికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్ అందిస్తారు. దీనికి నాణ్యత కూడా తోడవడంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ క్యూలో నిలుచుని మరీ టిఫిన్ చేస్తుంటారు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్ను నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్కు వస్తారని తెలిపాడు. వేడివేడిగా బజ్జీలు వేస్తున్న అత్త రత్నావతి నాకు సంతృప్తిగా ఉంది రూపాయి అనే పదానికున్న ప్రత్యేకత వేరు. రూపాయికే వైద్యం అంటారు. రూపాయికే కిలో బియ్యం అంటారు. ఇవన్నీ జనం నోట్లో విపరీతంగా నానుతాయి. అందుకే నేను కూడా నష్టం రానంతవరకూ రూపాయికే ఇడ్లీ అమ్మాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ధర పెంచాలన్నారు. కానీ నాకు నచ్చలేదు. 16 ఏళ్ల కిందట అర్ధ రూపాయితో ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టా. నా భార్య రాణి, అత్త రత్నావతి సహకారంతో ఇప్పటికీ అదే రేటుతో వ్యాపారం కొనసాగిస్తున్నాను. నష్టం లేకుండా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది నాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. – చిన్ని రాంబాబు, హోటల్ వ్యాపారి, ఆర్బీ కొత్తూరు, పెద్దాపురం మండలం ఇవీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు -
రోజుకి 18 గంటలు.. ఆరోగ్యంగా విజయాలు..
పరిశుభ్రమైన ఆహారం... రుచికరమైన ఆహారం.. వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించటం.. రుచి నచ్చిందా లేదా అని ప్రశ్నించటం.. కస్టమర్ల సూచనలు, సలహాలు పాటించటం.. వీటి వల్లే బ్రాండింగ్ వస్తుందనేది అనురాధ రావిరాల నమ్మకం.. అక్కడకు వచ్చినవారు కడుపునిండా హాయిగా భోజనం చేసి వెళ్తారు.. ఈ కారణాలే ఆమెను ఉత్తమ ఎంటర్ప్రెన్యూర్ స్థాయికి తీసుకువెళ్లాయి.. అనురాధ రావిరాల హైదరాబాద్ కోకాపేట్లో ఉంటున్నారు. తండ్రి ఆర్బి రాజు ఆర్కిటెక్ట్, తల్లి కుసుమ ఎంఏ పొలిటికల్ సైన్స్. వారి నుంచి మంచి చదువు చదవగలిగారు అనురాధ. ఇంటీరియర్ డిజైనింగ్, ఆ తరవాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేశారు. ఇంటీరియర్ డిజైన్ చేస్తూ కెరీర్ ప్రారంభించారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలనే కోరిక బలంగా ఉండేది. ఇంటీరియర్ డిజైన్ కాకుండా ఇంకా ఏదైనా చేయాలనిపించేది. అమ్మ చాలా రుచిగా వంట చేసేది. అమ్మతో పాటు అప్పుడప్పుడు నేను కూడా వంట చేసేదాన్ని. నాకు సంప్రదాయ వంటలంటే చాలా ఇష్టం. ఆ అభిరుచి కారణంగానే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాను’’ అంటున్న అనురాధ, చేసేది ఒక్క వంటకమైనా, అది పూర్తిస్థాయిలో రుచిగా, సంప్రదాయబద్ధంగా ఉండాలంటారు. చదవండి: Travel Tips: ప్రయాణించే సమయంలో ఈ విషయాలు మర్చిపోకండి! విజయానికి కారణం.. రెండు దశాబ్దాల కిందట వేవ్రాక్లో అమృత్సరీ పేరున పూర్తి శాకాహారం అందచేయటంతో ఫుడ్ బిజినెస్లో తొలి అడుగు వేసి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు ఫుడ్ సప్లయి చేశారు. నాన్వెజ్ ఫుడ్ సప్లయి కూడా ప్రారంభించారు. ‘‘డిమాండ్కి అనుగుణంగా సప్లయి చేయటం కోసం నార్సింగ్ మెయిన్ రోడ్ మీద సెంట్రల్ కిచెన్ను, చిన్న రెస్టారెంట్ను ప్రారంభించి, ఔట్లెట్ సెంటర్లను పెంచాను’’ అంటున్న అనురాధకు తొలి అడుగులో అపశృతి దొర్లినా, త్వరగానే కోలుకున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ప్రాంభించి, ఇప్పుడు మంచి టర్నోవర్ స్థాయికి ఎదిగారు. ఫుడ్ ఈజ్ ఇమోషనల్... నాణ్యమైన ఆహారం అందిస్తూ, దాని ద్వారానే బ్రాండింగ్ తెచ్చుకోవాలంటారు అనురాధ. ‘‘ఫుడ్ ఈజ్ ఇమోషనల్. ఏ పదార్థమైనా నోట్లో పెట్టుకోగానే వెంటనే అనుభూతి చెందుతారు’’ అంటున్న ఆమె, ఒక కస్టమర్ కోసం, వంటగదిలో స్వయంగా గరిటె పట్టుకున్నారు. గోంగూర పచ్చడి, పూర్ణాలు, బొబ్బట్లు, పులిహోర... అన్నీ అందించారు. ‘‘కాంప్లిమెంటరీగా పూతరేకులు కూడా ఇచ్చాం’’ అంటూ ఆనందంగా చెబుతారు అనురాధ. రోజుకి 18 గంటలు.. అన్నీ స్వయంగా చూసుకోగలిగితేనే వ్యాపారంలో రాణించగలమని నమ్ముతారు అనురాధ. ‘‘బిజినెస్లో ఇమోషన్స్ ఉండకూడదు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేస్తే విజయం సాధించటం తేలిక’’ అంటున్న అనురాధ.. ఇండిగ్రాండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అందిస్తున్నారు. సర్టిఫైడ్ ఇంటీరియర్ డిజైనర్గా ఆర్బి రాజు అండ్ అనురాధ అసోసియేట్స్ పేరున డిజైనింగ్ చేస్తున్నారు. హాస్పిటాలిటీ హోటల్స్కి బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి ఎదిగారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ మొహాలీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సుకి అప్లయి చేసిన కొన్ని వేల మందిలో సెలక్ట్ అయ్యారు. ‘‘మేం సెలక్ట్ కావాలంటే చాలా అడ్డంకులు దాటాలి. ఇంటర్వ్యూ స్కాలర్లీగా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. కన్ను ఆర్పటానికి కూడా సమయం దొరకదు. కోర్సు పూర్తి చేసి వెళ్లే ముందు వారు, ‘మా దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు, మీ హోటల్కి వచ్చిన వాళ్లని ఏ విధంగా గౌరవిస్తావు’ అని వారు వేసిన ప్రశ్నలకు మా సమాధానం చెప్పాలి. బిజినెస్ ఒక్కరితో, ఒక్కరోజులో ముగిసేది కాదు. మున్ముందు ఎలా విస్తృతపరుస్తామనే విషయాలను కూడా వివరంగా రాయాలి. ఫైనాన్సియల్ ప్రొజెక్షన్ కూడా ఇవ్వాలి. ఇంత కష్టపడిన తరవాతే సర్టిఫికేట్ వస్తుంది. – అనురాధ, ఉత్తరి హోటల్ అధినేత చదవండి: బీరకాయతో నాన్వెజ్.. చికెన్, రొయ్యలు, ఖీమా -
న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ద్వారక ప్రాంతంలోని సెక్టార్-8లోని హోటల్ కృష్ణలో అగ్నిప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్గా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం, ఈరోజు (ఆదివారం) ఉదయం 8 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి మంటలు చెలరేగాయి. కాసేపటికే ఆ ప్రదేశమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు, ఫైరింజన్ వారికి సమాచారం అందించారు. కాగా, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరిని దీపక్గా గుర్తించారు. గాయపడినవారిలో ఒక మహిళ ఉన్నట్లు గుర్తించారు. వీరిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని దీన్దయాళ్ ఆసుపత్రికి తరలించారు. ఈ భవనం.. జార్ఖండ్లోని రాంచీకి చెందిన సిద్దార్థ్, కరుణకు చెందినదిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రూమ్లోకి వెళ్లి మత్తు ఇంజక్షన్ ఎక్కించుకుని..
సాక్షి,విజయవాడ: మత్తు ఇంజక్షన్ ఎక్కించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజమండ్రిలోని రాజీనగరానికి చెందిన పెద్దింటి రాహుల్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటినుంచి అతను తన పిన్ని వద్ద ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 31న నగరానికి వచ్చి పీఎన్బీఎస్ సమీపంలోని బాలాజీ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం లాడ్జి సిబ్బంది అతని రూమ్ లోకి వెళ్లి చూడగా కదలకుండా ఉండటాన్ని చూసి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతదేహం పక్కనే మత్తు ఇంజక్షన్, సిరంజ్ లభించడంతో మత్తు ఇంజక్షన్ ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వైరల్: పనికి కుదిరిన కోతి.. పాత్రలు తలతల?
కొన్నిసార్లు కోతుల చేష్టలు మనుషులను మించి ఉంటాయి. కోతులు గుంపులుగా ఉండి అల్లరి చేస్తే.. అంతకు మించిన హంగామా మరోటి ఉండదనిసిస్తుంది. కొంటె పనులు చేసినపుడు చాలా మంది కోతి చేష్టలేంటి? అంటూ చమత్కరిస్తుంటారు. అయితే తాజాగా ఓ కోతి టీ స్టాల్లో పాత్రలు శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో ‘‘అందరూ కష్టపడాలి’’ అనే క్యాప్షన్తో షేర్ చేయగా.. 2.5 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అంతే కాదండోయ్ 2 లక్షలకు పైగా లైక్ కొట్టి.. వేల మంది కామెంట్ చేస్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్లో “అమ్మీ జాన్ కెహతి థి కి కోయి భీ ధండా చోటా నహి హోతా, ఔర్ ధండే సే బాదా కోయి ధరం నహీ హోటా”. అంటూ వచ్చే డైలాగ్ మరింత ఆకర్షణగా నిలుస్తోంది. కోతి పాత్రలు కడిగి తర్వాత మళ్లీ వాసన చూసి చెక్ చేసుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘పనికి కుదిరిన కోతి.. పాత్రలు తలతల?’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్.. జీతం ఎంతో చెప్పాలి.’’ అంటూ చమత్కరించాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.. కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by memes | culture | comedy (@ghantaa) -
అయ్యో ఎంత కష్టం: బాబా కా దాబా యజమాని ఆత్మహత్యాయత్నం
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మొదటి దశలో లాక్డౌన్ ఆంక్షలు సందర్భంగా వార్తల్లో నిలిచిన బాబా కా దాబా యజయాని కాంతా ప్రసాద్ అనూహ్యంగా ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. 81 ఏళ్ళ వయసులో కూడా నిరంతరం కష్టపడుతున్న ఆయనకు తీరని నష్టాలు వేధించడంతోనే నిద్రమాత్రలు సేవించి, ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీన్నిగమనించినకుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇటీవల పెట్టుకున్న రెస్టారెంట్ నష్టాల్లో మునిగిపోవడంతో వీరు మళ్లీ తన పాత హోటల్ వైపే మొగ్గారు. అయినా కరోనా ఆంక్షలు, హోటల్ నష్టాలను భరించలేక తనువు చాలించాలని భావించిన వైనం ఆందోళన రేపింది. తన తండ్రి నిద్రమాత్రలు తీసుకున్నారని కాంతాప్రసాద్ కుమారుడు కరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారి అతుల్ ఠాకూర్ వెల్లడించారు. కాగా కాంతా ప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్లో రోడ్డు పక్కన చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్ గౌరవ్ వాసన్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, అది దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. దీంతో పలువురు మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు రూ.5 లక్షల అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచినా కథ మళ్లీ మొదటి కొచ్చింది. కస్టమర్ల ఆదరణ లేక నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. మళ్లీ పాత హోటల్నే నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలోనే ఈ ఘటన చోట చేసుకుంది. -
బిర్యానీ ఇవ్వలేదని కరెంట్ కట్
అమీర్పేట: కరెంటు బిల్లులు చెల్లించినా బిర్యానీ ఇవ్వడం లేదన్న కోపంతో హోటల్కు కరెంటు సరఫరాను నిలిపివేశారని బల్కంపేటలో గల క్రిస్టల్ బావర్చి హోటల్ నిర్వా హకుడు ఆరోపించారు. హోటల్కు సంబంధించి మూడు కరెంటు మీటర్లు ఉన్నాయి. ఒక మీటరుకు రూ. 39,566, రెండో మీటర్కు రూ. 4,529, మూడో మీటర్కు రూ. 9,682ల కరెంటు బిల్లు వచ్చింది. పై రెండు మీటర్లకు సంబంధించి బిల్లులు 25న చెల్లించగా మూడో మీటర్ బిల్లును 29న చెల్లించామని హోటల్ నిర్వాహకుడు సైయ్యద్ హస్మతుల్లా ఖాద్రి తెలిపారు. ఉదయం కరెంటు సిబ్బంది సుధీర్కుమార్, రాజు, జీఎన్ రావులు హోటల్కు వచ్చి బిల్లులు చెల్లించని కారణంగా కరెంటును కట్ చేస్తున్నామని తెలిపారు. ఫోన్ పే ద్వారా రెండు బిల్లులు చెల్లించామని, ఓ బిల్లు ఈ రోజే చెల్లించామని, ఫోన్లో చెల్లించినట్లు ఉన్న స్క్రీన్ షాట్ను కూడా చూపించారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా మూడు మీటర్లకు కరెంటును కట్ చేశారు. హోటల్ యజమాని వచ్చే వరకైనా ఆగాలని హోటల్ సిబ్బంది నవీద్ వేడుకోగా మీ సార్... వచ్చేదాక ఆగాలా అంటూ కరెంటు కట్ చేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఒక మీటర్కు ఆలస్యమైతే మూడు మీటర్లకూ కట్ చేస్తారా.. మూడో మీటర్ ఒక్క దానికి బిల్లు చెల్లింపు ఆలస్యం జరిగితే మూడు మీటర్లకు విద్యుత్ సరఫరా ఎలా నిలిపివేస్తారని యజమాని ఖాద్రి వాపోయాడు. ఉదయం నుంచి కరెంటు లేకపోవడంతో ఆహార పదార్థాలు అన్ని పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ( చదవండి: కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే.. )