Kerala Floods 2018
-
ఆ మూవీకి తెలుగులో ఊహించని రెస్పాన్స్!
కేరళలో రీసెంట్ టైమ్స్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన '2018'. ఈ చిత్రం ఇవాళే తెలుగులో విడుదలైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ను హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోనూ ప్రదర్శించారు. ప్రెస్ స్క్రీనింగ్, సెలబ్రిటీ ప్రీమియర్కు అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్లో ప్రేక్షకుడిని సీటులోనే కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటోంది. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి) కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోందని, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఇది సిసలైన కేరళ స్టోరీ.. పది రోజుల్లో వందకోట్ల క్లబ్లోకి..!
భారత చలన చిత్ర పరిశ్రమల్లో మాలీవుడ్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చిన్న కథలు.. విలేజ్ డ్రామాలే అయినా సూపర్ సక్సెస్ అవుతుంటాయి. అయితే గత కొంతకాలంగా అక్కడి కలెక్షన్ల విషయంలో వరుసగా చిన్నాపెద్ద చిత్రాలు నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘2018’ పెనుసంచలనం సృష్టించింది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. సుమారు 15 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ‘2018’.. మే 5వ తేదీన రిలీజ్ అయ్యింది. కేవలం పదిరోజుల్లోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదీ పాన్ ఇండియా సినిమాగా కాదు.. కేవలం మలయాళంలోనే రిలీజ్ అయ్యి మరి. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు అక్కడి ఆడియొన్స్. జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో వచ్చిన ‘2018’ చిత్రం.. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు ఈ లిస్ట్లో ఉన్నా ఫుల్ రన్లో ఆ ఫీట్ను సాధించాయి. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్ జూడ్ ఆంథనీ. సామాన్యుడు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్. 2018.. ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్. క్యాప్షన్కు తగ్గట్లే కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో అందరూ హీరోలే. కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా చిత్ర కథ నడుస్తుంది. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలం అయిన ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా సాగాయి?. వాటిలో అక్కడి ప్రజలు ఎలా భాగం అయ్యారు? చివరికి ఏం జరుగుతుందనేది ఈ చిత్ర కథ. రెండున్నర గంటలపాటు సాగే కథలో.. ద్వితియార్థం సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. ప్రేమ, ధైర్యం, సాహసం, త్యాగాలు.. రకరకాల భావోద్వేగాలను తెరపై అద్భుతంగా పండించడంతో ఈ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ అనూప్ పాత్రలో అలరించాడు. బిజీ గవర్నమెంట్ ఉద్యోగి చివరికి వరదల్లో చిక్కుకున్న తన కుటుంబం కోసం తాపత్రయపడే షాజీ రోల్లో కున్చాకో బోబన్, ఎన్నారై రమేష్గా వినీత్ శ్రీనివాసన్, నిక్సన్ పాత్రలో అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి పేరున్న ఆర్టిస్టులు మాత్రమే కాదు, సినిమాలో చిన్నపాత్ర కూడా సినిమా ద్వారా ప్రభావం చూపుతుంది. -
‘కేరళకు లేవన్నారు.. స్టాచ్యూకి రూ. 3000 కోట్లు ఎక్కడివి’
బెంగళూరు : వరదలతో అతాలకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పీఎం విగ్రహం నిర్మాణం కోసం మాత్రం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇలాంటి విచక్షణ లేని నాయకున్ని మీరు ఎక్కడైనా.. ఎప్పుడైనా చూశారా అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడాన్ని తప్పు పడుతూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. కేరళను వరదలు ముంచేత్తినప్పుడు ముందు కేవలం 100 కోట్ల రూపాయలు.. ఆపై రూ. 500 కోట్ల సాయాన్ని ప్రకటించిన మోదీ సర్దార్ పటేల్ విగ్రహం కోసం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విచక్షణ జ్ఞానం ఉన్న నాయకుడేవరైనా ఇలాంటి పని చేస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. STATUE or HUMAN BEING.. Dear TROLLS..and FAKE NEWS FACTORY OWNERS who distorted what I said in an interaction on GOD.. WOMEN n RELIGION.... will you try DISTORTING this one too OR does it not serve your purpose ..#justasking pic.twitter.com/MT9360f8Qf — Prakash Raj (@prakashraaj) November 9, 2018 -
రెడ్అలర్ట్ : కేరళలో మలంపుజ డ్యామ్ గేట్ల ఎత్తివేత
కొచ్చి : కేరళను మరోసారి వరద భయం వెంటాడుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలతో ఇరు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పలక్కాడ్లోని మలంపుజ డ్యామ్ గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. మలంపుజ డ్యామ్కు చెందిన నాలుగు గేట్లను 9 సెంమీ చొప్పున అధికారులు ఎత్తివేశారు. ఐఎండీ సూచనల నేపథ్యంలో మూడు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల ఏడున రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈనెల 5 నాటికి మత్స్యకారులు సురక్షిత తీర ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం కోరిందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. -
కేరళకు మరో ప్రళయ హెచ్చరిక
తిరువనంతపురం : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో ప్రళయ భయం వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శనివారం, ఆదివారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యం కేరళ సీఎం పినరయి విజయన్ తీరంలోని మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీనిపై కేంద్రంతో ఇప్పటికే చర్చలు జరిగిన సీఎం.. వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాలకు ఎవ్వరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని, రెడ్ అలర్ట్ ప్రకటించిన మూడు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కాగా ఇటీవల సంభవించిన వరద బీభత్సం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రజలకు వర్ష సూచన భయాందోళనకు గురిచేస్తోంది. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షలకు 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. -
కథగా కేర ళ ట్రాజెడీ
మొన్నే వచ్చిన కేరళ వరదల విషాదం నుంచి కేరళ ఇంకా కోలుకోలేదు. ఆ వరదలను ఎదుర్కోడానికి ఒక్క తాటిపై నిలిచారు కేరళ వాసులు. ఈ ప్రకృతి బీభత్సాన్ని విజువల్గా చూపించడనికి సిద్ధమయ్యారు మలయాళ దర్శకుడు జూడ్ ఆంటొనీ జోసెఫ్. ‘2043 ఫీట్’ అనే టైటిల్ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా తీయడానికి గల కారణాలను దర్శకుడు వివరిస్తూ– ‘‘ఈ వరదల మీద ఇన్స్పైరింగ్గా ఏదైనా వీడియో తీయమని స్వచ్ఛంద సేవా సంస్థలు అడగ్గా ఈ ఐడియా వచ్చింది. భావితరాలకు చెప్పడానికి ఎన్నో ప్రేరణ తెప్పించే కథలు ఉన్నాయి. ఇందులో సహాయార్థాల నిమిత్తం పాల్గొన్న ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలే. ఈ సినిమాకు చాలా వీయఫ్ఎక్స్ పని ఉంటుంది. ఆల్రెడీ ఓ హాలీవుడ్ సంస్థతో మాట్లాడుతున్నాం’’ అని పేర్కొన్నారు. జూడ్ ఇది వరకు ఇరాక్లో జరిగిన నర్సుల కిడ్నాప్స్ ఆధారంగా ‘టేకాఫ్’ అనే చిత్రాన్ని రూపొందించారు. -
జనం ఆర్తనాదాలు చేస్తూ చస్తుంటే...
న్యూఢిల్లీ: వరద బీభత్సంతో ధ్వంసమైన కేరళను పునర్నిర్మించేందుకు ఆ రాష్ట్రంలోని మూడు ప్రధానమైన ఆలయాల బంగారం, సంపదను వినియోగించాలని వాయవ్య ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సలహా ఇచ్చారు. కేరళలోని పద్మనాభ స్వామి, శబరిమల, గురువాయూర్ ఆలయాల అధీనంలోని బంగారం, ఆస్తులను కలిపితే దాదాపు రూ.1లక్ష కోట్లకుపైగా ఉంటుందని, కేరళకు జరిగిన రూ.20వేల కోట్లకంటే ఈ మొత్తం చాలా ఎక్కువని ఆయన లెక్కకట్టారు. ‘ఓ వైపు జనం ఆర్తనాదాలు చేస్తూ చస్తుంటే, మరోవైపు ఆలయాలకు రూ.లక్ష కోట్ల సంపద ఉండి ఏం ఉపయోగం?’ అంటూ ఉదిత్ ట్వీట్ చేశారు. ఆలయాల సంపదను వాడాలన్న తమ డిమాండ్కు ప్రజలు మద్దతు పలకాలని ఆయన కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గత నెలలో కేరళలో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ భారీఎత్తున పునర్నిర్మాణపనులు జరుగుతున్నాయి. కేరళకు తక్షణసాయంగా ప్రధాని మోదీ రూ.600 కోట్లు మంజూరుచేయగా, పలు రాష్ట్రాలు, సంస్థలు, లక్షలాది మంది ప్రజలు తమ వంతు సాయమందించారు. రూ.20వేల కోట్ల నష్టం జరిగిందని, కనీసం రూ.2,000 కోట్ల సాయం చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రాన్ని కోరడం తెల్సిందే. -
కేరళలో నదులెండిపోతున్నాయి..!
తిరువనంతపురం: ఇటీవల సంభవించిన భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నీటిమట్టం పడిపోయింది. చాలా జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గిపోయి బావులు ఎండిపోయాయి. నేలను గుళ్లబారేలా చేసి రైతన్నలకు సాయపడే వానపాముల జాడే లేకుండా పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి తలెత్తడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ మండలిని ఆదేశించారు. నీటిమట్టం తగ్గిపోవడంపై రాష్ట్ర జనవనరుల నిర్వహణ సంస్థ, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మలబార్ బొటానిక్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్లు అధ్యయనం చేస్తాయని విజయన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ మేరకు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 491 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
చిన్నసాయం.. పెద్దమనసు
కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో వేలాది జీవితాలు కొట్టుకుపోయాయి. బతికి బట్టకట్టిన వారికి జీవనం ప్రశ్నార్థకమైంది. ఆ భీకర ప్రకృతి విలయం.. దైనందిన జీవితాల్లో కల్లోలం రేపింది. దేశానికి దక్షిణంలో వచ్చిన ఆ వరదల తాకిడి తూర్పున ఉన్న జార్ఖండ్ మహిళలను కదిలించింది! దేశవ్యాప్తంగా.. చేతినిండా డబ్బున్న వాళ్లు ఆర్థిక సాయం చేస్తున్నారు. రోజు కూలితో జీవించే తమకు అంతంత డబ్బు జమ చేయడం సాధ్యమైన పని కాదు. ఆ డబ్బును బాధితులకు పంపించడం ఎలాగో కూడా చేతకాదు. అయినా సరే.. తాము చేయగలిగిన ఉడుత సాయమైనా చేయాలనుకున్నారు జార్ఖండ్ మహిళలు. తాము తయారు చేస్తున్న చెప్పులతోనే కేరళ వరద బాధితుల కాళ్లకు రక్షణ కల్పించినా చాలనుకున్నారు. అంతే. వెయ్యి జతల రబ్బరు స్లిప్పర్స్తో ఓ లారీ జార్ఖండ్ నుంచి బయలుదేరింది. దాయాలన్నా దాగని సాయం! జార్ఖండ్ రాష్ట్రం, దుమ్కా జిల్లాలో బాలిజోర్ గ్రామం. ఆ గ్రామంలో మూడు వందల మంది మహిళలు బాలి ఫుట్వేర్ కంపెనీలో పని చేస్తారు. వారికి రోజు కూలి 250 రూపాయలు. ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు సహాయంగా ఇవ్వాలనుకున్నారు. ఆ వేతనానికి వచ్చినన్ని చెప్పుల జతలను సహాయార్థం సమకూర్చారు. వాళ్లు తయారు చేస్తున్న ఫుట్వేర్ కంపెనీలో ఒక చెప్పుల జత ఖర్చు 70 రూపాయలవుతుంది. శ్రామికుల వేతనం కాకుండా కేవలం మెటీరియల్ ఇతర ఖర్చులు మాత్రమే. మొత్తం 75 వేల రూపాయల డబ్బుతో వెయ్యి జతల చెప్పులను కేరళకు పంపించారు. నిజానికి ఈ మహిళలు పేరు కోసం తాపత్రయపడకుండా నిస్వార్థంగా సహాయం చేశారు. కానీ సహాయం పొందిన వాళ్లకు తమకు సహాయం చేసిన వాళ్ల ఊరి పేరును చెప్పులే చెబుతున్నాయి. బాలిజోర్ పేరు మీదనే బాలి ఫుట్వేర్ కంపెనీకి ఆ పేరు పెట్టారు. ఉన్నదాంట్లోనే కొంత ‘రిలీఫ్’ ‘‘కేరళలో ఇలా జరిగిందని వార్తల్లో చూసి తెలుసుకున్నాం. ‘ఎంత ఘోరం, వాళ్ల పరిస్థితి ఏమిటి, తిరిగి వాళ్ల బతుకులు తేరుకునేదెలా’ అని పనిచేస్తూ మాట్లాడుకునే వాళ్లం. పెద్దవాళ్లు ఎవరెవరు ఎంత సహాయం చేస్తున్నారో కూడా మా కబుర్లలో తెలుస్తుండేది. రిలీఫ్ ఫండ్కి డబ్బు ఇచ్చేటంత పెద్ద ఉద్యోగులం కాదు. రోజుకు 250 రూపాయలు వస్తే... అందులోనే ఇంట్లో తిండి గడవాలి, కొంత దాచుకోవాలి. మేమే పేదవాళ్లం, మాదే పేదరికం అనుకుంటుంటే, వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ల పరిస్థితి ఇంకా దారుణం కదా. వాళ్లు మా కంటే దయనీయమైన స్థితిలో ఉన్నారు. అందుకే మనం తయారు చేస్తున్న చెప్పులనే వారికిద్దామని అందరం ఒక్కమాట మీదకు వచ్చాం. మా కంపెనీకి మెటీరియల్ ఇచ్చే అధికారులతో ఇదే మాట చెప్పాం. చెప్పులను వరద బాధితులకు పంపే ఏర్పాట్లు జిల్లా అధికారులే చేశారు’’ అని చెప్పింది బాలి చెప్పుల కంపెనీలో పనిచేస్తున్న మిథియా తాదు. ఆ కార్మికుల్లో చురుకైన మిథియా, మంజుదేవి, మోనికా తాదుతోపాటు మిగిలిన వాళ్లంతా ముందుకొచ్చారు. దాంతో కేరళకు సాయం అందింది. సమాజం స్వార్థపూరితంగా మారిపోయింది, మనుషుల్లో మానవత్వం లోపించింది, కాఠిన్యం రాజ్యమేలుతోంది... ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. ఇన్నింటి మధ్య కూడా ఎదుటి వారికి కష్టం వస్తే అది తమ కష్టంగా స్పందించే సున్నితమైన మనసులు, చలించే స్నేహపూరిత హృదయాలు ఉన్నాయి. మరేం ఫర్వాలేదు.. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది అనే భరోసానిస్తున్నారు ఈ మహిళలు. – మంజీర -
రియల్ హీరో ఈ ఐఏఎస్ అధికారి
తిరువనంతపురం : కేరళ సహాయ శిబిరాల వద్ద కొన్ని రోజులుగా ఓ యువకుడు మూటలు మోస్తూ.. అక్కడివారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సహాయక శిబిరాలకు వచ్చిన వస్తువులను ట్రక్కులనుంచి కిందకు దించి వాటిని అవసరమైన వారికి చేరుస్తున్నాడు. గత ఎనిమిది రోజులుగా అతడు ఇవే పనులు చేస్తున్నాడు. తొమ్మిదో రోజు ఆ వ్యక్తిని కాస్తా పరిశీలనగా చూసిన ఓ అధికారి ఆశ్చర్యంతో ‘సార్.. మీరు ఏంటి ఇక్కడ, ఇలా..?’ అని అడిగాడు. అంతవరకూ అతన్ని తమలాంటి ఓ సాధరణ వాలంటీర్ అనుకున్న వారికి ఆ వ్యక్తి గొప్పతనం గురించి తెలిసింది. దాంతో ఆ వాలంటీర్తో సెల్ఫీ దిగడానికి వారంతా ఎగబడ్డారు. మూటలు మోసే వ్యక్తితో సెల్ఫీ దిగడం ఏంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే మూటలు మోస్తున్న ఆ వాలింటీర్ ఓ జిల్లా కలెక్టర్. కలెక్టర్ ఏంటి.. ఇలా మూటలు మోయడమెంటీ అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్టోరి చదవండి. కేరళకు చెందిన కన్నన్ గోపీనాథన్(32) 2012 బ్యాచ్కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి. శిక్షణ అనంతరం అతనికి కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో కేరళలో సంభవించిన వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కేరళను ఆదుకోవడానికి దేశమంతా తరలి వచ్చింది. అందులో భాగంగా పలు రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయాన్ని అందించాయి. అలా సాయం చేసిన వాటిలో దాద్రా నగర్ హవేలీ కూడా ఉంది. ప్రస్తుతం అక్కడే కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథన్ దాద్రా నగర్ హవేలీ తరపున కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించేందుకు వచ్చాడు. ఆ పని ముగిసిన తర్వాత తిరువనంతపురం నుంచి తన సొంత ఊరు పుతుపల్లికి వెళ్లాల్సిన గోపీనాథన్ కాస్తా వరదల ధాటికి తీవ్రంగా నష్టపోయిన చెంగన్నూర్కి వెళ్లి సహాయక శిబిరాల్లో ఉంటూ వాలంటీర్గా బాధితులకు సేవ చేయడం ప్రారంభించాడు. ఇలా 8 రోజులు గడిచిపోయింది. అనంతరం ఓ అధికారి గోపీనాథన్ని గుర్తుపట్టడంతో అతని గురించి అక్కడివారికి తెలిసింది. దీంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వాలంటీర్గా పని చేయడం గురించి గోపీనాథన్ మాట్లాడుతూ.. ఇక్కడి అధికారులు పడిన శ్రమతో పోలిస్తే.. నేనేం గొప్ప పని చేయలేదని వినయంగా చెప్పుకొచ్చాడు. నన్ను హీరో చేయొద్దు, క్షేత్ర స్థాయిలో ఇక్కడెంతో మంది సాయం చేస్తున్నారు. వారే రియల్ హీరోలు. ఇదే స్ఫూర్తితో అంతా కష్టపడితే.. త్వరలోనే కేరళ తన పూర్వ వైభవాన్ని పొందుతుందని గోపినాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కలాలతో కలలకు ఊపిరి..!
కేరళ విద్యార్థులపై వరదలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చెరిపేసే ఈ కార్యక్రమం వినూత్నమేకాదు అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. భారీ వర్షాలు, వరదల తదనంతర పరిణామాల్లో భాగంగా ఆ విద్యార్థులు తమకిష్టమైన చదువును కొనసాగించేందుకు భరోసా ఇస్తోంది. వరదనీళ్లలో వారు కోల్పోయిన క్లాస్ పుస్తకాలు, వివిధ సబ్జెకుల వారీగా ఇప్పటికే పూర్తయిన క్లాస్లకు నోట్స్లు (స్టడీమెటీరియల్) రాసి అందించడం ద్వారా వారి చదువులకు ఊపిరిపోస్తున్నారు. అనాథశరణాలయానికి చెందిన పిల్లలిచ్చిన సలహాలు, సూచనలతో కాలికట్కు చెందిన ‘ఇన్క్యుబేషన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పనిని భుజానవేసుకుంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువు నష్టపోకుండా ఉండేందుకు వరదల్లో వారు కోల్పోయిన క్లాస్ నోట్స్ను అందించేందుకు నడుం బిగించారు. ముందుగా వివిధ తరగతుల విద్యార్థులకు సంబంధించిన క్లాస్నోట్స్ రాసివ్వాలంటూ సామాజికమాధ్యమాల ద్వారా మెసేజ్ పంపించారు. అది వైరల్గా మారింది. ఈ ఆలోచననను వ్యక్తులు, కంపెనీలు, విద్యాసంస్థలు స్వాగతించాయి. వివిధ తరగతులు,సబ్జెక్టుల వారీగా సోషల్ మీడియా వేదికగా పీడీఎఫ్ ఫార్మాట్లో నోట్స్ పంపిణీలోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి ఇవి ఫార్వర్డ్ అయ్యాయి. దీనిపై ఇతరజిల్లాల నుంచి స్పందించే వారి సంఖ్య పెరిగింది. ఒక్క కేరళకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఈ వినూత్న అభ్యర్థన చేరుకుంది. ఫలితంగా వేలాది పుస్తకాలు గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులకు పంపిణీ అయ్యాయి. దాదాపు రెండువారాల పాటు కొనసాగించిన క్యాంపెయిన్కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ వివిధ జిల్లాల్లో దాదాపు పదివేలకు పైగా నోట్పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసినట్టు ‘ఇన్క్యుబేషన్’కు చెదిన నాబీల్ మహ్మద్ తెలియజేశారు. ‘జిరాక్సో, ప్రింట్ చేసిన నోట్ పుస్తకాల కంటే చేతిరాతతో రాసిన పుస్తకాల ద్వారా ప్రేమాభిమానాలు పంచాలనేది మా అభిప్రాయం ’ అని ఈ సంస్థ సమన్వయకర్త ఇల్యాస్ జాన్ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఈ నోట్స్రాసి రాయడం ఒక ఎత్తయితే. ఓ శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న నమితా హర్ష్ అనే మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా ఎనిమిది నోట్పుస్తకాలు రాయడం మరో విశేషం. ఈ నోట్పుస్తకాలను కేరళలోని వివిధ ప్రాంతాలకు ఉచితంగా అందించడానికి కొన్ని కొరియర్ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థయితే పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ›ప్రాంతాలకు రవాణా చేసింది. దీని కోసం వివిధ జిల్లాల్లోని తమ బస్సుడిపోల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నోట్స్ రాసే కార్యక్రమంలో తాము పాలుపంచు కుంటామంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటికీ ఈ సంస్థలకు విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. -
నడిగర్ సంఘానికి కేరళ సీఎం ప్రశంసలు
తమిళ సినిమా : దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్)ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ఇటీవల కేరళపై విరుచుకుపడిన భారీ వర్షాల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆపన్నహస్తం కోసం ఎదురు చూశారు. ఆర్థిక సాయం చేసి కేరళను ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజయన్ పొరుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. తమ వంతు సాయం చేయాల్సిందిగా సంఘ సభ్యులకు, ఇతర సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. నాజర్ పిలుపు మేరకు నడిగర్ సంఘ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సంఘం కృషిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసిస్తూ నాజర్కు లేఖ రాశారు. ఈ లేఖను నడిగర్ సంఘం మంగళవారం మీడియాకు విడుదల చేసింది. -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరువనంతపురం : ప్రకృతి సృష్టించిన విలయానికి గురైన కేరళకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. భారీ వరదల కారణంగా కేరళ తీవ్ర నష్టానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఏడాది వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ, యూత్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు వెచ్చించే నిధులను సీఎం రిలీఫ్ ఫండ్కు తరలించాలని నిర్ణయించింది. ఆ నిధులు కేరళ పునర్నిర్మాణంకు దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వదలకు 350పైగా పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదారు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రకృతి విలాయానికి గురైన కేరళను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు చేయూతనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్కు 1,036 కోట్లు విరాళాలు అందాయని ప్రభుత్వం వర్గాలు ప్రకటించాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాట్ ఫీవర్తో సోమవారం మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వరదలు తెచ్చిన కొత్త వైరస్తో కేరళ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను రంగంలోకి దింపింది. వైరస్ లక్షణాలతో భాదపడుతున్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. Kerala Government has decided to cancel all official celebrations for one year. Programs including International Film Festival of Kerala and other youth festivals stand cancelled #KeralaFloods pic.twitter.com/r5aJGHYW8c — ANI (@ANI) September 4, 2018 -
‘మీరంతా ప్రభాస్ని చూసి నేర్చుకొండి’
తిరువనంతపురం : ‘మీరంతా ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని విన్నాను. అంత సంపాదిస్తున్న మీరు కేరళ ప్రజలను ఆదుకోవడానకి చాలా తక్కువ మొత్తం సాయం చేశారు. మీకంటే తెలుగు హీరో ప్రభాస్ నయం. అతన్ని చూసి నేర్చుకొండి’ అంటూ కేరళ పర్యటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మలయాళ నటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా కేరళ అతాలకుతలమయిన సంగతి తెలిసిందే. వరద బాధితుల సంరక్షణ నిమిత్తం సోమవారం కేరళ ప్రభుత్వం ‘కేర్ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సురేంద్రన్ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్స్టార్లు ఉన్నారు. వారు ప్రతీ సినిమాకు 4 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. అంత సంపాదించే వారు వరద బాధితులకు చాలా తక్కువ మొత్తంలో సాయం చేశారు. మీలాంటి వారంతా ప్రభాస్ను చూసి నేర్చుకోవాలి. ఆయన ఇంతవరకూ మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ వరదల గురించి తెలిసిన వెంటనే సాయం చేయడానికి ముందుకొచ్చి.. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారంటా’ అంటూ సురేంద్రన్ మలయాళ నటులపై మండిపడ్డారు . మలయాళ నటులకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే ఎక్కువ నగదు సాయం చేశారని సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి ప్రభాస్ కేరళ వరద బాధితులకు సాయం చేసింది కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే. ఈ విషయం సదరు మంత్రి గారికి తెలియకపోవడంతో ప్రభాస్ని చూసి నేర్చుకొండి అంటూ వ్యాఖ్యానించారు. అయితే కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆర్థికంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇటీవల కమల్హాసన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ధనుష్, రజనీకాంత్, శివకార్తికేయ, నయనతార, విశాల్, విక్రమ్, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు కేరళ కోసం తమవంతు సాయం చేశారు. -
కేరళను పీడిస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద బీభత్సం అనంతరం కేరళలో ర్యాట్ ఫీవర్ (లెప్టోస్పైరోసిస్) విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 9 మంది చనిపోగా, 71 మందికి చేసిన రక్తపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో మరో 123 మంది ఇవే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. పాలక్కడ్, కోజికోడ్ జిల్లాల్లో ర్యాట్ ఫీవర్ ప్రభావం ఎక్కువగా ఉందని కేరళ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటించింది. వరదలు తగ్గుముఖం పట్టాక వివిధ రకాల జ్వరాలతో రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందిన వారి సంఖ్య 13,800 దాటింది. ర్యాట్ ఫీవర్ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అలప్పుజ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలా ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. చాలాచోట్ల పునరావాస కేంద్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
కేరళ వరద బాధితులకు రూ.కోటి విరాళం
కేరళ రాష్ట్రం ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు ఆర్థిక సాయాన్ని విరాళంగా అందిస్తున్నారు. నటుడు చిరంజీవి, మహేశ్బాబు, ప్రభాస్, రజనీకాంత్, కమల్హాసన్, సూర్య, విజయ్, విశాల్, విక్రమ్.. ఇలా పలువురు విరాళం అందించారు. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ తన వంతు సాయంగా కోటి రూపాయలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో తన బృందంతో సంగీత కచేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ముగిసిన తర్వాత తన బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ప్రజల సహాయార్థం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలో ఫ్లోరిడాలో కేరళ ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
కేరళను కుదిపేస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి ఆదివారం వరకు ఏడుగురు ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ర్యాట్ ఫీవర్తో ఆదివారం ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ర్యాట్ ఫీవర్తో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఎక్కువగా కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జ్వరం కేసులు కూడా పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వరదబాధితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పునర్నిర్మాణ పనుల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. -
కేరళ : దక్షిణాది తారల భారీ విరాళం
కేరళ వరద బాధితులకు ప్రపంచ నలుమూలలనుంచీ భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. దేశీయంగా రాజకీయ, సినీ, క్రీడారంగ,ఇతర ప్రముఖుల కూడా స్పందన కూడా విరివిగానే లభిస్తోంది. తాజాగా దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా స్పందించారు. ‘80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' పేరుతో కేరళ వరద బాధితుల సహాయార్ధం భారీ విరాళాన్నిచ్చింది. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ‘80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' పేరుతో వసూలు చేసిన 40 లక్షల రూపాయల విరాళం అందజేశామని సీనియర్ హీరోయిన్ సుహాసిని ట్విటర్ ద్వారా వెల్లడించారు. శుక్రవారం కేరళ సీఎంను కలిసి ఈ నగదును అందజేసామంటూ, ఆమె ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి హీరోయిన్లు కుష్బు , లిజీ కూడా పాల్గొన్నారు. 80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' ఆధ్వర్యంలో స్నేహితులు, బంధువుల నుంచి కూడా విరాళాలు సేకరించామని నటి లిజి మీడియాకు తెలిపారు. గాడ్స్ ఓన్ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.ఈ ఆపద సమయంలో తామంతా వారికి అండగా ఉన్నామనే భరోసా కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నామన్నారు. Handed over 40 lakhs to cm Kerala..from 80 s reunion and friends today at 3 pm pic.twitter.com/v0tvvgKFSc — Suhasini Maniratnam (@hasinimani) August 31, 2018 80s re union list of contributors to Kerala pic.twitter.com/e7RZUGzGZP — Suhasini Maniratnam (@hasinimani) August 31, 2018 -
పూలూ – పడగలూ
చాలాసార్లు చిన్నపిల్లలకి వచ్చేలాంటి సందేహాలు పెద్దవాళ్లకి రావు. ఎందు కంటే పెద్దవాళ్ల అభిప్రా యాలు, ఆలోచనలు లక్కలా బిడిసి, గట్టిగా స్థిర పడి పోయి ఉంటాయి. ప్రతి కల్పాంతంలోనూ భయంక రమైన జలప్రళయం వస్తుంది. అప్పుడీ సృష్టి మొత్తం జల సమాధి అయిపోతుంది. మళ్లీ నూతన సృష్టికి అంకురార్పణ జరుగుతుంది. అందుకు దేవుడు సృష్టి లోని సమస్త జీవకోటి శాంపిల్స్ని, విత్తనాలని ఒక పెద్ద పడవలోకి చేర్చి జాగ్రత్త పరిచాడు. ఈ పురాణ గాథని మరింత ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఉన్న ట్టుండి క్లాసులో ఓ పిల్లవాడు లేచి, ‘టీచర్ మరైతే పడవలో ఉన్న పులి అందులోనే ఉన్న మేకని తినె య్యదా?’ అని అడి గాడు. నిజమే, వాడొక శాంపిల్ చెప్పాడు గానీ ఇంకా కప్పని పాము, పాముని గద్ద మింగేస్తాయి కదా. అప్పుడు చాలా శాంపిల్స్ అడ్రస్ లేకుండా పోతాయి గదా. పిల్లలంతా నా జవాబు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేనేవన్నా ప్రవచనకారు డినా అప్పటి కప్పుడు ఆశువుగా వాడి సందేహం తీర్చ డానికి. కనీసం రెండు శ్లోకాలైనా పఠిస్తే, వాటిని గడగడ పుక్కిలించి, తోచిన అర్థంతో తరగతిని భయపెట్టి బయ టపడేవాణ్ణి. ఓ క్షణం దిక్కులు చూసి, ‘అఘో రించావ్. ఈ తెలివి మాత్రం ఉంది. కూర్చో’ అని గద్దించి, ఆ గండం గట్టెక్కాను. మొన్నామధ్య టీవీ వార్తలు చూస్తుంటే, పది పన్నెండేళ్ల పక్కింటి పిల్ల నాకూడా ఉంది. కేరళ వరదల్ని చూసి భయపడింది. చాలా జాలిపడింది. చూస్తున్నంత సేపూ అయ్యో పాపం అనుకుంటూనే ఉంది. మళ్లీ తర్వాత వేరే వేరే వార్తలు వచ్చాయి. చివరంటా నాతో పాటు వార్తలు చూసింది. ‘మరి... అయితే ఢిల్లీలో ఉండే మంత్రులు గొప్పవాళ్లా, ఇక్కడ ఉండే మన మంత్రులు గొప్పవాళ్లా’ అని అడిగిందా అమ్మాయి. ‘అంతా ఒకటే, కాకపోతే వాళ్లు అక్క డుండి దేశం సంగతులు చూస్తారు. వీళ్లు ఇక్కడ ఉండి రాష్ట్రం సంగతులు చూసుకుంటారు’ అని చెప్పాను. ‘మరైతే... మనవాళ్లు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా డోలంత పెద్ద పూలగుత్తుల్ని తీసికెళ్లి వాళ్లకిచ్చి దణ్ణం పెడతారెందుకు’ అని సూటిగా అడిగింది. వెంటనే జవాబు స్ఫురించలేదు. ‘మర్యాద.. అదొక మర్యాద’ అన్నాను. ‘ప్రతిసారీ మంచి ఖరీదైన పట్టు శాలువా కూడా ఢిల్లీ మంత్రులకు కప్పుతారు’ అన్నది. అవి లాంఛనాలు... అలాగే ఉంటాయన్నాను. మనలో మనకి అవన్నీ దేనికని ఎదురుప్రశ్న వేసింది. ఏదో సర్దిచెప్పి, ఒడ్డున పడ్డాను. పాపం, పుణ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని పిల్ల కాబట్టి, హాయిగా సందేహాలు అడిగింది. నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క మంత్రి చేతుల్లోకి ఎన్నెన్ని ఖరీదైన బొకేలు వస్తాయో.. ఒక్క క్షణం కూడా ఆయన చేతిలో ఉండదు. శాలువా కప్పగానే, అదేదో మిడతో, పురుగో భుజంమీద వాలి నట్టు దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఈ రాజ లాంఛనాలేమిటో అనిపి స్తుంది. దేవాలయాల్లో దేవు డికి వచ్చే వస్త్రాలను ఏటా వేలం వేస్తారు. ఈ శాలు వాలు కూడా అలా వేసి, ప్రభుత్వ ఖజానాకి జమ వేస్తే బాగుండు. సగటున ప్రతి మంత్రి నిత్యం పది శాలువాలు కప్పించుకుంటాడు. పదిహేను పూల గుచ్ఛాలు అందుకుంటాడు. మనలో మనకి ఈ మర్యాదలేంటని అందరూ ఒక్కమాట అను కుంటే, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవు తుంది. పోనీ, వీళ్లకి వాళ్లకి మధ్య నిజంగా గౌర వాలు, అభిమానాలు ఉంటాయా అంటే రవ్వంత కూడా ఉండవు. బయటకు రాగానే మీడియా మైకుల్లో నిర్భ యంగా చెరిగి పడేస్తారు. రాష్ట్ర గవర్నర్ ఉన్నతస్థాయి అధికారి. ఆయన కూడా ప్రజా సేవకే ఉన్నారు. ఆయనని కలవడానికి లేదా దర్శించడానికి వెళ్లినప్పుడల్లా మద్దెలంత పూల గుచ్ఛం స్వయంగా మోసుకు వెళ్లాలా? ఇవన్నీ ఎవరు నిర్దేశించారు. వీటి అమలు వెనుక అంతరార్థమేమిటి? ప్రధాని మోదీ ‘మనసులో మాట’ పేరుతో చాలా అర్థ వంతమైన ప్రసంగాలు ఆకాశవాణిలో చేస్తుంటారు. సందేశాలు, సలహాలు ఇస్తారు. ఇలాంటి కృత్రిమమైన మర్యాదల్ని, లాంఛనాల్ని ఎందుకు నిశ్శేషంగా వదిలిం చరో అర్థం కాదు. ముందసలు అన్నిచోట్ల కుప్పలుగా పడివున్న శాలువాలని వెంటనే కేరళకి పంపండి. కొంత పాపం శమిస్తుంది. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
రిలీఫ్ ఫండ్కు 14 రోజుల్లో రూ.713 కోట్లు
-
కేరళకు కేంద్ర సాయం కంటే.. విరాళాలే ఎక్కువ!
తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు, టెక్ దిగ్గజాలు మొదలుకొని సామాన్యుల వరకు తమకు తోచిన సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ఆగస్టు 29 వరకు 730 కోట్ల రూపాయలు అందాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వరదల అనంతర పరిస్థితులపై, పునరావాస చర్యలపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. 730 కోట్ల రూపాయల సాయం అందిందని ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలో ఈ మొత్తం జమ అయినట్టు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం(600 కోట్ల రూపాయలు) కన్నా ఇది 21.7 శాతం ఎక్కువని పేర్కొన్నారు. తమ అంచనాల కన్నా మూడు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. కేరళను పునర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ నలుమూలల నుంచి కేరళను ఆదుకోవడానికి అనేక మంది ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రకృతి విలయం కారణంగా కేరళలో 20వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఊహించని వర్షం.. అపార నష్టం వరదల కారణంగా 483 మంది ప్రాణాలు కోల్పోయారని, 15 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. వరదల సమయంలో 14.50 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం 59,296 మంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని చెప్పారు. 57 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. వరదల కారణంగా సంభవించిన నష్టం దాదాపుగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను దాటిపోయిందని భావిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేయగా ఏకంగా 352.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. -
సాధారణ మనిషిలా మూటలు మోసిన కేరళ మంత్రి
-
కేరళలో దళితులను ఆదుకోవాలి: చుక్కా రామయ్య
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో శ్రీమంతులు నిలదొక్కుకుంటున్నారని, దళిత, గిరిజన, ఆదివాసీలు మాత్రం నిరాశ్రయులయ్యారని అలాంటి వారిని ఆదుకుని మానవత్వం చాటాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఇటీవల చుక్కా రామయ్యకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.లక్ష నగదును అందచేయగా, ఆ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. కేరళకు చెందిన దళిత ఫ్యాంథర్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అంబుజాక్షన్కు ఆయన ఈ చెక్కును అందించారు. కేరళకు విదేశాల నుంచి వచ్చే సాయాన్ని తిరస్కరించరాదని, దాన్ని పేదల కోసం వినియోగించాలని రామయ్య సూచించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీ నర్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఐఏఎస్ కాకి మాధవరావులు మాట్లాడుతూ.. కేరళలో నిమ్నవర్గాల పట్ల చూపిస్తున్న వివక్ష తగదని, అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కేరళలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో దాదాపు 15 రోజుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులను టీచర్లు పాటలు పాడుతూ ఆహ్వానించారు. పుస్తకాలు, యూనిఫాం నాశనమయ్యాయన్న బాధను పోగొట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్వీట్లను అందజేశారు. ఈ విషయమై కేరళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్ సి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 600 పైచిలుకు పాఠశాలలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇంకా 1.97 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 3 నాటికి అన్ని పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదతో మానసికంగా కుంగిపోయిన పిల్లలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. యూనిఫామ్, పుస్తకాలు కోల్పోయిన పిల్లలు బాధ పడొద్దనీ, ప్రభుత్వం కొత్తవి అందజేస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. -
అవసరం –ఆత్మగౌరవం
యాభై అరవై సంవత్స రాల కిందట– మేం రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో ‘రీడర్స్ డైజెస్ట్’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. అందులో చివర ఒక సంక్షిప్త నవల ఉండేది. నిజంగా జరిగిన సంఘటన మీద ఒక నవల వచ్చింది. స్విట్జర్లాండ్లో ఒక విమాన ప్రమాదం జరిగింది. బాగా ఎత్తుగా ఉన్న ఆల్ఫ్స్ పర్వతశ్రేణి మధ్య ఆ విమానం కూలిపోయింది. నరమానవులు వెళ్లలేని మంచు శ్రేణులవి. అందులో 22 మంది ఉన్నారు. అందరూ వారిమీద ఆశలు వదులుకున్నారు. కానీ కొద్ది రోజులకు ఆ కూలిన ప్రదేశం నుంచి సంకేతాలు రాసాగాయి. అంతా తుళ్లిపడ్డారు. వెంటనే వారిని రక్షించడానికి పరుగులు తీశారు. తీరా 22 మందిలో 16మంది మరణించగా ఆరుగురు బతికారు. వారి మొదటి సమస్య బయటి ప్రపంచానికి తమ ఉనికిని తెలియజేయడం. మరి ఈ ఆరుగురు 16 రోజులు ఎలా జీవించారు? వారి చుట్టూ 16 శవాలు మంచులో నిక్షేపంగా ఉన్నాయి. ఆ నవల చివరి వాక్యం ఇన్నేళ్లూ నా మనస్సులో తలచుకున్నప్పుడల్లా తుపాకీలాగ పేలుతూనే ఉంది. ‘థాంక్గాడ్! వారి చుట్టూ మంచులో 16 దేహాలు ఉన్నాయి!’ ఇంతే కథ, ఆ కథ వివరాలు ఇప్పుడేమీ గుర్తులేవు. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒక జాతీయ రూపక కార్యక్రమంలో ఒక నాటకం ప్రసారం చేసి నట్టు బాగా గుర్తు. ఇక్కడా వివరాలు గుర్తు లేవు. కానీ ఒక బృందం కలిసి ప్రయాణం చేస్తున్నారు. అందరూ సంస్కారవంతులు. విద్యాధికులు, నగర సంస్కృతిలో జీవించేవారు. ప్రాణాంతకమైన ప్రమా దంలో ఎన్నో రోజులు ఇరుక్కున్నారు. కొందరు పోయారు. మిగిలినవారు ఎన్నో రోజులు జీవించాలి. ప్రాథమికమైన ‘బ్రతకాలనే’ ఆర్తి క్రమంగా వారి సంస్కారాన్ని అటకెక్కిస్తుంది. వారు అతి ప్రాథమి కమైన– కేవలం ‘ఉనికి’ కోసం విలువల్ని విస్మరించే స్థితికి వస్తారు. ఇది భయంకరమైన వాస్తవానికి ప్రతి బింబం. ఎన్నో నెలలపాటు కొత్త ప్రాంతాల అన్వేషణకు బయలుదేరిన అలనాటి కొలంబస్, వాస్కోడీగామా వంటి వారి బృందాలు సముద్ర మధ్యంలో ఆహార పదార్థాలు కొరవడగా– తమ నౌకల్లోని ఎలుకలను పట్టి తినడాన్ని మనం చదివాం. ఈ మూడు కథలూ– ఒక అనూహ్యమైన మలు పులో మానవునిలో సంస్కారవంతమైన విలువలు లుప్తమై కేవలం Suటఠిజీఠ్చిl∙లక్ష్యమైపోతుంది అన్న సత్యానికి నిరూపణలు. ఇప్పుడు కేరళలో ఎదురైన విపత్తు అలాంటిది. ఇక్కడ ‘ఆత్మ గౌరవం’ ఆలోచన లకు బహుదూరం. కేరళలో గత 100 సంవత్సరాలలో కనీవినీ ఎరు గని వర్షాలు పడ్డాయి. 32 డ్యామ్లు నీటితో ఊపిరి బిగించాయి. 10వేల కిలోమీటర్ల రోడ్లు కొట్టుకుపో యాయి. లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎందరో మరణించారు. ఇప్పుడు వీరి పునరావాసానికి గుంజాటన జరుగుతోంది. ఒక విలేకరి ఒక ఇంటిని చూపి– ఇక్కడ నీరు తగ్గాక– వర్షం తెచ్చిన మట్టి, ఇతర చెత్త నుంచి ఈ ఇంటిని పరిశుభ్రం చేయాలంటే కనీసం 2 నెలలమాట– అన్నారు. ఒక ఉదాహరణ. చెంగల్పట్టు సమీపంలో మామండూరు అనే ఊరిలో– రోడ్డుపక్క ఒక ఫ్యాక్టరీ షెడ్డు ఉంది. పక్కనే ఏరు. ఫ్యాక్టరీ మూతపడింది. ఎన్నో నెలల తర్వాత– కొత్త వ్యాపారి దానిని అద్దెకి తీసుకున్నాడు. శుభ్రం చేయడానికి మనుషుల్ని పుర మాయించాడు. లోపలికి మనుషులు వెళ్లగా రెండు పాములు కనిపించాయి. వాళ్లు బెదిరి పాములు పట్టేవారిని పిలిపించారు. తీరా ఆ షెడ్డులో కేవలం మూడు వేల పాములున్నాయట! కేరళ ఇళ్లలో శవాలే ఉన్నాయో, చెత్తే ఉందో, మరేం ఉందో ఇంకా తెలీదు. ఈలోగా విదేశాల వారు కూడా స్పందించి సహాయానికి నడుం కట్టారు. యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్ 700 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ కేంద్రం పరాయి దేశాల సహాయం వద్దంది. ‘మా అవసరాల్ని మేమే తీర్చు కుంటాం. మీ పెద్ద మనస్సుకి జోహార్’ అంటూ విదేశాంగ శాఖ విదేశాలకు సమాధానం ఇచ్చింది. కేరళ ముఖ్యమంత్రి ‘వారినయినా ఇవ్వనివ్వండి, మీరయినా ఇవ్వండి’ అన్నారు. కష్టంలో, సుఖంలో ప్రపంచమంతా చేతులు కలపాలన్న ‘వసుధైక కుటుంబం’ ఆదర్శం పాటించే దేశం– చెయ్యి అందించే పరాయి దేశం సహాయాన్ని ఎందుకు తిరస్కరించాలి? ఆత్మగౌరవం అరుదైన విలువ. కానీ అవసరం ప్రాథమికమైన ఉప్పెన. ఆపదలో ఆదుకునే సహృదయానికి ఆత్మగౌరవం ఆటంకం కాకూడదు. కాగా, సౌజన్యానికి ఎల్లలని నిర్ణయించడం ‘ఆత్మగౌరవానికి’ దక్కవలసిన కితాబు కాదు. ఔదార్యానికి ఆంక్ష పెద్ద మనసు అనిపించుకోదు. మన పెరట్లో మూడువేల పాములున్నాయి. బూరా ఊదే మనిషిని దూరంగా ఉంచకండి. గొల్లపూడి మారుతీరావు -
కేరళ వరదలు: హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ విరాళం
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేరళ వరద బాధితులకు భారీ సహాయాన్ని ప్రకటించింది. పదికోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే కేరళలో వరదలకు గురైన 30 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతోపాటు ఆగస్టు మాసానికి సంబంధించి పలు లోన్లపై చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులపై లేటు ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని డొనేట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలకు అండగా నిలబడాలని తాము భావించామని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి చెప్పారు. త్వరలోనే కేరళ ప్రజలు కోలుకొని సాధారణమైన స్థితికి చేరుకోవాలని ప్రార్థించారు. గ్రామాల దత్తతలో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని బ్యాంకు తెలిపింది. దీంతోపాటు ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అంతేకాదు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నామని బ్యాంకు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోపాటు లాభాపేక్ష లేని స్థానిక భాగస్వాముల సహాకారం ఈ కార్యక్రమాలను సుదీర్ఘ ప్రణాళికగా చేపడతామని వివరించింది. -
అరకొర వరద సాయంపై రాహుల్ రుసరుస..
కొచ్చి : వరదలతో దెబ్బతిన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎంతమాత్రం సరిపోదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ కేంద్రం అరకొర సాయం చేస్తూ దక్షిణాది రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కేంద్రం ఆరెస్సెస్ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం రెండు వైరుధ్య సిద్ధాంతాలున్నాయని, ఒకటి నాగ్పూర్ ఆదేశాలతో పనిచేసే కేంద్రీకృత విధానమైతే మరొకరి అన్ని వర్గాల ప్రజలు, సంస్కృతులు, ఆలోచనలను సమాదరిచే విధానం మరొకటని రాహుల్ పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న బాధితులకు బాసటగా నిలిచేందుకే తాను ఇక్కడికి వచ్చానని, రాజకీయాల కోసం కాదని చెప్పారు. వరదలతో నష్టపోయిన ప్రజలు తమ భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారని, వారికి పాలకులు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తాను కేరళ సీఎంతో మాట్లాడానని రాహుల్ చెప్పుకొచ్చారు. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని సత్వరమే వారికి అందించాలని కోరారు. -
వరదలనూ వదలని రాజకీయాలు
విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహాయక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశ ముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదు. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులే అయినప్పటికీ యూఏఈ వరదసాయాన్ని కేంద్రం తిరస్కరించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావనిపిస్తోంది. మరికొందరు దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివారణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడటం దురదృష్టకరం. కేరళలో వచ్చిన వర దలు గత వందేళ్లలో ఆ రాష్ట్రం చూడని వర దలు. ఈ ప్రకృతి వైప రీత్యాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పూర్తి అవగాహన, పరస్పర సహకా రంతో పనిచేశాయి. బాధితులను రక్షించడంలో, వారికి సహాయ సహకారాలు అందించడంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్), స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాయి. పూర్తి సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు చేతనైతే తమవంతు సహాయం అందించడం లేదా నైతిక మద్దతు ప్రకటించడం వదిలేసి కొంతమంది అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడమే తమ ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. దక్షిణ భార తదేశంలో జరిగే ఉపద్రవాలకు కేంద్రం సరైన సహ కారం అందించడం లేదని బాధ్యతారహితంగా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉపద్రవ సహాయక కార్యక్రమాలతో సంబంధంలేని, అవగాహన లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపద్రవlసహా యక కార్యక్రమాలను పర్యవేక్షించే వ్యక్తి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటికి ప్రాధాన్యం సంతరిస్తుంది. ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ట్విట్టర్లో రాష్ట్రప్రభుత్వం వరదల సహాయం కోసం కేంద్రాన్ని రూ. 2,200 కోట్లు అడిగిందని. కేంద్రం రూ. 600 కోట్లు ఇచ్చిం దని, యూఏఈ ప్రభుత్వం రూ. 700 కోట్లు ఇస్తా మంటే కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యానాల ఉచితాను చితాలను విశ్లేషించే ముందు భారతదేశంలో విప త్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యవస్థీకృత విధానం ఉన్నదో పరిశీలిద్దాం. ఈనాడు ప్రపంచంలో చాలా దేశాలలో లేని విధంగా విపత్తులను ఎదుర్కోవడానికి భారత దేశంలో చక్కని విధివిధానాలు రూపొందించారు. అమెరికా కత్రినా తుపాను ఎదుర్కొన్న విధానంతో పోల్చుకుంటే భారతదేశం వరదలు–తుపాన్లు వంటి ఉపద్రవాలు చాలా సమర్థంగా ఎదుర్కొంటున్నది. 2005లో కేంద్ర ప్రభుత్వం విపత్తుల పర్యవేక్షణ చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా విపత్తుల నిర్వహణ ప్రణాళిక తయారుచేశారు. ఈ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి విపత్తుల నివారణ, నిర్వహణ కోసం రూపొందించిన సెండాయ్ సమావేశపు విధి విధానాలకు అనుగుణంగా రూపొందించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ ఉప ద్రవ పర్యవేక్షణ వ్యవస,్థ రాష్ట్రస్థాయిలో ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఉపద్రవ సమయాలలో సహాయ రక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక బలగం ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశారు. ఉపద్రవ సహాయ రక్షణ కార్యక్రమాలలో శిక్షణనిచ్చి సామర్థ్యాలు పెంచ డానికి ఒక ప్రత్యేక శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ దక్షిణభారత కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్లోని గన్నవరం సమీపంలో రూపుదిద్దుకుం టోంది. వీటన్నిటికీ మించి ఉపద్రవ సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వ ర్యంలో ఒక కమిటీ, రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో కమిటీ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తాయి. ఈ కమిటీలు రోజువారీగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ద్వారా మీటింగులు నిర్వహించుకొని ఉపద్రవ నివారణ రక్షణ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తుంటాయి. ఉప ద్రవ నివారణ, రక్షణ కార్యక్రమాలను నిర్వహించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు, అధికా రులు పూర్తి సమన్వయంతో సహకారంతో పనిచేయ డంలో ఈ కమిటీలు చాలా ప్రధాన పాత్ర పోషి స్తాయి. హుదూద్ తుపాన్ సందర్భంలో ఈ కమిటీల పాత్రను, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల నుంచి పూర్తి సహాయ సహకారాలను నేను ప్రత్యక్షంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా చూశాను. రక్షణ హోం శాఖ కార్యదర్శులను అర్ధరాత్రి అపరాత్రి సమ యాల్లో కూడా ముఖ్య విషయాల్లో ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. వారి స్పందన కూడా సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉండేది. నేడు కేరళ వరదలు ఎదుర్కోవడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అనుకోవటానికి అవకాశాల్లేవు. వివాదమంతా ఆర్థిక సాయం గురించే! ఇక ఎటొచ్చి సమస్యంతా ఆర్థిక సహాయం గురించే. విపత్తుల నివారణకు, నిర్వహణకు కావాల్సిన ఆర్థిక సదుపాయాలకోసం విధి విధానాలను ఆర్థిక సంఘాలు నిర్దేశిస్తాయి. 2005 విపత్తుల నిర్వహణ చట్టం తర్వాత వచ్చిన 13, 14 ఆర్థిక సంఘాలు ఈ అంశంపై దృష్టి పెట్టి విపత్తు నిర్వహణకు కేంద్ర స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ఎస్, డీఆర్ఎఫ్ అనే రెండు నిధులను ఏర్పాటు చేశాయి. కేంద్రం కొన్ని ప్రత్యేక డ్యూటీల ద్వారా కేంద్ర స్థాయి నిధికి వనరులు సమీకరిస్తోంది. అదనంగా బడ్జెట్ నుంచి అవసరాన్నిబట్టి కేటాయిస్తోంది. రాష్ట్రస్థాయి నిధికి ఈ కేంద్ర నిధి నుంచే ఆర్థిక సంఘం నిర్ణయించిన విధంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం ముందు ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25 శాతం భరించేవి. 14వ ఆర్థిక సంఘం కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం భరించేటట్లు నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన అవార్డును అనుసరించి 2015 –20 మధ్య వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి విపత్తుల నిర్వహణకు రూ. 55 వేల కోట్ల కేటాయింపులు జరి గాయి. గత సంవత్సరాల్లో విపత్తు నిర్వహణలో రాష్ట్రాలు పెట్టిన ఖర్చు ఆధారంగా ఈ కేటాయిం పులు జరిగాయి. ఇది శాస్త్రీయ విధానం కాదని గుర్తించి విపత్తుల సూచికను రాష్ట్రాలవారీగా తయా రుచేయాలని 14వ ఆర్థిక సంఘం అభిలషించింది. ఇది కష్టసాధ్యమైన విషయంగా గుర్తించి అంతకు ముందు విపత్తులపై రాష్ట్రాలు చేసిన ఖర్చులను కొలబద్దగా తీసుకుని రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఇందువల్ల ఇంతకుముందు ఉపద్రవాలు ఎదుర్కొన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరి గాయి. ఉదాహరణకు ఈ ఐదేళ్ల కాలంలో అంటే 2015 నుంచి 2020 దాకా కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రూ. 2,186కోట్లు మధ్యప్రదేశ్కు రూ. 4,363 కోటు,్ల మహారాష్ట్రకు రూ. 7,376కోట్లు కేటా యించగా, కేరళకు ఈ ఐదేళ్లలో ఈ నిధి కింద కేటాయింపు రూ. 919 కోట్లు మాత్రమే. ఇంతకు ముందు సంవత్సరాల్లో కేరళలో ఉపద్రవాలు లేనం దువల్ల అవి ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి కేటాయింపులు తక్కువే జరిగాయి. అందు వల్ల ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కేరళ ఎక్కువ ఆర్థిక సహాయం అడగటానికి హేతుబద్ధమైన ప్రాతి పదిక ఉంది. ఎక్కువ కేటాయింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉపద్రవాలు రానప్పుడు కేటాయించిన నిధులను వెనుకకు తీసుకునే వెసులుబాటునూ 14వ ఆర్థిక సంఘం కల్పించినట్టు లేదు. అలాంటి వెసు లుబాటు ఉంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా ఖర్చు కాని రాష్ట్రాల నుంచి ఈ నిధులను కేరళ లాంటి రాష్ట్రానికి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం కనుక 15వ ఆర్థిక సంఘం అయినా ఈ అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ఏదైనా విపత్తు సంభ వించినప్పుడు ప్రధానమంత్రి విపత్తు ప్రాంతాలు పరిశీలించి ప్రకటించే సాయం తాత్కాలికమైనది. పూర్తి సహాయాన్ని నిపుణుల బృందం వచ్చి పరిశీ లించాక నిర్ధారిస్తారు. వెంటనే నిర్వహించవలసిన రక్షణ, సహాయ కార్యక్రమాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. విదేశీ సాయంపై అధికారం కేంద్రానిదే విదేశీ సహాయం విషయాల్లో ఈ అంశాల్లో నిర్ణయా« ధికారాన్ని విపత్తుల నివారణ ప్రణాళిక కేంద్రప్రభు త్వానికి వదిలేసింది. విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే మరో సారి ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహా యక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకో లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు విదేశీ సాయం లేనప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలో ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశాలన్నిం టిని సమగ్రంగా పరిశీలించి జాతీయ విపత్తులకు విదేశీ సహాయం తీసుకోలేదు. అదే సంప్రదాయాన్ని ఈనాడు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించాక కొనసాగించడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. యూఏఈ ప్రభుత్వం నుంచి వస్తుందనుకున్న సహాయం ఊహా పరమైనదేనని తెలిసిపోయింది. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులు. పై అంశాలేవి వారికి తెలియనివి కావు. ఈ పై అంశాల దృష్ట్యా వారు చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావ నిపిస్తోంది. మరికొందరు ఉత్తర, దక్షిణ భారత అంశాలను ప్రస్తావించి దక్షిణాది రాష్ట్రాల విష యంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివా రణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడ టం దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఇలాంటి విపత్తే తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ప్రాంతా ల్లో వస్తే దేశం ఇంత నిశితంగా చూసి ఉండేది కాదు. సహాయ సహకారాలు అంతంతమాత్రంగానే ఉండి ఉండేవి. కారణం ఆ రాష్ట్రాల వెనుకబాటుతనం. సమర్థ నాయకత్వ లోపం. దక్షిణాది రాష్ట్రాల్లో పరి స్థితులు వేరు. భవిష్యత్తులో తమ సమస్యలను స్పష్టంగా వినిపించగల, సాధించుకోగల సమర్థ నాయకత్వాలు కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కన్నా ఈ విషయాల్లో ముందే ఉంటాయి. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ iyrk45@gmail.com ఐవైఆర్ కృష్ణారావు -
బాహుబలిలా మూటలు మోసిన మంత్రి
తిరువనంతపురం: ప్రకృతి సృష్టించిన విలయం నుంచి కేరళ ప్రజలను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి కేంద్రబలగాలతో పాటు, ఉన్నతాధికారులు కూడా శ్రమించారు. మత్య్సకారులైతే స్వచ్ఛందగా తమ సేవలందించారు. ఇలా ప్రతి ఒక్కరు ఏదోరకంగా తమకు తోచిన సహాయం చేశారు. కేరళ వరద బాధితులకు సహాయక సామాగ్రిని అందజేయడానికి ఐఏఎస్ అధికారులు సైతం మూటలు మోసిన సంగతి విదితమే. సహాయక చర్యల్లో కేరళ మంత్రి రవీంద్రనాథ్ వ్యవహరించిన తీరు పలువురికి ఆదర్శంగా నిలిచింది. కేవలం సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా.. బాధితులకు కావాల్సిన సామాగ్రిని ఆయన తన భుజంపై మోసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే.. ఆయన బాహుబలిలా కష్టపడ్డారని అభినందిస్తున్నారు. కాగా కేరళలో సంభవించిన వరదల్లో చిక్కుకుని 400 మందికి పైగా మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని అంచనా వేస్తున్నారు. -
కేరళ వరదలు: మూటలు మోసిన మంత్రి
-
కేరళకు గూగుల్ భారీ సాయం..!
సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు గూగుల్ భారీ సాయం ప్రకటించింది. రూ. 7 కోట్లు విరాళమిస్తున్నట్టు గూగుల్ ఇండియా ట్విటర్లో వెల్లడించింది. సంస్థ వితరణలో ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారని తెలిపింది. కాగా, గత శతాబ్ద కాలంలో కేరళ ఇంతటి భారీ ప్రకృతి విలయాన్ని చూడలేదు. 1924లో ముంచుకొచ్చిన వరద ముప్పు నుంచి తేరుకున్న దేవభూమి కేరళ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కాగా, ఈ నెల (ఆగస్టు) మెదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండిపోవడంతో ఒకేసారి 34 ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీంతో రాష్ట్రం వరద ముంపునకు గురైంది. కేరళ వ్యాప్తంగా 400 పైగా జనం వరదల్లో చిక్కుకుని మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. మరోవైపు, ఈ విపత్తు పక్కకున్న కర్ణాటకను కూడా తాకింది. వరదల కారణంగా కొడగు జిల్లా నీట మునిగి 17 మంది చనిపోయారు. కేరళను ఆదుకోవడానికి దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఇప్పటికే ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రపంచంలోని కేరళీయులు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చి కేరళను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని పలు విశ్లేషణలు చెప్తున్నాయి. .@Googleorg and Google employees are contributing $1M, to support flood relief efforts in Kerala and Karnataka. #GoogleForIndia@RajanAnandan — Google India (@GoogleIndia) August 28, 2018 -
కేరళ కోసం జడ్జీల గానం
న్యూఢిల్లీ: సంక్షోభ సమయాల్లో మానవీయంగా స్పందించగలమని, అందుకు అవసరమైతే మైక్ పట్టుకుని పాటలు కూడా పాడగలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరూపించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం సోమవారం సుప్రీంకోర్టు జర్నలిస్ట్లు చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ గాత్ర ప్రావీణ్యాన్ని చూపారు. ఈ ఇద్దరు జడ్జీలు కేరళకే చెందినవారు కావడం గమనార్హం. మలయాళ క్లాసిక్ సినిమా ‘అమరం’లోని మత్స్యకారుల జీవనాన్ని వర్ణించే ఓ పాటను కేఎం జోసెఫ్ పాడారు. ‘కేరళలో వరద బాధితుల సహాయానికి ముందు స్పందించింది మత్స్యకారులే. అందుకే వారి కోసం ఈ పాట’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గాయకుడు మోహిత్ చౌహాన్తో కలిసి ‘వి షల్ ఓవర్కమ్ సమ్డే’ అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆలపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, పలువురు ఇతర జడ్జీలు, జర్నలిస్ట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 లక్షలకు పైగా విరాళాలు వసూలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరూ రూ. 25 వేల చొప్పున, కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. -
ఇక సినీ వెల్లువ
వరద విలయం సృష్టించింది.చేయీ చేయీ కలిపిన జనం దానిని ఎదిరించి నిలబడ్డారు.కొన్ని చోట్ల కరెంటు లేదు.కొన్ని చోట్ల నీళ్లు లేవు.కొన్ని చోట్ల నీడ.కాసింత నిరాశ ఉంటుంది.కాని ఈ నిరాశకు రిలీఫ్గా అక్కడ కొత్త సినిమాలు రానున్నాయి.మా సినిమాలు చూసి రీచార్జ్ అవ్వండి అంటున్నారు అక్కడి పెద్ద హీరోలు. నిజమే. ఆ వరదకు జవాబు ఈ వెల్లువే కదా అభిమానులకు. మనకు సంక్రాంతి, దసరాలానే కేరళకు ఓనమ్. ఇది ఓనమ్ సీజన్.ఈ సీజన్లో సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసి జోరుగా బిజినెస్ చేసుకోవాలని భావిస్తుంటారు నిర్మాతలు. కాని అనూహ్యంగా ఈ ఏడాది ఈ సీజన్లోనే కేరళకు వరద వచ్చింది. రాష్ట్రం చాలా దెబ్బ తినింది. సినిమా ఇండస్ట్రీ కూడా. ఆగస్ట్లో ఓనమ్ సీజన్లో రిలీజ్ కావల్సిన 5–6 సినిమాలు ఇప్పుడు డేట్ చూసుకొని షోకు సిద్ధం అవుతున్నాయి. ముందు వసతి తర్వాతే వినోదం కేరళ ప్రజలకు ఉండటానికి చోటు, తినడానికి సరైన తిండి కూడా లేనప్పుడు సినిమాల రిలీజు సరిౖయెన పని కాదని అనుకుంది అక్కడి ఇండస్ట్రీ. కనీస వసతుల మీద దృష్టి పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి తానూ చేయ దగ్గ సాయం చేసింది. మరోవైపు ఈ వరదల ద్వారా ఎంతో మంది బాధకు గురవుతుంటే మిగతా వాళ్లు పండగ సంబరాల్లో మునిగి తేలడం కూడా కరెక్ట్ కాదని స్టేట్ గవర్నమెంట్ కూడా పేర్కొంది. అందుకనే కేవలం సినిమా రిలీజ్లనే కాదు కేరళలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చాలా సినిమాల షూటింగ్లు ఆపేశారు. ఫాహద్ ఫాజల్ లేటెస్ట్ సినిమా కోసం వేసిన సెట్ వరదల్లో కొట్టుకుపోయిందని చిత్రబృందం పేర్కొంది. ఈ పండక్కు రిలీజ్ కావల్సిన కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేశారు చిత్రబృందాలు. ఈ సినిమాలను వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి రీ షెడ్యూల్ చేశారు. మలయాళ సినీ చరిత్రలో ఓనమ్కు సింగిల్ సినిమా కూడా రిలీజ్ లేకపోవడం ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఓనమ్కు కేరళ మార్కెట్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాల్లో ముందుగా... మలయాళం క్రేజీ ప్రాజెక్ట్.. ‘ప్రేమమ్’ ఫేమ్ నివీల్ పౌలీ హీరోగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘కాయమ్కులమ్ కొచ్చున్ని’. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దంలో నివసించిన కాయమ్కులమ్ కొచ్చున్ని అనే దొంగ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్న వాళ్ల దగ్గర దోచుకొని పేదవాళ్లకు పంచే రాబిన్హుడ్ క్యారెక్టర్. ఈ పాత్రను నివీన్ పౌలీ పోషించగా అతని గురువుగా మోహన్లాల్ కనిపిస్తారు. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. వరదల కారణంగా పోస్ట్ పోన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అల్లరి చేసే మమ్ముట్టి.. పండక్కి స్టార్ హీరో సినిమా లేకపోతే కచ్చితంగా ఆ వెలితి కనిపిస్తుంది. అయితే ఈసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’ సినిమాతో వస్తున్నారు. ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి గ్యాంగ్కి లీడర్గా కనిపిస్తారు మమ్ముట్టి. చేసిన పనికి, చేయని పనికి కచ్చితంగా బ్యాడ్ నేమ్ మాత్రం మన హీరోకే వస్తుందట. ఇలాంటి లైట్ హార్ట్ కామెడీతో రూపొందిన చిత్రం ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’. ‘అవును’ ఫేమ్ పూర్ణ, రాయ్ లక్ష్మీ హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. శేతు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్ట్ 24న విడుదల కావల్సింది. ఇప్పుడు సెప్టెంబర్ 14న రిలీజ్ కానుంది. హార్రర్ థ్రిల్లర్గా.. ఫాహద్ ఫాజిల్ ‘వరతాన్’ చిత్రం కుడా ఓనమ్కు వస్తుందని చాలా రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్నారు చిత్రబృందం. కెమెరామేన్, డైరెక్టర్ అమల్ నీరాద్ తెరకెక్కించిన ఈ సినిమాను అమల్ నీరద్తో కలసి ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నిర్మించారు. హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సినిమాలో ఓ రొమాంటిక్ పాటను కూడాపాడారు నజ్రియా. చైన్ స్మోకర్ సెటైర్ 2017లో మలయాళం సూపర్ హిట్ ‘మాయనది’తో మంచి పేరు సంపాదించుకున్న టోవినో థామస్ ఈ ఓనమ్కు ‘తీవండి’తో వస్తున్నారు. తీవండి అంటే చైన్ స్మోకర్ అని అర్థం. పొలిటికల్ సెటైర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఓనమ్ ఫెస్టివల్కి చాన్స్ లేకపోవడంతో సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఓనమ్కి రావాలనుకున్న కొన్ని సినిమాలు ‘కామెడీ పడయోట్టమ్’, ‘జానీ జానీ యస్ పాప్ప’, ‘మాంగళ్యం తంతూనానేనా’ సినిమాలను కూడా వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమాల కోసం థియేటర్లు పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. వరదల కారణంగా పలు థియేటర్లు నీట మునిగిపోయాయి. కేవలం థియేటర్స్ ఏరియా నష్టమే సుమారు 30 కోట్లు వరకూ ఉండొచ్చని కేరళ ఫిల్మ్ చాంబర్ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటు షూటింగ్ నిలిపివేత, అటు కొత్త చిత్రాల విడుదల ఆపివేత.. మొత్తంగా కేరళ ఎంటర్టైన్మెంట్ ఇండ్రస్టీకి తీరిన నష్టమే అని చెప్పాలి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మళ్లీ కేరళ కళకళలాడాలని, కొత్త రిలీజులతో థియేటర్లు సందడి చేయాలని, ఎప్పటిలా షూటింగ్స్ జోరుగా జరగాలని కోరుకుందాం. కాలం మన నేస్తం కేరళ ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ‘ప్రేమదేశం’ కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్ లిరిక్ని మార్చి తన కాలిఫోర్నియాలో షోలో పాడారు ఏఆర్ రెహమాన్. ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు రెహమాన్కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడారు. అందరూ తమ ప్రేయర్స్ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్ పాట ద్వారా తన సందేశం పంపారు. మేమున్నామని... కేరళకు మేమున్నాం అంటూ మోహన్లాల్, మమ్ముట్టి చేరో 25 లక్షలు సీయం రిలీఫ్ ఫండ్కి అందజేశారు. కొంత మంది హీరోలు డబ్బు రూపంలో సహాయం చేస్తే మరికొందరు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. కేరళకు సహాయంగా తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేశ్బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, విజయ్ దేవరకొండ ఇలా పలువురు కళాకారులు ఆర్థిక సహాయం చేశారు. తమిళనాడు నుంచి రజనీకాంత్, విక్రమ్, సూర్య, విజయ్ తదితరులు విరాళం అందజేసినవారిలో ఉన్నారు. పలువురు కథానాయికలు సైతం కేరళకు మేమున్నామని సహాయానికి ముందుకొచ్చారు. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి వారు కూడా చేయూతనిచ్చారు. కేరళ వరదలపై డాక్యుమెంటరీ 2018లో వచ్చిన వరదలు గత వందేళ్లలో కేరళ ఎప్పుడూ చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని విజువల్గా చూపించదలిచారు దర్శకుడు మధుసూదనన్. వరద సమయాల్లో ఫోన్ లేదా కెమెరాతో షూట్ చేసిన వీడియోస్ అన్నింటినీ కలిపి ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. కెమెరామేన్, దర్శకుడు రాజీవ్ రవి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టెక్నికల్ విషయాలను చూసుకుంటారట. ‘ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్తో వచ్చే డబ్బులను కేరళను మళ్లీ రీ–బిల్డ్ చేసే పనులకు వినియోగిస్తాం’ అని దర్శకుడు మధుసూదనన్ పేర్కొన్నారు. రానా 2 సినిమాలకు బ్రేక్ రానా నటిస్తున్న బహు బాషా చిత్రాలు ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ కూడా కేరళలోని వరదల కారణంగానే ఎఫెక్ట్ అయ్యాయి. ‘హాథీ మేరీ సాథీ’ సినిమా ఎక్కువ శాతం ఏనుగులు, అడవికి సంబంధించిన కథ. ఈ సినిమాకు సంబంధించిన చాలా పోర్షన్ కేరళ దట్టమైన అడవుల్లో షూట్ చేయాలి, కానీ ప్రస్తుతం కేరళలోని వాతావరణ పరిస్థితులు సినిమా షూటింగ్కు అంతరాయం కలిగించాయి అని రానా పేర్కొన్నారు. అలాగే 1945 కోసం వేసిన సెట్ వరదల కారణంగా ధ్వంసం అవడంతో యూనిట్ డైలమాలో పడింది. అయితే ఈ బ్రేక్ తాత్కాలికమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అల్లుడు ఆలస్యం అయ్యాడు కేరళలోని వరదల ప్రభావం కొన్ని తెలుగు సినిమాలపైన కూడా పడింది. హీరో నాగచైతన్య దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రీ రికార్డింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసుకోవల్సి వచ్చింది. కేరళ సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకుడు మారుతి లాస్ట్ మినిట్ వరకూ కేరళ వాతావరణంతో ఫైట్ చేసి రీ–రికార్డింగ్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దాంతో ఈ సినిమాను వచ్చే నెల 13న రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్రబృందం. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
‘కేరళ వరదలకు కారణం అదే’
కొచ్చి: వాతావరణ మార్పుల కారణంగానే ఇటీవల కేరళలో భారీ వర్షాలు, వరదలు పెను విధ్వంసం సృష్టించాయని ప్రముఖ పర్యావరణవేత్త, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్ర భూషణ్ తెలిపారు. గత కొన్నేళ్లలో ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, చెన్నైలో కుంభవృష్టితో పాటు అకస్మాత్తుగా భారీ వరద పోటెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న డ్యాముల నిర్వహణ వ్యవస్థను పునఃసమీక్షించాల్సిన అవసరముందని భూషణ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులతో పశ్చిమ కనుమల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగానే కేరళలో కుంభవృష్టి సంభవించిందనీ, కాంక్రీటు నిర్మాణాలు, ఇతర మానవ చర్యల కారణంగా వరద పోటెత్తి అపార నష్టం సంభవించిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా పశ్చిమ కనుమల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిటీ లేదా కస్తూరిరంగన్ కమిటీ చేసిన సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) సంస్థ భూషణ్కు గతేడాది ఓజోన్ అవార్డును అందజేసింది. మాంట్రియల్ ప్రోటోకాల్ను సవరిస్తూ కిగాలీలో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం చర్చల సందర్భంగా చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. -
కేరళకు విరాళంగా వైఎస్సార్సీపీ శాసనసభ్యుల నెల వేతనం
సాక్షి, అమరావతి: వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు నెల వేతనంతో పాటు అలవెన్సులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. కేరళ రాష్ట్ర సీఎం సహాయ నిధి కోసం ఆ మొత్తం అందేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) తీసి దానిని వైఎస్సార్సీపీ శాసనసభ కార్యాలయం ఇన్చార్జి ఎస్.శివప్రసాద్కు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. చదవండి: కేరళకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం -
కేరళ పునర్నిర్మాణం: సీఎం వినూత్న సూచన
తిరువనంతపురం: ప్రపంచంలోని కేరళీయులందరూ నెలజీతాన్ని విరాళమివ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా కొత్త కేరళను పునర్నిర్మించుకోడానికి సాయపడాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి దాతలకు ఆయన వినూత్న సూచన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు నెల వేతనం సహాయం చేయడానికి ముందుకొస్తారని తమ ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. ముఖ్యంగా దాతలు నెలకు మూడు రోజుల జీతం చొప్పున పదినెలలపాటు ఆర్థిక సహాయాన్ని అందించాలనే సూచన చేశారు. దీని వల్ల దాతలకు పెద్ద భారం ఉండదని పేర్కొన్నారు. కేవలం వరద ప్రభావిత ప్రాంతాలను బాగుచేయడం మాత్రమే కాదు కేరళను పునర్నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధించడం సవాలే, కానీ సాధించి తీరాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది, ఈ నేపథ్యంలో ప్రపంచం నలుమూలలా ఉన్న మలయాళీలంతా ముందుకు రావాలని ముఖ్యమంత్రి అభిలషించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆదివారం సమీక్షించిన కేరళ సీఎం ఇప్పటివరకూ మూడు లక్షలకు పైగా ఇళ్ళు శుభ్రపరిచినట్టు చెప్పారు. దీనితోపాటు ఇళ్లకు చేరిన బాధితులకు 10వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వివరించారు. 1,435 సహాయక శిబిరాలలో రాష్ట్రంలో మొత్తం 4.62 లక్షల మంది ఇప్పటికీ ఉన్నారని వెల్లడించారు. వీరికి తగినంత ఆహార నిల్వలు ఉన్నాయి, అలాగే పాఠశాలలు బుధవారంనుంచి తిరిగి ప్రారంభించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పాఠశాలలోని అన్ని సహాయక శిబిరాలను ఇతర సమీప ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు కేరళ వరదల్లో 357మంది చనిపోగా, లక్షలాదిమంది ప్రజలలు నీడ కోల్పోయి అనాధలుగా మిగిలిలారు. దాదాపు 2వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. మరోవైపు వరద బీభత్సంనుంచి కోలుకునే పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రజలు గుండె నిబ్బరంతో శ్రమిస్తున్నారు. -
కేరళ వరదలు : సల్మాన్ భారీ విరాళం..?
కేరళ వరద బాధితులను ఆదుకోవడం కోసం ఎందరో ముందుకు వస్తున్నారు. వీరిలో సిని పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కేరళ వాసులకోసం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరందరిలోకి అతి ‘భారీ విరాళా’న్ని ప్రకటించిన హీరో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. సల్లు భాయ్ కేరళ బాధితుల కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు నటుడు జావేద్ జాఫెరీ తన ట్విటర్లో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ అభిమానులు ఆయన మంచి మనసును అభినందిద్దామనుకునేలోపే జావేద్ ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. దాంతో అభిమానుల్లో గందరగోళం మొదలయ్యింది. అనంతరం జావేద్ మరో ట్వీట్ చేశారు. ‘కేరళ వరద బాధితుల కోసం సల్మాన్ ఖాన్ 12 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారనే వార్తను నేను కేవలం విన్నాను అంతే. సల్మాన్ లాంటి సూపర్ స్టార్కి అది ఏమంత పెద్ద విషయం కాదు. అలానే బాధితులను ఆదుకోవడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి వెంటనే ఈ విషయం గురించి ట్వీట్ చేశాను. అయితే ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం నాకు తెలియదు’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు. I had tweeted that I had ‘heard’ about @BeingSalmanKhan ‘s bcontribution. Because it was a very strong possibility given his track record, I put forward my thoughts and admiration. Taking the tweet off till I can confirm it — Jaaved Jaaferi (@jaavedjaaferi) August 26, 2018 ఇదిలా ఉండగా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ 1 కోటి రూపాయలను విరాళంగా ప్రకటించగా, ‘గోల్డ్’ నటుడు కునాల్ కపూర్ రూ. 1.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. మరో నటుడు రణ్దీప్ హుడా వాలంటీర్లతో కలిసి కేరళలోని ఖల్సా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనడమే కాక బాధితులకు స్వయంగా ఆహారం వండి పెట్టారు. -
‘బీఫ్ తిన్నందుకే కేరళకు ఈ శిక్ష’
సాక్షి, బెంగుళూరు : బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. దేవభూమిగా పేరొందిన గడ్డపై ఆవు మాంసం తినడంతోనే ఇంతటి ప్రకృతి విపత్తుకు గురైందని అన్నారు. పశుమాంసం తినేవారెవరైనా దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ‘చూడండి కేరళలో ఏం జరిగిందో..! దేవ భూమిగా పేరొందిన చోట విచ్చలవిడిగా ఆవు మాంసం విక్రయాలు చేశారు. బీఫ్ ఫెస్టివల్తో విర్రవీగారు. ఆ ఫెస్టివల్ చేసుకున్న ఏడాదిలోనే ఇంతటి ప్రకృతి విలయం సంభవించింద’ని శుక్రవారం జగిరిన విలేకర్ల సమావేశంలో ఎద్దేవా చేశారు. బసనగౌడ విజయపుర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, పశు మాంసం అమ్మకాలను నిషేదిస్తూ 2017లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కేరళకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీఫ్ ఫెస్టివల్ పేరిట కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య స్పందించారు. ప్రజల్ని రెచ్చగొట్టే, వారి మనోభావాలు దెబ్బతీసేలా మట్లాడడం బీజేపీ నేతలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ప్రకృతి విపత్తులు సంభవించాయన్నారు. ప్రజల అలవాట్లతో ప్రకృతి విధ్వంసానికి ముడి పెట్టొద్దని హితవు పలికారు. జేడీఎస్ జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ కూడా బసనగౌడపై మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడని బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తారని చురకలంటించారు. -
ఫేస్బుక్ లైవ్తో కేరళకు రూ.5లక్షలు సాయం
హిమాయత్ నగర్: కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఫేస్బుక్ సెలబ్రిటీ, దిల్షుక్నగర్ వాసి కొమ్మరాజు దివ్య అన్వేషిత ఇచ్చిన పిలుపునకు అనేకమంది స్పందించారు. సుమారు గంటన్నర్ర పాటు ఆమె ఫేస్బుక్ లైవ్ షో నిర్వహించింది. రూపాయి నుంచి మీ శక్తి మేరకు ఎంతైనా సాయం చేయోచ్చని కోరిందిం. స్పందించిన నెటిజన్లు పేటీఎం ద్వారా రూ.10 నుంచి రూ.20వేల చొప్పున తోచినంత నగదును ట్రాన్స్ఫర్ చేశారు. సుమారు రూ.5లక్షలు దివ్య అన్వేషిత ఫేస్బుక్ లైవ్ద్వారా కేరళకు సాయం చేయడం గమనార్హం. -
కేరళ బాధితులకు శారదాపీఠం సాయం
పెందుర్తి: ఇటీవల కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న గిరిజన ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పించారని, ఆయన ఆదేశాల మేరకు అనేక మంది దాతలను సహాయసహకారాల కోసం సంప్రదించినట్టు ఆ పీఠం ట్రస్ట్ రొబ్బి శ్రీనివాస్ తెలిపారు. ఐపీపీ సెంచరీ క్లబ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విలయతాండవంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలుసుకుని రుషికేష్లో చాతుర్మాసదీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర సరస్వతి అక్కడి ప్రజలకు దుస్తులు, పప్పుదినుసులు తదితర వాటిని అందించాలని శ్రీశారదాపీఠం ట్రస్ట్ సభ్యులను ఆదేశించారన్నారు. కేరళలో కూడా శంకర సేన సేవా ట్రస్ట్ శారదాపీఠానికి అనుబంధంగా ఉందని పేర్కొన్నారు. సేవలందించేవారు శారదాపీఠానికి తెలియజేస్తే శంకర సేన సేవా ట్రస్ట్, శారదాపీఠం ట్రస్ట్ సభ్యులు, శారదాపీఠం భక్తులు అంతా కలిసి కేరళ ప్రాంతంలో వాటిని అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే తొలివిడతగా శంకరసేన సేవా ట్రస్టుకు 5వేల దుప్పట్లు, 2వేల చీరలు, 1500 పంచెలు, 3వేల టవల్స్, ఆహారపదార్థాలు పంపించామని తెలిపారు. రెండో విడతగా ఆదివారం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎంఆర్ షాపింగ్మాల్ అధినేత మావూరి వెంకటరమణ, కృతుంగా రెస్టారెంట్స్ ఎండి నరేందర్రెడ్డి, అభిరుచి స్వీట్స్ అధినేత రామకృష్ణ, హూలీమేరీ ఇంజినీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ వరప్రసాద్రెడ్డి, మహిణ ఇన్ఫ్రా అధినేత సతీష్బాబు విరాళాలు ప్రకటించారు. శ్రీదుర్గా ఐబీపీ సెంచరీ క్లబ్ తరఫున లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళం అందించారన్నారు. శారదాపీఠం ట్రస్టీలు చల్లా రామారావు, సభ్యులు కె.చలపతిరావు, పి.హనుమంతరావు, పి.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
కేరళ వరదలు : దేశమంతా మీ వెంటే..
సాక్షి, న్యూఢిల్లీ : వరదలతో తల్లడిల్లిన కేరళ ప్రజలకు భారత ప్రజలంతా బాసటగా నిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. వాయు, సైనిక, వైమానిక దళాలతో పాటు, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కేరళలో అవిశ్రాంతంగా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. సంక్షోభ సమయంలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందిని తాను అభినందిస్తున్నానని ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజలకు రక్షాబంధన్, జన్మాష్టమి శుభాకాంక్షలతో ప్రధాని మోదీ తన రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఇటీవల మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి దేశానికి చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. భారత రాజకీయ వ్యవస్థల్లో వాజ్పేయి సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని దివంగత నేత కట్టుదిట్టం చేశారన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సంఖ్యాబలంలో మంత్రుల సంఖ్య 15 శాతం మించరాదని వాజ్పేయి హయాంలోనే పరిమితి విధించారన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలప్రదమయ్యేలా వ్యవహరించిన పార్లమెంట్ సభ్యులను ప్రధాని అభినందించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం వేచిచూస్తోందని, ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా దేశ ప్రజలంతా వారి పక్షాన ఉన్నారని తాను హామీ ఇస్తున్నానన్నారు. -
కళ తప్పిన ఓనం
తిరువనంతపురం: అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఓనం వేడుకలతో కేరళ సందడిగా ఉండేది. తీవ్ర వరద విపత్తు కారణంగా శనివారం జరిగిన రాష్ట్ర సంప్రదాయ పండగ పూర్తిగా కళ తప్పింది. ఇంకా చాలా మంది బాధితులు సహాయక శిబిరాల్లోనే ఉండటం, వేలల్లో ఇళ్లు ధ్వంసం కావడంతో పండుగ శోభ కనిపించలేదు. ప్రకృతి ప్రకోపంతో గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చేందుకు పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, మసీదులు, చర్చీల్లోనే కొందరు ఓనం విందులను ఏర్పాటుచేశారు. సంప్రదాయ పూల తివాచీలు పరచి బాధితుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కష్టకాలాన్ని అధిగమించేలా కేరళ ప్రజలకు ఓనం కొత్త శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి ఓనం ఊహించలేదు ‘కొత్తగా కట్టుకున్న మా ఇంట్లో మరోసారి ఓనం జరుపుకోలేమని అసలు ఊహించలేదు. ఈరోజు(శనివారం) తిరు ఓనం. కానీ మేము ఇంకా సహాయక శిబిరంలోనే ఉన్నాం. వర్షాలు, వరదలు మా ఇంటిని నేలమట్టం చేశాయి’ అని 82 ఏళ్ల కుమారి అనే మహిళ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక్క కుమారే కాదు హఠాత్తు వరదలకు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన సుమారు 8 లక్షల మందిదీ ఇదే బాధ, ఇదే వ్యధ. అలప్పుజాలోని ఓ మసీదులో సాదాసీదాగా నిర్వహించిన ఓనం వేడుకల్లో సంప్రదాయ మలయాళ వంటకాలు అవియాల్, పాయసం, సాంబార్లను తయారుచేసి అక్కడ బాధితులకు వడ్డించారు. మృతుల సంఖ్య 293: ఈ నెల 8 నుంచి కేరళ వరదల్లో 293 మంది మృతిచెందగా, 36 మంది జాడతెలియకుండా పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరాశ్రయుల కోసం పునరావాస కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపింది. 26 ఏళ్ల తరువాత తొలిసారి గేట్లు ఎత్తి నీటిని విడుదలచేసిన ఇడుక్కి డ్యాం సమీప ప్రాంతాల్లో అత్యధికంగా 51 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు. త్రిసూర్లో 43 మంది, ఎర్నాకులంలో 38 మంది, అలప్పుజాలో 34 మంది చనిపోయారు. మలప్పురంలో 30 మంది మరణించారు. 2,287 సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్న సుమారు 8.69 లక్షల మంది ఇప్పుడిప్పుడే సొంతిళ్లకు చేరుకుంటున్నారు. సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. సహాయక చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి విజయన్కు వైమానిక దళం రూ.20 కోట్ల చెక్కు అందించింది. -
కేరళ వరదలు: ఇంట్లోకి పాము..
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న కేరళ ప్రజలకు ఇప్పుడు పాముల భయం వెంటాడుతోంది. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుతున్న వారు ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి బోరుమంటున్నారు. వరదలతో ఇళ్లలో నక్కిన పాములను చూసి భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే పాము కాట్లతో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. మాములుగా చిన్నకీటకాలను చూస్తేనే భయంతో వణికిపోతారు మహిళలు. అలాంటిది ఓ మహిళ తన ఇంటికి వచ్చిన ఓ కొండచిలువను ధైర్యంగా వెళ్లగొట్టిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇంటి ప్రహారి గోడపైకి ఎక్కిన పామును ఆ మహిళ బూజు కర్రతో వెళ్లగొట్టి తమ కుటుంబాన్ని రక్షించింది. ఏ మాత్రం జంకకుండా పదేపదే కర్రను నేలకు కొడుతూ ఆ పామును వెళ్లగొట్టింది.ఆమె సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
కేరళకు యూఏఈ సాయం; ఎవరిది తప్పు?
సాక్షి, న్యూఢిల్లీ : జల ప్రళయానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇస్తానన్న ఆర్థిక సహాయాన్ని కేంద్రం తిరస్కరించిందన్న వార్తలపై కేంద్రం, కేరళ మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం నాడు మరో మలుపు తిరిగింది. యూఏఈ ఆఫర్ గురించి మీకు ఎవరు చెప్పారు? ఆ వార్త ఎలా వచ్చింది? కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి వివరణ కోరడం, అసలు అలాంటి ఆఫరే యూఏఈ నుంచి రాలేదని బీజేపీ నాయకుడు అమిత్ మాలవియా శుక్రవారం ప్రకటించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు యూఏఈ ముందుకు వచ్చిందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆగస్టు 21వ తేదీన ట్వీట్ చేశారు. ఇది కేంద్రం ఇప్పటి వరకు ప్రకటించిన ఆర్థిక సహాయం 600 కోట్ల రూపాయలకన్నా అధికం అవడంతో ఆయన ట్వీట్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ వార్త తప్పన్న విషయమై వాట్సాప్ గ్రూపుల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ వార్తలో నిజమెంతుంది? అబద్ధమెంతుంది? అందుకు బాధ్యులెవరు? అన్న అంశాన్ని పరిశీలించాల్సిందే. అయితే వార్తా వ్యాప్తి క్రమాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చూడాలి. కేరళ జల ప్రళయం గురించి తెలియగానే యూఏఈ స్పందిస్తూ తమ దేశ విజయగాధలో కేరళ ప్రజల పాత్ర ఉన్నందున కేరళకు సహాయం చేయాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. కేరళ సహాయక చర్యలకు సహకరించేందుకు ఓ అత్యవసర కమిటీని ఏర్పాటు చేశామని యూఏఈ ఆగస్టు 18వ తేదీన ప్రకటించింది. కష్ట కాలంలో కేరళ ప్రజలను ఆదుకోవడానికి యూఏఈ ముందుకు వచ్చినందుకు ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అల్ మక్తౌమ్కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 21వ తేదీన కేరళ సీఎం పినరయి విజయన్, 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిందని ట్వీట్ చేశారు. యూఏఈ ఈ విషయాన్ని ముందుగా గల్ఫ్లో అతిపెద్ద రిటైల్ చెయిన్ కలిగిన ‘లూలూ గ్రూప్’ యజమాని, మలయాళి వ్యాపారి యూసుఫ్ అలీ ఎంఏకు తెలియజేసిందని, నరేంద్ర మోదీకేమో అబుదాబీ రాజు షేక్ మొహమ్మద్ అల్ నాహ్యన్ ఈ విషయాన్ని తెలియజేశారని కేరళ సీఎంవో వరుస ట్వీట్లలో తెలియజేసింది. ఈ ట్వీట్లను ఆ రోజున యూఏఈగానీ, పీఎంవో కార్యాలయంగానీ ఖండించలేదు. ఈ ఆఫర్ను స్వీకరించేందుకు ప్రధాని మోదీ సుముఖంగా లేరని, విదేశీ సహాయం స్వీకరించకూడదనే కేంద్రం వైఖరికే ఆయన కట్టుబడి ఉన్నారంటూ ఆ మరుసటి రోజు, అంటే ఆగస్టు 22వ తేదీన అభిజ్ఞ వర్గాల పేరిట వార్తలొచ్చాయి. కేరళను ఆదుకునేందుకు పలు విదేశీ ప్రభుత్వాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకు ధన్యవాదాలు. విదేశీ విరాళాలను స్వీకరించకుండా స్వదేశీ నిధులను సహాయక చర్యలకు వెచ్చించే పద్ధతినే పాటిస్తాం. ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయక నిధులను కేరళ పునర్నిర్మాణానికి ఖర్చు పెడతాం. ఎన్ఆర్ఐ, పీఐవోలతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి మాత్రం ఆర్థిక సహాయాన్ని స్వీకరిస్తాం అంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళకు వచ్చిన విపత్తు అసాధారణమైనది కనుక, ఇలాంటి సమయాల్లో ఆర్థిక సహాయం తీసుకోవచ్చంటూ 2015 నాటి మోదీ ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్’ చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారికి విదేశీ సహాయాన్ని స్వీకరించాల్సిందిగా తన సీనియర్లను కోరుతున్నానని కేంద్ర బీజేపీ మంత్రి కేజే ఆల్ఫాన్స్ వ్యాఖ్యానించారు. ఆగస్టు 24: భారత్కు తాము ఇంత మొత్తం ఆర్థిక సహాయం చేయాలంటూ కచ్చితమైన సంఖ్యనేమీ సూచించలేదని, ఎంత సహాయం అందించాలనే విషయమై ఇంకా కసరత్తు జరుగుతోందని భారత్లోని యూఏఈ రాయబారి ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’తో వ్యాఖ్యానించారు. అదే రోజు బీజేపీ నాయకులు కేరళ ప్రభుత్వంపై దండయాత్ర ప్రారంభించారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తామనే ఆఫర్నే రాయబారి ఖండించినట్లు వారు ప్రచారం చేశారు. వాస్తవానికి ఆఫర్ను రాయబారి ఖండించలేదు. 700 కోట్ల రూపాయలను ఇస్తామన్న సంఖ్యను మాత్రమే ఆయన ఖండించారు. యూఏఈ ఆఫర్ను మోదీ ప్రభుత్వం తిరస్కరించిందన్నదే ఇక్కడ వార్తగానీ ఎంత అన్న సంఖ్య ముఖ్యం కాదు. కేంద్రం కన్న ఆఫర్ మొత్తం ఎక్కువ ఉన్నందున కేంద్రం పరువు తీయడానికి ఈ సంఖ్యను సృష్టించే అవకాశం కూడా ఉంది. మరి వాస్తవాలు తెలియడం ఎలా? గల్ఫ్ దేశం మోదీకే నేరుగా ఆఫర్ చేసిందని పినరయి విజయన్ చెప్పారు. తనకు ఆఫర్ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. తనకు ప్రముఖ మలయాళి గల్ఫ్ వ్యాపారస్థుడు యూసుఫ్ అలీ చెప్పారని తెలిపారు. ఇటు కేరళతోపాటు అటు ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం, యూఏఈ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయనకు వాస్తవం తెలియాలి. మోదీ ముందుకు ఆఫర్ తీసుకొచ్చిన వారికి, ఆఫర్ను తిరస్కరించిన మోదీకి వాస్తవాలు తెలియాలి. దీనిపై ఇంత వివాదం జరుగుతున్నా మోదీ గానీ, ఆయన కార్యాలయంగానీ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. -
భారత వైమానిక సంస్థ భారీ విరాళం
తిరువనంతపురం: కేరళ వరద బాధితుల సహాయార్ధం భారత వైమానిక సంస్థ భారీ విరాళాన్ని అందించింది. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ వాసులను భారీగా సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సంస్థ తాజాగా ఆర్ధిక సహాయాన్ని కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వరద సహాయనిధికి 20కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. సీఎం డిస్ట్రస్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్ఎఫ్) చెక్ను శనివారం ఐఏఎఫ్ అందించింది. కేరళ అంతటా వరద తుఫాను ప్రాంతాల్లో ఒక వారం పాటు కొనసాగిన రెస్క్యూ కార్యక్రమాలలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం ఈ భారీ విరాళాన్ని ప్రకటించింది. తిరువనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్ను కలిసిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, సౌత్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ బి సురేష్ బృందం ఈ చెక్ను అందజేసింది. -
ఐఫోన్ కంపెనీ విరాళమెంతో తెలుసా?
తిరువనంతపురం : ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ భారీ వరదలతో అతలాకుతలమైంది. వందలాది మంది మరణించగా... లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కకావికలమైన కేరళను కాపాడేందుకు యావత్ భారత దేశం ముందుకొస్తోంది. డబ్బు, నిత్యావసర వస్తు సామాగ్రిని సాయం చేస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ కూడా కేరళకు ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘కేరళలో వరదల పరిస్థితి గురించి తెలిసి మేం ఎంతగానో దిగ్భ్రాంతి చెందాం. కేరళ సీఎం సహాయనిధి, మెర్సీ కార్ప్స్ ఇండియాకు రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నాం. వీటిని అవసరమైన దగ్గర స్కూళ్లను, ఇళ్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగించండి’ అని ఆపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. కేరళను ఆదుకునేందుకు ముందుకురావాలని ఆపిల్ తన యూజర్లను ప్రోత్సహిస్తోంది. తన హోమ్ పేజీలో సపోర్ట్ బ్యానర్లను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక యాప్ స్టోర్, ఐట్యూన్లలో మెర్సీ కార్ప్స్కు విరాళాలు అందించేందుకు డొనేట్ బటన్ ఏర్పాటుచేసింది. ఈ బటన్ ద్వారా ఆపిల్ యూజర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో కేరళకు విరాళం ఇవ్వొచ్చని వెల్లడించింది. భారీ ఎత్తున సంభవించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపిల్ తన ఐట్యూన్స్ స్టోర్, ఆపిల్ స్టోర్ల ద్వారా విరాళాలు సేకరించి, తీవ్రంగా దెబ్బతిన్న వాటికి సాయంగా అందిస్తూ ఉంటుంది. ఆపిల్ కస్టమర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను వాడి 5 డాలర్లు, 10 డాలర్లు, 25 డాలర్లు, 50 డాలర్లు, 100 డాలర్లు, 200 డాలర్లను మెర్సీ కార్ప్స్కు డొనేట్ చేయొచ్చు. కాగ భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు తరలివెళ్తున్నారు. మరోవైపు కేరళను ఆదుకునేందుకు స్వదేశీయులతో పాటు విదేశీయులు సైతం ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తూ కేరళ ప్రజలకు అండగా ఉంటున్నారు. -
కేరళకు ప్రముఖ ఆలయాల విరాళాలు
సాక్షి,హైదరాబాద్ : కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అక్కడ సంభవించిన వరదల్లో ఆస్తి నష్టంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం నలుమూలల నుంచి కేరళకు విరాళాలు, సహాయ సహాకారాలు అందుతున్నాయి. తాజాగా ప్రముఖ దేవాలయాలు కేరళకు ఆర్థిక సహాయాన్ని అందించాయి. శబరిమల అయ్యప్ప ఆలయం రూ. 10కోట్లు, తిరుమల దేవస్థానం రూ.5కోట్లు, షిర్డీ సాయి ఆలయం రూ.5కోట్లు, ముంబై సిద్ధివినాయక ఆలయం రూ. కోటి, జమ్మూకశ్మీర్ వైష్ణోదేవి ఆలయం రూ.కోటి, కొల్లురూ మూకాంబికా దేవాలయం రూ.1.25కోట్లు, పండరీపుర్ ఆలయం రూ.25లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. -
కేరళకు యూఏఈ విరాళంపై వివాదం
-
కేరళ వరద బాధితులకు మేకపాటి రూ.కోటి విరాళం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా రూ.కోటి విరాళాన్ని కేఎంసీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహయనిధికి అందజేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28,29 తేదీల్లో స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసి డీడీని అందజేసి, వరద బాధితుల పునరావసం, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని కోరతారని తెలిపారు. -
వరద సాయంలోనూ రాజకీయాలేనా?
సాక్షి, హైదరాబాద్: కేరళలో వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, సాయం చేయడంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ మండిపడ్డారు. నగరంలోని మగ్దుంభవన్లో 2 రోజుల పాటు సాగే రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అతుల్కుమార్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రం 60 శాతం వరదలతో నష్టపోయిందన్నారు. కేరళకు సహాయం చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ సంకుచిత భావాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాజ్పేయి కలశయాత్రల పేరిట ఓట్ల కోసం మోదీ శవ రాజకీయాలకు దిగజారుతున్నారని విమర్శించారు. నిజంగా మోదీకి ఎస్సీల మీద ప్రేమ ఉంటే మేధోమధన కమిటీతో ఎందుకు నాలుగేళ్లుగా సమావేశాలు పెట్టలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల దేహాలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ సభ పెట్టుకుని ప్రగతి నివేదిక ఏమని ఇస్తారని ప్రశ్నించారు. పౌరహక్కుల రక్షణ, ప్రజాస్వామిక పాలన జరగాలంటే మరోసారి టీఆర్ఎస్ను గెలిపించొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం భావ సారూప్యత గల పార్టీలతో పొత్తు ఉంటుందన్నారు. -
కేరళపై ఇంత వివక్షా?
ప్రకృతి విలయతాండవంతో మొత్తం 14 జిల్లాలు నీటిలో మునిగి కేరళ రాష్ట్రం నేడు ఒక దీవిగా మారింది. ఆవాసాలు నీటిలో మునిగి తిండి, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో, తమ తమ శక్తిమేరకు సాయం చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఉండే భారతీయులు సైతం సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కాగా ప్రధాని మోదీ వైఖరి మాత్రం తీవ్ర వివాదాస్పదమౌతుంది. కేరళ రాష్ట్రానికి తక్షణ సహాయక చర్యల కోసం రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ప్రకటించడం బాధాకరం. ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులు చూసి కూడా మోదీ ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోవని, ఇలాంటి పరిస్థితుల్లో వివక్ష చూపరాదని హితవు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశ ప్రజల సొమ్ముకు కాపలా దారుగా ఉండాల్సిన ప్రధాని మోదీ దుబారా ఖర్చులకు, వ్యక్తిగత అభీష్టానికి, బీజేపీ, సంఘ్ పరివార్ ఉనికిని కాపాడుకోవటానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 2019లో జరుగబోయే అర్ధ కుంభమేళా ఏర్పాట్లకు రూ.1200 కోట్లు కేటాయించారు. 2015 ఆగస్టులో బిహార్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సాయం కింద ఎంత కావాలంటూ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేలంపాట పాడి మరీ ప్రకటించారు. 2014–16 మధ్య వరుసగా రెండేళ్లు అనావృష్టి పాలైన తెలం గాణ రాష్ట్రంలో ఇన్–పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల సాయం అడుగగా, రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చి మోదీ చేతులు దులుపుకొన్నారు. 2014 అక్టోబర్లో హదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్టానికి రూ. 1,000 కోట్లు ప్రకటించారు కానీ, రూ.400 కోట్లకు మించి విడుదల చేయలేదు. 2015 డిసెంబరులో చెన్నై సిటీ జలదిగ్బంధం అయినప్పుడు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూ. 5 వేలకోట్లు తక్షణ సాయం కోరగా, ఒక వెయ్యి కోట్లు ప్రకటిం చారు. ఇప్పటికైనా సర్వస్వం కోల్పోయిన కేరళ రాష్ట్రంపై వివక్ష చూపకుండా, నిలువ నీడ లేకుండా పోయిన ప్రజలను మోదీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆకాంక్షిద్దాం. కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు ‘ 98667 76999 -
కేరళ వరదలు: ఒక్కో కుటుంబానికి రూ. లక్ష రుణం
తిరువనంతపురం : వరదలతో ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు కేరళ ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. కుటుంబంలోని మహిళ పేరుతో రూ లక్ష వరకూ అందించే ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందని సీఎం తెలిపారు. ఆగస్టు 8 నుంచి కురిసిన భారీ వర్షాలతో కేరళ చిగురుటాకులా వణికింది. కనీవినీ ఎరుగని వరదలతో 231 మంది మరణించగా 26,000కు పైగా గృహాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలు వరద ధాటికి కొట్టుకుపోయాయి. వేలాది పునరావాస శిబిరాల్లో పది లక్షల మందికి పైగా తలదాచుకుంటున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదలతో కేరళకు రూ. 20,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఈ మొత్తం ప్రస్తుత సంవత్సర ప్రణాళిక వ్యయంతో సమానం కావడం గమనార్హం. 40,000 హెక్టార్లలో పంట దెబ్బతిందని సీఎం విజయన్ వెల్లడించారు. కేంద్రం కేరళకు ఇతోధికంగా వరద సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కేరళ వరదలు: యూపీలో ఘాటెక్కిన ధరలు
లక్నో : గడిచిన వందేండ్లలో ఎన్నడూలేనంతగా వరదలు సృష్టించిన బీభత్సానికి కేరళ వాణిజ్య పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాఫీ, టీ, యాలకులు, మిరియాలు, రబ్బరు, అరటి తోటలన్నీ నేలకొరిగాయి. ఆరుగాలం కష్టించిన రైతన్నలకు ఇక కన్నీళ్లే మిగిలాయి. దీంతో ఒక్కసారిగా ధరల వాత కూడా మోగిపోతుంది. కేరళ వరదలతో ఉత్తరప్రదేశ్లో ధరలు హీటెక్కాయి. ఉత్తరప్రదేశ్లో ప్రముఖ మార్కెట్ అన్నింటిల్లోనూ మసాలా దినుసుల ధరలు ఘాటుఘాటుగా ఉన్నాయని తెలిసింది. కేరళ మసాలా దినుసుల ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారిగా ఉంది. కేరళ నుంచి సప్లై ఆగిపోవడంతో, తూర్పు యూపీలో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్గా ఉంటున్న వారణాసిలోని దీననాథ్ మార్కెట్లో మసాలా దినుసుల ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. కేరళను ముంచెత్తిన వరదలతో గత రెండు వారాల నుంచి దీననాథ్ మార్కెట్లోకి మసాలా దినుసుల సరఫరా తగ్గిపోయిందని ట్రేడర్ రామ్ జి గుప్తా తెలిపారు. ఈ కొరతతో ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు చెప్పారు. నల్లమిరియాల ధరలు కేజీకి 315 రూపాయల నుంచి 400 రూపాయలకు పెరిగాయని, యాలుకల ధరలు కేజీకి 1300 రూపాయల నుంచి 1700 రూపాయలు పెరిగినట్టు మరో ట్రేడర్ అనిల్ కేసరి తెలిపారు. ఇక లవంగం ధరలు కేజీ 600 రూపాయలుంటే, ఇప్పుడు 700 రూపాయలున్నట్టు చెప్పారు. ఇతర మసాలాల ధరలు కూడా ఇదే విధంగా పెరిగాయని చెప్పారు. ఇక ఫతేపూర్ జిల్లా హోల్సేల్ మార్కెట్లో కూడా మసాలాల ధరలు దాదాపు 30 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ధరల పెంపుపై స్పందించిన స్థానిక వర్తకులు.. యాలుకల ధరలు కేజీకి 1200 రూపాయల నుంచి 1600 రూపాయలు పెరిగినట్టు చెప్పారు. ఒకవేళ మసాలాలు త్వరగా మార్కెట్కు రాకపోతే, వీటి ధరలు 50 శాతానికి పైగా పెరిగే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. బరేలి హోల్సేల్ మార్కెట్లో కూడా వీటి ధరలు 15 శాతం కాకపుట్టిస్తున్నాయి. కేరళలో సృష్టించిన ఈ ప్రకృతి విలయతాండవం దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కూడా ప్రభావం చూపుతుంది. మసాలాలు మాత్రమే కాక, కొబ్బరి సప్లై కూడా నిలిచిపోయిందని అలహాబాద్ జిల్లా హోల్సేల్ మార్కెట్ చెబుతోంది. మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉండటంతో, ధరలు మరింత హీటెక్కుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఈసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
స్పైడర్మేన్, బ్యాట్మేన్, ఐరన్మేన్లు కలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘హాలీవుడ్కు స్పైడర్ మేన్, బ్యాట్మేన్, ఐరన్మేన్లు ఉంటే కేరళ వాసులకు వీరందరు కలిసిన ఫిషర్మెన్’ ఉన్నారన్న కొటేషన్తో కేరళ వరద ప్రాంతాల్లో మత్స్యకారులు లేదా జాలర్లు అందించిన సేవలను సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వారి సహాయక చర్యలు అమోఘమని చెప్పడానికి పడవ పక్కన ఎర్రటి వర్షపు కోటును ధరించి కుడి చేతిలో భారీ తెడ్డును పట్టుకొని ఠీవీగా నిలబడిన మత్స్యకారుడి ఫొటోను కొటేషన్ కింద పొందుపర్చారు. ఇక పక్క పడవలో కేరళ రాష్ట్ర నమూనాను చూపించారు. సమాజంలోని విద్యార్థులు, వృత్తినిపుణులు, నావికులు, సాయుధ దళాల సిబ్బంది కుల, మత భేదాలు లేకుండా నిస్వార్ధంగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పుడు ఒక్క మత్స్యకారుల సేవలనే కొనియాడడం సమంజసం కాదని కొందరికైనా అనిపించవచ్చు. కానీ కేరళ వాసుల్లో సామాజికంగా బాగా వెనకబడిన అట్టడుగు వర్గాల వారు మత్స్యకారులు. మనష్యులకు దూరంగా బతికే సముద్రపు అల్లకల్లోల ప్రపంచం వారిది. ఏ పూటకాపూట వెతుక్కునే జీవితాలు వారివి. ఇతర మానవ సమాజంతో వారు కలిసేదే బహు తక్కువ. చేపల వేట నుంచి రాగానే వారు తెగిన వలల పోగులను అల్లుకొనో దెబ్బతిన్న పడవల మరమ్మతు చేసుకొనో మళ్లీ రేపటి వేటకు సిద్ధమవుతారు. రాత్రికి ఇంత తిని పడుకుంటారు. వారికి పక్కా ఇళ్లుగానీ, ఇళ్ల పట్టాలుగానీ ఏ ప్రభుత్వం ఏనాడు కల్పించలేదు. వారు ఏనాడు డిమాండ్ చేయనూ లేదు. అలాంటి వారు నిస్వార్థంగా సేవలందించడం ఎప్పటికీ ఎనలేనిదే. ముఖ్యంగా పట్టణం తిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో వారు అందించిన సేవలు అమోఘం. దాదాపు వెయ్యి మంది జాలర్లు, ఐదు వందల బోట్లతో, సొంత డబ్బుతో ఇంధనం కొని సేవలు అందించడం మామూలు విషయం కాదు. కాకపోతే సముద్రపు అలల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో బోట్లను నడిపిన అనుభవం వారికి సహాయక చర్యల్లో ఎంతో ఉపయోగపడింది. ఒక్క అలప్పూజా ప్రాంతంలోనే వారు 16000 మంది ప్రజల ప్రాణాలను రక్షించారని ఆ జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘అరే సరిగ్గా చదువుకోకపోతే మత్స్యకారుడివి తప్పా మరేమి కావంటూ మా ట్యూషన్ మాస్టర్ తిట్టినప్పుడు నిజంగా బాధ పడేవాడిని. నిజంగా నేడు వారిని చూస్తే గర్వంగా ఉంది. నీట మునిగిన ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ నుంచి నా సోదరిని రక్షించి తీసుకొచ్చారు. అందుకు ప్రతిఫలంగా తీసుకోవాల్సిందిగా ఓ నోట్ల కట్టను అందజేసినా, తమరు తమకు సోదరి లాంటి వారేనంటూ డబ్బును తిరస్కరించినట్లు నా సోదరి ఏడుస్తూ చెప్పడం నాకు ఏడుపు తెప్పించింది’ ఒకరు వాట్సాప్లో సందేశం పెట్టారు. ఇలాంటి సందేశాలు మరెన్నో! వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలతో మత్స్యకారుల పాత్ర ముగిసింది. ఇందులో వారు పలువురు గాయపడ్డారు. కొందరి బోట్లు కూడా దెబ్బతిన్నాయి. కేరళ పునర్నిర్మాణంలో వారి పాత్ర ఎలాగు ఉండదు. త్వరలోనే వారిని ప్రజలు మరచిపోవచ్చు. నేడు మత్స్యకారుల సేవలను కొనియాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు. భారీ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. రాజకీయావసారాల కోసం మాట్లాడడం ఆ తర్వాత మరచిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. కానీ ప్రజలు అలా వారి సేవలను మరచిపోరాదు. తమ ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను తర్వాతనైనా గుర్తించి అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి గతేడాది వచ్చిన ‘ఓఖీ’ తుపానులో ఈ నాటి వరదల కన్నా ఎక్కువ మంది మత్స్యకారులు మరణించారు. వారి పాకలు కొట్టుకుపోయాయి. వారికి అందిన సహాయం అంతంత మాత్రమే. వారిది రోజూ చస్తూ బతికే జీవితమే. అధికారిక లెక్కల ప్రకారమే చేపల వేటకు వెళ్లన మత్స్యకారుల్లో నాలుగు రోజులకు ఒకరు చొప్పున మరణిస్తున్నారట. ప్రజలే ముందుగా తమకు సాయం చేసిన మత్స్యకారులను గుర్తించాలి, ముఖ్యంగా పడవలు దెబ్బతిన్న వారిని గుర్తించి, వారి పడవలకు మరమ్మతులు చేయించాలి. అవసరమైన వారికి వలలు కొనివ్వాలి. ఆ తర్వాత వారి ఇళ్ల స్థలాల కోసం వారి తరఫున ప్రభుత్వంతో పోరాడి ఇప్పించాలి. అందులో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికే ప్రాధాన్యత ఉండేలా చూడాలి. ఆ తర్వాత వారి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. వారికి జాతీయ, రాష్ట్ర రిస్క్యూ టీముల్లో ఉద్యోగాలు వచ్చేలా చూడాలి. అంతిమంగా వారి సేవలు చిరస్మరణీయంగా ఉండేలా ఓ మెమోరియల్ లాంటిది ఏర్పాటు చేయాలి. వారి సహకార సంఘం కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించేలా ఉంటే ఇంకా బాగుండవచ్చు. వీటి సాధన కోసం నవంబర్ 21న రానున్న మత్స్యకారుల దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదేమో! -
కేరళకు సన్నీలియోన్ సాయం ఏంటో తెలుసా?
ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ కేరళ వరద బాధితుల కోసం రూ.5 కోట్లు సాయం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే అదంతా అసత్య ప్రచారం అని కూడా స్పష్టం అయింది. అయితే సన్నీ మాత్రం కేరళ వరద బాధితులకు కావాల్సింది ఇస్తున్నానని ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. భర్త డానియెల్ వెబర్, మరికొంత మంది బాలివుడ్ స్నేహితుల సాయంతో 1200 కేజీల రైస్, పప్పును పంపించింది. ‘ఈ రోజు నేను, డేనియల్ కలిసి కేరళలోని కొంత మందికి ఆహారం అందించగలుగుతున్నాం. 1200 కిలోల బియ్యం, పప్పు(1.3 టున్నులు) అందించాం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికేం కావాలో నాకు తెలుసు. ఇంకా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జుహులో అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిన ప్రతీక్, సిద్ధార్థ్ కపూర్, సువేద్ లోహియా చాలా గొప్పవారు’ అని సన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. (చదవండి: కేరళ వరదలు: రోనాల్డో 72.. కోహ్లి 82 కోట్లట!) Today @dirrty99 and I hopefully will able to feed a few of the many people in Kerala that need a warm meal with 1200kg’s (1.3tons) of rice and daal. I know it’s not a dent in what actually needs to be sent and I wish I could do more. Humanity at its finest @_prat @suved @siddhanthkapoor the men that arranged an amazing event at “B” in Juhu to bring help to those in need! You guys are so amazing! A post shared by Sunny Leone (@sunnyleone) on Aug 23, 2018 at 10:49am PDT -
యూఏఈ అంబాసిడర్ సంచలన ప్రకటన
తిరువనంతపురం: వరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీసాయాన్ని ప్రకటించడం ఆకర్షణీయంగా నిలిచింది. అయితే తాజాగా యూఏఈ ఆర్థికసాయంపై మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ భారీ సాయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలేదని యూఏఈ అంబాసిడర్ ప్రకటించారని ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. కేరళకు అందించే ఆర్థిక సహాయం నిర్దిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. వారికందించాల్సిన విరాళాలపై తమ అంచనా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పారని రిపోర్ట్ చేసింది. అయితే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేవలం 600 కోట్ల రూపాయలిచ్చి కేంద్రం చేతులు దులుపుకోగా గల్ఫ్దేశం రూ.700 కోట్ల భారీ సాయం అందించిందంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు విదేశీ ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా భారీ చర్చకు తెరతీసిన సంగతి తెలిసిందే. విదేశీసాయంపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే, యూఏఈ రాయబారి ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు యూఏఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేయడం కూడా గమనార్హం. మరి తాజా గందరగోళంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు గల్ఫ్ దేశం సాయాన్నితిరస్కరించడంపై పలువురు నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ గల్ఫ్ దేశం ఇచ్చింది రుణంకాదు, సాయం, విపత్తు నివారణ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే యూఏఈ సహాయాన్ని ఆమోదించేలా విధానంలో సవరణలు తేవాలంటూ ప్రధాని మోదీకి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఒక లేఖ రాశారు. ప్రజల బాధలను నిర్మూలించేలా విధానాలు ఉండాలి, విదేశీ ఆర్థిక సహాయాన్ని ఆమోదించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, దయచేసి తగిన మార్పులను తీసుకురావాలని ఆయన కోరారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ యూఏఈ సహాయంపై స్వయంగా మీడియాకు తెలియజేసారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారని వెల్లడించారు. -
కేరళ వరదలు: ఈ దండి గుండెకు దండాలు
సాక్షి, చెన్నై: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మానవత్వంతో స్పందించే మంచి మనుషులు, పెద్దమనుషుల గురించి మనకు తెలుసు. అయితే బాధితుల కష్టాల పట్ల చలిస్తున్న ‘పెద్ద’మనుసున్న చిన్నారుల గురించి తెలుసుకుంటే.. బాలలు కల్లకపట మెరుగని కరుణా మయులే అనింపిచకమానదు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న తమిళనాడుకు చెందిన ఓ బాలిక చేసిన సాయం విశేషంగా నిలిచింది. గుండె ఆపరేషన్కోసం విరాళాల రూపంలో సేకరిస్తున్న సొమ్మును కేరళ వరద బాధితులకు డొనేట్ చేసి అపారమైన తన దాతృత్వ గుణాన్ని చాటుకుంది. కేరళ వరద బాధితుల గాధల్ని టీవీలో చూసిన అక్షయ(12) చిన్ని గుండె కదిలిపోయింది. అందుకే తనకు డబ్బులు ఎంత అవసరమో తెలిసినా, నిస్వార్ధంగా స్పందించింది. 5వేల రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఎందుకంటే పుట్టుకతోనే హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న అక్షయకు ఇప్పటికే ఒకసారి (నవంబర్, 2017)లో ఒకసారి గుండె శస్త్రచికిత్స జరిగింది. ఇపుడు మళ్లీ తీవ్ర సమస్యలు తలెత్తడంతో రెండవసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన అక్షయ కుటుంబం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆపరేషన్కు అవసరమైన సొమ్మును సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 20వేలు సమకూరాయి. ఈ డబ్బులోంచే ఇపుడు 5వేల రూపాయలను కేరళ వరద బాధితులకు దానం చేయడానికి ముందుకు వచ్చింది. అక్షయ తమిళనాడులోని కరూర్ జిల్లాలోని తాంతోనిమలై సమీపంలో కుమారపలయం అనే చిన్న గ్రామంలో పుట్టింది. అక్షయ తల్లి జోతిమణి. తండ్రి ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ దంపతుల ముగ్గురి కుమార్తెల్లో పెద్ద పాప అక్షయ. రోజువారీ వేతన వ్యవసాయ కార్మికాలిగా పనిచేస్తూ తల్లి జోతిమణి కుటుంబాన్నిఒంటరిగా నెట్టుకొస్తోంది. మొదటిపారి గుండె ఆపరేషన్ కోసం ఫేస్బుక్లో విరాళాల ద్వారా 3.5 లక్షల రూపాయలు సేకరించగలిగామని జోతిమణి తెలిపారు. ఈ సారి కూడా అదే ప్రయత్నాల్లో ఉండగా అక్షయ నిర్ణయం తనను కదిలించిందని చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ప్రతీ చిన్నసహాయం ఎంత ముఖ్యమైందో, విలువైందో తెలుసు. అందుకే అక్షయ ఇష్టాన్ని కాదనలేకపోయానని జోతి తెలిపారు. కాగా ఇటీవల వరదల్లో కేరళలో ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల బాధల్ని గాధల్ని చూసి చలిస్తున్న చిన్నారులను చూస్తుంటే మాయమర్మమేమిలేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే అన్న ఆరుద్ర పదాలు గుర్తురాకమానవు. దండిగుండెతో కదులుతున్న ఈ చిన్నారుల సాయం కేరళలోని నిజమైన బాధితులకు చేరాలని కోరుకుందాం. -
తమిళనాడు వల్లే మాకు వరదలోచ్చాయి
-
కేరళను మినహాయించండి
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విదేశీ సాయం తీసుకోరాదన్న పాలసీ నుంచి కేరళకు ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు అందించాలనుకున్న రూ.700 కోట్ల సాయానికి కేంద్రం మోకాలడ్డటంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘గత 50 ఏళ్లలో కేరళ కారణంగా దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం లభించింది. 2017లో మలయాళీలు స్వదేశానికి రూ.75,000 కోట్ల విదేశీ మారకాన్ని పంపారు. దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో కేరళ ఒకటి. ఈ కారణాలరీత్యా కేరళ వరదలను ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి, విదేశీ సాయంపై ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని జూనియర్ మంత్రిగా నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయనీ, వాళ్లకు కనీసం దుస్తులు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి పెద్దమొత్తంలో నగదు అవసరమని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. తాము రూ.2,200 కోట్లు సాయం కోరితే కేంద్రం మాత్రం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహారశైలి ‘అమ్మ తాను అన్నం పెట్టదు. అడుక్కుని అయినా తిననివ్వదు’ రీతిలో ఉందని ఘాటుగా విమర్శిచారు. మరోవైపు, యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలకు విదేశీ సాయం స్వీకరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కేవలం సహాయ కార్యక్రమాలకు విదేశీ సాయం తీసుకోకూడదని మాత్రమే 2004లో మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. విదేశీ సాయం స్వీకరించొచ్చు: ఎన్డీఎంఏ అత్యవసర పరిస్థితుల్లో విదేశాలు మానవతా దృక్పథంతో అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) 2016లో రూపొందించిన ఓ పత్రం వెల్లడించింది. కేరళ వరద బాధితులకు యూఏఈ సాయం ప్రకటించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్డీఎంపీ) పేరిట తెచ్చిన ఆ పత్రంలో ‘ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు విదేశీ సాయానికి అర్థించకూడదనేది జాతీయ విధానంలో భాగం. కానీ విదేశాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విపత్తు బాధితులకు అండగా ఉంటామంటే, ఆ సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చు’ అని ఉంది. దానిలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ల సందేశాలు ఉన్నాయి. విదేశీ సాయాన్ని ఎలా వినియోగించుకోవాలో విదేశాంగ శాఖతో కలసి హోం శాఖ నిర్ణయిస్తుందని పత్రం తెలిపింది. ఎన్డీఎంపీపై వ్యాఖ్యానించేందుకు హోంశాఖ అధికారులు నిరాకరించారు. -
మానవత్వమే మతం
కొచ్చి: నవత్వానికి మతాలు అడ్డురావని వారు నిరూపించారు. విపత్కర పరిస్థితుల్లో అన్య మతస్తుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించి ఆదర్శంగా నిలిచారు. వరదల ఉధృతికి త్రిసూర్ జిల్లాలోని కోచ్కడవులోని జుమా మసీదును వరదనీరు ముంచెత్తింది. దీంతో సమీపంలోని రత్నేశ్వరి ఆలయంలోని హాలులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయ కమిటీ అంగీకరించింది. ప్రార్థనలు చేసుకోవడానికి హాలులో ఏర్పాట్లుచేసింది. ‘బుధవారం కల్లా వరద నీరు తగ్గితే, ప్రార్థనలు చేసుకోవచ్చని భావించాము. కానీ నీరు అలాగే ఉంది. దేవాలయ కమిటీ సభ్యులను కలవగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి వెంటనే అంగీకరించారు’ అని మసీదు కమిటీ అధ్యక్షుడు పీఏ ఖలీద్ చెప్పారు. ‘మొదట మనమంతా మనుషులం. అందరం ఒకే దేవుని బిడ్డలం అని గుర్తుంచుకోవాలి’ అని రత్నేశ్వరి దేవాలయ కమిటీ సభ్యుడొకరు అన్నారు. దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న నన్లు బక్రీద్ సందర్భంగా మెహందీ పెట్టుకున్న వీడియోలు, హిందూ దేవాలయాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫొటోలు మాధ్యమాల్లో వైరల్అయ్యాయి. హిందువులకు మసీదులో ఆశ్రయం వరదలకు నిరాశ్రయులైన పలు హిందూ కుటుంబాలకు మల్లప్పురం జిల్లా అక్కంపాడులోని చెలియార్ గ్రామంలో ఉన్న జుమా మసీదు ఆశ్రయం కల్పించింది. వరదలకు నిలువనీడ కోల్పోయిన 78 మంది హిందువులకు మసీదులో వసతి కల్పించారు. వరదనీటితో అపరిశుభ్రంగా మారిన వెన్నియాడ్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని, మల్లప్పురంలోని అయ్యప్ప ఆలయాన్ని కొంతమంది ముస్లింలు శుభ్రం చేశారు. ‘ముక్క’ను వదులుకున్న ఖైదీలు కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు పరప్పన అగ్రహారం, బళ్లారి జైలు ఖైదీలు ఒక్కవారం మాంసాహారాన్ని వదులుకున్నారు. ఇలా ఆదా అయ్యే నగదు మొత్తాన్ని వరద బాధితల సహాయార్థం వెచ్చించాలని జైలు అధికారులను కోరారు. ఈ రెండు జైళ్లలో ప్రతి శుక్రవారం ఖైదీలకు మాంసాహారం వడ్డిస్తారు. ఇందుకోసం సుమారు రూ.2–3 లక్షల దాకా ఖర్చవుతోంది. బక్రీద్ సందర్భంగా కేరళలోని త్రిసూర్ రత్నేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు -
కేరళకు ఒక రోజు వేతనం
సాక్షి, హైదరాబాద్: వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయ, పునరావాస చర్యల కోసం అధికారులు, సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు ప్రతిపాదించినట్లుగా వేతనాలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేలా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులు, తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర గెజిటెడ్ అధికారులు, టీచర్లు, పెన్షనర్లు, వర్కర్లు, యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఒక రోజు వేతనాన్ని కేరళ సీఎంఆర్ఎఫ్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రిటైర్డు ఉద్యోగులు, పెన్షనర్లు రూ.200 చొప్పున, ఫ్యామిలీ పెన్షనర్లు రూ.100 చొప్పున కేరళకు వితరణ ఇచ్చినట్లు తెలిపారు. విరాళంగా ఒకరోజు వేతనం: యూఎస్పీసీ కేరళ వరద బాధితుల కోసం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) పేర్కొంది. గురువారం ఈ మేరకు యూఎస్పీసీ ప్రతినిధులు సీహెచ్ రాములు, చావ రవి, బి.కొండల్రెడ్డి, మైస శ్రీనివాసులు, రఘుశంకర్రెడ్డి తదితరులు ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిని కలసి అంగీకార పత్రాన్ని అందించారు. నెల వేతనం ఇచ్చిన రాగం సుజాత కేరళకు నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాతాయాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని గురువారం ఎంపీ కవితకు అందించారు. ఒకరోజు వేతనం విరాళం: టీటీజేఏసీ కేరళ వరద బాధితులకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ (టీటీజేఏసీ) కమిటీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నెల జీతంలో ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని టీటీజేఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రతినిధులు సరోత్తంరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి,లక్ష్మారెడ్డి, నర్సింలు తదితరులు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ విరాళం కేరళకు సహాయం చేయడానికి రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ముందుకు వచ్చింది. టీఎస్ జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిలు ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్ల సహాయం కేరళకు తమ వంతు సహాయం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఒక్కొక్క పెన్షనర్ రూ.200 చొప్పున రాష్ట్రంలోని మొత్తం పెన్షనర్ల నుంచి దాదాపు రూ. 4 కోట్లను అందించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సీతారామయ్య, కార్యదర్శి సుదర్శన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
సాయానికి రెడ్సిగ్నల్
ప్రకృతి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా సర్వం కోల్పోయిన కేరళ పౌరులు ఇప్పుడిప్పుడే బుర దతో నిండి ఉన్న తమ తమ ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కొందరికైతే వెళ్లడానికంటూ ఇళ్లే లేవు. అవి నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికీ ఇంకా వరద ముంపులో ఉన్న ప్రాంతాలున్నాయి. ఈలోగా ఊహించని విధంగా వరద సాయం వివాదం మొదలైంది. కేరళలో జరి గిన నష్టం మొత్తం రూ. 21,000 కోట్ల పైమాటేనని, సాధారణ జీవనం మొదలు కావాలంటే కనీసం రూ. 2,200 కోట్లు అవసరమని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వం అంచనా వేస్తుండగా కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు గ్రాంటుగా మంజూరు చేసింది. ఇంత భారీ నష్టం సంభవించి నచోట ఇది ఏమూలకు సరిపోతుందన్న ప్రశ్నకు జవాబిచ్చేవారు లేరు. మరోపక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఇవ్వజూపిన రూ. 700 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం తిరస్కరించింది. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. అంతేగాక ఏ దేశం సాయం చేయడానికి ముందుకొచ్చినా సున్నితంగా తిరస్క రించాలంటూ మన రాయబార కార్యాలయాలకు ప్రభుత్వం వర్తమానం పంపింది. ఇప్పుడు సంభవించిన నష్టం సాధారణమైనది కాదు. కేరళలోని అత్యధిక జిల్లాల్లోని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలమంది ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు అందిస్తున్న సాయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థి తుల్లో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్న దేశాలను తోసిపుచ్చటం సరైనదేనా అన్న సందే హం ఎవరికైనా తలెత్తుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాలు సాయం అందించటానికి ముందుకు రావటం, మన దేశం వద్దనడం ఇది మొదటిసారేమీ కాదు. కశ్మీర్ భూకంపం(2005), ఉత్తరాఖండ్ వరదలు(2013), కశ్మీర్ వరదలు(2014) ఉదంతాల్లో అమెరికా, జపాన్, రష్యాలు ఇవ్వ జూపిన ఆర్థిక సాయాన్ని మన దేశం తిరస్కరించింది. 2004కు ముందు ఇలా లేదు. 1991నాటి ఉత్తరకాశీ భూకంపం, 1993నాటి లాతూర్ భూకంపం, 2001నాటి గుజరాత్ భూకంపం, 2002నాటి బెంగాల్ తుఫాను, 2004నాటి బిహార్ వరదల సమయాల్లో విదేశాల నుంచి సాయం అందుకుంది. ఎందుకీ మార్పు? ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవిస్తున్న నష్టాన్ని స్వశక్తితో పూడ్చుకోవటం సాధ్యమని నిజంగా మన దేశం విశ్వసిస్తోందా? ఇంతవరకూ జరిగిన వేర్వేరు వైపరీత్యాలను మనం అలా ఎదుర్కొనగలిగామా? పూర్తిస్థాయి పునర్నిర్మాణాన్ని సుసాధ్యం చేసుకోగలిగామా? ఆత్మాభిమానం కొనియాడదగిందే. ఎలాంటి పరిస్థితులెదురైనా చేయిచాచరాదన్న సంకల్పం గొప్పదే. కానీ లక్షలాదిమంది బతుకులు రోడ్డున పడినప్పుడు, మౌలిక సదుపాయాల కల్పనకు మన శక్తి చాలనప్పుడు సైతం ఇలాగే ప్రవర్తించాలా? ఇది మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబించటం లేదా? ఇలా సాయాన్ని తిరస్కరించటం ద్వారా తానొక ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకున్నానని చాటి చెప్పాలన్న ఆరాటమే కనబడుతోంది. మన దేశం గతంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్ని చవి చూసింది. 60వ దశకంలో ఆకలి చావులు సంభవిస్తున్నప్పుడు, ప్రజలకు తిండిగింజలు చాలనప్పుడు అమెరికా ఇచ్చిన గోధుమలు, బియ్యంపై ఆధారపడ్డాం. 1991లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి అప్పు తెచ్చుకోవటానికి మన బంగారం నిల్వలను తాకట్టు పెట్టాం. ఇప్పటికి కూడా బ్రిటన్కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం మొదలుకొని వేర్వేరు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో సహా యాన్ని స్వీకరిస్తున్న దేశాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నాం. 2004లో సునామీ సంభవించి 12,000 మంది మరణించి, దాదాపు పది లక్షలమంది నిరాశ్రయులైనప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తొలిసారి విదేశీ సాయాన్ని తిరస్కరించారు. దీన్ని స్వయంశక్తితో ఎదుర్కొనగలమని అప్పట్లో ఆయన ప్రకటించారు. పైగా మన సర్కారు శ్రీలంకకు 2 కోట్ల 25 లక్షల డాలర్లు, ఇండొనేసియాకు పది లక్షల డాలర్లు ఆర్థిక సాయం అందించింది. అత్యంత పేద దేశమైన హైతీ మొదలుకొని బాగా అభివృద్ధి చెందిన జపాన్ వరకూ మన సాయం పొందాయి. 2005లో భారత్, పాకిస్తాన్లు రెండూ భూకంపం ధాటికి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఆ సమయంలో కూడా మన దేశం విదేశీ సాయాన్ని తిరస్క రించింది. కానీ పాకిస్తాన్ను ఒప్పించి దాని అధీనంలోని ఆక్రమిత కశ్మీర్కు దుప్పట్లు, మందులు, ఆహారం పంపింది. 2 కోట్ల 50 లక్షల డాలర్ల చెక్కు కూడా ఇచ్చింది. ఎవరిదగ్గరైనా సాయం తీసుకో వటమంటే వారికి సాష్టాంగపడటమేనన్న అభిప్రాయం ఉన్న పక్షంలో ఇవ్వడంలోనూ అదే విధానాన్ని పాటించాలి. వారికి కూడా ఆత్మాభిమానం ఉంటుందని గుర్తించాలి. కనీసం వారు అర్ధించే వరకూ ఆగాలి. యూఏఈ కేవలం ఒక దేశంగా మాత్రమే సాయపడటానికి ముందుకు రావటం లేదు. తమ ఆర్థిక పురోగతిలో కేరళ నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల పాత్ర ఉన్నదని గుర్తించి, వారి కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం తమ ధర్మమని భావించింది. కేరళకొచ్చిన కష్టం జాతీయ వైపరీత్యంగా పరిగణించి కేంద్రం తగిన మొత్తంలో నిధులందిస్తే వేరే విషయం. ఇంత వరకూ వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంతంతమాత్రమే. సునామీ సమయంలో 10వేల కోట్ల నష్టం జరిగితే కేంద్రం అందించిన మొత్తం రూ. 500 కోట్లు. మహారాష్ట్ర వరదలు(2005)లో నష్టం రూ. 6,000 కోట్లయితే అందిన సాయం రూ. 700 కోట్లు. ఇలా ఎప్పుడైనా కేంద్రం నుంచి అందేది తక్కువే. నష్టానికీ, అందే సాయానికీ మధ్య ఇంత అగాథం ఉంటున్నప్పుడు ఏ దేశమైనా మన తిరస్కరణను చూసి పరిహసించదా? తోటి మనుషులు ఆపదలో పడినప్పుడు అండగా నిలబడటం మానవ నైజం. ఇవాళ వాళ్లు సాయ పడితే... రేపు మన వంతు రావొచ్చు. పరస్పరం సహకరించుకోవటం, సాయం చేసుకోవటంలో కించపడ వలసిందేమీ లేదు. -
కేరళ బాధితులకు లారెన్స్ సాయం ‘కోటి’
కేరళ వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయల సాయం ప్రకటించారు. కోలీవుడ్లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించిన నటుడు లారెన్సే. వరదల్లో కేరళ ప్రజల కష్టాలు తనను కలచివేశాయని ఈ సందర్భంగా లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్ను శనివారం కలిసి చెక్ను అందజేస్తానని తెలిపారు. బాధితులు ఎవరైనా తనను వ్యక్తిగతంగా కలిస్తే, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సేవా కార్యక్రమాల్లో లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. -
ఇక ఇప్పుడు ఆపరేషన్ క్లీన్!
’మా పిల్లలు బడికెళ్ళేందుకు పుస్తకాలు లేవు. మా కోళ్ళూ, పశువులూ అన్నీ వరదనీటిలో కొట్టుకుపోయాయి. మాకిప్పుడు తలదాచుకునేందుకు ఇంత నీడ లేదు మూడు లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా కట్టుకున్న ఇల్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాము’’అన్నీ పోగొట్టుకొని ప్రాణాలను మాత్రం చిక్కబట్టుకొని బతికిబయటపడ్డ శోభన ఆవేదన ఇది. ముంచెత్తిన చెత్తాచెదారం మధ్య గుర్తించలేని విధంగా తయారైన తమ ఇళ్ళను చూసుకొని జనం బావురుమంటున్నారు. ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి విలపిస్తున్నారు. పునరావాస కేంద్రం నుంచి ఎర్నాకుళం జిల్లాలోని కొత్తాడ్లోని తమ ఇంటికి తిరిగి వెళ్ళిన 68 ఏళ్ళ వృద్ధుడు అక్కడి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదం కంటతడిపెట్టించింది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తిరిగి సురక్షితంగా తమ ఇళ్ళకు చేర్చాలంటే ముందుగా బహిరంగ ప్రదేశాలనూ, వారి ఇళ్ళనూ శుభ్రపరిచి, నివాసయోగ్యంగా తయారు చేయాలి. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం దానిపైనే దృష్టికేంద్రీకరించింది. బావులను శుభ్రపరచడం, పైపులైన్లను పునరుద్ధరించడం, విద్యుత్ పునరుద్ధరణ లాంటి తక్షణావసరాలపైన ప్రభుత్వం దృష్టిసారించింది. ఇళ్ళను శుభ్రపరిచేపనిలో వేలాది మంది వాలంటీర్లు... స్థానిక స్వయంపాలన, ఆరోగ్య విభాగాల కింద దాదాపు 3000 కిపైగా బృందాలు ఇళ్ళను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యాయి. వీళ్ళు కాకుండా ఇప్పటికే దాదాపు 12,000 మంది వాలంటీర్లు ఇదే పనిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 12,000 ఇళ్ళను శుభ్రం చేసారు. దాదాపు 3000 పశువుల కళేబరాలను బుధవారం పూడ్చిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ’’దాదాపు ప్రజలందరినీ రక్షించాం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వరదనీటిలో చిక్కుకుపోయారేమోనని ఇంకా వెతుకుతూనే ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నెల్లిపట్టి, పలక్కాడ్ జిల్లాల్లో మట్టిపెళ్ళలు విరిగిపడి నీటిలో చిక్కుకుపోయిన 11 మందినీ, మరో 15 మందినీ ఇండియన్ ఎయిర్ఫోర్స్ రక్షించినట్టు వెల్లడించారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్! ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి డిమాండ్ పెరిగింది. కొన్ని బావులు పూర్తిగా వరద బురదతో నిండిపోవడంతో వాటిని శుభ్రపరిచేందుకు ఒక్కొక్కరికీ 15000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి వేసవిలో దాదాపు 40 బావులను శుభ్రపరిచే కూనమ్తాయ్కి చెందిన పికె.కుట్టాన్ బావులు శుభ్రం చేయాలంటూ తనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అన్నారు. పెద్దగా లోతులేని చిన్న చిన్న బావులు ఒక్కొక్కదాన్ని శుభ్రపరిచేందుకు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద బావులు శుభ్రపరచడం మరింత రిస్క్తో కూడుకున్నదంటున్నారు కుట్టాన్. ’’ముందుగా ఓ క్యాండిల్ని వెలిగించి బావిలోకి దింపి, అది ఆరిపోకుండా ఉంటేనే మేం బావిలోనికి దిగుతున్నాం. ఇలా చేయడం వల్ల బావిలోని ఆక్సిజన్ని అంచనావేసే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని సార్లు అది చాలా ప్రమాదకరం’’ అంటారాయన. త్రీ బెడ్రూం ఫ్లాట్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు దాదాపు 20,000 ఖర్చు అవుతుందని ఉదయంపెరూర్లోని సానోజ్ జోసెఫ్ అన్నారు. ’’ఒక్కో ఇంటికి రెండ్రోజుల పని ఉంటుంది. అదంతా ఫ్రీగా చేయాలంటే సాధ్యంకాదు. మా కుటుంబాలను కూడా పోషించుకోవాలి కదా?’’ అని ప్రశ్నిస్తున్నారు జోసెఫ్. ఫిక్స్ ఆల్... ఇదిలా ఉంటే ఉచితంగా సేవలందించేందుకు ’’ఫిక్స్ ఆల్’’ అనే ఆన్లైన్ వేదికొకటి ఏర్పాటయ్యింది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, రిఫ్రిజిరేటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చేందుకు ’ ఫిక్స్ ఆల్’ ఆన్లైన్ సహాయకులు లిజి జాన్ బృందం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. -
కేరళ వరదలు : కారణం ఎవరంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రకృతి ప్రకోపంతో తల్లడిల్లిన కేరళ తమ రాష్ట్రంలో వరదలకు కారణం తమిళనాడేనంటూ మండిపడింది. తమిళనాడు తీరును తీవ్రంగా తప్పుపట్టిన కేరళ ముళ్లపెరియార్ డ్యాం నుంచి ఒక్కసారిగా నీళ్లు వదలడంతోనే ఈ విపత్తు చోటుచేసుకుందని ఆరోపించింది. డ్యాం నుంచి ఒకేసారి నీళ్లు విడుదల చేయవద్దని తమిళనాడు సర్కార్ను కోరినా వినిపించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం నీళ్లు పోటెత్తడంతో కేరళలో వరదలొచ్చాయని సుప్రీం కోర్టుకు కేరళ నివేదించింది. అంతకుముందు ఇదే కేసులో గతంలో ముళ్లపెరియార్ డ్యాంలో నీటి మట్టాన్ని 139 అడుగులకు తగ్గించాలని, అప్పుడే కేరళ ప్రజలు భయభ్రాంతులకు లోనవకుండా ఉంటారని సర్వోన్నత న్యాయస్ధానం తమిళనాడును కోరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యామ్ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
రిలీఫ్ క్యాంప్లో నిద్రించిన ఫోటో : మంత్రికి చీవాట్లు
తిరువనంతపురం : వరదలతో తల్లడిల్లిన కేరళలో సోమవారం రాత్రి సహాయ పునరావాస శిబిరంలో కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ నిద్రించిన వ్యవహారం ప్రహసనంలా మారింది. ట్విటర్లో ఆయన పోస్ట్ చేసిన పరుపుపై నిద్రిస్తున్న ఫోటోకు ప్రశంసలు రాకపోగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆల్ఫోన్స్ ఈ ఫోటోను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురిని ట్యాగ్ చేయగా ఈ పోస్ట్పై నెటిజన్ల స్పందన ఆయనకు షాక్ ఇస్తోంది. సార్..ఇది పబ్లిసిటీ చేసుకునేందుకు సరైన అవకాశం కాదని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించగా, సార్ ఇది జోక్ కాదు..ఇలాంటి ప్రదర్శనలకు ఇది సమయం కాదని మరో యూజర్ కామెంట్ చేశారు. కేంద్ర మంత్రిగా కేరళకు ఇతోధిక సాయం చేయాల్సిన మీరు ఇలాంటి చవకబారు ప్రచార ఎత్తుగడకు పాల్పడటం సరైంది కాదని మరొకరు ట్రోల్ చేశారు. సహాయ శిబిరంలో మీరు నిద్రించినా రేపటిపై బెంగతో చాలా మంది నిద్రకు నోచుకోలేదనే విమర్శలు ఆల్ఫోన్స్పై వెల్లువెత్తాయి. మరోవైపు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రస్తుతం సహాయ, పునరావాస చర్యలు ముమ్మరం చేయడంపై దృష్టిసారించింది. -
కేరళ : కోల్కతా చిన్నారి సాయం ఎంతంటే..
కోల్కతా : ప్రకృతి విలయానికి విలవిల్లాడిన కేరళ వాసులను ఆదుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆపన్నహస్తం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో నేను సైతం అంటూ నాలుగేళ్ల చిన్నారి ఆకర్షణీయంగా నిలిచింది. కేరళలో ఉండే తన అక్కాచెల్లెళ్ల కోసమంటూ పిగ్గీ బ్యాంకులో దాచుకున్న 14 వేల 8 వందల రూపాయలను విరాళంగా ఇచ్చేసింది. నా అక్కాచెల్లెళ్ల కోసమే... కేరళ వరదల్లో తన తోటి చిన్నారుల కష్టాలను టీవీలో చూసిన అపరాజిత ఏం జరిగిందంటూ తల్లిదండ్రులను అడిగేది. ఈ క్రమంలో నీలాంటి ఎంతో మంది చిన్నారులు నీటిలో చిక్కుకుని బాధపడుతున్నారని, ఆకలితో ఏడుస్తున్నారంటూ వివరించారు ఆమె తల్లిదండ్రులు. దీంతో తన పిగ్గీ బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తానంటూ అపరాజిత ముందుకొచ్చింది. ఈ క్రమంలో జవదేవపూర్లో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు బీమన్ బోస్.. కేరళ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపునకు అపరాజితను తీసుకువెళ్లగా.. ఆమె తన పిగ్గీ బ్యాంకును ఆయనకు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను పశ్చిమ బెంగాల్ సీపీఐ(ఎం) తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. -
కేరళకు విదేశీ సాయం ఎందుకు వద్దు?
సాక్షి, న్యూఢిల్లీ : జలప్రళయంలో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించిన 700 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం సమంజసమేనా ? కాదా? అయితే ఏ మేరకు సమంజసం ? కాకుంటే ఎందుకు కాదు ? ఆపద సమయాల్లో వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించడమనే సంప్రదాయం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2004 సంవత్సరంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. 2004లో తమిళనాడు, అండమాన్, నికోబర్ దీవుల్లో సునామీ వచ్చినప్పుడు, 2005లో కశ్మీర్లో భూకంపం వచ్చినప్పుడు, 2013లో ఉత్తరాఖండ్లో వరదలు, 2014లో కశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సహాయాన్ని వరుసగా తిరస్కరిస్తూ వస్తోంది. ఇందుకు కారణం అవి బేషరతు విరాళాలు కాకపోవడమే. తాము ఇస్తున్న ఆర్థిక సహాయంలో ఫలాన సామాజిక వర్గానికే ఎక్కువ ఖర్చు పెట్టాలని, ఫలానా అభివద్ధి కార్యక్రమాలకే ఖర్చు చేయాలని లేదా తాము అందిస్తున్న ఆర్థిక సహాయానికి ప్రతిఫలంగా వీసా నిబంధనల్లో తమ దేశానికి వెసులుబాటు కల్పించాలని, వాణిజ్య ఆంక్షలను లేదా తమ ఉత్పత్తుల దిగుమతులపై పన్నులను సడలించాలనో షరతులు ఉంటాయి. ఆశ్చర్యంగా ఈసారే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎలాంటి షరతులు లేకుండా ఏకంగా 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేరళకు ప్రకటించిన ఆర్థిక సహాయంకన్నా అది 15 శాతం ఎక్కువ. ఎమిరేట్స్ కార్మిక వర్గంలో ఎక్కువ మంది కేరళ వాసులే అవడం వల్ల ఆ దేశం ఇంతపెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బేషరుతుగా వచ్చిన ఈ ఆర్థిక సహాయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరస్కరించిందంటే దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసమే కావచ్చు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎంతో పురోభివద్ధి సాధిస్తోందని చెప్పుకుంటున్న తరుణంలో విదేశీ వితరణను స్వీకరించడం బలహీనత అవుతుండొచ్చు. వాస్తవానికి గతంలో వచ్చిన సునామీ, వరదలు, భూకంపాలకన్నా ఇప్పుడు కేరళను ముంచెత్తిన జల ప్రళయం ఎక్కువ తీవ్రమైనది. కేరళలో కొన్ని వందల మంది మరణించడమే కాకుండా పది లక్షల మంది ప్రజలు నిరాశ్రీయులయ్యారని, 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల నష్టం వాటిళ్లి ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఇలాంటి సమయాల్లో ఏ ప్రతిఫలం ఆశించకుండా బేషరతుగా సౌహార్దపూర్వకంగా వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం స్వీకరించవచ్చు’ అని ‘నేషనల్ డిస్సాస్టర్ మేనేజ్ఎంట్ ప్లాన్’ సూచిస్తోంది. కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇస్సాక్ కూడా కేంద్రం దష్టికి ఇదే విషయాన్ని తీసుకొచ్చారు. ఎమిరేట్స్ ఇచ్చినంత ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువ ఆర్థిక సహాయాన్ని స్వయంగా కేరళకు ప్రకటించాలి. కేరళ పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించాలి. -
వైరల్ వీడియో : హ్యాట్సాప్ ఇండియన్ ఆర్మీ
తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమయింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. ఇప్పటి వరకూ దాదాపు 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు. ఓ బాలుడిని కాపాడం కోసం సైనికుడు తాడు సాయంతో ఒంటి చేత్తో హెలికాప్టర్పైకి వెళ్లడం, ఓ పైలట్ చాకచక్యంతో గర్భిణీని కాపాడడం లాంటి వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో కూడా వైరల్గా మరింది. వరదలో చిక్కుకున్న ఓ దివ్యాంగుడిని (ప్రోస్థెటిక్ అవయవం ధరించినవ్యక్తి) సైనికులు జాగ్రత్తగా కాపాడారు. ఓ అపార్ట్మెంట్లో చూట్టూ నీరు నిండి ఉంది. ఆ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో ప్రోస్థెటిక్ అవయవం ధరించిన వ్యక్తి చిక్కు పోయాడు. గమనించిన ఐదుగురు సైనికులు అతని కోసం పడవలో అక్కడి వెళ్లి నిచ్చెన సాయంతో జాగ్రత్తగా కిందికి దించి రక్షించారు. ఇదంతా వీడియో తీసి తమ అధికారిక ఇన్స్ట్రాగ్రామ్లో ‘ ఎక్కడ ఉన్న మేం మిమ్మల్ని రక్షిస్తాం’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్అయింది. ఓపికతో దివ్యాంగుడిని కాపాడిన సైన్యానికి ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెబుతున్నారు. చాలా మంది నెటిజన్లు సైనికులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్ ఇండియన్ ఆర్మీ, మీరే నిజమైన హీరోలు’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
కేరళ వరదలు : తమ వంతుగా టీమిండియా !
నాటింగ్ హామ్ : తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇవ్వడంతో పాటు మూడో టెస్ట్ మ్యాచ్ ఫీజును భారత క్రికెటర్లు విరాళంగా అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్ల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఒక్కో టెస్ట్ మ్యాచ్ ద్వారా జట్టు మొత్తం ఆటగాళ్లకు కలిపి దాదాపు 1.5 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. బుధవారం మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్లో గెలిచి కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలని జట్టుగా నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్నాం. ఈ గెలుపును వారికి అంకితం ఇస్తున్నాం. ప్రస్తుతం కేరళలో చాలా విషాదకరమైన పరిస్థితి నెలకొందని’ చెప్పాడు. కేరళ వరద బాధితులకు తమ వంతు సాయంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా అందించాలని టీమిండియా నిర్ణయించుకుంది. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ఆటగాళ్లు సమష్టిగా నిర్ణయం తీసుకుంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. అయితే కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రూ.80 కోట్ల ఆర్థిక సాయం చేశాడంటూ ఫేస్బుక్, వాట్సాప్ల్లో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే కేరళ బాధితులకు అన్ని విధాలా సాయం అందాలని, సహాయక బృందాలు వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోహ్లి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
3రోజులు ఆలస్యంగా కొచ్చి ఎయిర్పోర్ట్ సేవలు
సాక్షి, కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో నీటమునిగిన కొచ్చి విమాశ్రయం మూడు రోజులు ఆలస్యంగా తన సేవలను ప్రారంభించనుంది. ముందు ప్రకటించినట్టుగా ఆగస్టు 26నుంచి కాకుండా 29వ తేదీ నుంచి పూర్తి స్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో జరిగిన సమీక్షా సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్ధకు జరిగిన నష్టంపై చర్చించారు. కేరళలోవరద పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ విమాన సేవలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాజా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొచ్చి విమానాశ్రయం సోలార్ పవర్ మీద నడుస్తుంది. అధికారులు విమానాశ్రయం నుంచి వరద నీటిని తొలగించినప్పటికీ, విమానాశ్రయం లోపల భారీ వరదలకారణంగా సౌర ఫలకాలు బాగా దెబ్బతిన్నాయి. సుమారు 800 రన్వే లైట్లు మరమ్మతు చేయాలి, 2,600 మీటర్ల పొడవు గోడల పునర్నిర్మించటం అవసరం. దాదాపు 90శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులే వరద బాధితులు, వారందరూ వాళ్ల ఇళ్లలో చిక్కుకుపోయారు. మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం అందించలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి తమ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇతర సదుపాయాలు, కేటరింగ్ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్ పోర్టు కేరళ వరదలతో రూ.220 కోట్లు నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేశారు. కొచ్చి విమానాశ్రయం ప్రపంచంలోనే మొట్టమొదటి సౌరశక్తి విద్యుత్ వ్యవస్థకు కలిగిన ఎయిర్ పోర్టు. వరదలతో దీనికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెరియార్ నదికి వరదల కారణంగా రన్వే, టాక్సీ బే, కస్టమ్స్ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టెర్మినల్స్ నీట మునిగాయి. రన్వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు నాశనమయ్యాయి. -
అలాంటి వర్షమే ఆంధ్రప్రదేశ్లో కురిస్తే..
సాక్షి, అమరావతి : 2005 జూలై 16న ఒకేరోజు (24 గంటల్లో) 94 సెంటీమీటర్ల వర్షం కురిస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం అతలాకుతలమైంది. 2015లో ఒకేరోజు 41.3 సెంటీమీటర్ల వాన కురిస్తే చెన్నై రూపురేఖలు కోల్పోయింది. తాజాగా కుండపోత వర్షంతో కేరళలో పెను విషాదం అలుముకుంది. ఇలాంటి వర్షమే ఆంధ్రప్రదేశ్లో కురిస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు ఊహించాలంటేనే ఒళ్లు జలదరిస్తోందని వాతావరణ, విపత్తు నిర్వహణ నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ప్రకృతి ప్రకోపం నుంచి ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉన్న ముప్పు న్యూక్లియర్ బాంబు కంటే ప్రమాదకరమని చెప్పక తప్పదని అంటున్నారు. ఆక్రమణల చెరలో నదులు, వాగులు స్వల్ప సమయంలో అత్యధిక వర్షం కురిస్తే వాననీరు త్వరగా బయటకు వెళ్లిపోయే మార్గం ఉంటే నష్టం తక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు లాంటి నగరాల్లో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లిపోయే మార్గాలు లేవు. నీటి ప్రవాహానికి వీలుగా సరైన మురుగు కాలువలు లేవు. కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలోని జ్ఞానాపురంలో ఒకేరోజు 28 సెంటీమీటర్ల వర్షం కురిస్తే పడవలపై ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోని పెద్ద నగరాలు, పట్టణాల్లో ఒకటి రెండు రోజులు కుండపోత వర్షం కురిస్తే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కొల్లేరు మంచినీటి సరస్సు పెద్ద రిజర్వాయర్లా ఉంది. రెండు జిల్లాల నుంచి ఎటువైపు నుంచి నీరు ఎక్కువగా వచ్చినా ఈ సరస్సు నుంచి సముద్రంలోకి నీరు వెళ్లిపోతుంది. అయితే, కొల్లేరును ఆక్రమించేశారు. చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. ఈ చెరువులు కాంక్రీట్ జంగిల్స్ లాంటివే. ఇందులో నీరు ఇంకదు. వాగులు, వంకలు ఆక్రమణలతో కుంచించుకుపోవడం వల్ల వరద నీరు ముందుకు వెళ్లే దారిలేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. రహదారులు ధ్వంసమవుతున్నాయి. మనిషి స్వార్థంతో ప్రకృతికి చేటు ఖనిజాలు, విలువైన రాళ్ల తవ్వకాల కోసం కొండలను పిండి చేస్తున్నారు. అభయారణ్యాలు తరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా చెట్లు నరికేస్తున్నారు. మైనింగ్తో కొండలు కరిగిపోతున్నాయి. నదులు, వాగులను ఆక్రమించడం, దారి మళ్లించడం, నదుల్లో ఇసుకను తోడేయడం వల్ల చాలా అనర్థాలు కలుగుతున్నాయి. నీరు నిదానంగా ప్రవహించడానికి ఇసుక ఎంతో అవసరం. ఇసుక నీటిని భూమిలోకి ఇముడ్చుకోవడంతోపాటు నీటిని పరుగెత్తకుండా నెమ్మదిగా నడిచేలా చేస్తుంది. నీరు వేగంగా ప్రవహిస్తే భూమిలోకి ఇంకిపోదు. ప్రవాహ వేగంవల్ల చెరువులు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోతాయి. అందుకే నదులు, వాగుల్లో ఇసుకను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ‘‘జూన్ నుంచి సెప్టెంబరు వరకూ 120 రోజుల నైరుతీ రుతుపవనాల కాలంలో గతంలో 84 రోజులకు పైగా వర్షాలు కురిసేవి. ఇప్పుడు వర్షపాతం తగ్గకపోయినా వర్షాలు పడే కాలం మాత్రం 84 నుంచి 60–65 రోజులకు పడిపోయింది. తక్కువ సమయంలోనే విపరీతమైన వర్షం కురిస్తోంది. ప్రకృతిని ధ్వంసం చేయడం వల్లే విపత్తులు కాటు వేస్తున్నాయి’’ అని విశాఖపట్నానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ భానుకుమార్ తెలిపారు. నదికి స్వేచ్ఛ ఉండాలి వరుసగా రెండు రోజులు 30 సెంటీమటర్ల చొప్పున వర్షం కురిస్తే విజయవాడ, రాజధాని ప్రాంతం అమరావతి ఏమవుతాయో చెప్పడమే కష్టం. కొండవీటి వాగు ఉప్పొంగితే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతోపాటు పరిసర గ్రామాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులను పూడ్చేయడం, వాగులను ఆక్రమించి ఇళ్లు నిర్మించడం పెను ప్రమాదానికి సంకేతాలే. ‘‘నదులను ఆక్రమించుకోరాదు. నదికి స్వేచ్ఛ ఉండాలి. దానిపై ఒత్తిడి పెంచితే మనకే ముప్పు’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిటైర్డు అధికారి నరసింహారావు పేర్కొన్నారు. -
కేరళకు లారెన్స్ భారీ విరాళం..!
సాక్షి, చెన్నై : ప్రకృతి విలయానికి తీవ్రంగా నష్టపోయిన కేరళ వరద బాధితులకు విరాళం అందించేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులెందరో ముందుకొచ్చారు. తమ వంతు సాయం ప్రకటించారు. తాజాగా తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ఈ జాబితాలో చేరారు. వరద బాధితుల సహాయార్ధం ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించారు. -
వైరల్ వీడియో: ఇన్ఫోసిస్ సుధామూర్తి గొప్ప మనసు
సాక్షి, బెంగుళూరు : కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు, వరదలు కేరళ-కర్ణాటక సరిహద్దులోని కొడగు జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా కొడగులో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న కొడగు జిల్లాలోని ప్రజలకు సాయం చేయడానికి టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి ముందుకొచ్చారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులతో కలిసి వరద బాధితులకు నిత్యావసరాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె స్వయంగా సరుకులను ప్యాక్ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఎంతోమంది సుధామూర్తి గొప్పమనసును మెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘అమ్మ’ అనే హ్యాష్టాగ్తో షేర్ చేసుకుంటున్నారు. -
వరదల నుంచి కోలుకుంటున్న కేరళ
-
బీఫ్ తినేవారికి సాయం చేయొద్దు!
న్యూఢిల్లీ: కేరళలో గొడ్డుమాంసం (బీఫ్) తిన్న వరదబాధతులకు సాయం చేయొద్దంటూ ఆలిండియా హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీఫ్ తినమని అఫిడవిట్ ఇచ్చిన వారికే సాయం చేయాలని పేర్కొన్నారు. హిందూధర్మం ప్రకారం గోమాతను చంపడం మహాపాపమన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ స్వామి చక్రపాణి మహారాజ్ను ఆలిండియా అఖాడా పరిషత్ ‘ఫేక్ బాబా’ల జాబితాలో చేర్చింది. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కారును స్వామి చక్రపాణి వేలంలో కొని తగులబెట్టిన సంగతి తెలిసిందే. -
యూఏఈ సాయం తిరస్కరణ.. కేరళ అసంతృప్తి!
వరదలు ముంచెత్తడంతో నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయానికి యూఏఈ ముందుకొచ్చింది. భారత్తో మరీ ముఖ్యంగా కేరళతో యూఏఈకి ప్రత్యేక సంబంధాలున్న నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం ఇంత భారీ సాయాన్ని ప్రకటించింది. ఈ సాయాన్ని స్వీకరించబోమని భారత ప్రభుత్వం తెలిపింది. విదేశీ విరాళాలను అంగీకరించబోవడం లేదని సమాచారం. 2004 డిసెంబర్ నుంచే అమల్లోకి 2004 డిసెంబర్లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిది. ఈ ‘విపత్తు సహాయ విధానం’లో భాగంగా విదేశీ సహాయాన్ని అంగీకరించకూడదని నిర్ణయించింది. సునామీ కారణంగా భారత్లోని వివిధ రాష్ట్రాల్లో తీవ్రనష్టం సంభవించిన సందర్భంలో ఈ విధానాన్ని ఖరారు చేశారు. సునామీ అనంతర సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలు భారత్ సొంతంగా చూసుకోగలదని మన్మోహన్ చెప్పారు. కేరళలోని విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు దేశీయం గా అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలనే వినియోగించుకోవాలనే ఆలోచనతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉంది. దౌత్య కార్యాలయాలకు వర్తమానం కేరళ విపత్తుపై విదేశీ ఆర్థిక సహాయాన్ని స్వీకరించవద్దని ఇప్పటికే అన్ని రాయబార కార్యాలయాలకు మోదీ ప్రభుత్వం వర్తమానం పంపించింది. ఏ దేశ ప్రభుత్వమైనా సహాయం చేసే ఉద్దేశాన్ని వెల్లడిస్తే దానిని సున్నితంగా తిరరస్కరించాలని భారత రాయబార కార్యాలయాలకు పంపిన సందేశంలో పేర్కొంది. చివరగా 2004లో బిహార్ వరదలతో అతలాకుతలమైనపుడు విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని భారత్ తీసుకుంది. ఆ తర్వాతి సందర్భాల్లో తిరస్కరించింది. ఎన్ఆర్ఐల విరాళాలపై పన్ను లేదు ఇతర దేశాల ప్రభుత్వాలిచ్చే విరాళాలు, ఆర్థిక సహాయాన్ని నిరాకరిస్తున్నా, ఆ దేశాల్లోని భారతీయులు కేరళ సీఎం సహాయనిధికి నేరుగా విరాళాలు పంపించవచ్చు. వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది. ‘విదేశీ విరాళాల చట్టం కింద గుర్తింపు పొందిన, లాభాపేక్ష లేని స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ద్వారా వచ్చే విదేశీ సాయంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది’ అని విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి చెప్పారు. కేంద్రం నిర్ణయంపై కేరళ అసంతృప్తి! కొచ్చి: కేరళ వరదలకు విదేశాలు చేస్తున్న సాయాన్ని కేంద్రం తోసిపుచ్చడంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ విరాళాలు అత్యవసరమని రాష్ట్ర సీఎం భావిస్తున్నారు. యూఏఈ విరాళంపై పునరాలోచించాలని ప్రధానిని కలిసి విన్నవించనున్నట్లు విజయన్ తెలిపారు. విదేశీ సాయం తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కూడా వారు ప్రధానిని కోరనున్నారు. యూఏఈ రూ.700కోట్లు, ఖతార్ రూ.35కోట్లు, మాల్దీవులు రూ.35 లక్షల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కేరళలో తెలుగోడి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళ వరద విలయానికి అక్కడ నివసిస్తోన్న వందలాది మంది తెలుగు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కేరళ వ్యాప్తంగా వేలాది మంది తెలుగువారు ఉండగా.. ఒక్క కొచ్చిలోని ఏలూర్ కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వారంతా అక్కడికి వలస పోయారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వరద చుట్టుముట్టడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 50 నుంచి 100 తెలుగు కుటుంబాలపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. అనేక ఇళ్లు మునిగిపోవడంతో సామాన్లు పనికిరాకుండా పోయాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో తలదాచుకుని ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తం వస్తువులన్నీ పాడవడంతో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన స్థానిక ఫ్యాక్ట్ కంపెనీలో చిన్న కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో వలస కార్మికులు కొచ్చిలోని ఫ్యాక్ట్ కంపెనీ, షిప్యార్డుల్లో దాదాపు వెయ్యి, పదిహేను వందల మంది తెలుగువారు పని చేస్తున్నారు. వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేక రోజు గడవడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. వీరిని ఆదుకోవడానికి కొచ్చి తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ చేపడుతోంది. ఇక్కడి తెలుగు ప్రజల్లో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. -
29న కొచ్చి ఎయిర్పోర్టు సిద్ధం
కొచ్చి: భారీ వరదల కారణంగా వారం రోజులుగా విమానసేవలు రద్దయిన కొచ్చి విమానాశ్రయం ఆగస్టు 29 నుంచి పూర్తిస్థాయి సేవలను అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్థకు జరిగిన నష్టంపై అధికారులు చర్చించారు. 90 శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులు వరదబాధితులే. వారంతా ఇంకా వాళ్ల సొంతూళ్లలో చిక్కుకుపోయారు. ఎయిర్పోర్టు సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరుచుకోలేదు. ‘మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం ఇవ్వలేకపోతున్నాం. ఇతర సదుపాయాలు, కేటరింగ్ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి సేవలు మొదలవుతాయి’ అని విమానాశ్రయ అధికార ప్రతినిధి వెల్లడించారు. దేశంలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్పోర్టు.. తాజా వరదలు, విమాన సేవల నిలిపివేత కారణంగా రూ.220 కోట్లను నష్టపోయింది. పెరియార్ నదికి వరదల కారణంగా రన్వే, టాక్సీ బే, కస్టమ్స్ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టర్నినల్స్ నీట మునిగాయి. రన్వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. పలు ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు పాడయ్యాయి. ప్రపంచంలోనే తొలి సౌరశక్తి ఆధారిత విమానాశ్రయమైన కొచ్చిలో ఈ సోలార్ విద్యుత్ వ్యవస్థకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కాగా, కొచ్చిలోని నేవల్ ఎయిర్బేస్, ఐఎన్ఎస్ గరుడలపై తాత్కాలిక విమానసేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. -
ఇది ప్రకృతి హెచ్చరిక
కేరళలో ఈ ఏడాది వానలు, నదులు మనుషులతో మాట్లాడుతున్నాయి. చిన్ననాటి నుంచీఈ వానలే నా కలంలో సిరా. అవే నన్ను రచయిత్రిని చేశాయి. మీనాచిల్ నది నా కథను నడిపించింది. ప్రస్తుతం నదుల మహోగ్రరూపం ఊహకు అందనిది. త్రివిధ దళాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానికులు, జర్నలిస్టులు, మత్స్యకారులు ముఖ్యంగా సామాన్యులు ఎనలేని ధైర్యసాహసాలు చూపారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యమే అని చెప్పడానికి వీల్లేదు. మానవ తప్పిదం ఎంతో ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలే మొదట బలైపోతాయి. ఒకవైపు కార్చిచ్చులతో కాలిఫోర్నియా తగలబడిపోతూంటే, ఇటు వర్షబీభత్సంతో కేరళ మునిగింది. మనిషి అంతులేని స్వార్థంతో చేస్తున్న పనులతో కొండల మీదుగా వాన నీటి ప్రవాహం దిశ మారింది. అటవీ భూముల్లో గనుల తవ్వకం, చట్టవిరుద్ధంగా రిసార్టులు, సంపన్నుల ఇళ్లు, డ్యామ్ల అడ్డగోలు నిర్వహణ వంటివన్నీ నేటి ప్రళయానికి కారణం. ఈ వరదల్ని సెంట్రల్ వాటర్ కమిషన్ ఊహించకుండా ఎలా ఉంది? వరదనీటిని ఒడిసిపట్టాల్సిన డ్యామ్లు కీలక సమయంలో విపత్తు తీవ్రతను ఎన్నో రెట్లు పెంచేలా నీళ్లు ఎలా విడుదల చేశాయి? ఇప్పుడు సీఎం సహాయ నిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వాటిలో సామాన్యులు ఇస్తున్నవే ఎక్కువ. చిత్రమేమిటంటే ఎవరికైతే మనం నిధులిస్తున్నామో ఆ ప్రభుత్వ యంత్రాంగమే హెచ్చరికల్ని పెడచెవిన పెట్టింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మాధవ్ గాడ్గిల్ కమిటీ ఎప్పుడో ఊహించింది. అభివృద్ధి పేరుతో సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోకపోతే వినాశనమేనని హెచ్చరించింది. కేరళ వరదల్ని అడ్డుపెట్టుకొని భారత్లో కొందరు విషాన్ని చిమ్ముతున్నారు. ప్రేమ, ఆప్యాయత పంచాల్సిన సమయంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన దళితులు, ఆదివాసీలకు రాష్ట్రసర్కారు అండగా ఉంటుందని ఆశిద్దాం. మనం చేతులారా నాశనం చేసిన పర్యావరణాన్ని మనమే చక్కదిద్దాలి. అలా చేయకుంటే దేవభూమిలో మనిషి మసలడం సాధ్యం కాదు. 2018 వరదలు మనకి ఒక సున్నితమైన హెచ్చరిక. -
మానవ తప్పిదం వల్లే కేరళ విపత్తు!
తిరువనంతపురం: జలవిలయంలో తీవ్రంగా నష్టపోయిన కేరళలో సహాయక చర్యలు దాదాపు పూర్తి కావస్తుంటే మరోవైపు వరద రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. కేరళ వరదలు మానవ తప్పిదం వల్ల చోటుచేసుకున్న విపత్తేనని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఒకేసారి 40 ఆనకట్టల గేట్లు ఎత్తడమే ఈ కల్లోలానికి కారణమని రాష్ట్రంలోని లెఫ్ట్ సర్కారుపై రాష్ట్ర ప్రతిపక్షంతో పాటు బీజేపీ ఆరోపించాయి. విపత్తుపై న్యాయ విచారణకు డిమాండ్ ఈ మహాప్రళయానికి దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు ఆదేశించాలని మంగళవారం కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు. ‘పంబ నదీ పరీవాహకంలోని 9 డ్యాంలు, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో పెరియార్పై 11, త్రిస్సూర్లోని చాలకుడి నదీ పరీవాహకంలో ఆరు డ్యాంల నుంచి నీటిని ఒక్కసారి విడుదల చేస్తే ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయో అనేదానిపై ప్రభుత్వానికి అవగాహన శూన్యం. సరైన హెచ్చరికలు చేయకుండా ఒకేసారి 44 డ్యాంల ఆనకట్టల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.’ అని ఆయన అన్నారు. ఈ విపత్తుకు విజయన్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై తప్పుపట్టారు. ముందస్తు హెచ్చరికలు చేశాకే నీటి విడుదల ‘మా నియంత్రణలో ఉన్న డ్యాంల విషయంలో తప్పిదం జరగలేదు. హెచ్చరికలు జారీచేశాకే నీటిని విడుదల చేశాం. నదులు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగాయి. డ్యాంల గేట్లు ఎత్తివేయడం వల్లే వరదలు సంభవించాయి అనడంలో అర్థంలేదు’ అని కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు(కేఎస్ఈబీ) చైర్మన్ కేపీ శ్రీధరన్ వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలు అర్థరహితమని డ్యాంల భద్రతా విభాగం చైర్మన్ రామచంద్రన్ చెప్పారు. ఈ వరద కేవలం అధిక వర్షపాతం వల్లే చోటుచేసుకోలేదని, నిర్లక్ష్యం తోడైందని విపత్తు పరిశోధన ప్రత్యేక విభాగం చైర్పర్సన్, ఢిల్లీ జేఎన్యూ వర్సిటీ ప్రొఫెసర్ అమృతా సింగ్ అన్నారు. శరవేగంగా పునర్నిర్మాణ పనులు: కేరళలో పునర్నిర్మాణం, పారిశుధ్య పనులు ఊపందు కున్నాయి. బురద, చెత్తతో నిండిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయడంతో ప్రజలు నిమగ్నమయ్యారు. శిబిరాల నుంచి ఇళ్లకు చేరుతున్న బాధితులు ఇంట్లో నిండిన బురద, భారీ చెత్తను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. ‘మేం మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ఏమీ మిగల్లేదు’ అని ఓ మహిళ చెప్పింది. బావులన్నీ మురికినీటితో కలుషితం కావడం వల్ల ప్రజలు తీవ్ర తాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు. సులువుగా బీమా పరిహారం కేరళ వరద బాధితుల బీమా క్లెయిమ్లు త్వరగా పరిష్కరించేందుకు ఎల్ఐసీ నిబంధనలను సరళీకరించింది. పాలసీదారుడి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని అతడి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయబోమని బుధవారం ప్రకటించింది. అధీకృత ప్రభుత్వ అధికారి ఇచ్చే ఏదైనా పత్రం లేదా ప్రభుత్వం నుంచి పరిహారం పొందినట్లు ఆధారాలు ఇస్తే చాలు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా(పీఎంజేజేబీవై) పథకంలో చేరిన పాలసీదారుల క్లెయిమ్లను పరిష్కరించేందుకు భాగస్వామ్య బ్యాంకులతో కలసిపనిచేస్తున్నామని తెలిపింది. కేరళకు సిద్ది వినాయక్ రూ.కోటి సాయం సాక్షి, ముంబై: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రూ. కోటి సాయం ఇవ్వనున్నట్లు ప్రభాదేవిలోని సిద్ది వినాయక్ ఆలయ ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఈ మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు అందజేయనున్నారు. పతంజలి నుంచి రూ.2 కోట్ల సాయం: బాబా రాందేవ్ వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కేరళ, కర్ణాటకలను ఆదుకునేందుకు పతంజలి సంస్థ తమ వంతు కృషిచేస్తోంది. ‘టూత్పేస్టులు మొదలుకొని మంచి నీటి బాటిళ్ల వరకు ఇలా దాదాపు రూ.50 లక్షల విలువైన సరకులను ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపించాం. మరో వారంలో అదనంగా దాదాపు రూ.1.5కోట్ల విలువైన సహాయక సామగ్రిని వరద బాధిత రాష్ట్రాలకు తరలిస్తాం’ అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తెలిపారు. ఇంకా వరద ముంపులోనే పలు ప్రాంతాలు ఆగస్టు 8 నుంచి వరదల్లో 231 మంది మరణించగా.. ఇంకా 32 మంది ఆచూకీ తెలియడం లేదు. సహాయక శిబిరాల్లో 14.5 లక్షల మంది తలదాచుకున్నారు. కుట్టనంద్, అలపుజా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. కేరళకు కేంద్రం రూ. 600 కోట్ల సాయాన్ని విడుదల చేయగా.. మరోవైపు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి ఇంతవరకూ రూ. 309 కోట్ల విరాళాలు అందాయి. -
కాఫీ పై వరద కత్తి!
17 వ శతాబ్దంలో తొలిసారిగా కాఫీ ఘుమఘుమల రుచి మన దేశానికి పరిచయం అయ్యి, ఆ తరువాత ఇక్కడ నిలదొక్కుకుంది. దీంతో మన దేశపు కాఫీని ’’ఇండియన్ మాన్సూన్ కాఫీ’’ అని కూడా పిలుస్తారు. ఏదేమైనా కేరళ, కర్ణాటకను ముంచెత్తిన వరద పోటు కాఫీకి కూడా తప్పలేదు. కాఫీ ఉత్పత్తిలో కర్నాటక తొలిస్థానంలో ఉంటే కేరళ ద్వితీయస్థానంలో ఉంది. దేశానికి అవసరమైన కాఫీ ఉత్పత్తికి కీలకమైన రాష్ట్రాలు కర్ణాటక, కేరళ. కర్ణాటకలో 71 శాతం, కేరళలో 21 శాతం కాఫీ ఉత్పత్తి జరుగుతుంది. కేరళ రాష్ట్రంలోని కాఫీ పంటలనూ, కేరళని ఆనుకుని ఉన్న కర్ణాటక కాఫీ ఉత్పత్తి కేంద్రాలైన కొడగు, చిక్మంగుళూరులను ఈ వరద ప్రభావం తీవ్రంగా దెబ్బతీసింది. వరదలతో ఈ రెండు రాష్ట్రాల్లోని కాఫీ పంటకు కోలుకోలేని దెబ్బపడింది. అయితే కేవలం కాఫీ పంట దెబ్బతినడమే కాకుండా ఏళ్ళతరబడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోన్న కాఫీ మొక్కలను సైతం ఈ వరదలు కూకటివేళ్ళతో పెకిలించాయి. కాఫీ తోటలపై విరిగిపడిన కొండచరియలతో పంట సర్వనాశనం అయ్యింది. దీని ప్రభావం దేశంలోని మొత్తం కాఫీ పరిశ్రమపై కూడా ఉండనుంది. కాఫీ తోటల్లో పనిచేస్తోన్న కార్మికుల ఇళ్ళు కూడా ధ్వంసం అయ్యాయనీ కర్ణాటక ప్లాంటర్స్అసోసియేషన్(కెపిఎ) ఛైర్మన్హెచ్.టి.ప్రమోద్తెలిపారు. 2017-18లో మనదేశంలో కాఫీ ఉత్పత్తి 3.16 లక్షల టన్నులు. అయితే ఈ వరదల వల్ల కాఫీ పంటల నష్టం 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. కేరళలో కాఫీ పంట... కేరళ 20.8 శాతం కాఫీ ఉత్పత్తితో దేశంలో రెండవ స్థానంలో ఉంది. కేరళలోని ఈశాన్య ప్రాంతమైన వయ్నాడ్ జిల్లాలో కాఫీ ఎక్కువగా పండిస్తారు. అరబికా, రోబస్టా లాంటి కాఫీ పంటల్లో 80 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఎంత ఉత్పత్తి? దేశంలో కాఫీ పంటల పరిధిలో ఉన్న మొత్తం భూభాగంలో 19 శాతం కేరళ రాష్ట్రంలో ఉంది. వయ్నాడ్, ట్రావెన్కోర్, నెల్లియంపట్టి ప్రాంతాల్లో 85,000 హెక్టార్ల కాఫీ ప్లాంటేషన్స్ఉన్నాయి. కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో దేశంలోని మొత్తం కాఫీ పంటలో 25 శాతం ఉత్పత్తి అవుతోంది. దేశంలోని 70 శాతం కాఫీని ఉత్పత్తి చేస్తోన్న కొడగు, చిక్కమంగుళూరు, సక్లేష్పూర్(హస్సన్) జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లొచ్చని భావిస్తున్నారు. కర్ణాటకలోని మడికేరికి సమీపంలోని ముక్కోడ్లు గ్రామస్తుడైన విశ్రాంత సైనికాధికారి రిటైర్మెంట్అనంతరం కాఫీ ప్లాంటేషన్లోకి అడుగుపెట్టారు. దాదాపు 8 ఏళ్ళ సుదీర్ఘశ్రమ అనంతరం ఇప్పుడిప్పుడే ఆదాయం వస్తోంది. ఇంతలోనే ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పంటంతా మట్టిపాలైంది. ’’కనీసం నా పొలం సరిహద్దులేవో కూడా గుర్తించలేని పరిస్థితి నాకెదురైంది’’ అని సైనికాధికారి కొల్లప్ప వ్యాఖ్యానించారు. ’’కొడగులో దాదాపు 5000 ఎకరాల్లో కాఫీ పంట పూర్తిగా ధ్వంసం అయ్యింది’’ అని కూర్గ్ ప్లాంటర్స్ క్లబ్ నిర్వాహకులు కె.సి.బొప్పన్న తెలిపారు. కాఫీ ఉత్పత్తుల రవాణాకి సైతం అడ్డంకులు... కాఫీ ఉత్పత్తులను ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడంలో కూడా రెండు రాష్ట్రాలూ తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రవాణామార్గాలు మూసుకుపోవడంతో కొడగు, మంగుళూరు లేదా కొచ్చికి ఈ ఉత్పత్తులను చేరవేయడం అసాధ్యంగా మారింది. కాఫీ ఉత్పత్తులను రవాణా చేసేందుకు లారీ యాజమాన్యాలు సైతం సంసిద్ధంగా లేవని కర్ణాటక కాఫీ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ రాజన్ తెలిపారు. ఎంతమందికి ఉపాధి? కర్ణాటక కొడగు ప్రాంతంలో మొత్తం 2 లక్షల మంది కాఫీ తోటల్లో ఉపాధిపొందుతున్నారు. చిక్మగళూరు లోనే 1.3 లక్షల మంది కాఫీ తోటల్లో పనిచేస్తున్నారు. కేరళలో దాదాపు 44,000 మందికి కాఫీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. వయ్నాడ్, ట్రావెన్కోర్, నెల్లియంపట్టి ల్లో అత్యధికంగా కాఫీ తోటలున్నాయి. వయ్నాడ్లో 30,000 మంది ఉద్యోగులు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ట్రావెన్కోర్లో 10,000 మంది, నెలియంపట్టిలో 2,669 మంది ఉద్యోగులున్నారు. ఇంత మందికి ఉపాధినిస్తోన్న కాఫీ పరిశ్రమ వరదతాకిడితో అతలాకుతలమైంది. దీనిపైన ఆధారపడి పనిచేస్తోన్న వ్యక్తులూ, వారిపైన ఆధారపడిన వేలాది కుటుంబాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. -
కొచ్చిలో తెలుగువారి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడున్న తెలుగు వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. కొచ్చిలోని ఏలూరు కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వెయ్యి, పదిహేను వందల మంది ఇక్కడున్న ఫ్యాక్ట్ కంపెనీలో, షిప్యార్డుల్లో పని చేస్తున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వారి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.తెలుగువారికి చెందిన 20,25 ఇళ్లలో పదహారు ఇళ్లు వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి. ఆఇళ్లలో సామాన్లు ఏవీ పనికిరాకుండా పోయాయి.కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో ఉన్న వీరు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే, ఇళ్లలో రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేకపోవడంతో రోజు గడపడమే కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. కొచ్చి తెలుగు అసోసియేషన్ వీరిని ఆదుకోవడానికి విరాళాల సేకరణ వంటి చర్యలు చేపడుతోంది.ఇక్కడి తెలుగు వారిలో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సహాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. వర్షాల వల్ల ఒక్కో తెలుగు కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత హనుమంతు నాయక్ చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన నాయక్ ఇక్కడి ఫ్యాక్ట్ కంపెనీకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు.సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
29 నుంచి కొచ్చి విమానాశ్రయం పునరుద్ధరణ
తిరువనంతపురం : కేరళను వణికించిన వరదలతో మూతపడిన కొచ్చి విమానాశ్రయం ఈనెల 29 నుంచి మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించనుంది. గతంలో ఈ నెల 26 నుంచి విమానాశ్రయంలో సర్వీసుల పునరుద్ధరణ చేపడతామని అధికారులు ప్రకటించగా దీన్ని మరో మూడు రోజులు పొడిగించారు. వరదలతో కొచ్చికి దూరంగా తరలివెళ్లిన ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరేందుకు సమయం అవసరమని అధికారులు భావించడంతో ఈనెల 29 నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని బుధవారం జరిగిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్) సమావేశంలో నిర్ణయించారు. విమానాశ్రయానికి సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికీ మూతపడ్డాయని, ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయనే అంచనాతో మరో మూడు రోజుల పాటు ఎయిర్పోర్ట్ సేవల పునరుద్ధరణను పొడిగించామని, ఈనెల 29 నుంచి విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని సీఐఏఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. భారీ వరదలతో ఎయిర్పోర్ట్లోని రన్వే, ట్యాక్సీ వే, పార్కింగ్ ఏరియాల్లో నిలిచిన నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, రన్వే పునరుద్ధరణకు రెండు మూడు రోజలు సమయం పడుతుందని తెలిపింది. కాగా కొచ్చి ఎయిర్పోర్ట్లో దాదాపు రెండు వారాలుగా ఆపరేషన్స్ నిలిచిపోవడంతో విమానాశ్రయానికి రూ 22-27 కోట్ల నష్టం వాటిల్లిందని కేర్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. ఇతర ఆపరేషన్స్, సేవల కారణంగా మరో 10 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. -
కేరళ వరదలు : రైతు ఆత్మహత్య
ఎర్నాకుళం : ఎడతెరపి లేకుండా కేరళలో కురిసిన భారీ వర్షాలు వందలాది మందిని పొట్టన పెట్టుకోగా.. లక్షలాది మందిని నిరాశ్రయులు చేసింది. ఇప్పుడే కాస్త వర్షాలు తగ్గుమఖం పట్టి, వరదలు తగ్గుతుండటంతో, ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు కళకళలాడిన ఇళ్లు.. ప్రస్తుతం వరద బురదకు కొట్టుకుని ఉండటాన్ని చూసుకుని కన్నీంటిపర్యంతమవుతున్నారు. సర్వం కోల్పోయామని కన్నీరు మున్నీరవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర మనో వేదనకు గురై, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. గత మూడు రోజుల్లో, ముగ్గుర వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎర్నాకులం జిల్లా వరపుజ్హలో ఓ 68 ఏళ్ల రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని కే రాఖీగా గుర్తించారు. పునరావాస కేంద్రం నుంచి మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన రాఖీ.. మంగళవారం వరద నీటితో దెబ్బతిన్న తన ఇంటిని చూసుకుని కుమిలిపోయాడు. ఇంటిలో పేరుకుపోయిన బురదను బయటికి నెట్టేయడానికి గంటల కొద్దీ శ్రమించాడు. కుటుంబ సభ్యులను తిరిగి పునరావాస కేంద్రానికి వెళ్లమని.. ఇంటిని శుభ్రం చేసి తర్వాతి రోజు ఉదయాన్నే అక్కడికి వచ్చి వారిని తీసుకెళ్తానని చెప్పాడు. వారిని తిరిగి క్యాంపుకు పంపించాడు. కానీ తర్వాత రోజు ఉదయం అల్పాహార సమయానికి రాఖీ అక్కడికి వెళ్లలేదు. వెంటనే కుటుంబ సభ్యులే ఇంటి వద్దకు వెళ్లారు. కానీ అక్కడ రాఖీ, ఫ్యాన్కు ఉరివేసుకుని కనపడే సరికి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. వరదలతో అన్నీ కోల్పోయామని రాఖీ బాగా బాధపడేవాడని కుటుంబ సభ్యులు చెప్పారు. కాగ, కొజికోడ్ జిల్లాలో ఓ 19 విద్యార్థి కూడా వరదల్లో తన 12వ తరగతి సర్టిఫికేట్లు కొట్టుకుని పోయాయని తీవ్ర మనో వేదనకు గురై, ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిసూర్లో మరో వ్యక్తి కూడా ఇలానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరదల్లో బాగా నష్టపోయిన వారికి కౌన్సిలింగ్ ఇప్పించడానికి సైకాలజిస్ట్లను కూడా ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు పంపిస్తోంది. ఈ వరదలతో కేరళలో ఎక్కువగా బలవన్మరణాలు సంభవించవచ్చని సైకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. -
కేరళ వరదలు : సాయం వద్దంటే నిధులెలా..?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో వరద సహాయక చర్యలకు అంతర్జాతీయ సాయాన్ని తాము ఆమోదించబోమని భారత్ విస్పష్టంగా పేర్కొందని థాయలాండ్ అంబాసిడర్ ట్వీట్ చేయడంతో కేరళ పునర్నిర్మాణంపై విస్తృత చర్చ మొదలైంది. కేరళకు కేంద్రం ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోని క్రమంలో ఇతరులు చేసే సాయాన్ని కేంద్రం తిరస్కరించరాదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ తేల్చిచెప్పారు. వరదలతో తల్లడిల్లిన కేరళకు దుబాయ్ రూ 700 కోట్ల సాయం అందించేందుకు ముందుకు రాగా ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించారని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. వరద సాయం కింద తాము కేంద్రాన్ని రూ 2000 కోట్లు కోరితే కేవలం రూ 600 కోట్లు ఇచ్చారని, ఈ పరిస్థితుల్లో ఇతర ప్రభుత్వం, వ్యక్తులు సాయంతో ముందుకు వస్తే ఎందుకు కేంద్రం అడ్డుపడుతున్నదో తనకు అర్థం కావడం లేదని కేరళ మంత్రి థామస్ ఇస్సాక్ ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్, కేరళల మధ్య దీర్ఘకాల అనుబంధం కొనసాగుతుందని, దుబాయ్లో అత్యధిక జనాభా మళయాళీలేనని చెప్పారు. దుబాయ్లో దాదాపు 30 లక్షల మంది భారతీయులు పనిచేస్తుంటే వారిలో 80 శాతం మంది కేరళకు చెందినవారేనన్నారు. కేంద్రం ప్రకటించిన వరద సాయం అరకొరగా ఉందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ స్పందన రావడంతో గండం నుంచి గట్టెక్కామని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కేరళ పునర్నిర్మాణమే ఇప్పుడు తమ ముందున్న సవాల్ అన్నారు. -
కేరళ వరదలు : దుబాయ్ను అలా చూడలేం..
తిరువనంతపురం : వరదలతో ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళకు దుబాయ్ ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. దుబాయ్ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని, భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు దుబాయ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని విజయన్ వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంతవరకూ దుబాయ్ కేరళకు వరద సాయాన్ని తన సొంతంగా ప్రతిపాదించిందని, వారి దేశ నిర్మాణంలో భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు ఇతోధిక సాయం చేశారని ఆ దేశ పాలకులు గుర్తెరిగిన క్రమంలో దుబాయ్ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని విజయన్ స్పష్టం చేశారు. అబుదాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సాయంపై ప్రతిపాదించారని సీఎం విజయన్ చెప్పారు. కాగా, 2004లో ఏర్పాటైన విపత్తు సాయం విధానానికి అనుగుణంగా భారత్ వ్యవహరిస్తుందని, అప్పటి నుంచి విదేశ సాయాన్ని తిరస్కరిస్తూ వస్తున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: యూఏఈ సాయానికి కేంద్రం నో!) -
ఈ విజయం కేరళ బాధితులకు అంకితం: కోహ్లి
నాటింగ్ హామ్: ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇస్తున్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్లో గెలిచి కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలని జట్టుగా నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్నాం. ఈ గెలుపును వారికి అంకితం ఇస్తున్నాం. ప్రస్తుతం అక్కడ చాలా విషాదకరమైన పరిస్థితి నెలకొంది. ఇది భారత క్రికెట్ జట్టుగా వారి కోసం మేము చేయగల చిన్న పని. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విదేశాల్లో మేం ఆడిన టెస్టుల్లో ఒక్క లార్డ్స్ టెస్టుల్లోనే చెత్త ప్రదర్శన కనబర్చాం. ఆ మ్యాచ్లో చేసిన తప్పులను సవరించుకోని రాణించాం. బౌలింగ్, బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శనతో పాటు ఫీల్డింగ్లో ముఖ్యంగా స్లిప్ క్యాచ్లతో మ్యాచ్ మా వశం చేసుకున్నాం. ఈ మ్యాచ్లో అన్నీ మాకు కలిసొచ్చాయి. తొలి ఇన్నింగ్స్లో రహానే బాధ్యాతాయుతంగా ఆడాడు. ఆ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం కష్టం. కానీ అతను సానుకూలంగా ఆటను ఆస్వాదిస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. పుజారా రెండో ఇన్నింగ్స్లో అదరగొట్టాడు.’ అని చెప్పుకొచ్చాడు. నా ఇన్నింగ్స్.. అనుష్కకు అంకితం.. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి తన ఇన్నింగ్స్ను అనుష్కశర్మకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు.‘నేను నా ఇన్నింగ్స్ను నా సతీమణి అనుష్కశర్మకు అంకితమివ్వాలనుకుంటున్నాను. ఆమె ప్రోత్సాహం వెల కట్టలేనిది. నేను ఎల్లప్పూడు ప్రశాంతంగా ఉండేలా ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. ఈ మ్యాచ్లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు రాణించడం ఆనందంగా ఉంది. మేం ఎప్పుడూ మా ఫిట్నెస్పైనే దృష్టి సారిస్తాం. ఇదే ఊపుతో సిరీస్ కైవసం చేసుకుంటాం’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: మూడో టెస్ట్: భారత్ ఘనవిజయం -
కేరళ వరదలు: రోనాల్డో 72.. కోహ్లి 82 కోట్లట!
సాక్షి, హైదరాబాద్ : కేరళను ఒకవైపు వరద, మరోవైపు నకిలీ వార్తలు ముంచెత్తుతున్నాయి. కేరళకు వరదసాయం అందించడంలో సోషల్ మీడియా క్రియాశీల పాత్ర పోషిస్తోందన్న విషయం తెలిసిందే. అయితే విరాళాల విషయంలో ఫేస్బుక్, వాట్సాప్ల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని నకిలీ వార్తలు, కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా సినీ హీరోలు, క్రికెటర్ల అభిమానులు నకిలీ పోస్ట్లతో జనాలను పక్కదారి పట్టిస్తున్నారు. తమ అభిమాన హీరో ఇంత సాయం చేశాడంటే.. మా హీరో ఇంత చేశాడని, నా అభిమాన క్రికెటర్ ఎవరూ చేయని సాయం చేశారని ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారు. ఇవి ఆ హీరోలకు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. నిజానికి వారు చేసే సాయానికి.. అభిమానులు ప్రచారంలో చెబుతున్న దానికి పొంతనే లేకుండా పోతుంది. ఇది వారి అభిమాన హీరోల పరువుతీస్తోంది. స్వయంగా వాళ్లే మీడియా ముందుకు వచ్చి ఎంత సాయం చేశానో చెప్పేలా ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: కేరళ వరదలు : కదిలిన టాలీవుడ్) అలాంటి కొన్ని వార్తలు.. టీమిండియా కెప్టెన్ విరాట్ రూ.80 కోట్ల ఆర్థిక సాయం.. చేశాడంటూ ఓ పోస్ట్ ఫేస్బుక్, వాట్సాప్ల్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి కోహ్లి కేరళ సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సాయం ప్రకటించలేదు. కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, అక్కడ సేవలందిస్తున్న ఎన్టీఆర్ఎఫ్, భద్రతా బలగాలకు హ్యాట్స్ఫ్ అంటూ ఒక ట్వీట్ మాత్రమే చేశాడు. బాలీవుడ్ నటి సన్నీలియోన్ రూ. 5కోట్లు ఆర్థిక సాయం, టాలీవుడ్ హీరో ప్రభాస్ రూ. కోటి రూపాయలు, తమిళ హీరో విజయ్ రూ.14 కోట్లు, జనసేన అధ్యక్షుడు రూ.2 కోట్లు ప్రకటించినట్లు వారి అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ రూ.25 లక్షలు సాయం చేయగా.. తమిళ హీరో విజయ్ రూ.70 లక్షల విరాళం ప్రకటించారు. ఇక పవన్ కల్యాణ్, సన్నీలియోన్లు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా తమ సాయన్ని ప్రకటించలేదు. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ రూ. 77 కోట్ల విరాళం ప్రకటించాడని కూడా ఓ వార్తను సృష్టించారు. నిజానికి రోనాల్డో విరాళం ఏమో కానీ కనీసం వరదలకు సంబంధించిన ట్వీట్ కూడా చేయలేదు. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ స్టార్ల అభిమానులు ఒకరిని చూసి మరొకరు తమ హీరో గొప్పంటే.. తమ హీరో గొప్ప అని ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. చదవండి: వరదల్లో ఫేక్ న్యూస్ బురద -
కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ఫండ్కు రూ. 21 కోట్ల విరాళం అందజేసింది. దాంతోపాటు రూ. 50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని, వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఫౌండేషన్ సహాయక చర్యల్లో నిమగ్నమైందని తెలిపింది. ఆగస్ట్ 14 నుంచి వయనాడ్, త్రిశూర్, అలప్పుళ, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో తమ వాలంటీర్లు పనిచేస్తున్నారని వెల్లడించింది. కేరళలోని 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లోని బాధితులకు రిలయన్స్ రిటైల్ తరఫున ఆహార పదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ నాప్కిన్స్ వంటివి పంపిణీ చేస్తున్నామని పేర్కొంది. ఇక, కేరళలో వారం రోజుల పాటు ఉచిత వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. -
కొచ్చి విమానాశ్రయానికి భారీ నష్టం
కొచ్చి : ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన కేరళ ఇపుడిపుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఎడతెగని వర్షాలు, వరదలతో రాష్ట్రానికి తీరిని నష్టం వాటిల్లింది. ప్రాణనష్టంతోపాటు, ఆస్తినష్టం భారీగా నమోదైంది. రోడ్డు, రైలు తదితర రవాణా వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారిపోయాయి. జిల్లాలోని అనేక రోడ్డుమార్గాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా వరదల్లో చిక్కుకున్న కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం భారీగా నష్టపోయింది. ఆగస్టు 15నుంచి విమాన సర్వీసులు నిలిపివేసిన ఈ విమానాశ్రయ నష్టం 200 నుంచి 250 కోట్ల రూపాయల దాకా వుండవచ్చని అధికారులు అంచనా వేశారు. కేరళలో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం కొచ్చి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులద్వారా అత్యధిక ఆదాయాన్ని సాధిస్తుంది. అయితే వరదల కారణంగా రన్వే మొత్తం నీటితో నిండిపోవడంతో విమానాశ్రయాన్ని ఆగస్టు 26వ తేదీవరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వరద పరిస్థితి శాంతించడంతో తమ సేవల్ని పునరుద్ధరించడానికి 24 గంటలూ శ్రమిస్తున్నామనీ, ప్రస్తుతం, రన్వేను బాగు చేస్తున్నామని కొచ్చి విమానాశ్రయాధికారి అధికారి ఒకరు చెప్పారు. 250 కి పైగా ప్రజలు ఈ పునరుద్ధరణ ప్రయత్నాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జయనా తెలిపారు. ఆగస్టు 26 నుంచి తమ విమాన సేవలు పునఃప్రారంభయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తిగా సోలార్ ప్యానెల్స్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ కార్యాలయంలో ఎనిమిది విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్లలో నాలుగు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సోలార్ పానళ్ళలో 20 శాతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాం . ఒక నెలలోనే సాధారణ పరిస్థితికి చేరుకుంటామని పీఆర్వో చెప్పారు. వీటి మరమ్మతులకు దాదాపు 10కోట్ల రూపాయలదాకా ఖర్చవుతుందని అంచనావేశామని తెలిపారు. అయితే విమానాశ్రయానికి మొత్తానికి బీమా ఉన్నకారణంగా రూ. 250 కోట్ల అంచనా నష్టం తమకు బీమా సంస్థ నుంచి పరిహారం లభించే అవకాశడం ఉండటం ఊరటనిచ్చే అంశం. -
పాలమూరులో కేరళ వాసులు
దేవభూమి, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు.. అందాలకు నిలయమైన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. భారీ వరదలు ముంచెత్తడంతో చిగురుటాకులా వణికి పోతోంది. చిరుజల్లులతో పర్యాటకులకు ఆహ్లాదం పంచే మలయాళ సుగంధ మందారం కుంభవృష్టితో గజగజలాడింది. డ్యాములు, నదులు, రిజర్వాయర్లు కలిసి సంద్రంగా మారడంతో కకావికలమైంది. వరదల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నివాసం ఉంటున్న కొందరు కేరళలో ఉన్న తమ ఆప్తులు, ఆత్మీయులు ఎలా ఉన్నారోనని కలత చెందుతున్నారు. ఫోన్ల ద్వారా ‘మీరు అక్కడ క్షేమంగా ఉన్నారా.. మన ఊరు ఎలా ఉంది.. మన వాళ్లు ఎక్కుడున్నారు..’ అంటూ యోగక్షేమాలను వాకబు చేస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ పలకరించగా తమ బంధువుల విషాదగాధను పంచుకున్నారు. ఆత్మకూర్ మహబూబ్నగర్ : కేరళలో సంభవించిన భారీ విపత్తునకు 250 మందికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వవర్గాల అంచనా. సుమారు 7లక్షల మందికిపైగా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గినా ఎటుచూసినా మోకాళ్ల లోతు నీళ్లు.. పీకల్లోతు కష్టాలు. ఊళ్లకు ఊళ్లే ఏర్లుగా మారాయి. భూలోకస్వర్గంగా పేరొందిన సుందరప్రదేశం మరుభూమిగా మారింది. సర్వం కోల్పోయి ఎంతోమంది ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కేరళ వాసులకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో సత్సంబంధాలు ఉన్నాయి. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు ఉపాధి అవకాశాల కోసం పాలమూరులో సుమారు రెండువేల మందికిపైగా స్థిరపడ్డారు. మధుర స్మృతులు చెదిరాయి.. మా స్వగ్రామం కేరళలోని త్రిశూల్ జిల్లా వరకంచి మండల కేంద్రం.. ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాను. మా ఊరి అందాలను గత ఏడాది ఇక్కడి నుంచి తీసుకెళ్లి మా కుటుంబసభ్యులు 25 మందికి చూపించాను. వారం రోజుల పాటు అక్కడే ఎంతో ఎంజాయ్గా గడిపాం. ఆ మధుర స్మృతులు మరవకముందే మా ఊరు వరదల్లో మునిగిపోయింది. మా వాళ్లు సాగుచేసిన వరి పైరు, కొబ్బరి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇది విని చాలా బాధపడ్డాను. - ఆన్సి శ్రీధర్, ప్రిన్సిపాల్, ఎంవీ.రామన్ స్కూల్, ఆత్మకూర్ ఊరు ధ్వంసమైంది మాది కేరళలోని కన్నూర్ జిల్లా ఏరోమ్ స్వగ్రామం.. వరద ఉధృతి కారణంగా మా ఊళ్లోని రోడ్లు, భవనాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మా కుటుంబసభ్యులు ఐదెకరాల్లో పండించిన వరి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. నాతో పాటు ఇక్కడే ఉంటున్న భార్య, పిల్లలను వారం రోజుల క్రితమే స్వగ్రామానికి పంపించేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. వరదల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాం. - సత్యం, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు, ఆత్మకూర్ మమ్మల్ని ఆదుకోండి కేరళలోని మలప్పురం జిల్లా నిలంబుర్ మండల కేంద్రం మాది. మున్సిపాలిటీ కేంద్రమైన మా ఊరు వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయింది. ఎంతో సుందరమైన మా ప్రదేశం. రాష్ట్రం మొత్తం వరదల ఉధృతికి అతలాకుతలమైంది. సుమారు రూ.20వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కేంద్రం ప్రకటించిన రూ.500కోట్లు ఏమూలకు సరిపోవు. మా రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాలు ముందుకు రావడం సంతోషం. ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. - సల్మాన్, ప్రైవేట్ ఉపాధ్యాయుడు, ఆత్మకూర్ 10 మంది చనిపోయారు.. కేరళలోని కొట్టాయం జిల్లా చంగరసిరి మండలం త్రికొడ్డితాని స్వగ్రామం.. మా ఊరు పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. నిత్యం ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి మా ఊరు వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయింది. మా ఊళ్లో 10మందికి పైగా చనిపోయారు. చేతికొచ్చిన పంటలు పూర్తిగా పోయాయి. మా వాళ్లు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎంతో అందమైన ప్రదేశం పూర్తిగా మునిగిపోవడం ఎంతో బాధగా ఉంది. - నిషా, ప్రైవేట్ ఉపాధ్యాయురాలు, ఆత్మకూర్ అల్లాడిపోతున్నారు.. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా ఉడుంబన్ సోలా మండలం నేడుగండం మా స్వగ్రామం. వరదల కారణంగా మా ఊరు పూర్తిగా మునిగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాగునీరు, తిండికి మా ఊరివాసులు అల్లాడిపోతున్నారు. ఐదుగురు ఇప్పటికే చనిపోయారు. చాలామందిని సహాయక శిబిరాలకు తరలించారు. ఇంకా కొంతమంది అక్కడే ఉండిపోయారు. వారికి సహాయం అందించి ఆదుకోవాలి. - లతారాజ్, ప్రైవేట్ ఉపాధ్యాయురాలు, ఆత్మకూర్ మేమున్నామని.. సాక్షి, వనపర్తి : భారీవర్షాలు, వరదలు భూతల స్వర్గంగా కొనియాడే కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి సాయం చేసే వనపర్తి జిల్లావాసులు కేరళ ప్రజలకు మేమున్నామని.. సాయం చేసేందుకు ముందుకు కదలిలారు. కేరళ వరద బాధితులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముంపు నిర్వాసితులను ఆదుకోవాలని కలెక్టర్ శ్వేతామహంతి పిలుపునివ్వడంతో పలువురు వ్యాపారులు, ఉద్యోగులు, స్వచ్ఛసంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. గెజిటెడ్ అధికారులు రూ.లక్ష చెక్కును కలెక్టర్కు అందజేశారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ జోషి గోపాలశర్శ రూ.25వేలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అమరేందర్రెడ్డి రూ.15వేలు అందించారు. వరద బాధితులకు ఆర్థిక సాయం వనపర్తి : కేరళ, ఆదిలాబాద్ వరద బాధితులకు ఆర్థికసాయం చేశారు. మంగళవారం కలెక్టర్ శ్వేతామహంతికి చెక్కు అందజేశారు. స్థానిక ప్రజావైద్యశాల తరఫున డాక్టర్ మురళీధర్ కేరళ వరద బాధితులకు రూ.లక్ష, ఆదిలాబద్, ఆసిఫాబాద్ నిర్వాసితులకు రూ.25 వేలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఆదిలాబాద్ బాధితులకు రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు. ముందుకొస్తున్న దాతలుకేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లాలో ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. సోమవారం కలెక్టర్ శ్వేతామహంతిని కలిసి పలువురు చెక్కులు, డీడీలు అందజేశారు. పీడీఎస్యూ విద్యార్థులు రూ.7,166, వనపర్తి కలెక్టర్ కార్యాలయం ‘ఏ’ సెక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ రూ.15వేలు, వనపర్తి కల్వరిటౌన్ చర్చి ఆధ్వర్యంలో రూ.22వేలు, పురుషుల డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రూ.1,050 కలెక్టర్కు అందించారు. వీరితో పాటు పలువురు నేరుగా కేరళ సీఎం రిలీఫ్ఫండ్కు డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుండగా మరికొందరు వనపర్తి జిల్లా కలెక్టర్ ఖాతాలో నేరుగా డబ్బును జమచేస్తున్నారు. కలెక్టరేట్లో వరద బాధితులను ఆదుకునేందుకు ఒక సెల్ను ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం అందే అవకాశం ఉంది. కష్టాల్లో కన్నోళ్లు.. ∙పాలమూరులో నర్సింగ్ కోర్సు చదువుతున్న కేరళ విద్యార్థులు ∙క్షణంక్షణం కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకుంటున్న వైనం ∙రాష్ట్రం కోలుకోవాలని నిత్యం ప్రార్థనలు సాయం కోసం వేడుకోలు పాలమూరు : ప్రకృతి ప్రకోపానికి సుందర ప్రదేశం కేరళ కాకావికలమైంది. పచ్చటి పొలాలు, ఇళ్లు, ఊళ్లు వరద తాకిడికి నామరూపాల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఎటూచూసినా బురద దిబ్బలే కనిపిస్తున్నాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు జిల్లా కేంద్రంలోని నవోదయ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. కేరళలో నెలకొన్న విషాదం నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులను తలచుకుంటూ కుమిలిపోతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. మంగళవారం ‘సాక్షి’తో తమ ఆవేదన పంచుకున్నారు. మూడురోజులుగా ఆహారం లేదట మాది కేరళలోని కొల్లెం జిల్లా కున్నత్తు స్వగ్రామం.. పాలమూరు జిల్లా కేంద్రంలోని నవోదయ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. మా అమ్మ అజిత, తాతయ్య కార్తీకేయ, మా అన్నయ్య అతుల్ ఇంటివద్దే ఉంటున్నారు. వారితో ఫోన్లో మాట్లాడాను. మూడు రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా గడిపారని చెబుతున్నారు. మా ఇంటి రెండో అంతస్తులో విద్యుత్ లేకుండా రెండురోజుల పాటు ఉండి ఇతరుల సాయంతో సహాయక శిబిరంలోకి వెళ్లామని చెప్పారు. మూడు రోజులుగా ఫోన్ కలవడం లేదు. అందరికీ మంచి జరగాలని ప్రార్థన చేస్తున్నా.. చదువు మీద ధ్యాస ఉండటం లేదు. మేం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయాను. - అతుల్య, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి, మహబూబ్నగర్ కొండచరియలు విరిగి పడ్డాయి కేరళలోని ఇడుక్కి జిల్లా ఐడిమాలి స్వగ్రామం మాది. మా అమ్మ షీనా, నాన్న షిబి, సోదరులు స్టిల్జో, సిఫినా అక్కడే ఉంటారు. మా ఇంటి సమీపంలో ఉండే కొండచరియలు విరిగిపడ్డాయి. మేం నివాసం ఉండే ప్రాంతం కొండలతో చాలా అందంగా ఉండేది. ప్రస్తుతం అది గుర్తించలేకుండా ఉంది. దీంతో ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మా కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. వారితో మాట్లాడటానికి వీలుపడటం లేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉన్నప్పటికీ అక్కడి వాతావరణం బాగా లేకపోవడంతో వెళ్లడం లేదు. - సిఫియా, నర్సింగ్ విద్యార్థిని ఫోన్లు కలవడం లేదు.. కేరళలోని కొట్టాయం జిల్లా తలయోలసంబు స్వగ్రామం మాది. మా ఇంటి వద్ద నాన్న రాజు, అమ్మ సుధ, అన్నయ్య ఆదర్శ ఉంటున్నారు. మా ఇంటి లోపలికి వరద చేరింది. వాళ్లంతా సహాయక శిబిరాలకు వెళ్లిపోయారు. వారితో మాట్లాడి ఐదు రోజులవుతుంది. పూర్తిగా కరెంట్ నిలిచిపోవడంతో సెల్ఫోన్లు సైతం పనిచేయడం లేదు. మా కుటుంబసభ్యులు ఎలా ఉన్నారోనని ఆందోళనగా ఉంది. అక్కడ మా వారికి నీరు, ఆహారం ఎలా అందుతుందనే విషయంపై దిగులుగా ఉంది. ప్రస్తుతం కొంత వరకు వర్షాలు తగ్గాయని తెలిసింది. వాతావరణ పరిస్థితి కుదుటపడితే మా ఊరికి వెళ్తాం. - అశ్విత, నర్సింగ్ విద్యార్థిని వరదల్లో మా కుటుంబం కేరళలోని పతనంథిట్ల మండలం పందాలం స్వగ్రామం. ఊళ్లో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. మా ఊర్లో అమ్మ పాప్పచన్, నాన్నమ్మ రోసమ్మ, అన్నయ్య మబ్లే, అమ్మమ్మ అన్నమ్మ ఉంటున్నారు. మా కుటుంబం పూర్తిగా వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు బృందాలు రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు రోజులుగా ఫోన్ ట్రై చేస్తున్నా కలవడం లేదు. వారు ప్రస్తుతం ఎలా ఉన్నారనే సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నాను. మా కుటుంబంతో పాటు స్థానికులు బాగుండాలని మేం ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నాం. - మెర్లీన్, నర్సింగ్ విద్యార్థిని -
కేరళకు ఇండియన్ రైల్వే భారీ విరాళం!
తిరువనంతపురం : భారీ వరదలతో అస్తవ్యస్తమైన కేరళను ఆదుకునేందుకు భారత రైల్వే సంస్థ ముందుకొచ్చింది. పునరావాస చర్యల్లో కేరళకు అన్నివిధాల సహకరిస్తోంది. ఇక, వరద విపత్తులో చిక్కుకున్న కేరళకు అండగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని రైల్వేమంత్రి పీయూష్ గోయెల్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 16 జోన్లలో 13 లక్షలమంది రైల్వే ఉద్యోగులు ఉన్నారు. వీరు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే.. దాదాపు రూ. 200 కోట్ల భారీ సాయాన్ని అందించినట్టు అవుతుంది. మరోవైపు రైల్వేస్కు చెందిన పుణే డివిజన్ నిర్విరామంగా కేరళకు సాయం అందిస్తోంది. గతవారం కేరళకు 29 వ్యాగన్ల మంచినీటిని సరఫరా చేసిన పుణె రైల్వే డివిజన్.. తాజాగా మంగళవారం నాలుగు టన్నుల సహాయక సామాగ్రిని తిరువనంతపురం పంపింది. వర్షాలతో మూతపడిన కొచ్చి ఎయిర్పోర్టు ఈ నెల 26వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కేంద్రం తరఫున సహాయక చర్యల్లో నిమగ్నమైన కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ మంగళవారం రాత్రి చాంగనచెర్రీ సహాయక శిబిరంలో బస చేశారు. సహాయక శిబిరంలో తాను పడుకున్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. 2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వండి! వరదల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో సహాయక, పునరావాస చర్యల కోసం రూ. 2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. కేరళకు కేంద్రం ప్రకటించిన రూ. 500 కోట్ల సహాయం సరిపోదని, కేంద్ర సాయాన్ని రూ. 2వేల కోట్లకు పెంచాలని కోరుతూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మరోవైపు యూఏఈ ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
గుబాళించిన మానవత్వం
కలెక్టరేట్: కేరళ రాష్ట్రంలో ప్రకృతి విలయతాండవం చేయడంతో అక్కడి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నచందంగా సర్వం కోల్పోయి విలవిలలాడుతున్నారు. బాధితులను ఆదుకునేందుకు తామున్నామంటూ దయార్ద్ర హృదయులు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయంచేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన హీరా గ్రూప్ సంస్థ కేరళ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ చైర్ పర్సన్ నవ్హీరా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గన్ఫౌండ్రీలోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో హీరా గ్రూప్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ఇన్చార్జి ఫాజిల్ హుస్సేన్ మాట్లాడుతూ.. హీరా గ్రూప్ దేశ వ్యాప్తంగా పలు స్వచ్చంద కార్యక్రమాల్లో పాలుపంచుకుందన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థ ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న ప్రజలకు చేయూతనందించిందని పేర్కొన్నారు. కాశ్మీర్లోని ప్రజలు వరదలకు గురైనప్పుడు సంస్థ ద్వారా బాధితులకు సహాయం అందించామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తమ సంస్థ తరఫున కోటి రూపాయల చెక్కును అందజేశామన్నారు. స్టార్ ఇండియా ఉద్యోగుల విరాళం రూ.5 కోట్లు వరద బాధితుల సహాయార్థం స్టార్ ఇండియా ఉద్యోగుల రూ.5 కోట్ల విరాళాన్ని సౌతిండియా ఎండీ కె.మాధవన్ కేరళ సీఎం పినరయి విజయన్కు అందజేస్తున్న దృశ్యం. -
కేరళ: యూఏఈ 700 కోట్ల సాయం తిరస్కరణ!
సాక్షి, తిరువనంతపురం : మలయాళ సీమను ఆదుకునేందుకు యూఏఈ ప్రకటించిన రూ. 700 కోట్ల భారీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించబోతోంది. 2004లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విపత్తు సహాయ విధానం ప్రకారం యూఏఈ ప్రభుత్వ సాయాన్ని అంగీకరించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. భారత విపత్తు సహాయ విధానంలో 2004 సంవత్సరం కీలక మలుపుగా చెప్పవచ్చు. ఈ విధానం అమల్లోకి వచ్చిననాటి నుంచి మన దేశం విదేశీ సహాయాలను అంగీకరించడం లేదు. అంతకుముందు 1991 ఉత్తరకాశీ భూకంపం, 1993 లాతూర్ భూకంపం, 2001 గుజరాత్ భూకంపం, 2002 బెంగాల్ తుఫాన్, 2004 జూలై బిహార్ వరదల సమయంలో భారతదేశం విదేశీ సహాయాన్ని స్వీకరించింది. అయితే, ‘దేశంలో తలెత్తే పరిస్థితుల్ని సొంతంగా ఎదుర్కొగలిగే సత్తాను భారత్ సాధించింది. అవసరమైతే విదేశీ సహాయాన్ని తీసుకుంటాం’ అని పేర్కొంటూ 2004లో నూతన విపత్తు సహాయ విధానాన్ని మన్మోహన్సింగ్ అమల్లోకి తెచ్చారు. కేరళకు యూఏఈ ప్రకటించిన సహాయం విషయంలోనూ ఈ విధానాన్ని వర్తిస్తుందని, కాబట్టి ఈ సాయాన్ని అంగీకరించే అవకాశం లేదని కేంద్రానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ప్రస్తుతం కేంద్రం విదేశాల నుంచి ఆర్థిక సాయాన్ని అంగీకరించట్లేదు. యూఏఈ సాయానికీ అదే వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. విదేశాల్లోని భారతీయులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపవచ్చని.. వాటిపై ఎలాంటి పన్ను ఉండదని విదేశాంగశాఖ వివరణిచ్చింది. ‘విదేశీ సాయం నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) కింద గుర్తింపు పొందిన లాభాపేక్ష లేని సంస్థలు, ఎన్జీవోలకు విదేశీ సాయం అందితే వాటిపై పన్ను ఉండదు. గుర్తింపు లేని ఎన్జీవోలకు నిధులు అందితే మాత్రం వాటిపై పన్ను చెల్లించాలి’ అని విదేశాంగ శాఖ అధికారి తెలిపారు. -
వైఎస్ జగన్ పిలుపుతో కేరళకు కదిలిన కార్యకర్తలు
సాక్షి, చిత్తూరు : భారీ వర్షాలతో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కేరళకు సహాయం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వారు సానుకూలంగా స్పందించారు. కేరళకు అండగా నిలవడానికి తమ వంతుగా విరాళాలు అందించారు. నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో చిత్తూరులో ఒక్క రోజులోనే 10 లక్షల రూపాయలు, 14 టన్నుల బియ్యం, పప్పు ధాన్యాలు, చీరలు సేకరించారు. పుత్తూరు నుంచి 30 మందితో కూడిన పార్టీ బృందం.. సేకరించిన సరుకులు, నగదును తీసుకుని కేరళకు పయనమైందని రోజా తెలిపారు. కాగా, తన వంతు సహాయంగా నెల రోజుల వేతనాన్ని ప్రకటించి ఎమ్మెల్యే రోజా బాధితులకు బాసటగా నిలిచారు. -
శబరిమల దారిలో..
-
ఆరు రోజులు ప్రత్యక్ష నరకం
వాళ్లంతా మానసిక వికలాంగులు. చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించుకోలేని నిస్సహాయులు. ఆరు రోజులు బయట ప్రపంచంలో ఏమవుతోందో తెలీక, తమ ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయనే విషయాన్ని తెలుసుకోలేక నీళ్లల్లోనే అలా కాలం గడిపేశారు. చివరికి ఎలాగోలా సహాయబృందాలు వారున్న చోటుకి వెళ్లగలిగాయి. వారి ప్రాణాలు కాపాడాయి. కేరళ తిస్సూరు జిల్లాలోని మురింగూర్ అనే మారుమూల ప్రాంతంలోని మానసిక రోగుల సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారంతా తట్టబుట్ట సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతే, వరద నీరు మింగేస్తోందని కూడా తెలుసుకోలేని వారంతా అక్కడే ఉండిపోయారు. గుబురుగా ఉండే చెట్ల మాటున ఉండే ఆ కేంద్రం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండడంతో వారి ఆలనాపాలనా పట్టించుకునేవారే లేకపోయారు. అయితే అక్కడ స్థానిక బ్లాక్ పంచాయితీ సభ్యుడు థామస్ మాత్రం ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు. ప్రతీరోజూ చిన్న మరబోటులోనే ఆ కేంద్రానికి కొంచెం కొంచెం ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. అలా ఆరు రోజులు గడిచాక ఎలాగైతేనేం సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. థామస్ ఆ సహాయ బృందాలకు ఎదురేగి మానసిక వికలాంగుల పరిస్థితిని వివరించారు. కానీ వరదనీరు భారీగా చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం చాలా క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేకపోవడంతో ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. థామస్ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తిస్సూర్ జిల్లాలోని ఆ మారుమూల ప్రాంతానికి సహాయ బృందాలు చేరుకోవడం ఇదే ప్రథమం. గతంలో విపత్తులు సంభవించిన సమయంలోనూ అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు. కానీ ఈ సారి సహాయ బృందాలు మెడలోతు నీళ్లల్లో 3 కి.మీ. నడుచుకుంటూ వెళ్లి మరీ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆ గ్రామ ప్రజలనే కాదు మానసిక స్థితి సరిగా లేని వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన థామస్ని రియల్ హీరో అంటూ స్థానికులు కొనియాడుతున్నారు. -
ఆ మట్టికి పోరాడే శక్తి!
అంతా సజావుగా సాగకపోవచ్చు. కొన్ని లోపాలు కూడా తలెత్తి ఉండొచ్చు. ప్రజలంతా వరదల్లో చిక్కుకుంటే నిరాశా నిస్పృహలు చుట్టముట్టడం సహజమే. అయినా కేరళ తట్టుకుంది. ధైర్యంగా నిలబడింది. అనేక ఒడిదుడుకులను ఎదురొడ్డి నిలిచింది. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోకుండా అనితరసాధ్యమైన సాహసాలు చేసి ప్రజలను రక్షించుకుంది. గత కొన్ని రోజులుగా వరదల్లో చిక్కుకున్న కేరళ అదే పోరాటపటిమను ప్రదర్శించింది. కేరళ పాలకులకూ, నాయకత్వానికీ నిజానికి ఇదొక పెద్ద సవాల్! ప్రధానంగా యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కేంద్రీకరించి, సైనికదళాల సాయంతో తమ ముందున్న సవాళ్ళను అధిగమించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కృతకృత్యులయ్యారు. సాహసోపేతమైన సహాయక చర్యలు రాష్ట్రంలో మొత్తం 22000 మంది ప్రజలను రక్షించింది. వరదల్లో చిక్కుకున్న 7.24 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా పెద్ద సంఖ్యలో వృద్ధులనూ, చిన్నారులనూ రక్షించింది. వారి దీక్ష అనన్య సామాన్యం... మొన్న నిఫా వైరస్ ఎదుర్కొన్నట్టుగానే నేడు వరద ప్రళయాన్నీ తప్పించుకోవడంలో కేరళ ప్రజల పాత్ర అనన్యసామాన్యమైనది. వైద్యులు, ఉపాధ్యాయులూ, విద్యార్థులూ, ఐటి ఉద్యోగులూ ఇలా ప్రజలంతా ఎవరికి తోచిన సాయం వారందించారు. వరద బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో అహోరాత్రులు శ్రమించారు. ఎక్కడో వరదల్లో చిక్కుకుపోయిన గర్భిణులనూ, చిన్నారులనూ భుజాలకెత్తుకుని తీసుకెళ్ళారు. వృద్ధులను నెత్తిన మోసుకొచ్చారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి కావాల్సిన ఆహారపదార్థాలను అందించడానికి ఎందరో దాతలు ముందుకొచ్చారు. నీటిలో నానుతూ రోజుల తరబడి ఉండిపోయిన స్త్రీలకు అవసరమైన లోదుస్తులూ, సానిటరీ ప్యాడ్స్ని సైతం ప్రత్యేకించి వారికి చేర్చేందుకు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసిన స్వచ్ఛంద కార్యకర్తలెందరో కేరళ ప్రజల్లో దాగున్న పోరాటపటిమను చాటిచెప్పారు. సమైక్య శ్రమసౌందర్యాన్ని ప్రపంచ ప్రజలకు రుచిచూపించిన కేరళ మత్స్యకారుల పాత్రను చరిత్ర మరువజాలదు. ఊరూ పేరూలేని చేపలుపట్టే సాధారణ ప్రజలు సైతం తమతమ బోట్లతో సొంత ఖర్చుతో వరదప్రాంతాలకు చేరుకొని తమ శరీరాలను మెట్లుగా మలిచిన సందర్భం అపురూపమైనది. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది... ఇప్పటికే స్వచ్ఛందంగా ఎంతో మంది ముందుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇందులో మత్స్యకారుల పాత్ర ప్రత్యేకించి చెప్పుకోదగినది. సైన్యం నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇంకా చాలా పని మిగిలేవుంది. అంటువ్యాధులు పొంచి ఉన్నాయి. వైద్య సహాయం తక్షణావసరం. తాగునీటిని అందించడం, నిలవచేసుకోవడం. విద్యుత్ను పునరుద్ధరించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా సర్వస్వం కోల్పోయిన కేరళ ప్రజలు తమ జీవితాలను మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి. ఇళ్ళూ, పంటలూ, పొలాలూ, పాఠశాలలూ, అన్నీ కోల్పోయిన ప్రజలు ఇప్పుడు సహాయకశిబిరాల నుంచి తిరిగి తమతమ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఏమీలేని స్థితి నుంచి జీవితాలను ప్రారంభించాలి. కేరళ మట్టిలోనే పోరాడే శక్తి ఉంది. అక్కడి ప్రభుత్వం ప్రజలు సమైక్యంగా వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్న తీరు 1924లో కేరళని అతలాకుతలం చేసి ఇలాంటి వరదలనే గుర్తుకు తెస్తోంది. అప్పుడు సైతం... 1924లో కేరళని ముంచెత్తిన వరదలు దక్షిణ భారతదేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని నష్టపరిచాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా పశువులు చనిపోయాయి. పూర్వీకుల కథల్లో ఆ విషాదం ఇంకా మిగిలేవుంది. అప్పుడు కూడా కేరళని ఆదుకునేందుకు అంతా కదిలివచ్చారు. 1924 ఆగస్టులో వచ్చిన ఈ వరదల్లో వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 4000 మందిని అమబాలప్పుజా, 3000 మందిని అల్లెప్పీ, 5000 మందిని కొట్టయాం, 3000 మందిని చంగనాస్సెరీ, 8000 మందిని పెరూర్ తదిరత ప్రాంతాలకు పంపారు. ఆ యేడాది ప్రజలకు టాక్సులు వ్యవసాయ పన్నులు రద్దుచేసారు. వ్యవసాయ రుణాల కోసం 4 లక్షలు ప్రత్యేకించి కేటాయించారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఇళ్ళనిర్మాణం కోసం ఆర్థిక సాయం, వెదురును ఉచితంగా సరఫరా చేయడంలాంటి ఎన్నో కార్యక్రమాలు స్వర్గథామంలాంటి కేరళను మళ్ళీ మెల్లమెల్లగా పుంజుకునేలా చేసాయి. అటు కేంద్రం... ఇటు రాష్ట్రప్రభుత్వం... విపత్తులు సంభవించినప్పుడు, ప్రళయం ప్రజల ప్రాణాలను కబళిస్తున్నప్పుడు అన్నింటినీ పక్కకు పెట్టాల్సిందేనని కేరళ విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రుజువుచేసాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్యం కోసం అమెరికా వెళ్ళాల్సి ఉన్నా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ప్రజలకూ, కేంద్ర ప్రభుత్వానికీ నిత్యం అందుబాటులో ఉన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి కేరళ ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్రమోడీకి కేరళ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అందుతోన్న సైనిక సహకారాన్నీ, అదనంగా కావాల్సిన తోడ్పాటుని గురించీ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రంలో జరుగుతోన్న సహాయక చర్యలపట్ల హర్షం వ్యక్తం చేసారు. తక్షణ అవసరాలకనుగుణంగా కేంద్రం స్పందిస్తోంది. -
కేరళ వరదలు: టెక్ కంపెనీలు ఏం సాయం చేశాయ్!
వరదలతో కకావికలమై, తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కేరళ ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు వివిధ టెక్ కంపెనీలు ముందుకొచ్చాయి. కష్టకాలంలో కేరళ వాసులను ఆదుకునేందుకు మేమున్నామంటూ ఈ కంపెనీలు, సంస్థలు తమ స్థాయిలో సహాయం అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, ట్విటర్ మొదలుకుని, అమెజాన్,పేటీఎం, వంటి టెక్ కంపెనీలు, బిగ్బాస్కెట్, జొమాటో, ఓలా, ట్రూకాలర్ వంటి ఇతర కంపెనీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ సహాయాలు చేపడుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, ఆహార పదార్థాల పంపిణీ, సహాయ శిబిరాల నిర్వహణ, విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలకు అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి. గూగుల్... గూగుల్ సంస్థ ‘పర్సన్ ఫైండర్ టూల్’ ను యాక్టివేట్ చేసింది.ఈ టూల్లో యూజర్లు కనిపించకుండా పోయిన వారి వివరాలు నింపవచ్చు లేదా ఎవరి జాడ అయినా తెలిస్తే వారికి సహాయపడేలా ఏర్పాటుచేశారు. గూగుల్ వెబ్సైట్ ద్వారా ఈ టూల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ‘ప్లస్ కోడ్’ ఫీచర్ ద్వారా పది నుంచి 11 డిజిటల్ కోడ్లను వరద బాధితుల రక్షకులకు పంపించవచ్చు. వరదల్లో చిక్కుకున్న వారి జాడ తెలియజేసి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇది దోహదపడుతోంది. గూగుల్ మ్యాప్లో వారి జాడను కనుక్కున్నాక, వారి చిరునామా కూడా డిస్ప్లే అవుతుంది. కేరళ వరదల సందర్భంగా గూగుల్ మ్యాప్స్ లొకేషన్, ఆఫ్లైన్లోనూ కోడ్ను ఎస్సెమెస్ ద్వారా లేదా ఏదైనా నెంబర్కు కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు. ఆన్లైన్లో షేర్ చేయాలంటే ప్లస్కోడ్ ఎంటర్చేసి నగరం పేరును గూగుల్ మ్యాప్స్ లేదా సెర్చ్ యాప్లోని సెర్చ్ బాక్స్ క్లిక్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్స్లో సహాయ శిబిరాలు, ఆహారం, నీరు, మందులు, ఇతర నిత్యావసరాలు, వాలంటీర్లు, అంబులెన్స్లు, జీప్ల ద్వారా రెస్క్యూకు సంబంధించిన కేంద్రాలను గుర్తించేలా వాటిని పిన్ చేశారు. ఫేస్బుక్... యూజర్లు తాము సురక్షితంగా ఉన్నామా లేదా ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఫేస్బుక్ లైవ్ ‘సేఫ్టీ చెక్’ ఫీచర్ను ప్రవేశపెట్టింది. వరదలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని ఒకచోట అందుబాటులోకి వచ్చేలా ‘క్రైసిస్ రెస్పాన్స్ పేజీ’ క్రియేట్ చేసింది. ఈ పేజీలోని విపత్తు విరాళాల మీట ద్వారా 487 మంది విరాళాలిచ్చినట్టు ఆ సంస్థ తెలియజేసింది. సహాయకార్యక్రమాల్లో నిమగ్నమైన ‘గూంజ్’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా రూ. 1.75 కోట్ల మేర ఫేస్బుక్ విరాళాలు అందజేసింది. భారత్లో 20 కోట్లకు పైగా యూజర్లున్న గూంజ్ లేదా సీఎండీఆర్ఎఫ్ల ద్వారా విరాళాలు అందజేయాల్సిందిగా ఫేస్బుక్ సూచిస్తోంది. అమెజాన్ ఇండియా... ఆక్స్ఫామ్, వరల్డ్ విజన్ ఇండియా, హాబిటాట్ ఫర్ హ్యుమానిటీ, గూంజ్, తదితర స్వచ్ఛందసంస్థల భాగస్వామ్యంతో అమెజాన్ ఇండియా సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్ధ వెబ్సైట్లో పొందుపరిచిన ఎన్జీవోల జాబితాలోంచి మనకిష్టమైన దాన్ని ఎన్నుకుని, దాని ద్వారా ఏయే వస్తువులు విరాళం అందజేయాలనుకుంటున్నారో తెలియజేయవచ్చు. దానికి అయినా బిల్లును చెల్లించాక దానిని ఎవరికి పంపాలో చిరునామా పేర్కొనాలి. అమెజాన్తో పాటు ఆయా ఎన్జీవో సంస్థలు విరాళాలుగా పంపిస్తున్న వస్తువులు ఎంపికచేసిన సహాయశిబిరాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాయి. పేటీఎమ్... కేరళ వరద సహాయం కోసం చేసే విరాళాలను నేరుగా సీఎండీఆర్ఎఫ్ ఖాతాకే పంపించేలా పేటీఎమ్ ఓ బటన్ను యాక్టివేట్ చేసింది. మొబైల్ ఫోన్లలో ఈ యాప్ లేటెస్ట్ వర్షన్ యాక్టివేట్ చేసుకుంటే హోమ్పేజీలోనే విరాళాల బటన్ను గమనించవచ్చు. ట్విటర్... కేరళ ఫ్లడ్స్, కేరళ ఫ్లడ్ 2018 తదితర హ్యాష్ట్యాగ్లను ట్విటర్ వరద సహాయక కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. వరదల వల్ల ప్రభావితమైన వాళ్లు ఈ హ్యాష్ట్యాగ్ల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని పొందవచ్చు. జొమాటో... వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్తో జొమాటో కలిసి పనిచేస్తోంది. ముగ్గురు, ఆరుగురు లేదా పదిమందికి వెజ్, నాన్వెజ్ ఆహారాన్ని యూజర్లు పంపించేందుకు వీలుగా జొమాటో ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్ సెక్షన్లో హెల్ప్ కేరళ బ్యానర్ను యాక్టివేట్ చేసింది. ఆహారాన్ని పంపించే మనుషుల సంఖ్యను బట్టి రూ.90–300 వరకు చెల్లించేందుకు వీలు కల్పించారు. ఒకవేళ ఆ యాప్లో హెల్ప్కేరళ బ్యానర్ కనిపించకపోతే అంగమలి, కొచ్చికి యూజర్ల లొకేషన్ను మార్చుకుంటే ఆ పేజీని చూడవచ్చు. ట్రూకాలర్... పేటీఎమ్ మాదిరిగానే ట్రూకాలర్ కూడా తన ప్లాట్ఫామ్ను సీఎండీఆర్ఎఫ్కు లింక్ చేసింది. ట్రూకాలర్ పే యాప్ ద్వారా యూజర్లు విరాళాలు పంపించే వీలు కల్పించింది. అందుకోసం ముందుగా యూజర్లు తమ బ్యాంక్ ఖాతాను యూపీఐడీకి లింక్ చేసుకోవాలి. బిగ్బాస్కెట్... బిగ్బాస్కెట్ కూడా ‘గూంజ్’ స్వచ్ఛందసంస్ధ ద్వారా కలిసి సహాయకార్యక్రమాలు చేపడుతోంది. వరద బాధితుల కోసం ఆయా వస్తువులు, పదార్థాలను ఆన్లైన్లో యూజర్లు కొనుగోలు చేస్తే వాటిని ఈ సంస్థ ద్వారా చేరవేస్తోంది. అయిదురకాల నిత్యావసర వస్తువులతో కూడిన ప్యాకెట్లను తయారుచేసిన బిగ్బాస్కెట్ ,వాటిని యూజర్లు కొనుగోలు చేసి కేరళ వరదబాధితులకు సహాయంగా అందించేందుకు సహాయపడుతోంది. ఎయిర్టెల్, ఐడియా ఇతర టెల్కోలు... కేరళలోని ప్రీపెయిడ్ కస్టమర్లకు డేటా, కాల్ ప్రయోజనాలు కల్పిస్తూ ఎయిర్టెల్, జియో, ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు చర్యలు తీసుకున్నాయి. పోస్ట్పెయిడ్ కస్టమర్లు బిల్లు చెల్లించే సమయాన్ని పొడిగించి, వారికందించే సేవల్లో అంతరాయం ఏర్పడకుండా చూస్తున్నాయి. ఐడియా వినియోగదారులు ‘1948’ సర్వీసును ఉపయోగించి ఎస్ఎంఎస్ ద్వారా జాడ తెలియకుండా పోయిన వారు చివరిసారి ఎక్కడున్నారో తెలుసుకునే వీలు కల్పించింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.10 ఎమర్జెన్సీ టాక్టైమ్ క్రెడిట్ చేస్తోంది. దీనిద్వారా ఏడురోజుల పాటు 1 జీబీ డేటాను పొందవచ్చు. ఎయిర్టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ కూడా ఇలాంటి ప్రోత్సాహకాలనే ప్రకటించాయి. -
కేరళ పండుగ కళ తప్పింది
మొన్న నిఫాతో బెంబేలెత్తిన స్వర్గసీమ కేరళ నిన్న వరదబీభత్సానికి చివురుటాకులా వణికిపోయింది. చిన్నా చితకా వ్యాపారాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ వరకూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కేరళ అనగానే గుర్తొచ్చే పూల పండుగ పది రోజులపాటు ప్రతిఇంటా ఆనందాలు వెల్లవిరిసేవి. బంతులు, చామంతులూ, మల్లెలూ ఒకటేమిటి అన్ని పూలూ కేరళని ముంచెత్తేవి. ఓనమ్ పండుగ పదిరోజులూ ప్రతి ఇంటా పూల తివాచీలే పరిచేవారు. కానీ ఈసారి వరదలు సృష్టించిన బీభత్సం కేరళ ప్రజల జీవితాలను చిందరవందరచేసింది. వ్యాపారుల దగ్గర్నుంచి పూలుకొనేవాళ్ళే కరువయ్యారు. ప్రతియేటా ఇదే సీజన్లో జరిగే కేరళ ప్రసిద్ధ ఓనమ్ పండుగకు దాదాపు 800 టన్నుల పూల వ్యాపారం జరిగేది. కేరళ సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులోని తిరునాల్వేలి నుంచి తరలివచ్చే పూల వ్యాపారులకు ఈ ఏడాది నిరాశే ఎదురయ్యింది. ఒక్క తిరునాల్వేలి నుంచే కాకుండా హోసూర్, కోయంబత్తూర్, కన్యాకుమారి, బెంగుళూరుల నుంచి వచ్చే పూల వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మతాలకతీతంగా కేరళ ప్రజలు జరుపుకునే ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలో జరిగే మొత్తం వ్యాపారమే కీలకం. ఎలక్ట్రానిక్స్, బట్టల వ్యాపారంలో 15 శాతం బిజినెస్ ఈ పండుగ రెండు వారాల్లోనే జరుగుతుంది. మాల్స్, సూపర్ మార్కెట్స్, బట్టల షాపులు పండుగ ఆఫర్లతో వ్యాపారం మరింత జోరుగా సాగేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారమే లేదని త్రిస్సూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టిఆర్ విజయ్కుమార్ తెలిపారు. కేరళ రాష్ట్రానికి అధికాదాయ వనరు అయిన పర్యాటకరంగం వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నది. కేరళ లోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడటంతో చాలా మంది టూరిస్టులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. అలప్పుజా, మున్నార్, కుమరకమ్, పెరియార్ లాంటి ప్రధాన పర్యాటకప్రాంతాల్లో దాదాపు 95 శాతం పర్యాటకులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. ’’రోడ్లు పునర్నిర్మించాలి. పర్యాటక ప్రాంతాలను ప్రజల సందర్శనార్థం పునః ప్రారంభించాలంటే కొంత సమయం పడుతుంది. ఇదంతా సజావుగా సాగడానికి ఒకటి రెండు నెలలు పడుతుంది. సహజంగానే స్థానిక ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రజలు ఇష్టపడరు’’ అని ఎయిర్ ట్రావెల్స్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇఎం నజీబ్ తెలిపారు. కేరళలో పర్యాటకుల తాకిడి అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి మాత్రం 70 నుంచి 80 శాతం రెవెన్యూకి గండిపడుతుందని భావిస్తున్నారు. ప్రకృతి వైద్యం కోసం, ఇతర ఆరోగ్య అవసరాలకోసం ప్రతియేటా చాలా మంది వివిధ ప్రాంతాలనుంచి కేరళకి వెళుతుంటారు. అయితే ఈసారి మెడికల్ టూరిజం కూడా 50 శాతం నష్టపోయిందని ధాత్రి ఆయుర్వేద ఎండి, సిఐఐ కేరళ అధ్యక్షుడు డాక్టర్ సాజికుమార్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఒక్క పేషెంట్ కూడా రావడం లేదనీ మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందనీ ఆయన వివరించారు. కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించింది. పనిదినాలు, పర్యాటకుల పర్యటనల రద్దు, ఇతరత్రా అన్నీ కలుపుకొని 25,000 కోట్ల రూపాయల వరకూ రాష్ట్రం నష్టపోయినట్టు అంచనా వేసారు. అయితే ఇంత నష్టం జరిగినా కేరళల ప్రజలు, అధికారులు, సాధారణపౌరులూ, వైద్యులూ తమకు తోచిన విధంగా కేరళ పునర్నిర్మాణంలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. కొచ్చిలోని అస్తర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ సిఇఓ డాక్టర్ హరిప్రసాద్ పిళ్ళై మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తమ ఆసుపత్రిలో పనిచేసే 80 మంది డాక్టర్లు, 150 మంది నర్సులు 20 పునరావాస కేంద్రాల్లోనూ, కొచ్చీ, కలమస్సేరిలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రజాసేవలో మునిగి ఉన్నారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అధికారుల తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. వైద్య పరంగా ఈ యేడాదిలో నిఫా వైరస్ తర్వాత కేరళ ప్రజలెదుర్కొన్న రెండవ ఛాలెంజ్ ఇదేనని ఆయన అన్నారు. -
కేరళకు వెల్లువెత్తుతున్న సాయం!
తిరువనంతపురం : వరద ఉగ్రరూపానికి అతలాకుతలమై పునరావాసం కోసం ఎదురుచూస్తున్న కేరళ కోలుకునేందుకు అన్ని వైపుల నుంచి సాయం వెల్లువెత్తుతోంది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు, కార్పొరేట్ సంస్థలే కాకుండా వ్యక్తిగతంగా భారీ ఎత్తున ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇతర దేశాలు సైతం తమ వంతు చేయూతనిస్తున్నాయి. మలయాళ సీమను ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించిన యూఏఈ తన మాట నిలబెట్టుకుంటూ రూ. 700 కోట్ల సాయాన్ని ప్రకటించింది. కేరళకు ప్రకటించిన రూ. 600 కోట్ల మధ్యంతర సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. నౌకలు, రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున సహాయ సామగ్రి కేరళ చేరుకుంటున్నాయి. దాదాపు 231 మంది(ఆగస్టు నెలలో) ప్రాణాల్ని బలితీసుకోవడంతో లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేసిన ఈ పెను విషాదం నుంచి బయటపడేందుకు మరింత సాయం అందించాలని కేంద్రానికి కేరళ మంగళవారం విజ్ఞప్తి చేసింది. దారుణంగా దెబ్బతిన్న రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రూ. 2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. ముంపులో చిక్కుకున్న చివరి వ్యక్తిని కాపాడేంత వరకూ సహాయ చర్యలు కొనసాగిస్తామని కేరళ ప్రభుత్వం, ఆర్మీ ప్రకటించాయి. ఓనం వేడుకల్ని కేరళ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయగా.. పంపా నది పరిసరాల్లో వరద బీభత్సం దృష్ట్యా భక్తులు ఓనం పూజల కోసం శబరిమలకు రావద్దని దేవస్థానం సూచించింది. ప్రధాని మోదీకి యూఏఈ క్రౌన్ ప్రిన్స్ ఫోన్ కేరళకు ప్రకటించిన రూ. 600 కోట్ల సాయాన్ని కేంద్రం మంగళవారం విడుదల చేసింది. అలాగే వరద బాధితుల కోసం రాష్ట్రానికి దిగుమతి చేసుకునే సహాయ సామగ్రిపై కస్టమ్స్ పన్ను, ఐజీఎస్టీని రద్దు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. కేరళకు ప్రధాని మోదీ రూ. 500 కోట్ల సాయం ప్రకటించగా.. హోం మంత్రి రాజ్నాథ్ రూ. 100 కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళకు 100 మిలియన్ డాలర్లు(రూ. 700 కోట్లు) సాయం చేస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వాగ్దానం చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. ప్రధాని మోదీకి యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జయేద్ ఫోన్ చేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సాయం చేస్తామని హామీనిచ్చారని చెప్పారు. విజయన్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కేరళను కేంద్రం ఆదుకోవాలని అభ్యర్థించింది. కేరళలో మొత్తం రూ. 20 వేల కోట్ల నష్టం జరిగిందని ఇంతకుముందే విజయన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద విలయం మిగిల్చిన నష్టంపై చర్చించేందుకు ఆగస్టు 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను 13 దారుణంగా నష్టపోయాయి. వాటి పునర్నిర్మాణం కోసం బహిరంగ మార్కెట్లో రుణం తీసుకునే సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరతాం. ప్రస్తుత పరిమితి ప్రకారం.. స్థూల రాష్ట్ర ఉత్పత్తి(జీఎస్డీపీ)లో 3 శాతం మేర రుణాలు తీసుకునేందుకు కేరళకు అనుమతుంది. దానిని 4.5 శాతంగా పెంచితే అదనంగా బహిరంగ మార్కెట్లో రూ. 10,500 కోట్లను సేకరించే అవకాశముంటుంది’ అని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ వ్యవసాయ రుణాల చెల్లింపుపై ఏడాదికాలం మారటోరియం ప్రకటించాలని నిర్ణయించింది. ఇంకా జలదిగ్బంధంలో నాలుగు జిల్లాలు కేరళలో 10 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటుండగా.. వారిలో 2.12 లక్షల మంది మహిళలు, లక్ష మంది 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. కాగా మే 30 నుంచి ఇంతవరకూ వర్షాలు, వరదలతో కేరళలో 373 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ విభాగం(ఎన్డీఎంఏ) ప్రకటించింది. 87 మంది గాయపడగా.. 32 మంది ఆచూకీ తెలియడం లేదని, మొత్తం 54.11 లక్షల మందిపై వరద ప్రభావం పడిందని వెల్లడించింది. ఒక్క ఆగస్టు నెలలో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా.. ఎర్నాకులం, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజా, కొల్లాం జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధలోనే ఉన్నాయి. వరద ముంపులో చిక్కుకున్నవారిని దాదాపుగా రక్షించినా.. చివరి వ్యక్తిని కాపాడేంత వరకూ సహాయక చర్యలు ఆగవని రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ బలగాలు తెలిపారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1.63 లక్షల మందిని కాపాడారు. వరదలతో దెబ్బతిన్న ఇళ్ల శిథిలాలను, చెత్తను తొలగించడం సహాయక సిబ్బందిగా సవాలుగా మారింది. అంటు వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాలు, వైద్యులు, నర్సులు కేరళకు ఇప్పుడు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణం కోసం ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ తదితర నిపుణులు అవసరముందని అన్నారు. ఓనం వేడుకలు రద్దు కేరళ ప్రజలు ఏటా ఎంతో అట్టహాసంగా జరుపుకునే ఓనం పండుగ సంబరాలు వరదలకు ఆవిరైపోయాయి. ఓనం సందర్భంగా ఆగస్టు 25న నిర్వహించే అన్ని కార్యక్రమాల్ని ప్రభుత్వం, వివిధ సంస్థలు రద్దు చేశాయి. పండుగ కోసం సేకరించిన నిధుల్ని వరద సాయం కోసం వెచ్చించనున్నారు. బక్రీద్ను సాదాసీదాగా జరుపుకోనున్నారు. ‘ఏం మిగల్లేదు.. మొత్తం పోగొట్టుకున్నాం. ఎదురుచూసేందుకు ఇంకేముంది. నా కొడుకు జబ్బుపడ్డాడు. వరదల్లో ఇల్లు కొట్టుకుపోయింది. ఈ క్యాంపు నుంచి నా కొడుకు, కోడలు, మనవడితో ఎక్కడికెళ్లాలో తెలియడం లేదు’ అని అమ్మిణి(55) ఏడుస్తూ చెప్పింది. పంపా నదిలో వరద తగ్గుముఖం పట్టనందున ఓనం పండుగ సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లవద్దని భక్తులకు అధికారులు సూచించారు. అలాగే పంపా పరిసర ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, గుడికి వెళ్లే దారిలో అనేక చెట్లు నేలకూలాయని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. శబరిమల దారి మొత్తం బురదతో నిండిపోయిందని, అందువల్ల కొండ ఎక్కడం చాలా ప్రమాదకరమని తెలిపింది. ఓనం పూజల కోసం ఆలయాన్ని ఆగస్టు 23న తెరిచి ఆగస్టు 28 మూసివేస్తారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్ బ్యాంకు ఉద్యోగులు కేరళకు రూ. 11 కోట్ల సాయం ప్రకటించారు. అన్ని వైపుల నుంచి చేయూత కేరళ విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆహార, ప్రజా సరఫరా విభాగం 89,540 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు ఓకే చెప్పింది.వినియోగదారుల వ్యవహారాల శాఖ మరో 100 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల్ని పంపగా మరిన్ని నిల్వలు పంపేందుకు రెడీఅవుతోంది. రైల్వే 24 లక్షల లీటర్ల మంచినీటిని, 2.7 లక్షల వాటర్ బాటిల్స్ను పంపింది. మరో 14 లక్షల లీటర్ల నీటిని ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుంచి సరఫరాకు ఏర్పాట్లు చేస్తోంది. రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించడంతో అన్ని రాష్ట్రాల నుంచి కేరళకు ఉచితంగా రైల్వే శాఖ సరకులను చేరవేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే కోటి క్లోరిన్ మాత్రల్ని పంపింది. అదనంగా 3 కోట్ల మాత్రల్ని పంపనుంది. 30 టన్నుల బ్లీచింగ్ పౌడర్, 1.76 లక్షల శానిటరీ న్యాప్కిన్లు కేరళ చేరాయి. ట్యుటికొరిన్ పోర్టు నుంచి సహాయ సామగ్రితో మంగళవారం ఒక నౌక చేరుకుంది. ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలు, డీజిల్తో ముంబై పోర్టు నుంచి ఒక నౌక కేరళ చేరుకోగా ఐఎన్ఎస్ దీపక్ నౌక 800 మెట్రిక్ టన్నుల మంచినీళ్లు, 18 టన్నుల నిత్యావసరాలతో కొచ్చి పోర్టుకు చేరింది. యూఏఈ సాయం నిరాకరణ? కేరళలో పునరావాసం కోసం యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని కేంద్రం నిరాకరించే వీలుందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ‘ప్రస్తుతం కేంద్రం విదేశాల నుంచి ఆర్థిక సాయాన్ని అంగీకరించట్లేదు. యూఏఈ సాయానికీ అదే వర్తిస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. విదేశాల్లోని భారతీయులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపవచ్చని.. వాటిపై ఎలాంటి పన్ను ఉండదని విదేశాంగశాఖ వివరణిచ్చింది. ‘విదేశీ సాయం నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) కింద గుర్తింపు పొందిన లాభాపేక్ష లేని సంస్థలు, ఎన్జీవోలకు విదేశీ సాయం అందితే వాటిపై పన్ను ఉండదు. గుర్తింపు లేని ఎన్జీవోలకు నిధులు అందితే మాత్రం వాటిపై పన్ను చెల్లించాలి’ అని విదేశాంగ శాఖ అధికారి తెలిపారు. -
సాయానికి ‘సాక్షి’ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి విలయంతో ఛిద్రమైన కేరళను కష్టాల కడలి నుంచి గట్టెక్కించే మానవతా కృషి జరగాలిప్పుడు. ఎవరిస్థాయిలో వారు ఆర్థిక సహాయం అందించడానికి మానవతా దృక్పథంతో ముందుకు రావాలని ‘సాక్షి మీడియా సంస్థ’ పిలుపునిస్తోంది. సాటి మనుషుల కష్టం మన కష్టంగా భావించి తోచిన సా యం అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. కేరళ ప్రభుత్వం కూడా సాయం చేయాలంటూ ట్విట్టర్ ద్వారా అభ్యర్థిస్తోంది. బాధితులకు సాయం చేయాలంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇలా విరాళాలను పంపించొచ్చు. అకౌంట్ నంబర్: 67319948232 బ్యాంక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN0070028 పాన్: AAAGD0584M స్విఫ్ట్ కోడ్: SBININBBT08 -
బిక్కుబిక్కుమంటూ
వారంతా మానసిక వికలాంగులు. చుట్టూ వరద నీరు ముంచేస్తున్నా ఏం జరుగుతోందో గ్రహించలేని నిస్సహాయులు. ఆరు రోజులు నీళ్లల్లోనే కాలం గడిపేశారు. చివరికి సహాయక బృందాలు కాపాడాయి. త్రిసూర్ జిల్లా మురింగూర్లోని మానసిక సంరక్షణ కేంద్రంలో 400 మంది వరకు రోగులు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టడంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. జనావాసాలకు దూరంగా ఉండే ఆ మానసిక కేంద్రం గురించి పట్టించుకునేవారే లేకపోయారు. మొదటి అంతస్తులోకి నీళ్లు వచ్చేయడంతో స్థానిక బ్లాక్ పంచాయతీ సభ్యుడు థామస్ మాత్రం వాళ్లని జాగ్రత్తగా పై అంతస్తులోకి తరలించారు. ప్రతీరోజూ చిన్న మరబోటులో ఆ కేంద్రానికి ఆహార పదార్థాలను తీసుకువెళ్లి వాళ్లకి తినిపించేవారు. ఆరు రోజులు గడిచాక సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కానీ వరదనీరు చుట్టుముట్టేయడంతో వారందరినీ తరలించడం క్లిష్టంగా మారింది. ఆహారం, మందులు లేక ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారు. థామస్ సహకారంతో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇన్ని రోజులూ వారిని కంటికి రెప్పలా కాపాడిన థామస్ని రియల్ హీరో అని స్థానికులు కొనియాడుతున్నారు. -
కేరళ విపత్తుకు కారణమిదే!
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, తుపాను పరిస్థితులకు తోడు రుతు పవనాల తీవ్రత కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని నిపుణులు విశ్లేషించారు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కన్నా వరుసగా 15%, 18% వర్షాలు ఎక్కువగా కురవగా ఆగస్ట్ 1–19 తేదీల మధ్య సాధారణం కన్నా 164% ఎక్కువగా వర్షపాతం నమోదవడం విలయ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విపరీత పరిస్థితులను వాతావరణ నిపుణులు విశదీకరించారు. రుతుపవనాలు, తుపాను పరిస్థితులతో పాటు ‘సోమాలీ జెట్’ దృగ్విషయం కూడా కేరళలో తీవ్ర వర్షపాతానికి కారణమైందని వారు వివరించారు. మడగాస్కర్ ప్రాంతంలో ప్రారంభమై పశ్చిమ కనుమల వైపు వేగంగా వీచే గాలులను సోమాలీ జెట్ పవనాలుగా పేర్కొంటారు. ‘ఇప్పటికే కేరళ రాష్ట్రవ్యాప్తంలో రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయి. మరోవైపు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా కేరళలో, ఉత్తర కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి’ అని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఉపాధ్యక్షుడు మహేశ్ పాల్వత్ వివరించారు. ‘ఆగస్ట్ 7, 13 తేదీల్లో ఒడిశా తీరం దగ్గరలో ఏర్పడిన రెండు అల్పపీడనాల వల్ల అరేబియా సముద్ర తూర్పు ప్రాంత మేఘావృత గాలులు పశ్చిమ కనుమలవైపు వచ్చి కేరళ రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షాలకు కారణమయ్యాయి’ భారత వాతవరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఇలా పలు వర్షపాత అనుకూల పరిస్థితులు ఒకేసారి రావడం వల్ల భారీ వర్షాలు కురవడం, తద్వారా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. -
బాధితులకు విష సర్పాల స్వాగతం
కొచ్చి: కేరళలోని సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న వరద బాధితులకు విష సర్పాలు స్వాగతం పలుకుతున్నాయి. బాత్రూంలు, కప్బోర్డులు, వాష్ బేసిన్లలో నాగుపాము, రక్తపింజరి పాములు హడలెత్తిస్తున్నాయి. గత ఐదు రోజులుగా కేరళలో పాముకాటు కేసులు భారీగా పెరిగాయి. కొచ్చి సమీపంలోని అంగమలిలోని అస్పత్రి అధికారులు మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి 20 వరకూ మొత్తం 53 కేసులు తమ వద్దకు వచ్చాయని చెప్పారు. దీంతో పాముల్ని పట్టుకునేందుకు సమీప అటవీ సిబ్బందికి లేదా వాటిని పట్టడంలో నైపుణ్యమున్న వారికి సమాచారమిస్తున్నారు. -
విలయానికి సైతం ఎదురొడ్డి..
కొచ్చి: మహా విలయం చుట్టుముడితే అది మిగిల్చిన కల్లోలం నుంచి బయటపడడం పెను సవాలే. అయితే కేరళ తట్టుకుంది. ధైర్యంగా నిలబడింది. అన్ని వైపుల నుంచి వచ్చిన సాయంతో పాటు కేరళీయుల మనోస్థైర్యంతో వరద కష్టాలకు ఎదురొడ్డి నిలిచింది. నిరాశలో కూరుకుపోకుండా ప్రజల ప్రాణాల్ని కాపాడుకునేందుకు పోరాట పటిమ ప్రదర్శించింది. రాష్ట్రపాలకులకు, నాయకత్వానికీ ఈ విపత్తు పెద్ద సవాల్! మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కేంద్రీకరించి, సైనికదళాల సాయంతో సహాయక చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి విజయన్ కృతకృత్యులయ్యారు. అప్రమత్తతతో సాహసోపేతమైన సహాయక చర్యలు చేపట్టడం వల్ల వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు, చిన్నారులనూ కాపాడారు.వరద విలయాన్ని ఎదుర్కోవడంలో కేరళ ప్రజల పాత్ర అనన్యసామాన్యం. వైద్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇలా ఎవరికి తోచిన సాయం వారందించారు. బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో అహోరాత్రులు శ్రమించారు. వరదల్లో చిక్కుకున్న గర్భిణులు, చిన్నారుల్ని భుజాలకెత్తుకుని తీసుకెళ్ళారు. స్వచ్ఛంద కార్యకర్తలెందరో అహోరాత్రులు శ్రమించి కేరళ ప్రజల్లో దాగున్న పోరాటపటిమను చాటిచెప్పారు. వరద సాయంలో కేరళ మత్స్యకారుల పాత్ర మరువలేం. సొంత ఖర్చుతో వరద ప్రాంతాలకు చేరుకొని తమ శరీరాలను మెట్లుగా మలిచి ఎందరినో కాపాడారు. 1924 విలయాన్ని తట్టుకుని.. కేరళ మట్టిలోనే పోరాడే శక్తి ఉంది. అక్కడి ప్రభుత్వం, ప్రజలు సమైక్యంగా వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్న తీరు 1924లో కేరళని అతలాకుతలం చేసిన విలయాన్ని గుర్తుకు తెస్తుంది. 1924లో కేరళని ముంచెత్తిన వరదలు కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. మృతుల సంఖ్యపై సరైన లెక్క లేకపోయినా ఆ వరదల్లో వేల మంది మరణించారు. లక్షల మంది శిబిరాల్లో తలదాచుకున్నారు. ఆ ఏడాది ప్రభుత్వం పన్నులు రద్దుచేసింది. వ్యవసాయ రుణాల కోసం నిధులు కేటాయించింది.. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఇళ్ళనిర్మాణం కోసం ఆర్థిక సాయం, వెదురును ఉచితంగా సరఫరా చేయడంలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో కేరళ మళ్లీ కోలుకుంది. -
అమెరికాకు స్పైడర్మాన్.. కేరళకు బోట్మాన్!
అమెరికాలో ప్రజలను రక్షించడానికి సినిమాల్లో చూపించే స్పైడర్మాన్, బాట్మాన్, సూపర్మాన్ ఉంటే కేరళకు బోట్మాన్ ఉన్నాడని వాట్సాప్లో విపరీతంగా అందరికీ పంపిన సందేశం కేరళ వరద బాధితులకు మత్స్యకారులు చేసిన సహాయాన్ని వెల్లడిస్తోంది. వరదలు మొదలైన కొన్ని గంటలకే, సైనిక దళాల రాకకు ముందే, చేపలు పట్టే ఈ బెస్తలు తమ పడవలతో వచ్చి జల దిగ్బంధంలో ఉన్న జనాన్ని కాపాడే పని చేపట్టారు. చేపల వేటతో బతికే ఈ వర్గం ప్రజలు దుర్వాసనతో ఉంటారని మిగిలిన ప్రజలు సాధారణంగా ఈసడించుకోవడం తెలిసిందే. అలాంటి ఈ గంగపుత్రులు తమ పడవల్లో వచ్చి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఇక సైన్యం పాత్ర అసాధారణం. వరద నీటి నుంచి కాపాడిన పసిపాపను చేత్తో ఎత్తి పట్టుకున్న కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ పడవలో నిలబడిన దృశ్యం కేరళను అతలాకుతలం చేసిన వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. నీట మునిగిన ప్రజలను రక్షించడానికి రంగంలోకి దిగిన సిబ్బందిని, జనాన్ని సమన్వయం చేయడానికి తన నియోజకవర్గమైన ఆలపూళలో మంత్రి నీటిలోకి వచ్చి సేవలందించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తీసుకుంటున్న సహాయ, రక్షణ చర్యల గురించి వివరించడం కూడా నీటితో ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చింది. ఎలాంటి నాటకీయ చర్యలకు తావులేకుండా ప్రశాం తంగా సాగిన ఈ సమావేశాన్ని టెలివిజన్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇంటర్నెట్లో కూడా వెబ్సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం అవసరమైంది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కనిపిస్తూ వరద పరిస్థితులు, సహాయ చర్యలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం ప్రజలకు అందించారు. సహాయ సిబ్బంది కృషి ఆదర్శప్రాయం కేరళ వరదలపై వస్తున్న నకిలీ ఇంకా చెప్పాలంటే తప్పుడు వార్తలు, పుకార్లను అడ్డుకోవడానికి ఈ విధమైన సమాచార ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. రాజధాని తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో, జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి నిజంగా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. వరద బాధితుల కోసం తీసుకొచ్చిన బియ్యం బస్తాలను వైనాడ్ జిల్లా కలెక్టర్, సబ్కలెక్టర్ లారీ నుంచి దింపి తమ వీపులపై వేసుకుని మోయడం ఉన్నతాధికారుల గొప్ప ప్రవర్తన తార్కాణంగా కనిపిస్తోంది. 1924 తర్వాత కేరళలో ఇంతటి తీవ్ర స్థాయిలో వరదలు రాలేదు. ఈ జల ప్రళయంలో ఇప్పటి వరకూ 300 మందికి పైగా మరణించారు. అయితే, కోట్లాది మందిని కుదిపేస్తున్న ఈ సంక్షోభంలో జరుగుతున్న సహాయక చర్యలపైన, అధికారుల అలసత్వంపైనా ఫిర్యాదులు, విమర్శలు రాకపోవడానికి ఇసాక్, విజయన్, ఇతర అధికారుల కృషే కారణం. ఈ వరద సహాయక కార్యక్రమాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే, నీట మునిగిన ప్రజలను వరదల నుంచి కాపాడడానికి పాలనా యంత్రాంగంతో పౌర సమాజం చేతులు కలపడం. కేరళ సర్కారు సాయంపై లేనిపోని నిందలేయకుండా తోటి వారికి తోడ్పడాలనే లక్ష్యమే పౌర సమాజాన్ని అద్వితీయమైన చొరవతో ముందుకు నడిపిస్తోంది. ఇలాంటి కష్టకాలాల్లో చీటికి మాటికి ప్రభుత్వంపై వేలెత్తి చూపే ప్రతిపక్షం సైతం తమ కార్యకర్తలను సహాయ కార్యక్రమాల్లోకి దింపి ప్రజలకు సాయమందిస్తోంది. వరదల్లో చిక్కుకున్న జిల్లాల పరిస్థితులను స్వయంగా చూడడానికి ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ పర్యటనల్లో తనతోపాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితలను వెంట తీసుకెళ్లారు. వరద సహాయ, రక్షణ చర్యల్లో రాజకీయాలకు తావులేదని చెప్పడమే సీఎం విజయన్ ఉద్దేశం. మత్స్యకారులు మానవతామూర్తులు అమెరికాలో ప్రజలను రక్షించడానికి సినిమాల్లో చూపించే స్పైడర్మాన్, బాట్మాన్, సూపర్మాన్ ఉంటే కేరళకు బోట్మాన్ ఉన్నాడని వాట్సాప్లో విపరీతంగా అందరికీ పంపిన సందేశం మత్స్యకారులు చేసిన సహాయాన్ని వెల్లడిస్తోంది. భారీ వర్షా లతో వరదలు మొదలైన కొన్ని గంటలకే సైనిక దళాల రాకకు ముందే చేపలు పట్టే ఈ బెస్తలు తమ పడవలతో వచ్చి జల దిగ్బంధంలో ఉన్న జనాన్ని కాపాడే పని చేపట్టారు. చేపల వేటతో బతికే ఈ వర్గం ప్రజలు దుర్వాసనతో ఉంటారని మిగిలిన ప్రజలు సాధారణంగా ఈసడించుకోవడం తెలిసిందే. అలాంటి ఈ గంగపుత్రులు తమ పడవల్లో వచ్చి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాయపడే కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బంది అందుకు అనువుగా చేతులు లేని చొక్కాలు ధరిస్తారు. అలాంటి దుస్తులు లేకుండానే మత్స్యకారులు రంగంలోకి దిగి నీటము నిగిన కేరళ రహదారుల్లోకి తమ గట్టి బోట్లతో వచ్చి ప్రమాదస్థితిలో ఉన్నవారిని చేరుకుని కాపాడారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం ఈ వరదల్లో స్పందించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సైనిక దళాల సేవలు మరువలేనివి. నీటమునుగుతున్న ఇళ్ల పైకప్పులపై నిలబడిన వేలాది మందిని కాపాడిన ఘటనలు చెప్పలేనన్ని ఉన్నాయి. సాజిదా జాబిల్ అనే గర్భిణిని కూడా ఇలాగే రక్షించారు. ప్రసవానికి ముందు ఉమ్మ నీరు రావడంతో ఆమెను కొచ్చి నుంచి ఆస్పత్రికి వేగంగా తరలించారు. కాపాడిన కొన్ని గంటల్లోనే ఆమె మగ బిడ్డను ప్రసవించింది. మూడు రోజుల తర్వాత ఆమెను కాపాడిన ఇంటి పై కప్పు మీద ఆమె కుటుంబ సభ్యులు ‘థ్యాంక్స్’ అని పెద్దక్షరాలతో రాశారు. ఇలాంటి క్షణాలు కేరళ వరద సహాయ కార్యక్రమాల తీరు ఎంత సవ్యంగా, గొప్పగా ఉందో చెబుతున్నాయి. ఇలాంటి విపత్తుల సమయంలో నాటకీయంగా, అతి వ్యాఖ్యానాలతో వార్తా ప్రసార సాధనాలు పని చేస్తాయి. మలయాళ మీడియా మాత్రం సంయమనం పాటిస్తూ ప్రశంసాపూర్వకంగా వ్యవహరించింది. విలేకరులు, టీవీ యాంకర్లు అతిగా సోది చెప్పకుండా నిజంగా వరద దృశ్యాలు చూపిస్తూ సహాయక చర్యల గురించే వివరించారు. వరద సహాయచర్యల విషయంలో అంకితభావంతో ఏషియానెట్ న్యూస్ చానల్ రెండు రోజులపాటు వార్తల మధ్యలో వ్యాపార ప్రకటనల ప్రసారం కూడా నిలిపివేసింది. విపత్తు సమయంలో అధిక టీఆర్పీలను సొమ్ము చేసుకోకూడదనే ఆశయంతో ఈ పని చేసింది. వరదల వల్ల సొంతిళ్లు వదిలి వచ్చిన కనీసం ఒక కుటుంబానికి తమ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వాలని కోరుతూ టీవీ చానల్ న్యూస్18 ‘ఓపెన్ యువర్ హార్ట్, ఓపెన్ యువర్ హౌస్’(మీ హృదయం తలుపులు, ఇంటి తలుపులు తెరవండి) అనే పిలుపుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం సోమవారం ప్రత్యక్ష ప్రసారమైన సమయంలో ఈ చానల్కు 90 ఫోన్ కాల్స్ వచ్చాయి. టీవీ విలేకరులు సొంత కబుర్లతో ఊదరగొట్టకుండా చూపించాల్సిన దృశ్యాలతో అవసరమైన మాటలే చెప్పారు. అనేకమంది జర్నలిస్టులు సొంత సమస్యలు, విషయాలు పక్కన పెట్టి తమ విధులకే ప్రాధాన్యమిచ్చారు. వారి ఇళ్లు లేదా బంధువుల గృహాలు నీటి మునిగి ఉన్నా వాటి గురించి పట్టించుకునే తీరిక వారికి లేదు. జనానికి సేవలందించడానికే వారు అంకితమయ్యారు. అవాంఛనీయ ధోర ణులకూ కొదవ లేదు! అయితే, కేరళ వరదల సమయంలో కొన్ని అవాంఛనీయ ధోరణులూ కనిపించాయి. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళాలివ్వద్దని కోరుతూ సోషల్ మీడియాలో ప్రజలను కోరడంతో ఈ దుష్ప్రచారం మొదలైంది. సర్కారుకు ఇచ్చే సొమ్ము వరద బాధితులకు చేరదనీ, దాన్ని సక్రమంగా ఖర్చు చేయరనే నిందను ఈ రూపేణా ప్రచారం చేశారు కొందరు. అందుకే ఇతర ప్రైవేటు సహాయనిధులకు విరాళాలివ్వాలని వారు కోరుతూ రాష్ట్ర సర్కారు నిజాయితీని అనుమానించేలా ప్రయత్నించారు. క్రైస్తవ, ముస్లిం సంస్థలు తమ వర్గం ప్రజలకు ఎలాగూ సాయం చేస్తాయి కాబట్టి హిందువులకు మాత్రమే తోడ్పాటు అందించాలనే ప్రయత్నాలు జరిగాయి. మలయాళీలు గొడ్డుమాంసం తింటారు కాబట్టే వారికి ఇంతటి కష్టమొచ్చి పడిందనే ప్రచారాన్ని కూడా కొందరు చేశారు. హిందువులకు కీడుచేసే ప్రయత్నాలు, ఆవును పవిత్రంగా చూడకపోవడం వల్లే కేరళను వరదలు ముంచెత్తాయనే ప్రచారం కూడా చేశారు. 10–50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు శబరిమల అయ్యప్ప స్వామి గుడిలోకి ప్రవేశం కల్పించే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపు తున్న విషయం తెలిసిందే. ఈ కోర్టు పరిణామాలపై ఆయ్యప్పకు కోపమొచ్చిందనే సిద్ధాంతాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా కొత్తగా నియమితులైన ఎస్.గురుమూర్తి కేరళ వరదలకు అయ్యప్ప గుడిలో మహిళల ప్రవేశానికి ముడిపెడుతూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణకూ, భారీ వర్షాలకు మధ్య ఏదైనా సంబంధం ఉన్నదీ లేనిదీ సుప్రీంకోర్టు జడ్జీలు పరిశీలించాలని ఆయన తన ట్వీట్ల ద్వారా సూచించారు. వరదల కారణంగా ఇతర ప్రదేశాల మాదిరిగానే శబరిమలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ‘‘ఒక వేళ రెంటికీ మధ్య పది లక్షల్లో ఒక అవకాశం ఉన్నా స్త్రీల ప్రవేశానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇవ్వాలనే ప్రజలు కోరుకుంటున్నట్టు భావించాలి’’ అని గురుమూర్తి తన ట్వీట్లో చెప్పారు. ఒకవేళ కోర్టు విచారణపై అయ్యప్ప స్వామి తన ఆగ్రహం వరదల ద్వారా వ్యక్తం చేశారని భావించినా, ఆయన పది నుంచి 50 ఏళ్ల వయసు మహిళలే ఈ జల విలయంలో బాధపడేలా చేసి ఉండేవారని నేను అనుకుం టున్నాను. పాత సంప్రదాయం కొనసాగించాలని కోరే పురుషులను వరద బాధితులను చేసేవారు కాదని నమ్ముతున్నాను. అయ్యప్ప సుప్రీంకోర్టు విచారణను జాగ్రత్తగా గమనిస్తున్నారని, స్త్రీల ప్రవేశం కోరుతున్న లక్షలాది మంది కేరళ ప్రజలపై కక్ష సాధించాలని ఆయన వ్యవహరించారని మనం నమ్మాలా? మత విద్వేషంతో నిండిన మితవాదులు కోట్లాది మందికి ఆరాధ్యదైవాన్ని తమ మాదిరిగానే ప్రతీకారం కోరుకునే వాడిగా చిత్రించినట్టు మనకు ఈ పరిణామాలను బట్టి అర్థమౌతోంది. తమ దేశ విజయగాథలో కేరళ ప్రజలు ఎప్పుడూ భాగస్వాములని దుబాయ్ ఉపాధ్యక్షుడు, పాలకుడు షేక్ మహ్మద్ అల్ మక్తూం మలయాళం, ఇంగ్లిష్, అరబిక్ భాషల్లో ట్వీట్ చేస్తూ, కేరళ వరద సాయం కింద రూ.700 కోట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. కేరళకు నేడు ఆపన్న హస్తం అవసరం. దుష్ప్రచారం కాదు. - టీఎస్ సుధీర్ (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
వరదల్లో ఫేక్ న్యూస్ బురద
కేరళను ఒకవైపు వరద, మరోవైపు నకిలీ వార్తల బురద ముంచెత్తుతోంది. కేరళకు వరదసాయం అందించడంలో సోషల్ మీడియా క్రియాశీల పాత్ర పోషిస్తోంది. అయితే, ఫేస్బుక్, వాట్సాప్ల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న కొన్ని నకిలీ వార్తలు, పాత ఫొటోలు మాత్రం కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అలాంటి కొన్ని వార్తలు.. ♦ ‘ఒక వ్యక్తి లైఫ్ జాకెట్ వేసుకోవడానికి నిరాకరించాడు. దీనికి కారణం అది కాషాయ రంగులో ఉండడమే. కాషాయం హిందూత్వకు సంబంధించిన రంగు కావడంతో బాధితుడు వేసుకోనని తేల్చి చెప్పాడు. చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు‘అంటూ ఒక పోస్టు వైరల్ అయింది. చివరికి ముఖ్యమంత్రి పి.విజయన్ లైఫ్ జాకెట్లను కాషాయం రంగుకి బదులుగా ఆకుపచ్చ రంగులో తయారు చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారంటూ ఆ వార్తకు మసాలా అద్దారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దానిని ప్రచురించింది. కానీ చివరికి అది ఫేక్ అని తేలింది. ♦ ‘మరికాసేపట్లో ముల్లపెరియార్ డ్యామ్ కూలిపోతుంది. ఇప్పటికే ఆనకట్ట లీక్ అవుతోంది. మరో కొద్ది సేపట్లో డ్యామ్ కూలిపోవడం ఖాయం. ఎర్నాకుళం మునిగిపోతుంది. పీఎంవోలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం స్వయంగా చెప్పాడు. ఆ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా సురక్షిత స్థావరాలకు వెళ్లిపోండి‘ అంటూ ఒక ఆడియో క్లిప్ వైరల్గా మారి ప్రజల్లో భయభ్రాంతుల్ని సృష్టించింది. చివరికి అది ఫేక్ అని, అలాంటి ప్రమాదమేమీ లేదని ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ♦ కేరళవ్యాప్తంగా రోజంతా విద్యుత్ నిలిపివేస్తారు. ముందు జాగ్రత్తగా మీ మొబైల్స్ అన్నీ చార్జ్ చేసుకోండంటూ కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (కెఎస్ఈబీ) అలర్ట్ అంటూ ఒక ఫేక్ న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అయింది. చివరికి విద్యుత్ బోర్డు అలాంటిదేమీ లేదంటూ స్పష్టమైన ప్రకటన చేయాల్సి వచ్చింది. మరికొన్ని నకిలీ వార్తలు ♦ ‘కేరళ ప్రభుత్వం సహాయ చర్యల్ని అడ్డుకుంటోంది. సైన్యం సహాయ చర్యల్లో పాల్గొనవద్దంటూ ఆంక్షలు విధించింది‘ అంటూ సైనిక దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయింది. అతనికి, సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ స్పష్టం చేసింది. ♦ ఇక వరదనీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్లల వీడియోని షాకింగ్ అంటూ సామాజిక మా«ధ్యమాల్లో విపరీతంగా షేర్ చేశారు. వాస్తవానికి అది కేరళ వీడియో కాదు. గతంలో ఒడిశాను ముంచెత్తిన వరదల సందర్భంలో తీసిన వీడియో ఇది. ♦ బీజేపీ కార్యకర్తనని చెప్పుకునే సురేష్ కొచ్చటి అనే అతను కేరళ వరద బాధితులందరూ సంపన్న కుటుంబాలని, వాళ్లకి ఎవరూ సాయం చేయాల్సిన అవసరం లేదంటూ ఒక ట్వీట్ చేశారు. ♦ కొచ్చి వరదల్లో బారులు తీరిన కారులంటూ వరద నీటిలో మునిగిపోయిన కారుల ఇమే జ్ ఒకటి విస్తృతంగా షేర్ అయింది. చివరికి అది అయిదేళ్ల క్రితం నాటిదని తేలింది. ♦ ఇక కేరళ వరదలకి, అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి ముడిపెడుతూ వారికి తగిన శాస్తి జరిగిందని అంటూ కొందరు శాడిజం ప్రదర్శిస్తూ ఉంటే, మరికొందరు కుళ్లు జోకులు వేస్తూ రోత పుట్టిస్తున్నారు. కేరళ వరద బాధితులు కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటారు అంటూ ఒకరు ప్రశ్నిస్తే, వరద బాధితులకు కండోమ్స్ కూడా పంపాలంటూ మరొకడు తన వెకిలితనాన్ని చాటుకున్నాడు. -
కేరళ వరదలు : మహిళా అధికారులపై ప్రశంసలు
తిరువనంతపురం : కనీవినీ ఎరుగని వరదలతో భీతిల్లిన కేరళలో రెండు వారాలుగా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో అధికారులు తీరిక లేకుండా తలమునకలయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం, సహాయ పునరావాస శిబిరాలకు తరలించడం, నిత్యావసరాల సరఫరా వంటి కీలక బాధ్యతలను ఎన్నో సవాళ్ల మధ్య చాకచక్యంగా చేపట్టిన ఇద్దరు మహిళా జిల్లా కలెక్టర్ల సేవలను పలువురు ప్రస్తుతిస్తున్నారు. సంక్షోభ సమయంలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ ఇన్చార్జ్ టీవీ అనుపమ, తిరువనంతపురం జిల్లా కలెక్టర్ ఇన్చార్జ్ కే వాసుకిల చొరవకు సోషల్ మీడియాలో నెటిజన్లు కితాబిస్తున్నారు. డేరింగ్ ఆఫీసర్ అనుపమ.. అలప్పుజ జిల్లాలో కలెక్టర్ ఇన్చార్జ్గా గడతంలో పనిచేసిన అనుపమ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడరనే పేరుంది. గతంలో రవాణా శాఖ మాజీ మంత్రి థామస్ చాందీ భూ ఆక్రమణపై ఆమె చేపట్టిన నిజనిర్ధారణ నివేదిక ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పలుకుబడి కలిగిన రాజకీయ నేతలు, లాబీయింగ్ గ్రూపులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాలకు ప్రజల్లో అనూహ్యమైన మద్దతు లభించింది. త్రిసూర్ కలెక్టర్గా ఈ ఏడాది జూన్లో బాధ్యతలు చేపట్టిన అనుపమకు విధులు చేపట్టగానే వరద రూపంలో తొలి సవాల్ ఎదురైంది. సహాయ శిబిరాలకు నిత్యావసరాల సరఫరా కోసం బార్ అసోసియేషన్తో ఆమె పోరాడిన తీరు ప్రశంసలు అందుకున్నారు. జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినా తమ ప్రాంగణంలో వరద సాయం కోసం అందించే నిత్యావసరాలు నిల్వ చేసేందుకు బార్ అసోసియేషన్ నిరాకరించింది. దీంతో అనుపమ ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు బార్ అసోసియేషన్ తాళాలను బద్దలు కొట్టి నిత్యావసరాలను నిల్వ చేసేలా చొరవ చూపారు. స్ఫూర్తి నింపిన వాసుకి.. ఇక వరదల్లో ఎర్నాకుళం, అలప్పుజ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల మాదిరిగా తిరువనంతపురం జిల్లాకు పెద్దగా వరద ముప్పు లేకున్నా కలెక్టర్ ఇన్చార్జ్ కే వాసుకి పరిస్థితిని ఎదుర్కొన్న తీరు ప్రశంసలు కురిపిస్తోంది. నిత్యావసరాలు, సహాయ సామాగ్రిని ఆమె పర్యవేక్షణలో సిబ్బంది 54 ట్రక్కుల లోడ్ మెటీరియల్ను కేవలం రెండు రోజుల్లోనే సమీకరించి ఇతర ప్రాంతాలకు తరలించారు. సహాయ, పునరావాస శిబిరాల్లో మైక్రోఫోన్ను చేతపట్టిన వాసుకి అధికారులు, వాలంటీర్లను పరుగులు పెట్టించి అందరిలో స్ఫూర్తి నింపారు. సైనికుల తరహాలో మీరు ఈ ఆపద సమయంలో పనిచేస్తున్నారని వాలంటీర్లను ప్రోత్సహించారు. -
ఎటు చూసినా కన్నీటి గాథలే
ఊహించని విలయం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీటి ప్రవాహం ముంచెత్తడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రాణాలు దక్కించుకున్నారు. బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీశారు. ప్రకృతి ప్రకోపం చల్లారింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే ఇళ్లకు వస్తున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న సామాగ్రి.. ఎటు చూసిన బురద.. వారికి దర్శనమిచ్చాయి. ఆ ఇంట్లోని వస్తువులను తలచుకుంటూ, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కన్నీటి వరదలో ఇళ్లను పునర్నిర్మించుకునే పనిలో పడ్డారు. ఒక్క క్షణం ఆలస్యమైతే బతికేవాడ్ని కాదు ‘మా ఇంట్లోకి పది అడుగుల వరకు నీళ్లు వచ్చేశాయి. ఐదు రోజుల పాటు ఆ నీళ్లు అలానే ఉన్నాయి.. ప్రస్తుతం మా ఇల్లు యుద్ధభూమిని తలపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ఎర్నాకుళం జిల్లాలోని మంజలే గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం. ‘ఆగస్టు 14వ తేదీ రాత్రి నీటి ప్రవాహం మా ఇంటివైపు రావడం గమనించాను. వెంటనే మా పక్కింటి వాళ్లను అప్రమత్తం చేసి మా మొదటి అంతస్తులోకి నేను, నా భార్య వెళ్లిపోయాం. సురక్షితంగా ఉన్నామని భావించా. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగింది. ట్రెరస్కు కొద్ది దూరం వరకు నీళ్లు వచ్చేశాయి. స్థానికులు ఓ పడవలో వచ్చి మమ్మల్ని రక్షించారు. మొదట నా భార్య పడవలోకి వెళ్లింది. నేను ఆమె చీరను పట్టుకుని పడవలోకి దూకేందుకు ప్రయత్నించాను. అయితే కాలు జారి నీళ్లలో పడిపోయాను. వెంటనే బోటులో ఉన్న వారు స్పందించి నన్ను పట్టుకుని పైకి తీశారు. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి’ అంటూ ఆనాటి భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు సలాం. ‘గోడకు ఉన్న అల్మారాలో నా ఇద్దరు పిల్లలు స్కూలు, కాలేజీ రోజుల్లో సాధించిన ట్రోఫీలు, మెడల్స్ భద్రంగా దాచాను. వరదలకు అవి కొట్టుకుపోయాయి. ఆ ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సర్టిఫికెట్లు మాత్రమే మిగిలాయి.. చాలకుడి ప్రాంతానికి చెందిన సురేష్ జాన్ కుటుంబం రెండంతస్తుల భవనంలో ఉంటున్నారు. పది అడుగుల వరకు నీళ్లు రావడంతో ఇంట్లో వారి కుక్కను వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇంటి నుంచి పునరావాస కేంద్రానికి వెళ్లారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఇంటికి చేరారు. బురద, మరకలతో భయంకరంగా భయంకరంగా ఉన్న గోడలు వారికి దర్శనమిచ్చాయి. ఫర్నీచర్ అంతా ఓ చోట కూప్పగా పడి ఉంది. పుస్తకాలు అల్మారాలోనే నానిపోయి ఉన్నాయి. ప్రతీ గదిలోనూ బురద పేరుకుపోయింది. ‘ఇంటి పరిస్థితి చూస్తే నాకు మాటలు రావడం లేదు. నేను చాలా విచారంలో ఉన్నాను. సర్వం కోల్పోయాను, మా కుటుంబం మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు’ అంటూ జాన్ కన్నీటి పర్యంతమయ్యారు. మొదటి అంతస్తులో ఉందామని మొదట అనుకున్నాం. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంప్కు వెళ్లాం. నా బట్టలు, పాత, కొత్త పుస్తకాలు, ఫైల్స్, పేపర్లు అన్నీ పాడైపోయాయి. సర్టిఫికెట్లు జాగ్రత్తగా దాచుకోవడంతో అవి మాత్రమే మిగిలాయి’.అంటూ వాపోయారు ఎల్సా జాన్. అయితే, వారి కుక్క మాత్రం సురక్షితంగా తిరిగి వచ్చింది. మానసిక ఆందోళనలో ఉన్నారు ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ వృద్ధుడు ఛాతిలో నొప్పిగా ఉందని క్యాంప్లో సేవలందిస్తున్న వైద్యుడు రఫీక్ను కలిశాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు.. రోగం సంగతి ఎలా ఉన్నా ‘ముందు నువ్వు మీ ఇంటికి వెళ్లొద్దు.. మీ కొడుకు ఇల్లు మొత్తం శుభ్రం చేశాకే ఇంటికి వెళ్లు’ అని చెప్పాడు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ‘ఎంతో కష్టపడి చాలా మంది తమ ఇళ్లను నిర్మించుకున్నారు. ఆ ఇంటితో వారికి విడదీయరాని బంధం, అనుబంధం ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో ఆ ఇంటిని చూస్తే వారు తట్టుకోలేరు. వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. శారీరకంగా ధృడంగా ఉన్న వారు కూడా బోరున విలపిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు డాక్టర్ రఫీక్. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేరళ వరదలు: సెక్స్ వర్కర్ల సాయం
ముంబై : కేరళ వరద బాధితులకు మహారాష్ట్ర సెక్స్ వర్కర్లు సాయం చేశారు. అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన సెక్స్వర్కర్లు రూ.21వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నెలాఖరువరకు ఈ సాయాన్ని లక్షకు పెంచుతామని కూడా తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితులకు అందజేయాలని చెక్కును స్థానిక డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్కు అందజేశారు. ఈ విషయాన్ని సెక్సవర్కర్ల సంక్షేమం కోసం పనిచేసే ఓ ఎన్జీవో ప్రతినిధి తెలిపారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించనప్పుడల్లా సెక్స్వర్కర్లు సాయం చేశారని ఆయన పేర్కొన్నారు. 2015లో చెన్నై వరద బాధితులకు ఒక లక్ష సాయం చేసారని చెప్పారు. ఇప్పటి వరకు సెక్స్వర్కర్లు మొత్తం రూ. 27 లక్షల సాయాన్ని చేసినట్లు పేర్కొన్నారు. 2001లో గుజరాత్లో భూకంపం, సునామీ (2004), కశ్మీర్, బీహార్ వరదలు, మహరాష్ట్రలోని కరువు సంభవించినప్పుడు, కార్గిల్ హీరోలకు విరాళాలు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. సాయం చేసిన సెక్స్ వర్కర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
కేరళకు రూ. 600 కోట్ల వరద సాయం
సాక్షి, న్యూఢిల్లీ : వరదలతో తల్లడిల్లిన కేరళకు కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. కేరళ వరదలను తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించిన కేంద్రం ఆ దిశగా వరద సాయం కింద ఈ నిధులను విడుదల చేసింది. కేరళకు అదనంగా బియ్యం, పప్పు ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రాష్ట్రానికి తరలించే వరద సహాయ సామాగ్రి, ఆహార పదార్ధాలపై జీఎస్టీ మినహాయింపును ప్రకటించింది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో విద్యుత్, టెలికాం సేవల పునరుద్ధరణపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే మౌలిక సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా వరద బీభత్సంతో భీతిల్లిన కేరళను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించగా, పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. -
కేరళ వరదలు : విరాళాన్ని పెంచిన బజాజ్ ఆటో
న్యూఢిల్లీ : కేరళ బాధితుల దయనీయమైన పరిస్థితిని చూసి, ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే విరాళాలు ప్రకటించిన కంపెనీలు కూడా.. మరింత సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో, కేరళకు మరో రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ పలు బజాజ్ ట్రస్ట్ల ద్వారా రూ.50 లక్షల రూపాయలను కేరళకు అందించింది. తాజాగా ప్రకటించిన రెండు కోట్ల రూపాయలలో ఒక కోటిని నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధిలో క్రెడిట్ చేయనున్నట్టు పేర్కొంది. మరో కోటి రూపాయలను జానకిదేవి బజాజ్ గ్రామ్ వికాస్ సంస్థ(జేబీజీవీఎస్) ద్వారా సర్వైవల్ కిట్స్ సరఫరాకు ఉపయోగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. జేబీజీవీఎస్.. బజాజ్ ఆటో తరుఫున పలు కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ. వరదల్లో ప్రభావితమైన ప్రాంతాల్లో బేసిక్ స్టార్టప్ కిట్ ద్వారా సుమారు 1000 కుటుంబాలకు సహాయం అందించనుంది. రాష్ట్రంలో ఉన్న డీలర్షిప్ల ద్వారా కేరళకు తామిచ్చే సపోర్టును మరింత పెంచుతామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్(ఇంట్రా-సిటీ బిజినెస్) ఆర్సీ మహేశ్వరి తెలిపారు. బజాజ్ ఆటో అందిస్తున్న సర్వైవల్ కిట్లో వాటర్ ఫిల్టర్, బేసిక్ ఐటమ్స్తో కిచెన్ సెట్, ప్లాస్టిక్ స్లీపింగ్ మ్యాట్స్, బ్లాంకెట్లు, టవల్స్ వంటివి ఉండనున్నాయి. ఈ కిట్స్ను బజాజ్ ఆటో కమర్షియల్ వెహికిల్ డీలర్షిప్లు, సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్న ఎన్జీవోల ద్వారా సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇతర ఆటోమొబైల్ సంస్థలు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, టీవీఎస్ మోటార్ కంపెనీలు రెండు కోటి చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాయి. టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియా, బీఎండబ్ల్యూలు కస్టమర్లకు సర్వీస్ సపోర్టు ఇస్తున్నాయి. -
నాటి సహాయక చర్యలు నేటికి స్ఫూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : ‘గాడ్స్ ఓన్ కంట్రీ... ఏ ల్యాండ్ ఆఫ్ బ్యూటీ.. ఏ ల్యాండ్ ఆఫ్ ప్లెంటీ... ఏ ల్యాండ్ ఆఫ్ పీస్’గా ప్రసిద్ధి కెక్కిన కేరళలో జల ప్రళయం సంభవించడం ఇదే మొదటి సారి కాదు. అనేక సార్లు కేరళలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా 1924, 1999లో వచ్చిన వరదలు అపార ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించాయని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ‘వాటర్! వాటర్ ఎవ్రీవేర్’ అన్న వ్యాఖ్యంతో ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత థకాజి శివశంకరన్ పిల్లై నవల ‘ఇన్ ది వాటర్’ మొదలవుతుంది. ‘టావన్కోర్లో అది అతిఎత్తైన దేవాలయం. దాని శిఖరంపై 67 మంది పిల్లలు, 350 మంది పెద్దలు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురవడంతో వందలాది మానవులు, వేలాది జంతువుల ప్రాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లూ, జీవనాధార పంటలు నీటి పాలయ్యాయి. నీటిలో గర్భవతులు, పిల్లల నరక యాతన వర్ణనాతీతం’ అని 1924లో సంభవించిన వరదల గురించి థకాజి తన పుస్తకంలో వర్ణించారు. ఆయన అలప్పూజ జిల్లాలోని థకాజి గ్రామంలో జన్మించడంతో ఆయన ఊరిపేరుతోనే ఆయన్ని పిలిచేవారు. 1924లో జూలై నెలలో వరదలు వచ్చాయి. వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు ఆగస్టు మొదటి వారంలో అనేక ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. అలా అంబాలపూజలో 4,000 మందికి, అలెప్పి శిబిరంలో 3,000 మందికి, కొట్టాయంలో 5,000 మందికి, ఛంగనస్సరీలో 3,000 మందికి, పరూర్లో 8,000 మందికి ఆశ్రయం కల్పించారు. ఇవే కాకుండా ఇంకా అనేక చోట్ల నాడు ఆశ్రయం కల్పించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘మన్నార్ ఫ్లడ్ రిలీఫ్ డిప్యూటేషన్’ నివేదిక ప్రకారం నాడు వరదల వల్ల ఒక్క మధ్య ట్రావన్కోర్ ప్రాంతంలోనే 500 ఇళ్లు, 200 కొబ్బరి తోటలు, వెయ్యి ఎకరాల భూమి, 6,40,000 కిలోల ధాన్యం నీటి పాలయ్యాయి. నాడు బ్రిటీష్ మద్రాస్ పాలకులు వరద సహాయక చర్యల కోసం నిపుణుడైన టి. రాఘవయ్యను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సహాయక కమిటీ ఏర్పాటై నిరంతరగా పనిచేసింది. అప్పటి ట్రావన్కోర్ పాలకుడు మహారాజ మూలమ్ తిరునాల్ ఆ ఏడాదికి ప్రజల పన్నులన్నింటిని రద్దు చేశారు. వ్యవసాయ రుణాల కోసం నాలుగు లక్షల రూపాయలను కేటాయించారు. ఈ దిశలో ఆయన కన్నుమూశారు. అప్పట్లో కూడా మూడు రోజులపాటు సంతాప దినాలు పాటించాలి. ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించరాదు. అయితే ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన సేతు లక్ష్మీ భాయ్ సహాయక చర్యలను అధికారికంగా అనుమతించారు. ఎప్పటికప్పుడు రాఘవయ్యతో పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు. రైతుల వ్యవసాయ రుణాల బడ్జెట్ను నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదున్నర లక్షల రూపాయలకు పెంచారు. పేదల ఇళ్ల పునర్నిర్మాణం కోసం అడవిలోని వెదురు చెట్లను ఉచితంగా కొట్టుకొని తెచ్చుకునే హక్కును కల్పించారు. పదివేల మంది రైతులకు ఐదు వందల రూపాయల చొప్పున నాడు రుణాలు అందజేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని బట్టి వడ్డీ రేటును 6.25 శాతం నుంచి ఆరుకు, అంతకన్నా తక్కువకు తగ్గించారు. కొన్ని లక్షల రూపాయలతో రోడ్లు, మంచినీటి సౌకర్యాలను పునరుద్ధరించారు. అప్పుడు ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలి వచ్చారు. అప్పటి వరకు తన పట్టాభిషేక ఉత్సవాన్ని వాయిదా వేసుకున్న రాణి లక్ష్మీ భాయ్ ఆ తర్వాత ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకున్నారు. మను ఎస్ పిళ్లై రాసిన ‘ది ఐవరీ త్రోన్: క్రానికల్స్ ఆఫ్ ది హౌజ్ ఆఫ్ ట్రావెన్కోర్’ పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. నేటి పాలకులకు స్ఫూర్తి కోసం నాటి వివరాలు. సంబంధిత కథనాలు: పునరావాసమే సవాల్! ఎందుకు ఎయిర్ పోర్టుల్లోకి వరదలు? సామాన్యులే రియల్ హీరోలు మనిషి పుడతాడు కష్టంలో కేరళలో ఎందుకీ వరదలు? -
కేరళకు వరుసకట్టిన మ్యాగీ, బిస్కెట్లు, చాక్లెట్లు
న్యూఢిల్లీ : ప్రకృతి విలయతాండవానికి కేరళ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలకు కనీస అవసరాలు కరువయ్యాయి. వీరిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న విరాళాలు తరలివస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారంగా ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను కేరళకు తరలిస్తున్నాయి. ఐటీసీ, కోకా కోలా, పెప్సీ, హిందూస్తాన్ యూనిలివర్ వంటి 12కు పైగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే రెండు రోజుల్లో మరింత ఆహారాన్ని, మంచినీటిని, కనీస వస్తువులను సరఫరా చేస్తామని వాగ్దానం చేసినట్టు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. దిగ్గజ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల అధికారులతో నిన్న జరిగిన భేటీ అనంతరం, ఈ విషయాన్ని ప్రకటించారు. కేరళకు సహాయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఒక్కొక్కరూ సాయం చేయడం కంటే.. అందరూ కలిసి చేయడం ఎంతో మంచిదని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కు మంత్రి సూచించారు. హిదూస్తాన్ యూనిలివర్ ఇప్పటికే 9500 కేసుల ఉప్పు, 29వేల కేసుల గోధుమలు, 1000 కేసుల కెచప్, 250 కేసుల స్పైసస్ మిక్స్ మసాలా ఇతర ఉత్పత్తులను సరఫరా చేసింది. నెస్లే ఇండియా 90వేల ప్యాకెట్ల మ్యాగీ, 2 లక్షల ప్యాకెట్ల మచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్టీ మిల్క్ను అందించింది. అదనంగా మరో 40వేల ప్యాకెట్ల మ్యాగీ, లక్షల ప్యాకెట్ల మంచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్టీలను సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 30వేల ప్యాకెట్ల రెడీ-టూ-డ్రింక్ మిలో, 10వేల ప్యాక్ల సెరిగోలను సరఫరా చేయనుంది. ఐటీసీ కూడా 3.30 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను, 2000 బాటిళ్ల సావ్లాన్, 3000 ప్యాకెట్ల డైరీ వైటర్న్, 9000 ప్యాకెట్ల లిక్విడ్ హ్యాండ్ వాష్, 7000 సోపులను పంపనున్నట్టు తెలిపింది. కోకా కోలా ఇప్పటికే 1.4 లక్షల లీటర్ల మంచినీటిని పంపింది. అదనంగా మరో లక్ష లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, దానిలోనే 20వేల బాటిళ్లను కేరళకు తరలించనున్నట్టు వెల్లడించింది. పెప్సీకో కూడా 6.78 లక్షల లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, 10వేల కేజీల క్వాకర్ ఓట్స్ను సరఫరా చేసింది. బ్రిటానియా కూడా ఇప్పటికే 2.10 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లనును కొచ్చికి అందించింది. 1.25 లక్షల ప్యాకెట్లను మలప్పురం, వయనాడ్కు తరలించింది. వచ్చే రెండు రోజుల్లో మరో 1.25 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను కేరళ ప్రజలకు పంపించనున్నట్టు పేర్కొంది. 3000 బన్స్, 10000 ప్యాకెట్ల బిస్కెట్లను మధురైకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఎంటీఆర్ ఫుడ్ 35వేల ప్యాకెట్ల రెడీ టూ ఈట్ను వయనాడ్కు పంపించింది. డాబర్ కూడా 30 వేల నుంచి 40వేల వరకు టెట్రా-ప్యాక్ జ్యూస్లను, జీఎస్కే ఇండియా రూ.10 లక్షల విలువైన రిలీఫ్ మెటీరియల్స్ను, 10 లక్షల హార్లిక్స్ ప్యాకెట్లను, 10 లక్షల క్రోసిన్ టాబ్లెట్లను.. మెరికో 30 టన్నుల ఓట్స్ను కేరళ ప్రజలకు పంపించాయి. -
శశి థరూర్ సాయం.. వద్దన్న కేరళ
న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను అదుకోవాల్సిందిగా తాను ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఐరాసను కోరతానంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం జెనీవాలో ఉన్న శశిథరూర్, తాను కేరళ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర రాయబారిగా ఐక్యరాజ్యసమితిని తమ రాష్ట్రానికి సహాయం చేయాలని అడుగుతానంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ‘కేరళ వరదల విషయంపై మాట్లాడేందుకు ఐరాస, అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలను కలిసేందుకు జెనీవా వచ్చాను. ఐరాస సాయం కోరడం భారత ప్రభుత్వ హక్కు. నేను ఇక్కడి నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సంప్రదిస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఐరాసా ఎటువంటి సాయం చేయగలదో తెలుసుకుంటాను’ అని థరూర్ ట్వీట్ చేశారు. Landed in Geneva to meet w/ @UN & international humanitarian agencies for consultations on #KeralaFloods. While seeking help is the prerogative of the Govt of India, i am here, in close consultation w/ @CMOKerala @vijayanpinarayi, to explore what help could be possible if sought — Shashi Tharoor (@ShashiTharoor) August 20, 2018 అయితే కేరళ ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అంతేకాక తాము శశిథరూర్ను తమ ప్రతినిధిగా జెనీవా పంపలేదని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆయన తమ రాయబారి కాదని తెలిపింది. శశి థరూర్ కేరళ, తిరువనంతపురం నియోకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఆయన నియోజక వర్గం వరదలకు గురి కాలేదు. అయినా కూడా థరూర్ కేరళకు సాయం చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కానీ బీజేపీ మాత్రం శశి థరూర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే థరూర్, ఐరాసతో గతంలో తనకున్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని కేరళకు సాయం చేయాలని అడగాలనుకున్నారని, అందులో తప్పేముందని కాంగ్రెస్ బీజేపీపై మండిపడుతోంది. కేరళలో ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల దాదాపు రూ.20వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారని ప్రభుత్వం తెలిపింది. -
రూ. 50 కోట్ల భారీ విరాళమిచ్చిన ఎన్ఆర్ఐ వ్యాపారి
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకొనేందుకు ఆపన్న హస్తాలు స్పందిస్తున్నాయి. అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించించగా ఇటు దేశవ్యాప్తంగా చిన్నారులు సహా ప్రజలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేము సైతం సహాయాన్ని ప్రకటిస్తున్నారు. నగదు, ఆహారం, మందులు, దుస్తులు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. వీరితో పాటు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా మాతృదేశానికి వచ్చిన కష్టానికి స్పందిస్తున్నారు. తాజాగా అబుదాబీలో స్థిరపడిన భారత సంతతి వ్యాపారవేత్త స్పందించారు. అబుదాబి కేంద్రంగా పనిచేసే వీపీఎస్ హెల్త్ కేర్ సంస్థకు చైర్మన్ డా.షంషీర్ వయలిల్ కేరళకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన సొంత రాష్ట్రమైన కేరళకు 26 మిలియన్ దుబాయ్ దిర్హమ్లను (దాదాపు రూ.50 కోట్లు) కోట్లు విరాళం ఇచ్చారు. షంషీర్ వయలిల్ కు మధ్య ఆసియా, భారత్, యూరప్ లలో మొత్తం 22 ఆసుపత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి. డాక్టర్ షంషీర్ వయలిల్, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చి కేరళ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చినట్టు సమాచారం. షంషీర్ రూ.50 కోట్ల మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. త్వరలోనే ఓ ప్రాజెక్ట్ ప్రారంభించి ఈ రూ.50 కోట్లని బాధితుల పునరావాసం, ఆరోగ్యం, విద్యకు ఖర్చు చేయనున్నట్లు షంషీర్ తెలిపారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు గత వందేళ్లలో సంభవించని వరద ముప్పుతో విలవిల్లాడిన కేరళం ప్రస్తుతం వర్షాలు ఉపశమించాయి. అయితే కూలిన ఇళ్లు, తెగిపడిన రోడ్లు, విరిగి పడిన చెట్లతో జనం కన్నీటి సంద్రమవుతున్నారు. కొద్దికొద్దిగా సహాయ శిబిరాల్లోతలదాచుకున్న ప్రజలు చెదరిని తమ గూళ్లను చక్కదిద్దకునే పనిలో ఉన్నారు. పరిస్థితి చక్కదిద్దిడానికి కొన్ని వారాల సమయం పడుతుందని, ప్రస్తుతం డాక్టర్లు, నర్సులు, వైద్య సహాయం అవసరం చాలా అవసరమని అధికారులు ప్రకటించారు. -
వరదలు : పన్ను మినహాయింపుపై కేంద్రం ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : వరద బీభత్సం వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన నేపథ్యంలో కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మరిన్నినిధులు విడుదల చేసే అవకాశం ఉంది. కాగా వరద బాధితుల సహాయార్థం కేరళకు పంపించే వివిధ రకాల వస్తువులపై ప్రాథమిక సరుకుల పన్ను(బీసీడీ), సమీకృత వస్తు, సేవల పన్ను (ఐజీఎస్టీ) నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబరు 31, 2018 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు.. ‘కేరళకు భారత్ మొత్తం అండగా నిలుస్తుంది. కేరళ వరద బాధితుల కోసం పంపించే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఐజీఎస్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చిందని’ ఆయన ట్వీట్ చేశారు. India stands with Kerala in this hour of need. Central Government is exempting basic customs duty and IGST for the consignments of aid and relief materials being despatched or imported from abroad for the affected people. — Piyush Goyal (@PiyushGoyal) August 20, 2018 పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందాలంటే.. కేంద్ర ప్రభుత్వ, లేదా కేరళ రాష్ట్ర ప్రభుత్వాలచే ఆమోదం పొందిన రిలీఫ్ ఏజెన్సీలకే ప్రస్తుత మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే మినహాయింపు పొందాలనుకున్న వ్యక్తి లేదా సంస్థ... దానం చేయాలనుకున్న వస్తువుల జాబితాతో పాటుగా.. క్లియరెన్స్కు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కేరళలో ఏ జిల్లా, గ్రామానికైతే సాయం చేశారో సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ నుంచి... వస్తువులు స్వీకరించినట్లుగా సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ను డిప్యూటీ కమిషనర్ లేదా కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్కు సమర్పించినట్లయితే ఆరు నెలలోగా ఎప్పుడైనా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. -
ఎలర్ట్: వరద సాయం పేరుతో నకిలీ ఖాతా
కేరళ వరద విపత్తును కూడా క్యాష్ చేసుకోవడానికి నకిలీ కేటుగాళ్లు సిద్ధమైపోయారు. ఎస్బీఐ ఖాతా ద్వారా వరద విరాళాలను అక్రమంగా వసూలు చేసేందుకు ఎత్తుగడవేశారు. అయితే ఈ ప్రయత్నాలకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టారు అధికారులు. కేరళ సీఎం డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను ఛేదించామని ఎస్బీఐ ప్రతినిధి వెల్లడించారు. 20025290179, త్రివేండ్రం పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో బ్యాంకు బ్రాంచ్గా ఐఎఫ్ఎస్సీ కోడ్ ద్వారా గుర్తించారు. అయితే ఈ ఖాతాలో రెండు, మూడువేలు మాత్రమే ఉన్నాయని దీన్ని ఇప్పటికే బ్లాక్ చేశామని బ్యాంకు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంకా ఎలాంటి లావాదేవీలు సాధ్యంకాదని వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన బ్యాంకు ఖాతా 67319948232 ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా, ఫేస్బుక్లో షేర్ చేశారు. మరోవైపు మోసపూరిత సందేశాలు / పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నకిలీ ఖాతాలు, సందేశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలకు సూచించింది. అలాగే సైబర్ నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేసింది. విరాళాలు పంపాల్సిన అసలైన బ్యాంకు ఖాతా, చిరునామా లబ్ధిదారు పేరు: ప్రిన్సిపల్ కార్యదర్శి (ఫిన్), కోశాధికారి, సీఎండీఆర్ఎఫ్ బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతా సంఖ్య: 67319948232 శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం IFSC: SBIN0070028 ఆఫ్లైన్ కాంట్రిబ్యూషన్: తిరువనంతపురానికి చేరేలా చెక్ను లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ను ఈ కింది చిరునామాకు పోస్ట్ చెయ్యవచ్చు / పంపవచ్చు చిరునామా: ప్రిన్సిపల్ కార్యదర్శి (ఫైనాన్స్) కోశాధికారి సీఎండీఆర్ఎఫ్ సెక్రటేరియట్, తిరువనంతపురం - 695 001 అలాగే సీఎం సహాయ నిధికి పంపే విరాళాలకు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎస్బీఐతో పాటు పేటిమ్, భీమ్, తేజ్, ఫోన్ పే వంటి యునిఫైడ్ చెల్లింపు ప్లాట్ఫాంల ద్వారా కూడా సహాయాన్ని పంపించవచ్చు. -
‘కేరళ కేరళ డోంట్ వర్రీ కేరళ’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళను ముంచెత్తిన వరదల వల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడంతో బాధితులను ఆదుకునేందుకు ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి, దేశంలోని నలుమూలల నుంచి విశాల హృదయులు తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక నటులు, కళాకారులు, సెలబ్రిటీలు, సంగీత సామ్రాట్లు తమదైన శైలిలో బాధితులను ఊరడిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి అక్కడ తన సంగీత కచేరీని నిర్వహించారు. రెహమాన్ తాను సంగీతం సమకూర్చిన ‘ప్రేమ దేశం (కాదల్ దేశం)’ చిత్రంలోని ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా’ పాటను ఆయన స్టేజ్పైన పడాల్సి ఉంది. అయితే కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్నాయని తెల్సి బాధితుల్లో స్థైర్యాన్ని నింపడం కోసం ఆయన వారికి సంఘీభావంగా పాట పల్లవిలోని మాటలను కొద్దిగా మార్చి ‘కేరళ కేరళ డోంట్ వర్రీ కేరళ’ అంటూ ఆయన పాడారు. దానికి ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన లభించింది. వారిలో ఒకరు ఆయన పాడిన పాట పల్లవి వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది. అనంతరం రెహమాన్ కేరళ బాధితులను ధైర్యంగా ఉండాలంటూ, కేరళను ఆదుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ రెండు వేర్వేరు ట్వీట్లు చేశారు. -
కేరళ బాధితుల్ని రాష్ట్రం ఆదుకోవాలి
భువనేశ్వర్/పూరీ : వరద ఉప్పెనతో చితికి పోయిన కేరళ ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రజలు వెన్ను తట్టి ఆదుకోవాలి. విపత్తు తాండవం చవి చూసిన రాష్ట్ర ప్రజల పూర్వ అనుభవాల దృష్ట్యా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హృదయం మానవతా దృక్పథంతో స్పందించాలని యువ సైకత శిల్పి మానస కుమార్ సాహు సైకత కళాత్మకంగా పిలుపునిచ్చారు. కేరళలో వరద తాండవం విషాద దృశ్యం ప్రతిబింబించే రీతిలో ఆయన ఆవిష్కరించిన సైకత శిల్పం పూరీ గోల్డెన్ బీచ్ తీరంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. -
గిఫ్ట్ అందుకున్న ‘అను’
సాక్షి, చెన్నై: వర్షాలు, వరదలు విపత్తు ఈ పదాలకు అర్థాలు తెలియకపోయినా, తన తోటి చిన్నారుల కష్టాన్ని చూసి చలించిపోయిన తమిళనాడు అనుప్రియ (9) దానగుణంతో తన కోరికను నెరవేర్చుకుంది. అలాగే అనుప్రియకు కొత్త సైకిల్ ఇస్తామని ప్రకటించిన హీరో సైకిల్స్ కూడా తన మాటను నిలబెట్టుకుంది. మంగళవారం అనుప్రియను కలిసిన సంస్థ ఎండీ, ఛైర్మన్ పంకజ్ ఎం ముంజాల్ బ్రాండ్ న్యూ సైకిల్ను బహూకరించారు. ఈ సందర్బంగా అనుప్రియతో మాట్లాడటం, ఆమె తల్లిని కలవడం సంతోషంగా ఉందని, జీవితాంతం అనుప్రియ ఇదే వ్యక్తిత్వాన్ని కలిగి వుండాలంటూ ఆయన ట్వీట్ చేశారు. కేరళ వరదల్లో తన తోటి చిన్నారుల కష్టాలను టీవీలో చూసి కేవలం బాధపడి ఊరుకోకుండా, తనవంతు సాయం చేసేందుకు పెద్ద మనసు చేసుకుంది. యతద్వారా తమిళనాడు విల్లుపురానికి చెందిన అనుప్రియ(9) వార్తల్లో నిలిచింది. సైకిల్ కొనుక్కునేందుకు ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వరద బాధితులకు విరాళమిచ్చి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళ వరద విరాళాల ట్రాన్సాక్షన్స్ ద్వారా లక్షలాదిమంది యూజర్లను సాధిస్తూ, కోట్లాది రూపాయల టర్నోవర్ను సొంతం చేసుకుంటున్న పేటీఎం సీఈవో విజయ్శేఖర్ శర్మకంటే ఈ చిన్నారి చాలా నయం. అనుప్రియకు సాల్యూట్స్ అంటూ నెటిజన్లు చిన్నారిని అభినందించారు. అటు అనుప్రియ ఔదార్యానికి స్పందించిన హీరో మోటార్ సైకిల్స్ సంవత్సరానికి ఒక బైక్ (కిడ్స్) అందిస్తామని ట్విటర్ ద్వారా వెల్లడించింన సంగతి తెలిసిందే. Thanks to you dear Anupriya and pleasure to talk to your mom. I had read every act of kindness has a ripple effect. Through you I experienced, “Some act of kindness may bring an avalanche “. You are truly blessed and keep up this character of strength that you carry. pic.twitter.com/Ab8plZnKHM — Pankaj M Munjal (@PankajMMunjal) August 20, 2018 -
కేరళ వరదలు: ఏఆర్ రెహమాన్ పాడిన పాట!
-
కేరళకు 700కోట్ల భారీ సాయం ప్రకటించిన యూఏఈ!
తిరువనంతపురం : భారీ వర్షాలతో అతలాకుతలమైన దేవభూమి కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. యుఏఈ సక్సెస్ స్టోరీలో కేరళ ప్రజల భాగస్వామ్యం కీలకమైందంటూ వ్యాఖ్యానించిన ఆ దేశ నేతల మాటలు నిజం చేస్తూ.. 700 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం మీడియాకు తెలిపారు. కాగా వరద బీభత్సంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం అఖిలపక్షం సమావేశం కానుంది. -
పెద్ద మనసు చాటుకున్న ఆర్ఎక్స్ 100 చిత్రయూనిట్
-
కేరళకు వైఎస్ జగన్ కోటి విరాళం
-
కేరళ ముప్పు హైదరాబాద్కు వస్తే..??
కేరళ పరిస్థితే మనకు ఎదురైతే.? తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అలాంటి ఉపద్రవం భాగ్యనగరాన్ని ముంచేయక ముందే మేల్కొంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని నాలాలను తక్షణమే విస్తరించాలని, మూసీ సామర్థ్యాన్ని పెంచాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో కేరళ తరహాముంపు ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని నాలాలను తక్షణమే విస్తరించి, వరదనీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయకపోతే.. మూసీ సామరŠాధ్యన్ని పెంచని పక్షంలో.. కేరళ తరహా ముప్పు హైదరాబాద్కూ పొంచి ఉందని వరద ప్రవాహాల నిపుణులు పేర్కొంటున్నారు. 2000 సంవత్సరంలో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఇళ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. మారిన పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండైనా, వానైనా తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున హటాత్తుగా భారీ వర్షాలొచ్చే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. కేరళలో కురిసనట్లుగా భారీ వర్షాలు వస్తే నగరం మునిగిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. 2000 నాటి వరదలతోనే కిర్లోస్కర్, వాయెంట్స్ సొల్యూషన్స్ నివేదికల్లో నాలాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినా ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు. రెండేళ్లక్రితం వర్షాలతో తిరిగి నాలాల ఆధునీకరణ పనుల్లో కదలిక వచ్చినా ముందుకు సాగడం లేదు. నాలాలను ఆధునీకరించి, వరదనీరు వెళ్లే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వరదలనైనా బయటకు పంపించే మూసీ నది కబ్జాకు గురికావడంతో నీరు బయటకు వెళ్లడం లేదు. మూసీగుండా ప్రస్తుతం దాదాపు 50 క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్ధ్యం మాత్రమే ఉండటం రెండు రోజుల క్రితం జరిగిన ఇంజినీరింగ్ సదస్సులో చర్చకు వచ్చింది. మూసీకి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్ధ్యం ఉంటేనే నగరం వరదముంపు బారిన పడకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకుగాను తగిన కార్యాచరణతో తక్షణం పనులు చేపట్టాని వారు పేర్కొన్నారు. ఆక్రమణలతో తగ్గిపోయిన మూసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఇరిగేషన్, తదితర శాఖలు ఆరేడేళ్ల క్రితం జరిపించిన అధ్యయ నంలో వెల్లడవడాన్నీ సదస్సు ప్రస్తావించింది. గంటకు 10 సెం.మీ.వర్షపాతాన్ని తట్టుకోవాలి.. గతంలో నిర్వహించిన అధ్యయనాలు, కమిటీల నివేదికలు గంటకు నాలుగు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేందుకు రూపొందించినవి. ప్రస్తుతం గంటకు రెండు సెంమీటర్ల వర్షాన్ని తట్టుకునే సామర్ధ్యం మాత్రమే నాలాలకు ఉంది. గత ఏడాది తక్కువ సమయంలోనే పది సెంటీమీటర్లు మించిన వర్షపాతం నమోదైంది. మూసీని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేయడమే కాక, ప్రభుత్వశాఖలు సైతం అభివృద్ధి పేరిట మూసీ స్థలంలో నిర్మాణాలు జరిపాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా వెంటనే తగు చర్యలు చేపట్టి మూసీ ప్రవాహ సామరŠాధ్యన్ని పెంచాల్సిన అవసరముందని, లేని పక్షంలో కేరళ కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉం దని హెచ్చరించారు. అందుకుగాను తగిన ఆలోచనలు, ప్రణాళికలు అవసరమని సూచించారు. 13 ప్రాంతాలు సమస్యాత్మకం.. మూసీలో అనేక ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోయి సమస్యాత్మకంగా మారాయి. మూసీప్రక్షాళన, సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వం మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మూసీ తీరం వెంబడి సర్వే నిర్వహించిన కార్పొరేషన్ 13 ప్రాంతాల్లో డెబ్రిస్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది. 14 మండలాల పరిధిలో 57.5 కి.మీ.ల మేర విస్తరించిన మూసీని మొత్తం ప్రక్షాళన చేసి, ప్రవాహ సామరŠాధ్యన్ని పెంచితేనే వర్షాకాల సమస్యలు తప్పుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
కేరళ వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇంకా బాధ్యతగా వ్యవహరించాలని.. వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. రూ.600 కోట్లిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రధాని రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారని, కానీ రూ.650 కోట్లే ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రాల్లో జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ఖర్చు చేసేందుకు 14వ ఆర్థిక సంఘంలో కేటాయించిన రూ.62 వేల కోట్లు చాలా తక్కువన్నారు. దీన్ని 15వ ఆర్థిక సంఘంలోనైనా పెంచాలని కోరారు. కేరళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు రూ.6 కోట్ల విలువైన మరో 2 వేల టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక ఎన్జీవో జేఏసీ, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగుల జేఏసీ కలిసి రూ.24 కోట్లు.. పోలీసు అధికారులు, ఉద్యోగులు రూ.7 కోట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.2.5 కోట్లు ప్రకటించారని చెప్పారు. త్వరలో ఆ రాష్ట్రానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపి సంఘీభావం తెలుపుతామని చెప్పారు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నాం.. మన రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న 15 గ్రామాల్లో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 6,336 మందిని తరలించినట్లు తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు పంపించేందుకు నిత్యావసర వస్తువులు సిద్ధం చేశామన్నారు. పంటలు దెబ్బతిన్న చోట ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇంకా రూ.33 వేల కోట్లు కావాలి.. నాలుగేళ్లలో సాగునీటి రంగంపై రూ.56 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే జూన్ నాటికి 29 ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తికావాలంటే ఇంకా రూ.33,760 కోట్లు అవసరమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,620 కోట్లు ఇవ్వాల్సి ఉందని, డీపీఆర్ పంపించినా దాన్ని క్లియర్ చేయలేదని చెప్పారు. చిత్రావతి ద్వారా పులివెందులకు నీళ్లిచ్చినట్లు తెలిపారు. జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ప్రాజెక్టుల కోసం బాగా కష్టపడుతున్నారని, అందుకే ఆయన పేరును పద్మశ్రీకి సిఫారసు చేశామని సీఎం చెప్పారు. కానీ అధికారులకు ఇవ్వబోమంటూ కేంద్రం తిరస్కరించిందని తెలిపారు. వచ్చే ఏడాది కృష్ణానదిపై వైకుంఠపురం బ్యారేజీని పూర్తి చేసి.. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వద్ద మరో చిన్న బ్యారేజీ కడతామని తెలిపారు. సీఎంను సన్మానించిన కుల సంఘాల నేతలు బ్రాహ్మణ సంక్షేమ సంస్థ, అఖిల భారత కాపు ఫెడరేషన్ ప్రతినిధులు సోమవారం ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానించారు. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య చంద్రబాబును గజమాలతో సత్కరించారు. బలిజలను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు అఖిల భారత కాపు ఫెడరేషన్ ప్రతినిధులు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. -
ఎందుకు ఎయిర్ పోర్టుల్లోకి వరదలు?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో వరదలు ఇంకా కొనసాగుతున్నందున కోచిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26వ తేదీ వరకు మూసివేశారు. పెరియార్ నది ఉధృతంగా ప్రవహిస్తూ విమానాశ్రయం రన్వేను నీట ముంచడంతో 11 రోజులుగా విమానాశ్రయాన్ని మూసివేసి ఉంచారు. వరదల కారణంగా విమానాశ్రయం పరసర ప్రాంతాల్లోనే దాదాపు వంద మంది మరణించారు. 1999లో ప్రారంభించిన కోచి విమానాశ్రయానికి ఎందుకింత ముప్పు వచ్చింది? పెరియార్ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాకుండా, రన్వే కోసం పెరియార్ నదీ కాలువైన ‘చెంగల్ తోడు’ను, మరో మూడు వ్యవసాయ కాల్వలను మళ్లించారు. పెద్దగా ఉన్న చెంగల్ తోడు కాల్వను మళ్లించినప్పుడు అది చిన్న కాల్వగా మారిపోయింది. మళ్లించిన ఆ కాల్వ పక్కన పేదల గుడిశెలు, తాత్కాలిక ఇళ్లు వెలిశాయి. చెంగల్ తోడును, పంట కాల్వలను మళ్లించడం వల్ల వరద ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆనాటి పర్యావరణ వేత్త నేటి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీఆర్ నీలకందన్ హెచ్చరించినా, సామాజిక కార్యకర్తలంతా కలిసి ఆందోళనా చేసిన నాటి పాలకులు పట్టించుకోలేదట. కోచి విమానాశ్రయం ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతి పత్రంలో కూడా ‘చెంగల్ తోడు’ అనే చిన్న నీటి కాల్వను మళ్లించాల్సి ఉంటుందని మాత్రమే పేర్కొన్నారట. చెంగల్ తోడుకు చాలా కాలంగా వరదలు వస్తున్నాయి. 2013లో పెరియార్ నదిపైనున్న ఇదమలేయర్ డ్యామ్ గేట్లు తెరచినప్పుడు కూడా ఈ కాల్వకు వరదలు వచ్చాయి. అప్పుడు కూడా కోచి విమానాశ్రయాన్ని రెండు రోజులపాటు మూసివేశారు. దేశంలో నదుల పక్కన, కాల్వల పక్కన విమానాశ్రయాలు నిర్మించడం ఒక్క కేరళలోనే జరగలేదు. చెన్నై, ముంబై ఎయిర్పోర్టులు అంతే....... తమిళనాడులోని చైన్నై విమానాశ్రయానికి 2011లో రెండో రన్వేను నిర్మించినప్పుడు సమీపంలోని అడయార్ నదిపై వంతెనను నిర్మించారు. ఫలితంగా 2015లో వరదలు వచ్చినప్పుడు విమానాశ్రయం మునిగిపోవడంతో కొన్ని రోజులు దాన్ని మూసివేశారు. ఢిల్లీ తర్వాత అత్యంత ప్రయాణికుల తాకిడి ఉండే ముంబై రన్వేను కూడా నదిని ఆక్రమించి కట్టిందే. మొదటి రన్వేను మితీ నది కల్వర్ట్పై 2005లో నిర్మించగా, రెండో రన్వేను నేరుగా నదిలోకే కట్టారు. 2005లోనే మితీ నది నుంచి రన్వేపైకి వరదలు వచ్చినప్పటికీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం రెండో రన్వేను నేరుగా నదిపైకే నిర్మించింది. అప్పటికే కాదు, ఇప్పటికీ పాలకులు కళ్లు తెరవడం లేదు. నవీ ముంబైలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడం కోసం ఉల్వే నదిని మళ్లించాలని నిర్ణయించారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఎయిర్ లైన్స్ కన్సల్టెంట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని, బడా పెట్టుబడిదారులతోని పాలకులు లాలూచి పడడం వల్ల ప్రకృతికి విరుద్ధంగా ప్రాజెక్టులు వస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. -
బాధితుల్ని ఆదుకోండి: వెంకయ్య
న్యూఢిల్లీ: కేరళను ఉదారంగా ఆదుకోవాలని పార్లమెంటు ఉభయసభల స్పీకర్లు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సభ్యులందరూ తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సాయం చేయాలని కోరారు. సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో ఉపరాష్ట్రపతి వెంకయ్య భేటీ అయ్యారు. ఎంపీలందరూ ఓ నెల జీతాన్ని విరాళంగా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఉభయసభల స్పీకర్లు కోరారు. కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. మానవుల కారణంగా లేదా ప్రకృతి ప్రకోపం వల్ల విపత్తులు సంభవించినప్పుడు నిబంధనల ప్రకారం ఒక్కో పార్లమెంటు సభ్యుడు గరిష్టంగా రూ.25 లక్షల వరకూ కేటాయించవచ్చని తెలిపారు. అదే తీవ్ర విపత్తు సంభవిస్తే గరిష్టంగా రూ.కోటి వరకూ సాయం చేయొచ్చని వెల్లడించారు. -
సామాన్యులే రియల్ హీరోలు
వారంతా సాధారణ ప్రజలు. ఇతరులకు సాయం చేయడానికి కోట్లకొద్దీ డబ్బు లేదు. చేతిలో అధికారం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అవసరమైన అధునాతన పరికరాలు లేవు. ఉన్నదల్లా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయాలనే సంకల్పం. ఆ ఆశయంతోనే ఎంతోమంది సాధారణ ప్రజలు ముందుకు కదిలారు. వారిలో పదేళ్లు కూడా నిండని పిల్లలు, జైలు ఖైదీలూ ఉన్నారు. అలాంటి కొందరు స్ఫూర్తిప్రదాతల గురించి తెలుసుకుందాం. కిడ్డీ బ్యాంక్ ఇచ్చేసింది.. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 9 ఏళ్ల అనుప్రియ సైకిల్ కొనుక్కోవాలనే లక్ష్యంతో చాలా రోజుల నుంచి ఒక్కో రూపాయీ పోగేస్తోంది. రూ.9,000దాకా ఆమె కిడ్డీ బ్యాంక్లో పోగయ్యాయి. అదే సమయంలో టీవీల్లో కేరళ ప్రజల దైన్యాన్ని చూసి చలించిపోయింది. సైకిల్ కొనుక్కోడానికి దాచిన నగదంతా సహాయక కార్యక్రమాలకు పెద్ద మనసుతో ఇచ్చేసింది ఈ చిన్నారి. ఈ విషయం తెలుసుకున్న హీరో సైకిల్స్ సంస్థ బాలికపై ప్రశంసలు కురిపించింది. మానవత్వానికి అనుప్రియను ప్రతీకగా అభివర్ణించిన హీరో సైకిల్స్.. ఆమె జీవితాంతం ఏడాదికొక సైకిల్ను అనుప్రియకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మత్స్యకారుల మానవీయత చేపల వేట కోసం రోజూ సముద్రంలోకి వెళ్లే గంగపుత్రులు వారు. లోతైన నీటిలోనూ ఎలాంటి బెరుకూ లేకుండా ఈదడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తమకు తెలిసిన విద్యతో కేరళలో వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడాలని వారు తలచారు. అనుకున్నదే తడవుగా సొంత ఖర్చుతోనే తమ పడవలను ట్రక్కుల్లోకి ఎక్కించి తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరారు. వారిలో ఎక్కువగా త్రివేండ్రానికి చెందినవారే ఉన్నారు. మత్స్యకారుల సాయం గురించి తెలుసుకున్న కొందరు ట్రక్కు డ్రైవర్లు, యజమానులు.. వారి పడవలను ఉచితంగానే రవాణా చేశారు. పతనం తిట్ట, ఎర్నాకుళం, త్రిస్సూర్ సహా అనేక చోట్ల మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయక సిబ్బంది తాము చేరుకోలేమంటూ చేతులెత్తేసిన చోటుకి కూడా జాలరులు వెళ్లి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కేపీ జైసాల్ అనే మత్స్యకారుడు ఇలా బలగాలకు సాధ్యంకాని చోటుకు కూడా చేరుకుని తన వీపును మెట్టుగా మార్చి ముగ్గురు మహిళలను బోటులోకి ఎక్కించి రక్షించడం మనకు తెలిసిందే. ఈ నిజమైన హీరోల సేవలను గుర్తించిన సీఎం విజయన్.. వారందరికీ ఒక కొత్త బోటుని, సహాయక చర్యల్లో పాల్గొన్నన్ని రోజులకూ రోజుకు రూ. 3 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. నిరాశ్రయులకు ఖైదీల చపాతీలు వరదల్లో నిరాశ్రయులుగా మారిన వారికి ఆహారం అందించేందుకు త్రివేండ్రం పూజాప్పురలో ఉన్న కేంద్ర కారాగారంలోని ఖైదీలు తీవ్రంగా శ్రమించారు. మంచినీటి సీసాలతోపాటు దాదాపు 50 వేల చపాతీలను ఖైదీలతో తయారు చేయించి జైలు అధికారులు సహాయక బృందాలకు అందజేశారు. నీటిలో చిక్కుకుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారికి హెలికాప్టర్ల నుంచి జారవిడిచేందుకు తమ చపాతీ ప్యాకెట్లు బాగా ఉపయోగపడ్డాయని అధికారులు చెప్పారు. 2015లో చెన్నైలో వరదల సమయంలోనూ ఇదే జైలు నుంచి 50 వేల చపాతీలను పంపారు. సాధారణ రోజుల్లోనూ ఖైదీలు చపాతీతోపాటు శాకాహార, మాంసాహార వంటకాలను తయారుచేసి త్రివేండ్రంలో ‘ఫ్రీడమ్’ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. ప్రేమతో.. ఫేస్బుక్ దళం 2015లో చెన్నై వరదల సమయంలో సహాయక కార్యక్రమాల కోసం పురుడుపోసుకున్న ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ప్రస్తుతం కేరళలో సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నాడు 9 మందితో ప్రారంభమైన ఈ గ్రూప్లో నేడు వేలాది మంది ఉండగా దాదాపు 2,000 మంది సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆ గ్రూప్ పేరే ‘అన్బోదు కొచ్చి’ (ప్రేమతో కొచ్చి). కొచ్చిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలోనే ఈ గ్రూప్లోని 500 మంది ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి నిరాశ్రయులకు పంపించే పనిలో ఉన్నారు. బిస్కెట్లు, రస్క్, వంట పాత్రలు, దుస్తులు తదితరాలను ప్యాక్ చేసి సహాయక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ దళాల ద్వారా అవసరమైన వారికి అందిస్తున్నారు. కొచ్చిలో ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరంలో భోజనం చేస్తున్న ఓ వరదబాధిత చిన్నారి -
పునరావాసమే సవాల్!
తిరువనంతపురం/కొచ్చి: వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులకు పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం సవాల్గా మారింది. తిండి, నీరు, తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారుల ముందు అతిపెద్ద సమస్యగా నిలిచింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారు. మరోవైపు, పలుప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే కార్యక్రమాలు సాగుతున్నాయని సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ డీఆర్ సోనీ పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా ఇంకెవరు చిక్కుకుని ఉన్నారనే విషయం తెలుసుకుని.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘అందరినీ కాపాడి పూర్తి పునరావాసం కల్పించడంపైనే దృష్టిపెట్టాం’ అని ఆయన తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన కనీస సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు దాదాపుగా ముగిసినట్లేనని వైస్ అడ్మిరల్ గిరీశ్ లుథారా పేర్కొన్నారు. అక్కడక్కడ చిక్కుకుని ఉన్నవారిని గుర్తించామని వారిని కాపాడేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సహాయక చర్యలు ముమ్మరం ఇళ్లపైకప్పుల పైన, మిద్దెల పైన నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. ఎవరైనా రాకపోతారా.. కాపాడకపోతారా అనే ఆశతో తిండితిప్పల్లేకుండా ఆశగా ఎదురుచూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని శాటిలైట్ ఫోన్ల ద్వారా చేరుకుంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎర్నాకులం జిల్లా పరూర్లో ఆదివారం రాత్రి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు అందరినీ క్షేమంగా పునరావాస కేంద్రాలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, రాళ్లురప్పలు తొలగించే పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. నేవల్ ఎయిర్బేస్, కొచ్చి పోర్టు ద్వారా.. కొచ్చి నేవల్ ఎయిర్బేస్లో వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరునుంచి సరుకులతో వచ్చిన విమానం సోమవారం ఉదయం ఎయిర్బేస్లో ల్యాండైంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 26వరకు విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి సహాయసామాగ్రి కోసం ఈ ఎయిర్బేస్నే వినియోగించనున్నారు. మరోవైపు, కేరళ పోర్టుకు కూడా వివిధ రాష్ట్రాలనుంచి సముద్రమార్గం ద్వారా సహాయ సామగ్రి రవాణా మొదలైంది. ముంబై నుంచి 800 టన్నుల స్వచ్ఛమైన నీరు, 18 టన్నుల సరుకుతో నేవల్షిప్ ఐఎన్ఎస్ దీపక్ చేరుకుందని కొచ్చి పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. పోర్టునుంచే పునరావాస కేంద్రాలకు ట్రక్కుల్లో ఈ సామగ్రిని పంపిస్తున్నారు. మరోవైపు, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరో భారీ సరుకుల నౌక వల్లార్పదం పోర్టుకు చేరుకుంది. మరోవైపు, ముంబై నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన భారీ నౌకలో 50వేల మెట్రిక్ టన్నుల ఇంధనం కూడా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సహాయక కార్యక్రమాలు, ట్రక్కుల కోసం భారీగా ఇంధనం అవసరమైన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ నౌకను పంపించింది. అటు, తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ట్రయల్రన్ తర్వాత సహాయకసామగ్రిని తరలించేందుకు ఈ ట్రాక్ కీలకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు, తిరువనంతపురం నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలకు రైలు సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. సాయం అందుతోంది! వరదకోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.3కోట్లు, అస్సాం ప్రభుత్వం రూ.3కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. అటు, రూ.10 కోట్ల సాయం అందించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2,500 టన్నుల బియ్యాన్ని ప్రత్యేక రైల్లో కేరళకు పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 100 మెట్రిక్ టన్నుల ధాన్యాలు, 52 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులను సోమవారం కేరళకు పంపించింది. దీంతోపాటుగా 2,600 మెగావాట్ల విద్యుత్ను అందించేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) కేరళలో వరద పరిస్థితి, అందుతున్న సాయంపై సమీక్ష నిర్వహించింది. తలచుకుంటేనే భయమేస్తోంది: బాధితులు అటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారు కూడా భవిష్యత్తును తలచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరదలకు ముందుపరిస్థితి నెలకొనడం ఎలాగనేదే పెద్ద సమస్యంటున్నారు. ‘మళ్లీ ఇళ్లకు వెళ్లాక మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. సర్వం నష్టపోయాం. మా ఇళ్లను కట్టుకునేందుకు తగినంత సాయంకావాలి’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పునరావాస కేంద్రాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. చాలాచోట్ల కనీస వసతులు కూడా ఇంకా ఏర్పాటుచేయలేదు. ఎర్నాకులంలోని ఓ కేంద్రంలో ఓ చిన్నారికి తట్టు (చికెన్ పాక్స్) సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లతో చికిత్సనందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చల్లేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ కొరత కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రండి.. కాపాడుకుందాం: కేంద్రం పిలుపు వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘విషాదకరమైన మానవత్వ సంక్షోభం’లో ఉన్న కేరళను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు విజ్ఞప్తి చేశారు. సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకోవడం లేదని.. సహాయం చేయడం, చేసేవారిని కలుపుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, సీఐఐ, ఫిక్కీ వంటి వ్యాపార సంస్థలు తదితరులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. అటు కేరళనుంచి వివిధ ప్రాంతాలకు విమానచార్జీలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన కంపెనీలు మానవతాధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అటు, కేరళ సాధారణస్థితికి చేరుకునేందుకు వందలు, వేల సంఖ్యలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అవసరమని మరో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. జాతీయవిపత్తుగా గుర్తించబోం: కేంద్రం న్యూఢిల్లీ: కేరళలో వరద విలయాన్ని తీవ్రమైన విపత్తుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ‘కేరళలో వరదల తీవ్రత, కొండచరియలు విరిగిపడిన ఘటనలను, జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాం’ అని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రకృతి ప్రకోపాన్ని అరుదైన/తీవ్రమైన విపత్తుగా గుర్తించినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో సహాయం అందుతుంది. ఎన్డీఆర్ఎఫ్ నిధి నుంచి అదనపు సాయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3:1 నిష్పత్తితో విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్)ను ఏర్పాటుచేస్తారు. ఈ నిధిలో డబ్బులు తగ్గినపుడు నేషనల్ కెలామిటీ కంటిన్జెన్సీఫండ్ (100%కేంద్ర నిధులు) నుంచి సాయం అందిస్తారు. తీవ్రమైన విపత్తు ప్రకటించిన ప్రాంతాల్లో బాధితుల రుణాల చెల్లింపులో వెసులుబాటు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశాన్ని చూస్తారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించబోమని కేరళ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ఈ విషయం తెలిపింది. ‘కేరళ విపత్తు తీవ్రమైనది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ఆధారంగా దీన్ని లెవల్ 3 విపత్తుగా గుర్తించాం. ఎంత పెద్ద విపత్తు ఎదురైనా ఈ నిబంధనల ఆధారంగానే కేటగిరీలు నిర్ణయిస్తాం. కేరళ వరదల విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించబోవడం లేదు’ అని పేర్కొంది. తగ్గిన కర్ణాటక వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలో నాలుగురోజులుగా బీభత్సం సృష్టించిన వరద తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో పర్యాటకుల బుకింగ్స్ను రద్దుచేసి నిరాశ్రయులకు గదులు కేటాయించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కో కుటుంబానికి రూ.3,800 చొప్పున మధ్యంతర సహాయం అందించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అలువా జిల్లాలో అంటువ్యాధులు సోకకుండా మందుల పంపిణీ కొచ్చి ఆడిటోరియంలో బాధితుల కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేస్తున్న వాలంటీర్లు -
కేరళకు 500 టన్నుల బియ్యం
సాక్షి, హైదరాబాద్: వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు వెంటనే 500 టన్నుల బియ్యం పంపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆధికారులను ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేసేందుకు బియ్యం పంపాలని కేరళ నుంచి విజ్ఞప్తి వచ్చిన వెంటనే కేసీఆర్ స్పందించారు. రూ.25 కోట్ల నగదుతో పాటు నీటిశుద్ధి (ఆర్వో) యంత్రాలను, పౌష్టికాహారాన్ని పంపినందుకు కేరళ సీఎం పినరయి విజయన్ సీఎం.. తెలంగాణ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. విజయన్ ఈ మేరకు కేసీఆర్కు సోమవారం లేఖ రాశారు. కేరళ అధికారులు కూడా తెలంగాణ అధికారులతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. కేరళకు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలంగాణ అధికారులు చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్తో కేసీఆర్ మాట్లాడారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ అధికారులు కేరళకు రూ.కోటి విలువైన 500 టన్నుల బియ్యం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల విరాళం ప్రకృతి విపత్తు ధాటికి అతలాకుతలమైన కేరళకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం ముందుకొచ్చింది. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు ఒక రోజు వేతనానికి తక్కువ కాకుండా కేరళకు వితరణ ఇవ్వాలని నిర్ణయించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి ఈ మొత్తాన్ని పంపాలని నిర్ణయించారు. కేరళ ప్రజల సహాయ, పునరావాస పనుల్లో తమ వంతుగా సాయం చేయాలని తీర్మానించినట్లు ఐఏఎస్ అధికారుల సంఘం గౌరవ కార్యదర్శి నవీన్మిట్టల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. టీజీవోల వితరణ రూ.10 కోట్లు కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు ఒక్కరోజు జీతాన్ని ప్రకటించారు. టీజీవో గౌరవ చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, టీజీవో నేతలు సత్యనారాయణ, ఎంబీ కృష్ణయాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, రాజ్కుమార్గుప్తా తదితరులు ఈ మేరకు దాదాపు రూ.10 కోట్ల చెక్కును సీఎస్ ఎస్కే జోషికి అందజేశారు. ప్రకృతి విపత్తు సమయాల్లో తెలంగాణ ఉద్యోగులు ఎప్పుడూ ముందుంటారని మమత పేర్కొన్నారు. ఐపీఎస్ల ఒకరోజు వేతన విరాళం కేరళ వరద బాధితులకు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులంతా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు అధికారుల సంఘం కార్యదర్శి, నగర కమిషనర్ అంజనీకుమార్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో 97మంది అధికారులు పనిచేస్తున్నారని, వారి ఒకరోజు వేతనం సుమారు రూ.10లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ విరాళం మొత్తం ప్రభుత్వం ద్వారా కేరళ రాష్ట్ర రిలీఫ్ ఫండ్కు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘రెవెన్యూ’ సాయం రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది కేరళ ప్రజలను ఆదుకునేందుకు తమవంతు సాయాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. తహసీల్దార్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు రాష్ట్రంలో పనిచేస్తున్న అందరు రెవెన్యూ సిబ్బంది తరఫున ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కూడా ఒకరోజు వేతనాన్ని ప్రకటించారు. దీంతో రెవెన్యూ శాఖలోని ఉద్యోగులకు ఒకరోజు వేతనంగా వచ్చే దాదాపు రూ.1.5కోట్లు కేరళకు విరాళంగా అందనుంది. అండగా తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల నెల రోజుల వేతనాన్ని కేరళకు విరాళంగా ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నెల వేతనాన్ని కేరళ సహాయ నిధి కోసం రాజీవ్ వెల్ఫేర్ ఫౌండేషన్కు పంపుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి సోమవారం గాంధీభవన్లో మీడియాతో వెల్లడించారు. జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు తలా లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు. -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆపన్నహస్తం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న కేరళవాసులకు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఓవైపు సాంకేతికంగా సహకారం అందిస్తూ, మరోవైపు బాధి తులకు అవసరమైన దుస్తులు, ఇతర వస్తు సామగ్రిని సమకూర్చే పనిలో నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ విభాగంతోపాటు, కేరళకు చెందిన విద్యార్థులు పాలుపంచుకుం టున్నారు. చెన్నై, ముంబై, బెంగళూరుల్లోని తమ మిత్ర బృందాలను భాగస్వాములను చేస్తున్నారు. 30 వేల మంది ఫోన్ నంబర్లు వరద బాధితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు కేరళ ఐటీ విభాగం ‘కేరళ రెస్క్యూ డాట్కామ్’పేరిట ఓ వెబ్సైట్ ఏర్పాటు చేసింది. వేలాది మంది వరద బాధితులు తమను ఆదుకోవాలంటూ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ వెబ్సైట్ నుంచి ఐఐటీ హైదరాబాద్కు చెందిన కొందరు కేరళ విద్యార్థులు సుమారు 30 వేల మంది వరద బాధితుల ఫోన్ నంబర్లు సేకరించారు. ఈ నంబర్లను గ్రూపులుగా విభజించి ఐఐటీ హైదరాబాద్తోపాటు, ముంబై, బెంగళూరు, చెన్నైలోని తమ మిత్ర బృందాలకు పంపించారు. క్లాస్ రూమ్ను కాల్ సెంటర్గా మార్చుకున్నారు. ఒక్కో సభ్యుడు కనీసం 50 నుంచి వంద మంది బాధితులతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే బాధ్యతను తీసుకున్నారు. బాధితులతో నేరుగా సంభాషణ బాధితులతో ఫోన్లో సంభాషిస్తున్న విద్యార్థులు.. వారి వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు, రెస్క్యూ బృందాలతో సమన్వయం చేస్తున్నారు. గత గురువారం ఒక్కరోజే తాము ఏడు వేల మంది బాధితులతో సంభాషించినట్లు ఐఐటీహెచ్ విద్యార్థిని అనఘ ‘సాక్షి’కి వెల్లడించారు. సెల్ ఫోన్ నెట్వర్క్ కొన్నిచోట్ల దెబ్బతినడంతో బాధితులను అందరినీ చేరుకోలేకపోయినట్లు విద్యార్థి బృందం తెలిపింది. గత గురువారం నుంచి ఆదివారం వరకు మొత్తంగా సుమారు 30 వేల మందిని సంప్రదించగలిగామని చెప్పారు. విరాళాలు, సామగ్రి సేకరణ ఓ వైపు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరేలా చూస్తూనే, మరోవైపు బాధితులకు ధన, వస్తు రూపంలో సాయం అందించడంపైనా విద్యార్థులు దృష్టి సారించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లోని 12 హాస్టళ్లతోపాటు సిబ్బంది నుంచి ఇప్పటి వరకు 2.50 లక్షలకు పైగా రూపాయాలను విరాళాలు సేకరించి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. అంతేకాకుండా విద్యార్థులు, సిబ్బంది నుంచి రూ.4 లక్షలకు పైగా విలువ చేసే దుస్తులు, ఔషధాలు, సెల్ఫోన్ చార్జర్లు, టార్చ్లైట్లు, బ్లాంకెట్లు, చెప్పులు తదితర సామగ్రిని సేకరించారు. ఈ వస్తువుల నాణ్యతను సరిచూసిన తర్వాతే ప్యాక్ చేస్తుండటం విశేషం. కొచ్చిలో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ వస్తువులను వరద బాధితులకు అందేలా ఏర్పాటు చేసినట్లు కణ్ణన్ అనే విద్యార్థి తెలిపారు. నిరంతరాయంగా సంప్రదించాం.. కేరళ వరదలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టింగులతో అప్రమత్తమయ్యాం. వెంటనే బృందాలుగా ఏర్పడ్డాం. కేరళ ప్రభుత్వ వెబ్సైట్కు కుప్పలు తెప్పలుగా వస్తున్న అభ్యర్థనలను స్వీకరించి, ఫోన్ల ద్వారా బాధితులను నిరంతరాయంగా సంప్రదిస్తూ వచ్చాం. గత నాలుగు రోజుల్లో కనీసం 30 వేల మంది బాధితులను మా బృందం ఫోన్ ద్వారా సంప్రదించి, వారి వివరాలను కంట్రోల్ రూమ్, రెస్క్యూ బృందాలకు అందిస్తూ వచ్చింది. ఎవరెవరు, ఎక్కడెక్కడ చిక్కుకున్నారో చెబుతూ, బాధితులు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేంత వరకు ఫాలో అప్ చేస్తూ వచ్చాం. – అనురాగ్ అశోకన్, ఐఐటీహెచ్ ఉద్యోగి మా శ్రమకు ఫలితం దక్కింది పతనందిట్ట, తిరువల్లూరు తదితర ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉంది. పథనంథిట్ట జిల్లాలోని మా సొంతూరు కోజెన్చెర్రిలో ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. మా మందుల దుకాణం కూడా మునిగిపోయింది. అక్కడి ఆస్పత్రిలోని రోగులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటూ అభ్యర్థనలు అందాయి. మా బృందం సాయంతో వారిని రక్షించాం. వేలాది మందిని ఫోన్లో సంప్రదించి వరదల నుంచి బయట పడేలా చూశాం. ప్రాంతాలకు అతీతంగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు మాకు సహకరిస్తున్నారు. మా శ్రమకు ఫలితం దక్కింది. – దివిజ, రీసెర్చ్ అసోసియేట్, ఐఐటీహెచ్ -
కష్టాల్లో అన్నం పెట్టిన ఊరు.. వ్యాపారం చేసుకోలేను!
మనకెదురైన ఇబ్బంది మనలోని సామర్థ్యాన్ని బయటపెడితే ఎదుటి వాళ్లకు వచ్చిన కష్టం మనలోని మానవత్వాన్ని చూపెడుతుంది. ఈ నిజాన్ని ప్రకృతి వైపరీత్యాలెన్నో రుజువు చేశాయి. ఇప్పుడు కేరళ వరదలూ ఆ దృశ్యాలను చూపెడుతున్నాయి. వందేళ్ల కనివినీ ఎరుగని వరదలు కేరళను ముంచేస్తున్నాయి. దాదాపు 400 మందిని మింగేశాయి. ఇంకెంతోమంది జాడను గల్లంతు చేశాయి. ప్రకృతి చేస్తున్న ఆ బీభత్సాన్ని ఆపలేం. చేతుల్లో ఉన్నది.. సాయం చేయడమే. చేయందించి ఒడ్డుకు లాగడమే. ఆ పని రెస్క్యూ టీమ్ చేస్తోంది. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్న పిల్లాడిని గుండెలకత్తుకొని... వరదపోటుకి కూలిపోతున్న బ్రిడ్జి మీద నుంచి పరిగెత్తి... ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడిన రెస్క్యూ ఆఫీసర్ కన్నయ్య కుమార్ సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే... ఇంకో పేరు వినిపిస్తోంది.. మనిషీ కనిపిస్తున్నాడు. ఆయన విష్ణు కఛ్వా. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. వ్యాపార నిమిత్తం కేరళలోని కన్నూర్ జిల్లా, ఇరిట్టీలో ఉంటున్నాడు భార్య, ఇద్దరు పిల్లలతో. నెలలో రెండుసార్లు హరియాణాకు వెళ్లి అక్కడి నుంచి బ్లాంకెట్స్ తెచ్చి ఇరిట్టీ, చుట్టుపక్కల ఊళ్లలో ఇంటింటికీ తిరిగి వాటిని అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే ఈసారీ వెళ్లాడు హర్యానా దుప్పట్లు తేవడానికి. వెళ్లేముందు అంతా బాగానే ఉంది. దుప్పట్ల బేరం అయ్యాక హరియాణాలో రైలు ఎక్కి ఇక్కడ దిగేదాకా తెలియదు అంతా మునిగిపోయిందని. హతాశుడయ్యాడు. ఇల్లు, పొలం, పుట్రా, గొడ్డు, గోదా ఉన్న కుటుంబాలన్నీ దిక్కులేని వాళ్లయ్యారని, ఎక్కడో రెస్క్యూ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారని తెలిసి విలవిల్లాడాడు. వానకు తడిసి.. చలితో వణికిపోతున్న ముసలివాళ్లు, పిల్లలు కళ్లల్లో మెదిలారు. తను చేయదగ్గదొక్కటే.. బ్యాగ్లో ఉన్న బ్లాంకెట్స్ను వాళ్లకు అందివ్వడమే. వెంటనే కన్నూరు కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి విషయం చెప్పాడు. అతని వివరాలు, జీవనాధారం అన్నీ తెలుసుకున్న కలెక్టర్.. ‘‘వీటిని పంచేస్తే నువ్వెలా బతుకుతావు.. వద్దు’’ అని సున్నితంగా వారించాడు. ‘‘నాకు అన్నం పెట్టిన ఊరు, ఉండడానికి చోటిచ్చిన నా మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల బాధలతో నేను వ్యాపారం చేసుకోలేను సర్.. నేను చేయగలిగింది ఇదొక్కటే.. దయచేసి ఈ దుప్పట్లను వాళ్లకు ఇచ్చేయండి’’ అన్నాడట నీళ్లు నిండిన కళ్లతో బ్యాగ్ను కలెక్టర్ చేతుల్లో పెడుతూ. ఆ మాటలకు కలెక్టర్తో పాటు అక్కడున్న ప్రభుత్వ సిబ్బంది కళ్లూ చెమ్మగిల్లాయి. విష్ణును తీసుకొని అప్పుడే తెరిచిన అడిచుకూట్టి స్కూల్ శిబిరానికి వెళ్లాడు కలెక్టర్. విష్ణు చేతుల మీదుగానే ఆ దుప్పట్లను ఇప్పించాడు. అంత వైపరీత్యానికి విష్ణుది ఉడుత సాయమే కావచ్చు.. కానీ అది చేయూతనివ్వడానికి ముందుకొచ్చే వాళ్లకు అది కొండంత స్ఫూర్తి! మదరసా నిలిచింది.. అంతా బాగా ఉన్నప్పుడు.. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నప్పుడు.. మనిషి, మనిషికీ మధ్య కులం, మతం, డబ్బు అన్నీ అడ్డుగోడలవుతాయి. వీటిని కూలగొట్టడానికేనేమో ప్రకృతి ఇలాంటిది సృష్టిస్తుంది అనిపిస్తోంది కోజికోడ్ జిల్లాలోని మదరసాను చూస్తుంటే. ఆ జిల్లాలోని హిందువులందరికీ ఆశ్రయమిస్తూ రక్షిస్తోంది ఈ మదరసానే! మనుషుల్లాగే ఉందాం.. అంతా బాగున్నప్పుడు కూడా! మానవత్వాన్ని నిద్రలేపడానికి వైపరీత్యాల అవసరం మనకొద్దు! కష్టానికి చలించడం మన నైజం. దాన్నెప్పుడూ జీవంతోనే ఉంచుదాం! -
డేంజర్ బెల్స్
-
కేరళ వరదలు : వచ్చిన విరాళాలెన్నంటే..
దైవభూమిగా.. ఎల్లప్పుడూ పచ్చని వాతావరణంతో పరిమళ్లిలే కేరళ... ప్రకృతి ప్రకోపానికి కకావికలమైంది. భారీ వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారింది. ఈ మలయాళ రాష్ట్రంలో మరణ మృదంగం మోగింది. ఎటుచూసినా నీరే... ఎక్కడచూసినా సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులే. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలమంది దుర్మరణం పాలయ్యారు. లక్షలాదిమంది గూడులేక నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో కేరళ ఇలాంటి జలప్రళయాన్ని కనీవినీ ఎరుగదు. ఈ ప్రకృతి విలయతాండవానికి ప్రభావితమైన కేరళను ఆదుకోవడానికి దేశదేశాల నుంచి విరాళాలు కదలివస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి... దిగ్గజ కంపెనీలు, వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు తోచినంత సహాయం చేస్తూ కేరళ ప్రజలను ఆదుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కేరళ కోసం భారీ ఎత్తున్న విరాళాల సేకరణ జరుగుతోంది. వారికి కావాల్సిన దుస్తులు, ఆహారాన్ని కూడా సహాయక బృందాలు, ఎన్జీవోల ద్వారా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేరళకు ఎంతమేర విరాళాలు వచ్చాయో ఓ సారి చూద్దాం.. 1. జల విలయంతో కకావికలమైన కేరళకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.500 కోట్ల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హోం శాఖ మంత్రి రాజ్నాథ్ ప్రకటించిన రూ.100 కోట్లకు ఇది అదనం. అలాగే, కేరళ వరదల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున; తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ప్రధాని మోదీ నష్టపరిహారం ప్రకటించారు. 2. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ సీఎంతో మాట్లాడిన కేజ్రీవాల్ వరదల గురించి తెలుసుకుని, ఆయన చలించిపోయి తనవంతుగా ‘కేరళ సీఎం రిలీఫ్ ఫండ్’కు ఈ ఆర్థిక సాయం చేశారు. అంతేకాక ఆప్ ఎంఎల్ఏలు, ఎంపీల నెల వేతనాన్ని కేరళకే విరాళంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎంఎల్ఏలు కూడా నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ.10 కోట్లు ఇచ్చారు. ఇక.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేరళ వరద సాయాన్ని రెట్టింపు చేశారు. గతంలో ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సీఎం.. మరో ఐదు కోట్ల రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు 8 కోట్ల విలువచేసే పాలిథీన్ షీట్స్ పంపించారు. అలాగే 244 మంది అగ్నిమాపక దళ సిబ్బందిని, 75 బోట్లను ప్రత్యేక విమానంలో కేరళకు తరలించారు. 3. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రకృతి ప్రకోపానికి అల్లకల్లోలమైన కేరళకు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.10 కోట్లు, పుదుచ్చేరి కోటి రూపాయలు, జార్ఖండ్ రూ.5 కోట్లు, మహారాష్ట్ర రూ.20 కోట్లు, గుజరాత్ రూ.10 కోట్లు, పంజాబ్ రూ.10 కోట్లు, తెలంగాణ రూ.25 కోట్లు, బిహార్ రూ.10 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ.5 కోట్లు, ఉత్తరాఖండ్ రూ.5 కోట్లు, చత్తీష్గఢ్ రూ.3 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.10 కోట్లు, కర్నాటక రూ.10 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.10 కోట్లు, మణిపూర్ రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. 4. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన నెల జీతాన్ని వరద ప్రభావిత రాష్ట్రానికి అందిస్తున్నట్టు తెలిపారు. తన కొలీగ్స్కు కూడా ఇదే సూచించారు. తమిళనాడు ఐఎఎస్ అధికారులు కేరళలో వరద ఉపశమనం కోసం ఒక రోజు వేతనాలు అందజేశారు. ముస్లింలు ఈద్ బడ్జెట్లో 10 శాతాన్ని కేరళకు డొనేట్ చేయాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది. 5. తమిళనాడు రాజకీయ పార్టీ డీఎంకే కోటి రూపాయలను, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రూ.2 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు. ఇతర రాజకీయ నాయకులు కూడా కేరళకు సహాయం చేస్తున్నారు. అటార్ని జనరల్ కేకే వేణుగోపాల్ కోటి రూపాయలను, ఆయన కొడుకు, సీనియర్ న్యాయవాది క్రిష్ణన్ కూడా మరో రూ.15 లక్షలను కేరళకు విరాళమిచ్చారు. న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ కేఎం జోసెఫ్లు చెప్పుకోదగ్గ డబ్బును విరాళంగా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులంతా కూడా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఏపీ ఐఏఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. 6. రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించిన కేరళ వరద సహాయనిధి సేకరణకు విశేష స్పందన లభించింది. కేరళ వరదల బాధితులకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు సైతం తమకు తోచినంత సాయం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రోటరీ క్లబ్ రూ.4 లక్షలు, ఇంక్రిడబుల్ ఇండియా రూ.2 లక్షలు, విజయాబ్యాంక్ రూ.2 లక్షలు, ఐఏఎస్ అధికారి విజయ్కుమార్, జిల్లా జడ్జి రాధారాణిలు తమ నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. 7. కేరళను ఆదుకునేందుకు దేశవిదేశాల నుంచి దాతలు స్పందిస్తున్నారు. భారత సంతతికి చెందిన యూఏఈ వ్యాపారవేత్తలు ఆదివారం రూ.12.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ మూలాలున్న లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ఫాతిమా హెల్త్కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ రూ.5 కోట్ల చొప్పున ప్రకటించారు. యునిమొని అండ్ యూఏఈ ఎక్స్చేంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి రూ. 2 కోట్లు, అస్టర్ డీఎమ్ హెల్త్కేర్ చైర్మన్, అజద్ మూపెన్ రూ. 50 లక్షల సాయం చేశారు. 300లకు పైగా వాలంటీర్లను వైద్య సేవల నిమిత్తం అందుబాటులో ఉంచామని మూపెన్ తెలిపారు. మరోవైపు ఖతార్ చారిటీ రూ.34.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరదల్లో నిరాశ్రయులైన వారి కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు గల్ఫ్ టైమ్స్ తెలిపింది. 8. కేరళ బాధితుల కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా తన వంతు విరాళంగా 2,50,000 డాలర్లను అంటే 1.75 కోట్ల రూపాయలను ప్రకటించింది. వీటిని వరదల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల బాధితులకుఅందజేయనున్నట్టు పేర్కొంది. కమ్యూనిటీ రెసిలియన్స్ ఫండ్ గూంజ్ ద్వారా ఈ నగదును విరాళంగా అందజేస్తున్నట్టు తెలిపింది. ఇది ఢిల్లీకి చెందిన లాభాపేక్షలేని సంస్థ. 9. వరద బాధితుల కోసం ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు కోటిన్నర విలువ చేసే వస్తువులను కేరళ, కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సైన్యం చేపట్టిన సహాయక చర్యలను చూసి జాతీ గర్విస్తుందన్నారు. 10. మరోవైపు కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. విక్రమ్ 35 లక్షల సాయాన్ని ప్రకటించారు. రజనీకాంత్, కమల్హాసన్, మోహన్లాల్, మమ్ముట్టి, సూర్య, విజయ్ సేతుపతి, ప్రభాస్, మహేష్బాబు, ఎన్టీఆర్ 25 లక్షల చొప్పున ప్రకటించారు. నాగార్జున 28 లక్షలు విరాళంగా ఇచ్చారు. ధనుష్ రూ.15 లక్షలను, విశాల్, శివకార్తికేయన్ రూ.10 లక్షల చొప్పున విరాళంగా అందించారు. ఎస్బీఐ 2 కోట్లు, ఆటోమొబైల్ కంపెనీ హుందాయ్ కోటి అందించింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్చరణ్లు కలిసి 50 లక్షలతో పాటు మరో 10 లక్షల విలువైన మందులు అందించారు. కేరళ ప్రజలు ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకునే బన్నీ 25 లక్షలు ప్రకటించగా.. కల్యాణ్రామ్ 10 లక్షలు ఇచ్చారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ 3 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ లక్ష రూపాయలను, నటి రోహిణి రూ.2 లక్షలకు తమవంతు సాయంగా రిలీఫ్ ఫండ్కు అందజేశారు. ఇటీవల ఘనవిజయం సాధించిన గీత గోవిందం చిత్ర నిర్మాత బన్నీ వాసు తమ చిత్ర కేరళ వసూళ్లను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు. 11. అమ్మ ఆర్గనైజేషన్ రూ.10 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేసింది. స్టార్ ఇండియా రూ.2 కోట్లను, సన్ నెట్వర్క్ కోటి రూపాయలను, ఆసియానెట్ రూ.25 లక్షలను అందజేస్తున్నట్టు ప్రకటించాయి. స్టార్ ఇండియా ఎన్జీఓ సంస్థ గూంజ్తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని కేరళకు అవసరమయ్యే సహాయాన్ని అందిస్తోంది. 12. ఎర్నాకులం జిల్లాలోని కీజిల్లం లో ఉన్న ప్రముఖ ఆలయం దాని ట్రెజరీని సీఎండీఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చింది. మాతా అమృతానందమయి దేవి (అమ్మ) తన సంస్థ సంస్థ నుంచి రూ.10 కోట్లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి అందజేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 50వేల మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను బాధితులకు తరలించింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలో కేరళ కోసం భారీ ఎత్తున విరాళ సేకరణ జరుగుతోంది. ఆహారం, దుస్తులు, న్యాప్కీన్స్ వంటి కనీస వస్తువులను కేరళకు అందిస్తున్నారు. కేరళ ప్రజల పరిస్థితికి నలుమూలల నుంచి విరాళాలు పెద్ద ఎత్తునే తరలివస్తున్నాయి. -
కేరళ వరదలు: పెళ్లి వాయిదా వేసుకున్న నటుడు!
తిరవనంతపురం : కేరళ వరదల నేపథ్యంలో మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై తన వివాహాన్ని వాయిదా వేసుకొని మరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని తన అప్కమింగ్ మూవీ ‘షకీలా’ కోస్టార్ అయిన రిచా చాదా తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ‘నా స్నేహితుడు.. కోస్టార్ రాజీవ్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. తన హోం టౌన్ నన్నూర్లో వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడెందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాడు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను బోట్స్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. నా స్నేహితుడు చేసే పనిపట్ల గర్వంగా ఫీలవుతున్నాను’ అనే క్యాప్షన్తో అతని ఫొటోలను సైతం షేర్ చేశారు. ఇక అతని సేవలను నెటిజన్లు రియల్ సూపర్ హీరో అంటూ కొనియాడుతున్నారు. రాజీవ్ పిళ్లై ఇంజనీరింగ్ విద్యార్థి అయిన అజితాను వివాహం చేసుకోవాల్సింది.. కానీ వరదల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఇక ఇప్పటికే సినీ హీరోలు విరాళాలు ప్రకటిస్తూ కేరళ బాధితులకు అండగా నిలవాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. My friend and costar in #Shakeela , @rajeev_govinda_pillai postponed his wedding, which was to happen three days ago, in order to help out in rescue efforts in his hometown of Nannoor , Kerala. They made rafts, carried boats by road to the low lying areas, made good use of all the muscle. Bravo! 👏 . . . . . . . . . PS- apart from obvious resourceful-ness, helpfulness, I think this is when fitness comes in handy. When you’re strong, agile, you can be of use in adverse conditions. The young men and the fishermen in this town worked till late in the night to save people from the rising water. A post shared by Richa Chadha (@therichachadha) on Aug 19, 2018 at 10:17pm PDT -
ఎందుకు ఇలా అవుతోంది?
కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తడంతో కేరళ విలవిలలాడుతోంది. సాయం కోసం ఎదురుచూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇలా ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఈ సీజన్లో అత్యధిక వర్షాలు, వరదలతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రాల్లో ఈసారి కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో మేఘాలయా, అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రాల్లో వర్షాలు లేకపోవడంతో మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనీస స్థాయీ కరువే అస్సాంను వర్షాకాలంలో ఏటా వరదలు ముంచెత్తుతాయి. అయితే, ఈ ఏడాది ఆగస్టు 18 వరకు 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అస్సాంలో సాధారణ వర్షపాతం 1088.5 మిల్లిమీటర్లు. ఇప్పటివరకు కురిసింది 759.3 మి.మీ. మాత్రమేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మణిపూర్లో 66 శాతం, అరుణాచల్ప్రదేశ్లో 46 శాతం, మేఘాలయాలో 43 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో 28 శాతం, 23 శాతం, 10 శాతం తక్కువగా నమోదయ్యాయి. అత్యధిక వర్షపాతం కల్గిన మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాల్లోని మాసిన్రం, సోహ్రాల్లో ఈ సీజన్లో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదు అవ్వడం గమనార్హం. తేమశాతం తగ్గిపోవడం వల్లే.. నైరుతీ రుతుపవనాల కాలంలో ఈశాన్య ప్రాంతంలో వీస్తున్న గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉంటోంది. పశ్చిమ బంగాళాఖాతంలో తరుచుగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా పశ్చిమం నుంచి దక్షిణ దిశగా గాలులు వీయడంతో తేమ శాతం తగ్గిపోతోందని ప్రాంతీయ వాతావరణ శాఖకు చెందిన ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా కురవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎగువ అస్సాంలోని నార్త్ లక్ష్మిపూర్లో రెండు రోజుల క్రితం 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రీజియన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇక్కడ సాధారణం కంటే 6.2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. తేమతో కూడిన మేఘాలు లేకపోవడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని ప్రాంతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. నైరుతీ రుతుపవనాలు జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని కావున సీజన్ ఇంకా ముగియలేదని, అయితే ఈసారి సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. -
కేరళ వరదలు : తీవ్ర విపత్తుగా గుర్తించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేరళను వణికించిన వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులు కాగా, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వరద బీభత్సం కేరళను అతలాకుతలం చేయడంతో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేరళ వరద పరిస్థితిని గుర్తించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. వరదలతో 247 మంది మరణించారని, 17 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, వేలాది ఎకరాల పంట నీటమునిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలతో పాటు స్వయంగా ప్రధాని, హోంమంత్రి కేరళ వరద పరిస్థితిని సమీక్షించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. దీంతో కేరళలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో దీన్ని తీవ్ర ప్రకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రకటనతో కేరళకు ఇతోధిక సాయంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలకు ముమ్మరంగా చేపట్టేందుకు కేంద్రం అన్ని విధాలా చొరవ చూపనుంది.పలు రాష్ట్రాలు ఇప్పటికే పెద్ద ఎత్తున సాయం ప్రకటించగా, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు కష్టసమయంలో కేరళకు బాసటగా నిలుస్తామంటూ తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటించారు. -
కేరళకు విరాళం : ఫేస్బుక్ ఎంత ఇచ్చిందో తెలుసా?
తిరువనంతపురం : ప్రకృతి విలయతాండవానికి కకావికలమైన కేరళీయులను ఆదుకునేందుకు.. ప్రపంచమంతా కదలివస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి... దిగ్గజ కంపెనీలు, వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు తోచినంత సహాయం చేస్తూ కేరళ ప్రజలను ఆదుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కేరళ కోసం భారీ ఎత్తున్న విరాళాల సేకరణ జరుగుతోంది. వారికి కావాల్సిన దుస్తులు, ఆహారాన్ని కూడా సహాయక బృందాలు, ఎన్జీవోల ద్వారా తరలిస్తున్నారు. కేరళ బాధితుల కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా తన వంతు విరాళంగా 2,50,000 డాలర్లను అంటే 1.75 కోట్ల రూపాయలను ప్రకటించింది. వీటిని వరదల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల బాధితులకుఅందజేయనున్నట్టు పేర్కొంది. కమ్యూనిటీ రెసిలియన్స్ ఫండ్ గూంజ్ ద్వారా ఈ నగదును విరాళంగా అందజేస్తున్నట్టు తెలిపింది. ఇది ఢిల్లీకి చెందిన లాభాపేక్షలేని సంస్థ. గత కొన్ని రోజులుగా ఫేస్బుక్, కమ్యూనిటీతో కలిసి ప్రజలకు సహకరిస్తోంది. కకావికలమైన కేరళలో తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు లైవ్, క్రియేటింగ్ పేజీ, జాయినింగ్ కమ్యూనిటీ, ఫండ్స్ సేకరణ వంటి ఫీచర్లను ప్రజల ముందుకు తీసుకొచ్చినట్టు ఫేస్బుక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఫేస్బుక్ యూజర్లు కూడా కేరళకు ఫండ్స్ అందజేయడానికి ఈ సోషల్ మీడియా ద్వారా గ్రూప్లు, లైవ్ వీడియోలు, పేజీలను నిర్వహిస్తున్నారు. ఈ నిధులను వరద ప్రకోపానికి భారీగా ప్రభావితమైన వాటికి తరలిస్తున్నారు. ఆగస్టు 8 నుంచి కురుస్తున్న వర్షాలు దైవభూమి అయిన కేరళను అల్లకల్లోలం చేశాయి. కేరళ చరిత్రలో ఇంతటి ప్రకృతి బీభత్సాన్ని మరెన్నడూ చూడలేదు. ఇప్పటి వరకు లక్షల మంది నిరాశ్రయులు కాగ, 300మందికి పైగా మరణించారు. ఫేస్బుక్లో గ్రూప్లు క్రియేట్ చేస్తున్న వారు, బాధితుల ఎక్కడెక్కడ ఉన్నారో రెస్క్యూ టీమ్లకు తెలియజేయడంతో పాటు, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రవాణా, వైద్య సేవలను కూడా చేపడుతున్నారు. ఆగస్టు 9న ఫేస్బుక్ ‘సేఫ్టీ చెక్’ ఫీచర్ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా బాధితుల స్నేహితులు, కుటుంబ సభ్యులు వారు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. ‘హెల్ప్ అండ్ క్రిసిస్ డొనేట్ బటన్’ను కూడా సోషల్ మీడియా దిగ్గజం తన ప్లాట్ఫామ్పై ఉంచింది. ఈ ఫీచర్ ద్వారా 1300కు పైగా పోస్టులు షేర్ అయ్యారు. ఈ పోస్టుల ద్వారా బాధిత ప్రజలు తమకు కావాల్సిన ఆహారం, నీరు, రవాణా, సురక్షిత శిబిరం వంటి సహాయాలను కోరవచ్చు. క్రిసిస్ డొనేట్ బటన్ను వాడి ఇప్పటి వరకు సుమారు 500 మంది విరాళాలూ అందించారు. రెస్క్యూ టీమ్లను సంప్రదించలేని వారు, ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా తమ ప్రాణాలను కాపాడమని అభ్యర్థిస్తున్నారు. ‘కమ్యూనిటీ హెల్ప్’ అనే ఫీచర్ను కూడా 1200 మంది పైగా ప్రజలు వాడారు. ఫేస్బుక్లో జాతీయ విపత్త నిర్వహణ అథారిటీలకు, సంబంధిత రెస్క్యూ టీమ్లకు సహాయం అందించడానికీ విపత్తు మ్యాప్స్ ఫీచర్ను ఫేస్బుక్ అందిస్తోంది. -
కేరళ వరదలు సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
కేరళ వరదలు : రియల్ హీరోలు
-
కేరళ వరదలు : సర్టిఫికెట్లు లేవని యువకుడి ఆత్మహత్య
తిరువనంతపురం : కేరళను ముంచెత్తుతున్న వరదలు ఒక పంతొమ్మిదేళ్ల యువకుని భవిష్యత్తుని కూడా మింగాయి. వరదల్లో సర్టిఫికెట్లు నాశనం అయిన విషయం తట్టుకోలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కొజికోడ్కు చెందిన కైలాష్ మరి కొద్ది రోజుల్లో ఐటీఐ కోర్సులో జాయిన్ కావాల్సి ఉంది. అందుకోసం కొంత డబ్బుతో పాటు కొత్త బట్టలు కూడా కొని పెట్టుకున్నాడు. కానీ అనుకోని ప్రమాదంలా వచ్చిన వరదలు అతని ఆశల్ని చిదిమేసాయి. కేరళను ముంచెత్తిన భారీ వరదల్లో కైలాష్ నివాసం కూడా మునిగి పోయింది. దాంతో కైలాష్ తల్లిదండ్రులతో కలిసి సమీప సహాయక శిబిరానికి వెళ్లాడు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు లేవని ప్రకటించడంతో కైలాష్ ఆదివారం తన నివాసానికి చేరుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితుల చూసిన అతనికి నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ వరదల్లో కైలాష్ ఇంట్లోని వస్తువులే కాక అతని ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్లు కూడా నాశనమయ్యాయి. దాంతో మనస్తాపం చెందిన కైలాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేరళలో ఎందుకీ వరదలు?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భారీ వరదలకు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇందుకు కారణం ఏమిటని ఎవరిని ప్రశ్నించిన ‘భారీ వర్షాలు’ అని సమాధానం ఇస్తారు. భారీ వర్షాలకు కారణం ఏమిటని అడిగితే అల్పపీడనం అనో, పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వల్లనో అనో సమాధానం ఇస్తారు. ఇక వర్షాలు ఎక్కువ పడినా, తక్కువ పడినా ‘ఎల్ నైనో’ లేదా ‘లా నైనో’ ప్రభావమని ఇటు ప్రభుత్వం అటు అధికార యంత్రాంగం చెబుతోంది. ఇందులో సగం మాత్రమే ఉంది. ప్రభుత్వం విధాన లోపం కారణంగానే వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎక్కువగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆగస్టు 15 నాటికి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పడాల్సిన వర్షపాతం కన్నా మూడు రెట్లు వర్షపాతం ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రంలో కురిసిన వర్షపాతం ఎంతో ఇదుక్కి, వేయనాడ్ జిల్లాల్లో అంత వర్షపాతం కురిసింది. కేరళను ఆనుకొని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులోని ఈరోడు, నమ్మక్కల్ ప్రాంతాల్లో, కర్ణాటక కొడగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి భారీగా వరదలు వచ్చాయి. కేరళలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. సహజ సిద్ధమైన కొండలు, లోయలు ఎక్కువగా ఉండే కేరళలో ఇంత ఎక్కువ వర్షపాతం కురిసినంత మాత్రాన ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాల్సిన అవసరం లేదు. అయిన జరిగిందంటే మానవ తప్పిదమే. పాలకులు విధాన నిర్ణాయక లోపమే. 11 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన కోచి విమానాశ్రయం ఎక్కడుందంటే ఇప్పటికే ఎంతో బక్క చిక్కిన పెరియార్ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రమ్మంటే రావా? ఇక భారీ వర్షాలు కురిసిన ఈరోడు, నమ్మక్కాల్ ప్రాంతాలను తీసుకుంటే కావేరి నది ఒడ్డున కార్మికులు నిర్మించిన ఇళ్లన్ని కొట్టుకుపోయి ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కావేరి నదికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వరిపొలాలకు నీరందక రైతులు ఆందోళన చెందుతుంటే కావేరీకి వరదలొచ్చి ప్రాణ నష్టం సంభవించిందటే ఎవరి తప్పు? ఇవి ఉదాహరణలు మాత్రమే. కేరళలో కొండ చెరియలు విరిగి పడి ప్రాణ నష్టం సంభవించడానికి క్వారీలు కారణం. ఇటు క్వారీలు, అటు నదీ ప్రవాహాల పక్కన జనావాసాలు, మానవ నిర్మాణాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. -
పైలట్ హిరోచితం.. ఇంటిపై హెలికాప్టర్ ల్యాండింగ్..
-
వైరల్: ఇంటిపై ల్యాండింగ్.. పైలట్ హిరోచితం
తిరవనంతపురం: కేరళ వరద బాధితులను ప్రాణాలకు తెగించి రక్షించాడు ఓ పైలట్. మూడు సెకండ్లు ఆలస్యమైతే ఆ హెలికాప్టర్ ముక్కముక్కలయ్యేది. కానీ ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి 26 మందిని రక్షించాడు. ఈ థ్రిల్లింగ్ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చాలకుడి ప్రాంతంలోని వరదల్లో చిక్కుకున్న వారి కోసం పైలట్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. నావీకి చెందిన 42బీ హెలికాప్టర్ను ఇంటిపై(రూఫ్టాప్) చాకచక్యంగా ల్యాండ్ చేసి 26 మంది ప్రాణాలను రక్షించాడు. మూడు సెకన్లు ఆలస్యమైతే అందరి ప్రాణాలు గాల్లోకలిసేవి. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ డేర్డెవిల్ పైలట్ సాహాసాన్ని అందరూ కొనియాడుతున్నారు. ‘ఆ ఇంటిపై హెలికాప్టర్ బరువు పడకుండా కేవలం టైర్లు మ్రాతమే ఉండేలా ల్యాండ్ చేశా. 8 నిమిషాల్లో సహాయ సిబ్బంది ఆ 26 మందిని హెలికాప్టర్లోకి ఎక్కించేశారు.’ ఆ వెంటనే టేకాఫ్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఏదైన జరగకూడనిది జరిగితే అని ప్రశ్నించగా.. ‘ఓ మూడు సెకన్లు ఆలస్యమైతే హెలికాప్టర్ ముక్కలవుతోందని తెలుసు. అది నాకు కఠిన సవాల్. కానీ నేను తీసుకునే నిర్ణయం సరైనదేనని నమ్మాను. ఇలాంటి పరిస్థితుల్లో పైలట్ అవసరమెంటో తెలుస్తోంది.’ అని చెప్పుకొచ్చారు. A daredevil rescue operation carried out by naval Seaking helicopter piloted by Lt Cdr Abhijeet Garud on Friday #KeralaFloods #KeralaFloodRelief pic.twitter.com/BQpkJAeszi — S Anandan (@Anandans76) August 18, 2018