krishna delta
-
ఆ 45 టీఎంసీలూ ఏపీవే
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి మళ్లించే 80 టీఎంసీలకుగాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మిగిలే 45 టీఎంసీల కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కే దక్కుతాయని కేడబ్ల్యూడీటీ–2కు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ (ఏకే) గోయల్ స్పష్టం చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు ఆ 45 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని చెప్పారు. జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 విచారణ శుక్రవారం కొనసాగింది. ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి ఏకే గోయల్ను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాకు గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నందున నాగార్జున సాగర్ నుంచి ఆ మేరకు కృష్ణా డెల్టాకు విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చు కదా అంటూ తెలంగాణ న్యాయవాది అడిగిన ప్రశ్నలకు తగ్గించుకోవచ్చునని గోయల్ చెప్పారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించిన సంవత్సరంలో మాత్రమే.. సాగర్ నుంచి విడుదల చేసే నీటిని తగ్గించుకోవచ్చునని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించే ఒప్పందం 1978 ఆగస్టు 4న ఉమ్మడి రాష్ట్రంలోనే బేసిన్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిందన్నారు. గోదావరి జలాలను మళ్లించే ప్రాంతం, మళ్లించిన జలాలను వినియోగించుకునే ప్రదేశం రెండూ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నందున.. మళ్లించిన గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కే దక్కాలని తేల్చిచెప్పారు. గోదావరి నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్లో 45 టీఎంసీల లభ్యత అదనంగా ఉందన్నది వాస్తవమేనా అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా.. ఆ అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చాలని గోయల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)లను గుర్తించలేదని తెలిపారు. ఎస్సెల్బీసీ పూర్తయ్యేంత వరకూ ఏఎమ్మార్పీ ద్వారా నీటిని వాడుకోవచ్చునని, ఎస్సెల్బీసీ పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.మీరు రూపొందించిన ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిలో విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులను చేర్చారని, కానీ నెట్టెంపాడు ఎత్తిపోతలను ఎందుకు చేర్చలేదని తెలంగాణ న్యాయవాది అడగ్గా.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్కు మాత్రమే ఆ నియమావళిని రూపొందించానని గోయల్ చెప్పారు. జూరాల ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తరలిస్తారని ఎత్తిచూపారు. సాక్షిగా మీరు స్వతంత్రంగా వాంగ్మూలం ఇస్తున్నట్లు లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు సాక్షిగా పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారు కదా అన్న తెలంగాణ న్యాయవాది వాదనను గోయల్ తోసిపుచ్చారు.ముగిసిన సాక్షుల విచారణఏపీ ప్రభుత్వం తరఫు సాక్షిని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్, మౌఖిక వాంగ్మూలం ముగిసినట్లు ట్రిబ్యునల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2న దాఖలు చేసిన ఇంటర్లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అంగీకరించింది. తదుపరి విచారణను జనవరి 16, 17కు వాయిదా వేసింది. -
పోలవరం ఇక ఉత్త బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఆ ప్రాజెక్టు చుక్కాని అయిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి. ఈ డిజైన్ ప్రకారమే స్పిల్ వేను 55 మీటర్ల ఎత్తుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాంను పూర్తి స్థాయిలో నిర్మించి, నిర్వాసితులకు పునరావాసం కల్పించి 194.6 టీఎంసీలను నిల్వ చేయాలి.కానీ.. ప్రాజెక్టు నీటిని నిల్వ చేసే మట్టాన్ని 41.15 మీటర్లకే తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేవలం 115.44 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడిది ధవళేశ్వరం బ్యారేజి తరహాలోనే మారిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు. గోదావరిలో ప్రవాహం ఉంటేనే గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ బ్యారేజ్ ద్వారా నీటిని మళ్లిస్తారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుంది.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కలే..పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి 63.20 టీఎంసీలను తరలించి ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. అందుకే పోలవరం ఎడమ కాలువను 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారు. కానీ.. పోలవరం ప్రాజెక్టును కుదించడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నీళ్లందించడం కూటమి ప్రభుత్వం కలగా మార్చేసిందని నిపుణులు మండిపడుతున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకంపోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కుడి కాలువ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పోలవరం జలాశయాన్ని కుడి కాలువతో అనుసంధానం చేసే జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతి కోరుతూ 2022, మే 4న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించింది. కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్కు తరలించే గోదావరి జలాల్లో రెండు టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్ (వెలిగొండ) మీదుగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నీటిని సోమశిల మీదుగా కావేరికి తరలించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడంతో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమైంది. తాగు నీటికి, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బందేకమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో.. నీటి పారుదల విభాగానికి అయ్యే నిధులిస్తే చాలని 2016 సెప్టెంబరు 7న అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దాంతో తాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సాగు నీటితోపాటే తాగునీటినీ తీసుకెళ్తాం కాబట్టి తాగు నీటి విభాగానికి అయ్యే నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 28.50 లక్షల మంది దాహార్తి తీర్చడంతోపాటు విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల సరఫరాకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు కుదించడంతో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొందని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నీరుగారిపోనున్న ప్రాజెక్టు లక్ష్యాలుపోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడం ద్వారా 41.15 మీటర్లలో 115.44 టీఎంసీలు నీరే నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలే నీరుగారిపోతాయి.» నీటి మట్టం 41.15 మీటర్లకంటే ఎగువన ఉంటేనే కుడి, ఎడమ కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాలువల ద్వారా నీరందక 7.20 లక్షల ఎకరాలకు నీరందని దుస్థితి.» కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ఇందుకు 80.09 టీఎంసీలు అవసరం. ఇదే కాలువ ద్వారా కృష్ణా డెల్టాలో 13.18 లక్షల ఎకరాల స్థిరీకరణకు 84.70 టీఎంసీలు మళ్లించాలి. అంటే.. కుడి కాలువ ద్వారానే 164.79 టీఎంసీలు మళ్లించాలి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 84.80 టీఎంసీలు అవసరం. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు మళ్లించాలి. అంటే ఎడమ కాలువకు 108.24 టీఎంసీలు అవసరం. » కుడి, ఎడమ కాలువల ద్వారా పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీళ్లందిస్తున్న 2.98 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అంటే.. ప్రాజెక్టు కింద నిర్దేశించిన మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు, గోదావరి డెల్టాలో రెండో పంటకు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. » పోలవరానికి ఎగువన తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తారు. గోదావరి ఉప నదులపై ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరానికి వరద వచ్చే రోజులు కూడా తగ్గనున్నాయి. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును తగ్గించడంతో ఆయకట్టుకు నీళ్లందించం సవాలే అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
కృష్ణాడెల్టాకు సమర్థంగా నీళ్లు అందిస్తున్న విషం చిమ్మిన రామోజీ
-
Fact Check: కృష్ణాడెల్టాను ఎండబెట్టింది మీ చంద్రబాబే
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడమే పనిగా పెట్టుకున్న రామోజీ కుక్క తోకలా తన బుద్ధి కూడా వంకరేనని రామోజీరావు ఎప్పటికప్పుడు తన రాతల ద్వారా నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే.. కృష్ణాడెల్టా చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో 2019, 2020, 2021, 2022లలో ఖరీఫ్కే కాదు.. అధికారికంగా రబీ పంటకు వైఎస్ జగన్ ప్రభుత్వం సమృద్ధిగా నీళ్లందించి రైతులకు దన్నుగా నిలిచింది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల కృష్ణా బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లోనే కాదు.. కృష్ణా డెల్టాలోనూ తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలను రక్షించి.. రైతులకు దన్నుగా నిలవడానికి జలవనరుల శాఖాధికారులతో సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సమర్థవంతంగా నీళ్లందించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. పైగా.. పులిచింతల నీటికి గోదావరి (పట్టిసీమ) జలాలను జతచేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టాలో ఆయకట్టు చివరి భూములకు ప్రభుత్వం నీళ్లందిస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులను వైఎస్ జగన్ ప్రభుత్వం అధిగమిస్తూ.. సమర్థవంతంగా నీళ్లందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తుంటే రామోజీరావు అది చూసి క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. నిజాలను దాచేసి.. అభూతకల్పనలు, పచ్చి అబద్ధాలను వల్లెవేస్తూ.. ‘కృష్ణా డెల్టాను ఎండబెట్టేశారు’ అంటూ పెడబొబ్బలు పెడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే తన విషపుత్రిక ఈనాడులో రామోజీ విషం చిమ్మారు. ఇందులోని ప్రతి అక్షరంలో ఆయన అక్కసు తప్ప వీసమెత్తు నిజంలేదు. కృష్ణా డెల్టాకు 85.81 టీఎంసీలు సరఫరా.. ప్రకాశం బ్యారేజ్ కింద కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2023–2024 ఖరీఫ్ పంటలకు జూన్ 7న ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఆయకట్టులో 9.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పటివరకూ 85.81 టీఎంసీల నీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి 35.93 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా 29.88 టీఎంసీల గోదావరి జలాలు.. మున్నేరు, పాలేరు, కట్టలేరు, కీసర వాగుల ద్వారా వచ్చిన 20 టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణాడెల్టాకు అందించింది. ముందస్తు ప్రణాళికతో.. నిజానికి.. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది కృష్ణా బేసిన్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతోపాటు రాష్ట్రంలోనూ తక్కువగా వర్షాలు కురిశాయి. కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. శ్రీశైలం, నాగార్జునసాగర్లకు తగినంత నీటి ప్రవాహం రాకపోవడంతో వాటి నుంచి కృష్ణాడెల్టాకు నీటిని విడుదలచేసే పరిస్థితి ఈ ఏడాది లేదు. దీనిని ముందే గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తూ.. కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా.. ఈ సీజన్ ప్రారంభంలో పులిచింతల ప్రాజెక్టులో 38 టీఎంసీలు ఉండగా.. గోదావరిలో వరద ప్రవాహం రానంతవరకూ కృష్ణా డెల్టాలో పంటలకు పులిచింతల నుంచి 18 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో పట్టిసీమ పంపులను జూలై 21న ఆన్చేసి గోదావరి జలాలను ఎత్తిపోశారు. వాటికి పులిచింతల నీటిని జతచేసి.. కృష్ణా డెల్టాకు నీళ్లందించింది. ప్రభుత్వం దూరదృష్టితో రూపొందించిన ఈ ప్రణాళికను అమలుచేయడంవల్లే తెలంగాణలో కురిసిన వర్షాలకు మూసీ నది ద్వారా పులిచింతలలో తిరిగి 19 టీఎంసీలను నిల్వచేయగలిగింది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది. అదే పులిచింతల ప్రాజెక్టులో నీటిని ముందుగా వినియోగించుకోకపోయి ఉంటే.. మూసీ ద్వారా వచ్చిన వరద సముద్రం పాలయ్యేది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పంటలు పచ్చగా.. ► ఇక కృష్ణా బేసిన్లోనే కాదు.. కృష్ణా డెల్టాలో కూడా ఆగస్టు, అక్టోబరు నెలల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. ఇటువంటి పరిస్థితులు అరుదు. ప్రకృతి సహకరించకపోయినా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వారబందీ విధానంలో ప్రణాళికాబద్ధంగా నీటిని అందిస్తూ కృష్ణా డెల్టాలో పంటలను రక్షిస్తూ రైతులకు బాసటగా నిలబడుతోంది. ఇదీ వాస్తవం. కానీ, నీళ్లందకపోవడంవల్ల తూర్పు, పశ్చిమ డెల్టాల్లో కన్నీటి ప్రవాహం అంటూ ప్రభుత్వంపై రామోజీ ఎప్పటిలాగే తన అక్కసు వెళ్లగక్కారు. ► అలాగే, దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పంటలను రక్షించేందుకు వారబందీ విధానాన్ని అమలుచేస్తూ.. ఒక వారంపాటు సగం నిర్ధేశిత ప్రాంతాలకు.. మరో వారం మిగతా సగం నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ విధానంలో నిర్దేశిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నప్పుడు మిగతా నిర్దేశిత ప్రాంతాల్లోని కాలువల్లో ప్రవాహం ఉండదు. అప్పుడు చివరి భూములకు రైతులు ఆయిల్ ఇంజన్లతో కాలువల్లో నిలిచి ఉన్న నీటిని తోడిపోసుకుని పంటలు కాపాడుకోవడం అక్కడక్కడ జరుగుతుంది. దీన్నే భూతద్దంలో చూపించి వేలాది ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయని ‘ఈనాడు’ గగ్గోలు పెట్టింది. ► అసలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ ఒకేఒక్క పంటకు అరకొరగా నీళ్లందించారు. ఆ సమయంలో కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినా.. రైతులు నష్టపోయినా రామోజీరావు పెన్నెత్తి మాట అనలేదు. ఎందుకంటే.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కాబట్టి. కృష్ణా తూర్పునకు 52.69.. పశ్చిమానికి 33.12 టీఎంసీలు.. కృష్ణా తూర్పు డెల్టాలో 7,36,953 ఎకరాల ఆయకట్టు ఉండగా.. 5,30,136 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఈ పంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 52.69 టీఎంసీలను సరఫరా చేశారు. వారబందీ విధానాన్ని అమలుచేస్తూ ఆయకట్టుకు నీటిని సమర్థవంతంగా సరఫరా చేస్తున్నారు. ఏలూరు కెనాల్కు రోజూ 800 క్యూసెక్కుల నుంచి 1,200 క్యూసెక్కులు ఇప్పటివరకూ సరఫరా చేశారు. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు ప్రభుత్వం ఇలా అన్ని చర్యలు తీసుకుంటోంది. అలాగే.. ► కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.71 లక్షల ఎకరాలు ఆయకట్టు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉండగా.. పూర్తి ఆయకట్టులో రైతులు పంటలు సాగుచేశారు. వాటికి ఇప్పటివరకూ 33.12 టీఎంసీలు అందించారు. ► పశ్చిమ డెల్టాకు శనివారం 4,808 క్యూసెక్కులను విడుదల చేశారు. పొన్నూరు మండలం జడవల్లి గ్రామంలో టీఎస్ ఛానల్ పరిధిలోని ఆయకట్టు చివరి భూములకు శనివారం నుంచి వారబందీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. ► అలాగే, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని ఏఎం ఛానల్ పరిధిలోని ఆయకట్టుకు, బాపట్ల జిల్లాలో బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలోని ఆయకట్టుకు సోమవారం నుంచి వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తారు. ► మరోవైపు.. సీఎం జగన్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారబందీ విధానంలో నీళ్లందిస్తూ పంటలను రక్షించేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ► ఇక పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలు నిల్వఉన్నాయి. గోదావరిలో ప్రవాహాలు ఉన్నంత వరకూ పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోసి.. మరీ అవసరమైతే పోలవరం ప్రాజెక్టు రివర్ స్లూయిస్ ద్వారా నీరువదిలి.. వాటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాలో పంటలను రక్షించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది. పులిచింతలతో కృష్ణా డెల్టా సుభిక్షం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్కు ముందస్తుగా నీళ్లందించాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పులిచింతల ప్రాజెక్టును చేపట్టి.. 2009 నాటికే దానిని చాలావరకూ పూర్తిచేశారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం అప్పటి నుంచి నీటిని నిల్వచేస్తున్నారు. 2014లో పూర్తి గరిష్ఠ స్థాయి సామర్థ్యం అయిన 45.77 టీఎంసీలను నిల్వచేయవచ్చు. కానీ, అప్పటి సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం, తెలంగాణలో ఎత్తిపోతలకు పరిహారం చెల్లించకపోవడంవల్ల ప్రాజెక్టులో అరకొరగా నీటిని నిల్వచేసి.. తక్కువ నీటిని సరఫరా చేసి.. లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టి కృష్ణాడెల్టా రైతుల కడుపుకొట్టారు. కానీ, వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, తెలంగాణకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించి 2019లోనే పూర్తిస్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వచేశారు. 2020, 2021, 2022లోనూ అదే స్థాయిలో నీటిని నిల్వచేసి.. నాలుగేళ్లుగా డెల్టాలో ఏటా రెండు పంటలకు నీళ్లందించారు. అలాగే, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు సమర్థవంతంగా నీళ్లందిస్తుండటానికి ప్రధాన కారణం పులిచింతల ప్రాజెక్టే. -
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
పులిచింతల ప్రాజెక్టు గేటు బిగింపు పూర్తి
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు స్థానంలో కొత్త గేటును బిగించారు. జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ బీకెమ్ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 250 టన్నుల బరువున్న గేటును భారీ క్రేన్ల సహాయంతో అమర్చారు. స్పిల్ వే 16, 17 పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు) మధ్య గేటును దించి.. ఆర్మ్ గడ్డర్లను పియర్స్ ట్రూనియన్ బీమ్ల యాంకర్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత గేటును పైకి ఎత్తుతూ.. కిందకు దించుతూ పలుమార్లు పరీక్షించారు. గేటు పనితీరు ప్రమాణాల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జపాన్లో బుష్ల తయారీ, దిగుమతిలో జాప్యం వల్లే నాగార్జున సాగర్ నిండిపోవడంతో 2021 ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 55,028 క్యూసెక్కులను తెలంగాణ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఆ రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 2021 ఆగస్టు 5 తెల్లవారుఝామున ఏడు గేట్లను రెండడుగులు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు ఎడమ వైపు పియర్ ట్రూనియన్ బీమ్ విరిగిపోయి గేటు ఊడిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, 48 గంటల్లోనే దాని స్థానంలో స్టాప్లాగ్ గేటును ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయంలో నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు బిగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 16, 17వ పియర్లకు ట్రూనియన్ బీమ్లను కొత్తగా నిర్మించారు. గేటును కూడా సిద్ధం చేశారు. గేటును పియర్స్ మధ్య బిగించడానికి, వాటి ఆర్మ్ గడ్డర్లను ట్రూనియన్ బీమ్లతో అనుసంధానం చేసే సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. కొత్త బుష్ల తయారీలో జపాన్ సంస్థ తీవ్ర జాప్యం చేసింది. దీని వల్లే గేటు బిగింపు ఆలస్యమైంది. పది రోజుల క్రితం జపాన్ సంస్థ బుష్లను పంపడంతో అదే రోజు గేటు బిగింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం పూర్తి చేశారు. కృష్ణా డెల్టాకు వరం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటకు సకాలంలో నీటిని విడుదల చేసి.. తుపానులు వచ్చేలోగా పంట కోతలు పూర్తయ్యేలా చేయడం ద్వారా రైతుకు దన్నుగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 నవంబర్ 18న పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 20,37,656 క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు సులభంగా విడుదల చేసేలా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. స్పిల్వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2019 ఆగస్టులోనే పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ కృష్ణా డెల్టాలో రెండు పంటలకు సకాలంలో నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. -
నీటి ఎద్దడి నివారణపై 80 దేశాల సదస్సు
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అజెండాతో నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజీ) 25వ అంతర్జాతీయ సదస్సు (ఇంటర్నేషనల్ కాంగ్రెస్) నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఐసీఐడీ ఉపాధ్యక్షుడు, 25వ కాంగ్రెస్ నిర్వాహక కార్యదర్శి కె.యల్లారెడ్డితో కలిసి మంత్రి అంబటి రాంబాబు ఐసీఐడీ 25వ కాంగ్రెస్, ఆ సంస్థ 74వ ఐఈసీ (ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సమావేశం బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రతిష్టాత్మక సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు. ఐసీఐడీలో సభ్యత్వం ఉన్న 80 దేశాలకు చెందిన సుమారు 400 నుంచి 500 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సుమారు 500 నుంచి 600 మంది సాంకేతిక నిపుణులు సైతం సదస్సులో పాల్గొంటారన్నారు. నీటి ఎద్దడిపైనే ఫోకస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నీటి ఎద్దడిని యాజమాన్య పద్ధతుల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవడమే అజెండాగా 1951లో భారత్ ప్రోద్బలంతో ఐసీఐడీ ఏర్పాటైందని మంత్రి రాంబాబు చెప్పారు. తొలుత 11 సభ్య దేశాలతో ప్రారంభమైన ఐసీఐడీ ఇప్పుడు ప్రపంచంలో నీటిపారుదల, డ్రెయినేజీ వ్యవస్థలున్న 80 దేశాలు సభ్యులుగా ఉన్నాయన్నారు. ప్రతి మూడేళ్లకు ఓసారి ఐసీఐడీ సమావేశమై నీటి యాజమాన్య పద్ధతులపై మేధోమథనం చేసి నీటిఎద్దడిని ఎదుర్కోవడంపై ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఐసీఐడీ 6వ కాంగ్రెస్ 1966లో మన దేశంలో జరిగిందని, 57 ఏళ్ల తర్వాత ఆ సంస్థ 25వ కాంగ్రెస్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తుండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, సదస్సును విజయవంతం చేయడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా డెల్టాకుగోదావరి జలాలు పులిచింతలలో నిల్వ చేసిన నీటితో ఇన్నాళ్లూ కృష్ణా డెల్టాకు నీళ్లందించామని మంత్రి రాంబాబు చెప్పారు. ప్రస్తుతం పులిచింతలలో నీటి నిల్వ 17.41 టీఎంసీలకు చేరుకుందని, కృష్ణాలో వరద ప్రవాహం రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పంపులను రీస్టార్ట్ చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. నాలుగేళ్లలో ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే పట్టిసీమ ఎత్తిపోతలను వాడుకున్నామని గుర్తు చేశారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువకు 5 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానించాలా? లేదంటే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారని తెలిపారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ డయా ఫ్రమ్ వాల్పై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి చెప్పారు. ఐసీఐడీ 25వ కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శి కె.యల్లారెడ్డి మాట్లాడుతూ నీటి యాజమాన్యంలో మెరుగైన పద్ధతులు పాటించిన దేశాలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందచేస్తామని తెలిపారు. -
చివరికంటా.. సిరుల పంట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి కాలువలకు బుధవారం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం విజయవాడలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో డెల్టాకు జూలై నెలలో సాగు నీరు విడుదల చేసేవారు. దీంతో పంట కోత సమయంలో తుపానుల గండంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దీంతో పాటు రెండో పంట ఆలస్యమై గణనీయంగా దిగుబడులు తగ్గేవి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గత ఏడాది జూన్10వ తేదీన సాగు నీటిని విడుదల చేసింది. ఈ ఏడాది ఇంకా ముందుగానే సాగునీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టాకు సంబంధించి ఐదు జిల్లాల పరిధిలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కృష్ణా తూర్పు డెల్టాకు సంబంధించి కృష్ణా జిల్లా పరిధిలో 5.62 లక్షల ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 1,757 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 34.76 టీఎంసీల నీరు ఉంది. నీటి లాసెస్ పోను 29.76 టీఎంసీ నీరు అందుబాటులో ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు నీరు జూన్ నెలకు 6.90 టీఎంసీలు, జూలై నెలకు 27.60 టీఎంసీ అవసరం అని లెక్కించారు. గత ఏడాది నీటి వినియోగం ఇలా.. గత ఏడాది సకాలంలో వర్షాలు కురవటం, ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరటంతో ఆయకట్టుకు నీటిని పుష్కలంగా విడుదల చేశారు. గత ఏడాది ఖరీఫ్, రబీ, తాగునీటి అవసరాలకు సంబంఽధించి 194.62 టీఎంసీల నీటిని వినియోగించారు. ఇందులో కృష్ణా తూర్పు డెల్టాకు 118.21 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 76.41 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గత ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ సముద్రంలోకి 1,331.14 టీఎంసీలు వెళ్లాయి. పనులు పూర్తి.. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టు 16వ గేటుకు సంబంధించిన రూ. 8.64 కోట్లతో చేపట్టే పనులు తుది దశకు చేరాయి. ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి అంచనాలు రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. కృష్ణానది కరకట్ట రక్షణ గోడకు సంబంధించి రెండు దశల పనులు పూర్తి అయ్యాయి. మూడో దశ పనులు పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మవారధి వరకు రూ.138.80కోట్లతో శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణా నదిలో పూడికతీత పనులు చేపట్టారు. ఇప్పటికే కాలువ మరమ్మతులు, పూడిక తీత, తుడికాడ తొలగింపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాగు సంబరం.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు సంబరంగా మారింది. గతంలో సాగునీటి కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. రెండేళ్లుగా నైరుతి కంటే ముందుగానే కాలువలకు నీటిని విడుదల చేసి సాగు పనులు ముమ్మరం అయ్యేలా, సాగునీటికి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. – కంచర్ల వెంకటరావు, రైతు, కోలవెన్ను సకాలంలో సాగునీరు.. ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తోంది. గతేడాది కూడా సాగుకు ముందుగానే కాలువలకు సాగునీరు విడుదల చేసింది. ఈ ఏడాది కూడా సాగునీరు విడుదలకు చర్యలు తీసుకున్నారు. కాలువనీటిపై ఆధారపడి సాగు అధికంగా ఉంటుంది. వ్యవసాయ పనులు ఊపందుకోవటానికి మంచి అవకాశం. – మసిముక్కు సాంబశివరావు, రైతు, దావులూరు రెండు జిల్లాల్లో ఆయకట్టు ఇలా.. ప్రధాన కాలువ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఆయకట్టు జిల్లా ఆయకట్టు (ఎకరాల్లో) (ఎకరాల్లో) బందరు కాలువ 1.51లక్షలు – కేఈబీ కాలువ 1.38లక్షలు – ఏలూరు కాలువ 0.56లక్షలు 1332 రైవస్ కాలువ 2.17లక్షలు 425 మొత్తం 5.62లక్షలు 1,757 నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో 5.62 లక్షల ఎకరాలకు పైగాఆయకట్టు గత ఏడాది 194 టీఎంసీల నీటి వినియోగం -
పులిచింతల ప్రాజెక్టు: పాత పాపాలే శాపాలు!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నిర్వాకాలు పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులనూ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడా లేని రీతిలో ఆర్బిట్రేషన్ నిబంధనను ఈ కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చడం ద్వారా బొల్లినేని ఆదిలోనే ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు బాటలు వేశారు. డిజైన్ మారడం వల్ల చేసే పని పరిమాణం పెరిగితే.. అందుకు అదనంగా బిల్లులు చెల్లించేందుకు సర్కార్ అంగీకరించకుంటే ఆర్బిట్రేషన్ (వివాదాల పరిష్కార మండలి)కి పంపుతారు. ఈ కాంట్రాక్టు ఒప్పందంలో ఆర్బిట్రేషన్లో ఒక సభ్యుడిని బొల్లినేని, మరొక సభ్యుడిని జలవనరుల శాఖ, ఇంకో సభ్యుడిని ఆ ఇద్దరూ ఎన్నుకునేలా నిబంధన చేర్చడం గమనార్హం. ఈలోగా 2004 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆర్బిట్రేషన్ను అడ్డుపెట్టుకుని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టే వరకూ పులిచింతల ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత పనులను పరుగులు పెట్టించారు. ఆర్బిట్రేషన్ను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం బొల్లినేని రామారావు చీటికిమాటికీ పేచీ పెడుతుండటంతో జలవనరుల శాఖలో చేపట్టే పనుల్లో ఆ నిబంధనను వైఎస్సార్ రద్దు చేశారు. పనుల్లో జాప్యం వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంట్రాక్టర్ పేచీకి దిగడంతో ఆర్బిట్రేషన్ సూచనల మేరకు రూ.5.65 కోట్ల పరిహారాన్ని అప్పట్లో సర్కార్ చెల్లించింది. అయినప్పటికీ ఆర్బిట్రేషన్ నిబంధనను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం మరోసారి పేచీ పెట్టారు. పులిచింతల స్పిల్వేను 500.25 మీటర్లు పెంచారని.. గేట్లను 32 నుంచి 24కు తగ్గించారని.. భూసేకరణలో జాప్యం వల్ల ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలని.. ఇలా 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో బొల్లినేని కోరారు. దీన్ని పరిశీలించిన డీఏబీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రతిపాదనలు చేశారు. మొత్తమ్మీద రూ.199.96 కోట్లను అదనంగా చెల్లించాలంటూ 2013 అక్టోబర్ 3న ప్రతిపాదించారు. డీఏబీ–2 ప్రతిపాదనలను ముగ్గురు ఐఏఎస్లతో నియమించిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీకి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి పంపారు. కాంట్రాక్టర్కు గరిష్టంగా రూ.72 కోట్లను చెల్లించడానికి నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. కోర్టులో కేసును నీరుగార్చి... లోపాయికారీగా సహకరించి తన ప్రభుత్వాన్ని రక్షించిన చంద్రబాబు సూచనల మేరకు పులిచింతల కాంట్రాక్టర్కు అదనపు నిధులు ఇవ్వాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఒత్తిడి చేయడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో న్యాయ వివాదాలు తలెత్తడంతో మచిలీపట్నం కోర్టు పులిచింతల కాంట్రాక్టర్కు అదనపు బిల్లుల చెల్లింపుపై సుదీర్ఘ విచారణ జరిపింది. కాంట్రాక్టర్ ప్రస్తావించిన 27 అంశాలను తిప్పికొట్టేలా సమర్థ వాదనలు వినిపించకుండా గత సర్కారు అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా కాంట్రాక్టర్కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు 2016 జూన్ 2న తీర్పిచ్చింది. దాని ప్రకారం రూ.199.96 కోట్లను 2013 అక్టోబర్ 3 నుంచి 15% వడ్డీతో కాంట్రాక్టర్కు చెల్లించాలి. వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.399.34 కోట్లకు చేరుకుంది. రూ.199.67 కోట్లు దోచిపెట్టిన చంద్రబాబు.. మచిలీపట్నం కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు అనుమతించాలంటూ 2016 జూన్ 2 నుంచి 2018 అక్టోబర్ 1 వరకూ జలవనరుల శాఖ అధికారులు పలుదఫాలు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, నాటి మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిపాదనలు పంసినా న్యాయ సలహా పేరుతో కాలయాపన చేశారు. చివరకు వ్యూహాత్మకంగా 2018 అక్టోబర్ 23న హైకోర్టును ఆశ్రయించడానికి గత సర్కార్ అనుమతి ఇచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయకుండా 766 రోజులు ఏం చేశారంటూ నాడు హైకోర్టు ప్రశ్నించింది. కేసును విచారించాలంటే కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అంటే రూ.199.67 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఈమేరకు 2019 జనవరి 1న టీడీపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తాన్ని ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు చూపకుండానే డ్రా చేసుకున్న బొల్లినేని–చంద్రబాబు ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున వెదజల్లినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బొల్లినేని ఇలా చంద్రబాబు దన్నుతో ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లే పులిచింతల 16వ గేటు ఊడిపోయిందని స్పష్టమవుతోంది,. -
తెలంగాణ ఏజీపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సీజే
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి.. కృష్ణా డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి ఆయన తప్పుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా కేసులను విచారించే న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా? ప్రాంతీయ భావంతో చూస్తారా? అంటూ మండిపడ్డారు. న్యాయస్థానం ప్రథమ కోర్టు అధికారైన అడ్వొకేట్ జనరల్ న్యాయమూర్తుల నిజాయితీని అనుమానిస్తూ... ఉద్దేశాలను ఆపాదిస్తూ అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేసులను ఏ న్యాయమూర్తి విచారించినా మెరిట్స్ మీద వాదనలు వినిపించాలే తప్ప... న్యాయమూర్తులకు ఇలా నీచమైన, హీనమైన ఉద్దేశాలను ఆపాదించరాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34 ఆధారంగా విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల ప్రాజెక్టు నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని, దీంతో తమ సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందంటూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణ ప్రసాద్, ఎం.వెంకటప్పయ్య దాఖలు చేసిన పిటిషన్ను ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో... ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని సీజే పేర్కొన్నారు. తదుపరి విచారణను రెండుమూడు రోజుల్లో తెలియజేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఏజీ అభ్యంతరం.. సీజే ఆగ్రహం మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం కేసుల విచారణ ప్రారంభించగానే అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై.. నీటిపారుదల ప్రాజెక్టుల కేసులను ఇదే(సీజే) ధర్మాసనం విచారించాలని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అభ్యంతరం వ్యక్తం చేసినా.. జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్ను విచారిస్తోందని చెప్పారు. అక్కడ విచారించకుండా ఇక్కడికి బదిలీ చేసేలా చూడాలని కోరారు. జస్టిస్ రామచందర్రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి విచారించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిందని రైతుల తరఫున సీనియర్ న్యాయవా ది వేదుల వెంకటరమణ నివేదించారు. దీంతో జస్టిస్ హిమాకోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో ఊహించుకొని నిజాయితీ, నిబద్ధత కల్గిన న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోవాలని ఎలా కోరతారంటూ ఏజీపై మండిపడ్డారు. న్యాయమూర్తికి ప్రాంతీయ భావాన్ని అంటగడుతూ దాఖలు చేసిన పిటిషన్ను వెంటనే ఉపసంహరించుకోవాల ని ఆదేశించారు. న్యాయమూర్తులెవరికీ వ్యక్తిగత ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉండవని, మెరిట్స్ ఆధారంగా తీర్పులిస్తారని స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై పిటిషన్లను తమ ధర్మాసనం, రాష్ట్ర పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందన్నారు. డెల్టా రైతుల పిటిషన్లో ఈ రెండు అంశాలు ఉన్నందున ఏ ధర్మాసనం విచారించాలన్న దానిపై సందేహం తలెత్తిందని, వివరణ తీసుకునేందుకు రిజిస్ట్రీ అధికారులకు తగిన సమయం ఇవ్వాల్సిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోరం హంటింగ్ (నచ్చిన ధర్మాసనానికి బదిలీ కోసం) చేస్తున్నట్లుగానే మీరు ఆఘమేఘాల మీద విచారణ చేయాలని ఎందుకు కోరారని, రిజిస్ట్రీకి కొంత సమయం ఇవ్వాల్సిందంటూ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా విచారణ ఆపాలని కోరుతూ తన ముందు ప్రస్తావించిన విషయాన్ని జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ధర్మాసనానికి తెలియజేసి విచారణ ఆపాలని కోరాలని సూచించారు. ఈ పిటిషన్ను ఏ ధర్మాసనం విచారించాలన్నది తేలుస్తామన్నారు. ఈ కేసు ఫైల్ను తన ముందుంచాలని రిజిస్ట్రీ అధికారులను ఆదేశించారు. సీజే సూచన మేరకే విచారించాం... జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్పై విచారణను ప్రారంభించగానే.. సీజే ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణను ఆపాలని సూచించారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘ఈ విషయంపై మాకు సమాచారం లేదు. సోమవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజిస్ట్రీ అధికారులు విషయాన్ని సీజేకు తెలియజేశారు. ఈ పిటిషన్పై సీజే సమాచారం ఇచ్చిన తర్వాతే విచారించాలని నిర్ణయించాం. మీ అభ్యంతరాలను తోసిపుచ్చి విచారణ ప్రారంభించాం. పిటిషన్ విచారణార్హతపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదావేశాం. ఒకసారి విచారణ ప్రారంభించిన తర్వాత మళ్లీ మరో ధర్మాసనానికి పంపాలని కోరడం ఏంటి?’అని జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేయాలని, అప్పటిలోగా సమాచారం వస్తుందని ఏజీ తెలిపారు. భోజన విరామం తర్వాత ఈ పిటిషన్ను రిజిస్ట్రీకి పంపాలని సీజే సూచించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వెంకటరమణ నివేదించారు. ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పేర్కొంటూ ఈ పిటిషన్ను రిజిస్ట్రీకి పంపాలని ఆదేశించింది. -
కృష్ణా డెల్టాకు జలభద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు మరింత జల భద్రత చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 23 కి.మీ. ఎగువన ఇబ్రహీంపట్నం మండలం దామలూరు వద్ద కృష్ణా నదిపై పది టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. 2020–21 ధరల ప్రకారం ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ బ్యారేజీ ద్వారా మున్నేరు, కట్టలేరు, పాలేరు వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు అమరావతి, తుళ్లూరు తదితర మండలాల ప్రజలకు తాగునీటి అవసరాలను ఈ బ్యారేజీ ద్వారా తీర్చాలని నిర్ణయించింది.. ఈ బ్యారేజీ కమ్ రోడ్డు బ్రిడ్జి ద్వారా గుంటూరు–హైదరాబాద్ల మధ్య 45 కి.మీ.ల దూరం తగ్గుతుంది. దామలూరు బ్యారేజీ జలరవాణాకు, పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దామలూరు బ్యారేజీ ఎందుకంటే.. కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. అయితే దీని తరువాత కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి వరకూ దాదాపు 163 కి.మీల పొడవున నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు లేదు. ప్రకాశం బ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీటిని మళ్లించడంతోపాటు గుంటూరు, విజయవాడ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ బ్యారేజీపైనే ఆధారపడుతున్నారు. పులిచింతలకు దిగువన మున్నేరు, పాలేరు, కట్టలేరు వాగులు కృష్ణాలో కలుస్తాయి. ఇవి తరచూ ఉప్పొంగి ప్రవహిస్తాయి. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఈ వరద జలాలు కడలిపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదను ఒడిసి పట్టడం కోసం దామలూరు వద్ద పది టీఎంసీలతో బ్యారేజీ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. బ్యారేజీ కమ్ రోడ్ బ్రిడ్జి.. కృష్ణా నదిపై దామలూరు వద్ద 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,245 మీటర్ల పొడవున స్పిల్వేతో బ్యారేజీని నిర్మించేలా జలవనరుల శాఖ అధికారులు డిజైన్ రూపొందించారు. ఎడమ వైపు 1,695 మీటర్లు, కుడి వైపున 122.14 మీటర్ల పొడవున బ్యారేజీకి అనుబంధంగా మట్టికట్ట నిర్మిస్తారు. బ్యారేజీలో గరిష్టంగా 27 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేస్తారు. బ్యారేజీలోనే జలరవాణాకు వీలుగా నావిగేషన్ లాక్లను ఏర్పాటు చేస్తారు. బ్యారేజీ బ్రిడ్జిపై రెండు వరుసలతో రహదారి నిర్మించి గుంటూరు–హైదరాబాద్ హైవేతో అనుసంధానం చేస్తారు. బ్యారేజీ సివిల్ పనులకు రూ.738.463 కోట్లు, మెకానికల్(గేట్లు, హైడ్రాలిక్ హాయిస్ట్లు) పనులకు రూ.204.363 కోట్లు, నిర్వహణకు రూ.5.473 కోట్లు వెరసి దాదాపు రూ.948.30 కోట్లు వ్యయం అవుతుంది. జీఎస్టీ రూపంలో రూ.136.81 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ముంపునకు గురయ్యే 10,673 ఎకరాల భూసేకరణకు రూ.1,069.58కోట్లు, ఇతర పనులకు రూ.14.31 కోట్లు వెరసి సుమారు రూ.2,169 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి అంచనాలను రూపొందించారు. ఆర్థిక శాఖ ఆమోదముద్ర లభించగానే పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఏపీ: కొల్లేరు, కృష్ణా డెల్టాపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి ఆయకట్టుకు మళ్లించడం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా రూ.75,724 కోట్ల వ్యయంతో కొత్తగా 51 ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుల పనులు ప్రణాళికాయుతంగా పూర్తి చేసేందుకు ఐదు స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుల పనుల వ్యయంలో 70 శాతాన్ని జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమీకరిస్తుండగా మిగతా 30 శాతం నిధులను బడ్జెట్ ద్వారా కేటాయించి ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. శ్రీశైలానికి వరద సమయంలోనే.. కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాభావ పరిస్థితులు, ఎగువన ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద 35 నుంచి 40 రోజులకు తగ్గిపోయింది. అది కూడా ఒకేసారి గరిష్టంగా వస్తోంది. ఈ నేపథ్యంలో వరద వచ్చే రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా ఎత్తిపోతలు, కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రభుత్వం కొత్తగా చేపట్టింది. అవసరమైన చోట కొత్తగా ప్రాజెక్టుల పనులు చేపట్టింది. మొత్తమ్మీద 32 ప్రాజెక్టులను రూ.43,203 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆరీ్డఎంపీడీసీ)ను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..: పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలించడం ద్వారా ఉత్తరాంధ్రలో కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాండవ–ఏలేరు అనుసంధానం ద్వారా 57,065 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పనులను చేపట్టేందుకు ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టŠస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(యూఏఐడీసీ) పేరుతో ఎస్పీవీ ఏర్పాటైంది. దీని ద్వారా రూ.8,554 కోట్ల వ్యయంతో మొత్తం నాలుగు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. దుర్భిక్ష పల్నాడుకు దన్ను..: గోదావరి, వరికపుడిశెలవాగు వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష పల్నాడును సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు, వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా వాగు వరద నీటిని తరలించడం ద్వారా పల్నాడును సుభిక్షం చేసే పనులను చేపట్టేందుకు పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఏడీఎంసీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద ఆరు ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి రూ.8,276 కోట్లతో అనుమతి ఇచ్చింది. గోదావరి వరదతో రాష్ట్రానికి జలభద్రత.. గోదావరి వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాథమికంగా పోలవరం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించే పనులను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పనులను మొత్తం మూడు విభాగాలుగా చేపట్టడానికి రూ.12,707 కోట్ల వ్యయం కానుందని అంచనా. వాటిని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టŠస్(ఏపీఎస్డబ్ల్యూఎస్డీపీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా డెల్టా, కొల్లేరు పరిరక్షణే ధ్యేయం..: కృష్ణా డెల్టా, కొల్లేరు సరస్సులను ఉప్పు నీటి బారిన పడకుండా చేయడం ద్వారా వాటికి జీవం పోసే పనులను అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు, వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల, కొల్లేరు పరిరక్షణ పనులను చేపట్టేందుకు కృష్ణా–కొల్లేరు సెలైనిటి మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద రూ.2,989 కోట్లతో ఆరు ప్రాజెక్టులను చేపట్టనుంది. -
‘అప్పర్ భద్ర’కు జాతీయ హోదా?
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు ‘అప్పర్’ గండం ముంచుకొస్తోంది..! అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండా.. కనీసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తుంగభద్ర బోర్డుకు సమాచారం ఇవ్వకుండా కర్ణాటక సర్కారు చేపట్టిన ‘అప్పర్ భద్ర’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీ 2018 – 19 ధరల ప్రకారం అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో అనుమతి ఇచ్చింది. తాజా ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.21,450 కోట్లుగా ఉంది. అప్పర్ భద్రకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ కమిటీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన మరుక్షణమే అప్పర్ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కుతుంది. ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రమే అందజేస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోకుండానే అప్పర్ భద్రకు ఇప్పటికే సాంకేతిక అనుమతి ఇచ్చిన కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి జాతీయ హోదా కల్పించే ప్రక్రియను వేగవంతం చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో తుంగభద్ర సబ్ బేసిన్(కే–8)లో కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేటాయించిన 295 టీఎంసీల కంటే కర్ణాటక ఇప్పటికే అధికంగా వాడుకుంటోంది. కర్ణాటకకు టీబీ డ్యామ్ (తుంగభద్ర జలాశయం)కు ఎగువన 151.74 టీఎంసీలు కేటాయిస్తే 176.96 టీఎంసీలను వాడుకుంటున్నట్లు కేడబ్ల్యూడీటీ – 2 సైతం తేల్చి చెప్పింది. అప్పర్ భద్ర ద్వారా 29.40 టీఎంసీలను ఎత్తిపోసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కర్ణాటక చెబుతున్నా ఆ స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించాలంటే కనీసం 55 టీఎంసీలు అవసరమని, అదే స్థాయిలో నీటిని తరలించేలా కర్ణాటక ప్రాజెక్టును చేపట్టిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సీజన్లో భద్ర డ్యామ్లో నిల్వ చేసిన నీటితో కలుపుకొంటే కర్ణాటక వంద టీఎంసీలకు పైగా వినియోగించుకుందని సీడబ్ల్యూసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కర్ణాటక జలదోపిడీ వల్ల ఇప్పటికే టీబీ డ్యామ్లో నీటి లభ్యత తగ్గిందని, ఇక అప్పర్ భద్ర పూర్తయితే ఏపీలో దుర్భిక్ష రాయలసీమలో హెచ్చెల్సీ (ఎగువ కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువతోపాటు తెలంగాణలో ఆర్డీఎస్ కింద వెరసి 6.52 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తుంగభద్ర నుంచి వరద తగ్గడం శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఆగమేఘాలపై అప్పర్ భద్ర.. అప్పర్ భద్ర ప్రాజెక్టును 2014లో చేపట్టిన కర్ణాటక జాతీయ హోదాకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను 2015లోనే సాధించింది. ఈ అనుమతులతో సంబంధం లేకుండానే పనులు చేపట్టి 2019 మే నాటికే రూ.4,830 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. ఆ తర్వాత సాంకేతిక అనుమతి కోసం కేంద్ర జల సంఘానికి దరఖాస్తు చేసుకుంది. 2020 ఆగస్టు 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే ఆమోదముద్ర వేసింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన అప్పర్ భద్ర స్వరూపం ఇదీ.. ► తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజూ 1,342 క్యూసెక్కుల చొప్పున 17.4 టీఎంసీలను 80 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి 11.263 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా భద్ర జలాశయంలోకి తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి జూన్ నుంచి అక్టోబర్ మధ్య రోజుకు 2,308 క్యూసెక్కుల చొప్పున 29.90 టీఎంసీలను ఎత్తిపోసి 47.50 కి.మీ. (అజాంపుర వద్ద 6.9 కి.మీ. సొరంగంతో సహా) పొడవున తవ్వే కెనాల్ ద్వారా తరలిస్తారు. ► భద్ర జలాశయం నుంచి తవ్వే ప్రధాన కాలువ 47.5 కి.మీ. వద్ద రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా చిత్రదుర్గ, జగల్పూర్, తుమకూర్ బ్రాంచ్ కెనాల్లోకి నీటిని ఎత్తిపోసి చిక్మగళూర్, చిక్బళాç్ల³Nర్, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో 2,25,515 హెక్టార్ల (5,57,247 ఎకరాలకు) ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో 367 చెరువులను నింపి ఆయకట్టును స్థిరీకరిస్తారు. లెక్కలు.... కాకి లెక్కలే! ‘కేడబ్ల్యూడీటీ – 1 కేటాయించిన నీటిలో పది టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల 6.25 వెరసి 23 టీఎంసీలు మిగిలాయి. ఇక కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటా 2.40 టీఎంసీలు, మిగులు జలాలు ఆరు టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీలు కాగా ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటాం’ అని కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీకి అందచేసిన డీపీఆర్లో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అయితే తుంగ, భద్ర, విజయనగర ఛానల్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని తుంగభద్ర బోర్డు అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నీటి కంటే కర్ణాటక అధికంగా వినియోగిస్తున్నట్లు కేడబ్ల్యూడీటీ–2 కూడా పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు నీటి లభ్యతపై కర్ణాటక చెప్పేవన్నీ కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. -
భద్రంగా కట్టుకోండి!
కర్ణాటక జలదోపిడీకి సంపూర్ణ సహకారం ఇచ్చేలా కేంద్రం నిర్ణయాలు చేస్తోంది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించి, అభ్యంతరాలను పట్టించుకోకుండా... ఏకపక్షంగా కొమ్ముకాస్తోంది. కేటాయింపులకు మించి నీటి వాడకాన్ని ప్రతిపాదిస్తూ కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలని కేంద్ర జల్శక్తి శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో కర్ణాటక ఎడాపెడా నీటిని తోడేస్తే... దిగువనున్న తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలున్నాయి. సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర జలాల గరిష్ట నీటి వినియోగమే లక్ష్యంగా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ చేసిన నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్– 2 అవార్డు నోటిఫై కాకముందే, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వడ మే తప్పుగా పరిగణిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా జా తీయ హోదాకు సిఫారసు చేయడం తెలుగు రా ష్ట్రాలకు మింగుడు పడని అంశంగా మారింది. ప్ర ధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది ఆమోదంతో జాతీయ హోదా దక్క నుంది. ఈ లాంఛనం పూర్తయితే ప్రాజెక్టు వ్యయా న్ని కేంద్రమే భరిస్తుంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే దిగువ తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, దీన్ని కేం ద్రం విస్మరించడం, ఏకపక్షంగా నిర్ణయాలు చేయడంపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తన అభ్యంతరాలతో త్వరలోనే కేంద్ర జల్శక్తి శాఖకు లేఖ రాయనుంది. ఎగువనే నీటిని అడ్డుకునేలా... కర్ణాటక ఇప్పటికే తుంగభద్ర డ్యామ్లో నిల్వ సామర్థ్యం తగ్గిందని చెబుతూ, ఆ నష్టాన్ని పూడ్చేలా 31.15 టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. తుంగభద్ర కు భారీ వరద ఉన్నప్పుడు ఆ నీటిని వరద కాల్వ ద్వారా కొత్త రిజర్వాయర్కు తరలిస్తామని, దీనికి అనుబంధంగానే శివపుర, విఠలపుర చెరువుల ని ల్వ సామర్థ్యాలను పెంచుతామని, ఈ 3 రిజర్వాయర్ల కింద కలిపి మొత్తంగా 52 టీఎంసీల నీటిని వినియోగిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో దిగువకు వరద ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయ ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కర్ణాటక విన డం లేదు. దీనిపై రాష్ట్రం.. కేంద్రానికి సైతం ఫిర్యా దు చేసింది. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జల్శక్తి శాఖ జాతీయ హోదాను ఇవ్వడం తెలంగాణకు మరింత మింగుడుపడని అంశంగా మారింది. ఎడాపెడా ఎత్తిపోతలు... నిజానికి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక సర్కార్ 2014లోనే రూ.16,125.28 కోట్లతో శ్రీకారం చు ట్టింది. తుంగ జలాశయానికి ఎగువన తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను భద్ర జలాశయంలోకి ఎత్తిపోస్తారు. ఆపై భద్ర నుంచి 29.90 టీఎంసీలను ఎత్తిపోస్తూ.. చిక్మగళూర్, చిత్రదుర్గ, తుమకూర్, దావణగెరె జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల (బిందు సేద్యం) విధానంలో 2,25,515 హెక్టార్లకు నీళ్లందిస్తారు. ఇందులో తుంగ నుంచి నీటిని ఎత్తిపోసే పనులను రూ.324 కోట్లతో, భద్ర జలాశయం నుంచి నీటిని తరలించే పనులను రూ.1,032 కోట్ల తో పూ ర్తిచేసింది. మొత్తంగా రూ.4,800 కోట్ల మేర వ్య యం చేశాక 2018లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అను మతి కోసం సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసింది. అయి తే దీనిపై తెలంగాణ అప్పట్లోనే కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–2లో అప్పర్ తుంగకు 11 టీఎంసీ, అప్పర్భద్ర కు 9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. అయి తే ఈ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదు. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్ భద్రను చేపట్టింది. దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే సీడబ్ల్యూసీ అనుమతించింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన కర్ణాటక అధికంగా నీటిని వినియోగిస్తోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు కూడా పూర్తయితే, తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ రాష్ట్రంలోని ఆర్డీఎస్ ఆయకట్టు... 87,500 ఎకరాలు ప్రమాదంలో పడుతుంది. ఏపీలోని హెచ్చెల్సీ, కేసీ కెనాల్ల కింది ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడుతుం గభద్ర జలాశయానికి వరద వచ్చే అవకాశమే ఉండ దు. అదే జరిగితే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్కు వచ్చే వరద కూడా తగ్గనుంది. కాగా కాళేశ్వరం ప్రా జెక్టుకు జాతీయ హోదా అడిగినప్పుడల్లా ఆ విధానాన్నే పక్కనబెట్టామని చెబుతూ వస్తున్న కేంద్రం అప్పర్ భద్రకు హోదా ఇవ్వడంపై రాష్ట్ర నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘కృష్ణా’పై 3 బ్యారేజీలు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాలకు సమర్థంగా నీరందించడంతో పాటు.. డెల్టా పరిరక్షణే లక్ష్యంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం–రామచంద్రాపురం మధ్య రూ.1,215 కోట్లతో, బండికొల్లంక–రావిఅనంతవరం మధ్య రూ.1,350 కోట్లతో బ్యారేజీల నిర్మాణానికి ఇప్పటికే సర్కార్ ఉత్తర్వులిచ్చింది. కృష్ణా డెల్టాలో సకాలంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరందించేందుకు దివంగత సీఎం వైఎస్సార్ 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. డెల్టాకు మరింత సమర్థంగా నీరందించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,235.27 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ► కృష్ణా నదిపై 1,323 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీల దిగువున 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించనున్నారు. తొలి దశలో బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణ కోసం రూ.102.17 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ► కృష్ణా నదిపై 1,373 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 62 కి.మీ దిగువన 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. సర్వే, ఇన్వెస్టిగేషన్ తదితర పనులు, భూసేకరణ కోసం రూ.102.20 కోట్లను ఇప్పటికే సర్కార్ మంజూరు చేసింది. జల, ఉపరితల రవాణాకు ఊతం.. కృష్ణా నదిపై మూడు బ్యారేజీల నిర్మాణం అంతర్గత జల రవాణా, ఉపరితల రవాణాలకు ఊతం ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన బ్యారేజీలను నిర్మించడం వల్ల ఆ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. కొత్తగా నిర్మించే బ్యారేజీల వల్ల పులిచింతల నుంచి హంసలదీవి వరకూ నదిలో నీరు నిల్వ ఉంటుందని.. ఇది జలరవాణాకు ఊతమిస్తుందంటున్నారు. డెల్టా పరిరక్షణ భూగర్భ జలమట్టం తగ్గడం వల్ల భూమి పొరల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావడం, కృష్ణా నది వెంబడి సముద్రపు జలాలు పైకి ఎగదన్నడం వల్ల కృష్ణా డెల్టా చౌడు బారుతోంది. పంటల దిగుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటికీ ఇబ్బందులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూగర్భ జలమట్టం తగ్గకుండా కాపాడుకోవచ్చు. -
శతవసంతాల కల.. సాకారమైన వేళ
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా ప్రజల వందేళ్ల కల అయిన పులిచింతల ప్రాజెక్టు నేడు జలకళతో కళకళలాడుతోంది. ఆ కలను సాకారం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే.. ఆ మహానేత తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ స్వప్నాన్ని పరిపూర్ణం చేశారు. తెలంగాణ సర్కార్తో చర్చించి, ముంపు సమస్యను పరిష్కరించారు. దీంతో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్లో కృష్ణా డెల్టాలో పంటలకు సమృద్ధిగా నీరు లభించడంతో పాటు, వచ్చే ఖరీఫ్కు కూడా సకాలంలో నీళ్లందుతాయంటూ రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1911లోనే నివేదిక కృష్ణా నదిపై బ్యారేజిని నిర్మిస్తే డెల్టాను సస్యశ్యామలం చేయవచ్చని సర్ ఆర్థర్ కాటన్ 1852లో నాటి బ్రిటిష్ సర్కార్కు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా 1852లో కెప్టెన్ చారీస్ రూ. రెండు కోట్ల ఖర్చుతో బ్యారేజి నిర్మించారు. అయితే 1954లో వచ్చిన వరదలకు బ్యారేజి కుంగిపోవడం వల్ల 1954–57 మధ్య ప్రకాశం బ్యారేజి నిర్మించారు. ఈ బ్యారేజి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గడం.. ఖరీఫ్ పంటలకు జూన్లో నీళ్లందించే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం బ్రిటిష్ అధికారి కల్నల్ ఇల్లీస్ అధ్యయనం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చని 1911లో బ్రిటిష్ సర్కార్కు నివేదిక ఇచ్చారు. సింహభాగం వైఎస్ హయాంలో పూర్తి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం, ఓట్ల గండం గడిచాక దాన్ని అటకెక్కించడం రివాజుగా మార్చుకున్నారు. మే 14, 2004న ముఖ్యమంత్రిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక జలయ/æ్ఞంలో భాగంగా రూ. 1,281 కోట్ల అంచనాతో పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. ఆ ప్రాజెక్టు పనులను 2009 నాటికే సింహభాగం పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు కొంత భాగం మిగిలాయి. 2009 నుంచి ఇటీవల కాలం వరకూ పునరావాసం పనులను పూర్తి చేయలేకపోయారు. దీనివల్ల ప్రాజెక్టు పూర్తయినా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని దుస్థితి. పులిచింతలలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల 2014–15లో 73.33, 2015–16లో 9.259, 2016–17లో 55.21, 2018–19లో 38.88 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. తెలంగాణ సర్కార్కు కేవలం రూ.42 కోట్ల మేర పరిహారం చెల్లించడంలో టీడీపీ సర్కార్ విఫలం కావడం వల్ల 2017లో పులిచింతలలో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని దుస్థితి ఏర్పడింది. పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడానికి వీలుగా తెలంగాణ సర్కార్కు చెల్లించాల్సిన పరిహారాన్ని విడుదల చేయించారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో చర్చించి.. ముంపు గ్రామాలను ఖాళీ చేయించి.. ప్రాజెక్టులో నీటి నిల్వకు సహకరించాలని కోరారు. ఇందుకు కేసీఆర్ సమ్మతించారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఇటు గుంటూరు.. తెలంగాణలో సూర్యాపేట జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించి ప్రాజెక్టులో తొలి సారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. దాంతో కృష్ణా డెల్టా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా చింతలు తీరినట్లే.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్లో ఆలస్యంగా వరి సాగు చేయడం వల్ల అక్టోబర్, నవంబర్ నాటికి పంట కోతకు వస్తుంది. ఆ సమయంలో తుపాన్ల వల్ల పంట నష్టం జరుగుతోంది. జూన్లోనే వరి సాగు చేస్తే తుపాన్ల బారి నుంచి పంటలను రక్షించవచ్చునని భావించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసే నీటితో కృష్ణా డెల్టాలో వరి సాగుకు జూన్లోనే నీళ్లందివచ్చు. ప్రస్తుత ఖరీఫ్లో పంటలకు సమర్థవంతంగా నీటిని సరఫరా చేయడంతోపాటు.. వచ్చే ఖరీఫ్కు సంబంధించి జూన్లోనే సాగు నీటిని విడుదల చేయవచ్చు. -
నాడు కల.. నేడు నిజం
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నాలను సాకారం చేయడానికి 2004లో ముందు చూపుతో చేపట్టిన జలయజ్ఞం ఫలాలు నేడు ప్రజలకు చేరువయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రకు తోటపల్లి, వంశధారతో దన్నుగా నిలిస్తే దుర్భిక్ష రాయలసీమకు హంద్రీ–నీవా, గాలేరు–నగరితో ఊపిరి పోశారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులతో కృష్ణా, గోదావరి డెల్టాలనే కాదు.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళిక రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి 16 ప్రాజెక్టులను పూర్తి చేశారు. మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల హంద్రీ–నీవా, గాలేరు–నగరిలను 2004లో చేపట్టి, 2009 నాటికి తొలి దశ పూర్తి చేశారు. రెండో దశ పనులను కూడా ఓ కొలిక్కి తెచ్చారు. ప్రస్తుతం గాలేరు – నగరి కాలువ ద్వారా గోరకల్లు, అవుకు, గండికోట, మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వామికొండసాగర్, సర్వారాయసాగర్లకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు ముందు చూపుతోనే నేడు సాగు నీరు కృష్ణా డెల్టా ప్రజల తొమ్మిది దశాబ్దాల కల పులిచింత ప్రాజెక్టును 2009 నాటికే పూర్తి చేశారు. ప్రస్తుతం పులిచింతలో 44 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడటానికి ఆ మహానేత ముందుచూపే కారణం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వంశధార, తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల కింద భారీ ఎత్తున రైతులు పంటలు సాగు చేస్తున్నారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించి.. 2004లో పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువ పనులను సింహభాగం పూర్తి చేశారు. హెడ్ వర్క్స్కు అవసరమైన భూమిని అత్యధిక భాగం సేకరించారు. ఆ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చే క్రమంలోనే మహానేత హఠన్మరణం చెందారు. ఆ మహానేత తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. -
రేపు ఉదయం కృష్ణా డెల్టాకు నీటి విడుదల
సాక్షి, విజయవాడ : జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం కృష్టాజిల్లా 31వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం 9.45 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. పంట దెబ్బతినకుండా ప్రతి రైతుకు నీరు అందిస్తామన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను కొనసాగిస్తామని కొడాలి నాని పేర్కొన్నారు. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రస్తుతం 70 శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైతే కాలువలను పర్యవేక్షణ చేయాలని నాని కోరారు. -
ఆపదలో ‘అన్నపూర్ణ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ’గా భాసిల్లడానికి కారణమైన గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆకలి దప్పులు తప్పడం లేదు. ఈ రెండు డెల్టాలతోపాటు పెన్నా డెల్టాలోనూ సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ముంచుకొస్తోంది. డెల్టాలు ఉప్పునీటి కయ్యలుగా, సాగుకు పనికి రాని భూములుగా మారుతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని సాక్షాత్తు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదిక బట్టబయలు చేసింది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో భూములు శరవేగంగా చౌడుబారుతుండటం.. సాగుకు పనికి రాకుండా పోతుండటం.. పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుండటానికి కారణాలను అన్వేషించి.. పరిస్థితిని చక్కదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2014 జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీడబ్ల్యూసీని ఆదేశించారు. నాలుగేళ్లపాటు సమగ్ర అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశానికి తూర్పు, పశ్చిమ తీర రేఖలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్లతో కలిపి 7,516.6 కిలోమీటర్ల పొడవునా తీరం విస్తరించి ఉంది. దీవుల తీర రేఖను మినహాయిస్తే.. దేశానికి తూర్పు, పశ్చిమాన 5,422.6 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. దేశం నుంచి ప్రవహిస్తున్న 102కు పైగా నదులు తూర్పు, పశ్చిమ తీర రేఖల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రానికి 973.7 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఇది విస్తరించి ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్యన ప్రవహిస్తున్న కృష్ణా నది, ఉభయ గోదావరి జిల్లాల నడుమ ప్రవహిస్తున్న గోదావరి, నెల్లూరు మీదుగా ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కండలేరు, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహించే వంశధార నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎల్నినో, లానినో ప్రభావం వల్ల సముద్ర మట్టం ఎత్తు కనిష్టంగా 0.6 మీటర్ల నుంచి గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెరిగింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 903.2 మిల్లీమీటర్లు కురవాలి. ప్రకాశం జిల్లాలో కనిష్టంగా 757 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరిలో గరిష్టంగా 1,139 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో ప్రవాహం ఏడాది పొడవునా ఉండటం లేదు. సముద్ర మట్టం ఎత్తు పెరగడం.. నదుల్లో ఏడాది పొడవున ప్రవాహం లేకపోవడం వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోకి నదులు, డ్రెయిన్ల ముఖద్వారాల మీదుగా సముద్రపు నీరు ఎగదన్నుతోందని.. ఇది భూమిని చౌడుబారేలా చేస్తుందని సీడబ్ల్యూసీ తేల్చింది. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు.. తీర ప్రాంతంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్లో భూగర్భ జలాలు ఉప్పు బారిపోవడం ఖాయమని, అప్పుడు డెల్టాల్లో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీరు కూడా కష్టమవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. భూమి చౌడుబారడం వల్ల సాగుకు పనికి రాకుండా పోతుందని.. పంట దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని.. దీనివల్ల ఆకలికేకలు తప్పవని అభిప్రాయపడింది. నదులు, డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లను నిర్మించి.. ఉప్పునీళ్లు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మడ అడవులను భారీ ఎత్తున పెంచి, తీరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని పేర్కొంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని.. భూగర్భం నుంచి తోడేసిన నీటిని.. వర్షకాలం అయినా రీఛార్జ్ చేయాలని.. దీనివల్ల ఉప్పు నీరు పైకి ఉబికి వచ్చే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొంది. నదుల్లో ఏడాది పొడవునా ప్రవాహాలు కనిష్ట స్థాయిలోనైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చేపల చెరువుల సాగును తగ్గించాలని.. రసాయన, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని కనిష్ట స్థాయికి చేర్చాలని సూచించింది. రక్షణ చర్యలు తీసుకోకపోతే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కావడం ఖాయమని స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తోడేయడంతో.. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో సాగునీటితోపాటు చేపల చెరువుల సాగుకు, తాగునీటి కోసం భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. బోరుబావుల ద్వారా తోడిన మంచినీటి స్థానంలోకి ఉప్పునీరు చేరుతోందని సీడబ్ల్యూసీ గుర్తించింది. చేపల చెరువుల ప్రభావం వల్ల భూమి శరవేగంగా చౌడుబారుతోందని తేల్చింది. 2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. మడ అడవులను నరికేయడం.. సునామీ దెబ్బకు తీర ప్రాంతం బలహీనపడటం వల్ల సముద్రపు నీరు ఉపరితలానికి బాగా ఎగదన్నింది. వీటి ప్రభావం వల్ల తీర ప్రాంతంలో 38 మండలాలు పూర్తిగానూ.. 26 మండలాల్లో భూములు పాక్షికంగానూ చౌడుబారాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది, పశ్చిమగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 12, ప్రకాశంలో 13, నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో భూములు చౌడుబారినట్టు లెక్క తేల్చారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో 75.92 లక్షల ఎకరాల భూమి చౌడుబారిపోతే.. రాష్ట్రంలో 9.61 లక్షల ఎకరాల భూమి చౌడుబారి సాగుకు పనికి రాకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లోనూ నేల చౌడు (క్షార) స్వభావం శరవేగంగా పెరుగుతోంది. ఇది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఏటా సగటున ఐదు శాతం చొప్పున దిగుబడి తగ్గుతోందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. తీర ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 50 శాతం అధికంగా ఉందని, ఇది నేల స్వభావం శరవేగంగా మారడానికి దారితీస్తోందని తేల్చింది. -
‘గుంటూరు చానల్’లోనూ కమీషన్ల కక్కుర్తి
సాక్షి, అమరావతి : గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్కు దక్కవని నిర్ధారణకు వచ్చిన ముఖ్య నేత.. జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి టెక్నికల్ బిడ్ స్థాయిలోనే టెండర్ను ఈ నెల 7న రద్దు చేయించారు. తాజాగా అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయించి, ఎంపిక చేసిన కాంట్రాక్టర్కే పనులు దక్కేలా నిబంధనలను మార్చేసి టెండర్ నోటిఫికేషన్ ఇప్పించారు. ఫిబ్రవరి 4న టెక్నికల్ బిడ్, 8న ప్రైస్ బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేసి అనుకూల కాంట్రాక్టర్కు కట్టబెట్టనున్నారు. ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కమీషన్గా రూ.100 కోట్లు వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్కు నాలుగు టీఎంసీలు కేటాయించారు. బ్యారేజీ ఎగువన ప్రారంభమయ్యే ఈ కాలువ 47 కి.మీ.ల పొడవున తవ్వారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో 28,500 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అలాగే గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాల్టీలకు మంచినీటితోపాటు కాలువ పరిసర 27 గ్రామాలకు తాగునీటి కోసం 32 చెరువులకు దీని ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. 600 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్విన ఈ కాలువ పాడైపోయింది. దీంతో కాలువను విస్తరించి లైనింగ్ చేయడంతోపాటూ సుద్దపల్లి మేజర్, కోవెలమూడి మేజర్ డిస్ట్రిబ్యూటరీలను ఆధునికీకరించేందుకు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలపై సర్కార్ 2015, మే 27న ఆమోదముద్ర వేసింది. ఆధునికీకరణ పనులకు రూ.378.25 కోట్లను మంజూరు చేస్తూ మే 27, 2015న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూడున్నరేళ్ల తర్వాత టెండరా? ఐదేళ్లుగా గుంటూరు చానల్ కింద ఆయకట్టుకు సర్కార్ సక్రమంగా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఏటా పంటలు ఎండిపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. గుంటూరు చానల్ను ఆధునికీకరించడానికి నిధులు మంజూరు చేసిన మూడున్నరేళ్ల తర్వాత టెండర్ పిలవడానికి సర్కార్ సిద్ధమైంది. ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందిస్తామని రైతులను మభ్యపెట్టడం, ఎంపిక చేసిన కాంట్రాక్టర్కే పనులు అప్పగించి భారీ ఎత్తున కమీషన్ దండుకోవడమే లక్ష్యంగా ఆ పనులు చేపట్టింది. 750 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ విస్తరణ.. ఆధునికీకరణ పనులకు కి.మీ.కు గరిష్టంగా రూ.3 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. 47 కి.మీ. కాలువ విస్తరణ, లైనింగ్ పనులకు రూ.141 కోట్లు ఖర్చవుతుంది. కాలువపై 172 సిమెంటు కట్టడాల (అండర్ టన్నెల్స్, సూపర్పాసేజ్లు, బ్రిడ్జిలు)ను తొలగించి.. కొత్తగా నిర్మించడానికి రూ.88 కోట్లు వ్యయమవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులకు రూ.229 కోట్లకు మించి వ్యయం కాదు. కానీ అంచనా వ్యయాన్ని రూ.330 కోట్లకు పెంచేసి డిసెంబర్ 17న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 31న టెక్నికల్ బిడ్.. జనవరి 4న ప్రైస్ బిడ్ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆరుగురు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. అయితే ఎంపిక చేసిన కాంట్రాక్టర్కు పనులు దక్కవనే నెపంతో సాంకేతిక బిడ్ తెరవకుండానే ముఖ్య నేత టెండర్ను రద్దు చేయించారు. కాంట్రాక్టర్కు అనుకూలంగా నిబంధనలు తాజాగా అంచనా వ్యయాన్ని రూ.332 కోట్లకు పెంచేసి.. 24 నెలల్లో పనులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టి ఈ నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో పదేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా 7.70 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి, 1,33,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఉండాలని నిబంధన పెడితే.. తాజాగా కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్కు అనుకూలంగా మట్టి పనుల పరిమాణాన్ని 3 లక్షల క్యూబిక్ మీటర్లకు, కాంక్రీట్ పనుల పరిమాణాన్ని 1.31 లక్షలకు తగ్గించారు. పదేళ్లలో ఒక్క ఏడాదైనా కనీసం రూ.83 కోట్ల విలువైన ఇదే రకమైన పనులు పూర్తి చేసి ఉండాలని మరో నిబంధన పెట్టారు. గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీకన్స్ట్రక్షన్), బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్), ఎస్డీఆర్ (స్టాటజిక్ డెట్ రీకన్స్ట్రక్షన్) విధానాలు అమలు చేయని కాంట్రాక్టర్లే అర్హులని నిబంధనలు విధించారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో సిమెంటు లైనింగ్ చేసిన కాంట్రాక్టర్లే షెడ్యూలు దాఖలు చేయడానికి అర్హులని షరతు విధించారు. ఇతరులు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే.. టెక్నికల్ బిడ్లో అనర్హత వేటు వేయించి, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్కే పనులు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో రూ.వంద కోట్లకుపైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
డెల్టా భూముల్లో చిరుధాన్యాల దిగుబడి రెట్టింపు!
పౌష్టికాహార భద్రతను కల్పించే చిరుధాన్యాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో మెట్ట పొలాలతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా భూముల్లో కూడా వీటిని సాగు చేయడంపై రైతులు దృష్టి సారించాలని రాజేంద్రనగర్లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ డా. విలాస్ ఎ.తొనపి సూచించారు. సంక్రాంతి సందర్భంగా ‘సాక్షి సాగుబడి’తో ఆయన మాట్లాడారు. మెట్ట ప్రాంతాలతో పోల్చితే సారవంతమైన డెల్టా భూముల్లో చిరుధాన్యాల రెట్టింపు దిగుబడి పొందవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని డెల్టా భూముల్లో ఖరీఫ్లోనూ చిరుధాన్యాలను సాగు చేయవచ్చన్నారు. వరి కోసిన తర్వాత రెండో పంటగా కూడా చిరుధాన్యాలను సాగు చేయవచ్చని, భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఒక రక్షక పంట ఇస్తే సరిపోతుందన్నారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా సాగు చేయాలన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, సాగు నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం కోసం చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చిరుధాన్యాల క్లస్టర్లను ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పత్తి తదితర పంటల నుంచి రైతుల దృష్టి మళ్లించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమన్నారు. కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికలు వంటి సిరి(చిరు)ధాన్యాల ప్రాసెసింగ్కు యంత్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు మార్కెటింగ్కు మౌలిక సదుపాయాలు కల్పించడం అవసరమన్నారు. రైతులకు శిక్షణతోపాటు మేలైన విత్తనాలు అందించడానికి ఐ.ఐ.ఎం.ఆర్. సిద్ధంగా ఉందని డా. తొనపి(85018 78645) తెలిపారు. -
సీఎం ఇంటి కోసం అన్నదాతలకు అవస్థలు
పాలకులు తలచుకుంటే ప్రజలకు అద్భుత పాలనను అందించవచ్చు.. అదే పాలకులు స్వప్రయోజనాల కోసం పాకులాడితే.. జనాలకు కష్టాలు.. నష్టాలు తప్ప మిగిలేది ఏమీఉండదు. కృష్ణా తీరం వద్ద కొలువుదీరిన సీఎం ఇంటి కోసం అన్నదాతలకు అవస్థలు తెచ్చే కార్యం కొనసాగుతోంది. డెల్టాకు వరప్రదాయని ప్రకాశం బ్యారేజిలో నీటి నిల్వకు కొర్రీలు పెడుతూ కర్షకులకు కడగండ్లు తెచ్చేపనిలో పడ్డారు. సాక్షి, విజయవాడ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న చందంగా కృష్ణా నదీతీరంలో రాజధాని ఏర్పాటు.. సీఎం నివాసం.. కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిస్థాయిలో సాగునీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకుండాపోతోంది. 13 అడుగులకు గాను..9.5 అడుగులకే పరిమితం.. ప్రకాశం బ్యారేజీ వద్ద 13 అడుగుల వరకు నీరు నిల్వ చేసుకోవచ్చు. గతంలో 12 అడుగుల వరకు వరద నీరు నిల్వ చేసేవారు. దశాబ్దం క్రితం 12 అడుగుల గేట్లపై మరో అడుగు ఐరన్ షీట్లు వేసి గేట్లు ఎత్తు పెంచారు. దీంతో 13 అడుగుల వరకు కనీస నీటిని నిల్వ చేయవచ్చు. అయితే 13 అడుగుల నీరు నిల్వచేస్తే నదీ తీరంలో సీఎం ఇంటి సమీపంలోకి వరద నీరు వచ్చి చేరుతుందని ఇరిగేషన్ సిబ్బంది చెబుతున్నారు. దీనికితోడు కొండవీటి వాగు ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు కూడా రాదు. అదే జరిగితే రాజధాని ప్రాంతం మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న సూచనల మేరకు ప్రకాశం బ్యారేజీ వద్ద కనీసం 12 అడుగుల మేర కూడా నీటిని నిల్వ చేయడం లేదు. మంగళవారం 9.5 అడుగులకు నీటి మట్టం తగ్గించేశారు. దీనివల్ల సీఎం ఇంటికి ఇబ్బంది ఉండదని, కొండవీటి వాగులోని నీరు కూడా నదిలోకి వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టాకు ఇబ్బందే.. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి మున్నేరు, కట్టలేరు నుంచి 1,13,534 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, కిందకు 1,41,250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 54 గేట్లను నాలుగు అడుగుల మేర, 15 గేట్లను 2 అడుగుల మేర పైకెత్తి సముద్రంలోకి వరద నీటిని వదులుతున్నారు. వారం రోజులుగా 22 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారు. పూర్తయిన వరి నాట్లు కృష్ణా తూర్పుడెల్టా కింద కృష్ణా, పశ్చిమగోదావరి, పశ్చిమ డెల్టా కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు అందుతుంది. 13.5 లక్షల ఎకరాల ఆయకట్టులో గుంటూరు జిల్లాలో 5.71 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. డెల్టా పరిధిలో చాలావరకు వరి నాట్లు పూర్తయ్యాయి. ఇటీవల నాట్లు వేసిన పొలాల్లోని పైరు డిసెంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. అప్పటి వరకు పొలాలకు విడతల వారీగా నీటి తడులు పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వరద నీరు ఆగిపోతే కృష్ణా డెల్టాకు తిరిగి నీటి కష్టాలు ప్రారంభమవుతాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కనీసం 13 అడుగుల మేర నీరు నిల్వ చేయకపోతే, వరద తగ్గిన తరువాత కనీసం వారం రోజులకైనా పంట కాలువలకు నీరు ఇవ్వలేరు. 13 అడుగుల వరకు నీరు నిల్వ అవకాశం ఉన్నా.. కేవలం సీఎం ఇంటి భద్రత కోసం 9.5 అడుగులకు పరిమితి చేయడాన్ని రైతు సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. అన్నదాతలకు అవస్థలు తేవడం తగునా? ప్రకాశం బ్యారేజీలో నాలుగు అడుగులు తక్కువగా నీరు నిల్వ చేయడం వల్ల కనీసం ఒక టీఎంసీ నీరు తగ్గిపోతుంది. ఇప్పుడు నీటిని సముద్రం పాలుచేసి తరువాత రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతమేరకు సమజసమని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది నవంబర్ నాటికే పట్టిసీమ పడకేసింది. ఈ ఏడాది పులిచింతలలోనూ ఇప్పటి వరకు 3 టీఎంసీలు మించిలేవు. దీంతో రైతులకు ఈ సీజన్లోనూ సాగునీటి కటకటలు తప్పేలా లేవు. -
కక్ష.. వివక్ష..
కడప సిటీ : కేసీ రైతుకు కన్నీరే మిగులుతోంది. మూడేళ్లుగా కరువుతో సతమతవుతున్నారు..శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది మందస్తుగానే భారీ వరదనీరు చేరడంతో వరి సాగు చేయొచ్చని ఆశపడ్డారు. వరినారు కూడా పోసుకున్నారు. తర్వాత అధికారులు నీటి విడుదలను నిలిపేశారు. కృష్ణా డెల్టాకు వదిలి..కేసీకి ఆపేసి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. కృష్ణాడెల్టా రైతులపై ఎందుకంత ప్రేమ.. తమపై ఎందుకంత వివక్ష అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కడుపుమండిన రైతన్నలు ఈ నెల 8న రోడ్డెక్కారు. వైఎస్సార్సీపీ నేతలు వీరికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ప్రసుతం శ్రీశైలానికి వరదనీరు చేరుతోంది. ఇప్పటికైనా కేసీ ఆయకట్టు రైతులకు వరిసాగుకు సరిపడే నీళ్లిస్తామని స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కేసీ ఆయకట్టు రైతులు గత మూడేళ్లుగా వరిసాగుకు దూరమయ్యారు.కేవలం బోర్లకింద ఆరుతడి పంటలు వేసుకుని కాలం వెళ్లదీశారు.అయితే కర్ణాటకలో వర్షాలు అధికంగా పడడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు చేరింది.దీంతో గత నెల 29 రాజోలికి నీటిని విడుదల చేశారు.అక్కడి నుంచి మైదుకూరు, చాపాడు కేసీకెనాల్కు, కుందూకు వదిలారు. ఈ సమయంలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించలేదు.దీంతో కేసీ కాలువ కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. నారుమడులు పోసుకున్నారు. సత్తువ కోసం జీలుగ కూడా వేశారు. ఈ తరుణంలో అధికారులు నీటిని నిలిపివేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఆగిపోయిందని, వరిసాగు చేసేందుకు నీళ్లు ఇవ్వడం కష్టమని, ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని చెప్పారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం కేసీ కెనాల్కు నీటిసామర్థ్యం తగ్గిన సందర్భంలో శ్రీశైలంలో 872 అడుగుల నీటిమట్టం ఉంది. 854 అడుగులు ఉంచి మిగతా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.అయితే ఈ నీటిని కేసీకాలువకు ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు 10టీఎంసీలు మళ్లించారు. దీంతో కేసీ కాలువకు నీరు ఆగిపోయింది. 92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మైదుకూరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలు, కడపకు సంబంధించి 30 వేల ఎకరాలు, మిగతా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉంది. మూడేళ్లుగా వరిపంటకు దూరమైన కేసీ ఆయకట్టు రైతులు ఈ ఏడాది నీళ్లు వచ్చాయని ఆనందపడి సాగుకు సిద్ధమయ్యారు. వారి ఆనందం రెండు రోజులకే ఆవిరైంది. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా రైతులపై వివక్ష చూపుతోంది.వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మొదటి నుంచి సవతిప్రేమ చూపిస్తున్నారు. కెసీ కాలువకు నీటి విడుదల విషయంలో ముఖ్యమంత్రి వక్రబుద్ధి మరోసారి బయటపడిందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి,ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి.అంజాద్బాషా,రాచమల్లు శివప్రసాద్రెడ్డి, జిల్లా రైతువిభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాద్రెడ్డి నాయకులు, కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కేసీకి నీళ్లు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కేసీ కెనాల్కు రావాల్సిన నీటిని కృష్ణాడెల్టాకు తరలిస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయనరెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. మన వాటా కోసం కలిసి కట్టుగా పోరాడుదామని, అందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు కేసీకాలువకు నీళ్లు రావడంతో ఈ ఏడాది 10 ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించా. నారుమడి పోశా. ఇందుకోసం రూ.2000 ఖర్చు అయింది.అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతున్నారు.ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. – ఆంజనేయులు, రైతు, పల్లవోలు, చాపాడు మండలం నిలువునా ముంచారు మూడేళ్ల నుంచి వరిపంటకు దూరమయ్యాం.ఈ సారి కేసీకెనాల్కు నీళ్లు రావడంతో వరినారు వేశాం.ఇప్పుడేమే ఆరుతడి పంటలకు మాత్రమే నీళ్లు ఇస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.నారుమడి కోసం ఎకరానికి రూ.2000 ఖర్చు అయింది. పాలకులు, అధికారులు రైతులను నిలువునా ముంచారు. – సీసీ వెంకటసుబ్బారెడ్డి, తొండలదిన్నె, రాజుపాళెం మండలం చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు. కడప రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది.కెసీ కెనాల్కు అర్ధాంతరంగా నిలిపివేయడం దారుణం. కేసీకెనాల్కు నీళ్లు ఇచ్చే వరకు రైతుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. – సంబటూరు ప్రసాద్రెడ్డి,వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే... శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గింది.అందువల్ల వరిసాగుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. ఉన్నతాధికాల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం.ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనుమతులు ఉన్నాయి. మళ్లీ వానలు అధికమై శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటాం. - జిలానీబాషా, డీఈఈ, కేసీ కెనాల్ -
సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
-
పోలవరం నిర్వాసితులకు మోడల్ కాలనీలు: సీఎం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. మోడల్ కాలనీలు నిర్మించి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలన్నారు. నిర్వాసితుల స్థితిగతులు, వ్యక్తిగత సమాచారంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. నిర్వాసితుల జీవన ప్రమాణాలను పెంచేలా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, పునరావాస పరిహారం కింద మరింత సాయానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. లక్ష కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం, మౌలిక వసతులు కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన 68వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికి 56.69 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. ప్రాజెక్టు పనుల్లో 45 డిజైన్లకుగాను 14 డిజైన్లు కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం పొందగా, మరో 22 పెండింగ్ ఉన్నాయని, మరో 9 డిజైన్లు ఏజెన్సీల వద్ద పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు. డిజైన్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరగా ఆమోదం పొందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎం కార్యదర్శి రాజమౌళి, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టాకు తొలిసారిగా జూన్లో నీళ్లిచ్చాం: బాబు కృష్ణా డెల్టా 150 ఏళ్ల చరిత్రలో జూన్లో ఆయకట్టుకు నీళ్లి వ్వడం, పంటలు సాగు చేయడం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం సచివాలయంలో నీరు– ప్రగతి, వ్యవసాయంపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశధార, నాగావళికి వరద ప్రవాహం పెరిగిందన్నారు. మరో 10 రోజుల్లో శ్రీశైలం రిజర్వా యర్ నిండుతుందన్నారు. మంగళవారం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని రాయలసీమకు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో ఇది సాధ్యమైందన్నారు. కాగా ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో సోమవారం పలువురు యానిమేటర్లు సీఎంను కలసి తమకు గౌరవ వేతనం పెంచాలని కోరారు. దీనికి సీఎం స్పందిస్తూ నెలకు రూ. 3 వేలు గౌరవ వేతనం ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. చేనేతలకు ‘ముద్ర’రుణాలపై సీఎం సమీక్ష చేనేత కార్మికులకు కేంద్రం ద్వారా ఇస్తున్న ‘ముద్ర’రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గతేడాది 10,209 మంది చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా ముద్ర పథకం కింద రూ. 52.27 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. -
నిధుల అనుసంధానం!
సాక్షి, అమరావతి: గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ పనులకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు నిబంధనలను తుంగలో తొక్కి ఆగమేఘాలపై పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై జలవనరుల శాఖ అధికారులు నివ్వెరపోతున్నారు. వ్యాప్కోస్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) ఆధారంగా కృష్ణా డెల్టా సీఈ రూపొందించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను జలవనరుల శాఖ ఈఎన్సీ(ఇంజనీర్–ఇన్–చీఫ్)కి పంపకుండానే పని పూర్తి చేశారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసి రూ.6,020.15 కోట్లతో ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేయించటం గమనార్హం. పథకం ప్రతిపాదన దశలోనే అంచనా వ్యయాన్ని రూ.1,403.15 కోట్లు పెంచడంతోపాటు ఒకే ప్యాకేజీ కింద బడా కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం, మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇచ్చే రూ.500 కోట్లను కమీషన్ల రూపంలో వసూలు చేసుకోవడం ఇందులో అసలు వ్యూహం. నిబంధనలకు నీళ్లు.. గోదావరి–పెన్నా అనుసంధానంపై తొలుత వ్యాప్కోస్ రూపొందించిన నివేదికను పక్కనపెట్టిన సీఎం చంద్రబాబు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించడంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ పనులను తొలి దశ కింద చేపట్టాలని నిర్ణయించారు. గత ఫిబ్రవరి 5న చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.4,617 కోట్లుగా జలవనరుల శాఖ ప్రతిపాదించింది. ఇది మరింత పెంచాలని ఒత్తిడి తెచ్చినా కీలక అధికారి ఒకరు అంగీకరించలేదు. అయితే అనంతరం ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.6,212.08 కోట్లకు పెంచుతూ గత ఏప్రిల్ 28న కృష్ణా డెల్టా సీఈ ద్వారా జలవనరులశాఖకు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదనలు తెప్పించారు. కనీసం హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకుండానే వీటిని రూపొందించడం గమనార్హం. నిబంధనల ప్రకారం వీటిని ఈఎన్సీకి పంపాలి. అక్కడ ఆమోదించాక ఐబీఎం కమిటీకి పంపాలి. కానీ అటు ఈఎన్సీకిగానీ ఇటు ఐబీఎం కమిటీకిగానీ ప్రతిపాదనలు పంపలేదు. వ్యయం భారీగా పెంచేసిన నేపథ్యంలో వీటిని ఈఎన్సీ, ఐబీఎం తిరస్కరిస్తాయనే నేరుగా జలవనరుల శాఖ కార్యదర్శికి పంపేలా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తిప్పి పంపిన ఆర్థిక శాఖ కృష్ణా డెల్టా సీఈ రూ.6,212.08 కోట్లతో పంపిన ప్రతిపాదనలను జలవనరులశాఖ రూ.6,020.15 కోట్లకు కుదించింది. అనంతరం వీటిని పరిశీలించిన ఆర్థిక శాఖ క్షేత్ర స్థాయిలో చేపట్టే పనులకు, అంచనా వ్యయానికి భారీ వ్యత్యాసం ఉండటంపై ఆశ్చర్యపోయింది. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే బడ్జెట్లో ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించింది. పాత కాంట్రాక్టర్లను 60 సీ నిబంధన కింద తొలగించడం, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి కొత్తవారికి అప్పగించడాన్ని పరోక్షంగా తప్పుబట్టింది. కావాలంటే సర్వే, భూసేకరణకు మాత్రం అనుమతి ఇస్తామంటూ ప్రతిపాదనలను వెనక్కి పంపింది. కేబినెట్లో చర్చించకుండానే.. బడ్జెట్లో నిధులు కేటాయించని కొత్త పథకాలు ఏవైనా చేపట్టాలంటే కేబినెట్ అనుమతి తప్పనిసరి. కానీ కేబినెట్లో చర్చికుండానే గోదావరి–పెన్నా తొలిదశ అంచనా వ్యయం పెంపు ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఈనెల 6వ తేదీన ఆమోదముద్ర వేశారు. నిధులు సమకూర్చాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.రెండు వేల కోట్లకు మించి నిధులు సర్దుబాటు చేయలేమని ఆర్థికశాఖ మరోసారి స్పష్టం చేసినా దీన్ని బేఖాతర్ చేస్తూ రూ.6,020.15 కోట్లతో గోదావరి–పెన్నా తొలిదశకు జలవనరుల శాఖ ద్వారా సీఎం చంద్రబాబు పరిపాలన అనుమతి ఉత్తర్వులు జారీ చేయించారు. టెండర్లకు ముందే బేరం...! గోదావరి–పెన్నా తొలిదశ పనుల్లో ఒక్కో పంప్ ద్వారా 1,750 క్యూసెక్కుల చొప్పున నాలుగు పంప్ల ద్వారా ఏడు వేల క్యూసెక్కులను వైకుంఠపురం నుంచి ఐదు దశల్లో ఎత్తిపోయాలి. నాగార్జునసాగర్ కుడి కాలువకు గోదావరి జలాలను తరలించేందుకు ఐదు చోట్ల పంప్ హౌస్లు, 10.09 కి.మీ. పొడవు ప్రెజర్ మైన్, 56.5 కి.మీ. పొడవున కాలువ తవ్వాలి. భూసేకరణకు రూ.676.25 కోట్లు, పనులకు 4,588.63 కోట్లు, క్రాస్ డ్రైనేజ్ పనులకు రూ.86.12 కోట్లు, బ్రిడ్జిలకు రూ.106.72 కోట్లను కేటాయించారు. ఈ పనుల్లో పంప్ హౌస్, కాలువ పనులు అంటే రూ.4,588.63 కోట్ల విలువైన పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవాలంటూ జలవనరులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఇటీవల నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు కట్టబెట్టిన సంస్థకే దక్కేలా గోదావరి–పెన్నా తొలి దశ పనులకు టెండర్లు పిలవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. టెండర్లు ఖరారైన వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో సర్కార్ ఇచ్చే రూ.500 కోట్లను తొలి విడత కమీషన్ కింద, బిల్లులు చెల్లించేటపుడు మలి విడతగా మరో రూ.600 కోట్లకుపైగా కమీషన్ ఇచ్చేలా కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వ పెద్దలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆ బాధ్యత సాధికార మిత్రలదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి, వారికి ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడేలా నచ్చజెప్పే బాధ్యత సాధికార మిత్రలదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి 35 ఇళ్లకు ఒక డ్వాక్రా మహిళను సాధికార మిత్రలుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన అధికార నివాసం నుంచి 500 మంది సాధికార మిత్రలతో ప్రత్యక్షంగా, మిగిలిన 4.60 లక్షల మంది సాధికార మిత్రలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘మీకు కేటాయించిన 35 కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించాలి. రాష్ట్రంలో 99 శాతం మంది ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందేలా నచ్చజెప్పాల్సిన బాధ్యత మీదే’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సాధికార మిత్రలకు త్వరలో ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు అందజేస్తుందని, ఫోన్ బిల్లులు సైతం చెల్లిస్తుందని చెప్పారు. ఫోన్లోని ప్రత్యేక యాప్లో ప్రభుత్వ పథకాల వివరాలుంటాయని, సాధికార మిత్రలు ఆ వివరాలను ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. కేటాయించిన 35 కుటుంబాలకు సాధికార మిత్రలు తోడ్పాటు అందిస్తే, సాధికార మిత్రలకు అండగా నిలిచే బాధ్యత తనదేనని చంద్రబాబు వెల్లడించారు. రైతులకు రెట్టింపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలే చెబుతోందని.. కానీ, రెండింతల ఆదాయం ఎలా పెంచాలన్నది రాష్ట్రంలో మనం చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు ఖర్చు పెట్టి, మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ అందజేస్తోందని తెలిపారు. ఈ ప్యాడ్స్కు ‘రక్ష’ పేరు ఖరారు చేస్తున్నామన్నారు. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తాం ఏటా జూన్ 1వ తేదీనే కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబుఅన్నారు. ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న తూర్పు కాలువపై కొత్తగా నిర్మించిన రెగ్యులేటరీ ద్వారా కృష్ణా డెల్టాకు సీఎం బుధవారం నీరు విడుదల చేశారు. కృష్ణా కాలువలో గంగపూజ నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల పైలాన్ను ఆవిష్కరించారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి తరలిస్తారు. సీఎం మాట్లాడుతూ గతేడాది కంటే వారం ముందే కాలువలకు నీరు విడుదల చేశామని తెలిపారు. తద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.36లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. 160 ఏళ్లలో మొదటిసారిగా ఈ ఏడాది కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి జీరో అవుట్ ఫ్లో ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిపై ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా గడిచిన 15ఏళ్లలో కృష్ణా డెల్టాలో అదను తప్పి సాగు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పట్టిసీమ నిర్మాణం, కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం ద్వారా ఈ సమస్య అధిగమించామన్నారు. భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. -
డెల్టా సాగుకు 152 టీఎంసీలు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా డెల్టాలో సాగుకు 152.2 టీఎంసీల నీరు అవసరమని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదించింది. గోదావరి నుంచి డెల్టాకు 80 టీఎంసీలే మళ్లిస్తున్నామని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై జస్టిస్ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఏపీ తరఫు సాక్షి, సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గోదావరి నీటిని పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా మళ్లించి డెల్టా సాగు అవసరాలు తీర్చితే పులిచింతల నీటి అవసరం ఉండదు కదా అని వైద్యనాథన్ ప్రశ్నించగా.. డెల్టా నీటి అవసరాలు 152.2 టీఎంసీలని, గోదావరి నుంచి 80 టీఎంసీలే మళ్లిస్తున్నట్లు సుబ్బారావు సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సాగర్కు నీటిని ఎత్తిపోయడం ద్వారా సముద్రంలోకి వెళ్తున్న నీటిని ఆపి సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా వినియోగించు కొనేందుకు సాధ్యమవుతుందా అని ప్రశ్నించగా.. అందు కు 17 నుంచి 590 అడుగులకు నీరు ఎత్తిపోయాల్సి ఉంటుందన్నారు. ఇక గోదావరి, పెన్నార్ నదుల అనుసంధానంపై అధ్యయనం జరుగుతోందన్నారు. కాగా, తదుపరి విచారణ వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో జరగనుంది. -
బయట ఉన్నా బేసిన్లో భాగమే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో డెల్టా ప్రాంతం ఎక్కువ భాగం కృష్ణా బేసిన్కు బయట ఉన్నా అది బేసిన్లో భాగమేనని, డెల్టాలో వర్షం నీరు ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ప్రాంతంలో మాత్రమే సాగుకు ఉపయోగపడుతుందని ఏపీ సర్కారు బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై గురువారం కూడా జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ జరిగింది. ఏపీ తరఫు సాక్షి కె.వి. సుబ్బారావును తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వి.రవీందర్రావు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. డెల్టాలో వర్షం వల్ల వచ్చే నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన మాత్రమే సాగుకు వినియోగిస్తారని, ఇక్కడ కాలువల ద్వారా వచ్చే నీటిని వినియోగించరని సుబ్బారావు సమాధానాలిచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా పాలార్, పొన్నిర్ నదీ బేసిన్లకు కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు కదా? అని రవీందర్రావు ప్రశ్నించగా.. ఇది నిజమేనని, అయితే కృష్ణా నదిలో మిగులు జలాలను మాత్రమే హంద్రీనీవాలో వినియోగిస్తున్నామని సుబ్బారావు సమాధానం చెప్పారు. కృష్ణా బేసిన్లో 95 శాతం డెల్టా ప్రాంతం బేసిన్ బయట ఉందికదా.. అని ప్రశ్నించగా.. డెల్టా వ్యవస్థ బేసిన్కు బయట ఉన్నా అది బేసిన్లో భాగమేనని సుబ్బారావు చెప్పారు. ఇక కేసీ కెనాల్ ఆధునీకరణ వల్ల దాని అవసరాలు 39 టీఎంసీల నుంచి 19 టీఎంసీలకు తగ్గుతుంది కదా! అని రవీందర్రావు పేర్కొనగా.. ఈ వాదనను తిరస్కరిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు. తదుపరి విచారణ శుక్రవారం కూడా జరగనుంది. -
గోదావరి నీరు మళ్లించుకోవచ్చుగా
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు సరిపడా మళ్లించుకోవచ్చు కదా అని ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ సూచించింది. దీని వల్ల నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నీరు అవసరం ఉండదు కదా అని వ్యాఖ్యానించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ తరఫు సాక్షి కె.వి. సుబ్బారావును తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలపై పలు ప్రశ్నలు అడిగారు. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా డెల్టా అవసరాలను తీర్చుకోవచ్చు కదా అని వైద్యనాథన్ సూచించగా ఆ ప్రతిపాదనను సుబ్బారావు తిరస్కరించారు. ఏపీ నూతన రాజధాని ప్రాంతం వల్ల కృష్ణా జలాల ద్వారా సాగులో ఉన్న 7 లక్షల ఎకరాలు ప్రభావితమవుతున్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు.. రాజధాని ప్రాంతం కేవలం 217 చ.కి.మీ. పరిధిలోనే ఉందని సమాధానమిచ్చారు. 217 చ.కి.మీ. పరిధి రాజధానిగా నిర్ణయిస్తే మౌలిక సదుపాయల అభివృద్ధి, కారిడార్ జోన్, పరిశ్రమల జోన్, అర్బన్ జో¯న్ల వల్ల పరిధి పెరిగే అవకాశం ఉంది కదా అని వైద్యానాథన్ ప్రశ్నించగా.. అన్ని జోన్లు ప్రతిపాదిత ప్రణాళికలోనే ఉంటాయని సుబ్బారావు తెలిపారు. ఇక డెల్టాలో పంటకాలం 180 నుంచి 130 రోజులకు తగ్గించినందు వల్ల నీటి అవసరాలు కూడా తగ్గినట్టే కదా అని అడిగిన ప్రశ్నకు.. పంటకాలం తగ్గింపు వల్ల నీటి ఆవశ్యకత తగ్గలేదని సుబ్బారావు సమాధానమిచ్చారు. కృష్ణా డెల్టాలో పంటకాలాన్ని 112 రోజులకు తగ్గించుకుంటే సాగునీటి అవసరం తగ్గుతుంది కదా అనగా.. అది అంగీకారం కాదన్నారు. గోదావరి నుంచి పులిచిం తల ప్రాజెక్టు ద్వారా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఎంత నీరు మళ్లిస్తారని అడిగిన ప్రశ్నకు.. దానిపై అధ్యయనం జరుగుతోందని సుబ్బారావు సమాధానమిచ్చారు. కాగా, కృష్ణా జలాల పంపకాలపై తదుపరి విచారణ గురువారం జరగనుంది. -
సకాలంలో పోలవరం పూర్తిచేస్తాం
సీఎం చంద్రబాబు వెల్లడి - కృష్ణా డెల్టాకు జూన్లోనే నీరు ఇచ్చాం - కుంటలు, చెక్డామ్ల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి - కృష్ణా తూర్పు డెల్టాకు నీరు విడుదల చేసిన సీఎం సాక్షి, విజయవాడ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సకాలంలోనే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తి చేయడం ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. విజయ వాడలోని కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం సోమవారం సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూజలు చేశారు. గేట్ల స్విచ్ ఆన్ చేసి 2,500 క్యూసె క్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో సీఎం చంద్ర బాబు మాట్లాడుతూ.. ఏటా ఆగస్టులో కృష్ణాడెల్టా కాలువలకు నీరు అందించే వారని, ఈ ఏడాది జూన్లోనే పట్టిసీమ నుంచి తెచ్చిన గోదావరి నీరు ఇస్తున్నా మన్నారు. దీనివల్ల తుపాన్లు రావడానికి ముందే రైతులకు పంటలు చేతికి అందుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా విశాఖ నగరానికి తాగునీరు ఇస్తామన్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టును అడ్డుకు న్నారని, రైతులకు నచ్చజెప్పి పరిహారం అందించామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని మడకశిర, కుప్పంలకు నీళ్లు తీసుకువెళ్లామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రాబోయే సంవత్సరా లలో రాయలసీమకు నీరు అందిస్తామన్నారు. భూగర్భ జలాలు పెరిగాయి.. రాష్ట్రంలో పంట కుంటలు, చెక్డ్యామ్లు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు 90 టీఎం సీలు పెరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కురిసిన వర్షాలు వల్ల భూగర్భ జలం మీటరు పెరిగిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండటానికి రూ. 2 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించా మన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 845 కోట్ల బడ్జెట్ కేటాయించామని, పెళ్లి చేసుకునే మైనార్టీ యువతులకు దుల్హాన్ పథకం కింద రూ. 100 కోట్లు ఇచ్చామన్నారు. పనులు వేగవంతం చేయండి.. పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తన నివాసంలో పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్ష నిర్వహించి వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో ప్రాజెక్టు పూర్తికి నిర్మాణ సంస్థలు, అధికారులు కలిసి రావాలని కోరారు. -
పోలవరంకు శంకుస్థాపన చేసిందెవరు?
విజయవాడ: కృష్ణా డెల్టాపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. కృష్ణా డెల్టాకు తానొచ్చిన తర్వాతే నీళ్లు వచ్చాయని బాబు చెప్పుకోవడం శోచనీయమన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అప్పట్లో సీఎం ఉన్న చంద్రబాబు కృష్ణా డెల్టాకు అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులను తానే అనుసంధానించినట్టు ఆయన చెప్పుకోవడాన్ని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే గోదావరి, కృష్ణా అనుసంధానికి బీజం పడిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందెవరని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎప్పుడు అనుమతులు లభించాయని నిలదీశారు. వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి ఆయన ప్రయత్నిస్తే టీడీపీ నాయకులు, తమ వర్గంతో అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. మీ వర్గానికి సంబంధించిన రైతాంగాన్ని రెచ్చగొట్టి కేసులు వేయించి అడ్డుపడింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని పార్థసారధి అన్నారు. -
కృష్ణా డెల్టాకు నీరు విడుదల
అమరావతి: ఎప్పుడూ లేని విధంగా కృష్ణా డెల్టాకు ముందుగా నీళ్లు ఇచ్చాము.. రైతులు పంటలు వేసుకునేందుకు సిద్ధం కావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన కృష్ణా తూర్పు డెల్టాకు నీరు విడుదల చేశారు. పట్టిసీమ విషయంలో తనపై అనేక ఆరోపణలు చేశారని, వాటికి భయపడి తాను వెనకడుగు వేసి ఉంటే కృష్ణాకు తీవ్ర నష్టం జరిగేదని అన్నారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు కృష్ణాకు తీసుకొస్తామని, రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు పంటల కంటే ముందే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ చుట్టూ విహార ప్రాంతంగా మారుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. -
ప్రాజెక్టుల కోసం 40 వేల కోట్లు ఖర్చు
సాక్షి, అమరావతి: మూడేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో రూ.పదివేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పోలవరంతోసహా ఏడు ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం విజయవాడలోని ఎ కన్వెన్షన్ హాలులో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సదస్సు ముగింపులో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీకల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చరిత్ర తిరగరాసిన వారమవుతామని.. ప్రపంచంలో అలాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని అన్నారు. ఎండిపోయిన కృష్ణా డెల్టాకు నీరిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా గోదావరి నీటిని డెల్టాకిస్తామని, రైతులు నారుమళ్లు పోసుకోవాలని కోరారు. కృష్ణా డెల్టాకు కృష్ణానది నుంచి ఇచ్చేనీటిని పులిచింతల వద్ద నిల్వ చేస్తామన్నారు. మొబైల్ లిఫ్టుల ద్వారా రాష్ట్రంలోని చెరువులకు నీరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేరే దేశాలు, రాష్ట్రాలతో పోటీపడి గతంలో పనిచేశానని, అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి సాధించానని చెప్పుకొచ్చారు. తనకు ఏ కోరికా లేదని, ఆశ కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని తనకిచ్చారని, అదే తాను ఇంకా కోరుకుంటున్నానని చెప్పారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారు.. కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేసినట్లు పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాజకీయలబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అప్పుడు అధికారంలో ఉండి దెబ్బకొట్టారని, ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికొచ్చే ఆదాయంలో 32 శాతం వ్యవసాయం నుంచే వస్తుందని, అలాంటి వ్యవసాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆస్పత్రుల్లో చనిపోయినవారిని వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లేందుకు త్వరలో మహాప్రస్థానం వాహనాల్ని ప్రవేశపెడుతున్నామని సీఎం చెప్పారు. చనిపోయిన వారిని ఈ వాహనాల్లో వారింటికి తీసుకెళ్లడంతోపాటు కుటుంబానికి రూ.30 వేలు చొప్పున ఇస్తామన్నారు. -
కొమ్మమూరు..కన్నీరు
కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. కాంట్రాక్టు సంస్థ వందల కోట్ల విలువైన కాలువ పనుల్లో అవకతవకలు జరిగాయి. పనులు చేయాల్సిన గడువు ముగిసిపోయినా.. పలుమార్లు నోటీసులిచ్చినా కనీసం స్పందించని కాంట్రాక్టు సంస్థపై సర్కారు చూపుతున్న వల్లమాలిన ప్రేమలో పదో వంతు కూడా తమపై లేదని రైతులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఫలితంగా వర్షాకాలంలోనూ కాలువలో సక్రమంగా నీరు పారక.. సాగునీరందక రైతులు ఏటా నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ► కాలువ రాదు.. చేను తడవదు ► ఏటా అన్నదాతకు అవస్థే ► తొమ్మిదేళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ ► పనుల విలువ రూ.196 కోట్లు ► ఇప్పటి వరకు చేసింది రూ.50 లక్షల పనులే ► ఈ ఏడాదీ మొదలుకాని పనులు చీరాల: కృష్ణాడెల్టా పరిధిలో ఎప్పుడో కాటన్ దొర సమయంలో కాలువల పనులు జరిగాయి. ఆనాటి నుంచి నేటి వరకు తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు. దీంతో ఏటా సాగునీరందక రైతులు విలవిల్లాడుతున్నారు. రైతుల మొర ఆలకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2 వేల కోట్లతో కృష్ణాడెల్టా ఆధునికీకరణ చేయాలని సంకల్పించారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రధాన సాగునీటి వనరైన కొమ్మమూరు కాలువను నల్లమడ కాలువ నుంచి పెదగంజాం వరకు రూ.196 కోట్లతో ఆధునికీకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి కాలువలకు 2007లో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. 47 కిలోమీటర్ల పొడవున నల్లమడ నుంచి పెదగంజాం వరకు ఉన్న కొమ్మమూరు కాలువను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంకెన్నేళ్లు.? కృష్ణా డెల్టా ఆ«ధునికీకరణ టెండర్ల ప్రక్రియ పూర్తయి తొమ్మిదేళ్లు సమీపిస్తున్నా కనీసం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ అండర్ కన్స్ట్రక్షన్సంస్థ పనులు పూర్తి చేయడం లేదు. ముందుగానే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ప్రభుత్వం చెల్లించింది. గతంలో సంభవించిన లైలా, జల్, ఓగ్ని, నీలం, థానే వంటి తుఫాన్లకు కొమ్మమూరు కాలువ కరకట్టలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువ కట్టలు సైతం బలహీనపడి కోతకు గురయ్యాయి. కృష్ణా డెల్టా నుంచి కొంత మేర నీరు వదలినప్పటికీ కొమ్మమూరు కాలువలకు ఇరువైపులా బలహీనంగా ఉన్న కట్టలకు గండ్లు పడి చుట్టు పక్కల ఉన్న పొలాలను నీరు ముంచెత్తుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కారణంతోనే కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి పూర్తి స్థాయిలో కాకుండా నామమాత్రంగా కొమ్మమూరు కాలువకు నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వలన దిగువ ప్రాంతాలకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో, కాటన్ దొర హయాంలో జరిగిన మరమ్మతులు మినహా మరలా పూర్తి స్థాయిలో కాలువల అభివృద్ధి జరగలేదు. ఆధునికీకరించాల్సింది ఈ విధంగా... కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా సాగునీటి కాలువ కొమ్మమూరు కెనాల్ను 47 కిలో మీటర్ల మేరకు ఆధునికీకరించాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లాలో నల్లమడ కాలువ నుంచి కాలువ చివరి ప్రాంతమైన పెదగంజాం వరకు పనులు చేయాలి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న కాలువను 5 లక్షల క్యూబిక్ మీటర్ల లోతు తవ్వడంతో పాటు కాలువ పొడవునా నడిచి వెళ్లేందుకు వీలుగా 34 ర్యాంపులు, 35,500 క్యూబిక్ మీటర్లు సీసీ లైనింగ్, ఇసుక ప్రాంతంలో 4.92 లక్షల చదరపు మీటర్ల పొడవున రాతితో లైనింగ్ ఏర్పాటు, 11 రెండు లైన్ల బ్రిడ్జిలు, 26 ఒక లైన్ బ్రిడ్జిలు, 64 బాక్స్ కల్వర్టులు, 15 అండర్ టన్నెళ్లను హై పర్టిక్యులర్స్ పద్ధతి ప్రకారం ఆధునికీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రూ.50 లక్షలను ఖర్చు పెట్టి పెదగంజాం ప్రాంతంలో కొన్ని కల్వర్టులు మాత్రమే నిర్మించారు. గడువు పూర్తై చాలాకాలం అయినా కృష్ణా డెల్టా ఆధునికీకరణపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నోటీసులు ఇచ్చాం...పెనాల్టీలు విధించాం – ఇరిగేషన్ డీఈ, విజయ్కుమార్, చీరాల. ఇప్పటికే కాంట్రాక్టు సంస్థకు పనులు చేయని కారణంగా పలుమార్లు నోటీసులు జారీ చేశాం. అలానే నష్ట పరిహారం విధించినా ఆ సంస్థ స్పందించడం లేదు. ఏదో ఒక కారణంతో గడువును పొడిగించుకుంటున్నారు. కొమ్మమూరు ఆ«ధునికీకరణ జరిగితేనే జిల్లాలోని రైతులకు మేలు జరుగుతుంది. -
రాయలసీమ పై సర్కారు నిర్లక్ష్యం
-
చర్చంతా 'కృష్ణా'పైనే..
‘అపెక్స్ కౌన్సిల్’ ఎజెండాను ఖరారు చేసిన చైర్పర్సన్ ఉమాభారతి ≈ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపైనే ప్రధానంగా చర్చ ≈ పట్టిసీమ, పోలవరం జలాల్లో వాటాపై తేల్చేది కృష్ణా ట్రిబ్యునలేనని స్పష్టీకరణ ≈ గోదావరి ప్రాజెక్టులపై చర్చకు స్పష్టమైన హామీ ఇవ్వని కేంద్ర జల వనరుల శాఖ ≈ ఈనెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. ≈ పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో ఏపీకి తీవ్ర నష్టం ≈ శ్రీశెలం నుంచి 120 టీఎంసీలు తోడుకోనున్న తెలంగాణ సర్కారు ≈ రాయలసీమ, నాగార్జునసాగర్, పులిచింతల ఆయకట్టు, కృష్ణా డెల్టాకు కష్టాలే ≈ ఏపీ ప్రభుత్వం కౌన్సిల్లో సమర్థంగా వాదనలు వినిపించాలి ≈ రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి ≈ సాగునీటి రంగ నిపుణుల సూచన సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులపైనే ‘అపెక్స్ కౌన్సిల్’లో ప్రధానంగా చర్చించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎజెండాను ఖరారు చేసింది. ఈ నెల 21న కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావులకు సమాచారం పంపింది. పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల తదితర గోదావరి ప్రాజెక్టులపైనా చర్చించాలన్న ప్రతిపాదనపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర జల వనరుల వాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల వివాదాన్ని పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సిద్ధమయ్యారు. పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టుల ద్వారా కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో 90 టీఎంసీల వాటా తమకు కేటాయించాలని, దానిపై చర్చించాలన్న తెలంగాణ సర్కారు ప్రతిపాదనపై కృష్ణా ట్రిబ్యునల్లో తేల్చుకోవాలని ఇప్పటికే సూచించామని, అపెక్స్ కౌన్సిల్లో దాన్ని చర్చించలేమని స్పష్టం చేశారు. సమర్థంగా వాదనలు వినిపిస్తేనే... ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు 21న జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎంతో కీలకమైనది. రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడాలంటే... అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై కౌన్సిల్లో ఏపీ ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి వాటిల్లే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం విఫలమైనా రాష్ట్ర ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సమయాన్ని బట్టి ఆర్డీఎస్పై చర్చిద్దాం ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీం) కుడి కాలువ ను తవ్వేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని, దానికి అనుమతులు లేవంటూ తెలంగాణ సర్కారు చేసిన ఫిర్యాదుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. సమయాన్ని బట్టి ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దామని హామీ ఇచ్చింది. గోదావరి జలాల వినియోగంపై తమను సంప్రదించకుండా మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అనుమతి లేకుండా 135 టీఎంసీల వినియోగానికి సిద్ధమవడంపై చర్చించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదననూ కేంద్రం సున్నితంగా తోసిపుచ్చింది. ఈ అంశాన్ని అజెండాలో చేర్చలేమని, వీలును బట్టి చర్చిద్దామంటూ దాటవేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అజెండాను ఖరారు చేసిన అపెక్స్ కౌన్సిల్ చైర్ పర్సన్ ఉమాభారతి.. ఈ నెల 21న సమావేశానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లకు శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ ప్రాజెక్టులతో ఏపీ ఎడారే! రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు కృష్ణా డెల్టా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కృష్ణా నది వరప్రదాయిని. ఈ నదిపై ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే లెక్కలేనన్ని ప్రాజెక్టులు, బ్యారేజీలు, లిఫ్ట్లు కట్టడంతో దిగువకు చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. అన్ని అడ్డంకులు దాటుకొని, శ్రీశైలంలోకి నీరు వచ్చినా.. దాన్ని తోడేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ లిఫ్ట్ల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తోడుకోవాలని నిర్ణయించింది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. ఈ మట్టం వద్ద గరిష్టంగా 215 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవల్ 840 అడుగులు అయినప్పటికీ శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప దాని ద్వారా రాయలసీమకు నీరివ్వడం సాధ్యం కాదు. వెలిగొండ ప్రాజెక్టుకు నీరివ్వాలన్నా శ్రీశైలంలో 854 అడుగుల మట్టాన్ని కొనసాగించాలి. కానీ, 800 అడుగల వద్దే నీటిని తోడుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తోంది. రోజుకు 2 టీఎంసీల చొప్పున తోడేస్తే.. భారీ వరద ఉంటే తప్ప శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు చేరడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్కు కనీవినీ ఎరుగని నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం నుంచి నీటిని తెలంగాణ తోడేస్తే రాయలసీమతోపాటు దిగువనున్న నాగార్జునసాగర్, పులిచింతల ఆయకట్టు, కృష్ణా డెల్టాకు కష్టాలు తప్పవు. -
కృష్ణా డెల్టాను నాశనం చేయొద్దు: నాగిరెడ్డి
తెనాలి: పట్టిసీమ పేరుతో కృష్ణా డెల్టాను నాశనం చేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి ఉంటే కృష్ణాబోర్డు నుంచి ఏమేరకు నీటిని తీసుకుంటారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరు అందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను నాగిరెడ్డి పరిశీలించారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. -
పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టా నాశనం చేయెద్దు
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్.నాగిరెడ్డి తెనాలి పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టాను నాశనం చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి వుంటే కృష్ణాబోర్డు నుంచి ఏ మేరకు నీటిని తీసుకొంటారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను మంగళవారం నాగిరెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగుభూమి 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. తెలంగాణలో సాగుభూమి 38.58 లక్షల హెక్టార్ల నుంచి 43 లక్షల హెక్టార్లకు విస్తరించిందని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్లో ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో పంటల సాగు 69 శాతం కాగా, గుంటూరు జిల్లాలో 59 శాతం మాత్రమేనని చె ప్పారు. ఇదే జిల్లాలో 1.89 లక్షల హెక్టార్లకు 76 శాతమే సాగు చేయగలిగినట్టు నాగిరెడ్డి వివరించారు. ఏరువాక పేరుతో పండుగలు చేసిన ప్రభుత్వం, జులై 10వ తేదీనుంచి నారుమళ్లు పోసుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాడెల్టా రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నాగిరెడ్డి ఆరోపించారు. పట్టిసీమ నీటిని నెల్లూరు, పెన్నావరకు తీసుకెళతామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం కృష్ణాడెల్టాలో నారుమళ్లకు కూడా ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. వెదజల్లిన చేలల్లో పంటలు ఎండిపోతున్నా, పుష్కరాల కోసమని అక్కడే వుంటున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదనీ, సుభిక్షమైన కృష్ణాడెల్టాను బీడుగా మార్చారని ఆరోపించారు. పంటకాలువల నుంచి ఇంజిన్లతో బ్రాంచి కాలువలకు, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పొలాలు తడువుకోవాల్సిన దుస్థితిని రైతులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టిసీమ నీటిని తరలిస్తున్న పోలవరం కాలువను కాంక్రీట్ లైనింగ్తో సహా 130 కి.మీ వైఎస్ హయాంలో పూర్తిచేస్తే తర్వాత 42 కి.మీ దూరం కాలువను సక్రమంగా నిర్మించని కారణంగానే గండి పడిందన్నారు. మళ్లీ గండ్లు పడతాయన్న భయంతోనే పట్టిసీమకు గల 24 పంపులను వినియోగించే ధైర్యం చేయలేకపోతున్నట్టు చెప్పారు. మరోవైపు గత రెండేళ్లలో ప్రకటించిన కరువు మండలాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇంతవరకు అందించలేదని గుర్తుచేశారు. 2003లో కరువు సమయంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. పుష్కరాల కోసం తీసుకున్న నీటిని గత రెండుమూడు రోజులుగా ఇస్తున్న ప్రభుత్వం, ఇదే పరిమాణంలో కంటిన్యూగా సరఫరా ఇస్తామని హామీనివ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగం కోసం ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా వుందన్నారు. వీరితో పార్టీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పెరికల కాంతారావు, యలవర్తి రామమోహనరావు, యలవర్తి నాగభూషణం, గాదె శివరామకృష్ణారెడ్డి, ఉయ్యూరు అప్పిరెడ్డి, రాపర్ల నరేంద్ర ఉన్నారు. -
ఖరీఫ్కు గడ్డుకాలం..
కృష్ణాడెల్టాకు అరకొరగా నీరు ఇప్పుడు నాట్లు వేస్తే జనవరిలో కోతలు ఆందోళనలో రైతులు మచిలీపట్నం : కృష్ణా డెల్టాకు గడ్డు కాలం. పాలకుల నిర్లక్ష్యంతో వరిసాగు చేసే రైతుల పాలిట శాపంగా మారింది. ఆగస్టు ముగుస్తున్నా పూర్తిస్థాయిలో కాలువలకు నీరు విడుదల చేయలేదు. వర్షాలు కురవని సమయంలో అన్ని ప్రధాన కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 15 వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కాలువల్లో నీటిమట్టం పెరగని పరిస్థితి నెలకొంది. ఎండిపోతున్న పైరు.. గతంలో నెలలో కురిసిన ఓ మోస్తరు వర్షానికి రైతులు నారుమళ్లు పోశారు. కొంత మేర నాట్లు వేశారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పైరు సగం మేర చనిపోయింది. నాలుగు రోజులుగా కాలువలకు నీరు విడుదల చేస్తున్నా పొలాలకు ఎక్కేంతగా నీట్టి మట్టం పెరగటం లేదు. దీంతో కాలువ పక్కనే భూములు ఉన్న రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారు. 2.40 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. ఆగస్టు 15లోపే వరినాట్లు పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ రూరల్, కంకిపాడు, ఉంగుటూరు, గుడివాడ, తోట్లవల్లూరు, పామర్రు తదితర మండలాల్లో సబ్మెర్సిబుల్ పంపులు ఉన్న బోర్ల ద్వారా దాదాపు 2.40 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తిచేశారు. వెద పద్ధతితో కొంతమేర వరినాట్లు వేసినా, నీరు లేకపోవటంతో ఎండిపోయింది. ఖరీఫ్లో ఏ రకం వరివంగడం సాగు చేసినా కనీసంగా 145 రోజులకు కోతకు వస్తుంది. పట్టిసీమ పేరుతో మాయ.. ప్రకాశం బ్యారేజీ నుంచి అన్ని ప్రధాన కాలువలకు రోజుకు 15 వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. పట్టిసీమ నుంచి 8,500 క్యూసెక్కుల నీరు వచ్చినా డెల్టాకు ఏ విధంగా సాగునీటి అవసరాలను తీరుస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే డెల్టా బీడుగా మారి దర్శనమిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు దీని ప్రభావం అపరాల సాగుపై తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు. -
కృష్ణా డెల్టాలో కరువు ఛాయలు
► వైఎస్ జగన్ను కలిసిన ► పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కృష్ణా డెల్టా పూర్తిగా ఎండిపోయిందని వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్కు విన్నవించారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను రమేష్ కలిశారు. కృష్ణా జిల్లాలో రైతులుకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్కు వివరిం చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సీఆర్డీఏలో గ్రీన్బెల్ట్ పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. అనంతరం రమేష్ సాక్షితో మాట్లాడుతూ కృష్ణా,గోదావరి డెల్టాల పరిరక్షణ కోసం ఈనెల 16 నుంచి 18 వరకు కర్నూలులో వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్తామని వివరించారు. -
ముడుపుల యావ తప్ప ముందుచూపేదీ?
గోదావరి ట్రిబ్యునల్ నిబంధనలు పట్టని సీఎం సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగితే బేసిన్ మారుతుంది కనుక గోదావరి ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కొన్ని హక్కులు కల్పించింది. 7 (ఇ), 7 (ఎఫ్) క్లాజుల ప్రకారం ఆ హక్కులు సంక్రమిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు నమ్మకంగా నీరందించవచ్చు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణాజలాల్లో కర్ణాటక, మహారాష్ర్టకు 35 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ప్రాజెక్టు అనుమతుల కంటే ముందుగానే కాల్వల పనులను శరవేగంగా పూర్తిచేయడానికి, అనుమతులు రాగానే పోలవరం ప్రాజెక్టును కూడా వేగంగా పూర్తి చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాధాన్యమిచ్చారు. 190 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకోవడానికి వీలు కల్పించే పోలవరం వంటి భారీ ప్రాజెక్టు వల్ల 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు కోల్పోయినా పరవాలేదు కానీ.. పట్టిసీమ వంటి 4 టీఎంసీల పిల్ల ప్రాజెక్టుతో ఇపుడు 35 టీఎంసీల నీటిని కోల్పోయే ప్రమాదమేర్పడడమే విచారకర అంశం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయ ఫలితమేనని సాగునీటి రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముడుపుల యావలో రాష్ట్రానికి జరుగుతున్న ఈ నష్టాన్ని చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శిస్తున్నారు. వైఎస్ ముందుచూపు వల్లే వేగంగా కుడికాల్వ పనులు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణా జలాల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ ఎగువ రాష్ట్రాలకు దక్కుతుందనే నిబంధన దృష్ట్యా.. అనుమతి వచ్చిన వెంటనే పనులు ముమ్మరం చేసి ఆఘమేఘాల మీద పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేదంటే కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు 35 టీఎంసీలు వాడుకుంటే.. ఏపీ తీవ్రంగా నష్టపోతుంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన నేపథ్యంలో.. ప్రాజెక్టు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా పట్టిసీమ లిఫ్ట్ ద్వారా కుడికాల్వకు నీరు మళ్లించడానికి పూనుకొంది. రెండు నదుల్లోనూ ఒకేసారి వరద.. నిల్వకు లేని అవకాశం ‘ఇటు గోదావరి, అటు కృష్ణా.. రెండు నదుల్లోనూ దాదాపు ఒకే సమయంలో వరదలు ఉంటాయి. కృష్ణాలో వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు మళ్లించడంలో అర్థం లేదు. కృష్ణాలో వరద లేనప్పుడు గోదావరిలో కూడా ప్రవాహం పెద్దగా ఉండదు. ఫలితంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. కుడికాల్వకు నీళ్లు మళ్లించిన తర్వాత.. నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. కృష్ణా డెల్టాలో నీరు అవసరం ఉన్నప్పుడే, అవసరం ఉన్నంత మేరకే గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గోదావరిలో ప్రవాహం ఉండే అవకాశం లేనందున, కృష్ణా డెల్టాకు నీళ్లివ్వడం సాధ్యం కాదు. అంటే.. లిఫ్ట్ వల్ల కృష్ణా డెల్టాకు అదనంగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని.. ఎగువ రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడితే.. కృష్ణా జలాల్లో మనకు ఉన్న నికర జలాల నుంచి 35 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. రాష్ట్రానికి, ప్రత్యేకించి రాయలసీమ, కృష్ణా డెల్టాకు తీవ్ర నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7(ఇ) క్లాజ్: ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకువాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంలో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక,మహారాష్ట్రకు ఉంటుంది. 7(ఎఫ్)క్లాజ్: 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని కుడికాల్వకుమళ్లిస్తే.. ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు అదే దామాషాలో వాటా ఉంటుంది. -
ఏడాదిలోనే పట్టిసీమ పూర్తి
శాసనసభలో సీఎం ప్రకటన సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 2019 కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేశారు. గతంలో తాను పునాది వేసిన సాగునీటి ప్రాజెక్టులను తిరిగి తన హయాంలోనే పూర్తి చేస్తున్నానని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి నీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నానని, నదుల అనుసంధానానికి కృషి జరుగుతోందని చెప్పారు. రాయలసీమ జిల్లాలను హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నారు. చంద్రబాబు సుదీర్ఘోపన్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు కట్టడం వల్ల రాష్ట్రంలోని జలాశయాలకు సరిపడా నీరు రావడం లేదు. ఇంకోవైపు గోదావరి నీరు వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి నీటిని కృష్ణాకు మళ్ళించే ఉద్దేశంతోనే పట్టిసీమను చేపట్టాం. ► ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లు, డ్రాయింగులు ఏమాత్రం ఆలస్యం లేకుండా అధికారులు పూర్తిచేశారు. ప్రతిరోజు వెయ్యిమంది ప్రాజెక్టు వద్ద పనిచేశారు. ► 24 పంపులు, మోటార్లను ఉపయోగించి 8,500 క్యూసెక్కుల గోదావరి జలాలను తోడే విధంగా పథకాన్ని రూపొందించాం. ► రాష్ట్రంలోనే తొలిసారిగా 354 క్యూసెక్కుల సామర్థ్యం గల వర్టికల్ టర్బయిన్ పంపులను నీళ్ళను లిఫ్ట్ చేయడానికి ఉపయోగించాం. ► పట్టిసీమ వల్ల 80 నుంచి 100 టీఎంసీల గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదికి మళ్ళించడానికి వీల వుతుంది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది. ► గత వ్యవసాయ సీజన్లో సుమారు 4.20 టీఎంసీల నీటిని పట్టిసీమ వద్ద లిఫ్ట్ చేయడం జరిగింది. మరో 4.6 టీఎంసీలను ఆడిపూడి వద్ద లిఫ్ట్ చేశాం. పట్టిసీమ నీటి వల్ల కృష్ణాడెల్టాలో రూ.2,500 కోట్ల విలువైన వరిపంటను కాపాడాం. -
కృష్ణా డెల్టాకు నీటి విడుదల
నాగార్జునసాగర్ : తాగు నీటి అవసరాల మేరకు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డెల్టాకు శుక్రవారం నీటిని విడుదల చేశారు.విద్యుత్ ఉత్పాదక కేంద్రం ద్వారా 7 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేష్ రాష్ట్రానికి నాలుగున్నర టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా... ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీవరకు రెండు టీఎంసీల నీరు విడుదల చేశారు. మిగిలిన రెండున్నర టీఎంసీలు పూర్తి అయ్యే వరకూ నీటి విడుదల కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
గ్రామం సజీవ సమాధి
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవ రేఖ. ఈ ప్రాజెక్టు వస్తే కృష్ణాడెల్టాకు నీటి కష్టాలు తీరుతాయి. విశాఖపట్నంకు తాగునీరు అందుతుంది. ఇదంతా నాణేనికి ఒకైవెపు. మరోవైపు ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో గ్రామాలు కనుమరుగైపోతున్నాయి. ఈ విధంగా సజీవ సమాధి అయిపోతున్న గ్రామమే పోలవరం మండలం ‘మామిడిగొంది’. ఒకప్పుడు 160 గడపలతో పచ్చటి చెట్లు, చక్కటి పంట పొలాలు, పశుపక్ష్యాదులతో క ళకళలాడిన గ్రామమే ఇది. ఇప్పుడు ఈ గ్రామాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించి మరోచోటికి తరలించింది. గ్రామాన్ని వదిలివెళ్లిపోయే వారు తమ ఇళ్ల కర్రలు, ఆకులు, సామగ్రిని తీసుకుపోయారు. గుడి-బడి, వాటర్ ట్యాంక్ పక్కా నిర్మాణాలు కావటం అవి అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామం పోలవరం ప్రాజెక్టు కోసం తవ్వుతున్న మట్టి కింద సజీవ సమాధి అయిపోతోందని తెలియజేసే సజీవ చిత్రమే ఇది. గ్రామానికి చెందిన గుడి (సాయిబాబా చిత్రం ఉన్న భవనం) పక్కనే బడి, గ్రామస్తులకు మంచినీటిని అందించిన వాటర్ ట్యాంక్ మరికొద్ది రోజుల్లో మట్టిదిబ్బలతో మూసుకుపోనున్నాయి. వాటిని చూసి గ్రామస్తులు ఎంతో ఖేదంతో ఉన్నారు. -ఫొటో: వీరభగవాన్ తెలగారెడ్డి, విజయవాడ -
ఈ నీళ్లు ఏ మూలకు?
సాగర్ నుంచి ఇప్పటివరకు 3.68 టీఎంసీలు విడుదల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులను చేరని తాగునీరు సాక్షి, విజయవాడ బ్యూరో :కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగునీటి సరఫరా చేసే విషయంలో జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాగు నీటి కోసం కృష్ణాడెల్టాకు కేటాయించిన 4 టీఎంసీలు ప్రజల అవసరాలకు సరిపోవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నీరు కాల్వల్లో ప్రవహిస్తుందేగానీ, చెరువులకు చేరడం లేదు. కాల్వల విడుదల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అతి తక్కువ పరిమాణంలో నీటిని వదలడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నేడో రేపో సాగర్ నుంచి నీటి విడుదల నిలిపి వేయనున్నప్పటికీ, ఇంకా 10 శాతం చెరువులు కూడా నిండలేదు. తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు కృష్ణాడెల్టా పరిధిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న 480 మంచినీటి చెరువులను నింపితే గానీ మార్చి నుంచి ఎదురయ్యే తాగునీటి ఎద్దడి పరిష్కారం కాదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కృష్ణాడెల్టాకు మళ్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా గత శుక్రవారం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల జరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు 4,981 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గుంటూరు చానల్కు మరో 43 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి అటు తూర్పు, ఇటు పశ్చిమ డెల్టా కాల్వలకు నీటి విడుదల జరుగుతున్నా తాగునీటి చెరువులు 10 శాతం కూడా నిండలేదు. తూర్పు, పశ్చిమ వైపు ఉన్న రెండు ప్రధాన కాల్వలకూ కనీసం 8 వేల క్యూసెక్కులు వదిలితేనే కాల్వ దిగువ వరకు వేగంగా ప్రవహించే వీలుంటుంది. 5 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రైవస్, ఏలూరు కాల్వలకు 1000, 500 క్యూసెక్కుల చొప్నున విడుదల చేయడంతో మూడు రోజులుగా నీళ్లు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఇంకా రెండ్రోజులైతేనే చెరువులను చేరతాయి. పులిచింతలలో 1.20 టీఎంసీలు... నాగార్జునసాగర్ నుంచి విడుదల చేస్తున్న తాగునీటిలో 1.20 టీఎంసీలను పులిచింతల రిజర్వాయర్లో నిల్వ చేస్తున్నారు. మిగతా నీటిని మాత్రమే కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నీటినే బ్యారేజీ అధికారులు రెండు జిల్లాల తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, పెదకాకాని మండలాల్లోని 100కు పైగా చెరువులకు తాగునీటి అవసరం ఉంది. కేటాయించిన 4 టీఎంసీల్లో ఇప్పటి వరకు 3.68 టీఎంసీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా 0.32 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఉన్న నీరు సరిపోకపోతే పులిచింతల నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. నీటిని కేవలం తాగు అవసరాలకే ఉపయోగించుకోవాలని, పంటల సాగు, చేపల చెరువుల కోసం వాడకూడదని విజయవాడ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వైఎస్ సుధాకర్రావు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఈ నీరు.. శివారుకు చేరేనా! దాహార్తి తీరేనా?
పులిచింతలకు 2.8 టీఎంసీలు చేరిక ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం కాల్వలకు కొద్దికొద్దిగా నీటి విడుదల నాలుగు రోజుల్లో చెరువులకు తాగునీరు శివారుకు చేరికపై అనుమానాలు సాక్షి, విజయవాడ : కృష్ణా డెల్టాలో చెరువులు అడుగంటడంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. నాలుగు టీఎంసీలు విడుదల చేస్తామని అంగీకరించిన కృష్ణా యాజమాన్య బోర్డు ఆ మేరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తోంది. ఆ నీరు ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఇరిగేషన్ అధికారులు ఆ నీటిని కొద్దికొద్దిగా కాలువలకు వదులుతున్నారు. చెరువులకు నీరందే సరికి మరో నాలుగైదు రోజులు పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ నీటిలో శివారుకు ఎంత చేరుతుందనే అనుమానాలు ఆ ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి. పులిచింతలలో, ప్రకాశం బ్యారేజీలో నిల్వలు పోను విడుదల చేసే నీటిలో చెత్తా చెదారం వల్ల కొంత వృథాగా పోతుందని, మరికొంత ఇంకిపోతుందని చెబుతున్నారు. మిగిలిన నీటిలో అక్రమ మళ్లింపులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిచింతల వద్దకు 2.8 టీఎంసీల నీరు... ఎగువ నుంచి విడుదల చేసిన నీరు శనివారానికి పులిచింతల వద్దకు 2.8 టీఎంసీలు చేరింది. ఇందులో 1.2 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద 8.2 అడుగుల నీరు ఉండగా, ప్రస్తుతం వస్తున్న నీటితో 10.6 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద 12 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసి మిగిలినది కాల్వల ద్వారా చెరువులకు వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో కొంత నీరు చేరడంతో కొద్దికొద్దిగా కాల్వలకు వదులుతున్నారు. కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు... కృష్ణాడెల్టా పరిధిలోని కాల్వలకు 3,212 క్యూసెక్కుల నీరు వదులుతున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రైవస్ కాల్వకు 503 క్యూసెక్కులు, ఏలూరు కాల్వకు 511, బందరు కాల్వలకు 152, అవనిగడ్డ, నాగాయలంక వైపు వెళ్లే కేఈబీ కాల్వకు 500, తెనాలి వైపు వెళ్లే కేడబ్ల్యూ కాల్వకు 1,516 , గుంటూరు చానల్కు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కాల్వల ద్వారా వదులుతున్న నీటితో జిల్లాలోని 370 చెరువులకు, బందరు, గుడివాడ మున్సిపాలిటీలకు నీరు ఇవ్వనున్నారు. పులిచింతల నుంచి వస్తున్న నీటి నుంచే విజయవాడ కార్పొరేషన్తో పాటు, ఎన్టీటీపీఎస్ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. విడుదల చేసిన నీటిలో దాదాపు ఐదువేల క్యూసెక్కుల మేరకు కాలువల్లో పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం పారదోలేందుకు పోతుందని అధికారులు చెబుతున్నారు. నీరంతా వృథా కాకుండా ఉండటం కోసం తొలుత బందరు కాల్వకు 500 క్యూసెక్కులు వదిలిన అధికారులు.. ప్రస్తుతం 152 క్యూసెక్కులకు తగ్గించారు. -
ఎప్పటికో ఆధునికీకరణ?’
• కృష్ణాడెల్టా పనుల్లో తీవ్ర జాప్యం ఏడేళ్లలో చేసింది సగం పనులేతాగునీరు విడుదల చేశాకే పనులు ప్రారంభం అరకొరగానే నీటి విడుదల రెండు నెలల్లోనే మళ్లీ తాగునీటి సమస్య సాక్షి, విజయవాడ: కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాస్తవంగా ఈ ఏడాది రబీ పంట లేదు. ఆధునికీకరణ పనులకు తగినంత సమయం ఉంది. ఇప్పటివరకు పనులు చేయించేందుకు అధికారులు సమాయత్తం కాలేదు. జిల్లాలోని అనేక చెరువుల్లో నీరు లేదు. వాటిని నింపిన తరువాతనే ఆధునికీకరణ పనులు చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. నాలుగు టీఎంసీల నీరు విడుదల... కృష్ణా డెల్టా పరిధిలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉధృతమవుతోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు నాలుగు టీఎంసీల నీరు విడుదల చేసింది. నీరు పులిచింతలకు వచ్చిన తరువాత అక్కడ కొంత నిల్వ చేస్తారు. మిగిలిన నీటిని ప్రకాశం బ్యారేజ్కి వదులుతారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8.6 అడుగుల నీరు ఉంది. కనీసం 11 అడుగుల వచ్చే వరకు నీటిని నిల్వ చేస్తారు. ఆ తరువాతనే కాల్వలకు వదిలే అవకాశం ఉంది. ఇదంతా జరిగే సరికి మరో పక్షం రోజులు పడుతుంది. ఆ తరువాత జిల్లాలో 370 చెరువులు నింపాల్సి ఉంటుంది. మచిలీపట్నం, పెడన, బంటుమల్లి, కృత్తివెన్ను, పెడన, గుడివాడ తదితర ప్రాంతాల్లోని కొన్ని చెరువులు ఇప్పటికే అడుగంటాయి. మిగిలిన చెరువుల్లో పది నుంచి 30 శాతం మాత్రమే నీరు ఉంది. ప్రస్తుతం వచ్చే నీటిలో కొంత కాల్వల్లోనే ఇంకిపోతుంది. ఈ లెక్కన సాగర్, శ్రీశైలం నుంచి వచ్చే నీరు చెరువులు వద్దకు చేరేసరికి సుమారుగా 20 నుంచి 30 రోజులు పడుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెరువులను పూర్తిగా నింపితే మూడు నాలుగు నెలల వరకు నీటి ఎద్దడి ఉండదు. ఇప్పుడు వచ్చే నీటితో 50 శాతం చెరువులు నిండే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు నెలలకే గ్రామాల్లో నీటి సమ స్య వచ్చే అవకాశంఉంది. మే నాటికి మరళా కృష్ణా యాజ మాన్య బోర్డును అడిగి మరికొంత నీటితో చెరువులు నిం పాల్సి ఉంటుంది. ఈ విధంగా పైనుంచి వచ్చే నీటిని కాల్వ ల ద్వారా కిందకు వదులుతూ పోతే కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు వేగంగా చేయడం ఏమాత్రం సాధ్యపడదు. అనుమతించినా.. చేరుకోని లక్ష్యం కృష్ణా డెల్టా ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయంలో 2007 నవంబర్లో రూ.4,573 కోట్లతో 84 ప్యాకేజీలకు ప్రభుత్వం అనుమతించింది. రూ.3003.862 కోట్లకు ఒప్పందంతో పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో కృష్ణా జిల్లా 46 ప్యాకేజ్లకు రూ.1486.954 కోట్లు, గుంటూరు జిల్లాలో 38 ప్యాకేజ్లకు రూ. 1516. 91 కోట్లు కేటాయించారు. గతేడాది మార్చి వరకు మొత్తం రూ.1387.16 కోట్ల పనులు జరిగాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రూ.300 కోట్ల పనులు చేయాలని లక్ష్యం గా నిర్ణయించుకున్నారు. అయితే కేవలం రూ.116కోట్ల పనులు మాత్రమే జరిగాయి. మొత్తంగా రూ.1503. 16 కోట్ల పనులు జరిగాయి. ఆ తరువాత వర్షాలు పడడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ లెక్కన ఎనిమిది ఏళ్లల్లో సగం పనులు మాత్రమే జరిగాయని ఇరిగేషన్ లెక్కలు చెబుతున్నాయి. రబీ లేకపోయినా.... ఈ ఏడాది రబీ లేదు. మార్చి నుంచి జూలై వరకు కృష్ణా డెల్టా పనులు జరుగుతాయని రైతులు భావించారు. అరకొరగానే పనులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చెరువులకు నీరు నింపిన తరువాత కాల్వలు ఎండి పనులు ప్రారంభించే సరికి రెండు నెలల కన్నా ఎక్కువ సమయం ఉండడం లేదు. ఫలితంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. -
నీటి విడుదలకు ఓకే
కృష్ణా డెల్టాకు 4 టీఎంసీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ నిర్ణీత వాటా కంటే ఇప్పటికే ఎక్కువగా వినియోగించుకుందని స్పష్టం చేసిన తెలంగాణ... ప్రస్తుతం కృష్ణా డెల్టా అవసరాల కోసం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీటి విడుదల పట్ల సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీలోని కృష్ణా డెల్టా అవసరాల కోసం 4 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు తెలంగాణ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 1.2 టీఎంసీల నీటి విడుదలకు ఓకే చెప్పింది. ఇప్పటికే అధిక వినియోగం.. తెలంగాణ, ఏపీల్లో వినియోగం కోసం శ్రీశైలం నుంచి నీటి విడుదల అంశంపై ఈనెల 5న బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్తో కూడిన త్రిసభ్య కమిటీ అత్యవసరంగా సమావేశమైన విషయం తెలిసిందే. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాల కోసం 6 టీఎంసీలు విడుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే తెలంగాణ సానుకూలంగా స్పందించకపోవడంతో... 4 టీఎంసీల విడుదలకైనా అంగీకరించాలని కోరింది. ప్రభుత్వంతో మాట్లాడాక నిర్ణయం చెబుతానని తెలంగాణ ఈఎన్సీ ఆ సమావేశంలో చెప్పారు. అనంతరం ప్రభుత్వ పెద్దలతో ఈ అంశంపై మాట్లాడిన సమయంలో అదనపు నీటి విడుదల తెరపైకి వచ్చింది. ‘‘కృష్ణా బేసిన్లో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కృష్ణాలో లభించిన దాదాపు 140 టీఎంసీల నీటిలో తెలంగాణ 44.79 టీఎంసీలు, ఏపీ 95.15 టీఎంసీల మేర వినియోగించుకున్నాయి. నిర్దిష్ట వాటా నిష్పత్తి ప్రకారం చూస్తే.. తెలంగాణ 52.4 టీఎంసీలు, ఏపీ 88.12 టీఎంసీలు వాడుకోవాలి. ఈ లెక్కన తెలంగాణ 7 టీఎంసీలు తక్కువగా వాడుకోగా.. ఏపీ 7 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంది...’’ అని తెలంగాణ ఉన్నతాధికారులు తేల్చారు. దీంతో ఏపీకి అదనపు నీటి విడుదలకు తెలంగాణ ఒప్పుకోదనే భావన వ్యక్తమైంది. అయినా ఏపీ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన తెలంగాణ.. 4 టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నీటి విడుదలకు సంబంధించి మంగళవారం కృష్ణా బోర్డు ఉత్తర్వులు విడుదల చేసింది. ‘ఏపీ విజ్ఞప్తికి తెలంగాణ అంగీకరించిన నేపథ్యంలో శ్రీశైలం నుంచి 4.2 టీఎంసీలు (0.2 టీఎంసీల సరఫరా నష్టంతో కలిపి) విడుదల చేయాలి. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 1.2 టీఎంసీలను శ్రీశైలం నుంచి విడుదల చేయాలి. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే విధంగా నీటి విడుదల జరగాలి. విద్యుత్ను ఇరు రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలి..’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బోర్డు చైర్మన్ పండిట్ పదవీ విరమణ కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.కె.జి.పండిట్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అధ్యక్షతన చివరిగా బుధవారం బోర్డు సమావేశం జరగనుంది. పండిట్ పదవీ విరమణ తర్వాత గోదావరి బోర్డు చైర్మన్ రాంశరణ్కు కృష్ణా బోర్డు బాధ్యతలను అదనంగా అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
కృష్ణా డెల్టాలో కనిపించని దీవాళి సంబరాలు
-
తడారి.. ఎడారి!
చేనుకు చేటు.. రైతుకు దుఃఖం వరికి పొట్టదశలోనూ సాగునీరందని వైనం ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి కృష్ణాడెల్టా భవితవ్యం ప్రశ్నార్థకం మచిలీపట్నం : అన్నదాతలకు పెద్ద కష్టమే వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణాడెల్టాకు ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకుండా మిన్నకుండిపోయింది. పట్టిసీమ ద్వారా సాగునీరిస్తామని సీఎం, మంత్రులు చెప్పడంతో ఆశపడి వరిసాగు చేశామని, చివరికి తమకు నిరాశే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి మట్టిపాలు ఈ ఏడాది ఖరీఫ్ సెప్టెంబర్ 30తో ముగిసింది. ఈ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా 4.64 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తిచేశారు. 1.70 లక్షల ఎకరాల్లో నాట్లు పడలేదు. నాట్లు పూర్తిచేసిన పొలాల్లోని పైరు అడపాదడపా కురిసిన వర్షపునీరు కారణంగా బతికింది. డ్రెయిన్లు, బోరునీటి ఆధారంగా మరికొంత భూమిలోని పైరును రైతులు బతికించుకున్నారు. ప్రస్తుతం పైరు చిరుపొట్ట, పొట్టదశలో ఉంది. ఈ దశలో తప్పనిసరిగా వరికి నీరు కావాల్సిందే. నీరందకుంటే పైరు ఈతకు రాదని, వచ్చినా తాలు, తప్పలు వస్తాయని రైతులు అంటున్నారు. చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పామర్రు, మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో చిరుపొట్ట, పొట్టదశలో ఉన్న వరి పొలాలు నెర్రెలిస్తున్నాయి. సాగునీరు అందకపోవడంతో మూడు రోజుల క్రితం పామర్రులో ఓ రైతు తన వరి పొలాన్ని దున్నేశాడు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇంతా జరుగుతున్నా పాలకులు సాగునీటిని విడుదల చేసేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టామని, వరిపైరు పొట్టదశలో ఉన్న సమయంలో నీరు అందుబాటులో లేకుంటే ఈ పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ నుంచి ఖరీఫ్ సీజన్లో 80 టీఎంసీల నీరు కృష్ణాడెల్టాకు విడుదల చేయాల్సి ఉండగా చుక్కనీరు కూడా ఇవ్వలేదు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాడెల్టాకు ప్రథమ వినియోగ హక్కు ఉన్నా పాలకులు పెదవి విప్పడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. -
కృష్ణా డెల్టాకు నీటి విడుదల
మరో రెండు రోజుల్లో కుడి కాలువకు ? విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి కృష్ణాడెల్టాకు ఆదివారం తెల్లవారుజాము నుంచి అధికారులు 1,133 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణాడెల్టా ఆయకట్టు ప్రాం తంలో తాగునీటి అవసరాల నిమిత్తం నీటి ని విడుదల చేయాలని ప్రభుత్వం కృష్ణాబోర్డుకు విజ్ఞప్తి చేసింది. దీంతో 5టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు నాలుగు రోజుల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా డెల్టాకు నీటి విడుదల జరి గింది. మరో రెండ్రోజుల్లో కుడికాలువకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 509.40 అడుగుల వద్ద ఉంది. ఇది 130.6544 టీఎంసీలకు సమానం. -
కృష్ణాడెల్టాకు నీళ్లు విడుదల
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణాడెల్టాకు ఆదివారం 1,112 క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా ఈ నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
దేవినేని ఉమకు జోగు రమేష్ బహిరంగ సవాల్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగు రమేష్ బహిరంగ సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో వైఎస్ఆర్ సీపీ నేతలతో కృష్ణా డెల్టాలో పర్యటించే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు. కృష్ణాజిల్లా వాసులకు సాగు, తాగునీరు అందించలేదని నువ్వు రాయలసీమను రతనాల సీమ చేస్తావా అంటూ జోగు రమేష్ ఈ సందర్భంగా ఉమపై ధ్వజమెత్తారు. -
'కృష్ణా, సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి'
గుంటూరు: గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), డాక్టర్ గోపిరెడ్డి, కోనా రఘుపతి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వారు జిల్లా జాయింట్ కలెక్టర్ ను డిమాండ్ చేశారు. పట్టిసీమ నిర్మాణంతో కృష్ణాడెల్టాకు నీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేమి చేస్తోందని వారు ప్రశ్నించారు. కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. -
బాబు ప్రకటన వల్లే ఈ దుస్థితి: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం హైదరాబాద్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మిన రైతులు పంటలు వేశారని, అయితే నీళ్లు లేక పంటలు ఎండిపోయాయన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. -
కన్నీటి సేద్యం
కరెంటు లేదు.. కాల్వలకు నీరు రాదు ఎండిపోవడానికి సిద్ధంగా4.32 లక్షల ఎకరాలు వరుణుడి కరుణ కోసం ఎదురుచూపులు కృష్ణా డెల్టా రైతులకు నీటి కష్టాలు విజయవాడ : కృష్ణా డెల్టా రైతు కన్నీటి సేద్యం చేస్తున్నాడు. 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్ నెల ముగుస్తున్నా.. నాగార్జునసాగర్ నుంచి చుక్క నీరు కిందికి రాలేదు. సాగర్ దిగువన.. పులిచింతల ఎగువన కురిసిన వర్షం నీటినే నీటిపారుదల శాఖ అధికారులు భద్రపరిచి కొద్దికొద్దిగా వదులుతున్నారు. దీంతో చేతికొచ్చిన పంట నోటి వరకు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఎట్టకేలకు రైతుల కష్టాలపై దృష్టిసారించారు. మరి నష్ట నివారణ చర్యలు ఏ మేరకు తీసుకుంటారనేది అంతుచిక్కని ప్రశ్నే. రోజుకు ఐదో వంతు నీరు కృష్ణా డెల్టా అన్ని కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని వదలాలంటే 16 వేల క్యూసెక్కులు కావాలి. మంగళవారం రాత్రికి కేవలం 3,247 క్యూసెక్కుల నీరు మాత్రమే వదిలినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నీరు కాల్వలను దాటి రైతుల పొలాలను తాకేది అనుమానమే.మరోవైపు పులిచింతలలో నీరు బాగా తగ్గింది. మంగ ళవారానికి 0.9 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నీటిని నిరంతరంగా వదిలితే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రాదు. అందువల్ల ఇక వదలకుండా తాగునీటి కోసం దాస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. కాల్వలకు వదులుతున్న 3,247 టీఎంసీల్లో కేవలం పులిచింతల నుంచి 2,560 టీఎంసీల నీరు వస్తుండగా కేవలం ఆరేడు వందల క్యూసెక్కులు మాత్రమే పట్టిసీమ నుంచి వస్తున్నట్లు సమాచారం. నీటికోసం కోటి కష్టాలు అడపాదడపా పడిన వర్షాలకు ఎలాగోలా ఊడ్పులు పూర్తిచేసిన రైతులు ఇప్పుడు పండిన పంటను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 4.32 లక్షల ఎకరాలకు రెండు, మూడు తడులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు వరి పొలాలన్నీ ఈనిక, పొట్ట దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో నీరు లేక భూమి నెర్రెలిస్తే తాలు కంకులు వస్తాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం, బంటుమిల్లి, పామర్రు, పెడన, గుడివాడ, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లో కాల్వలలో వచ్చే కొద్దిపాటి నీటిని దక్కించుకునేందుకు నిద్ర మానుకుని రాత్రిపూట కాల్వల వద్దే పడిగాపులు పడుతున్నారు. కరెంటు రాగానే బోర్ల ద్వారా నీటిని మళ్లించాలనే ఉద్దేశంతో వందలాదిమంది రైతులు పొలాలను వదలి గ్రామాల్లోకి రావడమే లేదు. మరోవైపు కాల్వలు ఎండిపోగా, ఇంకోవైపు వర్షాలులేక భూగర్భ జలాలు అడుగంటాయి. రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. రోజుకు ఏడు గంటలు కరెంటు వచ్చినా విడతలవారీగా రావడంతో భూములు తడవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఎకరాకు కనీసం రూ.10 వేలు చొప్పున పది ఎకరాలకు పెట్టుబడి పెట్టామని, ఈ దశలో పంట చేతికి రాకపోతే భారీగా నష్టపోతామని పెడన రైతు కృష్ణారావు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
నీళ్లన్నీ కృష్ణార్పణం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘‘పట్టిసీమతో కృష్ణాడెల్టాకు గోదావరి జలాల తరలింపు సెప్టెంబర్ మొదటి వారంలో మొదలవుతుంది.. తాడిపూడి ఎత్తిపోతల్లో మిగులు జలాలను పోలవరం కుడి కాల్వలో పడేస్తాం.. మొత్తంగా పోలవరం కుడి కాల్వ ద్వారా 70, 80 టీఎంసీల గోదావరి నీరు కృష్ణాడెల్టాకు తీసుకువెళ్తాం.. తమ్మిలేరు, వాగులేరు, బుడమేరు, ఎర్రకాలువల నీళ్లను కూడా కృష్ణా డెల్టాకు తరలిస్తాం...’’ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేసిన ఈ ప్రకటనలపై జిల్లా రైతాంగం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ప్రభుత్వం మన జిల్లాలోని గోదావరి జలాల దారులన్నీ కృష్ణాకు అనుసంధానం చేయడం.. ఇక్కడి నీరంతా అక్కడి డెల్టాకు ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై పశ్చిమ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్నెల్ల కిందట పట్టిసీమ పథకంతో కేవలం గోదావరి మిగులు జలాలను మాత్రమే తీసుకువెళ్తామని సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పథకం పూర్తయ్యే నాటికి అన్ని ఎత్తిపోతల పథకాలు, కాలువలు, వాగులు, వంకలను కుడి కాల్వకి అనుసంధానం చేస్తామని చెప్పడం పశ్చిమ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడమేనని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మధ్యలో ఉన్నా నీళ్లు లేక జిల్లాలో చాలాచోట్ల నాట్లు పడలేదు. చివరి భూములైతే బీడు వారాయి. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలన్నీ కృష్ణాడెల్టాకే ఎత్తిపోస్తే పచ్చని పశ్చిమ ఎడారిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదని రైతు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చెంతనే గోదావరి ఉన్నా జిల్లాలో రోజురోజుకీ తీవ్రమవుతున్న సాగునీటి ఎద్దడిని పట్టించుకోకుండా పాలకులు కృష్ణాడెల్టా జపం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చివరి భూములకు చింతే.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో డెల్టాలోని శివారు భూములకు సాగునీరు సకాలంలో అందక వరినాట్లు సైతం ఆలస్యమయ్యాయి. నేటికీ నరసాపురం, మొగల్తూరు మండలాల్లో రెండు వేల ఎకరాల్లో వరినాట్లు పడలేదు. భీమవరం, వీరవాసరం మండలాల పరిధిలో తగినంత వర్షాలు కురవకపోతే ఏడు వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బంది తలెత్తే ప్రమాదముంది. ఆక్వా చెరువులకు డె ల్టా కాలువల నుంచి అనుకున్న స్థాయిలో నీరందని పరిస్థితి ఉంది. మెట్ట ప్రాంతాల్లో కటకట మెట్ట ప్రాంతంలో ఉన్న 18 మండలాల్లో ఎక్కడా 50 నుంచి 60 శాతానికి మించి వరినాట్లు పూర్తి కాలేదు. చెరువులు, జలశయాలకు నేటికీ అనుకున్న స్థాయిలో నీరు చేరలేదు. పోలవరం నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో 12,619 హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా, కేవలం 4,901హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండలాల పరిధిలో 6వేల హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు వెయ్యి ఎకరాలలో మాత్రమే నాట్లు వేశారు. ఇక చాలాచోట్ల చెరువుల ఆయకట్టు కింద వరినాట్లు నేటికీ పూర్తికాలేదు. చింతలపూడి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలో ఈ ఏడాది 16,915 హెక్టార్లలో వరిసాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాభావం వల్ల సబ్ డివిజన్లో ఇంతవరకు 60 శాతం కూడా నాట్లు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలు, డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి పెట్టకుండా గోదావరి నీళ్లన్నీ కుడికాల్వలో ఎత్తిపోయడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. మాటకు ముందు.. వెనుక పశ్చిమ రుణం తీర్చుకుంటానని చెప్పే బాబు... చివరికి ఇంతేనా జిల్లాకు ఒనగూర్చేది అని విమర్శిస్తున్నారు. ఇక్కడి రైతుల ప్రయోజనాలను పణంగా పెడితే ఊరుకోం కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వొద్దని మేం అనడం లేదు. కానీ గోదావరి జిల్లాల ైరైతుల ప్రయోజనాలను పణంగా పెడితే ఊరుకునేది లేదు. ఈ ఖరీఫ్ సీజన్లోనే నీళ్లందక జిల్లాలో చాలాచోట్ల నాట్లు పడలేదు. గోదావరి చెంతనే ఉన్నా సాగునీటి ఎద్దడితో రైతులు అల్లాడిపోతున్నారు. డెల్టా ఆధునికీకరణ చేపడితే లక్షలాది ఎకరాలు, చివరి భూములు సాగులోకి వస్తాయి. దానిని విస్మరించిన ప్రభుత్వం కృష్ణాడెల్టాకు నీళ్లు మళ్లించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంది. - బి.బలరాం, రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు. మెట్ట రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం తాడిపూడి పథకం పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఇక్కడి నీటిని పోలవరం కాలువ ద్వారా కృష్ణాకు మళ్లించడానికే ప్రాధ్యాన్యం ఇస్తోంది. ఏటా ఒకే పంటకు నీరందిస్తున్నప్పటికీ తాడిపూడి కాలువల్లో నీరు పారడం ద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. తద్వారా మెట్ట ప్రాంతంలోని రైతులకు పరోక్షంగా రెండో పంటకు ఉపకరిస్తుంది. - తానేటి వనిత, వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర కార్యద ర్శి, కొవ్వూరు. -
పట్టిసీమ నీరు రాలేదు
వర్షపు నీరు అయిపోతోంది ప్రాజెక్టుల్లోనూ అడుగంటిన నీరు చేతులెత్తేసిన అధికారులు ఆందోళనలో రైతాంగం విజయవాడ : కృష్ణాడెల్టాకు సాగు నీటి సమస్య యథాతధంగా కొనసాగుతోంది. ఒకవైపు వరుణుడు చిన్నచూపు చూడటం మరొకవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో జల వనరుల శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో కృష్ణా డెల్టాలో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతోంది. తాగునీరు కూడా లేక కొన్ని గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. 3080 క్యూసెక్కుల నీరు విడుదల.. ఇటీవల వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ ఎగువన, పులిచింతల ప్రాజెక్టు దిగువన సుమారు 1.2 టీఎంసీ నీరు కీసర వద్ద కృష్ణానదికి చేరడంతో రెండుమూడు రోజులుగా ఈ నీటిని కాల్వలకు వదులుతున్నారు. శనివారం 5003 క్యూసెక్కుల నీరు వదలగా, ఆదివారానికి వరద నీరు తగ్గడంతో 3080 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదిలినట్లు జలవనరుల శాఖ చెబుతోంది. ఏలూరు కాల్వకు 103 క్యూసెక్కులు, రైవస్ కాల్వకు 1021, బందరు కాల్వలకు 340, కృష్ణా పశ్చిమ కాల్వకు 2010 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.2 అడుగుల నీరు మాత్రమే ఉంది. సోమవారం వరద నీటి రాక మరింత తగ్గే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి నీరు నాలుగు రోజులకు కృష్ణాడెల్టాలో తాగునీటికి కటకటలాడుతూ ఉండటంతో శ్రీశైలం నుంచి మూడు టీఎంసీ నీటిని విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించారు. అయితే ఈ నీటిని ఆదివారం వరకు విడుదల చేయలేదు. శ్రీశైలంలో నీటిని విడుదల చేసిన తరువాత నాలుగు రోజులకు ప్రకాశం బ్యారేజ్కు వస్తాయి. అయితే ఈ నీటిని పూర్తిగా క్రిందకు వదిలిపెట్టకుండా పులిచింతల ప్రాజెక్టులో స్టోర్ చేసి కృష్ణాడెల్టాలో తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. గోదావరి జలాల జాడేది? పంద్రాగస్టున పట్టిసీమను జాతికి అంకితం ఇచ్చి గోదావరి జలాలను కృష్ణానదికి తీసుకువస్తామంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు ఊదరగొట్టారు. దీంతో ఆగస్టు 15 తరువాత నీటి సమస్య ఉండబోదని రైతులు భావించారు. అయితే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినట్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించినా ప్రకాశం బ్యారేజ్కు మాత్రం గోదావరి జలాలు ఒక చుక్క కూడా చేరలేదు. జిల్లా రైతాంగం కష్టాలు యథావిధిగా ఉన్నాయి. -
డెల్టా రైతులకు సాగు నీరు ఇవ్వాలి
హనుమాన్ జంక్షన్ : కృష్ణా డెల్టా రైతులకు సాగు నీరు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో డిమాండ్ చేశారు. సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై మాజీ మంత్రి కొలుసు పార్థ సారధి, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు రామచంద్రరావు, రైతు విభాగం జిల్లా నాయకుడు కొల్లి రాజశేఖర్, మహిళా నాయకురాలు జ్ఞానమణిలు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అనంతరం కృష్ణా - ఏలూరు కాల్వను పరిశీలించారు. -
కాలువ ఇలా.. మళ్లింపు ఎలా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కృష్ణా డెల్టాకు ఆగస్టు 15 నాటికి గోదావరి జలాలను తరలిస్తామని చంద్రబాబు పదేపదే ప్రకటిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు పరిశీలిస్తే పది రోజుల్లో నిర్మాణాలు పూర్తిచేసి నీళ్లు తరలించడం అనుమానంగానే కనిపిస్తోంది. పంద్రాగస్టు నాటికి పట్టిసీమ ట్రయల్ రన్ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పుకొస్తున్నా కుడి కాలువ నిర్మాణం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కుడికాలువ పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి చేపట్టగా, ఆరు ప్యాకేజీలకు సంబంధించిన పనులు ఇంకా పూర్తికాలేదు. భూసేకరణ సమస్య కారణంగా ఇప్పటివరకు ఈ పనులు నిలిచిపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి ఎకరానికి రూ.28 లక్షల నుంచి రూ.53 లక్షల వరకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది. వెంటనే అధికారులు భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి మిగిలిపోయిన పనులను హడావుడిగా చేపట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేయిస్తున్నారు. 65 భారీ యం త్రాల ద్వారా మట్టిని తవ్వి దాదాపు 175 లారీలతో బయటకు తరలిస్తున్నారు. ఎంత యుద్ధప్రాతిపదిన పనులు చేస్తున్నా ఆగస్టు 15 నాటికి పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. 40 లక్షల క్యూబిక్ మీటర్ల పని పెండింగ్లోనే ఆరు ప్యాకేజీలకు సంబంధించి మొత్తం 116.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని కాలువ నుంచి తవ్వాల్సి (ఎర్త్వర్క్) ఉండగా, ఇప్పటివరకు 77.08 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తవ్వారు. మిగిలిన 39.22 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు చేయాల్సి ఉంది. ప్యాకేజీల వారీగా చేయాల్సిన పనులను పరిశీలిస్తే.. మొదటి ప్యాకేజీలో 1.28 లక్షల క్యూబిక్ మీటర్లు, రెండో ప్యాకేజీలో 6.16 లక్షలు , నాలుగవ ప్యాకేజిలో 6.70 లక్షలు, ఐదో ప్యాకేజీలో 5.2 లక్షలు, ఆరో ప్యాకేజీలో 19 లక్షలు, ఏడవ ప్యాకేజీలో 0.88 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్వర్క్ పనులు చేయాల్సి ఉంది. మొత్తం ఏడు ప్యాకేజీల్లో ఒక్క మూడవ ప్యాకేజీ పనులు మాత్రమే పూర్తయ్యాయి. దేవరపల్లి మండలం దేవరపల్లి, రామన్నపాలెం, దుమంతునిగూడెం గ్రామాల పరిధిలో సుమారు 2 కిలోమీటర్లు, పెదవేగి మండలంలో సుమారు 3 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వకం చేయాల్సి ఉంది. కుడికాలువ తవ్వకం పనుల కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగించే కాజ్వేలు, చిన్నచిన్న వంతెనలు ఉన్నచోట్ల పైపులు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక పనులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ పనులు కూడా ఆగస్టు 15వ తేదీలోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాజ్వేల నిర్మాణానికి తూరలు వేసినప్పటికీ వాటికి ఇరుపక్కలా కాంక్రీట్ పనులు పూర్తి చేయాల్సిఉంది. వెడల్పు 40 మీటర్లకు తగ్గింపు ఎట్టి పరిస్థితుల్లోనూ 15వ తేదీ నాటికి నీటిని తరలించాలన్న లక్ష్యంతో కాలువ వెడల్పును కుదించి పనులు చేస్తున్నారు. 80 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల లోతున కాలువ తవ్వాల్సి ఉండగా సమయం తక్కువగా ఉండటంతో కాలువ వెడల్పును 40 మీటర్లకు కుదించి పనులు చేస్తున్నారు. మొదటి దశలో 40 మీటర్ల వెడల్పున కాలువ తవ్వకం పూర్తిచేసి పట్టిసీమ నీటిని పంపించిన అనంతరం రెండో దశలో మిగిలిన 40 మీటర్ల వెడల్పు కాలువ పనులను చేపడతామని పోలవరం కుడి కాలువ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంగరాజు చెబుతున్నారు. ఎత్తిపోతలూ అనుమానమే ఇక రూ.1,300 కోట్ల అంచనాలతో మార్చి 29న మొదలైన ఎత్తిపోతల నిర్మాణం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎత్తిపోతలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేందుకు వీలుగా రూ.200 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్టు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జూలై 31న ప్రకటించారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల పనులు అంచనా వేసిన లక్ష్యానికి దగ్గరగా కూడా లేవు. ఈ పధకం ప్రారంభ దశలో 12 పంపులతో 24 పైపులైన్ల ద్వారా గోదావరి జలాలను తరలించాలని భావించారు. జూన్ నెలలో సీఎం పనుల పరిశీలనకు వచ్చినప్పుడు ఆగస్టు 15 నాటికి మొదటి విడతగా 8 పంపులతో 16 పైపులైన్ల ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పారు. ఆ ప్రకారం కూడా పనులు జరగకపోవడంతో గత నెలలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎత్తిపోతల పనుల పథకాన్ని పరిశీలించి కనీసం 4 పంపులు 8 పైపులైన్ల ద్వారానైనా నీటిని తరలించాలన్నారు. కనీసం ఆ లక్ష్యం మేరకు కూడా ఇప్పుడు పనులు జరిగే పరిస్ధితి కానరావడం లేదు. ప్రస్తుతం ఎత్తిపోతల వద్ద సాగుతున్న నిర్నాణాన్ని బట్టి చూస్తే కేవలం 2 పంపులు 4 పైపులైన్ల ద్వారా మాత్రమే పట్టిసీమ నుంచి నీరు తరలించే అవకాశం కనిపిస్తోంది. అది కూడా పది రోజుల్లో కుడికాలువ నిర్మాణం పూర్తయితేనే. -
కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలు చాలు!
-
కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలు చాలు!
కేంద్ర జల వనరుల శాఖ ముందు రాష్ట్రం వాదనలు ♦ సాగర్ దిగువన-ప్రకాశం ఎగువన నీటి లభ్యత పుష్కలం ♦ 181 టీఎంసీల కేటాయింపుల్లో 101 టీఎంసీలు అక్కడే లభ్యం ♦ మరో 20 టీఎంసీలు భీమాకు తరలిస్తే డెల్టాకు 60 టీఎంసీలు చాలు ♦ బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15 మేరకు రాష్ట్రాలకు ఉన్నవి ♦ గుండుగుత్త కేటాయింపులే ♦ వాటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని వివరణ.. ♦ ఈ వాదనపై ఏకీభవించిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా డెల్టాకు ఉన్న నీటివాటాలో సగానికి పైగా నీరు.. నాగార్జునసాగర్ దిగువన, ప్రకాశం ఎగువలోనే లభ్యమవుతోందని కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ స్పష్టం చేసింది. సాగర్-ప్రకాశం మధ్య పరీవాహకంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నందున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటికేటాయింపులను 60 టీఎంసీలకు తగ్గించాలని సూచించింది. ఢిల్లీలో కేంద్ర జల వనరులశాఖ వద్ద జరుగుతున్న కృష్ణా బోర్డు సమావేశాల్లో రాష్ట్రం తన వాదనలను బలంగా వినిపించింది. కృష్ణా పరీవాహక ప్రాంతం, దాని ఉపనదుల్లో లభ్యమయ్యే నీరు, అందులో తెలంగాణకు దక్కాల్సిన వాటాను వివరిస్తూ నీటి లెక్కలను సమర్పించింది. సాగర్ దిగువనే..: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు ఇచ్చే 181.2 టీఎంసీల నీటిలో 101.2 టీఎంసీలు సాగర్ దిగువనే లభిస్తోందని తెలిపింది. కాబట్టి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటినే అవసరంగా భావించాలని పేర్కొంది. ఇందులో 20 టీఎంసీలను భీమాకు పునః కేటాయింపుగా ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో డెల్టాకు 60 టీఎంసీలు సరిపోతుందని వివరించింది. తుంగభద్ర, వేదవతి సబ్బేసిన్ల ద్వారా కృష్ణాకు ఆశించిన నీరు రావడం లేదని.. లోయర్ కృష్ణా, మూసీ, పాలేరు, మున్నేరు సబ్బేసిన్ల నుంచి సాగర్కు నీరు రావడం లేదని స్పష్టం చేసింది. వీటి దృష్ట్యా సాగర్ నుంచి డెల్టాకు 60 టీఎంసీలను సరిపెట్టాలని వాదించింది. సబ్బేసిన్లు, కృష్ణా ప్రధాన పరీవాహకంలో 200 టీఎంసీలు(41.6 శాతం) తెలంగాణకు, 280.6 టీఎంసీలు (58.4 శాతం) ఏపీకి దక్కుతాయని తెలిపింది. గుండుగుత్త కేటాయింపులే!: ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలు గుండుగుత్త (ఎన్బ్లాక్)గా ఇచ్చినవేనని.. విభజన అనంతర ం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి దక్కిన 512 టీఎంసీలను ఎన్బ్లాక్గానే చూడాలని రాష్ట్రం స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్లోని క్లాజ్-15 ప్రకారం ఒక రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడైనా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 1996లోనూ అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్.. రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని పునః కేటాయించుకోవచ్చని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. తమకు కేటాయించిన వాటా నీటినే సాగర్ నుంచి వాడుకుంటున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ వాదనతో కేంద్ర జలవనరుల శాఖ సైతం ఏకీభవించింది. కాగా ప్రాజెక్టుల భద్రతకు అన్ని రకాల రెగ్యులేటర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సీఐఎస్ఎఫ్తో పహారా అవసరం లేదని, ఎక్కడైనా సీఐఎస్ఎఫ్ బలగాలతో పెట్రోలింగ్ చేయించాలని సూచించింది. -
పట్టిసీమ.. ‘వట్టి’ సీమ
నీళ్లు- నిజాలు : 4 గోదావరి నీటిని మళ్లించడం ద్వారా కృష్ణాడెల్టాలో మిగిలే నీటిని సీమకిస్తుందట * పట్టిసీమ పేరుతో మభ్యపెడుతున్న ప్రభుత్వం * సీమపై చిత్తశుద్ధి ఉంటే.. పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా సామర్థ్యానికి అనుగుణంగా కాలువలను సిద్ధం చేయాలి: రైతు సంఘాలు సాక్షి, హైదరాబాద్: ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానంటే ఇదేనేమో! కృష్ణమ్మ పోటెత్తి ప్రవహించినప్పుడు రాయలసీమకు నీరు తీసుకెళ్లడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. గోదావరి నీటిని మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమ లో వినియోగించుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇం దుకోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్టు ప్రజ లను మభ్యపెడుతోంది. నిజానికి గోదావరి, కృష్ణా నదులు రెం డింటికీ దాదాపు ఒకే సమయంలో వరదలొస్తాయి. కృష్ణాలో వరదలున్నప్పుడు గోదావరి నీటిని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కృష్ణా డెల్టాకు నీటి అవసరం ఉన్నప్పుడు, గోదావరిలో వరద లేకపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశమూ ఉండదు. అంటే కృష్ణా డెల్టాకే గోదావరి నీటి తరలింపుపై ‘గ్యారంటీ’ లేదు. కానీ గోదావరి నీటిని కృష్ణా డెల్టా అవసరాలకు వాడి, అక్కడ మిగిలే కృష్ణా నికర జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కృష్ణా నది నుంచీ సీమకు నీళ్లు తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. కొత్తగా నికర జలాలను తరలిస్తామని చెప్పడంలో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతోంది. సీమకు నీళ్లెలా ఇస్తారు? కృష్ణానది నీటిని రాయలసీమకు తీసుకెళ్లడానికి రెండే మార్గాలు ఉన్నాయి. 1. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, 2. హంద్రీ-నీవా సుజల స్రవంతి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని రాయలసీమకు తీసుకెళ్లడానికి అవకాశముంది. విద్యుత్ ఉత్పత్తికోసం వినియోగించే మరో 4,500 క్యూసెక్కుల నీరు దీనికి అదనం. కృష్ణాలో ఏడాదికి సగటున 30 రోజులపాటు వరద ఉంటుందని అంచనా. గతేడాది దాదాపు 100 రోజులపాటు కృష్ణానది పోటెత్తింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని తీసుకెళితే.. 30 రోజుల్లో 120 టీఎంసీలకు మించి నీటిని తీసుకెళ్లవచ్చు. కానీ తీసుకెళ్లింది 45-50 టీఎంసీలే.పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తెసుకెళ్లే కాలువల్లో అవరోధాలు ఉండటంతో 7-8 వేల క్యూసెక్కులకు మించి నీటిని తీసుకెళ్లడానికి వీల్లేకుండా పోయింది. నామమాత్రపు నిధులతో పనులు పూర్తి చేయడానికి అవకాశమున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ‘హంద్రీ-నీవా సుజల స్రవంతి’ పరిస్థితీ అంతే. పనుల పెండింగ్ వల్ల కాల్వల గరిష్ట సామర్థ్యం మేరకు నీరు ప్రవహించట్లేదు. 12 మోటార్లద్వారా నీటిని లిఫ్ట్కు వీలున్నా.. 3 మోటార్లకు మించి నడిపితే.. నీరు సాఫీగా వెళ్లలేదు. నామమాత్రపు నిధులతో ఈ ఇబ్బందుల (బాటిల్నెక్స్)ను తొలగించడానికి అవకాశమున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. కృష్ణానదిలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేని సర్కారు.. గోదావరి నీటిని తీసుకొచ్చి వాడుకుంటామని చెప్పడం పై అధికారవర్గాల్లోనే అనుమానాలున్నాయి. రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా నుంచి గరిష్ట సామర్థ్యంతో నీటిని తీసుకెళ్లడానికి చర్యలు తీసుకోవాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిన వైఎస్ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువప్రాంతాలకు తరలించవచ్చుననే నిబంధనలున్నాయి. 1982లో పోతిరెడ్డిపాడు వద్ద 4 గేట్లతో 15 వేల క్యూసెక్కుల నీటివిడుదల సామర్థ్యంతో హెడ్రెగ్యులేటర్ను నిర్మించారు. కృష్ణా నుంచి వరద జలాలను అధికంగా తీసుకెళితే, రాయలసీమ ప్రాజెక్టులను నింపడానికి అవకాశం ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. 2005 డిసెంబర్లో రూ. 201.347 కోట్ల వ్యయంతో 44 వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుకూలంగా పదిగేట్లతో కొత్త హెడ్రెగ్యులేటర్ నిర్మాణ పనులు చేపట్టారు. వైఎస్ మరణానంతరం బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిలు దీనిని పూర్తిచేయటంలో శ్రద్ధచూపలేదు. దీంతో రూ.186 కోట్లను వెచ్చించి 85 శాతం మేరకే హెడ్రెగ్యులేటర్ పనులను పూర్తిచేశారు. మిగిలిన 15 శాతం పనులను ఐదేళ్లుగా పూర్తిచేయటంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. 15 శాతం పనుల్లో 0 నుంచి 9 కిలోమీటర్ల వరకు స్టాండర్డుబ్యాంకు, శ్రీశైలం కుడి కాల్వ(ఎస్ఆర్ఎంసీ) వెంట(3, 4, 8, 12 కిలోమీటర్ల వద్ద) నాలుగు ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాల్సి ఉంది. అలాగే ఎర్రగూడూరు గ్రామం వద్ద 15వ కిలోమీటరు వద్ద ఎస్ఆర్ఎంసీ కాల్వను కిలోమీటరు మేర విస్తరించాల్సిన పనులు నిలిచిపోయాయి. కాల్వలను విస్తరించి మిగిలిన 15 శాతం పనులు పూర్తిచేయటంతోపాటు బానకచర్ల వద్ద హెడ్రెగ్యులేటరును పూర్తిచేసి పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతోపాటు దిగువనున్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితే ఏటా వృథా అవుతున్న వందల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశముంది. కానీ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపకపోవడంతో ఈ ఏడాది కృష్ణానది పోటెత్తినా సీమకు తగినన్ని నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమైంది. ఇదీ వైఎస్ ఘనత.. హంద్రీ-నీవాకు టీడీపీ హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మరోసారి హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు హయాం లో ప్రాజెక్టుకోసం కేవలం రూ.13.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశా రు. ఆ నిధులు సిబ్బంది జీతభత్యాలకే సరిపోయాయి. తర్వాత వైఎస్ సీఎం అయ్యాక రూ.6,850 కోట్లతో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. వైఎస్ హయాంలో (5ఏళ్లలో) రూ. 4,340.36 కోట్లు కేటాయించారు. ఆపై రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలో రూ. 2,143.44 కోట్లు ఇచ్చారు. ఇదీ బాబు నిర్వాకం.. * కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకూ మూడేళ్లుగా నీటిని ఎత్తిపోస్తున్నారు. మల్యాల-జీడిపల్లి మధ్యలో ఎనిమిది లిఫ్ట్లు ఉన్నాయి. ప్రతీ లిఫ్ట్ వద్ద 12 పంపులున్నాయి. అయితే 3 పంపులద్వారా మాత్రమే నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తికాకపోవడం, ప్రధాన కాలువ వెంబడి అప్రోచ్ కాలువను నిర్మించకపోవడంతో మొత్తం పంపులు రన్ చేస్తే నీటి ప్రవాహ ఒత్తిడికి ప్రధాన కాలువ తెగిపోయే ప్రమాదముంది. దీంతో 3 పంపులతోనే రన్ చేస్తున్నారు. అప్రోచ్ కాలువ పనులు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో రన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. * ఏడాదిలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు పదేపదే చెప్పారు. మంత్రులు, బాలకృష్ణతోసహా రెండుసార్లు హంద్రీ-నీవా కాలువను సందర్శించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన బహిరంగసభలోనూ హంద్రీ-నీవా ద్వారా ఏడాదిలోపు చిత్తూరుకు నీళ్లు తీసుకొస్తానని సీఎం చెప్పారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్లో కనీసం రూ.800-1000 కోట్లు కేటాయిస్తారని అంతా భావించారు. కానీ రూ. 200 కోట్లే కేటాయించారు. -
వద్దు బాబూ.. వద్దు
‘పట్టిసీమ’పై అసెంబ్లీ సాక్షిగా గళమెత్తిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘పశ్చిమ’ అన్నదాతల హర్షాతిరేకాలు ఎలాగైనా కట్టితీరుతామన్న సర్కారు మొండి వైఖరిపై ఆగ్రహావేశాలు వైఎస్ జగన్ అండతో పోరుబాటకు రైతుల నిర్ణయం కృష్ణా డెల్టాకు తరలించే ఆ నీటిని మధ్యలో స్టోరేజీ లేకుండా ఎక్కడ నిల్వ చేస్తారని జగన్ మోహన్రెడ్డి సూటిగా సర్కారును నిలదీశారు. ప్రకాశం బ్యారే జి సామర్థ్యం 3 టీఎంసీల కంటే తక్కువేనని గుర్తు చేశారు. వర్షాకాలంలో దాదాపు ఒకే సమయంలో గోదావరి, కృష్ణా నదులకు వరదలు వస్తాయని, అప్పుడు ముంచుకొచ్చే ఈ వరద నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నిం చారు. ఆ నీటిని నిల్వ చేసుకునేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టారని, 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బహుళ ప్రయోజనాలుగల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అందరం కలసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని కోరారు. అంతేగానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రూ.వందలాది కోట్లు వృథా చేసి పట్టిసీమ పథకం చేపట్టొద్దని వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆయన సూటిగా చేసిన ఈ వ్యాఖ్యలతో ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం మొండిపట్టుపై ఆందోళన మూడు నెలల క్రితం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ఇక్కడి రైతులు ఇటీవల సర్కారు భూముల సర్వే చేస్తుండటంతో కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. కేవ లం భూముల సర్వే కారణంగానే రెం డు రోజుల క్రితం ఆందోళనకు గురైన బంగారుపేటకు చెందిన రైతు కర్రి శంకరయ్య గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. ఇక్కడి రైతుల మానసిక వ్యథకు ఇదో ఉదాహరణ మాత్రమే. అయినా రైతుల కడగండ్లను ఏమాత్రం పట్టించుకోని సర్కారు పట్టిసీమ ఎత్తిపోతలపై మొండిగానే ముందుకు వెళ్తామని ప్రకటించింది. బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఎవరేం చేసినా, ఎంతమంది వ్యతిరేకించినా పట్టిసీమ నిర్మాణంలో వెనకడుగు వేసేదిలేదని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు తాజా ప్రకటనతో ఇక్కడి రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి అండతో పట్టిసీమ నిర్మాణానికి వ్యతిరే కంగా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని రైతులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పటికే కొనసాగిస్తున్న తమ ఆందోళనను వైఎస్ జగన్మోహన్రెడ్డి అండతో తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. పోలవరంపై రు‘బాబు’ ఇదిలావుండగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ.. 2009 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణం జాప్యం మీ వల్లనే అంటూ వైఎస్సార్ సీపీ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కాలంగా శంకుస్థాపనకే నోచుకోని బహుళార్థ సాధక పోల వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేతంగా ప్రారంభిం చారు. వైఎస్ హయాంలో కుడి, ఎడమ కాలువల పనులతోపాటు హెడ్వర్క్స్లో భాగంగా స్పిల్ వే, ట్విన్ టన్నెల్స్, కుడి కనెక్టవిటీస్, ఎడమ కనెక్టవిటీస్ నిర్మాణ పనులు మొదల య్యాయి. కాంట్రాక్టు సంస్థ అనుకున్నంత వేగంగా పనులను చేయకపోవడంతో విడివిడిగా ఇచ్చిన స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్ టెండర్లను వైఎస్ రాజశేఖరరెడ్డి రద్దు చేశారు. ఈ మూడు ప్యాకేజీలను కలిపి ఒకే ప్యాకేజీగా టెండరు ఇవ్వాలని నిర్ణయిం చారు. అయితే, వైఎస్ హఠాన్మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడేళ్లకుపైగా కాలయాపన చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగార్చింది. ఎట్టకేలకు ఏడాదిన్నర క్రితం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్ పనులను ఒకే ప్యాకేజీగా ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అప్పగించింది. ఆ సంస్థ సామర్థ్యంపై అనుమానాలు వెల్లువెత్తే విధంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. టీడీపీ సర్కారు కొలువుదీరిన అనంతరం పది నెలల కాలంలో పనులు కనీసమాత్రంగా కూడా జరగడం లేదు. ఈ క్రమంలో పోలవరం నిర్మాణ పనుల జాప్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి గాని, వైఎస్సార్ సీపీ సభ్యులకు గానీ ఏం సంబంధమని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలవరం నిర్మాణం జాప్యం మీ వల్లనే అంటూ బాబు చేసిన వ్యాఖ్య హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు. కోస్తా జిల్లాల్లోని బీడువారిన భూములను సస్యశ్యామలం చేయడంతోపాటు విద్యుత్ కొరతను తీర్చగలిగే సామర్థ్యమున్న, రాయలసీమకు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం నిర్మాణం ఇంతవరకు వచ్చిందంటే అది కేవలం మహానేత పుణ్యమేనని వైఎస్సార్ సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎందుకది పోల‘వరం’.. ఎందుకిది ‘వట్టి’సీమ
⇒ పోలవరం ప్రాజెక్టుతో 4.368 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది ⇒ 540 గ్రామాలకు తాగునీరు ఇవ్వొచ్చు ⇒ ఏటా 2,369.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ⇒ ప్రజెక్టుకు పెద్దయెత్తున నీటి స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది ⇒ పట్టిసీమ వద్ద కానీ, కుడికాల్వలో కానీ నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు సాక్షి, హైదరాబాద్: పోలవరం ఎన్నో దశాబ్దాల కల. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు రావడానికి ఎంతోకాలం పట్టింది. ఎట్టకేలకు అనుమతులు వచ్చాయి. జాతీయ హోదా కూడా వచ్చింది. ఈ సమయంలో ప్రాజెక్టు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ దిశగా కృషి చేయకుండా పట్టిసీమ ఎత్తిపోతలను తెరపైకి తెచ్చింది. పట్టిసీమను ‘వట్టి’సీమగా పేర్కొంటూ.. టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నా.. ఆ విధంగానే ముందుకు వెళతామంటోంది. 22 శాతం అధిక ధరతో ఎత్తిపోతలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వరప్రదాయని? పట్టిసీమను ‘వట్టి’సీమని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఎందుకంటున్నాయి... ఒకసారి పరిశీలిస్తే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం జిల్లా మొదలు రాయలసీమ వరకు.. పలు జిల్లాలకు తాగు, సాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలకూ నీళ్లివ్వడానికి అవకాశం ఉంటుంది. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లివ్వవచ్చు. ఆమేరకు డెల్టా వాడకంలో మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది కాబట్టి, అవసరమైనప్పుడు, అవసరమైన మేరకు కుడికాల్వకు నీటి విడుదల చేస్తారు. కాబట్టి.. ఏడాది పొడవునా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కుడికాలువ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయడానికి వీలవుతుంది. అంటే.. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తప్పనిసరిగా నీరివ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా శ్రీశైలం ఎగువ నుంచి నమ్మకంగా రాయలసీమకు నీళ్లివ్వడానికి వీలవుతుంది. గోదావరి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని కుడికాలువకు మళ్లిస్తే.. కృష్ణా డెల్టాకు వస్తాయి. అయితే గోదావరిలో వరద ఏడాదిలో 60 రోజులకు అటూఇటూగా ఉంటుంది. మిగతా రోజుల్లో నీటిని కృష్ణాకు తరలించడం సాధ్యం కాదు. గోదావరిలో వరద ఉండే సమయంలోనే కృష్ణానదిలోనూ వరదలు ఉండే అవకాశం ఉంది. కృష్ణాలో ఏటా దాదాపు 40 రోజులు వరద ఉంటుంది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా డెల్టా, రాయలసీమ.. అన్ని ప్రాంతాల్లోనూ పట్టిసీమపై అనుమానాలున్నాయి. తమ నీటిని కృష్ణాకు తరలిస్తారమోననే అనుమానం ఉభయ గోదావరి జిల్లాల రైతులను వేధిస్తుండగా, గోదావరి నుంచి నీళ్లిస్తున్నామనే పేరిట నాగార్జున సాగర్ నుంచి తమకు రావాల్సిన నీళ్లు నిలిపివేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కృష్ణా డెల్టా రైతుల్లో నెలకొంది. గోదావరి మీద ఎత్తిపోతల పథకాన్ని నమ్ముకొని, సాగర్ నుంచి వచ్చే నీటిపై హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. గోదావరి పొంగి ప్రవహిస్తున్నప్పుడు, పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడే లిఫ్ట్ ద్వారా గోదావరి నీరు కృష్ణా డెల్టాకు చేరుతుందని, పరిస్థితుల్లో తేడా వస్తే నీరందని పరిస్థితులు వస్తాయని, అదే జరిగితే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతానికీ ఉపయోగపడని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని హడావుడిగా తెరపైకి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లే విమర్శిస్తున్నారు. ఏ ప్రాంతానికీ ఉపయోగపడకపోగా, కృష్ణా జలాల్లోనూ 35 టీఎంసీల వాటా కోల్పోయే ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నామని, ఫలితంగా అన్ని ప్రాంతాలకు నష్టం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. కుడికాల్వను ముందే ఎందుకు తవ్వారంటే.. సీడబ్ల్యూసీ అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణా జలాల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ ఎగువ రాష్ట్రాలు దక్కుతుందనే నిబంధన దృష్ట్యా.. అనుమతి వచ్చిన వెంటనే పనులు ముమ్మరం చేసి ఆఘమేఘాల మీద పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేదంటే కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు 35 టీఎంసీలు వాడుకుంటే.. ఏపీ తీవ్రంగా నష్టపోతుంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టు అవార్డు చేయడంలో చూపిస్తున్న వేగం, కుడికాలువ పనుల్లో అసంపూర్తిగా ఉన్న 30 శాతం పనులను పూర్తి చేయడంపై చూపించడం లేదు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసి నిర్మాణాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు? గోదావరి నుంచి పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు మళ్లించి, ఆ మేరకు మిగిలే నీటిని శ్రీశైలం ఎగువ నుంచి రాయలసీమ అవసరాలకు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. పట్టిసీమ లిఫ్ట్ నిర్మాణానికి రూ.1,300 కోట్ల అంచనా వ్యయానికి పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఈ ఏడాది జనవరి ఒకటిన జారీ చేసిన జీవో నంబర్ 1.. ముఖ్యమంత్రి వాదనలో డొల్లతనాన్ని వెల్లడించింది. జీవోలోని 5వ పాయింట్లో ‘డొమెస్టిక్, ఇండస్ట్రియల్ అవసరాల కోసం గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు నీటిని మళ్లించే పనులకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది’ అని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు నీళ్లిస్తామని ఈ జీవోలో ఎక్కడా చెప్పలేదు. కృష్ణా డెల్టాకు నీటిని మళ్లిస్తామని జీవోలో చెప్పని ప్రభుత్వం, డెల్టాలో వాడుకొనే కృష్ణా జలాలను శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇస్తామని చెప్పడాన్ని ఎలా నమ్మాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇటు సీమకు, అటు కృష్ణా డెల్టాకు నష్టం! గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల నీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు 35 టీఎంసీల వాటా ఉంటుంది. కుడికాల్వకు నీళ్లు ఎప్పుడు మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరు చేసిన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో ఉన్న వాటా నుంచి 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోవడానికి హక్కు ఉంటుందని గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో పేర్కొంది. వాస్తవంగా కుడికాల్వకు నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా, పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న వాటా నుంచి 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు వినియోగించుకొనే స్వేచ్ఛ ఉంటుంది. పోలవరం నుంచి నమ్మకంగా జలాలు రాకుండా, ఎత్తిపోతల పథకాన్ని సాకుగా చూపి ఎగువ రాష్ట్రాలు కృష్ణా జలాల్లో అధిక వినియోగానికి పాల్పడితే.. ఇటు రాయలసీమకు, అటు కృష్ణా డెల్టాకు తీరని నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు ‘వట్టి’సీమ అంటే... ⇒ పట్టిసీమ వద్ద, కుడికాల్వకు మళ్లించిన తర్వాత ఎక్కడా నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేదు ⇒ గోదావరి, కృష్ణాకు ఒకేసారి వరద వచ్చే రోజులు ఎక్కువ. కృష్ణాలో వరద ఉంటే లిఫ్ట్ అనవసరం ⇒ రెండు నదులు జీవ నదులు కాదు. రుతుపవనాల సమయంలోనే పోటెత్తి ప్రవహిస్తాయి ⇒ ఏడాదిలో గోదావరికి 60 రోజులు, కృష్ణాకు 40 రోజుల వరద ఉంటుంది ⇒ వరద లేని రోజుల్లో లిఫ్ట్ వాడితే గోదావరి డెల్టాకు నీళ్లందవు ⇒ కృష్ణలో నీళ్లు లేక డెల్టా రైతులు ఇబ్బంది పడితే.. కచ్చితంగా గోదావరి నీళ్లిస్తామని చెప్పడానికి లేదు ⇒ ఆ సమయంలో గోదావరిలో వరద ఉండి, పుష్కలంగా విద్యుత్ అందుబాటులో ఉంటేనే.. లిఫ్ట్ వాడగలరు ⇒ కృష్ణా డెల్టాకు నమ్మకంగా నీళ్లిస్తామనే గ్యారంటీ లేకుండా, రాయలసీమకు నీళ్లివ్వడం సాధ్యం కాదు ⇒ సీమకు నీళ్లిస్తామని పట్టిసీమ జీవోలో ప్రభుత్వం పేర్కొనలేదు ⇒ నమ్మకం లేని నీటి కోసం లిఫ్ట్ నిర్మాణానికి రూ.1300 కోట్లు ఖర్చు పెట్టాలి ⇒ పోలవరం మీద దృష్టి పెట్టకుండా పట్టిసీమను పట్టుకొని వేలాడితే.. రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది ⇒ కుడికాల్వకు మళ్లించే నీటి మీద ఎగువ రాష్ట్రాలు హక్కు కోరితే.. రాష్ట్ర ప్రయోజనాలకు గండి పోల‘వరం’ ఎందుకంటే... ⇒ పోలవరం ప్రాజెక్టులో స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది ⇒ ఎప్పుడు అవసరమైనా నీటిని కుడికాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు ఇవ్వచ్చు... పైసా ఖర్చు లేకుండా.. గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి కృష్ణాకు నీళ్లు చేరతాయి ⇒ గోదావరిలో వరద లేనప్పుడు కూడా, నిల్వ సామర్థ్యం ఉంటుంది కాబట్టి కృష్ణాడెల్టాకు నీటి గ్యారంటీ ఉంటుంది ⇒ కృష్ణా డెల్టాలో మిగిలే వాడకాన్ని, శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇవ్వచ్చు ⇒ కుడికాల్వకు 80 టీఎంసీల గ్యారంటీ ఉంటుంది కాబట్టి.. ఎగువ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో వాటా ఇవ్వచ్చు ⇒ గోదావరి డెల్టాకు ఎలాంటి అన్యాయం జరగదు. చివరి ఆయకట్టు భూములకూ నీళ్లొస్తాయి ⇒ విశాఖపట్నానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందుతాయి ⇒ ప్రాజెక్టు ప్రయోజనాలపై ఏ ప్రాంత రైతులకూ అనుమానాల్లేవు... పోలవరంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి ⇒ అన్నిటికంటే మించి.. జాతీయ హోదా దక్కినందున ప్రజెక్టు మొత్తం వ్యయం కేంద్రమే భరిస్తుంది ⇒ రాష్ట్ర ఖజానాపై పైసా భారం పడదు ⇒ 4.368 లక్షల హెక్టార్లకు సాగునీరు, 540 గ్రామాలకు తాగునీరు అందుబాటులోకొస్తుంది. ⇒ ఏటా 2,369.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. -
కృష్ణా డెల్టాకు మరో 4 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టా అవసరాల కోసం నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. జలసౌధలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావుల మధ్య అంగీకారం కుదిరింది. సాగర్ ఎడమ కాలువ కింద కృష్ణా డెల్టా ఆయకట్టు ఉన్న విషయం విదితమే. ఈఎన్సీల భేటీలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఎడమ కాలువకి ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. -
కృష్ణలో వరద ఉంటే లిఫ్టు వాడం
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ సాక్షి, హైదరాబాద్: గోదావరిలో వరద ఉన్నప్పుడు కృష్ణలో కూడా వరద ఉంటే పట్టిసీమ లిఫ్టును వినియోగించుకోమని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కృష్ణా డెల్టాకు అవసరమైనప్పుడు మాత్రమే లిఫ్టు ద్వారా నీటిని తరలిస్తామన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ లిఫ్టు వల్ల ఉపయోగం లేదని, జేబులు నింపుకోవడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతోందంటూ ‘సాక్షి’లో శుక్రవారం ‘పట్టిసీమలో పరమ రహస్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల మట్టం వరకు నీటిని నిల్వ ఉంచుతామని, ఆమేరకే గోదావరి నుంచి నీటిని తీసుకొస్తామన్నారు. గోదావరి లిఫ్టు ద్వారా మళ్లించే నీటితో కృష్ణా డెల్టాను కాపాడితే, ఆ మేరకు మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు వాడుకుంటామన్నారు. 70 టీఎంసీల కృష్ణా నీటిని రాయలసీమ ప్రాజెక్టుల్లో నిల్వ ఉంచుతామన్నారు. పట్టిసీమ లిఫ్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1లో ఎక్కడా.. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు వాడతామని పేర్కొనలేదని, మరి కృష్ణా డెల్టాకు వాడే కృష్ణా జలాలను మిగిల్చి రాయలసీమకు ఎలా ఇస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. -
సీమ, ప్రకాశంకు నీరందిస్తా: బాబు
నీరు-చెట్టు ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు హామీ బి.కొత్తకోట: కరువుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు. పట్టిసీమ వద్ద ఈ నెల 23న ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని, తద్వారా మిగిలే శ్రీశైలం నీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఇస్తామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం గ్రామం పెద్దచెరువులో గురువారం సీఎం నీరు-చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ నిర్మించిన నీరు-చెట్టు పైలాన్ను ప్రారంభించి, చెరువులో పూడికతీత మట్టిని జే సీబీతో ట్రాక్టర్లో పోశారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, నాగావళి, వంశధార నీటిని వినియోగించుకోవడం కోసం నదుల అనుసంధానం జరగాలన్నారు. ఏడాదిలోగా హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృషి చేస్తానని, అవసరమైతే కాలువలపై నిద్రింైచె నా పనులు పూర్తి చేయిస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తోటపల్లి, వెలుగోడు ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ఐదేళ్లలో రూ.27,200 కోట్ల ఖర్చు నీరు-చెట్టు కార్యక్రమాన్ని చరిత్రాత్మకమైందిగా సీఎం అభివర్ణించారు. దీనికోసం రూ.27,200 కోట్ల నిధులను ఖర్చు చేస్తామన్నారు. గతంలో తాను నీరు-మీరు పథకం ద్వారా భూగర్భజలాల వృద్ధికి చర్యలు తీసుకుంటే పదేళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, నీటి నిల్వ చర్యలు చేపట్టనందునే ప్రస్తుతం కరువు వచ్చిందని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంతో ఈ పరిస్థితిని అధిగమించి, రాష్ట్రాన్ని కరువు రహితంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పథకం తన ఒక్కడితోనే విజయవంతం కాదని, ప్రజలంతా బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలు సైతం కలసిరావాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నీటిలభ్యతపై సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. కాగా కరువు నెలకొన్న మండలాల్లో కూలీలకు 150 రోజుల వరకు పని కల్పిస్తామని సీఎం ప్రకటించారు. రుణమాఫీలో మేమే భేష్.. దేశంలో ఒక్కో రైతుకు రూ.1.5 లక్షల మేరకు రుణ మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు చెప్పారు.దేశవ్యాప్తంగా 50 శాతం మంది రైతులు రుణాలు తీసుకుంటే రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు రుణాలు తీసుకున్నారని తెలిపారు. నిధుల సమస్య ఉన్నప్పటికీ రైతుల కళ్లల్లో ఆనందంకోసం రుణాలు మాఫీ చేశానని చెప్పుకొచ్చారు. మహిళా సంఘాలను తాను పైకి తీసుకొచ్చి పొదుపు నేర్పితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం నేర్పించిందని విమర్శించారు. -
‘పట్టిసీమ’లో పరమ రహస్యం!
* పట్టిసీమ ఎత్తిపోతల లక్ష్యం పోలవరం ప్రాజెక్టుతో నెరవేరుతుంటే కొత్తగా ఈ ‘లిఫ్ట్’ ఎవరి కోసం? * రూ.1,300 కోట్ల దుబారా ఎందుకు?.. కాంట్రాక్టుల్లో కాసులు దండుకోవడానికే అని విమర్శలు * పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో పొరుగు రాష్ట్రాల వాటా సంగతి మరిచారా? * కృష్ణా, గోదావరికి ఒకే సమయంలో వరద వస్తే ఎత్తిపోతల నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? * ఎనిమిది నెలలుగా ఒక్క పనీ చేయని సర్కారు.. ఏడాదిలో ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేస్తుందట! సాక్షి, హైదరాబాద్: పట్టిసీమపై పట్టు ఎందుకు...? పోలవరంతో నెరవేరబోయే లక్ష్యాన్నే కొత్తగా చూపడం దేనికి..? ఒకటి కాదు రెండు కాదు.. రూ.1,300 కోట్లను ఎవరి జేబుల్లోకి ఎత్తిపోసేందుకు ఈ ఎత్తిపోతల..? పట్టిసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు తీరుపై అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే! నాలుగేళ్లు గడిస్తే పోలవరం పూర్తవుతుంది.. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించే అవకాశం ఏర్పడుతుంది.. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల అంటోంది! రూ.1,300 కోట్లు నీటిలో పోసేందుకు సిద్ధమవుతోంది. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించాలన్న లక్ష్యం పోలవరంతో నెరవేరుతున్నప్పుడు పట్టిసీమ ఎందుకన్నది ప్రశ్న. అదీగాకుండా ఇందులో చిక్కుముడులున్నాయి. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల నీటిలో పొరుగు రాష్ట్రాలు తమ వాటా అడిగే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం వరద నీటిని లిఫ్ట్ చేసుకుంటే వాటా ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది. అలాగయితే గోదావరికి వరదలు వచ్చే సమయంలోనే కృష్ణాకు కూడా వరదలు వస్తాయి. అప్పుడు పట్టిసీమ లిఫ్ట్ చేసిన నీటిని ఎక్కడికి పంపుతారు? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడేనాటికే పోలవరం కుడికాలువ పనుల్లో 70 శాతం పూర్తయ్యాయి. మరో 30% పూర్తి చేస్తే సరిపోతుంది.ఈ ఎనిమిది నెలల్లో ఈ పనులు అంగుళమైనా కదల్లేదు. దీనికి చొరవ చూపని ప్రభుత్వం.. పట్టిసీమ ఎత్తిపోతలకు మాత్రం ఉత్సాహం చూపుతోంది. ఈ ఎత్తిపోతలను ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెబుతుండడం హాస్యాస్పదంగా మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంతర్ రాష్ట్ర విభేదాలకు బీజం వేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీటిలో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు 35 టీఎంసీల వాటా ఉంది. ఈ మేరకు కృష్ణా నీటిని అదనంగా ఎగువన వినియోగించుకోడానికి బచావత్ ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాలకు అవకాశమిచ్చింది. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్లోనే ఈ నిబంధన ఉంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఈ 45 టీఎంసీల్లో తెలంగాణ కూడా వాటా అడిగే అవకాశం లేకపోలేదు. ఫలితంగా నీటిని 58:42 నిష్పత్తిలో పంచాల్సి వస్తే.. ఆంధ్రప్రదేశ్కు దక్కేది 26 టీఎంసీలే. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులతో సంబంధం లేకుండా నీటిని వాడుకుంటే.. వాటాల విభజన నుంచి తప్పించుకోవచ్చు. కానీ, ఇలా వాడుకునేందుకు ప్రభుత్వం వద్ద ఆచరణాత్మక ప్రణాళిక లేదని ఇంజనీర్లు చెబుతుండ గా.. వరద నీటిని లిఫ్ట్ ద్వారా తీసుకుంటే ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం అంటోంది. నీటి నిల్వ ఎక్కడ..? వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం 45 రోజులు. అయితే గత కొన్నేళ్లుగా కనీసం 30 రోజులకు కూడా వరద నీరు వస్తున్న దాఖలాలు లేవు. అదే సమయంలో కృష్ణా నదికి కూడా వరదలుంటాయి. కృష్ణా పొంగి ప్రవహిస్తే గోదావరి నీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో వరద ఉన్నప్పుడు తీసుకెళ్లిన నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన కలపనున్నారు. ఆ బ్యారేజీ గరిష్ట సామర్థ్యం 3 టీఎంసీలే. కృష్ణాలో ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. గోదావరి నుంచి లిఫ్ట్ చేసిన నీటిని కాల్వలో 2 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వరద తగ్గిన తర్వాత వినియోగించుకోవడానికి అవకాశం ఉంటే నీరు కేవలం 2 టీఎంసీలే! పోలవరం కుడి కాల్వ పనులు కదలవేం? పోలవరం కుడి కాల్వ పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. మిగతా 30 శాతం పనులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఈ పనులు పూర్తి కావాలంటే ఇంకా 1,770 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వెళ్లారు. రైతుల సమస్యలు పరిష్కరించి తక్షణం భూసేకరణ చేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వెంటనే తీర్పులు రాకపోతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నట్లుగా గోదావరి నీటిని వచ్చే ఖరీఫ్కు కాదు కదా మూడేళ్ల తర్వాత వచ్చే ఖరీఫ్కు కూడా కృష్ణా డెల్టాకు ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలో జాప్యం మరీ ఎక్కువైతే.. పట్టిసీమ పథకం చేపట్టీ ప్రయోజనం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. ఎటూ కుడి కాల్వ ద్వారా నీరు కష్ణా డెల్టాకు చేరుతుంది. ఎవరికీ ప్రయోజనం చేకూర్చని పథకాన్ని రూ.1,300 కోట్ల వ్యయంతో చేపట్టాలా అని గోదావరి జిల్లాల ప్రజలతో పాటు కృష్ణా డెల్టా రైతులూ ప్రశ్నిస్తున్నారు. ఉట్టికెక్కలేనమ్మ.. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానంటే ఇదే! కృష్ణమ్మ నీరు పోటెత్తి ప్రవహించినప్పుడు ఆ జలాలను రాయలసీమకు తీసుకెళ్లడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. గోదావరి నీటిని మళ్లించగా, కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమలో వినియోగిస్తామని చెబుతోంది. శ్రీశైలం నిండిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని రాయలసీమకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే మరో 4,500 క్యూసెక్కుల నీరు దీనికి అదనం. కృష్ణాలో 30 రోజుల పాటు వరద ఉంటుందని అంచనా. కిందటేడాది అంతకంటే ఎక్కువ రోజులే కృష్ణాకు వరద పోటెత్తింతి. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని తీసుకెళితే.. 30 రోజుల్లో 120 టీఎంసీల కన్నా ఎక్కువ నీటినే తీసుకెళ్లవచ్చు. కానీ ఈ ఏడాది తీసుకెళ్లింది 45-50 టీఎంసీలే! కృష్ణాలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేని సర్కారు.. గోదావరి నీటిని తీసుకొచ్చి వాడుకుంటామని చెప్పడం వెనక అంతరార్థం ఏమిటోనని అధికార వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం? పట్టిసీమ ఎత్తిపోతల పథకం లక్ష్యం ఏమిటి? గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం. మరి పోలవరం అందుకే కదా..? మళ్లీ ఈ లిఫ్ట్ ఎందుకు? ఎవరికైనా ఈ అనుమానం రావడం సహజం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే.. ‘పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుంది. ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తి చేసి నీళ్లిస్తే.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడాని కంటే మూడేళ్ల ముందే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వొచ్చు. ఎత్తిపోతల పథకం కోసం కొత్తగా కాల్వ తవ్వాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ ఎలాగూ ఉంది’ అని సమాధానమిస్తున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అధికారం చేపట్టి 8 నెలలు పూర్తయినా.. ఆ మిగిలిపోయిన 30 శాతం పనుల్లో కనీసం ఒక్కశాతమైనా పూర్తి చేశారా అని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం ఉండదు. ఏడాదిలో పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు ఎలా మళ్లిస్తారని అడిగినా.. బదులు ఉండదు. భూసేకరణలో సమస్యలు రావడంతో ఆగిపోయిన పనుల సంగతి అటుంచితే, రెండు మేజర్ అక్విడెక్టులు నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు. కానీ ఆ పనులను మొదలేపెట్టకపోవడం గమనార్హం. కొత్త కాంట్రాక్టుల్లో కాసుల కోసమే లిఫ్ట్ను ప్రభుత్వం చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలవరం మరుగున పెట్టేందుకే.. పోలవరం ప్రాజెక్టును మరుగున పెట్టేందుకే ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించాలని యత్నిస్తోంది. ఇది పూర్తయ్యేందుకు మూడేళ్లు పట్టే అవకాశముంది. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని సీఎం ప్రక టిస్తున్నప్పుడు పట్టిసీమ పథకం అనవసరం. - విప్పర్తి వే ణుగోపాలరావు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గోదావరి హెడ్ వర్క్స్, ధవళేశ్వరం ప్రాణమైనా ఇస్తా.. భూములివ్వను ప్రాణాలైనా అర్పిస్తా గానీ పట్టిసీమ ఎత్తిపోతల పధకానికి భూమి ఇచ్చేది లేదు. ప్రస్తుతం నాకున్నది రెండెకరాల భూమే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ళ స్ధలాలకు 3 ఎకరాల భూమి ఇచ్చాను. మిగిలింది 2 ఎకరాలే. అదే నాకుటుంబ జీవనాధారం... - పప్పల సత్యనారాయణ, బంగారంపేట -
'కృష్ణా డెల్లాకు నీరు విడుదల నిలిపివేత'
హైదరాబాద్ : కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రబీ పంటకు సాగర్ కుడి కాల్వ కింద నీటిని విడుదల చేయలేమని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే కేటాయించిన దాని కంటే అదనంగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుందని తెలిపారు. 44 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నారని...అందువల్ల సాగర్లో నీటి మట్టం తగ్గిందని హరీష్రావు వెల్లడించారు. -
కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయం: టి సర్కార్
-
సంకల్పంతో సీమకు సాగునీరు సులభమే!
సీమకు న్యాయం జరగాలంటే గోదావరి జలాలను వీలైనంత మేరకు కృష్ణకు తరలించి, కృష్ణా డెల్టాకు అందించినంత మేర నికర జలాలను తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి సీమ ప్రాజెక్టులకు తరలించాలి. త్వరితగతిన గోదావరి-కృష్ణ నీటి మళ్లింపుపై తగు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తెలుగునేలపై మరో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు రహదారిని ఏర్పరచడమే అవుతుంది. తెలుగువారందరి ప్రత్యేక రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించి రాయలసీమ వాసులు అన్ని విధాలా నష్టపో యారు. సర్కారు జిల్లాలతో ఐక్యత పట్ల నాటి సీమ నేత లలో పలువురికి ఆంధ్ర మహా సభ కాలం నుండి అనుమానా లు ఉండేవి. ఆంధ్ర విశ్వవిద్యా లయ కేంద్రాన్ని అనంతపురం లో ఏర్పాటు చేయాలంటూ యూనివర్సిటీ సెనేట్ కమిటీ 1926లో చేసిన తీర్మానాన్ని సైతం లెక్కచేయక దాన్ని విజయవాడ నుండి విశాఖపట్టణానికి తరలించారు. ఇలాంటి వైఖరి కారణంగానే తమిళుల ఆధిపత్యం వదు ల్చుకొని సర్కారు జిల్లాల వారి ఆధిపత్యం కొనితెచ్చుకో వడం ఎందుకంటూ, ప్రత్యేక రాయలసీమ డిమాండు ముందుకొచ్చింది. 1934లో రాయలసీమ మహాసభ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో సర్కారు, సీమ పెద్దమ నుషుల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక (1937) కుదిరింది. ఆచరణలో అది రాయలసీమను ఆంధ్ర రాష్ట్రంలో ఐక్యం చేయడానికి వేసిన ఎత్తుగడ మాత్రమేనని రుజువైంది. 1953లో రాయలసీమసహా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరి గింది. కానీ కర్నూలులో రాజధాని, అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయపు రెండో కేంద్రం ఏర్పాటు వాగ్దా నాలు గాలిలో కలసిపోయాయి. పదేళ్లు, అవసరమైతే ఆ పై మరికొన్నేళ్లపాటు సీమ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధా న్యం ఇవ్వడం, తుంగభద్ర, పెన్న, కృష్ణాజలాలతో రాయ లసీమ, నెల్లూరు జిల్లాల సాగు భూములను కోస్త్రాంధ్ర జిల్లాల స్థాయికి అభివృద్ధి చేయడం వంటి మాటలన్నీ నీటి మూటలయ్యాయి. ఫలితంగా రతనాల సీమ కరువు కాటకాల సీమగా మారింది. సీమ నీటి అవసరాలను తీర్చగలిగినది కృష్ణా నది నీరేనని సర్ మెకంజీ 1880 ప్రాంతంలోనే గుర్తించారు. కృష్ణా-తుంగభద్ర-పెన్నా నదుల అనుసంధానంతో 3,60,000 ఎకరాలకు సాగు నీరందించే పథకాన్ని ఆయన రూపొందించారు. అది కలగానే మిగిలిపోయింది. 1947 లో గోదావరిపైన, 1953లో కృష్ణపైన ఆనకట్టలను నిర్మిం చినా సీమకు ఒరిగిందేమీ లేదు. కాటన్ రూపొందించిన కడప-కర్నూలు కాలువ నిర్మాణం (1890) వల్ల కర్నూలు జిల్లాలో 1,84,000, కడప జిల్లాలో 94,000 ఎకరాలకు సాగునీరు మాత్రమే సీమకు దక్కింది. 1951లో నాటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును ప్రతిపాదించి, కేంద్ర ప్రభుత్వం, ప్రణాళికా సంఘాల అనుమతులను సైతం పొందింది. ఆ ప్రాజెక్టుతో కర్నూలు జిల్లాలో 2,50,000, కడప జిల్లాలో 4,00,000, చిత్తూరు జిల్లాలో 70,000, నెల్లూరు జిల్లాలో 7,00,000 ఎకరాలకు సాగునీరు లభించేది. సీమకు గొప్ప వరం లాంటి ఆ ప్రాజెక్టు వల్ల సర్కారు జిల్లాలకు నీరు తగ్గిపోతుందన్న స్వార్థంతో అక్కడి నేతలు దానికి కాలడ్డారు. తమిళులు నీటిని తరలించుకుపోతున్నారని గగ్గోలు పెట్టారు. సీమకు మేలు చేయగల ప్రాజెక్టును సీమవాసులే వ్యతిరేకించేట్టు చేశారు. సీమకు చుక్క నీరైనా అందివ్వలేని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం ఉద్యమించేట్టు చేశారు. ఆ ప్రాజెక్టు కోసం 1954లో ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా సీమ సాగునీటి పథకాలకు కృష్ణా నికరజలాలే లేకుండాపోయాయి. అదే ఏడాది తుం గభద్ర ప్రాజెక్టు నుండి 80 శాతం విద్యుత్తు, 20 శాతం నీరు ఆంధ్రకు చెందేట్టుగా ఆంధ్ర-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అలా సీమకు తుంగభద్ర నీటినీ పెద్దగా మిగలకుండా చేశారు. 1976లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కృష్ణా జలాల (తుంగభద్ర నీరు సహా) వాటాను 800 టీఎంసీలుగా నిర్ణయించింది. 1981 అఖిల పక్ష సమావేశం ఆ నీటిని కోస్తాకు 377.70 (49.2%), తెలంగాణకు 266.83 (34.8%), రాయలసీమకు 122.70 టీఎంసీలు (16.8%) పంపకం చేసింది. ఈ కేటాయింపుల సమయంలో శ్రీబాగ్ ఒడంబడికలోని నీటి ప్రాధాన్యతలు, హామీలుగానీ, గోదావరి నీటిని కృష్ణకు తరలించే నీటి గురించిగానీ, కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు విషయంగానీ ఎవ రికీ పట్టలేదు. పైగా ఈ కేటాయింపులకు ప్రాతిపదిక పంట భూముల విస్తీర్ణంగానీ, జనాభాగానీ, వెనుకబాటు తనంగానీ కాకపోవడం విశేషం. ఈ ఒప్పందం ద్వారా సీమకు కొత్తగా చుక్కనీరు దక్కిందిలేదు. సీమకు కేటాయించిన 122.70 టీఎంసీలలో కొత్తగా కేటాయించిన నికరజలాలు శూన్యం. పైపట్టికలోని వివరాలను గమనిస్తే సీమకు జరిగిన అన్యాయం విశదమవుతుంది. సీమకు న్యాయం జరగాలంటే గోదావరి నదీ జలా లను వీలైనంత మేరకు కృష్ణకు తరలించి, కృష్ణా డెల్టాకు అందించినంత మేర నికర జలాలను సీమలోని తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటి సీమ ప్రాజెక్టు లకు తరలించాలి. 1962 నాటి గుల్హతి కమిషన్ సూచించి నట్టు నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలి. శ్రీబాగ్ హామీలను ఈ రూపంలో ఈ మేరకైనా ఇప్పటికైనా సాకారం చేయ డానికి అన్ని ప్రాంతాల వారు కలిసికట్టుగా కృషి చేయాలి. త్వరితగతిన గోదావరి-కృష్ణా నీటి మళ్లింపుపై తగు నిర్ణ యం తీసుకోవాలి. లేకపోతే తెలుగు నేలపై మరో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు రహదారిని ఏర్పరచడమే అవుతుంది. (వ్యాసకర్త ఎస్.వి. యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు) మొబైల్ నం: 9849584324 ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల పంపకం, వాడకం తీరు అంశం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ 1. ఎ. ఇప్పటికే ఉన్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులు, పథకాలతో సాగునీరు అందే భూములు (లక్షల హెక్టార్లలో) 33.8 25.7 8.5 బి. మొత్తం పంట భూముల్లో సాగునీరు అందే భూమి శాతం 94.0 53.9 28.4 2. ఎ. మొత్తం పంట భూములు (లక్షల హెక్టార్లలో) 35.9 47.7 29.8 బి. పంట భూమి విస్తీర్ణం ప్రాతిపదికన 2,746 టీఎంసీల నదీజలాలలో మూడు ప్రాంతాలకు అందవలసిన వాటా (టీఎంసీలు) 870.0 1153.0 723.0 సి. ప్రతీ 1,000 మంది జనాభాకు లభ్యమవుతున్న నదీజలాలు (మిలియన్ ఘనపుటడుగులు) 67.0 48.0 25.0 డి. పంట భూముల్లో ప్రతి 1,000 ఎకరాలకు ఉపయోగిస్తున్న నదీ జలాలు (మిలియన్ ఘనపుటడుగులు) 174.0 78.0 34.0 డా॥దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి -
అక్కడో మాట..ఇక్కడో మాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘రాయలసీమ జిల్లాల్లో కురిసే వర్షపాతం కంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదయ్యే వర్షపాతం చాలా తక్కువ. కానీ.. అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి. కారణం గోదావరి నదికి భారీగా వరద నీరు రావడం. ఇప్పుడు ఆ నీటిని ఒడిసి పట్టి పోలవరం కుడికాలువ ద్వారా రాయలసీమకు మళ్లిస్తా. మీ సాగునీటి కష్టాలు తీరుస్తా. 70 టీఎంసీల నీరు కచ్చితంగా వచ్చి చేరుతుంది. రుణమాఫీ కంటే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తా’ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు గురువారం చిత్తూరు జిల్లాలో జరిగిన రైతు సాధికార సదస్సులో చేసిన ప్రకటన ఇది. ‘నాలుగేళ్లలో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఈలోగా సముద్రంలోకి వృథాగా పోతున్న మిగులు జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తాం. దీనిపై ఇక్కడి రైతుల్లో కొందరు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. నాకు ముందుగా గోదావరి జిల్లాల రైతులే ముఖ్యం. ఇక్కడ రెండో పంటకు కూడా నీరిచ్చిన తర్వాతే సముద్రంలోకి వృథాగాపోతున్న 3 వేల టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తాం’ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో శుక్రవారం జరిగిన సదస్సులో అదే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. రుణమాఫీ కంటే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాయలసీమకు గోదావరి నీటిని మళ్లిస్తామని చిత్తూరులో బహిరంగంగా ప్రకటించిన చం ద్రబాబు మరుసటి రోజు గోదావరి జిల్లాకు వచ్చేసరికి ఎక్కడా రాయల సీమ ఊసెత్తలేదు. నేరుగా ఎత్తిపోతల ప్రాజెక్టు అని కూడా అనకుండా మిగులు జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని అస్పష్టంగా మాట్లాడారు. ఒక్కరోజు వ్యవధిలోనే మాట మార్చిన చంద్రబాబు వైఖరిని ఎలా నమ్మేదంటూ డెల్టా రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘తొమ్మిదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పశ్చిమగోదావరి జిల్లాలో వచ్చిన ఎన్నికల ఫలితాలే కారణం. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిది. ఎక్కడా జరగని అభివృద్ధి చేసి రుణం తీర్చుకునే యత్నం చేస్తాను’ అని జిల్లాకు వచ్చినప్పుడల్లా పదే పదే ప్రకటనలు చేసే చంద్రబాబు ఇప్పుడు జిల్లా రైతులకు ఆశనిపాతంలా మారే నిర్ణయం తీసుకుంటున్నారంటూ రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి మాటలు అక్కడ చెబుతూ ఇరు ప్రాంతాలనూ మోసం చేసే బాబు వైఖరిని ఎండగడుతూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు దిగువన పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. పోలవరం పూర్తయ్యేలోగా ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని, సముద్రం పాలయ్యే మిగులు జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని సర్కారు చెబుతోంది. రూ.1,800 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ర్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని డెల్టాకు మళ్లిస్తామని ప్రకటించారు. వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం 45 రోజులు కాగా, గత కొన్నేళ్లుగా కనీసం 30 రోజులకు కూడా వరద నీరు భారీగా వస్తున్న దాఖ లాలు లేవు. గత ఏడేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతోంది. దీంతో గోదావరికి సీలేరు జలాల మళ్లించి పంటలను రక్షించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు నానాతంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకం నిర్మించి కృష్ణాడెల్టాకు మళ్లిస్తే పశ్చిమలో సాగు, తాగు, ఆక్వా అవసరాలకు నీరు అందకపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే ది ప్రశ్నార్థకంగా మారింది. డెల్టా ఆయకట్టుకూ ప్రమాదం గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే రూ.1,800 కోట్లను గోదావరిలో వృథాగా పోసినట్టేనని ఇంజినీరింగ్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ పథకం వల్ల డెల్టా ఆయకట్టూ ప్రమాదకరంగా మారుతుందనేది నిపుణుల వాదన. గోదావరిలో వరద ప్రవాహం ఒక్కో ఏడాది ఒక్కో రకంగా ఉంటోంది. తక్కువగా ఉన్న సమయంలో ఉన్న కొద్దిపాటి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తే పశ్చిమ డెల్టా ఆయకట్టులో రెండో పంటకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. ఇక ఎత్తిపోతల పథకం పూర్తయి కృష్ణా డెల్టాకు నీరు మళ్లించడం మొదలైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంటుందనేది ఇంజినీరింగ్ నిపుణుల వాదన. భూ సేకరణకు అడ్డంకులు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 4.5 కిలోమీటర్ల పొడవునా 2,500 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలోని భూములన్నీ సారవంతమైనవి కావడంతో రైతులు ఇందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతోపాటు నిరసన గళం విప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాడిపూడి, చింతలపూడి, పైడిమెట్ట ఎత్తిపోతల పథకాలతో పాటు కొవ్వాడ కాలువ విస్తరణ, అవుట్పాల్ స్లూయిస్ నిర్మాణాల పేరుతో చేపట్టిన భూసేకరణ కారణంగా ఈ ప్రాంత రైతులు ఇప్పటికే చాలా భూములు కోల్పోయారు. మళ్లీ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వడానికి సుముఖంగా లేమని తెగేసి చెబుతున్నారు. సొమ్ము వృథా 176 కిలోమీటర్ల పొడవున్న పోలవరం కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి సుమారు 40 కిలోమీటర్ల మేర భూ సేకరణ, కోర్టు వివాదాలు అడ్డంకిగా మారాయి. ఈ ప్రక్రియను ఎంత వేగంగా చేసినా 8 నెలల్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. పోలవరం కుడి కాలువ పనులు పూర్తి కాకుండా పట్టిసీమ ఎత్తిపోతలకు ఓ రూపు రాదు. కుడి కాలువ పనులు, పట్టిసీమ ఎత్తిపోతల పనులు ప్రభుత్వం ఎంత వేగంగా చేసినా రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగేళ్లలో పోల వరం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం కేవలం రెండేళ్ల కోసం రూ.1,800 కోట్లు ఖర్చు చేయడాన్ని నీటిపారుదల శాఖ నిపుణులు తప్పు పడుతున్నారు. సీఎం చంద్రబాబు చెబుతున్నట్టుగా పోలవరం ప్రాజెక్ట్ నాలుగేళ్ల కాలంలో పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఖర్చు చేసే నిధులను వృథా చేయడమేనన్నది నిపుణుల వాదన. చింతలపూడి పథకాన్ని పూర్తిచేస్తే ఎత్తిపోతలతో పనిలేదు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 15 మండలాల పరిధిలోని 160 గ్రామాలకు చెందిన 2 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు రూపొందించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు సర్కారు చొరవ చూపడం లేదు. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2013 నాటికే పూర్తి కావాల్సి ఉంది. చింతలపూడి మొదటి దశ ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తే 14.5వ కిలోమీటర్ వద్ద పోలవరం కుడి ప్రధాన కాలువకు కలపవచ్చు. తద్వారా ఎత్తిపోతల అవసరం లేకుండానే 1,977 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. రైతుల్ని ముంచుతున్నారు నాకున్నది ఎకరం భూమి ఇది కూడా తీసుకుంటే మా పరిస్థితి ఏమిటి. పైగా ఈ పథకం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కృష్ణా డెల్టా కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైతులను ముంచుతున్నారు. - కన్నూరి రామారావు, రైతు, బంగారమ్మ పేట, పశ్చిమగోదావరి జిల్లా ఇప్పుడెంత నష్టపోవాలో పోలవరం కుడి ప్రధాన కాలువ నిర్మాణం వల్ల రెండు ఎకరాలు పోయింది. ఇంకా మూడు ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎత్తిపోతలతో ఎంత నష్టపోవాలో. - సానా నారాయణ, రైతు, పట్టిసీమ, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మరుగున పెట్టేందుకే.. పోలవరం ప్రాజెక్టును మరుగున పెట్టేందుకే ప్రభుత్వం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని చూస్తోంది. ఇది పూర్తి కావడానికి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని సీఎం ప్రక టిస్తున్నప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనవసరం. పోలవరం పూర్తయితే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.వందలాది కోట్లు వృథా అవుతాయి. - విప్పర్తి వే ణుగోపాలరావు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, గోదావరి హెడ్ వర్క్స్, ధవళేశ్వరం అవసరం లేదు ఎత్తిపోతల పథకం వల్ల చేకూరే ప్రయోజనమే పోలవరం ప్రాజెక్టు ద్వారా కలుగుతుంది. ఎత్తిపోతలకు మళ్లీ రైతుల నుంచి భూములను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజె క్టు కోసం ఇప్పటికే భూములను తీసుకున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మించే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే రైతులు, ప్రజల తరపున కమ్యూనిస్టు పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది. - డేగల ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి -
చినుకు..చింత
రైతన్నను కుంగతీస్తున్న వర్షాభావం నీరందక ఎండుతున్న పంటలు ఖరీఫ్లో తగ్గిపోయిన సాగు జిల్లాలో వరుణుడు మొహం చాటేశాడు. నల్లని మేఘాలు కమ్ముకోవడం..ఇంతలోనే మటుమాయవడం నిత్యకృత్యమవుతోంది. వాన చినుకు జాడ కోసం రైతులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సకాలంలో పెట్టుబడులు, విత్తనాలు అందకపోయినా..అప్పో సొప్పో చేసి కోటి ఆశలతో సాగు చేసిన పంటలు నీరందక కళ్లముందే ఎండిపోతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సర్కారు చేయూత లేకపోయినా...అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తున్న రైతులకు వరుణ దేవుడి కరుణ కూడా కరువైంది. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో ఖరీఫ్ ఆలస్యమైంది. ఖరీఫ్ సీజన్ అక్టోబర్ 15తో ముగిసింది. వర్షాలు లేక జిల్లా వ్యాప్తంగా వరి కేవలం 53 శాతమే సాగు చేశారు. పత్తి, మినుములు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటల విస్తీర్ణం పెరిగినా వరి విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. వర్షపాతం కూడా గణనీయంగా తగ్గింది. జూన్ నెలలో 80 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో ఒక మాదిరిగా వర్షపాతం నమోదైంది. ఆగస్టులో 54 శాతం, సెప్టెంబర్లో 44 శాతం వర్షపాతం తక్కువ నమోదు కాగా, అక్టోబర్లో ఇప్పటి వరకూ 88 శాతం తక్కువ నమోదైంది. దీంతో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సజ్జలు 2994 హెక్టార్లలో, శనగలు 1957 హెక్టార్లలో, పత్తి 7705 హెక్టార్లలో, నువ్వులు 248 హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో 39,363 హెక్టార్లలో వరి విస్తీర్ణం ఉండగా, గత ఏడాది 58,103 హెక్టార్లలో వరి వేశారు. ఈసారి అది 20 వేల హెక్టార్లకు కూడా చేరుకోలేదు. కృష్ణాడెల్టా కాల్వల పరిధిలో మాత్రమే వరి వేశారు. జొన్నలు 471 హెక్టార్లలో గత ఏడాది వేయగా, ఈ ఏడాది కేవలం 12 హెక్టార్లలోనే వేశారు. సజ్జలు గత ఏడాది 25277 హెక్టార్లలో వేయగా ఈ ఏడాది అది 10,611 హెక్టార్లకే పరిమితమైంది. మొక్కజొన్న గత ఏడాది 2,865 హెక్టార్లలో సాగు చేయగా ఇప్పటి వరకూ 1183 హెక్టార్లలో వేశారు. రాగి, చిరుధాన్యాలు 162 హెక్టార్లలో మాత్రమే వేశారు. పొగాకు, శనగ పంటల విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దీంతో పత్తి, మిర్చి ఇతర పంటల సాగు పెరిగింది. పత్తి సాధారణ విస్తీర్ణం 56,167 హెక్టార్లు కాగా ఈ ఏడాది 70,571 హెక్టార్లలో వేశారు. చెరుకు 446 హెక్టార్లకు గాను 900 హెక్టార్లలో సాగు చేశారు. అంటే సాగు 202 శాతానికి పెరిగింది. తుఫాన్ ప్రభావం కూడా జిల్లా మీద కనపడలేదు. రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడినా అవి పంటలకు సరిపడా లేవని రైతులు చెబుతున్నారు. -
డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!
* 14న గుంటూరులో ఉన్నతస్థాయి సమీక్ష * 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు రాక * రద్దుకానున్న పనులు.. మరికొన్నింటికి టెండర్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించే యోచనలో ఉంది. ఆరేళ్ల నుంచి పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలను తెలుసుకుని ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ చేపట్టిన జలయజ్ఞంపై చర్యలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డెల్టాల వారీగా సమీక్షలకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా, ఈనెల 14న గుంటూరులోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఆరేళ్ల కిందట నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరిగి ఉంటే 20 టీఎంసీల నీరు మిగులు ఉండేది. కొన్ని పనులు ఆలస్యం కావడానికి ప్రభుత్వం, మరికొన్నింటికి నిర్మాణ సంస్థలు కారణంగా తెలుస్తోంది. ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు వేయకపోవడంతో పేరు ప్రఖ్యాతులు, సమర్థత కలిగిన నిర్మాణ సంస్థలు కూడా కొన్ని పనులను ప్రారంభించలేదు. ఏడాది పొడవునా నీరు ప్రవహించే కాలువలకు మరమ్మతులు చేయాలని, నల్లరేగడి కలిగిన కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయాలని కొందరు ఇంజనీర్లు హడావుడిగా అంచనాలు తయారు చేశారు. ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తే బీటలు వారే అవకాశాలు ఎక్కువ. ఈ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా అంచనాలు తయారుచేయాలి. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో కొందరు ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు తయారు చేయలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించలేదు. భూసేకరణ, డిజైన్ల అనుమతిలో జాప్యం వల్ల కూడా నిర్మాణ సంస్థలు పనులు చేయలేకపోయాయి. దీనికి తాము బాధ్యులం కాబోమని ఆ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని పనులు ప్రారంభించలేదు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా ఆ సంస్థల అధిపతులు ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందినవారు కావడంతో అధికారులు మిన్నకుండి పోయారు. ఈ కారణాలతో కృష్ణాడెల్టాలోని 13.35 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం రూ. 4,573 కోట్లను ఆధునీకరణ పనులకు కేటాయిస్తే రూ. 1,178 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మాణ సంస్థల పనితీరు, పనులు జరగకపోవడానికి గల కారణాలపై ఒక అవగాహన వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్లు కొన్నింటిని రద్దు చేసేందుకు నివేదికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేకంటే పనుల పరిశీలన, నివేదిక ఇవ్వడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజనీర్లు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని అవసరంలేని పనులను రద్దు చేసే అవకాశం ఉంది. పనులు చేయని నిర్మాణ సంస్థల ఒప్పందాన్ని రద్దు చేసి, చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రద్దు కానున్న పనుల్లో రైతులకు అవసరమైనవి ఉంటే వాటికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
జలయజ్ఞ ఫలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజన్న కల సాకారమవుతోంది. కృష్ణాడెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల ప్రాజెక్టు తొలిసారిగా రైతులకు అందుబాటులోకి వస్తోంది. ఈ ఖరీఫ్లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే నిర్ణయానికి అనుకూలంగా ప్రాజెక్టు వద్ద 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇప్పటికే శ్రీశైలం నిండగా, మరో వారంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీటితో పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఆ తరువాత అదనంగా వచ్చే నీటిని సాగర్ నుంచి దిగువకు విడుదల చేసి పులిచింతల వద్ద నిల్వ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస ప్రాంతాలకు వెంటనే తరలించి 11 టీఎంసీల నీటిని ప్రాజెక్టు వద్ద నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభంలో వర్షాభావం, ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండకపోవడం వంటి కారణాల వల్ల కృష్ణాడెల్టాలో వరినాట్లు ఆలస్యమయ్యాయి. క్రమంగా వరద నీటితో డ్యామ్లు నిండుతుండ టంతో సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జలయజ్ఞంలో భాగంగా నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టు ఆగస్టు 15 నుంచి రైతులకు అందుబాటులోకి వచ్చింది.24 గేట్లను పూర్తిగా కిందకు దించి నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టు మధ్య ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగు లేరు, చంద్రవంక తదితర వాగులు పొంగి ఆ వరద నీరంతా కృష్ణానదిలోకి చేరుకున్నది. సాగర్ నుంచి విడుదలైన నీటిలో కొంత భాగం నది బేసిన్లో నిల్వ ఉండి పోయింది. వర్షాలకు నదినీటి ప్రవాహ వేగం పెరిగి మిగులు నీరంతా ప్రాజెక్టుకు చేరుకున్నది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇరిగేషన్ శాఖ ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని భవిష్యత్ అవసరాలకు నిల్వ ఉంచింది. మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని, ఆ తరువాత మిగులు నీటిని దిగువకు విడుదల చేసి పులిచింతల ప్రాజెక్టు వద్ద మొత్తం 11 టిఎంసీలను నిల్వ చేస్తామని పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ చంద్రశేఖర్ ‘సాక్షి’కి వివరించారు. -
తూర్పు డెల్టాలో 37 శాతం నాట్లు పూర్తి
ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు అవనిగడ్డ : కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలోని తూర్పుడెల్టాలో 37 శాతం వరినాట్లు పూర్తయినట్లు ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటి వరకు తూర్పుడెల్టాలో 4.15లక్షల ఎకరాల్లో నాట్లు వేసినట్లు తెలిపారు. పులిగడ్డ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని పశ్చిడెల్టాలో 1.79 లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా, 31 శాతం పూర్తయినట్లు చెప్పారు. యనమలకుదురు లాకుల నుంచి నిమ్మగడ్డ లాకు వరకు ఒకే స్థాయిలో సాగునీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాల్లోని కాలువ చివరి భూములకు సాగునీరందడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకురావడంతో వంతులువారీ విధానాన్ని అమలుచేయాలని సూచించినట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులు ప్రారంభించటంతో సాగునీటి ఎద్దడి ఏర్పడిందని, సాగునీటి విడుదలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివిసీమలోని కాలువ చివరి భూములకు సైతం పూర్తిస్థాయిలో సాగునీరు అందించటమే తమ లక్ష్యమని చెప్పారు. సాగునీటి వినియోగంపై కృష్ణారివర్ బోర్డు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 15వ తేదీలోపు వరినాట్లు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కరువు కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నామని, సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకుని, ముందస్తుగా నాట్లు వేయటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరినాట్లు పూర్తయిన తర్వాత ఇలాంటి వర్షాభావ పరిస్థితులే నెలకొంటే వంతులువారీ విధానం అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈ జి.గంగయ్య, డీఈ భానుబాబు, ఆర్సీ డీఈ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అపర భగీరథుడు ఆంధ్ర కేసరి
నేడు ‘టంగుటూరి’ జయంతి ఆంధ్రుల ఆవేశం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక ప్రకాశం పంతులు నేడు రాష్ట్రవ్యాప్తంగా అధికారిక జయంతి కార్యక్రమాలు 1953, ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజీకి శంకుస్థాపన బ్యారేజీ నిర్మాణంతో కృష్ణాడెల్టాకు తీరిన నీటి కరువు బతికుండగానే బెజవాడలో కాంస్య విగ్రహం దివిలోని గంగమ్మను భగీరథుడు భువికి రప్పిస్తే.. అక్కరకు రాకుండాపోతున్న కృష్ణమ్మను ఆయకట్టుకు అనుకూలం చేసి అపర భగీరథుడయ్యూడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని వేరుచేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యూరు. అంతటి గొప్పవ్యక్తి జయంతి కార్యక్రమాలను రాష్ట్రమంతటా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి, విజయవాడ బ్యూరో : టంగుటూరి ప్రకాశం పంతులు పేరు వినగానే మొదట గుర్తొచ్చేవి రెండే రెండు. మొదటిది ప్రకాశం జిల్లా, రెండోది ప్రకాశం బ్యారేజీ. ఒంగోలుకు సమీపంలోని వినోదరాయునిపాలెంలో పుట్టిన టంగుటూరి బాల్యమంతా ఒంగోలు, అద్దంకి, నాయుడుపేట ప్రాంతాల్లోనే గడిచింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పట్టభద్రుడయ్యాక ఆయన దృష్టి స్వాతంత్య్రోద్యమం వైపు మళ్లింది. 1928లో బొంబాయి చేరుకున్న సమైన్ కమిషన్పై ఉద్యమించి ‘ఆంధ్రకేసరి’గా గుర్తింపు పొందారు. ఉమ్మడి మద్రాసు నుంచి మన రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. దీనికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టంగుటూరి బెజవాడ కేంద్రంగా కీలక రాజకీయాన్ని నెరిపి ఇక్కడి నుంచే పాలన కొనసాగించారు. కృష్ణాడెల్టా వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ అప్పట్లో కోల్కతా, బొబ్బిలి, విజయనగరం, వాల్తేరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి మద్రాసు, తిరుపతి, కంచి వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన వారు బెజవాడ చేరుకోగానే కృష్ణానది దాటేందుకు నానా అవస్థలు పడేవారు. ఒక్కోసారి పడవ ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు పోతుండేవి. 1952లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. నదీ ప్రవాహ వేగానికి బెజవాడ వద్ద నదికి అడ్డంగా కాటన్ నిర్మించిన కొండరాళ్ల ఆనకట్ట కొంతమేర కొట్టుకుపోయింది. అప్పట్లో ఇంజినీరుగా గుర్తింపు పొందిన వేపా కృష్ణమూర్తి పంటు మీద నదీ ప్రవాహంలోకి ప్రవేశించి గండిని పూడ్చే ప్రయత్నంలో నదిలో పడి కొట్టుకుపోయారు. ఈ సంఘటన ప్రకాశం పంతులును కదిలించింది. వెంటనే బ్యారేజీ కట్టాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులకు తోడు రైతాంగం నీటి తీరువా కింద చెల్లించిన వేల రూపాయలను జోడించి బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారు. సీఎం హోదాలో 1954 ఫిబ్రవరి 13న (భీష్మేకాదశి) బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సీఎంగా పదవిలోకి వచ్చిన నీలం సంజీవరెడ్డి 1957 డిసెంబరు 24న బ్యారేజీని కృష్ణాడెల్టా ప్రజలకు అంకితమిచ్చారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, సర్కారు జిల్లాల మధ్య రాకపోకలు పెరిగాయి. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వల్ల ఏలూరు, కొమ్మమూరు, బకింగ్హాం కాల్వలు అభివృద్ధి చెంది కాకినాడ- మద్రాసు నగరాల మధ్య జలరవాణా మార్గం సులభతరమైంది. అంతేకాకుండా కృష్ణాడెల్టాలోని నాలుగు జిల్లాల రైతులు 13 లక్షల ఎకరాల్లో ఏటా మాగాణి సాగు చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజీ వరదాయినిగా మారింది. ‘టంగుటూరి’ జీవితంలో ప్రధాన ఘట్టాలు న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని కలలుగన్న ప్రకాశం పంతులుకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక రాత్రికి రాత్రి 50 కిలోమీటర్ల నడిచి మేనమామ దగ్గరికి వెళ్లినా ఫీజుకు అవసరమైన రూ.3 లభించలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి తన పట్టువస్త్రాన్ని తాకట్టు పెట్టి ఫీజు చెల్లించింది. ఈ ఘటన ఆంధ్రకేసరి మనసులో చిరస్థాయిగా మిగిలిపోయింది. తాను సీఎంగా పనిచేసిన రోజుల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. తన గురువు హనుమంతరావును చూసేందుకు ఒంగోలు నుంచి రాజమండ్రి వెళ్లిన ప్రకాశం తిరుగు ప్రయాణంలో కృష్ణానదిని దాటలేక వెనక్కి వెళ్లారు. ప్రియ శిష్యుడు వెళ్లిపోవడంతో బాధపడుతూ కూర్చున్న గురువు హనుమంతరావు తిరిగొచ్చిన ప్రకాశాన్ని చూసి పులికించిపోయి రాజమండ్రిలోనే ఉంచుకుని చదివించారు. 1949లో కారులో కృష్ణానది వరకు చేరుకున్న ప్రకాశం పంతులు నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న నదిని దాటి మద్రాసు వెళ్లాల్సి ఉంది. కారు డ్రైవర్ ముందుకు పోనిచ్చేందుకు భయపడుతుంటే ఆయనకు ధైర్యం చెప్పి కారును నీళ్లలోనే పోనిచ్చి ఆవలి ఒడ్డుకు చేరుకున్న ప్రకాశం ధైర్యాన్ని అప్పట్లోనే జనం అభినందించారు. 1951 జులై 23న బెజవాడలో ప్రకాశం పంతులు అభిమానులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరిన ప్రముఖులందరూ వర్షం వల్ల నాగపూర్లోనే ఆగిపోయారు. మరుసటి రోజు బెజవాడ చేరుకున్న వీరంతా విగ్రహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రకాశం పంతులు బెజవాడలోనే ఉండి విగ్రహం నెలకొల్పిన చోటకు వెళ్లలేదు.