-
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు న్యాయవాదుల స్వాగతం
-
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ప్రముఖ న్యాయవాదుల లేఖ
-
సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సహా దాదాపు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. పొలిటికల్ అజెండాతో కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయస్థానాల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా దేశవ్యాప్తంగా 600 మందికిపైగా న్యాయవాదులు ఉన్నారు. వీరంతా లేఖలో ఒకవర్గం న్యాయమూర్తులను తమ పేర్లు ప్రస్తావించకుండా టార్గెట్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు. కొందరు లాయర్లు పగటిపూట రాజకీయ నాయకులను సమర్థించి.. రాత్రిపూట మీడియా ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ లేఖను మార్చి 26 రాసినట్లు సమాచారం. చదవండి: కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేం: ఢిల్లీ హైకోర్టు -
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్ను అందజేశారు. బోడుప్పల్లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్మన్గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
ఏపీకి చంద్రబాబు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం: వక్తలు
-
బెయిల్ నిబంధనలు బేఖాతర్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను అభాసుపాల్జేస్తున్నారని పలువురు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో కండిషనల్ బెయిల్పై వచ్చి న వ్యక్తి న్యాయస్థానం విధించిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు తప్పులు చేసి పట్టుబడినా చట్టాల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిన్నారని దుయ్యబట్టారు. ఇందుకు చంద్రబాబు విషయమే ఉదాహరణగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు వ్యవహార శైలి– బెయిల్ నిబంధనల ఉల్లంఘన– శిక్షలు’ అంశంపై ఏపీ ఇంటిలెక్చువల్స్– సిటిజన్స్ ఫోరం(ఎపిక్) ఆధ్వర్యంలో చర్చ నిర్వహించారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. బెయిల్ మంజూరు విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వర్గం పెత్తందారి, నియంతృత్వ పోకడలకు పోతోందని, కోర్టులను, న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తోందన్నారు. చంద్రబాబు కేసులో తాము చెప్పినట్టుగా తీర్పు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన తీరు ఇటీవల కోర్టులో చూశామన్నారు. తీవ్ర నేరాలు చేసిన చంద్రబాబు, రామోజీరావులు తాము చట్టాలకతీతమన్నట్టుగా వ్యవహరిస్తూ.. వాటి నుంచి తప్పించుకునేందుకు యత్ని స్తున్నారని ధ్వజమెత్తారు. కోర్టులను బాబు మేనేజ్ చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో కోర్టులను చంద్రబాబు మాత్రమే మేనేజ్ చేసినట్టు అనేక సందర్భాల్లో రుజువైంది. న్యాయస్థానాలు చట్ట ప్రకారం పనిచేస్తుంటే మాత్రం దు్రష్పచారం చేస్తున్నారు. చంద్రబాబు తీవ్రమైన ఆర్థిక నేరం కేసులో జైలుకు వెళితే.. తాము చేప్పినట్టు తీర్పు ఇవ్వలేదని ఆయన వర్గం వారు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. చివరికి బెయిల్ రాకపోయేసరికి ‘అనారోగ్యం’ సాకుగా చూపారు. కోర్టు కండిషన్లు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటికొచ్చాక ఆస్పత్రికో, ఇంటికో వెళ్లాల్సి చంద్రబాబు.. 14 గంటల పాటు ర్యాలీ చేశారు. ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే. – విజయ్బాబు, ఎపిక్ ఫోరం వ్యవస్థాపకుడు ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణే చంద్రబాబు కేసులో దాదాపు 53 రోజులు దేశంలో ప్రముఖ న్యాయవాదులు కేసును వాదించారు. చివరికి ‘వైద్యం’ పేరుతో అబద్ధం చెప్పి బెయిల్ తీసుకుని రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణ. ఆయన బెయిల్ రద్దు చేయాలి. లేకుంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇలాగే బయటకొచ్చే అవకాశం ఉంది. – పిళ్లా రవి, న్యాయవాది న్యాయ వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయో పురందేశ్వరి చెప్పాలి పురందేశ్వరి, టీడీపీ నాయకులు న్యాయ వ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వారు బెయిళ్లు తెచ్చుకున్నప్పుడు.. ఇప్పుడు అవే చట్టాలు. తనకు అనుకూలంగా బెయిళ్లు వచ్చినప్పుడు చట్టం తనపని చేసుకుపోతుందన్నారు, ఇప్పుడేమో మేనేజ్ చేస్తున్నారంటున్నారు. చంద్రబాబు ఆరి్థక నేరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. న్యాయ వ్యవస్థలో ఏం లోపాలున్నాయో పురందేశ్వరి చెప్పాలి. – విఠల్రావు, న్యాయవాది బెయిల్ నిబంధనలపై చర్చ అవసరం దేశంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు కావడం లేదు. ఏదైనా కేసులో అండర్ ట్రైల్ కింద జైలుకు వెళ్లిన వారు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం వారి హక్కు. కానీ ఇక్కడ అందరికీ ఈ హక్కు లభించడం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసుకునేవారికి, ఆర్థికంగా శక్తిమంతమైన వారికి సులభంగా బెయిల్ వచ్చేస్తోంది. కానీ చాలామంది సామాన్యులు అండర్ ట్రైల్లోనే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయాలి. ప్రభుత్వంలో ఉండి ఆరి్థక నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ ఇవ్వకూడదు. – కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురందేశ్వరి టీడీపీలో పదవి ఆశిస్తున్నట్టున్నారు.. చంద్రబాబు సీఎంగా 2014–19 మధ్య చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఇప్పుడు దొరికిపోయాక అరెస్టు నుంచి బెయిల్ వరకు చట్టాలను ఉల్లంఘించారు. చివరికి న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తున్నారు. మెడికల్ కండిషన్పై బెయిల్ తెచ్చుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పురందేశ్వరికి ఇవన్నీ కనిపించడం లేదా? ఆమె బీజేపీ పదవి కంటే టీడీపీ పదవి ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. – సాయిరామ్, అడ్వకేట్ వారికి చట్టాలంటే గౌరవం లేదు ఒకరు నేరం చేశారని కేసు నమోదైతే కింది కోర్టులో తీర్పు వెలువడ్డాక పైకోర్టులకు వెళతారు. కానీ చంద్రబాబు కేసులో మాత్రం అందుకు విరుద్ధం. చేసిన నేరం నుంచి బయటపడేందుకు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారంటే జరిగింది ఎంత పెద్ద నేరమో అర్థం చేసుకోవచ్చు. పైగా వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలో తెలిసినవారే ఇలా చేస్తారు. ఈ కేసులో చంద్రబాబు వర్గానికి చట్టాలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై గౌరవం లేదు. యథేచ్ఛగా చట్టాలను ఉల్లఘించారు. – నరహరిశెట్టి శ్రీహరి, హైకోర్టు న్యాయవాది బాబుకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివయ్యాయి.. సామాన్యులు బెయిల్ రాకుండా అండర్ ట్రైల్లోనే ఉండిపోతున్నారు. కానీ చంద్రబాబు, రామోజీరావులు కోర్టు మెట్లు ఎక్కకుండానే బెయిల్ తెచ్చుకుంటున్నారు. స్కిల్ స్కాం తప్ప మరే కేసులోను బాబు కోర్టుకు, జైలుకు వెళ్లింది లేదు. తనకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివే అన్నారు, ఈ ఒక్క కేసులో బెయిల్ రాకపోయేసరికి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ నిబంధనలపై న్యాయ సమీక్ష అవసరం – ధనలక్ష్మి, న్యాయవాది అబద్ధాలు చెప్పి బయటికొచ్చారు చంద్రబాబుకు వైద్యం కోసం కోర్టు బెయిల్ ఇచ్చి ంది. బయట ప్రసంగాలు చేయొద్దని చెప్పింది. కానీ బాబు మాత్రం తన హక్కును కాపాడిన కోర్టు హక్కులనూ కాలరాశారు. అబద్ధం చెప్పి బయటకు వచ్చి ర్యాలీలు చేశారు. – ఎన్.జ్యోతి, న్యాయవాది రోజుకో రోగమని చెప్పారు.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోజుకో రోగమని చెప్పారు. వైద్యం కోసం బెయిల్ తెచ్చుకుని బయటికి రాగానే ర్యాలీలు చేశారు. బాబు అరెస్ట్ సమయంలోనూ ఇలాగే ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. – జె.జయలక్ష్మి, న్యాయవాది ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు గమనించాలి చంద్రబాబు అన్ని రకాల బెయిళ్లకు అప్లై చేసి, ఏదీ రాకపోయేసరికి ‘అనారోగ్యాన్ని’ అడ్డుపెట్టుకుని బయటపడ్డారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రికి వెళ్లాల్సింది పోయి.. రాజకీయ ర్యాలీలు చేశారు. న్యాయస్థానాలు ఇలాంటివి గమనించాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది -
‘మై లార్డ్’ అనకండి..సగం వేతనం ఇచ్చేస్తా!
న్యూఢిల్లీ: కోర్టులో వాదోపవాదాల సమయంలో పదేపదే మై లార్డ్, యువర్ లార్డ్షిప్స్’అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు? ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా’అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు. వాదోపవాదాల సమయంలో ఓ సీనియర్ లాయర్ పదేపదే ‘మై లార్డ్, యువర్ లార్డ్షిప్స్’ అంటుండటంపై పైవిధంగా ఆయన స్పందించారు. వాటికి బదులుగా సర్ అని అనొచ్చు కదా అని తెలిపారు. లేకుంటే ఆ మాటలను ఎన్నిసార్లు వాడేదీ లెక్కపెడ తానని చెప్పారు. ‘మై లార్డ్, యువర్ లార్డ్షిప్’అనే మాటలు వలస పాలన ఆనవాళ్లని, కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. -
లాయర్ల ఫీజు చెల్లించడానికి డబ్బులు ఎక్కడివి?: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి. .చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే..లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. 2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ సెటైర్లు వేశారు. -
చంద్రబాబు ఢిల్లీ లాయర్లు ఖుషి చేస్తున్నారు..!
-
చంద్రబాబు లాయర్లపై చర్యలు !..బాబు కొంప ఎక్కడ..?
-
బాబు లాయర్లు రౌడీయిజం...ఏసీబీ జడ్జి సీరియస్..!
-
బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
సాక్షి, విజయవాడ: వరుసబెట్టి పిటిషన్లు.. న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు.. అయినా కొనసాగుతున్న పిటిషన్ల పర్వం. దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉంది. ఈ సమయంలో ఆయన తరపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. సీఐడీ తరపు న్యాయవాదులతో తాజాగా దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో.. సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు. వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో లాయర్ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను జడ్జి ప్రశ్నించారు. మరోవైపు లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది. దీంతో.. న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ‘లేరు’అని చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. దీంతో.. న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. -
చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు ఆదేశం
-
చంద్రబాబు 3 లాయర్లపై ఆర్జీవీ కామెంట్స్
-
భువనేశ్వరికి లాయర్ల కౌంటర్
-
చంద్రబాబు లాయర్ల కొత్త స్కెచ్..
-
తండ్రి కోసం కోడుకు..బయటనుండి లోకేష్ డైరెక్షన్స్...
-
ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద టీడీపీ లాయర్ల హంగామా
సాక్షి, అమరావతి: విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హంగామా సృష్టించారు. టీడీపీ న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి జడ్జిని కలిసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చేందుకు రాత్రి 12 గంటల సమయంలో టీడీపీ న్యాయవాదులు వెళ్లారు. పిటిషన్ తీసుకునేందుకు జడ్జి నిరాకరించారు. కోర్టుకే రావాలని సూచించారు. జడ్జి సూచనల మేరకు పోలీసులు న్యాయవాదులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో లాయర్లు పోలీసులతో గొడవకు దిగారు. జడ్జి చెప్పడం వల్లే తాము బయటకు వెళ్లాలంటున్నామని పోలీసులు చెబుతున్నా వినలేదు. -
బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్లోని 100 ఎకరాలకు హెచ్ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్కు ఆన్లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. చదవండి: హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట? -
'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..'
ఇస్లామాబాద్: తొషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను అతి దారుణమైన సెల్లో ఉంచారనే విషయాన్ని ఇటీవల ఆయన తరుపు లాయర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఆ జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు ఆయన తరుపు న్యాయవ్యాది చెప్పారు. పగలు ఈగలు, రాత్రి కీటకాలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన జైలులో జీవితాంతం ఉండలేనని చెప్పినట్లు వెల్లడించారు. అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్లోని అతని ఇంటి నుండి ఖాన్ను అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ ఇటీవల జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. ఇదీ చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
అవునని తెలిసీ... కాదని అంటాం!
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది. ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్. అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్. అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి. మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్. ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య. అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ధన్ చైర్మన్గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది. చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు. ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ కోర్టులో బుధవారం ఉదయం కాల్పులు కలకలం చెలరేగింది. తీస్ హాజారీ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తుపాకీ చేతబట్టి కాల్పులకు తెగబడ్డారు. . అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకున్నారు. ఏదో విషయంపై రెండు వర్గాల లాయర్ల మధ్య వాగ్వాగం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఓ వర్గం న్యాయవాదులు తమ వద్ద ఉన్న పిస్తోళ్లతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదని పేర్కొన్నారు. కోర్టు వద్ద పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. #WATCH | An incident of firing was reported at Tis Hazari Court premises in Delhi this afternoon. No injuries were reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/AkRYOoyQPe — ANI (@ANI) July 5, 2023 కోర్టులో కాల్పులు జరపడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేకే మనన్ ఖండించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. అయితే సదరు గన్లకు లైసెన్స్ ఉందా లేదాన అనే కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఒకవేళ లైసెన్స్డ్ ఆయుధాలు అయినప్పటికీ కోర్టు కాంప్లెక్స్లో న్యాయవాదులు కానీ ఇతరులు కానీ కాల్పులు జరపడం నేరమని పేర్కొన్నారు. చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్పై సంచలన వ్యాఖ్యలు Delhi | A firing incident reported at Tis Hazari Court premises, no injuries reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/MMPOQwpWaZ — ANI (@ANI) July 5, 2023 -
జూనియర్ లాయర్ల నుంచి పేదల పట్ల మమకారాన్ని ఆశిస్తున్నానని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
న్యాయ సాయం అందించడంలో.. పేదలకు మీరే నేస్తం: సీఎం జగన్
జూనియర్ లాయర్లు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాక పేదల పట్ల ఇదే రీతిలో మమకారం చూపాలి. ప్రభుత్వం తరఫున ఒక అన్నగా, స్నేహితుడిగా మీ నుంచి నేను ఆశించేది అదే. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ లా నేస్తం’ లాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. యువ న్యాయవాదులు వృత్తిలో ప్రవేశించిన తొలి మూడేళ్ల పాటు ఆర్థికంగా ఊతమిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. నాలుగేళ్లుగా లా నేస్తం పథకాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు 5,781 మందికి మొత్తం రూ.41.52 కోట్లు అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి – జూన్ వరకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం సాయం కింద 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ చొప్పున రూ.25,000 అందచేస్తూ మొత్తం రూ.6,12,65,000ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వృత్తిలో నిలదొక్కుకునేలా.. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడేళ్లు ప్రాక్టీస్పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తై కోర్టుల్లో అడుగుపెడుతున్న తరుణంలో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా తోడుగా నిలిచి నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80 లక్షలు అందిస్తున్నాం. దీనివల్ల వృత్తిలో ఇబ్బంది పడకుండా నిలదొక్కుకుని ముందుకు వెళ్తారన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. రూ.వంద కోట్లతో వెల్ఫేర్ ట్రస్ట్.. ఇలాంటి ఆలోచన, ఇలాంటి పథకం కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా అడ్వొకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేశాం. మెడిక్లెయిమ్, న్యాయవాదుల అవసరాలకు రుణాలు లాంటి వాటికి ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశాం. ఈ రెండు కార్యక్రమాల ద్వారా అడ్వొకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది. ఇంకా బాగా ఉపయోగపడాలని.. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నేను న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం ద్వారా మంచి జరిగితే వారు వృత్తిలో స్థిరపడ్డాక ఇదే మమకారాన్ని పేదల పట్ల చూపిస్తారని విశ్వసిస్తున్నా. ఒక అన్నగా, స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతోంది. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్నెళ్లకు కలిపి ఒకేసారి మొత్తం రూ.30 వేలు అందిస్తే జూనియర్ న్యాయవాదులకు ఇంకా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో క్రితంసారి మార్పులు చేశాం. మళ్లీ డిసెంబరులో ఈ ఏడాది రెండో దఫాకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటి వల్ల న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నా. మీ స్ఫూర్తితో పేదలకు సాయం చేస్తా.. గుంటూరు బార్ అసోసియేషన్లో జూనియర్ అడ్వొకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా బాబాయి కూలి పనులు చేస్తూ తన పిల్లలతో పాటు నన్ను చదివించారు. లా కోర్సు పూర్తవగానే గుంటూరులో ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు. స్పందనలో దరఖాస్తు చేసుకోగానే మహిళా ప్రాంగణంలో వసతి కల్పించారు. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.ఐదు వేలు చొప్పున రెండేళ్లుగా క్రమం తప్పకుండా అందుతోంది. మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన వస్తోంది. పిన్నికి చేయూత అందుతోంది. మా కుటుంబ సభ్యులంతా మీ పథకాలను పొందుతున్నారు. అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీర్ఘకాలం ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ స్ఫూర్తితో పేదలకు న్యాయం సాయం చేస్తానని మాట ఇస్తున్నా సార్. – రత్నకుమారి, న్యాయవాది, గుంటూరు ఎంతో ఉపయోగం.. జూనియర్ అడ్వొకేట్గా 2020లో బెజవాడ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ ప్రారంభించా. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వొకేట్స్ లబ్ధి పొందుతున్నారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి మంజూరు చేశారు. మీరు అందిస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అడ్వొకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. – అరవింద్, అడ్వొకేట్, విజయవాడ
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement