lawyers
-
భారత్.. ఆధ్యాత్మిక స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మికత, ధర్మ పరిరక్షణలో ప్రపంచానికి భారత్ స్ఫూర్తిదాయకమని.. ప్రజలంతా వాటిని ఆచరించి శాంతి పొందాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉద్ఘాటించారు. ధర్మ రాజ్యం అంటే.. రూల్ ఆఫ్ లా అని.. సరైన విలువలు, సరైన ఆలోచన, సేవలు, కరుణ, నీతి, నైతికత పాటించడమే ధర్మమని వివరించారు. దేశం ధర్మ రాజ్యంగా ప్రగతి బాట పయనించాలని మహాత్ముడు అభిలాషించారని చెప్పారు. ఆర్థిక భారతమే కాదు.. వికసిత్, విరాసిత్ భారత్ ఆవశ్యకతనూ ప్రధాని మోదీ వెల్లడించారన్నారు. మనసును నిగ్రహించుకుని చట్టపరమైన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడంపై బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జాతీయ న్యాయనిపుణుల సదస్సు శనివారం హైదరాబాద్లోని శాంతి సరోవర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టితోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు మాట్లాడారు. గుడిలో పూజలు, అర్చన, ప్రదక్షిణలు చేయడం మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించడం కూడా ఆధ్యాత్మికమే అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. శాంతి లేని బతుకు నిరర్థకమని.. స్వామి వివేకానందుడే స్ఫూరిగా ఆధ్యాత్మికాన్ని ఆచరించాలని సూచించారు. ఆధ్యాత్మికాన్ని పెంపొందించడంలో బ్రహ్మకుమారీల పాత్ర అభినందనీయమన్నారు. మితిమీరిన ‘ఇన్స్టంట్’కు అలవాటుపడితే అనారోగ్యాన్ని ఆహ్వానించినవారవుతారని హెచ్చరించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి: జస్టిస్ ఎస్వీ భట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగినప్పుడే అసాధ్యాలు కూడా సుసాధ్యం కాగలవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి చెప్పారు. న్యాయవాదులకు స్వీయ అవగాహన ఉండాలని, కేసును, కక్షిదారుడిని అర్థం చేసుకున్నప్పుడే సమర్థ వాదన సాధ్యపడుతుందన్నారు. గెలుపోటములను ఒకేలా స్వీకరించాలని.. అపజయానికి కుంగిపోవడం, విజయానికి పొంగిపోవడం వృత్తినే కాదు, వ్యక్తిత్వాన్నీ దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏం చేస్తున్నాం.. ఎలా చేస్తున్నాం.. అనే సమీక్ష అందరికీ అవసరమన్నారు. వృత్తిపరంగా ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయని.. కొన్నిసార్లు మనసు కలుషితం అవుతుందని చెప్పారు. సానుకూలత లేకుండా సరైన నిర్ణయం తీసుకోలేమని చెబుతూ.. జరిగిందేదో జరిగిపోయింది.. సానుకూలంగా ముందుకెళ్తాను అనే ధోరణిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ బీడీ రాథి, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎం.రాజేందర్రెడ్డి, మాజీ అడ్వొకేట్ జనరల్లు దేశాయి ప్రకాశ్రెడ్డి, బీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.జీఎస్టీ.. దేశ ఆర్థిక చరిత్రలో ఓ మలుపు: గవర్నర్ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టడం మన దేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. శనివారం తాజ్ దక్కన్ హోటల్లో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో జీఎస్టీ రూపకల్పనలో కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రపై సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య సమన్వయం అవసరమన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానానికి జీఎస్టీ దోహదం చేసిందన్నారు. సాహసోపేతమైన సంస్కరణల మాదిరిగానే జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు అవాంతరాలు తప్పలేదని పేర్కొన్నారు. ఎక్కడైతే ప్రజలకు న్యాయం అందుతుందో.. అక్కడ ధర్మంతోపాటు రాజుకు బలమైన పునాది ఏర్పడుతుందని కౌటిల్యుడు చెప్పిన మాటలను ఉదహరించారు. పన్ను చెల్లింపుదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న వన్ టైమ్ వడ్డీ మాఫీ పథకాన్ని ఈ నెల 31లోగా పన్ను చెల్లించి లబ్ధి పొందాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి మాట్లాడారు. ఎఫ్టీసీసీఐ జీఎస్టీ కమిటీ చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్, బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదులు లక్ష్మీకుమారన్, శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో హైకోర్టు బెంచ్ కోరుతూ సదస్సు
విశాఖ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్ర న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు(ఆదివారం) సదస్సు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రజలకి సైతం విశాఖ అందుబాటులో ఉంటుందని ఉత్తరాంధ్రకు చెందిన ఆరు జిల్లాల న్యాయవాదులు కోరుతున్నారు. హైకోర్టు బెంచ్ విశాఖకు ఇచ్చేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల న్యాయవాదులతో సదస్సు నిర్వహించారు. విఖాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత 20 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుందని న్యాయవాదులు అంటున్నారు. విజయవాడలో ఉన్న హైకోర్టుకు వెళ్లాలంటే సుమారు 700 కి.మీ ప్రయాణించాల్సిన కారణంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ అనేది అనివార్యమని వారు డిమాండ్ చేస్తున్నారు. -
గౌనును బట్టి గౌరవం లభించదు
న్యూఢిల్లీ: ధరించిన గౌనును బట్టి లాయర్లకు గౌరవం లభించదని సుప్రీంకోర్టు పేర్కొంది. 70 మంది లాయర్లకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ హోదాను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. గౌనును బట్టి వేరుగా గౌరవం దక్కుతుందని తాము భావించడం లేదని పేర్కొంది. పిటిషన్ వేసిన నెడుంపర అనే లాయర్ వాదనను తోసిపుచ్చుతూ, ‘‘జడ్జిలు కూడా అవసరాన్ని బట్టి రాత్రి దాకా కేసుల విచారణలోనే ఉంటున్నారు. వాళ్లూ మనుషులే. శాయశక్తులా చేయగలిగిందంతా చేస్తున్నారు’’ అని పేర్కొంది. కేసుల సత్వర విచారణకు మరింతమంది జడ్జీల అవసరముందని నెడుంపర తెలపగా ఎక్కువ మంది జడ్జీలను నియమించడం తమ చేతుల్లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
రాజ్యాంగ సంస్థలు పరిధి దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: చట్టసభలు, న్యాయస్థానాల లాంటి రాజ్యాంగ సంస్థలు తమ పరిధి దాటి ఇతర వ్యవస్థల పరిధిలో జోక్యం చేసుకోవద్దని రాజ్యాంగం పేర్కొంటోందంటూ పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, న్యాయశాఖ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దేనికదే హుందాతనాన్ని పాటించాలని, స్పీకర్ పరిధిలోని అంశాల్లో న్యాయ సమీక్ష సాధ్యం కాదని పేర్కొన్నారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు కొంత వీలుంటుందని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆలోగా దీనికి సంబంధించిన వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని సెప్టెంబర్ 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. ‘కైశం మేఘాచంద్ర సింగ్’లో ముగ్గురు జడ్జిల తీర్పు చెల్లదు ‘చట్టప్రకారం తహసీల్దార్ లాంటి వారి నిర్ణయానికి కూడా నెల సమయం ఉంటుంది. అలాంటిది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి పిటిషనర్లు కనీసం ఆ సమయం కూడా ఇవ్వలేదు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్దిష్ట వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాలనే ఉత్తర్వులు ఇస్తే, భవిష్యత్లో స్పీకర్ చట్టసభలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. కిహోటో హోలోహన్ (1992) కేసు విచారణ సందర్భంగా ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్ను ట్రిబ్యునల్గా పేర్కొన్నందున.. ఆయన నిర్ణయాలపై సమీక్ష జరపొచ్చు. కానీ నిర్ణయం తీసుకోక ముందు కోర్టుల జోక్యం కూడదు. కైశం మేఘాచంద్ర సింగ్ (2020) కేసు విచారణ సందర్భంగా ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై జోక్యం చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఐదుగురు జడ్జిల తీర్పు తర్వాత ముగ్గురు జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పే పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా స్పీకర్ పరిధిలో జోక్యం చేసుకున్నట్లే ఉన్నాయి..’అని రవీంద్ర శ్రీవాస్తవ, శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి, ఫిరాయింపులపై పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తరఫున జె.ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్రావు, పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి తరçఫున మయూర్రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్సైట్ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
హైకోర్టు ఇస్తారా.. ప్రత్యేక రాష్ట్రం చేస్తారా.. చంద్రబాబుకి లాయర్లు డిమాండ్
-
ధిక్కార ‘స్వర’ భాస్కరం!
స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు. ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు. పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు. అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024 ఉమర్, ఖాలిద్, అతర్, గుష్ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
Supreme Court: లాయర్లుగా ఎన్రోల్కు అంత ఫీజా?
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేందుకు లాయర్లుగా ఎన్రోల్చేసుంటున్న న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు(ఎస్బీసీ) భారీ స్థాయిలో ఫీజులు వసూలుచేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం ఎస్సీ–ఎస్టీ కేటగిరీ లా పట్టభద్రుల నుంచి రూ.125 ఫీజు, జనరల్ కేటగిరీ నుంచి రూ.750 మించి వసూలుచేయకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఎస్బీసీలు వసూలుచేస్తున్న విపరీతమైన ఫీజుల కారణంగా అణగారిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేద, మధ్యతరగతి లా పట్టభద్రులు న్యాయవృత్తిలోకి రాలేని పరిస్థితి నెలకొంటోందని, వారు ఈ వృత్తిలో భాగస్వాములయ్యే అవకాశాలు తగ్గిపోతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరిచింది. -
న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించం
విజయవాడస్పోర్ట్స్: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల కిందట జరిగిన దాడి ఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్ను నిందితుడుగా చేర్చడాన్ని బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) న్యాయవాదులు తప్పుబట్టారు. రాజకీయ కోణంలో జరిగిన ఈ దాడి ఘటనలో న్యాయవాదులను ఇరికించేందుకు మంగళగిరి రూరల్ పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. డిఫెన్స్ తరుఫున న్యాయస్థానానికి వాదనలు వినిపించేందుకు వెళ్లిన గవాస్కర్పై తాజాగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరును ఖండిస్తూ బీబీఏ న్యాయవాదులు విధులు బహిష్కరించి గవాస్కర్కు సంఘీభావంగా విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి మాట్లాడుతూ 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని, అప్పట్లోనే పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారన్నారు. అయితే పలువురు నిందితుల తరుఫున వకల్తా పుచ్చుకున్న గవాస్కర్పై తాజాగా కేసు నమోదు చేసి 88వ నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సబబని ప్రశి్నంచారు. సీనియర్ న్యాయవాది గౌతంరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. న్యాయవాది గవాస్కర్ మాట్లాడుతూ ఈ కేసులో తన పేరు ఉందని వారం కిందటి వరకు తనకు తెలీదన్నారు. నాలుగు రోజుల క్రితం కోర్టుకు వెళితే హత్యాయత్నం కేసులో నిందితుడిగా తన పేరును పోలీసులు చేర్చడంతో ఒక్క సారిగా ఖంగుతిన్నట్టు చెప్పారు. ఇదేంటని ప్రశి్నస్తే.. పై నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళన కార్యక్రమంలో న్యాయవాదులు మన్మథరావు, నిర్మల్రాజేష్, కోటంరాజు, బసవరెడ్డి, సాయిరామ్, ఆదాం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత.. సీజేఐకు 150 మంది న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు.లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్లోడ్ చేయడానికి ముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఈడీ సవాల్పై ఎలా విచారణ చేపట్టి ఆర్డర్ను హోల్డ్లో ఉంచారు? బెయిల్ అమలును ఎలా నిలిపివేశారు? అని ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాలలో రికార్డ్ చేయడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ సమయంలో చేసిన సమర్పణలను న్యాయవాదుల ముందు, కేసు వాయిదా వేయడానికి ముందు రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా అభ్యర్ధించారు.బెయిల్ మంజూరులో జాప్యం గురించి ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం.ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మా ఆందోళనలను మీతో పంచుకుంటున్నాం. వీటిని త్వరగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాం.’ అని లేఖలో ప్రస్తావించారు. -
మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి
సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులు వృత్తి మెళకువలు నేర్చుకుని పైకి రావాలంటే ఓ మంచి న్యాయవాదిని ఎంపిక చేసుకొని, ఆయన వద్ద శిష్యరికం చేయాలని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. మంచి న్యాయవాది అంటే ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కాదని, న్యాయశాస్త్రంలో అంశాల మీద మంచి పట్టున్న వ్యక్తి అని చెప్పారు. అలాంటి వ్యక్తి వద్ద చేరితే కేసులను వాదించే అవకాశం దక్కి, మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుందని, తద్వారా వృత్తిలో ముందుకెళ్లే అవకాశం దొరుకుతుందని చెప్పారు.వాదించే అవకాశం సులభంగా రాదని, బాగా కష్టపడాలని ఉద్బోధించారు. తాను కూడా అలా కష్టపడితేనే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానన్నారు. యువ న్యాయవాదులకు రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్), కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ తరగతుల్లో రెండో రోజు శనివారం “ఆర్ట్ ఆఫ్ అడ్వొకసీ’ అనే అంశంపై జస్టిస్ నాగార్జునరెడ్డి మాట్లాడారు. కేవలం వాదనలు వినిపిస్తే సరిపోదని, వాదనలు ఎలా వినిపించాలో నేర్చుకోవాలని, అది ఓ కళ అని తెలిపారు. ఆ కళని ఒంటబట్టించుకుంటేనే విజయవంతమైన న్యాయవాది అవుతారన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.అందరిలో ఒకరిలా ఉండిపోకండి‘న్యాయ పాలనలో న్యాయవాదులు, న్యాయమూర్తుల పాత్ర’ అన్న అంశంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడారు. న్యాయమూర్తిగాకంటే న్యాయవాదిగా తాను ఎక్కువ ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. మూడుసార్లు తాను న్యాయమూర్తి పోస్టును తిరస్కరించానని, చివరకు విధి లేని పరిస్థితుల్లో ఆ పోస్టును అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఆ మరుసటి రోజే తన అంగీకారన్ని ఉపసంహరించుకుంటానని అప్పటి ప్రధాన న్యాయమూర్తిని కోరానని, అప్పటికే జాబితా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదని తెలిపారు.తాను ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. ఎప్పుడూ పెద్ద కలలు కనాలని, అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికి చేరుకుంటారని, అసలు కలలు కనకుంటే ఏ స్థాయికీ రాలేరని తెలిపారు. అందరిలో ఒకరిలా ఉండపోకూడదని, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని చెప్పారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావును బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు.కక్షిదారుడు న్యాయవాదులకు దేవుడుమనకు కేసు అప్పగించే కక్షిదారుడిని ఎప్పుడూ దేవుడిలా చూడాలని జస్టిస్ నాగార్జునరెడ్డి చెప్పారు. కక్షిదారుడిని అవమానించడం, తక్కువ చేసి చూడటం, అతనితో కర్కశంగా మాట్లాడటం వంటివి చేయకూడదన్నారు. కక్షిదారుడు ఇచ్చే ఫీజుతో మన కుటుంబాలు నడుస్తున్నాయన్న విషయాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు. అలాగే కక్షిదారుల నుంచి వసూలు చేసే ఫీజుల విషయంలో కూడా సహేతుకంగా ఉండాలని హితవు పలికారు. -
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు న్యాయవాదుల స్వాగతం
-
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ప్రముఖ న్యాయవాదుల లేఖ
-
సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సహా దాదాపు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. పొలిటికల్ అజెండాతో కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయస్థానాల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా దేశవ్యాప్తంగా 600 మందికిపైగా న్యాయవాదులు ఉన్నారు. వీరంతా లేఖలో ఒకవర్గం న్యాయమూర్తులను తమ పేర్లు ప్రస్తావించకుండా టార్గెట్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు. కొందరు లాయర్లు పగటిపూట రాజకీయ నాయకులను సమర్థించి.. రాత్రిపూట మీడియా ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ లేఖను మార్చి 26 రాసినట్లు సమాచారం. చదవండి: కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేం: ఢిల్లీ హైకోర్టు -
జీజేఆర్ క్రికెట్ టోర్నీ విజేత ‘హైకోర్టు’ జట్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు న్యాయవాదుల క్రికెట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన జీజేఆర్ టోర్నమెంట్ పోటీల్లో హైకోర్టు న్యాయవాదుల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శనివారం కప్ను అందజేశారు. బోడుప్పల్లోని సాగర్ క్రికెట్ గ్రౌండ్, ఆరంఘర్లోని విజయానంద్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన పోటీల్లో నగరంలోని 13 కోర్టుల న్యాయవాదులు పాల్గొన్నారు. సెమీ ఫైనల్లో సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల జట్టు (78)పై హైకోర్టు టీమ్(79) విజయం సాధించింది. అనంతరం జరిగిన ఫైనల్లో హైకోర్టు జట్టు... హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు టీమ్పై గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ది ఫైనల్లో బెస్ట్ బ్యాట్స్మన్గా వి.మనోహర్, బెస్ట్ బౌలర్గా సాయిచందర్ నిలిచారు. ఈ కప్ అందజేత కార్య క్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్గౌడ్, కౌన్సిల్ సభ్యుడు జితేందర్రెడ్డి, కటకం శారద, శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
ఏపీకి చంద్రబాబు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం: వక్తలు
-
బెయిల్ నిబంధనలు బేఖాతర్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను అభాసుపాల్జేస్తున్నారని పలువురు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో కండిషనల్ బెయిల్పై వచ్చి న వ్యక్తి న్యాయస్థానం విధించిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి విజయోత్సవాలు చేసుకోవడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు తప్పులు చేసి పట్టుబడినా చట్టాల నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిన్నారని దుయ్యబట్టారు. ఇందుకు చంద్రబాబు విషయమే ఉదాహరణగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు వ్యవహార శైలి– బెయిల్ నిబంధనల ఉల్లంఘన– శిక్షలు’ అంశంపై ఏపీ ఇంటిలెక్చువల్స్– సిటిజన్స్ ఫోరం(ఎపిక్) ఆధ్వర్యంలో చర్చ నిర్వహించారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, న్యాయవాదులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. బెయిల్ మంజూరు విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వర్గం పెత్తందారి, నియంతృత్వ పోకడలకు పోతోందని, కోర్టులను, న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తోందన్నారు. చంద్రబాబు కేసులో తాము చెప్పినట్టుగా తీర్పు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన తీరు ఇటీవల కోర్టులో చూశామన్నారు. తీవ్ర నేరాలు చేసిన చంద్రబాబు, రామోజీరావులు తాము చట్టాలకతీతమన్నట్టుగా వ్యవహరిస్తూ.. వాటి నుంచి తప్పించుకునేందుకు యత్ని స్తున్నారని ధ్వజమెత్తారు. కోర్టులను బాబు మేనేజ్ చేస్తున్నారు తన రాజకీయ జీవితంలో కోర్టులను చంద్రబాబు మాత్రమే మేనేజ్ చేసినట్టు అనేక సందర్భాల్లో రుజువైంది. న్యాయస్థానాలు చట్ట ప్రకారం పనిచేస్తుంటే మాత్రం దు్రష్పచారం చేస్తున్నారు. చంద్రబాబు తీవ్రమైన ఆర్థిక నేరం కేసులో జైలుకు వెళితే.. తాము చేప్పినట్టు తీర్పు ఇవ్వలేదని ఆయన వర్గం వారు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. చివరికి బెయిల్ రాకపోయేసరికి ‘అనారోగ్యం’ సాకుగా చూపారు. కోర్టు కండిషన్లు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటికొచ్చాక ఆస్పత్రికో, ఇంటికో వెళ్లాల్సి చంద్రబాబు.. 14 గంటల పాటు ర్యాలీ చేశారు. ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే. – విజయ్బాబు, ఎపిక్ ఫోరం వ్యవస్థాపకుడు ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణే చంద్రబాబు కేసులో దాదాపు 53 రోజులు దేశంలో ప్రముఖ న్యాయవాదులు కేసును వాదించారు. చివరికి ‘వైద్యం’ పేరుతో అబద్ధం చెప్పి బెయిల్ తీసుకుని రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేశారు. ఇది పూర్తిగా న్యాయ ధిక్కరణ. ఆయన బెయిల్ రద్దు చేయాలి. లేకుంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇలాగే బయటకొచ్చే అవకాశం ఉంది. – పిళ్లా రవి, న్యాయవాది న్యాయ వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయో పురందేశ్వరి చెప్పాలి పురందేశ్వరి, టీడీపీ నాయకులు న్యాయ వ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వారు బెయిళ్లు తెచ్చుకున్నప్పుడు.. ఇప్పుడు అవే చట్టాలు. తనకు అనుకూలంగా బెయిళ్లు వచ్చినప్పుడు చట్టం తనపని చేసుకుపోతుందన్నారు, ఇప్పుడేమో మేనేజ్ చేస్తున్నారంటున్నారు. చంద్రబాబు ఆరి్థక నేరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. న్యాయ వ్యవస్థలో ఏం లోపాలున్నాయో పురందేశ్వరి చెప్పాలి. – విఠల్రావు, న్యాయవాది బెయిల్ నిబంధనలపై చర్చ అవసరం దేశంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు కావడం లేదు. ఏదైనా కేసులో అండర్ ట్రైల్ కింద జైలుకు వెళ్లిన వారు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం వారి హక్కు. కానీ ఇక్కడ అందరికీ ఈ హక్కు లభించడం లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసుకునేవారికి, ఆర్థికంగా శక్తిమంతమైన వారికి సులభంగా బెయిల్ వచ్చేస్తోంది. కానీ చాలామంది సామాన్యులు అండర్ ట్రైల్లోనే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయాలి. ప్రభుత్వంలో ఉండి ఆరి్థక నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ ఇవ్వకూడదు. – కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురందేశ్వరి టీడీపీలో పదవి ఆశిస్తున్నట్టున్నారు.. చంద్రబాబు సీఎంగా 2014–19 మధ్య చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఇప్పుడు దొరికిపోయాక అరెస్టు నుంచి బెయిల్ వరకు చట్టాలను ఉల్లంఘించారు. చివరికి న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తున్నారు. మెడికల్ కండిషన్పై బెయిల్ తెచ్చుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పురందేశ్వరికి ఇవన్నీ కనిపించడం లేదా? ఆమె బీజేపీ పదవి కంటే టీడీపీ పదవి ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. – సాయిరామ్, అడ్వకేట్ వారికి చట్టాలంటే గౌరవం లేదు ఒకరు నేరం చేశారని కేసు నమోదైతే కింది కోర్టులో తీర్పు వెలువడ్డాక పైకోర్టులకు వెళతారు. కానీ చంద్రబాబు కేసులో మాత్రం అందుకు విరుద్ధం. చేసిన నేరం నుంచి బయటపడేందుకు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేశారంటే జరిగింది ఎంత పెద్ద నేరమో అర్థం చేసుకోవచ్చు. పైగా వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలో తెలిసినవారే ఇలా చేస్తారు. ఈ కేసులో చంద్రబాబు వర్గానికి చట్టాలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై గౌరవం లేదు. యథేచ్ఛగా చట్టాలను ఉల్లఘించారు. – నరహరిశెట్టి శ్రీహరి, హైకోర్టు న్యాయవాది బాబుకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివయ్యాయి.. సామాన్యులు బెయిల్ రాకుండా అండర్ ట్రైల్లోనే ఉండిపోతున్నారు. కానీ చంద్రబాబు, రామోజీరావులు కోర్టు మెట్లు ఎక్కకుండానే బెయిల్ తెచ్చుకుంటున్నారు. స్కిల్ స్కాం తప్ప మరే కేసులోను బాబు కోర్టుకు, జైలుకు వెళ్లింది లేదు. తనకు స్టేలు ఇచ్చి నంత కాలం న్యాయస్థానాలు మంచివే అన్నారు, ఈ ఒక్క కేసులో బెయిల్ రాకపోయేసరికి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ నిబంధనలపై న్యాయ సమీక్ష అవసరం – ధనలక్ష్మి, న్యాయవాది అబద్ధాలు చెప్పి బయటికొచ్చారు చంద్రబాబుకు వైద్యం కోసం కోర్టు బెయిల్ ఇచ్చి ంది. బయట ప్రసంగాలు చేయొద్దని చెప్పింది. కానీ బాబు మాత్రం తన హక్కును కాపాడిన కోర్టు హక్కులనూ కాలరాశారు. అబద్ధం చెప్పి బయటకు వచ్చి ర్యాలీలు చేశారు. – ఎన్.జ్యోతి, న్యాయవాది రోజుకో రోగమని చెప్పారు.. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోజుకో రోగమని చెప్పారు. వైద్యం కోసం బెయిల్ తెచ్చుకుని బయటికి రాగానే ర్యాలీలు చేశారు. బాబు అరెస్ట్ సమయంలోనూ ఇలాగే ప్రవర్తించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. – జె.జయలక్ష్మి, న్యాయవాది ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు గమనించాలి చంద్రబాబు అన్ని రకాల బెయిళ్లకు అప్లై చేసి, ఏదీ రాకపోయేసరికి ‘అనారోగ్యాన్ని’ అడ్డుపెట్టుకుని బయటపడ్డారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆస్పత్రికి వెళ్లాల్సింది పోయి.. రాజకీయ ర్యాలీలు చేశారు. న్యాయస్థానాలు ఇలాంటివి గమనించాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది -
‘మై లార్డ్’ అనకండి..సగం వేతనం ఇచ్చేస్తా!
న్యూఢిల్లీ: కోర్టులో వాదోపవాదాల సమయంలో పదేపదే మై లార్డ్, యువర్ లార్డ్షిప్స్’అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు? ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా’అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు. వాదోపవాదాల సమయంలో ఓ సీనియర్ లాయర్ పదేపదే ‘మై లార్డ్, యువర్ లార్డ్షిప్స్’ అంటుండటంపై పైవిధంగా ఆయన స్పందించారు. వాటికి బదులుగా సర్ అని అనొచ్చు కదా అని తెలిపారు. లేకుంటే ఆ మాటలను ఎన్నిసార్లు వాడేదీ లెక్కపెడ తానని చెప్పారు. ‘మై లార్డ్, యువర్ లార్డ్షిప్’అనే మాటలు వలస పాలన ఆనవాళ్లని, కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. -
లాయర్ల ఫీజు చెల్లించడానికి డబ్బులు ఎక్కడివి?: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి. .చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే..లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. 2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని, ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటూ సెటైర్లు వేశారు. -
చంద్రబాబు ఢిల్లీ లాయర్లు ఖుషి చేస్తున్నారు..!
-
చంద్రబాబు లాయర్లపై చర్యలు !..బాబు కొంప ఎక్కడ..?
-
బాబు లాయర్లు రౌడీయిజం...ఏసీబీ జడ్జి సీరియస్..!
-
బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
సాక్షి, విజయవాడ: వరుసబెట్టి పిటిషన్లు.. న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు.. అయినా కొనసాగుతున్న పిటిషన్ల పర్వం. దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉంది. ఈ సమయంలో ఆయన తరపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. సీఐడీ తరపు న్యాయవాదులతో తాజాగా దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో.. సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు. వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో లాయర్ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను జడ్జి ప్రశ్నించారు. మరోవైపు లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది. దీంతో.. న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ‘లేరు’అని చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. దీంతో.. న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. -
చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు ఆదేశం
-
చంద్రబాబు 3 లాయర్లపై ఆర్జీవీ కామెంట్స్
-
భువనేశ్వరికి లాయర్ల కౌంటర్
-
చంద్రబాబు లాయర్ల కొత్త స్కెచ్..
-
తండ్రి కోసం కోడుకు..బయటనుండి లోకేష్ డైరెక్షన్స్...
-
ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద టీడీపీ లాయర్ల హంగామా
సాక్షి, అమరావతి: విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హంగామా సృష్టించారు. టీడీపీ న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి జడ్జిని కలిసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చేందుకు రాత్రి 12 గంటల సమయంలో టీడీపీ న్యాయవాదులు వెళ్లారు. పిటిషన్ తీసుకునేందుకు జడ్జి నిరాకరించారు. కోర్టుకే రావాలని సూచించారు. జడ్జి సూచనల మేరకు పోలీసులు న్యాయవాదులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో లాయర్లు పోలీసులతో గొడవకు దిగారు. జడ్జి చెప్పడం వల్లే తాము బయటకు వెళ్లాలంటున్నామని పోలీసులు చెబుతున్నా వినలేదు. -
బుద్వేల్ భూముల వేలంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బుద్వేల్ భూముల అంశంలో హెచ్ఎండీఏ వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలంపై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై స్పందిస్తూ.. బార్ అసోసియేషనల్లో విభేదాలు ఉన్నాయని, అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామన్న వాదనతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. దీంతో బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. రంగారెడ్డి బుద్వేల్లోని 100 ఎకరాలకు హెచ్ఎండీఏ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. 100 ఎకరాల్లో 14 ప్లాట్కు ఆన్లైన్ వేలం జరపాలని నిర్ణయించింది. ఈ భూమూలను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. దీని ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. చదవండి: హవ్వ.. చెట్లను కొట్టేసి మొక్కలు నాటుతారట? -
'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..'
ఇస్లామాబాద్: తొషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను అతి దారుణమైన సెల్లో ఉంచారనే విషయాన్ని ఇటీవల ఆయన తరుపు లాయర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఆ జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు ఆయన తరుపు న్యాయవ్యాది చెప్పారు. పగలు ఈగలు, రాత్రి కీటకాలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన జైలులో జీవితాంతం ఉండలేనని చెప్పినట్లు వెల్లడించారు. అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్లోని అతని ఇంటి నుండి ఖాన్ను అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ ఇటీవల జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. ఇదీ చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
అవునని తెలిసీ... కాదని అంటాం!
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది. ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్. అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్. అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి. మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్. ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య. అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ధన్ చైర్మన్గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది. చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు. ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
లాయర్ల మధ్య వాగ్వాదం.. కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ కోర్టులో బుధవారం ఉదయం కాల్పులు కలకలం చెలరేగింది. తీస్ హాజారీ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తుపాకీ చేతబట్టి కాల్పులకు తెగబడ్డారు. . అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకున్నారు. ఏదో విషయంపై రెండు వర్గాల లాయర్ల మధ్య వాగ్వాగం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఓ వర్గం న్యాయవాదులు తమ వద్ద ఉన్న పిస్తోళ్లతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదని పేర్కొన్నారు. కోర్టు వద్ద పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. #WATCH | An incident of firing was reported at Tis Hazari Court premises in Delhi this afternoon. No injuries were reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/AkRYOoyQPe — ANI (@ANI) July 5, 2023 కోర్టులో కాల్పులు జరపడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేకే మనన్ ఖండించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. అయితే సదరు గన్లకు లైసెన్స్ ఉందా లేదాన అనే కోణంలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఒకవేళ లైసెన్స్డ్ ఆయుధాలు అయినప్పటికీ కోర్టు కాంప్లెక్స్లో న్యాయవాదులు కానీ ఇతరులు కానీ కాల్పులు జరపడం నేరమని పేర్కొన్నారు. చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్పై సంచలన వ్యాఖ్యలు Delhi | A firing incident reported at Tis Hazari Court premises, no injuries reported. Police say that this happened after an argument among lawyers. (Note: Abusive language) (Video Source: A lawyer) pic.twitter.com/MMPOQwpWaZ — ANI (@ANI) July 5, 2023 -
జూనియర్ లాయర్ల నుంచి పేదల పట్ల మమకారాన్ని ఆశిస్తున్నానని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
న్యాయ సాయం అందించడంలో.. పేదలకు మీరే నేస్తం: సీఎం జగన్
జూనియర్ లాయర్లు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాక పేదల పట్ల ఇదే రీతిలో మమకారం చూపాలి. ప్రభుత్వం తరఫున ఒక అన్నగా, స్నేహితుడిగా మీ నుంచి నేను ఆశించేది అదే. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ లా నేస్తం’ లాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. యువ న్యాయవాదులు వృత్తిలో ప్రవేశించిన తొలి మూడేళ్ల పాటు ఆర్థికంగా ఊతమిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. నాలుగేళ్లుగా లా నేస్తం పథకాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు 5,781 మందికి మొత్తం రూ.41.52 కోట్లు అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి – జూన్ వరకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం సాయం కింద 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ చొప్పున రూ.25,000 అందచేస్తూ మొత్తం రూ.6,12,65,000ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వృత్తిలో నిలదొక్కుకునేలా.. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడేళ్లు ప్రాక్టీస్పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తై కోర్టుల్లో అడుగుపెడుతున్న తరుణంలో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా తోడుగా నిలిచి నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80 లక్షలు అందిస్తున్నాం. దీనివల్ల వృత్తిలో ఇబ్బంది పడకుండా నిలదొక్కుకుని ముందుకు వెళ్తారన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. రూ.వంద కోట్లతో వెల్ఫేర్ ట్రస్ట్.. ఇలాంటి ఆలోచన, ఇలాంటి పథకం కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా అడ్వొకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేశాం. మెడిక్లెయిమ్, న్యాయవాదుల అవసరాలకు రుణాలు లాంటి వాటికి ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశాం. ఈ రెండు కార్యక్రమాల ద్వారా అడ్వొకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది. ఇంకా బాగా ఉపయోగపడాలని.. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నేను న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం ద్వారా మంచి జరిగితే వారు వృత్తిలో స్థిరపడ్డాక ఇదే మమకారాన్ని పేదల పట్ల చూపిస్తారని విశ్వసిస్తున్నా. ఒక అన్నగా, స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతోంది. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్నెళ్లకు కలిపి ఒకేసారి మొత్తం రూ.30 వేలు అందిస్తే జూనియర్ న్యాయవాదులకు ఇంకా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో క్రితంసారి మార్పులు చేశాం. మళ్లీ డిసెంబరులో ఈ ఏడాది రెండో దఫాకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటి వల్ల న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నా. మీ స్ఫూర్తితో పేదలకు సాయం చేస్తా.. గుంటూరు బార్ అసోసియేషన్లో జూనియర్ అడ్వొకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా బాబాయి కూలి పనులు చేస్తూ తన పిల్లలతో పాటు నన్ను చదివించారు. లా కోర్సు పూర్తవగానే గుంటూరులో ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు. స్పందనలో దరఖాస్తు చేసుకోగానే మహిళా ప్రాంగణంలో వసతి కల్పించారు. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.ఐదు వేలు చొప్పున రెండేళ్లుగా క్రమం తప్పకుండా అందుతోంది. మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన వస్తోంది. పిన్నికి చేయూత అందుతోంది. మా కుటుంబ సభ్యులంతా మీ పథకాలను పొందుతున్నారు. అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీర్ఘకాలం ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ స్ఫూర్తితో పేదలకు న్యాయం సాయం చేస్తానని మాట ఇస్తున్నా సార్. – రత్నకుమారి, న్యాయవాది, గుంటూరు ఎంతో ఉపయోగం.. జూనియర్ అడ్వొకేట్గా 2020లో బెజవాడ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ ప్రారంభించా. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వొకేట్స్ లబ్ధి పొందుతున్నారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి మంజూరు చేశారు. మీరు అందిస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అడ్వొకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. – అరవింద్, అడ్వొకేట్, విజయవాడ -
నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి.. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవాదుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్ను అందుబాటులో ఉంచింది. -
చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపాటు
-
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
మన లక్ష్యం.. పేదలకు ‘న్యాయం’
సాక్షి, అమరావతి: న్యాయవాదులకు అండగా ఉండేందుకు ‘వైఎస్సార్ లా నేస్తం’ తీసుకొచ్చామని, పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు వృత్తి జీవితంలో పేదలకు సాయపడాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 దఫాలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘వైఎస్సార్ లా నేస్తం’ ద్వారా దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నామని వెల్లడించారు. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు కోవిడ్ సమయంలో దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు ప్రయోజనం చేకూర్చినట్లు వివరించారు. పేదవాడి పట్ల న్యాయవాదులు అంకితభావం చూపాలని కోరారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్రవాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000 మేర ఆర్థికసాయాన్ని సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. సీఎం ఏమన్నారంటే.. వృత్తిలో ఊతమిచ్చేందుకు... దేవుడి దయతో గత మూడు సంవత్సరాలుగా మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందన్న సంకేతాన్ని గట్టిగా చెప్పేందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నా. న్యాయవాది వృత్తిని ఎంచుకున్నవారు మన రాజ్యాంగాన్ని, చట్టాలను క్షుణ్నంగా చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడే క్రమంలో తొలి మూడేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో పాదయాత్ర సందర్భంగా చాలాసార్లు నా దృష్టికి తెచ్చారు. వారంతా సొంత కాళ్ల మీద నిలబడే ఒక గొప్ప పథకం ఇది. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమం న్యాయవాదులుగా స్థిరపడేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వం వారికి తోడుగా నిలవడం వల్ల డబ్బులు లేని పేదవాడికి సాయం చేయగలుగుతారనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం తమకు తోడుగా నిలిచినట్లుగానే, తాము కూడా పేదలకు సాయపడాలనే తలంపు వారి మనసులో మెదలాలన్నదే మా ఆరాటం. చదువు పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన తరువాత తొలి మూడేళ్లు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చాం. ఇది వారికి వృత్తిలో ఊతమివ్వడంతో పాటు స్ధిరపడేందుకు దోహదం చేస్తుంది. మూడున్నరేళ్లలో 4,248 మందికి లబ్ధి.. ఈ పథకం ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నాం. రూ.35.40 కోట్లు సహాయంగా అందించాం. ఈరోజు 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు పథకంలో కొనసాగుతున్నారు. వీరికి ఇవాళ దాదాపు రూ.కోటికి పైగా జమ చేస్తున్నాం. ఒకేసారి పెద్ద అమౌంట్ ఇస్తే వారి అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 సార్లు అందచేస్తున్నాం. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్... న్యాయవాదుల సంక్షేమం కోసం మరో గొప్ప అడుగు వేసి రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్ ఫండ్ నెలకొల్పాం. కోవిడ్ సమయంలో కార్పస్ ఫండ్ ద్వారా దాదాపు రూ.25 కోట్ల మేర మంచి చేయగలిగాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటూ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో లా సెక్రటరీ మెయిల్ ఐడీకి కూడా దరఖాస్తు చేయవచ్చు. sec&law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక లా నేస్తం పథకానికి సంబంధించి కూడా పారదర్శకంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉన్న తుపాకీ లాంటిదని, హంతకుడి చేతిలో ఉండే బాకు లాంటిది కాదని చెబుతుంటారు. నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు దాన్ని గుర్తుంచుకుని అదే అంకిత భావాన్ని పేదవాడి పట్ల చూపాలని కోరుతున్నా. ఈ కార్యక్రమంలో లా సెక్రటరీ జి.సత్యప్రభాకరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెరిగింది బెజవాడ బార్ అసోసియేషన్లో ఏడాది నుంచి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. మంచి క్రిమినల్ లాయర్ అవ్వాలన్నది నా లక్ష్యం. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతోకోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతావు? మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేరమని తల్లిదండ్రులు చెబుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వైఎస్సార్ లా నేస్తం పథకం ఎంతో ఉపయోగపడింది. దీంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా నేను నిలదొక్కుకునేందుకు ఈ పథకమే కారణం. పాదయాత్ర హామీని సీఎం జగన్ నెరవేర్చడంతో చాలా సంతోషంగా ఉన్నాం,ద్యాంక్యూ సార్. –అమూల్య, లా నేస్తం లబ్ధిదారు, జూనియర్ న్యాయవాది, ఎన్టీఆర్ జిల్లా ఉన్నత చదువులకు ఉపకారం.. జూనియర్ అడ్వకేట్గా పని చేస్తున్నా. అమ్మ టైలరింగ్ చేస్తుండగా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. 2021 నుంచి లా నేస్తం తీసుకుంటున్నా. ఈ డబ్బులు జ్యూడీషియల్ ఎగ్జామ్స్ ఫీజు కోసం, మెటీరియల్ తీసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఉన్నత చదువులకు మీరు ఇస్తున్న సపోర్ట్ ఎంతో బాగుంది. విద్యార్థులకు మంచి పథకాలు ప్రవేశపెట్టారు. విదేశాల్లో చదువుకునేందుకు కూడా సాయం చేస్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పేద విద్యార్ధులకు ఉచితంగా సాయం చేయాలనుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు మీవల్ల ప్రయోజనం పొందుతున్నాయి. పెన్షన్, రేషన్ ఇంటి దగ్గరే ఇస్తున్నారు. మా అమ్మకు ఇంటి పట్టా వచ్చింది. –సీహెచ్. వెన్నెల, జూనియర్ న్యాయవాది, గుంటూరు -
జూనియర్ న్యాయవాదులకు అండగా లా నేస్తం
సాక్షి, అమరావతి: లా నేస్తం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం వైఎస్ జగన్ బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించబోయే మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్ను ఏర్పాటుచేసింది. కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు. -
తెలంగాణ సీఎస్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ప్రైవేట్ లాయర్లకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుందని లేఖలో పేర్కొంది. ఏజీ, అడిషనల్ ఏజీ ఉండగా, ప్రైవేట్ లాయర్ల ఎందుకు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. గవర్నర్ రిపబ్లిక్ డే కేసుతో పాటు, ఎమ్మెల్యేల ఫాంహౌస్ కేసులోనూ ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రైవేట్ న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదు చేసింది. చదవండి: E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్పైకి ఎలా వచ్చాయ్? -
జీవో 1లో నిషేధం అనే పదం లేదు.. రాజకీయ రాద్ధాంతమే..
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విపక్ష పార్టీల నాయకులు జీవో నం.1పై రాజకీయాలు చేస్తున్నారని విద్యావంతులు, న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత స్వార్థ ప్రయోజనాలకు 11 మంది అమాయకులు బలైతే పోలీసులపై నిందలు వేయడం ఏమిటని నిలదీశారు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచి్చతో 29 మంది మృత్యువాత పడితే అందుకు ప్రజలదే బాధ్యతంటూ టీడీపీ నిస్సిగ్గుగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాస్తవానికి మన దేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణంతో పాటు చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివేనని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలను రోడ్లపై కాకుండా అనువైన ప్రదేశంలో తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1పై శుక్రవారం విజయవాడలో చర్చా వేదిక నిర్వహించారు. పౌర హక్కులపై ఏపీ ఇంటెలెకు్చవల్ అండ్ సిటిజన్ ఫోరం (ఎపిక్) ఆధ్వర్యంలో పి.విజయబాబు అధ్యక్షతన ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్యులను సమిధలుగా మారుస్తున్నారని సిద్ధార్థ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరహక్కులే ప్రధానమని, వాటి పరి రక్షణకు చట్టాలు చేయడం ప్రభుత్వాల బాధ్యతని విజయబాబు పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి.. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1లో ఏముందో తెలుసుకోకుండా ఓ వర్గం మీడియా భావ కాలుష్యాన్ని సృష్టిస్తోంది. రోడ్లు, ఇరుకైన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించరాదని అందులో ఉంది. సభలు నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతి, జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్డు షోలపై నిషేధం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రోడ్లు ఉన్నది ప్రజలు తిరిగేందుకేగానీ సభల కోసం కాదని కోర్టు పేర్కొంది. రోడ్లను రాజకీయ క్రీడా మైదానాలుగా మారుస్తున్న కొందరు నాయకులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్లు విష ప్రచారం చేస్తున్నారు. ప్రాథమిక హక్కులనేవి రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినా కమ్యూనిస్టులు స్పందించలేదు. కారకులను వదిలేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టిన గోడ కూల్చినందుకే ఉద్యమ స్థాయిలో స్పందించిన జనసేన అధినేత 11 మంది అమాయకులు చనిపోతే ఎందుకు స్పందించడం లేదు? – పి.విజయబాబు, ఎపిక్ ఫోరం అధ్యక్షుడు చట్టంపై వక్రభాష్యం ఏదైనా దుర్ఘటన జరిగి సామాన్యులకు ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1తో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. ఈ చట్టం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. తన చర్యలతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా హక్కులను వినియోగించుకుంటున్నానని చెప్పే వారిని ఏమనాలి? రోడ్లపై ర్యాలీలు నిర్వహించరాదని చట్టంలో లేదు. సభలు మాత్రమే వద్దని అందులో పేర్కొన్నారు. – జి.రామచంద్రారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే.. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. అలాంటి వాటిలో 1861 పోలీస్ చట్టం ఒకటి. జీవో నం.1 పోలీస్ చట్టానికి అనుగుణంగానే ఉంది. ఇందులోని నిబంధనలు ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఈ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారు. బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్ల బాధ్యత నిర్వాహకులదే. సమయం, ప్రదేశం, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహిస్తారు? వలంటీర్ల ఏర్పాటు లాంటి వివరాలతో పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిర్దిష్ట సమయానికి నిర్వహించలేకపోతే కారణాలను వివరిస్తూ మరోసారి అనుమతి పొందాలి. పోలీసులు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని చట్టంలో ఉంది. జీవో నం.1లో సభలపై నిషేధం గానీ, అభ్యంతరకర అంశాలుగానీ లేవు. – ఏఎస్ఎన్ రెడ్డి, రిటైర్డ్ ఎస్పీ జీవో వచ్చాక కూడా సభలు జరిగాయ్ ఓ ఘటన జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.1 తెచ్చింది. ఇది సభలను, ర్యాలీలను నిషేధిస్తూ చేసింది కాదు. ఈ చట్టం చేశాక ఒంగోలులో బాలకృష్ణ, విశాఖలో చిరంజీవి సినిమా సభలు జరిగాయి. తర్వాత పవన్ కళ్యాణ్ సభ కూడా జరిగింది. ఒకవేళ జీవోలో నిషేధం అని ఉంటే ఈ సభలు జరిగేవా? ప్రతిపక్ష పార్టీలు స్వలాభం కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఈ చట్టంలో ఏముందో తెలియదంటే అవివేకమే అవుతుంది. – పిళ్లా రవి, న్యాయవాది రోడ్లను దిగ్బంధించే హక్కు లేదు నిరసనలు తెలిపేందుకు, బహిరంగ సభల నిర్వహణకు ప్రత్యేక వేదికలుంటాయి. అక్కడ మాత్రమే చేపట్టాలి. రోడ్లను దిగ్బంధించి సభలు నిర్వహించే హక్కు ఎవరికీ లేదని కేరళ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దండి మార్చ్ సైతం మహాత్మాగాంధీ 78 మందితోనే నిర్వహించారు. ఇప్పుడు రాజకీయ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు, స్వలాభం కోసం రోడ్లను దిగ్బంధిస్తున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు పునరావృతం కాకుండా సరిదిద్దే బాధ్యత ప్రభుత్వానిది. అందుకోసమే జీవో నం.1 జారీ చేశారు. అందులో సభలు, ర్యాలీలను నిషేధించలేదు. రోడ్లపై సభలు వద్దని మాత్రమే పేర్కొన్నారు. ప్రత్యేక ప్రదేశంలో నిర్వహించే సభలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ జీవోను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఓ యువకుడు హైకోర్టుకు వెళితే దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. కానీ నాలుగు రోజుల్లోనే ఈ జీవోను రద్దు చేయాలని ఒకరు ఆశ్రయిస్తే ఇది బ్రిటీష్ కాలం నాటి చట్టమని ఆక్షేపించింది. వాస్తవానికి మన న్యాయ వ్యవస్థ నిర్మాణం, చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. – కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా న్యాయవాదుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నిధుల నిర్వహణ బాధ్యతను అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. అరణ్యభవన్లో శనివారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, కౌన్సిల్ సభ్యులు కలిసి న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమనిధికి ప్రతి ఏడాది రూ.10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, దీనివల్ల సభ్యులకు, మరణించిన లాయర్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రికి వివరించారు. మరణించిన న్యాయవాది నామినీకి న్యాయవాదుల సంక్షేమం నిధి ద్వారా రూ.4 లక్షలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వం తరఫున అదనంగా మరో రూ.4 లక్షలు, జూనియర్ న్యాయవాదులకు మూడేళ్ల కాలపరిమితికి ప్రతీ నెల రూ.ఐదువేలు ఉపకార వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హమీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్రావు, రాజేందర్రెడ్డి, కిరణ్ పాలకుర్తి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్ తదితరులు ఉన్నారు. -
జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదు: లాయర్లు
విజయవాడ: జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదని ఏపీ హైకోర్టు లాయర్లు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు కులాలు,మతాలు ఆపాదించడం తగదన్నారు. కొలీజియం నిర్ణయం మేరకే జడ్జిల నియామకాలు, బదిలీలు ఉంటయాన్నారు. జడ్జిల బదిలీల అంశానికి సంబంధించి సీఎం జగన్పై తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. అసలు కులాలు, మతాలతో రాజకీయం చేసేది చంద్రబాబేనని వారు స్పష్టం చేశారు. -
రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడకూడదు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం ఇచ్చిన భూములను ఆ ప్రయోజనం కోసం కాకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని అమరావతి రైతుల తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం మాస్టర్ ప్లాన్కు విరుద్ధమని అన్నారు. సీఆర్డీఏ చట్ట సవరణ ద్వారా రాజధానిలో రాజధానేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంలో రైతుల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి రైతు సంఘాలు వేర్వేరుగా వేసిన పిటిషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున బి.ఆదినారాయణరావు, కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే తగిన పరిహారం చెల్లించి భూ సేకరణ ద్వారా కేటాయించాలే తప్ప, రాజధాని కోసం తామిచ్చిన భూముల్లో స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రాజధాని నగరాన్ని మురికివాడగా మార్చకూడదన్నదే తమ వాదనని తెలిపారు. -
చెంగల్రాయుడును అరెస్ట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, భీమవరం/ఉండి/నెల్లూరు(లీగల్): రాజ్యాంగబద్ధమైన పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీ పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సమక్షంలోనే చెంగల్రాయుడు పోలీసు, న్యాయ వ్యవస్థలను తిడుతూ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయన ఖండించకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు, పోలీసు, న్యాయ వ్యవస్థలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెంగల్రాయుడు లాంటి వ్యక్తులను చట్టసభలకు పంపిన చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం పోలీసు వ్యవస్థపై పరుష పదజాలంతో నిరాధారమైన, అవాస్తవమైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఒక సందర్భంలో పోలీసులను కట్టు బానిసలుగా అభివర్ణించారని, దానిని కూడా ఖండిస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి విధులు నిర్వహించడంలో మాత్రమే కట్టు బానిసలుగా ఉంటారని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థ మీద విమర్శలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు అధికారుల సంఘ ఉపాధ్యక్షుడు ఆర్.రఘురాం, సీఐడీ యూనిట్ అధ్యక్షుడు అక్కిరాజు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, సభ్యుడు సత్యారావు, విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.సోమయ్య పాల్గొన్నారు. చెంగల్రాయుడు, చంద్రబాబుపై విజయవాడలో సీపీకి న్యాయవాదుల ఫిర్యాదు న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచేలా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడకు చెందిన న్యాయవాదులు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణాకు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడును ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన వారిలో న్యాయవాదులు జి.నాగిరెడ్డి, పి.నిర్మల్ రాజేష్, జె.జయలక్ష్మి, నరహరిశెట్టి శ్రీహరి, కె.వెంకటేష్శర్మ, గవాస్కర్, జి.కిరణ్, ఎస్.పరమేష్, బసవారెడ్డి, పి.రాంబాబు, కె.ప్రభాకర్, బి.రమణి, అల్లాభక్షు, ఎం.విఠల్రావు, ఎన్.కోటేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చెంగల్రాయుడు, చంద్రబాబుపై భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో, పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో, ఏలూరులో, నెల్లూరులోని చిన్నబజారు పోలీస్స్టేషన్లో, తిరుపతిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. చెంగల్రాయుడు వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయ వ్యవస్థ, పోలీసులను కించపరిచేలా చెంగల్రాయుడు వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను ప్రోత్సహించిన చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
చంద్రబాబు కాన్వాయ్ ను అడుగడుగునా అడ్డుకుంటున్న విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు
-
చంద్రబాబుకు చేదు అనుభవం.. గో బ్యాక్ అంటూ నినాదాలు
కర్నూలు జిల్లా: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్మా చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసే హోటల్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానికి అంగీకరించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. ఇక్కడ అడుగుపెట్టే అధికారం లేదని న్యాయవాదుల సంఘం హెచ్చరించింది. ఇక్కడ చదవండి: కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ -
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం : న్యాయవాదులు
-
కోర్టులో లేడీ లాయర్ల ఫైటింగ్ .. వీడియో వైరల్..
-
3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో.. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.inలో పొందుపరిచారు. దరఖాస్తు చివరి తేదీ ఇదే.. ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11.59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్ను తెలియజేస్తారు. దరఖాస్తు ఫీజు ఇలా.. : ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. హైకోర్టులో పోస్టుల ఖాళీల వివరాలు ఇలా.. ► ఆఫీస్ సబార్డినేట్–135 ►కాపీయిస్టు–20 ►టైపిస్ట్–16 ►అసిస్టెంట్–14 ►అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–13 ►ఎగ్జామినర్–13 ►కంప్యూటర్ ఆపరేటర్లు–11 ►సెక్షన్ ఆఫీసర్లు–9 ►డ్రైవర్లు–8 ►ఓవర్సీర్–1 ►అసిస్టెంట్ ఓవర్సీర్–1 ►మొత్తం 241 పోస్టులు. జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ►ఆఫీస్ సబార్డినేట్–1,520 ►జూనియర్ అసిస్టెంట్–681 ►ప్రాసెస్ సర్వర్–439 ►కాపీయిస్టు–209 ►టైపిస్ట్–170 ►ఫీల్డ్ అసిస్టెంట్–158 ►స్టెనోగ్రాఫర్ (గ్రేడ్–3)–114 ►ఎగ్జామినర్–112 ►డ్రైవర్(ఎల్వీ)–20 ►రికార్డ్ అసిస్టెంట్–9 ►మొత్తం 3,432 పోస్టులు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయండి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ను కోరారు. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం హెలిప్యాడ్లో ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును ఏర్పాటు చేయాలని, అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కృష్ణరంగడు, పుల్లారెడ్డి, జయరాజ్, ఓంకార్, రవిగువేరా, నరసింహ, లక్ష్మీనారాయణ ఉన్నారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఉద్యమం
కర్నూలు(లీగల్): హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే వరకు ఉద్యమం ఆపేది లేదని న్యాయవాదులు స్పష్టంచేశారు. కర్నూలులోని ధర్నా చౌక్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు నరసింహ, సంపత్కుమారి, బి.కృష్ణమూర్తి, సోమశేఖర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరం వద్దకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరితోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, డోన్, ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాదులు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ చౌదరి, కార్యదర్శి దస్తగిరి మరికొందరు మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు భాస్కర్రెడ్డి కూడా న్యాయవాదులకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కొలిమిగుండ్ల ప్రాంతంలో కలసి వినతిపత్రం సమరి్పస్తామని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కాటం రంగడు, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, రాయలసీమ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ కమిటీ నేత వై.జయరాజు, ఓంకార్ తెలిపారు. సీఎం జగన్ను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
కర్నూలుకు హైకోర్టును తరలించాల్సిందే
కర్నూలు(సెంట్రల్): ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాల్సిందేనని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది జయరాజు డిమాండ్ చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలని న్యాయవాదులు చేపట్టిన దీక్షలు ఆదివారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలుకు హైకోర్టును తరలించే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు సానుకూలంగా ఉన్నా ప్రతిపక్ష పార్టీలు అమరావతి భ్రమలో ఉన్నాయన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలన్నారు. దీనిని అమలు చేయకుండా గతంలో చంద్రబాబు సీమకు అన్యాయం చేశారన్నారు. దీక్షల్లో న్యాయవాదులు శ్రీనివాసులు, సోమశేఖర్, కె.రవికుమార్, ఎం.సుంకన్న, ఎం.మహావిష్ణు విజయలక్ష్మి కూర్చున్నారు. వారికి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కె.రంగడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రావిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, వెంకటస్వామి, సుబ్బయ్య మద్దతు తెలిపారు. -
హైకోర్టును కర్నూలుకు తరలించాలి
కర్నూలు(సెంట్రల్/లీగల్): కర్నూలుకు వెంటనే హైకోర్టును తరలించాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి.. కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఆర్ కృష్ణ, జేఏసీ కన్వీనర్ వై.జయరాజ్ మాట్లాడుతూ.. గతంలో కర్నూలుకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. సీఎం వైఎస్ జగన్ హైకోర్టు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తరలింపును అడ్డుకునే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలియజేస్తామన్నారు. హైకోర్టు తరలింపు కోసం వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు విధులను బహిష్కరించి.. తమ ఆందోళన తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, వి.నాగలక్ష్మీ, పి.సువర్ణరెడ్డి, ఎం.సుబ్బయ్య, బి,చంద్రుడు, కర్నాటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు (లీగల్): రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించి సీమ ప్రజల చిరకాల వాంఛను తీర్చాలని కర్నూలు న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఆర్.కృష్ణ, సీమ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వై.జయరాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, నాగలక్ష్మీదేవి, ఎం.సుబ్బయ్య, పి.సువర్ణరెడ్డి, బి.చంద్రుడు, రాజేష్, రంగనాథ్ మాట్లాడారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చరిత్రాత్మక అవసరమే కాకుండా మూడుప్రాంతాల సమతుల్యానికి దోహదం చేస్తుందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధానులతో సంబంధం లేకుండా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్కు, ప్రతిపక్ష నేతకు, సీమప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. -
హైకోర్టులో 35 మంది ప్యానెల్ అడ్వొకేట్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులతో కూడిన ప్యానెల్ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (అమరావతి)లో వాదనలు వినిపించేందుకు మరో ఏడుగురు న్యాయవాదులను నియమించింది. వీరంతా మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పోస్టుల్లో కొనసాగుతారు. హైకోర్టులో నియమితులైన న్యాయవాదులంతా కూడా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మార్గదర్శకత్వంలో పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా నియమితులైనవారిలో సాగి శ్రీనివాసవర్మ, జోస్యుల భాస్కరరావు, బొమ్మినాయుని అప్పారావు, ఏవీఎస్ రామకృష్ణ, తాత సింగయ్య గౌడ్, గేదెల తుహిన్ కుమార్, అంబటి సత్యనారాయణ, మల్లంపల్లి శ్రీనివాస్, సీవీఆర్ రుద్రప్రసాద్, అరవల శ్రీనివాసరావు, మంచాల ఉమాదేవి, పోతంశెట్టి విజయకుమారి, బేతంపల్లి సూర్యనారాయణ, బాచిన హనుమంతరావు, తానేపల్లి నిరంజన్, అరవ రవీంద్రబాబు, గుడిసేవ నరసింహారావు, గుండుబోయిన వెంకటేశ్వర్లు, పసల పున్నారావు, గేదెల సాయి నారాయణరావు, వి.వెంకట నాగరాజు, ఇ.అంజనారెడ్డి, కామిని వెంకటేశ్వర్లు, తుమ్మలపూడి శ్రీధర్, ఓరుగంటి ఉదయ్ కుమార్, కె.శ్రీధర్ మూర్తి, సోమిశెట్టి గణేష్ బాబు, తడసిన అలేఖ్య రెడ్డి, వైవీ అనిల్ కుమార్, సోమసాని దిలీప్ జయరామ్, పల్లేటి రాజేష్ కుమార్, పామర్తి కామేశ్వరరావు, మన్నవ అపరాజిత, షేక్ బాజీ, గొర్రెముచ్చు అరుణ్ శౌరి ఉన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో నియమితులైన వారిలో కవిపురపు పట్టాభి రాముడు, గొరికపూడి అంకమ్మరావు, ఎన్.వీరప్రసాద్, సీతిరాజు రామకృష్ణ, మాదాల ఆదిలక్ష్మి, షేక్ మంజూర్ అహ్మద్, బి.బి.లక్ష్మయ్య ఉన్నారు. -
విభిన్న ప్రతిభావంతుల కోసం ‘నల్సా’ కొత్త పథకం
కడప అర్బన్ : విభిన్న ప్రతిభావంతుల కోసం జాతీయ న్యాయ సేవాధికారసంస్థ (నల్సా) కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. కవిత తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాసదన్లో విభిన్న ప్రతిభావంతుల కోసం నల్సా రూపొందించిన న్యాయ సేవలు పథకం 2021పై అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి కవిత మాట్లాడుతూ ఈ పథకం గురించి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా మానసిక, శారీరక దివ్యాంగులైన పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతులైన పిల్లల పట్ల వివక్ష చూపరాదని, 18 సంవత్సరాలు వచ్చేంతవరకు ఉచిత విద్యను అందించాలన్నారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. న్యాయసేవలు ఉచితంగా అందజేస్తామన్నారు. కొత్తపథకంపై పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీ కార్యాలయాల్లో బోర్డులు ప్రదర్శించాలని జడ్జి వివరించారు. కార్యక్రమంలో భాగంగా అంధులైన పిల్లలకు డైజీ ప్లేయర్స్, విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, వీల్ చైర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వారి తల్లిదండ్రులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఆబ్లెడ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్, ఎస్ఎస్ఏ పీఓ ప్రభాకర్రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్బాష, అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి. నరసింహులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సాంబశివరావు, లీగల్ కమ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సునీతరాజ్, అన్నమయ్య జిల్లా డీసీపీఓ సుభాష్యాదవ్, జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసర్ చెన్నారెడ్డి, రాష్ట్రీయ సేవాసమితి, ఆల్షిఫా ఇనిస్టిట్యూట్ కరస్పాండెంట్ రఫి, హెలెన్కెల్లర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంతంత ఫీజులు సామాన్యుడు ఎలా భరించగలడు?
జైపూర్: పౌరులకు ఉచిత న్యాయసేవను అందిస్తున్న దేశాల్లో మనది ఒకటి. అలాంటి దేశంలో కేసుల కోసం లక్షల నుంచి కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న న్యాయవాదులు ఉంటున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యల చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. దేశంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగకుండా ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న అధిక లీగల్ ఫీజులపై ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జైపూర్లో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్లో మంత్రి రిజిజు మాట్లాడుతూ.. “డబ్బున్నవాళ్లు బడా లాయర్లను నియమించుకుంటారు. అంతెందుకు సుప్రీంకోర్టులో ఉన్న కొందరు న్యాయవాదుల ఫీజులను సామాన్యులు భరించలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో వాదన కోసం రూ.10-15 లక్షలు వసూలు చేస్తే.. అసలు సామాన్యుడు ఎలా చెల్లించగలడు?. పేదలకు న్యాయం ఎలా అందుతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా! అని న్యాయశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. జూలై 18, సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 71 వాడుకలో లేని చట్టాలను రద్దు చేస్తామని న్యాయ మంత్రి వెల్లడించారు. आज जयपुर में राष्ट्रीय विधिक सेवा प्राधिकरण की 18वी अखिल भारतीय बैठक के उद्घाटन समारोह में भाग लेंगे। pic.twitter.com/ADBCN4a9zo — Kiren Rijiju (@KirenRijiju) July 16, 2022 ఇక న్యాయ సేవల సమావేశానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా జరిగిన ప్రచారంపైనా గెహ్లట్ స్పందించారు. “సస్పెండ్ చేయబడిన బిజెపి los నూపుర్ శర్మ పిటిషన్ను విచారిస్తున్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులపై దుష్ప్రచారం ప్రారంభించడం చాలా ఆందోళన కలిగించే విషయం” అని ఆయన అన్నారు. పనిలో పనిగా బీజేపీపై విరుచుకుపడిన గెహ్లాట్.. హార్స్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. “దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నా(రాజస్థాన్) ప్రభుత్వం ఎలా మనుగడ సాగించిందనేది ఆశ్చర్యం కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. -
దివ్యాంగుల కోసం కోర్టుల్లో సౌకర్యాలు కల్పించాలి: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో దివ్యాంగులైన న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం లిఫ్టులు, రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వసతుల ఏర్పాటు బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తమ ముందున్న వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో దివ్యాంగులైన న్యాయవాదులకు, కక్షిదారులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాదులు జీఎల్వీ రమణమూర్తి, మరో ఏడుగురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. -
న్యాయవాదులుగా ఉంటూ.. న్యాయవ్యవస్థను కించపరుస్తారా?
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. న్యాయవాదులు మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేశ్కుమార్లనూ ఇటీవల అరెస్టుచేసింది. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది కోదండరామిరెడ్డి వాదనలు వినిపించారు. మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి తమ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారని వారు వాదించారు. కోర్టును లిఖితపూర్వకంగా క్షమాపణ కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ కూడా ఇచ్చారన్నారు. వారి క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార చర్యలను మూసివేసిందన్నారు. వారి వయస్సు, అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎంతమాత్రం సహించేదిలేదు.. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, న్యాయవాదులుగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిపోయి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడి దాని ప్రతి ష్టను దిగజార్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేదిలేదని జస్టిస్ రాయ్ చెప్పారు. వ్యవస్థలో భాగమైన న్యాయవాదులు న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజా నీకం కూడా గౌరవిస్తుందన్నారు. సీబీఐ న్యాయవాది కె. చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వారికి బెయిల్ మంజూరు చేయరాదన్నారు. కింది కోర్టు రెండ్రోజుల పాటు నిందితులను సీబీఐ కస్టడీకి ఇచ్చిందని, న్యాయవాది కళా నిధి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కస్టడీ ఉత్తర్వులు అమల్లో ఉండగా బెయిల్ మంజూరు చేయరాదన్నారు. అది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందన్నారు. కస్టడీ ముగిసిన తరువాత కూడా వారిని జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాల్సిన అవసరం ఏముందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. -
మై లార్డ్, యువరానర్ అనాల్సిన అవసరం లేదు.. సర్ చాలు!
సాక్షి, భువనేశ్వర్/కటక్: సాధారణఃగా కోర్టుల్లో కేసుల విషయంలో వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ లేదా..యువరానర్’ అని సంభోదిస్తుంటారు. అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే మై లార్డ్, యువర్ లార్డ్షిప్, యువర్ ఆనర్ వంటి సంబోధనలు మినహాయించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్.మురళీధర్ న్యాయవాదులకు విన్నపం చేశారు. సర్ వంటి సాధారణ సంబోధన సరిపోతుందని ఆయన అన్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఈ సందేశం జారీ చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రోజుల్లో సైతం న్యాయవాదులకు ఆయన ఇదే సందేశాన్ని జారీ చేయడం విశేషం. 2006 మే 29 నుంచి 2020 మార్చి 5వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2020లో పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉండే సమయంలో కూడా ఇదే విన్నపం అక్కడి న్యాయవాదులకు విన్నవించడం గమనార్హం. 2020 మార్చి 6 నుంచి 2021 జనవరి 3వ తేదీ వరకు పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా, చీఫ్ జస్టిస్ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మై లార్డ్, లార్డ్షిప్, యువర్ ఆనర్, ఆనరబుల్ వంటి సంబోధనలు నివారించాలని 2006లో తీర్మానించింది. చదవండి: వేల సంఖ్యలో కేసులు.. భారత్లో మొదలైన కరోనా థర్డ్వేవ్? చీఫ్ జస్టిస్ నిర్ణయం అభినందనీయం.. హైకోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించాల్సిన సంబోధనల పురస్కరించుకుని, ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన సందేశం అభినందనీయమని ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జె.కె.లెంకా తెలిపారు. ఆయన విన్నపం నేపథ్యంలో తోటి న్యాయమూర్తులు ఈ సంస్కరణ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, కోర్టు విచారణకు హాజరయ్యే వ్యక్తులు ఇదే పద్ధతి పాటించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే సంబోధనల నివారణకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హయాంలో బీజం పడిందని సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి 1975 వరకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయమూర్తులను సర్ అని సంబోధించాలని ఫుల్ బెంచ్ అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. -
న్యాయవాదులు సమాజానికి మార్గ దర్శకులు
-
వారధిలా న్యాయ విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదలకు న్యాయం అందించే దిశగా ప్రారంభించిన ‘మిషన్ లీగల్ సర్వీసెస్’ను ఓ ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంలో న్యాయ విద్యార్థులే కీలకమని, మిషన్ లీగల్ సర్వీసెస్కు వారు వెన్నెముక లాంటి వారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు చేపట్టిన మిషన్ లీగల్ సర్వీసెస్ కార్యక్రమాన్ని సీజే జస్టిస్ మిశ్రా మంగళవారం ఉదయం ప్రారంభించి మాట్లాడారు. దత్తత గ్రామాల పర్యటనకు ఉద్దేశించిన వాహనాలను ఆయన ప్రారంభించారు. దత్తత గ్రామాల్లో సేవలు... గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తుళ్లూరు, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకుని మిషన్ లీగల్ సర్వీసెస్ను ప్రారంభిస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం న్యాయ విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. వారు ప్రజలు, న్యాయవ్యవస్థకు మధ్య వారధిలా పని చేస్తారన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ ద్వారా గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, రైతుల సమస్యలతో పాటు తాగునీటి ఇబ్బందులను గుర్తించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటూ గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే సంబం«ధిత వ్యక్తులకు కోర్ కమిటీ ఉచితంగా న్యాయ సాయం అందిస్తుందన్నారు. చట్టాలున్నా... అవగాహన లేక పేదల హక్కుల రక్షణ విషయంలో పలు చట్టాలున్నా అవగాహన లేకపోవడం వల్ల నిరర్థకం అవుతున్నాయని ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ సమర్థంగా అమలయ్యేలా 6 కమిటీలు ఏర్పాటు చేశామని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి తెలిపారు. ఎనిమిది న్యాయ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు, 41 మంది న్యాయవాదులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
కోవిడ్తో 77 మంది లాయర్ల మృతి.. సుప్రీంకోర్టు నివాళి
న్యూఢిల్లీ: కోవిడ్తో మృత్యువాతపడిన 77 మంది లాయర్లకు సుప్రీంకోర్టు నివాళులర్పించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహా న్యాయమూర్తుల తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ)కు చెందిన 77 మంది కోవిడ్తో మృతి చెందినట్లు ఎస్సీబీఏ తెలిపింది. మృతులకు మా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందిన సభ్యులను స్మరించుకోవడం ఉత్తమమైన చర్యగా న్యాయవాది గోపాల్ శంకర నారాయణ అభివర్ణించారు. చదవండి: చార్ధామ్ యాత్రకు కోర్టు బ్రేక్ -
ఓటుకు కోట్లు కేసు: కుట్రదారును వదిలి పాత్రధారులపై అభియోగాలా?
సాక్షి, హైదరాబాద్: ఈడీ చార్జిషీట్లో ‘ఓటుకు కోట్లు’కుట్రకు ప్రధాన సూత్రధారి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరును నిందితుడిగా చేర్చకపోవడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘మనవాళ్లు అంతా బ్రీఫ్డ్ మీ. వారిచ్చిన హామీని నెరవేరుస్తా’నంటూ నేరుగా స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టిన చంద్రబాబును పక్కనపెట్టి.. కుట్రను అమలుచేసిన పాత్రధారులపై మాత్రమే అభియోగాలు మోపడం ఆశ్చర్యకరమని అంటున్నారు. టీడీపీ మహానాడు వేదికగా కుట్ర జరిగినట్టు బయటపడినా, స్పష్టమైన ఆడియో, వీడియో ఆధారాలున్నా కూడా చంద్రబాబును నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ఆ స్వరం చంద్రబాబుదే.. స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణలను ప్రఖ్యాత ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) పరీక్షించింది. ఆ స్వరం చంద్రబాబుదేనని తేల్చిచెప్పింది. చంద్రబాబు చేసిన ఈ కుట్రను రేవంత్రెడ్డి తదితరులు అమలు చేశారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఆడియో, వీడియో ఆధారాలున్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈడీ కూడా చంద్రబాబును నిందితుడిగా చేర్చకపోవడం సరికాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే సందేశం ఇవ్వాలంటే చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలి. – కొంతం గోవర్ధన్రెడ్డి, న్యాయవాది చంద్రబాబే కుట్రదారు టీడీపీ అధినేత, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే వచ్చామని రేవంత్, ఇతర నిందితులు స్టీఫెన్సన్కు చెప్పారు. అంటే ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయనను వదిలేసి పాత్రధారుల్ని నిందితులుగా చేర్చడం శోచనీయం. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్రను అమలు చేసినా ఈడీ ఆయనను విచారించలేదు. లంచం డబ్బును తీసుకొచ్చిన వారిని నిందితులుగా చేర్చి.. డబ్బు సమకూర్చి పంపిన చంద్రబాబును విడిచిపెట్టడం ఏమిటి? ఇప్పటికైనా చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలి. – ఒద్యారపు రవికుమార్, న్యాయవాది -
సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ల జంట హత్యల కేసు చివరికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మెడకు చుట్టుకుంటోంది. కేసు చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గన్మెన్లను వదిలి వారం రోజులపాటు అదృశ్యం కావడంతో ఆయన ప్రమేయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితి తలెత్తింది. లాయర్ల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను జైలులో ఉండగా.. అతని ఇంటి నిర్మాణానికి పుట్ట మధు సహకరిస్తున్నట్లు వామన్రావు తండ్రి కిషన్రావు ఫిర్యాదు చేశారు. వాటితోపాటు మరిన్ని అనుమానాస్పద అంశాలు జెడ్పీ చైర్మన్ మధుకు తలనొప్పిగా మారుతున్నాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన మధును శుక్రవారం రాత్రి ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ.. వామన్రావు హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. హత్య కేసు విచారణాధికారి అడిషనల్ డీసీపీ అశోక్కుమార్, ఓఎస్డీ శరత్చంద్రపవర్, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ వేర్వేరుగా విచారించారు. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైది. రూ, 2 కోట్లు సుపారీ నిజమేనా..? హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్రావు తండ్రి కిషన్రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖనే పుట్ట మధుపై ఎంక్వైరీకి కారణమైంది. వామన్రావు దంపతుల హత్యకు రూ.2 కోట్లు డీల్ మాట్లాడిందెవరు? బిట్టు శ్రీనుకు కొత్త కారు కొనిచ్చింది ఎవరు? కుంట శ్రీను ఇంటికి ఎవరు డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలను ఏ బ్యాంకు నుంచి తెచ్చారు? విత్డ్రా చేసిందెవరు? తదితర కోణాలపై రామగుండం పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరగడానికి ముందు నుంచి తరువాత చోటు చేసుకున్న పరిణామాల వరకు పుట్ట మధు ఎవరెవరితో మాట్లాడారో కాల్డేటా కూడా తీసుకుని విచారిస్తున్నారు. చార్జిషీటు దాఖలుకు సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో కోర్టుకు సమాధానం చెప్పుకొనేందుకు.. వామన్రావును అంతమొందించడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే కోణంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. వారం రోజులు ఎందుకు అదృశ్యం..? జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ కోసం గన్మెన్లుగా వచ్చిన నలుగురు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వ కారును వదిలేసి ఎందుకు అదృశ్యం కావలసి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని సమాచారం. పోలీసుల కళ్లు కప్పి మహారాష్ట్ర, హైదరాబాద్, భీమవరం ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగానే మధు గాయబ్ అయ్యాడా? ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదృశ్యంపై గోప్యత ఎందుకు? గత నెల 29న రాత్రి హైదరాబాద్ నుంచి ఓ పోలీస్ అధికారి నుంచి ఫోన్ కాల్ రావడంతో అదేరోజు రాత్రి పుట్ట మధు అదృశ్యమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మధు అదృశ్యమైన తరువాత మరుసటి రోజు ఉదయం గన్మెన్లు ఈ విషయాన్ని ఏఆర్ విభాగం చీఫ్కు తెలియజేయడం, ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. గన్మెన్లు తమ ఆయుధాలను సరెండర్ చేసి, ఏఆర్కు అటాచ్డ్ అయ్యారు. ఆ వెంటనే రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మధు, ఆయన డ్రైవర్ సెల్ టవర్ సిగ్నల్స్ మేరకు మహారాష్ట్ర వెళ్లారు. ఈనెల 1న మహారాష్ట్రలోని వని పట్టణంలో మధు సోదరుని నివాసానికి వెళ్లి విచారణ జరపగా, మధు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. అదే సమయంలో ఈటల రాజేందర్ వ్యవహారం తెరపైకి రావడంతో హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. మధు కోసం జిల్లాకు చెందిన ఓ మంత్రి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజుల క్రితం సదరు మంత్రికి ‘సాక్షి’ ఫోన్ చేయగా, మధు హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. సాక్షి కథనాలతో అప్రమత్తమైన పోలీసులు ‘భీమవరం’ నుంచి అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. ‘సాక్షి’ వరుస కథనాల సంచలనం పుట్ట మధు అదృశ్యమైన విషయంపై ఈనెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పటివరకు పుకారుగా ప్రచారంలో ఉన్న ఈ అంశాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజు 7న ‘అజ్ఞాతంలోనే మధు’ శీర్షికతో వారం రోజులుగా వీడని సస్పెన్స్ను హైలైట్ చేస్తూ కథనం ప్రచురించింది. మధు ఎక్కడికి వెళ్లలేదని, గన్మెన్ ఆయనతోనే ఉన్నారని, మిస్సింగ్ ఫిర్యాదులు ఏవీ అందలేదని రామగుండం పోలీస్ కమిషనర్ ఇచ్చిన వివరణతోపాటు జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది. అదే సమయంలో తన భర్త ఆచూకీ తెలపాలని మధు సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మంత్రి ప్రశాంత్రెడ్డిని కలిసిన వివరాలను ప్రచురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును అదుపులోకి తీసుకున్న విషయాన్ని మీడియాకు వెల్లడించాలని నిర్ణయించారు. అదే సమయంలో శుక్రవారం పుట్ట శైలజ ‘సాక్షి’తో మాట్లాడుతూ పుట్ట మధు హైదరాబాద్లోనే ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు 8న ‘అజ్ఞాతంలోకి పోలేదట..’ శీర్షికతో మరో కథనం ప్రచురితమైంది. చివరికి పుట్ట తమ అదుపులో ఉన్న విషయాన్ని పోలీసులు వెల్లడించక తప్పలేదు. -
నకిలీ వకీలు: కోర్టులో ప్రశ్నలకు తడబడటంతో..
అనకాపల్లి టౌన్: విశాఖ జిల్లా అనకాపల్లిలో న్యాయస్థానాన్ని మోసగించబోయిన ఓ నకిలీ వకీలు న్యాయమూర్తి అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఇద్దరు వ్యక్తుల బెయిల్ పిటిషన్ వాదించడానికి వచ్చిన తానే కటకటాలపాలయ్యాడు. పట్టణ ఎస్ఐ ఎల్.రామకృష్ణ అందించిన వివరాలు.. విశాఖ డాబాగార్డెన్స్కు చెందిన సంపంగి చినబంగారి దుర్గా సురేష్కుమార్ న్యాయవాదిలా నల్లకోటు వేసుకొని అనకాపల్లి 11వ మెట్రోపాలిటన్ జడ్జి ఎస్.విజయచందర్ ముందు గురువారం బెయిల్ పత్రాలు దాఖలు చేశాడు. కోర్టు ప్రశ్నలకు తడబడడంతో న్యాయమూర్తికి అనుమానం వచ్చి అతని పూర్తి వివరాలు చెప్పాలని కోరారు. సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేయగా, అక్కడున్న న్యాయవాదులు అతన్ని పట్టుకున్నారు. సురేష్కుమార్ వద్ద ఉన్న గుర్తింపు కార్డును పరిశీలిస్తే.. దానిపై టి.దేవేందర్ అనే అడ్వకేట్ పేరు ఉండగా, ఫొటో మాత్రం సురేష్కుమార్ది ఉంది. దీంతో న్యాయమూర్తి కోర్టు సూపరింటెండెంట్ను పిలిచి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. నకిలీ వకీల్ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు శుక్రవారం ప్రవేశపెట్టగా, 14 రోజులు రిమాండ్ విధించారు. -
తీర్మానాలు చించేశారు.. కుర్చీలు విసిరేశారు..
సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్కు చెందిన కొందరు న్యాయవాదులు.. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాల్లో జోక్యానికి ప్రయత్నించడం, హైకోర్టు వద్ద సర్వసభ్య సమావేశానికి పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. ఇది గురువారం న్యాయవాదుల మధ్య ఘర్షణకు దారి తీసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి, అధ్యక్షులను విజయవాడ న్యాయవాదులు నిర్ణయించడం ఏమిటంటూ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సర్వసభ్య సమావేశం తీర్మానాలను కొందరు చించివేయగా.. మరికొందరు కుర్చీలు విసిరేశారు. బయట నుంచి వచ్చిన న్యాయవాదులు విసిరేసిన కుర్చీ తగలడం వల్ల బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్కు గాయమైందంటూ.. ఆయన జూనియర్లు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అజయ్కుమార్ తదితరులు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే న్యాయవాదుల మధ్య వివాదంలో తాను ఏరకంగానూ జోక్యం చేసుకోనని ప్రధాన న్యాయమూర్తి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు హైకోర్టు న్యాయవాదులు మెట్టా చంద్రశేఖర్తో పాటు మరికొందరు ఎస్పీఎఫ్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సభ్యులు కాని వ్యక్తులు తమపై దాడికి ప్రయత్నించారంటూ డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వాస్తవానికి హైకోర్టు న్యాయవాదుల సంఘం పాలకవర్గం కాల పరిమితి ఎప్పుడో ముగిసింది. గతేడాది ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి తెలియకుండా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం వివాదానికి కారణమైంది. చలసాని అజయ్ ఇటీవల జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారని, అతనికి హైకోర్టు న్యాయవాదుల సంఘంలో ఓటు హక్కు లేదని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఆయనే గొడవ సృష్టించారని చెబుతున్నారు. చదవండి: వీడియో వైరల్: హైదరాబాద్కు రజనీకాంత్ రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
లాయర్ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్య కేసులో మే 17 నాటికి 90 రోజులు పూర్తవుతుందని, ఆ లోగా అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. న్యాయవాద దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గత ఫిబ్రవరిలో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదిక సమర్పిం చారు. ఈ కేసులో 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని, వారిలో 26 మంది వాంగ్మూలాలను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని, మిగిలినవారి వాంగ్మూలాలను త్వరలో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని.. ఆ నివేదిక వచ్చేందుకు నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17న హత్య జరిగిన నేపథ్యంలో మే 17 నాటికి 90 రోజులు అవుతుందని, 17లోగా సమగ్రంగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఇస్తే.. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని గట్టు వామన్రావు తండ్రి కిషన్రావు తరఫు న్యాయవాది విజయభాస్కర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. నివేదికపై హైకోర్టు సంతృప్తి.. దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసుల నివేదిక సంతృప్తికరంగా ఉందని, దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. చదవండి: బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు -
‘న్యాయవాద దంపతులది ప్రభుత్వ హత్యే’
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణిల హత్యను ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల అక్రమాల చిట్టా వారి వద్ద ఉందని, వాటి ఆధారంగా హైకోర్టులో కేసులు దాఖలు చేసినందునే పోలీసు అధికారుల సహకారంతో వారిని పక్కాగా అంతమొందించారని సంజయ్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో న్యాయవాద దంపతుల మృతదేహాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. హత్య వెనుక టీఆర్ఎస్ హస్తం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: న్యాయవాదులు గట్టు వామన్రావు దంపతుల హత్య వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వామన్రావు హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ చేసిన హత్యేనని, ఇప్పటివరకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు హత్యను ఖండించకపోవడమేంటని ప్రశ్నించారు. హత్యపై హైకోర్టు న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తానని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని, పార్లమెంట్లో ఈ అంశంపై ప్రస్తావన తీసుకొస్తానని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి: జీవన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: లాయర్ దంపతులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. కేసును సీబీఐ విచారణకు ఆదేశించి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు కాదని.. టీఆర్ఎస్ నేతలకేనని ఓ ప్రకటనలో విమర్శించారు. -
కారు, కత్తులు సమకూర్చింది అతడే..
సాక్షి, కరీంనగర్: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్యకు సొంత గ్రామంలో నెలకొన్న గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు నిందితులు ఉపయోగించిన నల్లని బ్రీజా కారు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. గురువారం రాత్రి పెద్దపల్లిలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, డీఐజీ ప్రమోద్ కుమార్తో కలిసి వరంగల్ జోన్ ఐజీ వి.నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను కారు డ్రైవర్ శివందుల చిరంజీవి కలిసి కొబ్బరికాయలు నరికే కత్తులతో ఈ హత్యాకాం డకు పాల్పడ్డారని తెలిపారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని వామన్రావు అడ్డుకోవడం, ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కార ణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు. ‘రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను సమకూర్చగా.. అతడి కారు డ్రైవర్ చిరంజీవితో కలిసి కుంట శ్రీనివాస్ నడిరోడ్డుపై హత్యాకాండకు తెగబడ్డాడు. కుంట శ్రీనివాస్ను ఏ1గా, చిరంజీవిని ఏ2గా, అక్కపాక కుమార్ను ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశాం. కుంట శ్రీనివాస్, చిరంజీవిని గురువారం మహారాష్ట్ర సరిహద్దుల్లో అరెస్టు చేశాం. కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నాం. వామన్రావు తండ్రి ఫిర్యాదు మేరకు రిటైర్డ్ డీఈ వసంతరావుకు ఈ కేసులో ఏమైనా ప్రమేయం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నాం. హత్య చేయడానికి కారు, కత్తులను సమకూర్చిన బిట్టు శ్రీను కోసం గాలిస్తున్నాం’అని నాగిరెడ్డి వెల్లడించారు. పథకం ప్రకారమే హత్య... న్యాయవాద దంపతుల హత్య పక్కా పథకం ప్రకారమే జరిగిందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ‘గుంజపడుగు గ్రామంలోని దేవాలయానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు తన తండ్రి, సోదరుడి సంతకాల కోసం గట్టు వామన్రావు దంపతులు గురువారం మంథని కోర్టుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న కుంట శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లేటప్పుడు వామన్రావును చంపాలని పథకం వేసుకున్నాడు. తన కారును అక్కపాక కుమార్కు ఇచ్చి వామన్రావు కదలికలను తెలియజేయాలని సూచించాడు. బిట్టు శ్రీను అనే వ్యక్తి నుంచి నల్లని బ్రీజా కారును, రెండు కొబ్బరి కాయలు కోసే కత్తులు తీసుకుని అతడి డ్రైవర్ చిరంజీవితో కలిసి మధ్యాహ్నం సమయంలో కల్వచర్ల శివారులో కాపు కాశాడు. వామన్రావు కారు రాగానే దానిని ఢీకొట్టి కారు ఆపారు. అనంతరం కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు అద్దం పగలగొట్టాడు. దీంతో డ్రైవర్ భయపడి కారు దిగిపోవడంతో వామన్రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారు నడిపే ప్రయత్నం చేశారు. వెంటనే కుంట శ్రీను ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో చిరంజీవి రెండోవైపు నుంచి వచ్చి వామన్రావు భార్య నాగమణిపై కత్తితో దాడి చేయడంతో ఆమె కారులోనే కుప్పకూలిపోయారు. తర్వాత చిరంజీవి కూడా వామన్రావు వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం ఇరువురూ బ్రిజా కారులో ఇంక్లైన్ కాలనీ నుంచి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లిపోయారు. రక్తపు మరకలు అంటున్న బట్టలు, దాడికి ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడేసి, అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు పారిపోయారు. మహారాష్ట్ర ప్రాంతంలో తెలంగాణ పోలీసుల కదలికలున్నాయనే అనుమానంతో ముంబై వెళ్తుండగా, వాంకిడి చంద్రపూర్ మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’అని నాగిరెడ్డి వివరించారు. ఐదేళ్లుగా వివాదాలు.. వామన్రావుకు తన గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్తో ఐదేళ్లుగా వివాదాలున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాలస్వామి దేవాలయం మేనేజ్మెంట్ కమిటీ వివాదంతోపాటు ఇల్లు, కుల దేవత పెద్దమ్మ ఆలయం నిర్మాణాలు నిలిపివేయించారనే కక్షతోనే కుంట శ్రీను వామన్రావును చంపాలని కుట్ర పన్ని, బిట్టు శ్రీను సహకారంతో హత్య చేసినట్లు వివరించారు. కుంట శ్రీనివాస్ గతంలో నిషేధిత సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో పనిచేశాడని, బస్సు దహనం, 498ఏ కేసుల్లో నిందితుడని తెలిపారు. చిరంజీవికి ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా, ఆర్థికంగా ఆదుకున్న కుంట శ్రీనివాస్ మీద అభిమానంతో ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. కేసులో ఎలాంటి రాజకీయ కారణాలు వెల్లడి కాలేదని, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హత్య సమయంలో ప్రయాణికులు తీసిన వీడియో క్లిప్పింగులు ఏవైనా ఉంటే తమకు పంపించాలని ఆయన కోరారు. -
న్యాయవాదుల హత్యలో వారిదే పాత్ర: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యోదంతంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే హత్యలు జరిగాయని ఆరోపణలు చేశారు. వారిపై కుట్ర కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంథని న్యాయవాదుల హత్యలో స్థానిక టీఆర్ఎస్ నేతలు కేవలం పాత్రధారులేనని, హత్యకు ఉసిగిల్పింది మాత్రం కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్లను తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న హాలియా సమావేశంలో కేసీఆర్, తమను ఎవరైనా ప్రశ్నిస్తే నషంలాగా నలిపివేస్తామని చెప్పినట్లు రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బాల్క సుమన్ ఏకంగా హత్య చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తొక్కేస్తమని పెద్దలే చెపుతున్నారని ఉదాహరించారు. ఈ హత్యలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ బాధ్యులని చెప్పారు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సుమోటోగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
న్యాయవాదుల బీమా పథకానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టిన లాయర్ల బీమా పథకం అమలుకు రాష్ట్ర బార్ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బార్ కౌన్సిల్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. మొదటి పాలసీని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్కు కంపెనీ ప్రతినిధులు గురువారం అందచేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి, రవి గువేరా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాది, వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల వరకు నగదు రహిత వైద్యసాయం, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని అడ్వొకేట్ జనరల్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ బీమా సౌకర్యం కోసం 15,552 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ప్రీమియం కింద ఒక్కొక్కరు రూ.5,348 చొప్పున చెల్లించాల్సి ఉండగా, ఇందులో న్యాయవాది వాటా రూ.1000 కాగా, మిగిలిన మొత్తాన్ని(రూ.4,348) ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. సంక్షేమ నిధికి ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఈ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. 2020, డిసెంబర్ 30 నుంచి 2021, డిసెంబర్ 29 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి రూ.25 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు గంటా రామారావు, నాగిరెడ్డి తదితరులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి కూడా ఇదే విషయంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
పేదలకు ఇకపై ఉచిత ప్రతివాద న్యాయసేవలు
అనంతపురం లీగల్: పేద, బడుగు వర్గాలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదుల నియామకానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్కుమార్ చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురం జిల్లాకు మంజూరైన న్యాయ సహాయ ప్రతివాద న్యాయవాది వ్యవస్థను జస్టిస్ రాకేష్కుమార్ శుక్రవారం డిజిటల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెషన్స్ కేసుల్లో పేదవారి తరఫున అండగా నిలిచి న్యాయసహాయం అందించటానికి ఈ వ్యవస్థ చక్కటి అవకాశమన్నారు. జిల్లా పరిపాలనా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్రావు మాట్లాడుతూ.. సకాలంలో సరైన న్యాయ సహాయకులు లేక ఎందరో జైళ్లలో మగ్గిపోతున్నారని, వారందరికీ అండగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ చిన్నంశెట్టి రాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గరికపాటి దీనబాబు, జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు రావిురెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.గురుప్రసాద్, అన్ని జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు, సీనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం: ఆ పిల్ను కొట్టేయండి
సాక్షి, అమరావతి: న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన నిరాధార, తప్పుడు కథనాన్ని ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టును అభ్యర్థించింది. ఈ వార్తా కథనం ప్రామాణికతను తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపింది. తప్పుడు కథనం ప్రచురించిన ఆ పత్రికకు ఇప్పటికే లీగల్ నోటీసు జారీ చేశామని, ఆ తదుపరి చర్యలు కూడా ఉంటాయని వివరించింది. ప్రామాణికత లేని వార్తల ఆధారంగా పిల్ దాఖలు చేయడానికి కుదరదంది. ఇదే విషయాన్ని కుసుమలత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని పేర్కొంది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన తప్పుడు కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి కరోనాతో బాధపడుతుండటంతో హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. (బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..) -
లిస్టులో కేసులున్న న్యాయవాదులకే ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7(సోమవారం) నుంచి ప్రయోగాత్మకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు నలుగురు న్యాయమూర్తులు భౌతికంగా కేసులు విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిస్టులో కేసులు ఉన్న న్యాయవాదులు, పిటిషనర్లను మాత్రమే అనుమతించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయవాదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలను రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం జారీచేశారు. ‘‘ఒక కేసుకు సంబంధించి పిటిషనర్ తరఫున ఒకరు, ప్రతివాది తరఫున ఒక న్యాయవాది మాత్రమే హాజరుకావాలి. కోర్టు హాల్లో మొత్తం న్యాయవాదులు, కేసులను నేరుగా వాదించుకునే (పార్టీ ఇన్ పర్సన్స్) వారి సంఖ్య ఆరుకు మించడానికి వీల్లేదు. కేసు విచారణ పూర్తవుతూనే ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోవాలి. జూనియర్ న్యాయవాదులు, న్యాయవాదుల క్లర్కులతోపాటు ఇతరులెవరికీ ప్రవేశం లేదు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారెవరూ హైకోర్టు ఆవరణలోకి రావడానికి వీల్లేదు. న్యాయవాదులు సైతం తమ కేసు విచారణకు వచ్చే వరకూ వెయిటింగ్ హాల్స్ లేదా ఖాళీగా ఉన్న ఇతర కోర్టులో వేచి ఉండాలి. ఉదయం 7.30, 9.30 గంటలకు, సాయంత్రం 5 గంటల తర్వాత కోర్టు హాల్స్ను పూర్తిగా శానిటైజ్ చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనంతోపాటు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ జి.శ్రీదేవి బెంచ్లు భౌతికంగా కేసులను విచారిస్తాయి. హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలతోపాటు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి’’అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
న్యాయమూర్తుల అనవసర బదిలీలు
ఉద్యోగస్తులకి బదిలీలు సర్వ సామాన్యం. ఆరోపణలు వచ్చినా, మూడు సంవత్సరాలు గడిచినా ఆ ఉద్యోగిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకన్నా న్యాయమూర్తుల బదిలీలు క్రమబద్ధంగా జరు గుతూ ఉంటాయి. ప్రతి సంవ త్సరం ఏప్రిల్, మే నెలల్లో ఈ బదిలీలు తప్పక జరుగు తాయి. కోవిడ్–19 వచ్చిన తరువాత ఈ బదిలీల విష యంలో ప్రభుత్వాలు వెనుకంజ వేశాయి. కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఈ వార్షిక బదిలీలని నిలిపివేశాయి. మనదేశంలోని చాలా హైకోర్టులు కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాయి. అందులో ముఖ్యమైనవి తెలంగాణ, బాంబే, అలహా బాద్, మద్రాస్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా తీవ్రత లేని రాష్ట్రాలు కూడా ఈ సంవత్సరం సాధారణ బదిలీలను నిలిపివేశాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం న్యాయమూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ ఈ మధ్య గుండెపోటుతో మరణించారు. పని ఒత్తిడి వల్ల మరణించినాడని, కోవిడ్ వల్ల మర ణించాడని వార్తలు విన్పిస్తున్నాయి. అందులో ఏది వాస్తవమో మనకు తెలియదు. కరోనా విజృంభిస్తున్నవేళ, కోర్టులే వర్చువల్ కోర్టులుగా పనిచేస్తున్న సందర్భంలో న్యాయమూర్తుల బదిలీలు అవసరమా అన్న ప్రశ్నని చాలామంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, వెలి బుచ్చుతున్నారు. కొన్ని మాసాలపాటు కోవిడ్తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. లాక్డౌన్వల్ల, కొత్త పద్ధతులకి, న్యాయ మూర్తులు, సిబ్బంది అలవాటు పడే పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త వాతావరణానికి న్యాయమూర్తులు, సిబ్బంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఈ వాతావర ణంలో కోర్టులో కేసుల పరిష్కారం, కుటుంబ బాధ్యత, పిల్లల చదువు, ఆరోగ్యం లాంటి అంశాలతో న్యాయ మూర్తులు తల్లడిల్లుతున్నారు. ఈ దశలో న్యాయమూర్తులకి బదిలీలు వాళ్లని తెలియని ఒత్తిడికి గురిచేస్తాయి. కరోనా కాలంలో కొత్త ప్రాంతానికి వెళ్లడం, అక్కడ సర్దుబాటు కావడం సులువైన విషయం కాదు. సామాను సర్దుకోవడం చాలా కష్టమైన పని. దానికి పనివాళ్ళ సహాయం కావాలి. ప్యాకర్స్, మూవర్స్ అవసరం ఏర్పడుతుంది. కూరగాయలనే కడు గుతున్న కాలంలో సామానుని ఒక ఊరి నుంచి మరో ఊరికి తరలించడం కష్టసాధ్యమైన పని. లగేజీకి, అంటు వ్యాధి సంక్రమించకుండా చూసుకోవడం చాలా కష్టమైన పని. పిల్లల చదువూ, ఆరోగ్యం, తల్లిదండ్రుల బాధ్యత మధ్య న్యాయమూర్తులు సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత ఒత్తిడిలో ఉన్న న్యాయమూర్తులు తన విధు లని ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నని చాలామంది విజ్ఞులు లేవనెత్తుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా న్యాయ మూర్తులు నోరు విప్పరు. అలాంటి క్రమశిక్షణ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్స్ కూడా మాట్లాడటానికి జంకుతారు. మిగతా ఉద్యోగులు వేరు. న్యాయమూర్తులు వేరు. కిందికోర్టు న్యాయమూర్తులని అనవసర బదిలీల ద్వారా, అసౌకర్య బదిలీల ద్వారా బలిపశువులని చేస్తూ ఉంటారని సుప్రీంకోర్టు మింటూ మాలిక్ కేసులో (హైకోర్టు ఆఫ్ కలకత్తా వర్సెస్ మింటూ మాలిక్ మరియు ఇతరులు, స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) నెం. 24240/2019, తీర్పు తేదీ నవంబర్ 15, 2019) అభిప్రా యపడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, బి.ఆర్. గవాయ్లు ఈ తీర్పుని వెలువరించారు. న్యాయమూర్తులని బలిపశువులు చేసే విషయంలో సుప్రీంకోర్టు తన ఆందోళనని ఈ తీర్పులో వెలువ రించింది. ఈ కేసులో ఒక రైల్వే మేజిస్ట్రేట్ని నిర్బంధంగా పదవీ విరమణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులని ఆ న్యాయమూర్తి కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. ఆ న్యాయమూర్తిని తిరిగి విధుల్లో చేర్చుకోవా లని హైకోర్టులోని డివిజన్ బెంచ్ హైకోర్టుని ఆదేశిం చింది. అతను చేసిన చర్యలో చెడు నడవడిక లేదని సదు ద్దేశంతో అతను ఆ చర్యను చేశాడని హైకోర్టు అభి ప్రాయపడింది. ఆ మేజిస్ట్రేట్ ప్రయాణం చేసే రైలు తరచూ ఆల స్యంగా రావడానికి కారణం అనవసరంగా కొన్ని ప్రదే శాల్లో ఆపి, చట్ట వ్యతిరేకంగా కొన్ని వస్తువులని దింపడం. తన అధికార పరిధిలో చట్ట వ్యతిరేక పనులు జరగడం పట్ల ఆందోళన చెంది అతను ఆ రైల్వే ఉద్యోగుల మీద చర్య తీసుకుంటాడు. ఈ విషయం మీద హైకోర్టు విచా రణ జరిపి అతన్ని సస్పెండ్ చేసి, నిర్బంధంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలను అతను హైకోర్టులో సవాలు చేస్తే, అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని అదేవిధంగా లక్ష రూపాయలు అతనికి ఖర్చుల కింద ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టునే ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఇలా అభిప్రాయపడింది. ఈ రోజుల్లో న్యాయమూర్తులని బలిచేసే ట్రెండ్ ఒకటి మొదలైంది. అనవసర బదిలీల ద్వారా మరో విధమైన చర్యల ద్వారా న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు. న్యాయమూర్తులకి వ్యతిరేకంగా న్యాయవాదులు గానీ, ఇతరులు కానీ ధర్నాలు చేస్తే చాలు.. వారిని బది లీలు చేస్తున్నారు. అదేవిధంగా చర్యలు తీసుకుంటు న్నారు. న్యాయమూర్తుల తప్పు ఎంతవుందన్న ఆ విష యాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సాధారణ బదిలీల విషయంలో మింటూ మాలిక్ కేసులో మాదిరిగా చెడు నడవడిక, ధర్నాల ప్రస్తావన వుండదు. అలాంటి కేసులు ఒకటి అరా ఉండవచ్చేమో తెలియదు. కానీ, ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే ప్రక్రియ. ఈ కోవిడ్–19 కాలంలో అన్ని హైకోర్టుల మాదిరిగా బదిలీలను నిలిపివేస్తే న్యాయమూర్తులు అసౌక ర్యానికి, వేదనకి గురికాకుండా ఉంటారు. వ్యాసకర్త, మంగారి రాజేందర్ -
తెల్లరంగు దుస్తులు ధరించండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసుల విచారణకు హాజరయ్యే లాయర్లు కోట్లు, నల్లరంగు పొడవైన గౌన్లు వేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు లాయర్లందరూ ఈ సూచనని పాటించాలని బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. లాయర్లు వేసుకొనే పొడవైన గౌన్ల ద్వారా వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఈ గౌన్లు ధరించడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ‘వైద్యల సూచనలు, సలహాల మేరకు, కరోనాను కట్టడి చేయడానికి లాయర్లు, తెల్ల రంగు షర్టు, తెల్ల సల్వార్ కమీజ్, తెల్ల చీర, మెడచుట్టూ తెల్ల రంగు బ్యాండ్ ధరించాలి’ అని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వర్చువల్ సిస్టమ్ ద్వారా జరిగే విచారణకు హాజరయ్యే లాయర్లు తెల్ల రంగు దుస్తుల్లోనే రావాలని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు అందే వరకు కొత్త డ్రెస్ కోడ్ని అనుసరించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ ఎస్ కల్గోవాంకర్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
రిటైరైన వారికీ ఇవ్వాలి : పిటిషనర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా న్యాయవాదులకు కేటాయించిన ఫండ్ పిటిషన్పై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం న్యాయవాదులకు విడుదల చేసిన రూ.25 కోట్లు ప్రతి ఒక్కరికీ చెందాలని కోర్టుకు తెలిపారు. సీనియారిటీని ప్రాతిపదికలోకి తీసుకోకుండా ప్రతి ఒక్క న్యాయవాదికి డబ్బు చెల్లించాలని కోర్టును కోరారు. న్యాయవాదులకు రూ.25 కోట్లను ఏ ప్రాతిపదికన ఎంత ఇస్తున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సమాధానంగా ఏడు సంవత్సరాల లోపు అనుభవం ఉన్న న్యాయవాదులతో పాటు 20 వేల మంది క్లర్క్లకు అందజేయాలని భావిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయితే రిటైర్మెంట్ అయిన న్యాయవాదులకు కూడా వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. (రూ.100 కోట్లుకు వడ్డీని చెల్లించాలని పిల్) -
హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి,అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. మొత్తం ఆరుగురి పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో కృష్ణమోహన్, సురేష్ రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్రెడ్డి, జీఎల్ నర్సింహారావు, కె.మన్మథరావు ఉన్నారు. ఈ జాబితాపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపింది. బొప్పూడి కృష్ణమోహన్ గుంటూరులో 1965, ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లి.. సావిత్రి. తండ్రి.. బీఎస్ఆర్ ఆంజనేయులు జిల్లా జడ్జిగా పనిచేశారు. భార్య.. వసంత లక్ష్మి కూడా హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. కృష్ణమోహన్ 1988లో ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గుంటూరు జిల్లా కోర్టులో కొద్ది నెలల పాటు ప్రాక్టీస్ చేశారు. సీనియర్ న్యాయవాది కృష్ణ కిషోర్ వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. అదే ఏడాది హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. సీనియర్ న్యాయవాది త్రివిక్రమరావు వద్ద జూనియర్గా చేరారు. 1994లో సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ అడ్వొకేట్లలో ఒకరిగా ఉన్నారు. ఈయనకు నాటకాలంటే ఆసక్తి. చిన్నతనంలో పలు నాటకాలు వేశారు. 2019, జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఈయన. కంచిరెడ్డి సురేష్రెడ్డి అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో 1964, డిసెంబర్ 7న జన్మించారు. తండ్రి శంకర్రెడ్డి. తల్లి లక్ష్మీదేవమ్మ. అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989 సెప్టెంబర్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది టి.బాల్రెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. కొన్నేళ్ల తర్వాత సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. క్రిమినల్ లాలో మంచి పట్టు సాధించారు. హైకోర్టులో ఉన్న అతి తక్కువ మంది ఉత్తమ క్రిమినల్ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా మరణశిక్ష కేసులను వాదించడంలో దిట్ట. సివిల్, రాజ్యాంగపరమైన కేసులను కూడా వాదించారు. కన్నెగంటి లలితకుమారి లలిత కుమారి స్వగ్రామం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జములపాళెం. 1971, మే 5న జన్మించారు. తల్లి.. కె.అమరేశ్వరి, తండ్రి.. అంకమ్మ చౌదరి. 10వ తరగతి నుంచి మిగిలిన విద్యాభ్యాసమంతా హైదరాబాద్లో సాగింది. పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎంఆర్కే చౌదరి వద్ద జూనియర్ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత న్యాయవాదులు.. కె.హరినాథ్, ఒ.మనోహర్రెడ్డి వద్ద జూనియర్గా పనిచేశాక సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, దేవదాయ శాఖ, టీటీడీ, వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. -
న్యాయవాదులను ఆదుకోండి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అడ్వకేట్ మద్దికుంట లింగం నారాయణ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో అన్ని న్యాయస్థానాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో జూనియర్ లాయర్లు, నిరుపేద న్యాయవాదులు ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేరుగొప్ప ఊరు దిబ్బ చందంగా న్యాయవృత్తిలో కొనసాగుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వెల్లడించారు. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా కోర్టులు మూతపడటంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబ పోషణ భారమై ఎంతో న్యాయవాదులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో న్యాయవాదులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసిందని, జూనియర్ న్యాయవాదులకు రూ. 5 వేలు చొప్పున సహాయం అందించడానికి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తెలంగాణలో కూడా న్యాయవాదులను ఆదుకోవడానికి రూ.10 వేలు చొప్పున తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంలో స్పందించి న్యాయవాదులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని లింగం నారాయణ కోరారు. -
‘వారిని టీడీపీ టార్గెట్ చేస్తోంది’
సాక్షి, గుంటూరు: దళితులను అణచివేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని న్యాయవాదులు మండిపడ్డారు. శనివారం గుంటూరులో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ న్యాయవాదుల సమావేశంలో వారు టీడీపీ తీరుని దుయ్యబట్టారు. ‘అమరావతిలో దళిత ప్రజా ప్రతినిధులపై దాడులు - ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్న వైనం’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. దళిత ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని.. దళితులపై దాడి చేయడం దారుణమన్నారు. అమరావతిలో రైతుల ముసుగులో కొంత మంది చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కూడా దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత ప్రజా ప్రతినిధులను టీడీపీ టార్గెట్ చేస్తోందని విమర్శించారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని న్యాయవాదులు పేర్కొన్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.. ‘దళిత ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆయన నియంతలాగా పాలించారు. గతంలో ఏ ప్రభుత్వం న్యాయవాదులను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూనియర్ లాయర్లకు స్టైఫండ్ ఇస్తున్నారని’ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు సీఎం జగన్ నాణ్యమైన విద్య అందిస్తున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. -
ఆధార్ సంస్థ నోటిసులపై న్యాయపోరాటం చేస్తాం
-
జిఎన్ రావు కమిటీ నివేదిక స్వాగతించిన న్యాయవాదులు
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
‘న్యాయవాదులంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంబీల్లో న్యాయవాదులు పని చేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు కాదు రాజధాని నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా, బీకే వ్యాఖ్యలపై న్యాయవాదులు మండిపడుతున్నారు. తమను అవమానించేలా బీజే వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన వెంటనే తమకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వికేంద్రీకరణకు అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది. టీడీపీ నాయకులు సైతం మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
సీఎం వైఎస్ జగన్ ప్రకటనపై న్యాయవాదులు హర్షం
-
సమత నిందితుల తరఫున వాదించేందుకు నిరాకరణ
సాక్షి, ఆదిలాబాద్: సమతపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. ఈ కేసులోని నిందితుల రిమాండ్ ముగియడంతో జిల్లా జైలు నుంచి పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. వారి కేసును ఎవరు వాదించవద్దని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. న్యాయవాదులను నియమించుకునేందుకు నిందితులు కోర్టును మూడు రోజుల సమయం కోరారు. కాగా మంగళవారం ఉదయం 10గంటల వరకు గడువు ఇచ్చింది. నిందితులను పోలీసులు జుడీషియల్ కస్టడీకి తరలించారు. మంగళవారం తదుపరి విచారణ కోసం నిందితులను హాజరుపర్చనున్నారు. ఆదిలాబాద్లోని స్పెషల్ ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్ట్రాక్ కోర్టులో సమత కేసు నిందితులైన షేక్ బాబు, షేక్ శాబొద్దీన్, షేక్ ముగ్దుమ్లపై విచారణ జరగనుంది. జుడీషియల్ కస్టడీకి.. నిందితులపై లింగాపూర్ పోలీసులు 376–డి, 404, 312, 325, 3(2)(5)ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపర్చారు. జుడీషియల్ కస్టడీకి న్యాయస్థానం వారిని అప్పగించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి, సెల్ఫోన్, రూ.200లతో పాటు 72 రకాల వస్తువులను కోర్టులో పోలీసులు డిపాజిట్ చేశారు. వీటిలో సమత దుస్తులు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను పోలీసులు కోర్టులో డిపాజిట్ చేసినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. మొత్తం 44 మంది సాక్షులు.. ఒకవేళ న్యాయవాదులెవరూ కేసును వాదించేందుకు ముందుకు రాకపోతే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా, ప్రభుత్వం తరఫునుంచైనా న్యాయవాదిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మొత్తం 44 మంది సాక్షులను పోలీసులు సేకరించగా, రోజు కొంతమంది కోర్టులో హాజరుకానున్నట్లు సమాచారం. -
అది బూటకపు ఎన్కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్కౌంటర్గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని పిటిషనర్లు జి.ఎస్.మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిటిషన్లో కోరారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను అమలుచేయాల్సిందిగా ఆదేశించాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీలతోపాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్లను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ బృందంతో విచారణ జరిపించాలని విన్నవించారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’కేసులో జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం జారీచేసిన తీర్పులోని 16 మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించిందని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ(ఏపీసీఎల్సీ) కేసును కూడా ఈ పిటిషన్లో ఉదహరించారు. 2006లో నాటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్ అలియాస్ బుర్రా చెన్నయ్య సహా ఎనిమిది మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఫుల్ బెంచ్ విచారణ జరిపి ఫిబ్రవరి 6, 2009న తీర్పు ప్రకటించింది. ‘ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే, అధికార విధుల్లో భాగమైనప్పటికీ, ఆత్మరక్షణ కోసమైనప్పటికీ, సంబంధిత ఘటనకు దారితీసిన కారణాలను నిక్షిప్తం చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి..’అని ఆ తీర్పులో పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారించి జూలై 18, 2019న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’కేసులో జస్టిస్ లోధా ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కూడా ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇదే కోర్టు స్పష్టం చేసిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో గుర్తుచేసింది. ఆ తీర్పులోని 16 మార్గదర్శకాలు అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తాయంది. సెక్షన్ 157 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇతర పోలీస్స్టేషన్ అధికారులతో దర్యాప్తు జరిపించి, ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని జస్టిస్ లోధా తీర్పు స్పష్టంచేసింది. ఇలా సుప్రీం కోర్టు తీర్పును న్యాయవాదులు ప్రస్తావిస్తూ తాజాగా ‘దిశ’ కేసులోని నిందితుల ఎన్కౌంటర్కు బాధ్యులైన వారిపై విచారణకు ఆదేశించాలని సు్రíపీంకోర్టుకు నివేదించారు. -
‘న్యాయ సహాయం అందించం’
షాద్నగర్ రూరల్: దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులకు న్యాయ సహాయం అందించబోమని షాద్నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నడికూడ సత్యనారాయణ యాదవ్ మాట్లాడు తూ దిశ హత్య అమానుషమన్నారు. మానవ రూపంలో ఉన్న మృగాల వల్ల ఆడపిల్లలకు స్వేచ్ఛ లేకుండాపోయిందని వాపోయారు. నిందితులకు కఠినతరమైన శిక్ష అమలు చేస్తేనే ఇలాంటి తప్పు చేసేందుకు మరొకరు సాహసించరని అభిప్రాయపడ్డారు. ‘దిశ’మృతికి న్యాయవాదులు వేణుగోపాల్రావు, చెంది మహేందర్రెడ్డి, గుండుబావి శ్రీనివాస్రెడ్డి, పాతపల్లి కృష్ణారెడ్డి, బెన్నూరి చంద్రయ్య, నరేందర్, రమేశ్బాబు తదితరులు సంతాపం తెలిపారు. -
లాయర్లు, పోలీసుల్లో ఎవరు అధికులు!?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ జరిగి పది రోజులు గడుస్తున్నా న్యాయవాదులు ఇప్పటికీ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. నవంబర్ రెండవ తేదీ నాడు ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడడం, పలు వాహనాలు దగ్ధమవడం తెల్సిందే. ఆ రోజు తమపై దాడి జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈమధ్య వెలుగులోకి వచ్చిన ఆనాటి ఓ వీడియోను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందులో డిప్యూటీ పోలీసు కమిషనర్ మోనికా భరద్వాజ్ సహా కొంత మంది పోలీసులను ఓ లాయర్ల బృందం తరమడం కనిపించింది. అలాగే పలు పోలీసు వాహనాలకు లాయర్లు నిప్పు పెట్టడం కనిపించింది. మరో వీడియోలో నలుగురు పోలీసు అధికారుల వెంటపడగా రెండు చేతులు జోడించి ఆందోళన చేస్తున్న లాయర్లను మోనికా భరద్వాజ్ వేడుకోవడం, తన తుపాకీని ఎవరో కాజేశారంటూ తన సబార్డినేట్కు చెప్పుకోవడం కనిపించింది. ఆ తుపాకీ జాడ ఇప్పటికీ లేదు. నాటి ఘర్షణల్లో పది మంది పోలీసులు గాయపడినప్పటికీ, వీడియో సాక్ష్యాలు లభించినప్పటికీ ఇప్పటి వరకు సదరు న్యాయవాదులపై నమోదు చేయక పోవడం ఆశ్చర్యకరమైతే, న్యాయవాదులే ఇప్పటికీ ఆందోళన చేయడం మరింత ఆశ్చర్యకరం. ఇదే మొదటి సారి కాదు ఢిల్లీలో లాయర్లు, పోలీసులు ఘర్షణ పడడం ఇదే మొదటి సారి కాదు. 1988లో ప్రస్తుతం పుదుచ్ఛేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీ నార్త్ ఢిల్లీకి డిప్యూటి పోలీసు కమిషనర్గా ఉన్నప్పుడు ఓ లాయర్ను ఓ పోలీసు అధికారి అరెస్ట్ చేసినప్పుడు లాయర్లు పెద్ద గొడవ చేశారు. కిరణ్ బేడీ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆమె ఆఫీసులోకి దూసుకుపోయి ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఢిల్లీలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగడం చాలా సాధారణమని ఢిల్లీలో 1985 నుంచి 2004 వరకు పలు సీనియర్ పదవుల్లో పనిచేసిన రిటైర్డ్ పోలీసు మాక్సివెల్ పెరీరా తెలిపారు. 1980వ దశకంలో హత్య కేసులో ఓ న్యాయవాదే ప్రధాన నిందితుడని తేలినప్పటికీ ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఓ జడ్జీపై న్యాయవాదులు ఒత్తిడి చేసి సంతకం చేయించుకున్నారని ఆయన చెప్పారు. చట్టానికి లాయర్లు అతీతులు కానప్పటికీ ఢిల్లీ న్యాయ వ్యవస్థలో మాత్రం పక్షపాతం కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. లాయర్లు, పోలీసుల మధ్య ఢిల్లీలో నవంబర్ రెండవ తేదీన ఘర్షణ జరగ్గా, మూడవ తేదేనీ ఆ సంఘటనపై ప్రత్యేక విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులపై లాఠీచార్జి జరిపి, కాల్పులకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాల్సిందిగా పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ను ఆదేశించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత నవంబర్ ఏడవ తేదీన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ‘న్యాయవాదులకు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకోరు. ఏ అధికారం లేకుండా పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తారు. ఇదేమీ న్యాయమో అర్థం కావడం లేదు’ అని పెరీరా వ్యాఖ్యానించారు. తమకు న్యాయం జరగాలంటే నవంబర్ ఐదవ తేదీన పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు వేల సంఖ్యలో పోలీసు నిరసన ప్రదర్శన జరిపినా లాభం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా అబద్ధమని, జడ్జీలేమీ తమ పట్ల పక్షపాతం చూపడం లేదని, చట్ట ప్రకారమే వారు ఉత్తర్వులు జారీ చేశారని పాటియాలా హౌజ్ కోర్టులో గత 11 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అజయ్ కుమార్ ఖండించారు. సీనియర్ న్యాయవాది చిదంబరమే నేడు జైల్లో ఉన్నారని, నేరం చేసినప్పుడు మాత్రమే ఎవరైనా జైలుకు వెళతారని ఆయన వ్యాఖ్యానించారు. లాయర్ల వద్ద ఎలాంటి అధికారం లేదని, పోలీసుల వద్ద అధికారం ఉంది కనుకనే వారి వద్ద ఆయుధాలు, కర్రలు ఉన్నాయని మరో సీనియర్ న్యాయవాది యోగేంద్ర సింగ్ తోమర్ మీడియాతో వ్యాఖ్యానించారు. వీడియోల గురించి ప్రస్తావించగా, అవి ఏకపక్షంగా తీసిన వీడియోలని చాలా మంది న్యాయవాదులు ఖండించారు. -
పోలీసుల పోరు!
దేశ రాజధాని మంగళవారం విస్తుపోయింది. పదకొండు గంటలపాటే కావొచ్చుగానీ... ఎప్పుడూ ఆందోళనలను, నిరసనలను అణచడం కోసం రంగంలోకి దిగే పోలీసులు ఈసారి తామే ఆందోళన చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించారు. వారి కుటుంబసభ్యులను సైతం రంగంలోకి దించి న్యూఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తి నినాదాలు చేశారు. తమను సముదాయించడానికొచ్చిన ఉన్నతాధికారులను ‘గో బ్యాక్..గోబ్యాక్’ అంటూ తృణీకరించారు. ఇంత ఆందోళనకు కారణం ఈ నెల 2న ఢిల్లీలోని తీస్హజారి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదు లకూ, పోలీసులకూ మధ్య తలెత్తిన వివాదం. ఒక వాహనాన్ని పార్క్ చేయడం దగ్గర రాజుకున్న వివాదం చూస్తుండగానే ముదిరి రెండు వర్గాలూ కొట్టుకునే స్థాయికి చేరింది. అటు న్యాయ వాదులు, ఇటు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమ య్యాయి. పోలీసులు కాల్పులు కూడా జరిపారు. పోలీస్ పిస్తోలు కూడా మాయమైందంటున్నారు. శనివారం జరిగిన ఈ గలాటా ఆదివారంనాడు ఢిల్లీ హైకోర్టు ముందుకెళ్లింది. ఇద్దరు ఏఎస్ఐ స్థాయి అధికారుల సస్పెన్షన్కు ఆదేశాలివ్వడంతోపాటు అదనపు డీసీపీని, స్పెషల్ కమిషనర్ను బదిలీ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. జరిగిన ఉదంతంపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేశారు. న్యాయవాదులపై మళ్లీ ఆదేశాలిచ్చేవరకూ చర్యలు తీసుకోవద్దన్నారు. ఈ ఆదే శాలన్నీ న్యాయవాదులకు ఉపశమనం కలిగించేవే. సాధారణంగా అయితే ఇక్కడితో అంతా సద్దు మణిగేది. కానీ అంతవరకూ బాధితులుగా కనబడ్డ న్యాయవాదుల పరిస్థితి సామాజిక మాధ్య మాల్లో ప్రచారంలోకొచ్చిన కొన్ని దృశ్యాల పర్యవసానంగా తిరగబడింది. న్యాయవాదులు తీస్ హజారి కోర్టు లాకప్పైకి దూసుకెళ్లి ఒకరిద్దరు కానిస్టేబుళ్లను చితకబాదడం, అక్కడున్న ఫర్నీచర్ను ధ్వంసం చేయడం వగైరాలన్నీ ఆ దృశ్యాల్లో ఉన్నాయి. అంతేకాదు... సోమవారం కోర్టుకు రికార్డు సమర్పించడానికెళ్లిన కానిస్టేబుల్పై కొందరు న్యాయవాదులు అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించినరోజే పోలీసులు కూడా తమపై జరిగిన దౌర్జన్యం గురించి చెబితే వేరేవిధంగా ఉండేదేమో! కానీ ఈ దృశ్యాలు బయ టపడేవరకూ వారికి కూడా జరిగిన ఘటనపై స్పష్టత లేనట్టు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన దృశ్యాలు న్యాయవాదుల ప్రతిష్టను పెంచవు. పోలీసుల వల్ల వారికి అన్యాయమే జరిగి ఉండొచ్చు. న్యాయవాదులు కూడా సంయమనం కోల్పోయి రౌడీయిజానికి దిగడం సమస్య పరి ష్కారానికి దోహదపడదు. ఒక చిన్న వివాదాన్ని పరిష్కరించుకోవటంలో ఇరువర్గాల్లోనూ చాక చక్యం లోపించి ఇదంతా సంక్లిష్ట వ్యవహారంగా మారింది. దేశ రాజధానిలో పోలీసులే ఆందోళనకు దిగడం పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆ నగరంలో శాంతిభద్రతల వ్యవహారాలు చూసే కేంద్ర హోంశాఖను కూడా ఇరకాటంలో పడేసింది. రెండు వర్గాల మధ్య విశ్వసనీయత కొరవడటం ఈ ఉదంతంలో ప్రధాన సమస్య. న్యాయ వాదులు–పోలీసుల మధ్య మాత్రమే కాదు... పోలీసులకూ, పోలీసు ఉన్నతాధికారులకూ మధ్య కూడా సంబంధాలు సక్రమంగా లేవని ఢిల్లీ ఉదంతం చెబుతోంది. ఒకపక్క తమ సహచరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సమయంలోనేæ కొందరు న్యాయవాదులు దౌర్జన్యానికి దిగి తాము కూడా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడంలో ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఇదే ఢిల్లీలో గతంలో పాత్రికేయులపై కూడా వారు దౌర్జన్యానికి దిగారు. తాజా ఉదంతంలో పోలీసులు సైతం తమ విధి నిర్వహణ రీత్యా క్రమశిక్షణతో మెలగవలసి ఉండగా అందుకు భిన్నంగా ప్రవర్తించారు. కేటా యించిన స్థలంలో కాక వేరే చోట న్యాయవాది వాహనం ఉంచటం పరిష్కరించవీలులేనంత పెద్ద సమస్యా? గోటితో పోయేదానికి గొడ్డలి తీసుకెళ్లినట్టు న్యాయవాదులతో అంత దురుసుగా ప్రవ ర్తించడం అవసరమా? శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రాథమిక కర్తవ్యం అన్న సంగతిని పోలీ సులు గుర్తుంచుకుంటే ఇలా దురుసుగా ప్రవర్తించి చిన్న వివాదాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చేవారు కాదు. తీస్హజారి కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఎలాంటి నిబంధనలూ పాటిం చరని, భద్రతా తనిఖీలను సైతం ఖాతరు చేయరని ఎప్పటినుంచో పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆ అవరణను తమ సొంతాస్తిగా న్యాయవాదులు భావిస్తారన్నది వారి ప్రధాన ఫిర్యాదు. తీస్హజారి కోర్టు, న్యాయవాదులు–పోలీసుల ఘర్షణ అనగానే ఎవరికైనా 1988నాటి ఉదంతం గుర్తుకొస్తుంది. కిరణ్ బేడీ గుర్తొస్తారు. అప్పట్లో ఒక న్యాయవాదిని దొంగతనం ఆరోపణతో అరెస్టు చేసిన పోలీ సులు ఆయనకు సంకెళ్లు వేసి న్యాయస్థానానికి తీసుకురావడం వివాదానికి మూలం. ఈ కేసులో న్యాయవాదికి మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ వెంటనే బెయిల్ మంజూరు చేయడంతోపాటు సంకెళ్లు వేసిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. న్యాయవాదికి సంకెళ్లు వేయడాన్ని కిరణ్బేడీ సమర్థించడం, న్యాయవాదుల ఆందోళన అణచడానికి బలప్రయోగా నికి దిగడం పరిస్థితిని దిగజార్చింది. రెండు నెలలపాటు కోర్టులు స్తంభించిపోయాయి. దాని ప్రభావం ఎంతగా ఉందంటే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిరణ్బేడీని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించినప్పుడు ఆరు జిల్లాల్లోని న్యాయవాదులంతా ఏకమై ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రత్యర్థిగా కిరణ్ బేడీ ఆగమనం కూడా ఆప్ ఘనవిజయానికి ఒక కారణం. శాంతి భద్రతల పరిరక్షణకు తమపై ఆధారపడే ప్రభుత్వాలు, ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో తమకు రక్షణగా నిలబడవన్నది పోలీసులు ఎప్పటినుంచో చేస్తున్న ఫిర్యాదు. జరిగిన ఉదంతం విషయంలో పోలీసుల అసంతృప్తిని సకాలంలో పసిగట్టలేకపోవడం ఉన్నతాధికారగణం వైఫల్యం. కనీసం ఇకముందైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఏం చర్యలు అవసరమో వారు గ్రహించాలి. -
వకీల్ వర్సెస్ ఖాకీ: కిరణ్బేడీ మళ్లీ రావాలి!!
న్యూఢిల్లీ : పార్కింగ్ విషయంలో ఢిల్లీ పోలీసులు, న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. న్యాయవాదుల తీరును నిరసిస్తూ పోలీసులు ఆందోళన బాట పట్టారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద తమకు న్యాయం చేయాలన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. శనివారం నాటి ఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ చూసి తప్పెవరిదో తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిరసనకు ఐపీఎస్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా పెద్దఎత్తున వీరికి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళన విరమించాలని ఉన్నతాధికారులు కోరుతున్నప్పటికీ తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించే వరకు ఆందోళన ఆపేది లేదని, దీనిపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను కమిషనర్ పట్నాయక్ కేంద్ర హోంశాఖ అధికారులకు వివరించారు. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఆదివారం విచారణ చేపట్టి, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు) సంజయ్ సింగ్ను సస్పెండ్ చేయడంతోపాటు పలువురు పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. బార్ కౌన్సిల్ సభ్యులకు ఢిల్లీ హైకోర్టు సమన్లు పంపింది. గొడవ మొదలైంది ఇలా..! తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్లకు మధ్య శనివారం గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్లకు కూడా గాయపడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను బాధించింది. అదేవిధంగా సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు. ఘర్షణకు పోలీసుల తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే న్యాయంకోసం ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే, తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. అసాధారణరీతిలో రోడ్లపైకి రావడమే కాకుండా.. ఏకంగా పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుటే ఆందోళన చేపట్టారు. విధుల్లోకి రావాలంటూ సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి పోలీసులు నిరసనలు నిలిపివేయాలని కమిషనర్ పట్నాయక్ కోరారు. సోమవారం కూడా పోలీసులపై లాయర్లు దాడి చేయడం అనేది క్షమించరానిదన్న కమిషనర్ దీనిపై చట్టపరంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. సంఘటన జరిగిన వెంటనే కొంతమంది పోలీసులు మాత్రమే నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించడంతో వందల సంఖ్యలో పోలీసులు తమ విధులకు బ్రేక్ ఇచ్చి పోలీస్ హెడ్క్వార్టర్స్కు చేరుకుని గొంతును కలిపారు. ఉన్నతాధికారులు స్పందించేవరకు వెనక్కి తగ్గేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటగంటకు నిరసనలో పాల్గొనే పోలీసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాకుండా ఒక మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసివేయడం జరిగింది. కిరణ్ బేడీ మళ్లీ రావాలి అంటూ పోలీసుల నినాదాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నిరసనకు దిగిన పోలీసు సిబ్బంది.. ఢిల్లీ సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. సీపీ అంటే ఎలా ఉండాలి.. కిరణ్ బేడీలా ఉండాలి అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ గా మీరే కావాలంటూ దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ ఫొటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని తమ బాధను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామని కొంతమంది పోలీసులు చెప్పారు. న్యాయవృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే సామాన్య ప్రజలు తమను లెక్కచేస్తారా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
నకిలీ దందాకు చెక్..13 మంది అరెస్టు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో జరుగుతున్న నకిలీ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నకిలీ ఆధార్, డాక్యుమెంట్స్, స్టాంప్స్ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. కోర్టులనే మోసం చేస్తూ న్యాయవాదుల సహకారంతో ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు పూచీకత్తు ఇచ్చే సమయంలో నకిలీ పత్రాలు సమర్పిస్తున్నట్లు, దాదాపు 150కిపైగా కేసులలో నకిలీ ప్రతాలను న్యాయవాదులు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నలుగురైదుగురు న్యాయవాదుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అత్యధికంగా గంజాయి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసలలో నకిలీ దందా సాగిస్తున్నట్లు, గంజాయి కేసులో పూచీకత్తులకు 20 వేలు, రోడ్డు ప్రమాద కేసులో 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో కోర్టులను మోసం చేసి నిందితులను రక్షించారని, ఇతర రాష్ట్రాల నిందితులకు పూచీకత్తు కోసం నకిలీ పత్రాలు సృష్టించారని వెల్లడించారు. ఈ వ్యవహారం నాలుగు సంవత్సరాలుగా సాగుతోందన్నారు. గత భూదందా కేసులో రికార్డులు తారుమారుపై ఈ ముఠా పాత్ర ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నమని తెలిపారు. అరెస్టు చేసిన 13 మందిలో ఒక రౌడీషీటర్ ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. -
డిసెంబర్ 3న ‘వైఎస్సార్ లా నేస్తం’ ప్రారంభం
-
మరో హామీ అమలుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. ప్రాక్టీస్లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్లో నమోదైన న్యాయవాదులు 61వేల మంది ఉన్నారు. ఏటా కొత్తగా 1,500 మంది ఎన్రోల్ అవుతున్నారు. దరఖాస్తు... https://ysrlawnestham.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు ఆధార్ నంబర్ను జత చేయాలి. స్టైఫండ్ ఏ బ్యాంకు ఖాతాలో జమ కావాలని కోరుకుంటున్నారో ఆ వివరాలు అందజేయాలి. పరిశీలన.. మంజూరు వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ కమిషనర్లు గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ/వార్డు వలంటీర్లకు పంపుతారు. వీరి పరిశీలనలో దరఖాస్తు సరైనదేనని తేలిన తరువాత, జిల్లా కలెక్టర్ ఆమోదం తీసుకుని ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తారు. సోషల్ ఆడిట్ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ప్రదర్శిస్తారు. అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్ను జమ చేస్తారు. రశీదును వార్డు వలంటీర్ ఇంటికి తెచ్చి ఇస్తాడు. అర్హతలు.. దరఖాస్తుదారు న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. 2016, ఆ తరువాత ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే స్టైఫండ్ కు అర్హులు. న్యాయవాద చట్టం సెక్షన్ 22 కింద ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ జారీ చేసిన నాటి నుంచి తొలి మూడేళ్ల ప్రాక్టీస్ను లెక్కిస్తారు. ఈ జీవో జారీ అయ్యే నాటికి ప్రాక్టీస్ ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్కు అర్హులవుతారు. దరఖాస్తుదారు తాను ఇంకా ప్రాక్టీస్లో కొనసాగుతున్నానని 15 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాది, లేదా సంబంధిత బార్ అసోసియేషన్, లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్ సమర్పించాలి. న్యాయవాదిగా నమోదైన తరువాత, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల లోపు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ను సమర్పించాలి. దరఖాస్తుదారు న్యాయవాద వృత్తిని విడిచి వెళ్లినా, మరో ఉద్యోగం సంపాదించినా, ఆ విషయాన్ని ఆన్లైన్ ద్వారా రిజిస్టరింగ్ అథారిటీకి తెలియచేయాలి. ఒకే కుటుంబం.. ఒకే ప్రయోజనం కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్టైఫండ్ను అందచేస్తారు. ప్రతీ దరఖాస్తుదారు కూడా ఆధార్కార్డు కలిగి ఉండాలి. అనర్హతలు.. ఈ జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాది వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. నాలుగు చక్రాల వాహనం ఉన్న జూనియర్ న్యాయవాది స్టైఫండ్కు అనర్హుడు. న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకుని, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులే. బార్ కౌన్సిల్ హర్షం... జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్ చెల్లించేలా ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల తరఫున ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత
-
హైకోర్టులో న్యాయవాదుల నిరసన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ను పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు విధులను బహిష్కరించడంతో బుధవారం హైకోర్టు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రంలోని పలు కింది కోర్టుల్లోనూ ఇలాగే విధుల బహిష్కరణ జరిగింది. ఉదయం హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే న్యాయవాదులందరూ ప్రతీ కోర్టు హాలుకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. దీంతో న్యాయమూర్తులందరూ బెంచీలు దిగి తమ చాంబర్లకు వెళ్లిపోయారు. అనంతరం జస్టిస్ సంజయ్కుమార్ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైకోర్టు న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం మరోసారి జరిగింది. సోమవారం తమ కార్యాచరణను ప్రకటిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్రెడ్డి తెలిపారు. సుప్రీం సీజేను కలిసే ప్రయత్నాలు.. జస్టిస్ సంజయ్కుమార్ బదిలీ విషయంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం, సీనియర్ న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ను కలవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రపతి, న్యాయ మంత్రిని కూడా కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆందోళన విషయాన్ని సిటీ సివిల్ కోర్డు చీఫ్ జడ్జికి తెలియజేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా బుద్వేలు గ్రామానికి హైకోర్టు తరలించాలని, ఆ గ్రామంలో హైకోర్టుకు కొత్త భవనాలు నిర్మించాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు పరిరక్షణ సమితి పేరిట న్యాయవాదుల నిరసన కార్యక్రమం అయిదో రోజు బుధవారం కూడా కొనసాగింది. తరలింపు ఇప్పట్లో జరగదని, న్యాయవాదులకు కొత్త చాంబర్లు నిర్మిస్తామని ప్రధాన న్యాయమూర్తిని కలసినప్పుడు తమకు చెప్పారని న్యాయవాదులు తెలిపారు. ఏపీలో నేడు, రేపు విధులకు గైర్హాజరు.. జస్టిస్ సంజయ్కుమార్ బదిలీని రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం సమావేశం కోరింది. గురు, శుక్రవారాలు 2 రోజులు కోర్టులకు హాజరుకారాదని నిర్ణయించింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ బదిలీ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సమావేశం కోరింది. -
రెండవ రోజు హైకోర్టు న్యాయవాదుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. బదిలీలకు నిరసనగా బుధవారం తెలంగాణ హెకోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. శనివారం వరకు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులను బహిష్కరించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. జస్టీస్ సంజయ్ కుమార్ను వెంటనే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ జస్టీస్ సంజయ్ కుమార్ను పంజాబ్, హర్యానా కోర్ట్కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. -
బదిలీ సిఫారసుపై న్యాయవాదుల భగ్గు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ సంజయ్కుమార్ బదిలీ సిఫా రసు నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళవారం అత్యవసరంగా ఏర్పా టు చేసిన సర్వసభ్య సమావేశానికి భారీస్థాయిలో న్యాయవాదులు పాల్గొన్నారు. కొలీజియం నిర్ణయానికి నిరసనగా మంగళవారం నుంచి శనివారం (3 నుంచి 7) వరకు కోర్టు విధులను బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. 4 నుంచి 7వ రకు విధులను బహిష్కరించాలని కింది కోర్టు ల న్యాయవాద సంఘాలను సైతం హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. ఇటు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కూడా జస్టిస్ సంజయ్కుమార్కు అండగా నిలవాలని నిర్ణ యించింది. సుప్రీంకోర్టులో పిల్కు తీర్మానం.. సీనియర్ న్యాయవాదుల నేతృత్వంలోని సంఘం కార్యవర్గం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియంలోని ఇతర న్యాయమూర్తులను కలవాలని కూడా తీర్మానించారు. ఇటు రాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కలవాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల నియామకాలు, ప్రధాన న్యాయమూర్తిగా పదో న్నతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిం చే విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల ఖాళీలన్నింటినీ భర్తీ చేసే వరకు ఏ హైకోర్టు నుంచి కూడా న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయరాదని సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. బదిలీ అన్యాయం: టి.సూర్యకరణ్రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ‘నెంబర్ టు స్థానంలోని న్యాయమూర్తిని అదే స్థానంలో మరో హైకోర్టుకు బదిలీ చేస్తే ఎవరికీ అభ్యంతరముండదు. 12వ స్థానంలో ఉండే లా బదిలీ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఏఆరోపణలు లేని జస్టిస్ సంజయ్కుమార్ను ఇలా బదిలీ చేయడం సరికాదు. 3 రాష్ట్రాల సీజేలు జస్టిస్ సంజయ్కుమార్ కంటే జూనియర్లు. జస్టిస్ సంజయ్కుమార్కు సీజేగా పదో న్నతి ఇవ్వకపోవడం అన్యాయమైతే ఇప్పు డు జూనియర్గా బదిలీ చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే..’ -
జస్టిస్ సంజయ్ బదిలీపై న్యాయవాదుల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ను పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేశారు. విధులను బహిష్కరించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు నిరసన తెలిపారు. శనివారం వరుకు రాష్ట్ర్రవాప్తంగా ఉన్న అన్ని కోర్టులను న్యాయవాదులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ తీర్మానించింది. సంజయ్ కుమార్ను తక్షణమే తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మరొకవైపు హైకోర్టు బిల్డింగ్ను తరలించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని హైకోర్టు పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ గేట్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. -
‘తెలంగాణ హైకోర్టును తరలిస్తే ఉరుకోం’
సాక్షి, హైదరాబాద్ : వంద ఏళ్ల చరిత్ర కలిగిన హైకోర్టును తరలిస్తే ఉరుకోమంటూ తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు హెచ్చరించారు. హైకోర్టును బద్వేల్కు తరలించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా లాయర్లు రెండవ రోజు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ ప్రతిపాదనల పేపర్లను న్యాయవాదులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టును తరలిస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని, అన్ని కోర్టుల్లో కార్యకలాపాలను స్తంభింపజేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే మరో తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని న్యాయవాదులు హెచ్చరించారు. -
ధైర్యం, నైతిక విలువలతో మంచి విజయాలు
హైదరాబాద్: నమ్మకం, ధైర్యం, నైతిక విలువలు పాటించడం ద్వారా న్యాయవాదులుగా మంచి విజయాలను సాధించవచ్చని హైకోర్టు (ఏసీజే) ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ పేర్కొన్నారు. శామీర్పేట్ గ్రామ పరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన ఐదు రోజుల న్యాయవాదుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులు చిరునవ్వుతోనే జయాపజయాలు సాధించవచ్చన్నారు. న్యాయవాదులు తన రోజువారీ వృత్తిలో భాగంగా కేసు పూర్వాపరాలకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోనే విధంగా వ్యాజ్యాన్ని నివేదించేందుకు ప్రాథమికంగా పాటించాల్సిన విషయాలను వివరించారు. ప్రతీ న్యాయవాది సమాజానికి ఒక బోధకుడిగా ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం కేటాయించిన కార్పస్ ఫండ్పై వచ్చిన వడ్డీతో న్యాయవాదులకు ఆరోగ్యబీమా, ఆర్థిక సహా యం వంటి పలు సహకారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న న్యాయవాదులకు ప్రతి ఒక్కరికి రూ.10వేలు ఆర్థిక సహాయంతోపాటు పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ట్రస్టు చైర్మన్, అడ్వొకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్, యువన్యాయవాదులనుద్దేశించి పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో ట్రస్టు సలహాసభ్యులు మోహన్రావు, నల్సార్ రిజిస్ట్రార్ బాలక్రిష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు మహమ్మద్ అలీ, బాబా తెల్కర్, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువరానర్..కాదు కాదు.. అధ్యక్షా..!
సాక్షి, గుంటూరు: న్యాయ శాస్త్రం చదివి కోర్టులో కేసులు వాదించాల్సిన జిల్లాకు చెందిన అనేక మంది న్యాయవాదులు రాజకీయాల్లో ప్రవేశించి చక్కగా రాణిస్తూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తమదైన గుర్తింపు పొందారు. జిల్లాకు చెందిన సుమారు 20 మంది న్యాయవాదులు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పదవులు అలంకరించి జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. 20 మందిలో ఏడుగురు ఎంపీలుగా గెలిచారు. వీరిలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మిగతా 14 మంది ఎమ్మెల్యేలుగా... వీరిలో కొందరు రాష్ట్ర మంత్రులుగా కూడా పని చేశారు. - నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి లా చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మొట్టమొదటిసారిగా ఫిరంగిపురం నుంచి ఎమ్మెల్యేగా రెండు దఫాలు ఎన్నికయ్యారు. అనంతరం నరసరావుపేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఈయన కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానమైన ఏఐసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఈయన న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు కూడా గురజాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి 2004, 2009 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - దుగ్గిరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అనంతరం మంత్రిగా పనిచేసిన ఆలపాటి ధర్మారావు సైతం న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - వేమూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా యడ్లపాటి వెంకట్రావు మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. ఈయనా న్యాయవాద వృత్తి నుంచి వచ్చినవారే. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన కోన ప్రభాకరరావు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రమంత్రిగా, శాసనసభ స్పీకర్గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్గా పని చేశారు. - కొత్త రఘురామయ్య గుంటూరులో న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. - సలగల బెంజిమెన్, సింగం బసవపున్నయ్య, ఎస్.వి.ఎల్.నరసింహారావు, ముప్పలనేని శేషగిరిరావు, నిశ్శంకరరావు వెంకటరత్నం, మోదుగుల వేణుగోపాల్రెడ్డి న్యాయవాద వృత్తి నుంచి ఎంపీలుగా గెలుపొంది నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యాన్ని కనబర్చారు. - జిల్లాకు చెందిన గాదె వీరాంజనేయశర్మ, గంగినేని వెంకటేశ్వరరావు, నల్లపాటి వెంకటరామయ్య, అంబటి రాంబాబు, నక్కా ఆనందబాబు, మర్రి రాజశేఖర్ కూడా న్యాయవాదులుగా కొనసాగుతూ రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. -
సమస్యల పరిష్కారం కోసం లాయర్లు ర్యాలీ
-
సమస్యల పరిష్కారం కోసం రోడెక్కిన లాయర్లు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్భవన్ వరకు న్యాయవాదులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గవర్నర్ నరసింహన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్తోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించి.. లాయర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. న్యాయవాదుల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో రూ. ఐదువేల కోట్ల కేటాయించాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. పదివేల చొప్పున ఉపకార వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
నాంపల్లి కోర్టు వద్ద న్యాయవాదుల ధర్నా
-
హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీపై కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న పలు వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా ఉమ్మడి హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ సొసైటీ కార్యకలాపాల పర్యవేక్షణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ పి.కేశవరావులకు ఈ కమిటీలో స్థానం కల్పించింది. సొసైటీ అకౌంట్ల పరిశీలనకు న్యాయవాదులు వేదుల శ్రీనివాస్, ఎస్.మమతలతో ఏర్పాటు చేసిన కమిటీ తన బాధ్యతలను పూర్తి చేసి, రెండు నెలల్లో తన నివేదికను జడ్జీల కమిటీకి అప్పగించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ కమిటీ నివేదికను బట్టి జడ్జీల కమిటీ తదుపరి తగిన ఆదేశాలు జారీ చేయవచ్చునంది. సొసైటీ మేనేజింగ్ కమిటీలోని సభ్యులు ఎవరైనా ఏ రకమైన దుర్వినియోగానికి పాల్పడి ఉంటే, వారిపై ఐపీసీ, సహకార చట్ట నిబంధనల మేరకు మూడు నెలల్లో తగిన చర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రికార్డులన్నింటినీ కూడా రిజిష్ట్రార్ జనరల్ చేత నియమితులయ్యే అధికారికి అప్పగించాలని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. లేఔట్ అమలు విషయంలో జడ్జీల కమిటీ అనుమతితో సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవచ్చునంది. ప్లాట్ల కేటాయింపు విధానం, సభ్యులు చెల్లించిన లేఔట్ అభివృద్ధి చార్జీలు తదితర వివరాలను జడ్జీల కమిటీకి, సొసైటీ సభ్యులకు అందచేయాలని ప్రస్తుత హౌసింగ్ సొసైటీ పాలకవర్గాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ ముందుంచిన లేఔట్, భవన ప్లాన్లను జడ్జీల కమిటీ ముందు ఉంచి, వాటిని ఆ కమిటీ సలహా మేరకు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆర్జీ... ఉద్యోగులపైఓ కన్నేసి ఉంచండి.. ఏ వ్యక్తి నుంచి రూ.5వేలకు మించి నగదును తీసుకోవడానికి గానీ, చెల్లింపులు చేయడానికిగానీ వీల్లేదని కమిటీ పాలకవర్గానికి హైకోర్టు తేల్చి చెప్పింది. జడ్జీల కమిటీని సంప్రదించి ఓ చార్టర్డ్ అకౌంటెంట్ను నియమించుకోవాలని ఆదేశించింది. చెల్లింపులు, స్వీకరణల ఖాతాలను సిద్ధం చేయాలంది, మూడు, ఆరు నెలలతో పాటు వార్షిక ఆడిట్ నివేదికలను సిద్ధం చేసి, వాటిని డిస్ప్లే బోర్డులో ఉంచాలంది. లేఔట్ అభివృద్ధి, తదితర పనులపై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ను వేర్వేరు ఏజెన్సీల నుంచి తెప్పించుకోవాలని, అంతిమంగా జడ్జీల కమిటీ ఆమోదించిన వారికి పనులు అప్పగించాలంది. సభ్యులకు కేటాయించిన ప్లాట్లలో నిర్మాణాలను హౌసింగ్ సొసైటీ చేపట్టడానికి వీల్లేదంది. కేటాయించిన ప్లాట్లను ఉపయోగించుకునే విషయంలో సభ్యులకు స్వేచ్ఛనివ్వాలంది. సొసైటీకి హైకోర్టు ప్రాంగణంలో కేటాయించిన కార్యాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని, కోర్టు పని గంటల్లో సొసైటీ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. ఈ విషయంలో ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలని రిజిష్ట్రార్ జనరల్ (ఆర్జీ)ను ఆదేశించింది. ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోండి... అర్హులైన పలువురికి సొసైటీలో సభ్యత్వం ఇవ్వలేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం కేటాయించిన స్థలం పక్కనే ఏదైనా స్థలం ఖాళీగా ఉంటే దానిని కేటాయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకోవాలని సొసైటీకి స్పష్టం చేసింది. స్థలం కేటాయింపు విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చునంది. తాము ఆదేశించిన మేర ప్లాట్ల కేటాయింపులు, లేఔట్ అభివృద్ధి సంతృప్తికరంగా జరుగుతుంటే, జడ్జీల కమిటీ పక్కకు జరిగి, ఎన్నిౖకైన పాలకవర్గాలు స్వతంత్రంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక దృష్టి సారించిన సీజే రాధాకృష్ణన్... హైకోర్టు ఉద్యోగులకు 2010లో ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగింది. అంతకు ముందే ఏపీ హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ ఏర్పాటు జరిగింది. స్థలాల కేటాయింపు జరగడానికి ముందే సొసైటీ బైలాను సవరించడంపై 2007లో కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్థలం కేటాయింపు జరిగిన తరువాత వివాదాలు మరింత ముదిరాయి. ఆ తరువాత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. వీటన్నింటిపై పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఉమ్మడి హైకోర్టు సీజేగా వచ్చిన జస్టిస్ రాధాకృష్ణన్ ఈ మొత్తం వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సొసైటీలో చోటు చేసుకున్న అన్ని పరిణామాలను పాలనాపరంగా తెలుసుకున్నారు. ఈ వివాదాలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల వాదనలు విని తీర్పు వెలువరించింది. -
న్యాయప్రతిష్టను కాపాడాలి
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని కేంద్రంగా కొత్తగా కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తన తొలి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హైకోర్టు(10 కోర్టు హాల్స్)లోని మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోర్టు హాలు చిన్నది కావడంతో న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. న్యాయవాదులనుద్దేశించి మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదులు(బార్), న్యాయమూర్తులు (బెంచ్) కలిసి పనిచేస్తేనే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. న్యాయప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత బార్ అండ్ బెంచ్పై ఉందన్నారు. కేసుల విచారణలో న్యాయవాదుల సహకారం లేకుండా న్యాయమూర్తులు ఏమీ చేయలేరన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలగలమని న్యాయవాదులకు ఉద్బోధించారు. సామాజిక న్యాయస్థానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే విషయంలో ఎంతమాత్రం వెనుకడుగు వేయరాదన్నారు. -
హైకోర్టు విభజన తీరు సరిగా లేదు
సాక్షి, అమరావతి: హైకోర్టు విభజన తీరు సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం ఇవ్వకుండా జనవరి ఒకటినే వెళ్లిపోవాలనడంతో న్యాయవాదులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. డిసెంబర్ 15 కల్లా కోర్టు భవనం పూర్తవుతుందని తాము చెప్పిన మాట నిజమేనని అయినా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అన్నింటినీ తరలించడం కష్టమవుతుందన్నారు. సమయం ఇవ్వకుండా నాలుగు రోజుల్లోనే అంతా వెళ్లిపోవాలని చెప్పారని, ఉద్యోగులు వెళ్లడానికి మానసికంగా సిద్ధం కావాలి కదా అని ప్రశ్నించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సాంస్కృతిక శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయవాడ క్యాంపు కార్యాలయం, సమీపంలోనే ఆర్అండ్బీ భవనంలో ఫైళ్లు, ఇతర కార్యాలయాలకు వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జడ్జిలు, న్యాయాధికారులకు హోటళ్లు, అపార్టుమెంట్లు, విల్లాల్లో వసతి చూస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసుల విచారణలో జాప్యం చేసేందుకే హైకోర్టు విభజన జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్టు విభజన వల్ల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. సీబీఐ కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని అప్పుడు విచారణ ప్రక్రియ మొదటికొస్తుందని చెప్పారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని, రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ ఉత్సవ్లో ఎయిర్ షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. కేంద్రం ఇప్పుడు రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటేనని ఆరోపించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ సమాచారం పలు ప్రెస్మీట్లు, ఇతర సమావేశాల్లో అన్ని విషయాలు కేంద్రానికి చెప్పామన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై వైఎస్ జగన్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉంది పదేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని, ఈ రేటు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే నిబంధనను మారుస్తామని, పంచాయతీ ఎన్నికల్లో ఈ నిబంధనను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గించామని, మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, హైస్కూళ్లలో వంద శాతం ఫర్నిచర్, టాయిలెట్ల నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. 11 ప్రైవేట్ యూనివర్సిటీలు రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. నాలుగున్నరేళ్లలో విద్యా రంగంలో 1.31 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అందులో స్కూల్ ఎడ్యుకేషన్కు రూ.79.50 వేల కోట్లు, ఉన్నత విద్యకు రూ. 15 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. వైద్య రంగంలో పలు పథకాలు తెచ్చాం.. వైద్యరంగంలో 24 పథకాలను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ముఖ్యమంత్రి బాల సురక్ష, ఈ–ఔషధి, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, మహాప్రస్థానం, ఎన్టీఆర్ బేబీ కిట్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు, 108 బైక్ అంబులెన్సులు కొత్తగా ప్రవేశపెట్టామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్ చేయడమే కాకుండా, నెలకు రూ. 2,500 పింఛన్ ఇస్తున్నామన్నారు. 108 సర్వీసును సంస్కరించామన్నారు. మలేరియా కేసులను తగ్గించామని, విశాఖలో మెడ్టెక్ జోన్ ఏర్పాటు చేసి ఒకేచోట అన్ని వైద్యపరికరాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని, ఇది ప్రపంచానికే మోడల్ అని చెప్పారు. భవిష్యత్లో మరింతగా మానవ వనరులపై శ్రద్ధ పెడతామన్నారు. సేవల రంగంలో రాష్ట్రం వెనుకబడిందని, దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీలో సేవల రంగం వాటా తక్కువుగా ఉందని చెప్పారు. హైకోర్టు ఏర్పాటుపై చంద్రబాబు సమీక్ష హైకోర్టు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఎనిమిది కోర్టు హాళ్లు ఏర్పాటుకు అవకాశం ఉందని జీఏడీ అధికారులు చెప్పగా వెంటనే వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ బంగ్లాలో న్యాయాధికారులు, ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జడ్జిలు, న్యాయాధికారులు, ఇతర ముఖ్యులకు బస కోసం అనువైన అన్నింటినీ పరిశీలించి వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పారు. మరోవైపు రాజధానిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనంపై కాంట్రాక్టు సంస్థ, సీఆర్డీఏ అధికారులతో సంప్రదింపులు జరిపారు. జనవరి 22 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో అడ్వొకేట్ జనరల్, సీఆర్డీఏ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హైకోర్టు విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఆందోళన
సాక్షి, అమరావతి : ఉమ్మడి హై కోర్టును విభజిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హై కోర్టులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హై కోర్టు విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రాలో హై కోర్టు ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్ నుంచి దింపి కోర్టు నడవకుండా చేశారు. ఆంధ్రాలో కోర్టు సముదాయాలు ఇంకా సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆంధ్రా న్యాయవాదులు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. తగిన సమయం ఇవ్వకుండా కోర్టును విభజించడం వల్ల కేసుల విభజన, సిబ్బంది విభజన వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. హై కోర్టు విభజనకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హై కోర్టు విభజన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాన్ని తెలంగాణకు కేటాయించగా.. ఏపీ హై కోర్టు భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని సమాచారం. -
లాయర్లదే కీలకపాత్ర
సాక్షి, హైదరాబాద్: న్యాయపాలన సమర్థవంతంగా సాగే విషయంలో న్యాయవాదులదే కీలక పాత్ర అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామయ్యగారి సుభాష్రెడ్డి అన్నారు. ప్రధాన న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలు ఆచరణ సాధ్యం కావాలంటే అందుకు న్యాయవాదుల సంపూర్ణ సహకారం ఎంతో అవసరమన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుభాష్రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాద సంఘాల ప్రతినిధులు శుక్రవారం హైకోర్టులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుభా ష్రెడ్డి హైకోర్టుతో, న్యాయవాద సంఘంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఇరు సంఘాల అధ్యక్షులు, ఇతర కార్యవర్గ ప్రతినిధులు జస్టిస్ సుభాష్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరడం సబబే
సాక్షి, అమరావతి: ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును ప్రభుత్వ అధీనంలో లేని సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కోరడంలో తప్పు లేదని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నప్పుడు ఈ డిమాండ్ సహేతుకమేనంటున్నారు. వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలోని క్యాంటిన్లో పనిచేసే జె.శ్రీనివాసరావు కోడి పందేలకు వాడే కత్తితో దాడికి తెగబడిన తర్వాత ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. హత్యాయత్నం జరిగిన వెంటనే పూర్వాపరాలను విచారించాల్సిన పోలీసు శాఖ.. అవేవీ పట్టించుకోకపోవడం, సంఘటన జరిగిన గంటలోపే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పోలీసు విభాగానికి అధిపతిగా ఉన్న డీజీపీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం, అంతలోనే లేఖలు, ఫ్లెక్సీలు బయటకు రావడం, అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మానవత్వం మరచి వ్యాఖ్యానాలు, విమర్శలకు దిగడం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్థాయిని దిగజార్చుకునేలా ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేయడం, ఇదేదో సంచలనం కోసం జరిగిన ఘటనగా చిత్రీకరించడం, రాష్ట్ర అధిపతిగా ఉన్న గవర్నర్ ఈ సంఘటనపై ఆరా తీయడాన్ని తప్పుబట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర దర్యాప్తును కోరింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన వ్యక్తులే ఇలా దిగజారి మాట్లాడిన తరుణంలో తమకు పోలీసు శాఖ వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై విశ్వాసం లేదని ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టులో వ్యాజ్యం కూడా వేసింది. దీన్ని తప్పుపడుతూ అధికార టీడీపీ నేతలు ప్రధాన ప్రతిపక్షంపై విమర్శల దాడికి పూనుకున్నారు. ప్రస్తుత పరిణామాలు, పరస్పర విమర్శలు, ఐదు రోజుల పాటు నిందితుడిని విచారించినా హత్యాయత్నానికి పథకాన్ని రచించిన సూత్రధారులు, పాత్రధారులెవరో సిట్ దర్యాప్తు కనిపెట్టలేకపోయిన నేపథ్యంలో ‘సాక్షి’ పలువురు ప్రముఖులు, న్యాయవాదుల అభిప్రాయాలను కోరింది. వాళ్లు ఏమన్నారంటే.. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా డీజీపీ ఎలా మాట్లాడతారు? ఇదో అసాధారణమైన కేసు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా డీజీపీ, ముఖ్యమంత్రి దానిపై మాట్లాడకూడదు. జగన్పై హత్యాయత్నం కేసులో ఈ విషయాన్ని డీజీపీ, ముఖ్యమంత్రి తుంగలో తొక్కారు. కేసును పక్కదోవ పట్టించేలా మాట్లాడారు. నిబంధనలను తోసిరాజని మాట్లాడిన డీజీపీ నియమించిన సిట్కు విలువేముంటుంది? సహజంగా పై అధికారి చెప్పిందే కింది అధికారి చేస్తాడు. అందువల్ల జగన్ డిమాండ్ సమంజసం, సహేతుకం. చాలా కేసుల్లో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం విధితమే. ఈ కేసులో కూడా అదే జరగవచ్చు. – ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు బాధితుని హోదా, కేసు తీవ్రత దృష్ట్యా కోరవచ్చు వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న డిమాండ్ సమంజసమే. అయితే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం రెండు సందర్భాలలో ఉంటుంది. ఒకటి.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాయిష్టాలు. రెండు.. కోర్టు మార్గదర్శకత్వాలు. సత్యం కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తే షేర్హోల్డర్లు కోర్టుకు వెళ్లి సీబీఐ దర్యాప్తు కోరి తెచ్చుకున్నారు. కేసు తీవ్రత, బాధితుని హోదాపై దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. జగన్పై హత్యాయత్నం విచారణకు పోలీసు శాఖ వేసిన సిట్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించినట్టు చెబుతున్నారు. అంటే ఈ కేసు చాలా ప్రాధాన్యమైందని తెలుస్తోంది. దీనివెనుకున్న కుట్ర గురించి దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. పారదర్శకత కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలి. హత్యాయత్నం జరిగింది ప్రతిపక్ష నాయకుని మీద కాబట్టి కేసు తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దర్యాప్తు సంస్థలను రాష్ట్ర పోలీసులు, ముఖ్యమంత్రి తప్పుదోవపట్టించే అవకాశం ఉందని వైఎస్ జగన్ అనుమానిస్తున్నందున స్వతంత్ర దర్యాప్తు కోరడం సమంజసమే. – ఎన్.రామచంద్రరావు, ఇండియన్ బార్ కౌన్సిల్ సభ్యుడు అది న్యాయమైన డిమాండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ చాలా న్యాయమైంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత గంటలోపే రాష్ట్ర పోలీసు అధిపతి, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ బయటకు వచ్చి చెప్పిందేమిటి? హత్యాయత్నం చేసిన వ్యక్తి.. జగన్ మనిషని, ఆయన అభిమానని, తన నాయకుని సానుభూతి కోసమే ఈ దాడి చేశాడనే నిర్ణయానికి వచ్చేశారు. ఎప్పుడైతే విచారణకు ముందే ఇటువంటి నిర్ణయానికి వచ్చారో ఇక విచారణ ఎలా జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ మొదలు పెట్టక మునుపే డీజీపీ తన నిర్ణయాన్ని చెప్పేశాడు. నిందితుడు వైఎస్సార్సీపీ అభిమానని, అభిమానితోనే వైఎస్ జగన్ దాడి చేయించుకున్నాడని డీజీపీ నిర్ణయానికి వచ్చిన తర్వాత బాధితునికి ఏ రకమైన విశ్వాసం కలుగుతుంది? ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఈ హత్యాయత్నాన్ని ఓవైపు చులకనగా మాట్లాడుతుంటే మరోవైపు దర్యాప్తు చేయాల్సిన డీజీపీ ఇలా మాట్లాడిన తర్వాత ఇక విచారణ అనేది తూతూ మంత్రంగానే ఉంటుంది. విచారణలోనూ అదే చెబుతారనే అనుమానం ఎవరికైనా వస్తుంది. ఈ అనుమానం రావడానికి డీజీపీ అత్యుత్సాహం, అది కూడా టీడీపీ భాషలో మాట్లాడడం కారణం. చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి ఇదే చెప్పిన తర్వాత పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతారని గానీ, నిజానిజాలు నిగ్గుతేల్చుతారని గానీ వైఎస్సార్ సీపీ నమ్మే అవకాశమే లేదు. అందువల్ల వాళ్లు కోర్టుకు వెళ్లి నిష్పాక్షికమైన థర్డ్ పార్టీ దర్యాప్తు కోరడంలో న్యాయముంది. – ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు ఇవ్వొచ్చు వైఎస్సార్సీపీ డిమాండ్లో తప్పులేదు. జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు సరిగా లేదని భావించినప్పుడు స్వతంత్ర సంస్థతో విచారణ కోరడం సమంజసమే. గతంలో పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పుడు అదేపని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేసి తన నిష్పాక్షికతను నిరూపించుకోవచ్చు. తాను పక్షపాతంగా లేనని నిరూపించుకునేందుకైనా ఆ పని చేయవచ్చు. అలా చేయడం వల్ల సమాజంలో ఆయన హోదా పెరుగుతుందే తప్ప తరగదు. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇది ఇటువంటి నేరాలను విచారించి వాస్తవాలను వెలుగులోకి తేవచ్చు. ప్రత్యేకించి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అడిగినప్పుడు స్వతంత్ర దర్యాప్తును అంగీకరించవచ్చు. – వీరారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది -
జగన్పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ న్యాయవాదుల ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఉమ్మడి హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ ర్యాలీలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ గేట్ నుంచి హైకోర్టు ప్రధాన ప్రవేశద్వారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్పై హత్యాయత్నానికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్కే ప్రభుత్వం భద్రత కల్పించలేని దుస్థితిలో ఉందంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. జగన్ను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నానికి పాల్పడితే చంద్రబాబు రాజకీయం చేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ వీరాభిమాని అని చెప్పి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారం కోసమే కత్తితో దాడి చేశారని సాక్షాత్తు డీజీపీ ప్రకటించడాన్ని బట్టి ఏపీలో పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. -
కేటీఆర్ను కలిసిన న్యాయవాదులు
-
న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత న్యాయవాదుల కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టామని, త్వరలో పార్టీ ప్రకటించే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు పథకాలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతిభవన్లో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లతోపాటు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కేటీఆర్ను కలిశారు. తెలంగాణ అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్టుకు మరిన్ని నిధులు కేటాయించాలని, ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్కార్డులు జారీ చేయాలని న్యాయవాద ప్రతినిధులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ల ప్రతిపాదనలను కేటీఆర్కు సమర్పించారు. మేనిఫెస్టోలో న్యాయవాదులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. మేని ఫెస్టో కమిటీకిడిమాండ్ల ప్రతిని ఇస్తామన్నారు. -
#మీటూ: 97మంది లాయర్లా..!
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలుఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ న్యాయపోరాటంలో న్యాయవాదుల సంఖ్య తెలిస్తే నోరు వెళ్లబెట్టక తప్పదు. ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా 97మంది న్యాయవాదులు ఈ జాబితాలో ఉన్నారు. జర్నలిస్టు ప్రియా రమణి లైంగిక ఆరోపణల నేపపధ్యంలో ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావాను 97మంది న్యాయవాదులు వాదించనున్నారు. ప్రముఖ సంస్థ కరంజావాలాకు చెందిన లాయర్లు ప్రియా రమణికి వ్యతిరేకంగా వాదించనున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై నేరపూరిత ఆరోపణ కేసును సోమవారం నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
వైఎస్ జగన్ను కలిసిన లాయర్లు
-
మంత్రి సోమిరెడ్డిపై న్యాయవాదుల ఫిర్యాదు
నెల్లూరు లీగల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యంగ వ్యవస్థ అయిన కోర్టు ప్రాంగణంలో పత్రికా సమావేశం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డిపై విమర్శలు చేయటానికి కోర్టు ప్రాంగణాన్ని అనుమతి లేకుండా వినియోగించటం నిబంధనలకు పూర్తి విరుద్ధం అని పేర్కొంటూ న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో జడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావుకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదును పంపారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కోర్టు నియమ నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. ఈ నెల 15న మంత్రి సోమిరెడ్డి కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన అనంతరం మంత్రి సోమిరెడ్డి కోర్టు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అది కూడా పూర్తిగా వ్యక్తిగత రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డిపైనే మాట్లాడారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో రాజకీయపరమైన కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కోర్టు ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించేలా వ్యవహరించటంతోపాటు కోర్టు విలువలను, నిబంధనలను పాటిం చకుండా ఉండటం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించటం అధికార దుర్వినియోగం అవుతుందని, దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ప్రాంగణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్త పద్ధతికి తెరతీసి పవిత్ర న్యాయస్థానాలను అగౌరవ పరిచేలా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీతో పాటు విలేకరుల సమావేశానికి సంబం« దించిన వీడియోలు, ఫొటోలను అందజేశారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుడుముల రవికుమార్, మురళీధర్రెడ్డి, పత్తి రాజేష్తో పాటు పలువురు న్యాయవాదులు ఉన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన న్యాయవాదులు
-
ఒక్క వాయిదాకు లక్షల్లో ఫీజులా?!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఒక్కో వాయిదాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తుండటంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వామననావు అభ్యంతరం తెలిపారు. ఇలా భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తుండటంపై పునరాలోచన చేయాలని కోరారు. కోర్టులో కేసు విచారణకు రాకపోయినా ఫీజు తీసుకుంటున్నారని, ఈ తరహా దోపిడీ విధానానికి స్వస్తి పలకాలని కోరారు. ఢిల్లీలో రాజీకి వచ్చిన ఒక కేసులో రూ.30 లక్షల ఫీజు తీసుకున్నారని, ఈ విధానం కొనసాగితే రాజీకొచ్చిన కంపెనీల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్లో అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల ప్రత్యామ్నాయ కేంద్రం (ఐసీఏఆర్డీ)–హైదరాబాద్ సెంటర్, తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా ‘వాణిజ్య వివాదాల సత్వర పరిష్కారం–న్యాయ సంస్కరణలు’అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కేసులో వాదనలకు ఒక్క వాయిదాకే రూ.లక్షలు వసూలు చేసే విధానాన్ని నియంత్రించాలని, ఈ తరహా న్యాయ సంస్కరణలు చాలా అవసరమని అన్నారు. వాది ప్రతివాదులు కేసును రాజీ చేసేందుకు మధ్య వర్తిత్వ వాదనలు ఫైవ్ స్టార్ హోటల్స్లో నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘పేటెంట్ రైట్స్’పై శిక్షణ ఇవ్వాలి పేటెంట్ రైట్స్ గురించి మాట్లాడుతూ.. కింది కోర్టుల్లో చాలా మంది జడ్జీలకు ఈ అంశంపై అవగాహన లేదని, వారికి జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని జస్టిస్ వామనరావు అన్నారు. ఐసీఏఆర్డీకి వచ్చిన కేసు మూడు నెలల్లో పరిష్కారం అవుతోందని, కేసులు రాజీ చేయడంలో ప్రపంచంలో భారత్ 145వ స్థానంలో ఉండేదని, సంస్కరణల ఫలితంగా 100వ స్థానానికి వచ్చిందని ఐసీఏఆర్డీ–హైదరాబాద్ కేంద్ర కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి చెప్పారు. గ్రామీణ జనాభాను దృష్టిలో పెట్టుకుని పేటెంట్ రైట్స్ తీసుకురావాలని వర్డిక్ట్ ఐపీ వ్యవస్థాపకుడు అశోక్ రామ్ కుమార్ అన్నారు. సాఫ్ట్వేర్లో భారతీయులు, ప్రధానంగా తెలుగు వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నా సాఫ్ట్వేర్పై పేటెంట్ రైట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేటెంట్ రైట్స్ పొందడం వల్లే రెడ్డి ల్యాబ్స్ ఉత్పత్తి చేసిన మందును గత ఇరవై ఏళ్లుగా ఇతర దేశాలు ఉత్పత్తి చేయనీయకుండా అడ్డుకుందని, ఇదే తరహాలో గ్రామీణ స్థాయిలో పేటెంట్ రైట్స్ పొందాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. సీఐఐ డైరెక్టర్ సుభజిత్ షా తదితరులు ప్రసంగించారు. -
వైఎస్ జగన్ను కలిసిన న్యాయవాదులు
-
వైఎస్ జగన్ను కలిసిన న్యాయవాదులు
-
సమస్యలు పరిష్కరించన్నా..
పిఠాపురం : న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు న్యాయవాదులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. కాకినాడలో సాగిన పాదయాత్రలో జగన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బచ్చు రాజేష్, మాజీ కార్యదర్శి గెద్డాడ వెంకటేశ్వరరావు, అధిత్య కుమార్ తదితరులు మాట్లాడుతూ డెత్ బెనిఫిట్స్ రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. జూనియర్ లాయర్లకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాలంలో నెలకు రూ.5 వేలు ఇవ్వాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు కోరారు. -
నేడు బార్ కౌన్సిళ్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటిదాకా ఓటింగ్ జరుగుతుంది. తెలంగాణలో 88, ఏపీలో 146 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నమోదైన ఉభయ రాష్ట్రాల లాయర్లు సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేయనున్నారు. రిటర్నింగ్ అధికారులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అంబటి శంకర నారాయణ, పి.కేశవరావు వ్యవహరిస్తున్నారు. ఏపీ ఎన్నికలను జస్టిస్ కేశవరావు, తెలంగాణ ఎన్నికలను జస్టిస్ శంకర నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఏపీ బార్ కౌన్సిల్ బరిలో 107 మంది, తెలంగాణ కౌన్సిల్కు 86 మంది బరిలో ఉన్నారు. తెలంగాణలో 21,077 మంది లాయర్లకు, ఏపీలో 27,676 మందికి ఓటు హక్కుంది. ఏపీ కౌన్సిల్ ఓట్ల లెక్కింపు జూలై 11న, తెలంగాణకు జూలై 23న జరగనుంది. ఒక్కో రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి 25 మందిని ఎన్నుకుంటారు. వీరిలోంచి చైర్మన్, కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఉభయ రాష్ట్రాలకు వేర్వేరుగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో లాయర్లు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల్లో కొందరు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, ఖరీదైన సెల్ఫోన్లు, వాచీలు, విదేశీ మద్యం, లాయర్లు వేసుకునే గౌన్లు, పుస్తకాలు... ఇలా ఏది కావాలంటే అది ఓటర్లకు తాయిలాలుగా ఇస్తున్నారు. మరికొందరు ఓట్లను కొనేస్తున్నారు. తెలంగాణ అభ్యర్థులతో పోలిస్తే ఏపీ అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. కొందరైతే వ్యక్తిగత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఖర్చు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్నారు. వారికి దన్నుగా ఆయా పార్టీల నేతలు భారీ విందులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలనూ బాగా ఉపయోగించుకుంటున్నారు. కరపత్రాలు, వాట్సాప్ మెసేజ్లు, ట్విటర్, ఫేస్బుక్ల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
షాద్నగర్టౌన్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర బార్ అసోసియోషన్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్స్కు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి న్యాయవాదులు అవకాశం కల్పించి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా తనను ఎన్నుకోవాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అడ్వకేట్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులను లాభం చేకూర్చే విధంగా వారికి ఉపకార వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ ఉపయోగపడే విధంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అడ్వకేట్స్ ఫండ్ కింద వంద కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని న్యాయవాదుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. షాద్నగర్లో సబ్కోర్టు ఏర్పాటు కావడానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమమే «ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. జూన్ 29న నిర్వహించే రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. 22 ఏళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యుడిగా, వైస్ చైర్మన్గా, చైర్మన్గా ఎన్నో సేవలు అందించానని, మరిన్ని సేవలు అందించేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు చెంది మహేందర్రెడ్డి, మోముల బసప్ప, కంచి రాజ్గోపాల్, పాతపల్లి కృష్ణారెడ్డి, మధన్మోహన్రెడ్డి, జగన్, శ్రీనివాస్, ప్రణీత్రెడ్డి, కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్
-
వారికోసం 100కోట్లతో వెల్ఫేర్ ఫండ్ : వైఎస్ జగన్
సాక్షి, గుడివాడ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రలో జననేత అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈసందర్భంగా ఆదివారం వైఎస్ జగన్ కౌతవరంలో న్యాయవాదులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా న్యాయవాదులకు ఆయన పలు హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. చివరకు న్యాయవాదులను సైతం నిలువునా వంచించిన చరిత్ర చంద్రబాబుదేనని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ఈ సమావేశంలో న్యాయవాదులు తమ సమస్యలను జననేతతో ఏకరవు పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి పథకాలు, సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను విన్న ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినవారికి ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాటు 100 కోట్ల రూపాయలతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైకోర్టు లేదని, ఎక్కడ వస్తుందో చూసి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్న వైఎస్ జగన్పై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతకు తమ మద్దతు ఉంటుందన్నారు. -
తరచూ మద్యం సేవించేది వారే..
లండన్ : సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఉంటూ అధిక రాబడి పొందే వారే ఎక్కువగా మద్యం సేవిస్తారని తాజా అథ్యయనం వెల్లడించింది. బ్రిటన్లో ఇతరులతో పోలిస్తే వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు తరచూ మద్యం తీసుకుంటారని తేలింది. మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ బాధ్యతల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో నలుగురు ఆల్కహాల్ తీసుకుంటారని అంచనా వేసింది. ఇక ఈ అలవాటు కార్మికులు, లారీ డ్రైవర్లు, రిసెప్షనిస్టులు, కేర్ వర్కర్లు ఇతరుల్లో కేవలం సగానికే పరిమితమని పేర్కొంది. అయితే మద్యం మితిమీరి తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ర్పభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ మద్యానికి దాసోహం అవుతుండటం పెచ్చుమీరుతోందని ఆల్కహాల్ ఎడిక్షన్ నిపుణుడు స్టీవ్ క్లార్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పనిఒత్తిడిని అధిగమించేందుకు వారు తమకు తామే మద్యాన్ని మెడిసిన్లా వాడుతున్నారని తాము గుర్తించామన్నారు. యూకేలో మద్యం అలవాట్లపై ప్రచురితమైన నివేదిక ఈ ధోరణులకు అద్దం పట్టింది. బ్రిటన్లో దాదాపు 60 శాతం మంది పెద్దలు మద్యాన్ని సేవిస్తున్నట్టు తేలింది. అతిగా మద్యం సేవించడం కారణంగా మరణాల సంఖ్య ఈ దశాబ్ధంలో పది శాతం మేర పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
జస్టిస్ జోసెఫ్ను కేంద్రం కావాలనే అడ్డుకుంది
న్యాయమూర్తుల నియామకాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందా? కొలీజియం సిఫార్సులు చెల్లుబాటు కాకుండా మోకాలడ్డుతోందా? కొలీజియం సిఫార్సుల జాబితాలోని పేర్లకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాసి అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైనాన్ని సాక్షాత్తు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించిన సమయంలోనే... ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపింది. కేంద్ర నిర్ణయం ఎంతమాత్రం సహేతుకంగా లేదని... తీర్పులు, పద్ధతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని దీనిద్వారా కేంద్రం ఇచ్చినట్లు కనబడుతోందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి తన మనసులోని మాట చెప్పారు. జస్టిస్ జోసెఫ్ పదోన్నతి విషయంలో కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పి పంపడంపై మీ అభిప్రాయం? మూడు కారణాలు చూపించి కేంద్రం ఈ పని చేసింది. అందులో మొదటిది–జోసెఫ్ కంటే 42 మంది న్యాయమూర్తులు సీనియర్లుగా ఉన్నారు. రెండు– కేరళ నుంచి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ న్యాయమూర్తి ఉన్నారు. మూడు–సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా దళితులు లేరు. కేంద్రం చెప్పిన ఈ మూడు కారణాలూ ఏ మాత్రం సహేతుకంగా లేవు. ఎందుకు సహేతుకంగా లేవో వివరిస్తారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేందుకు ఆలిండియా సీనియార్టీ విధానం ఎప్పుడూ లేదు. కేరళకు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఒకరుంటే రెండో వ్యక్తి న్యాయమూర్తి కాకూడదనేమీ లేదు. మహారాష్ట్రకు చెందిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో అయిదుగురున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ముగ్గురు, చిన్న ప్రాంతమైన ఢిల్లీకి చెందిన వారు ముగ్గురు సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. మరి జస్టిస్ జోసెఫ్ విషయంలో మాత్రమే అభ్యంతరం ఎందుకు? ఇక చివరి అభ్యం తరం.. దళితులు లేరని చెప్పి జస్టిస్ జోసెఫ్కు అడ్డు చెప్పడం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికీ, దళితుడు కాకపోవడానికీ సంబంధం ఏముంది? కేంద్రం చెప్పనవన్నీ కుంటిసాకులే. ఆయనను సుప్రీంకోర్టుకు రాకుండా చేసేందుకే ఈ సాకులు చెప్పినట్లు అనిపిస్తోంది. కొలీజియం సిఫార్సుల్ని తిప్పిపంపే అధికారం కేంద్రానికి లేదంటారా? ఎందుకు లేదు? ఉంది. అయితే, అందుకూ ఓ పద్ధతి ఉంది. కొలీ జియం సిఫార్సుల్లోని పేర్లపై కేంద్రం సేకరించే కీలక సమాచారంలో ఆ జాబితాలోని వారి ప్రవర్తన, పనితీరుపై తీవ్ర ఆరోపణలు ఉంటే పునః పరిశీలన చేయాలని కేంద్రం కోరవచ్చు. ఇందులో తప్పులేదు. కాని జస్టిస్ జోసెఫ్ పనితీరుపై లేదా ప్రవర్తనపై ఎటువంటి ఆరోపణలు లేవు. మరి ఆయన పేరును ఏ ప్రాతిపదికన వెనక్కి పంపిందనుకోవాలి? జస్టిస్ జోసెఫ్ విషయంలో కేంద్రం ఎందుకలా వ్యవహరిస్తోందంటారు? తెర వెనుక కారణాలు ఏమై ఉంటాయి? తెర వెనుక కాదు.. అన్నీ బహిరంగమే. దీని విషయంలో దాపరికం ఏముంది? ఉత్తరాఖండ్లో విధించిన రాష్ట్రపతి పాలన చెల్లదని గతంలో జస్టిస్ జోసెఫ్ తీర్పు చెప్పారు. ఆ తీర్పే ఆయనను సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాకుండా చేస్తోందనిపిస్తోంది. ఆ తీర్పు వారికి అనుకూలంగా లేదు గనుక నచ్చకపోయి ఉండొచ్చు. కొలీజియం సిఫారసులన్నింటినీ కేంద్రం ఆమోదించాలా? మేజి స్ట్రేట్ పరీక్షలో తప్పిన ఒకరి పేరును అనంతరకాలంలో కొలీజియం సిఫార్సు చేస్తే ఆయన న్యాయమూర్తి అయ్యారు కదా... కొలిజీయం అంతా సజావుగా ఉందని ఎవరూ అనడం లేదు. ఉన్న వ్యవస్థ లోపభూయిష్టంగా లేదని ఎవరూ అనడం లేదు. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాలి. లోటుపాట్లు సరిచేయాలి. ఇవేమీ చేయకుండా ఉన్న వ్యవస్థకే తూట్లు పొడిస్తే ఎలా? ఇలా చేయడం ద్వారా పాలకులు ఏం సందేశం పంపుతున్నారు? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కేంద్రం తన గుప్పెట్లో న్యాయవ్యవస్థను పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోందని అనుకోవచ్చా? కేవలం ఈ చర్య ఆధారంగా ఆ నిర్ణయానికి రాలేము. అయితే అలాంటి అపోహలకు ఆస్కారం ఉంది. కొలీజియం సిఫార్సుల్ని తిప్పిపంపడం ద్వారా కేంద్రం ఏం సందేశం ఇస్తోంది? న్యాయమూర్తులు వెలువరించే తీర్పులు, వారి పద్ధతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది. తమకు అనుకూలంగా ఉండాలనే సందేశాన్ని కేంద్రం పంపినట్లుంది. ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుతూనే ఉన్న లోటుపాట్లను సరిచేసే దిశగా చర్యలు ఉండాలేగానీ, ఆ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉండకూడదు. ప్రజలు సైతం దీనిని హర్షించరు. జస్టిస్ జోసెఫ్ పేరును కొలీజియం తిరిగి కేంద్రానికి పంపితే.. ఏం చేస్తుంది? ఆమోదించక తప్పదు కదా! – శ్రీనివాస్ పెమ్మరాజు, సాక్షి ప్రతినిధి -
బీసీల గొంతుకోసిన బాబు
బీసీ న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ కుమార్లు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించటానికి అర్హులు కారంటూ ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు రాసిన లేఖ బహిర్గతమైంది. బీసీ న్యాయవాదులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వారి నియామకాలను అడ్డుకోవాలని బాబు ప్రయత్నించారు. అయితే, ఇంటెలిజెన్స్ శాఖ పరిశీలనలో బీసీ న్యాయవాదులపై చేసిన ఆరోపణలపై అబద్ధాలని తేలిపోవడంతో, వారిని కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తులుగా నియమించింది. కేంద్రమంత్రికి బాబు రాసిన లేఖల్ని జస్టిస్ ఈశ్వరయ్య బయటపెడుతూ మరిన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. వాటన్నింటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉంది.సుప్రీంకోర్టులోగానీ, రాష్ట్ర హైకోర్టులోగానీ, జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్ సూత్రాన్ని పాటించడం లేదు, పైగా కొలీజియం పద్ధతి ద్వారా జడ్జీలే, జడ్జీలను నియమించే విధానం కొనసాగుతున్నందువల్ల ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ జడ్జీల సంఖ్య బహు స్వల్పంగా ఉంటోంది. గత 68 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో మొత్తం సుమారు 200మంది న్యాయమూర్తులు నియమితులు అవగా, వారిలో ఒకరిద్దరు తప్ప బీసీ న్యాయమూర్తులు లేరు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రస్తుతం 600 మందికి పైగా న్యాయమూర్తులు పనిచేస్తుండగా బీసీ న్యాయమూర్తులు 80 మంది కూడా లేరు. జనాభాలో 50 శాతానికి మించి ఉన్న బీసీలకు న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం లేదు. జిల్లా స్థాయిలో ఉన్న రిజర్వేషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో ఎందుకు పాటించరు? రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎక్కువమంది బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. కనుక బీసీ న్యాయవాదులు హెచ్చు సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. వై. కోటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ మహాజన సమితి, మొబైల్ : 98498 56568 (నేడు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో బీసీ న్యాయవాదుల సభ సందర్భంగా) -
చంద్రబాబు ఇదేనా మీ ప్రేమ : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బీసీలంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఇద్దరు బీసీలు(అమర్నాథ్ గౌడ్, అభినవ కుమార్ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావులను సిఫార్సు చేస్తే.. అమర్నాథ్ గౌడ్, అభినవ కుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన లేఖలను కూడా ఆయన బయటపెట్టారు. ‘నోరు తెరిస్తే బీసీల సంక్షేమం అనే చంద్రబాబు ఎందుకు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకుంటున్నారు? వారి నియామకాలను అడ్డుకునేలా తప్పుడు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు?’ అని ట్విటర్లో వైఎస్ జగన్ ప్రశ్నించారు. కాగా, చంద్రబాబు తీరుపై ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాద సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీసీ న్యాయవాదుల బృందం రాష్ట్రపతికి చంద్రబాబు తీరుపై ఫిర్యాదు కూడా చేసింది. Recent disclosures by Justice Eswaraiah have exposed Naidu's so-called 'sincerity' towards BCs. @ncbn, you claim to accord priority to BC welfare, then why did you oppose the appointment of BC advocates as Judges? Why did you provide false feedback to prevent their appointment? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 26, 2018 -
న్యాయవ్యవస్థలో చంద్రబాబు జోక్యం
హైదరాబాద్: న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ స్వప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో–కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. బీసీలు ప్రధాన న్యాయమూర్తులుగా పనికిరారని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అనుకూలమైన వారు లేరనే కారణంతో ఇటీవల ఉమ్మడి హైకోర్టులో నియమితులైన న్యాయమూర్తులను ఎంపిక దశలోనే నిరోధించే యత్నం చేశారని ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టుకు పంపిన న్యాయవాదులపై కావాలనే ఆరోపణలు చేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన న్యాయవాదులపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలకు 2016 ఏప్రిల్ 30న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి లేఖ రాస్తే నెల రోజుల్లో సీఎం కేసీఆర్ తన అభిప్రాయం పంపగా.. చంద్రబాబు మాత్రం సిఫార్సులను వ్యతిరేకించారన్నారు. బీసీ న్యాయమూర్తుల పట్ల చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రవికుమార్, సదానంద్, దేవరాజు, ప్రశాంత్, స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ న్యాయవాదుల ఆందోళనలు బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలపై కొద్ది రోజులుగా హైదరాబాద్లోని వేర్వేరు కోర్టుల్లోని బీసీ న్యాయవాదులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం రంగారెడ్డి కోర్టుకు చెందిన బీసీ న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీల ఓట్లు కావాలి.. బీసీలు వద్దా అంటూ ప్రశ్నించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. -
బాబు తీరుపై ఫిర్యాదుకు..రాష్ట్రపతి వద్దకు బీసీ న్యాయవాదులు!
సాక్షి, హైదరాబాద్: బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న బీసీ న్యాయవాదులు ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. అవసరమైతే మిగతా బీసీ సంఘాలను కూడా కలుపుకోవాలని భావిస్తున్నారు. బాబు తీరును ఖండిస్తూ మొదట రాష్ట్రపతికి లేఖ రాయాలని, తరవాత అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలవాలని భావిస్తున్నారు. బాబు వ్యక్తం చేసిన అనుచిత అభిప్రాయాలను లిఖితపూర్వకంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే, బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా చేసేందుకు కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు, ఈ మొత్తం వ్యవహారంలో ఏకంగా హైకోర్టునే తప్పుబట్టారు! జస్టిస్ అమర్నాథ్ గౌడ్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ గంగారావు, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయంపై ఆయన విస్మయకర రీతిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొలీజియం నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించారు! అంతేకాక ఈ ఆరుగురు న్యాయమూర్తులుగా పనికి రారని ఒక్క ముక్కలో తేల్చేశారు. వారి నిజాయితీ, వృత్తిపరమైన సమర్థతను నిర్ధారించకుండానే వారి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేసిందంటూ ఆయన కొలీజియంపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసలు ఆ ఆరుగురిలో ఒక్కరికి కూడా న్యాయమూర్తులయ్యేంత శ్రేష్టత, సచ్చీలత లేనే లేవని కేంద్రానికి పంపిన ఫిర్యాదు లేఖలో బాబు పేర్కొన్నారు. ఆరుగురు న్యాయమూర్తుల గురించి బాబు తన లేఖలో తీవ్ర అభ్యంతకరమైన పదజాలం ఉపయోగించిన నేపథ్యంలో సదరు లేఖను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య రెండు రోజుల క్రితం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. రెండు రాష్ట్రాల న్యాయవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ ఆరుగురి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేయడం సరికాదంటూ ఒకింత రెచ్చగొట్టే పదజాలాన్ని కూడా బాబు ఉపయోగించారు. దీనిపై పలువురు విశ్రాంత న్యాయమూర్తులు తీవ్ర ఆశ్చర్యం, విస్మయం వ్యక్తం చేశారు. బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమే గాక ఏకంగా కొలీజియం నిర్ణయాన్నే తప్పుపడుతూ లేఖ రాయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన సామాజిక వర్గానికి, తన కోటరీకి చెందిన న్యాయవాదులెవరూ జాబితాలో లేరన్న అసహనం బాబు లేఖలో స్పష్టంగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. బాబు అసహనాన్ని, ఆయన అభిప్రాయాల్లోని ఉద్దేశాలను గుర్తించే, వాటిని పట్టించుకోకుండా అమర్నాథ్ గౌడ్ తదితరులను జడ్జీలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిందని వారు చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం ఈ ఆరుగురి విషయంలో మాత్రం ఆలస్యానికి తావులేకుండా నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
‘చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతాం’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో సీఎం చంద్రబాబు వైఖరి పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆ వర్గానికి చెందిన న్యాయవాదులు మంగళవారం నాంపల్లి కోర్టు వద్ద ఆందోళన చేశారు. బీసీ వ్యతిరేకి చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బీసీల ఓట్లు కావాలిగానీ, బీసీలు జడ్జీలు కాకూడదా? అంటూ న్యాయవాదులు ప్రశ్నించారు. కోర్టు వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీసీలను అవమానించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పానలి ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. -
బాబుపై బీసీ న్యాయవాదుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో సీఎం చంద్రబాబు లిఖితపూర్వక వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. బీసీ న్యాయవాదులు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆ వర్గానికి చెందిన న్యాయవాదులు సోమవారం హైకోర్టు వద్ద ఆందోళన చేశారు. ఇందులో ఉభయ రాష్ట్రాల బీసీ న్యాయవాదులు పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ వ్యతిరేకి చంద్రబాబుకు తగిన బుద్ధి చెపుతామని, ఆయన ఆటలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. బీసీల ఓట్లు కావాలిగానీ, బీసీలు జడ్జీలు కాకూడదా? అంటూ ప్రశ్నించారు. ‘టీడీపీ.. వాళ్ల సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని ఏకకాలంలో సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించుకుంది. మరోవైపు బీసీలు హైకోర్టు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యలు చాలా దుర్మార్గం. ఏపీలో టీడీపీకి సమాధి కట్టే రోజు దగ్గర్లో ఉంది. ఇప్పటి వరకు బీసీ న్యాయవాదిని అడ్వొకేట్ జనరల్గా నియమించలేదు. ప్రధాన పోస్టులు కూడా ఇవ్వకుండా అవమానించారు’ అని హైకోర్టు బీసీ న్యాయవాది డీఎస్ఎన్వి ప్రసాద్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన కులం వాళ్ల విషయంలో ఇలాగే చేశారా? హైకోర్టు న్యాయమూర్తుల పదవులకు అమర్నాథ్గౌడ్తో పాటు మిగిలిన న్యాయమూర్తుల పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసినప్పుడు, వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లిఖితపూర్వకంగా> పంపిన అభిప్రాయాలను మాజీ న్యాయమూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. సీఎం అభిప్రాయాలు న్యాయవర్గాలను విస్మయానికి గురి చేశాయి. తన వారు తప్ప, ఇతరులెవ్వరూ న్యాయమూర్తులు కాకూడదన్న ఉద్దేశం చంద్రబాబు అభిప్రాయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని పలువురు విశ్రాంత న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అమర్నాథ్గౌడ్ తదితరులను ఎట్టి పరిస్థితుల్లో జడ్జీలు కాకుండా చేసేందుకే చంద్రబాబు ఈ స్థాయికి దిగజారారని చెబుతున్నారు. తనకులానికి చెందిన వ్యక్తులు జడ్జీలుగా నియమితులైనప్పుడు చంద్రబాబు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారా? లేదా? అన్నది పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం హైకోర్టులో టాప్ 7లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులను కూడా హైకోర్టు జడ్జీలు కాకుండా తప్పుడు కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు వివరించారు. అలాగే సుప్రీంకోర్టులో ఓ సీనియర్ జడ్జిని ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఎలా గేమ్ ప్లాన్ చేశారో కూడా తెలియచేశారు. చిన్న వయసులో జిల్లా జడ్జిగా ఎన్నికైన ఓ యువ న్యాయవాదిపై కూడా పిటిషన్ వేయించి, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఘటనను కూడా వారు ‘సాక్షి’తో పంచుకున్నారు. న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే... జడ్జీల నియామకం, వారి సమర్థత గురించి చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ అన్నారు. వ్యక్తిగత స్థాయిలో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలా లేఖలు రాయడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. ఇటువంటి లేఖల వల్ల పలు చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయని, న్యాయవ్యవస్థ స్వతంత్రకు ఇవి ముప్పుగా పరిణమిస్తాయని ఆయన చెప్పారు. న్యాయమూ ర్తుల నియామకాల్లో ముఖ్యమంత్రుల అభిప్రాయా లు కోరితే, వారు తమకు అనుకూలమైన వారినే జడ్జీలుగా నియమించుకోవాలని చూస్తారన్నారు. -
బీసీలను చంద్రబాబు అణగదొక్కుతున్నారు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): సీఎం చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆయన కులానికి చెందిన వారికి మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాలకు పరిమితి లేకుండా పోయిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు బీసీలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్కు సీఎం చంద్రబాబు రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఇద్దరు బీసీలు(అమర్నాథ్గౌడ్, అభినవకుమార్ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావును సిఫార్సు చేస్తే.. అమర్నాథ్గౌడ్, అభినవకుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఆరోపించారు. హైకోర్టు జడ్జిగా అమర్నాథ్ గౌడ్ పనికిరారంటూ పలు ఆరోపణలు చేస్తూ పంపిన లేఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ తప్పుడు నివేదిక అందజేసి మోకాలడ్డేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణ చేపట్టి ఆ నలుగురిపై చంద్రబాబు ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చడంతో వారు జడ్జీలుగా నియమితులయ్యారని చెప్పారు. తన వద్ద సాక్ష్యాలున్నాయంటూ.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు చంద్రబాబు రాసిన లేఖలను ఆయన మీడియాకు విడుదల చేశారు. బీసీలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని.. కానీ ఆ విలువలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిలుగా అభినవ్కుమార్, గంగారావు పనికిరారంటూ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు పంపిన లేఖ స్వర్ణాంధ్రప్రదేశ్ చంద్రబాబు జాతి కులానికేనా? అని ప్రశ్నించారు. బాబు కులానికి చెందిన వారికి తప్ప ఇతర వర్గాలకు ఎలాంటి ప్రాజెక్టులు గానీ.. పనులు గానీ దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ మంత్రులున్నప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజా రక్షకుడిగా ఉన్న వ్యక్తే భక్షకుడిగా మారారని దుయ్యబట్టారు. బాబుకు వత్తాసు పలికిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి డీవీ సోమయాజులుపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు పంపిన లేఖ -
ఆధార్ : లాయర్లకు దానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ : ఆధార్ కార్డు లేనప్పటికీ రిటర్నులు దాఖలు చేసే అనుమతి న్యాయవాదులకు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆధార్ కార్డు వివరాలు ఇవ్వన్నప్పటికీ అనుమతి ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదులు ముకుల్ తల్వార్, వ్రిండా గ్రోవర్లు దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కు డివిజిన్ బెంచ్ నోటీసులు కూడా పంపింది. తదుపరి విచారణ మే 14న చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆధార్తో పాన్ కార్డు లింక్ చేసుకునే తుది గడువు జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆధార్ చట్టాన్ని కేంద్రం సుప్రీంకోర్టులో సమర్థించుకుంటూ వస్తోంది. ఇది ఒక సరసమైన, సహేతుకమైన చట్టంగా కేంద్రం అభివర్ణిస్తోంది. గోప్యతా హక్కు విషయంలో చారిత్రక తీర్పుకు ఇది కట్టుబడి ఉందని తెలిపింది. కాగ, గతేడాది ఆగస్టులో గోప్యత హక్కు, ప్రజల ప్రాథమిక హక్కు అని తొమ్మిది సభ్యుల రాజ్యాంగ బెంచ్ చారిత్రక తీర్పు వెలువరించింది. మరోవైపు ఆధార్ స్కీమ్ వాలిడిటీపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్తో విచారిస్తోన్న సంగతి తెలిసిందే. -
విశాఖ హైకోర్టు బెంచ్ ఏరాటుచేయాలని లాయర్లు నిరసన
-
సీజేఐను కలవనున్న ‘న్యాయ’ సంఘాల ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ప్రతిని«ధులు ఏప్రిల్ 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను కలవనున్నారు. ఈ మేరకు వారికి సీజేఐ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయంపై వారు సీజేఐతో చర్చించనున్నారు. ఇటీవల ఇదే విషయంపై న్యాయవాదులు రెండు రోజులపాటు తీవ్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ ఇరు సంఘాల ప్రతినిధులతో మాట్లాడనున్నారు. -
ఏపీ సచివాలయం ముందు రాయలసీమ లాయర్ల ధర్నా
-
హైకోర్టు వద్ద న్యాయవాదుల ధర్నా
-
అనంతలో ఉద్రిక్తత.. లాయర్ల ముందస్తు అరెస్ట్
-
అక్షరాల తోడుగా.. న్యాయం వైపు నడకలు
మహిళా సాధికారత చదువుతోనే సాధ్యం. సమాజంలో పురుషులతోపాటు స్త్రీలకూ సమాన హక్కులుంటాయి. కానీ లింగ వివక్ష నేటికీ కొనసాగడం బాధాకరం. అన్నింట్లో మహిళలకూ సమాన అవకాశాలు ఉంటేనే పురుషాధిక్యత తగ్గుతుంది. స్త్రీలపై జరుగుతున్న వివక్షతకు చరమగీతం పాడాలి. దీని కోసం ప్రభుత్వాలు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెన్నూర్: అక్షరాస్యతతోనే మహిళ శక్తిగా మారుతుంది. మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. అన్ని రంగాల్లో లింగ వివక్షత కన్పిస్తోంది. లింగ వివక్షతను రూపు మాపాలంటే చదువు ఒక్కటే మార్గమని చెన్నూర్ సివిల్ కోర్టు న్యాయవాది చీర్ల గిరిజారాణి అన్నారు. ‘మాది వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామం. మా నాన్న చీర్ల దామోదర్రెడ్డి శ్రీరాంపూర్ గ్రామంలో వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు. 1వ తరగతి నుంచి 10 వరకు శ్రీరాంపూర్లో విద్యాభ్యాసం చేశా. ఇంటర్ మంచిర్యాల, డిగ్రీ, న్యాయవాద కోర్సును హైదరాబాద్లో చేశాను. మా సోదరుడు రోషిరెడ్డి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అన్నయ్యను స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాద వృత్తిని ఎంచుకున్నా. న్యాయవాదిగా మహిళలకు న్యాయం చేస్తా. న్యాయవాదిగా పని చేయడం నాకు సంతృప్తిగా ఉంది’ అని గిరిజారాణి అన్నారు. ఆర్థిక స్వాలంబన సాధించాలి.. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మహిళలకు ఆర్థిక స్వాలంబన సాధించాలి. అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగాలి. మహిళలు అనే చులకన భావన అన్ని రంగాల్లో ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయటికి వస్తేనే మహిళలకు పురుషాధిక్యత నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. లింగ వివక్షత నుంచి బయట పడాలంటే ప్రతి మహిళ అక్షరం అనే ఆయుధాన్ని సాధించాలి. మహిళలకు ప్రత్యేక చట్టాలు.. మహిళలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. భార్యను హింసిస్తే ఆ భార్య గృహహింస చట్టం కింద కేసు నమోదు చేస్తే హింసించిన వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. నిరుపేదలకు న్యాయ స్థానాల్లో ఉచిత న్యాయ సేవా, సలహా కేంద్రాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. –న్యాయవాది చీర్ల గిరిజారాణి మహిళలకు అండగా ‘నిర్మల’ నిర్మల్అర్బన్: నిర్మల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మునుబర్తి నిర్మల మహిళలకు అండగా నిలు స్తోంది. తను ఎదుర్కొన్న కష్టాలు మరే మహిళ పడకూడదనే ఉద్దేశంతో ‘మహిళా మండలి’ ఏర్పాటు చేసి బాధితులకు న్యా య సహాయం అంది స్తోం ది. మహిళలపై జరుగుతున్న దాడులు, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, లైంగిక వేధింపులు, స్త్రీల హక్కులు, కట్నం కోసం వేధింపులు తదితర రుగ్మతలపై పోరాడుతోంది. యువతులకు మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తుంది. న్యాయవాదిగా ఎదిగి.. నిర్మలది ప్రేమ వివాహం. వివాహానంతరం తన కుటుంబసభ్యుల నుంచి సహకారం అందలేదు. సన్నిహితులందరి నుంచి ఆదరణ కరువైంది. అప్పటికి నిర్మల ఏడో తరగతి మాత్రమే చదువుకుంది. ఆమెకు చదువు విలువ తెలిసివచ్చి నిర్మల్లోని డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ ద్వార డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఎల్ఎల్బీ హైదరాబాద్లో పూర్తి చేశారు. 2011లో బార్ కౌన్సిల్లో సభ్యత్వం తీసుకున్నారు. ఎన్నో శ్రమలను ఎదుర్కొని స్వయం శక్తితో న్యాయవాదిగా ఎదిగారు. మహిళా మండలి ఏర్పాటు.. బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందిన తర్వాత 2012లో ఐద్వా ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్గా పనిచేశారు. ఆ తర్వాత మహిళలు, యువతులకు న్యాయ సహాయం అందించేందుకు మహిళా మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలి ద్వారా కళాశాలల్లో యువతులకు ప్రేమ పేరిట జరుగుతున్న మోసాలపై, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారి మధ్య మనస్పర్దలు వస్తే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -నిర్మల, న్యాయవాది న్యాయవాది వృత్తి ఉన్నతమైనది లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని ఊత్కూరు గ్రామ పంచాయతీ పరిధి గంపలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ళ పద్మ న్యాయవాది వృత్తిలో రాణిస్తుంది. ముం బాయిలో డిగ్రీ వరకు చదువుకుని వివా హం కావడంతో గ్రామానికి విచ్చేసి చదువుపై ఉన్న శ్రధ్ధతో న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో కష్టపడి హన్మకొండలోని లా కళాశాల నుంచి న్యాయవాద పట్టా సంపాదించారు. 2012వ సంత్సరం నుంచి మండల కేంద్రంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రస్తుత రోజుల్లో కష్టపడితే సాధించలేనిది ఏది లేదంటున్నా రు. సమాజంలో మహిళలు ఇంకా ముందుకు రావాలని సూచించారు. భర్త ప్రైవేటు వాహన డ్రైవర్గా చేస్తుంటారు. ఇద్దరు పిల్లలను చదివిస్తూ కుటుం బానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. న్యాయవాద వృత్తి వలన అన్ని చట్టాలు తెలసి ఉంటాయని ప్రతి విషయంపై అవగాహన వస్తుందన్నారు. న్యాయవాద వృత్తి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. -న్యాయవాది పద్మ మహిళలు విభిన్న రంగాల్లో రాణించాలి ఖానాపూర్: స్త్రీలు విభిన్న రంగాల్లో రాణించినప్పుడే వారికంటూ ఒక ప్రత్యేకతతో పాటు గుర్తింపు ఉంటుందనేది నా నమ్మకం అని న్యాయవాది తునికి అరుణ అన్నారు. సోమవారం నేను శక్తిలో భాగంగా సాక్షితో మాట్లాడారు. తాను న్యాయవాది వృత్తిలో రాణించడానికి నా కుటుంబ ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. స్త్రీ సమానత్వం కుటుంబ స్థాయి నుంచే ఉండాలని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలను ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివించి వారి లక్ష్యం మేరకు ప్రోత్సహించినప్పుడే మహిళలు వివిధ రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉందన్నారు. ప్రతి మహిళలో సామాజిక చైతన్యంతోపాటు చట్టాలపై సరైన అవగాహన ఉన్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సగర్వంగా జీవిస్తారన్నారు. మహిళాభ్యున్నతి సాధించాలంటే కేవలం సాధికారిత సాధిస్తే సరిపోదని, దాని ఫలాలు అందరికీ అందేలా చూసినప్పుడే అది సాధ్యం అవుతుందన్నారు. నేడు మహిళా సాధికారిత పేరుతో ఎన్నో చట్టాలు, సభలు, సంఘాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. మహిళలపై జరిగే అన్యాయాలను ప్రతిఘటించాలి. -న్యాయవాది తునికి అరుణ సంకల్పమే సగం బలం ఆదిలాబాద్: సంకల్పమే సగం బలం అంటారు. అనుకున్నది సాధించాలనే తపన ఆమెను ముందుకు నడిపించింది. కుటుంబ పోషణ బాధ్యతను మోస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు రావాలనుకుంది. అది చదువుతోనే సాధ్యమవుతుందని చిన్నప్పటి నుంచి న్యాయవాది కావాలన్న కోరికను నెరవేర్చుకుంది ఆదిలా బాద్కు చెందిన అడ్డి మంజులతరెడ్డి. తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్రెడ్డి, సుచితల కూతురే మంజులతరెడ్డి. న్యాయవాది కావాలని.. మంజులతరెడ్డిది వ్యవసాయ కుటుంబం. అయినా తండ్రి కూతురు చదువును పోత్రహించాడు. చిన్నప్పటి నుంచే తాను న్యాయవాదిని కావాలనే కోరిక బలంగా ఉండేది. శిశు నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్లోని శిశుమందిర్ పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీ జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి చేసింది. 1996లో డిగ్రీ పూర్తి అయిన తర్వాత మూడు సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగం చేశారు. 2000 సంవత్సరంలో పెళ్లైంది. పెళ్లి తర్వాత కూడా తన చదువు వృథా పోకూడదని, ఏదైతే చిన్నప్పటి నుంచి న్యాయవాది కావాలనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అనుకుంది. తాను చదువుకున్న చదువుకూ.. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనుకుని ఎల్ఎల్బీ చేయాలని నిర్ణయించుకుంది. భర్త చంద్రశేఖర్రెడ్డి ఇందుకు ప్రోత్సహించడంతో చంద్రాపూర్లోని నాగ్పూర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో ప్రవేశం పొందారు. అయితే స్వతహాగా ఆమె తెలుగు మీడియం కావడంతో ఇంగ్లిష్ పరీక్ష రాయడం ఇబ్బందిగా మారింది. దీంతో లీగల్ డిక్షనరీ తనకు ఎంతో ఉపయోగపడింది. పరీక్షల సమయంలో 30 సబ్జెక్టులను టెస్టు పేపర్ ద్వారానే పరీక్షలకు సిద్ధమైంది. ఇంట్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతలు చూసుకుంటూనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. 2006లో ఎల్ఎల్బీ పట్టా పొందారు. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు కోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత 2009లో ఉమెన్ వెల్ఫేర్ గృహహింస చట్టంలో లీగల్ కౌన్సిలర్గా నియామకమయ్యారు. ఎంతో మందికి కౌన్సెలింగ్ ఇస్తూ దంపతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది మంజులతరెడ్డి. మహిళలు రాణించగలరని.. ప్రస్తుత తరుణంలో ప్రతి మహిళ వైద్యురాలిగా లేదంటే ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని కోరుకుంటారు. కానీ మంజులతరెడ్డి అందుకు భిన్నంగా న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు. అయితే కొంత మంది న్యాయవాదులు మహిళలు న్యాయవాది వృత్తిలో రాణించలేరని.. ఇందులో ఆదాయం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ అభిప్రాయాలను ఆమె లెక్కచేయలేదు. కొంత మంది సీనియర్ న్యాయవాదులు ఆమెను ప్రోత్సహించడంతో ఆమె ఇందులో నిలదొక్కుకున్నారు. తన భర్త, కుటుంబ సభ్యులు తనకు ఎంతో అండగా ఉండడంతోనే తాను ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగానని మంజులతరెడ్డి చెబుతోంది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనే ఆమె నిరూపించింది. -మంజులత రెడ్డి ఇష్టపడే న్యాయవాద వృత్తిలోకి.. కాగజ్నగర్టౌన్: ఇష్టపడి చదివి న్యాయవాది వృత్తిని ఎంచుకున్నాను. నేను 1వ తరగతి నుంచి బీఎస్సీ వరకు కాగజ్నగర్ పట్టణంలోనే చదివినాను. ఎల్ఎల్బీ వరంగల్లో పూర్తి చేసి 2012 నుంచి న్యాయవాది వృత్తి చేస్తున్నాను. తండ్రి ఫజల్ ఆహ్మద్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే న్యాయవాది వృత్తిలో రాణిస్తున్నాను. జనవరి 26న ఉత్తమ న్యాయవాదిగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చేతుల మీదుగా ప్రశంస పత్రం తీసుకున్నాను. మహిళ రిప్రజంటేటివ్ సిర్పూర్(టి) కోర్టు, మానవహక్కుల కమిషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యురాలుగా ఉన్నాను. పేద మహిళ సమస్యలపై స్పందించి పేదల కోసం ఉచితంగా వాదిస్తున్నాను. లోక్ ఆదాలత్లో మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాను. పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి. చట్టాలు తెలియన అమాయక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. -రాహత్ ఫాతిమా, న్యాయవాది, సిర్పూర్(టి) కోర్టు చదువే అన్నింటికీ మూలం ఆమె చిన్నతనంలోనే తండ్రి అకాల మరణం చెందాడు. నలుగురు పిల్లల సంతానం ఉన్న ఆ కుటుంబంలో ఆమె మూడో వ్యక్తి. డిగ్రీ వరకు చదువుకున్నాక అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.అప్పటికే చదువు ఆగిపోయినట్లేనని భావించిన ఆమెకు భర్త , బంధువులు, కుటుంబ సభ్యుల సహకారం లభించడంతో పట్టుదలతో చదివి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రస్తుతం బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న ఆ మహిళనే నల్లుల సంగీత. తన కుటుంబ నేపథ్యం, ఎంచుకున్న లక్ష్యం గురించి‘ సాక్షి’తో ఆమె ముచ్చటించారు. బెల్లంపల్లి: మాది బెల్లంపల్లి మున్సిపాలిటీలోని రైల్వే రడగంబాల బస్తీ.మాది అత్యంత మధ్యతరగతి కుటుంబం.మా తల్లిదండ్రులు నల్లుల మాధవి, కృష్ణకు నలుగురం సంతానం. నేను మూడో వ్యక్తిని. నాకు అక్క, అన్న, తమ్ముడు.మా నాన్న అకాల మరణం చెందడంతో మా కుటుంబ పరిస్థితి కష్టాల్లో పడింది. కష్టాలు పడుతూనే మా అమ్మ అన్నీ తానై మాకు చదువు చెప్పిం చింది.నేను డిగ్రీ వరకు చదువుకున్నాక లోకం పోకడ కొంత అవగతమైంది.అంతలోనే ప్రేమ పెళ్లి చేసుకున్నాను. చదువుకోవాలనే ఆసక్తి కూడా తగ్గింది. కానీ నా భర్త ఉపేందర్, అత్తా మామ మా బంధువులు, సన్నిహితులు, మా కుటుంబ సభ్యులు ప్రోత్సహించి నాతో ఎల్ఎల్బీ చది వించారు.హైదరాబాద్లోని ఆదర్శ లా కళాశాలలో చదివి 2015లో ఎల్ఎల్బీ పట్టా అందుకున్నాను. రెండేళ్ల నుంచి న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్నాను. న్యాయ శాస్త్రం చదవడం వల్ల అ న్నింటా వివక్షతకు గురవుతున్న మహిళలకు న్యా య సలహాలు అందించడానికి, న్యాయం చేయడానికి వీలు కలిగింది. చదువుకోవడం వల్లే.. అన్నింటికీ మూలం చదువు. విద్య నేర్వడం వల్ల సమాజంలో జరుగుతున్న పరిణామాలను, మం చి చెడు విచక్షణ అవగతమవుతుంది. అన్నింటికి మించి ధైర్యం వ స్తుంది. చదువుతోనే సమాజంలో గౌరవం దక్కుతుంది. నేను ఉ న్నత విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టడం వల్ల న్యాయమూర్తి ముందు కుర్చీలో కూర్చునే గౌరవం దక్కింది. ఇది నాకెంతో ఆనందంగా ఉంది. మా కుటుంబ సభ్యులు అమ్మాయికి చదువెందుకని భావిస్తే ప్రస్తుతం నేనీ స్థితిలో ఉండే అవకాశం ఉండేది కాదు. చదువుతోనే ధైర్యం.. విద్యను అభ్యసించడం వల్ల మహిళలకు ఎంతో ధైర్యం వస్తుంది. ఎన్నో విషయాలపై అవగాహన కలుగుతుంది.బాలికలు ఏదైనా సమస్య ఎదురైతే మానసికంగా కుంగి పోకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని గ్రహించాలి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. -సంగీత (న్యాయవాది) ఆడపిల్లలను అర్థం చేసుకోవాలి మంచిర్యాలటౌన్: తల్లిదండ్రులు ఆడ పిల్లలను ఎంతో ప్రేమతో పెంచినా, పెళ్లి విషయం వచ్చేసరికి మాత్రం వారి పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా, డబ్బు, హోదా, ఉద్యోగాలను చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నారని మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహిళా న్యాయవాది కండెవీర చిదానంద కుమారి అన్నారు. న్యాయవాదిగా పనిచేస్తూ ఫ్యామిలీ కౌన్సెలింగ్కు ప్రత్యేకంగా ఆమె పనిచేస్తుండగా, అమ్మాయిలు, మహిళల పట్ల జరుగుతున్న వివక్షను అమె ‘సాక్షి’తో పంచుకున్నారు. పెళ్లి అయ్యాక అమ్మాయిలు వారి ఇష్టాలకు దూరంగా బతుకును వెళ్లదీసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నేను పుట్టి పెరిగింది వరంగల్లో. మా అమ్మానాన్న పీఎల్ నర్సింగరావు ఎల్ఐసీలో జాబ్చేస్తూ మా ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ఎంఏ పూర్తి చేసిన నాకు మంచిర్యాలకు చెందిన కేవీ ప్రతాప్తో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత తనకు చదువుకోవాలని ఉందని చెప్పిన వెంటనే నా భర్త నన్ను ఎల్ఎల్బీ చేసేందుకు ప్రోత్సాహం ఇచ్చారు. ఎడ్యుకేషన్పై పీహెచ్డీ కూడా చేసి, 1990 నుంచి మంచిర్యాలలోనే లాయర్గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత కోర్టుకు వచ్చే ఫ్యామిలీ కేసులను తనకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు వందకు పైగా వివిధ సమస్యలతో వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇవ్వగా, అందులో సగానికి పైగానే పలువురు మారి సంసార జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. కూచిపూడి నృత్యంలో ఆల్ ఇండియా కూచిపూడి పోటీల్లో 1982లో మొదటి బహుమతిన పొందాను. పెళ్లి తరువాత తనకు వచ్చిన కూచిపూడిని నలుగురికి అందించాలని ఉచితంగా నేర్పిస్తూనే ఉన్నాను. మంచిర్యాల మహిళా తరంగిణి(మమత) అనే మహిళా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి మహిళలకు ఉన్న చట్టాలు, సమాజంలో మహిళలు సమస్యలను ఎదుర్కొనే విధానాన్ని వివరిస్తున్నాను. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ, మహిళల్లో చైతన్యం తీసుకువస్తున్నాను. తన దగ్గరకు వచ్చే వారికి ఉచితంగా న్యాయసలహాలు, కౌన్సెలింగ్ ఇస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయిని బీటెక్ ఎంబీఏ చదివించి పెళ్లి చేశాను. అబ్బాయి ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అన్నీ కుటుంబసమస్యలే ఫ్యామిలీ కౌన్సెలింగ్కు వచ్చే వారిలో ఎక్కువగా భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. అందులో భార్యను అదనపు కట్నం కోసం వేధించడం, ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని భార్యను హింసిస్తున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుంది. పురుషులు, మహిళలు సమానం అనే భావన ఇప్పటికీ నేను చూసిన కేసుల్లో ఎక్కడా కనబడడం లేదు. పురుషులు అహంతో కూడిన వారే ఎక్కువగా చూశాను. కౌన్సెలింగ్కు రెండేళ్ల సమయం తీసుకున్నా, వారిలో మార్పు రాకపోవడం, మహిళల్లో మార్పు వచ్చినా సంసారంలో మళ్లీ పురుషుల ఆధిక్యత పెరిగి విడిపోతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. మంచి ఉద్యోగం ఉందని పెళ్లి చేస్తే, తమ అమ్మాయి వేధింపులకు బలవుతుందన్న ఆందోళన వారి తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. పెళ్లి చేయడం ఎంత ముఖ్యమో, అమ్మాయికి తగిన వారిని చూసి చేయడం అంతే ముఖ్యం. ఆడపిల్లల మనసును అర్థం చేసుకుని వారి ఇష్టాల్ని తెలుసుకుని ప్రవర్తించాలి. మగవారితో సమానంగా ఆడవారికి కూడా హక్కులున్నాయనే విషయాన్ని గుర్తించాలి. -చిదానంద కుమారి -
కోర్టులో కాల్పులు..ఇద్దరు లాయర్ల మృతి
-
కోర్టులో కాల్పులు..ఇద్దరు లాయర్ల మృతి
లాహోర్ : పాకిస్తాన్లోని లాహోర్ సెషన్స్ కోర్టులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు లాయర్లు మృతిచెందారు. మృతిచెందిన వారు రాణా ఇష్తియక్, ఓవైస్ తాలిబ్ అనే లాయర్లుగా గుర్తించారు. కాల్పులు జరిపిన కాషిఫ్ రాజ్పుత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రాణా ఇష్తియక్, కాషిఫ్ రాజ్పుత్కు వరసకు సోదరుడవుడాడు. కాల్పులను అడ్డుకోబోయిన తాలిబ్పై కూడా రాజ్పుత్ కాల్పులు జరపడంతో తీవ్రగాయాలు అయ్యాయి. తాలిబ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి షెబాజ్ షరీఫ్ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.