Mammootty
-
మెగాస్టార్ ఇంట్లో బస చేసే ఛాన్స్.. రోజుకు రూ.75,000!
హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్ట్లీ బంగ్లాలో నివసిస్తారు. వారిని చూసేందుకు స్టార్ హీరోల ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు ఫ్యాన్స్. అంతేకాదు.. కథానాయకుల లైఫ్స్టైల్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? ఎక్కడకు వెళ్తుంటారు? ఇంద్రభవనంలాంటి ఇల్లు లోపల ఎలా ఉంటుంది? ఇలా అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఓ హీరో బంపరాఫర్ ఇస్తున్నారు. తన ఇంట్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే హోటల్ మాదిరిగానే ఇక్కడ కూడా రోజుకింత అని డబ్బు కట్టి ఉండొచ్చట.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ ఇల్లు ఎక్కడ అనేది పూర్తి కథనంలో చదివేయండి..ఇంటిని అభిమానుల కోసం..మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)కి కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్లో ఓ ఇల్లుంది. భార్య సుల్ఫాత్, కుమారుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), కూతురు కుట్టి సురుమితో కలిసి 2008 నుంచి 2020 వరకు ఇదే ఇంట్లో నివసించారు. ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ పాతింటికి వస్తూ వెళ్తుంటారట! అయితే సకల వసతులు ఉన్న ఈ ఇంటిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక.. అభిమానులకు ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ప్లాన్ను అమల్లోకి తెచ్చారు. ఒక్కరోజు ఉండాలంటే..ఇంతకాలం ఇంటిని బయటనుంచే ఫోటోలు తీసుకున్న అభిమానులు ఇప్పుడెంచక్కా ఇంట్లోనే బస చేయొచ్చు. మమ్ముట్టి గదిలో, దుల్కర్ గదిలో సేద తీరొచ్చు. తండ్రీకొడుకుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రైవేట్ థియేటర్, గ్యాలరీ రూమ్ చూసేందుకు కూడా వీలు కల్పిస్తారట! ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే రూ.75 వేలు చెల్లించాలి. ఏప్రిల్ 1 నుంచి బుకింగ్స్ మొదలుపెడతారట! ఎంత ఖర్చయినా పర్లేదు, మమ్ముట్టి ఇంటికి వస్తాం.. ఆయన్ను కలుస్తాం అనుకునేరు.. కేవలం ఆయన ఇంట్లో బస చేయడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మమ్ముట్టిని, దుల్కర్ను కలిసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయరు.దుల్కర్ సల్మాన్ బెడ్రూమ్సినిమా..మమ్ముట్టి.. చివరగా డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే సినిమా చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం మమ్ముట్టి బజూక అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీనో డెనిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈయన చివరగా లక్కీ భాస్కర్ చిత్రంతో అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార, ఐయామ్ గేమ్ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by VKation Experiences (@vkationexperiences) చదవండి: 'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్ -
మలయాళ మెగాస్టార్పై రూమర్స్.. స్పందించిన టీమ్!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్పై ఆయన టీమ్ స్పందించింది. గత కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన స్టార్ సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని పేర్కొంది. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని వెల్లడించింది.మమ్ముట్టి టీమ్ తమ ప్రకటనలో రాస్తూ.. 'ఆయన ప్రస్తుతం రంజాన్ ఉపవాసం ఉన్నందున సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే అతను తన షూట్ షెడ్యూల్ నుంచి కూడా విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మోహన్ లాల్- మహేష్ నారాయణన్ సినిమా షూటింగ్కి తిరిగి వెళ్తారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్" అని స్పష్టం చేశారు.కాగా.. మమ్ముట్టి, మోహన్లాల్లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు. కాగా.. మమ్ముట్టి చివరిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన కామెడీ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్లో కనిపించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 23న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. -
కొచ్చి టు ఢిల్లీ
మోహన్లాల్(Mohanlal), మమ్ముట్టి(Mammootty) హీరోలుగా మలయాళంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో హీరోయిన్ నయనతార(Nayanthara) నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొచ్చిలో జరుగు తోంది.ఈ మూవీ షూటింగ్లో నయనతార జాయిన్ అయ్యారని మేకర్స్ ఆదివారం ప్రకటించారు. అలాగే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఢిల్లీలో జరుగనుందని, ఈ షెడ్యూల్తో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు గతంలో ‘తస్కరవీరన్ (2005), రప్పకల్ (2005), భాస్కర్ ది రాస్కెల్ (2015), పుతియ నియమం (2016)’ వంటి చిత్రాల్లో మమ్ముట్టి–నయనతార స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
మోహన్లాల్ 'లూసిఫర్2' మూవీ టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆప్తుడి ఇంటి వేడుకలో మమ్మూటీ, దుల్కర్ల సందడి (ఫొటోలు)
-
పదహారేళ్ల తర్వాత...
మోహన్లాల్, మమ్ముట్టి కాంబినేషన్లో దాదాపు యాభైకి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2008లో రిలీజైన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ సినిమా చేయలేదు. పదహారేళ్ల తర్వాత మోహన్లాల్, మమ్ముట్టి ఓ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో ‘మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్’ వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా, మరో కీలకపాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో మొదలైంది. మమ్ముట్టి, మోహన్లాల్, కుంచాకోల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాదల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్లాల్ నటించారు. కానీ ఈ చిత్రంలో మోహన్లాల్ది అతిథిపాత్ర. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తాజా ఫుల్ లెంగ్త్ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. -
మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా.. ఆ లిస్ట్లో ఏకంగా రెండో స్థానం!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్వైట్లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్ను వెల్లడించింది. ఈ లిస్ట్లో మొదటిస్థానంలో ది సబ్స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది. (ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)‘భ్రమయుగం’ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్లో అందుబాటులో ఉంది.Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024 -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్లో...
మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ దశాబ్దం తర్వాత మళ్లీ కలిసి నటించి ఫ్యాన్స్ను ఖుషీ చేయనున్నారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నాయి. 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్రాన్ని షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మూవీ స్టోరీలైన్కి తగ్గట్టు షూటింగ్ లొకేషన్ పర్మిషన్ కోసం నిర్మాతలు శ్రీలంక ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినట్టు కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం షూటింగ్ శ్రీలంకలోనూ మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్లోనూ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి, మోహల్ లాల్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు మహేశ్ నారాయణ్. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్లాల్ చివరిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్ను షేర్ చేసుకున్నారు. -
అంతిమంగా సినిమా బతకాలి: మమ్ముట్టి
మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడంతో ఇందుకు నైతిక బాధ్యత వహించి, ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్లాల్తో పాటు కమిటీ సభ్యులందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా హేమా కమిటీ నివేదికపై ఆల్రెడీ మోహన్లాల్ స్పందించారు. తాజాగా మరో అగ్రనటుడు మమ్ముట్టి ఈ అంశం గురించి సోషల్ మీడియాలో సుధీర్ఘమైనపోస్ట్ను షేర్ చేశారు. ఈపోస్ట్ సారాంశం ఈ విధంగా...⇒ ఓ సంస్థకు సంబంధించి ఒక విధానం ఉంటుంది. మొదట నాయకత్వం స్పందించిన తర్వాతే సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను ‘అమ్మ’లో సభ్యుడిని మాత్రమే. అందుకే నేను కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను. ⇒సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులు సినిమాల్లోనూ ఉంటాయి. అయితే సినిమాలపై సమాజం దృష్టి చాలా దగ్గరగా ఉంటుంది. జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు. ఒక్కోసారి చిన్న అంశాలు కూడా పెద్ద స్థాయి చర్చలకు కారణమవుతుంటాయి. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ⇒ ఓ దురదృష్టకర సంఘటన (2017లో జరిగిన దిలీప్– భావనా మీనన్ల ఘటనను ఉద్దేశించి కావొచ్చు) జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని నియమించింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, సలహాలు, పరిష్కారాలను స్వాగతిస్తున్నాం. అయితే ఈ అంశాలను అమలు చేయడానికి మలయాళ చిత్ర పరిశ్రమలో అన్ని అసోసియేషన్లు ఏకతాటి పైకి రావాలి. ఇక హేమా కమిటీ పూర్తి నివేదిక కోర్టులో ఉంది. కమిటీకి అందిన ఫిర్యాదులపైపోలీసులు నిజాయితీగా విచారణ చేస్తున్నారు. దోషులను కోర్టు శిక్షిస్తుంది. హేమా కమిటీ సిఫార్సులు అమ్మలయ్యేలా చట్టపరమైన కార్యాచరణ జరగాలి... అంతిమంగా సినిమా బతకాలి. -
హేమ కమిటీపై 'మమ్ముట్టి' ఫస్ట్ రియాక్షన్ ఇదే
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు చాలామంది క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. ఇప్పటికే మలయాళ పరిశ్రమలోని ప్రముఖులు చాలామంది పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రముఖ హీరో మమ్ముట్టి తొలిసారి స్పందించారు.మాలీవుడ్లో కొంతమంది అగ్ర నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న సమయంలో మమ్ముట్టి ఇలా స్పందించారు. హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న సూచనలు, పరిష్కారాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. సినిమా షూటింగ్ సమయంలో మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా దర్శక నిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హేమ కమిటీకి నా మద్దతు ఉంటుంది. చిత్రపరిశ్రమపై అద్యయనం చేసిన హేమ కమిటీ పలు సూచనలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అందరి మీద ఉంది. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల విచారణ నిజాయితీగానే జరుగుతుంది. జస్టిస్ హేమ కమిటీ అందించిన రిపోర్ట్ కోర్టు వద్ద ఉంది. విచారణ పూర్తి అయిన తర్వాత నిందితులకు తగిన శిక్షను కూడా కోర్టు విధిస్తుంది. ఇండస్ట్రీలో 'పవర్ సెంటర్' అనేది లేదు. కానీ, సినిమా బతకాలి.' అనేది తన అభిప్రాంయ అని మమ్ముట్టి పేర్కొన్నారు. -
ఆయన అడిగిన ప్రశ్న ఎంతో బాధించింది: నటి అంజలి అమీర్
మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారిన హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాలివుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ నుంచి పలు సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఇతర నటులు గతంలో తమ చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్జెండర్ నటి అంజలి అమీర్ తన అనుభవాలను పంచుకున్నారు.మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అంజలి అమీర్ ఇలా పంచుకున్నారు. ' 2018లో మమ్ముట్టి నటించిన పెరున్బు అనే తమిళ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ఆ సినిమాలో సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ నన్ను ప్రశ్నంచారు. అప్పుడు నేను చాలా కలత చెందాను. ఆయన అడిగేంత వరకు, నేను అలాంటి బాధాకరమైన అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను బలంగా ఉన్నాను, కానీ ఈ ప్రశ్న నాకు చాలా కోపం తెప్పించింది. అతడిని హెచ్చరించి మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేశాను. ఆపై వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. మరలా నాతో అలా మాట్లాడలేదు. నేను ఆయన్ను అభినందిస్తున్నాను.' అని అంజలి అమీర్ అన్నారు. సూరజ్ వెంజరమూడ్ టాలీవుడ్కు పరిచయమే.. డ్రైవింగ్ లైసెన్స్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాలతో పాటు నాగేంద్రన్స్ హానీమూన్స్ వెబ్ సిరీస్తో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు.ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్లు, ఫేవర్లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి పేర్కొంది. -
జాతీయ అవార్డులు: ఆ స్టార్ హీరో సినిమా ఒక్కటీ పంపలేదు
జాతీయ అవార్డుల కోసం 300 చిత్రాల వరకు పోటీ.. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మమ్ముట్టి సినిమా లేదు. ఈ మాట అంటున్నది మరెవరో కాదు జాతీయ అవార్డు జ్యూరీ మెంబర్, దర్శకుడు ఎమ్బీ పద్మకుమార్. మమ్ముట్టి.. 2022 నుంచి గతేడాదివరకు దాదాపు తొమ్మిది సినిమాలతో అలరించాడు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా జాతీయ అవార్డు కోసం పంపలేదు.ఒక్క సినిమా పంపలేదుదీని గురించి డైరెక్టర్ పద్మకుమార్ మాట్లాడుతూ.. మమ్ముట్టి నటించిన ఒక్క సినిమాను కూడా అవార్డుల కోసం పంపలేదు. జనాలు మాత్రం మళ్లీ ప్రభుత్వాన్ని తప్పుపడతారు. అసలు ఇలా ఎందుకు జరిగిందని మేము అడుగుతున్నాం. మమ్ముట్టి అద్భుత నటన కనబర్చిన సినిమాలను కూడా సబ్మిట్ చేయకపోవడం ఘోర తప్పిదం.మాలీవుడ్కు తీరని లోటుఇది కేవలం మమ్ముట్టికి మాత్రమే లోటు కాదు.. మలయాళ సినిమాకు కూడా తీరని లోటు అని పేర్కొన్నాడు. కాగా 2023లో వచ్చిన నాన్పకల్ నెరటు మయక్కం, కాతల్: ద కోర్ వంటి సినిమాలు మమ్ముట్టికి మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలు జాతీయ అవార్డు కోసం పోటీపడ్డాయి. జాతీయ అవార్డులుమలయాళ మూవీ ఆట్టమ్ ఉత్తమ చిత్రంగా నిలవగా రిషబ్ శెట్టి (కాంతార)ని ఉత్తమ నటుడు అవార్డు వరించింది. తిరుచిత్రాంబళమ్ మూవీకిగాను నిత్యామీనన్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. కార్తికేయ 2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. -
OTT: మమ్ముట్టి ‘టర్బో’ రివ్యూ
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన చిత్రం ‘టర్బో’. ఇదో సీరియస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. దీనికి దర్శకులు వైశాఖ్. డెబ్బై ఏళ్ళ పైబడి వయస్సులో ఉన్న మమ్ముట్టి ఈ సినిమాలో నలభై ఏళ్ల వ్యక్తిలా యంగ్ అండ్ ఎనర్జిటిక్గా కనిపించారు. టర్బో జోస్ (మమ్ముట్టి) తనకు సంబంధం లేని తగాదాల్లో తల దూరుస్తుంటాడు. అతనిది ఎవ్వరికీ భయపడని మనస్తత్వం... ఒక్క వాళ్లమ్మకు తప్ప. జోస్కి మంచి ఆప్తుడు జెర్రీ. జెర్రీకి సంబంధించిన ఓ సమస్యను పరిష్కరించడంలో జెర్రీని ప్రేమించిన నిరంజనకు జోస్ తారసపడి, అదే సందర్భంలో తన ఆప్తుడైన జెర్రీని పోగొట్టుకుంటాడు. అలాగే జెర్రీ సమస్య నగరంలో అసమాన్యుడి నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయపడే వెట్రివేల్ షణ్ముగంతో ముడిపడి ఉంటుంది. దీంతో వెట్రివేల్తో టర్బో జోస్ పోరాడవలసి వస్తుంది. అసలు జెర్రీకి వచ్చిన సీరియస్ సమస్య ఏంటి ? జెర్రీ ఎలా చనిపోయాడు? వెట్రివేల్ను జోస్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది మాత్రం సోనీ లివ్ ఓటీటీæ తెరమీదే చూడాలి. టర్బో అంటే అదనపు శక్తి అన్నమాట. టైటిల్కి తగ్గట్టే సినిమాలో ఎలిమెంట్స్ అన్నీ అదనపు శక్తితో నడుస్తాయి. మమ్ముట్టి మంచి ఈజ్తో జోస్ పాత్రను రక్తి కట్టించారు. ఆ తరువాత చెప్పుకోవలసిన పాత్ర రాజ్ బి. శెట్టిది. ఇతనే వెట్రివేల్ షణ్ముగం. ఈ సినిమాలో ప్రతినాయకుడు. విలన్ పాత్రలో రాజ్ బి. శెట్టి చాలా విలక్షణంగా చేశారు. ఈ పాత్రలతో పాటు సినిమా మొత్తం యాక్షన్, కామెడీ సన్నివేశాలతో సీరియస్ కథను సరదా స్క్రీన్ప్లేతో తెరకెక్కించిన విధానం అద్భుతం. వీకెండ్కి ఓ మంచి సినిమా ఈ ‘టర్బో’. – ఇంటూరి హరికృష్ణ -
'నేషనల్ అవార్డ్స్.. రేసులో స్టార్ హీరో
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు సాయింత్రం ప్రకటించనుంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నేడు (ఆగష్టు 16) జాతీయ అవార్డు అందుకోనున్న వారి జాబితా మాత్రం విడుదల అవుతుందని సమాచారం ఉంది.ఎంపిక విధానం2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్ను అందిస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్లో మార్పులు వచ్చాయి. దీంతో 2022కు సంబంధించిన సినిమాలకు నేడు విన్నర్స్ జాబితా విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ను వారు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్లు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి.ఉత్తమ హీరో రేసులో ఎవరున్నారు..?70వ జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ హీరోగా ఎంపిక అయింది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే, మమ్ముట్టి, రిషబ్ శెట్టి, విక్రాంత్ మాస్సే మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ రోషాక్, నాన్ పకల్ నేరత్తు మయక్కం అనే రెండు సినిమాలతో మమ్ముట్టి టాప్లో ఉన్నారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఉంటే... 12th ఫెయిల్ సినిమా ద్వారా విక్రాంత్ మాస్సే తర్వాతి స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ నుంచి పోటీలు ఉన్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈసారి కూడా సౌత్ ఇండియా హీరోకే అవార్డ్ దక్కుతుందని తెలుస్తోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ హీరోగా అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. -
ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి హిట్ సినిమా
ఇతర భాషల్లో హిట్ అందుకున్న సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఓటీటీ వేదికలపైన ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అబ్రహామింతే సంతాతికల్ ఇప్పుడు తెలుగులో వచ్చేస్తుంది. మమ్ముట్టి నటించిన ఈ సినిమా డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. 2018లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు ఆరేళ్ల తర్వాత తెలుగు ఓటీటీలో విడుదల కానుంది.మమ్ముట్టి నటించిన డెరిక్ అబ్రహాం ఆగష్టు 10వ తేదీన తెలుగు ఆహా ఓటీటీలో విడుదల కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి షాజీ పాడూర్ దర్శకత్వం వహించారు. గుడ్విల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై టీఎల్ జార్జ్, జాబీ జార్జ్ నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్తో ప్రేక్షకులను థ్రిల్లింగ్కు గురిచేసే కథతో దీనిని తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మమ్ముట్టి మెప్పించారు. సుమారు రూ. 5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 45 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యల కేసును ఏఎస్పీ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) ఎలా పూర్తి చేశారనేది ప్రధానాంశంగా ఉంటుంది. ఆగష్టు 10వ తేదీన డెరిక్ అబ్రహాం చిత్రాన్ని ఆహా ఓటీటీలో చూసేయండి. -
ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట!
ఫిలింఫేర్ (సౌత్) 2024 అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో శనివారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని సినిమాలకు, నటీనటులకు పురస్కారాలు అందించారు. నాన్పకల్ నెరతు మయక్కమ్ సినిమాకుగానూ మలయాళ స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.ఇది 15వ అవార్డ్ఈ పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో మమ్ముట్టి ఎమోషనల్ అయ్యాడు. అవార్డు తీసుకుంటున్నందుకు అంత సంతోషంగా ఏమీ లేదన్నాడు. విక్రమ్, సిద్దార్థ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మమ్ముట్టి.. 'ఇది నా 15వ ఫిలింఫేర్ అవార్డ్.. ఈ మూవీలో నేను ద్విపాత్రాభినయం చేశాను. తమిళ్, మలయాళం మాట్లాడాను. ఈ చిత్రాన్ని నేనే నిర్మించాను. ఈ విజయాన్ని సాధించేందుకు తోడ్పడ్డ టీమ్కు కృతజ్ఞతలు.అందువల్లే ఈ బాధనిజానికి ఈ క్షణం నేనెంతో సంతోషంగా ఉండాలి. కానీ ఆ ఆనందమే లేకుండా పోయింది. కేరళలోని వయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రులయ్యారు. ఆ ప్రమాదం మనసును కలిచివేస్తోంది. మీరు కూడా బాధితులకు ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను' అని పిలుపునిచ్చాడు. కాగా మమ్ముట్టి వయనాడ్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు.చదవండి: రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. మ్యాడ్ ట్రైలర్ వచ్చేసింది! -
కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్.. ఎవరెవరు ఎంత..?
కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.సౌత్ ఇండియా స్టార్ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు కేరళ మంత్రి పి రాజీవ్కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్ ప్యాడ్పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్లు కీలక పాత్రలు పోషించారు.Hold on to your seats as Mammootty takes you on a roller coaster ride of thrills and twists. Stream Turbo from August 9th only on Sony LIV.#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Action #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas pic.twitter.com/xhwBhfFxbk— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రేజీ అంటే క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్కి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అంతలా స్పెషల్ అంటే.. ఏదైనా సినిమాలో గానీ సిరీస్లో మహా అయితే ఒకరిద్దరు స్టార్స్ నటిస్తారు. కానీ దీని కోసం మాత్రం దాదాపుగా ఇండస్ట్రీనే కదిలొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్లో అంతమంది స్టార్స్ ఉన్నారు. అసలు దీని సంగతేంటి? తాజాగా రిలీజైన ట్రైలర్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: మ్యూజీషియన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)ఈ ఏడాది ఏ ఇండస్ట్రీకి లేనంత సక్సెస్ రేట్ మలయాళ చిత్రపరిశ్రమ దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. వందల కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాయి. స్వతహాగా మలయాళ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ భాషలోని స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ పాజిల్.. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలామంది 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ చేశారు.రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ నటించడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
ఓటీటీకి మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ టర్బో. మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ నటుడు సునీల్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు రాజ్ బీ శెట్టి విలన్గా మెప్పించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు రిలీజైన రెండు నెలల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 9 నుంచి సోనీలివ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ഒരു മാസ്സ് ആക്ഷൻ മമ്മൂട്ടി ചിത്രം!ടർബോ ഓഗസ്റ്റ് 9 മുതൽ Sony LIVൽA mass action entertainer starring Mammootty opposite Raj B Shetty!Turbo, coming on Sony LIV from August 9th#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas #SamadTruth pic.twitter.com/LZ88S0wOxq— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
మెగాస్టార్ సినిమాలో సమంత
-
కువైట్ అగ్ని ప్రమాదంపై కమల్, మమ్ముట్టి దిగ్భ్రాంతి
కువైట్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందడం పట్ల హీరోలు కమల్ హాసన్, మమ్ముట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది మృత్యువాత పడ్డారు. బాధితుల్లో ఎక్కువమంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం కువైట్ వెళ్లి అగ్నికి ఆహుతి అయ్యారు. குவைத் நாட்டின் மங்கஃப் நகரில் உள்ள அடுக்குமாடிக் குடியிருப்பில் நேரிட்ட தீ விபத்தில் இந்தியர்கள் உள்பட 50-க்கும் மேற்பட்டோர் உயிரிழந்த செய்தி மிகுந்த அதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கிறது. உயிரிழந்தோர் குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலையும், ஆறுதலையும் தெரிவித்துக் கொள்கிறேன்.…— Kamal Haasan (@ikamalhaasan) June 13, 2024 ఈ విషాద ఘటన పట్ల కమల్ స్పందిస్తూ.. ‘కువైట్లోని మంగాఫ్లో అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో భారతీయులు సహా 50 మందికి పైగా మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘోర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి, మరణించిన వారి మృతదేహాలను మాతృదేశానికి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’అని కమల్ ట్వీట్ చేశాడు.Heartfelt condolences to the families of those affected by the Kuwait fire accident. I pray that you gather courage and find solace in this difficult time.— Mammootty (@mammukka) June 12, 2024‘కువైట్ అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో మీకు ధైర్యం, ఓదార్పునివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను’అని మమ్ముట్టి ఎక్స్లో రాసుకొచ్చాడు. -
మమ్ముట్టికి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే?
నటుడు విధార్ధ్, వాణి భోజన్ జంటగా నటించిన చిత్రం అంజామై. ఈ చిత్రం ద్వారా ఎస్వీ.సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ప్రముఖ వైద్యుడు, ర చయిత తిరునావుక్కరసు నిర్మాతగా తిరుచిత్రం పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం విడుదల హక్కులను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్స్ పొందడం విశేషం. ఈ సంస్థ ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.చిత్ర దర్శకుడు సుబ్బురామన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం పరిస్థితుల ప్రభావంతోనే రూపొందిందని చెప్పాలన్నారు. ఈ చిత్ర నిర్మాత తిరునావుక్కరసు ఒక వైద్యుడు మాత్రమే కాకుండా, రచయిత, సామాజిక సృహ కలిగిన వ్యక్తి అని చెప్పారు. నిజానికి ఇందులో నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాల్సిఉందని.. అందుకు ఆయన ఒప్పుకున్నా, అనివార్య కారణాల వల్ల ఆ పాత్రలో నటుడు రఘమాన్ను నటించాల్సి వచ్చిందని చెప్పారు. అందుకు ఈ సందర్భంగా మమ్ముటికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. అయితే ఆ పాత్రలో రఘుమాన్ చాలా బాగా నటించారని చెప్పారు. చట్టం చేసే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కారణంగా ఒక సామాన్యుడు ఎలాంటి బాధలకు గురయ్యారనేదే ఈ చిత్ర కథాంశం అని చెప్పారు. విధార్ద్ మంచి నటుడన్నది తెలిందేననీ, అయితే ఆయన నుంచి మరింత నటనను వెలికి తీసినట్లు చెప్పారు. ఇక నటి వాణీభోజన్ ఈ చిత్రంలో మరో కోణంలో నటించారని చెప్పారు. నటి వాణిభోజన్ మాట్లాడుతూ అంజామై తనకు చాలా స్సెషల్ చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటుడు రఘుమాన్, కృతిక్ మోహన్, బాలచంద్రన్ ఐఏఎస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ ఛాయాగ్రహణం, కళాచరణ్ నేపథ్య సంగీతాన్ని అందించారు. -
చివరి శ్వాస వరకు సినిమాల్లో ఉంటా.. కానీ నన్ను గుర్తుంచుకోరు: మమ్ముట్టి
మలయాళ స్టార్, మెగాస్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు. -
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
సీతారామం మూవీతో ఒక్కసారిగా స్టార్గా మారిపోయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. అంతేకాదు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో గుంటూరుకారం భామ మీనాక్షి చౌదరి అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ఇన్స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇవాళ తన తల్లిదండ్రులు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు. వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాకుండా తన పేరేంట్స్ గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దుల్కర్ ఇన్స్తాలో రాస్తూ..'మీ ఇద్దరి 45 ఏళ్లబంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ సొంత మార్గాల్లో మికోసం చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. మీలో నేను భాగమై మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా, నాన్న! మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రతో కాంబోలో వస్తోన్న చిత్రంలో దుల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు దుల్కర్ సూరారై పొట్రు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తోన్న పురాణనూరు చిత్రానికి సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం
శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి 'ఒనవిల్లు: ది డివైన్ బో' పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మార్చి 8 నుంచి మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్లో సబ్టైటిల్స్ పడుతుండటం వల్ల ఈ డాక్యుమెంటరీని ఇతర భాష వారు కూడా చూస్తున్నారు. ఓనవిల్లు అంటే శ్రీ పద్మనాభస్వామి ఆలయ స్వామికి 'ఓనవిల్లు' అంటే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరిని "ఒన్వవిల్లు కుటుంబం" అంటారు. ఈ విల్లును తయారు చేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందు 41 రోజుల తపస్సును పాటిస్తారు. ఆ వంశీయులు ఏడు తరాలుగా ఏటా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్టమైన సంప్రదాయ ఆచారం గురించి వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ఉన్ని ముకుందన్లు వాయిస్ని అందించడం విశేషం. సంపదకు రక్షణగా ట్రావెన్కోర్ కొంతకాలం క్రితం అనంతపద్మనాభ ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో ఎవరికీ తెలియని రహస్యం. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్.. బిగ్ మార్క్ను దాటేసిన మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు. భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
ఖైదీలా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
మమ్ముట్టి ఇప్పుడీ పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనం.. ఏడు పదుల వయస్సు ధాటినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్. 'యాత్ర' సినిమాతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయాడు.. తాజాగా 'భ్రమయుగం' సినిమాతో ప్రేక్షకులను మరీంత ఆశ్చర్యపరిచాడు. బ్లాక్ అండ్ వైట్లో మూడే పాత్రలతో 'భ్రమయుగం' సినిమా తీసి తన సత్తా ఎంటో నిరూపించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? అనుకుంటే సాధ్యమే అని నిరూపించాడు. ఒక స్టార్ హీరో ఒక గే పాత్ర చేయడం అంటే అంత సులభం కాదు.. 'కాదల్ ది కోర్'లో చేశాడు మమ్ముట్టి. అందరి హీరోల మాదిరి కాకుండా కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, వైవిధ్యాన్ని చూపుతు తనదైన స్టైల్లో సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. 'టర్బో' పేరుతో మరో భిన్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ ప్రాజెక్ట్.. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ను మమ్ముట్టి షేర్ చేశారు. పోలీసుస్టేషన్లో ఖైదీల మధ్యలో కూర్చుని కొత్త అవతారంలో మమ్ముట్టి కనిపించారు. ఈ లుక్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇదే క్రమంలో ఆయన 'బజూక' అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. గేమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. 'బజూక'లో బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్లో ఉన్న పోస్టర్ ఇప్పటికే వైరల్ అవుతుంది. బజూక సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. -
Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ
టైటిల్: భ్రమయుగం నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్,సిద్ధార్థ్ భరతన్ నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ తెలుగు విడుదల:సితార ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వం: రాహుల్ సదాశివన్ సంగీతం: క్రిస్టో జేవియర్ సినిమాటోగ్రఫీ: షఫీక్ మహమ్మాద్ అలీ విడుదల తేది: 23 ఫిబ్రవరి 2024(తెలుగు) ‘భ్రమయుగం’ కథేంటంటే.. తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్లో భ్రమయుగం చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రయోగాలు చేయడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్ అనే ఇమేజ్ని పక్కకి పెట్టి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. భ్రమయుగం కూడా మరో ప్రయోగాత్మక చిత్రమే. ఒక్క చిన్న పాయింట్తో రెండున్నర గంటల పాటు కథను నడిపించడం మాములు విషయం కాదు. దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ విషయంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తం కేవలం మూడు పాత్రల చుట్టే తిప్పుతూ ఆడియన్స్ని సీట్ల నుంచి కదలకుండా చేశాడు. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో తెరకెక్కించి మెప్పించాడు. మమ్ముట్టి నటన.. క్రిస్టో జేవియర్ బీజీఎం సినిమా స్థాయిని పెంచేసింది. కథగా చూస్తే భ్రమయుగంలో కొత్తగా ఏమి ఉండడు. పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు..అతని చేతిలో బంధి అయినా ఓ ఇద్దరి వ్యక్తుల కథే ఇది. పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. వాటిని మలిచిన తీరు అద్బుతంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించాడు. సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ ఉన్నా అంతగా భయపెట్టవు. థ్రిల్లర్ ఎమిమెంట్స్తోనే కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. పాత్రల పరిచయం వరకు కథ స్లోగా సాగుతుంది. పాడుబడ్డ భవన్లోకి తేవన్ వచ్చిన తర్వాత అక్కడే చోటు చేసుకునే కొన్ని సంఘటనలు ఉత్కంఠకు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినా.. కొన్ని సీన్స్ మాత్రం థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కురియన్ పొట్టి ఫ్లాష్ బ్యాక్.. చేతన్ స్టోరీ అవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. సినిమా మొత్తం కాస్త నెమ్మదిగా సాగినా.. భ్రమయుగం ఓ ఢిపరెంట్ థ్రిల్లర్ మూవీ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి నటననే. కుడుమన్ పొట్టి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై కొత్త మమ్ముట్టిని చూస్తారు. సినిమా మొత్త ఒకే డ్రెస్లో కనిపించి తనదైన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్లో ఆయన నటన అందరిని కట్టిపడేస్తుంది. దేవన్ పాత్రకు అర్జున్ అశోకన్ పూర్తి న్యాయం చేశాడు. సెకండాఫ్లో అయితే మమ్ముట్టిలో పోటీపడి నటించాడు. వంట మనిషిగా సిద్ధార్థ్ భరత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యక్షి పాత్ర ఆసక్తిరేకించినా.. ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో తెరపై సరిగా చూపించలేకపోయారు. టెక్నికల్ పరంగా సినిమా అదరిపోయింది. క్రిస్టో జేవియర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. షఫీక్ మహమ్మాద్ అలీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో సాగినా.. తెరపై ప్రతి సీన్ చాలా అందంగా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
తెలుగులోనూ బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని రాహుల్ సదాశివన్ దర్శకత్వం తెరకెక్కించారు. సరికొత్త పీరియాడిక్ హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్లో రూపొందించిన ఈ మూవీపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో తెలుగు వర్షన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే కన్నడ, తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. -
మెగాస్టార్ సరికొత్త హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'భ్రమయుగం'. ఈ చిత్రానికి 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్ 'భ్రమయుగం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక సింగర్ జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విలన్లు, హీరోలు లేరని మెగాస్టార్ మమ్ముట్టి అన్నారు. విలన్లు, హీరోలు అనే కాన్సెప్ట్ కూడా లేని కాలంలో 'భ్రమయుగం' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనా పాత్ర చాలా మిస్టరీగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో భాగమైనందుకు మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ.. 'గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వచ్చాయి. ఫ్లాష్బ్యాక్లను బ్లాక్ అండ్ వైట్లో చూపించేవాళ్లం. ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకపోవడం వల్ల యువత పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో సినిమా చూడటం ఇప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని అన్నారు. -
విధితో ఆటలు.. భయపెడుతున్న మమ్మట్టి 'భ్రమయుగం' తెలుగు ట్రైలర్
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్కి వచ్చే రోజు ఖరారైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్తో పాటు ట్రైలర్ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్గా షెహనాద్ జలాల్ ఉంటే సంగీతం క్రిస్టో జేవియర్ అందించారు. సౌత్ ఇండియాలో విభిన్నమైన నటుడిగా మమ్ముట్టికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆయనకు గతంలో జాతీయ అవార్డు కూడా దక్కింది. యాత్ర, యాత్ర-2 చిత్రాలతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభినందిస్తున్నారు. -
సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్'. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో జయరాం హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మెగాస్టార్ మమ్ముట్టి కనిపించారు. కాగా.. జయరాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ అమెజాన్ ప్రైమ్లో రిలీజవ్వగా.. తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తండ్రిగా మెప్పించారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భాగమతి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జయరాం.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్లో కనిపించనున్నారు. -
Yatra 2 Movie Reveiw: యాత్ర 2 రివ్యూ
టైటిల్:యాత్ర 2 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్,సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్ తదితరులు నిర్మాణ సంస్థ: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ నిర్మాత: శివ మేక రచన-దర్శకత్వం: మహి వి. రాఘవ్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ:మది విడుదల తేది: ఫిబ్రవరి 8, 2024 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం (2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. యాత్ర 2 ఈవెంట్ బేస్డ్ బయోపిక్. వైఎస్సార్ మరణం అనంతరం, ఆయన తనయుడు, వైఎస్. జగన్మోహన్రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’ కథ. వైఎస్సార్ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు.. వాటన్నింటిని ఎదుర్కొన్ని వైఎస్ జగన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. ఇది వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల కథ కాదు..వారి వ్యక్తిత్వానికి సంబంధించిన స్టోరీ. వైఎస్సార్ రాజకీయం ఎలా ఉంటుంది? ఆయనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎలాంటి భరోసా ఇస్తారు? అనేది ‘యాత్ర’లో చూపించిన మహి వి రాఘవ్.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన పడిన కష్టాలేంటి? అదిష్టానం వద్దని చెప్పినా..తనను నమ్ముకున్న ప్రజల కోసం అండగా ఉండేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర.. వైఎస్సార్సీపీ పార్టీ స్థాపించడానికి గల కారణం.. ప్రత్యర్థులంతా ఒక్కటైనా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? అనేది యాత్ర 2లో చూపించాడు. వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆ యాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చాలా ఎమోషనల్గా చూపించాడు డైరెక్టర్ మహి. ఎమోషన్స్ ఎంత పండించాలి? ఎలాంటి సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనేది లెక్కలేసుకొని మరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు మహి. రెగ్యులర్ బయోపిక్లా కేవలం కథను మాత్రమే చెప్పకుండా.. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్గా చూపిస్తూ ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశాడు. 2009 నుంచి 2014 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ ప్రకటించే సన్నివేశంలో ‘యాత్ర 2’కథ ప్రారంభం అవుతుంది. రెండోసారి వైఎస్సార్ సీఎం అవ్వడం.. రచ్చబండ కోసం వెళ్తూ మరణించండం కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రజల కోసం జగన్ అదిష్టానాన్ని ఎదిరించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సెకండాఫ్ అంతా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్ చెప్పే మాటలు అందరిని ఆకట్టుకుంటాయి. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా..జగన్ ధైర్యంతో పార్టీని నడిపించడం.. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం.. తప్పుడు కేసులు పెట్టిన నందిగాం సురేశ్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం..ఇవ్వన్నీ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి డైలాగు.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. వైఎస్ జగన్ ఎలాంటి వాడో డైలాగ్స్లతోనే తెలియజేశాడు మహి వి.రాఘవ్. ‘జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ అనే ఒకే ఒక్క డైలాగ్తో జగన్ వ్యక్తితం ఎలాంటిదో తెలియజేశాడు. ‘ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’ అనే మాటల్లో జగన్ విశ్వసనీయత ఎంతటిదో అర్థమవుతుంది. 'నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు.. జగన్పై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది తెలియజేస్తుంది. ‘నేను విన్నాను-నేను ఉన్నాను' అంటూ జగన్ చెప్పే మాటలు ప్రజలకు ఆయనిచ్చిన భరోసాని తెలియజేస్తుంది. 'నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని'అంటూ అసెంబ్లీ వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్ ధైర్యం ఎలాంటిదో అర్థమతుంది. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’ అనే మాటలు.. జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తుంది. ‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే...పులిని బోనులో పెట్టినా అది పులే’అంటూ వైఎస్ జగన్ గురించి ఓ సీనియర్ నేత చెప్పే డైలాగ్కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కథంతా వైఎస్సార్, వైఎస్ జగన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించేశాడు. ఇక వైఎస్ జగన్గా జీవా అదరగొట్టేశాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు జీవా. వైఎస్ జగన్ హుందాతనం, రాజకీయం, తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెరపై అద్భుతంగా పండించాడు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై అచ్చం వైఎస్ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె సోనియా గాంధీని గుర్తు చేశారు.చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేంతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ‘చూడు నాన్న..’పాటు హృదయాలను హత్తుకుంటుంది. పెంచలదాస్ పాడిన వైఎస్సార్ పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తుంది. ‘తొలి సమరం’సాంగ్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో జోష్ని నింపుతుంది. మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ‘ఓ రాజకీయ నాయుకుడి జీవితంలో డ్రామా ఉండవచ్చు.. యాక్షన్కూ అవకాశముంది.. బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందన్న వాళ్లను చూస్తే కామిడీకి స్కోపు ఉందని అనుకోవచ్చు. కానీ.. ఎమోషన్ కూడా ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది అనడమే కాకుండా... ఆ భావోద్వేగాలను అందంగా తెరపైకి ఎక్కించి మరీ చూపించాడు మహి వి.రాఘవ్. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘యాత్ర 2’ ట్విటర్ రివ్యూ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన మూవీ ‘యాత్ర 2’. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్తో పాటు పాటలు సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశాయి. (చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!) ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు(ఫిబ్రవరి 8) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? వైఎస్ జగన్గా జీవా ఎలా నటించాడు? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యాత్ర 2 చిత్రానికి ఎక్స్లో పాజిటివ్ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్ అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయంటూ పలువురు నెటిజన్స్ ఎక్స్లో కామెంట్ చేస్తున్నారు. #Yatra2 The best biopic ever in all the industries u will feel goosebumps right from the start @MahiVraghav just remember this name. Had a little hatred towards jagan but now it’s love ❤️ @JiivaOfficial 💥 Antis ki kuda goosebumps vache moments unnay ⭐️⭐️⭐️⭐️/5 Rating :-4/5 pic.twitter.com/Tggn0vieAr — Film Buff 🍿🎬 (@SsmbWorshipper) February 7, 2024 ‘యాత్ర 2’ బెస్ట్ బయోపిక్. సినిమా స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు మహి వి. రాఘవ్. ఇంతకు ముందు జగన్పై కొంచెం ద్వేషం ఉండే..సినిమా చూశాక అది ప్రేమలా మారింది. వైఎస్ జగన్ని ద్వేషించేవారికి కూడా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయంటూ ఓ నెటిజన్ 4/5 రేటింగ్ ఇచ్చాడు. Honestly chepthuna one of the best biopics ever made in Telugu #Yatra2 🔥🔥🔥🔥 Blockbuster movie 👌🏻👌🏻👌🏻#Yatra2 Bomma Blockbuster 🔥💙#YSJaganAgain @ysjagan @JiivaOfficial @mammukka pic.twitter.com/YhYNZnV46B — Sri Surya Movie Creations (@SSMCOfficial) February 8, 2024 నిజాయితీగా చెబుతున్న..తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్. బ్లాక్ బస్టర్ మూవీ. బొమ్మ అదిరింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుంది -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి #BlockbusterYatra2#Yatra2#CMYSJagan pic.twitter.com/kKzp63OOgv — YSR Congress Party (@YSRCParty) February 7, 2024 యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుందని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 @DrPradeepChinta అన్న రేటింగ్ 5 స్టార్ అంటే.... #Yatra2Movie కి తిరిగే ఉండదిక.... 👏👏👏👏 https://t.co/8J3g3dCOTd — #Siddham for 2024 🦾💪🇮🇳 (@bhojaraju99) February 8, 2024 First half completed! Edipinchesav @MahiVraghav ! pure emotions and YSJagan mass high! Trailer is jujubi.#Yatra2 #Yatra2JourneyBegins #Yatra2Movie #Yatra2OnFeb8th https://t.co/8xpua0Epg0 — Pavan_GR (@pavan_gr) February 7, 2024 Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 Last Ki @ysjagan sir cameo 🔥 Pillini teesukuni velli adavilo vadileste adi pille, kani akkada undi puli adavilo Unna bonu lo Unna gargistundi. Deii em cinema Ra Babu HYD vadini Kuda vachi meeku vote veyali ani undi Jai Jagan#Yatra2#Yatra2OnFeb8th #Yatra2Premier pic.twitter.com/RS25F9xmp9 — UK DEVARA 🌊⚓ (@MGRajKumar9999) February 7, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 #Yatra2 #Yatra2Movie వైఎస్ఆర్ మరణం, తదనంతర పరిణామాలు,తన తండ్రి మరణంతో నష్టపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్రను ఎలా ప్రారంభించాడో, ఆయన నిర్ణయం వల్ల ఎదుర్కొన్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు — @Team Basireddy (@BasireddyLokes1) February 7, 2024 ప్రతీ అభిమాని గుండె చప్పుడిలో పెద్దాయన ఉంటారు 🥹🥹#Yatra2#Yatra2JourneyBegins#JaitraYatrapic.twitter.com/IdzOCiCkZ1 — Vikas 🎯🎯 (@VikasRonanki) February 8, 2024 Yatra -2 movie is an inspiration 👌👌👌👌👌@MahiVraghav @mammukka @JiivaOfficial @ysjagan @YSRCParty @JaganannaCNCTS @SajjalaBhargava Please watch it 🔥🔥https://t.co/DSvqpvfiEs pic.twitter.com/1gFEvtBqTX — Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) February 8, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 Finally blockbuster kottisamu anna.. 🥹❤️🔥🙏 Tnq @MahiVraghav Anna Great inspirational movie ichavu... 🧎♂️ Jai Jagan anna.. 🇸🇱🙏 @ysjagan #Yatra2Movie #Yatra2 #YSJaganAgainIn2024 pic.twitter.com/IB16sF6fa8 — ᴀʟʟᴜ sᴀɴᴊᴜ ʀᴇᴅᴅʏ™🪓🐉 (@AlluSanjuReddy) February 8, 2024 @MahiVraghav ఎవడ్రా నువ్వు మా జగనన్నకు మాకన్నా పెద్ద ఫ్యాన్ లా ఉన్నావ్🔥 Thanks Mahi anna 🥰 pic.twitter.com/dGJY6pV6Ge — Manager (@thinkpad8gen) February 8, 2024 -
అమెరికాలో 'యాత్ర- 2' ప్రీమియర్స్ సిద్ధం.. అభిమానుల భారీ ర్యాలీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా వైఎస్సార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అమెరికాలో నివసిస్తున్న వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ యాత్ర సినిమా విడదుల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్ పట్టుకుని రోడ్ షో నిర్వహించారు. అమెరికాలో విడుదలకు ముందే యాత్ర జండా రెపరెపలాడుతుంది. సినిమా విడుదల కోసం ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్, డల్లాస్లో ఫిబ్రవరి 7న యాత్ర 2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవన్నీ భారీగా ట్రెండ్ అవుతున్నాయి. USA #Yatra2 Collection 🔥🔥 pic.twitter.com/9FxfcrFmuF — MBYSJTrends ™ (@MBYSJTrends) February 6, 2024 🚨Premiere Alert🚨 All theatre chain passes are now enabled for #Yatra2 in the USA 🇺🇸 Premieres on Feb 7#Yatra2Trailer - https://t.co/xzuTsMDg0h Directed by @mahivraghav#LegacyLivesOn #Yatra2OnFeb8th @mammukka @JiivaOfficial @ShivaMeka pic.twitter.com/Tcputw5Thl — Three Autumn Leaves (@3alproduction) February 6, 2024 -
నేను విన్నాను...
‘‘నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందన్నా.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు.. అన్నా.. మాకంత స్తోమత లేదు (ఓ పాత్రధారి). మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం.. ఐ డోంట్ థింక్.. ఇట్స్ రైట్ సార్ (మరో పాత్రధారి)... నువ్వు చెప్పింది కరెక్ట్నే అయ్యా.. నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు (మమ్ముట్టి) అనే సీన్తో మొదలైంది ‘యాత్ర 2’ సినిమా టీజర్. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, పేదల కోసం వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర 2’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’కు సీక్వెల్గా ‘యాత్ర 2’ వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
Yatra 2 Movie Trailer: ‘యాత్ర 2’ ట్రైలర్ వచ్చేసింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. (చదవండి: యాత్ర 2' ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న ఈ డైలాగ్స్) వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్, సాంగ్స్ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్ అభిమానుల గుండెలను తాకాయి. తాజాగా యాత్రా 2 నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషిన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అన్నా.. మాకు అంత స్థోమత లేదు’ అని ఓ సామాన్యురాలు తన కూతురికి గురించి సీఎం వైఎస్సార్(మమ్ముట్టి)కి చెప్పే సీన్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వైఎస్సార్ మరణం.. జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ చేసే కుట్రలు.. పార్టీ పెట్టిన తర్వాత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు..ఇవన్నీ ట్రైలర్లో హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఇక చివర్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్ కొడుకువు అన్నా..మాకు నాయకుడిగా నిలబడు అన్నా’అని అనగా..నేను విన్నాను..నేను ఉన్నాను’ అని జగన్(జీవా) చెప్పే డైలాగ్తో ఎమోషనల్గా ట్రైలర్ ముగిసింది. దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖలు జీవితాలపై బయోపిక్లుగా పలు చిత్రాలు వచ్చాయి.. వాటంన్నింటికీ దక్కని క్రేజ్ యాత్ర సీక్వెల్ చిత్రాలకు దక్కింది. ఇంతలా యాత్ర-2కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్ను అంతే స్థాయిలో పొయెటిక్గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఆందుకే ఆయన నిజ జీవితాన్ని మరొకసారి వెండితెరపై చూసేందుకు కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
యాత్ర- 2 ట్రైలర్పై ప్రకటన చేసిన డైరెక్టర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే టీజర్లో కనిపించాయని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో యాత్ర 2 చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ట్రైలర్ను రేపు (ఫిబ్రవరి 3న) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. -
ఆ రోజే భ్రమయుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్కి వచ్చే రోజు ఖరారైంది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్. -
చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
కల్లర్ మ్యాజిక్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్గా, ట్యాన్ అయిన స్కిన్తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా బ్లాక్గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్లో కనిపిస్తారు. -
యాత్ర-2 నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఎమోషన్స్తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ్. -
హారర్ థ్రిల్లర్ కథతో 'భ్రమయుగం'.. టీజర్తో మెప్పించిన స్టార్ హీరో
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం 'భ్రమయుగం'.. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. మమ్ముట్టి ఇటీవల నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్: ది కోర్'తో మెప్పించాడు. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. ఇలా విభన్నమైన అంశాలతో సినిమాలు తీసి సూపర్ హిట్లు కొడుతున్న ఆయన త్వరలో 'భ్రమయుగం' చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు. తాజాగా విడుదలైన భ్రమయుగం టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పోస్టర్తో పాటు అన్నీ అంశాలు చాలా ప్రత్యేకంగానే ఉన్నాయి. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ ప్రస్తుతం మాత్రం మలయాళ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. -
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్లలో వాట్సప్ స్టేటస్లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్ను అంతే స్థాయిలో పొయెటిక్గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్
‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్తో ‘యాత్ర 2’ టీజర్ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్ మూవీకి సీక్వెల్గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్ఆర్ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్. మహేశ్ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్ నారాయణన్. -
Yatra 2 Teaser: రిలీజైన 'యాత్ర 2' టీజర్
'యాత్ర 2' సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏయే సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటివరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. టీజర్లో ఏముంది? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులని జగన్ ఎలా అధిగమించారు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే 'యాత్ర 2' సినిమా. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) గూస్బంప్స్ సీన్స్ ఈ టీజర్లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్.. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే మరో సీన్.. 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) -
గే పాత్రలో మమ్ముట్టి.. సైలెంట్గా ఓటీటీలోకి..
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందువరుసలో ఉంటాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఆరు పదుల వయసులో విభిన్న కథాంశాలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షక, సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇటీవల ఈయన నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్: ది కోర్'. జియో బేబి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్గా నటించింది. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. దీంతో విడుదలకు ముందు ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కథ హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా ఉందంటూ కువైట్, ఖతార్ దేశాలు కాదల్: ది కోర్ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. అయితే ఈ విమర్శలను దాటుకుంటూ నవంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ మూవీ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి అయితే తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు. ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే! ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో చూడాలి! #KaathalTheCore available for Rental in AMAZON PRIME. pic.twitter.com/E3c2ypE8j5 — Christopher Kanagaraj (@Chrissuccess) January 4, 2024 చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
టీజర్ రెడీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్గా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఈ నెల 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ను షేర్ చేసింది యూనిట్. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్తో కలిసి శివ మేక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
యాత్ర 2 టీజర్ వచ్చేస్తోంది!
‘యాత్ర’మూవీకి సీక్వెల్గా ‘యాత్ర 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. (చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో) ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే హీరో జీవా లుక్తో పాటు వైఎస్ భారతీ పాత్ర పోషిస్తున్న మరాఠీ నటి కేతకి నారాయణన్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నారు. జనవరి 5న యాత్ర 2 టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. మమ్ముట్టి, జీవాలకు సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేసింది. View this post on Instagram A post shared by Mahi V Raghav (@mahivraghav) -
కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్లో సుమారు 15 ఆవులు మృతి చెందాయి. ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడం వల్లే అవి మృతి చెందాయని తెలుస్తోంది. ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15)లకు చెందినవి. తన తండ్రి మరణం తరువాత వారిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు. పాఠశాలకు వెళ్తూనే డెయిరీ రంగంలోకి వారు కష్టపడుతున్నారు. మాథ్యూ చదువుతో పాటు ఆవులను కూడా పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సమయంలో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్తో పాటు వారి తల్లి కుంగిపోవడం ఆపై వారు ఆస్పత్రి పాలు కావడం జరిగింది. గతంలో వీరు రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతుగా అవార్డును గెలుచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్లలో వీరిది ఒకటి. డిసెంబర్ 31న వారి ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆ కుటుంబం ఇబ్బందిని తెలుసుకున్న మలయాళ నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు. తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షలు అందించడం విశేషం. జయరామ్కు తెలుగు చిత్ర సీమలో కూడా మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో తండ్రిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా రూ. లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఇద్దరూ పిల్లలకు ఆ డబ్బు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు అని ఆయన తెలిపారు. గతంలో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవులు కూడా కొన్ని కారణాల వల్ల మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను, తన భార్య ఎంతో బాధపడ్డామని ఆయన తెలిపారు. మరోవైపు కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ఆ యువ రైతుల కుటుంబానికి చేరుకున్నారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50,000 అందించారని సమాచారం. -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
ఒక ఫ్రేమ్ లోకి రజినీకాంత్, మమ్మూట్టి..?
-
Yatra 2 Movie: పవర్ఫుల్ డైలాగ్తో వైఎస్ భారతి లుక్ రిలీజ్
యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్హిట్ మూవీ ‘యాత్ర’కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మహి. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. నేడు(డిసెంబర్ 9) వైఎస్ భారతి పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 మూవీలో ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్పై ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు.’ అని భారతి పాత్ర చెప్పే పవర్ఫుల్ డైలాగ్ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. A resilient force behind the rise of a leader! Presenting @KetakiNarayan as #YSBharathi from #Yatra2. In cinemas from 8th Feb, 2024.#HBDYSBharathiGaru #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/KdhUuB47wA — Mahi Vraghav (@MahiVraghav) December 9, 2023 -
నాకు సోదరి కూడా ఉందంటూ ఫోటో షేర్ చేసిన దుల్కర్
సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్లో జెండా పాతిన హీరోల్లో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. సీతారామం, చుప్,కింగ్ ఆఫ్ కొత్త లాంటి సినిమాల ద్వారా ఇటు మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో ఒక క్రేజీ ప్రాజెక్ట్లో భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో తన అక్క సురుమి తీసినట్లు ఆయన తెలిపాడు. మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్.. తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొడుతున్నాడు. కానీ ఆయన సోదరి సురుమి మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె చాలా పెయింటింగ్స్ వేయడం జరిగింది. దుల్కర్, సురుమి ఇద్దరూ కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. తన సోదరి సురుమి తీసిన ఫోటోను దుల్కర్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో దుల్కర్తో ఉన్న వ్యక్తి సురుమి భర్త డా. ముహమ్మద్ రేహాన్ షాహిద్ అని అభిమానులు గుర్తించారు. ఆ ఫోటోకు క్యాండిడ్ క్యాప్చర్ అనే టైటిల్ను ఆయన చేర్చాడు. మై వన్ అండ్ ఓన్లీ, సిబ్లింగ్ క్లిక్, బెస్ట్, క్యాండిడ్ ఫోటోలు, స్పెషల్ సమ్మిట్, క్లీనింగ్ అప్, బిజినెస్మెన్ అనే ట్యాగ్లతో దుల్కర్ చిత్రాన్ని పంచుకున్నాడు. సోదరి తీసిన ఆ ఫోటో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. బావ బావమరుదుల ముఖాలు కూడా స్పష్టంగా ఉండేలా ఫోటో షేర్ చేసి ఉంటే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. దుల్కర్ తన బావతో కలిసి ఫార్మల్ డ్రెస్లో స్టైలిష్ స్మైల్తో ఫోటోలో కనిపించాడు. 'నాకు ఒక సోదరి ఉంది.. ఆమె నేరుగా నిలబడి ఫోటోకు ఎలా పోజులివ్వాలో కూడా ఆమెకు తెలియదు. దుల్కర్ తరచుగా తండ్రి, సోదరి మోడల్గా పోజులిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఒక సినిమాలో భాగంగా దుల్కర్తో మమ్ముట్టి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సినిమాకు సురుమి మాత్రమే ఎందుకు రాలేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. వాటికి స్వయంగా సురుమినే సమాధానమిచ్చింది. తనకు సినిమాలంటే ఇష్టమని, అయితే కెమెరా ముందుకు రాలేనని, తెరపై సోదరుడిలా కనిపించడం తనకు ఇష్టం లేదని సురుమి తెలిపింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సురుమి పెయింటింగ్ అక్కడి ఎగ్జిబిషన్లో పాపులర్ అయింది. తొమ్మిదో తరగతి నుంచి చిత్రలేఖనంపై ఆమెకు పట్టు ఉంది. సురుమికి ఇద్దరు కుమారులు. బెంగుళూరులో తన భర్త ముహమ్మద్ రేహాన్ షాహిద్తో సురుమి ఉంది. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
నా అభిమాన హీరో ఆయనే.. సమంత పోస్ట్ వైరల్!
ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన భామ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న సామ్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ మూవీని చూసిన సమంత తన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు. సామ్ తాజాగా మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన కాథల్-ది కోర్ చిత్రంపై తన రివ్యూను ప్రకటించారు. సమంత ట్విట్టర్లో రాస్తూ.. 'కాథల్-ది కోర్ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. తప్పకుండా అందరు కలిసి చూడాల్సిన చిత్రమిది. మమ్ముట్టి నా అభిమాన హీరో. ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమాలు చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవ్ యూ జ్యోతిక' అంటూ పోస్ట్ చేసింది. అలాగే మూవీ డైరెక్టర్ జీయో బాబీని లెజెండ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. సమంత పోస్ట్పై కాథల్ ది కోర్ చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. కాగా.. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ప్రధానంగా ఈ మూవీలో చూపించారు. -
Anagha Maya Ravi: మమ్ముట్టి ఆన్స్క్రీన్ కూతుర్ని చూశారా? రచ్చ లేపుతోందిగా (ఫోటోలు)
-
హోమో సెక్సువల్ పాత్రలో స్టార్ హీరో.. ఆ రెండు దేశాల్లో బ్యాన్!
ఆరు దశాబ్దాల వయసు దాటినా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అతికొద్ది మంది హీరోల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక్కరు. ఈ వయసులో కూడా ఆయన డిఫరెంట్ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ మెగాస్టార్ నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘కాథల్-ది కోర్’. జీయో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టికి జోడీగా జ్యోతిక నటించింది. నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు కొద్ది రోజుల ముందే ఈ చిత్రానికి ఊహించని షాక్ తగిలిగింది. ఈ మలయాళ చిత్రాన్ని రెండు దేశాలు నిషేధించాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని(హోమో-సెక్సువాలిటీ)ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. ‘కాథల్-ది కోర్’ కథేంటి? ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పత్రిక..ఈ చిత్రం కథని క్లుప్తంగా వివరిస్తూ వార్తను ప్రచురించింది. దాని ప్రకారం.. కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన జార్జ్(మమ్ముట్టి).. భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న ఊళ్ళో నివసిస్తుంటాడు. అతను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. (చదవండి: వారి వల్ల నా ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు.. చనిపోదామనుకున్న అంటూ యమున ఆవేదన) నామినేషన్ వేసిన తర్వాత..అతని భార్య ఓమన హఠాత్తుగా విడుకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. జోసెఫ్ మాత్రం తీవ్రంగా ఖండిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎన్నికల్లో జార్జ్ పోటీ చేశాడా? లేదా? విడాకుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం చూసే తీరును ఇందులో చూపించినట్లు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పారు. దీంతో కువైట్, ఖతార్ దేశాలు ఈ చిత్రాన్ని బహిష్కరించాయి. -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. సినిమాలు కుటుంబంతో కలసి ఇంట్లోనే చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రతివారంలో రిలీజయ్యే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా చిన్న చిత్రాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతే కాకుండా దక్షిణాదిలో మలయాళంలోనూ ప్రతివారం సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్లు ఉన్న సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ వారంలో మిమ్మల్ని అలరించేదుకు వస్తోన్న మాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. ఓటీటీలో అలరిస్తోన్న మాలీవుడ్ సినిమాలు ఇవే! 1. కన్నూరు స్క్వాడ్ - మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం కన్నూరు స్క్వాడ్. ఈ మూవీ మలయాళంలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సూపర్ హిట్ మూవీ ఈ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. 2.మాస్టర్పీస్ వెబ్ సిరీస్ - నిత్య మీనన్ ప్రధాన పాత్రలో వచ్చిన మలయాళ కామెడీ వెబ్ సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లనే అందుబాటులో ఉంది. 3.కాసర్ గోల్డ్ - రెండున్నర కోట్ల విలువైన బంగారం చోరీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కాసర్ గోల్డ్ తెరకెక్కించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 13 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. 4.వాలట్టీ - రెండు కుక్కల చుట్టూ తిరిగే ఎమోషనల్ కథే వాలట్టీ. కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 7 నుంచే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. 5.18 ప్లస్ - ప్రేమ, స్నేహం, కుటుంబ మద్దతు లేకుండా లేచిపోయి పెళ్లి చేసుకునే జంట ఇబ్బందులే కథాంశంగా తీసిన చిత్రమిది. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఫీల్ గుడ్ మూవీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. 6.నెయ్మార్ - మనషులు, జంతువుల మధ్య ఉండే రిలేషన్స్ను చాటి చెప్పే సినిమా నెయ్మార్. నెయ్మార్ అనే ఓ కుక్క ఇద్దరు స్నేహితుల జీవితాలను ఎలా మార్చిందనేది కథాంశాన్నే తెరకెక్కించారు. ఈ సినిమా కూడా హాట్స్టార్లో అలరిస్తోంది. -
యాత్రలో జర్మనీ నటి సుజానే
‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్ జగన్గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే అఖిల్ ఏజెంట్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది మలయాళంలో ఆయన నటించిన తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్'. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన కన్నూర్ స్క్వాడ్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా వచ్చిన ఈ చిత్రానికి రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన స్వీయ నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. (ఇది చదవండి: ఆ ఓటీటీకి వరుణ్- లావణ్య పెళ్లి వేడుక!!) కథ ఏంటంటే.. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్కు సవాల్గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆధారాలు లేని ఈ క్రైమ్ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకు తెస్తుంది. -
మమ్ముట్టికి మైల్స్టోన్ చిత్రంగా 'కన్నూర్ స్క్వాడ్'.. కథ ఏంటంటే?
శాండిల్వుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా విడుదల చేసిన 'కన్నూర్ స్క్వాడ్' 100 కోట్ల క్లబ్లో చేరింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మమ్ముట్టి నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్ను కూడా మమ్ముట్టి సంస్థ షేర్ చేసింది. 100 కోట్ల క్లబ్లో చేరిన మమ్ముట్టికి ‘కన్నూర్ స్క్వాడ్’ నాలుగో చిత్రం. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) గతంలో 'భీష్మ పర్వం', 'మధురరాజా', 'మామాంగమ్' చిత్రాలు కూడా మమ్ముట్టి 100 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ సినిమాలు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికీ కూడా వీకెండ్లో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. 'కన్నూర్ స్క్వాడ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరి మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 'కన్నూర్ స్క్వాడ్' కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమా విజయాన్ని అభినందించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చూనిట్ సభ్యులందరికీ సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంపై చూపిన అంతులేని ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. కథ ఏంటి..? కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్కు సవాల్గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకుతెస్తుంది. -
Viral Pics: కేరళీయం 2023 వేడుకలు: ఒకే ఫ్రేమ్లో దిగ్గజాలు (ఫొటోలు)
-
మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'భ్రమయుగం'. రాహుల్ సదాశివం దర్శకుడు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమూల్దా లైజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జవీర్ సంగీతమందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఆగస్టు 17 నుంచి ఒట్టపాలెం, కొచ్చి, అదిరపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పాడు. అయితే పాన్ ఇండియా సినిమా షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తిచేయడమంటే విశేషమనే చెప్పాలి. కొన్నాళ్ల ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందని స్వయంగా దర్శకుడు చెప్పాడు. ఈ క్రమంలోనే చిత్ర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. వైవిధ్య భరితమైన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా 'భ్రమయుగం' ఉంటుందని దర్శకుడు చెప్పాడు. వచ్చేది ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: కీర్తి సురేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన ఆ నిర్మాత) -
వచ్చే ఏడాది భ్రమ యుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్–థ్రిల్లర్ ఫిల్మ్ ‘భ్రమ యుగం’. రాహుల్ సదాశివన్ రచన–దర్శకత్వంలో చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘‘ఈ ఏడాది ఆగస్టులోప్రారంభమైన ఈ సినిమాను ఓట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి వంటి లొకేషన్స్లో చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. 2019 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’లో వైఎస్ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టి ‘యాత్ర 2’ లోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అనే అనే డైలాగ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉన్నాయి. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ–‘‘వైఎస్ జగన్గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! యాత్ర 2 లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇన్టెన్స్ లుక్స్తో కనిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్ను కూడా పోస్టర్లో గమనించవచ్చు. పోస్టర్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 - 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. In the shadow of a legend, A leader rises! Presenting the first look of #Yatra2. In cinemas from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @mammukka @JiivaOfficial @ShivaMeka @vcelluloidsoff @KetakiNarayan @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/doygY3BBTC — Mahi Vraghav (@MahiVraghav) October 9, 2023 చదవండి: కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్ ప్రక్రియ.. అమర్, తేజలకు.. -
ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!
ప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం స్టార్ మమ్ముట్టి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుకూ తుదిశ్వాస విడిచారు. కాగా.. అమీనాకు జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ) అయితే ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. వరుస విషాదాలతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. (ఇది చదవండి: ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్.. ఈసారైన కలిసొచ్చేనా?) -
థియేటర్లలో మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తున్న సినిమాలు ఇవే..
హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం. భ్రమ యుగంలో... సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. హారర్ రాజా లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రముఖి తిరిగొస్తే.. హారర్ జానర్ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. భైరవకోనలో ఏం జరిగింది? ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఇందులో సందీప్కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మంత్రం.. తంత్రం.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మంచి దెయ్యం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్లో భయపెడతారో చూడాలి. కేరాఫ్ దెయ్యం గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
జైలర్ సినిమాలో మెగాస్టార్ ఉండాల్సింది, సైడ్ చేసిన రజనీకాంత్!
సాధారణంగా సినిమాలో ఇద్దరు స్టార్స్ ఉంటేనే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటిది జైలర్లో ఒకరిద్దరు కాదు, అనేకమంది స్టార్స్ ఉన్నారు. కన్నడ నుంచి శివ రాజ్కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్.. ఇలా వివిధ భాషల నుంచి వేర్వేరు స్టార్స్ను తీసుకువచ్చారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎవరి ప్రాధాన్యతను తగ్గించకుండా అందరికీ సమన్యాయం చేస్తూ అందరి ఫ్యాన్స్ను ఖుషీ చేశాడు డైరెక్టర్. విలన్గా ఈయన చేయాల్సింది కాదు ఇకపోతే ఈ సినిమాలో విలన్ వర్మాన్ పాత్ర కూడా బాగా పండింది. నటుడు వినాయకన్ ఈ పాత్రకు సరిగ్గా సెట్టయ్యాడు. అయితే విలన్ పాత్ర ఈయన చేయాల్సింది కాదట! మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చేయాల్సిందట! ఈ విషయాన్ని జైలర్లో రజనీ కొడుకుగా నటించిన వసంత రవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మమ్ముట్టి సర్ను విలన్గా అనుకున్నారు. రజనీకాంత్ సరే సెట్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. కానీ మమ్ముట్టికి అలాంటి పాత్ర ఇవ్వడానికి ఆయనకు మనసొప్పలేదు. మమ్ముట్టికి అలాంటి పాత్రనా? బాధపడ్డ రజనీ నెగెటివ్ పాత్రలో తనను ఊహించుకోలేకపోయాడు. ఆయనే స్వయంగా మమ్ముట్టి సర్కు ఫోన్ చేసి మనం ఇది కాకుండా మరో సినిమాలో కలిసి నటిద్దాం అని చెప్పాడు. అలా ఆయన విలన్గా చేయలేదు అని పేర్కొన్నాడు. ఇకపోతే మమ్ముట్టి ప్రస్తుతం భ్రమయుగం అనే సినిమా చేస్తున్నాడు. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. చదవండి: జైలర్లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘భ్రమయుగం’ టైటిల్ ఖరారైంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. ‘భ్రమ యుగం’ సినిమా చిత్రీకరణ గురువారం ప్రారంభమైంది. ‘‘ఇప్పటివరకూ చేయని కొత్త పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను’’ అని మమ్ముట్టి అన్నారు. ‘‘కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథ ‘భ్రమ యుగం’’ అన్నారు రాహుల్ సదాశివన్. ‘‘హారర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికే మా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాం. తొలి చిత్రాన్నే మమ్ముట్టీగారితో చేస్తుండడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. మమ్ముట్టీగారి ఇమేజ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్తుంది. దర్శకుడు రాహుల్ సృష్టించిన అద్భుత ప్రపంచం ‘భ్రమ యుగం’’ అన్నారు నిర్మాతలు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. #Bramayugam - My next, shoot commences today ! Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @StudiosYNot pic.twitter.com/Qf9gRVwKzY — Mammootty (@mammukka) August 17, 2023 -
‘ఏజెంట్’మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు అఖిల్ అక్కినేని. తొలి సినిమా కోసం మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ని ఎంచుకొని భారీ బడ్జెట్తో ‘అఖిల్’ని తీశాడు.అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో తన పంథాని మార్చి లవర్ బాయ్గా మారాడు. అయినా కూడా పెద్ద సెక్సెస్ని అందుకోలేకపోయాడు. చివరి మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` ఓ మోస్తరు విజయం సాధించింది. అయినా కూడా లవర్ బాయ్గా ఉండేందుకు అఖిల్ ఇష్టపడటం లేదు. మాస్ హీరోగా నిరూపించుకోవడానికి ఈ సారి ‘ఏజెంట్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి `కిక్` ఫేమ్ సురేందర్రెడ్డి దర్శకుడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఏజెంట్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలు ట్విటర్లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Jus Now I have completed my Show .it was kutha ramp for masses . justification has been done for tha tag #wildsale ..🥵🥵🥵🙏🙏🙏 will be first 100cr share from Tier 2 Those whoever wants to take screen shot they can ...#Agent — Pawanfied (@OnlyPSPK_) April 28, 2023 ట్విటర్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయని అంటున్నారు. యాక్షన్ పరంగా అఖిల్ ఆకట్టుకున్నాడని చెబుతున్నారు. కానీ కథ బలంగా లేదని కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదు కానీ సెకండాఫ్ కొంపముంచిందని నెటిజన్స్ అంటున్నారు. అఖిల్ వన్ మ్యాన్ షో అని కామెంట్ చేస్తున్నారు. #Agent what a mess..Surender Reddy completely lost it..feel sorry for Akhil..not even one department was decent..bgm was horrible and the graphics are awful..the film looks incomplete..I am not sure if DI is complete…it had a dark shade throughout.. Disaster. — akhil_maheshfan2 (@Maheshfan_1) April 28, 2023 Akhil One man Show 💥💥💥 Action Sequences Mathram 👌👌👌 Love story 😢😢😢 Songs 😢😢😢 BGM 🥵 Interval And Climax KCPD 💥💥💥 Negetive Reviews patinchukovadhu Movie Bagundhi 👍👍 Rating:3/5 #Agent #AkhilAkkineni pic.twitter.com/UUwvOYhVez — Srinivas (@srinivasrtfan2) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 #Agent An engaging Spy Action Film! Akhil is extra ordinary in this movie and can see his hard work and dedication in action sequences and comedy scenes, cinematography and BGM are main highlights of the movie. Surendra reddy delivers a hit again after SyeRaa. pic.twitter.com/DwhK91ZbYO — Johnnie Walker (@roopezh) April 28, 2023 #Agent: 👉#Agent is such a terrible film. In recent times, Telugu Film Industry has not produced such a bad film 👉It’s a third-rate film because of the medicore direction and predictable plot 👉#AkhilAkkinen’s transformative efforts are futile#AgentReview #Mammootty — PaniPuri (@THEPANIPURI) April 28, 2023 #Agentreview from USA premiere : Excellent Response💥💥💥 Great action episodes Akhil's terrific screen presence 💥💥 Awesome screenplay Never Before Songs Kummesayi, WildSaale Song Mind-blowing🥵 Full of suspense n twists. ⭐⭐⭐⭐/5#AkhilAkkineni #Agent #BlockbusterAgent 🔥💥 — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 -
ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో తల్లి కన్నుమూత..!
మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫాతిమా ఇస్మాయిల్(93) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. కాగా.. మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్కు దగ్గరయ్యారు. గతేడాది ఆయన నటించిన చిత్రం రాస్చాక్. ఈ సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం అక్కినేని అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
Agent Movie: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ (ఫొటోలు)
-
‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం
కొన్ని కథలు ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కథలు హృదయాలను హత్తుకుంటాయి. కన్నీళ్లను తెప్పిస్తాయి. అలా మనసుల్ని హత్తుకునే కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి వాటిలో ‘యాత్ర’ ఒకటి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ఇది. వైఎస్సార్లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్.. పాదయాత్ర ద్వారా జనంలోకి ఎలా వెళ్లగలిగారు? సమస్యలు ఎలా తెలుసుకున్నారు? కష్టాలకు పట్టించుకోకుండా.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు? ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి? పాదయాత్ర రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు? అన్నదే ఈ సినిమా కథ. ఒక సినిమాకు కథతో పాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్ని నిర్ణయిస్తుంది. వైఎస్సార్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయడంతోనే ఈ సినిమా సగం విజయం సాధించింది. ‘యాత్ర’ సినిమా అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ కంటే పాత్రలే ముఖ్యం. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పెట్టి నటించాడు. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు తెర మీద రాజన్ననే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్లో వచ్చే వైఎస్ రాజశేఖర్రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్సార్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని బయోపిక్ మూవీస్లా కేవలం కథను మాత్రమే చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే విమర్శకులు సైతం రాఘవపై ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా, చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా ‘యాత్ర’ను తీర్చి దిద్దారు. (యాత్ర సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 8) నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా..) -
క్షమించండి.. ఇకపై అలా జరగదు.. స్టార్ హీరో
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి సోషల్మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. తన తప్పును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు విషయమేమిటంటే.. 2018లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా 2018 పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ శాంతి ఓషాన' సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న జూడో ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీ టీజర్ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మమ్ముట్టి దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. ఈవెంట్లో దర్శకుడి హెయిర్ స్టైల్పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ..'జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా, అసాధారణమైన మెదడు కలిగిన అత్యుత్తమ ప్రతిభావంతుడైన దర్శకుడు' అని అన్నారు. దీంతో దర్శకుడిని బట్టతల వ్యక్తి అంటూ అవమానించారని నెటిజన్లు భావించారు. ఇలా మాట్లాడడం బాడీ షేమింగ్తో సమానమంటూ పోస్టులు చేశారు. దీనిపై మమ్ముట్టి క్షమాపణలు చెబుతూ.. తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 'డియర్ ఆల్.. దర్శకుని ప్రశంసించేందుకు నేను వాడిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధపెట్టాయని తెలిసింది. ఉత్సాహంతో అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమించండి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతా. ఈ తప్పును గుర్తుచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టి చేసిన తప్పును వెంటనే అంగీకరించి వెంటనే సోషల్ మీడియా పోస్ట్తో క్షమాపణలు చెప్పినందుకు నెటిజన్లు ఇప్పుడు మమ్ముట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
తెలుగులో మలయాళ హిట్ మూవీ, ఓటీటీలో ఎప్పుడంటే?
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ రోస్చాక్. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. హాట్స్టార్లో నవంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా రోస్చాక్ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేసింది హాట్స్టార్. ఇది చూసిన జనాలు ట్రైలర్ అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. కాగా నిశం బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించాడు. మిధున్ ముకుందన్ సంగీతం అందించగా కిరణ్ దాస్ ఎడిటర్గా పని చేశాడు. అసిఫ్ అలీ, షరఫ్ ఉధీన్, గ్రేస్ ఆంటోని ముఖ్యపాత్రల్లో నటించారు. చదవండి: ఇనయ కోసం సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసిన బిగ్బాస్ బాత్టబ్లో శవమై కనిపించిన సింగర్ -
మరో సూపర్స్టార్తో విజయ్ సేతుపతి
ఇతర కథానాయకులకు భిన్నమైన నటుడు విజయ్ సేతుపతి. ఈయనకు హీరోగా స్టార్ డమ్ ఉన్నా దాని పక్కన పెట్టి ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా నచ్చిన, వచ్చిన అవకాశాలను వదలుకోకుండా నటిస్తుంటారు. ప్రస్తుతం విజయ్సేతుపతి గాంధీ టాకీస్, మేరీ క్రిస్మస్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అలాగే మైఖేల్, విడుదలై, జవాన వంటి చిత్రాల్లో ఇతర హీరోలతో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తెలుగు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలోనూ, తమిళంలో సూపర్స్టార్ రజనీకాంత్కు విలన్గా పేట చిత్రంలో, కమలహాసన్కు విలన్గా విక్రమ్ చిత్రంలో, విజయ్కు ప్రతినాయకుడిగా మాస్టర్ చిత్రంలోనూ పోటీ పడి నటించి మెప్పించారు. కాగా తాజాగా మలయాళం సూపర్స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణికంఠన్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇందులోనూ విజయ్ సేతుపతి విలన్గానే కనిపిస్తారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
13 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో జ్యోతిక
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
మమ్ముట్టి చేతుల మీదుగా ‘పికాసో’ ఫస్ట్ లుక్ పోస్టర్
నాటకం సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో ఆశిష్ గాంధీ. ఇప్పుడు ఆశిష్ తన కొత్త చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నారు. రుద్రంగి అనే భారీ యాక్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే అదే సమయంలో ఆశిష్ గాంధీ మాలీవుడ్ను కూడా పలకరించబోతున్నారు. ఆశిష్ గాంధీ ఈసారి మలయాళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పికాసో అనే చిత్రంతో కేరళ ఆడియెన్స్ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి చేతుల మీద ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక పోస్టర్ ఈ పోస్టర్లో ఆశిష్ గాంధీ ఎంతో పవర్ఫుల్గా కనిపించాడు. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ సునిల్ కరియాట్టుకర దీన్ని భారీ యాక్షన్ జానర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు కేజీయఫ్ ఫేమ్ రవి బసూర్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. -
హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్ సల్మాన్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మూవీ సక్సెస్ నేపథ్యంలో ఓ చానల్తో ముచ్చటించాడు దుల్కర్ సల్మాన్. చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా.. ఈ సందర్భంగా తన తండ్రి మమ్ముట్టి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను సినిమాల్లోకి వస్తానని చెబితే నాన్న బాధపడ్డారంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందువల్లనే ఫైట్లు, డాన్స్లు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టుగానే చదువుకుని దుబాయ్లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. అందువల్లనే కేరళకి తిరిగి వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆ విషయంలో టాలీవుడ్ గ్రేట్: తమిళ నిర్మాత రాజన్ ఆ తర్వాత ఈ విషయంలో ఇంట్లో పెద్ద గొడవే జరిగిందన్నాడు. ‘నేను సినిమాల్లోకి వెళతానని చెప్పాగానే నాన్న పెద్ద గొడవ చేశారు. అంతకుముందు ఆయనను ఎప్పుడూ అంత కోపం, బాధతో చూడలేదు. హీరోగా చేస్తానని చెప్పగానే నువ్వు ఎప్పుడూ సరదాగా డాన్స్ చేసింది లేదు.. నటించేందుకు నువ్వు ప్రయత్నించడం కూడా నేనేప్పుడు చూడలేదు. యాక్టింగ్ అంటే నువ్వు అనుకున్నత సులువు కాదు. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచన చేయకు’ అని చివాట్లు పెట్టారని చెప్పాడు. తాను నటిస్తానంటే వద్దని చెప్పిన ఆయనే ఇప్పుడు తన సినిమాలు చూసి సూచనలు ఇస్తుంటారని దుల్కర్ పేర్కొన్నాడు. -
తండ్రి క్రమశిక్షణ ఎక్కువైతే.. 'పురు' మూవీ రివ్యూ
టైటిల్: పురు (Puzhu) నటీనటులు: మమ్ముట్టి, పార్వతి తిరువోతు, వాసుదేవ్ సజీత్ తదితరులు నిర్మాత: ఎస్ జార్జ్ దర్శకత్వం: రథీనా పీటీ సంగీతం: జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: థేనీ ఈశ్వరన్ విడుదల తేది: మే 13, 2022 (సోనీ లివ్) మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విభిన్నమైన సినిమాలతో విలక్షణ నటనతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ 70 ఏళ్ల వయసులోనూ నేటి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5, ది ప్రీస్ట్ సినిమాలతో ఆకట్టుకున్న మమ్ముట్టి, మరో వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్లో నటించిన చిత్రం 'పురు' (Puzhu). ఈ సినిమాతోనే మమ్ముట్టి ఓటీటీలోకి అడుగు పెట్టగా, రథీనా పీటీ దర్శకురాలిగా పరిచయమయ్యారు. మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు మరో కీ రోల్లో నటించారు. మే 13న ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: పోలీస్ ఆఫీసర్ కుట్టన్ (మమ్ముట్టి) తన భార్య చనిపోవడంతో కొడుకు కిచ్చు (వాసుదేవ్ సజీత్)తో కలిసి అందిరికీ దూరంగా నివసిస్తూ ఉంటాడు. అనుక్షణం క్రమశిక్షణ పేరుతో కొడుకు కిచ్చుతో కాస్తా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. కానీ కిచ్చుకు మాత్రం తండ్రి ప్రవర్తన చాలా ఇబ్బంది పెడుతుంది. అయినా తండ్రి మీద భయంతో అది పైకి మాత్రం చెప్పడు. మరోవైపు కుట్టన్ చెల్లెలు భారతి (పార్వతి తిరువోత్తు) పెద్దలను ఎదిరించి కేపీ అనే నాటకాలు వేసే వ్యక్తిని ప్రేమవివాహం చేసుకుంటుంది. కేపీది తక్కువ కులం కావడంతో కుట్టన్ ఫ్యామిలీ వారిద్దరిని దూరం పెడతారు. కానీ అనుకోకుండా కుట్టన్ ఉంటున్న ఫ్లాట్లోకి భారతి-కేపీ వచ్చి నివసిస్తుంటారు. మరోవైపు కుట్టన్ను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తుంటారు. కుట్టన్ చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు ? వారికి కుట్టన్కు సంబంధం ఏంటీ ? తన చెల్లెలు భారతి ప్రేమను కుట్టన్ అంగీకరించాడా ? కుట్టన్తోపాటు భారతి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది తెలియాలంటే 'పురు' చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక సింపుల్ స్టోరీ. పరువు హత్యలు, రివేంజ్ కథాంశంగా తెరకెక్కింది. ఈ స్టోరీని మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా బాగానే మలిచారు డైరెక్టర్ రథీనా పీటీ. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. క్రమశిక్షణ పేరుతో తండ్రి ప్రవర్తించే తీరు, అది నచ్చకపోయిన తండ్రి మీద భయంతో వాటన్నింటిని కొడుకు భరించే సీన్లను చక్కగా చూపించారు. ఉన్నత కుటుంబాల్లో ఉండే కుల వివక్షత, ఎవరైనా ప్రేమించి పెద్దలను పెళ్లి చేసుకుంటే ఇరుగుపొరుగు వాళ్ల మాటలు, తండ్రి చెప్పిందే వేదం వంటివి ఆలోచింపజేస్తాయి. కానీ స్టోరీ, స్క్రీన్ప్లే చాలా స్లోగా నడుస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పవచ్చు. తర్వాత ఏదో జరుగబోతోందనిపించే ప్రేక్షకుడికి ప్రతిసారి నిరాశే మిగులుతుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ పర్వాలేదనిపిస్తుంది. కుట్టన్ తీసుకునే సడెన్ డెసిషన్ ఆశ్చర్యపరుస్తుంది. కుట్టన్ను ఎందుకు, ఎవరు చంపుతున్నారనే విషయం ఓకే అనిపిస్తుంది. ఒరిజినల్గా ఇది మలయాళ చిత్రం. తెలుగులోకి డబ్ చేశారు. అయితే పాత్రల లిప్ సింక్కు తగినట్లుగా డబ్ చేస్తారు. డబ్ చేసేటప్పుడు దానికి తగినట్లుగానే డైలాగ్లు రాస్తారు. మలయాళంలో ఉన్న డైలాగ్లనే తెలుగులోనూ పూర్తిగా అదే అర్థం వచ్చేలా చెప్పిస్తే కొంతవరకు బెటర్గా ఉండేది. రివెంజ్ తీర్చుకునే వ్యక్తి ఇంటెన్సిటీ చక్కగా కనిపించేది. ఎందుకంటే ఇంగ్లీష్లో వచ్చే సబ్టైటిల్స్కు తెలుగులో డైలాగ్లకు కొన్నిసార్లు సంబంధం ఉండదు. కేవలం కొద్దిపాటి అర్థం వచ్చేలా మ్యానేజ్ చేశారు. ఎవరెలా చేశారంటే? ఈ మూవీలో హైలెట్ అంటే కేవలం అది మమ్ముట్టి నటనే. కొడుకు మీద ప్రేమతోపాటు క్రమశిక్షణ ఎంత అవసరమో అని చెప్పే తండ్రిగా, భార్య జ్ఞాపకాలను తలుచుకుంటూ జీవించే భర్తగా ఆయన నటన అద్భుతంగా ఉంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్కు నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆయన క్యారెక్టర్, నటన బాగా మ్యాచ్ అయ్యాయి. కుట్టన్ కొడుకు కిచ్లుగా బాల నటుడు వాసుదేవ్ సజీత్ కూడా ఎంతో చక్కగా నటించాడు. తండ్రి మీద భయం, ద్వేషం, ప్రేమ వంటి ఎమోషన్స్ చూపించండలో ఆకట్టుకున్నాడు. పార్వతి తిరువోతు నటన ఆ క్యారెక్టర్కు సరిపోయేలా ఉంది. నెక్ట్స్ సమ్థింగ్ ఏదో జరగుతుందనిపించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్గా ఉంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఇక చివరిగా చెప్పాలంటే టైంపాస్ కోసం చూడలనుకునేవారు ఓపికతో 'పురు'ను చూడొచ్చు. -
మమ్ముట్టి మిస్టిక్ థ్రిల్లర్ 'పుజు'.. నేరుగా ఆ ఓటీటీలోకి
Mammootty Puzhu Movie Released On Sony Liv: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5 ది బ్రెయిన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా మరో డిఫరెంట్ మూవీ 'పుజు'(Puzhu) తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో 'చార్లీ' సినిమా ఫేమ్ పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో రతీనా పీటీ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అలాగే ఇందులో మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ తండ్రికొడుకుల నేపథ్యంలో మిస్టిక్ థ్రిల్లర్గా తెరెకెక్కినట్లు తెలుస్తోంది. వాసుదేవ్ సజీత్ మరార్ మమ్ముట్టి కొడుకుగా నటిస్తున్నాడు. ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సోనీ లివ్లో మే 13 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్, సిన్సిల్ సెల్యూలాయిడ్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వైజాగ్లో ఏజెంట్
ప్రత్యర్థుల ప్లాన్ను తిప్పి కొట్టడానికి వ్యూహం పన్నారు ఏజెంట్. మరి.. ఈ వ్యూహంలో ప్రత్యర్థులు చిక్కుకుని ఎలా అల్లాడిపోయారు? అనేది థియేటర్స్లో చూడాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఏజెంట్’. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రధారి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అఖిల్ వైజాగ్ వెళ్లారు. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారని, ఈ బ్లాక్ ఇంట్రవెల్లో వస్తుందని టాక్. ‘ఏజెంట్’ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
అఖిల్ ‘ఎజెంట్’ మూవీ నుంచి మమ్ముట్టి లుక్ అవుట్
అక్కినేని వారసుడు అఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎజెంట్’. సురేందర్రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు చాకోలెట్ బాయ్గా కనిపించిన అఖిల్ ఈ మూవీ కోసం జిమ్లో కసరత్తుల చేసి సిక్స్ బ్యాక్ బాడీతో మేకోవర్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మేకర్స్ దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి మమ్ముట్టి ఫస్ట్లుఖ్ పోస్టర్ విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ను షేర్ చేస్తూ.. ‘క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో భాగమయ్యారు’ అంటూ ఆయన పోస్టర్ను విడుదల చేశారు. తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకున్న మమ్ముట్టి భారీ యాక్షన్ సీన్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ‘ది డెవిల్ క్రూరమైన రక్షకుడు’ అని మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వడం పట్ల మమ్ముట్టి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి కథానాయికగా నటిస్తోంది. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. A Stalwart of Indian Cinema who paved his own path with Discipline & Dedication 🔥 Megastar @mammukka🤘Joins the shoot of #AGENT ⚡️ Can’t wait to witness the magic on sets ❤️@AkhilAkkineni8 @DirSurender @AnilSunkara1 @VamsiVakkantham@hiphoptamizha @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/pmVv474Vnz — AK Entertainments (@AKentsOfficial) March 7, 2022 -
మొన్న తండ్రి.. ఇప్పుడు తనయుడు.. వదిలిపెట్టని కరోనా
కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఏ తేడా లేకుండా అందరికీ సోకుతూ ఇండస్ట్రీని గడగడలాడిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్లు కరోనా బారిన పడగా తాజాగా మరో యంగ్ హీరోకు వైరస్ సోకింది. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉంటున్నాను. స్వల్ప కోవిడ్ లక్షణాలు మినహా అంతా బాగానే ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ ఐసోలేషన్లో ఉంటే మంచింది. ఈ మహమ్మారి మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా దుల్కర్ తండ్రి, మలయాళ స్టార్ మమ్ముట్టి సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే! సంక్రాంతి రోజే తను కోవిడ్ ఉన్నట్లు తేలిందని సోషల్ మీడియాలో వెల్లడించాడు. వారం రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
పండగపూట బ్యాడ్ న్యూస్ చెప్పిన సూపర్ స్టార్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శనివారం(జనవరి 15) నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కాస్త జ్వరం మినహా అంతా బాగానే ఉంది. ప్రస్తుతం నేను ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. అన్నివేళలా మాస్కు ధరించండి' అని ట్వీట్ చేశాడు. కాగా ఆయన ప్రస్తుతం 'సీబీఐ 5' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన సేతురామన్ అయ్యర్ పాత్రలో కనిపించనున్నాడు. దీనికి కె.మధు దర్శకత్వం వహిస్తుండగా ముఖేశ్, జగతి శ్రీకుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Despite taking all the necessary precautions I have tested Covid Positive yesterday. Besides a light fever I am otherwise fine. I am self isolating at home as per the directions of the concerned authorities. I wish for all of you to stay safe. Mask at all times and take care. — Mammootty (@mammukka) January 16, 2022 -
దుల్కర్ చిత్రానికి రూ. 40 కోట్ల ఓటీటీ డీల్, ఒప్పందం రద్దు చేయించిన మమ్ముట్టి!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ తెరకెక్కి నవంబర్ 12న విడుదలకు సిద్దమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇటీవల విడుదలైన ‘కురుప్’ ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ విడుదలపై హీరో దుల్కర్ సల్మాన్, చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తిక వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ‘కురుప్’ మూవీ షూటింగ్ ఎప్పుడో పూరైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మొదట ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారట. అంతేగాక డిజిటల్ విడుదలకు వారికి ఓటీటీ నుంచి రూ. 40 కోట్ల డీల్ కూడా కుదిరినట్లు వినికిడి. చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు అయితే దుల్కర్ సల్మాన్ తండ్రి, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమా చూసి ఓటీటీ డీల్ను రద్దు చేసి థియేటర్లో విడుదల చేయమని మేకర్స్ను ఒప్పించాడట. తండ్రి చెప్పడంతో వెంటనే రూ. 40 కోట్ల ఓటీటీ ఒప్పందాన్ని దుల్కర్ సల్మాన్ రద్దు చేసుకుని థియేటర్లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ చిత్రాన్ని స్యయంగా దుల్కర్ సల్మాన్ నిర్మించడం విశేషం. చదవండి: తెలుగు ప్రేక్షకులను మించిన సినీ ప్రేక్షకులు ఉండరేమో: హీరో -
అఖిల్ ‘ఏజెంట్’లో మలయాళ స్టార్ హీరో!
ఉప్పెనలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. పుష్పలో ఫాహద్ ఫాజిల్ విలర్ రోల్ చేస్తున్నాడు. అలాగే సలార్ లో మరో మలయాళ నటుడు పృథ్విరాజ్ కీరోల్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు బ్యాచ్ లర్ కొత్త చిత్రం ఏజెంట్ లోనూ మాలీవుడ్ సూపర్ స్టార్ అడుగు పెట్టబోతున్నారట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్తో దసరా హీరోగా మారాడు అఖిల్.ఇప్పుడు నెక్ట్స్ మూవీని బ్యాచ్లర్ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఏజెంట్ లోమాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మమ్ముట్టి చిత్రాలు చేశాడు. రీసెంట్గా వైఎస్సార్ బయోపిక్ యాత్ర లో మహానేతగా మెప్పించారు.ప్రస్తుతం మాలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు మమ్ముట్టి. ఈ దశలో మాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ వరకు వచ్చి అఖిల్ మూవీలో కీరోల్ చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. -
అందుకే ఆయనను ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అనేవాళ్లు
మమ్ముట్టి.. ఇండియన్ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా సౌత్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాలీవుడ్ మెగాస్టార్గా వెలుగొందుతున్న ఆయన.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా మొదలైన ముహమ్మద్ కుట్టీ పనపరంబిల్ ఇస్మాయిల్ నటనా పరంపర.. ఇవాళ అభిమానులతో ఆప్యాయంగా ‘మమ్ముక్క’ అని పిలిపించుకునేంత స్థాయికి ఎదిగింది. నేడు(సెప్టెంబర్ 7) ‘మమ్ముట్టి’పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం. Happy Birthday Mammootty: మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబంలో పుట్టిన మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించాడు. ఆపై రెండేళ్లపాటు మంజేరీలో లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశాడు. అనుభవంగళ్ పాలిచకల్(1971)లో గుంపులో గోవిందుడిగా కనిపించాడు పనపరంబిల్ ఇస్మాయిల్. ఆపై నటనపై ఆసక్తితో సినిమా, నాటకాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాడు. 1979లో దేవలోకం సినిమాతో లీడ్ రోల్ పోషించాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది. విక్కనుండు స్వప్నంగల్(1980) ద్వారా సాజిన్ పేరుతో మాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారి పలకరించాడు. అదే ఏడాది వచ్చిన ‘మేళా’ ఆయనకి హీరోగా తొలి గుర్తింపు ఇచ్చింది. అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అనేవారు ఎనభై దశకం మొదట్లో సాజిన్ పేరుతోనే కొన్నాళ్లపాటు నటనా ప్రస్థానం నడిచింది. ‘అహింసా’ సినిమాకు గాను కేరళ స్టేట్ తొలి అవార్డు(సపోర్టింగ్ రోల్) అందుకున్నాడు. ఓవైపు మాస్ క్యారెక్టర్లతో పాటు మరోవైపు ఎక్కువగా భర్త-తండ్రి పాత్రలతో అలరించాడాయన అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అంటూ ప్రాసను వాడేవాళ్లు ఆయన మీద. అలాంటి టైంలో ‘న్యూఢిల్లీ’, ‘తనియావర్తనం’ ఆయనలోని సీరియస్ నటనా కోణాల్ని ఆవిష్కరించాయి. ఆపై చాలాకాలం వరుసగా అలాంటి సినిమాలే ఆయనకు దక్కాయి. 1984-93, 1994-2000, 2000-2010.. ఈ మధ్యకాలాల్లో మాస్-క్లాస్-ప్రయోగాత్మక కథలతో.. అప్ అండ్ డౌన్స్తో, మధ్య మధ్యలో భారీ బ్లాక్బస్టర్లతో మమ్మూటీ సినీ ప్రయాణం కొనసాగింది. ఎక్కువగా ఊరమాస్ క్యారెక్టర్లతో అలరించడం వల్లే మెగాస్టార్గా ముద్రపడిపోయాడు ఆయన. క్రిటికల్ నటుడు మమ్మూటీ మలయాళం పరిశ్రమకు మాస్ ఇంట్రోలు-యాక్షన్ అందించే మెగాస్టార్ కావొచ్చేమో.. కానీ, సౌత్కు మాత్రం ఆయనొక టిపికల్ నటుడు. సంగం, ఉత్తరం, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కథోడు కథోరం, పొంథన్ మడ, కౌరవర్, ప్రణామం, అయ్యర్ ది గ్రేట్, ముద్ర, ది కింగ్.. ఇలా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా పాత సినిమాల సంగతి సరేసరి. పెరంబూ, ఉండా లాంటి కొన్ని రీసెంట్ చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని అన్ని భాషలకు చూపెట్టాయి. ఇక జబ్బర్ పటేల్ డైరెక్షన్లో వచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్కుగానూ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. ‘సామ్రాజ్యం’ లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆరు భాషల్లో.. 70 ఏళ్ల మమ్మూటీ ఇప్పటిదాకా 400పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఒక మెయిన్ లీడ్ హీరో మిగతా భాషల్లోనూ నటించడం అప్పటికే నడుస్తోంది. అలా మమ్మూటీ కూడా ఆరు భాషల్లో నటించారు. మాలీవుడ్తో పాటు మౌనం సమ్మదం(తమిళం)..దళపతి లాంటి సినిమాలు, స్వాతి కిరణం, త్రియాత్రి(హిందీ), షికారి(కన్నడ), డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(ఇంగ్లీష్) నటించారు. అంతేకాదు ఐదు సినిమాలకుగానూ మూడు నేషనల్ అవార్డులు అందుకున్న అరుదైన రికార్డు మమ్ముక్క సొంతం. ఒరు వడక్కన్(1989) వీరగాథకు ఫస్ట్ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. అలాగే ఏడు స్టేట్ అవార్డులు దక్కాయి కూడా. తెలుగులో స్వాతి కిరణం, సూర్య పుత్రులు(1996), రైల్వే కూలీ(రిలీజ్కు నోచుకోలేదు).. ఆపై రెండు దశాబ్దాల తర్వాత వైఎస్సార్ బయోపిక్‘యాత్ర’లో నటించి.. మెప్పించాడు మమ్మూట్టీ. 4 ఇయర్స్.. 120 ఫిల్మ్స్ జూనియర్ ఆర్టిస్ట్గా మొదలైన మమ్మూటీ.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా-విలన్గా, సపోర్టింగ్ రోల్స్తో ఆపై లీడ్ రోల్స్తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒకానొక టైంలో ఆయన ఎంత బిజీ అయ్యారంటే.. 1983 నుంచి 1986 మధ్య నాలుగేళ్ల కాలంలో ఏడాదికి 30కి పైగా సినిమాల చొప్పున ఏకంగా 120 సినిమాల్లో నటించారాయన. అంతేకాదు మలయాళంలో 15సార్లు డ్యుయెల్రోల్స్ వేసిన ఘనత కూడా ఆయన ఖాతాలో ఉంది. నిర్మాతగా కూడా.. నటుడే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. మెగాబైట్స్, ప్లే హౌజ్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్, టెక్నోటెయిన్మెంట్ పేరుతో డిసస్టట్రిబ్యూషన్ కంపెనీ నడిపించారు కూడా. ఆయనలో రాతగాడు కూడా ఉన్నాడు. కాల్చప్పుడు పేరుతో ఓ పేపర్లో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు సందర్భానికి తగ్గటుగా సోషల్ మీడియాలో వేదాంత ధోరణిలో కొటేషన్లు కూడా రాస్తుంటాడు. ఆయనలో మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అందుకే కేరళ వాలీబాల్ లీగ్కు అంబాసిడర్గా కూడా వ్యవహరించాడు. -
‘గ్రేట్ శంకర్’గా మమ్ముట్టి
మలయాళ హిట్ మూవీ ‘మాస్టర్ పీస్’ తెలుగులో ‘గ్రేట్ శంకర్’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్కుమార్, ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ ‘గ్రేట్ శంకర్’ని తెలుగులో విడుదల చేయనున్నారు. (చదవండి: చిరు ‘గాడ్ ఫాదర్’కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్, డేట్స్ కూడా ఫిక్స్!) ‘‘మంచి కథాబలం ఉన్న చిత్రం ఇది. మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది. మలయాళంలో హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు లగడపాటి శ్రీనివాస్. -
మోహన్ లాల్, మమ్ముట్టిలకు యూఏఈ అరుదైన గౌరవం
యుఏఈ గోల్డెన్ వీసాలకు మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్లు ఎంపికయ్యారు. యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించినట్లు స్వయంగా మోహలాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులకు గౌరవప్రదమైన గుర్తింపును ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సంజయ్ దత్లకు ఈ వీసాను ఇచ్చిన సంగతి తెలిసిందే. గోల్డెన్ వీసా, 2019 లో యుఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వీసా ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చు. అంతేగాక ఎలాంటి జాతీయ స్పాన్సర్స్ లేకుండానే 10 సంవత్సరాల పాటు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వీసా గడువు పూర్తి కాగానే ఆటోమెటిక్గా రెన్యూవల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీసా మోహాన్ లాల్ అందుకోగానే త్వరలోనే మమ్ముట్టి యూఏఈలో తీసుకోనున్నారు. My grateful thanks to H E Mohamed Ali Al Shorafa Al Hammadi for bestowing upon me the Golden Visa for the UAE. Am indeed honoured. My gratitude also goes out to Mr @Yusuffali_MA for facilitating this.@AbuDhabiDED pic.twitter.com/Wo5Jd8AaJX — Mohanlal (@Mohanlal) August 23, 2021 -
ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ: జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మెగాస్టార్గా..
Mammootty Completes 50 Years In Cinema: మమ్మూట్టీ.. ఇండియన్ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా సౌత్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాలీవుడ్ మెగాస్టార్గా వెలుగొందుతున్న ఆయన.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఒక జూనియర్ ఆర్టిస్ట్గా మొదలైన ముహమ్మద్ కుట్టీ పనపరంబిల్ ఇస్మాయిల్ నటనా పరంపర.. ఇవాళ అభిమానులతో ఆప్యాయంగా ‘మమ్ముక్క’ అని పిలిపించుకునేంత స్థాయికి ఎదిగింది. సాక్షి, వెబ్డెస్క్: మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబంలో పుట్టిన మమ్మూట్టీ.. ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించాడు. ఆపై రెండేళ్లపాటు మంజేరీలో లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశాడు. అనుభవంగళ్ పాలిచకల్(1971)లో గుంపులో గోవిందుడిగా కనిపించాడు పనపరంబిల్ ఇస్మాయిల్. ఆపై నటనపై ఆసక్తితో సినిమా, నాటకాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాడు. 1979లో దేవలోకం సినిమాతో లీడ్ రోల్ పోషించాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది. విక్కనుండు స్వప్నంగల్(1980) ద్వారా సాజిన్ పేరుతో మాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారి పలకరించాడు. అదే ఏడాది వచ్చిన ‘మేళా’ ఆయనకి హీరోగా తొలి గుర్తింపు ఇచ్చింది. ఆల్ జానర్ల ఆర్టిస్ట్ ఎనభై దశకం మొదట్లో సాజిన్ పేరుతోనే కొన్నాళ్లపాటు నటనా ప్రస్థానం నడిచింది. ‘అహింసా’ సినిమాకు గాను కేరళ స్టేట్ తొలి అవార్డు(సపోర్టింగ్ రోల్) అందుకున్నాడు. ఓవైపు మాస్ క్యారెక్టర్లతో పాటు మరోవైపు ఎక్కువగా భర్త-తండ్రి పాత్రలతో అలరించాడాయన అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అంటూ ప్రాసను వాడేవాళ్లు ఆయన మీద. అలాంటి టైంలో ‘న్యూఢిల్లీ’, ‘తనియావర్తనం’ ఆయనలోని సీరియస్ నటనా కోణాల్ని ఆవిష్కరించాయి. ఆపై చాలాకాలం వరుసగా అలాంటి సినిమాలే ఆయనకు దక్కాయి. 1984-93, 1994-2000, 2000-2010.. ఈ మధ్యకాలాల్లో మాస్-క్లాస్-ప్రయోగాత్మక కథలతో.. అప్ అండ్ డౌన్స్తో, మధ్య మధ్యలో భారీ బ్లాక్బస్టర్లతో మమ్మూటీ సినీ ప్రయాణం కొనసాగింది. ఎక్కువగా ఊరమాస్ క్యారెక్టర్లతో అలరించడం వల్లే మెగాస్టార్గా ముద్రపడిపోయాడు ఆయన. క్రిటికల్ నటుడు మమ్మూటీ మలయాళం పరిశ్రమకు మాస్ ఇంట్రోలు-యాక్షన్ అందించే మెగాస్టార్ కావొచ్చేమో.. కానీ, సౌత్కు మాత్రం ఆయనొక టిపికల్ నటుడు. సంగం, ఉత్తరం, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కథోడు కథోరం, పొంథన్ మడ, కౌరవర్, ప్రణామం, అయ్యర్ ది గ్రేట్, ముద్ర, ది కింగ్.. ఇలా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా పాత సినిమాల సంగతి సరేసరి. పెరంబూ, ఉండా లాంటి కొన్ని రీసెంట్ చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని అన్ని భాషలకు చూపెట్టాయి. ఇక జబ్బర్ పటేల్ డైరెక్షన్లో వచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్కుగానూ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. ‘సామ్రాజ్యం’ లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆరు భాషల్లో.. 69 ఏళ్ల మమ్మూటీ ఇప్పటిదాకా 400పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఒక మెయిన్ లీడ్ హీరో మిగతా భాషల్లోనూ నటించడం అప్పటికే నడుస్తోంది. అలా మమ్మూటీ కూడా ఆరు భాషల్లో నటించారు. మాలీవుడ్తో పాటు మౌనం సమ్మదం(తమిళం)..దళపతి లాంటి సినిమాలు, స్వాతి కిరణం, త్రియాత్రి(హిందీ), షికారి(కన్నడ), డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(ఇంగ్లీష్) నటించారు. అంతేకాదు ఐదు సినిమాలకుగానూ మూడు నేషనల్ అవార్డులు అందుకున్న అరుదైన రికార్డు మమ్ముక్క సొంతం. ఒరు వడక్కన్(1989) వీరగాథకు ఫస్ట్ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. అలాగే ఏడు స్టేట్ అవార్డులు దక్కాయి కూడా. తెలుగులో స్వాతి కిరణం, సూర్య పుత్రులు(1996), రైల్వే కూలీ(రిలీజ్కు నోచుకోలేదు).. ఆపై రెండు దశాబ్దాల తర్వాత వైఎస్సార్ బయోపిక్‘యాత్ర’లో నటించి.. మెప్పించాడు మమ్మూట్టీ. 4 ఇయర్స్.. 120 ఫిల్మ్స్ జూనియర్ ఆర్టిస్ట్గా మొదలైన మమ్మూటీ.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా-విలన్గా, సపోర్టింగ్ రోల్స్తో ఆపై లీడ్ రోల్స్తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒకానొక టైంలో ఆయన ఎంత బిజీ అయ్యారంటే.. 1983 నుంచి 1986 మధ్య నాలుగేళ్ల కాలంలో ఏడాదికి 30కి పైగా సినిమాల చొప్పున ఏకంగా 120 సినిమాల్లో నటించారాయన. అంతేకాదు మలయాళంలో 15సార్లు డ్యుయెల్రోల్స్ వేసిన ఘనత కూడా ఆయన ఖాతాలో ఉంది. నిర్మాతగా కూడా.. నటుడే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. మెగాబైట్స్, ప్లే హౌజ్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్, టెక్నోటెయిన్మెంట్ పేరుతో డిసస్టట్రిబ్యూషన్ కంపెనీ నడిపించారు కూడా. ఆయనలో రాతగాడు కూడా ఉన్నాడు. కాల్చప్పుడు పేరుతో ఓ పేపర్లో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు సందర్భానికి తగ్గటుగా సోషల్ మీడియాలో వేదాంత ధోరణిలో కొటేషన్లు కూడా రాస్తుంటాడు. ఆయనలో మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అందుకే కేరళ వాలీబాల్ లీగ్కు అంబాసిడర్గా కూడా వ్యవహరించాడు. ఫ్రెండ్లీ స్టార్ సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోల మధ్య పోటీతత్వం.. అలాగే వాళ్ల అభిమానుల మధ్య వైరం కనిపిస్తుంటుంది. కానీ, మెగాస్టార్గా పేరున్న మమ్మూటీ.. మాలీవుడ్లో సీనియర్-జూనియర్లతోనూ స్నేహం కొనసాగిస్తుంటాడు. మధ్య మధ్యలో వాళ్ల సినిమాల్లో, మాలీవుడ్ చేపట్టే ఛారిటీ కార్యక్రమాల్లోనూ సహ నటులతో మెరుస్తుంటాడు. 2005-10 మధ్య మమ్మూట్టీ-మోహన్లాల్-దిలీప్.. ఈ త్రయం 97 శాతం మాలీవుడ్ ఫిల్మ్ రెవెన్యూను రాబట్టగా.. అందులో మేజర్ షేర్ మమ్మూట్టీదే కావడం విశేషం. ఇక మాలీవుడ్ సూపర్స్టార్ మోహన్లాల్తో కొనసాగించే స్నేహం చాలామంది హీరోలకు ఒక మంచి పాఠం కూడా. Today, my brother completes 50 glorious years in the film industry. I feel so proud to have shared the screen with him in 55 memorable films and looking forward to many more. Congratulations Ichakka! @mammukka pic.twitter.com/UevUpSkSGH — Mohanlal (@Mohanlal) August 6, 2021 -
దర్శకుడిగా మారిన మలయాళ స్టార్ హీరో
యాక్టర్ మోహన్ లాల్ మెగాఫోన్ పట్టి డైరెక్టర్గా మారారు. మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ సినిమా ప్రారంభోత్సవం కొచ్చిలో జరిగింది. మలయాళ దర్శకుడు, నటుడు జిజో పున్నూస్ రచించిన ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్, స్పానిష్ యాక్టర్లు పాజ్ వేగా, రాఫెల్ అమర్గో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘‘జీవితం నన్ను నటుడిని చేసింది. ఈ ప్రయాణంలో సినిమాయే నా జీవితం.. నా జీవనాధారం అని అర్థమైంది. నటుడిగా అద్భుతమైన ప్రయాణం చేసిన నేను ఇప్పుడు దర్శకుడిగా మరో ప్రయాణాన్ని మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు మోహన్ లాల్. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పాల్గొన్నారు. చదవండి: ఖమ్మం నుంచి వచ్చి సోనాలి సూద్ పేరు చెప్పగానే.. విజయ్ దేవరకొండ పాటకి సిగ్గు పడుతూ వీడియో -
క్రేజీ ఆఫర్: స్టార్ హీరోతో అనసూయ!
అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పాలి. కామెడీ షోకు గ్లామర్ అద్దిన ఈ యాంకర్ తన అందచందాలతోనే కాకుండా జబర్దస్త్ పంచులతో అభిమానులను బుట్టలో వేసుకుంది. తన టాలెంట్ను కేవలం బుల్లితెరకే పరిమితం చేయకుండా వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ సినిమాల్లో నటిస్తూ వెండితెర మీద కూడా సత్తా చాటుతోంది. అయితే ఈ నటికి తెలుగులోనే కాకుండా ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా రంగమ్మత్త కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే కదా! తాజాగా ఆమెకు మాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటించనున్న భీష్మ పర్వంలో ఓ ముఖ్య పాత్రకు అనసూయను తీసుకుంటున్నారట. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన 'యాత్ర' సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా అనసూయ కూడా ఓ కీలక పాత్రలో మెప్పించింది. ఇందులో ఆమె నటనను చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు అమల్ నీరద్ 'భీష్మ పర్వం' సినిమాలోని ఓ పాత్రకు అనసూయ అయితేనే కరెక్ట్గా ఉంటుందని ఆమెను ఎంపిక చేశారట. ఈ చిత్రం ద్వారా ఆమె మాలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అనసూయ 'క్రాక్' హీరో రవితేజ 'ఖిలాడీ' సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. మరోవైపు గోపీచంద్ 'సీటీమార్'లో ఐటమ్ సాంగ్లో ఆడిపాడింది. చదవండి: నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్ వైరల్: మహేష్ బాబుపై క్లాప్ కొట్టిన బుచ్చిబాబు -
ఒక సినిమా నూటనలభై మంది స్టార్స్!
కోవిడ్ వల్ల ఇబ్బందిపడ్డ సినీ కార్మికులకు సహాయంగా ఓ మెగా మల్టీస్టారర్ చిత్రం చేయడానికి రెడీ అయింది మలయాళ చిత్రసీమ. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్ లాల్ ప్రకటించారు. ప్రముఖ మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా మలయాళంలో టాప్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో కనిపించనున్నారు. సుమారు 140 మంది నటీనటులు ఈ చిత్రంలో భాగమవ్వనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మందికి పని కల్పించడంతో పాటు వచ్చే మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి వినియోగించనున్నారు. -
హిట్లర్ టు లూసిఫర్
‘హిట్లర్’ (1997) టు తాజా ‘లూసిఫర్’ వరకూ చిరంజీవి చాలా సినిమాలు చేశారు. వీటిలో ‘ఠాగూర్’, ‘స్టాలిన్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి తమిళ, హిందీ రీమేక్ చిత్రాలున్నాయి. కానీ మలయాళ రీమేక్ లేదు. ‘హిట్లర్’ చిత్రం మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’కి రీమేక్. ఇప్పుడు చిరంజీవి నటించనున్నæమోహన్ లాల్ మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ని బుధవారం ప్రకటించారు. విశేషం ఏంటంటే.. చిరంజీవి ‘హిట్లర్’కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ ‘హిట్లర్’ రీమేక్కి నిర్మాత. చిరంజీవి రాబోయే సినిమాగా ‘లూసిఫర్’ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్.వి. ప్రసాద్ నిర్మించనున్నారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మన నేటివిటీకి తగ్గట్టు ఈ స్క్రిప్టును మోహన్ రాజా బాగా న్యారేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్కి వెళతాం. ఏప్రిల్తో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు మోహన్ రాజా. ‘‘బాస్తో (చిరంజీవి) సినిమా అంటేనే అందరిలో కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తాం’’ అన్నారు ఎన్.వి. ప్రసాద్. -
అడుగు బయటపెట్టారు
కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో అందరూ దాదాపు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్వీయ సవాల్ విసురుకున్నారు మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా ఎన్ని రోజులు ఉండగలనన్నది ఆ చాలెంజ్. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కొన్ని రోజుల క్రితం పంచుకున్నారు. ‘ఇప్పటికే నాన్న ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి 150 రోజులయింది’ అని పేర్కొన్నారు దుల్కర్. దాదాపు తొమ్మిది నెలలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు మమ్ముట్టి. సుమారు 275 రోజులు ఇల్లు కదల్లేదు ఆయన. తాజాగా స్వీయ నిర్భంధాన్ని బ్రేక్ చేశారు. శుక్రవారం ఇంటి నుంచి అడుగు బయటపెట్టారు మమ్ముట్టి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. త్వరలోనే సినిమా షూటింగ్స్లోనూ పాల్గొననున్నారట మమ్ముట్టి. -
275 రోజుల తర్వాత.. స్నేహితులతో సూపర్ స్టార్..
తిరువనంతపురం: మాలమాళ సూపర్స్టార్ మమ్ముట్టికి సవాళ్లు అంటే ఇష్టం. అందుకే లాక్డౌన్లో కాలు బయట పెట్టకుండ ఎన్ని రోజుల ఉండగలరో తనకను తానే సవాలు విసురుకున్న విషయం తెలిసిందే. ఇంట్లోవారంత అలా నిత్యవసర సరుకులు తీసుకురమ్మని చెప్పినా కూడా ససేమిరా అంటూ ఇంటిపట్టునే ఉన్నారంట. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం లాక్డౌన్ ఎత్తివేయడంతో కాస్తా సాధారణ పరిస్థితులు రాగానే మమ్ముట్టి శుక్రవారం రాత్రి బయటకు వచ్చి స్నేహితులతో సరదాగా గడిపారు. దాదాపు తొమ్మిది నెలల(275 రోజులు) తర్వాత ఆయన తన స్నేహితులైన దర్శకుడు ఆంటో జోసెఫ్, బదుషా, నటుడు రమేష్ పిషరోడితో కలిసీ సాయంకాలం అలా సరదగా బయటకు వచ్చి సులైమాని చాయ్ తాగుతున్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (చదవండి: అడుగు బయటపెట్టేది లేదు!) కాగా మమ్ముట్టి తన తదుపరి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ప్రైస్ట్’ షూటింగ్లో భాగంగా మార్చిలో కేరళలోని ఆయన కొత్త ఇంటికి వచ్చారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నుంచి లాక్డౌన్ అమలు కావడంతో కుటుంబంతో కలిసి ఆయన అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో మమ్ముట్టి లాక్డౌన్లో బయటకు వెళ్లకుండా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండగలనని పరీక్షించుకునేందుకు తనకు తానే సవాలు విసురుకున్నట్లు ఆయన తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్ అగష్టులో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు బోరు కొట్టకుండా ఉండేందకు ఇంట్లో వ్యాయమం చేస్తూ ఫిట్నెస్ శ్రద్ధ పెట్టారంట. ఇందుకు సంబంధించిన ఫొటోలను దుల్కర్ తరచూ సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: వైరలవుతోన్న మమ్ముట్టి వర్క్వుట్ ఫోటోలు) -
మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
‘వేరే పనేం లేదు.. అందుకే ఇలా’
షూటింగ్లు, ప్రెస్ మీట్లు, ఇండస్ట్రీకి చెందిన పలు కార్యక్రమాలతో బిజీగా ఉండే సినిమా జనాలు లాక్డౌన్ ఎఫెక్ట్తో ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్లకు అనుమతించినప్పటికి చాలా మంది ఇంకా వర్క్ మోడ్లోకి రాలేదు. అయితే ఈ గ్యాప్ను కూడా బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు మన స్టార్లు. ఒకేసారి ఇన్ని రోజులు సెలవు దొరకింది. ఖాళీగా ఉంటే బద్దకంగా తయారవుతామనే ఉద్దేశంతో నచ్చిన వ్యాపకాలతో తమను తాము బిజీగా ఉంచుకుంటున్నారు సినీ జనాలు. కొందరు వ్యవసాయం, వంటలవైపు మల్లగా.. మరి కొందరు శరీరానికి పని చెప్పే పనిలో పడ్డారు. మళయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కూడా కసరత్తులు చేస్తూ.. బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు ఆదివారం వర్క్వుట్ సెషన్కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు మమ్ముట్టి.(అడుగు బయటపెట్టేది లేదు!) View this post on Instagram Work at Home ! 🤔 Work from Home ! 😏 Home Work ! 🤓 No other Work 🤪 So Work Out ! 💪🏻 A post shared by Mammootty (@mammootty) on Aug 16, 2020 at 5:18am PDT గ్రే కలర్ టీ షర్ట్ ధరించి.. జిమ్ గ్లవ్స్ వేసుకుని ఉన్న ఫోటోలను.. ‘వర్క్ ఎట్ హోం.. వర్క్ ఫ్రమ్ హోం.. హోం వర్క్.. నో అదర్ వర్క్.. సో వర్క్వుట్’ క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు మమ్ముట్టి. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజనలు సూపర్బ్.. మీరు యువతకు ఆదర్శం అంటూ కామెంట్ చేస్తున్నారు. గత పోస్ట్లో క్వారంటైన్ పిరియడ్లో ఓల్డ్ హాబీ పేరుతో.. ప్రొఫెషనల్ కెమరాతో పక్షుల ఫోటోలను తీస్తున్న చిత్రాలను షేర్ చేశారు మమ్ముట్టి. ఇక సినిమాల విషయానికి వస్తే.. లాక్డౌన్కు ముందు మమ్ముట్టి అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో వచ్చిన షైలాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (లాక్డౌన్లో బరువు పెరిగారా? ఇలా చేయండి) -
అడుగు బయటపెట్టేది లేదు!
మమ్ముట్టికి సవాళ్లంటే ఇష్టమట. తాజాగా ఓ సవాల్ ను తన మీద తానే విసురుకున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మమ్ముట్టి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదట. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి సుమారు 150 రోజులు అయింది. ఇలా బయటకు రాకుండా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండగలనో చూస్తాను అని ఓ చిన్న ఛాలెంజ్ చేసుకున్నారట. ‘సరదాగా ఓ డ్రైవ్ కి వెళ్లి రండి’ అని ఇంట్లోవాళ్లు అన్నప్పటికీ ‘నో’ అనేశారట మమ్ముట్టి. ఇలా తండ్రి బయటకు అడుగుపెట్టేది లేదని, ఇంటిపట్టునే ఉంటున్న విషయాన్ని మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్ సరదాగా షేర్ చేసుకున్నారు. -
భలే ఉన్నాయి సారూ!
పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలను చూడగానే మమ్ముట్టి మనసు గతంలోకి వెళ్లిపోయింది. అప్పట్లో ఆయనకున్న హాబీల్లో ‘ఫొటోగ్రఫీ’ ఒకటి. ఈ లాక్డౌన్ వేళ అది గుర్తొచ్చింది. అంతే.. కెమెరా తీశారు. తన ఇంటి గార్డెన్లో తీగ మీద సేద తీరుతున్న పక్షులను క్లిక్మనిపించారు. ‘‘ఉషోదయపు అతిథులు (పక్షులను ఉద్దేశించి), ఫొటోగ్రఫీ.. నా పాత హాబీ’’ అంటూ తాను తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మమ్ముట్టి. ఆ ఫొటోలను చూసి, ‘ఫొటోగ్రఫీలో మీకు చాలా నైపుణ్యం ఉంది సారూ. భలే ఉన్నాయి’’ అని నెటిజన్లు ప్రశంసించారు. -
రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇంటి పట్టునే ఉండిపోయిన ‘ఫ్యామిలీ’ల కోసం ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ సమయంలో కుటుంబాలను ఉత్సాహపరచడానికి, వారికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఈ షార్ట్ఫిల్మ్ ఉపయోగపడనుంది. అమితాబ్ ప్రోద్బలంతో సోనీ నెట్వర్క్ సహాయంతో ఈ షార్ట్ఫిల్మ్ తయారవుతోంది. ప్రసిద్ధ యాడ్ డైరెక్టర్ ప్రసూన్ పాండే వర్చువల్గా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షార్ట్ఫిల్మ్ కుటుంబాలకు ఐదు విషయాలను చెప్పనుంది. ‘ఇంట్లో ఉండండి’, ‘సురక్షితంగా ఉండండి’, ‘చేతులు కడుక్కోండి’, ‘ఇంటి నుంచి పని చేయండి’, ‘భౌతిక దూరం పాటించండి’... అని సృజనాత్మకంగా చెప్పనుంది. భారతీయులందరినీ ఉత్సాహపరచాలి కనుక ఈ షార్ట్ఫిల్మ్లో భారీ తారాగణం లిప్తపాటు కనిపిస్తారట. వారిలో రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్లాల్, శివ రాజ్కుమార్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, రణ్బీర్ కపూర్ తదితరులు ఉంటారు. ఏప్రిల్ 6న రాత్రి 9 గంటలకు ఈ షార్ట్ఫిల్మ్ దేశమంతా ప్రముఖ చానెళ్లలో ప్రసారం కానుంది. ఈ షార్ట్ఫిల్మ్ గురించే కాక దేశంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తున్న చిన్న స్థాయి కార్మికులు లక్షమందికి సోనీ నెట్వర్క్, కల్యాణ్ జువెలర్స్తో కలిసి అమితాబ్ ఒక నెల వెచ్చాలను అందించనున్నారు. సూపర్మార్కెట్లతో ఏర్పాటు చేసుకున్న కూపన్లు కార్మికులకు అందేలా చేసి వెచ్చాలను అందించనున్నారు. -
రాజా వస్తున్నాడు
మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో ‘మన్యం పులి’ ఫేమ్ వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో, జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్లో మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహ’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘అదొక మారుమూల అటవీ ప్రాంతం. ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందు తాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా ఎలా తీర్చాడు? అన్నదే ఈ చిత్రకథాంశం. చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి మాస్ యాక్షన్ , జగపతిబాబు క్యారెక్టర్, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం, పీటర్ హెయిన్ పోరాటాలు ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా?
‘‘పవన్ కల్యాణ్తో తీయబోయే సినిమాలో విలన్ పాత్ర చేయగలరా? అని పదేళ్ల క్రితం మమ్ముట్టిని అడిగితే, ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా అన్నాడు. మమ్ముట్టి వ్యక్తిత్వానికి అది నిదర్శనం’’ అన్నారు అల్లు అరవింద్. మమ్ముట్టి లీడ్ రోల్లో పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మామాంగం’. ఈ సినిమా తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 12న విడుదలవుతోంది. తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కేరళలోని చావెరుక్కల్ యుద్ధ వీరులకు గొప్ప చరిత్ర ఉంది. కలరీ యుద్ధ విద్యలో ఆరితేరిన వారి కథతో మమ్ముట్టి ఈ సినిమా చేయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘మామాంగం’ కేరళకు సంబంధించిన కథే కాదు. ప్రతి భారతీయుడు దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి 12 ఏళ్లకు జరిగే మామాంగం అనే ఉత్సవం నేపథ్యంలో ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మమ్ముట్టి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహి.వి రాఘవ్ పాల్గొన్నారు. -
సమస్యను పరిష్కరించే రాజా
‘‘మమ్ముట్టిగారి నటన అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ఆయన నటించిన ‘మధుర రాజా’ చిత్రం మలయాళంలో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో విడుదలవుతోంది. ట్రైలర్ చూస్తే తెలుగులోనూ విజయం సాధిస్తుందనిపిస్తోంది. తొలిరోజే ఈ సినిమా చూస్తా’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేమ్ వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ని బోయపాటి శ్రీను విడుదల చేశారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘చ క్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అటవీ ప్రాంతంలోని సమస్యను ‘రాజా నరసింహా’ ఎలా పరిష్కరించాడు? అన్నదే మా చిత్రం. సన్నీ లియోన్ ప్రత్యేక గీతం, పీటర్ హెయిన్స్ పోరాటాలు సినిమాకు హైలైట్గా నిలుస్తాయి’’ అని వైశాక్ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ, సంగీతం: గోపీ సుందర్. -
ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తాజాగా నటిస్తున్న మూవీ మామంగం అధికారిక టీజర్ విడుదలైంది. 250 ఏళ్ల నాటి చారిత్రత్మక కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. మెగాస్టార్ మమ్ముట్టి నటన, అద్భుతమైన విన్యాసాలతో వచ్చిన టీజర్ ఉత్కంఠ భరితంగా ఉండటం విశేషం. కావ్య ఫిలింస్ బ్యానర్పై వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. సినిమా నవంబర్ 21 న తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుందని భావిస్తున్నారు. -
రాజా వస్తున్నాడహో...
మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రలు చేశారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ మలయాళ చిత్రం ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ని దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజా నరసింహా’ ట్రైలర్ పవర్ఫుల్గా ఉంది. టైటిల్ యాప్ట్గా ఉంది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి’’ అన్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి పవర్ఫుల్ యాక్షన్, జగపతిబాబు విలనిజం, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
కేరళ చరిత్రతో...
17వ శతాబ్దంలోని కేరళ రాష్ట్ర కథతో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం ‘మామాంగం’. కావ్య ఫిల్మ్స్ పతాకంపై వేణు కున్నపిల్లి నిర్మించగా, ఎం.పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 21న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘మన దేశ సంస్కృతి విశిష్టమైనది. భాషలు మనల్ని విడదీస్తాయి. అయితే భాష వల్ల మన చరిత్ర వేరే వాళ్లకి తెలియకుండా పోకూడదు. కేరళ రాష్ట్ర చరిత్రతో సినిమా అంటే అది భారతదేశ చరిత్ర కూడా. సినీ మాద్యమం అన్ని భాషల ప్రేక్షకులను ఏకం చేస్తుంది’’ అన్నారు. పద్మకుమార్ మాట్లాడుతూ– ‘‘నిజమైన కథతో ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్స్తో తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ ఈ సినిమా మేకింగ్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. భారీ బడ్జెట్తో రూపొందించాం’’ అన్నారు వేణు. -
క్షమాపణ చెప్పిన మమ్ముట్టి
తమిళసినిమా : మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి క్షమాపణ చెప్పారు. ఇందుకు కారణం ఆయన వీరాభిమానులే. ఆ కథేంటో చూద్దాం. ఇటీవల 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరాది చిత్రపరిశ్రమతో పాటు దక్షిణాదిలో ఒక్క తమిళచిత్ర పరిశ్రమ మినహా అన్నీ సినీ పరిశ్రమలను ఈ అవార్డులు వరించాయి. తమిళంలోనే రెండు జాతీయ అవార్డులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా మమ్ముట్టి అభిమానులు అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్ రవిపై దండయాత్ర చేస్తున్నారు. ఆయన ఫేస్బుక్లో ఇస్టానుసారంగా ఏకేస్తున్నారు. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అందుకు కారణం మమ్ముట్టి నటించిన చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడమే. మమ్ముట్టి మలయాళంలోనూ కాకుండా తమిళం, తెలుగు, హింది బాషల్లో నటించి బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈయన తమిళంలో నటించిన చిత్రం పేరంబు. పలువురు సినీ ప్రముఖుల ప్రసంశలను అందుకున్న ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అలాంటి పేరంబు చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు రాకపోవడమే మమ్ముట్టి అభిమానుల ఆగ్రహానికి కారణం. అవార్డు కమిటీపై ఆరోపణలు రావడం సహజమేకానీ, ఇలా అభిమానులు మండిపడడం అరుదే. మమ్ముట్టి అభిమానులు జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్రవిపై ఫేస్బుక్లో విమర్శల దాడికి దిగారు. చాలా అసభ్య పదజాలంను వాడడంతో వేదన చెందిన రాహుల్రవి వెంటనే నటుడు మమ్ముట్టికి ఒక వివరణను ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అందులో మిస్టర్ మమ్ముట్టి మీ అభిమానులు పరుష పదజాలంతో నాపై దాడి చేస్తున్నారు. పేరంబు చిత్రానికి అవార్డును ప్రకటించలేదని దూషిస్తున్నారు. అందుకు వివరణ ఇస్తున్నాను. ముఖ్యంగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కమిటీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నంచరాదు. ఇకపోతే మీ పేరుంబు చిత్రాన్ని ప్రాంతీయ కమిటీనే తిరష్కరించడంతో కేంద్ర కమిటీ పరిశీలనకు రాలేదు. ఈ విషయం తెలియక మీ అభిమానులు గొడవ చేస్తున్నారు అని పేర్కొన్నారు. దీంతో కొద్ది సమయంలోనే మమ్ముట్టి రాహుల్ రవి ట్వీట్కు స్పందిస్తూ ‘క్షమించండి. ఈ విషయాలేమీ నాకు తెలియవు. అయినా జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను’అని ట్విట్టర్లో బదులిచ్చారు. చూశారా? ఒక్కోసారి మితివీురిన అభిమానం కూడా తలవంపులు తెచ్చిపెడుతుందన్నదానికి ఈ ఉదంతమే ఉదాహరణ. -
రాజా నరసింహా
మమ్ముట్టి, జై, మహిమా నంబియర్ కీలక పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘మధురరాజా’. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘యాత్ర’ వంటి సూపర్హిట్ సినిమా తర్వాత తెలుగులో వస్తున్న మమ్ముట్టి చిత్రమిది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలైలో సినిమా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం ఉంది. మమ్ముట్టి, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీ లియోన్ ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకష్ణ. -
యుద్ధానికి సై
మలయాళ నటుడు మమ్ముట్టి తన కొత్త చిత్రం కోసం యోధుడిలా మారిపోయారు. ఆయన హీరోగా పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మమంగం’. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిల్లి నిర్మిస్తున్నారు. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ‘యుద్ధానికి సిద్ధం’ అన్నట్టు మమ్ముట్టి ఫోజుని గమనించవచ్చు. ‘ఈ ఫస్ట్లుక్ని సాధారణంగా ఫొటోషూట్ జరిపినట్టు కాకుండా యాక్టర్స్ అందరూ ఆ సన్నివేశాన్ని నటిస్తుంటే ఈ ఫొటోలను తీసి ఫస్ట్లుక్గా రిలీజ్ చేశాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలకానుంది. -
యుద్ధవీరుడిగా మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్ డ్రామా మమాంగం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫస్ట్లుక్లో మమ్ముట్టి కేరళ సాంప్రదాయ యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. మమాంగం అనే పండుగ సందర్భంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. 17వ శతాబ్దం నాటి కథతో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తొలి షెడ్యూల్ సంజీవ్ పిళ్ళై దర్శకత్వం వహించగా తరువాతి షెడ్యూల్ నుంచి ఎం పద్మకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రాచీ తెహ్లన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలోఉన్ని ముకుందన్, అను సితార, మాళవికా మీనన్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రెండో యాత్రకు శ్రీకారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ‘యాత్ర’ సీక్వెల్కు శ్రీకారం చూట్టారు మహీ వి. రాఘవ్. ‘‘వై.ఎస్. రాజారెడ్డి (వైఎస్సార్ తండ్రి), వై.ఎస్. జగన్ పాత్రలు లేకుండా వైఎస్సార్గారి కథ సంపూర్ణంగా అనిపించదు. ‘యాత్ర’ సినిమా వై.ఎస్. జగన్గారి విజువల్స్తో ముగుస్తుంది. ‘యాత్ర 2’ను అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఆలోచనతోనే అలా చేశాం’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహి.వి. రాఘవ్. -
మాలో యాత్ర
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్మా’ చానెల్లో ప్రదర్శితం కానుంది. -
18 మెట్లు
నాలుగు దశాబ్దాల కెరీర్లో దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ఇప్పుడు 18 మెట్లు ఎక్కబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘పదునెట్టామ్ పడి’. అంటే.. 18 మెట్లు అని అర్థం. ఈ చిత్రంలో మమ్ముట్టి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాన్ అబ్రహాం పాలక్కల్ అనే ప్రొఫెసర్ పాత్ర చేస్తున్నారు. స్టైలిష్ ప్రొఫెసర్గా కనిపించనున్నారాయన. శంకర్ రామకృష్ణన్ దర్శకుడు. ఈ చిత్రంలో మమ్ముట్టి లుక్కి మంచి స్పందన లభించింది. ఆయనది సినిమాకి కీలకంగా నిలిచే అతిథి పాత్ర అని సమాచారం. పృథ్వీరాజ్, ప్రియా ఆనంద్, ఆర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
గ్యాంగ్స్టర్ నిజాయితీ
మమ్ముట్టి, స్వరాజ్ గ్రామిక ముఖ్యతారలుగా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘పుతన్ పనమ్’ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘జయహో నాయకా’ టైటిల్తో కల్లూరి వెంకట సుబ్బయ్య సమర్పణలో కల్లూరి శేఖర్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ధర్మం, నీతి, నిజాయితీ గల గ్యాంగ్స్టర్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తారు. ఓ గ్యాంగ్ కారణంగా మిస్ఫైర్ అయిన తుపాకీ ఓ బాలుడికి దొరుకుతుంది. ఆ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. షాన్ రెహమాన్ మంచి సంగీతం అందించారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. -
యాత్ర ఒక బాట.. ఒక మాట
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిప్రతి పథమూ ఒక గొప్ప యాత్ర. నడక భరోసా ఇవ్వాలి.నడత స్ఫూర్తిని కలిగించాలి. ఇది జనం నచ్చిన యాత్ర.. జగం మెచ్చిన యాత్ర. ‘‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే.’’‘‘జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఉంది. వినాలనీ ఉంది. కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.’’‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’’‘యాత్ర’ చిత్రంలోని ఈ సంభాషణలు వింటే చాలు.. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వం, పట్టుదల తెలియడానికి. ప్రజలకు మేలు చెయ్యాలన్న నాయకుడని చెప్పడానికి! మండుటెండలో నాయకుడు నడుస్తుంటే.. మనమెందుకు ఆ ఎండలోకి వెళ్లాలని ప్రజలు అనుకోకుండా.. ఆయన్ని కలిసేందుకు.. తమ బాధల్ని చెప్పుకునేందుకు అడుగులో అడుగేశారు. ‘‘అలాంటి వ్యక్తినిరాజకీయ నాయకుడని అనరు. ప్రజా నేత అని పిలుస్తారు’’ అని చెబుతున్నారు.. మమ్ముట్టి. ‘యాత్ర’ సినిమాతో తెలుగుతెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మమ్ముట్టి.. జనం గుండెచప్పుడని చెప్పే రాజన్న రాజసాన్ని మరోసారి ప్రజలకు పరిచయం చేశారు. వైఎస్సార్ అంతరంగాన్ని ఆకళింపు చేసుకొని మరీ నటించి.. నడుస్తున్న చరిత్రగా రాజన్న ప్రజాప్రస్థానాన్ని ప్రజలకు అందించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ► ‘యాత్ర’ సినిమా ఘనవిజయం సాధించినందుకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ►మమ్ముట్టి: థ్యాంక్యూ. ఇది ‘యాత్ర’ యూనిట్ విజయం. అంతకుమించి ప్రజలది. అన్నింటికన్నా.. వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వానిదీ విజయం. ► సుమారు నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో ఎన్నో సక్సెస్లు చూశారు. ఈ సినిమా సక్సెస్ ఎలాంటి అనుభూతిని ఇస్తోంది? ►ఇది నాకు స్పెషల్ సినిమా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోని ఓ భాగాన్ని కథగా రూపొందించి మలచిన చిత్రమిది. దీన్ని బయోపిక్ అనలేం. వైఎస్సార్ లైఫ్లోని ఓ ఈవెంట్ బేస్డ్ స్టోరీ అని కూడా అనుకోలేం. ఎందుకంటే ఆయన ప్రజా ప్రస్థాన యాత్ర ఓ నడుస్తున్న చరిత్ర. అందుకే.. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ►350 సినిమాల కెరీర్లో మీకు కాంప్లిమెంట్స్ కొత్త కాదు. ఈ సినిమాకు మాత్రం సామాన్యుల నుంచి సినీ దిగ్గజాల వరకూ ప్రతి ఒక్కరూ మీ నటనను ప్రశంసిస్తున్నారు. మమ్ముట్టి తప్ప మరెవర్నీ ఈ క్యారెక్టర్లో ఊహించుకోలేక పోతున్నామంటున్నారు. మీరెలా ఫీలవుతున్నారు.? ►ఎవరి నటనతో వారు మెప్పించగలరు. నాకు అవకాశం వచ్చింది. నేను నటించాను. అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. అయితే సక్సెస్కు పొంగిపోవడం నాకు రాదు. చాలా రోజుల తర్వాత తెలుగులో నటించాను. ఈ చిత్రకథ, డైరెక్టర్ మహి కథ చెప్పిన విధానం నన్ను ఇంప్రెస్ చేసింది. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాను. ►డైరెక్టర్ మహి కథ చెప్పక ముందు వైఎస్సార్ గురించి మీకు ఏం తెలుసు.? ►ఒక పౌరుడిగా సమకాలీన రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఆ సందర్భంలోనే వైఎస్సార్ రాజకీయ ప్రస్థానం గురించి చాలాసార్లు విన్నాను. న్యూస్లోనూ, పత్రికల్లోనూ ఆయన అద్భుతమైన పాలన గురించి చూశాను, చదివాను. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకున్నాను. ►వైఎస్సార్ను ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా మీరు చూడలేదు. కానీ ఆయన రాజసం, మాటల్లో గాంభీర్యం, నడకలో తెగువ, చేయి ఊపడం.. అన్నీ ఎలా పండించగలిగారు? ►వైఎస్సార్ను ఇమిటేట్ చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనలా నడవాలని, ఆయనలా మాట్లాడాలని ప్రతి సీన్కు ముందు అనుకోలేదు. నా సినీ అనుభవంతో నేను వైఎస్సార్ అనే పాత్రలో నటిస్తున్నాను కాబట్టి.. ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఊహించుకొని నటించాను. అయితే ఆ సీన్లన్నీ చరిత్రలో ఏం జరిగాయో, ఆయన హావభావాలు ఎలా ఉన్నాయో.. అచ్చం అలా వచ్చేశాయి. యాదృచ్ఛికంగా వైఎస్సార్ బాడీ లాంగ్వేజ్, నేను నటించిన విధానం ఒకేలా రావడం ఆశ్చర్యం. ►‘యాత్ర’ సినిమా కథ వినక ముందు వైఎస్సార్పై మీ అభిప్రాయం, కథ విన్న తర్వాత, సినిమా చేసిన తర్వాత ఆయన పై మీ అభిప్రాయం ఎలా ఉంది.? ►చూడండి.. నేను ఒక సామాన్య పౌరుడిగా దేశ రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. అయితే ఏపీ రాజకీయాల గురించి అంతగా అవగాహన లేదు. కానీ రాజశేఖర్రెడ్డి లీడర్షిప్ గురించి మాత్రం కొంత తెలుసు. ‘యాత్ర’ కథ విన్నాక పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. వైఎస్సార్ క్యారెక్టర్ నచ్చింది కాబట్టే ‘యాత్ర’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. ►ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఎమోషన్ ఉంది. మీకు హార్ట్ టచింగ్ అనిపించిన ఎమోషనల్ సీన్ ఏది? ►ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల కోసం జీవిస్తూ, వారి ఎమోషన్లను పంచుకునే ప్రతి నాయకుడూ సక్సెస్ అవుతాడు. రాజశేఖర్రెడ్డి ఈ కోవకు చెందిన వారే. తెలుగు ప్రజలందరిలోనూ వైఎస్సార్తో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. రాజన్న మనకోసం ఉన్నాడు, మనకు ఉపకారం చేసేందుకు వచ్చాడు, మన బాధలు తీర్చే నాయకుడని విశ్వసించారు. అందుకే సినిమాలో నటించేటప్పుడు నేను ఆ ఎమోషన్ను చూపించాలని అనుకున్నాను. సక్సెస్ అయ్యాను. సినిమా చూసినంతసేపూ ప్రేక్షకులు ‘అతను మన రాజశేఖర్రెడ్డి.. మన జీవితాల్ని బాగుచేసింది ఈయనే’ అన్న ఉద్వేగానికి గురయ్యారు. అందుకే ప్రతి సన్నివేశం ప్రజల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. అదే ఫీలింగ్ నాలోనూ ఉండిపోయింది. ఒక సన్నివేశం అని కాదు.. సినిమా మొత్తం నాకు నచ్చింది. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి. ►ఒక రాజకీయ నాయకుడి గురించి సినిమా అంటే.. ఆయన అభిమానులు, పార్టీకి సంబంధించిన వారికే నచ్చుతుందని భావిస్తారు. కానీ.. ‘యాత్ర’ మాత్రం అన్ని వర్గాల వారి హృదయాల్ని కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. ఇంతటి ఘన విజయం ఊహించారా? ►వైఎస్సార్ జీవిత చరిత్ర మొత్తం చెప్పిన కథ కాదు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఓ రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్తూ చేసిన పాదయాత్ర అనే భాగం. పాదయాత్రకు మునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు పాదయాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, సుదీర్ఘ పాదయాత్ర ఎలా చేశారు? ఆయన పాదయాత్ర చేసిన నాటికి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, ఆయన వాటిని వింటూ, భరోసా ఇచ్చిన విధానం గురించి ప్రజలకు వివరించిన చిత్రమిది. పార్టీ గురించి కాకుండా ప్రజల గురించి చేసిన పాదయాత్ర కావడం.. ఆ విశేషాలను చక్కని స్క్రీన్ప్లేతో కళ్లకు కట్టినట్లు చూపించడం వల్లే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ►50 ఏళ్లు దాటాక సుదీర్ఘ పాదయాత్ర చెయ్యడం, అదీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం.. ఏ రాజకీయ నాయకుడికైనా సాధ్యమని మీరు భావిస్తారా.? ►పాదయాత్ర అంటే కేవలం అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం కాదు. వెయ్యి, రెండు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లిపోవడం కాదు. ఆ యాత్రలో ఏం జరిగింది? ప్రజలను ఎలా కలుసుకున్నారు? వారి బాధలు ఎలా తెలుసుకున్నారు? నడిచి వస్తున్న నాయకుడ్ని ప్రజలు ఎలా ఆదరించారన్నది ముఖ్యం. ఏదో నడిచాం.. మాట్లాడాం అన్నది కాదు. వారి బాధల్ని మర్చిపోయేలా భరోసా ఇవ్వడం. వారికోసం ఏం చేస్తామో కుండబద్దలుకొట్టినట్లు వైఎస్సార్ చెప్పారు. అందుకే యాత్ర తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు నమ్మారు. ఆ వయసులో తమ కోసం నడిచి వచ్చి.. తమ బాధలు వినేందుకు రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు వచ్చాడని ఆనందపడ్డారు. ►రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ‘యాత్ర’ సినిమా విజయం గురించి ఒక్కమాటలో చెప్పండి.? ►ఇది రాజకీయ నాయకుడి సినిమా కాదు. ప్రజా నాయకుడి చిత్రం. అందుకే అందరూ ఆదరిస్తున్నారు. ►మలయాళం, తమిళ ప్రజలు కూడా యాత్రను ఆదరిస్తున్నారు కదా.. ►అవును. తెలుగులో విజయం సాధించిందంటే.. రాజశేఖర్రెడ్డి గురించి తెలుసు అనుకోవచ్చు. కానీ.. తమిళం, మలయాళంలోనూ ప్రజలు ‘యాత్ర’ సినిమాను ఆదరిస్తున్నారు. ఎందుకంటే వైఎస్సార్ అనే ఓ ప్రజానేత గురించి చెప్పిన చిత్రమిది. ఒక పొలిటికల్ లీడర్... పీపుల్స్ లీడర్గా ఎలా మారాడన్నది తెలుసుకున్న ప్రజలు సినిమాను బ్రహ్మరథం పడుతున్నారు. ►కొత్త జనరేషన్కు వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని చూపించారు. రాజశేఖర్రెడ్డి గురించి తెలియని యువతకు ‘యాత్ర’ సినిమా చూపిస్తూ ఇలా ఉండేవారు అని చెబుతున్నారు ►నిజమే. నేనూ విన్నాను.. కొత్త జనరేషన్ వైఎస్సార్ పేరు, ఆయన ఏం చేశారు అనేవి మాత్రమే విని ఉంటారు. యాత్రలో చూపించిన ప్రతి సన్నివేశం యువతను ఆకట్టుకుంటోందని ప్రజలు చెబుతున్నారు. ► సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులకు కన్నీరు తెప్పించాయి. ఆ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారు? ►రైతుల కోసం ఓ డైలాగ్ ఉంటుంది. ఈ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న రైతుల్ని చూశాను.. వాళ్ల కన్నీళ్లతో కూడా తడవని నేలని చూశాను. జీవంలేని ఆ భూముల్ని చూసి ప్రాణం వదిలిన ఎంతో మంది రైతుల్ని చూశాను. నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఇది చాలా ఉద్వేగమైన సంభాషణ. నిజమే కదా.. నాయకుడంటే ప్రజలు తయారు చేసినవాడే. ఎండలో పనిచేసే ప్రతి పేదవాడికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని భావించిన రాజశేఖర్రెడ్డి యాత్ర చేశారు. ►మీరు నటించిన సినిమాల్లో పంచెకట్టు ఉంటుంది. వైఎస్సార్ పంచెకట్టు ఎలా అనిపించింది? ►పంచెకట్టు నేను నటించిన చాలా సినిమాల్లో ఉంది. అయితే ‘యాత్ర’ లో పంచెకట్టు ప్రత్యేకంగా ఉంది. అది కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ►సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా.. ఇంకా ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది.? ►అన్ని పాత్రలూ సమానమే. ప్రతి పాత్ర నిజ జీవితంలో జరిగిందే కదా. అందుకే ఎవరి పరిధిలో వారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవాల్సింది స్నేహానికి వైఎస్సార్ ఎంత విలువ ఇచ్చారన్న పాయింట్ గురించి. ఆయన స్నేహితుడు కేవీపీ పాత్రలో రావురమేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇప్పుడు నేను, రావు రమేష్ మంచి స్నేహితులుగా మారిపోయాం కూడా. సినిమాలో నన్ను చాలా సపోర్ట్ చేశారు. ►తెలుగులో చాలా గ్యాప్ తర్వాత కనిపించారు. మళ్లీ ఎప్పుడు తెలుగు తెరపై మిమ్మల్ని చూడవచ్చు? ►తెలుగులో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ►మలయాళీ మెగాస్టార్గా కాకుండా.. సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు కేరళకు మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన రాష్ట్రాలకు విస్తరిస్తారా? ►అదేం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా సేవలందిస్తున్నాం. బాల కార్మికులకు విద్యనందించేందుకు స్ట్రీట్ ఇండియా మూమెంట్, పేదలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించేందుకు పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ పేరుతో కార్యక్రమాలు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ సేవా సంస్థ ఏపీలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► 350 సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 7 కేరళ ఫిల్మ్ అవార్డులు, 13 ఫిల్మ్ఫేర్ అవార్డులు, డాక్టరేట్లు, పద్మశ్రీ.. ఇలా మీ ప్రస్థానం సాగుతోంది. మీరెలా ఫీలవుతున్నారు.? ►చాలా సంతోషంగా ఉంది. ఇది కొనసాగిస్తాను. నావరకూ నేను సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చెయ్యాలని అనుకుంటున్నాను. ► ‘యాత్ర’ సినిమా చూసిన వారు మమ్ముట్టి రాజ కీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. ఇందులో నిజమెంత ఉంది? ►సినిమాల్లో ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. వారిని ఆనందపరిచేందుకు నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ‘యాత్ర’ సినిమాపై కొంతమంది ప్రేక్షకుల స్పందన నడుస్తున్న చరిత్ర కథ మంచి ఎమోషనల్ టచింగ్గా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్ను తీసుకొచ్చారు. ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాం. నాలుగైదు సార్లు కళ్లు చెమర్చినా, అరె సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది. చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీజ్ రీయింబర్స్మెంట్’, నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ఞం’... ఇలా అయిదున్నరేళ్ల అభివృద్ధి – సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన అన్ని పథకాలూ.. ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించారు. అది ముగిసిన యాత్ర కాదు.. ‘నడుస్తున్న’ చరిత్ర. అందుకే తడుస్తున్న కళ్లతో ఆ చిత్రాన్ని చూస్తున్నాం. – రామకృష్ణారెడ్డి, కాంతమ్మ దంపతులు, బెంగళూరు వైఎస్సార్ వ్యక్తిత్వం తెలిసింది రాజశేఖర రెడ్డి వలన అనేకమంది లబ్ది పొందారు. ఆయన్ను మరచిపోలేము. మహోన్నత నాయకుడు. ఆయన పాత్రలో మలయాళ నటుడు ముమ్ముట్టి ఒదిగిపోయారు. రాజశేఖర రెడ్డి అంటే మంచి పరిపాలకుడు, సంక్షేమ పథకాలకు ఆద్యుడు అని మాత్రమే మాకు తెలుసు. ‘యాత్ర’ సినిమా చూశాక ఆయన వ్యక్తిత్వం మాకు మరింత తెలిసింది. కష్టాలలో ఉన్నవారికి ధైర్యం ఇవ్వడం, వారికి అండగా ఉండడం, అధిష్టానాన్ని తనదైన శైలిలో ఎదిరించడం, మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం ఒక ఎత్తు అయితే ‘యాత్ర’లో ముమ్ముట్టిని చూశాక రాజశేఖర రెడ్డిని మరోసారి చూసినట్లు అయ్యింది. ఆయన పదవిలోకి వచ్చాక ఆయన చేపట్టిన కార్యక్రమాలు మరింతగా చూపించాల్సింది. ఏది ఏమైనా ‘యాత్ర’ సినిమా రాజశేఖర రెడ్డిలోని అన్ని కోణాలను కళ్లకు కట్టినట్లు చూపారు. సినిమా సూపర్బ్. – జుత్తాడ అరుణకుమారి, బొబ్బిలి క్లైమాక్స్ కన్నీళ్లు తెప్పించింది నేను, నా భర్త ‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ తర్వాత ఏం జరుగుతుందోనన్న ఒక ఫీలింగ్ కలిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి చాలా అద్భుతంగా నటించారు. వైఎస్సార్ చేసిన నిజజీవితపు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం రాగానే వాటిని అమలు చేస్తామన్న వాగ్దానాలు ‘యాత్ర’ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన హెలికాప్టర్ సన్నివేశాలను చూపిస్తూ కన్నీళ్ళు తెప్పించారు. – ధర్మాన సుశ్రీ, శ్రీకాకుళం అద్భుతంగా చూపించారు ‘యాత్ర’ సినిమాలో రాజశేఖర్రెడ్డి ప్రజా ప్రస్థాన యాత్రలో ఎదురైన అనుభవాలను చక్కగా చూపించారు. వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చారు. డైర్క్షన్ అదుర్స్. స్క్రీన్ప్లే అద్భుతం. ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది డైలాగ్ సూపర్. సినిమా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంట తడితో బయటికి వస్తున్నారు. ‘యాత్ర’ సినిమాతో రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు మళ్లీ రావాలని దేవుని కోరుకుంటున్నాం. – సాత్విక, చిత్తూరు ఆ తర్వాత మళ్లీ ‘యాత్ర’కే క్షీరాభిషేకాలు 20 సంవత్సరాలుగా సినిమా రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్నాను. మాతృదేవోభవ, అమ్మోరు చిత్రాల అనంతరం థియేటర్ల వద్ద మళ్లీ క్షీరాభిషేకాలు చూడటం జరిగింది. ‘మాతృదేవోభవ’లో ఆద్యంతం హృదయాన్ని పిండే సన్నివేశాలు చూసి, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు హాలు నుంచి బయటకు వచ్చేవారు. ఇప్పుడు మళ్లీ ‘యాత్ర’ సినిమా చూసి వందలాది మంది చెమర్చిన కళ్లతో సినిమా హాలు నుంచి బయటకు వచ్చి మహానేతను మననం చేసుకోవడం కనిపించింది. – సోమరౌతు అప్పారావు, థియేటర్ రిప్రజెంటేటివ్, కొయ్యలగూడెం హృదయాన్ని కదిలించే సినిమా జన హృదయాలలోని సంఘర్షణలకు ప్రత్యక్ష రూపమిచ్చిన ‘యాత్ర’ సినిమా చూస్తున్నంత సేపూ వైఎస్సార్ నిజ జీవితంలో తిరుగాడినట్లుంది. వైఎస్సార్ పాత్రలో ముమ్ముట్టి జీవించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. హృదయాన్ని కదిలించే ఈ చిత్రంలోని సన్నివేశాలు చూస్తుంటే అడుగడుగునా మాకు జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు విన్నట్టే అనిపించాయి. మా ఇంట్లో వారు పట్టుబట్టి చిత్రం చూశారు. మొత్తం మీద జీవితం లాంటి సినిమాను చూశామన్న తృప్తి అందరికి కల్గుతుంది. – కె.నరసింహారెడ్డి, ప్రయివేటు ఉద్యోగి, పుట్టపర్తి అందరూ ఫిదా రాజన్న నడకలోని రాజసం, మాటలోని గాంభీర్యం.. మనసులోని మర్మం.. సెల్యులాయిడ్పై నిలువెల్లా వ్యాపించింది. ‘యాత్ర’ చూశాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ‘యాత్ర’ నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రం. హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉంది. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలే. ‘యాత్ర’లో భాగంగా వచ్చే ప్రతి సీన్ మనసును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం. – సానికొమ్ము సుప్రియ, బెంగళూరు జన్మ చరితార్థమైంది ‘యాత్ర’ సినిమా ఉచిత షోలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. మహానేతపై ఉన్న అభిమానంతో సినిమా హక్కులు కొనుగోలు చేయడమే కాక పేద మధ్య తరగతి ప్రజలు సైతం సినిమా చూడాలనే ఉద్దేశ్యంతో షోలను ఉచితంగా ప్రదర్శించి. జన్మను చరితార్థం చేసుకోగలిగాను. చిత్రాన్ని చూసిన ప్రతీ మహిళ, వృద్ధులు చెమర్చిన కళ్లతో మంచి చిత్రాన్ని చూపించి మాకు మళ్లీ మహానేతను మా ముందుంచావు అంటూ పేర్కొనడం గర్వకారణంగా భావిస్తున్నా. – గంజిమాల దేవి, వైఎస్సార్ అభిమాని, కొయ్యలగూడెం, ప.గో.జిల్లా, పాదయాత్రలో పాల్గొన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తుగ్లక్ పాలన తలపించడంతో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైఎస్ఆర్ ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా ప్రస్థాన ‘యాత్ర’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశాన్ని మార్చేసేందుకు దోహదం చేసింది. ఆం్ర«ధప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్రను ‘యాత్ర’ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూశాం. ఈ సినిమా చూస్తుంటే మహానేత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రలో మొత్తం పాల్గొన్నట్లుగా ఉంది. సినిమా అద్భుతం. మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి యాక్టింగ్ అచ్చం వైఎస్ఆర్ తరహాలోనే ఉంది. ‘యాత్ర ’సినిమాలో ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్ హైకమాండ్తో ఎలా నడుచుకున్నది, రైతుల సమస్యలు ఎలా తెలుసుకున్నది, విద్యార్థుల సమస్యలను.. ఇలా చెప్పుకుంటే పోతే రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలో వైఎస్ఆర్ పడిన కష్టాలను మమ్ముట్టి ‘యాత్ర’ సినిమాలో చూశాం. నిజంగా ఇది యాత్ర సినిమా కాదు. మహానేత వైఎస్ఆర్ పాదయాత్రను, ఆయన వ్యవహారశైలిని దగ్గరగా చూసే అదృష్టం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – శ్రీనివాసరెడ్డి పాల్వాయ్, ఆర్.కే.ఆస్పత్రి, బళ్లారి, కర్ణాటక. ప్రతి సీన్ బాగుంది మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్ను ధిక్కరించి చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. – తాన్న సునీల్కుమార్ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల) ప్రతి సీన్ బాగుంది మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్ను ధిక్కరించి చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. – తాన్న సునీల్కుమార్ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల) కళ్లకు కట్టినట్లు తీశారు ‘యాత్ర’ సినిమాలో రాజశేఖర రెడ్డిగారి పాద యాత్రను కళ్లకు కట్టినట్లు తీశారు. ఆయన నిజజీవితంలో జరిగిన ఎన్నో వాస్తవ సంఘటనలను యధావిదిగా చూపారు. రాజశేఖర రెడ్డి హావభావాలను అచ్చంగా అలానే ముమ్ముట్టి ప్రదర్శించారు. ఆయన నటన చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ‘యాత్ర’లో స్క్రీన్ప్లే బాగుంది. పాటలు ఇంకా ఉత్తేజంగా ఉంటే బాగుండేవి. రాజశేఖర రెడ్డి గొప్ప దార్శనికులు.ఆయన ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపారు. కానీ ఆయన కుటుంబం అనేక కష్టాలలో ఉంది. ‘యాత్ర’ సినిమా జగన్కు మేలు చేయాలని కోరుకుంటున్నాం. – బిట్రా శ్రీనివాసరావు, బొబ్బిలి రాజన్న పాత్రలో మమ్ముటి జీవించారు ‘యాత్ర’ చిత్రాన్ని సినిమా యూనిట్ అత్యద్భుతంగా తెరకెక్కించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముటి జీవించారు. అధిష్టానాన్ని ఎదిరించే సన్నివేశం అద్భుతంగా ఉంది. నటీనటులు వారి వారి పాత్రకు న్యాయం చేశారు. ప్రతి సీన్ అభిమానులను కంట తడి పెట్టిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు, వాటి గల కారణాలను సూటిగా చూపించారు. – రాజు, చిత్తూరు మమ్ముట్టిని చూస్తున్న కొద్ది వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొచ్చారు ‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ మొదటి నుంచి చివరి వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డినే చూసినట్లు అనిపించింది. రాజన్న రాజసం తెరమీద చూపించేందుకు డైరక్టర్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ను తెరమీద చూస్తున్న కొద్దీ చాలా ఆనందంగా అనిపించింది. రాజశేఖర రెడ్డి నిజజీవితంలో ఎలా ఉండేవారు? అనేది ‘యాత్ర’ సినిమాను డైరక్టర్ ప్రేక్షకులకు అద్భుతంగా చూపించారు. – అక్కేన నరేష్. శ్రీకాకుళం – కరుకోల గోపీకిశోర్రాజా, సాక్షి, విశాఖ -
బాధ్యతారాహిత్యంపై దండ‘యాత్ర’
కళకీ కులాలుంటాయి. సినిమాలకీ రాజకీయాలుంటాయి. మనోళ్ల కళ హాయిగా కళ కళ లాడుతూ ఉంటుంది. మనోళ్లకి నష్టం తెచ్చే పరాయి వారి కళ ఎంతబాగున్నా వెల వెలబోతుంది. అసలామాటకొస్తే మనోడి సినిమా బాగాలేకపోయినా.. అద్భుతంగా ఉందని చెప్పడానికి మనకి భయమే ఉండదు. మనోడి సినిమాకన్నా అవతలోడి సినిమా నిజంగానే అద్భుతంగా ఉన్నా...మన మాటల వల్ల కూడా ఆ సినిమాకి ప్రచారం జరిగిపోతే కొంపలంటుకుపోతాయి కాబట్టి దాని గురించి మాట్లాడనే మాట్లాడం. ఇపుడు టాలీవుడ్ లో మెజారిటీ ప్రముఖులకు ఓ సినిమా అంటరానిదైపోయింది. దాని గురించి మాట్లాడ్డమే నేరమన్నట్లు అంతా మౌనవ్రతం పట్టేశారు. ఆ సినిమాయే యాత్ర. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవితంలో ఓ చిన్న అధ్యాయం పాదయాత్ర. ఆ చిన్నపాటి ఘట్టాన్నే ఇతివృత్తంగా తీసుకున్న నిర్మాత...ఓ వర్ధమాన దర్శకుడు కలిసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఎలాంటి హడావిళ్లూ..ప్రచార ఆర్భాటాలూ లేకుండా యాత్ర సినిమాని విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. చిత్రంగా టాలీవుడ్ లో ఏ సినీ ప్రముఖుడూ కూడా ఈ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సినిమా బాగుందనో.. బాగాలేదనో చెప్పలేదు. దీనికి కొద్ది రోజుల ముందు నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా అత్యంత ఆర్భాటంగా విడుదలైంది. సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచే అన్ని చానెళ్లూ..పత్రికలూ కథానాయకుడి గురించి లెక్కకు మించిన కథనాలు రాసి ప్రమోట్ చేశాయి. అంత హడావిడీ చేసి విడుదల చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా సినిమా గురించి ఆహా ఓహో అని పొగిడారు. ట్విట్టర్ లో పోస్టింగులు పెట్టి తమ బాధ్యత నెరవేర్చుకున్నారు. ఈ పెద్దలంతా యాత్ర సినిమా విషయం వచ్చేసరికి నోళ్లు కట్టేసుకున్నారు. కలాలు పక్కన పెట్టేశారు. మౌస్ లు కదలకుండా పట్టేసుకున్నారు. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదు. కావాలనే..ఒక పథకం ప్రకారమే.. యాత్ర గురించి మాట్లాడకుండా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందువల్ల చేత? యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది. అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది. టాలీవుడ్ లో భిన్న వైరుధ్యాలు..శత్రుత్వాలూ ఉన్న గ్రూపులన్నీ కూడా యాత్రను ప్రమోట్ చేయకూడదన్న ఒకే ఒక్క అంశంలో ఒక్కతాటిపైకి రావడం చూసి భయమేసింది. ఏ చిన్న సినిమాయో అనాథలా విడుదలై హిట్ అయితే..స్పందించకపోతే బాగుండదేమోనని బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సినీ జీనియస్ లు సైతం యాత్ర ను వెలివేయడం చూసి బాధేసింది. సామాజిక వర్గం ఆధారంగా ఓ సినిమాని ఇలా వెలివేసేసే పెద్దలున్న కాలంలోనే నేనూ బతుకుతున్నందుకు సిగ్గేసింది. ఈ పెద్దలంతా కూడా... కథానాయకుడి విషయంలో ఇందుకు భిన్నంగా స్పందించడం చూసి ఆశ్చర్యమేసింది. కథానాయకుడు సినిమా ఫ్లాప్ అని తేలిపోయిన తర్వాత కూడా.. అన్ని చానెళ్లూ..అందరు సినీ ప్రముఖులూ కూడా ఒకటే భజన. కథానాయకుడి సినిమా చాలా బాగున్నప్పటికీ..బాలకృష్ణ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ...సినిమా అనుకున్నట్లు ఆడలేదట. అంటే..మనోడి సినిమాని మెచ్చుకోకపోతే..మొత్తం ప్రేక్షకులందరినీ బోనులో నిలబెట్టి..ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేదని కాలర్ పట్టుకుని నిలేస్తారన్నమాట. అదే అవతలోడి యాత్ర ఎవరూ ప్రమోట్ చేయకపోయినా..మీడియా ఏ పాటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా..విడుదలై జనం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటే... ఆ విషయం ఎవరికీ తెలీకుండా ఉండేందుకు మొత్తం యాత్ర సినిమానే బోనులో పెట్టేస్తారన్నమాట. యాత్రపై కోపానికి చాలా కారణాలే ఉండచ్చు. ఎందుకంటే..చాలా సినిమాల్లా యాత్ర సినిమా ఆర్భాటంగా ముందుకు రాలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి భారీ సెట్టింగులు వేసి..సినీ పరిశ్రమలోని అతిరథమహారథులను పిలిచి తారల తళుక్కుల మధ్య నిర్వహించలేదు. సినిమాలో సుమోలు గాల్లోకి లేచి కిందపడలేదు. అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలతో యువతకు గేలం వేయలేదు. భారీ సెట్టింగులూ లేవు..ఘోరమైన ఫైటింగులూ లేవు. ఓ ఊరి నుంచి మరో ఊరికి ఎడ్లబండిపై వెళ్లినట్లు సినిమాని ముందుకు నడిపించారు దర్శకుడు మహి. సినిమాకి సంబంధించిన రూల్స్ ని పక్కన పెట్టి.. సినీ పరిశ్రమలోని సంప్రదాయాలను పట్టించుకోకుండా.. అత్యంత సింపుల్ గా సినిమా విడుదల చేసేసి..హిట్ కొట్టేసి.. కాలరెగరేస్తే ఎలాగ? అనుకున్నారో ఏమో కానీ చిత్ర పరిశ్రమ అంతా ఒకేలా సహాయనిరాకరణ ప్రదర్శించింది. సమకాలీన అంశాలపై తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో అద్భుతంగా స్పందించే సినీ మేథావులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి బ్రదర్స్, నాగబాబులతో పాటు..సోషల్ మీడియాలో భిన్న అంశాలపై బాధ్యతాయుతంగా తమ అభిప్రాయాలను వెల్లడించే..సాహితీ ప్రియులు...విమర్శకులు సైతం యాత్ర మనది కాదులేనని వదిలేయడం అన్యాయం అనిపించింది. సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫాన్- అన్న సామెత కూడా అన్ని వేళలా..అన్ని కాలాల్లోనూ నిజం కాదనిపించింది. ఎందుకంటే కథానాయకుడు ఫెయిల్ అయినా..మేథావులు..సినీ ప్రముఖులూ.. జర్నలిస్టులూ అంతా కూడా సినిమా బాగుంది కానీ..ఎక్కువ మంది చూడలేదని కితాబునిచ్చారు. అంటే మనోళ్ల ఫెయిల్యూర్ కి కూడా చాలా మంది ఫాదర్సూ,బాబాయిలూ..మావయ్యలూ దూరపు చుట్టాలూ అండగా నిలిచారు. సినిమా బాగుంటే జనం ఎందుకు చూడరు? జనం చూడకపోవడం వల్లనే కదా సినిమా ఫ్లాప్ అయ్యింది. చూడలేదంటే ఆ సినిమా జనానికి నచ్చలేదనే కదా. అదే యాత్ర చాలా బాగుందని జనం మెచ్చుకున్నా..సినిమా హిట్ అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క మంచి మాట అనలేకపోవడం దేనికి సంకేతం? అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే..యాత్ర సినిమా ఘన విజయం సాధించాక..చిత్ర యూనిట్ విశాఖ పట్టణంలో సక్సెస్ మీట్ పెట్టారు. దానికి చిత్ర కథానాయకుడు..మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా వచ్చారు. చిన్న చిన్న సినిమాల సక్సెస్ మీట్ లు జరిగినా మీడియాలో వార్తలు వస్తారు. కానీ యాత్ర సక్సెస్ మీట్ వార్తలు మాత్రం ప్రధాన పత్రికలు పక్కన పెట్టేశాయి. యాత్రను మీడియా కూడా వెలి వేసిందన్నమాట. యాత్ర సక్సెస్ అయినా ..అనాథగా వదిలేసి వెళ్లిపోవాలని మెజారిటీ పెద్దలు అనుకున్నారు. అయితే యాత్ర అనాథ కాలేదు. 5కోట్ల మంది ప్రజలు యాత్రను దత్తత తీసుకుని తమ గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు. జన హృదయాల్లోంచి యాత్ర సంతకాన్ని ఎవరూ చెరపలేరు. మనం మెచ్చిందే కళ...మనం చెప్పిందే వేదం అన్న ఆలోచన ఎంత ప్రమాదకరం? కళ మనకో మనోళ్లకో...మనోళ్ల పార్టీలకో మేలు చేసేదై ఉండాలనుకోవడం ఎంత బాధ్యతారాహిత్యం? ఎంత దారుణం? - సి.ఎన్.ఎస్.యాజులు -
‘యాత్ర’ బ్లాక్బస్టర్ మీట్
-
వైఎస్గారి పాత్ర చేయడం నా అదృష్టం
‘‘యాత్ర’ సినిమాకి ముందు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆసక్తికరంగా అనిపించకపోవడంతో చేయలేదు. అయితే ‘యాత్ర’ సినిమాను కాదనలేకపోయాను. కథ బాగుంది.. మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. ప్రజలను అర్థం చేసుకోకపోతే రాజకీయ నాయకుడు.. ప్రజానాయకుడు కావడం కష్టం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడే రూలర్ అవుతారు’’ అని హీరో మమ్ముట్టి అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం వైజాగ్లో నిర్వహించిన ‘బ్లాక్ట్బస్టర్ మీట్’లో మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు.. నన్ను క్షమించండి. తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇంకా రాలేదు. నా డైలాగ్స్కు జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. తెలుగులో ప్రత్యక్షంగా ‘యాత్ర’ నా మూడో చిత్రం. కె.విశ్వనాథ్గారితో ఒక సినిమా, ఉమా మహేశ్వరరావుగారితో మరో తెలుగు సినిమా చేశాను. ‘యాత్ర’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాంగ్ షూట్ చేశాం. ఆ తర్వాత ఓ సీన్ను చిత్రీకరించాం. కాస్త భయం వేసింది.. నెర్వస్గా ఫీలయ్యాను. లక్కీగా ఆ సీన్ సినిమాలో లేదు. ఆ తర్వాత మ్యానేజ్ చేశాను. దర్శక–నిర్మాతలు నాకు మ్యాగ్జిమమ్ కంఫర్ట్ లెవల్స్ ఇచ్చారు. నా నుంచి కొత్తవిషయాలు నేర్చుకున్నానని మహి చెప్పారు. కానీ, నేర్చుకున్నది నేను. పాత్ర కోసం కొత్త భాష నేర్చుకున్నాను. సెట్లో ప్రతి రోజూ నాకు కొత్త రోజే. డైలాగ్స్ పలకడానికి సహకరించిన అసోసియేట్ డైరెక్టర్స్తో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. సినిమాల్లో నాకు అనుభవం ఎక్కువగా ఉండొచ్చు. కానీ తెలుగులో తక్కువ. సినిమా సక్సెస్ అయ్యింది. ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘యాత్ర’లో హీరో లేడు.. హీరోయిన్ లేదు.. ఫైట్స్ లేవు.. పాటలు, కామెడీ సీన్స్ లేవు.. అయినా ప్రేక్షకులు ఆదరించారు. సినిమాలను చూడటంలో వారి అభిరుచి మారింది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలి. విభిన్నమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఆల్రెడీ పెరిగారు. వైఎస్ఆర్గారిలా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆయన పాత్రలో నటించడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో మూడో సినిమా ‘యాత్ర’. మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ చేసినప్పుడు బాగా పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. రెండో సినిమా మహితో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చేసినప్పుడు బాగా డబ్బులు వచ్చాయి కానీ పెద్దగా పేరు రాలేదు. ‘యాత్ర’ మా మూడో సినిమా. ఈ చిత్రానికి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని వేల ఫోన్కాల్స్ వచ్చాయి. అందరూ ఒక్కటే మాట చెప్పారు. ‘మేం జీవితాంతం మీ రుణం తీర్చుకోలేం.. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్గారిని తీసుకొచ్చారు’ అనడంతో మేం పడ్డ ఏడాదిన్నర కష్టం మరచిపోయాం. ఈ సినిమాని చూసి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్ చేసి సంతోషం వ్యక్తం చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా కేవలం డబ్బు కోసం తీయలేదు. వైఎస్గారి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్స్ టు మమ్ముట్టిసార్.. వైఎస్గారిని మళ్లీ తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక నేను, మహి వెళ్లి జగన్ అన్నని కలిశాం.. ‘యాత్ర’ ప్రొడ్యూసర్.. రండి అని అన్న అనడంతో చాలా సంతోషం వేసింది’’ అన్నారు. దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు నమ్మకపోతే ఈ సినిమా చేయడం అసాధ్యం. వైఎస్గారిపై అభిమానం వేరే, కృతజ్ఞత వేరే అని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నా. వైఎస్గారిపై అభిమానం, ప్రేమకు మించిన ఒక భావం కానీ, ఏదైనా ఒక ఫీలింగ్ ఉందంటే అది కృతజ్ఞత. ఆయన్ను ప్రేమించేవారికి ఓ కృతజ్ఞత ఉంది. అది క్రీడాకారులకో, సినిమా వాళ్లకో రాదు.. అది అసాధ్యం. నేను ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు.. ఎక్కువ డబ్బులు రావొచ్చేమో కానీ, నా జీవితంలో నాకు తెలిసి ఇంత కృతజ్ఞత కానీ, ప్రేమ కానీ రాదని కచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ఒకతను నాకు ఫోన్ చేసి, ‘ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను’ అన్నాడు. ఓ మహిళ ఫోన్ చేసి, ‘ఇకపై రైతు మార్కెట్లో టమోటాని ధర కన్నా రెండు రూపాయలకు తక్కువ ఇమ్మని రైతులను అడగను’ అని చెప్పింది. ఓ కథ ఇంత ప్రభావం చూపిస్తుందని, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. జగనన్నకి కూడా థ్యాంక్స్. ఎన్నికలు ఉన్న ఏడాదిలో నేను ఎవర్నో కూడా తెలియకుండా నన్ను గుడ్డిగా నమ్మి ‘మీ నాయకుని కథ మీరు చెప్పుకోండి’ అన్నారు. ఆ మాట అనాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అందుకు అన్నకి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాల్లో చాలామంది కడప కథలు చెప్పారు. తొలిసారి ఓ కడప బిడ్డ కథ చూపించాం. వైఎస్గారు కడపలో పుట్టినా ప్రతి గడపలోకి వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఆయన్ని ప్రేమించారు. రాఘవేంద్రరావుగారు, రామ్గోపాల్వర్మగారు... ఇలా చాలామంది సినిమా బావుందని అభినందించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు అశ్రిత, ఉమ, ‘దిల్’ రమేశ్, దయానంద్, మొయినుద్దీన్, బాలనటి సహస్ర, శ్రీమిత్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్’
‘యాత్ర’ YSR బయోపిక్ కాదు, అది తీయడానికి రెండున్నర గంటల సినిమా నిడివి సరిపోదు. కేవలం ‘పాదయాత్ర’ అంటే, అంతసేపు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడానికి సరుకు చాలదు. మరేంటి? ఈ ఉత్సుకతతోనే సినిమాకెళ్ళా! ఓపెన్ మైండ్తో, నిర్మల మనసుతో సాంతం చూశా. ఇంటర్మిషన్, ది ఎండ్ త్వరగా వచ్చాయి. నడుమ నాలుగయిదు మార్లు కళ్ళు చేమర్చినా, అరె! సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది. హాట్సాఫ్ టు ది డైరెక్టర్. చిత్రీకరణ నైపుణ్యమే కాదు సినిమా అంతటా నిజాయితీ ఉంది. అందుకే ఆ నిండుతనం. జనమాధ్యమాల (mass communication) లో సెల్యులాయిడ్, సినిమా ఎంత పవర్ఫుల్లో మరోమారు అర్థమైంది. ‘వైఎస్సార్’ అని పొట్టిగా పిలిచినా, ‘రాజశేఖరరెడ్డి’ అంటూ రాజసం చిలికినా, ‘డా.వైఎస్సార్’ని ఒడలు పులకించేలా పొడుగ్గా పలికినా... నాలుగు దశాబ్దాలు ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్! ఎందుకు? ఎందువల్ల? ఏ కారణంగా? క్రమంగా వికసించిన ఆయన వ్యక్తిత్వం, తనవారితో మమేకమయ్యే జీవనశైలి, ద్విదృవ మొండి/హుందాతనం, ఊపిరై సహవాసం చేసిన మానవత, జనం కోసం ఏమైనా చేయగల తెగువ... ఇవే, దర్శకుడికి ముడిసరుకయ్యాయి. అందుకే, సంఘటనలు, సన్నివేశాల వరుస మార్చినా, అక్కడక్కడ నిజాలకు సినీమాటిక్ ట్రిక్కులద్దినా... ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీ రిఇంబర్స్మెంట్’, నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్’, సాచురేషన్ వరకిచ్చిన ‘పెన్షన్లు’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ణం’ ఇలా, అయిదున్నరేళ్ళు అభివృద్ధి - సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన దాదాపు అన్ని పథకాలూ.... ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్ దట్సాల్! కుళ్ళు రాజకీయాల్ని జొప్పించలేదు, ఒకటీ అరా ఆహ్లాదపరిచే సెటైర్లు తప్ప! ‘నటన’ కళ అయితే, అది తప్పక భాషాతీతమని మమ్ముట్టి తన నిండైన రూపం, చాతుర్యం, మ్యానరిజం, కడకు వాచకం (తనదే డబ్బింగ్)తో నిరూపించాడు. చివరికి, గ్రేట్.... కనబడీ కనబడనీకుండా కంటతడి తుడిచేసుకుంటారు గనుక, ‘రాజకీయాల్లో ఉంటే వైఎస్సార్ లా ఉండాలి, ‘అధికారం’ అబ్బితే ఆయనలా నడవాలి, మనిషై మాటిస్తే రాజన్నలా కట్టుబడాలి, స్నేహమంటూ చేస్తే అతనిలా విశ్వసించాలి, ఇవేవీ చేయలేకపోయినా.... మనకెప్పటికీ YSR లాంటి పాలకుడుండాలి’ అనుకుంటూ, ప్రేక్షకులంతా బరువెక్కిన గుండెలతో థియేటర్ బయటకు నడుస్తారు. -దిలీప్ రెడ్డి. -
‘యాత్ర’పై వర్మ ప్రశంసలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘యాత్ర ఒక అద్భుతమైన చిత్రం. వైఎస్సార్ గొప్ప నాయకుడు. వైఎస్సార్లోని నిజమైన కోణాన్ని ఈ చిత్రం అవిష్కరించింది. మహి వీ రాఘవ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశార’ని ట్విటర్లో పేర్కొన్నారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. Yatra is an awesome film ..A truly great insight into YSR,a truly great leader ..Kudos to @MahiVraghav who made him come alive and kudos to @mammukka for immortalising him forever 🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2019 -
వైఎస్సార్గారు ప్రజలను తండ్రిలా ఆదరించారు – వైఎస్ విజయమ్మ
‘‘వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ‘యాత్ర’ సినిమాని నిర్మించి, విజయవంతంగా నడిపించిన డైరెక్టర్ మహి, నిర్మాతలు విజయ్, శశి, శివగార్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభినందిస్తున్నా’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాని సోమవారం హైదరాబాద్లో ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని కోట్లమంది హృదయ అంచుల్లో, అంతరాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిగారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యవహార శైలిని, ప్రజల పట్ల ఆయనకున్న ఆరాటం, తపన, ఆయన ఆశయాలు, సంక్షేమ పథకాలను మరోసారి ప్రజల గుండె లోతుల్లో నుంచి తట్టి లేపారు. అందుకే నేను ‘యాత్ర’ యూనిట్ని అభినందించడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాజశేఖర రెడ్డిగారిని ప్రజలు ఏ విధంగా నాయకునిగా నిలబెట్టుకున్నారో.. ఆయన కూడా ఓ తండ్రిగా మిమ్మల్ని (ప్రజలు) ఆదరించి మీకు ఏం కావాలో అవన్నీ చేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డిగారి కుటుంబాన్ని వదిలి పెట్టకుండా అక్కున చేర్చుకున్న ప్రజలందరికీ, రాజశేఖర రెడ్డిగారి నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాని ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రంలో వైఎస్ విజయమ్మ పాత్రలో నటించిన అశ్రిత మాట్లాడుతూ– ‘‘యాత్ర’ విడుదల తర్వాత ఎంతోమంది ఫోన్లు చేసి వైఎస్ విజయమ్మగారిలానే ఉన్నానని అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. విజయమ్మగారితో కలిసి ‘యాత్ర’ సినిమా చూసే అవకాశం రావడం హ్యాపీ. ఈ సినిమా చూసి విజయమ్మగారు సంతోషపడ్డారు. ఎప్పటినుంచో ఆమెను కలవాలనే నా కోరిక ఇప్పుడు తీరింది’’ అన్నారు. ‘‘దేశానికి అన్నం పెట్టే రైతులను ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి చూడాల్సిన సినిమా ‘యాత్ర’. ఎటువంటి భేషజాలకు పోకుండా సినీ అభిమానులందరూ ‘యాత్ర’ లాంటి మంచి సినిమాని చూసి, ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలో చాలా బరువైన పాత్ర చేశా. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటుడు ‘దిల్’ రమేశ్ అన్నారు. విజయ్ చిల్లా, మహి వి. రాఘవ్ పాల్గొన్నారు. -
‘రాజన్నే స్వయంగా స్క్రీన్ మీద ఉన్నారు’
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాజన్న పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. పాజిటివ్ రివ్యూలతో, మంచి టాక్తో అందరి మన్నలను అందుకున్న ఈ చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమా వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ యాత్ర చూశాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా.. మమ్ముట్టి గారు అద్భుతంగా నటించారు. చిత్రానికి పనిచేసిన నటీనటులు, చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. Watched Yatra! It was such a sincere emotional journey. Felt emotional on many occasions.Aided by a honest and brilliant performance by @mammukka gaaru, I felt rajanna himself was on the screen. Congratulations to the entire cast n crew for wonderful and respectful job...🙏🏻🙏🏻 pic.twitter.com/ypz3rChIEj — SurenderReddy (@DirSurender) February 11, 2019 -
మమ్ముట్టిపై సూర్య ప్రశంసలు!
మమ్ముట్టి ఏ పాత్ర చేసినా.. అందులో ఒదిగి పోతారన్న సంగతి తెలిసిందే. పైగా ఏ భాషలో నటించినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. మమ్ముట్టి తాజాగా పెరంబు, యాత్ర చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు సినిమాలపై సూర్య ప్రశంసలు కురిపించారు. మలయాళ, తమిళ భాషల్లో పెరంబు తెరకెక్కగా.. తెలుగు, మలయాళ, తమిళ, భాషల్లో యాత్ర తెరకెక్కింది. కూతురు, తండ్రికి మధ్య ఉండే ప్రేమానురాగాల నేపథ్యంలో పెరంబులో అద్భుతంగా నటించారని విమర్శకులు ప్రశంసించారు. యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశారు. ఇక ఈ చిత్రాలను వీక్షించిన హీరో సూర్య.. పెరంబు, యాత్ర సినిమాలను ఎంచుకున్న విధానం, వస్తున్న ఫీడ్బ్యాక్, స్వచ్చమైన సినిమాలను చేస్తూ.. మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. సూర్య ప్రస్తుతం ఎన్జీకే చిత్రంతో బిజీగా ఉన్నాడు. Recently #Peranbu n now #Yatra so many feedbacks and what a varied choice @mammukka .. Thank you team for inspiring us with this truth and purity of cinema! All respects 🙏🙏🙏 pic.twitter.com/qeNndXMRC5 — Suriya Sivakumar (@Suriya_offl) February 10, 2019 -
మేకింగ్ ఆఫ్ మూవీ యాత్ర
-
‘సుచరితా రెడ్డి’పై స్పందించిన అనసూయ
రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనను మరువక ముందే.. ‘యాత్ర’లో సుచరితా రెడ్డిగా మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశారు. యాత్రలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా.. తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు ఆమె. యాత్ర చిత్రంలో తన పాత్రపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. అనసూయ తన ఆనందాన్ని అభిమానులతో పంచకున్నారు. ‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ మహి వి రాఘవ, 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్కు ధన్యవాదాలు’ అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘యాత్ర’ విజయవంతంగా దూసుకుపోతోంది. Playing #SucharitaReddy was an experience I will cherish always.. Thank you my audience for all the good things you are saying.. Thank you @MahiVraghav Sir and @70mmEntertains for having faith in me that I can pull this off 🙏🏻#YatraTheMovie #YatraRoars pic.twitter.com/miywLKlVqo — Anasuya Bharadwaj (@anusuyakhasba) 10 February 2019 -
‘యాత్ర’ యూనిట్కు జగన్ శుభాకాంక్షలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అంకిత భావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు’ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను అభినందించారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు. Congratulations @MahiVraghav @devireddyshashi @VijayChilla @ShivaMeka @mammukka & entire crew on the successful release of #Yatra.I wholeheartedly thank you & appreciate your passion & dedication in wanting to depict cinematically,the character & essence of the great leader,YSR. — YS Jagan Mohan Reddy (@ysjagan) 10 February 2019 -
గుండెల్లో నిలిచిపోయే ‘యాత్ర’
ఎటుచూసినా కరువు కాటకాలు, దుర్భరంగా ప్రజల బతుకులు. చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేదు. జేబులో చిల్లిగవ్వ కరువాయె. ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రజలకు భరోసానివ్వడానికి మహానేత వైఎస్ఆర్ చేపట్టినదే ప్రజా ప్రస్థాన పాదయాత్ర. ఆ మహాఘట్టం వెండితెరపై యాత్రగా పునరావిష్కృతమై ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకుంటోంది. వైఎస్ఆర్గా మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి పాత్రకు ప్రాణం పోశారని మన్ననలు పొందారు. కన్నడనాట ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నయవంచక పరిపాలనతో విసిగిపోయిన ప్రజానీకంలో 2004 అసెంబ్లీ ఎన్నికల ముందు మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర కొత్త ఆశలు చిగురింపజేసింది. ఏపీని కొత్త అడుగులు వేయించిన ప్రజాప్రస్థాన యాత్ర, మహానేత వైఎస్ఆర్ క్షేత్ర స్థాయి నుంచి సమస్యలు తెలుసుకున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ కన్నడనాట ప్రభంజనం సృష్టిస్తోంది. యాత్ర సినిమా బళ్లారి నగరంలోని గంగ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన శుక్రవారం మొదటి ప్రదర్శన నుంచే ప్రేక్షకులు, అభిమానులతో కిక్కిరిసింది. కదిలిన మనసులు, చెమర్చిన కళ్లు వైఎస్ఆర్ జ్ఞాపకాలను నెమరవేసుకుని ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. ప్రజాప్రస్థాన యాత్రలో ఆస్పత్రిలో గుండెజబ్బు చిన్నారి కష్టాలను వైఎస్ఆర్ చూసి వారికి చేయూత ఇచ్చేందుకు ప్రయత్నించిన దృశ్యం, అనంతరం ఆ బాలిక కన్నుమూయడం సన్నివేశం ప్రేక్షకులను కలచివేసింది. ఎన్నికల్లో ఘన విజయంతో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీ నాంది పలకడానికి ఆ ఘటనే కారణమని భావిస్తారు. ప్రజాప్రస్థాన యాత్రలో వైఎస్ఆర్ కళ్లారా చూసిన సమస్యలకు సీఎం అయిన తర్వాత పరిష్కార మార్గం చూపారని ప్రేక్షకులు పేర్కొన్నారు. రెండు రోజులుగా యాత్ర సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సాగుతోందని థియేటర్ యజమాని సాక్షికి తెలిపారు. యాత్ర సినిమా చూసిన ప్రేక్షకులు ఏమన్నారంటే... అందరి సమస్యలను తీర్చారు యాత్ర సినిమా కొత్త అనుభూతిని ఇచ్చింది. వైఎస్ఆర్ సుదీర్ఘ పాదయాత్రను యాత్ర సినిమాలో చూసేందుకు అవకాశం ఏర్పడింది. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్న మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్ ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని ఆయన చేసి చూపించారు. – రమేష్, బళ్లారి అద్భుతంగా ఉంది యాత్ర సినిమా అద్భుతంగా ఉంది. మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ ప్రజాప్రస్థాన పాదయాత్రను ఈ సినిమా ద్వారా చూసే భాగ్యం కలిగింది. అనేక సన్నివేశాలను మనసును కదిలించాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సీఎం అయిన తర్వాత అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనంలో చిరస్థాయిగా నిలిపోయారు. – బేసేజ్రెడ్డి, కొర్లగొంది ఆనందం, బాధ కలిగాయి వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన యాత్రను చిత్రంలో చూసిన తరువాత ఆనందంతో పాటు ఎంతో బాధ కలిగింది. కాళ్లకు బొబ్బలు వచ్చినా, సుస్తీ కలిగినా ఆపకుండా పాదయాత్ర చేయడం వల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ దేశానికి మంచి జరిగింది. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత అమలు చేసిన పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయంటే అది మహానేత చలువే. – శ్రీకాంత్రెడ్డి, కొళగల్లు దేశానికే ఆదర్శం వైఎస్ఆర్ పథకాలు ప్రజాప్రస్థాన యాత్ర సినిమా ఎంతో మంచి అనుభూతిని కలిగించింది. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజ్ రిఇంబర్స్ మెంట్, జలయజ్ఞం ఇలా చెప్పుకుంటే పోతే వైఎస్ఆర్ పథకాలు దేశానికి వరంగా మారిపోయాయి. అలాంటి మహానేత చేసిన ప్రజాప్రస్థాన యాత్రను మేం మళ్లీ చూసేందుకు యాత్ర సినిమా దోహదపడింది. మమ్ముట్టి ఎంతో బాగా నటించారు. యాత్ర సినిమా మళ్లీ మళ్లీ చూడాలని ఉంది. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలన్నది చేసి చూపించింది ఒక్క వైఎస్సార్ మాత్రమే. – హేమారెడ్డి, కొళగల్లు వైఎస్ఆర్ అంటేనే సమ్మోహకశక్తి వైఎస్ఆర్ నిర్వహించిన ప్రజాప్రస్థాన పాదయాత్ర మేం కుటుంబం మొత్తం చూసి తరించాం. వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలు సమ్మోహనశక్తి లాంటివి. వృద్ధులు పడుతున్న బాధలను తెలుసుకుని, వృద్ధాప్య పెన్షన్ను భారీగా పెంచారు. విద్యుత్ కొరతతో అల్లాడిపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు చరిత్రాత్మకం. ఇదంతా ప్రజాప్రస్థాన యాత్ర ద్వారానే సాధ్యమైంది. మహానేత పాదయాత్ర యావత్ దేశానికే మార్గదర్శకంగా మారింది. – లలితమ్మ, బళ్లారి -
‘యాత్ర’ చేసినందుకు గర్వంగా ఉంది
‘‘70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ముఖ్యోద్దేశం ప్రేక్షకులను డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయడమే. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ ఇప్పుడు ‘యాత్ర’. ఇది పొలిటికల్ సినిమా అయినప్పటికీ పాలిటిక్స్ ఉండవు. కేవలం వైయస్సార్గారి సోల్, స్పిరిట్ను ఈ సినిమాలో చూపించాం’’ అని విజయ్ చిల్లా అన్నారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో వైఎస్సార్గా మమ్ముట్టి నటించిన చిత్రం ‘యాత్ర’. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం రిలీజైంది. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ – ‘‘మహీ వి. రాఘవ్ నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు కాంట్రవర్శీ ఎందుకు? అన్నాను. కానీ తను చెప్పిన సన్నివేశాలు విన్నాక సినిమా మొత్తం ఇదే ఎమోషన్తో ఉంటే చేద్దాం అనుకున్నాను. మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలామంది ఫోన్ చేసి ‘పెద్దాయన్ని గుర్తు చేశారు, బరువైన హృదయంతో, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు’ అని అంటున్నారు. ఈ సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. మా బడ్జెట్కు మంచి ఓపెనింగ్ లభించింది’’ అన్నారు. ‘‘అభిమానానికి, కళకి వెల కట్టలేము. ‘రుణం తీర్చుకోలేము స్వామి’ అని ప్రేక్షకులు అంటున్నారు. మేం కేవలం ఒక నాయకుడి కథ అనుకొని కథ చెప్పాం. ఇలాంటివి వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మహా అయితే ఇంకో 4–5 సినిమాలు తీస్తానేమో కానీ ఇంత అభిమానం రాకపోవచ్చు. కలెక్షన్స్, సినిమా రేటింగ్స్ కాదు చిన్న చిన్న సన్నివేశాలు కూడా గుర్తుపెట్టుకుని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. మనం అన్నింటినీ అంకెల్లో చూడటానికి అలవాటు పడ్డాం. ఈ అంకెల్లో కొలవడం మనం ఆపేయాలి. వరంగల్, నల్గొండ ప్రాంతాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఒక నాయకుడిని ఇంత అభిమానిస్తున్నారా? అనుకున్నాను. భయమేసింది. ఇది తెలిసి ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాణ్ని కాదేమో. ‘మాతృదేవోభవ’ సినిమా చూసి ఏడ్చాం. మళ్లీ ‘పితృదేవోభవ’ సినిమా చూపించి ఏడిపిస్తున్నారండీ అని అంటున్నారు. 2–3 సన్నివేశాల తర్వాత మమ్ముట్టిగారు ప్రేక్షకుడిని కచ్చితంగా సినిమాలోకి తీసుకెళ్తారని నమ్మాం. రెస్పాన్స్ అలానే ఉంది’’ అని మహీ వి. రాఘవ్ అన్నారు. ‘‘యాత్ర’లో కేవీపిగారి పాత్ర పోషించాను. ‘విలేజ్లో వినాయకుడు’కు మహీ నిర్మాతగా చేశారు. అప్పుడు తెలియలేదు కానీ అతని డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. గొప్ప నాయకుడి కథ చెప్పేటప్పుడు కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ చెప్పడం కుదరదు. పాదయాత్రే ఉంది. రాజకీయాల గురించి చెడుగా చెబుతారు. కానీ సినిమా చూస్తుంటే ఎంతో గౌరవంగా ఉంది. ఇంటిని సెట్ చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ఇంతమందికి సహాయపడాలంటే నాయకులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. వైయస్గారి పాత్ర తాలూకు బరువు మోయాలంటే కష్టం. కానీ మమ్ముట్టిగారు దాన్ని భూజాన మోసిన విధానం గ్రేట్. ఆలోచింపజేసేంత గొప్ప సినిమా ఇది. స్క్రీన్ మీద మమ్ముట్టిగారు, నాకూ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసింది’’ అన్నారు రావు రమేశ్. -
యాత్ర ప్రతి ఒక్కరిని కదిలించే చిత్రం : రావు రమేశ్
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి హిట్టాక్తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో మహానేత వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే కేవీపీ పాత్రలో రావురమేశ్ ఒదిగిపోయారు. ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్ స్పందించారు. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలేనని తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవకు అభినందనలు. ఓ మహా నాయకుడు సినిమా.. ఎలాంటి సున్నితమైన అంశాల జోలికి పోకుండా చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సినిమా చూసి రాత్రంతా ఆ మహానేత గురించే ఆలోచించాను. సినిమాలోని ప్రతీ సీన్ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి అంతరాత్మను తాకే సినిమా ఇది. ముఖ్యంగా యాత్రలో భాగంగా వచ్చే ప్రతి సీన్ మనస్సును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం. మహానాయకుడి పాత్రలో మమ్ముట్టిగారు ఒదిగిపోయారు. ప్రతి సీన్ను ఆయన మోసిన విధానం అద్భుతం. మహీ తీసిన విధానం, మ్యూజిక్, సిరివెన్నల సీతారమశాస్త్రి ‘పల్లెల్లో కళ ఉంది.. పంటల్లో కలిముంది’ అనే లిరిక్స్ కదిలించాయి. రోజు పేపర్లో రైతుల ఆత్మహత్యలు చూసి మొండిగా తయారయ్యాం. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా? అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే మంచి సినిమా. ఈ అనుభూతిని వర్ణించలేను. ఈ సినిమాలో కేవీపీ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. తెల్లబట్టలేసుకుని ఏదో చేశా అనుకున్నా కానీ.. నిన్న చూసిన తర్వాత నా ప్రాతను చూసి ఆస్వాదించాను. చాలా తృప్తినిచ్చిన పాత్ర. ఈ పాత్ర ఇచ్చినందుకు డైరక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని తన అనుభూతి పంచుకున్నారు. -
సినిమా చూసిన తర్వాత ఆ మహానేత ఆలోచనలే
-
జైత్ర యాత్ర
-
లాస్ ఏంజిల్స్లో వైఎస్సార్ అభిమానుల సందడి
లాస్ ఏంజిల్స్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కథాంశంగా నిర్మించిన ‘యాత్ర’ సినిమా రిలీజ్ వేడుకలు శుక్రవారం విదేశాల్లో ఘనంగా జరిగాయి. ఏంజిల్స్లో జరిగిన సినిమా వేడుకల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్, మమ్ముట్టీ అభిమానులు పాల్గొన్నారు. ఏంజిల్స్లోని సినిమార్క్ సెంచరీ థియేటర్స్లో యాత్ర ప్రీమియర్ ఫ్యాన్ షోకు తెల్ల షర్టులు, పంచకట్టుతో అభిమానులు సినిమాకు వచ్చి వైఎస్సార్ని గుర్తు చేసుకున్నారు. డ్రమ్స్, డ్యాన్సులతో థియేటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. థియేటర్లో భారీ కటౌట్ను పెట్టారు. సినిమాను చూసి సీఎంగా వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
హ్యూస్టన్లో 'యాత్ర' సంబరాలు
-
హ్యూస్టన్లో 'యాత్ర' సంబరాలు
హ్యూస్టన్ : మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. యాత్ర చిత్ర విడుదల సందర్భంగా హ్యూస్టన్లో 200 కార్లతో వైఎస్సార్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కేటీలోని సినేమార్క్ థియేటర్లో యాత్ర చ్రిత విడుదలను సంబరంగా జరుపుకున్నారు. సినిమా అయిపోయిన తరువాత అందరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ సందర్బంగా వారు చిత్ర దర్శకునికి, నిర్మాతలకు, చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర చిత్రాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత ఎంత వరకైనా వెళ్లగలను అనడానికి వైఎస్సార్ ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ఈ వేడుకల్లో సుమారు 300 మంది వైఎస్సార్ అభిమానులు పాల్గొని యాత్ర కేక్ కట్ చేశారు. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని హోరెతించారు. సినిమా విజయవంతం అయినందుకు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాకి వచ్చిన అందరికి డిస్ట్రిబ్యూటర్ రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . -
యాత్ర ఫలించింది
నేను విన్నాను.. నేను ఉన్నాను.మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలేజ్ యాజమాన్యాన్ని కలవమను.. రాకుంటే నన్ను కలవమను.దేశ భద్రత ముఖ్యమే.. కానీ ఆహార భద్రతా అంతే ముఖ్యం.కడప దాటి ప్రతి గడపకూ వెళ్లాలనుంది. ప్రజల గుండె చప్పుడు వినాలనుంది.మంచిమనసున్న మనుషులున్నప్పుడు ముహూర్తాలతో పని ఏముంది.నా సహనాన్ని అసమర్థత అనుకోకండి.. నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే... బానిసను కాదు.ఒక కార్డు ఇస్తాను.. ఆ కార్డుతో ఎంత పెద్ద ఆస్పత్రిలో అయినా రూపాయి కూడా చెల్లించకుండా వైద్యం పొందొచ్చు.ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఆర్నెల్లు కష్టపడి సోనా మసూరి బియ్యం పండించినా రేషన్ బియ్యం తింటున్నారు.మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా... వంటి అర్థవంతమైన, ఎమోషనల్ డైలాగ్స్తో సాగే ‘యాత్ర’ సూటిగా జనాల హృదయాలను తాకే విధంగా ఉంది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జనం గురించి ఎంతలా ఆలోచించారో చెప్పే ఈ సంభాషణలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. వైఎస్ చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ ఏంటంటే... మనం ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎందుకు అధికారం చేపట్టలేకపోతున్నాం అంటే.. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం అంటూ స్వీయ ఆత్మ పరిశీలన నుంచి సినిమాలో వైఎస్సార్ పాదయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఓ రైతు చేసే ఆత్మహత్యాయత్నం, పేదరికంతో వైద్యం చేయించలేక ఓ కన్నతల్లి తన బిడ్డను కోల్పోవడం, పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడే ఓ విద్యార్థి వేదన.. వంటివి వైఎస్ మనసుని కలచివేస్తాయి. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వైఎస్ ఇచ్చే భరోసా ప్రజల్లో ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. అదే వైఎస్ గెలుపునకు కారణం అవుతుంది. ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ తన పట్టుదలతో విజయ తీరాలకు చేర్చుతారు. ‘మాట ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.. ఇచ్చాక ఇక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని అన్నట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం పెడతారు. నిజ జీవితంలో మాట ఇస్తే వెనక్కి తగ్గని వైఎస్ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘యాత్ర’. వైస్సార్ పాత్రకు మమ్ముట్టి తప్ప వేరే ఎవరూ సూట్ కారు అనేలా ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ వైఎస్సార్ని తలపించింది. చివరికి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పారు. సినిమా అంతా ఒక ఎత్తయితే క్లైమాక్స్లో వచ్చే వైఎస్సార్ రియల్ ఫుటేజ్ మరో ఎత్తు. బరువెక్కిన హృదయంతో ఆ మహానేతను మరోమారు తలచుకుంటూ ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటికి రావడం కనిపిస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండటంతో ఏడాదిన్నరగా యూనిట్ పడ్డ కష్టం ఫలించింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఆయన ఇమేజ్ని క్యాప్చర్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఎన్నో కోణాలు ఉన్న నాయకుడు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఆహార్యం, ఆయనలో ఉండే ఎనర్జీ, ఆయన్ని చూడగానే ఆకర్షితులయ్యే గుణం... ఇవన్నీ ఓ వైపు ఉన్నా, ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన సిద్ధాంతాలు ఎలాంటివో అవే పెద్దకథ చెప్పాయి. రాజశేఖర రెడ్డిని ప్రేమించని వాళ్లు, ఆయన గురించి తెలియని వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరనే చెప్పాలి. ఆయన జీవితకాలంలో చేసిన మంచి పనుల్లో ఎంతోమంది లాభపడ్డారు. అంతటి మహానుభావుణ్ని, మహానేతను 2 గంటల నిడివిలో చూపించడం చాలా కష్టం. అందుకనే ‘మరో ప్రస్థానం’ పేరుతో సాగిన ఆయన పాదయాత్రని మహి వి.రాఘవ్ తీసుకోవడం వల్ల ఆయన జీవితంలోని కొన్ని కోణాలను ఆవిష్కృతం చేసుకునే అవకాశం దొరికింది. అదే కాకుండా నిజమైన సంఘటనల్లోనే అందమైన కథలు దొరికాయి. కథలు రాసుకొని బయోపిక్ని ప్రెజెంట్ చేయడం వేరు.. బయోపిక్ని చూసి దాంట్లో కథని వెతుక్కుంటూ సన్నివేశాలు రాసుకోవడం మరో ఎత్తు. అది కూడా ఒక మహానుభావుని యాత్ర.. ఒకటి మనకు స్ఫూర్తిని కలిగించాలి.. రెండు ఇతర నాయకులకు ఒక దిశానిర్దేశం కావాలి. యాత్ర ఒక మనిషిది కాదు.. ఒక మహానుభావుడిది మాత్రమే కాదు.. యాత్ర ఒక సమాజానిది. ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సమాజం మళ్లీ ఒక్కసారి వైఎస్ స్మృతులను నెమరు వేసుకోవడం చాలా అందమైన అనుభవం. సహజత్వానికి దూరం పోకుండా నిజాయతీగా తీసిన సినిమా ‘యాత్ర’. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పిన మహీ ప్రయోగం బాగుంది. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఓ మహా యోధుడిని సమాజానికి చూపించాలనే ఆకాంక్ష నిర్మాతలు విజయ్, శశిలది. బయోపిక్స్ అధ్యాయం నడుస్తున్న సమయంలో రెపరెపలాడే జెండా ఈ ‘యాత్ర’. -
‘తన కథను చెప్పమని.. ఆయనే నన్ను ఎంచుకున్నాడు’
వెండితెరపై బయోపిక్లు అన్నివేళలా విజయాన్ని చేకూర్చలేవు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కథలో అందర్నీ ఆకర్షించగలిగే అంశాలు, మనసుల్ని కట్టిపడేసే కథనం ఉండాలి.. అంతేకానీ ఆర్భాటాలకు పోయి సినిమాను తెరకెక్కిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూశాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రేక్షకుల గుండెను బరువెక్కేలా, కన్నీటిని కార్చేలా చేసిన ‘యాత్ర’ సినిమా పాజిటివ్ టాక్తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న సందర్భంగా.. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్, నిర్మాత విజయ్ చిల్లా ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు.. తాను యాత్రకు సంబంధించిన రిపోర్ట్ను ఉదయం నాలుగు గంటలకు యూఎస్ నుంచి విన్నానని.. ఓ అభిమాని ఫోన్చేసి చాలా బాగుందని చెప్పాడని తెలిపాడు. ఆనందో బ్రహ్మ సమయంలో.. ఈ మధ్య కాలంలో ఇలా ఓ సినిమా చూసి ఇంత సేపు నవ్వేలా చేశారని ప్రేక్షకులు తనతో అన్నారని.. మళ్లీ ‘యాత్ర’కు వచ్చేసరికి చాలా ఏడిపించారని చెబుతున్నారని అన్నారు. చప్పట్లు కొట్టించే సన్నివేశాల కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్సే ఎక్కువగా గుర్తుంటాయని, అవే ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్తారని, హాస్పిటల్లో చిన్నపాప సీన్, రైతు సీన్ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రాన్ని పోస్ట్ప్రొడక్షన్లో చాలా సార్లు చూశానని.. థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే తాను నోటీస్ చేయని సన్నివేశాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. తాను రాసిన మాటలకు కూడా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, ఆయనే తన కథను చెప్పమని తనను ఎంచుకున్నాడేమోనని అన్నారు. ప్రతీ వ్యక్తికి వైఎస్సార్తో అనుబంధం ఉంటుందని.. భారతదేశంలో రాజకీయ నాయకులను నమ్మడమనేది అరుదుగా చూస్తామని.. ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడటం..చనిపోయి ఇంతకాలమైనా..ఆ వ్యక్తిని ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే.. ఏదో కథ ఉందని ఓ దర్శకుడిగా తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు. -
ట్రెండింగ్ : ‘యాత్ర’ బ్లాక్ బస్టర్ హిట్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై యాత్ర పేరుతో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్తో ఈ మూవీ అంచనాలను మించిపోయింది. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇక ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. (‘యాత్ర’ మూవీ రివ్యూ) విడుదల అన్ని కేంద్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్తో అందరినీ కంటతడి పెట్టించిన అసిస్టెంట్ డైరెక్టర్ వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘యాత్ర’ మూవీ రివ్యూ
టైటిల్ : యాత్ర జానర్ : బయోగ్రాఫికల్ మూవీ తారాగణం : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి సంగీతం : కె దర్శకత్వం : మహి వీ రాఘవ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యాత్ర. వైఎస్ఆర్లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కిన యాత్ర ఎలా సాగింది..? కథ : ఇది ఈవెంట్ బేస్డ్ బయోపిక్. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. ఆ యాత్ర సమయంలో వైఎస్ఆర్కు ఎదురైన అనుభవాలు. వాటి వల్ల వైఎస్ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి.. పాదయాత్ర రాజశేఖర్రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ. నటీనటులు : బయోపిక్ కావటంతో సినిమా అంతా ఒక్క రాజశేఖరరెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద రాజన్ననే చూస్తున్నమంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. రాజారెడ్డి పాత్రలో.. కనిపించింది రెండు సన్నివేశాలే అయినా జగపతిబాబు తన మార్క్ చూపించారు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె విజయమ్మను గుర్తు చేశారు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఆమె పాత్ర గుర్తుండి పోతుంది. మరో కీలక పాత్రలో కనిపించిన రావూ రమేష్ తనదైన నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశాడు. తెర మీద కనిపించింది కొద్దిసేపే అయిన అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళిలు.. వారు పోషించిన పాత్రలకు జీవం పోశారు. విశ్లేషణ : ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి కథ కాదు.. ఆయన వ్యక్తిత్వం. వైఎస్ఆర్ రాజకీయం ఎలా ఉంటుంది? మాటకు, నమ్మకానికి ఆయన ఇచ్చే విలువ ఏంటి? ఆయనను నమ్ముకున్న వ్యక్తులకు ఆయనకు ఎలాంటి భరోసా ఇస్తారు? పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత వైఎస్ఆర్లో వచ్చిన మార్పు ఏంటి? ఇలా వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాలను వెండితెర మీద ఆవిష్కరించారు. తొలి సన్నివేశం నుంచే వైఎస్ఆర్ రాజకీయం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చూపించారు. పాదయాత్రలో ఆయన ప్రజలతో వైఎస్ఆర్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. తన ప్రత్యర్థి కూతురు ఇంటికి వచ్చి సాయం అడిగితే.. సాయం చేయద్దన్న వారితో ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా’ అనే రాజన్న మాటలకు ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హైకమాండ్ పెద్దలు వచ్చి మీ ఒక్కరితోనే మాట్లాడలన్నప్పుడు పక్కన కేవీపీ ఉన్నా.. ‘మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు’ అనటం ఆయన స్నేహానికి ఎంత విలువ ఇచ్చేవారో గుర్తు చేస్తుంది. మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే’ అన్న మాటల్లో ఆయన విశ్వసనీయత ఎంతటిదో అర్ధమవుతుంది. ‘నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు’ అంటూ హైకమాండ్ పెద్దలను ఎదిరించినప్పుడు ఆయన ధైర్యం ఎలాంటిదో అర్ధమవుతుంది. మార్కెట్లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో ‘నేను విన్నాను.. నేనున్నాను’ అన్ని సన్నివేశం ఆయనలోని నాయకుడిని జ్ఞప్తికి తెస్తుంది. తనను నమ్ముకున్న ఓ పోలీసు కానిస్టేబుల్ తప్పు చేస్తే నాకేందుకులే అని విడిచిపెట్టుకుండా, తనకు చెడ్డ పేరువస్తుందేమో అని ఆలోచించకుండా తానే తగ్గి ‘నా కోసం అతని తప్పును పొరపాటుగా భావించి వదిలిపెట్టమనడం’ ఆయనది ఎంత పెద్ద మనసో చూపిస్తుంది. పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభిస్తే అశుభమన్న పేరొస్తుందేమో అన్న సబితమ్మతో ‘మంచి మనసున్న మనుషులున్నప్పుడు ముహూర్తాలతో పని ఏముంది’ అన్నప్పుడు ఓ అన్న, చెల్లికి ఇచ్చే భరోసా కనిపిస్తుంది. ఇలా ఒక్కో సన్నివేశంతో రాజన్నలోని ఒక్కో గుణాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. గ్రామంలోని ఓ ఇంట్లో భోజనం చేయటం, హస్పిటల్లో వైఎస్ఆర్ కళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాలొదలటం, మార్కెట్లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో వైఎస్ఆర్ మాట్లాడటం లాంటి సీన్స్ గుండె బరువెక్కేలా చేస్తాయి. రెగ్యులర్ బయోపిక్లా కేవలం కథ చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. ప్రతీ ప్రేక్షకుణ్ని పాదయాత్రలో భాగం చేశాడు. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అక్కడక్కడ పొలిటికల్ సెటైర్లు కూడా బాగా పేలాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర పెద్దల ఆహార్యం, వారి డైలాగ్స్ సినిమాకు కామెడీ టచ్ ఇచ్చాయి. ఇక అప్పటి సంఘటనలకు తగ్గట్టుగా ‘బ్రీఫ్డ్ మీ’ డైలాగ్ను జోడించిన సన్నివేశం నవ్వులు పూయించింది. కె అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుడికి మరింత దగ్గర చేశాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటాయి. సినిమాకు మరో ప్రధాన బలం సిరివెన్నెల సీతారామశాస్త్రీ అందించిన సాహిత్యం. ఆయన అందించిన పాటలు వైఎస్ వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో ఆవిష్కరించాయి. చివర్లో వచ్చే పెంచల్దాస్ పాట ప్రతీ ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తుంది. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్లో వచ్చే వైఎస్ రాజశేఖర్రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్ఆర్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ కదిలిస్తుంది. మరోసారి ఆ చీకటి రోజును గుర్తుచేస్తుంది. యాత్ర తెలుగు రాజకీయాలను మలుపు తిప్పిన ఓ మహత్తర ఘట్టానికి సాక్ష్యం. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం. సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
970 స్క్రీన్స్లో వెండితెర యాత్ర
మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ విశేషాలు. ► ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి హిట్ చిత్రాల తర్వాత 70 ఎంఎం బ్యానర్లో 3వ చిత్రంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘‘ఈ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి వైఎస్గారి అభిమానుల్లోనే కాదు.. సాధారణ ప్రజల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం.. ఓ మహానేత చరిత్ర తెరకెక్కించటం. వైఎస్గారిని ఎలా చూపించనున్నారు? సినిమా పాజిటివ్గా ఉంటుందా? లేక నెగటివ్గా ఉంటుందా? అనే సందేహాలు ఒకవైపు. అసలు ‘యాత్ర’ ఇప్పడు తీయాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల స్టంటా? వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి సపోర్ట్గా తీస్తున్నారా? వంటి ప్రశ్నలు మరోవైపు. వీటన్నింటికీ ఈ రోజు ‘యాత్ర’ సినిమా సమాధానం చెబుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ► 970 స్క్రీన్స్లో భారీ ఎత్తున ‘యాత్ర’ విడుదలయింది. సాధారణంగా ఒక సినిమా హీరో బయోపిక్ లేదా బిగ్ కాస్టింగ్తో తీసిన సినిమాలు ఇంతటి భారీ స్థాయిలో రిలీజ్ కావటం చూశాం. కానీ, తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి బయోపిక్ తీస్తే ఒక్క ఓవర్సీస్లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్లో ఈ చిత్రం విడుదలవటం చూస్తే ‘యాత్ర’పై తెలుగు ప్రజల క్రేజ్ ఏంటో తెలుస్తోందని, అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన లభిస్తోందని నిర్మాతల్లో ఒకరైన విజయ్ చిల్లా చెప్పారు. ► ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ... జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ అంటూ అధిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి పాదయాత్ర చేసిన వైఎస్గారు జననేతగా, మహానేతగా, పేద ప్రజల గుండె చప్పుడుగా పదిలమైన చోటు సంపాదించుకున్నారు. వైఎస్గారి పాదయాత్ర 68 రోజులు జరిగింది. యాదృచ్ఛికంగా ‘యాత్ర’ షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తికావటం ఆ పెద్దాయన ఆశీస్సులుగా టీమ్ భావిస్తున్నారు. ► వైఎస్గారి రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ ‘యాత్ర’. పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ల ఆవేదనలు, ప్రతి ఒక్కరి భావోద్వేగాలని రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రంలో కీలక భాగం. రాజకీయాలు లేని రాజకీయ నాయకుడి కథే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే కష్టం ఎవరికైనా కష్టమే. అందుకే ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ని తెలుగుతోపాటు భారతదేశం మొత్తం విడుదల చేశాం. ఎమోషనల్ కంటెంట్తో ఉన్న ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడు బరువైన గుండెతో థియేటర్స్ నుంచి బయటకి వస్తారు. ► మహి చెప్పిన ‘యాత్ర’ కథలోని పాత్రలు, వాటి కష్టాలు మమ్ముట్టిగారిని కలచి వేశాయి. ఆ తర్వాత ఆయన వైఎస్గారి గురించి పూర్తిగా తెలుసుకుని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ‘ఇది రాజకీయ నాయకుడి కథ మాత్రమే కానీ, రాజకీయాలు ఉండవు.. ప్రజల కష్టాలు, రైతుల బాధలు ఉంటాయి.. ఇవన్నీ భారతదేశం అంతటా ఉంటాయి. ఏ రైతుని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా వారి కష్టాలు చెప్తారు’ అని మమ్ముట్టి చెప్పారు. ‘యాత్ర’లో ఆద్యంతం ఎమోషన్తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ఫ్యామిలీ ఎమోషన్స్ని దర్శకుడు చూపించారు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని నిర్మాతలు అన్నారు. ► ‘‘యాత్ర’ సినిమా చేయాలనుకున్నప్పటి నుంచి విడుదల వరకూ వైఎస్ జగన్గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా అభ్యంతరాలు పెట్టలేదు సరికదా కనీసం కథ వివరాలు కూడా అడగలేదు. దర్శకుడికి, ప్రొడక్షన్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జగన్గారి గొప్పతనానికి నిదర్శనం. ఇటీవల జగన్గారిని మహి కలిసినప్పుడు.. ‘మీ నాయకుడి చిత్రం మీరు తీస్తున్నారు.. ఆయన గురించి మీకే బాగా తెలుసు.. నాన్నగారు చేసిన పనులు చెప్పండి చాలు’ అని జగన్గారు సున్నితంగా చెప్పటం మా యూనిట్కి నూతనోత్సాహం కలిగించింది. ఇందుకు జగన్గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అన్నారు. -
యాత్ర బుకింగ్లు చూస్తుంటే హ్యాపీ
‘‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఓ ఎగై్జట్మెంట్ కనిపించింది. మా విజయ్కి, మహికి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘యాత్ర’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓపెనింగ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ సినిమాకి రెవెన్యూ పరంగా మంచి మ్యాజిక్ జరుగుతుంది. ఫస్ట్ మంచి ఓపెనింగ్స్ రావాలి.. ఆ తర్వాత మంచి టాక్ రావాలి. ఓ సినిమాకి ఓపెనింగ్స్ అన్నవి ఎప్పుడూ ముఖ్యమే.. కానీ ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అంటే మెల్లిగా ఓపెనింగ్స్ పెరిగేవి. ఇప్పుడు అలా లేదు.. మంచి ఓపెనింగ్స్ వస్తేనే సినిమా. ‘యాత్ర’ అడ్వాన్స్ బుకింగ్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని నైజాం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ విడుదల చేస్తోంది. వైఎస్గారి పాదయాత్ర మూమెంట్స్ని ఆ రోజుల్లో టీవీల్లో చూడటం, పేపర్లో చదవటమే. పాదయాత్రతో ఆయన హీరో అయిపోయారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనాలకోసం ఏదైనా చేస్తాను అని పాదయాత్ర ద్వారా చూపించారాయన. ఎన్టీ రామారావుగారి తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వైఎస్గారికే అంత ఇమేజ్ వచ్చింది.అలాంటి ఆయన నేపథ్యంలో వస్తున్న ఈ ‘యాత్ర’ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘యాత్ర’ కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. రేపు విడుదలవుతోందంటే చాలా ఎగై్జటింగ్గా, సంతోషంగా ఉంది. వైఎస్గారు రాజకీయ నేత కావొచ్చు.. సినిమాలో రాజకీయాలు ఉండొచ్చు.. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా కాదు. ఎటువంటి వివాదాలు లేవు. ఈ సినిమా మొత్తానికి సోల్ అండ్ స్పిరిట్ వైఎస్గారే. సినిమా చూడండి.. నచ్చితే ఇతరులకు చెప్పండి. ఇది కేవలం ఆయన అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించేవారెవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు’’ అన్నారు. ‘యాత్ర’ సినిమాను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి వి. రాఘవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కథను చెప్పడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఆయన కుటుంబం, అభిమానుల నుంచి మాకు అమితమైన ఆదరణ లభించడం గొప్ప విషయం. చిత్రబృందం చాలా కష్టపడింది. దీన్ని మరో సినిమాతో పోల్చి.. ఓ రేస్లా చేయకండి. వైఎస్సార్ ప్రయాణంలా భావించి సెలబ్రేట్ చేసుకుందాం’. ‘ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ ఈ నేలతల్లి బిడ్డలు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవపర్చడానికి కారణాలు కాకూడదు. నాకు వైఎస్సార్, చిరంజీవిగార్లపై ఉన్న ఇష్టం, అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు. మనకు స్ఫూర్తినిచ్చిన వారి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. అదే మనం వారికిచ్చే గొప్ప నివాళి’. ‘మా ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది. నిజాయతీగా మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఈసారి ఇంకా మంచి కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
వైఎస్ ‘యాత్ర’లో పాల్గొనండి!
మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలతో లబ్ధి పొందని తెలుగు ప్రజలంటూ దాదాపుగా ఉండరు. ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక సహాయాన్ని, ప్రయోజనాన్ని పొందే ఉంటారు. ఫీ రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత్ విద్యుత్లాంటి వినూత్న పథకాలతో వైఎస్సార్ తన పాలనలో ప్రజలపై చెరగని ముద్ర వేశారు. మహానేత మరణించి ఇన్నేళ్లైనా.. జనం గుండెళ్లో ఆయనపై ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. చిరంజీవిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రజలతో కలిసి, వారితో నడిచి, కన్నీళ్లను తుడుస్తూ.. చేపట్టిన పాదయాత్ర.. రాజన్ననను ప్రజలకు మరింత దగ్గర చేసింది. అప్పటి పాదయాత్ర స్మృతులతో పాటు ఎన్నో ఘటనలను యాత్ర పేరుతో వెండితెరపై ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ - యాత్ర సినిమాను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. రాజన్న ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందారు? ఆయనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీకు కలిగిన అనుభం, సందర్భాన్ని గురించి నాలుగు విషయాలను కింద పేర్కొన్న ఈ మెయిల్ కు పంపించండి. (టికెట్లు అందజేయడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా ఈ కాంటెస్ట్ హైదరాబాద్లో నివసిస్తున్న వారికి మాత్రమే పరిమితం) వైఎస్ తో ఉన్న మీ అనుబంధం, అనుభవాన్ని పంచుకోవడానికి మీరు చెప్పే సందర్భం, సన్నివేశం వివరాలతో పాటు మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తో సహా info@sakshi.com కు మెయిల్ చేయగలరు. ఈ కాంటెస్ట్లో పాల్గొన్నవారిలో కొందరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. కాంటెస్ట్లో పాల్గొనండి. టిక్కెట్లు పొందండి. -
వేలంలో ‘యాత్ర’ టికెట్ ఎంత పలికిందంటే..?
సియాటెల్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు. అమెరికాలోని సియాటెల్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్ను గెలుచుకున్నారు. వైఎస్సార్ మీద అభిమానంతో మునీశ్వర్ రెడ్డి యాత్ర టికెట్ బిడ్డింగ్ రూపంలో కొన్నారు. అయితే టికెట్ ధర 12 డాలర్లు మాత్రమే నిర్మాతలు తీసుకుని మిగతా మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు సహాయంగా ఇస్తామని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సినిమాస్ వారు తెలిపారు. ప్రీమియర్ షోలు అధికంగా వేసి, టికెట్ రేట్లు పెంచుకుని జేబులు నింపుకుంటున్న నిర్మాతలు ఉన్న ఈ రోజుల్లో, వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చిన యాత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డిలను కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు అభినందించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 8న యాత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జైత్ర యాత్ర మమ్మూట్టీ ప్రత్యేక ఇంటర్వ్యూ