migrant workers
-
ఇది చట్టబద్ధ హత్య!
పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసపోయే కార్మికుల విషాద గాథలు మనకు కొత్తగాదు. జీవితాలు సవ్యంగా వెళ్తే సరేగానీ... ఒకసారంటూ సమస్యల్లో చిక్కుకుంటే అక్కడ నరకం చవి చూడక తప్పదని తరచు వెల్లడయ్యే ఘోర ఉదంతాలు చెబుతాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబూధాబీలో చేయని నేరానికి ఉరికంబం ఎక్కిన ఉత్తరప్రదేశ్ యువతి షెహజాదీ ఉదంతం మరింత దారుణమైనది. నాలుగు నెలల శిశువును హత్య చేసిందని ఆరోపిస్తూ మోపిన కేసులో ఆమె వాదనలన్నీ అరణ్య రోదనలు కాగా చివరకు గత నెల 15న అక్కడి ప్రభుత్వం ఆ యువతి ఉసురు తీసింది. జవాబుదారీతనం ఏమాత్రం లేని వ్యవస్థలతో నిండిన యూఏఈలో వలస కార్మికులకు వీసమెత్తు విలువుండదు. వారి ప్రాణాలకు పూచీ ఉండదు. కానీ మన దేశం నుంచి వలసపోయే వారిలో అత్యధికులు ఎంచుకునేది యూఏఈనే. ఒక లెక్క ప్రకారం అక్కడ 35 లక్షలకు పైగా భారతీయ వలస కార్మికులున్నారు. ఆ దేశ జనాభాలో వీరి వాటా దాదాపు 33 శాతం. ఈ కార్మికుల్లో అత్యధికులు నివసించేది అబూధాబీలోనే. వలస కార్మికుల రక్షణ కోసం మన దేశం చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా అవి చాలినంతగా లేవు. మనకు యూఏఈతో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలున్నాయి. ప్రవాసీ బీమా యోజన కింద తప్పనిసరి ఇన్సూరెన్స్ పథకం ఉంది. కార్మికుల హక్కులు కాపాడటానికీ, వలసల క్రమబద్ధీకరణకూ ఈ–మైగ్రేట్ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ షెహజాదీని కాపాడలేకపోయాయి. చిన్ననాడు ముఖంపై కాలిన గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించుకోవాలని ఆరాటపడి ఆమె ఒక మాయగాడి వలలో చిక్కుకుంది. యూఏఈలో ఉన్న తన బంధువుల ద్వారా అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని అతగాడు నమ్మించి షెహజాదీ నుంచి రూ. 3 లక్షలు, బంగారు నగలు తీసుకుని ఆమెను 2021 చివరిలో అబూధాబీకి పంపాడు. శస్త్రచికిత్స మాట వదిలి ఒక ఇంట్లో పని మనిషిగా చేర్చాడు. ఆ ఇంటి యజమాని భార్య ఒక శిశువుకు జన్మనిచ్చాక అదనంగా శిశు సంరక్షణ భారం కూడా పడింది. నాలుగు నెలలున్న శిశువు వ్యాక్సిన్ వికటించి మరణిస్తే షెహజాదీపై హత్యా నేరం మోపారు. 2022 డిసెంబర్లో ఈ ఘటన జరిగిన నాటి నుంచీ దర్యాప్తు పేరుతో ఆమెను జైలు పాలు చేసిన పోలీసులు 2023 ఫిబ్రవరిలో లాంఛనంగా అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తంతు నడిపించి ఆమెను దోషిగా తేల్చారు. ఈ క్రమమంతా మన ప్రభుత్వ యంత్రాంగం, యూఏఈలోని మన రాయబార కార్యాలయం ఏం చేశాయన్నదే ప్రశ్న. శిశు మరణానికి కారణం స్పష్టంగా కనబడు తోంది. ఒక్కోసారి వ్యాక్సిన్లు శిశువులకు ప్రాణాంతకం కావటం అసాధారణమేమీ కాదు. ఆ మరణం వ్యాక్సిన్ వల్ల జరిగిందా లేక షెహజాదీయే శిశువుకు హాని తలపెట్టిందా అన్నది పోస్టు మార్టం జరిపితే వెల్లడయ్యేది. కానీ ఆ శిశువు తండ్రి అందుకు ఒప్పుకోలేదట. కనుక షెహజాదీని కోర్టులు దోషిగా నిర్ధారించాయి! సరైన ప్రయత్నాలు జరిపివుంటే న్యాయం జరిగేదేమో! రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని అన్ని స్థాయుల్లోనూ మొరపెట్టుకుంటూనే ఉన్నామని, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నామని కానీ సరైన స్పందన లేదని షెహజాదీ తండ్రి షబ్బీర్ ఖాన్ అంటున్నారు. ఆఖరికి తమ కుమార్తె బతికుందో లేదో చెప్పమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప నిజమేమిటో వెల్లడి కాలేదు. శస్త్ర చికిత్స కోసం వెళ్లిన యువతిని బలవంతంగా పనికి కుదుర్చుకోవటమేగాక ఆమెపై హత్యా నేరం మోపటం, కింది కోర్టు విధించిన శిక్షను ఉన్నత న్యాయస్థానం కనీస ఆలోచన లేకుండా ఖరారు చేయటం అమానవీయం. ప్రభుత్వం అంతకన్నా బాధ్యతారహితంగా వ్యవహరించింది. గత నెల 15న మరణశిక్ష అమలు చేయగా, 17న రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు సైతం కేసును పరిశీ లిస్తున్నామన్న జవాబే ఇచ్చింది. మరణశిక్ష అమలైనట్టు 28నగానీ మన రాయబార కార్యాలయానికి చెప్పలేదు. కేసు విషయంలో చేయగలిగిందంతా చేశామని మన విదేశాంగ శాఖ వివరిస్తోంది. ఆమె తరఫున క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయించామని, చట్టాలు కఠినంగా ఉండటంతో కాపాడలేక పోయామని అంటున్నది. కానీ రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం, ఇతరత్రా హక్కుల సంఘాల దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. ఉసురు తీసేముందు చివరి కోరికగా తల్లిదండ్రులతో మాట్లాడించినా అది రెండు నిమిషాల ముచ్చటే అయింది. సంపన్నవంతమైన దేశంలో కాయకష్టం చేస్తే మంచి సంపాదన ఉంటుందని భావించి చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. కానీ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అత్యంత దారుణమైన పరి స్థితుల్లో పనిచేయాలని, అక్కడ అమల్లోవున్న కఫాలా వ్యవస్థ ప్రకారం వారి వీసాలు యజమానులకు అనుసంధానించి వస్తాయని, దిగినవెంటనే వారు పాస్పోర్టులు స్వాధీనం చేసుకుంటారని, అందువల్ల మరోచోట పని వెదుక్కోవటం అసాధ్యమని చాలామందికి తెలియదు. అధిక గంటలు పనిచేయించుకోవటం, వేతనాలు ఎగ్గొట్టడం, సామాజిక భద్రత పథకాలు లేకపోవటం వలస కార్మి కుల బతుకును దుర్భరం చేస్తోంది. ఈ విషయంలో యూఏఈతో మాట్లాడి తగిన చట్టాలు అమలయ్యేలా చూడటం, అక్కడ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న మన కార్మికుల వివరాలు ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావటం అవసరమని చెప్పాలి. వలసపోయే కార్మికులకు అక్కడ పొంచివుండే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలి. షెహజాదీని కాపాడుకోలేక పోయినా, ఆ స్థితి మరెవరికీ రాకుండా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
వలస కార్మికుల మృత్యు ఘోష
మోర్తాడ్ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణించాడు. వారం రోజుల కిందనే ఒమన్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజన్న అనే వలస కార్మికుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై బ్రెయిన్డెడ్తో మృత్యువాత పడ్డాడు. ఇలా గల్ఫ్ దేశాల్లో తెలంగాణ (Telangana) జిల్లాలకు చెందిన వలస కార్మికులు అనారోగ్యం, మానసిక ఒత్తిడితో గుండెపోటుకు గురై చనిపోతూనే ఉన్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఏడాది కాలంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతర్, ఒమన్ (Oman), బహ్రెయిన్, కువైట్, ఇరాక్లలో దాదాపు 200 మంది వలస కార్మికులు వివిధ కారణాలతో మరణించారు. గతంలో కంటే మరణాల సంఖ్య రెండేళ్ల నుంచి పెరగడంతో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించకపోవడంతోనే ప్రమాదం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది.అంపశయ్యపై ప్రవాసీల ఆరోగ్యంగల్ఫ్ దేశాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వలస కార్మికుల్లో అత్యధికులు తక్కువ నైపుణ్యం గల అల్పాదాయ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తాము పని చేసేచోట అనారోగ్యం పాలైతే ఖరీదైన వైద్యం అందుకోలేని దుస్థితిలో ఉన్నారు. వైద్య ఖర్చులను భరించలేక ఎడారి దేశాల్లో వలస కార్మికులు మృత్యువాత పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎల్లలు దాటి విదేశాలకు వలస వెళ్లిన వారికి అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఆరోగ్య హక్కు ఉన్నా దీనిపై అవగాహన లేకపోవడం, విదేశాంగ శాఖ దృష్టి సారించకపోవడం, కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యంతో వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణ గాలిలో దీపంలా మారింది.చదవండి: ఆదిలాబాద్ కా అమితాబ్ అధిక పనిగంటలు, తీవ్ర ఒత్తిడి, విశ్రాంతి లేకుండా జీవనం సాగిస్తుండటంతో వలస కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు. గడిచిన రెండు నెలల్లో 20 మంది బ్రెయిన్డెడ్తో మరణించినట్లుగా నమోదవడం గమనార్హం. పనిచేసే చోట భద్రత లేకపోవడం, నైపుణ్యం లేక ప్రమాదాలకు గురి కావడం వలస కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది.ప్రవాసీ బీమాలో ‘ఆరోగ్యం’కరువు దేశం నుంచి గల్ఫ్తో సహా 18 దేశాలకు వలస వెళ్తున్న ఈసీఆర్ కేటగిరీ (10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన) వారికి భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం తప్పనిసరి విధానంలో అమలు చేస్తుంది. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్న ఈ బీమా పథకంలో ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన అంశం లేకపోవడంపై కార్మిక సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల అనారోగ్య మరణాలు, ఆత్మహత్యలను నిరోధించడానికి విదేశాంగ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు. -
తిరుగు వలసలు చెబుతున్నదేమిటి?
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.వ్యవసాయంలోనే ఉపాధి‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు. భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
ఉపాధికి అడ్డ.. భువనగిరి గడ్డ
సాక్షి, యాదాద్రి: ఒకప్పుడు వలసలకు కేంద్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు వలస కార్మికులకు ఉపాధి అడ్డాగా మారింది. ఉపాధి లేక ముంబై, భివండీ, సోలాపూర్, బెంగళూరు, ఆంధ్ర, సూరత్ వంటి పట్టణాలకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి నిరంతరం వలసలు సాగేవి. కానీ ఇప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, గృహనిర్మాణ రంగాలు పుంజుకోవడంతో వివిధ రకాల పనులు ఊపందుకున్నాయి. దీంతో కూలీల కొరత నెలకొనడంతో జిల్లాకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్మికులు వలసవచ్చి ఉపాధి పొందుతున్నారు.30 వేల మందికి పైగా.. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన వేలమంది జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యాదాద్రి జిల్లాకు రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండటంతో కార్మికులు నేరుగా చేరుకుంటున్నారు. జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో 30 వేలకు పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు పలు రకాల పనులు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్లులు, హోటళ్లు, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, టైల్స్, పీవోపీ, పౌల్ట్రీ, ఎయిమ్స్, కంపెనీలు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. చౌటుప్పల్, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్మిల్లులు, భవన నిర్మాణ పనులు, వ్యవసాయంలో నాట్లువేయడం, పత్తి ఏరడం తదితర పనులు చేస్తున్నారు. బార్బర్ పని, హోటళ్లలో మాస్టర్లు, వెయిటర్లు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రం కార్మికులది ఒక్కో ప్రత్యేకత బిహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేస్తుండగా.. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారు భవన నిర్మాణంలో తాపీ మేస్త్రీలుగా, పార కూలీలుగా.. రాజస్తాన్ నుంచి వచ్చిన వారు హోటళ్లు, పీవోపీ, హార్డ్వేర్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు పత్తి ఏరడం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారు పొలంలో నాట్లు వేయడం లాంటి పనులు చేసి జీవనోపాధి పొందుతున్నారు.అధికంగా రైస్ మిల్లుల్లో.. ఒక్కో రైస్ మిల్లులో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక గుంపునకు ఒక ముఠామేస్త్రి కార్మికులను సూపర్వైజ్ చేస్తారు. అందరికంటే ముఠామేస్త్రికి కాస్త కూలి ఎక్కువగా ఉంటుంది .రైస్ మిల్లుల్లో మిల్లు డ్రైవర్, ప్లాంటు డ్రైవర్, హమాలీలుగా పని చేస్తారు. మిల్లు ప్లాంటు, డ్రైవర్లకు రోజుకు సుమారు రూ.800 కూలి పడుతుంది. మిల్లుకు వచ్చే లారీల ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, హమాలీ కార్మికులు చేస్తారు. వీరికి రోజుకు సుమారు రూ.500 కూలి పడుతుంది. మిల్లు యజమానులు వీరికి భోజనం, వసతి కల్పిస్తారు. అడ్వాన్స్లు చెల్లించి మరీ.. పలు గ్రామాల్లో గల ఇటుక బట్టీల్లో సుమారు 6,000కుపైగా ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల పనుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించి ఇటుక బట్టీ యజమానులు పనులకు తీసుకువస్తారు. ఒక్కో వ్యక్తికి వారానికి రూ.వెయ్యి చొప్పున కిరాణా సరుకుల కోసం ఖర్చులు ఇవ్వడంతో పాటు వారు చేసిన పనులను బట్టి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు అడ్వాన్స్లో కటింగ్ చేస్తారు. ఒడిశా కూలీలు తాము తీసుకున్న అడ్వాన్స్కు సరిపోను ఈ నాలుగు నెలల కాలంలో పనులు చేస్తారు.చదవండి: రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు.. ఎమ్మెల్యే కాటిపల్లిబెంగాల్ నుంచి వచ్చాను మాది పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గొసాబా. మా రాష్ట్రంలో పనులు లేవు. ఉపాధికోసం భువనగిరికి వచ్చాం. తిండి, వసతి ఖర్చులు లేకుండా పనిచేసే గ్రామాల్లోనే షెల్టర్ వెతుక్కుంటున్నాం. ఒక్కొక్కరం రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తాం. దాదాపుగా రెండు నెలల పాటు పనులు చేసి తిరిగివెళ్తాం. కుటుంబ పోషణ చూసుకుని మరో సారి వస్తాం. ఇలా సంవత్సరానికి రెండు మూడుసార్లు వస్తాం. ఇక్కడ పనులకు కొరతలేదు. – దాలీమ్షేక్, పశ్చిమబెంగాల్మూడు నెలలు ఇక్కడే మా రాష్ట్రం ఛత్తీస్గఢ్లో సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో ఒక సీజన్లో కూడా పని దొరకదు. సాగు అంతంత మాత్రమే. అందుకే మేమంతా తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడ మాకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఏడాదిలో మూడు నెలలు ఇక్కడే ఉంటాం ధాన్యం ఎత్తడం, దించడం వంటి హమాలీ కూలి పని చేస్తాం. ఉప్పరి మేస్త్రీ పనికి వెళ్తాం. – మహబూబ్ ఆలమ్, ఛత్తీస్గఢ్ఇక్కడ ఉపాధికి కొదవలేదు ఇక్కడ ఉపాధికి కొదవ లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాం. రెండు నెలలు ఇక్కడ పని చేసుకుంటాం. రోజుకు ఖర్చులు పోను రూ.500 సంపాదిస్తాం. హమాలీ, మేస్త్రీ, ఇతర పనులు చేస్తాం. పనులు పూర్తి అయిన తర్వాత వెళ్లిపోతాం. మాకు భోజనానికి బియ్యం, ఉండటానికి ఇళ్లు, తాగునీరు, వైద్య సౌకర్యం, వసతులు పని ఇచ్చే వారే చూసుకుంటారు. ఉమ్మడి స్నేహితులతో కలిసి వస్తాం పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం. – అన్వర్, మహారాష్ట్రరోజుకు రూ.1,000 సంపాదిస్తున్న జీవనోపాధి కోసం ఒడిశా నుంచి యాదగిరిగుట్టకు వచ్చాం. దాదాపు సంవత్సరం అవుతోంది. ఇక్కడ బిర్యానీ హోటల్లో పనిచేస్తూ బతుకుతున్నాను. రోజుకి రూ.1,000 సంపాదిస్తున్నాను. ప్రస్తుతం అయితే డబ్బుల కోసం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.– జాకీర్, ఒడిశాఇక్కడే ఆరు నెలలు ఉపాధి మా రాష్ట్రంలో పనులు దొరకవు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. జిల్లాకు ఏటా వచ్చి రైసు మిల్లులో పనిచేస్తా. ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉంటా. వారానికోసారి సేటు పైసలు ఇస్తరు. నా ఖర్చులకు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపిస్తాను. ఇక్కడా బాగా వుంది. – బాబులాల్, బిహార్ -
ఉచితాలతో ఇంకెంతకాలం?
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయం నుంచి వలస కార్మికులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఉచితాలను ఇంకా ఎంతకాలం ఇస్తారంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగావకాశాల కల్పన, సామర్థ్యాల పెంపుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచిత/సబ్సిడీ రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపగా..దీనర్థం పన్ను చెల్లింపుదార్లను మాత్రమే మినహాయించారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలపై సుమోటోగా దాఖలైన పిటిషన్పై ఎన్జీవో తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇ–శ్రమ్ పోర్టల్ నమోదైన వలస కార్మికులందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని కోరారు. స్పందించిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘వలస కార్మికులందరికీ ఉచితంగా రేషనివ్వాలని రాష్ట్రాలను మేం ఆదేశిస్తే ఒక్కరు కూడా ఇక్కడ కనిపించరు. ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి, రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డులను జారీ చేస్తాయి. అసలు సమస్య ఇదే’అని ధర్మాసనం పేర్కొంది. వలస కార్మికుల సమస్యలపై సవివర విచారణ జరపాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 8వ తేదీన వాయిదా వేసింది. -
18 ఏళ్ల తరువాత.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు
సాక్షి, సిరిసిల్ల: సుదీర్ఘ కాలం దుబాయ్ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో జైలు నుంచి విడుదలైన వీరికి ఆయనే సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన సిరిసిల్లకు చెందిన దండుగుల లక్ష్మణ్ రెండు రోజుల క్రితం విడుదలైన రుద్రంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. పెద్దూరు గ్రామానికి చేరుకున్న శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు కార్మికులు మంగళవారం సిరిసిల్లకు చేరుకున్నారు. వచ్చే నెలలో చందుర్తికి చెందిన మరో కార్మికుడు వెంకటేశ్ జైలు నుంచి విడుదలై తిరిగి రానున్నానడు. కమ్యూనికేషన్ సమస్య వల్ల దుబాయ్ జైల్లో మగ్గిపోయిన వీరిని విడిపించేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దుబాయ్లో జైలు పక్షులుగా మారిన సిరిసిల్ల వాసులు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం కనీళ్లు, ఆనంద భాష్పాలతో కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. ఇదీ చదవండి.. రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు -
Pongal: భాగ్యవంతులొస్తున్నారు..
ఆశలు మూటలు నెత్తిన మోస్తూ గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ భాగ్యవంతులు వస్తున్నారు. ఇంకో వారంపదిరోజుల్లో హైదరాబాద్, బెజవాడ..గుంటూరు..నెల్లూరు..నల్గొండ.. ఈస్ట్..వెస్ట్.. జిల్లాలనుంచి వేలమందిని మోసుకుంటూ రైళ్లు బస్సులు మన్యం జిల్లాకు వస్తుంటాయి. వాళ్లంతా వలసకూలీలని సామాజికవేత్తలు అంటుంటారు కానీ నాలాంటి అల్ప సంతోషులు మాత్రం వాళ్ళను భాగ్యవంతులు అంటారు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదలని మేధావులు అంటారు. నాలాంటి సామాన్యులు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులని అంటాం భోగి ముందురోజు రాత్రి ఐడ్రా బాడ్ నుంచొచ్చిన అప్పలనాయుడు, లక్ష్మీ, నాయుడి వీరకాడు నారాయణ, ఇరుగుపొరుగు వట్టిగడ్డి కుప్పేసి దమట ముట్టించి సుట్టూ కూకుని కవుర్లు మొదలెట్టారు.. మరేటిబావా ఐడ్రాబాడ్లో అంతా బాగున్నట్టేనా అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మీ అందుకుని.. పర్లేదన్నియ్యా ఇద్దరం డూటీకి వెళ్తాం..మాతోబాటే మా మహేసూ వస్తాడు.. ముగ్గురికి బాగానే వస్తాది అదోరం సెలవు.. ఒకలి జీతం అద్దికి.. ఖర్చులకు పోయినా రెండు జీతాలు మిగుల్తాయి.. మరి దాంతోటే కదా ఈ ఇల్లు పునాదులు రేకులు వెయ్యడం.. పెద్దదాని పెళ్లి అప్పు లచ్చన్నర తీర్చడం..చిన్నదాన్ని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అంతలోనే లక్ష్మీ మళ్ళీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నియ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు కౌసు ఉండాలి అంటున్నప్పుడు ఆరేడేళ్ళు క్రితం ఇదేఊళ్ళో అడ్డిడు బియ్యం.. తవ్విడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోన్లేర్రా ఊళ్ళో అయినోళ్ళ ముందు చెడి .. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింది వదిన చేటలో చెత్త పెంటమీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ నచ్చిమొదినా చెవులోవి కొత్తవా ఏటీ అన్నాది. వెంటనే లక్ష్మీ మొహాన్ని సంతోషం కమ్మేయగా..అవును మంగొదినా ఇన్నాళ్లకు ఆర్తులం సెయిను, ఆర్తులం జూకాలూ చేయించాడు మీ అన్నియ్య అని చెబుతూ భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జూకాలు మరింత మెరుస్తూ కనిపించాయి. ఇదిగో ఈ సీర్లన్నీ సీఎమ్మారులో కొనేసామ్ ఒకేసారి అంటున్నప్పుడు అప్పట్లో పాతచీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మీ గొంతులో మాకిప్పుడా అవసరం లేదన్న భరోసా వినిపించింది.. మొన్నామధ్య యాదగిరి వెళ్ళాము. తిరప్తి కన్నా పెద్దది తెలుసా.. ఇంతంత కాదని చెబుతున్నపుడు మేం విహారయాత్రలకూ వెళ్తాం..మేం అప్పట్లా లేం.. అనే ధీమా ముప్పిరిగొంటుంది. పాత్రల పేర్లు మారతాయేమో కానీ పార్వతీపురం డివిజన్లోని ప్రతిగ్రామంలోనూ ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఆరేడేళ్ళ క్రిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్..బస్సు ఎక్కి.. ఆ జిల్లాలకు వెళ్లాయి. రైస్ మిల్లులు..నూలు మిల్లులు..టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు..చేపలు..రొయ్యల చెరువులు..ఫామ్ హవుసులు.. కోళ్లఫారాలు..డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయారు.. పాపం అమాయకులు..నిజాయితీగా ఒళ్ళోంచి పనిచేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇష్టులైపోయారు. చాలామందికి..చిన్నపాటి షెడ్.. ఇల్లు..రేషన్ కూడా యజమానులే ఇస్తారు..ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్ళు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్ళకే స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లు లేకపోవచ్చు..లక్షలూ అక్కర్లేదు. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది..తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది. ఓపికున్నన్నాళ్లు చేద్దాం..ఊళ్ళోకొచ్చి మాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం ..ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్నీ కోణాలూ..అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచినవాళ్ళు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ళ జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసిపట్టుకుని అలాక్కాడు.. మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు సామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్ళెవరూ పేదలు కారు...అవును పేదలు కారు...అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి..శ్రమ ఉన్నచోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి..ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు... శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం. గాంధీ... విజయనగరం -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు. ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
లోకల్ టచ్చిస్తారా..నేషనల్ నచ్చేస్తారా?
వేలల్లో పరిశ్రమలు. లక్షలాదిమంది కార్మికులు.. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలతో సందడి..అన్ని భాషలు, సంస్కృతుల సమ్మేళనం.. వెరసి మినీ ఇండియా పేరుగాంచింది మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా. మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. వారిదే ప్రధాన భూమిక శ్రామికుల రాజధానిగా పేరుగాంచిన మేడ్చల్ జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై శ్రామిక ఓటర్లు ప్రభావం చూపనున్నాయి. ఈ జిల్లా జనాభాలో 40 శాతం మంది శ్రామికులే ఉన్నారు. జిల్లాలో మొత్తం శ్రామికులు 2,26,939 మంది ఉండగా, వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వలస శ్రామికులు 1,80,326 మంది ఉన్నారు. జిల్లాలో రెండు మెగా పరిశ్రమలు, 71 భారీ పరిశ్రమలు, 3,760 మైక్రో , 2320 సూక్ష్మ, 16 మధ్యతరహా పరిశ్రమల్లో 77,862 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. ఇక ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన 599 సూక్ష్మ, చిన్న పరిశ్రమలతో 4,609 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లోని నివసిస్తున్న వీరంతా ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరి ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. అయితే వీరు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి. జాతీయ పార్టీలకు మద్దతిస్తారా.. లోకల్గా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడి పార్టీ కే పట్టం కడతారా అన్నది చూడాల్సిందే. సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ప్రధానంగా బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, అస్సోం, ప శ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఏయే కంపెనీలు ఉన్నాయంటే.. జీడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, శామీర్పేట్, మేడ్చల్ ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలతోపాటు ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మౌలాలి ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్, స్టీల్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కెమికల్, ఎల్రక్టానిక్స్ తరహా పరిశ్రమలు ఉన్నాయి. బాలానగర్ పారిశ్రామికవాడ పరిధిలో ఫ్యాన్లు తయారు చేసే కంపెనీలు, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, బీర్ మాన్యు ఫాక్చరింగ్ యూనిట్, ఫాబ్రికేషన్, వైర్ మెష్ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బీహెచ్ఈఎల్, ఆర్ అండ్ డీ, హెచ్ఎఎల్, ఐడిపిఎల్, ఎన్ఆర్ఎస్ఎ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఐడీఏ బాలానగర్, ఐడీఏ కూకట్పల్లి, సీఐఈ గాం«దీనగర్ ఒకే చోట ఉన్నాయి. ఇక శామీర్పేట్, మేడ్చల్ మండలాల్లో బయెటెక్, కెమికల్, విత్తన చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. -
బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకున్నాం
సాక్షి ప్రతినిధి కరీంనగర్/మోర్తాడ్/ఆర్మూర్: ఇజ్రాయెల్లో ఉన్న తెలంగాణ వలస కార్మికుల కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాలస్తీనా సరిహద్దుకు సమీప ప్రాంతంలో నివసిస్తున్నవారు ఇబ్బందులు పడుతుండగా, టెల్ అవీవ్ వంటి నగరాల్లో ఉన్నవారు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి ఏపీ నుంచి ఐదువేల మంది వరకు ఇజ్రాయెల్కు వలస వెళ్లారు. వీరిలో నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల తదితర జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది ఉన్నారు. విజిట్ వీసాలపై ఇజ్రాయెల్ వెళ్లిన చాలామంది అక్కడ ఇళ్లలో కార్మికులుగా పనులు చేస్తున్నారు. ఇజ్రాయెల్లోని రమద్గాన్ పట్టణం తలవిల ప్రాంతంలో చాలామంది తెలంగాణవారు ఉన్నారు. ఈ పట్టణం పాలస్తీనా సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనివారం సాయంత్రం నుంచి బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోందని తెలంగాణవాసులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ప్రభుత్వం బాంబుల దాడి సమయంలో సైరన్ మోగించడంతో వెంటనే ప్రతి అపార్ట్మెంట్లో ఉండే బాంబ్ సేఫ్టీ రూంలో తలదాచుకున్నామని చెప్పారు. తెలంగాణవాసులు కార్మికులుగా పనిచేసే ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగిన బాంబుదాడిలో ఓ భవనం ఆరో అంతస్తు శిథిలమైందని, ఇప్పటివరకు అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లికి చెందిన జలపతిరెడ్డి, గుండ సత్తయ్య, అనంతరెడ్డి, హబ్సీపూర్కు చెందిన ఏలేటి మల్లారెడ్డి, గుగ్గిల్ల లక్ష్మీనారాయణ, వరికోల నర్సయ్య, ఆదివారం రాత్రి అక్కడి పరిస్థితులను ‘సాక్షి’కి వివరించారు. టెల్అవీవ్లో సురక్షితం తెలంగాణకు చెందిన 600 మంది వలస కార్మికులు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలో ఉపాధి పొందుతున్నారు. హమాస్ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లోని వారికే ఎక్కువ ముప్పు ఉందని, ఇతర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని నిజామాబాద్ జిల్లానుంచి ఇజ్రాయెల్కు వలస వెళ్లిన కార్మికులు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. దాడులు మొదలైనప్పుడు కొంత ఆందోళనకు గురయ్యామని, మిలిటెంట్ల ఆగడాలను అరికట్టడానికి ఇజ్రాయెల్ రక్షణ విభాగం రంగంలోకి దిగి సరిహద్దు ప్రాంతాల్లోనే నిలువరించాయని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. రక్షణ చర్యలు చేపట్టారు ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరుల రక్షణకు చర్యలు చేపట్టింది. దాడులు జరుగుతున్న ప్రాంతం మా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం వల్ల తెలంగాణవారు పెద్దగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. – సోమ రవి, తెలంగాణ ఇజ్రాయెల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఉపాధిపై ప్రభావం ఉంటుంది కుటుంబాలను పోషించుకోవడానికి కోసం ఇక్కడకు వలస వచ్చాం. కోవిడ్ సమయంలో పనులు లేక ఇబ్బందిపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. – ఓంకార్, ఇజ్రాయెల్లో ఉన్న ఆర్మూర్ మండలం పిప్రివాసి -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగించకుండా స్టార్మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు. -
విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించిన కువైట్.. డ్రైవింగ్ లైసెన్స్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి విదేశీయులకు జారీ చేసిన లైసెన్స్లలో ఏకంగా 66 వేల లైసెన్స్లను రద్దు చేసింది. ఇంకా అనేక మంది లైసెన్స్లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలతో ఇతరులతో పాటు తెలుగు రాష్ట్రాల వలస కారి్మకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన అనేకమంది అరబ్బులకు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అలాగే సేల్స్మెన్ కమ్ డ్రైవర్లుగా కూడా అనేక మంది వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారికి జారీ చేసిన లైసెన్స్ల విషయంలో కువైట్ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సేల్స్మెన్లు కేవలం అదే పని చేయాలని, డ్రైవింగ్ ఎలా చేస్తారని ప్రశి్నస్తూ గతంలో జారీ చేసిన లైసెన్స్లను బ్లాక్ లిస్ట్లో ఉంచారని సమాచారం. మరోవైపు కంపెనీలను నిర్వహిస్తున్నవారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి డ్రైవింగ్ లైసెన్స్లను పొందారు. వీరి ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకుని సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్లను కొనసాగించనున్నారు. కొన్నేళ్ల కిందట డ్రైవింగ్ లైసెన్స్లను విచ్చలవిడిగా జారీ చేయడంతో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన కువైట్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుందని అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులు కొందరు వెల్లడించారు. దిద్దుబాటులో భాగంగా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మన కరెన్సీలో కనీసం రూ.1.50 లక్షల వేతనం ఉండాలనే నిబంధన అమలులోకి తీసుకువచ్చారు. తక్కువ వేతనం అందుకుంటున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసి ఉంటే దానిని రద్దు చేశారు. కాగా తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్ లైసెన్స్లు పొందినవారు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ -
తెలంగాణ వలస కార్మికుల షాక్! రూ.లక్ష జరిమానా కట్టి మీ దేశం వెళ్లండి!
సాక్షి, నిజామాబాద్: ఉపాధిని వెతుక్కుంటూ ఇరాక్ వెళ్లిన తెలంగాణ వలస కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో ఇంటికి చేరుకోవాలంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. అకామ లేకపోవడంతో ఎవరూ పనిఇవ్వడం లేదని, పార్కులలో తలదాచుకుంటూ అష్టకష్టాలు పడుతున్న తమకు జరిమానా చెల్లించే స్తోమత లేదని వలస కార్మికులు వాపోతున్నారు. ఎర్బిల్ పట్టణంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు సుమారు 20 మంది వరకు ఉండిపోయారు. గతంలో అకామ లేనివారిని ఇరాక్లో మన రాయబార కార్యాలయం అధికారులు జరిమానాను తప్పించి ఇంటికి పంపించారు. అలా వందలాది మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరుకున్నారు. కాగా కొంత మంది మాత్రం ఇంటికి రాకుండా ఇరాక్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇరాక్లో చట్టవిరుద్ధంగా ఉన్నవారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఇంటికి చేరుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ. వెయ్యి నుంచి 1,500 వరకు అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో రూ. లక్షకు పైగా) జరిమానా చెల్లిస్తేనే విదేశీ కార్మికులను వారి దేశాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ఇరాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో ఉన్న తాము జరిమానా చెల్లించి, విమాన టికెట్ను కొనేందుకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలని వలస కార్మికులు వాపోతున్నారు. మంచిర్యాల్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఇరాక్లో ఉండిపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇరాక్లోని వలస కార్మికులు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ను ఆశ్రయించగా సదరు సంస్థ ప్రతినిధులు విదేశాంగ శాఖను సంప్రదించారు. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ప్రవాసీ మిత్ర సంస్థ ప్రతినిధులు సమాచారం అందించారు. ఇంటికి రప్పించడానికి చొరవ తీసుకోవాలి... గడువు ముగిసిపోవడంతో మాకు పనివ్వడం లేదు. కరోనా వల్ల అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఇంటికి రావాలంటే జరిమానా చెల్లించడానికి మా వద్ద డబ్బులు లేవు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని వలస కార్మికులను ఇంటికి రప్పించాలి. -
నకిలీ వీడియో కేసు.. పోలీసుల కస్టడీలో యూట్యూబర్!
చెన్నై: తమిళనాడులోని బీహార్ వలస కార్మికులపై దాడులు చేశారంటూ నకిలీ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని మధురై కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం న్యాయస్థానం కశ్యప్కు మూడు రోజుల కస్టడీని విధించింది. మార్చి 18న జగదీష్పూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తర్వాత బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్ను అరెస్టు చేసింది. పోలీసుల ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్పై బీహార్ నుంచి తమిళనాడుకు తీసుకువచ్చింది. నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అతనిపై మధురైలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటీవల, తమిళనాడులో వలస కార్మికులపై దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్ట్ చెక్ కమిటీ, పోలీసు శాఖ ద్వారా ఈ వీడియోలు ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోల అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్గా తీసుకున్నారు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని సహాయాన్ని వలస కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
వలస జీవులపై వికృత క్రీడ
అసత్యాల కన్నా అర్ధసత్యాలు ఎక్కువ ప్రమాదం. ఎక్కడో జరిగినదాన్ని మరెక్కడో జరిగినట్టు చూపెట్టి, బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టే ఫేక్ వీడియోల హవా పెరిగాక ఈ ప్రమాదం ఇంకెంతో పెరిగింది. ఉత్తరాది వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సోషల్ మీడియాలో తెగ తిరిగిన ఘటన, దానిపై బిహార్ సహా దేశవ్యాప్తంగా రేగిన రచ్చ అందుకు తాజా నిదర్శనం. తమిళనాడు ప్రభుత్వం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, వేరెక్కడో జరిగిన ఘటనల దృశ్యాల్ని ఇప్పుడు ఇక్కడ జరిగినట్టు వీడియోల్లో చూపారని నిర్ధారించాల్సి వచ్చింది. బిహార్ సీఎం తొందరపాటుతో హడావిడిగా తమిళనాడుకొచ్చిన బిహార్ ప్రభుత్వాధికారులూ నిజం తెలుసుకొని, సంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది. గతంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. మొత్తం మీద ఈ వ్యవహారం ఫేక్ న్యూస్ల ముప్పుతో పాటు వలసదారులనే గుర్తింపు తీరని కళంకంగా మారి, హింసా ద్వేషాలను ప్రేరేపిస్తున్న వికృత ధోరణిని చర్చకు పెట్టింది. స్వరాష్ట్రం, వలసపోయిన రాష్ట్రం – రెండింటి ఆర్థికాభివృద్ధిలో అంతర్ రాష్ట్ర వలసలది కీలక పాత్ర. అయితే, దేశంలో వలసలపై ప్రభుత్వ గణాంకాలు సమగ్రంగా లేవు. పాత లెక్కలే ఇప్పటికీ ఆధారం. 2011 జనగణన ప్రకారం మన దేశంలోనే అంతర్గత వలసదార్ల సంఖ్య 45.36 కోట్లు. అంటే దేశ జనాభాలో 37 శాతం మంది. ఇక, 2016 – 17 నాటి ఆర్థిక సర్వే ప్రకారం స్వస్థలం వదిలిపోతున్న మొత్తం వలస శ్రామికుల్లో దాదాపు సగం మంది సాపేక్షంగా తక్కువ అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల జనాభాయే. ఈ అభాగ్య సోదరులను గోవా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలు అధికంగా ఆదరిస్తున్నాయి. వెరసి, జీవనోపాధికై వస్తున్న ఉత్తరాది వారిని ఢిల్లీ తర్వాత ఎక్కువగా అక్కున చేర్చుకుంటున్నది దక్షిణ భారతావనే అనుకోవచ్చు. పారిశ్రామిక కేంద్రంగా పేరున్న తమిళనాట 10 లక్షల మందికి పైగా వలస కార్మికులున్నారు. ఇది ఆ రాష్ట్ర కార్మిక విభాగం పక్షాన జరిపిన 2016 సర్వే లెక్క. అధికశాతం మంది బడుగు వేతన జీవులైన నైపుణ్యం లేని శ్రామికులు. ఎక్కువగా బెంగాల్, అస్సామ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ల నుంచి వచ్చినవారే. తిరుప్పూర్, ఈరోడ్ లాంటి వస్త్ర కేంద్రాల వృద్ధికి, రాష్ట్ర పురోగతికి వీరు వెన్నెముక. ఈ పరిస్థితుల్లో వలస కార్మికులపై తమిళనాట దాడులంటూ సంబంధం లేని పాత వీడియోలు సోషల్ మీడియాలో తిరగడం తాజా సమస్యకు కారణం. హిందీవారికి వ్యతిరేకంగా తమిళనాట ఏదో జరిగిపోతోందని నమ్మించడానికి ఒక వర్గం వీడియోలను ఆన్లైన్లో తెగతిప్పింది. దాంతో తమిళనాడు ఆ ఘటనలు వేరెక్కడివో, ఎవరెవరి మధ్య జరిగిన ఘటనల తాలూకువో వివరించాల్సి వచ్చింది. నిజం వెల్లడయ్యేలోగా కథ బిహార్ అసెంబ్లీకి ఎక్కింది. నిజం కాళ్ళకు చెప్పులు తొడిగే లోపల అబద్ధం ఊరంతా చుట్టివస్తుందన్నట్టుగా అసత్యప్రచారం దేశం చుట్టింది. అయితే, బీజేపీయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఈ తరహా వైరల్ ఫేక్ న్యూస్ వల్ల ఎవరికి, ఏ ప్రయోజనం ఉందనే అనుమానాలూ పైకి వచ్చాయి. సాక్షాత్తూ తమిళనాడు సీఎం సైతం ఘర్షణలు రేపి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రకోణం గురించి ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి ఏ రాష్ట్రం, ఏ భాషకు చెందినవారినైనా స్థానికులుగా కలుపుకొనే ఆత్మీయ, ఆతిథేయ సంస్కృతి దక్షిణాదిన, అందులోనూ తమిళనాట తరతరాలుగా ఉన్నదే. శాంతిభద్రతల పరిరక్షణలో అక్కడి పోలీసు యంత్రాంగం పేరున్నదే. అక్కడే ఇలా జరిగిందంటే – ఇతర రాష్ట్రాలకిది మేలు కొలుపు. కొందరి తుంటరితనం, స్వార్థ రాజకీయాలు సోదర భారతీయుల మధ్య విభజన గీతలు గీస్తే అది పెను ప్రమాదం. ఐకమత్యం, సౌభ్రాతృత్వాలకు గొడ్డలిపెట్టయ్యే ఏ వికృత ధోరణినీ ఎవరూ సహించకూడదు. సహకరించకూడదు. హోలీకని రద్దీ రైళ్ళలో స్వరాష్ట్రాలకు తరలివెళ్ళిన వలస కార్మికుల్లో ఎందరు తిరిగొస్తారనేది ఇప్పుడు తమిళనాట హోటళ్ళ నుంచి పరిశ్రమల వరకు అన్నిటి ఆందోళన. ఏ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నైనా అంతర్ రాష్ట్ర వలస కార్మికుల వాటా అవిస్మరణీయం. వారికి సౌకర్యాలు, సురక్షిత వాతావ రణం కల్పించడం కీలకమంటున్నది అందుకే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాలకు కానీ పార్లమెంట్ ‘అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం–1979’ చేయలేదు. అయినా ఇప్పటికీ వారి పరిస్థితి పూర్తిగా మారలేదు. వారి స్థితిగతులపై విస్తృత సర్వేలు జరపాలి. కేరళ నమూనా సర్వేలు అందుకు ఆదర్శం. సర్వేల సమాచారంతో సొంత, వలస రాష్ట్రాల్లో మెరుగైన విధానాలు చేపట్టవచ్చు. వలసదార్ల వల్ల స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయనీ, మురికివాడలు, నేరాలు పెరుగుతున్నాయనీ రాజకీయ స్వార్థంతో పేలడం తేలిక. ఇలా ‘బయటివార’నే ముద్ర వేసి స్థానికుల్ని రెచ్చగొడితే, తాత్కాలిక లబ్ధి ఉంటుందేమో కానీ, శాశ్వత నష్టం తథ్యం. భారత పౌరులెవరైనా దేశ భూభాగంలో ఎక్కడికైనా ఉపాధికై స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, స్థిరపడవచ్చనేది మన రాజ్యాంగం (ఆర్టికల్ 19) కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ, కరోనా వేళ ‘ఇన్ఫెక్షన్ వాహకులు’ అంటూ కన్న ప్రాంతం, ఉన్న ఊరు వలస కార్మికుల్ని ‘అవాంఛనీయులు’గా చూశారు. వారిపై దాడులూ అనేకసార్లు రికార్డులకెక్కవు. ఈ పరిస్థితుల్లో వలసదార్లు సైతం స్థానికులతో ఏకమయ్యేలా తగిన చర్యలు చేపట్టడం ప్రభుత్వ విధి. అలాగే, సామాజిక న్యాయం, మానవ హక్కులను పరిగణనలోకి తీసుకొని కీలకమైన ఈ శ్రామిక పెట్టుబడిని కాపాడుకొనేలా సమగ్ర, వ్యవస్థీకృత విధానం అవసరం. అప్పుడే తమిళనాట తలెత్తిన తాజా ఫేక్ న్యూస్ రచ్చ లాంటివి నిర్వీర్యమవుతాయి. -
భయం వద్దు..తమిళులు మంచివారు
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది. వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
బిహార్ కార్మికులూ మా కార్మికులే
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వలస కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ బిహార్ సీఎం నితీశ్ కుమార్కు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న కార్మికులంతా తమ వాళ్లేనని, వారికి ఎటువంటి హాని జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగనివ్వమన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమిళనాడులో బిహార్, జార్ఖండ్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో స్టాలిన్ శనివారం నితీశ్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవనీయ సోదరుడు నితీశ్తో ఫోన్లో మాట్లాడినట్లు అందులో చెప్పారు. బిహార్ సహా ఉత్తరాది వలస కార్మికుల భద్రతపై ఆయనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బిహార్కు చెందిన ఒక జర్నలిస్ట్ తమిళనాడులో వలసకార్మికులపై దాడులపై ఒక ఫేక్ వీడియోను మొదట ఆన్లైన్లో సర్క్యులేట్ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకునేందుకు వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్మికులకు నచ్చజెప్పిన పోలీసులు ఉత్తరాది వలస కార్మికులపై దాడుల పుకార్ల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు బయలు దేరారు. దీంతో బస్, రైల్వే స్టేషన్లు నిండిపోయాయి. రిజర్వేషన్ రైలు బోగీల్లో కార్మికులు పెద్దఎత్తున ఎక్కడంతో శనివారం వారికి పోలీసులు నచ్చజెప్పి కిందికి దించివేశారు. కాగా, ఈ వ్యవహారంపై బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమిళనాడు అధికారులతో సంప్రదింపులు జరిపాయి. అలాగే ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు తమిళనాడుకు శనివారం చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాయి. కాగా, వదంతుల వీడియోలకు సంబంధించి పోలీసులు బీజేపీ అధికార ప్రతినిధులు తదితరులపై కేసులు నమోదు చేశారు. -
మా సోదరులను రక్షిస్తాం!ఎవరైనా బెదిరిస్తే కాల్ చేయండి: స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను రక్షస్తామని హామి ఇచ్చారు. వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మిమ్మల్ని బెదరిస్తే హెల్ప్లైన్కు కాల్ చేయండి అని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు, మా వలస సోదరులకు రక్షణా నిలుస్తారని అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమిళనాడు, బిహార్ అధికారులు వలస కార్మికులపై దాడుల గురించి అనవసరమైన పుకార్లు సృష్టించకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పుకార్లే కార్మికులలో భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమే బిహార్ అసెంబ్లీలో వాడివేడి చర్చలకు దారితీసింది. వలస కార్మికులను కలుసుకోవడం తోపాటు స్థానిక అధికారులను కూడా సంప్రదిస్తామని స్టాలిన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులకు సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే వలస కార్మికులను భయపడవద్దని తమిళనాడు జిల్లా కలెక్టర్లు హిందీలో విజ్ఞప్తి చేశారు.కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ విషయమై అన్ని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైగా వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్!ఆ తర్వాత..) -
‘గల్ఫ్’ వలసలపై ఆరా!
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాలకు కార్మికుల వలసలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం వివరాలు సేకరిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకు ఏ సంవత్సరం ఎంతమంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్న తరుణంలో ఈ ప్రక్రియ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అధికంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై గల్ఫ్ వలసలు ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేసింది. ఆయన మరణం తర్వాత గల్ఫ్ వలస కార్మికుల గురించి పట్టించుకున్నవారు లేరని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ గల్ఫ్ వలస కార్మికుల అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఉద్యమంలో కార్మికుల కుటుంబాలు చురుగ్గా పాల్గొన్నాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా గల్ఫ్ వలస కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేరళ తరహాలో ప్రవాసీ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మొదటి నుంచీ వినిపిస్తోంది. కాగా 2019 అక్టోబర్లో కూడా పంచాయతీరాజ్ శాఖ ఇదే అంశంపై వివరాలను నమోదు చేసింది. కానీ అప్పట్లో ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో మరో సారి వలస కార్మికుల లెక్కల విషయంలో సర్కారు దృష్టి సారించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు మంద భీంరెడ్డి తెలిపారు. ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు ఉంటే వలస కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఖతర్లో వరల్డ్కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు గ్రూప్ దశతో పాటు ప్రీక్వార్టర్స్ మ్యాచ్లు ముగిశాయి. ఇక క్వార్టర్స్లో టాప్-8 జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్ చేరిన వారిలో అర్జెంటీనా, పోర్చుగల్, బ్రెజిల్, మొరాకో, నెదర్లాండ్స్, క్రొయేషియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్లు ఉన్నాయి. ఈ సంగతి పక్కనబెడితే ఫిఫా వరల్డ్కప్లో మనకు తెలియని ఒక ఆసక్తికర విషయం బయటపడింది. సాధారణంగా అరబ్ దేశాలకు వలస కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. అందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే వీరందరిని వరల్డ్కప్ సందర్భంగా స్టేడియాల నిర్వహణకు ఖతర్లోని దోహాకు తరలించారు. అప్పటినుంచి 400 నుంచి 500 మంది వలస కార్మికులు మరణించినట్లు సమాచారం. గార్డియన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఖతర్లో ఫిఫా వరల్డ్కప్ ప్రాజెక్ట్ కోసం ఏడాది క్రితమే దాదాపు 6500 మంది వలస కార్మికులు తీసుకెళ్లారని తెలిపింది. అప్పటినుంచి అక్కడే పనిచేస్తున్న వలస కార్మికుల్లో చాలా మంది చనిపోయినట్లు తెలిసింది. తాజాగా గురువారం మరో వలస కార్మికుడు మృతి చెందడాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఫిలిపినో అనే సంస్థ ఖతర్లో వర్క్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. వలస కార్మికుల మరణాలు ఎందుకు జరిగాయదన్న దానిపై నివేదిక అందజేయనుంది. వలస కార్మికుల మృతిపై ఫిఫా విచారం వ్యక్తం చేసింది. వరల్డ్కప్ నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన వారందరికి నివాళి అర్పించింది. ఇక ఫుట్బాల్ సభ్యత్వం ఉన్న 10 యూరోపియన్ దేశాలతో పాటు ఇంగ్లండ్ , జర్మనీలు వలస కార్మికుల క్షేమమై ఫిఫాకు లేఖ రాశాయి. ఖతర్లోని వలస కార్మికుల హక్కులను మెరుగుపరచడానికి ప్రపంచ పాలకమండలి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. అదే విధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO)కు కూడా యూరోపియన్ దేశాలు తమ లేఖను అందజేశాయి. Another DEATH at QATAR 2022 as organisers probing demise of Filipino MIGRANT worker at WC Training site#FIFAWorldCup #Qatar2022 https://t.co/z1McJFJ33Y — InsideSport (@InsideSportIND) December 9, 2022 చదవండి: ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా? -
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు
మోర్తాడ్: గల్ఫ్ వలస కార్మికులకోసం తెలంగాణలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్వో), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ప్రతినిధులు ముందుకొచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం ఐఎల్వో దక్షిణాసియా దేశాల ఇన్చార్జి, వలస కార్మికుల వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి ఈనెల 22న హైదరాబాద్లో సీఎస్ సోమేష్కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డితో సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాల నుంచి సొంత గడ్డకు చేరుకునే వారికి పునరావాసంతో పాటు, కుటుంబం, సమాజంతో వారు మమేకం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తాము కొన్ని కార్య క్రమాలను చేపట్టనున్నామని, దీనికి తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ వలసల వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి ఐఎల్వో ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతా ధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే వలస కార్మికుల కుటుంబాలు బాగుపడే అవకా శాలు న్నాయి. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయా లన్న ఐఎల్వో ప్రతిపాదనలపై గల్ఫ్ వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎల్వో ప్రా జెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావాలి.. ఐఎల్వో ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలపాలి. ఇక్కడ అమలు చేయకపోతే పైలట్ ప్రాజెక్టు మరో రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నాయకులు -
క్రికెట్లో ప్రొటీస్.. ఫుట్బాల్లో డచ్; ఎక్కడికెళ్లినా దరిద్రమే
విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్ కప్కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ మెగాసమరంలో ఇకపై గోల్స్ వర్షం కురవనుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా సాకర్ ఫీవరే కనిపిస్తుంది. ఇక వరల్డ్కప్లో పాల్గొనబోయే 32 జట్లు ఇప్పటికే ఖతార్కు చేరుకొని ప్రాక్టీస్లో వేగం పెంచాయి. 1974, 1978, 2010లో రన్నరప్.. ఫిఫా ర్యాంక్ చూస్తే 8వ స్థానం..! ఇటీవల వరుసగా 15 మ్యాచ్ల్లో పరాజయమే ఎరుగని వైనం. ఇదీ నెదర్లాండ్స్ జట్టు రికార్డు. కానీ ఇప్పటి వరకు ఆ టీమ్ ఫిఫా వరల్డ్కప్ను ముద్దాడలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. అసలు సిసలైన ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ ఉన్నా.. నిలకడలేమితో కీలక మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ తడబడుతోంది. -సాక్షి, స్పోర్ట్స్ వెబ్డెస్క్ ఈ నేపథ్యంలో మరోసారి ఫిఫా కప్కు రెడీ అయిన డచ్ టీమ్.. అరబ్ గడ్డ ఖతార్లో కత్తిమీద సాముగా ఉండే పరిస్థితుల్లో ఎలా ఆడుతుందన్న ఆసక్తి మొదలైంది. గత పది వరల్డ్కప్స్లో ఈ టీమ్ గ్రూప్ దశను దాటింది. కానీ నాకౌట్ మొదలవుతుందంటే డచ్ ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. దీంతో అభిమానులు నెదర్లాండ్స్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో సౌతాఫ్రికాకు దురదృష్టమైన జట్టుగా పేరు ఉంది. నాకౌట్ దశ వచ్చే సరికి ఎక్కడ లేని ఒత్తిడి కొనితెచ్చుకునే సౌతాఫ్రికా ఇంటిబాట పట్టడం అలవాటు చేసుకుంది. అచ్చం ఇదే తరహాలో ఫుట్బాల్లో నెదర్లాండ్స్ జట్టుకు జరుగుతుంది. ఇప్పటికి మూడుసార్లు రన్నరప్గా నిలిచన నెదర్లాండ్స్ ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. ఇక ఫిఫా వరల్డ్కప్లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్లు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్కు అర్హత పొందింది. మిడ్ఫీల్డర్ ఫ్రెంకీ డి జాంగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్ డి రిజ్ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్ చేరితే మాత్రం కప్ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది. ఇక ఖతార్ చేరుకున్న నెదర్లాండ్స్ జట్టు తమ ప్రాక్టీస్ను మొదలెపెట్టింది. తమ ట్రైనింగ్ సెషన్కు వలస కార్మికులను ఆహ్వానించి వారితో మ్యాచ్ ఆడడం వైరల్గా మారింది. ఆ వలస కార్మికులంతా ఖతర్లో వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్న స్టేడియం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. స్టేడియానికి కొత్త హంగులు అద్దడం కోసం వీళ్లు గంటల కొద్దీ కష్టపడ్డారు. వలస కూలీల శ్రమకి గుర్తింపుగా ప్రాక్టీస్ సెషన్కి పిలిచిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు వారితో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. The Dutch National Team invited migrant workers who helped building the World Cup stadiums to attend their training session and to play football together. 🧡 pic.twitter.com/kvGor8LJlW — 𝐀𝐅𝐂 𝐀𝐉𝐀𝐗 💎 (@TheEuropeanLad) November 17, 2022 చదవండి: ఫిఫా ఆదాయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం 'నీకేం పోయే కాలం'.. రసెల్పై అభిమానుల ఆగ్రహం -
వలస కార్మికులకు బహ్రెయిన్ షాక్
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన కొట్టూరి శ్రీకాంత్ రెండు నెలల కిందట విజిట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ ఏదో ఒక కంపెనీలో పని చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ విజిట్ వీసాపై వచ్చిన వారికి పని ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి. ఫలితంగా విజిట్ వీసా గడువు ముగిసేలోపు శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. బహ్రెయిన్కు వెళ్లడానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయగా ఈ డబ్బును శ్రీకాంత్ నష్టపోవాల్సి వచ్చింది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్కు చెందిన ఎండీ ఇబ్రహీం కొన్నేళ్ల నుంచి బహ్రెయిన్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల కిందట ఇంటికి వచ్చి మళ్లీ బహ్రెయిన్ వెళ్లాడు. అతనికి మరో రెండేళ్ల వరకు అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ అక్కడి ప్రభుత్వ ఆధీనంలోని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఏ) అనేక మంది వలస కార్మికుల వీసాలను అర్ధంతరంగా రద్దు చేసింది. ఫలితంగా ఇబ్రహీం ఇంటికి వచ్చేశాడు. విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బహ్రెయిన్లో పర్యాటక రంగం వృద్ధి చెందడంతో ఆ దేశానికి వెళితే ఏదో ఒక పని చేసుకోవచ్చని వలస కార్మికులు ఆశిస్తున్నారు. అదే ఆశతో విజిట్ వీసాపై వెళ్లిన శ్రీకాంత్ ఇంటి దారి పట్టగా, వర్క్ వీసాకు గడువున్నా ఇబ్రహీం కూడా బలవంతంగా ఇంటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వందలాది మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. మోర్తాడ్ (బాల్కొండ): బహ్రెయిన్లో ఉపాధి పొందవచ్చని భావిస్తున్న ఎంతో మంది వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమాన్ల మాదిరిగానే బహ్రెయిన్ కూడా ఎంతో మంది తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అయితే ఇకనుంచి అది చరిత్రగానే మిగిలిపోనుంది. బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు, వలస కార్మికుల వీసాలను పర్యవేక్షించే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అనుసరిస్తున్న విధానాలతో బహ్రెయిన్లో ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి. వారం, పది రోజుల వ్యవధిలోనే తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు దాదాపు రెండు వేలమంది బహ్రెయిన్ నుంచి ఇంటిదారి పట్టారని అంచనా. వర్క్ వీసాలను రద్దు చేయడం, విజిట్ వీసాలపై వెళ్లి పని వెతుక్కునేవారికి ఎల్ఎంఆర్ఏ ఇచ్చిన ఆదేశాలతో కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో ఉపాధి కరువైంది. బహ్రెయిన్ ప్రభుత్వం పునరాలోచన చేస్తే తప్పా ఆ దేశంలో వలస కార్మికుల ఉపాధికి అవరోధాలు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహ్రెయిన్కు వెళ్లే ఆలోచన మానుకోవాలని వలస కార్మికుల సంఘాలు సూచిస్తున్నాయి. -
ఎడారి గోసకు.. ఏదీ భరోసా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరువైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబు నిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే దాదాపు పదిహేను లక్షల మంది గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రేయిన్, ఒమన్)కు వెళ్లగా, తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాటపడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళుతుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి కఠినమైన పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్నవారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలా గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో 1,612 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఇంకా కూలీలుగానే తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా గల్ఫ్కు వెళ్లే వారి కోసం ప్రత్యేక సాంకేతిక శిక్షణ లేకపోవడంతో అక్కడకు వెళుతున్న వారిలో 90 శాతం కూలీలుగానే పనిచేస్తున్నారు. నిరక్షరాస్యత, ఎడారి దేశాల్లో వ్యవహరించే తీరుపై ముందస్తు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పని ప్రదేశంలో ప్రమాదాలు – వివాదాలు, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుబాయ్ బాధలుండవని నాయకులు హామీ ఇచ్చినా పేద కార్మికులకు భరోసా విషయంలో కార్యాచరణ ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2016లో ఎన్నారై పాలసీపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, 2018 –19 బడ్జెట్లో ఎన్నారైల కోసం రూ.100 కోట్లను కేటాయించినా.. పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటించకపోవడంతో వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూరలేదు. రెండు రోజులకో మృతదేహం.. గల్ఫ్ దేశాల నుంచి రెండు రోజులకొక మృతదేహం తెలంగాణకు చేరుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 1,612 మృతదేహాలు వచ్చాయి. ఇందులో 25 నుంచి 50 ఏళ్ల లోపు వారే అత్యధికం. అక్కడి వాతావరణం, ఆహారం కారణంగా మానసిక ఒత్తిడితో గుండె, మెదడు సంబంధిత వ్యాధుల భారిన పడి మరణిస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం ఇటీవల వెల్లడించింది. కేరళ రాష్ట్రంలో భేష్ గల్ఫ్ దేశాల్లో అత్యధిక ప్రవాసీలున్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం వలస కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. గల్ఫ్కు వెళ్లే వారికి ముందస్తుగా నైపుణ్య శిక్షణ ఇస్తుండటంతో వాళ్లు వైట్ కాలర్ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అలాగే స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం విస్తృత స్థాయిలో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో ఉన్న వారికి న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్నార్టీఎస్ ఆధ్వర్యంలో ఎన్నారైల కోసం 24 గంటల హెల్ప్లైన్తోపాటు ప్రవాసాంధ్ర భరోసా పేరుతో రూ.10 లక్షల బీమా (18–60 ఏళ్లు)తో పాటు రూ.50 వేల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నారు. ఇవీ కార్మికుల డిమాండ్లు.. ►గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలి. ►గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, జీవిత, ప్రమాదబీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి. ►గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి. ►శిక్షపడ్డ ఖైదీలకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాల నుంచి ఖైదీల మార్పిడి వెంటనే చేయాలి. ►కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్లో సౌదీ, యూఏఈ, కువైట్ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి. ►ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన తరహాలో గల్ఫ్లో మృతి చెందిన వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.లక్ష ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ►ప్రవాసి భారతీయ బీమా యోజన కింద రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండేళ్ల కాలపరిమితితో ఇన్సూరెన్స్ అమలు చేయాలి. తక్షణ కార్యాచరణ చేపట్టాలి తెలంగాణ వస్తే దుబాయ్ బాధలు తప్పుతాయనుకున్నం. కొత్త వలసలు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల సంక్షేమానికి తక్షణ కార్యాచరణను అమలు చేయాలి. –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకుడు కాన్సులేట్లు ఏర్పాటు చేయాలి దేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచే అత్యధిక కార్మికులు గల్ఫ్లో పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు మరణాలు, జైలు పాలవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి, హైదరాబాద్లో సౌదీ, ఇతర ముఖ్య దేశాల కాన్సులేట్లను ఏర్పాటు చేస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. – పి.బసంత్రెడ్డి, గల్ఫ్ సోషల్ వర్కర్ కన్న బిడ్డల కోసం.. కన్నులు కాయలు కాచేలా సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే అన్నదమ్ములిద్దరూ 2004లో దుబాయ్ వెళ్లారు. పని ప్రదేశంలో నేపాల్కు చెందిన దిల్ బహుదూర్ అనే గార్డు హత్యకు కారమణంటూ వీరితో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అక్కడి చట్టాల మేరకు బాధితుని కుటుంబ సభ్యులు పరిహారం తీసుకుని క్షమాభిక్ష పత్రాన్ని సమర్పిస్తే శిక్షను తగ్గించటం లేదా రద్దు చేయటం సులువు. ఈ మేరకు మల్లేశం, రవి తల్లి గంగవ్వ 2012లో పరిహారం సొమ్ము కోసం తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాల్సిందిగా హెచ్ఆర్సీని కోరిన అంశం అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టి వచ్చింది. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి రూ.15 లక్షలను నేపాల్ వెళ్లి బాధిత కుటుంబానికి అందించి క్షమాభిక్షపత్రాన్ని తీసుకొచ్చారు. నేర తీవ్రత, చేసిన తీరు ఘోరంగా ఉందంటూ అక్కడి హైకోర్టు యావజ్జీవ శిక్ష(25ఏళ్లు)గా మార్చింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటే కానీ వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మీరైనా.. జాడ చెప్పండి ‘గల్ఫ్కు పోయివస్తే కష్టాలన్నీ తీరుతయన్న డు. పోయినోడు మళ్లీ రాక.. మేము దినదిన నరకం అనుభవిస్తున్నం. మా కొడుకు ఎక్కడున్నడో..ఏం చేస్తున్నడో ఎవరూ చెప్పడం లేదు’ అంటూ జగిత్యాల జిల్లా మన్నెగూడేనికి చెందిన శ్రీరాముల రాజేశ్వరి, రాజేశం తమకు ఎదురైన వారందరినీ అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. శ్రీరాముల ప్రసాద్ (42) రెండేళ్ల క్రితం గల్ఫ్ లోని క్యాంప్కు చేరినట్లు ఫోన్ చేశాడు. ‘వారానికి ఒకసారైనా ఫోన్ చేసేవాడు. ఏడాదిగా అది కూడా లేదు. మీరై నా నా కొడుకు జాడ చెప్పాలె’ అంటూ రాజేశం వేడుకుంటున్నారు. -
మాల్దీవుల్లో ఘోరం
మాలె: మాల్దీవుల రాజధాని మాలెలో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది భారతీయులు సహా మొత్తం 10 మంది వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. నిరుఫెహి ప్రాంతంలోని విదేశీ పనివారు నివసించే ఇరుకైన భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 9 మంది భారతీయులు కాగా, మరొకరిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనంలోని గ్రౌండ్ఫ్లోర్లోని గ్యారేజీలో మంటలు మొదలై కార్మికులున్న మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ప్రతి కార్మికుడి బెడ్ పక్కన ఒక గ్యాస్ సిలిండర్ ఉంది. ఫ్లోర్ అంతటికీ కలిపి కేవలం ఒకటే కిటికీ ఉంది. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని అధికారులు తెలిపారు. -
వలస కార్మికులకు ఉచిత ప్రయాణం
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంపెనీ ఏడీఎన్హెచ్.. 150 మంది వలస కార్మికులకు దుబాయ్ వెళ్లడానికి ఉచిత వీసాలు, విమాన టికెట్లు సమకూర్చింది. కార్మికులకు క్లీనింగ్, క్యాటరింగ్ సెక్షన్లలో ఉపాధి కల్పిస్తోంది. వలస కార్మికులకు వీసాలను జారీ చేయడానికి లైసెన్స్డ్ ఎజెన్సీలు, సబ్ ఏజెంట్లు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ, వివిధ పట్టణాల్లో బ్రాంచీలు కలిగి ఉన్న జీటీఎం కంపెనీ ద్వారా ఏడీఎన్హెచ్ రిక్రూట్ చేసుకుంది. ఉచిత వీసాల వల్ల వలస కార్మికులందరికీ కలిపి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు తప్పింది. వీసాలు పొందిన కార్మికులు దుబాయ్ వెళ్లేందుకు ముంబైకి బయలుదేరి వెళ్లారు. గతంలో ఇదే కంపెనీ ఖతర్లో, అబుదాబీల్లో పనిచేయడానికి 2,200 మందికి ఉచిత వీసాలు అందజేసింది. ‘సాక్షి’కథనం వల్లే.. వలస కార్మికులకు బంపర్ ఆఫర్ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల జీటీఎం నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాం. ఎలాంటి సొమ్ము చెల్లించకుండానే దుబాయ్కు వెళ్లడం సంతోషంగా ఉంది. పేద కార్మికులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. – పవన్ కళ్యాణ్, పెంబి, నిర్మల్ జిల్లా -
ఏజెంట్ చేతిలో మోసపోయిన వలసకార్మికులు.. ఏపీ ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి రాక!
ఒమాన్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 08 మంది వలసకార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS సహకారంతో స్వదేశానికి రప్పించారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా సక్రమ పద్ధతిలో వెళ్లాలని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 08 మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమాన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది. వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు ఏపీఎన్ఆర్టీసీ ప్రయత్నాలు ఫలించడంతో ఈ నెల 27న వాళ్లు విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ఏపీఎన్ఆర్టీఎస్ నిరంతరం పనిచేస్తోందన్నారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒమాన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ 08 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేసి ఒమాన్ దేశం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి, భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, APNRTS ను సంప్రదించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి డా. సీదిరి అప్పలరాజు వలసకార్మికుల క్షేమసమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరారు. తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి, ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరించారు. సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవడంతో పాటు వారిని భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు ఈ విషయమై.. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎవరూ అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా ఆమోదింపబడిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలని సూచించారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీకున్న సందేహాలు, సమస్యలు ఉంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, +91 8500027678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు. -
ఖతార్లో సాక్షి దినపత్రిక 'గల్ఫ్ జిందగీ' సావనీర్
ఖతార్: ఖతార్ లోని సిటీ సెంటర్ రొటానా హోటల్లో బసచేసిన తెలంగాణ వలస కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్లను బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఇ) సంస్థకు ఖతార్లో కమ్యూనిటీ లైజన్ ఆఫీసర్ (ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్) గా పనిచేస్తున్న మార్కోపోలో ఫెర్రర్ మర్యాదపూర్వకంగా సోమవారం కలుసుకున్నారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు వలసలపై ఆసియా-గల్ఫ్ దేశాల చర్చల సమావేశానికి హాజరవడానికి స్వదేశ్ పరికిపండ్ల ఒకరోజు ముందు ఖతార్కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్వదేశ్ పరికిపండ్ల వద్ద ఉన్న సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్ను చూసి సంతోసం వ్యక్తం చేశారు మార్కో పోలో. తెలుగు రాకపోయినా 88 పేజీల పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని ఫోటోల ద్వారా గల్ఫ్ వలసల గురించి సమాచారం ఉన్న పుస్తకం అని గమనించారు. దీంతో వివరాలను ఇంగ్లీష్లోకి అనువాదం చేసి అతనికి స్వదేశ్ వివరించాడు. దాదాపు గంటన్నర సేపు ముఖ్య కథనాల సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా వినడమేకాదు, ఈ సావనీర్ను ఇంగ్లీష్లోకి అనువదించి ఒక పుస్తక రూపంలో వేయాలని మార్కో పోలో సూచించడం విశేషం. 'గల్ఫ్ జిందగీ' సావనీర్ గురించి... గల్ఫ్ వలసలు - అభివృద్ధి, కష్టాలు, సుఖాలు, హక్కులు, జీవితాలపై, సమాజంపై, ప్రభుత్వాలపై చూపించే ప్రభావం, ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం సాక్షి జిల్లా పేజీల్లో 'గల్ఫ్ జిందగీ' ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన 'గల్ఫ్ జిందగీ' పేజీ 22 నెలలుగా సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా ప్రచురితమైన అన్ని పేజీలను కూర్పు చేసి ఒక సావనీర్ గా రూపొందించారు. వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు 'గల్ఫ్ జిందగీ' వారధిలా ఉపయోగపడుతూ సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఒక భరోసానిస్తూ ముందుకెళ్లింది. మొదట్లో ప్రతీ శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరికమేరకు 15 జూన్ 2018 నుండి గల్ఫ్ దేశాలలో సెలవుదినం అయిన శుక్రవారానికి మార్చారు. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి కుటుంబాల జీవనంపై కథనాలు ఇచ్చారు. ఇవే కాకుండా గల్ఫ్లో కష్టాలను జయించి మెరుగైన జీవితం గడుపుతున్న కార్మికుల సక్సెస్పై కూడా ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించారు. 'గల్ఫ్ జిందగీ' పేజీకి కావలసిన సమాచార సేకరణలో సహకరించిన 'మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా' సభ్య సంస్థ 'ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం' అధ్యక్షులు మంద భీంరెడ్డి గారికి కృతఙ్ఞతలు అని ఎడిటర్ సావనీర్ ముందు మాటలో రాశారు. అద్భుతమైన కథనాలు అందించిన సాక్షి గల్ఫ్ డెస్క్, విలేఖరుల బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ గల్ఫ్ వలసల చరిత్రలో ఈ 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ఆవిష్కరణ గుర్తుండిపోయే ఘట్టంగి నిలిచిపోయింది. సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. (https://www.sakshi.com/sites/default/files/article_images/2019/10/4/gulf_book.pdf -
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం..
భవిష్యత్తుపై గంపెడాశలతో గల్ఫ్ బాట పడుతున్న వలస కార్మికులకు నీడలా కష్టాలు వెంటాడుతున్నాయి. అవగాహాన లేమి, ట్రావెల్ ఏంజెట్ల మోసాలు, పనికి పిలిపించుకున్న యజమానుల కక్కుర్తి.. వెరసి వలస కార్మికుల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాయి. తాజాగా పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిలా కార్మికులు పరాయి దేశంలో చిక్కుకుని... యజమానులు చూపించే నరకం నుంచి బయట పడేయాలంటూ మొరపెట్టుకున్నారు. - సౌదీ అరేబియాలో బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఉందంటూ భర్త చెప్పిన మాటలు విని మెహరున్నీసా విమానం ఎక్కింది. నెలకు రూ.35,000ల వరకు వేతనం వస్తుందని చెప్పడంతో సౌదీకి రెడీ అయ్యింది. రియాద్కి చేరుకునే సమయానికి తీవ్ర అనారోగ్యం పాలైంది. అక్కడ సరైన ఆశ్రయం, తిండి లభించకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. తనను వదిలేస్తే ఇండియాకి తిరిగి వెళ్తానంటూ చెబితే రూ.2 లక్షలు కడితే కానీ వదిలిపెట్టమంటూ యజమాని హుకుం జారీ చేశారు. దీంతో తనను కాపాడాలంటూ ఆమె వీడియో సందేశాన్ని పంపింది. - రిజ్వానా బేగం అనే మహిళ నెలకు రూ.25 వేల వేతనం మీద మెయిడ్గా పని చేసేందుకు గల్ఫ్కి వెళ్లింది. కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం, సరైన వసతి కల్పించకుండా నిత్యం నరకం చూపిస్తున్నారు యజమానులు. ఇదేంటని ట్రావెల్ ఏజెన్సీని ప్రశ్నిస్తే.. ఇండియాకు తిరిగి వెళ్లాంటే రూ.2.50 లక్షలు చెల్లించాలు చెప్పారు. దీంతో సాయం అర్థిస్తూ ఆమె ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసింది. - హసీనా బేగం వలస కార్మికురాలిగా కువైట్కి చేరుకుంది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వెన్నుపూసలో సమస్య తలెత్తింది. దీంతో అక్కడ ఉండలేనంటూ తనను ఇండియాకు తీసుకురావాలంటూ కుటుంబ సభ్యుల ద్వారా మొరపెట్టుకుంది. విదేశాల్లో వలస కార్మికులు పడుతున్న కష్టాలపై కేంద్రం స్పందించింది. ఆయా దేశాలకు చెందిన ఎంబసీ అధికారుకుల సమస్యలను వివరించింది. వారికి ఇబ్బంది రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అవసరం అయితే వారిని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలంది. చదవండి: వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి -
వలస కార్మికులకు ‘ఖతర్’ కంపెనీ ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు ఉచితంగా వీసాలు అందించేందుకు ఖతర్లోని ఒక క్యాటరింగ్ కంపెనీ ముందుకొచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి తేరుకుంటున్న సమయంలో కార్మికులపై ఆర్థిక భారం పడకుండా వీసాలను ఉచితంగా జారీ చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. తెలంగాణలోని ఒక లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వీసా ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఖతర్లోని వివిధ కంపెనీలు, విమానయాన రంగానికి ఆహారం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ వలస కార్మికులతో ఖాళీలను భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. కిచెన్ క్లీనింగ్, వెయిటర్స్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకోసం ఈనెల 30న ఆర్మూర్లో, 31న సికింద్రాబాద్లో ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఆకర్షణీయమైన వేతనంతో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నారు. 21 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘గతంలో వీసా కావాలంటే కార్మికులు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కార్మికులపై ఎలాంటి భారం పడకుండా ఖతర్ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం’అని జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత సతీశ్రావు ‘సాక్షి’కి తెలిపారు. వలస కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. -
వీసాలున్నా వెళ్లలేక..
మోర్తాడ్: విదేశీ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కువైట్ ద్వారాలు తెరచినా రాష్ట్రం నుంచి ఔత్సాహికులు వెళ్లలేకపోతున్నారు. సకాలంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, స్టాంపింగ్ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసాలు జారీ అయ్యాక మూడు నెలల్లో కువైట్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రక్రియలు అయ్యేలోపే గడువు ముగుస్తోందని ఆందోళన చెందుతున్నారు. రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన కువైట్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కువైట్ విదేశాంగ శాఖ వీసాల జారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన లైసెన్స్డ్ ఏజెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. సెలవు రోజుల్లో మినహా రోజూ 2 వేల వరకు వీసాలు జారీ చేస్తోంది. కువైట్ వీసా పొందిన ప్రతి ఒక్కరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాలి. పాస్పోర్టు కార్యాలయం ద్వారానే పీసీసీ పొందాల్సి ఉంటుంది. అయితే పీసీసీల జారీలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. గతంలో 2, 3 రోజుల్లో పీసీసీలను జారీ చేసేవారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి 25 రోజులవుతోంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని తరువాత ముంబై, ఢిల్లీలోని కువైట్ ఎంబసీల్లో ఎక్కడో ఓచోట స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాంపింగ్ ప్రక్రియలోనూ తీవ్ర కాలయాపన జరుగుతోందని వలస కార్మికులు చెబుతున్నారు. 5 రోజుల్లో పూర్తి కావాల్సిన స్టాంపింగ్కు 20 రోజులకు మించి పడుతోందని వాపోతున్నారు. పీసీసీ, స్టాంపింగ్ల కోసం నెలన్నర పడుతోందని, ఒకవేళ స్లాట్ సకాలంలో బుక్ కాకపోతే మరింత ఎక్కువ సమయం అవుతోందని చెబుతున్నారు. దీంతో వీసా జారీ అయ్యాక 3 నెలల్లో కువైట్కు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియలు ఆలస్యమై వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసాలను రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. భారీగా పెరిగిన స్టాంపింగ్ ఫీజు కువైట్ ఎంబసీలో స్టాంపింగ్ ఫీజును భారీగాపెంచారు. గతంలో రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. కువైట్ విదేశాంగ శాఖనే భారీగా ఫీజు పెంచిందని, తమ చేతిలో ఏం లేదని మన విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. వీసాల జారీకి అనుగుణంగా పీసీసీ, స్టాంపింగ్ ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని వలస కార్మికులు కోరుతున్నారు. -
వలస కూలీపై సామూహిక అత్యాచారం
సాక్షి, గుంటూరు, రేపల్లె రూరల్, సాక్షి, అమరావతి : బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీ కుటుంబంపై మానవ మృగాలు దాడి చేశాయి. నాలుగు నెలల గర్భిణిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు పరారయ్యారు. గంటల వ్యవధిలోనే ఆ మృగాలని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఓ కుటుంబం తాపీ పని నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు శనివారం రాత్రి గుంటూరు నుంచి రేపల్లె రైల్వే స్టేషన్కు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు బస్సులు, ఆటోలు లేకపోవటంతో తమ ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారంపై నిద్రించారు. సమయం అడిగి భర్తతో వివాదం.. ఆపై.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్లాట్ఫారంపైకి మద్యం మత్తులో వచ్చిన ముగ్గురు దుండగులు నిద్రిస్తున్న బాధితురాలి (25) భర్తను లేపి సమయం ఎంతైందని అడిగారు. తన దగ్గర వాచ్లేదని సమాధానం చెప్పగా, ఆ వ్యక్తి వద్ద ఉన్న రూ.750 లాక్కొని దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న భార్య తన భర్తను కొట్టవద్దని ప్రాధేయపడగా.. వారిలో ఇద్దరు ఆమెను ప్లాట్ఫారంపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. తర్వాత మరో నిందితుడూ వారితో కలిశాడు. ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్కు వెళ్లి.. పలుమార్లు తలుపు కొట్టినా ఎవరూ స్పందించలేదు. వెంటనే స్టేషన్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న రిక్షా కార్మికులను ఆశ్రయించాడు. బాధితురాలి కుటుంబసభ్యుడికి రూ.50 వేల సాయం అందజేస్తున్న మోపిదేవి రాజీవ్, మంత్రి మేరుగ తాము సహాయం చేయలేమని, కొంత దూరంలో పోలీసు స్టేషన్ ఉందని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్కు పరుగు పరుగున చేరుకుని విషయం చెప్పాడు. సర్కిల్ కార్యాలయ పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్ చేరుకునే లోపు జీపు సైరన్ విన్న దుండగులు పరారయ్యారు. లైంగిక దాడికి గురైన బాధితురాలిని తక్షణ వైద్య సేవల నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 4 నెలల గర్భవతి అని వైద్యాధికారులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని, అమె కుటుంబ సభ్యులను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, బాధితురాలి భర్త ఫిర్యాదుతో రేపల్లె సీఐ వి.సూర్యనారాయణ ఐపీసీ సెక్షన్లు 376(డీ), 394, 307 ఆర్/డబ్యూ 34తో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎప్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో గంధం రవీందర్లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించారు. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై నిందితులవి రెండు జతల చెప్పులు పడివుండటంతో వాటిని డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేయగా, అవి కొంతదూరంలో నిందితులలో ఒకరు చొక్కా మార్చుకున్న చోటుకు వెళ్లాయి. అక్కడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు రేపల్లె పట్టణంలోని 24వ వార్డుకు చెందిన పోలుబోయిన విజయ్కృష్ణ, పాలుచూరి నిఖిల్, మరో మైనరు (16) బాలుడిగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వారిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడు ఇప్పటికే మూడు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడన్నారు. వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి, శిక్షపడేలా చూస్తామన్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. కాగా, రైల్వే పోలీసులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే అధికారులెవరూ స్పందించలేదు. ఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అజయ్ప్రసాద్ విలేకర్లతో మాట్లాడేందుకు నిరాకరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం ఒంగోలు అర్బన్: మహిళలకు సంబంధించిన ఘటనలు సున్నితమైనవి కాబట్టి వాటిని ఎవరైనా సరే సున్నితంగానే చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. రేపల్లె ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలిని ఆదివారం ఆమె ఒంగోలు జీజీహెచ్లో పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులు ప్రకాశం జిల్లా వాసులు కావడంతో మెరుగైన వైద్యం, రిహాబిలిటేషన్ కోసంఒంగోలు జీజీహెచ్కు తరలించామన్నారు. బాధితురాలి కుటుంబసభ్యుడికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చెక్కుని అందజేస్తున్న మంత్రి విడదల రజని మహిళా కమిషన్ సీరియస్ అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటన సమాచారం తెలియగానే చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్తో ఫోన్లో మాట్లాడారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. రైల్వేస్టేషన్లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించి పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చారన్నారు. అత్యాచార నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆదివారం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మోపిదేవి రాజీవ్, మోపిదేవి హరనాధబాబులతో కలసి బాధితురాలిని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. సమాచారం తెలియగానే సీఎం జగన్ తమను అప్రమత్తం చేశారన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు తనయుడు రాజీవ్.. బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాల వద్ద, ఒంగోలు జీజీహెచ్ వద్ద హడావుడి చేశారు. -
ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం జరిపే ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఈ సందర్భాన్ని 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) గా నిర్వహిస్తున్నారు. చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఏర్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుండి తెలంగాణకు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2022 వరకు దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. బతుకుదెరువు కోసం ఎడారి బాట పట్టిన 15 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల కన్నీటి గాథ ఇది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందో అని ప్రవాసీ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమిని వదిలి వలస వెళ్లిన అభాగ్యులు గల్ఫ్ దేశాలలో అసువులు బాస్తున్నారు. శవపేటికల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. కొందరిని అక్కడే ఖననం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల ఆసుపత్రుల మార్చురీలలో వందలాది భారతీయుల మృతదేహాలు మగ్గుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు.. స్వరాష్ట్రంలో మొండి చేయి ఆమ్నెస్టీ కారణంగా 2007 లో యూఏఈ దేశం నుండి వాపస్ వచ్చి అప్పుల బాధతో ఉత్తర తెలంగాణ కు చెందిన 29 మంది గల్ఫ్ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ 9 మే 2008 నాడు జీఓ (నెం. 266) ను జారీ చేసింది. ఆ తర్వాతి కాలంలో గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన పేద కార్మికులకు కూడా ఆర్ధిక సహాయం చేయడం ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట ప్రభుత్వం, ఆనాటి కరీంనగర్ జిల్లాలోని 34 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ జీఓ నెం.1840 ను 24 ఏప్రిల్ 2013 న జారీ చేసింది. గవర్నర్ పాలనలో ఆరు పాత జీఓ లను రీ-వాలిడేట్ చేసి జారీ చేసిన జీఓ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వేలాదిమంది గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. అప్పటి ప్రభుత్వం 100 మందికి లోపే ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. గుండెపోటు మరణాలు అధికం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్నారైలు ఎక్కువగా హృదయ సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తున్నారు. పగలు ఎండలో.. రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు ఆకస్మిక మరణాలకు కారణాలని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గల్ఫ్ ఆత్మహత్యలు గల్ఫ్ దేశాల్లో భారతీయుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరిఅయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, ప్రియమైన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిస అవడము లాంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోవిడ్ కు పూర్వం విదేశాలలో మరణాలు 2014 నుండి 2019 వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 33,930 మంది ప్రవాస భారతీయులు మృతి చెందారని ప్రభుత్వం 20 నవంబర్ 2019 న లోక్ సభకు తెలిపింది. ఆరేళ్లలో సౌదీ అరేబియా (15,022), యుఏఈ (9,473), కువైట్ (3,580), ఓమాన్ (3,009), ఖతార్ (1,611), బహరేన్ (1,235) మంది ఎన్నారైలు చనిపోయారు. ఆరు గల్ఫ్ దేశాలలో 89 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా ఇందులో సగటున రోజుకు పదిహేను మంది ఎన్నారైలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉండగా 2015 నుండి 2019 వరకు అయిదు సంవత్సరాల కాలంలో 125 దేశాలలో మృతి చెందిన 21,930 మంది మృతదేహాల శవపేటికలను భారత్ కు తెప్పించామని ప్రభుత్వం 5 ఫిబ్రవరి 2020 న లోక్ సభకు తెలిపింది. వీటిలో అత్యధికం గల్ఫ్ దేశాలలో సంభవించాయి. కోవిడ్ వలన మరణాలు విదేశాలలో కోవిడ్ వలన 4,048 మంది ఎన్నారైలు మృతి చెందారని ప్రభుత్వం 3 డిసెంబర్ 2021 న లోక్ సభ కు తెలిపింది. సౌదీ అరేబియా (1,154), యుఏఈ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109) ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 3,576 మంది కోవిడ్ తో చనిపోయారు. అన్ని దేశాల మొత్తం మరణాలలో పోలిస్తే గల్ఫ్ లోనే 88 శాతం మంది కోవిడ్ తో మృతి చెందారు. ప్రమాదాల్లో విదేశాలలో ప్రమాదాల్లో మరణించిన భారతీయుల వివరాలను 3 డిసెంబర్ 2021 న ప్రభుత్వం లోక్ సభ లో వెల్లడించింది. గత మూడేళ్లలో 63 దేశాలలో 2,384 మంది ఎన్నారైలు ప్రమాదాలలో మృతి చెందారు. సౌదీ అరేబియా (683), యుఏఈ (370), కువైట్ (195), ఓమాన్ (94), ఖతార్ (60), బహరేన్ (44) ఆరు గల్ఫ్ దేశాలలో 1,446 మంది ప్రమాదాలలో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారతీయుల ప్రమాద మరణాలలో గల్ఫ్ లోనే 61 శాతం సంభవించాయి. ఇదిలా ఉండగా గత మూడేళ్లలో నేపాల్ (227), ఫిలిప్పీన్స్ (153), మలేసియా (76), సింగపూర్ (55) మంది ప్రమాదాల్లో మృతి చెందారు. విదేశాల్లో 468 ప్రమాద పరిహార కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కువైట్ (142), ఓమాన్ (127), సౌదీ అరేబియా (85), ఖతార్ (41), యుఏఈ (24) కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎడారిలో ఎండమావులు... కేసీఆర్ గల్ఫ్ హామీలు 14 ఏళ్ళ క్రితం... 2008 లో పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ ప్రసంగం యధాతదంగా (వీడియో ట్రాన్స్క్రిప్ట్): తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేలకోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు వెంటనే ప్రభుత్వం 500 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి, విడుదల చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ఎన్నారైల పిల్లలను స్థానికులుగా పరిగణించి, కేరళ ప్రభుత్వం ఏవిధంగా సాయం అందిస్తుందో అదే విధంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో చనిపోయిన , ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ఆదుకోవడంతో పాటు స్వదేశం రావడానికి, గల్ఫ్ లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. మానవ వనరుల ఎగుమతి.. ఇంధనాల దిగుమతి భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కార్మికులను (మానవ వనరులను) ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నది. ఇది మనుషులను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే పక్కా ఎగుమతి, దిగుమతి వ్యాపారం. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలు మనం వెలకట్టగలమా ? ఈ దేశం కోసం డ్యూటీలో భాగాంగా ఎడారిలో దిక్కులేని వారిగా చనిపోయిన మన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను "గల్ఫ్ అమరులు" అని పిలుచుకుందాం అని ప్రవాసీ సంఘాలు అంటున్నాయి. దేశ సరిహద్దులు దాటి అరబ్ గల్ఫ్ దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న భారత సైనికుల మాదిరిగా వలస కార్మికులు కూడా దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు 95% ఒంటరిగానే వెళుతున్నారు. తక్కువ వేతనం వలన కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళలేరు. 15 లక్షల మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వీరు ప్రతి నెలా రూ. 1,500 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కు పంపిస్తున్నారు. ఈ విదేశీ మారకద్రవ్యంతో (ఫారిన్ ఎక్స్చేంజి) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ (పెట్రోల్, డీజిల్) ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రవాసీ కుటుంబాలు ప్రతి నెల పొందుతున్న 1,500 కోట్ల రూపాయల సొమ్ము వినిమయంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నులు వసూలయినా నెలకు 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి జమ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతున్నది. ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏమైంది ? 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయింది. కేరళ, పంజాబ్ తరహా విధానాలను అవలంభిస్తామని తరుచూ చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేక ప్రవాసి మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు. ఇప్పటికీ సాధారణ పరిపాలన శాఖ (జిఏడి) లో ఎన్నారై సెల్ అని ఒక విభాగం మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ఏర్పాటు చేయాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. - మంద భీంరెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) +91 98494 22622, mbreddy.hyd@gmail.com] చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్ -
పరాయి దేశాల్లో పడరాని పాట్లు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్పోర్ట్, విమానం టికెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. సిక్కోలు (శ్రీకాకుళం) జిల్లాకు చివర్లో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులను మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగుల యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. నా భర్త ఏమయ్యాడో.. నా పేరు పుచ్చ అనుసూయమ్మ. మాది వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడు గ్రామం. నా భర్త కుర్మారావు 2019లో సౌదీకి ఉపాధి కోసం వెళ్లాడు. అల్ మసాలిక్ కంపెనీలో చేరాడు. రెండు నెలలుగా అచూకీలేదు. నా భర్తకు ఏమైందో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీడంలేదు. ఎస్పీ, జిల్లా కలెక్టర్లను ఆశ్రయించాం. చివరికి నా భర్త పనిచేస్తున్న కంపెనీని మెయిల్ ద్వారా సమాచారం కోరాం. ఎలాంటి సమాచారంలేదు. మన వారిని చూసి కన్నీళ్లొచ్చాయి.. విదేశాల్లో మనవారు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. టూరిస్ట్ వీసాలతో మోసపోయి సుమారు 60 మంది దుబాయ్లో అనేక కష్టాలుపడ్డారు. కడుపు నింపుకోవడం కోసం ప్రతీ శుక్రవారం మసీదుల వద్ద ఉచితంగా అందించే రొట్టెలు, పండ్లు కోసం క్యూ కట్టేవారు. రాత్రి సమయంలో ఇసుక తిన్నెలపై పడుకునేవారు. పోలీసుల కంటపడకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయా.. – హెచ్చర్ల కుమారస్వామి, బాధితుడు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం. ఉద్యోగాలివ్వకుండా మోసం.. సింగపూర్లోని రొమేనియాలో ఉద్యోగాలిప్పిస్తామని కంచిలి మండల పరిధి కత్తివరం రోడ్డులోగల శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని బసవ వెంకటేష్ మోసం చేశాడు. మా వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశాడు. డబ్బులు కట్టినప్పటికీ ఉద్యోగాలకు పంపించలేదు. రెండేళ్లుగా మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ ఇవ్వడంలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. మోసగాడు తప్పించుకు తిరుగుతున్నాడు. – దుంగ తారకేశ, ఇన్నీసుపేట, ఈరోతు తారకేశ్వరరావు, సన్యాసిపుట్టుగ, సంగారు సురేష్, కపాసుకుద్ది మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ► ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ► కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి 70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ► అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమ్మబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. ఒక ఉద్యోగం అని చెప్పి.. వేరే ఉద్యోగం ఇచ్చి.. శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు ఓటీతో కలిపి రూ.25వేలు వరకు వచ్చే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశారు. తీరా వారం రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి అక్కడి గమేజ్ ట్రేడింగ్ కంపెనీలో నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలిచ్చి మోసంచేశారు. ఏజెంట్ చెప్పిన ప్రకారం ఏదిలేదు. మాకు జరిగిన మోసంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మేం కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలి. – శ్రీలంక నుంచి బాధితులు పురుషోత్తం, బినోద్ నాయక్, శివ -
‘బూస్టర్’ తీసుకున్న వారికే యూఏఈ అనుమతి
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కొత్త నిబంధనలను విధించింది. టీకా రెండు డోస్లు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమలులోకి రానుంది. సాధారణంగా ఎక్కడైనా రెండు డోస్ల టీకాలనే ఇస్తున్నారు. మన దేశంలో బూస్టర్ డోస్ కేవలం ఫ్రంట్లైన్ వారియర్స్కే ఇవ్వాలని నిర్ణయించారు. ఇతరులకు బూస్టర్ డోస్ ఇచ్చే ఆంశం ఇంకా వైద్య ఆరోగ్య శాఖ పరిశీలనలో ఉంది. దేశంలో కోవిషీల్డ్ టీకా ఎక్కువగా ఇస్తుండగా మొదటి డోస్కు, రెండో డోస్కు 84 రోజుల కాలపరిమితి విధానాన్ని అమలు చేస్తున్నారు. కేవలం విదేశాలకు వెళ్లే వారికి వీసా ఉంటేనే నెల రోజుల వ్యవధిలో రెండు డోస్ల టీకాలను ఇస్తున్నారు. ఇప్పుడు బూస్టర్ డోస్ అంశాన్ని యూఏఈ తెరమీదపైకి తేవడంతో యూఏఈ వెళ్లే వలస కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. వీసా గడువు సమీపించే వారికి కేంద్రం బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు. డోస్ల మీద డోస్లు.. దేశంలో 2 డోస్ల టీకా కార్యక్రమం ఇంకా సాగుతుండగా యూఏఈలో వలస కార్మికులకు డోస్ల మీద డోస్ల టీకాలు వేస్తున్నారు. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్లను దృష్ట్యా చైనా ఉత్పత్తి చేసిన సినోఫాం టీకా రెండు, మూడు డోస్లు ఇచ్చారు. సినోఫాం టీకాతో వైరస్ కట్టడి కావడం లేదని తాజాగా ఆ టీకాలు మూడు డోస్లు తీసుకున్నవారికి మళ్లీ ఫైజర్ టీకా ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికీ 3, 4 డోస్లకు మించి టీకాలు ఇస్తున్నారు. చదవండి: ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!! -
జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం
మానవ వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ. వలసలకు, అభివృద్ధికి, మానవ వికాసానికి సంబంధం ఉన్నది. వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ వలసలు ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం వలసలకు ఒక కారణం కాగా, అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. కోవిడ్ మరణాలు కోవిడ్ పరిస్థితుల వలన తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా ఆరు గల్ఫ్ దేశాలలో 3,576 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో 200 కు పైగా తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. సౌదీ అరేబియా (1,154), యుఏఇ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109). వందే భారత్లో కోవిడ్ సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు 'వందే భారత్ మిషన్' లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. యుఏఇ (3,30,058), సౌదీ అరేబియా (1,37,900), కువైట్ (97,802), ఓమాన్ (72,259), ఖతార్ (51,190), బహరేన్ (27,453) వేల మంది భారతీయులు ఇండియాకి తిరిగి వచ్చారు. జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్ కరోనా సమయంలో గల్ఫ్ నుండి హడావిడిగా వెళ్లగొట్టబడిన కార్మికులకు జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) రాబట్టుకోవడం కోసం 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' అనే ఉద్యమం నడుస్తున్నది. వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసింది. వాపస్ వచ్చినప్పుడు అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడైనాయి. భారంగా మారిన తిరుగు ప్రయాణం కరోనా తగ్గుముఖం పట్టడంతో వాపస్ వచ్చిన వలస కార్మికులు తిరిగి గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కరోనా టెస్టులు, అధిక విమాన చార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొత్తగా ఉద్యోగుల రిక్రూట్మెంట్ కూడా పుంజుకుంటున్నది. కరోనా సందర్భంగా రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆదుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, రూ. 8 లక్షల నుంచి రూ. 4 లక్షలకు తగ్గించింది. వలస కార్మికులు చెల్లించే సర్వీస్ చార్జీలు రూ.30 వేలు దీనిపై 18 శాతం జీఎస్టీ మాత్రం తగ్గించలేదు. ప్రవాసీ విధానం ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరి చూస్తున్నారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఆన్లైన్ ఓటింగ్ 38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎన్నారైలకు 'ప్రాగ్జీ' ఓటింగు (ప్రతినిధి ద్వారా, పరోక్ష పద్ధతిలో ఓటు వేయడం) లేదా ఆన్ లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీస వేతనం గల్ఫ్ దేశాలలో పనిచేసి భారతీయ కార్మికులకు భారత ప్రభుత్వం కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీ చేసింది. అన్నివర్గాల ఒత్తిడితో ఆ తర్వాత ఆ సర్కులర్లను రద్దు చేశారు. భారత విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాలలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విదేశీ భవన్ కావాలి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయి లో ఏర్పాటు చేసిన విధంగా "విదేశ్ భవన్" ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (సమీకృత సముదాయం) లో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు ఉంటాయి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం 'ప్రవాసీ తెలంగాణ దివస్' ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసులు అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ ... - మంద భీంరెడ్డి (+91 98494 22622 ) -
Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం
సౌదీ అరేబియా రెసిడెన్సీ వర్క్ పర్మిట్ల విషయంలో కొత్త చట్టం చేసింది. మూడు నెలలకు ఓసారి అక్కడ పని చేస్తున్న కార్మికులకు రెసిడెన్సీ వర్క్ పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సౌదీ అంతర్గత వ్యవహరాలు, మానవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలో పని చేస్తున్న వలస కార్మికులు నివాసం ఉండేందుకు జారీ చేసే పర్మిట్లను ఇకమాగా పేర్కొంటారు. వలస కార్మికులకు పని కల్పించే ఎంప్లాయర్లే ఈ పర్మిట్లకు సంబంధించిన ఫీజులు చెల్లిస్తూంటారు. గతంలో ఏడాదితో పాటు ఆరు నెలలు, తొమ్మిది నెలల కాలానికి ఈ పర్మిట్లు జారీ చేసేవారు. అయితే ఇక్మాల జారీని మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కనీస కాలపరిమితి మూడు నెలలకు తీసుకువచ్చారు. అయితే ఇళ్లలో పని చేస్తున్న కార్మికులు కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక్మా రెన్యువల్ చేసుకునేవారు అబ్షేర్ ఇండివిడ్యువల్, అబ్షేర్ బిజినెస్, ముఖీమ్, కివా వంటి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్లను ఉపయోగించుకోవచ్చు. స్వల్పకాలానికి సంబంధించిన పనులకు వలస కార్మికులను రప్పించుకునే విషయంలో కొత్త నిబంధనల వల్ల ఎంప్లాయర్లకు తక్కువ భారం పడుతుందని సౌదీ ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగానికి ఎంతో ఊతం లభిస్తుందని పేర్కొంది. -
ఉచిత వీసాలతో దళారుల దందా..
మోర్తాడ్ (బాల్కొండ) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఎం.నర్సయ్య నిర్మల్లో ఒక ఎజెన్సీ నిర్వహించిన గల్ఫ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉచిత వీసా అనే ఉద్దేశంతో నర్సయ్య ఇంటర్వ్యూకు వెళ్లగా వీసా కోసం ఏజెంట్ అతనిని రూ.50వేలు డిమాండ్ చేశాడు. ఇది నర్సయ్య ఒక్కనిదే కాదు ఎంతో మంది వలస కార్మికులకు ఎదురవుతున్న సమస్య. తమ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఆబుదాబి నేషనల్ హోటల్ కంపెనీ(ఏడీఎన్హెచ్) ఉచితంగా జారీ చేస్తున్న వీసాలను కొందరు దళారులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. యూఏఈలోని విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు, ఇతరులకు భోజనం సరఫరా చేసే కేటరింగ్ను ఏడీఎన్హెచ్ సంస్థ నిర్వహిస్తుంది. తమ కేటరింగ్ నిర్వహణ కోసం ఎక్కువ సంఖ్యలో కార్మికులు అవసరం కావడంతో ఏడీఎన్హెచ్ సంస్థ భారీ రిక్రూట్మెంట్కు ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో లైసెన్స్డ్ గల్ఫ్ ఎజెన్సీల ద్వారా ఏడీఎన్హెచ్ సంస్థ నియామకాలను కొనసాగిస్తోంది. 21 ఏళ్ల వయస్సు నిండి 35 ఏళ్ల లోపువారు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉంటే ఉచిత వసతి, భోజన సదుపాయాలను సదరు సంస్థ కల్పిస్తుంది. క్లీనింగ్ వర్క్ వీసాలను జారీ చేస్తున్న సంస్థ వలస కార్మికులకు నెలకు రూ.18 వేల వరకు వేతనం చెల్లిస్తుంది. ఎలాంటి వీసా చార్జీలు, విమాన టిక్కెట్, మెడికల్ చార్జీలు లేకుండా కార్మికులు యూఏఈలో ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. అయితే కొందరు గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత వీసాలే అయినా వలస కార్మికుల నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా జగిత్యాల్, పెర్కిట్, నిజామాబాద్లలోని ఒక సంస్థ మాత్రం ఉచితంగానే కార్మికులను రిక్రూట్మెంట్ చేసి యూఏఈకి పంపించింది. గల్ఫ్కు వలసలు ఆరంభమైన మొదట్లో కొనసాగిన ఉచిత రిక్రూట్మెంట్ కరోనా పరిస్థితుల తరువాత మళ్లీ కొనసాగడం విశేషం. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రిక్రూట్మెంట్కు సంబంధించి లైసెన్స్డ్ ఏజెంట్లే నియామకాలు చేపట్టాల్సి ఉండగా దళారుల దందా కొనసాగుతుండటం గమనార్హం. కార్మికులకు అవగాహన లేక నష్టపోతున్నారు... ఉచిత వీసాలపై కార్మికులకు అవగాహన లేక నష్టపోతున్నారు. కంపెనీలు జారీ చేసే ఉచిత వీసాలకు ఎవరూ చార్జీలు వసూలు చేయవద్దు. కాని వలస కార్మికుల అవసరాలను కొందరు ఏజెంట్లు ఆసరాగా తీసుకుంటున్నారు. కార్మికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్ఆర్ఐ సెల్పై ఉంది. – దొనికెన కృష్ణ, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కొందరు రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నారు... ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఎవరైనా వలస కార్మికులకు వీసా జారీ చేసి గల్ఫ్కు పంపిస్తే 45 రోజుల వేతనం లేదా రూ.30 వేలను ఫీజుగా తీసుకోవచ్చు. ఒక వేళ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేస్తే కార్మికులను రిక్రూట్మెంట్ చేసే ఎజెన్సీలకు ఆ కంపెనీ ఫీజు చెల్లిస్తుంది. ఏడీఎన్హెచ్ కంపెనీ ఉచితంగా వీసాలను జారీ చేసి కార్మికులకు లబ్ధి చేకూరుస్తుంది. అయితే ఈ కంపెనీ వీసాలతో కొందరు ఏజెంట్లు రెండు రకాలుగా లబ్ధి పొందుతున్నారు. కంపెనీ నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందుతూనే వలస కార్మికుల నుంచీ వసూలు చేస్తున్నారు. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు -
వలస కార్మికులకు ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని కొన్ని కంపెనీలు వలస కార్మికులకు తిరిగి స్వాగతం చెబుతున్నాయి. గతంలో వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసిన ఏజెన్సీలు ప్రస్తుతం ఉచిత రిక్రూటింగ్ను చేపట్టాయి. కరోనా కారణంగా కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను ఇళ్లకు పంపించేయడంతో అనేక పోస్టులు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, కంపెనీల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇప్పుడు వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. దీంతో యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి ఎయిర్పోర్టులలో క్లీనింగ్ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులను తరలిస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల్, ఆర్మూర్లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్ను కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలను సర్వీస్ చార్జీలుగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు వలసలు మొదలైన ఐదు దశాబ్దాల కింద ఉచిత రిక్రూటింగ్ జరిగింది. ఇదిలాఉండగా ఇక్కడి వారికి ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో మన ప్రాంతంలో కొనసాగుతున్న ఇంటర్వూ్యలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం. ఇప్పటివరకు ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 2వేల మందిని యూఏఈ తరలించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు వివరించారు. -
కొత్త వీసాల జారీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
మోర్తాడ్ (బాల్కొండ): కొత్తగా వచ్చే వలస కార్మి కులకు వీసాలు జారీ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నుంచి కువైట్, కార్మికులకు కొత్త వీసాల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కువైట్లో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో కువైట్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సమయంలో విదేశీ వలస కార్మికులు పెద్ద ఎత్తున స్వస్థలాలకు తరలిపోవడంతో ప్రస్తుతం కువైట్లో కార్మికుల కొరత ఏర్పడింది. గతంలో వీసా గడువు ఉన్నా కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులను ఇంటికి పంపించిన కంపెనీలు పాత కార్మికులను మళ్లీ రావాల్సిందిగా కోరుతున్నాయి. కొత్త వీసాల జారీకి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అవసరం ఉన్న రంగాల్లో వలస కార్మికులను రప్పించుకోవడానికి ఆయా కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కువైట్ ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ–శ్రమ్ పోర్టల్లోకి 4 కోట్ల అసంఘటిత కార్మికులు
న్యూఢిల్లీ: ప్రారంభించిన రెండు నెలల్లోపే 4 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల పేర్లు ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదయ్యాయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఆదివారం తెలిపింది. నిర్మాణం, దుస్తుల తయారీ, మత్స్య, వ్యవసాయ, రవాణా తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్న వారంతా పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. చాలా రంగాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో అత్యధిక భాగం నిర్మాణ, వ్యవసాయ రంగాలకు చెందిన వారేనని పేర్కొంది. ఈ పోర్టల్ ఆధారంగానే అసంఘటిత రంగ కారి్మకులకు అన్ని రకాల సామాజిక భద్రత, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు అందుతాయని వెల్లడించింది. మొత్తం 4.09 కోట్ల అసంఘటిత రంగ కారి్మకుల్లో 50.02% మంది లబి్ధదారులు మహిళలు కాగా 49.98% మంది పురుషులని వివరించింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని కూడా తెలిపింది. నమోదైన వారిలో ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపింది. నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ–శ్రమ్ మొబైల్ అప్లికేషన్ను గానీ వెబ్సైట్ను గాని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంకా, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీలు), రాష్ట్ర సేవా కేంద్ర, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్ సేవా కేంద్రాలకు వెళ్లాలని వివరించింది. నమోదైన వారికి దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే డిజిటల్ ఈ–శ్రమ్ కార్డు అందజేస్తారనీ, వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ–శ్రమ్ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవికలత్వం ప్రాపించినా రూ.2 లక్షల పరిహారం అందుతుందనీ, పాక్షిక అంగ వైకల్యమైతే రూ.1 లక్ష సాయం అందుతుందని తెలిపింది. -
బహ్రెయిన్ నుంచి క్షేమంగా తిరిగొస్తున్న వలస కార్మికులు
సాక్షి, అమరావతి: బహ్రెయిన్లో ఎన్హెచ్ఎస్ సంస్థలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 33 మందిని బహ్రెయిన్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు భోజనం, వసతి, స్వస్థలాలకు రవాణా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది కార్మికులను వెనక్కి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎన్హెచ్ఎస్ సంస్థ దాష్టీకాలు భరించలేక ఇబ్బందులు పడుతూ అక్కడ ఇరుక్కుపోయిన కార్మికుల విషయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లగానే.. ఆయన తక్షణం స్పందించినట్టు తెలిపారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెప్టెంబర్ 13న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. దీనిపై విదేశాంగ శాఖ తక్షణం స్పందించడంతో కార్మికులను స్వదేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. -
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం
సాక్షి, అమరావతి/రేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో ఒడిశా వలస కూలీలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా.. ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆ మొత్తాలను చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందజేశారు. ఆక్వా చెరువుల యాజమాన్యం తరఫున రూ.5 లక్షల చొప్పున అందించారు. మరోవైపు ఒడిశా ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునా«థ్ గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి.విష్ణుప్రసాద్ పండా తదితరులు పాల్గొన్నారు. -
తోటి వారిని కోల్పోయి.. బరువెక్కిన హృదయాలతో తిరుగు ముఖం
రేపల్లె (గుంటూరు): ఆ వలస కూలీలంతా కలిసే వచ్చారు. అగ్ని కీలల రూపంలో విరుచుకుపడిన ఆ కాళరాత్రి తమలో ఆరుగుర్ని సజీవ దహనం చేయడంతో భయకంపితులయ్యారు. అస్థికలుగా మారిన తోటి వారికి బరువెక్కిన హృదయాలతో అంత్యక్రియలు జరిపించారు. ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని తట్టుకోలేక.. తమతో వచ్చిన వారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక విలపిస్తూనే సొంతూళ్లకు పయనమయ్యారు. గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బ గ్రామంలోని బెయిలీ ఆక్వా ఫామ్లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర ప్రమాదంలో సజీవ దహనమైన ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన యువకులు నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అíస్థికలకు ఘటనా స్థలంలోనే ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి కూలీలు అదే గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. బావురుమన్న తల్లిదండ్రులు, బంధువులు ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఒడిశా నుంచి శనివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని కీలల్లో కాలిబూడిదైన అస్థికలను చూసి బావురుమన్నారు. మమ్మల్ని పోషించడం కోసం ఇంత దూరం వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ రోదించారు. వారితోపాటు వచ్చిన ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునాథ్ గుమెంగో ప్రమాదానికి గల కారణాలను ఇక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన గదిలోంచి బయటపడ్డ నలుగురు కూలీల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులు, బెయిలీ ఆక్వా ఫామ్ యాజమాన్యాన్ని కోరారు. ఒడిశా నుంచి మొత్తం 25 మంది వలస కూలీలు ఆక్వా ఫామ్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం రాగా.. గురువారం రాత్రి 10 మంది ఒక గదిలోను, 15 మంది మరో గదిలోను నిద్రించిన విషయం విదితమే. 10 మంది నిద్రించిన గదిలో ఆరుగురు అగ్ని కీలల్లో సజీవ దహనం కాగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటంతో భయాందోళనకు గురైన మిగిలిన 19 మంది కార్మికులు శనివారం సాయంత్రం తమ వారు లేరన్న బాధతో రోదిస్తూ స్వగ్రామాలకు పయనమయ్యారు. సమగ్ర విచారణకు డిమాండ్ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. శనివారం లంకెవానిదిబ్బ గ్రామానికి చేరుకున్న సీపీఎం, సీపీఐ (ఎంఎల్) నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఆరుగురి మృతిపై సమగ్ర విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇదిలావుండగా.. ప్రమాదానికి రొయ్యల చెరువు యజమాని నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గఫూర్, కార్యదర్శి నరసింగరావు శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. యజమానిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
ఒమన్ పొమ్మంటోంది!
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికులకు అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించిన ఒమన్ దేశం.. ఇప్పుడు వారిని వదిలించుకుంటోంది. స్వదే శీయులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బయటవారిని సాగనంపుతోంది. దీంతో వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టా డుతోంది. దీంతో అక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి, వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని ఒమన్ నిర్ణయించింది. ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో ఒమనీయులకు పెద్దపీట వేశారు. అలాగే, చిన్న, మధ్య తరహా వాహనాల డ్రైవింగ్లోనూ తమ ప్రజలకు అవకాశం కల్పిస్తూ, విదేశీ డ్రైవర్ల లైసెన్స్ల రెన్యూవల్ను నిలిపి వేశారు. దీనికి తోడు ప్రైవేటు రంగంలోనూ ఒమన్ పౌరులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణ కార్మికులకు పెద్ద దెబ్బ.. ఒమన్ నిర్ణయం తెలంగాణ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒమన్లో ఇప్పటివరకు ఉపాధి పొందిన విదేశీ వలస కార్మికులలో భారత్కు చెందిన వలసదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండగా, ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 1.25 లక్షల మంది ఉంటారని అంచనా. తాజా నిర్ణయంతో 80 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని అంచనా. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం .ఒమన్లో కొన్ని నెలల నుంచి భారతీయులే కాకుండా ఇతర దేశాల వ్యాపారులు, ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులకు కష్టకాలం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఒమన్లో బతకడం కష్టమే. –నరేంద్ర పన్నీరు, ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
వలస కార్మికులకు భద్రత ఏది?
లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల దుఃస్థితిపై సంవత్సరం పైగా విచారించిన సుప్రీంకోర్టు జూన్ 28న తన తీర్పును వెలువరించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ‘ఒకే దేశం, ఒకే రేషన్’ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ 2021 మే 6 నాటికి ఈ పథకం కింద 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని వార్తలు. పైగా వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి చాలా చోట్ల తిరస్కరించారని కూడా తేలింది. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న కార్మిక సంక్షేమ పథకాలన్నీ...అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తన శక్తిని మొత్తంగా దీనిపై కేంద్రీకరిస్తే యావద్దేశం దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా... సంఘటిత కార్మికుల్లాగే క్రమబద్ధమైన పని వాతావరణం, కాస్త ప్రాథమిక భద్రత మాత్రమే. వలస కార్మికుల కేసుగా అందరికీ తెలిసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును తాజాగా వెలువరించింది. గతేడాది లాక్డౌన్ కాలంలో భారీవలసల సందర్భంగా వలస కార్మికుల దుఃస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేసింది. సెకండ్ వేవ్ సమయంలోనూ దీనిపై విచారణ కొనసాగింది. జూన్ 28న ఉన్నత న్యాయస్థానం 7 పాయింట్లతో 80 పేజీల తీర్పును ప్రకటించింది. వీటిలో అయిదు అంశాలు–వలస కార్మికుల ఆహార భద్రతకు హామీ ఇవ్వడానికి సంబంధించినవి. వలస కార్మికులకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఉదారంగా వ్యవహరించి రేషన్ కార్డు లేని వారికి కూడా ఆహారం అందించాలని, సబ్సిడీ ధాన్యం కేటాయింపును పెంచాలని కోర్టు తీర్పు ఆదేశించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. వీటిలో చివరి అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది సుదీర్ఘకాలంగా చేస్తూవస్తున్న డిమాండే. న్యాయస్థానం తన తీర్పును ప్రభుత్వ యంత్రాంగం ఎలా అమలుచేస్తుందనే అంశంపై నిశితంగా పర్యవేక్షించాలని ఎవరైనా కోరుకుంటారు. కాగా వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అనే పథకాన్ని అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి న్యాయస్థానం హామీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం కోవిడ్–19 ఫస్ట్ వేవ్ తర్వాత ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. 2020 జూన్ 6న తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే గత సంవత్సర కాలంలో ఈ పథకం కింద చాలా కొద్ది మాత్రమే లబ్ధి పొందారని ప్రభుత్వ డేటానే చూపిస్తోంది. 2021 మే 6 నాటికి ఈ పథకంలో భాగంగా 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని ఇంటెగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నివేదించింది. ఈ పథకం కింద వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి దేశంలో పలుచోట్ల తిరస్కరించిన ఉదంతాలెన్నో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వలస కార్మికుల నమోదు వీటన్నింటిని పక్కనబెట్టి చూస్తే, వలస కార్మికులకు ఆహార భద్రతపై హామీ ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. పైగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు వలస కార్మికులు కాస్త ఎక్కువగానే కడుపు నింపుకుని సాధారణ పనులను నిర్వహించవచ్చు. ఇక తీర్పులోని చివరి రెండు అంశాలను ప్రాథమికంగా విమర్శించాల్సి ఉంది. ఈ రెండూ వలస కార్మికుల నమోదుకు సంబంధించినవి. ఇదే చాలా ముఖ్యమైనది.ఎలాంటి లక్ష్య బృందానికైనా ఈ పథకం లబ్ధి్ద కలిగించాలని ఎవరైనా భావిస్తే, ముందుగా ఈ లక్ష్య బృందంలోని అందరినీ గుర్తించాల్సి ఉంది. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో ఉన్నారు అనే అంశంపై ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేనందునే ఫస్ట్ వేవ్ కాలంలో వలస కార్మికులు భారీ స్థాయిలో వలస పోయారు. అందుకే వలస కార్మికుల నమోదు అంశంపై న్యాయస్థానం తీర్పు అధికంగా దృష్టి సారించింది. న్యాయస్థానం తన తీర్పును ఎలా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వాలూ, పౌర సమాజ సంస్థలూ, సంబంధిత పిటిషన్తో పాక్షికంగా సంబంధంలో ఉండి కోర్టుకు సహకరించిన న్యాయవాదులూ మొత్తంగా క్షేత్ర వాస్తవికతను పూర్తిగా పట్టించుకోలేదనే చెప్పాలి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తన తొలి తీర్పులో అసంఘటిత కార్మికుల గణన ప్రక్రియను ప్రారంభించడంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందని దుయ్యబట్టింది. పైగా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్(ఎన్డీయూడబ్ల్యూ)ని ఏర్పాటు చేయడానికి తుది గడువును కూడా నిర్ణయించింది. తర్వాత అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్ఎమ్డబ్ల్యూ యాక్ట్)ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లయితే, అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ రూపంలో ప్రత్యేక నమోదు ప్రక్రియ అవసరమే ఉండదు. అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియకు సంబంధించిన గత చరిత్రను న్యాయస్థానం ఎత్తి చూపలేదు. ప్రస్తుత అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన తొలి అయిదేళ్ల పాలనలో శ్రమయేవ జయతే పేరిట అసంఘటిత కార్మికులను భారీ స్థాయిలో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అసంఘటిత కార్మికులందరి సంఖ్యను గుర్తించి వారికి స్మార్ట్ కార్డులు జారీ చేయడమే దీని లక్ష్యం. అయితే ఈ పథకం వెనుకపట్టు పట్టడానికి ముందు కొంతమందికి కార్డులు జారీ చేశారు. కార్మికుల నమోదు నత్తనడకన సాగుతున్న నిర్మాణ కార్మికుల బోర్డుల నమోదు చరిత్రను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అన్ని కార్మిక చట్టాలు ఆయా పనిస్థలాల్లో కార్మికుల పేర్లు నమోదు చేయాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఈ చట్టాల పరిధిలోనే పనికోసం ఒక చోటి నుంచి మరో చోటికి తరలి వెళ్లిపోయే వలస కార్మికులను నమోదు చేయడం జరగలేదు. సంక్షేమ పథకాల అమలు లోపం 1948 ఫ్యాక్టరీల చట్టం ద్వారా నిర్వహిస్తున్న పరిశ్రమలలో అనేకమంది వలస కార్మికులను గణనీయంగా నియమించుకున్నారు. ఈ శక్తిమంతమైన చట్టాన్ని పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టరేట్ అమలు చేస్తోంది. కానీ వాస్తవానికి ఈ చట్టం కింద చాలా కొద్దిమంది కార్మికుల పేర్లను మాత్రమే నమోదు చేసింది. గుజరాత్లోని సూరత్ నగరం వేలాది మరమగ్గాలతో కూడిన అతిపెద్ద వస్త్రపరిశ్రమ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి పనిచేసేవారిలో మెజారిటీ ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికులే. కానీ ఈ నగరంలో ఉన్న పరిశ్రమ యూనిట్ల సంఖ్య ఎంత అని ఎవరైనా డైరెక్టరేట్ని అడిగితే సమాధానం శూన్యమే. నగరంలో ఎన్ని మరమగ్గాలు ఉన్నాయి అని తెలిపే కనీస డేటా కూడా దీనివద్ద లేదు. కోర్టు ఈ మొత్తం వ్యవహారంపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఈ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి అనేకమంది కార్మికులు వేచి చూస్తున్నారని తీర్పులోని 70వ పేజీలో న్యాయస్థానం పేర్కొంది. కానీ, ఇవన్నీ కూడా గుర్తింపులేని అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న అసంఖ్యాక కార్మిక సంక్షేమ పథకాల సంఖ్యను కుదించి ఒక నమూనా స్కీమ్ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.వాస్తవానికి గుజరాత్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అసంఘటిత రంగ కార్మికులకు 20 పథకాలు అవసరం లేదు. వారికి ప్రాథమిక భద్రత, పీఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ వంటివి అవసరం. వీటిని పక్కనబెట్టి వివిధ బోర్డులలో కార్మికుల పేర్లను నమోదు చేసి వివిధ పథకాలను కేటాయించినా అవన్నీ ఆచరణలో విఫలమవుతాయి. దేశంలోని వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా.. కార్మిక చట్టాలు అందించే క్రమబద్ధమైన పని వాతావరణం, ప్రాథమిక భద్రత మాత్రమే. సుప్రీంకోర్ట్ తన శక్తిని దీనిపై కేంద్రీకరిస్తే దేశం దేశమే దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. సుధీర్ కటియార్ ‘సెంటర్ ఫర్ లేబర్ రీసెర్చ్ అండ్ యాక్షన్’ సభ్యులు. (‘ది వైర్’ సౌజన్యంతో) -
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. వలస కార్మికుల డాటా బేస్ నిమిత్తం జాతీయ స్థాయిలో వర్కర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ‘వలస కార్మికుల సమస్యలు, కష్టాలు’పై సుమోటో కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 80 పేజీల తీర్పు వెలువరించింది. ప్రతి వారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు, రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో కేంద్ర కారి్మక శాఖ కనబరుస్తున్న ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కారి్మకులకు రేషన్ సరుకుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకాలన్నీ జూలై 31 కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్ నేషన్–వన్ రేషన్ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలంది. రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగించాలని పేర్కొంది. వలస కార్మికులకు రేషన్ సరఫరా నిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకురావాలి. ఆ మేరకు కేంద్రం అదనపు ఆహారధాన్యాలను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగిన పథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది. చదవండి: ఆకలి మంటల్లో కార్మికులు! -
Lockdown Relaxation: బెంగళూరుకు వలసకూలీల వెల్లువ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా లాక్డౌన్ను సోమవారం నుంచి కొంచెం సడలిస్తుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వలసలు మళ్లీ ఆరంభమయ్యాయి. రాష్ట్రంలోని 30 జిల్లాలకు గానూ 11 చోట్ల మాత్రమే మరో వారం రోజుల పాటు లాక్డౌన్ కొనసాగిస్తుండగా, మిగతా 19 జిల్లాలకు సోమవారం నుంచి పరిమితంగా సడలింపు లభించింది. ఇందులో బెంగళూరు కూడా ఉంది. దీంతో ఆదివారం బెంగళూరులోని రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. వేలాది మంది వలస కూలీలు వచ్చారు. బయటి నుంచి వస్తున్నవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని సీఎం యడియూరప్ప ఆదేశించారు. దీంతో ప్రత్యేక శిబిరాలు పెట్టి నమూనాల సేకరణ చేపట్టారు. కాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేస్తే థర్డ్ వేవ్ తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: ఓ తల్లి దయనీయగాథ.. భుజాలపై పిల్లాడితో -
Deepsikha: ‘అక్కా ఇంట్లోంచి వెళ్లిపోదామా.. అమ్మ ఎలాగ మరి’!
దీపశిఖ ఢిల్లీలో బి.ఏ. చదువుతోంది. త్వరలోనే అక్కడినుంచి కేరళ వలస కూలీల పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు తీసుకోబోతోంది. కేరళ ప్రభుత్వం అందుకు ఆమెను ఎంపిక చేసుకుంది. దీపశిఖ కూడా వలస కూలీల కుటుంబంలోని అమ్మాయే. పేదరికం, తాగుడుకు బానిసైన తండ్రి, తండ్రి పెట్టే హింసకు మానసికంగా జబ్బున పడ్డ తల్లి, ఆలనా లాలన లేని ముగ్గురు తమ్ముళ్లు.. ఇంత అభాగ్యమైన పరిస్థితులలో ధైర్యంగా నిలదొక్కుకుంది. కోవిడ్ రిలీఫ్ వర్కర్గా ఇటీవలి వరకు పని చేసింది. ‘ఎవరిదీ అభాగ్యం కాదు. ఎందుకంటే మనకన్నా అభాగ్యులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కనుక..‘ అని అంటోంది ధీశాలి దీపశిఖ. కొన్నాళ్ల క్రితం వరకు ఏచూరులో ఉన్న దీపశిఖ ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లింది. కేరళ, కన్నూరు జిల్లాలోని ఎదక్కడ్ బ్లాక్లో ఉంటుంది ఏచూరు గ్రామం. అక్కడి ‘హోలీ మౌంట్’ పునరావాస కేంద్రంలో కోవిడ్ రిలీఫ్ వర్కర్గా ఆమె పని చేసింది. ఇప్పుడిక ఢిల్లీ యూనివర్సిటీలో క్లాసులు మొదలవడంతో హోలీ మౌంట్ చేయి వదలక తప్పలేదు. బి.ఎ. సంస్కృతం దీపశిఖది. ఆ అమ్మాయికి హిందీ వచ్చు, అస్సామీ వచ్చు. బెంగాలీ వచ్చు. మలయాళం వచ్చు. ఇంగ్లిష్ ఎలాగూ వచ్చే ఉంటుంది. ఇన్ని భాషలు వచ్చిన వారు సాధారణంగా వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలోని సమాచార విభాగంలో పని చేస్తుంటారు. అయితే దీపశిఖను కేరళ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంపిక చేసుకుంది. తను ఢిల్లీలోనే ఉంటుంది. అక్కడి నుంచి కేరళలోని వలస కార్మికుల పిల్లల కోసం ఆన్లైన్లో పాఠాలు చెబుతుంది. ‘కేరిటస్ ఇండియా’ పర్యవేక్షణలోని ‘కైరోస్ కన్నూర్’ ప్రాజెక్టు కింద దీపశిఖ కు ఈ బాధ్యతను అప్పగించారు. వలస కూలీలు తమ పిల్లల్ని చదివించడానికి ఎన్ని తిప్పలు పడతారో దీపఖకు తెలుసు కనుక ఆ ‘ఆఫర్’ను గొప్ప భాగ్యంగా స్వీకరించింది. దీపశిఖ కూడా వలస కూలీల ఇంటి బిడ్డే. ∙∙ పేదరికం ఒక్కటే ఉరుముతుంటే అమ్మ ఒడిలోనో, నాన్న చేతుల్లోనూ తల దాచుకోవచ్చు. దీపశిఖకు, ముగ్గురు తమ్ముళ్లకు నాన్నే ఉరుమయ్యాడు. ఆ ఉరుముకు దంచి అమ్మ మరొక తోబుట్టువు అయిందే తప్ప, అమ్మలా తమను అక్కున చేర్చుకోలేకపోయింది. దీపశిఖ తండ్రి దీపూదేవ్, తల్లి షీలాదేవ్ దీపశిఖకు ఆరు నెలల వయసుండగా ఉపాధి వెతుక్కుంటూ అసోం లోని మార్ఘరిటా నుంచి కేరళలోని కన్నూర్కు వలస వచ్చారు. తండ్రి తాగి రావడం, తల్లిని కొట్టడం, అన్నం లేదని పళ్లెం విసిరి కొట్టడం.. అప్పుడప్పుడు తమ్ముళ్లనీ కొట్టడం.. దీపశిఖ చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్ననాడనేముందీ.. టెన్త్, ఇంటర్ వరకు కూడా! భర్త కొట్టిన దెబ్బలకు షీల మానసిక ఆరోగ్యం దెబ్బ తినింది! ‘అక్కా ఇంట్లోంచి వెళ్లిపోదామా..’ అని ఎన్నోసార్లు తమ్ముళ్లు అన్నా.. ‘అమ్మెలాగ మరి!’ అనే ప్రశ్నే దీపశిఖను నిలిపేసేది. ఆమెను నిలిపింది ఆ ప్రశ్న ఒక్కటే కాదు. టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా. అప్పుడే అనుకుంది ఆ అమ్మాయి.. బాగా చదువుకుని అమ్మను బాగా చూసుకోవాలని. ఇంటర్లో మరింతగా కష్టపడి చదివింది. తెల్లవారు జామున మూడు గంటలకు లేచి చదివిందే ఆమె చదువు. రాత్రి తండ్రి చేసే గొడవతో, పగలు కాలేజీకి వెళ్లి రావడంతో చదవడం కుదిరేది కాదు. ∙∙ దీపశిఖ టెన్త్లో ఉండగా ఓ రోజు స్కూలుకు ‘చైల్డ్లైన్’ అధికారులు వచ్చారు. ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా అని పిల్లల్ని అడిగారు. దీపశిఖ తన సమస్య గురించి చెప్పింది. నాన్న తాగి రావడం, అమ్మ ఏడుస్తూ ఉండటం, తమ్ముళ్లు ముగ్గురూ తన చుట్టూ చేరడం.. అన్నీ చెప్పింది. ఆ మర్నాడే ‘కేరిటస్ ఇండియా’ వాళ్లు వచ్చి దీపశిఖను, మరికొందరు విద్యార్థినులను తమ ఆధ్వర్యంలోని ‘సాంత్వన భవన్’కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తోటి పిల్లల గురించి ఒక్కోటీ తెలుస్తున్నప్పుడు దీపశిఖకు తన కష్టాలు పెద్ద కష్టంగా కనిపించలేదు. తనకు మించిన అభాగ్యులు కూడా లోకంలో ఉన్నారు అనుకుంది. చేతనైతే వాళ్లకు సహాయం చేయాలని కూడా అప్పుడే నిర్ణయించుకుంది. ఏదో ఒక సహాయం. చదువు సహాయం. సేవల సహాయం. కనీసం మాట సహాయం. ఇప్పుడు ఆమెకు ఆన్లైన్లో పిల్లలకు పాఠాలు చెప్పడం అనే సహాయం చేసే అవకాశం వచ్చింది. డిగ్రీ పూర్తయ్యాక ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థల్లో చేరాలని దీపశిఖ ఆశ. ఆమె తమ్ముళ్లు తల్లి దగ్గరే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చదవండి: ‘మా అమ్మాయికి చదువు అక్కర్లేదని గొడవలకు దిగేవారు’ -
ఆకలి మంటల్లో కార్మికులు!
హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా కూలీలు, కార్మికులు, పేదలు, అనాథల పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతోంది. మహమ్మారి కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రెక్కాడితేగానీ డొక్కాడని పేదల జీవితాలను ఛిద్రం చేసింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది జియాగూడలోని మేకలమండీ. జియాగూడ మేకలమండీ నిత్యం మేకలు, గొర్రెల క్రయ విక్రయాలతో కిటకిటలాడేది. లాక్డౌన్ కారణంగా మండీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జీవాల దిగుమతి పూర్తిగా నిలిచిపోంది. దీంతో జియాగూడ మేకలమండీ నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ సడలింపు ఉన్నా అది కొన్ని గంటలు మాత్రమే కావడంతో జీవాలు మండీకి రాకపోగా వచ్చే 1, 2 లారీలలో 300లకు పైగా జీవాలతో కార్మికులకు పూట గడవడం లేదు. రోజూ 20 వేలకుపైగా కార్మికులు మండీలో వివిధ పనులతో ఉపాధి పొందుతుంటారు. వచ్చే జీవాలు కూడా నాగ్పూర్, మహారాష్ట్రాల నుంచి మండీకి దిగుమతి కావాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు మండీకి రావడం లేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే స్వల్ప జీవాల విక్రయాలు కార్మికులకు పొట్ట నిండక పూటగడవడమే గగనమైంది. కార్మికుల ద్వారా శుభ్రపరచిన మటన్ నగరంలోని హోటల్స్, మాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్, నాన్వెజ్ హోటల్స్ తదితర మటన్ దుకాణాలకు మండీ నుంచే ఎగుమతి అవుతుంది. లాక్డౌన్తో హోటల్స్, మాల్స్, మటన్ దుకాణాలు మూతపడటంతో మండీలో కొనుగోలు చేయడానికి ఎవరూ రావడం లేదు. దిగుమతి అంతంత మాత్రమే, సప్లయ్ అంతమాత్రమే కావడంతో కార్మికులకు ఉపాధి లభించక ఎంతో మంది మండీకి వచ్చి తిరిగి వెళ్తున్నారు. కరోనా, లాక్డౌన్లతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా ప్రతి ఆధార్ కార్డుదారునికి 5 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేపట్టాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి కాలయాపన చేస్తుండటం దారుణమని జియాగూడ మాజీ కార్పొరేటర్ ఎ.మునేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
Photo Feature: వలసజీవి కష్టం.. పెళ్లిబట్టలుగా పీపీఈ కిట్లు
కరోనా మహమ్మారి దెబ్బకు వలస కార్మికులు జీవితాలు తలక్రిందులయ్యాయి. కరోనా కట్టిడికి విధించిన ఆంక్షలతో నగరాల్లో ఉపాధి కరువై తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. కాగా, కరోనా కాలంలోనూ కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ఇదిలావుంచితే కరోనా విలయంతో పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుగుతున్నాయి. వధూవరులు పీపీఈ కిట్లనే పెళ్లిబట్టలుగా ధరించాల్సిన ఆగత్యం ఏర్పడింది. -
చివరి చూపు అయినా దక్కాలి కదా!
వలస కార్మికులు ఇళ్లు చేరడానికి సహాయపడుతున్నాడు. ఆకలి బాధ తీరుస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఊపిరి (ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరా) పోస్తున్నాడు. మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో సాయంతో ముందుకు వచ్చాడు.. మనిషి చనిపోతే.. వేరే ఊర్లో ఉండే అయినవాళ్లు వచ్చేలోపు భౌతికకాయాన్ని భద్రపరిచే వీలు లేక అంత్యక్రియలు చేస్తుంటే.. భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్సులు ఇవ్వాలనుకున్నాడు. రీల్ లైఫ్లో సోనూ సూద్ విలన్. రియల్ లైఫ్లో హీరో. ఇవన్నీ చేయడానికి సోనూ వెనక ఉన్నది ఎవరు? ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ పలు విషయాలు చెప్పారు. ► మనిషి తన ఇల్లు చేరుకోవడానికి, ప్రాణాపాయంలో ఉంటే బతికి బయటపడటానికి మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనిషి కన్నుమూశాక కుటుంబ సభ్యులకు ‘చివరి చూపు’ దక్కాలనే ప్రయత్నం మొదలుపెట్టారు.. ఈ కొత్త సహాయం గురించి? సోనూ సూద్: నేను చిన్న టౌన్ (పంజాబ్లోని మోగా) నుంచి వచ్చాను. నగరాలతో పోల్చితే పట్టణాల్లో, గ్రామాల్లో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని తెలిసినవాడిని. ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైమ్లో ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడం ఎంత ఇబ్బందో తెలిసిందే. గ్రామాల్లో ఉన్నవాళ్లు చనిపోతే సిటీలో ఉంటున్న వాళ్ల దగ్గర బంధువులు వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. ఈలోపు భౌతికకాయన్ని భద్రపరిచే సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు. అయినవాళ్లు రాకముందే అంత్యక్రియలు జరిపించేస్తున్నారు. ‘చివరి చూపు’ అయినా దక్కాలి కదా! అది కూడా దక్కకపోతే ఆ బాధ జీవితాంతం ఉండిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మాకు ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పారు. అందుకే ‘డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్’లను పంపాలనుకున్నాం. అడిగినవాళ్లకు అడిగినట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. ► దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందజేయాలనే ఆలోచన గురించి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువమంది కరోనా బాధితులు ఆక్సిజన్ దొరక్క కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కోసం దేశవ్యాప్తంగా మాకు మెసేజ్లు వస్తున్నాయి. అందుకే ప్యాన్ ఇండియా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ గురించి ఆలోచించాం. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తగ్గించి కోవిడ్ బాధితులకు సహాయం చేయడానికి దాదాపు 20కి పైగా ఆక్సిజన్ ప్లాంట్స్ను ఆరంభించనున్నాం. ► గొప్ప నాయకుడు భగత్ సింగ్ పుట్టిన ప్రాంతానికి చెందిన మీరు హిందీలో తొలి చిత్రం ‘షాహిద్–ఇ–అజామ్’లో భగత్ సింగ్ పాత్ర చేశారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా మిమ్మల్ని చాలామంది భగత్ సింగ్తో పోల్చడంపై మీ ఫీలింగ్? నన్ను గొప్ప గొప్ప వ్యక్తులతో పోలుస్తున్నారు. దాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ప్రజల నమ్మకం నా బాధ్యతను ఇంకా పెంచుతోంది. నా సాయం కోరుకున్నవారు ఏ మారుమూల ప్రాంతాన ఉన్నా వారిని చేరుకోవాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ► సహాయ కార్యక్రమాలు చేయడానికి మా అమ్మానాన్న స్ఫూర్తి అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఏ విధంగా వారిని చూసి స్ఫూర్తి పొందారో ఉదాహరణ చెబుతారా? నా చిన్నతనం నుంచే మా అమ్మనాన్నల ద్వారా ఇతరులకు సాయం చేయడాన్ని నేర్చుకున్నాను. ఇతరులకు సహాయపడటానికి ఇద్దరూ ఎప్పుడూ ముందుండేవారు. అలా నా కళ్ల ముందే నాకో మంచి ఉదాహరణ ఉంది. నాలోనే కాదు.. నా భార్య, నా కొడుకులో కూడా పరోపకార గుణం ఉంది. ప్రతి ఒక్కరం మన సామర్థ్యం మేరకు ఇతరులకు సాయం చేయాల్సిన సమయం ఇది. ఈ కరోనా టైమ్లో ‘గివింగ్ బ్యాక్ టు సొసైటీ’ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ► ఇతరులకు సహాయపడాలంటే గొప్ప మనసు మాత్రమే కాదు.. ఆర్థిక బలం కూడా ఉండాలి. మీకు ఎక్కడ్నుంచి ఆర్థిక బలం వస్తోంది? తోటివారికి సాయపడాలంటే మనం సంపన్నులమై ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మంచి మనసు ఉంటే చాలు. మనం చేస్తున్న హెల్ప్ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది, సహాయం చేస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరికి సాయం చేయాలో తెలియక? ఎలా చేయాలో తెలియక కొందరు మా ‘సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్’కు డబ్బు అందజేస్తున్నారు. చూపు లేని ఓ అమ్మాయి తన ఐదు నెలల పెన్షన్ 15000 రూపాయలు, రైల్వేస్కు చెందిన మరో హ్యాండీకాప్డ్ పర్సన్ 60 వేల రూపాయలను మా ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చారు. దీన్నిబట్టి మన చుట్టూ ఎంతమంది మంచివాళ్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ► మీ సాయం పొందినవాళ్లల్లో కొందరు వాళ్ల పిల్లలకు మీ పేరు పెట్టుకున్నారు.. ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ (మహాపురుషుడు, దేవుడు, దేవ దూత వంటి అర్థాలు) అని మీరు పుస్తకం రాసినా మీకు కొందరు గుడి కట్టారు. ఎలా ఉంది? నా తల్లిదండ్రులు భౌతికంగా లేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా ఇదంతా చూసి, ఆనందపడతారు. నాక్కూడా జీవితంలో ఏదో సాధించాననే ఫీలింగ్ కలిగింది. కానీ ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇక నా పుస్తకం ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ విషయానికి వస్తే.. అవును.. నేనేం దేవుణ్ని కాదు. ఐయామ్ ఎ కామన్మ్యాన్. ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలతో నేను కనెక్ట్ అయ్యాను. ► ఇలా విరివిగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికే ఇలా చేస్తారని కొందరు భావిస్తారు. మరి.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? నిజమే... నేను రాజకీయాల్లోకి రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నానని కొందరు ఊహించుకుంటున్నారు. ఇంకొందరు నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి చేయగలనని చెబుతున్నారు. కానీ మంచి పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ భవిష్యత్లో ఎవరు ఏం అవుతారో? ఏం జరుగుతుందో అంచనా వేయలేం. చూద్దాం.. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో! ► మీ ఈ సేవల వెనక ఓ రాజకీయ పార్టీ ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. మీ సేవా కార్యక్రమాలు చూస్తున్న ప్రజలు మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు సేవ చేయాలనే గుణం ఉంటే వెనక ఎవరైనా ఉంటారా? వస్తారా? అనే ఆలోచన రాదు. సహాయం చేయడం మొదలుపెట్టేస్తాం. మనం కామన్ మ్యాన్గా ఉన్నప్పుడే ఎంతో చేయగలుగుతున్నాం.. అదే రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చు. కానీ నేను పాలిటిక్స్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడంలేదు. అలాగని నాకు రాజకీయాల మీద వ్యతిరేక భావన లేదు. ప్రజలు కోరుకున్నట్లు జరుగుతుందేమో భవిష్యత్ చెబుతుంది. ► అరుంధతి, సీత వంటి సినిమాల్లో ఓ విలన్గా హీరోయిన్లను చాలా ఇబ్బందులపాలు చేశారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని సోదరుడిలా భావిస్తున్నారు... నా సోదరీ మణులకు థ్యాంక్స్. ఆ చిత్రాల్లో ఆ పాత్ర లను నాకు ఆ సినిమాల దర్శకులు ఇచ్చారు. కానీ రియల్ లైఫ్లో దేవుడు నాకో పవర్ఫుల్ స్క్రిప్ట్ రాశా డు. ఆ పాత్రలో జీవిస్తున్నాను. దేవుడి ఇచ్చిన ‘మోస్ట్ బ్లెస్డ్ రోల్’ ఇది అని భా విస్తున్నా. ► బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్రీజర్ బాక్సుల పంపిణీ.. వలస కార్మికులను ఊళ్లకు పంపించడం.. ఇన్ని చేయడం సులభం కాదు.. మాకు మంచి నెట్వర్క్ ఉంది. మా టీమ్లో కొందరికి ట్రైనింగ్ ఇచ్చాం. మరికొందరు నా గైడ్ లైన్స్ను ఫాలో అవుతారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే సహాయం అందజేయడంలో వీరి పాత్ర చాలా కీలకం. వారికి ధన్యవాదాలు. అలాగే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలన్నదే మా ఆశయం. సమష్టిగా పోరాడే సమ యం త్వరలో రావాలని కోరుకుంటున్నా. ► మీ బయోపిక్ తీయడానికి కొందరు ఉత్సాహంగా ఉన్నారు. మీకిష్టమేనా? బయోపిక్ గురించి నాతో సంప్రదింపులు జరిపారు. ప్రజలు నా బయోపిక్ను చూడాలనుకుంటున్నారని వారు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి అదేం లేదు. కొన్నేళ్ల తర్వాత ప్రజలు నా గురించి ఏం అనుకుంటారో చూడాలి. ► ఇటీవల మీకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది? పాజిటివ్ వచ్చిన విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఐసోలేషన్లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా చాలామందికి సహాయం చేశాను. సహాయం కావాల్సిన వారు నా ఫోన్కు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. వారికి సహాయం చేయాలనే పట్టుదల నాలో తగ్గలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇరవైగంటలకు పైగా నేను ఫోన్తో కనెక్ట్ అయి, మా టీమ్తో టచ్లో ఉన్నాను. నా ఫోన్కి ప్రతిరోజూ దాదాపు 40 వేల మేసేజ్లు వస్తుంటాయి. కానీ ప్రతి ఒక్కరికీ మేం సహాయం చేయలేకపోవచ్చు. అయితే ఎవరికి ముందుగా అవసరం ఉందో వారిని గుర్తించి, ముందు వారిని కాంటాక్ట్ అవుతాం. మా సహాయం పొందిన చాలామంది తామంతట తామే ఫోన్ చేసి పక్కవారికి సాయం చేస్తాం అంటున్నారు. అలాగే కొందరు చేశారు కూడా. చాలా మంది వలస కూలీలకు మేం సహాయం చేశాం. వారిలో చాలామంది మాకు టచ్లో ఉన్నారు. అవసరమైనప్పుడు మేం వారికి ఫోన్ చేసి ‘మీరు సహాయం పొందారు. ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పినప్పుడు పాజటివ్గా స్పందించారు... స్పందిస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాల్లో మా టీమ్ మాత్రమే కాదు.. ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, వార్డ్ బాయ్స్, హాస్పిటల్ యాజమాన్యాలు.. ఇలా అందరికీ భాగం ఉంది. – డి.జి. భవాని -
Photo Feature: వ్యాక్సిన్ వెతలు.. మీకో దండం!
కరోనా వ్యాక్సిన్ కోసం తిప్పలు తప్పడం లేదు. టీకాల కోసం ఆరోగ్య కేంద్రాల ముందు జనం బారులు తీరుతున్నారు. మరోవైపు కోవిడ్ కట్టడికి విధించిన ఆంక్షల కారణంగా వలస కార్మికులు, బడుగుజీవుల బతుకు ఆగమాగమైంది. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు కోరుతున్నారు. -
వలస జీవుల సంక్షోభ పరిష్కారం ఎలా?
దేశంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, అది అమలవుతున్న తీరు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలస కార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందుకే పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా మన విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటు లేదు. భారత్లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస జీవుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృత స్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది. ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. బాల్యంలో, మా హౌసింగ్ సొసైటీ తోటలో ఆడుకుంటున్నప్పుడు, మా కాలనీలో పనిమనుషులు, సేవకులు తమ తమ గ్రామాల గురించిన జ్ఞాపకాలను పంచుకునేవారు. కొంకణ్ లేదా మహారాష్ట్ర ఇతర ప్రాంతాల గ్రామాల్లోని మామిడి తోటలు, ఏపుగా పెరిగిన వరి పొలాలు, విశాలమైన గృహాల గురించి వారు రమ్యంగా వర్ణిస్తూ పోయేవారు. పెరిగి పెద్దవుతున్నప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన శ్రామికులను కలిసే అవకాశం తటస్థించినప్పుడు తమ గ్రామాల్లోని ఒకప్పుడు తాము నివసించిన ఇళ్ల గురించి వారు చెప్పేవారు. వారి జ్ఞాపకాలు విన్నప్పుడల్లా నాకు ఒకటే ఆలోచన వచ్చేది. కొంకణ్ లేదా కేరళ లేదా హిమాచల్ ప్రదేశ్ అద్భుతమైన పర్వతప్రాంతాలు, లేక ఉత్తర బెంగాల్కి చెందిన సుందరమైన గ్రామాల నుంచి ప్రజలు వలస వచ్చి, అకుపచ్చదనం కానీ, చోటు కానీ, కనీస గౌరవం కానీ ఉండని బాంబే మురికివాడల్లో ఎందుకు కనాకష్టంగా బతుకుతున్నారు అనే ప్రశ్న నాలో రగిలేది. కరోనా తొలివేవ్ ఉధృతమైన 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో, 2021 ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కాలంలో వలస కార్మికులు భారీ ఎత్తున తమ తమ ఊళ్లకు వెళ్లిపోవడం చూసినప్పుడు జాతీయ రాజధాని సరిహద్దుల్లో భారత రైతులు కొనసాగిస్తున్న నిలకడైన పోరాటంతో వలస కార్మికుల జీవితం ముడిపడి ఉందనిపించక మానదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, వాటిపై అవిరామంగా పోరాడుతుండటం పూర్తిగా చట్టబద్ధమైనదేననిపిస్తుంది. రైతులు ఈ మూడు చట్టాల వెనుక ఉన్న తర్కాన్ని, అంతరార్థాన్ని, అంతర్జాతీయ కార్పొరేట్ పెట్టుబడితో ఈ చట్టాల అనుసంధానాన్ని చక్కగా అర్థం చేసుకున్నారని బోధపడుతుంది. భారతీయ అసంఘటిత శ్రామికులు భారత శ్రామిక శక్తిలో 90 శాతం వరకు అసంఘటిత రంగంలో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. వీరిలో 75 శాతం వరకు వలస శ్రామికులే. ఇంతవరకు సంఘటిత రంగంలో ఉన్న కొద్ది శాతం శ్రామికులు కూడా ఇప్పుడు శరవేగంగా అసంఘటి రంగం కోరల్లోకి వెళ్లిపోతున్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న ఈ అసంఘటిత రంగంలోని శ్రామికుల హక్కులు, భద్రత, గౌరవాన్ని పణంగా పెట్టి మరీ దేశంలో పారిశ్రామికీకరణ తొలి దశ నిర్మితమైందని నగరాల్లోని శ్రామికులను చూస్తే అర్థమవుతుంది. అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో శ్రామికులకు ఏమాత్రం భద్రత ఉండదు. ఈ రంగంలోని శ్రామికులు రోజుకు 12 గంటలపాటు నెలపొడవునా పనిచేయాల్సి ఉంటుంది. లేదా కొన్ని రోజులు మాత్రమే పని దొరుకుతుంది. ఏరోజైనా పనిలోకి రాకుండా ఉండే స్వేచ్ఛ శ్రామికులకు ఉంటుంది కానీ అలాంటివారికి ఆరోజు తిండి దొరికే అవకాశం వట్టిమాటే. ఇంత భయంకర వాస్తవం కొట్టొచ్చినట్లు కనబడుతుండగా దేశ పాలనా పగ్గాలు చేపట్టిన వారు 2020 మార్చి నెలలో కేవలం 4 గంటల సమయం మాత్రమే ఇచ్చి దేశ రవాణా వ్యవస్థను సంపూర్ణంగా నిలిపివేస్తూ కఠినాతికఠినమైన లాక్ డౌన్ను అంత నిరంకుశంగా ఎలా విధించగలిగారన్నది ప్రశ్నగానే మిగులుతుంది. భారతీయ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగ వాటా 1950 లలో 55.3 శాతంగా ఉండగా, 2000 నాటికి అది 21.8 శాతానికి పడిపోయిందన్నది వాస్తవం. కానీ వ్యవసాయంపై ఆధారపడిన జనాభా, ఇతర కార్యకలాపాలు ఆ స్థాయిలో తగ్గిపోలేదు. 1993–94లో వ్యవసాయంపై ఆధారపడిన వారి జనాభా 62.8 శాతం కాగా, 2015 నాటికి 47 శాతానికి పడిపోయింది. జీడీపీ, ఉపాధి రెండింటి రీత్యా చూస్తే వ్యవసాయం స్తంభనకు గురైందని, ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాన్ని దాటుకుని, పరిశ్రమలు, సేవారంగాలకు తరలిపోతోందనడానికి ఇది కారణం కావచ్చు. దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉందని, ఈ రంగంలో పనిచేస్తున్నవారు కోలుకోలేనంతగా దెబ్బ తింటున్నారనడంలో సందేహమే లేదు. ఈ సంక్షోభమే ప్రత్యేకించి 1990ల నుంచి ఆయా ప్రభుత్వాల రాజకీయ ప్రాధమ్యాలను, విధానాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ప్రభుత్వ విధానాల్లో, బడ్జెట్లలో వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం వ్యవస్థాగతంగానే కొనసాగుతూ వచ్చిందని సులభం గానే బోధపడుతుంది. ఆహార ఉత్పత్తుల ధరలు కాస్త పెరిగితే చాలు దేశంలో కొంపలంటుకు పోయినట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వాటి ధరలను తగ్గిస్తూ రావడం దశాబ్దాలుగా పాలనా నిర్ణేతలకు, పరిశ్రమ దారులకు అలవాటైపోయింది. అదే సమయంలో వ్యవసాయానికి తప్పనిసరైన ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లు, డీసెల్, విద్యుత్ వంటి పారి శ్రామిక ఉపకరణాల ధరలు కొండెక్కుతున్నాయి. వ్యవసాయం ప్రాధాన్యతను కోల్పోయిందని సామెత చెబుతున్నా 86 శాతం భూమికి ప్రాధాన్యం వహిస్తున్న సన్నకారు రైతులు తాము వ్యవసాయ భూమికి దూరం కావడం లేదని భావిస్తూ వస్తున్నారు. చివరి క్షణంలో మాత్రమే వారు పొలాలను వదిలి నగరాల బాట పడుతున్నారు. భూమికి రైతు కట్టుబడటం అత్యంత ఉద్వేగాల కారణంగానే జరుగుతోందని తరచుగా చెబుతుంటారు. అందుకే రైతు కుటుంబాలు తరాలుగా సేద్యానికి కట్టుబడి ఉంటారు. అయితే వ్యవసాయాన్ని, భూమిని రైతు ఎందుకు వదిలిపెట్టలేడు అనే అంశాన్ని ప్రస్తుత కిసాన్ అందోళన్ చక్కగా విడమర్చి చెప్పింది. ఎందుకంటే భూమి ఒక ఉత్పత్తి సాధనం. ఇది ఇతర వనరులను సృష్టించిపెట్టే వనరు. పైగా ఇది సజీవ వనరు. నిరంతరం జీవితాలను సృష్టిస్తుంటుంది. పైగా గత ఏడు దశాబ్దాల కాలంలో సాగు భూమికి దూరమైన కోట్లాదిమంది అనుభవాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. మనుగడ కోసం తమ భూమిని అటవీ వనరులను దూరం చేసుకుని వలస వెళ్లినవారు అక్కడ బతకడానికి వనరులు, ఉపాధి లేక అల్లాడుతూ వస్తున్నారు. డబ్బు భూమికి ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదనే అనుభవం డ్యాములు, గనులు, జాతీయ రహదారుల కారణంగా తమ భూములు కోల్పోయి నగరాల బాట పట్టిన లక్షలాది మంది రైతుల వ్యధలు కళ్లారా చూస్తూ ఇప్పటికీ కొద్దిగా భూమిని కలిగి ఉన్న రైతులు భూమికి దూరం కావడమనే ఆలోచననే మదిలోకి రానివ్వడం లేదు. అందుకే కిసాన్ ఆందోళన్లో పాల్గొంటున్న రైతులు ఒకే విషయం చెబుతూ వస్తున్నారు. మేం ఈ భూమికి యజమానులం, రైతులం. మాకు మేమే బాస్లం. కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలు అమలైనట్లయితే కొద్ది సంవత్సరాల్లోనే మేం సేవకులుగా, కార్పొరేట్ బాస్ల పనిమనుషులుగా మారకతప్పదు. మరొకరి భూమిపై మేం పనిచేసి బతకాలనుకోవడం లేదు. దేశంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, అది అమలవుతున్న తీరు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలస కార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందుకే పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా మన విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం బైపాస్ చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటు లేదు. 2016–17 నాటికి దేశంలో పది కోట్లమంది వలస కార్మికులున్నారని అంచనా వీరిలో ఎస్సీ, ఎస్టీలకు చెందినవారే ఎక్కువ. 1989 నుంచి అమల్లోకి వచ్చిన అంతర్రాష్ట్ర వలసల చట్టం వలసకార్మికులకు కాస్తంత ఉపశమనం కలిగించినప్పటికీ గత కొన్నేళ్లుగా ఇది పనికిరాకుండా పోయింది. భారత్లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. అలాగని అపరిచితమైనదీ కాదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస కార్మికుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృత స్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది. ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. సుజాతా గొటోస్కర్ శ్రమ, జెండర్, సంస్థాగత ప్రక్రియలపై పరిశోధకురాలు -
చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది మాదిరిగా దేశ వ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ లేదని, పరిశ్రమలు కూడా నడుస్తున్నందున ఈసారి వలస కార్మికులకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)కింద 80 కోట్ల రేషన్ కార్డుదారులకు రెండు నెలల (మే, జూన్)పాటు అదనంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం అమలు తో బహిరంగ మార్కెట్లో ఆహారధాన్యాల ధరలపై ఎటువంటి ప్రభావం లేదని పేర్కొంది. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను సుమారు 2 కోట్ల మంది లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. పీఎంజీకెఎవై పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. సోమవారం నాటికి 34 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 15.55 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డిపోల నుంచి తరలించుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు అన్ని రాష్ట్రా లు మే, జూన్ నెలల పీఎంజీకేఏవై ఆహార ధాన్యాల పంపిణీని జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సూచించాయన్నారు. ఆహార ధాన్యాల పంపిణీ పురోగతిపై ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్రాల ఆహార కార్యదర్శులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. అంతేగాక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ప్రారంభించిన 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా ల్లో 69 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. రైతుల ఖాతాలకు నగదు దేశంలో గోధుమల సేకరణతో ఇప్పటివరకు రూ.49,965 కోట్లను నగదు బదిలీ చెల్లింపులో నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేశామని సుధాన్షు పాండే తెలిపారు. ఇందులో పంజాబ్లో రూ.21,588 కోట్లు, హరియాణాలో రూ.11,784 కోట్లు నేరుగా బదిలీ చేసినట్లు కార్యదర్శి తెలిపారు. కోవిడ్ కారణంగా గోధుమ, బియ్యం నిల్వలను బహిరంగ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రభుత్వం 2021–22 సంవత్సరానికి ఓఎంఎస్ఎస్(డి) విధానాన్ని సరళీకృతం చేసిందని పాండే పేర్కొన్నారు. కోవిడ్ –19 మహమ్మారి సమయంలో 928.77 లక్ష మెట్రిక్ టన్నుల(ఎల్ఎమ్టీ) ఆహార ధాన్యాలు, 363.89 ఎల్ఎమ్టీ గోధుమలు, 564.88 ఎల్ఎమ్టీ బియ్యం గతేడాది సెంట్రల్ పూల్ నుంచి పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. చదవండి: డబుల్ మాస్క్పై కీలక మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం -
మధుర జ్ఞాపకాలతో కాదు.. చేదు జ్ఞాపకాలతో వీరి బాల్యం
సాక్షి, హైదరాబాద్ (గోల్కొండ) : ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యం ఫుట్పాత్లపైనే గడిచిపోతున్నది. మధుర జ్ఞాపికాలను మిగిల్చే బాల్యం వీరికి చేదు జ్ఞాపకాలను మిగులుస్తోందనం నిర్వివాదాశం. కరోనా నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలో పని లేక పస్తులుంటున్న కార్మికులు పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చారు. ఇక్కడా వారికి ఉపాధి దొరకడం గగనమైపోయింది. నగరానికి వలస వచ్చిన వీరు ఫుట్పాత్లు, ఫ్లై ఓవర్ల కింద డివైడర్ల పైనే కాపురం ఉంటున్నారు. ప్లాస్టిక్ ఆట బొమ్మలు, బెలూన్లు అమ్ముకుంటూ వీరు అతి కష్టంగా బతుకీడుస్తున్నారు. రాత్రంతా ఫుట్పాత్లపై ఉంటూ బెలూన్లు, ఇతర ప్లాస్టిక్ ఆట వస్తువులు తయారు చేసుకుంటారు. ఉదయమే ఫుట్పాత్లపై రొట్టెలు వేసుకుని వారు తిని, పిల్లలకు తినిపిస్తారు. అనంతరం కుటుంబ పెద్దలంతా ఆట బొమ్మలను అమ్మడానికి వెళ్లిపోతారు. ఒక వ్యక్తిని పిల్లలను చూడటానికి వదిలి వెళ్తారు. పిల్లలు ఫుట్పాత్ల మీదనే స్నానం చేస్తూ, దానినే ఆడుకుంటూ ఉంటారు. రాత్రి మళ్లీ తమ తల్లిదండ్రుల ముఖాలు చూస్తారు. టోలిచౌకి చౌరాస్తా, షేక్పేట్ నాలా, రేతిబౌలి రింగ్ రోడ్డు, మెహిదీపట్నం పీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే తదితర ప్రాంతాలలు వలస కుటుంబాలు ఫుట్పాత్లపై, ఫ్లై ఓవర్ల కింద డివైడర్లపై నివసిస్తాయి. ( చదవండి: ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాలిక కేకలు వేయడంతో! ) -
వాళ్ల విషయంలో స్పందిస్తున్న కార్మికశాఖ
సాక్షి, మేడ్చల్ జిల్లా: వలసజీవుల సమాచారాన్ని కార్మికశాఖ సేకరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లి తిరిగొచ్చిన కార్మికుల వివరాలను ఆరా తీస్తోంది. ఈ మేరకు మున్సిపల్ సర్కిళ్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో కార్మికుల సమాచారాన్ని రాబడుతోంది. బతుకు దెరువు కోసం వెళ్లిన వారిలో ఇప్పటి వరకు ఎంత మంది స్వస్థలాలకు చేరారనే విషయాన్ని క్షేత్రస్థాయి సర్వేలో తెలుసుకుంటోంది. వివరాలను సేకరిస్తున్న కార్మికశాఖ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కార్మిక శాఖ ఈ సమాచారాన్ని సేకరిస్తోంది. జీవనోపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన కార్మికులు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఏ రాష్ట్రం నుంచి తిరిగి వచ్చారు? తదితర వివరాలను సమీకరిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడలతోపాటు ఎంపిక చేసిన ప్రాంతాలు, బస్తీల్లో కార్మిక శాఖకు చెందిన సిబ్బంది, ఆయా పురపాలక సంఘాలు, జీపీల ఉద్యోగుల సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటంతోపాటు ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. భవన నిర్మాణ రంగంతోపాటు వివిధ పరిశ్రమల్లో పనుల కోసం వచ్చిన వలస కార్మికులు, కూలీలు, వారి కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నట్లు కరోనా తరుణంలో అధికార యంత్రాంగం గుర్తించి అన్ని విధాల సహకారాలు అందించింది. సెకండ్ వేవ్లో కరోనా కేసులు పెరుగుతున్న దశలో వలస కార్మికులు, కూలీల వివరాల నేపథ్యంలో మరోసారి వారికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ( చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ) -
వలస కూలీలకు భరోసా
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించే వలస కూలీలను కాపాడుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది లాక్డౌన్తో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో అన్ని చోట్లా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా రాష్ట్ర పారిశ్రామిక రంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశాలు లేవని, కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తూ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చంటూ పారిశ్రామికవేత్తలకు భరోసాను కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా టెక్స్టైల్, గ్రానైట్, నిర్మాణ రంగాల కార్యకలాపాల్లో లక్షలాది మంది వలస కూలీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటనలు వస్తుండటంతో రాష్ట్రంలోని యాజమాన్యాలు, వలస కూలీల్లో ఒకరకమైన అభద్రతా భావం నెలకొని ఉన్న విషయం గమనించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. పనిచేసే చోట కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస కూలీలు తరలి వెళ్లిపోతున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక క్వారంటైన్లు.. లాక్డౌన్ తర్వాత గత నవంబర్ నెల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. ఇప్పుడు సెకండ్ వేవ్ దెబ్బతో వలస కూలీలు మారోమారు వెళ్లిపోకుండా ఉండటానికి యాజమాన్యాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం యూనిట్లలో పనిచేసే కూలీలకు ప్రత్యేక వైద్యం, వసతిని ఏర్పాటు చేస్తున్నాయి. కూలీల్లో ఎవరికైనా కోవిడ్ సోకితే వారి నుంచి ఇతరులకు విస్తరించకుండా ఉండటం కోసం పరిశ్రమల్లోనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దండ ప్రసాద్ తెలిపారు. మార్చి నెల నుంచి వలస కూలీల్లో ఆందోళన మొదలైనప్పటికీ ఇంత వరకు ఎవ్వరూ వెనక్కి వెళ్లలేదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఏపీ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.కోటేశ్వరరావు తెలిపారు. గత లాక్డౌన్ సమయంలో తిరిగి వెళ్లిపోయిన వలస కూలీల్లో 65 శాతం మంది వెనక్కి వచ్చారని, ఇప్పుడు వారు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
ఉపాధి పనుల్లో... వలస కార్మికులకు కోటా
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనుల్లో వలస కార్మికులకు కోటా ఏర్పాటు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నియమించిన అధ్యయన బృందం సిఫారసు చేసింది. భారతదేశంలో వలస కార్మకుల సామాజిక భద్రత, ఆరోగ్య హక్కులపై పరిశోధన, అధ్యయనం చేయాలంటూ అక్టోబరు 18, 2019న ఢిల్లీలోని కేరళ డెవలప్మెంట్ సొసైటీకి ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, మహారాష్ట్రల్లోని నాలుగు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 4,400పై ఈ అధ్యయనం నిర్వహించారు. అనంతరం అధ్యయన బృందం కేంద్ర కార్మికశాఖ, గ్రామీణాభివద్ధిశాఖ, వినియోగదారుల వ్యవహారాలు శాఖలతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్కు పలు సిఫారసులు చేసింది. ఈ అధ్యయనాన్ని ఎన్హెచ్ఆర్సీ ఇటీవల ఆమోదించింది. కార్మికశాఖకు సిఫారసులు జాతీయ స్థాయిలో వలస కార్మికుల సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం నిమిత్తం అంతర్ రాష్ట్రాల వలస మండలి ఏర్పాటు చేయాలి. అంతర్ రాష్ట్ర వలస కార్మికులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాలి. 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలి. గ్రామీణాభివద్ధి శాఖ: ఉపాధి హామీ పథకంలో వలస కార్మికులకు కోటా కేటాయించాలి. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని వలస కార్మికుల కోసం మెరుగుపరచాలి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ వారు వన్ నేషన్–వన్ రేషన్ కార్డు ఫాస్ట్ ట్రాక్లో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు: కార్మిక విభాగాలు తప్పనిసరిగా వలస కార్మికుల జాబితా రూపొందించాలి. వలస కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి. వాటిని పనిచేసే చోట ఏర్పాటు చేసేలా చూడాలి. విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం వలస కార్మికుల పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. వలసకార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. వలస కార్మికుల సొంత రాష్ట్రాలు కానీ, పనిచేసే చోట అక్కడి రాష్ట్రాలువారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ వలస కార్మికుల కోసం వారి సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా రిమోట్ ఓటింగ్ హక్కు కల్పించాలి. ( చదవండి: వలసపక్షుల బెంగ ) -
లాక్డౌన్ భయం.. సొంతూళ్లకు తరలుతున్న వలస కూలీలు
సాక్షి, హైదరాబాద్ : అవే రోజులు.. అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి.. ఊరు కాని ఊరిలో ఉండటం కంటే సొంతూరికి పోయి బలుసాకు తినైనా బతకొచ్చనే ధీమాతో నగరంలోని వలసజీవులు మరోసారి పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్నారు. లారీ, బస్సు, రైలు, కారు, క్యాబ్.. ఏదో ఒకటి దొరికిందాంట్లో బతుకు జీవుడా అంటూ బయలుదేరుతున్నారు. మహమ్మారి మహోగ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ‘నైట్ కర్ఫ్యూ’తో కట్టడి విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు జనం బారులుదీరుతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ వాహనాల యజమానులు చార్జీల రెట్టింపుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏ క్షణంలో.. ఏం జరుగుతుందో.. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే జనం ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. ఆకస్మాత్తుగా విధించిన లాక్డౌన్తో రైళ్లు, బస్సులతో పాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. గత్యంతరం లేక వలస కూలీలు వందలకొద్దీ కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల వలస కూలీలు ప్రాణాలకు తెగించి భార్యా పిల్లలతో మహాపాద యాత్రలు చేశారు. ఈ క్రమంలో కొందరు అసువులు బాశారు. ఆకలి దప్పుల కోసం అలమటించారు. ఈ ఏడాది మరోసారి అలాంటి చేదు అనుభవాలకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే చాలా మంది సొంత ఊళ్ల వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా కోవిడ్ ఉద్ధృతి పెరగడంతో పాటు తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ అందుకు దోహదం చేస్తున్నాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత నగరానికి చేరుకొన్న లక్షలాది మంది కొద్ది నెలల్లోనే తిరిగి సొంత ఊళ్లకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం కావడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ముంబై. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతోనూ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళతో పయనమవుతున్నారు. ఇళ్లకు చేరేదెలా? ఒకవైపు సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి ఇలా ఉండగా.. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు రాత్రి 9 దాటితే ఇళ్లకు చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ మొదలు కానుంది. అదే సమయానికి సిటీ బస్సులు విధులు ముగించుకొని డిపోలకు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా నిలిచిపోనున్నాయి. క్యాబ్లు, ఆటోలు కూడా ఆగిపోనున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో సిటీకి వచ్చేవారు గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారనుంది. -
అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు
సాక్షి, హైదరాబాద్: అవే రోజులు.. అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి.. ఊరు కాని ఊరిలో ఉండటం కంటే సొంతూరికి పోయి బలుసాకు తినైనా బతకొచ్చనే ధీమాతో నగరంలోని వలసజీవులు మరోసారి పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్నారు. లారీ, బస్సు, రైలు, కారు, క్యాబ్.. ఏదో ఒకటి దొరికిందాంట్లో బతుకు జీవుడా అంటూ బయలుదేరుతున్నారు. మహమ్మారి మహోగ్ర రూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ‘నైట్ కర్ఫ్యూ’తో కట్టడి విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు జనం బారులుదీరుతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ వాహనాల యజమానులు చార్జీల రెట్టింపుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏ క్షణంలో.. ఏం జరుగుతుందో.. ► గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే జనం ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. ఆకస్మాత్తుగా విధించిన లాక్డౌన్తో రైళ్లు, బస్సు లతో పాటు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. గత్యంతరం లేక వలస కూలీలు వందలకొద్దీ కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. ► తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల వలస కూలీలు ప్రాణాలకు తెగించి భార్యా పిల్లలతో మహాపాద యాత్రలు చేశారు. ఈ క్రమంలో కొందరు అసువులు బాశారు. ఆకలి దప్పుల కోసం అలమటించారు. ► ఈ ఏడాది మరోసారి అలాంటి చేదు అనుభవాలకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే చాలా మంది సొంత ఊళ్ల వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా కోవిడ్ ఉద్ధృతి పెరగడంతో పాటు తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ అందుకు దోహదం చేస్తున్నాయి. ► లాక్డౌన్ సడలింపుల తర్వాత నగరానికి చేరుకొన్న లక్షలాది మంది కొద్ది నెలల్లోనే తిరిగి సొంత ఊళ్లకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం కావడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ముంబై, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతోనూ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళతో పయనమవుతున్నారు. ఇళ్లకు చేరేదెలా? ► ఒకవైపు సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి ఇలా ఉండగా.. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు రాత్రి 9 దాటితే ఇళ్లకు చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ మొదలు కానుంది. అదే సమయానికి సిటీ బస్సులు విధులు ముగించుకొని డిపోలకు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా నిలిచిపోనున్నాయి. క్యాబ్లు, ఆటోలు కూడా ఆగిపోనున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో సిటీకి వచ్చేవారు గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారనుంది. ( చదవండి: నెగెటివ్గా తేలినా మళ్లీ టెస్టు బెటర్: నిపుణులు ) -
వలసపక్షుల బెంగ
నిరుడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాక కనబడిన దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి క్రమేపీ పెరుగుతున్న జాడలు కనబడటంతో పరిమిత స్థాయిలో కావొచ్చుగానీ... ఒక్కో రాష్ట్రమే లాక్డౌన్లు, రాత్రి పూట కర్ఫ్యూలు విధించటం వైపు అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో అక్కడక్కడ నగరాలు, జిల్లాల్లో కొన్ని పరిమితులతో లాక్డౌన్ విధించారు. కొన్నిచోట్ల రాత్రి పూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. పర్యవసానంగా తయారీ రంగ పరిశ్రమలు, దుకాణాలు, నిర్మాణరంగం, చిన్న చిన్న వ్యాపారాలు మూతబడటం లేదా పాక్షి కంగా మాత్రమే పనిచేయవలసివస్తోంది. మహారాష్ట్ర పూర్తి స్థాయి లాక్డౌన్ విషయం ఆలోచిస్తున్న దని చెబుతున్నారు. ఈ పరిణామాలు వలస జీవుల్లో సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది వున్నకొద్దీ తీవ్రమై గతంలో మాదిరే పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తారని భయాందోళనలు ఏర్పడ టంతో వారు స్వస్థలాలకు వెళ్లడం తప్ప మార్గం లేదనుకుంటున్నారు. ఇప్పటికైతే ఈ వలసలు అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కనబడుతున్నాయి. పూర్తి స్థాయి లాక్డౌన్ విధించబోమని... రైళ్లు, బస్సులు యథాప్రకారం నడుస్తాయని ప్రభుత్వాలు వాగ్దానాలిస్తున్నాయి. ఎవరూ రోడ్డున పడే పరిస్థితి వుండదని హామీ ఇస్తున్నాయి. భయపడవద్దని కోరుతున్నాయి. కానీ వాటిని ఎంతవరకూ విశ్వసించవచ్చునో సామాన్యులు తేల్చుకోలేకపోతున్నారు. పరిస్థితి శ్రుతిమించితే ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలవు? పూర్తి స్థాయి కావొచ్చు... పాక్షికంగా కావొచ్చు లాక్డౌన్ విధిస్తే అందరి కన్నా దాని ప్రభావం అధికంగా పడేది దినసరి కూలీలు, కార్మికులు వంటి అట్టడుగు జీవులపైనే. క్రితంసారి ఆకలితోనో, అర్ధాకలితోనో గడపక తప్పని రోజులు వారు మరిచిపోలేదు. అందుకే పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి వుంటున్నాయి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకెళ్లే రైళ్లు, బస్సులు జనంతో కిటకిటలాడుతున్నాయి. నిరుటితో పోలిస్తే ఇప్పు డున్న పరిస్థితి భిన్నమైనది. అప్పట్లో కేవలం మూడు గంటల సమయం మాత్రమే ఇచ్చి లాక్డౌన్ విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. పైగా అది దేశంలో తొలిసారి కావడంతో దానివల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న అవగాహన చాలామందికి లేదు. పైగా వలసజీవులకు ఇన్నాళ్లూ ఉపాధి కల్పిస్తున్నవారే లాక్డౌన్ ఎత్తేసేవరకూ వారి బాధ్యత తీసుకోవాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. కానీ దాన్ని పాటించినవారు అతి కొద్దిమంది. పర్యవసానంగా వలసజీవులు దిక్కులేని పక్షుల య్యారు. లక్షలాదిమంది రోడ్లమీదికొచ్చారు. వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామా లకు నడకదారి పట్టారు. పోలీసులు అడ్డుకున్నా, ఎండలు మండిపోతున్నా, ఆకలి బాధిస్తున్నా వెనక్కి తగ్గలేదు. మార్గమధ్యంలో కొందరు అభాగ్యులు ఆకలితో, అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు మరోసారి స్వస్థలాలకు ప్రయాణం కడుతున్న వలసజీవుల్ని తప్పుబట్టడానికి లేదు. అయితే కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వర్తమానంలో ఇది ప్రమాదకరమైన పరిణామం. వారి నిష్క్రమణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ తొమ్మిది పది నెలలుగా పరిస్థితి కాస్త మెరుగుపడినా ఏ రంగమూ ఇంతవరకూ పూర్వ స్థాయికి చేరలేదు. వ్యాపార, వాణిజ్య కార్య కలాపాలు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. తాజా పరిణామాల వల్ల అవి మరింత కుదేలవు తాయి. ఇటు ప్రజారోగ్య రంగం సైతం ఇబ్బందుల్లో పడుతుంది. శరవేగంతో మహమ్మారి విస్తరి స్తున్న ప్రస్తుత తరుణంలో జనం సరిగా మాస్కులు ధరించకుండా ఇలా పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడితే దాని దుష్ఫలితాలెలా వుంటాయన్నది తెలియనిది కాదు. ఇప్పుడిదే అందరినీ ఆందో ళనలో పడేస్తున్న విషయం. నిరుటితో పోలిస్తే ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. ఇంతవరకూ దాదాపు పది కోట్లమంది జనం టీకాలు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే టీకాలు అందుబాటులోకొచ్చినవారు నిండా 8 శాతంమంది కూడా లేరు. పైగా వీరిలో అనేకులు రెండో డోస్ తీసుకోలేదు. వలస కూలీలకు వారు పనిచేసేచోట పెద్దగా పలుకు బడివుండదు కనుక, వారిలో ఎంతమందికి టీకాలందాయో అంచనా వేయటం కష్టం. దీని సంగతలావుంచి వ్యాక్సిన్ తీసుకున్నంతమాత్రాన వైరస్ నుంచి రక్షణ కలుగుతుందన్న నమ్మకం లేదని, మాస్కులు ధరించటం తప్పనిసరని వైద్య రంగ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ కిటకిటలాడుతూ కనిపిస్తున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూస్తుంటే వాటిని ఎవరూ పాటిస్తున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా అందరిలోనూ భరోసా కలిగించాల్సిన అవసరం వుంది. ఆ భరోసా మాటల్లోకన్నా చేతల్లో కనబడాలి. గత అనుభవాలరీత్యా వలస కూలీలకు కావలసిన రేషన్, ఇతర నిత్యావసరాలు సరఫరా అయ్యేలా చూడాలి. నిరుడు విధించిన లాక్డౌన్ ముగిశాక కేంద్ర ప్రభుత్వం వలసజీవుల డేటా సేకరణకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా విధానం రూపొందింది. ఈ విషయంలో ఏమేరకు ముందడుగు పడిందో తెలియదుగానీ... అలాంటి ఏర్పాటుంటే వలస కూలీలను గుర్తించి, వారికి సాయపడటం ఇప్పుడు సులభమయ్యేది. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి అనువుగా వలస కూలీలకు భరోసా కల్పించడం, ఎక్కడివారక్కడ వుండేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. -
లాక్డౌన్ : వలస కార్మికుల గుండెల్లో ‘రైళ్లు’
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశలో విస్తరిస్తుండటంతో వలస కార్మికులు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అందుకే బతుకుజీవుడా అంటూ మళ్లీ సొంత ఊరి బాటపడుతున్నారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కరోనా విస్తరణ తీవ్ర స్థాయిలో ఉన్న మహారాష్త్రలో మళ్లీ పూర్తి లాక్డౌన్ విధిస్తారన్న భయం వారిని వెన్నాడుతోంది. అందుకే సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నారు. అన్ని రవాణా మార్గాలు మూసుకుపోకముందే తిరిగి సొంత రాష్ట్రాలకు బయల్దేరాలని ఆతృతపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ముంబై రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా కుర్లాలోని లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్దకు వలస కార్మికుల భారీగా చేరుకుంటున్నారు. (భారీ ఊరట: మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి) పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య దేశ రాజధాని డిల్లీలో కూడా ఇదే సరిస్థితి నెలకొంది. గత ఏడాది విధించిన లాక్డౌన్ వెతలను తలచుకుని బెంబేలెత్తుతున్న వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు పయన మవుతున్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తే, అన్ని రవాణా మార్గాలు మూసివేయడంతోపాటు పని దొరక్క తిండి గడవటం కష్టమని భావిస్తున్న చాలామంది కార్మికులు కుటుంబాలతో సహా దొరకిన వాహనాల్లో ఇళ్లకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు చూస్తోంటే.. లాక్డౌన్ తప్పదు..అందుకే ఊరికి పోతున్నానని, తనకిక వేరే మార్గం లేదని లక్నోకు చెందిన గౌరీ శంకర్ శర్మ వాపోయారు. ఉత్తర ప్రదేశ్ బరేలీకి చెందిన వలస కార్మికుడు సునీల్ గుప్తాకి కూడా ఇదే ఆవేదన. మరోవైపు దేశంలో రెండో దశలో కరోనా వైరస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య లక్షకు ఎక్కడా తగ్గడంలేదు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!) Delhi: Amid rising cases of COVID-19, migrant workers start returning to their native places; visuals from ISBT, Anand Vihar. "The rate at which the cases are rising makes it obvious that lockdown would be imposed. That is why I am going home," a labourer said yesterday. pic.twitter.com/8D2kfxQcfN — ANI (@ANI) April 13, 2021 #WATCH | Mumbai: Huge crowd of migrant workers arrive at Lokmanya Tilak Terminus (LTT) in Kurla pic.twitter.com/6zkz8xt0eE — ANI (@ANI) April 13, 2021 -
కర్ఫ్యూల కలవరం: ఊరికాని ఊరిలో ఉండలేం..
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, అలాంటి సన్నివేశాలే మళ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గతేడాది కోవిడ్ సంక్రమణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో నగరాలు, పట్టణాల్లో ఉన్న బడుగుజీవులు గత్యంతరం లేని పరిస్థితుల్లో సొంతూళ్లకు ఏదో ఒక రకంగా చేరుకోవాలనే తపనతో కష్టాలకోర్చి ప్రయాణాలు చేశారు. కాలినడకన, సైకిళ్లు, సొంత వాహనాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు, స్పెషల్ రైళ్లలో ఎలాగోలా చేరుకున్నారు. పరిస్థితి దాదాపుగా చక్కబడిందనుకొని నాలుగైదు నెలల క్రితం మళ్లీ నగరబాట పట్టిన వారికి తాజా పరిణామాలు ఏమాత్రం మింగుడుపడట్లేదు. కొన్ని రోజులుగా కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో పురోగతి ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఉండడం, సంక్రమణ రేటు రెట్టింపు కావడంతో రాష్ట్రాలు ఇప్పటికే పలు నగరాల్లో ఆంక్షలు విధించాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందనే స్పష్టత కొరవడింది. నాలుగైదు రోజులుగా రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఏరకంగా మారుతుందనే అంశంపై అంచనా వేయడం కష్టమౌతోంది. ఒకవైపు కేసులు పెరుగుతుండడం, మరోవైపు వ్యాక్సినేషన్ చేసేందుకు తమ వద్ద అవసరానికి ఉండాల్సిన స్టాక్ లేదని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. మహారాష్ట్రలో స్టాక్ అందుబాటులో లేని కారణంగా పలుచోట్లు వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. మరోవైపు తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుక్రవారం ప్రధాని రాసిన లేఖలో మరో రెండు రోజుల వ్యాక్సిన్ స్టాక్ మాత్రమే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల్లో జీవించడం కంటే తమ సొంత ఊరుని నమ్ముకుంటేనే మేలని అనేకమంది భావిస్తున్నారు. అందుకే ప్రజలు ప్రయాణాలకు సిద్ధపడడంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ , ముంబై, బెంగళూరు, పూణే సహా నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అనధికారిక వర్గాలు ప్రకటించాయి. సంక్రమణ భయంతో వలస కార్మికులు అనేకమంది స్వగ్రామాలకు వెళుతున్న నేపథ్యంలో రైలు సర్వీసుల కొనసాగింపుపై శుక్రవారం రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. రైలు సేవలను తగ్గించడానికి కానీ ఆపడానికి ఎటువంటి ప్రణాళిక లేదని, అవసరమైతే పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ చెప్పారు. దేశరాజధాని ఢిల్లీ దేశ రాజధానిలో ఈనెల 6వ తేదీన ప్రారంభమైన నైట్ కర్ఫ్యూ ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, గర్భిణీ స్త్రీలు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు టెర్మినస్ నుండి టిక్కెట్లు చూపించి ప్రయాణించే వారికి మాత్రం ప్రభుత్వం పరిమితుల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయినప్పటికీ ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించని వారిపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి రూ.2వేలు జరిమానా విధిస్తున్నారు. మహారాష్ట్ర ముంబై, పూణే, నాగ్పూర్ సహా మహారాష్ట్రలోని అన్ని నగరాలు, జిల్లాల్లో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కఠినమైన లాక్డౌన్ జరుగనుంది. కోవిడ్ –19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బీఎంసీ ముంబై నగరంలో వీకెండ్ లాక్డౌన్ విధించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. ముంబై అధికారులు నగరానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. పూణే మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ఈనెల 30వ తేదీ వరకు అన్ని మార్కెట్లు, దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్, అలహాబాద్, మీరట్, ఘజియాబాద్, బరేలీ జిల్లాల్లో ప్రారంభమైన నైట్ కర్ఫ్యూ ఈనెల 17వరకు అమలులో ఉండనుంది. కాన్పూర్, లక్నో ల్లోనూ ఆంక్షలు విధించారు. జమ్మూకశ్మీర్ శుక్రవారం రాత్రి నుంచి జమ్మూకశ్మీర్లోని 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ మొదలైంది. జమ్మూ, ఉధంపూర్, కథువా, శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, అనంతనాగ్, కుప్వారా జిల్లాల్లోని పట్టణప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి. ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దుర్గ్ జిల్లాలో లాక్డౌన్ ప్రకటించింది. ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పూర్తి లాక్డౌన్ విధించారు. రాయ్పూర్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి, జిల్లా సరిహద్దులను శుక్రవారం నుంచి ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు సీలు చేశారు. ఈ 10 రోజుల్లో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్ ప్రక్రియ సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈనెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. రాజస్తాన్ రాత్రి కర్ఫ్యూతో పాటు అనేక ఆంక్షలను జైపూర్ సహా రాజస్తాన్లోని అన్ని నగరాలు, జిల్లాల్లో ఈనెల 5 నుంచి 19వ తేదీ వరకు కొనసాగించనున్నారు. నైట్ కర్ఫ్యూని రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు విధించారు. పంజాబ్ ఈ నెల 30వ తేదీ వరకు పంజాబ్ అంతటా రాత్రి కర్ఫ్యూను పొడిగించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. చంఢీగఢ్లోనూ 7వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. తమిళనాడు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అధికారయంత్రాంగం కఠినమైన నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి అమలులోకి వచ్చిన నిబంధనలతోనైనా వ్యాప్తి రేటు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. -
లాక్డౌన్ భయం: ‘మళ్లీ ఊరెళ్లిపోతా మామ’
న్యూఢిల్లీ: ‘ఊరెళ్లి పోతా మామ.. ఊరెళ్లి పోతా’ అంటూ మళ్లీ వలస కార్మికులు, కూలీలు పల్లె బాట పట్టారు. కరోనా వైరస్ రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభణ కొనసాగడంతో అన్ని రాష్ట్రాలు తీవ్ర ఆంక్షలు విధిస్తున్నాయి. లాక్డౌన్ మినహా అన్ని చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో వలసవెళ్లిన కార్మికులు, కూలీలు ఊరి బాట పడుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండడంతో ఆ రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఆంక్షలు విధించారు. రాత్రిపూట కర్ఫ్యూ.. పగటి పూట పని వేళల మార్పు చేయడం పొట్ట పోసుకోవడానికి వచ్చిన కార్మికులు మళ్లీ తిప్పలు పడుతున్నారు. ఇక్కడ ఉండడం కన్నా ఊర్లో ఉండడం మేలు అనే భావనతో తిరిగి గ్రామాలకు వెళ్తున్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే భయంతో ఇప్పుడే ఊరెళ్లడం నయమని భావించి తట్టాబుట్టా సర్దేసుకుని మళ్లీ ఊరి బాట పడుతున్నారు. ఢిల్లీలో రాత్రి 10 నుంచి ఉదయం 5 దాక కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ విధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ కూడా విధించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఆంక్షలు విధించారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు ఆ పట్టణాల్లో ఉండలేక స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో పట్టణ ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు, కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. గతేడాది అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంతో పడ్డ కష్టాలను తలుచుకుని ఇప్పుడు ముందే జాగ్రత్త పడుతూ ఊరికి వెళ్తున్నారు. -
హైదరాబాద్లో అడ్డా కూలీల తీరని వెతలివి!
ఉదయం కాగానే తాజాగా బతుకు మొదలవుతుంది.. చకచకా అడ్డామీదకు చేరుకుంటారు.. పనికోసం ఎదురు చూస్తుంటారు.. పని దొరికినోళ్లు సంతోషంగా వెళ్తారు.. మిగిలిపోయినోళ్లకు ఎదురుచూపులు తప్పవు. ఒక్కో రోజు మధ్యాహ్నం దాటిపోతుంది.. ఆకలి చంపేస్తుంది.. పనిపై ఆశ మాత్రం చావదు. ఇక ఆ రోజు పనిలేక గడపాల్సిందేననుకుంటూ ఆకలి తీర్చుకునేందుకు స్థానికంగా ఉండే రూ.5 భోజన కేంద్రం వద్ద కడుపు నింపుకొని, కేంద్రం లేనిచోట కడుపు మాడ్చుకొని సాయంత్రం ఇంటిబాట పడతారు. ఇదీ నగరవ్యాప్తంగా ఉన్న అడ్డా కూలీల దుస్థితి. కరోనా మహమ్మారి కారణంగా పనులు లేక ఎన్నో కష్టాలు పడుతున్న వలస కూలీల పరిస్థితులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి కథనం.. – సాక్షి, సిటీబ్యూరో ‘ఉప్పల్ గాంధీ బొమ్మ వలస కూలీల అడ్డా.. ఏడాది క్రితం వరకు వందలాది మంది కూలీలతో సందడిగా ఉండేది. ఉదయం 10 గంటల వరకు అంతా పనుల్లోకి వెళ్లేవారు. ఇప్పుడు కూడా సందడిగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 గంటల దాటినా పనుల కోసం పడిగాపులు కాసే కూలీలు కనిపిస్తారు. ఒకప్పుడు అక్కడ కనీసం350 మందికి పైగా వలస కూలీలు పనికోసం ఎదురు చూసేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య 250కి పడిపోయింది. సగం మందికి పని దొరికితే.. మరో సగం మంది ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. యూసుఫ్గూడ లేబర్ అడ్డాలో గతేడాది ప్రతిరోజూ సుమారు 500 మంది కూలీలు పనికి వచ్చేవారు. ప్రస్తుతం 300 మంది వరకు వస్తున్నారు. అందరికీ పనులు దొరకడం లేదు. ఉప్పల్, యూసుఫ్గూడ వంటి అడ్డాలే కాదు. గ్రేటర్లోని వందలాది వలస కూలీల అడ్డాలు ప్రస్తుతం పనుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కోవిడ్కు ముందు నెలలో కనీసం 25 రోజులు పని లభించగా.. ప్రస్తుతం 15 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. మిగతా 15 రోజులు పనుల్లేక కష్టంగా ఉంటోంది. కొన్నిచోట్ల ఐదు రూపాయల భోజనం ఆదుకుంటోంది. కానీ అడ్డా కూలీలు ఉన్న అన్నిచోట్లా భోజన కేంద్రాలు లేవు. ఎదురు చూపులే... గ్రేటర్ హైదరాబాద్లో మేడ్చల్, మేడిపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తిస్థాయిలో ఊపందుకోలేదు. కోవిడ్కు ముందు గ్రేటర్లో సుమారు 10 లక్షల మంది వలస కూలీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 7 లక్షలకు తగ్గింది. లాక్డౌన్ రోజుల్లో సొంతూళ్లకు వెళ్లిన వారిలో మూడొంతుల మంది తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. సుమారు 3 లక్షల మంది మాత్రం ఊళ్లలోనే ఉంటున్నారు. నగరంలోని చిక్కడపల్లి, అశోక్నగర్, యూసుఫ్గూడ, మల్కాజిగిరి, రామంతాపూర్, ఉప్పల్, గౌలిగూడ, అంబర్పేట్, బాలానగర్, కూకట్పల్లి హౌసింగ్బోర్డు, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, ఎల్బీనగర్, హయత్నగర్, బీఎన్రెడ్డినగర్ తదితర సుమారు 2,500 కూడళ్లు వలస కూలీల అడ్డాలు. ప్రస్తుతం ఈ అడ్డాల్లో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది పనికోసం ఎదురు చూస్తున్నారు. కానీ 3.5 లక్షల మందికే పనులు లభిస్తున్నట్లు కారి్మక సంఘాల సర్వేలో వెల్లడైంది. సగం మంది పనికోసం ఎదురు చూడాల్సి వస్తోందని సీఐటీయూ నాయకులు ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల చదువులు ఆగినై.. ఒకరోజు పని ఉంటే మరో రోజు ఉంట లేదు. ఇంతకు ముందు లెక్క లేదు. బతుకు కష్టంగా మారింది. తినడానికి తిండి కూడా కష్టమైతుంది. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేదు. చదువులు బంద్ అయినై. మా కష్టాలు ఎవరు తీరుస్తరు సార్? – సుజాత, విజయపురి కాలనీ, ఉప్పల్ పెరిగిన ధరలు–పెరగని కూలీ రేట్లు.. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇంధనం ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయల ధరలు పెరిగాయి. రవాణా చార్జీలు రెట్టింపయ్యాయి. అందుకు అనుగుణంగా లేబర్ రేట్లు మాత్రం పెరగలేదు. పురుషులకు రోజుకు రూ.700, మహిళలకు రూ.600, మేస్త్రీలకు రూ.800 చొప్పున కూలీ లభిస్తోంది. నెలలో కేవలం 15 రోజులే పని దొరుకుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది నెలల తరబడి పచ్చడి మెతుకులతోనే గడుపుతున్నారు. కొన్ని చోట్ల రూ.5 భోజనంఆదుకుంటోంది. ఏ పనైనా మంచిదే.. పెయింటింగ్ పని చేస్తాను. కానీ ఇప్పుడు పనుల్లేక ఏది దొరికితే దానికి వెళ్లాల్సి వస్తోంది. ఒకప్పుడు ఆర్డర్లు తీసుకొని ఇళ్లకు రంగులు వేశాను. ఇప్పుడు అడ్డామీదకు వచ్చి పనికోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజు దొరుకుతోంది.. మరోరోజు నిరాశతో వెళ్లిపోతున్నాను. తప్పడం లేదు. – లక్ష్మణ్, సూరారం రూ.5 భోజనం ఆదుకుంటోంది పొద్దున్నే తిన్నా తినకపోయినా.. అడ్డా మీదకు వస్తున్నాను. ఏమాత్రం ఆలస్యమైనా పని దొరకడం లేదు. పని దొరకని రోజు రూ.5 భోజనంతో కడుపు నింపుకుంటున్నాను. దొరకని రోజు మధ్యాహ్నం వరకు ఎదురు చూసి వెళ్లిపోతున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. – కృష్ణ, చింతల్ పని దొరికితేనే తిండి రోజూ అడ్డా మీదకు వస్తున్నా.. పని దొరికిన రోజు సంతోషం. ఆ రోజు ఇంటిళ్లిపాదికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది. పనిలేని రోజు పచ్చడితో బువ్వ తినాల్సిందే.. ఇంటి కిరాయిలు బాగా పెంచిండ్రు. గతంలో నెలకు రూ.5 వేలు ఉండె. ఇప్పుడు రూ.6,500 అయ్యింది. చాలా కష్టంగా ఉంది. – సత్తయ్య, ఉప్పల్ పోటీ పెరిగింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల వల్ల బాగా పోటీ పెరిగింది. రోజుకు రూ.450 నుంచి రూ.500లకే ఒప్పుకుంటున్నారు. వాళ్లకు అపార్టుమెంట్లలోనే ఆశ్రయం ఇచ్చి పనులు అప్పగిస్తున్నారు. అడ్డా కూలీలకు పనులు దొరకడం లేదు. దీంతో కుటుంబమంతా తిప్పలు పడుతున్నారు. – చందు, ఉప్పల్ బిహార్ నుంచి మళ్లీ వచ్చా.. పనికోసం బిహార్ నుంచి ఇక్కడికి వచ్చాను. లాక్డౌన్ రోజుల్లో కష్టంగా ఉండడంతో తిరిగి వెళ్లిపోయాం. తర్వాత మళ్లీ హైదరాబాద్కు వచ్చాం. పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. రోజుకు రూ.600 మాత్రమే కూలీ లభిస్తోంది. ఇప్పుడేమో సెకెండ్ వేవ్ అంటున్నారు. లాక్డౌన్ పెడితే ఏం చేయాలో అర్ధం కాట్లే. – రౌతమ్, మల్లాపూర్ -
పేదింటి మహిళలను భయపెట్టిస్తున్న లాక్డౌన్..
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ను అదుపులోకి తెచ్చేందుకు మరోమారు లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా లాక్డౌన్ దిశగా ఆలోచిస్తోందన్న వార్తలు చాలామందిని కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధనవంతుల ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగించే ఎందరో పేదింటి మహిళలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతేడాది అమలుచేసిన లాక్డౌన్ వల్ల వారు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఉన్న ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లి గవ్వ లేక పస్తులుండాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో గత ఆరు నెలలుగా వారికి ఏదో ఒక ఉపాధి దొరికింది. దీంతో వారి కుటుంబాలకు కొంత ఆధారం లభించినట్లు అయింది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ అంటుండటంతో వారు ఉన్న ఆధారం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ మరోసారి లాక్డౌన్ విధిస్తే తమ కుటుంబ పరిస్ధితి ఏంటని తలచుకుంటూ వారు బాధపడుతున్నారు. 35 లక్షల మంది మహిళా కార్మికులు ముంబై, థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేసే మహిళా కార్మికులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. వీరిలో కొంత మంది ఇటుక బట్టీలలో పనులు చేసుకుంటుండగా.. మరికొందరు ఇతర కూలీ పనులు చేసుకుంటున్నారు. కానీ, ఎక్కువ మంది మాత్రం ధనవంతుల ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అయితే, గత కొంతకాలంగా ముంబైతో పాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో, శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైనా లాక్డౌన్ అమలు చేసే ఆస్కారముందని ప్రచారం సాగుతోంది. దీంతో గతేడాది పరిస్ధితులు మళ్లీ పునరావృతం అయ్యే ప్రమాదముందని వారు బెంబేలెత్తిపోతున్నారు. తమకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళలు అధిక శాతం ఉన్నారు. వీరికి సొంత ఇళ్లు కూడా లేకపోవడంతో అద్దె ఇళ్లలో ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ విధించి వీళ్లు ఉపాధి కోల్పోతే ఇంటి అద్దె కూడా చెల్లించేందుకు డబ్బులు లేని దయనీయ పరిస్థితి వస్తుంది. గతంలో విధించిన లాక్డౌన్ ఇప్పటికే పిల్లల చదువు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలామందికి ఉపాధి పోయింది. అప్పుడు పోగొట్టుకున్న పని ఇంతవరకు దొరకలేదు. ఇక ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ పెడితే తాముంటున్న అద్దె ఇళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోవాల్సిందేనని పేద మహిళలు వాపోతున్నారు. చదవండి: (లాక్డౌన్ హెచ్చరికలు.. సొంతూళ్లకు కూలీలు) -
లాక్డౌన్ హెచ్చరికలు.. సొంతూళ్లకు కూలీలు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కరోనా వైరస్ విజృంభణ, దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో బతుకీడుస్తున్న వలస కార్మికులు, కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్లీ లాక్డౌన్ అమలుచేస్తే ముంబై మహానగరంలో ఎలా బతకాలో తెలియక చాలామంది కూలీలు, కార్మికులు మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు. ఉపాధి కోసం నగరానికి రావాలనుకున్న వాళ్లు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాకే నగరానికి రావాలని భావిస్తున్నారు. తగ్గినట్టే తగ్గి.. డిసెంబర్, జనవరి మాసాల్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాల్లో కూలీలు, కార్మికులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రతీరోజు వేలాది మంది ఉపాధి కోసం ముంబై నగరానికి వచ్చారు. అయితే, ఫిబ్రవరి చివరి వారం నుంచి కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో మరింత కఠినంగా వ్యవహరించింది. రాత్రి పూట కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేసింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజల్లో మార్పు రావాలని, లేని పక్షంలో మరోసారి లాక్డౌన్ విధించక తప్పదని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. దీంతో లాక్డౌన్ విధిస్తే తమకు ఉపాధి లభించకపోవచ్చని ముందుగానే గ్రహించిన అనేక మంది పేదలు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారు స్వగ్రామాలకు వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఒకవేళ మళ్లీ లాక్డౌన్ విధిస్తే ముంబైలోనే చిక్కుకుంటామని వారిలో భయం నాటుకుపోయింది. దీంతో చాలామంది స్వగ్రామాలకు పయనం అవుతున్నారు. పెట్టే బేడ, పిల్లా పాపలతో దొరికిన వాహనంలో బయలుదేరుతున్నారు. అర్ధంతరంగా పనులు వదిలేసి.. రెడీమేడ్ దుస్తులు తయారుచేసే గార్మెంట్లలో, చిన్నా చితకా పరిశ్రమలలో పనిచేసే కూలీలు, కార్మికులు చేతిలో ఉన్న పనిని అర్ధంతరంగా వదిలేసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వారిని నమ్ముకుని ముందస్తుగా ఆర్డర్లు తీసుకున్న చిన్న, బడా వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సమయానికి ఆర్డర్లు వినియోగదారులకు అందించకపోతే మరింత నష్టం వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. మరోపక్క భవన నిర్మాణ రంగంలో కూలీలకు, కార్మికులకు నిత్యం మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో బిల్డర్లు అయోమయంలో పడిపోయారు. వాహనాల కోసం పడిగాపులు ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు, హైవేలపై ట్రక్కులు, టెంపోలు, ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు అన్నీ స్వగ్రామాలకు వెళ్లే కూలీలు, కార్మికులతో నిండిపోతున్నాయి. కొందరైతే ఎలాగైనా ఇంటికి వెళ్లాలన్న తపనతో వాహనాల వారు అడిగినంత చార్జీలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా కొందరు చార్జీలు కూడా భారీగా పెంచారు. ఇంకా కొందరు దూరప్రాంతాలకు వెళ్లేవాళ్లు తమ ప్రాంతానికి వెళ్లే వాహనాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడిగాపులు కాస్తున్నారు. మరికొందరు ఎక్స్ప్రెస్, మెయిల్ రైళ్లలోనైనా వెళ్లిపోయేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. -
గల్ఫ్ వెళ్లే కార్మికులకు కేంద్రం షాక్!
మోర్తాడ్ (బాల్కొండ) : అవ్వ పెట్టదు అడుక్కు తిననివ్వదు.. అన్నట్లుగా ఉంది వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక దేశం విడిచి గల్ఫ్కు వలస వెళుతున్న మన కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన విదేశాంగ శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారత కార్మికుల శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వాలకు సూచించాల్సిన మన విదేశాంగ శాఖ, కార్మికులకు నష్టం కలిగించేలా ఉత్తర్వులను జారీ చేసిందని చెబుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ దేశాలకు సంబంధించి కార్మికుల ఇమ్మిగ్రేషన్ విధానంలో కనీస వేతనాల కుదింపుపై అక్కడి ప్రభుత్వాలకు భారత్ సమ్మతి తెలిపిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు గత సెపె్టంబర్ 8న ఒక ఉత్తర్వును, అదే నెలలో 21వ తేదీన మరో ఉత్తర్వును విదేశాంగ శాఖ జారీ చేసిందని చెబుతున్నారు. గత సెప్టెంబర్లోనే ఈ ఉత్తర్వులు వెలువడినా గల్ఫ్ దేశాలకు ఇటీవలే మళ్లీ కార్మికుల వలసలు ప్రారంభం కావడంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో విదేశాంగ శాఖ ఉత్తర్వుల విషయం తెలిసిందని కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికులకు కనీస వేతనాన్ని కుదించవచ్చని విదేశాంగ శాఖ ఆయా ప్రభుత్వాలకు ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, ఎంపీ కె.ఆర్. సురేశ్రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన మిగతా ఎంపీలు కూడా దీనిపై దృష్టిసారించాలని ఆయన కోరారు. ఖతర్, బహ్రెయిన్, ఒమన్, యునైటెడ్ అర బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు నెలకు 200 అమెరికన్ డాలర్ల వేతనం.. అంటే మన కరెన్సీలో దాదా పు రూ.15 వేలు కార్మికులకు చెల్లించవచ్చని విదేశాంగ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొందని చెబుతున్నారు. అలాగే కువైట్లో పనిచేసే కార్మికులకు 245 డాలర్లు, సౌదీ అరేబియాలో పని చేసేవారికి 324 డాలర్ల వేతనం చెల్లించవచ్చ ని మన విదేశాంగ శాఖ అమోదం తెలిపిందని అంటున్నారు. అయితే ఇదింకా ఎక్కువ ఉండాలని కార్మికులు చెబుతున్నారు. ఖతర్లో పనిచేసే వలస కార్మికులకు కనీసంగా 1,300 రియాళ్ల వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆయా కంపెనీలకు నిర్దేశించగా మన విదేశాంగ శాఖ దానిని దృష్టిలో ఉంచుకోకుండా తక్కువ వేతనానికే భారతీయ కార్మికులు పనిచేస్తారని హామీ ఇచ్చిందని తెలుస్తోంది. యూఏఈలో కార్మికులకు నెలకు రూ.16వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. విదేశాంగ శాఖ ఉత్తర్వులతో ఆ వేతనం తగ్గుతుందని అంటున్నారు. కార్మిక, కర్షకుల కష్టంతోనే దేశపురోగతి క్యాపిటలిస్టులతో దేశాభివృద్ధి జరగడం లేదని, కార్మికుల, కర్షకుల కష్టంతోనే పురోగతి సాధిస్తోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘ఆలిండియా కన్వెన్షన్ ఫర్ దళిత్ రైట్స్ అండ్ ఎగైనెస్ట్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్’ కార్యక్రమం జరిగింది. సదస్సుని బెజవాడ విల్సన్ ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో రైతులను, శ్రామికులను చిన్నచూపుతో చూస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 58.9 శాతం దళితులు ఇప్పటికీ భూమి లేకుండా రైతు కూలీలుగా జీవనాన్ని వెళ్లదీస్తున్నారన్నారు. దేశం లో సామాజిక, కుల వివక్షకు బీజేపీ వంటి హిందూత్వ పార్టీలే ప్రధాన కారణమని విమర్శించారు. పేదరికం కారణంగా దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంక ట్ వాపోయారు. కార్యక్రమంలో హన్నన్ మొల్ల (ఏఐకేఎస్), ఏఐఏడబ్ల్యూయూ నేత విక్రమ్ సింగ్, తెలంగాణ కార్మిక సంఘం నేత ఐలయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు, గుల్జార్సింగ్ గోరియా (బీకేఎంయూ), అసిత్ గంగూలీ (ఎస్కేఎస్), సంజయ్ శర్మ (ఏఐఏఆర్ఎల్ఏ), సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
మ‘కామ్’ మారింది!
సాక్షి, మెదక్: వారికి పట్నంలో పనిలేదు.. మనీ లేదు. ఉన్నపణంగా ఉపాధి పోయింది. ఉన్నట్టుండి రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ గగనమైంది. కరోనా కాటుకు వలసకూలీలు విలవిలలాడారు. కట్టుబట్టలతో, ఖాళీకడుపులతో ఊరిబాటపట్టారు. హైదరాబాద్ నగరంలో విపత్కర పరిస్థితులను తట్టుకోలేక సొంతూళ్లకు వచ్చిన చాలామంది స్థానికుల అండతో కొత్త ఉపాధిని వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గినా పట్టణాలకు తరలిపోకుండా సొంత గ్రామం లేదా జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకొని తోచిన వ్యాపారం చేస్తూ, కూలిపని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యావంతులైన నిరుద్యోగులు పలువురు సొంతంగా చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకోగా ఇతరులు పలు షాపుల్లో పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నట్లు తెలుస్తోంది. రేషన్ పోర్టబిలిటీ లెక్కలే నిదర్శనం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ రేషన్ దుకాణం నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే(పోర్టబిలిటీ) వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కలిపించని విషయం తెలిసిందే. కరోనాకు ముందు ప్రస్తుతం పోర్టబిలిటీ సేల్ను పరిశీలిస్తే అధిక మొత్తంలో ప్రజలు సొంతూళ్లలోనే ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ, వెంటనే లాక్డౌన్ అమల్లోకి రాగా ఆ తర్వాత విడతలవారీగా అన్లాక్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లో, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్లో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్డౌన్తో పనుల్లేక వలస కూలీలు సొంత జిల్లాలకు తరలివచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ స్థానికంగానే ఉపాధి పొందుతున్నారు. మెదక్ జిల్లాలో కరోనాకు ముందు ఫిబ్రవరిలో రేషన్ పోర్టబిలిటీ కింద 18,825 మంది ఇతర ప్రాంతాల లబ్ధి దారులు రేషన్ సరుకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30,096కు చేరింది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ గమనించవచ్చు. -
నేను రక్షకుడిని కాదు!
లాక్డౌన్ సమయంలో ఎంతోమంది తమ ప్రాంతాలు చేరుకునేందుకు సహాయపడ్డారు నటుడు సోనూ సూద్. ‘మా పాలిట రక్షకుడిలా వచ్చావు’ అని దీవెనలందించారు వలస కార్మికులు. సూపర్ హీరో అని సోషల్ మీడియాలో ఒకటే పొగడ్తల వర్షం. అయితే ఇప్పుడు సోనూ సూద్ మాత్రం ‘నేను రక్షకుడిని కాను’ అంటున్నారు. ‘ఐయామ్ నో మెసయ్యా’ (నేను రక్షకుడిని/కాపాడేవాడిని కాదు అని అర్థం) అనే టైటిల్తో తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ పుస్తకం డిసెంబర్లో విడుదల కానుంది. ‘ఇది నా జీవిత కథ. కేవలం నాది మాత్రమే కాదు. ఎన్నో వేలమంది వలస కార్మికుల కథ’ అన్నారు సోనూ సూద్. -
బతకలేం, తిరిగి పనిలోకి వచ్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగొచ్చేందుకు వలసకార్మికులు సంసిద్ధులవుతున్నారు. వివిధ రాష్ట్రా ల్లోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన వారిలో 70% వరకు మళ్లీ నగరాలు, గతంలో పనిచేసిన చోట్లకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్తో కొన్నిరోజుల పాటు అనేక కష్టాలు ఎదుర్కొని వలస కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకున్న సం గతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక కోటి 4 లక్షల మంది వలసకార్మికులు తమ ఊళ్లకు చేరుకున్నట్టుగా సర్వేలో వెల్లడైంది. తాము పనిచేస్తున్న చోట్ల ఉపాధి దొరకక, ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కుటుంబాలను పోషించలేక, ఇళ్ల అద్దెలు కట్టలేక సొంత గ్రామాలకు వెళ్లిపోయినవారికి తమ నైపుణ్యాలకు తగ్గట్టు పనిదొరకక, ఇంకా కొందరికి సరైన పనులు లభించక లాక్డౌన్ సమయంలోనే 94% ఆదాయాలు తగ్గిపోయినట్టుగా తాజా సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో దాదాపు 70% వలసకార్మికులు తిరిగి పాత పనిప్రాంతాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. మాజీ ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తల ఆధ్వర్యంలో ‘మైగ్రెంట్ వర్కర్స్: ఏ స్టడీ ఆన్ దెర్ లైవ్లీహుడ్ ఆఫ్టర్ రివర్స్ మైగ్రేషన్ డ్యూటు లాక్డౌన్’శీర్షికతో నిర్వహించిన ఇన్ఫెరెన్షియల్ సర్వే స్టాటిస్టిక్స్, రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యయనంలో ఇంకా అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఫౌండేషన్ను నేషనల్ శాంపిల్సర్వే ఆఫీస్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ బి.బి.సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మాజీ ఆర్థిక సలహాదారు ఎన్కే సాహు తదితరులు స్థాపించారు. కోవిడ్ ప్రభావం వారిపై తీవ్రం వలస కార్మికులపై కోవిడ్ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా పడినట్లు సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్ల నుంచే ఎక్కువ సంఖ్యలో కార్మికులు వలస వస్తున్న నేపథ్యంలో.. ఈ రాష్ట్రాల్లోనే ఈ అధ్యయనం నిర్వహించారు. సొంతూ ళ్లకు వెళ్లిన వారిలో నెల లేదా రోజువారీ వేతనం పొందేవారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, వ్యవసాయేతర రంగాల్లోని క్యాజువల్ కార్మికులపై ఇది తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. సొంతూళ్లకు చేరుకున్న వారి ఆదాయాలను గతంలో పనిచేసిన చోట్ల ఆదాయంతో పోలిస్తే సగటున 85% తగ్గిపోయాయి. ఇక జార్ఖండ్,యూపీల్లో అయితే 94% మేర ఆదాయం తగ్గిపోయింది. గతంలో వివిధ మార్గాల్లో స్వయం ఉపాధి పొందే వలసకార్మికుల్లో ప్రస్తుతం 86% మేర ఆదాయం (ఆరు రాష్ట్రాల్లో కలిపి)కోల్పోయారు. గ్రామాల్లో ఆదాయమార్గాలు లేక పట్టణాలకు వెళితే ఏదో ఒక ఉపాధి దొరుకుతుందనే ఆశాభావంతో 41 శాతం మంది ఉన్నారు. గతంలో పనిచేసిన యజమానుల నుంచి వస్తున్న వేతనం పెంపుదలకు స్పందించి 33 శాతం మంది తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. జార్ఖండ్, యూపీల నుంచే ఎక్కువ నగరాలు, గతంలో తాము పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు 70% వలసకార్మికులు సుముఖంగా ఉండగా, వారిలో జార్ఖండ్ నుంచి 92.31%, యూపీ నుంచి 89.31%, ఒడిశా నుంచి 59 శాతంమంది సిద్ధమౌతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి మాత్రం 35 శాతంమందే మళ్లీ నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. -
సోనూసూద్కు ప్రతిష్టాత్మక అవార్డు
సాక్షి, ముంబై: రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది. ఇప్పటివరకు అద్భుత నటనకు అవార్డులు ప్రశంసలు గెలుచుకున్న సోనూ తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్లో చాలాకొద్దిమందికి దక్కిన అరుదైన గౌరవాన్ని సోనూ అందుకోవడం విశేషం. (రియల్ హీరో సోనూ సూద్కు గ్రాండ్ వెల్కమ్) నిస్వార్ధంగా, అలుపెరగకుండా లక్షలాది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం, వారిని ఆర్థికంగా ఆదుకున్న సోనూ సూద్ అక్కడితో ఆగిపోలేదు. విదేశాలలో చిక్కుకున్న వేలాదిమంది విద్యార్థులకు సహాయం, చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అవసరమైన వారికి ఉచిత ఉపాధి అవకాశాలను కల్పించడం లాంటి అనేక సేవలకుగాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఆయనకు ట్విటర్ లో అభినందన వెల్లువ కురుస్తోంది. హాలీవుడ్ నటులు ఏంజెలీనా జోలీ, లియోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, నోబెల్ బహుమతి గ్రహీత ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్హాం, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లాంటి వారిని ఐక్యరాజ్యసమితి పలు అవార్డులతో సత్కరించింది. మరోవైపు ఇది అరుదైన గౌరవమనీ, యూఎన్ఓ గుర్తింపు తనకు చాలా ప్రత్యేకమైందంటూ సోనూ సూద్ సంతోషం వ్యక్తం చేశారు. తన దేశీయుల కోసం తనకున్న దాంట్లో తాను చేసిన చిన్న సాయమని పేర్కొన్నారు. 2030 నాటికి పేదరికం, ఆకలి, లింగ వివక్ష నిర్మూలన లాంటి 17 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనలో యుఎన్డీపీకి తన మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. -
ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. (చదవండి: అవి రైతుల పాలిట మరణ శాసనాలే!) ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్ను ట్విట్టర్లో షేర్ చేశారు థరూర్. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు ‘నో డాటా అవైలబుల్’ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్ని ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima — Shashi Tharoor (@ShashiTharoor) September 22, 2020 వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్ ఈ ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయని తెలిపారు. ఈ పరిమితి కారణంగా, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యకు గల కారణాలపై జాతీయ సమాచారం ఆమోదించడం కానీ విడిగా ప్రచురించడం కానీ జరగలేదు’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో మరణించిన వలసదారుల సంఖ్యపై తమ దగ్గర ఎలాటి డాటా లేదని గతంలో పార్లమెంటులో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
శ్రామిక్ రైళ్లలో 97 మంది వలస కార్మికులు మృతి!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించేందుకు కేంద్రం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రామిక్ స్పెషల్ రైళ్లలో సంభవించిన మొత్తం మరణాల వివరాలపై శుక్రవారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో మొత్తం 97 మంది వలస కార్మికులు శ్రామిక్ రైళ్లలో ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. (గుడ్ న్యూస్ : మరో 40 స్పెషల్ రైళ్లు ) కాగా ఇటీవల వలస కార్మికుల మరణాల గురించి తమ వద్ద ఎలాంటి లెక్కలు లేవని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై ప్రతిపక్షలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్ర తొలిసారిగా శ్రామిక్ రైళ్లలో సంభవించిన మరణాల లేక్కలను రాజ్యసభలో ప్రకటించింది. అయితే, ఆయా రాష్ట్రాల పోలీసులు వీటిని అసహజ మరణాలుగా పరిగణిస్తూ సెక్షన్ 174 కింద కేసులు నమోదు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం కేసుల్లో 87 కేసులకు సంబంధించి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించినట్లు వెల్లడించారు. అందులో 51 కేసుల్లో బాధితులు గుండె పోటు, లివర్, ఊపరితిత్తుల సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు లాంటి కారణాలతో మరణించినట్టు తేలింది. (నాడు గాలికి వదిలేసి.. ఇప్పుడు రమ్మంటే) -
సమాచార లోపం సరికాదు
దేశం ఇంకా కరోనా వైరస్ మహమ్మారి గుప్పెటనుంచి బయటపడని వేళ... ఆర్థిక సంక్షోభం పర్యవ సానంగా కోట్లాదిమంది ఉపాధి అవకాశాలు అడుగంటుతున్న వేళ... 18 రోజుల పార్లమెంటు వర్షా కాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. పార్లమెంటు లోపలా, వెలుపలా కనబడుతున్న దృశ్యాలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యలు ఎంత పకడ్బందీగా అమలవుతున్నాయో అర్థమవు తుంది. పార్లమెంటు రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆర్నెల్లు మించరాదన్న రాజ్యాంగ నిబంధన వుంది గనుక అది ముగుస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు గుమిగూడే పరిస్థితులు తలెత్తకుండా ఉభయ సభలూ చెరో పూట సమావేశమ య్యేలా ఏర్పాట్లు చేశారు. తక్కువ వ్యవధిని కారణంగా చూపి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అయితే సభ్యులడిగే ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందుబాటులో వుంటాయని ఉభయ సభల అధ్యక్షులూ ప్రకటించారు. కానీ తొలిరోజే వలస కార్మికుల మరణాలపై తమ వద్ద ఎలాంటి డేటా లేదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ జవాబివ్వడం దిగ్భ్రాంతి కలిగి స్తుంది. అంతేకాదు... రాష్ట్రాలవారీగా ఎంతమంది వలస కార్మికులకు ఉచిత రేషన్ వగైరాలు అందాయో చెప్పలేమని తెలిపింది. కరోనా విపత్తుతో గత మార్చి 24 నుంచి దేశమంతా లాక్డౌన్ విధించారు. కొన్నాళ్లపాటు పౌరుల కదలికలను పూర్తిగా స్తంభింపజేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దాన్ని అమల్లో పెట్టేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమంగా లేకపోవడంతో వలస జీవులు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. ఉపాధి పోయి, గూడు చెదిరి ఏం చేయాలో తోచక, ఎలా పొట్ట నింపుకోవాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు. ఉన్నచోటే వుంటే దిక్కులేని చావు చస్తామన్న భయంతో స్వస్థలాలకు పోవడానికి నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ వల్ల సమస్త కార్యకలాపాలూ స్తంభించిపోవడంతో వీరంతా నడకదారిని ఎంచుకోక తప్పలేదు. వీరిలో వలస కూలీలు, కార్మికులు, చిన్నా చితకా వ్యాపారులు వున్నారు. ఇలా మొత్తం కోటి నాలుగు లక్షల అరవై ఆరువేలమంది స్వస్థ లాలకు వెళ్లారని కార్మిక శాఖ చెబుతోంది. అధికంగా ఉత్తరప్రదేశ్కు 32.5 లక్షలమంది వలస కార్మి కులు తిరిగిరాగా, ఆ తర్వాత స్థానంలో బిహార్(15 లక్షలమంది), పశ్చిమబెంగాల్(13.38 లక్షల మంది) వున్నాయి. 63లక్షలమందికిపైగా వలస జీవుల్ని ప్రత్యేక రైళ్ల ద్వారా చేరేశారని కూడా ఆ శాఖ వివరించింది. అయితే లాక్డౌన్ మొదలైన నెల తర్వాత మాత్రమే ఈ ప్రత్యేక రైళ్లు నడిపారని మరిచిపోకూడదు. అనేకానేక కారణాలవల్ల ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేనివారు కూడా నడవక తప్పలేదు. ఇలాంటివారంతా ఎన్నో యాతనలు పడ్డారు. కొందరు ఆకలిదప్పులకు తట్టుకో లేక మరణించారు. మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని చనిపోయారు. గాయాలపాల య్యారు. కొన్ని సందర్భాల్లో వారు వెళ్లే దారిలో తారసపడిన వాహనాలెక్కి, అవి ప్రమాదాలపాలవ డంతో మరణించినవారున్నారు. మహారాష్ట్రలో రైల్వే ట్రాక్పై ఆదమరిచి నిద్రపోతూ 17మంది వలసకూలీలు చనిపోయారు. సుదూర ప్రాంతం నడిచిన కారణంగా ఒంట్లో సత్తువ కోల్పోయి మృత్యువాత పడిన ఉదంతాలున్నాయి. ఈ వలస జీవులకు పేరూ ఊరూ లేకపోవచ్చు. కానీ మహా నగరాల, పట్టణాల నిర్మాణం, వాటి మనుగడ వీరిపైనే ఆధారపడివుంటుంది. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో, రహదారుల నిర్మాణంలో, పారిశుద్ధ్యంలో, వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల్లో, సంపన్నులు, మధ్యతరగతి వర్గాల ఇళ్లల్లో వీరు లేకపోతే అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోతాయి. వలస కార్మి కుల శ్రమ విలువ జీడీపీలో పది శాతమని గణాంకాలు చెబుతున్నాయి. ఏ రిజిస్టర్లోనూ, రికార్డు ల్లోనూ చోటు దొరకని ఈ అభాగ్యులు సంక్షోభం ముంచుకొచ్చేసరికి ఎవరికీ కాకుండా పోయారు. బతికుండగానే ఎవరికీ కానివారు మరణించాక మాత్రం ఏం లెక్కలోకి వస్తారు? అందుకే ప్రభుత్వాల దగ్గర వారి మరణాల గురించిన లెక్కలు లేవనుకోవాలి. కనీసం ఆ వలసజీవుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేసే సంస్థలనైనా ప్రభుత్వాలు సంప్రదించివుంటే ఏదో మేరకు గణాంకాలు లభ్యమయ్యేవి. అలా మరణించినవారిపై ఆధారపడిన కుటుంబాలకు సాయం అందిం చడం సాధ్యమయ్యేది. ఆ ప్రయత్నం చేస్తామని కూడా చెప్పకుండా తమ వద్ద డేటా లేదన్న సమా ధానం ఇవ్వడం కేంద్రానికి భావ్యం కాదు. రహదారి భద్రత గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ సేవ్ లైఫ్ ఫౌండేషన్ లాక్డౌన్లో రోడ్డు ప్రమాదాల బారినపడి మరణించినవారి వివరాలు సేకరించింది. ఆ సంస్థ గణంకాల ప్రకారం 198మంది వలస జీవులు లాక్డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. మార్చి 25–మే 31మధ్య దేశవ్యాప్తంగా 1,461 ప్రమాదాలు చోటుచేసుకోగా, అందులో 750మంది మరణించారని, మృతుల్లో 198మంది వలసజీవులని సంస్థ డేటా వెల్లడించింది. అయితే ఇది సమగ్రమైన నివేదికని చెప్పలేం. వనరుల రీత్యా స్వచ్ఛంద సంస్థలకు అనేక పరిమితులుం టాయి. కానీ ప్రభుత్వాలకేమైంది? వలసజీవులు పిల్లాపాపలతో స్వస్థలాలకు నడుచుకుంటూ పోవడం దేశ విభజన తర్వాత భారత్లో చోటుచేసుకున్న అతి పెద్ద ఉత్పాతమని సామాజిక రంగ నిపుణులు అభివర్ణించారు. ఎంతమంది వలస కార్మికులు, కూలీలు నడిచిపోయారో చెప్పలేకపో యినా, కనీసం ప్రమాదాల్లో చిక్కుకుని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో లెక్కలు చెప్పలేని స్థితి వుండకూడదు. ఎందుకంటే చిన్నదో పెద్దదో ప్రతి ప్రమాదమూ సమీప పోలీస్స్టేషన్లో తప్పని సరిగా నమోదవుతుంది. అందులో చిక్కుకున్నవారు ఎటునుంచి ఎటుపోతున్నారో రికార్డవుతుంది. ఎందరు మరణించారో, గాయపడ్డారో వివరాలుంటాయి. కనీసం ఇప్పుడైనా ఆ డేటాను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి పార్లమెంటుకు సమర్పించడం, బాధిత కుటుంబాలకు పరిహారం అందిం చడం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్తో ఉపాధిపై భరోసా లేక బతుకుజీవుడా అంటూ సొంతూరు బాటపట్టిన వలస జీవులు తిరిగి నగర బాట పడుతున్నారు. కొన్ని నెలల క్రితం స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులకు ప్రస్తుతం అక్కడ సైతం ఉపాధి కరువైంది. ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. తమ సొంతవారిని కలిశామన్న తృప్తి తప్ప చేసేందుకు తగినంత పని లేకుండా పోయింది. కుటుంబ పోషణ కష్టమైంది. నగరంలో కోవిడ్ ఉద్ధృతి తగ్గకున్నా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ వచ్చేందుకు కొందరు సిద్ధమవుతుండగా.. మరికొందరు కరోనా కేసులు పెరుగుతుండటంతో వెనక్కి రావడానికి ఇష్టపడటం లేదు. కొందరు రావడానికి రెడీ అవుతున్నా వారి కుటుంబ సభ్యులు అడ్టుకుంటున్నారు. అయినా పాత పనులకు సై అంటున్నారు. పరిస్థితులు తారుమారు.. కరోనా మహమ్మారితో పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం వలస కూలీల కొరత ఏర్పడింది. భవన నిర్మాణ కార్మికుల కొరత కాంట్రాక్టర్లను వేధిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. స్థిరాస్తి రంగం పడిపోయింది. అమ్మకాలు విపరీతంగా తగ్గాయి.. వలస కూలీలు లేకుంటే పనులు జరగవు. దీంతో వెనక్కి రప్పించడానికి కాంట్రాక్టర్లు తీవ్రంగా తంటాలు పడుతున్నారు. మునుపటి కంటే ఎక్కువ జీతం, ఉచిత గది, ఇతర సౌకర్యాలు వంటివి కల్పిస్తామని చెబుతున్నారు. దీంతో కొంతమంది వలస కూలీలు తిరిగి వస్తుండటంతో నిర్మాణ రంగం, సూక్ష్మ పరిశ్రమలకు జీవం వస్తోంది. తాజాగా వివిధ మార్గాల్లో వలసజీవులు తిరిగి వస్తుండటంతో భవన నిర్మాణ రంగం కాంట్రాక్టర్లు, సూక్ష్మ పరిశ్రమల యాజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. -
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసిన సోనూసూద్ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. (చదవండి : త్వరలోనే వస్తా.. మిమ్మల్ని కలుస్తా: సోనూసూద్) ‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలూ కల్పిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రవాసీ రోజ్గార్ ద్వారా ఈ మంచి పని కోసం అందరం కష్టపడ్డామని, ఎన్ఏఈసీ అధ్యక్షుడు లలిత్ ఠుక్రాల్ ఎంతో సాయం చేశారని, కార్మికులందరికీ ఆరోగ్యకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తామని సోనూసూద్ హామీ ఇచ్చారు. లాక్డౌన్తో ఇబ్బందుల పడుతున్న వలస కార్మికుల సాయం కోసం సోనూసూద్ ఓ టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన ఇటీవల ఒక స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను కూడా ప్రారంభించారు. -
నిరుద్యోగ భూతం.. పెరిగిన శాతం
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగభూతం రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో అది 9.1 శాతానికి చేరుకుంది. గత తొమ్మిది వారాల్లో జాతీయస్థాయిలో ఇదే అత్యధికం. ఆగస్ట్ 16తో ముగిసిన వారాంతానికి జాతీయస్థాయిలో చూస్తే... పట్టణాల్లో 9.61 శాతం, గ్రామాల్లో 8.86 శాతం నిరుద్యోగం నమోదైనట్టు సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడైంది. ఆగస్టు 9 తేదీ నాటికి 8.67 శాతమున్న దేశ నిరుద్యోగ శాతం ఆగస్టు 16 నాటికి 9.1 శాతానికి పెరిగింది. ఈ నెలలో వ్యవసాయ కార్యకలాపాలు తగ్గడం, వలస కార్మికులు నగరాలు, పట్టణాల బాట పట్టడం నిరుద్యోగ శాతం పెరగడానికి కారణాలు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ తగ్గుదలతో ఉద్యోగ అవకాశాల్లో కోత పడినట్టు భావిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక ట్రెండ్ కావచ్చని మరికొందరు ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ ప్రభావం.. వేతనాలు, ఉద్యోగాల (శాలరీడ్ జాబ్స్)పై అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్తో ముగిసిన నెలకు 6.84 కోట్ల శాలరీడ్ జాబ్స్ తగ్గగా, జూలై మాసాంతానికి 6.72 కోట్లకు చేరుకున్నట్టు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీల్లో ఏవిధంగా ఉందంటే.. ► తెలంగాణలో 9.1 శాతం నిరుద్యోగం నమోదైంది ► ఛత్తీస్గఢ్లో 9, తమిళనాడులో 8.1, జార్ఖండ్లో 8.8 శాతం ► ఆంధ్రప్రదేశ్లో 8.3 శాతం, కేరళలో 6.8 శాతం ► పశ్చిమబెంగాల్లో 6.8 శాతం, యూపీలో 5.5 శాతం నిరుద్యోగం అగ్రస్థానంలో హరియాణా ► హరియాణా 24.5 శాతం నిరుద్యోగంతో టాప్ప్లేస్లో ఉంది ► పుదుచ్చేరి 21.1, ఢిల్లీ 20.3 శాతంతో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి ► హిమాచల్ ప్రదేశ్ 18.6 శాతంతో నాలుగోస్థానం, గోవా 17.1 శాతంతో ఐదో ప్లేస్లో నిలిచింది. అతి తక్కువ నిరుద్యోగమున్న రాష్ట్రాలివే... ► ఒడిశా, గుజరాత్ల్లో 1.9 శాతం చొప్పున అత్యల్ప నిరుద్యోగం ► మేఘాలయ 2.1, అస్సాం 3.2, మధ్యప్రదేశ్, కర్ణాటక 3.6 శాతం చొప్పున ► మహారాష్ట్ర 4.4, సిక్కింలో 4.5 శాతం నిరుద్యోగం 10 శాతానికిపైగా నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► త్రిపురలో 16.4, రాజస్తాన్లో 15.2, ఉత్తరాఖండ్లో 12.4 శాతం నిరుద్యోగం ► బిహార్లో 12.2, జమ్మూ,కశ్మీర్లో 11.2, పంజాబ్లో 10.4 శాతం నిరుద్యోగం -
22 రోజులు.. 110 కిలో మీటర్లు..
సాక్షి, హైదరాబాద్: కూటి కోసం.. కూలి కోసం.. కాంట్రాక్టర్ మాటలు నమ్మి.. వెంట వెళ్లిన కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. చేతిలో చిల్లిగవ్వలేక.. కరోనా వేళ కరుణించేవారు లేక.. కళ్లలో ఆశలుడిగి కాలినడకన బయలుదేరిన ఆ కూలీ కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. 22 రోజులుగా నడిచి నడిచి, ఎడతెరిపిలేని వాననీటిధారలోనే ఎడతెగని కన్నీటిధార కలిసిపోయిన ఆ పేద జంటకు ఎంత కష్టం.. ఎంత కష్టం.. చివరికి కూలీని మరో కూ లీ చెంతకు తీసుకొని చింత తీర్చి మానవత్వం ఇంకా కూలిపోలేదని నిరూపించిన ఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్నగర్కు చెందిన భాషబోయిన రమేశ్ దినసరి కూలీ. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ మాటలు నమ్మి భార్య లక్ష్మి, కుమారుడు చక్రిని తీసుకుని ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లాడు. తీరా పనిచేయించుకున్న కాంట్రాక్టర్ వారికి చెప్పాపెట్టకుండా ఎటో ఉడాయించాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. ఎన్నిరోజులు ఎదురుచూసినా తిరిగిరాలేదు. తనతోపాటు పలువురు స్థానిక, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు కూడా ఆ కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఎగ్గొట్టాడు. దీంతో మోసపోయామని గ్రహించిన రమేశ్ భార్యాబిడ్డలతో కలసి స్వగ్రామానికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చాలామందిని చార్జీ డబ్బుల కోసం బతిమిలాడాడు. కరోనా విజృంభిస్తున్నవేళ ఎవరూ వారిని కరుణించలేదు. కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుండటంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. రూ.100 చేతిలో పెట్టి వెళ్లిపొమ్మన్నారు. లారీ డ్రైవర్లు కూడా వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు నిరాకరించారు. 22 రోజులపాటు పట్టాల వెంబడే నడక..! చేసేదేమీ లేక కాలినడకన రైలు పట్టాల వెంట విశాఖపట్నం నుంచి వరంగల్కు బయల్దేరింది ఆ కూలీ కుటుంబం. మార్గమధ్యంలోనూ చాలామందిని అర్థించినా ఫలితం లేకుండా పోయింది. సరిగా తిండి లేకపోవడంతో రోజుకు 4–5 కి.మీ. మాత్రమే నడిచేవారు. స్టేషన్లలో ప్రయాణికులను బతిమిలాడుతూ.. పొట్టనింపుకున్నారు. పట్టాల వెంబడే నిద్రపోవడంతో రమేశ్ కుమారుడు చక్రీకి, భార్య లక్ష్మికి పలుమార్లు తేళ్లు కుట్టాయి. అయినా గుండెధైర్యంతో 22 రోజులపాటు పట్టాల వెంట నడక సాగించారు. మధ్యలో ఐదురోజులపాటు ఏకధాటి వాన కురుస్తున్నా నడుస్తూనే ఉన్నారు. దాదాపు 110 కిలోమీటర్ల అనంతరం రాజమండ్రి సమీపంలోని లక్ష్మీనారాయణపురం రైల్వేస్టేషన్ వద్దకు బుధవారం రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ పనులు చేసుకుంటున్న రైల్వే కూలీ డేవిడ్ వారిని గుర్తించి వివరాలు వాకబు చేశాడు. డేవిడ్ ఇటీవల తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్గా సెలక్టయ్యాడు. ట్రైనింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో కూలి పనులు చేసుకుంటున్నాడు. రమేశ్ తన పరిస్థితి చెప్పగానే డేవిడ్, అతని మిత్రులంతా కలిసి ఆ కుటుంబాన్ని చేరదీశారు. ఆకలి తీర్చి, ఆ రాత్రికి తమ వద్దే ఆశ్రయమిచ్చారు. మర్నాడు డేవిడ్ తాను పనిచేసే ఎంఎంఆర్ సంస్థ అధికారులకు, తోటి కూలీలకు, తెలంగాణలోని టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు విషయం వివరించాడు. దీంతో వారంతా కలసి రమేశ్ కుటుంబానికి ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్చేశారు. కూలీలంతా కలసి రాజమండ్రి వరకు ఆటో మాట్లాడి వారిని అందులో ఎక్కించారు. దారి ఖర్చులకు డబ్బులిచ్చారు. రాజమండ్రిలో వరంగల్ రైలెక్కించి మానవత్వం చాటుకున్నారు. -
‘ఇప్పటికే రూ.10 కోట్లు.. ఇంటికి పంపించండి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. దాంతో భారత్ నుంచి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఎందరో కార్మికులు తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 20 వేల మంది తెలంగాణ వాసులు హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వీరందరిని స్వస్థలాలకు పంపించకుండా హైదరాబాద్లోనే క్వారంటైన్లో ఉంచింది ప్రభుత్వం. ఈ క్రమంలో తొలుత వచ్చిన 5,500 మందికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించింది. అయితే జూన్ 7 ‘వందే భారత్ మిషన్’లో భాగంగా దాదాపు 14,500 వేల మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు. వీరందరికి ఉచిత క్వారంటైన్ కల్పించడం కష్టంగా భావించిన సర్కార్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 8,000 రూపాయలు వసూలు చేసి హోటల్స్లో క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇలా ప్రభత్వం వీరి దగ్గర నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. (ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?) తాజాగా హోటల్ సిబ్బంది మరోసారి డబ్బులు కట్టాల్సిందిగా వీరిని డిమాండ్ చేస్తున్నారు. అసలే ఉద్యోగాలు కోల్పోయి స్వదేశం వచ్చారు. ఇంకా ఇళ్లకు కూడా వెళ్లలేదు. చేతిలో ఉన్న కొద్ది మొత్తం క్వారంటైన్ పేరుతో హోటల్కే ఖర్చయ్యింది. ప్రస్తుతం జేబులో రూపాయి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి హోటల్లో క్వారంటైన్లో ఉండలేము.. మమ్మల్ని హోం ఐసోలేషన్కు అనుమతించండి అంటూ గల్ఫ్ కార్మికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వలసకార్మికుల సంక్షేమ సంఘం సభ్యుడు ఎం. బాల్రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. 14,500 మంది దగ్గర నుంచి ఎనిమిది వేల చొప్పున 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు రావడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి సగటున 1,000 యూఏఈ దిర్హామ్స్, సౌదీ / ఖతారి రియాల్స్ (సుమారు రూ .20,000) ’వసూలు చేశారని తెలిపారు. (క్వారంటైన్ నుంచి భార్యాభర్తల పరార్) ఈ లెక్క ప్రకారం, 20,000 మంది వలసదారులు ఉంటే ఒక వ్యక్తి నుంచి 20,000 రూపాయల చొప్పున మొత్తం 40 కోట్ల రూపాయలు వసూల చేశారని తెలిపారు బాల్రెడ్డి. అంతేకాక ‘కేరళ, మహారాష్ట్రల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని ‘హోం క్వారంటైన్’కు అనుమతిస్తున్నారు. ఇక ఏపీ, ఢిల్లీలో గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తోన్న పేద వలస కార్మికుల కోసం ప్రభుత్వాలే ఉచిత క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నాయి’ అని తెలిపారు బాల్రెడ్డి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఆగస్టు 13 వరకు 46,488 మంది ప్రయాణికులు వందే భారత్ మిషన్లో భాగంగా హైదరాబాద్కు తిరిగి వచ్చారు. వీరంతా 30 దేశాల నుంచి 285 విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. -
సోనూసూద్ పుట్టినరోజు: 3 లక్షల ఉద్యోగాలు
ముంబై: వెండితెరపై ఆయన భయంకరమైన విలన్. కానీ రియల్గా మాత్రం మంచి మనుసున్న వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి చేయూత అందిస్తున్న రియల్ హీరో నటుడు సోనూసూద్. ఈ రోజు (గురువారం) జూలై 30 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా వలస కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వారిని ఆదుకునేందుకు మరో ముందడుగుడు వేశాడు. కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు తన జన్మదినం కానుకగా 3 లక్షల ఉద్యోగాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు ప్రవాసిరోజ్గర్.కామ్లో 3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఇతర సదుపాయలు కూడా అందుతాయి’’ అంటూ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇప్పటికే లాక్డౌన్లో వలస జీవులను తన సొంత ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించి గ్రామాలకు చేర్చిన విషయం తెలిసిందే. (చదవండి: భావోద్వేగం, సోనూ సూద్ కంటతడి!) मेरे जन्मदिन के अवसर पे मेरे प्रवासी भाइयों के लिए https://t.co/UWWbpO77Cf का 3 लाख नौकरियों के लिए मेरा करार। ये सभी अच्छे वेतन, PF,ESI और अन्य लाभ प्रदान करते हैं। धन्यवाद् AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea और अन्य सभी का।#AbIndiaBanegaKamyaab pic.twitter.com/rjQ0rXnJAl — sonu sood (@SonuSood) July 30, 2020 ఈ విషయంలో తనకు మద్దతుగా వచ్చిన పలు సంస్థలు ధన్యవాదాలు తెలిపాడు. లాక్డౌన్లో వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చిన సోనూసూద్ ఆ తర్వాత కూడా నిరంతరాయంగా సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ పేద రైతు తన ఇద్దరూ కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియోకు చలించిన ఆయన ఏకంగా ట్రాక్టర్ను కొని పంపించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన టీవీ నటుడి చికిత్సకు డబ్బు సాయం చేశాడు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శారదకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఇలా కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తూ సోనూసూద్ అందరి మన్ననలు పొందున్నాడు. (చదవండి: చిరునవ్వుతో నమస్కరించాలి: సోనూసూద్) -
సోనూ సూద్ వెనుక సోనాలి పాత్ర
(సాక్షి, వెబ్డెస్క్): కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటూ ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్నారు ‘రీల్ విలన్’ సోనూసూద్. లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల పాలైన వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. ‘నిసర్గ’తుఫాను బాధితులకు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు. లాక్డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి మార్గం చూపేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ను కూడా తయారు చేయించారు. ఇలా ప్రతీ ఒక్కరికి తన వంతు సాయం చేస్తూ ముందుకు సాగుతున్న సోనూను ‘అపర కర్ణుడు ’అంటూ నెటిజన్ల ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా సుపరిచితుడైన సోనూసూద్ జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. పంజాబీ కుటుంబం సోనూ సూద్ స్వస్థలం పంజాబ్లోని మోగా. జూలై 30, 1973లో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. సోనూ తండ్రి పేరు శక్తి సాగర్ సూద్. ఆయన వ్యాపారం చేసేవారు. తల్లి సరోజ్ సూద్ ఉపాధ్యాయిని. సోనూకి ఓ సోదరి కూడా ఉంది. తన పేరు మోనికా సూద్. ఆమె సైంటిస్టుగా పనిచేస్తున్నారు. మొదటి సంపాదన రూ. 500 స్కూల్లో చదివే రోజుల్లో సోనూ తన తండ్రి షోరూంలో పని చేసేవారు. బడి నుంచి రాగానే షాపులో కూర్చునేవారు. ఇక ఉన్నత విద్య కోసం మహారాష్ట్రకు వెళ్లిన సోనూసూద్.. నాగ్పూర్లోని యశ్వంత్రో చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్లో పట్టా పుచ్చుకున్నారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న సమయంలో మోడలింగ్ దిశగా అడుగులు వేసిన ఆయన.. తొలి సంపాదన 500 రూపాయలు. దాంతో సోనూ డెనిమ్ దుస్తులు కొనుగోలు చేశారు.(సోనూసూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?) ముంబైకి వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోనూసూద్కు ముంబైకి షిఫ్ట్ అయ్యారు. స్నేహితులతో కలిసి అక్కడే ఓ చిన్న గదిలో ఉండేవారు. దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేటు సంస్థలో కొన్నాళ్లు పనిచేసిన సోనూ.. ఫీల్డ్ వర్క్ కారణంగా తరచుగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అప్పుడు ఆయన జీతం రూ. 4500. దీంతో మంత్లీ ట్రెయిన్ పాస్ తీసుకుని ఖర్చు తగ్గించుకునే మార్గాన్ని ఎన్నుకున్నారు. అలా రైలు ప్రయాణంలో ఉండే కష్టనష్టాల గురించి సోనూకి అప్పుడే అనుభవంలోకి వచ్చింది.(‘సాఫ్ట్వేర్ శారద’కు సోనూసూద్ జాబ్) టాప్-5లో ఒకడిగా.. చాలీచాలని జీతంతో నెట్టుకొస్తూనే సోనూ సూద్ మోడలింగ్ కెరీర్పై దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ‘గ్రాసిం మిస్టర్ ఇండియా’ పోటీలో పాల్గొని టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలు సోనూసూద్ది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు సొనాలీ సూద్. 1996లో వీరి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమారులు అయాన్, ఇషాన్ ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సొనాలి ఉద్యోగం చేస్తూ భర్తకు అండగా నిలబడ్డారు. మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడి ఆమె.. భర్త చేసే ప్రతి పనిలోనూ వెన్నంటే ఉంటారు. సోనూ చేస్తున్న దానధర్మాల వెనుక సొనాలి పాత్ర కూడా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తమిళ సినిమాతో ఎంట్రీ ఇక సోనూసూద్ సినీ జీవితానికి వస్తే.. 1999లో కలాగర్ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘షాహీద్ ఈ ఆజం’ మూవీతో 2002లో హిందీ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సోనూ నటించిన యువ సినిమా తనకెంతగానో గుర్తింపు తీసుకువచ్చింది. ఇక తెలుగులో సోనూ నటించిన అరుంధతి సినిమా ఆయనకు ఎంతటి క్రేజ్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. పశుపతి పాత్రలో జీవించినందుకు గానూ అనేక అవార్డులు సోనూసూద్ సొంతమయ్యాయి. శక్తి, అశోక్, ఏక్ నిరంజన్, దబాంగ్, ఆషిక్ బనాయా అప్నే వంటి సినిమాల్లో కూడా సోనూ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. 2016లో షువాజంగ్ అనే సినిమాతో చైనీస్ చిత్రసీమలోనూ అడుగుపెట్టారు. ఇక కుంగ్ ఫూ యోగా సినిమాలో నటించిన సోనూకు.. హాలీవుడ్ యాక్టర్ జాకీ చాన్తో మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్లోనూ సోనూ తళుక్కుమన్నారు. అదే విధంగా తండ్రి పేరు మీదుగా శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. నో స్మోకింగ్.. పక్కా వెజిటేరియన్ సోనూ సూద్కు మద్యపానం అలవాటు లేదు. అదే విధంగా ఆయన స్మోకింగ్కు కూడా దూరం ఉంటారు. పక్కా వెజిటేరియన్. కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం. గిటార్ కూడా వాయిస్తారు. ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే సోనూ.. పలు మ్యాగజీన్ కవర్లపై కూడా దర్శనమిచ్చారు. సోనూసూద్ వినాయకుడి భక్తుడు. అయితే తన తల్లి చనిపోయిన తర్వాత అంటే గత నాలుగేళ్లుగా ఆయన ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇక సోనూకు మూగజీవాలపై కూడా ప్రేమ ఎక్కువే. ఆయన దగ్గర ‘స్నోయీ’ అనే కుక్క ఉంది. (దారి చూపే దేవత నువ్వు: సోనూసూద్) లగ్జరీ కార్లంటే మక్కువ సోనూసూద్కు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆయన దగ్గర పోర్షే, ఆడి క్యూ 7 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒకరోజు తన స్నేహితుడు అజయ్ ధర్మతో కలిసి ఆడి కారులో ప్రయాణిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ వాళ్లిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇక సోనూసూద్ సినీ జీవితంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లేడీ డైరెక్టర్తో పనిచేయడం ఇష్టం లేకే మణికర్ణిక సినిమా నుంచి తప్పుకున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే తాను వైదొలిగినట్లు సోనూ సన్నిహితులు వెల్లడించారు. -
యాప్తో ఉద్యోగం
అక్షర జ్ఞానాన్ని ఇస్తే గురువని, ఆర్థిక సహాయం చేస్తే దాత అని, ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకుంటే దేవుడని అంటారు. ‘‘ఈ కరోనా కాలంలో సోనూ సూద్ మా పాలిట దేవుడు’’ అని పలువురు వలస కార్మికులు అంటున్నారు. ప్రత్యేక బస్సుల్లో వలస కార్మికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లే ఏర్పాటు చేశారు సోను. కొందరినైతే ఏకంగా ఫ్లయిట్లో కూడా పంపించారు. ఇప్పుడు సహాయంపరంగా ఇంకో మెట్టు ఎక్కారు. కరోనా కారణంగా చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారందరి కోసం సోనూ సూద్ ఓ కొత్త æయాప్ను తయారు చేయించారు. ఈ యాప్ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ‘‘అర్హులందరికీ తప్పకుండా ఈ యాప్తో సాయం అందుతుంది’’ అంటున్నారు సోనూ సూద్. -
వారి కోసం సోనూసూద్ మరో గొప్ప ప్రయత్నం
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సోనూసూద్ (46) వలస కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎనలేని సేవ చేసి సూపర్ హీరోగా నిలిచిన సోనూసూద్ తాజాగా వారికి ఉపాధిని అందించేందుకు ఒక కొత్తయాప్ను విడుదల చేశారు. కరోనా సంక్షోభంతో ఉపాధి లేక అల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకునే లక్ష్యంతో ఈ యాప్ను ఆవిష్కరించారు. 'ప్రవాసీ రోజ్గార్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఉచిత ఆన్లైన్ ప్లాట్ ఫామ్ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాల కల్పనలో సహకారం అందించనున్నారు. గత కొన్ని నెలలుగా దీనిపై కసరత్తు చేసినట్టు సోనూ సూద్ వెల్లడించారు. ఉపాధి కోల్పోయి సొంత ప్రదేశాలకు చేరుకున్న కార్మికులకు సాయం అందించేలా వివిధ టాప్ సంస్థలు, ఎన్జీవోలు, దాతృత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యనిర్వాహకులు, స్ట్రాటజీ కన్సల్టెంట్స్, టెక్నాలజీ స్టార్ట్ యాప్స్ తో విస్తృతంగా చర్చించి దీన్ని తీసుకొచ్చినట్టు సూద్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వలస కార్మికులకు సరైన ఉపాధి అవకాశాలు అందించేలా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ రూపొందించినట్టు చెప్పారు. ప్రధానంగా నిర్మాణ రంగం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్, బీపీవోలు, సెక్యూరిటీ, ఆటోమొబైల్, ఇ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన 500 ప్రసిద్ధ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామన్నారు. అలాగే స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణతోపాటు నిర్దిష్ట ఉద్యోగాలకు కూడా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, తిరువనంతపురంలో 24x7 హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. -
వలస కార్మికులపై విమాన చార్జీల మోత
మోర్తాడ్/సాక్షి, జగిత్యాల: బతుకుదెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఒక పక్క ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడగా, మరో పక్క సాధారణ ప్రయాణికుల షెడ్యూల్ విమానాలకు ప్రభుత్వాల అనుమతి లేకపోవడంతో ఇంటికి రావాలనుకుంటున్న కార్మికులకు చార్టర్డ్ విమానాలే దిక్కవుతున్నాయి. దీంతో రవాణా చార్జీ తడిసి మోపెడవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతర్లలో లాక్డౌన్కు సడలింపులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లాలనుకునే తెలంగాణ కార్మికులు చార్టర్డ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైదరాబాద్కు రావాలంటే విమానాల్లో టికెట్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో షెడ్యూల్ విమానాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. చార్టర్డ్ విమానాల ల్యాండింగ్కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పలు గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి చార్టర్డ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ఒక్కో వ్యక్తినుంచి టికెట్ ధర రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో చార్జీలు అధికంగా ఉండడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న అనేక మంది కార్మికులు తమకు తెలిసిన వారి వద్ద అప్పు చేస్తున్నారు. కొందరు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో కూడా వెంటనే టికెట్లు లభ్యం కావడం లేదని, రోజుల తరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక భారంతో ఉన్న తమను ఆదుకోవడానికి సాధారణ విమానాలకు అనుమతివ్వాలని కార్మికులు కోరుతున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా నడుపుతున్న విమానాలు అరకొరగా ఉండటంతో చార్టర్డ్ విమానాలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. గల్ఫ్ కార్మికులకు ఎంతో నష్టం కలిగింది కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్డౌన్ వల్ల గల్ఫ్ కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. నష్టానికి తోడు ఇంటికి రావాలంటే రవాణా చార్జీల భారమూ పెరిగింది. ఉపాధి లేక ఆందోళనలో ఉన్న కార్మికులకు రవాణా చార్జీలు అధికం కావడం ఇబ్బందిగా మారింది. – సిద్దిరాములు, పెద్దమల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా షెడ్యూల్ విమానాలను నడపాలి.. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎంతో మంది తెలంగాణ వాసులు ఇళ్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చార్టర్డ్ విమానాల టికెట్ ధర భారీగా ఉంది. వాటిలో రావడం తలకుమించిన భారం. షెడ్యూల్ ప్రకారం విమానాలను నడిపి వలస కార్మికులను ఇళ్లకు రప్పించాలి. – నవీన్, చంద్రాయన్పల్లి, నిజామాబాద్ -
ఇరాక్లో ఉండలేం.. ఇండియాకు రప్పించండి
దండేపల్లి: ఉపాధి కోసం ఊరు వదిలి ఇరాక్ వెళ్లిన వలస కూలీలకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. తిరిగి భారత్కు వద్దామనుకుంటే చాలామందికి వీసా గడువు ముగియడంతో ఇరాక్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో వలస కార్మికులకు ఏం చేయాలో తెలియక బోరుమంటున్నారు. కార్మికులు తమ బాధలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మంత్రి కేటీఆర్తో పాటు, ఎంపీలకూ ట్విట్టర్లో పోస్టులు సైతం చేశారు. వివరాలు.. కోవిడ్–19 కారణంగా ఇరాక్లో కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. కొందరు భారతీయులకు వీసా గడువు ముగిసింది. ఇంకొందరికి అకామా(గుర్తింపు కార్డు)లేక కంపెనీల్లో పనులు దొరకడం లేదు. దీంతో వలస కార్మికులు రోడ్డున పడ్డారు. నాలుగు నెలలుగా ఉండేందుకు, తినేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ భరించలేక ఇంటికి వద్దామన్నా వచ్చే పరిస్థితులు లేవు. ఇక వీసా గడువు ముగిసిన వారు ఇరాక్లోనే ఉంటే వారికి నెలకు రూ. 30వేలు వరకు అక్కడి ప్రభుత్వం జరిమానాలు కూడా విధిస్తుండటం వలస కార్మికులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇరాక్లో తెలంగాణకు చెందిన సుమారు 250 మందికిపైగా ఇబ్బందులు పడుతున్నామని తమ బాధలను సాక్షికి ఫోన్ ద్వారా తెలిపారు. ఇరాక్లో ప్రస్తుతం ఉండటానికి, తినడానికి ఇంటి దగ్గర అప్పులు చేయించి డబ్బులు తెప్పించుకుంటున్నామని, తమని స్వరాష్ట్రానికి రప్పించేలా చేయాలని మాజీ ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్లకు ట్విట్టర్లో వేడుకుంటూ సందేశం పంపారు. కాగా, గత నెల 13న తమ కోసం ఎర్బిల్లో విమానం సిద్ధం చేసినా ఇరాక్ ప్రభుత్వం అకామాలు లేవని ఇండియాకు పంపకుండా అడ్డుకుందని వారు వాపోయారు. ఎర్బిల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవట్లేదని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉచిత క్వారంటైన్ కల్పించండి
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటిబాట పట్టిన గల్ఫ్ వలస కార్మికులు రాష్ట్రంలో పెయిడ్ క్వారంటైన్ తమకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఉచితంగానే క్వారంటైన్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులకే మనసు మార్చుకుంది. వందే భారత్ మిషన్తో పాటు చార్టర్డ్ విమానాల్లో రాష్ట్రానికి వస్తున్న కార్మికుల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు క్వారంటైన్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఒక వేళ ఫీజు చెల్లించకపోతే వారి పాస్పోర్టులను అధికారులు తమ అధీనంలో ఉంచుకుని ఫీజు చెల్లించిన తరువాత అప్పగిస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో వచ్చే వారి నుంచి మాత్రం గల్ఫ్ దేశాల్లోనే క్వారంటైన్ ఫీజును వసూలు చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో వచ్చేవారు ముందుగా క్వారంటైన్ ఫీజును చెల్లిస్తే ఆ సొమ్మును తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ను ఏడు రోజులకు కుదించారు. ఈ 7 రోజుల క్వారంటైన్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల ఫీజును నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరైనా ధనవంతులు ఉంటే వారికి విలాసవంతమైన క్వారంటైన్ కోసం ప్రత్యేకంగా ఫీజును వసూలు చేస్తున్నారు. 5,500 మందికే ఉచిత క్వారంటైన్.. విదేశాల నుంచి.. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చే పేద కార్మికులకు ఉచిత క్వారంటైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. విదేశాల నుంచి తెలంగాణకు ఇప్పటి వరకు 21 వేల మంది వచ్చారని అధికారులు వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇందులో 14,500 మంది గల్ఫ్ దేశాల నుంచి.. మిగి లినవారు ఇతర దేశాల నుంచి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత క్వారంటైన్ సదుపాయాన్ని 5,500 మంది గల్ఫ్ కార్మికులు సద్వినియోగం చేసుకున్నారు. కొందరు క్వారంటైన్ కోసం రూ.15 వేల చొప్పున ఫీజును చెల్లించారు. మరి కొంతమంది రూ.8 వేల ఫీజుతో బయటపడ్డారు. కాగా, ఉచిత క్వారంటైన్ను ఈనెల 4 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు క్వారంటైన్ ఫీజు చెల్లింపు మరింత భారం అవుతోందని వలస కార్మికులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ కల్పించాలని కోరుతున్నారు. ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించాలి.. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న తెలంగాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించాలి. క్వారంటైన్ కోసం ఫీజు చెల్లించాలంటే కార్మికులు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – ఎస్వీ రెడ్డి, టీపీసీసీ దుబాయ్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి.. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. క్వారంటైన్ ఫీజును బలవంతంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న కార్మికులకు ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించాలి. – గుగ్గిళ్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్ -
అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: వలస కార్మికుల సమస్యపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వలస కార్మికులకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి సమస్యా లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరిస్తూ, వలస కార్మికుల ఇబ్బందులను గుర్తించి, పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని నొక్కి చెప్పింది. వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాజాగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.కె.కౌల్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. లాక్డౌన్ కాలంలో వలస కార్మికులెదుర్కొన్న సమస్యలను సుమోటోగా తీసుకుని, విచారించిన కోర్టు ‘మహారాష్ట్రలో ఇప్పటికీ వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్ళేందుకు ఎదురుచూస్తున్నారనీ, అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?’ అని ప్రశ్నించింది. గతంలో వారి స్వరాష్ట్రాలకు వెళ్ళిపోవాలనుకున్న వలస కార్మికులు సైతం, తిరిగి ఉపాధి అవకాశాలకోసం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా కోర్టుకి వెల్లడించారు. దీనిపై తదుపరి విచారణను జూలై 17కి కోర్టు వాయిదా వేసింది. (రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య..) -
ఆర్టీసీకి రూ.15.71 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.15.71 కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా రోజుకు 65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఇప్పుడు కేవలం రెండు లక్షల మందికే సేవలందిస్తోంది. రోజుకు రూ.13 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించే పరిస్థితి నుంచి ఇప్పుడు సగటున రూ.1.50 కోట్ల వరకే ఆర్జించే స్థితికి పడిపోయింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మే నెలకు సంబంధించి కాంట్రాక్టు సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు, పాత బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జూన్ నెలకు సంబంధించి ఎస్ఆర్బీఎస్ పెన్షన్, ఎస్బీటీ చెల్లింపులు, ఐటీఐ అప్రెంటిస్లకు స్టైఫండ్, ఉద్యోగుల వైద్య ఖర్చులు, ఆఫీసు నిర్వహణ, డీజిల్ బిల్లుల చెల్లింపులు తదితరాలకు ఖర్చుచేసింది. ♦ ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక గడ్డు పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం 52 వేల మంది ఉద్యోగులకు జీతాలతో పాటు ఆర్టీసీ సేవలకు నిధులు చెల్లించింది. ♦ వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చేర్చడానికి ఆర్టీసీ 8,611 బస్సుల్ని వినియోగించి, మొత్తం 2,45,308 మందిని వారి స్వస్థలాలకు చేర్చింది. -
చవగ్గా అద్దె గృహ సముదాయాలు
న్యూఢిల్లీ: పట్టణాల్లోని వలస కూలీలు, పేదల కోసం చవకగా అద్దె గృహ సముదాయాలను(అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్సెస్– ఏఆర్హెచ్సీ) అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికులకు.. తాము పని చేసే ప్రదేశాలకు దగ్గరలో చవకగా అద్దె ఇళ్లు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా, ప్రభుత్వ నిధులతో నిర్మితమై, ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌజింగ్ కాంప్లెక్స్లను 25 ఏళ్ల కన్సెషన్ అగ్రిమెంట్ ద్వారా ఏఆర్హెచ్సీలుగా మారుస్తారు. పట్టణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏఆర్హెచ్సీని అభివృద్ధి చేస్తారు. కన్సెషన్ అగ్రిమెంట్ పొందిన వ్యక్తి/సంస్థ ఆ భవన సముదాయానికి మరమ్మతులు చేసి, ఇతర సదుపాయాలు కల్పించి ఆవాసయోగ్యంగా మారుస్తారు. ఈ పథకానికి టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ కింద రూ. 600 కోట్లను కేటాయించారు. కన్సెషన్ అగ్రిమెంట్దారులను పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. 25 ఏళ్ల అగ్రిమెంట్ కాలం ముగిసిన తరువాత, ఆ కాంప్లెక్స్లు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోకి వెళ్తాయి. అనంతరం మళ్లీ బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుంది. సొంత భూమిలో ఏఆర్హెచ్సీలను నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక అనుమతులు, సదుపాయాలు, ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పిస్తారు. పన్ను చెల్లింపుల్లోనూ రాయితీ ఇస్తారు. ఈ పథకం ద్వారా 3.5 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని మే 14న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులైన పేద మహిళల కోసం ప్రకటించిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను.. వారు సెప్టెంబర్ చివరి వరకు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు మూడు ఉచిత సిలిండర్లను తీసుకోని వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ‘ఉచిత రేషన్’కు కేబినెట్ ఆమోదం ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ వరకు ఉచిత రేషన్ కార్యక్రమానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా కల్లోలం నేపథ్యంలో.. ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలి తీర్చేందుకు నవంబర్ వరకు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించనున్నట్లు జూన్ 30న మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారతీయులకు షాకిచ్చిన కువైట్
కువైట్: గల్ఫ్ దేశాల్లో ఉన్న విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ కువైట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రవాసీ కోటా డ్రాఫ్ట్ బిల్లుకు ఆదేశ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. దీని ప్రభావం గల్ఫ్ దేశాలలో ఉన్న 8 లక్షల మంది భారతీయులపై పడనుంది. ఈ బిల్లు ప్రకారం గల్ప్ దేశాలలో భారతీయుల జనాభాలో 15 శాతానికి మించకూడదు. గల్ఫ్లో ఉన్న విదేశీయుల జనాభాలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైట్ జనాభాలో 4.3 మిలియన్లు అయితే అందులో 3 మిలియన్లకు పైగా (30 లక్షలు) ప్రవాసీయులే ఉన్నారు. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులను కువైట్ నుంచి తిరిగి స్వదేశానికి పంపనున్నారు. (కువైట్ నుంచి సొంత రాష్ట్రానికి..) కరోనా వైరస్ కారణంగా అక్కడి ప్రధాన వ్యాపారమైన చమురు ధరల క్షీణించడంతో కువైట్లో ఉన్న విదేశీయుల సంఖ్యను తగ్గించాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మద్దతు తెలపడంతో సునాయాసంగా ఆమోదం లభించింది. గత నెలలో కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా విదేశియుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేగాక కువైట్లో ప్రవాసియుల సంఖ్యను క్రమంగా తగ్గించాలని కోరుతూ సమగ్ర ముసాయిదా బిల్లు చట్టాన్ని తాను శాసనసభ్యుల బృందంతో కలిసి అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ మార్జౌక్ అల్-ఘనేమ్ కువైట్ పేర్కొన్నారు. ఈ బిల్లులో తాము వైద్యులను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని మాత్రమే నియమించుకుంటామని, నైపుణ్యం లేని కార్మికులను తిరిగి పంపించేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ప్రభుత్వానికి నర్సులు, జాతీయ చమురు కంపెనీలలో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నవారు సుమారు 28 వేల మంది ఉన్నారు. మెజారిటీ భారతీయులు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు. అదనంగా, సుమారు 1.16 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారు. వీరిలో దేశంలోని 23 భారతీయ పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజా బిల్లు వీరందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అక్కడున్న కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
తీగలే.. మృత్యుపాశాలై..
జీవితాల్లో వెలుగును నింపే విద్యుత్తు.. ప్రాణాలనూ హరిస్తోంది. కూలి పనుల కోసం వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు విద్యుత్తు షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇస్తామంటూ ట్రాన్స్కో అధికారులు బాధితులనుఆదుకుంటున్నారు. తూర్పుగోదావరి, శంఖవరం: బతుకుతెరువు కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన ఇద్దరి కూలీల బతుకులు.. విద్యుత్తు షాక్తో ముగిసిపోయాయి. వారిలో ఒకరు వివాహితుడు, మరొకరు అవివాహితుడు. మరొకరు షాక్ నుంచి ప్రాణాలను దక్కించుకున్నాడు. పాత వజ్రకూటం పంచాయతీ పరిధి రామన్నపాలెం పొలాల సమీపంలో అలానా కంపెనీకి చెందిన పశువుల కబేళాలో ఆదివారం బోరు తవ్వుతున్నారు. ఈ బోరు తవ్వుతుండగా విద్యుత్తు షాక్కు గురై ఇద్దరు యువకులు డేరాంగుల అంకన్న (35), అరిజన రమేష్ (23) మృతి చెందగా, మరో కూలి స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా నుంచి ఐదుగురు యువకులు కూలి పని కోసం వచ్చి కత్తిపూడిలో ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుచోట్ల వారు అనేక బోర్లు తవ్వారు. ఉదయం యథావిధిగా లారీతో కూడిన మెషినరీతో బోరు తవ్వుతుండగా పొలాల మీదుగా వెళ్లిన 11 కేవీ విద్యుత్తు తీగలు మెషీన్కు తగిలాయి. దీంతో దానిపై పని చేస్తున్న ఈ ఇద్దరు యువకులు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలంలో ఉన్న కూలీలు రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన అనంతపురానికి చెందిన అంకన్నకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మరో మృతుడు రమేష్.. అనంతపురం జిల్లా కనిగళ్ల మండలం గోపాలపురానికి చెందిన వాడు. ఇదే గ్రామానికి చెందిన హరిజన నాగార్జునుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. రెండు మృతదేహాలను పోలీసులు ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి కూలి పని కోసం వచ్చి మృత్యువాత పడిన మృతుల కుటుంబాలకు అలానా కంపెనీ భారీ నష్ట పరిçహారం చెల్లించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజలకు హాని కలిగే పనులను కంపెనీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు నష్ట çపరిçహారం చెల్లించకుంటే కంపెనీ చేయించే పనుల వద్ద ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. -
కువైట్ నుంచి సొంత రాష్ట్రానికి..
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం కువైట్కు వెళ్లి కరోనా మూలంగా ఇబ్బందులు పడుతున్న 320 మంది వలస కార్మికులు శుక్రవారం సాయంత్రం రాష్ట్రానికి చేరుకున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా కువైట్లో అనేక మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్న వీరిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్కు తరలించారు. కాగా, కువైట్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తెలంగాణకు రప్పించేందుకు విమాన అనుమతుల కోసం మాజీ ఎంపీ కవిత సహకారం అందించారని కువైట్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ముత్యాల వినయ్కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కవితతో పాటు రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపారు. షార్జా నుంచి 200 మంది.. మోర్తాడ్: కరోనా నేపథ్యంలో షార్జాలో ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడిన 200 మంది తెలంగాణ వలస కార్మికులు గురువారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. వీరందరిని ఒక ప్రముఖ కంపెనీ తమ క్యాంపు నుంచి తొలగించింది. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడమే కాకుండా ఉండటానికి నివాసం లేక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న ఇండియన్ అసోసియేషన్ షార్జా (ఐఏఎస్), పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అండగా నిలిచాయి. షార్జా పోలీసుల సహకారంతో తాత్కాలిక వసతిని, భోజన సదుపాయాలను కల్పించాయి. వలస కార్మికులు ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా, వలస కార్మికులకు నాలుగు నెలల పాటు వసతి కల్పించిన షార్జా పోలీసుల సహకారం మరువలేనిదని పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్వీ రెడ్డి పేర్కొన్నారు. -
వాళ్లను ముందుగానే తరలించి ఉంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనాను కట్టడి చేయడం కోసం అనూహ్యంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వలస కార్మికులు ఆ మరుసటి రోజు నుంచే తమ స్వస్థలాకు బయల్దేరిన విషయం తెల్సిందే. అలా రాజస్థాన్ రాష్ట్రానికి మొదటి విడతన అంటే మార్చి 25 తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, ముంబై, ఇండోర్ నగరాల నుంచి దాదాపు మూడు లక్షల మంది రాజస్థాన్కు చేరుకున్నారు. వీరంతా కాలి నడకన, సొంత వాహనాలు, ఇతర కిరాయ వాహనాల్లో నానా కష్టాలు పడి స్వస్థలాలకు చేరుకున్నారు. (పంజాబ్ సీఎం కీలక నిర్ణయం) అప్పటికి రాష్ట్రంలో కరోనా కేసుల శాతం ఒక శాతం ఉండగా, వలస కార్మికుల రాకతో 1.5 శాతానికి చేరుకుందని ‘ఆజీవిక బ్యూరో’ లెక్కలు తెలిపింది. మే 4వ తేదీ నుంచి వలస కార్మికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా అనుమతించడంతో మరో విడత వలస కార్మికుల రాక మొదలైంది. మే చివరి దాక కొనసాగిన ఈ వలస కార్మికుల రాకలో రాజస్థాన్కు మరో నాలుగు లక్షల మంది చేరుకున్నారు. అప్పటి వరకు 1.5 శాతం ఉన్న కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా మూడు శాతానికి చేరుకుంది. (‘క్వారంటైన్ బబుల్’ ఓ కొత్త దృక్పథం) మొదటి విడతలో చేరుకున్న వలస కార్మికులకంటే రెండు విడతలో చేరుకున్న వలస కార్మికుల్లో రెంటింపు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన వలస కార్మికులను తరలించాకే దేశంలో లాక్డౌన్ను అమలు చేసి ఉన్నట్లయితే నేడు కరోనా మహమ్మారి ఇంత తీవ్రంగా ఉండేది కాదని ఆజీవిక బ్యూరోతోపాటు రాజస్థాన్లో వలస కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ‘బేసిక్ హెల్త్కేర్ సర్వీసెస్’ సహ వ్యవస్థాపకులు పవిత్ర మోహన్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు 20 వేలకు చేరుకుంది. (లాక్డౌన్ సడలించాక పెరిగిన కేసులు) -
‘మహమ్మారికి భయపడితే ఆకలితో చస్తాం’
లక్నో : కరోనా మహమ్మారితో సుదీర్ఘ లాక్డౌన్ల నేపథ్యంలో స్వరాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్కు చేరిన 30 లక్షల మందికి పైగా వలస కార్మికుల్లో కొందరు తిరిగి పనులకు వెళ్లేందుకు సంసిద్ధమయ్యారు. లాక్డౌన్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు గాడినపడుతుండటంతో పొట్టచేతపట్టుకుని కూలీలు తలో దిక్కుకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. కరోనా మహమ్మారితో భయపడికూర్చుంటే ఆకలితో మరణిస్తామని వారు తిరిగి పనుల బాట పడుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు వెళ్లే గోరఖ్పూర్ రైల్వే జంక్షన్ వైపు వలస కూలీలు బారులుతీరారు. ‘ ఇక్కడే పనిదొరికితే నేను ఎక్కడికీ వెళ్లను.. ముంబై మహానగరంలో నేను పనిచేసే ఫ్యాక్టరీ ఇంకా తెరుచుకోలేదు.అయినా అక్కడికి వెళ్లి ఏదో ఒక పని చూసుకుంటా’నని అన్సారీ అనే కార్మికుడు చెప్పారు. ఆకలితో తన పిల్లలు మరణించేకంటే కరోనాతో తాను చావడమే మేలని అన్నారు. ఇక కోల్కతాలోని ఓ సంస్థలో పనిచేసే ప్రసాద్ హోలీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చి యూపీలో చిక్కుకుపోయారు. తాను పనిచేసే సంస్థ తిరిగి తెరుచుకోవడంతో కోల్కతాకు తిరిగివెళుతున్నారు. కరోనా మహమ్మారి వెంటాడుతుండటంతో తిరిగి పనిలోకి వెళ్లాలంటే భయంగానే ఉన్నా కుటుంబాన్ని పోషించుకునేందుకు మరో గత్యంతరం లేదని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీల కోసం యోగి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా పథకాలను ప్రారంభించినా అవి తమ వరకూ చేరలేదని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉపాథి హామీ సహా పలు పథకాలు ప్రకటించినా అవి తమ వరకూ చేరడం లేదని అందుకే తాను ముంబై తిరిగివెళుతున్నానని ఏసీ టెక్నీషియన్గా పనిచేసే మహ్మద్ అబిద్ చెప్పుకొచ్చారు. ముంబైలో తాను బాగా సంపాదిస్తానని ఇక్కడ (యూపీ) మాత్రం నెట్టుకురాలేకపోతున్నానని అన్నారు. ఇక తూర్పు యూపీలోని బలియా రైల్వే స్టేషన్కూ పలువురు వలస కూలీలు పనికోసం తిరిగి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. అహ్మదాబాద్లో తాను కిరాణా షాపు నిర్వహిస్తున్నానని తిరిగి అక్కడకు వెళుతున్నానని మూడు నెలల కిందట స్వస్ధలానికి వచ్చిన రాజేష్ కుమార్ వర్మ చెప్పారు. ప్రభుత్వం రేషన్ ఇస్తున్నా ఇతర ఖర్చులకు డబ్బులు ఉండటం లేదని, ఉపాథి హామీ పథకం తప్ప వేరే పనులు ఉండటం లేదని ఆయన అన్నారు. షాపు అద్దెకు తీసుకుని అహ్మదాబాద్లో కిరాణా షాపు నడుపుతున్నానని, తిరిగి అక్కడికి వెళ్లకపోతే పేరుకుపోతున్న కిరాయిని ఎలా చెల్లిస్తానని వర్మ ప్రశ్నించారు. కరోనా మహమ్మారితో స్వస్ధలాలకు చేరుకున్న వలస కూలీల్లో పలువురు యూపీలోనే ఉంటుండగా మరికొందరు పస్తులుండటం కంటే పనిలోకి వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. చదవండి : వలస కార్మికులను ఆదుకోవడం అందరి బాధ్యత -
త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లు
న్యూఢిల్లీ: కరోనా ముప్పు నేపథ్యంలో.. అన్ని రెగ్యులర్ రైళ్లను నడపడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చని శుక్రవారం రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ పేర్కొన్నారు. అయితే, త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నామన్నారు. సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ ఉపాధి కోసం నగరాల బాట పట్టడం సంతోషకరమని, ఆర్థిక రంగం కుదుటపడుతోందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు కోరితే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమేనని తెలిపారు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి శ్రామికులు ఎక్కువగా తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారన్నారు. జూన్ 25 వరకు మొత్తం 4,594 శ్రామిక్ రైల్ సర్వీసులను నడిపామని, మే 1వ తేదీ నుంచి మొత్తం 62.8 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు. కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కోచ్ల నిర్వహణ, ఆహారం, సిబ్బందికి రక్షణ పరికరాలు.. తదితరాల కోసం ఒక్కో కోచ్కు సుమారు రూ.2 లక్షలు ఖర్చు అయిందని వీకే యాదవ్ వెల్లడించారు. ఇప్పటికి 5,213 ఐసోలేషన్ కోచ్లను ఏర్పాటు చేశామని, నిధులు కేంద్ర కోవిడ్ కేర్ ఫండ్ నుంచి అందాయని తెలిపారు. -
వలస కార్మికులను ఆదుకోవడం అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులను ఆదుకోవడం ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల రాజ్యాంగ బాధ్యతని హైకోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికులను ఆదుకునే విషయంలో తామిచ్చిన ఉత్తర్వులను మెడపై కత్తిలా ఉన్నాయన్న భావన ఏమాత్రం సరికాదని రైల్వేశాఖకు హైకోర్టు హితవు పలికింది. న్యాయస్థానం ఆదేశాలను అలా ఎప్పటికీ చూడరాదని స్పష్టం చేసింది. చిట్టచివరి వలస కార్మికులు గమ్యస్థానానికి చేరే వరకు తమ ఉత్తర్వులు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. వలస కార్మికుల తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ అనుసరిస్తున్న విధానాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. అధికరణ 226 కింద వలస కార్మికులకు అండగా నిలబడాల్సిన బాధ్యతపై న్యాయస్థానాలపై ఉందని గుర్తుచేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇటుక బట్టీల కార్మికులకు సంబంధించి మానవ హక్కుల వేదిక సమన్వయకర్త ఎస్.జీవన్కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. అయితే వలస కార్మికుల తరలింపు విషయంలో ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయడం లేదంటూ ప్రొఫెసర్ రామ్ శంకర్ నారాయణ్ మేల్కొటే దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయ మూర్తి బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృతజ్ఞతలు చెప్పిన వలస కార్మికులు అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 418 మంది వలస కూలీలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారని, ఇందుకు హైకోర్టుకు, ప్రభుత్వానికి, రైల్వేశాఖకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇటుక బట్టీల కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారని, అందువల్ల ఆ అంశానికి సంబంధించిన వ్యాజ్యంపై విచారణ ముగించవచ్చునన్నారు. సికింద్రాబాద్లో ఉన్న షెల్టర్ హోంలో 20 మంది మాత్రమే ఉన్నారని, ఈ హోంను మూసివేస్తే ప్రజారోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, వలస కార్మికుల తరలింపు విషయంలో చేసిన ఏర్పాట్లను కొనసాగిస్తామన్నారు. కావాలంటే కోర్టు ఆదేశాలు ఇవ్వొచ్చునని తెలిపారు. రైల్వే శాఖ న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, సికింద్రాబాద్–దానాపూర్ రైల్లో 113 బెర్తులు, హౌరా ఎక్స్ప్రెస్లో 21 బెర్తులు కేటాయించామని చెప్పారు. ఇకపైనా ఏర్పాట్లను కొనసాగిస్తామన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యాలపై విచారణను ముగించాలని, హైకోర్టు ఉత్తర్వులు తమ మెడపై కత్తిలా ఉన్నాయని ఆమె అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అలాంటి భావన సరికాదని, వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ విచారణను వాయిదా వేసింది. -
1.25 కోట్ల ఉద్యోగాలు.. యోగి సర్కారు భేష్!
న్యూఢిల్లీ/లక్నో: సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘‘ఆత్మనిర్భర్ ఉత్తర్ప్రదేశ్ రోజ్గార్ అభియాన్’’ ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సంభాషించారు. ఈ క్రమంలో ముంబై, హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కూలీలు.. ఇకపై రాష్ట్రంలోనే ఉండి పనులు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ పథకం ద్వారా స్థానికంగా దాదాపు 1. 25 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని యూపీ అధికారులు వెల్లడించారు. మరణాల సంఖ్య 90 శాతం తగ్గింది.. మహమ్మారి కోవిడ్-19పై పోరులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఒకప్పుడు ప్రపంచ దేశాలను జయించి, అతిపెద్ద శక్తులుగా అవతరించిన ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ తదితర యూరప్ దేశాల జనాభా మొత్తం కలిపి 24 కోట్లు. ఇది ఉత్తర ప్రదేశ్కు జనాభాకు సమానం. కోవిడ్-19 కారణంగా ఈ దేశాల్లో దాదాపు లక్షా ముప్పై వేల మంది మృత్యువాత పడగా.. యూపీలో కేవలం 600 కరోనా మరణాలు మాత్రమే సంభవించాయి. యూపీ సర్కారు మహమ్మారిపై పోరాడుతున్న తీరుకు ఇది నిదర్శనం’’ అని ప్రశంసించారు. అయితే భారత్లోనైనా.. ప్రపంచంలోని మరే ఇతర దేశాల్లోనైనా నివసిస్తున్న ప్రజలందరి ప్రాణాలు సమానమేనని.. కరోనాతో ప్రజలు మరణించడం విషాదకరమని విచారం వ్యక్తం చేశారు.(‘టెస్టింగ్ సామర్థ్యం మూడింతలు’) అదే విధంగా ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలని, భౌతిక దూరం తప్పక పాటించాలని ప్రజలక ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంపై దృష్టి సారించిన యోగి సర్కారు తీసుకుంటున్న చర్యల వలన అక్యూట్ ఎన్సెఫలిటిస్ సిండ్రోమ్(ఏఈఎస్- విపరీతమైన జ్వరం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం) పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గిందని.. మరణాల సంఖ్య కూడా 90 శాతానికి పడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం ‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన’ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిహార్లోని ఖగారియా జిల్లాలో జూన్ 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 50వేల కోట్లతో ఆరు రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఇక ఈ పథకం కింద ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీలకు రూ. 50 వేల కోట్లతో 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. ఇందులో పేదలకు గృహ నిర్మాణం, చెట్లు నాటడం, ప్రజలకు తాగునీటి వసతి కల్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం, మార్కెట్లు, రోడ్ల నిర్మాణం తదితర 25 రకాల పనులు ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూపీలో శుక్రవారం ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
అలాంటి విమర్శలే నాకు స్ఫూర్తి
కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలది దయనీయ స్థితి అనే చెప్పాలి. ఉన్న చోట ఉపాధి లేకపోవడంతో స్వగ్రామాలకు వెళదామనుకున్నా వాహనాల రాకపోకలు లేవు. అయినా వందల కిలోమీటర్లు నడుస్తూ సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. వలస కూలీలను స్వగ్రామాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు వాహనాలను సమకూర్చాయి. బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా బస్సులు, రైళ్లు, విమానాల్లో వలస కూలీలను తన సొంత ఖర్చుతో స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేయడంతో ఆయనపై ప్రశంసల జల్లులు కురిశాయి. అయితే ‘రాజకీయ లబ్ధి కోసమే సోనూ సూద్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’ అంటూ కొందరు రాజకీయ నాయకులు విమర్శించారు కూడా. దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ – ‘‘ఏదైనా మంచి పని చేయాలనుకునేవారిపై ఇలాంటి ఆరోపణలు, విమర్శలు రావడం సహజం. నాపై వచ్చిన విమర్శలు, ఆరోపణల్ని నేనిప్పటివరకూ పట్టించుకోలేదు.. నా గురించి ఏం రాస్తున్నారో అని చూసే తీరిక కూడా లేదు. అయినా మరెన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి విమర్శలు, ఆరోపణలు నాకు బలాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి’’ అన్నారు. -
'ప్రత్యేక బోగీల ఏర్పాటు వీలుకాదు'
సాక్షి, హైదరాబాద్ : వలస కార్మికుల స్వస్థలాల తరలింపుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వలస కార్మికులకు అదనపు బోగీల ఏర్పాటు విషయమై హైకోర్టు భాటియాను ప్రశ్నించింది. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదన్నారు. బీహార్కు చెందిన 45 మంది వలస కూలీలను రేపు స్వస్థలాలకు చేరుస్తామని తెలిపారు. అత్యవసర కోటాలో రేపటి రైళ్లలో టికెట్లు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కలెక్టర్లు కోరితే రోజుకు 50 మంది వలస కూలీలకు ఈక్యూలో టికెట్లు కేటాయించేదుకు సిద్ధమని ఆనంద్ భాటియా తెలిపారు. వలస కార్మికులందరూ తమ స్వస్థలాలకు చేరే వరకు ఇదే విధానం కొనసాగించాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది. -
ఒక్క బోగీ కలిపితే ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులను తరలించేందుకు సాధారణ రైలుకు ఒక బోగీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఎందుకు వీలుకాదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని, లాక్డౌన్ వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన మూడు పిల్స్ను సోమవారం మరోసారి విచారించింది. గూడ్స్ రైలుకు 70 బోగీలు ఉంటాయని, సాధారణ రైలుకు 24కి మించి బోగీలు ఉండకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని ప్రశ్నించింది. వలస కార్మికుల విషయంలో రైల్వే శాఖ ఎందుకు ఉదాసీనంగా ఉంటోందో.. వలస కార్మికుల కోసం ఒక అదనపు బోగీ ఏర్పాటు చేసేందుకు ఉన్న అడ్డంకులు ఏంటో తమకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించింది. వలస కార్మికుల కష్టాలను చూస్తే డీఆర్ఎం స్పందించే వారని పేర్కొంది. పర్యాటకుల కోసం ఒకట్రెండు రోజులు ఖాళీగానే ఉంచుతారని, అలాంటిది వలస కార్మికుల కోసం ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించింది. బిహార్కు చెందిన 45 మంది వలస కార్మికుల కోసం శ్రామిక్ రైలును రూ.10 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం కూడా ఎలా నడపగలదని అడిగింది. అదే రైల్వే శాఖ ముందుకు వచ్చి సాధారణ ప్రయాణికుల రైలుకు ఒక్క బోగీ తగిలిస్తే సమస్య పరిష్కారం అయ్యేదనే ఆలోచన కూడా చేయట్లేదని ఆక్షేపించింది. మాకే తప్పుడు సమాచారం ఇస్తారా? సికింద్రాబాద్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నా కూడా.. ఖాళీగా లేదని జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదించడంపై ధర్మాసనం మండిపడింది. ఆ కాంప్లెక్స్లో వలస కార్మికులను ఉంచేందుకు వీలవుతుందేమో తెలపాలని కోరితే తమకే తప్పుడు వివరాలిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కాంప్లెక్స్ను రిజిస్ట్రార్లు స్వయంగా పరిశీలించారని, మొత్తం కాంప్లెక్స్ ఖాళీగా ఉందని చెప్పింది. హౌసింగ్ బోర్డు అధీనంలోని 3 అంతస్తుల ఆ కాంప్లెక్ ఇప్పటికీ ఖాళీగానే ఉందని పేర్కొంది. అయినా కూడా ఖాళీగా లేదని కలెక్టర్ ఎలా చెబుతారని దుయ్యబట్టింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. సదరు కాంప్లెక్స్లో మరుగుదొడ్లు లేవని చెప్పారు. దీంతో వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుని, అది వాస్తవం కాదని, అన్ని వసతులు ఉన్నాయని తేల్చి చెప్పింది. హౌసింగ్ బోర్డు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయలేదని, కోర్టులను తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్ను ఉద్దేశించి హెచ్చరించింది. దీనిపై పిటిషనర్ న్యాయవాది వసుధా నాగరాజ్ కల్పించుకుని.. మిగిలిన 45 మంది వలస కార్మికులను పంపితే సమస్య కొలిక్కి వస్తుందని, వసతి సమస్య ఉండదని చెప్పారు. బిహార్కు చెందిన 170 మంది వలస కార్మికులు మిగిలితే పలు సేవా సంస్థలు వారిని గమ్యస్థానాలకు పంపాయని, మిగిలిన 45 మందిలో 30 మందికే టికెట్లు లభించాయని చెప్పారు. రైల్వే శాఖ స్టాండింగ్ కౌన్సిల్ పుష్పేందర్ కౌర్ వాదనలు వినిపిస్తూ.. అత్యవసర కోటాలో రోజుకు 30 టికెట్లే లభ్యం అవుతాయని తెలిపారు. విచారణ నేటికి వాయిదా పడింది. -
వలస కూలీలకు ఉపాధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు. లాక్డౌన్ వల్ల పనులకు దూరమైన వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన’ను మోదీ శనివారం ప్రారంభించారు. రూ. 50వేల కోట్లతో ఆరు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని, అమలు చేయనున్నారు. కరోనాను అరికట్టే విషయంలో గ్రామీణ ప్రజల కృషి నగరాలకు పాఠాలు నేర్పిస్తోందని కొనియాడారు. నగరాలు వేగంగా అభివృద్ధి చెందడం వెనుక వలస కూలీల శ్రమ, నైపుణ్యం దాగి ఉందన్నారు. గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజనతో ఇక గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీల సంక్షేమంపై నిత్యం ఆలోచించామని తెలిపారు. ఇప్పుడు సొంత గ్రామాల్లోనే వారికి పనులు లభిస్తుండడం సంతోషకరమని చెప్పారు. ఇంటర్నెట్ వేగం పెంచేందుకు చర్యలు దేశంలో మొట్టమొదటి సారిగా నగరాల కంటే గ్రామాల్లోనే ఇంటర్నెట్ అధికంగా వినియోగిస్తున్నారని ప్రధానమంత్రి తెలియజేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ వేగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజనతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు పెరగడంతోపాటు ఇంటర్నెట్ లాంటి ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. కూలీలకు ఉపాధి కల్పించే పథకానికి మోదీ బిహార్లోని కతిహార్ జిల్లాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకారం చుట్టారు. 125 రోజుల పాటు ఉపాధి గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన కింద ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీలకు రూ.50 వేల కోట్లతో 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తామని కేంద్ర సర్కారు ప్రకటించింది. మొత్తం 25 రకాల పనులను కూలీలకు అప్పగిస్తామని వెల్లడించింది. పేదలకు గృహ నిర్మాణం, చెట్లు నాటడం, ప్రజలకు తాగునీటి వసతి కల్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం, మార్కెట్లు, రోడ్ల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి. -
ఏదో జరిగింది.. వివరణ ఇవ్వండి!
బెంగళూరు: కరోనా సంక్షోభం నేపథ్యంలో కర్ణాటకలో యడియూరప్ప వెలగబెట్టిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వలస కార్మికులకు సహాయం పేరుతో బీజేపీ సర్కారు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) విచారణలో వెల్లడైంది. ఎటువంటి వివరాలు లేకుండా 1.25 లక్షల మందికి రూ. 5 వేలు చొప్పున ఎలా పంపిణీ చేశారని ప్రభుత్వాన్ని పీఏసీ నిలదీసింది. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ‘లబ్దిదారుల జిల్లాల పేర్లు కూడా తెలియకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కార్మికుల పేర్లు, చిరునామాలు లేకుండా ప్రభుత్వ సాయాన్ని ఎలా అందించారు? మొత్తానికి ఏదో అవకతవకలు జరిగినట్టు కమిటీ అనుమానిస్తోంద’ని పీఏసీ చైర్మన్ హెచ్కే పాటిల్ అన్నారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లకుండా ఆపేందుకు మే నెలలో ముఖ్యమంత్రి యడియూరప్ప రూ. 1600 కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. గుర్తింపు పొందిన కార్మికులకు అంతకుముందు ఇచ్చిన 2 వేల రూపాయలకు అదనంగా మరో 3 వేల రూపాయలు ఇస్తామని హామీయిచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కర్ణాటకలో 15.8 లక్షల మంది గుర్తింపు పొందిన కార్మికులు ఉన్నారు. ఆశ్చర్యకరంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో 43 వేల మంది కార్మికులు నమోదు చేసుకుంటే, బీదర్ జిల్లాలో 66 వేల మంది కార్మికులు రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. ‘నిర్మాణ రంగానికి కేంద్ర బిందువైన బెంగళూరులో.. బీదర్, ఇతర ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో కార్మికులు ఎలా ఉన్నార’ని పీఏసీ చైర్మన్ హెచ్కే పాటిల్ ప్రశ్నించారు. దర్యాప్తుకు సిద్ధం: డిప్యూటీ సీఎం పీఏసీ విచారణ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ స్పందించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి సాధ్యమైనంత ఉత్తమమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేశామని ఆయన అన్నారు. ఇప్పటికీ అనుమానాలు ఉంటే, తాము ఎల్లప్పుడు దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించారు. (అమూల్య కేసు ఎన్ఐఏకి అప్పగించండి) కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం కర్ణాటకలో ఇప్పటివరకు 8,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,210 మంది కోలుకుకున్నారు. ప్రస్తుతం 2,947 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈనెల 30తో ముగుస్తుంది. (కరోనా: మిఠాయి రాజాకు ఎదురుదెబ్బ) -
'50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి'
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన కూలీలకు కేంద్రప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. 'గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన' పేరుతో శనివారం రోజున బిహార్లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 50వేల కోట్ల రూపాయలతో వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం వలస కూలీలు ఎక్కువగా తరలి వచ్చిన 116 జిల్లాల్లో మొదట ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ పథకం కింద బీహార్తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఎంపికైనట్టు తెలిపారు. వచ్చే 125 రోజుల్లో సుమారు 25 పథకాలను గరీబ్ కళ్యాన్ రోజ్గార్ అభియాన్ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు సొంతూళ్లలోనే ఉపాధి చూపిస్తామన్నారు. 25 భిన్న రకాలైన పనులు చేసే వారికి ఈ పథకం కింద ఉపాధి లభించనుంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. చదవండి: దేశంలోకి ఎవరూ ప్రవేశించలేదు: ప్రధాని మోదీ -
వలస కార్మికులూ మనుషులే...
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులూ మనుషులేనని, వాళ్లను జంతువుల కంటే హీనంగా చూడొద్దని, మానవీయకోణంలో స్పందించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటుక బట్టీ ల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఈమేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇటుక బట్టీ పనుల కోసం వచ్చి లాక్డౌన్ వల్ల రాష్ట్రం లో పలు చోట్ల ఇరుక్కుపోయిన వలస కార్మి కులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ని సొంత రాష్ట్రాలకు పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన మూడు వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బిహార్ వంటి రాష్ట్రాలకు పంపేందుకు ప్రత్యే క రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. రైలును ప్రత్యేకంగా నడపాలంటే పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అదే సాధారణ రైలుకు నాలుగు బోగీలను వలస కార్మికులకు కేటాయిస్తే ప్రభుత్వానికి భారం తగ్గేదని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ, బిహార్, ఛత్తీస్గఢ్లకు రోజు కు 30 చొప్పున ప్రభుత్వం టికెట్లను కొనుగోలు చేస్తోందని, శ్రామిక్ రైళ్లను నడిపితేనే వలస కార్మికుల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. సాంఘిక, కార్మిక, రైల్వే శాఖల అధికారులు వసతి ప్రాంతాలను పరి శీలించి నివేదిక అందజేయాలని ఆదేశించింది. వలస కార్మికులు ఉన్నంత కాలం వారి బాగోగులు ప్రభుత్వమే చూడాలని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
50 వేల కోట్లతో వలస కూలీలకు ఉపాధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 20న ప్రారంభించే పీఎం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. వలస కూలీలు స్వస్ధలాలకు తరలివెళ్లిన ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకం కింద పెద్ద ఎత్తున ఉపాథి అవకాశాలు సమకూర్చనున్నారు. బిహార్లోని ఖగారియా జిల్లాలో ఈనెల 20న ప్రజా పనుల పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. లాక్డౌన్ అనంతరం వలస కూలీలు స్వస్ధలాలకు తిరిగివెళ్లిన బిహార్, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్ధాన్లోని 116 జిల్లాల్లో ఈ పథకం కింద మొత్తం 25 పనులను చేపడతారని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 125 రోజుల్లో 50,000 కోట్ల రూపాయలతో వలస కూలీలను మమేకం చేస్తూ ఈ పనులను చేపడతారు. వలస కూలీలతో చేపట్టే ఈ పనుల ద్వారా భారీఎత్తున ప్రజా ఆస్తులు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. చదవండి : చిరు వ్యాపారులకు ఊరట -
25 రోజులపాటు కాలినడకన..
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాధారణంగా మానవ శరీర నిర్మాణం రోజుకు కొన్ని గంటలు నడిచేందుకే అనువుగా ఉంటుంది. ఓ కిలోమీటరు నడిస్తే 60–70 కాలరీలు కరిగి పోతాయి. కడుపు నిండా తిన్న ఆహారం దాదాపు 600 కాలరీలు ఉంటుంది. అంటే ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు నడిస్తే ఆ 600 కాలరీలు కరిగిపోతాయి. ఇది ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ. లాక్డౌన్ కారణంగా సొంతూళ్లకు బయల్దేరిన కార్మికులు రోజుకు 8 నుంచి 12 కిలోమీటర్లు నడిచారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు లేకపోవడంతో, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంకా కొందరు నడుస్తున్నారు. మొన్నటిదాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఒంటిపూట భోజనం లేదా అర్ధాకలితో నడిచారు. అలాంటప్పుడు వారిలో జీవన క్రియ భయంకరంగా దెబ్బతింటుంది. మానవ కండరాల్లోని అణువులు తగినంత శక్తిని విడుదల చేయలేవు. వాటి నుంచి ‘లాక్టిక్’ యాసిడ్ వెలువడుతుంది. అది శరీరాన్ని తీవ్ర అలసటకు గురి చేస్తుంది. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో ఎక్కువగా ఉపయోగపడే గ్లూకోజ్ పడి పోతుంది. అప్పుడు కళ్లు తిరుగుతాయి. దప్పిక, ఆకలి ఎక్కువవుతుంది. సకాలంలో ఆహారం, విశ్రాంతి లేకపోతే స్పృహతప్పి పోతారు. సకాలంలో వైద్యం అందకపోతే మరణిస్తారు. ఎండలో ఎక్కువగా నడుస్తుంటే శరీరంలోని నీటి స్థాయి పడిపోతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్లో సమతౌల్యం దెబ్బతింటుంది. సోడియం లెవల్స్ పడిపోయి, వాంతుల అవుతాయి. దీన్ని ‘సన్స్ట్రోక్’ లేదా ‘డీహైడ్రేషన్’గా వ్యవహరిస్తారు. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోతాయి. సుదీర్ఘ నడక కారణంగా అరిపాదాలు బొబ్బలెక్కుతాయి. అవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తే ప్రాణాంతకం అవుతాయి. ఈ వైద్యపరమైన విషయాలను బిలాస్పూర్లో గిరిజనులకు, గ్రామీణ ప్రజలకు అతి చౌకగా వైద్య సేవలు అందించేందుకు ‘జన్ స్వస్థ సయోగ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న డాక్టర్ యోగేశ్ జైన్ తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన అమిత్ కుమార్ గత మే నెలలో మొహమ్మద్ సాయిద్ చేతుల్లో మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ఆయన ‘సన్స్ట్రోక్’తోనే మరణించారు. ఇలాంటి కారణాల వల్లనే గత మే 31వ తేదీ వరకు కాలి నడకన బయల్దేరిన వలస కార్మికుల్లో 46 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 17 ఏళ్ల బలిరామ్ కుమార్ బెంగళూరు నుంచి 25 రోజులపాటు నడిచి అక్కడికి చేరుకున్నారు. కాళ్లకు బూట్లు ఉన్నప్పటికీ పాదాలు బొబ్బలెక్కాయని, పాదాలతోపాటు మొత్తం వొళ్లంతా నొప్పులు సలిపేస్తున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. (తిండి, నీళ్లు లేవు.. చుట్టూ శవాలే!) బిహార్లోని కతియార్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న 20 ఏళ్ల వినోద్ యాదవ్ తాను 27 రోజులపాటు నడిచి బెంగళూరు నుంచి అక్కడికి చేరుకున్నట్లు చెప్పారు. ఇలా ఎంతో మంది ప్రాణాలకు తెగించి తమ స్వస్థలాలకు చేరుకున్న విషయం తెల్సిందే. దేశంలో కరవు కాటకాలు, కలరా లాంటి మమమ్మారీలు దాపురించినప్పుడే కాకుండా దేశ విభజన సందర్భంగా మత ఘర్షణలు చెలరేగినప్పుడు ఇలాగే మానవ వలసలు కొనసాగాయి. అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1942లో బర్మాలోని రంగూన్ నగరంపై జపాన్ బాంబులు వేసినప్పుడు కూడా వేలాది మంది భారతీయులు భారత్కు కాలి నడకన బయల్దేరారు. బర్మాను మయన్మార్ అని, రంగూన్ను యాంగన్ అని నేడు వ్యవహరిస్తారని తెల్సిందే. (ఇలాంటి కథలు...ఇంకెన్నో!) -
ఇలాంటి కథలు...ఇంకెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లోని వారణాసి జిల్లాకు చెందిన 17 ఏళ్ల అజిత్ కుమార్ రెండేళ్ల క్రితం గుజరాత్లోని సూరత్లో తన కజిన్ పని చేస్తోన్న ఎంబ్రాయిడరీ ఫ్యాక్టరీకి వెళ్లి పనిలో చేరారు. నెలకు పదివేల రూపాయలు జీతం వస్తుండగా, అందులో మూడున్నర వేల రూపాయలు ఇంటి అద్దెకు చెల్లిస్తూ ఉంటున్నారు. నెలకు రెండున్నర, మూడున్నర వేల రూపాయలు ఇంటికి పంపిస్తూ వచ్చారు. ఇంతలో లాక్డౌన్ వచ్చి పడింది. కంపెనీ నుంచి ఏప్రిల్ నెలకు డబ్బులు రాలేదు. ఇంటి అద్దె మూడున్నర వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఆ దశలో ‘అమ్మా! నేను ఇక ఇంటికి డబ్బులు పంపించలేను. అద్దె చెల్లించడమే కనా కష్టంగా ఉంది’ అంటూ ఫోన్చేసి చెప్పారు. అజిత్ కుమార్ తండ్రి దినసరి కూలీగా పని చేస్తారు. ఒకరోజు కూలి 300 రూపాయలు వస్తుంది. అయినా రెండు నెలల పాటు కుమారుడికి ఐదు వేల రూపాయల చొప్పున పంపించారు. ఇక లాభం లేదని, ఇంటికి వచ్చేయమని చెప్పారు.(మనసున్న ఆటో డ్రైవర్) అజిత్ ఇంటికి వస్తున్న విషయం తెలిసి ఇరుగు పొరుగు వారు అజిత్ తల్లి ఉషాదేవీని కలిసి కొడుకును ఇంట్లోకి అనుమతించరాదని, 14 రోజులపాటు క్వారెంటైన్లో ఉంచాలని హెచ్చరించారు. అలా ఊరికి వచ్చిన వారిని క్వారెంటైన్లో ఉంచేందుకు ఊరి పాఠశాలలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఉషాదేవీ, అదే విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. చివరకు వాకబు చేయగా, పాఠశాలలో అలాంటి ఏర్పాట్లేమీ సర్పంచ్ చేయలేదు. కనీసం ఆ పాఠశాలలో మంచినీళ్లు కూడా లేవు. దాంతో ఉషాదేవి, ఆమె భర్త కలిసి ఇంటికి దూరంగా రేయింబవళ్లు కష్టపడి కొడుకు కోసం ఇటుకలతో చిన్న గుడిశె నిర్మించారు. ఇటుకలకు 13 వేల రూపాయలు, రెండు వందల రూపాయల చొప్పున వెదురు బొంగులు, 500 రూపాయలకు టార్పాలిన్ కొనుక్కొచ్చి గుడిశె నిర్మించినట్లు ఉషా దేవీ వివరించారు. గుడిశె నిర్మాణానికి 15వేల రూపాయలు ఖర్చయిందని, అదంతా అప్పుతెచ్చే కట్టామని చెప్పారు. అజిత్ కుమార్ మే 11వ తేదీన 48 గంటల ప్రయాణం అనంతరం గోరఖ్పూర్లో రైలు దిగారు. ఆయన రైలు టిక్కెట్ కోసం 1200 రూపాయలు చెల్లించారు. ఆయన్ని మరో 200 కిలోమీటర్లు రోడ్డు మార్గాన యూపీ అధికారులు పంపించారు. అజిత్ స్వగ్రామమైన మధుకర్ షాపూర్ గౌర్ గ్రామానికి సమీపంలో దించారు. అక్కడ ఆయనకు థర్మల్ స్క్రీనింగ్ చేసి ప్రస్తుతానికి జ్వరం ఏమీలేదని తేల్చి 14 రోజులపాటు క్వారెంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించి పంపించారు. (విమానాలు లేక.. ఇంటికి రాలేక! ) అప్పటి నుంచి అజిత్ను తాము 14 రోజులపాటు కనీసం చూడలేదని పక్కింటి అర్జున్ బింద్ తెలిపారు. నిన్న, మొన్నటి వరకు ఉషాదేవీ కుటుంబం మొత్తాన్ని గ్రామస్థులు అంటరానివారిగా చూశారట. గ్రామీణ ఉపాధి హామీ గ్యారంటీ పథకం కిందా పని చేయడానికి కూడా అనుమతించలేదట. ఎందుకు అనుమతించరంటూ రెండు, మూడు రోజుల పంతం పట్టి గొడవ చేస్తే ఉపాధి హామీ పథకం కింద భార్యా, భర్తల్తో ఇద్దరి కాకుండా, ఒక్కర్నే అనుమతిస్తామని చెప్పారట. ఉపాధి హామీ కింద కుటుంబానికి ఒక్కటే కార్డు ఉంటుంది. వంద రోజులు పూర్తయ్యే వరకు ఇంట్లో ఎవరో ఒక్కరే కాకుండా, ఇంట్లోని వారంతా పనికి వెళ్లవచ్చు. మే 17వ తేదీతో గ్రామీణ ఉపాధి హామీ పనులు కూడా నలిచిపోయాయట. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులు ఇంత తిండి పెడితే ఏ పనైనా చేస్తామంటూ ఇళ్లిళ్లు తిరుగుతూ బతుకు ఈడుస్తున్నారట. లాక్డౌన్ కారణంగా ఇలాంటి కథలెన్నో! -
వారి రాకతో పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారాత్ ఆయీ హై, వ్యవస్థా కర్నీ హోగీ ( పెళ్లి బృందం వచ్చింది. ఏర్పాట్లు చేయాల్సిందే)’ జాన్పూర్ జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రామాజీ పాండే వ్యాఖ్యానించారు. ‘తక్షణమే పది పడకలు వేయండీ, రాత్రికల్లా వంద పడకలు సిద్ధం చేయాలి’ అని ఆయన తన సిబ్బందికి హుటాహిటిన ఆదేశాలు జారీ చేశారు. ‘ 25 భోజనాలు తగ్గితే ఎలా? అసలు నీవు రోజుకు ఎన్ని భోజనాలు సరఫరా చేయగలవు?’ అంటూ ఆయన ఓ వంట వాడిని ఉద్దేశించి ప్రశ్నించారు. (చదవండి : పది కోట్ల మందికి కరోనా ముప్పు!) ఆయన చేస్తున్న హడావిడి అంత పెళ్లివారి కోసం కాదని, ముంబై, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చిన వలస కార్మికులకు జరపుతున్న వైద్య పరీక్షల్లో తేలుతున్న కరోనా కేసుల గురించి. గత ఆదివారం నాటికి ఈ మూడు ప్రాంతాల నుంచి దాదాపు రెండున్నర లక్షల మంది కార్మికులు యూపీకి తిరిగొచ్చారు. వారి రాకతో జాన్పూర్లో కూడా కరోనా కేసులు హఠాత్తుగా పెరిగాయి. మే 15వ తేదీ నాటికి ఆ జిల్లాలో కేవలం 18 కేసులే ఉండగా, జూన్ ఏడవ తేదీ నాటికి కరోనా కేసులు 284కు చేరుకున్నాయి. వాటిలో 249 కేసులు వలస కార్మికులవే. జూన్ 9వ తేదీ నాటికి ఆ కేసుల సంఖ్య 301 చేరుకున్నాయి. (చదవండి : ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..) దాంతో జాన్పూర్ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కలిగిన జిల్లాగా మారిపోయింది. కరోనా పరీక్షలకు జాన్పూర్ ఆస్పత్రిలో ఒకే ఒక ఆస్పత్రి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుకు దాదాపు రెండు వేల మంది అనుమానితుల నుంచి శాంపిల్స్ను తీసుకుంటున్నప్పటికీ 25 శాంపిల్స్ మాత్రమే ల్యాబ్ సిబ్బంది పరీక్షించ గలుగుతున్నారు. దాంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న కరోనా అనుమానితులకు ‘కల్ హాజావో, నయీ పర్సుం ఆజావో’ అంటూ ల్యాబ్ సిబ్బంది నుంచి సమాధానాలు వస్తున్నాయి. -
చెక్కించుకున్న పేర్లు మిగలవ్
కొన్ని వార్తలు మనుషుల మీద నమ్మకాన్ని గౌరవాన్ని కలిగిస్తాయి. ఇటీవలి కరోనా గత్తరతో మనలోని మానవీయత జాలి, దయ కొంచెం వైరాగ్యం మేల్కొన్నాయి. మొన్నటి సమస్యలో వేల లక్షలమంది వలసకూలీలు వేరేదారి లేక కాలినడకన స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళడం ఎంతోమందిని కలిచివేసింది. వేలమైళ్లు నడిచి వెళ్ళాలనుకోడం కేవలం సొంతవూరి మీది మమకారం. కొందరు రకరకాలుగా వారికి సాయపడ్డారు. ఒక తెలంగాణారైతు తన పొలంలో పండిన పుచ్చకాయల్ని వలస కూలీలకు ఉచితంగా ఉదారంగా పంచిపెట్టాడు. ఈ వార్త మనసుని ఎంతగానో సేద తీర్చింది. దీని తర్వాత నాకు బాగా తెలిసిన ఒక పెద్ద మనిషి తన శక్తి కొద్దీ సైకిళ్లు కొని వలస కూలీలకు పంచారు. రెండువేలు ఖర్చయింది. కాని వారెంత సంతోషించారో చెప్పలేను. మూడు రోజులు ముందు వూరు చేరతామని సంబరపడ్డారు. ఇలాంటప్పుడు చేసిన, చేస్తున్న ప్రభుత్వాల మీద బురద జల్లుతూ కూర్చోడం కంటే, మన మాజీ నేత చంద్రబాబు ఓ వెయ్యి సైకిళ్లు పంచిపెట్టవచ్చుగదా. పైగా సైకిల్ తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా.బాబుకి జిందాబాదుళ్లు కొట్టించుకోవడంలో ఉన్న నిషా ఇంకెందులోనూ లేదు. కావాలంటే పచ్చరంగుతో సైకిళ్లు పంచితే గొప్ప ప్రచారం కూడా కదా. వెయ్యి సైకిళ్లు టోకున కొంటే నాలుగు లక్షలకు వస్తాయి. ఎంత పుణ్యం? ఎంత పేరు, ఎంత ప్రచారం. చిన్న చిన్న త్యాగాలు కూడా చెయ్యరు గాని చేసే వారిపై విమర్శలు సంధిస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని తాపత్రయ పడుతుంటారు. ఇంకా ఆయన హెరిటేజ్ షాపుల ద్వారా వలస జీవులకు ఒక గ్లాసెడు చల్లటి మజ్జిగ యిచ్చినా వారి మేలు మర్చిపోలేరు. దాని విలువ పావలాకి మించి ఉండదు. ఈ పాటి త్యాగానికి కూడా పూనుకోలేకపోతున్నారు. హైవే మీద ఆకలి తీరుస్తున్న అమీనా బేగం అపర అన్నపూర్ణ. ఆమె నిజంగా ఆ పుచ్చ రైతుకి పై నుంచి ఎన్ని దీవెనలు వస్తాయో. ఈ తల్లికి. ఎన్నిపుణ్యాలు వస్తాయో. ఎప్పుడో చిన్నప్పుడు సానెట్లుగా చదివిన ఒక బైబిలు కథ జ్ఞాపకం వస్తోంది. చాలా పాతకాలంలో చక్రవర్తి తన రాజ్యంలో ఓ కొండమీద అద్భుతమైన చర్చి నిర్మించాలని ప్రారంభించాడు. దాని ద్వారా తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలనుకున్నాడు. రాళ్లని, యితర నిర్మాణ సామాగ్రిని చేర్చడానికి గాడిదల్ని పనిలోకి దింపారు. పాపం గాడిదలకి రోజంతా కొండరాళ్లు మోయడమే పని. ఒక వృద్ధుడు వాటి శ్రమని గమనించాడు. రోజూ కొండ కింద కూర్చుని గాడిదలకు లేత పచ్చికలు మేపేవాడు. గాడిదలకు అదొక సేదతీర్చే మజిలీ అయింది. వెళ్తూ ఆ వృద్ధుణ్ణి నాలిలుతో స్పృశించి వెళ్లేవి. అందుకే వృద్ధుడు పులకించిపోయేవాడు. కొన్నాళ్లు గడిచింది. చర్చి భూమిపై ఒక అద్భుతంగా నిలిచింది. దాన్ని గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ మర్నాడు చర్చిని చక్రవర్తి ఆవిష్కరించి ప్రజలకి అంకితం చేస్తాడు. చక్రవర్తి మంది మార్బలంతో సహా వచ్చి, చర్చిని పరిశీలనగా చూసి, దానిపై ప్రముఖంగా తన చిరునామాలతో సహా తన పేరు పాలరాతిపై ఎలా చెక్కాలో శిల్పులకు ఆదేశించాడు. తెల్లవార్లూ చెప్పింది అక్షరం పొల్లు పోకుండా శిల్పులు చెక్కారు. వెన్నెల వెలుగులో చక్రవర్తి పేరు ప్రతిష్టలు నక్షత్రాల్లా మెరిసాయి. తెల్లవారింది చక్రవర్తి చర్చి ఆవిష్కరించడానికి పెద్ద ఊరేగింపుతో వచ్చారు. కొండ దగ్గరకు వచ్చేసరికి చర్చిమీద పేరు చూసి రాజు నివ్వెర పోయాడు. అంతలోనే పట్టరాని కోపంతో ఊగిపోయాడు. తనపేరు శిలాక్షరాలతో ఉండాల్సిన చోట మరోపేరు చెక్కబడి ఉంది. స్వయంగా పేరుచెక్కిన శిల్పులు చక్రవర్తి కాళ్లమీద పడ్డారు. ఎవడిదా పేరు అని రాజు హుంకరించాడు. గాడిదలకి ఓర్పు సహనాలతో ప్రతిఫలం ఆశించకుండా పచ్చికలు అందించిన వృద్ధుడిపేరుగా గుర్తించారు. చక్రవర్తి నిర్ఘాంతపోయాడు. అన్ని పైనించి గమనించే రాజాధిరాజు, మహాచక్రవర్తి ఒకడుంటాడు ప్రభువా వందనం నన్ను మన్నించమని చక్రవర్తి తలదించుకున్నాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
హైదరాబాద్ నుంచి శ్రామిక్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలింపునకు చర్యలు తీసుకున్నామని, గురువారం ఒడిశాకు హైదరాబాద్ నుంచి ఐదు శ్రామిక్ రైళ్లు బయల్దేరనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వీటి ద్వారా 9,200 మంది వెళ్తారని, ఇంకా మిగిలే 15,800 మంది కోసం ప్రభుత్వం బస్సు, రైలు వంటి రవాణా ఏర్పాట్లు చేస్తుందని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఒడిశాకు ఐదు శ్రామిక్ రైళ్లను నడపడం శుభపరిణామమని, ఇదే తరహాలో ఉత్తర్ప్రదేశ్, బిహార్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వలస కార్మికుల కోసం రెగ్యులర్ రైళ్లకు అదనంగా నాలుగు బోగీలను నడిపితే బాగుంటుందని సూచన చేసింది. సరిహద్దు, సమీప రాష్ట్రాలకు బస్సుల ద్వారా తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించింది. తరలింపు చర్యలు పూర్తయ్యే వరకూ వలస కార్మికులకు ఆహారం, వసతి, వైద్యం అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రవాణా చార్జీలను కూడా రాష్ట్రమే భరించాలని స్పష్టం చేసింది. ఇటుక బట్టీల్లో వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించాలని కోరుతూ ప్రొఫెసర్ రామ శంకర్ నారాయణ్ మేల్కొటి, న్యాయవాది పి.వి.కృష్ణయ్య, జీవన్కుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. రాజస్తాన్, బిహార్, జార్ఖండ్లకు ఎందుకు రైళ్లను నడపటం లేదని ప్రశ్నించింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ఆర్టీసీ బస్సులు నడిపి వలస కార్మికులను తరలింపునకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. తెలంగాణ వినతిపై శ్రామిక్ రైళ్లు కోర్టుకు సహాయకారిగా నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ వాదిస్తూ, రాష్ట్ర వినతిపై రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. గురువారం ఐదు రైళ్ల ద్వారా ఒడిశాలోని బౌలంగీర్, శ్రీకాకుళంలోని నౌపడా ప్రాంతాల వారు వెళతారని, మరో నాలుగు రైళ్లను ఏర్పాట్లు చేస్తే అందరూ వెళ్లిపోతారని తెలిపారు. రెజిమెంటల్ బజార్లో 250 మంది వలస కార్మికులకు రెండే టాయిలెట్స్ ఉన్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఎగ్జిబిషన్లో మాదిరిగా తాత్కాలిక టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచన చేసింది. రెగ్యులర్ రైళ్లకు నాలుగు బోగీల్లో వలస కార్మికులను తరలింపునకు కష్టం అవుతుందని రైల్వే తరఫు న్యాయవాది పి.కౌర్ చెప్పారు. అయినా హైకోర్టు సూచనను రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, శ్రామిక్ రైళ్ల ద్వారా వలస కార్మికులను పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని 1,218 ఇటుక బట్టీలను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సందర్శించారని, వాటిలో 64,669 మంది వలస కార్మికులు ఉన్నారని గుర్తించారని చెప్పారు. వారిలో 48,416 మంది వారి రాష్ట్రాలకు వెళ్లిపోయారని, ఇరవై జిల్లాల్లో 15,880 మంది రవాణా కోసం నిరీక్షిస్తున్నారని, వీరందరి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాదనల అనంతరం విచారణ 19కి వాయిదా పడింది. -
ఉపాధికి దూరం.. వలస భారం
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులను ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నెల 8వ తేదీతో లాక్డౌన్కు వివిధ రూపాల్లో సడలింపులు (కొన్ని మినహా) అమల్లోకి రాగా,. వారి స్థితిగతులు, ఇబ్బందులు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దాదాపు రెండున్నర నెలల క్రితం లాక్డౌన్ను విధించిన నాటి నుంచి ఉపాధి కరువై దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్ (స్వాన్) జోనల్ హెల్ప్లైన్ల ద్వారా వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు, అత్యవసర ఖర్చులకు నగదు, రవాణాచార్జీల రూపంలో సాయం అందజేసింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా 34 వేల మందిని సంప్రదించడంతో పాటు వారి ఇబ్బందులను గుర్తించి వలసకార్మికుల ఖాతాల్లోకి నేరుగా దాతల ద్వారా రూ.50 లక్షల దాకా ¯నగదును బదిలీ చేయించింది. వీటిపై ఇప్పటివరకు రెండు నివేదికలను విడుదలచేసిన ఆ సంస్థ , తాజాగా ‘టు లీవ్ ఆర్ నాట్ టు లీవ్ (సొంతూళ్లకు తిరిగి వెళ్లాలా వద్దా)’శీర్షికతో మూడో నివేదికను వలస కార్మికుల రవాణా, సంబంధిత అంశాలపై వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ►మే15 నుంచి జూన్ 1 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది వలసకార్మికుల నుంచి ఆపత్కాలంలో వచ్చిన ఫోన్లు, ఇతరత్రా రూపాల్లో సమాచారం ద్వారా ఇప్పటికీ 80% మందికి ప్రభుత్వ రేషన్ అందడం లేదు, 63 శాతం మంది వద్ద రూ.వంద కంటే తక్కువ నగదు మాత్రమే అందుబాటులో ఉంది. ►లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి 67% మంది (2 వేల మందిలో) ఇంకా ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడే చిక్కుకుపడిపోయారు. 33% మంది సొంత ప్రాంతాలకు వెల్లగలిగారు. ►వలసకు వెళ్లిన ప్రాంతాల్లోనే 75% మంది (1200 మందిలో) ఇంకా చిక్కుకుపోయారు. ఇప్పటికీ ఇంకా వారికి ఎలాంటి ఉపాధి లభించలేదు. ►బస్సులపై 44% మంది, ప్రత్యేక శ్రామిక్ రైళ్లపై 39% మంది లారీల్లో, ఇతర సదుపాయాల ద్వారా 11 శాతం మంది, కాలినడకన 6 శాతం మంది సొంతూళ్లకు చేరుకున్నారు. ►వీరిలో 85% మంది రవాణా ఖర్చులను చెల్లించారు. మూడింట రెండు వంతులు రూ.వెయ్యికంటే ఎక్కువగా చార్జీల రూపంలో చెల్లించారు. ► లాక్డౌన్ కాలంలో 1600 మందిలో 80 % మంది అప్పులు చేశారు. వారిలో 15% మంది రూ. 8 వేల కంటే ఎక్కువ మొత్తంలో రుణంగా తీసుకున్నారు. -
బిగ్ బీ ఔదార్యం: 3 విమానాల్లో 500 మంది!
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల పట్ల బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఔదార్యం ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 500 మంది కార్మికులను మూడు విమానాల్లో తరలించేందుకు మెగాస్టార్ టికెట్లు బుక్ చేశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. మిడ్డే కథనం ప్రకారం.. ‘‘బచ్చన్జీకి పబ్లిసిటీ ఇష్టం ఉండదు. వలస కార్మికుల కష్టాలు విని చలించిపోయిన ఆయన.. వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. 180 మందిని వారణాసికి తరలించేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో టికెట్లు బుక్ చేశారు. ఈ రోజు ఉదయం ఓ విమానం బయల్దేరింది. వలస కార్మికులు పొద్దున ఆరు గంటలకే అక్కడికి చేరుకున్నారు. నిజానికి తొలుత వాళ్లను రైళ్లలో తరలించాలని భావించారు. కానీ కుదరలేదు. మొత్తం 500 మంది కోసం మూడు విమానాలు ఏర్పాటు చేశారు’’ అని అమితాబ్ స్నేహితులు పేర్కొన్నారు.(అఅఆ వసూళ్లు బాహుబలి–2 కంటే ఎక్కువ!) ఇక వారణాసితో పాటు పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల వలస కార్మికులను తరలించేందుకు సైతం బిగ్ బీ ఏర్పాట్లు చేస్తున్నారని వారు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. వారం రోజుల క్రితం ముంబై నుంచి యూపీ వలస కార్మికులను 10 బస్సుల్లో అమితాబ్ టీం తరలించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నింటిని బిగ్ బీకి అత్యంత నమ్మకమైన ఓ వ్యక్తి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమితాబ్ బచ్చన్ గతంలోనూ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. రైతులకు ఆర్థిక సాయం ప్రకటించిన బిగ్ బీ.. వారి అప్పులను తీర్చారు. తాజాగా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తన వంతు సాయం అందించారు. ఇక బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వందలాది మంది వలస కార్మికులను తరలించి అందరి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.(ఎవరి అభిప్రాయం వారిది : సోనూసుద్) -
15 రోజుల్లోగా పంపండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుని, ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలసకార్మికులను 15 రోజుల్లోగా తమ స్వస్థలాలకు పంపించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వారిలో ఆందోళనలు తొలగేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని, స్వస్థలాల్లోనే వారికి ఉపాధి కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలపై స్పందించిన కోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. తమ రాష్ట్రంలో చిక్కుకుని, సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న కార్మికులను గుర్తించి, వారిని పక్షం రోజుల్లోగా పంపించేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భౌతిక దూరం సహా లాక్డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి వలస కార్మికులపై పెట్టిన క్రిమినల్ కేసులను ఉపసంహరించాలంది. మానవత్వంతో వ్యవహరించాలి ఉపాధి కోల్పోయి, తప్పనిసరై స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని పోలీసులు, ఇతర అధికారులకు ధర్మాసనం సూచించింది. పోలీసులు, పారా మిలటరీ దళాల దురుసు ప్రవర్తన తమ దృష్టికి వచ్చిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో మరింత జాగ్రత్త రాష్ట్రంలో కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వలస కార్మికుల గుర్తించే కార్యక్రమం, వారిని స్వస్థలాలకు తరలించే ప్రక్రియను మరింత జాగ్రత్తగా పూర్తిచేయాలని మహారాష్ట్రను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల విషయంలో మహారాష్ట్ర వ్యవహరిస్తున్న తీరులో చాలా లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. 37 వేల మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారన్న రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క శ్రామిక్ రైలు మాత్రమే కావాలని రైల్వేను కోరడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్ని రైళ్లు కావాలో చెప్పండి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు అదనంగా ఎన్ని శ్రామిక్ రైళ్లు అవసరమవుతాయో జూన్ 10వ తేదీలోగా తమకు తెలియజేయాలని రైల్వే శాఖ రాష్ట్రాలను కోరింది. ఇప్పటికే డిమాండ్ చేసిన 171 శ్రామిక్ స్పెషల్ రైళ్లు కాకుండా, ఇంకా ఎన్ని సర్వీసులు అవసరమవుతాయో సమగ్రంగా తెలపాలంది. ప్రయాణికుల సంఖ్య, ప్రారంభ స్టేషన్, గమ్యస్థాన స్టేషన్, ఏ రోజు, ఏ సమయానికి అవసరం అనే పూర్తి వివరాలను అందించాలని కోరింది. -
సోనూసూద్ను అడ్డుకున్న పోలీసులు
ముంబై: లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకుంటూ వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు నటుడు సోనూ సూద్. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని, భవిష్యత్తులోనూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. ఉత్తర ప్రదేశ్కు శ్రామిక్ రైలులో వెళ్లనున్న వలస కార్మికులను కలిసేందుకు నటుడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అయితే అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అతడిని స్టేషన్లోనికి పంపించకుండా బయటే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. (బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ ) దీనిపై స్పందించిన ముంబై పోలీసులు నటుడిని అడ్డుకున్నది తాము కాదని, రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్ బలగాలు) అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా నటుడి సాయాన్ని ఉటంకిస్తూ అతను బీజేపీకి కొమ్ము కాస్తున్నాడని, కరోనా కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడంటూ 'సామ్నా' ఎడిటోరియల్ వేదికగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం సోనూసూద్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్యా ఠాక్రేతో భేటీ అయి రాజకీయ విమర్శలకు చెక్ పెట్టాడు. (విమర్శలకు చెక్: సీఎంతో భేటీ) -
రాష్ర్టాలకు 15 రోజుల డెడ్లైన్ : సుప్రీం
న్యూఢిల్లీ : వలస కార్మికులను గుర్తించి వారి నైపుణ్యాలకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని మంగళవారం సుప్రీంకోర్టు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు దాదాపు కోటిమందికి పైగా వారి స్వగ్రామంలోనే పని కల్పించేందు ఓ జాబితా తయారుచేయాలని సూచించింది. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారని, ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వలసదారులను గుర్తించి వారికి ఉద్యోగాలు కల్పించడానికి అందుబాటులో ఉన్న పథకాలకు సంబంధించిన సమాచారాన్ని జులై 8లోపు అఫిడవిట్ ద్వారా కోర్టులో సమర్పించాలని రాష్ర్టాలను కోరింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను 15 రోజుల్లోగా వారి స్వస్థలాలకు చేర్చాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. (ఢిల్లీలో ముంచుకొస్తున్న కరోనా ముప్పు ) వలస కూలీల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లు తగినన్ని లేవని, అంతేకాకుండా సరైన వసతులు కల్పించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారని సుప్రీం స్పష్టం చేసింది. వలస కార్మికులను తరలించడానికి రైలు సదుపాయం కల్పించాలని ఏ రాష్ర్టమైనా కోరిన 24 గంటల్లోపు అందించేలా రైల్వే శాఖ బాధ్యత వహించాలని కోరింది. అవసరమైతే అదనంగా ప్రత్యేక రైళ్లు నడపాలని న్యాయస్థానం పేర్కొంది. స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నంలో లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘించినందుకు వలస కూలీలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా రాష్ర్టాలను కోరింది. (కరోనా: కమ్యూనిటీ ట్రాన్స్మిషన్పై కీలక సమావేశం ) -
వలస కూలీల కోసం భారీ ప్రణాళిక?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడమే కాకుండా. స్వస్థలాలకు చేరేందుకు నానా అవస్థలు పడ్డ వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాని∙మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకంలోని పలు పనుల కోసం వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించడం ఈ ప్రణాళికలోని ముఖ్యాంశంగా తెలుస్తోంది. జన్ధన్ యోజన, కిసాన్ కళ్యాణ్ యోజన, ఆహార భద్రత పథకం, ప్రధాని ఆవాస్ యోజన కార్యక్రమాలను వలసకూలీలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తారు. ఇందుకోసం దేశంలో వలస కూలీలు ఎక్కువగా ఉన్న 116 జిల్లాలను ఎంపిక చేశారు. బిహార్లో 32, ఉత్తర ప్రదేశ్లో 31, మధ్యప్రదేశ్లో 24, రాజస్థాన్లో 22, జార్ఖండ్లో 3, ఒడిశాలోని 4 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఈ జిల్లాల్లో వలస కూలీలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. -
సోనూకు రాజకీయ రంగు: మోదీతో భేటీ!
సాక్షి, ముంబై : కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్పై శివసేన విమర్శల వర్షం కురిపించింది. తన అధికారిక పత్రిక సామ్నా వేదికగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సోనూను రాజకీయ రొచ్చులోకి లాగారు. వలస కార్మికులను అడ్డుపెట్టుకుని మరో మహాత్ముడు దిగి వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనూ మంచి నటుడని కితాబిస్తూనే.. ఆయన వెనుక మంచి దర్శకులు కూడా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సోనూసుద్ సహాయంలో ఎన్నో లోతుపాతులు ఉన్నాయని, త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారంటూ రాజకీయ రంగు పూశారు. ఈ మేరకు ఆదివారం సామ్నా ఎడిటోరియల్లో ఓ కథనం ప్రచురితమైంది. (28 వేల మందికి సోనూసూద్ సాయం) ‘వలస కార్మికులకు మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ అండగా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సొంత ఖర్చుతో నటుడు సోనూసుద్ కొంతమంది కార్మికులను వారి స్వస్థలాలకు పంపించారు. ఆయన సహాయం వెనుక స్థానిక ప్రభుత్వ సహకారం కూడా ఉంది. సోనూ కార్యక్రమాల్లో రాజకీయ కోణం కూడా దాగి ఉంది. ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు నిలవడమే దీనికి నిదర్శనం. వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసుద్ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడం ఖాయం. సోనూ సెలబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ అంటూ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా లాక్డౌన్ కారణంగా మహారాష్ట్రలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తనసొంత ఖర్చులతో స్వస్థలాలకు తరలించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నిసర్గ తుపాను ముంచుకొస్తున్న సమయంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.సోనూ సహాయం దేశంలో నిజమైన హీరోగా ఆయన్ని నిలబెట్టిందంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ, త్రిపుర సీఎం బిప్లద్ దేవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం సోనూను అభినందనల్లో ముంచెత్తారు. తెరపై చేసే సాహసాల కంటే నిజ జీవితంలో ప్రజలను ఆదుకునేవారే నిజయమైన హీరో అంటూ కొనియాడారు. (సోనూసూద్.. నువ్వు రియల్ హీరో) -
వలస పక్షులకు రాదారి గూళ్లు
లోకాన్ని ముంచేసే ముప్పేదో రాబోతోందని తెలిస్తే.. అయినవాళ్ల కోసం మనసు వెదుక్కుంటుంది.. చచ్చినా, బతికినా తనవాళ్లతోనే అని కోరుకుంటుంది.. అలాంటి తండ్లాటే కరోనా కాలంలోనూ కనిపిస్తోంది.. ఆ వైరస్ కన్నా దాన్ని రానివ్వకుండా పెట్టిన లాక్డౌన్ మనుషుల్లో భయాన్ని సృష్టించింది.. కలైనా.. కఠోర వాస్తవాన్నయినా కుటుంబంతో చూద్దాం... కలో గంజో ఏదున్నా కలిసి పంచుకుందాం అనుకొనేలా చేసింది.. పొట్టకూటి కోసం పరాయి గడ్డకు వచ్చిన మనుషులను బాటసారులుగా మార్చింది.. సొంతవాళ్లను చేరుకునేందుకు వందల కొద్ది కిలోమీటర్లు నడిపించింది... గుండెకున్న ఆత్రం కాళ్లకూ ఉన్నా నడిపించే శక్తి కడుపులో నిండాలి కదా! అదిలేక నీరసించి సొమ్మసిల్లారు.. ప్రమాదాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. అయినా మిగిలిన వాళ్లు ప్రయాణం ఆపలేదు.. ప్రాణం పోయినా సరే.. తనది కాని చోట బతికేదే లేదు అనుకుంటూ నడుస్తూనే ఉన్నారు.. ఆ మొండితనమే కాలే కడపులో శక్తిని రగిలించింది.. తోటి మనుషులను కదిలించింది.. సహాయానికి వేల చేతులను అందించింది. వ్యక్తులుగా.. సమూహాలుగా.. గల్లీల్లో.. హైవేల మీద... ఎక్కడెక్కడ వలస కార్మికులు కనిపించే వీలుందో.. అక్కడక్కడ సహాయక శిబిరాలు వెలిశాయి.. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా సాయం అందిస్తూనే ఉన్నారు.. ఏ ఒక్క వలస కార్మికుడూ ఆకలితో ఇల్లు చేరకూడదు.. వాళ్లను భద్రంగా, సగౌరవంగా వాళ్ల ప్రాంతానికి చేర్చాలి అనే లక్ష్యంతో. అలా నిలబడ్డ కొంతమంది వ్యక్తులు.. కొన్ని సమూహాలు.. సంస్థల గురించి... ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దేశమంతా లాక్డౌన్ అయిపోయింది. అత్యవసర సర్వీసులే గడప దాటాయి. మిగిలిన వాళ్లంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుంటూ, వాట్సప్ చాలెంజ్లు, టిక్టాక్, యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉన్న సమయంలో నెత్తి మీద మూటలతో.. చంకన బిడ్డలతో.. చెప్పుల్లేని కాళ్లతో ఎర్రటి ఎండలో నడుస్తున్నారు వలసకార్మికులు చడీచప్పుడు లేకుండా. వీళ్లు మీడియా కంట పడ్డా.. జనం దృష్టిలోకి రాలేదు మొదట్లో. నడుస్తూ నడుస్తూ ప్రమాదానికి గురైన రెండు మూడు సంఘటనలతో యావద్దేశం ఉలిక్కిపడి వీళ్లవైపు తలతిప్పింది. అప్పటికే జాతీయ రహదారుల మీద బారులుబారులుగా కదులుతున్నారు వీళ్లు. అలాంటి వాటిల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఉన్న నేషనల్ హైవే 44 ఒకటి. ఇది తెలంగాణ మీదుగా వెళ్తుంది. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వచ్చిన వలసకార్మికులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే రహదారి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాళ్లకు. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నవాళ్లకు హైదరాబాద్ .. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ సెంటర్ పాయింట్. ఇక్కడే వెలసింది ఒక సహాయక శిబిరం. మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ క్యాంప్.. ఈ క్యాంప్ ఏర్పడక ముందే మేడ్చల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్లు కాలినడకన వెళ్తున్న ఈ కార్మికులను చూసి, చలించిపోయారు. వాళ్లను గమ్యం చేర్చడం వల్లకాని పనే.. కనీసం భోజనం పెట్టయినా వాళ్ల కష్టంలో పాలుపంచుకోవాలనుకున్నారు. పది, ఇరవై మందికి సరిపడా వంట చేసి.. దాన్ని పార్సిల్స్గా ప్యాక్ చేసుకొని హైవే మీదకు వచ్చి ఈ వలసకార్మికులకు ఆ ప్యాకెట్లు ఇచ్చి వెళ్లిపోయేవారు. అడ్వకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్ ఈ ప్రయత్నం ఇలా సాగుతున్నప్పుడే హైదరాబాద్ నగరంలో లాక్డౌన్తో పనిపోయిన వలసకార్మికులకు ఆహారాన్ని, రేషన్ను అందజేస్తున్నారు చాలామంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు. వాటిల్లో ఒక గ్రూపే ‘అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్’. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యాక్టివిస్ట్లు కలిపి పెట్టిన గ్రూప్ ఇది. ఇందులో రైతు స్వరాజ్య వేదిక నవీన్, మహిళా రైతుల గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సజయ, శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకురాలు సూరేపల్లి సుజాత, భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, అంకురం నిర్వాహకురాలు సుమిత్ర, యాక్టివిస్టులు అంబిక, సునీత అచ్యుత, బ్రదర్ వర్ఘీస్, వీవీ జ్యోతి, రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, న్యాయవాది వసుధ నాగరాజ్, శ్రుతి మొదలైన వాళ్లంతా ఉన్నారు. ఈ గ్రూప్ జంటనగరాల్లో ఉన్న వలసకార్మికుల కోసం ‘సహాయ’ అనే హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్లైన్కు వచ్చే ఫోన్ కాల్స్ తీసుకోవడానికి ఇరవై మంది వాలంటీర్లు పనిచేసేవారు ఎవరి ఇళ్లల్లో వాళ్లుండే. నిత్యావసరాల కోసం ఫోన్ చేసిన కార్మికుల నంబర్ సహా వాళ్ల వివరాలను నమోదు చేసుకొని ‘అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్’ వాళ్లకు తెలియపరిచేవారు. ఈ గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఆ ఏరియాకు కాస్త దగ్గరగా ఉంటే వాళ్లు వెళ్లి ఆ కార్మికులకు రేషన్ ఇచ్చేవారు. ఇలా మార్చి 25న మొదలైన ఈ సేవ కొనసాగింపే మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ క్యాంప్. సహాయ హెల్ప్లైన్ పది మంది వాలంటీర్లతో ప్రారంభమై నలభైమందికి పెరిగి.. ఈ కథనం రాస్తున్నప్పటికి వలసకార్మికులూ సొంతూళ్లకు వెళ్లడం వల్ల సహాయం చేసే అవసరమూ తగ్గి ఇరవై మంది వాలంటీర్లతో నడుస్తోంది. లాక్డౌన్ మూడో దశకు ముందు.. ఒకనాటి రాత్రి.. హైదరాబాద్లోనే ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్లో ఉన్న వలసకార్మికుల్లో ఓ అమ్మాయికి డెలివరీ అయింది. పాప పుట్టింది. ఆ సమయంలో ఆమెకు అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూపే సహాయమందించింది. మీకేం భయంలేదు.. అని వాళ్లకు ధైర్యమిచ్చేలోపే లాక్డౌన్ మూడో దశను ప్రకటించారు. వలస కార్మికుల్లో నిరాశ. ఇంకెంతలే.. నాలుగు రోజులు ఆగితే లాక్డౌన్ ఎత్తేస్తారు.. రైళ్లు, బస్సులు మామూలుగా తిరుగుతాయి సొంతూళ్లకు వెళ్లిపోవచ్చనుకున్న కార్మికులంతా నిరుత్సాహపడ్డారు. ఇక ఒక్కక్షణం కూడా ఆగకూడదు అని ఉన్న సామానంతా సర్దుకొని ప్రయాణానికి సిద్ధపడ్డారు. వాళ్లలో ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్ వలసకార్మికుల్లోని ఛత్తీస్గఢ్ కార్మికులూ ఉన్నారు. చంటిపిల్ల తల్లి సంబంధీకులు ఓ ముపై ్ప మంది కాలినడకనే వెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలిసి ఆ బాలింతను కూడా నడిపిస్తారేమోననే భయంతో అప్పటికప్పుడు ఓడియన్ థియేటర్కు వచ్చారు అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్ సభ్యులు కొందరు. ప్రభుత్వ అధికారుల అనుమతితో ఏదైనా వెహికిల్ మాట్లాడి పంపిస్తామని వాళ్లకు నచ్చజెప్పి.. పర్మిషన్ కోసం ప్రయత్నించారు. కాని అనుమతి దొరకలేదు. సహనం నశించిన ఛత్తీస్గఢ్ కార్మికులు నడకమొదలుపెట్టారు మేడ్చల్ వరకూ .అక్కడి నుంచి ఏదైనా ట్రక్కులో వెళ్లిపోతామని. అయితే ఆ బాలింతను, ఆమె భర్త, ఇంకొంతమంది చిన్నపిల్లలను ఈగ్రూప్ సభ్యులు ఆపారు. మేడ్చల్ వరకు కార్లో తీసుకెళ్లి అక్కడ ట్రక్ ఎక్కిద్దామని. వాళ్లకు భోజనం పెట్టి, దారిలోకి కావల్సినవి పార్సిల్ చేయించి ఆ రోజు సాయంకాలం కార్లో మేడ్చల్ తీసుకెళ్లారు గ్రూప్ సభ్యుల్లో ఒకరైన సి. వనజ. దారెంట వందల కొద్ది కార్మికులు నెత్తి మీద మూటలతో నడుస్తూ ఉన్నారు. ‘వాళ్లనలా చూస్తే భయమేసింది. నా వెంట ఉన్న ఆ చంటిపిల్ల కుటుంబాన్ని, ఆ పిల్లలను ట్రక్ ఎక్కించేసి వసు«ధ నాగరాజ్కు ఫోన్ చేశా. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. తెల్లవారే వసుధ వచ్చేసింది మేడ్చల్ హైవే దగ్గరకి. ఆ కార్మికులతో మాట్లాడాం. తమిళనాడు, బెంగళూరు నుంచి వస్తున్నారు. రెండు రోజులుగా వాళ్లకు తిండిలేదు, తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. లారీలను, ట్రక్కులను బతిమాలుకుంటున్నారు. చాలా దయనీయంగా ఉంది వాళ్ల పరిస్థితి. అప్పుడనిపించింది మేం పనిచేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది అని. అయితే అప్పటికే చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఇక్కడ సహాయం చేస్తున్నట్టు అర్థమైంది. వాళ్లకు తోడుగా మేమూ స్టార్ట్ చేశాం. మా గ్రూప్లో మిగిలిన వాళ్లకూ చెప్పాం. వాళ్లూ వచ్చారు. పళ్లు, బ్రెడ్, బిస్కట్ ప్యాకెట్స్, మంచి నీళ్లు పంచడం మొదలుపెట్టాం. ఒకొక్కళ్లం రోజుకి పది ట్రిప్పులు వేసినా సరిపోయేది కాదు. విపరీతమైన ఎండ. నడుస్తున్న వాళ్లు సేద తీరడానికి అక్కడేదైనా నీడ ఉంటే బాగుండు అనిపించింది. వెంటనే దిలిప్ కొణతంతో మాట్లాడితే, వెంటనే అక్కడ రెండు టెంట్లు వేయించారు. ఇండివిడ్యువల్గా హెల్ప్ చేస్తున్న వాళ్లనూ ఈ టెంట్ కిందకే తెచ్చి అందరం కలిసి ఓ గ్రూప్గా తయారయ్యాం. ఓ ప్రవాహంలా రావడం మొదలుపెట్టారు కార్మికులు. రోజుకు పదిహేనువేల మంది. ఫుడ్, వాటర్, వాలంటీర్స్ కోసం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతన్య పింగళి, ఆమెతోపాటు మరికొంత మంది.. వచ్చి చేరారు. అలా అలా సర్వీస్ అనేది ఓ ఉద్యమంలా మారింది. ఆరామ్ఘర్లో రేషన్ పంపిణీ అయిపోయాక సజయా వచ్చేసింది మేడ్చల్ ఓఆర్ఆర్కి. పీఓడబ్ల్య్లూ సం««ధ్య, కవిత పులి, సూరెపల్లి సుజాత, వీవీ జ్యోతి, నవీన్ సరేసరి. ఇలా చెప్పుకుంటే మేడ్చల్ చుట్టుపక్కల వాళ్లు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లు.. టీచర్లు, రిటైర్డ్ పర్సన్స్, గృహిణులు, స్టూడెంట్స్, పిల్లలు.. ఒక్కరు కాదు.. ఎంతమందో! తర్వాత కొంపెల్లిలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశాం. ఇక్కడ హైవే మీద టెంట్ల సంఖ్యా పెరిగింది. మేం చేస్తున్నది చూసి లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా స్పందించారు. నాలుగు రోజుల్లో పది టెంట్లు వేయించి, ఆరు వాటర్ ట్యాంకర్లు, నాలుగు టాయ్లెట్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆ మరుసటి రోజుకి మా అవసరాలేంటో కనుక్కొని తెల్లవారికల్లా వాటిని అరెంజ్ చేసేవారు. మే 12 నుంచి 26వ తారీఖు వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆకలి, దాహంతో ఈ మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ పాయింట్ దాటలేదు. దాదాపు రెండున్నరలక్షల మందికి ఈ ఫుడ్పాయింట్లో భోజనం పెట్టడమే కాదు, వాళ్లు ఇల్లు చేరేవరకు వాళ్లు వెళ్లే దూరాన్ని బట్టి వాళ్లకు సరిపడా ఫుడ్ను ప్యాక్ చేసి ఇచ్చాం. మొదట్లో వచ్చినవాళ్లను వచ్చినట్లు ట్రక్కులు మాట్లాడి ఎక్కించేవాళ్లం. అయితే ఎక్కడో ఒక ట్రక్కుకి యాక్సిడెంట్ (మేం పంపించిన వాళ్లవి కాదు) అయిందని తెలిసి ట్రక్స్లో పంపించడం అంత సేఫ్ కాదనిపించింది. దాంతో బస్సుల అరెంజ్మెంట్కు స్పాన్సర్షిప్ మొదలైంది. 30 బస్సులు ఆర్గనైజ్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ దాన్నో బాధ్యతగా ఫీలయ్యారు. అక్కడ ఎవరి బ్యానర్స్ లేవు. ఎవరు ఏది తీసుకొచ్చినా అందరు కలిసే సర్వ్ చేశారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి రాత్రి పదకొండు గంటల వరకు ఉండేవాళ్లం. లోకల్గా ఉండే శ్రీనివాస్ సజ్జ, శ్రీరామ్ ఉదయం ఆరున్నరకే క్యాంప్ ఓపెన్ చేసేవాళ్లు. రోజంతా నిలబడే ఉండేవాళ్లు’ అంటూ మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ క్యాంప్ గురించి చెప్పుకొచ్చారు సి. వనజ. ఆమె అన్నట్లుగా ఈ క్యాంప్లో తమ వంతు బాధ్యతను నిర్వహించిన వాళ్లెందరో. ఇండస్ మార్టిన్, అరుణాంక్ లత, మోషే డయాన్, ఉషాజ్యోతి బంధం వంటి యాక్టివిస్ట్లు, ఆర్టిస్ట్లు సహా ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఉండే స్టూడెంట్స్, చింతల్బస్తీలో ఉండే చిరు వ్యాపారాలు, యువత, బస్సుల ఏర్పాటుకు శక్తి కొలది సహాయం చేసే ప్రియాంక దత్ వంటి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు చెప్పుకుంటూ పోతే ఎందరో మనసున్న మనుషులు. పెర్కిట్ ఫుడ్ క్యాంప్.. మోతే గంగారెడ్డి.. ఫిల్మ్ మేకర్. హైదరాబాద్లో నివాసి. ఏప్రిల్ రెండో తారీఖున.. హైదరాబాద్లోనే అతనికి ఒక వ్యక్తి కనిపించాడు... తల మీద ఇనప్పెట్టె పెట్టుకొని, పిల్లల్ని వెంటేసుకొని నడుస్తూ. ‘ఎక్కడికి వెళ్తున్నావ్?’ అని అడిగాడు. ‘ఛత్తీస్గఢ్ సాబ్ ’ జవాబిచ్చాడు అతను. సొంతూళ్లకు కాలినడక మొదలుపెట్టిన వలసకార్మికుల గురించి వస్తున్న వార్తలను అప్పటికే చదివున్నాడు గంగారెడ్డి. ఆ రోజు ప్రాక్టికల్గా చూస్తున్నాడు. వెంటనే వాళ్లకు చేయగలిగిన సాయం చేశాడు. కాని మనసులోంచి ఆ వ్యక్తి ముద్ర చెరిగిపోలేదు. ఇలా హైదరాబాద్ మీదుగా ఎంతమంది వెళుతున్నారో అనే ఆలోచన మొదలైంది అతనిలో. ఒకరోజు రాత్రి రెండు గంటలకు కార్లో సొంతూరు బయలుదేరాడు. అంత రాత్రి కూడా నేషనల్ హై వే మీద వలసకార్మికులు నడుస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో కారు ఆపుతూ ఎక్కడి వెళ్తున్నారు అని అడిగితే.. ‘ఛత్తీస్ గఢ్’ అని కొంతమంది.. ‘మధ్యప్రదేశ్’ అని కొంతమంది.. ‘బిహార్’ అని మరికొంతమంది, ‘యూపీ’ అని ఇంకొంతమంది నుంచి సమాధానం. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు.. తలల మీద, భుజాలకు బరువులు... చంకలో చంటిపిల్లలు.. డబ్బుల్లేవు.. తిండీ లేదు.. తన దగ్గరున్న కొంత డబ్బిచ్చాడు.. ఎంతని ఇవ్వగలడు? ఎంత మందికి అని ఇవ్వగలడు? వాళ్లు వెళ్లే రూట్లో ఉండే ఊళ్లళ్లోని తన ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్లందరినీ అలర్ట్ చేశాడు ఆ వలసకార్మికులకు ఏదైనా సహాయం అందించడం గురించి. అక్కడితో ఆగిపోకుండా, తనకు ఎదురైన సంఘటనల గురించి ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు వీడియోలతో సహా. మే ఒకటవ తారీఖున.. తన ఊళ్లోని యూత్తో మీటింగ్ పెట్టాడు. అంశం.. వలసకార్మికులే. హైవే మీద తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ కాలినడకన వెళ్లే వలసకార్మికులను ట్రాక్టర్ల మీద తీసుకెళ్లి బార్డర్ దాటించే ఏర్పాట్లు ఏమైనా చేద్దామా? అని అడిగాడు. అతని ప్రతిపాదన సబబుగానే అనిపించినా పర్మిషన్ దొరకదని, అనుమతి లేకుండా అంత పెద్ద బాధ్యత తీసుకోవడానికి భయపడ్డారు. చేసేదిలేక తెల్లవారే మళ్లీ హైవే బాటపడ్డాడు గంగారెడ్డి. ఆర్మూర్ గుట్టల మధ్య ఇంకో బారు కనిపించింది అతనికి. మ««ధ్యాహ్నానికి మరొకటి. ఆ పూట వెళ్తున్న వారిలో ..ఒక మహిళ తల మీద మూట ఉంది.. చంకన మూడేళ్ల బిడ్డ.. ఆమె ముందు ఓ అయిదేళ్ల పాపా.. ఆ పాప చంకన యేడాదిన్నర మరో చంటి బిడ్డ. ఆ వరుసలో ఇంకా చిన్న పిల్లలున్నారు.. ఎండకు మొహాలు కమిలిపోయి.. నీళ్లు లేక నోరు పిడచకట్టుకుపోయి... తిండి లేక నీరసపడిపోయి.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్.. మొత్తం నాలుగు రాష్ట్రాల వాళ్లు.. మొత్తం 120 మంది నడుస్తునే ఉన్నారు... అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని గంగారెడ్డి. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నారట. 20 రోజులుగా నడుస్తూనే ఉన్నారట. ‘ఏం దేశం? ఏం అభివృద్ధి ఇది?’ ఇది అనుకున్నాడు. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేస్తే వచ్చారు. ఆ 120 మందిని ఎలాగైనా వెహికిల్స్లో పంపించాలని అటుగా వెళ్తున్న లారీలను అపారు. రెండు లారీలు తీసుకెళ్లడానికి ఓకే చెప్పాయి. అవి మహారాష్ట్ర వెళ్తున్నాయి కాబట్టి.. అందరినీ ఆ బార్డర్లో దింపేస్తాం అన్నారు డ్రైవర్లు. ఆ కాస్త దూరం శ్రమ తగ్గినా తగ్గినట్టే కదా.. అని ఒప్పుకున్నారు. ఆ వలసకార్మికులను ఎక్కించి పంపేశారు. మనసు కాస్త కుదుట పడింది. అసలు ఈ హైవే మీద ఎంత మంది నడుస్తున్నారో చూడాలని ఒకరోజు ఇందల్వాయి (నిజామాబాద్ దగ్గర) నుంచి మహారాష్ట్ర బార్డర్ పెన్గంగ వరకు ప్రయాణించాడు గంగారెడ్డి. హైవే మొత్తం రైలుపెట్టెలా వరుసగా కార్మికులు నడుస్తూ కనిపించారు. ఆ సమయంలో పెర్కిట్ చౌరస్తా దగ్గర కొంత మంది టీచర్లు, బీడీ కార్ఖానా రాజేశ్వర శర్మ ఈ వలసకార్మికులకు ఫుడ్ పార్శిల్స్ తెచ్చివ్వడం, అలాగే సుంకేట్ గ్రామానికి చెందిన జయప్రకాశ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఊళ్లోని యువతతో కలిసి ఇటుకబట్టీ వలస కార్మికులకు ఫుడ్ అందించడం, ఆర్మూర్ దగ్గర్లోని జానకంపేట్కు చెందిన కొందరు, పచ్చల నడుకుడ యూత్, కొంతమంది రైతులు కూడా వలసకార్మికుల ఆకలి తీర్చడం కోసం ప్రయత్నించడం, ముప్కాల్ హైవే మీద అమీనా బేగం అనే ఓ మహిళ రోజుకి కనీసం 250 మంది వలసకార్మికులకు భోజనం పెట్టడం కనిపించింది. వాళ్లందరితో మాట్లాడి వాళ్ల ఇంటర్వ్యూలనూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు గంగాధర్. అయితే ఇలా ఎవరికి వారు.. వాళ్లకు అనుకూలమైన సమయాల్లో సహాయం అందించడం వల్ల చేస్తున్న సహాయం కూడా సరిగ్గా ఉపయోగపడట్లేదు.. అందిన వాళ్లకు ఆహారం అందుతోంది... అందని వాళ్లు కాలే కడుపుతోనే పొలిమేర దాటుతున్నారని గ్రహించాడు గంగారెడ్డి. వీళ్లందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి నిర్విరామంగా సహాయ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అనుకున్నట్టుగానే ఆ వ్యక్తులందరినీ కలిశాడు. తన స్నేహితులకూ చెప్పాడు. టీచర్స్ గ్రూప్కు నాయకత్వం వహిస్తున్న ఎమ్ఈఓ రాజేశ్వర్కు ఆ సూచన నచ్చింది. మిగతా వాళ్లూ ఓకే అన్నారు. అంతా కలిసి పెర్కిట్ కూడలి దగ్గర టెంట్లు వేశారు. ఈ విషయాన్ని మళ్లీ ఎఫ్బీలో పోస్ట్ చేసి.. డబ్బు సాయం కోరాడు గంగాధర్. ఎమ్ఈఓ రాజేశ్వర్ అకౌంట్ నంబర్ ఇచ్చాడు. పన్నెండు రాష్ట్రాలు.. నేపాల్ వాళ్లు కూడా ‘మంచి స్పందన వచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఎన్ఆర్ఐలూ స్పందించారు. మే 13న మొదలుపెట్టాం. మొదటి రోజు రూ.2.60 లక్షలు వస్తే, రెండో రోజుకి అది రూ. 6 లక్షలకు చేరింది. వారం రోజులకు రూ.20.70 లక్షలు అయ్యాయి. అన్ని డిటైల్స్ ఎప్పటికప్పుడు ఎఫ్బీలో పోస్ట్ చేసేవాళ్లం. అంతా పారదర్శకంగానే సాగింది. కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశాం. మనుషుల ఫ్లోను బట్టి అన్నం ఉడికేది. పొద్దున్నుంచి రాత్రి వరకు వేల మంది కార్మికులు. ఎవరూ ఆకలితో వెళ్లకూడదు. డీహైడ్రేట్ కాకూడదు. చల్లటి నీళ్లు, మజ్జిగ, కీర దోసకాయలు, అరటిపళ్లు కొరత లేకుండా చూసుకున్నాం. అన్నం పెట్టి, మంచినీళ్ల బాటిల్, అరటిపళ్లు, బిస్కట్లు, బ్రెడ్, కీర, మజ్జిగ పాకెట్ పార్సిల్ చేసి ఇచ్చేవాళ్లం. కొంతమంది అయితే 30 గంటలు ఆహారం లేకుండా వచ్చారు నీరసపడిపోయి. దారి తెలియకుండా అలా రోడ్డు పట్టుకుని నడుస్తున్న వాళ్లూ ఉన్నారు. పెర్కిట్ కూడలి దగ్గర పన్నెండు రాష్ట్రాల వాళ్లు వచ్చారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, యూపీ, రాజప్థాన్, గుజరాత్, పంజాబ్, అస్సాం, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీతోపాటు నేపాల్ వాళ్లు కూడా ఉన్నారు. ఒడిశా, బెంగాల్ అటువైపు ఎందుకు వచ్చారు అంటే దారి తెలియక. ఇలా వలసకార్మికులు నడుస్తూ కనపడితే వాళ్లు కూడా వీళ్లతో కలిసి నడవడం మొదలుపెట్టారు. వాళ్ల అమాయకత్వం, వాళ్ల కష్టం చూస్తే ఎంత బాధేసిందంటే.. ఏ సమాజంలో ఉన్నాం మనం అనిపించింది. లాక్డౌన్తో పనిపోతే వాళ్లు డబ్బుల కోసమూ డిమాండ్ చేయలేదు. కనీసం మా ఊరికి బస్సు వేయండీ అని కూడా రిక్వెస్ట్ చేయలేదు. అయ్యా.. మమ్మల్ని వదిలేస్తే మా దారిన మేం పోతాం ఇంటికి అన్నారు. సురక్షితంగా వాళ్లను ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది.. అది కార్మికులుగా తాము డిమాండ్ చేసుకోగల హక్కు అన్న కనీసమైన ఎరుక కూడా వాళ్లకు లేదు. వీళ్లు లేకపోతే నగరాల అభివృద్ధి ఎక్కడిది? వాళ్ల శక్తిని పిండుకుని వాళ్ల కర్మకు వాళ్లను వదిలేశాం. ఇంతకన్నా అమానుషం ఇంకొకటి ఉండదు. వాళ్లకు ఉపయోగపడని ఈ అభివృద్ధి ఎందుకు? నడుస్తూ నడుస్తూ సొమ్మసిల్లిన వాళ్లను చూస్తే కడుపులోంచి దుఃఖం వచ్చేది. ఇక్కడ మానవీయ సందర్భం ఏంటంటే.. చాలా మంది ట్రక్కు డ్రైవర్లు వలసకార్మికులను ఉచితంగానే తీసుకెళ్లారు. మేం డబ్బులిస్తున్నా తీసుకోలేదు. వలసకార్మికులు కూడా నోరు విడిచి అన్నం పెట్టమని అడగలేదు. వెనక వరుసలో ఉన్న వాళ్లకు సరిపోదేమోనని కడుపు నిండకపోయినా మాకు చాలు వాళ్లకు వడ్డించండి అని చెప్పేవారు. వాళ్లను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని స్థానిక నాయకులనూ కోరాం. మంత్రి ప్రశాంత్రెడ్డి స్పందించారు. ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి బస్సులు వేసి హెల్ప్ చేశారు. ఇళ్లకు చేరుకున్న వాళ్లంతా ఫోన్లు చేసి క్షేమంగా చేరుకున్నాం.. తెలంగాణలో దొరికినట్టుగా తర్వాత మాకు ఎక్కడా ఆదరం అందలేదు అని చెప్తుంటే బాధ.. మళ్లీ మళ్లీ దుఃఖం. నిజానికి హై వే అంతా అలా ప్రతి పది కిలోమీటర్లకు ఒక క్యాంప్ పెడితే బాగుణ్ణనిపించింది. అందరినీ కలుపుకొని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేద్దామనుకున్నా, కుదరలేదు. ఎవరూ చెప్పకుండానే అమీనా బేగం, సుంకేట్ యూత్, టీచర్లు, రైతులు, బీడీ కార్ఖానా రాజేశ్వర్, ఇందల్వాయి దగ్గర డాక్టర్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ గ్రూప్, మేడ్చల్ హైవే మీది ఫుడ్ క్యాంప్.. వీళ్లంతా వాళ్లంతట వాళ్లే స్పందించి తోటి మనుషుల కష్టాన్ని తగ్గించాలనుకున్నారు.. ఇంతకన్నా ఏం కావాలి. మనసు భారమైనప్పుడు వీళ్లే ఆశను పెంచుతారు నాకే కాదు సమాజానికి కూడా. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా కొంతమంది వస్తూన్నారు కాబట్టి మా ఈ ఫుడ్ క్యాంప్ను ఇంకా పదిహేనురోజులు కొనసాగించాలనుకుంటున్నాం’ అని చెప్పాడు మోతే గంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో సేవ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడ – చెన్నై హైవే ఫుడ్ క్యాంప్గా మారింది. నిజానికి అక్కడి ప్రభుత్వమే వలసకార్మికుల బాధ్యతను తీసుకుంది. కాలినడకన వస్తు్తన్న వాళ్లకు సహాయం అందించడానికి సూరజ్ ధనుంజయ్ అనే అసిస్టెంట్ కలెక్టర్ను నియమించింది. ‘మంచి కోఆర్డినేషన్తో ఇక్కడి గవర్నమెంట్ పనిచేసింది’ అన్నారు పీఓడబ్ల్యూ సభ్యురాలు, గుంటూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రమాసుందరి. ఆంధ్రప్రదేశ్– ఒడిశా బార్డర్ వరకు ప్రభుత్వమే బస్సులు నడిపింది. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి సురక్షితంగా పంపారు. ప్రైవేట్ సంస్థలు, మహిళా సంఘాలు, వ్యక్తులు కూడా వలస కార్మికులకు సహాయం అందించారు. అందులో పీఓడబ్ల్యూ, జమాతే ఇస్లాం హింద్ ఆర్గనైజేషన్లోని సాంఘిక సేవా విభాగం కూడా ఉన్నాయి. విజయవాడ – చెన్నై హైవే అప్పటిదాకా ఊళ్లోనే ఉన్న కార్మికులకు సహాయం అందిస్తున్న పీఓడబ్ల్యూ మహిళా సంఘం సభ్యులు వలసకార్మికుల నడక గురించి విని ‘మన హైవే ఎలా ఉందో చూద్దాం’ అని విజయవాడ– చెన్నై హైవే మీదకు వెళ్లారు. సైకిళ్ల మీద వస్తూ కనిపించారు. ఆపి అడిగారు ‘ఎందుకలా రిస్క్ తీసుకుంటున్నారు?’ అని. ‘ఏం చేస్తాం మరి? మీరేమైనా బస్సుల్లో పంపే సహాయం చేయగలరా?’ అని అడిగారు. అప్పటికప్పుడు అంటే ఏ మార్గం తోచలేదు. బస్సులు కాకపోయినా కనీసం ఫుడ్, ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులతో కిట్స్ అన్నా ఇవ్వాలి అనుకున్నారు. రమా సుందరి తన దగ్గరి అయిదు వేల రూపాయలతో వస్తువులు కొందామనుకునేలోపు ఆమె స్టూడెంట్ కూడా అయిదువేల రూపాయలను ఇచ్చింది. ఆ పదివేల రూపాయలతో బ్రష్లు, పేస్ట్లు, టవల్స్, సోప్స్, బిస్కట్, బ్రెడ్ పాకెట్స్ వంటివి కొని కిట్స్లా తయారు చేశారు. మిగిలిన అరెంజ్మెంట్స్తో తెల్లవారి హైవే మీదకు వెళ్లారు. రెవన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు తెలిసి వాళ్లు వచ్చి టెంట్లు వేసి ఓ సెంటర్లా చేశారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ను అక్కడ పెట్టారు. ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బిహార్, యూపీ వాళ్ల ఎక్కువగా వస్తున్నారు. వాళ్లందరికీ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లు సహాయం అందించడం మొదలుపెట్టారు. అయితే పీఓడబ్ల్య్లూ వాళ్లు ఆ సెంటర్ కన్నా కాస్త ముందుకు వెళ్లి.. సైకిళ్ల మీద, నడుస్తూ వస్తున్న వాళ్లను ఆపి వాళ్లకు తమ దగ్గరున్న కిట్స్ పంచుతూ ‘ముందు గవర్నమెంట్ సెంటర్ ఉంది.. వాళ్లను సంప్రదించండి మీకు సహాయం అందుతుంది’ అని సూచించే బాధ్యతను తీసుకున్నారు. ‘ప్రభుత్వమే చాలా మంది కార్మికులను పంపింది. అస్సాం వంటి చోట్లకు వెళ్లాల్సిన వాళ్లను రెండు మూడు జిల్లాల వాళ్లు కలిసి డబ్బు పోగేసి పంపారు. చివరకు వెస్ట్బెంగాల్ వాళ్లు మిగిలారు. మా దగ్గరున్న ఫండ్స్తో ఓ వెహికిల్ మాట్లాడాం. మమతా బెనర్జీ అనుమతించట్లేదని తెలిసినా సాహసించాం.. కనీసం బార్డర్ వరకు అయినా పంపిస్తే అక్కడినుంచి ఎలాగైనా సొంతప్రాంతానికి చేరుకుంటారనే ఆశతో. ఇక వెళ్లిపోతారనగా ప్రభుత్వం వాళ్లను హ్యాండ్ ఓవర్ చేసుకుంది రైలులో పంపిస్తాం అని. వాళ్లను విజయవాడ తీసుకెళ్లాక బెంగాల్లో తుఫాను వల్ల ట్రైయిన్ క్యాన్సిల్ అయిపోయింది. ఆగిపోయారు. వాళ్లలో మాల్డా బ్యాచ్ వాళ్లూ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి తండ్రి చనిపోయాడు. ఆ పిల్లాడి కష్టం చూస్తే చాలా బాధేసింది. ఆ పిల్లాడికి కొంత డబ్బు ఇచ్చాం. అయితే తర్వాత తెలిసింది.. తోడుగా ఉన్న ఓ వ్యక్తితో కలిసి ఆ అబ్బాయి నడుచుకుంటూ వెళ్లిపోయాడని. చేరుకున్నాడో లేదో.. ఇటుగా వెళ్లిన చాలామంది పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలే. కొంతమందైతే తల్లిదండ్రులకు వాళ్లక్కొరే సంతానంగా ఉన్నవాళ్లు. ఇంతదూరం ఎందుకు పంపించారు మీ అమ్మానాన్న అంటే ‘అక్కడ పనుల్లేవ్’ అనే సమాధానం. ఆ పిల్లలంతా ఇక్కడ పానీపూరీ బండ్లు, ఐస్క్రీమ్ బండ్లు నడుపుకుంటున్న వాళ్లే. కాళ్లకు చెప్పుల్లేవు, తిండి లేదు. చెప్పులిచ్చి, తిండి పెట్టి .. బాగా నడవండి అని చెప్పి పంపినట్టయింది అనిపించింది. మనం చేసింది కరెక్టేనా అనే బాధ తొలుస్తోంది. వలస కార్మికుల విషయంలో వ్యవస్థలూ స్పందించాలి. ప్రభుత్వాలదే తప్పు. మీకేం కాదు అన్న ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వలేకపోయాయి ప్రభుత్వ వ్యవస్థలు’ అంటున్నారు పీఓడబ్ల్యూ సభ్యులు. కత్తిపూడి హైవే ఇక్కడ సహాయకార్యక్రమాలు చేపట్టింది జమాతే ఇస్లాం హింద్ ఆర్గనైజేషన్లోని సాంఘిక సేవా విభాగం. ‘చెన్నై నుంచి బిహార్ వెళ్లే వాళ్లు ఈ మార్గం గుండా నడిచారు. అందరూ యంగ్స్టర్సే. చెన్నై నుంచి ఎనిమిది రోజులుగా నడుస్తున్నారట. భోజనం పెట్టి, పార్సిల్స్ ఇస్తుంటే, ఏదైనా వెహికిల్ ఉంటే పంపించండి.. కొంత దూరమైనా పర్లేదు అని రిక్వెస్ట్ చేసేవాళ్లు. బాధనిపించింది. కొందరిని హైవే మీద వెళ్తున్న లారీల్లో ఎక్కించాం. అప్పటి నుంచి మా సర్వీస్ను కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. బ్యాచ్లు బ్యాచ్లుగా విడిపోయి తణుకు, రాజమండ్రి, మండపేట హైవేల్లో క్యాంప్లు పెట్టాం. కాకినాడ స్టార్టింగ్ పాయింట్. వలస కార్మికులు ముందు కాస్త తక్కువగానే కనిపించినా తర్వాతర్వాత బ్యాచ్లు బ్యాచ్లుగా రావడం మొదలైంది. పతి రోజూ అయిదు వందల లీటర్ల మజ్జిగ, ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్లం. వాళ్లకు భోజనం పెట్టి, పార్శిళ్లు ఇచ్చి వెహికిల్స్ ఎక్కిస్తుంటే చల్లగా ఉండండి అని దీవెనలిచ్చేవారు. వాళ్ల మొహాల్లో తృప్తి చూస్తే చాలా సంతోషంగా ఉండేది. ఈద్ కూడా వాళ్లతోనే కలిసి చేసుకున్నాం. అందరికీ వేడివేడి షీర్ కుర్మా పంచాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.. లాక్డౌన్ కంటే ముందు వరకు ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా మేం ఉద్యమం చేశాం. అప్పటిదాకా క్లోజ్గా ఉన్న మా హిందూ ఫ్రెండ్స్ చాలా మంది దూరం పాటించారు. కాని మేం హైవే మీద ఈ సర్వీస్ మొదలుపెట్టాక మళ్లీ వాళ్లంతా మాతో కలసి పాలు పంచుకుంటున్నారు. మానవత్వానికి కులమతాల అడ్డులేదు. మనుషులంతా ఒకటే.. అంతా కలిసే ఉందామనుకుంటారు’ అని చెప్తాడు మెకానికల్ ఇంజనీర్ హసన్ షరీఫ్. -సరస్వతి రమ -
బాలీవుడ్ నటుడికి తమిళుల హారతి
నటుడు సోనుసూద్ దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. కాగా కరోనా కారణంగా ఎందరో ప్రజలు బాధింపునకు గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో నటుడు సోనుసూద్ ఎందరినో ఆదుకుంటున్నారు. ఈయన కరోనా బాధితుల కోసం ముంబైలోని తన ఫైవ్స్టార్ హోటల్ను కేటాయించారు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో మరెందరో తమిళులు ముంబైలో చిక్కుకుపోయారు. సొంత ఊళ్లకు ఎలా చేరుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వారంతా నటుడు సోనుసూద్ను ఆశ్రయించారు. దీంతో ఆయన వారందరినీ విమానంలో సొంత ఊళ్లకు పంపించాలని భావించారు. అయితే అందుకు అనుమతి లేకపోవడంతో ప్రత్యేక బస్సులో పంపడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా శుక్రవారం ఒక బస్సును ముంబై నుంచి తమిళనాడుకు పంపించారు. ముందుగా ఆ బస్సుకు సోనుసూద్ కొబ్బరికాయ కొట్టి వారందరినీ సంతోషంగా పంపించారు. దీంతో ఆ తమిళులందరూ హారతి పట్టి కృతజ్ఞతలు తెలిపారు. -
3 నెలల్లో 50వేల మంది కార్మికులు సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో వేగంగా విస్తరిస్తూ పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ముందుంది. కొన్నేళ్లుగా ని ర్మాణరంగం మరింత వేగాన్ని పుంజుకుంది. సరిగ్గా ఈ స మయంలోనే కరోనా అడ్డు తగిలింది. వలస కూలీలు సొం తప్రాంతాలకు తరలివెళ్లారు. ఫలితంగా నిర్మాణ రంగం కు దేలైంది. ఇప్పుడు దాన్ని పట్టాలెక్కించి పరుగులు పెట్టిం చేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేవలం 3 నెలల్లోనే 50 వేల మంది కార్మికులను సిద్ధం చేయనున్నాం. వెరసి కొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుంటుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మం త్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. శనివారం ఆయన ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, న్యాక్ డీజీ భిక్షప తి, ఇతర నిర్మాణసంస్థల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం ‘సాక్షి’తో పంచుకున్న వివరాలు ఆయన మాటల్లోనే.. న్యాక్ శిక్షణతో ఉపాధి: అందుబాటులో ఉన్న వారిలో ఎంతమందికి నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉం దో గుర్తించి వారిని పనుల్లోకి తీసుకోబోతున్నాం. దీనికి ని ర్మాణ సంస్థలతో కూడిన బీఏఐ, క్రెడాయ్, ట్రెడా, టీబీ ఎ ఫ్, ఐజీబీసీ సంస్థలు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాయి. ప్రభుత్వ ఆదేశంతో ప్రత్యేకంగా జ్టి్టpట://్టటn్చఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ రూపొందించి శనివారం ప్రారంభించాం. వేరే ప్రాం తాల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు తమ వివరాలను ఇందులో అప్లోడ్ చేయాలి. ఏ రంగంలో నిష్ణాతులో తెలపాలి. ఆ వివరాలను ఈ 5 సంస్థలకు అందిస్తాం. వాటి ద్వారా వారికి ఉపాధి చూపుతాం. నిర్మాణ రంగంలో నైపుణ్యమున్న వారికి వెంటనే ఆ రంగంలో ఉపాధి చూపుతాం. ఇతర రంగాల్లోని వారికీ నిర్మాణ రంగంపై ఆసక్తి ఉంటే న్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించి సిద్ధం చేస్తాం. జిల్లా, నియోజకవర్గస్థాయికి ‘న్యాక్’: పేదలకు సంక్షేమ పథకాలు, రైతులకు ప్రాజెక్టులు–రైతుబంధులాంటి స్కీ మ్స్ ఉన్నట్టే మూడో కేటగిరీగా ఉపాధి రంగాన్ని పటిష్టపరచాలన్నది సీఎం ఆలోచన. ఇందుకోసం న్యాక్ను పటిష్టపరచాలని ఆదేశించారు. ఆ మేరకు ఆ సంస్థను జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్ర స్థాయికి చేర్చాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. నిరుద్యోగ యువతను గుర్తించి ఆసక్తి ఉన్న రంగం లో ఉపాధి కల్పించేలా న్యాక్ ద్వారా నైపుణ్యాన్ని కల్పిస్తాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉపాధి కల్పిస్తాం తెలంగాణ అంటే నమ్మకం: ఇటీవల వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లేప్పుడు.. రైలు బయల్దేరగానే ‘జై కేసీఆర్, జై తెలంగాణ, హమ్ ఫిర్ లౌటాయింగే’ అంటూ నినాదాలిచ్చారు. దేశంలోనే తెలంగాణ ఉపాధికి మంచి కేంద్రమన్న భావన, నమ్మకం చాలామందిలో ఉన్నాయి. సొంత ప్రాంతాలకు వెళ్లినవారంతా త్వరలోనే తిరిగొస్తారు. 50 వేల మంది అందుబాటులో.. కరోనా భయంతో 7 లక్షల నుంచి 10 లక్షల మంది సొంత ప్రాంతాలకు తరలిపోయారు. దాదాపు అంతే సంఖ్యలో ఇక్కడే ఉన్నారు. వారిక్కడే ఉండేలా పూర్తి భరోసా కల్పిస్తున్నాం. వెళ్లిన వారిలో సగం మంది మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నిర్మాణ రంగం పురోగతికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసి కార్యాచరణ ప్రారం భించాం. కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 10వేల మందికి పైగా తెలంగాణ కార్మికులు వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి మరో 40 వేల మంది వచ్చారు. వెరసి 50 వేల మంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ ఇక్కడే ఉపాధి చూపుతాం. -
15 రోజుల్లోగా పంపేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజుల గడువివ్వనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్వరాష్ట్రాలకు వెళ్ళే వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం, వారికి ఇతర ప్రయోజనాలు చేకూర్చేందుకు వారి పేర్లను నమోదు చేయాలని కోరింది. అందుకు ఈ సమయం సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. వలస కార్మికుల తరలింపు, వారి పేర్ల నమోదు, ఉపాధి అవకాశాల కల్పన సహా అన్నింటిపైనా జూన్ 9న ఆదేశాలివ్వనున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. వలస కార్మికుల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు గతంలో ఆదేశాలు జారీచేసింది. వలస కార్మికుల నుంచి బస్సుల్లోగానీ, రైళ్ళలోగానీ చార్జీలు వసూలు చేయరాదనీ, వారికి ఉచితంగా భోజనసదుపాయం కల్పించాలనీ సుప్రీంకోర్టు మే 28న ఆదేశించింది. తీర్పుని రిజర్వులో ఉంచిన కోర్టు, కోవిడ్ కారణంగా లాక్డౌన్తో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.కే.కౌల్, ఎంఆర్.షాలతో కూడిన ధర్మాసనం కోరింది. స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కొత్త పథకాలు రూపకల్పన చేయాలని సూచించింది. వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు జూన్ 3వ తేదీ వరకు 4,200 శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడిపినట్టు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఇప్పటి వరకు కోటి మందికిపైగా వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చామనీ, 41 లక్షల మందిని బస్సుల ద్వారానూ, 57 లక్షల మందిని రైళ్ళ ద్వారా తరలించినట్టు మెహతా పేర్కొన్నారు. వలస కార్మికులకోసం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అత్యధిక రైళ్ళను నడిపినట్టు వెల్లడించారు. ఇంకా ఎంత మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు ఎన్ని రైళ్ళు అవసరమనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని తుషార్ మెహతా కోర్టుకి వెల్లడించారు. ఇకముందు కూడా వలస కార్మికుల అవసరాన్ని బట్టి వారిని తరలించేందుకు రైళ్ళు నడుపుతామని కోర్టుకి హామీ ఇచ్చారు. జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం కల్పించుకొని వలస కార్మికుల ప్రయోజనం కోసం చేపట్టాల్సిన కొన్ని చర్యలను వివరించింది. మొత్తం 22 లక్షల మందిలో ఇంకా 2.5 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే తరలించాల్సి ఉందని గుజరాత్ పేర్కొంది. ఇంకా ఢిల్లీలో 2 లక్షల మంది వలస కార్మికులుండగా 10 వేల మంది మాత్రమే తిరిగి వెళ్లాలనుకుంటున్నారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ సరిహద్దుల నుంచి 5.50 లక్షల మంది వలస కార్మికులను తమ రాష్ట్రానికి చేర్చినట్టు ఉత్తరప్రదేశ్ విన్నవించింది. రాజస్తాన్ నుంచి 6 లక్షల మందిని, మహారాష్ట్ర నుంచి 11 లక్షల మందిని తరలించారు, ఇంకా 38 వేల మందిని తరలించాల్సి ఉంది. 28 లక్షల మంది బిహార్కి తిరిగి వచ్చినట్టు ఆ రాష్ట్రం పేర్కొంది. కోవిడ్కు ఉచిత చికిత్స చేస్తారా? ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ భారత్’కింద కోవిడ్ –19 రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. దేశంలోని పేద, అట్టడుగు వర్గాల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ భారత్ని ప్రవేశపెట్టారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్–19 రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని తాము కోరడం లేదని పేర్కొంది. కేవలం ప్రభుత్వ భూముల్లో, లేదా తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నడుస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు కోవిడ్–19 రోగులకు ఉచిత చికిత్సనందించాలని జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సారథ్యంలోని జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ రిషికేష్ రాయ్ల ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లు కొందరికైనా ఉచిత చికిత్సనందించలేవా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పనిచేసేలా చూడాలని అభిప్రాయపడింది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం, అవే ధరలను అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయాలని పిటిషన్ దారుడు, న్యాయవాది సచిన్ జైన్ కోర్టుకి విన్నవించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తిరిగి రెండు వారాల అనంతరం విచారించనుంది. ప్రైవేటులో కరోనా చికిత్స ఖర్చుకు పరిమితి విధించండి! ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగుల చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై వారంలోగా స్పందించాలని జస్టిస్ అశోక్భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోగల స్థోమత ఉన్న వ్యక్తికి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరమేంటని పిటిషన్దారు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆరోగ్య బీమా ఉన్నవారికి నగదు రహిత వైద్యం అందించాలన్నారు. -
చిక్కుకుపోయిన వలస కార్మికులు 26 లక్షలు
సాక్షి, అమరావతి: లాక్డౌన్తో వలస కార్మికులు ఎంతగా అవస్థలు పడ్డారో దేశమంతా చూసింది.. ఇంతకీ లాక్డౌన్ కారణంగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు 26 లక్షల మంది. చిక్కుకుపోయిన వారిలో అత్యధికంగా ఛత్తీస్గఢ్లో, అత్యల్పంగా చండీగఢ్లో ఉన్నారు. లాక్డౌన్ ప్రకటించే నాటికి తెలంగాణలో దాదాపు 1.93 లక్షల మంది చిక్కుకుపోగా, ఏపీలో లక్ష మంది ఉన్నారు. వలస కార్మికులపై కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం ఓ నివేదిక వెల్లడించింది. దానిలోని అంశాలిలా ఉన్నాయి.. ► మార్చి 25న లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నాటికి దేశంలో 26 లక్షల మందికి పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారు. ► వారిలో 46 శాతం మంది ఆ వలస ప్రాంతాల్లో తాము నివాసం ఉంటున్న చోటే ఉండిపోయారు. ► మరో 43 శాతం మందికి.. వారికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల యాజమాన్యాలు ఆశ్రయం కల్పించాయి. ► 10 శాతం మంది ప్రభుత్వ పునరావాస, సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. తమిళనాడు, పంజాబ్, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రభుత్వ సహాయక శిబిరాల్లో ఒక్కరు కూడా లేరు. వలస కార్మికుల్లో ఏఏ రాష్ట్రాలకు చెందినవారు ఎంతమంది ఉన్నారన్న విషయం కేంద్ర కార్మిక శాఖ వెల్లడించలేదు. -
వయసు చిన్న.. మనసు పెద్ద
వలస కార్మికుల కోసం ఎంతోమంది తమకు చేతనైన సాయం చేస్తున్న కథనాలు మన చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఎంతోమంది తమ ఉదాత్త మనసు చాటుకుంటూ వలస కార్మికులకు చేతనైన సాయం చేస్తున్నారు. వారి జాబితాలో ఇప్పుడు నోయిడాలో నివసిస్తున్న 12 ఏళ్ల అమ్మాయి నిహారికా ద్వివేదీ చేరింది. నిహారిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ న్యూస్ఛానెళ్లలో వలస కార్మికుల కష్టాలు, వారి దయనీయ కథనాలు చూస్తూ చలించిపోయింది. కొందరికైనా తన వంతు సాయం చేయాలనుకుంది. తమ నివాస ప్రాంతంలోనూ వలకార్మికులు ఉన్నారు. వారు సొంత ప్రాంతాలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా తన దృష్టికి వచ్చిన ముగ్గురు వలస కార్మికుల గురించి తెలుసుకుంది. రెండేళ్లుగా పిగ్గీబ్యాంకులో తను దాచుకున్న డబ్బు ఎంత ఉందో లెక్క కట్టింది. పిగ్గీ బ్యాంకులో 48 వేల 530 రూపాయల ఉన్నాయి. ఆ డబ్బులతో తమ ప్రాంతంలో ఉన్న ఆ ముగ్గురు వలస కార్మికులను వారి సొంత రాష్ట్రమైన జార్ఖండ్కి విమానంలో పంపింది. ఈ 12 ఏళ్ల నిహారిక సున్నిత మనసుకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. చిన్న వయసులో పెద్దమనసును చాటుకుంటున్న నిహారికకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. నిహారిక మాట్లాడుతూ ‘ఆ ముగ్గురు వలస కార్మికుల్లో ఒకరు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నారు. అలాంటి వారు వెయ్యికి పైగా కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ల స్వస్థలానికి చేరుకోవాలి. అది తలుచుకుంటే బాధగా అనిపించింది. మా అమ్మనాన్నలతో మాట్లాడి నా పిగ్గీ బ్యాంక్ మనీతో వారిని సొంతప్లేస్కు పంపించాలనుకుంటున్నట్టు చెప్పాను. వాళ్లు ఆనందంగా ఒప్పుకున్నారు. దాంతో ఆ కార్మికులు సురక్షితంగా, తక్కువ సమయంలో వాళ్ల తమ సొంత ఊళ్లకు చేరారు. ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది’ అని వివరించింది నిహారిక. -
వలస కార్మికులతో క్రైమ్ పెరుగుదల!
పట్నా : లాక్డౌన్తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న తరుణంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన ఓ లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) అమిత్ కుమార్ జిల్లా ఎస్పీలకు మూడు రోజుల క్రితం ఓ లేఖ రాశారు. కరోనా వైరస్ నేపథ్యంలోనే ఉపాధి లేక స్వరాష్ట్రానికి (బిహార్) తిరిగివచ్చిన వలస కూలీలు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కూలీల రాకతో రాష్ట్రంలో మరోసారి క్రైమ్ రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఏడీజీ వివాదాస్పద రీతిలో లేఖ రాశారు. అంతేకాకుండా అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్న కూలీల వివరాలను నమోదు చేసుకోవాలని స్థానిక ఎస్పీలందరికీ ఆయన సూచించారు. (వారానికి ఒక్కసారైనా... లేదంటే జీతం కట్!) ఏడీజీ రాసిన లేఖలో ‘ఇనాళ్లూ దేశంలో ఎక్కడ ఒక చోటు ఏదో ఒక పని చేసుకుంటూ వలస జీవులు కాలం వెళ్లదీశారు. కూలీలపై పిడుగులా పడిన కరోనా వైరస్ వారిని నేరాలకు పాల్పడేలా చేసే అవకాశం ఉంది. ఉపాధి లేక కుటుంబ గడవక దోపిడీలు, దొంగతనాలకు పాల్పడొచ్చు. రాష్ట్రంలోని వచ్చిన వలస కార్మికుల రాకలను స్థానిక పోలీసు అధికారులు గమనించాలి.’ అని పేర్కొన్నారు. తాజా లేఖపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్తో పాటు మరికొందరు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను దొంగలతో పోల్చడం సరైనది కాదని, దీనికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల నుంచి విమర్శలు ఎక్కువతున్న తరుణంలో తన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏడీజీ కుమార్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. -
వలస కార్మికుడే హీరో
‘పండుగాడు ఫొటో స్టూడియో’ ఫేమ్ దర్శకుడు దిలీప్రాజా ‘లాక్డౌన్’ అనే టైటిల్తో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ‘లాక్డౌన్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్కు కేంద్ర సెన్సార్ బోర్డ్ ఆమోదం ఇచ్చినట్లుగా దిలీప్రాజా తెలిపారు. ఈ సినిమాను విజయ బోనెల, ప్రదీప్ దోనూపూడి నిర్మించనున్నారు. ఈ ‘లాక్డౌన్’ సినిమా గురించి దిలీజ్ రాజా మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్లో సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఒకవైపు కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలీల బతుకు చిత్రమే ‘లాక్డౌన్’. ఈ చిత్రంలో వలస కార్మికుడే హీరో. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అలాగే ‘యూత్: కుర్రాళ్ళ గుండె చప్పుడు’ అనే చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు దిలీప్రాజా. -
ఏడిపించే కొత్త ఏడు చేపల కథ
లాక్డౌన్ ప్రకటించగానే వాళ్లెందుకు నడుస్తున్నారు? సరదానా, పనీపాటా లేకనా, మధుమేహం రోగమా? సొంతూరికి బయలు దేరి వేలమైళ్లదూరాలు దాటడానికి అడుగులేస్తూ ప్రాణాలర్పిస్తున్న కార్మికులు వారు. ఇక్కడ రాజ కీయం కాదు, రాజ్యాంగాన్ని చూడాలి. పార్టీని కాదు, పాలకుల్ని అడగాలి. చట్టాల్ని కాదు, చట్టుబండలైన మానవత్వాన్ని అడగాలి. ప్రాణాంతకమైన నేరంచేస్తే, రుజువుచేసి ప్రాణం తీయడమే శిక్ష అని భావించినప్పుడు తప్ప మరే రకం గానూ ప్రాణం తీయవద్దని ఆర్టికల్ 21 జనం ప్రాణాలకు భరోసా ఇచ్చింది. అడుగడుగునా అరికాళ్ల రక్తపు మడుగులతో తడిసిపోతూ రాజ్యాంగమా ఉన్నావా అని అడుగుతున్నది. ఇది మన నాగరికత వేసిన కొత్త ముందడుగు అనుకొని మురిసిపోదామా లేక నిలదీసి అడుగుదామా? వలస కార్మికులను ఏడిపించే కొత్త ఏడు చేపల కథ. మొదటి చేప: అందరికన్నా ముందు, కరోనాకు విరుగుడు వ్యూహం లాక్ డౌన్ అని ప్రకటించిన వలస కూలీల జీవ రాశి ఉందనే విషయం గుర్తులేదు, అదే ఎండని మొదటి చేప. పత్రికలు టీవీలు గాడాంధకార కాంతి చిత్రాలు చూపిస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్ పురుషోత్తములు నిట్టూరుస్తున్నారు. పిల్లను చెత్తబుట్టలో వేస్తు న్నారు. కొత్తవి పడుతున్నాయి. రెండో చేప: జనవరి 30న కరోనా తొలి బలితీసుకున్నది. ఓవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తున్నా మార్చి 13న మనం ఇదేమంత ఎమర్జెన్సీ కాదన్నాం. ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాం. వలసకూలీలకు బతుకు భయమేసింది. నాలుగు గంటల నోటీసుతో భారత జాతీయ జనతా అష్టదిగ్బంధనం మార్చి 24న ప్రకటించారు. కోట్లాది వలస కూలీలు భవిష్యత్తు ఆలోచనకు నాలుగ్గంటలు, ప్రమాదమేమీ లేదనే హామీకి, దేశవ్యాప్తలాక్ డౌన్ కు మధ్య కేవలం రోజులు. మూడో చేప: వలస కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. తిండి, డబ్బు లేదు. యాజమాన్యాలు పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వం ఆజ్ఞాపించింది. అప్పటికే పని చోటుకు చాలాదూరమైపోయారు. రెండింతలు రేషన్ ఇస్తామన్నారు మార్చి 26న. వారిలో చాలా మందికి రేషన్ కార్డే లేదు. ప్రజాపంపిణీలో లేని 8 కోట్ల పేదలకు తిండి పదార్థాలు ఇస్తామని లాక్ డౌన్ 50వ రోజున ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడున్నారో తెలియని 8 కోట్లమందికి తిండిగింజలు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. నాలుగో చేప: శ్రామిక రైళ్లన్నీ వలస కూలీలకే. అందమైన పేరు. కాళ్లరిగేట్టు నెత్తురోడేట్టు తిరుగుతున్న కూలీలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఏప్రిల్ 29 న ప్రకటించింది ప్రభుత్వం. కూలీలు బయలుదేరిన రాష్ట్రం, చేరవలసిన రాష్ట్రం సమష్టిగా కోరితేనే రైళ్లిస్తామన్నారు. ఎవరు సమన్వయం చేస్తారు? కొన్ని రాష్ట్రాల వారికి కూలీలను బయటకు పంపే ఉద్దేశం లేదు. రాజకీయంగా నువ్వంటే నువ్వని తిట్టుకోవడానికి కొత్త సాకు దొరికింది. 58 రోజుల తరువాత వారి ప్రయాణాల సమన్వయానికి ‘జాతీయ వలసకూలీ సమాచార వ్యవస్థ’ను కేంద్రం ప్రకటించింది. అయిదో చేప: వలసకూలీలు హాయిగా సొంతూరికి రైల్లో పోవచ్చు. కాని కరోనాలేదని తేలిన తరువాతే. ఎవరిస్తారీ సర్టిఫికెట్? ఎంతిస్తే ఇస్తారు? ఆన్లైన్ ఫారం నింపాలట.ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తరువాత దానికేమైందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలి? ఇదంతా లాభం లేదని మళ్లీ నడక ప్రారంభించారు. ఆరోచేప: మోదీ ప్రభుత్వం 85 శాతం రైల్వే చార్జీలు భరిస్తాం అని చెప్పింది. ఎంత ఉదారత? రైల్వే పూర్తి చార్జీలు గోళ్లూడగొట్టి మరీ వసూలు చేసింది. ఎంత ఆర్థిక క్రమశిక్షణ? 2011 జనాభా లెక్కల ప్రకారం వలస కూలీలు 5 కోట్ల 60 లక్షలు. అసలు సంఖ్య ఆరున్నరకోట్లు. వీరంతా వెనక్కి రావడానికి రూ. 4,200 కోట్లు కావాలట. ఎవరిస్తారు– ఏ లాభమూ లేకుండా? ఏడో చేప: రైల్వే శాఖ 15 లక్షల మంది వలస కూలీలను తరలించామని సగర్వంగా చెప్పుకున్నది. మిగతా ఆరుకోట్ల 35 లక్షల సంగతేమిటి? వారే రోడ్ల మీద నడుస్తున్నది. పిల్లలను భుజాల మీద మోసుకుని, ముసలాయనను చక్రాల సూట్కేస్మీద, గర్భవతైన భార్యను చక్రాల చెక్కమీద, ఎందుకు వందల మైళ్లు లాక్కుపోతున్నారు? ఈ మధ్యలో కేంద్రప్రభువులు రాష్ట్రాలకు మళ్లీ ఉత్తర్వులు–‘రోడ్ల మీద కూలీలను నడవనీయకండి’ అని. ఉత్తరప్రదేశ్ కూలీలు రాష్ట్రం హద్దులు దాటడానికి వీల్లేదని ఉత్తర్వులు వేసింది. ఒక జిల్లాలో స్థానికులు కూడా వారికి సాయం చేయరాదని ఆదేశించింది. వలస కూలీలు ఓటర్లు కారా? లేక వారికి హక్కులు లేవా? వాళ్లను ఎవరు నడవమన్నారు? వాళ్లు అలా నడిచి వెళితే మేమేం చేయగలం అని అంటారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. మనం మనుషులమేనా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ (madabhushi.sridhar@gmail.com) -
వలస కార్మికుల కోసం; లాయర్ రూ.25 లక్షలు
ముంబై: ముంబై హైకోర్టు అడ్వకేట్ సాఘీర్ అహ్మద్ ఖాన్ సాఘీర్ అహ్మద్ ఖాన్ ఉత్తర ప్రదేశ్కు చెందిన వలస కార్మికులు ముంబైలో ఎదుర్కొంటోన్న వెతలను చూసి చలించిపోయారు. పైగా అతను కూడా యూపీవాసే కావడంతో వారిని తరలించేందుకు రూ.25లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ అతడి నిర్ణయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వలస కార్మికులు స్వస్థలాకు చేరుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో మే 15న పిటిషన్ దాఖలు చేశారు. (ఎవరు చెప్పినా ఆగని సెంటిమెంట్ ప్రయాణాలు) దీని కోసం రూ.25 లక్షలు చెల్లించేందుకు సిద్ధమేనంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం డబ్బులు చెల్లించాలనుకుంటున్నారా? అని అహ్మద్ ఖాన్ను ప్రశ్నించింది. దీనికి సదరు న్యాయవాది అవునని బదులు చెప్పగా పీఎం కేర్స్ ఫండ్పై తనకు నమ్మకం లేని కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో వారం రోజుల వ్యవధిలో డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. అనంతరం ఈ మొత్తాన్ని వలస కార్మికులను తరలించేందుకు మాత్రమే ఉపయోగించాలి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. (వలస కూలీలను అవమానపరిచినందుకు..) ఈ విషయం గురించి న్యాయవాది అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. "తొలుత ఈ విషయం గురించి నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాను. వలస కార్మికుల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. కానీ సమాధానమే రాలేదు. పైగా వారిని పంపించే విషయంలో రైలు టికెట్ల ఖర్చు ఎవరు భరిస్తారనేదానిపై రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. దీంతో నేను టికెట్ల ధరల కోసం రూ.25 లక్షల వరకు జమ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ మే 9న యూపీ నోడల్ అధికారికి, ముఖ్యమంత్రికి లేఖ రాశాను. అయినప్పటికీ వారు స్పందించలేదు. ఆఖరుకు నేను ముంబై పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం చెప్తే.. వాళ్లు ప్రతి వలస కార్మికుడి రెండు ఫొటోలు సమర్పించాలని తెలిపారు. అదీ ఈ లాక్డౌన్ సమయంలో! దీంతో విసిగిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించాను" అని చెప్పుకొచ్చారు. (ఒక కుటుంబం ఆరు చపాతీలు..) -
రియల్ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్
-
రియల్ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్
భోపాల్ : అచ్చం సినిమా సీన్ తరహాలో పరిగెడుతున్న రైలులో పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఒక నాలుగేళ్ల చిన్నారికి పాల పాకెట్ను అందించి రియల్ హీరోగా మారాడు ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ మానవతా దృక్పథానికి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కూడా ముగ్దులయ్యారు. వివరాల్లోకి వెళితే.. 33ఏళ్ల ఇందర్ సింగ్ యాదవ్ మధ్యప్రదేశ్లోని భోపాల్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీల కోసం బెల్గాం నుంచి గోరఖ్పూర్కు వెళుతున్న శ్రామిక్ రైలు అక్కడికి చేరుకుంది. అదే రైలులో హసీన్ హష్మి తన భార్య షరీఫ్ హష్మి, నాలుగేళ్ల చిన్నారితో కలిసి గోరఖ్పూర్లోని సొంతూరుకు వెళుతున్నాడు. అప్పటికే పాల కోసం నాలుగేళ్ల చిన్నారి గుక్క పట్టి ఏడుస్తున్నాడు. మధ్యలో రెండు మూడు రైల్వే స్టేషన్లలో రైలు ఆగినా వారికి పాలు దొరకలేదు. (విషాదం : కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయాయి) ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఇందర్ సింగ్కు చెప్పి తమకు సహాయం చేయాలని అర్థించారు. వెంటనే స్పందించిన ఇందర్ సింగ్ రైల్వే స్టేషన్ బయటకు పరిగెత్తి ఒక షాపులో పాలపాకెట్ను కొని మళ్లీ పరిగెత్తుకొచ్చాడు. కానీ అప్పటికే రైలు కదిలిపోయింది. కానీ ఇందర్ సింగ్ మాత్రం ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా రైలు వెంట పరిగెడుతూ చివరికి ఎలాగోలా షరీఫ్ హష్మికి కిటికీలోంచి పాలపాకెట్ను అందించాడు. ఈ వీడియో రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.ఇప్పుడు ఇందర్ సింగ్ రియల్ హీరోగా మారిపోయాడు. (పైలట్ తప్పిదం వల్లే ఆ ఘోర ప్రమాదం) ఈ వీడియోనూ చూసిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇందర్ సింగ్ నిజమైన హీరో అంటూ ట్విటర్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తాడు. ' ఇందర్ సింగ్ ఇవాళ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారి ఆకలి తీర్చేందుకు అతను చేసిన సాహసం నిజంగా అభినందించదగ్గది. కదులుతున్నరైలు వెంబడి పరిగెడుతూ చివరికి చిన్నారి తల్లికి పాలపాకెట్ అందించి గొప్ప మనుసును చాటుకున్నాడు.. ఇందర్ సింగ్' అంటూ పేర్కొన్నాడు. కాగా ఈ ఘటన మే 31న చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
28 వేల మందికి సోనూసూద్ సాయం..
ఆయన ‘చేతికి ఎముక లేదు’.. సాటి మనుషుల కష్టాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.. అసలు ఆ దాతృత్వ గుణం ముందు ఎవరూ నిలవలేరంటే అతిశయోక్తి కాదు.. ఎందుకంటే కోట్లాది రూపాయలు దానం చేసే మహానుభావులు ఎందరో ఉంటారు.. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు నేరుగా సాయం అందించే సోనూసూద్ లాంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. లాక్డౌన్ కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన ఆయన.. తాజాగా తుపాను ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. (సోనూసూద్పై సీఎం ప్రశంసల జల్లు) ఈ విషయం గురించి సోనూసూద్ పీటీఐతో మాట్లాడుతూ... ‘‘ఈరోజు మనమంతా చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఒకరికొరం అండగా నిలబడి ధైర్యంగా పోరాడాలి. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో నేను, నా బృందం తీర ప్రాంతాల్లోని దాదాపు 28 వేల మందికి ఆహారం అందించాం. వారిని సమీపంలోని స్కూళ్లు, కాలేజీలు తదితర పునరావాస కేంద్రాలకు తరలించాం. వారంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం’’అని చెప్పుకొచ్చారు. అదే విధంగా నిసర్గ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన 200 మంది అస్సామీ వలస కార్మికులను షెల్టర్ హోంకు తరలించినట్లు వెల్లడించారు. కాగా వలస కార్మికుల తరలింపు విషయంలో చొరవ చూపిన సోనూసూద్పై ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. (సోనూ మనసు బంగారం) ఈ క్రమంలో సోనూసూద్ సాయం పొందిన వారు ఆయనను దేవుడిగా అభివర్ణిస్తున్నారు. ఇక నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న తరుణంలోనూ.. ‘‘నిసర్గ కోసం సోనూసూద్ ఎదురుచూస్తున్నాడు. వెంటనే దానిని ఇంటికి పంపేస్తాడు’’ అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసరగా.. ‘‘రానివ్వండి.. పంపేస్తాను’’ అంటూ అంతే చమత్కారంగా సోనూసూద్ బదులిచ్చారు. కాగా అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను (నిసర్గ)గా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ వద్ద నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే కొన్ని గంటల్లోనే తుపాను ప్రభావం తగ్గిపోవడంతో ముంబై వాసులు ఊపిరిపీల్చుకున్నారు.(ఇక నుంచి అలవాటు చేసుకోండి: హీరో) -
వలస కార్మికులు.. వాస్తవాలు
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు అంతా ఇంతా కాదు. వారు ఓపిక పట్టలేక కాలి నడకన ఇళ్లకు బయల్దేరారంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వలస కార్మికులు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నది అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1. వలస కార్మికులు ఓపిక లేక ఇంటిబాట పట్టలేదు. వారికి ఉపాధి పోయింది కనుక ఇంటి బాట పట్టారు. 2. వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. ఇంటి అద్దె కట్టలేక, తినడానికి ఇంత తిండిలేక ఇంటి బాటపట్టారు. 3. లాక్డౌన్ కారణంగా 80 శాతం మంది పట్టణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అజిమ్ ప్రేమ్జీ యూనివర్శిటీ నిర్వహించిన సర్వే లెక్కలు తెలియజేస్తున్నాయి. 16 శాతం పట్టణ వాసులకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను కొనుగోలుచేసే శక్తి లేదు. 4. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు ఏ మూలకు సరిపోలేదు. మరోపక్క ప్రభుత్వ గిడ్డంకుల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు కుళ్లిపోయాయి. 5. వలస కార్మికుల తరలింపునకు వేసిన ప్రత్యేక శ్రామిక రైళ్లు వారికి ఏ మూలకు సరిపోలేదు. ఆ రైళ్లు ఎక్కిన వలస కార్మికులు అన్న పానీయాల కోసం అలమటించారు. 6. మే 9వ తేదీ నుంచి మే 27వ తేదీ మధ్య ఆకలితో, ఎండ తీవ్రతను తట్టుకోలేక రైళ్లలో 80 మంది వలస కార్మికులు మరణించారు. ఈ విషయాన్ని రైల్వే రక్షణ దళమే తెలియజేసింది. 7. వలస కార్మికుల కష్టాలు ఐదు రోజులో, ఐదు వారాలో కొనసాగలేదు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాలను ప్రభుత్వం రద్దు చేయడంతో వలస కార్మికులు దొరికిన వాహనాన్ని ఎక్కిపోవడానికి ప్రయత్నించడమే కాకుండా, కాలినడకన కూడా స్వస్థలాలకు బయల్దేరారు. రోడ్డు మార్గాల్లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 200 మంది కార్మికులు మరణించారు. చదవండి: కార్మికులకు ఓపిక లేకనే... అమిత్ షా -
‘డబుల్’కు ట్రబుల్!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పలు ఫ్లైఓవర్లు, అండర్పాస్లు పూర్తిచేసి ప్రారంభోత్సవాలు కూడా చేసిన జీహెచ్ఎంసీ..డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో మాత్రం వెనుకబడ్డది. ట్రాఫిక్ జంజాటాలతో నగరంలో ఇంజినీరింగ్ పనులకు క్లిష్ట సమస్యలుండేవి. లాక్డౌన్లో రోడ్లు ఖాళీ కావడంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇదే తరుణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు మాత్రం కుంటుపడ్డాయి. అందుకు కారణం కార్మికుల లేమి. వాస్తవానికి కాంట్రాక్టు ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉండటంతో గత సంవత్సరం ఆగస్టునుంచే పనులు కుంటుపడ్డాయి. చాలా చోట్ల నిలిచిపోగా..కొన్ని చోట్ల నామమాత్రంగా జరిగాయి. ఈ నేపథ్యంలో పనులు పూర్తి జోరుమీదున్నప్పుడు దాదాపు 50వేల మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. లాక్డౌన్ ప్రకటించడానికి ముందు దాదాపు పదివేల మంది మాత్రమే ఆయా ప్రాంతాల్లో పనుల్లో ఉన్నారు. ఇక లాక్డౌన్ ప్రకటించాక దాదాపు నాలుగువేల మంది మాత్రమే మిగిలారు. మిగతావారు తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. లాక్డౌన్ తరుణంలో పెండింగ్ బిల్లుల్లో 80 శాతం వరకు చెల్లించి పనులు వేగిరం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మునిసిపల్ మంత్రి కేటీఆర్ గతనెలలో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా(అప్పట్లో రైళ్లకు కూడా అనుమతి లేదు) స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులను రప్పించేందుకు సంబంధిత రాష్ట్రాలతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామని, వారిని తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా వాహనాలు సమకూర్చుకోవాలని కాంట్రాక్టు ఏజెన్సీలకు సూచించారు. ఈలోగా లాక్డౌన్ మినహాయింపులతో ప్రయాణానికి అవకాశం లభించినప్పటికీ, వలస కార్మికులు ఇప్పుడిప్పుడే తిరిగి హైదరాబాద్కు రావడానికి సుముఖంగా లేరని తెలిసింది. వీరిలో చత్తీస్గఢ్,బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వారెప్పుడొస్తారో తెలియడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై కూడా ఈ ప్రభావం పడనుంది. ఇళ్ల పనులు దాదాపుగా పూర్తయి.. మౌలిక సదుపాయాల పనులు జరగాల్సిన రాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహసముదాయం 50 వేల ఇళ్లు కష్టమే.. ఆగస్ట్ నెలాఖరుకు దాదాపు 50 వేల ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తుది దశలో పనులున్న ఇళ్లను పరిగణనలోకి తీసుకొని ఆ ప్రకటన చేయగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోగా అవి పూర్తి కావడం అసాధ్యమే. ఉన్న కార్మికులతోనే రేయింబవళ్లు పని చేయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతమున్న కార్మికులతోనే అవి పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. గ్రేటర్లో ‘డబుల్’ ఇళ్ల పరిస్థితి.. ♦ 117 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్లాన్. ♦ ఏడు ప్రాంతాల్లో (అహ్మద్గూడ,డి.పోచంపల్లిలో రెండు ప్రాంతాల్లో,బహదూర్పల్లి, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడ, చిత్తారమ్మ బస్తీ)8వేల ఇళ్లకు పైగా పూర్తి. ♦ దాదాపు 80వేల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ వీటిల్లో తుది దశ పనుల్లోదాదాపు 42వేల ఇళ్లు. ♦ ఆగస్టు వరకు మొత్తం 50 వేల ఇళ్ల పనులు పూర్తి కాగలవని భావించారు. ♦ కార్మికులు లేక కదలని పనులు ♦ లక్ష ఇళ్ల అంచనా వ్యయం దాదాపు : రూ.8,600 కోట్లు. -
ఏపీలో కరోనా టెస్టులు 4,03,747
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 8,066 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 4,03,747కు చేరింది. ప్రతి పది లక్షల జనాభాలో 7,561 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా అన్ని రాష్ట్రాల కంటే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా 180 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 3,971కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 94 వలస కూలీలకు చెందినవి కాగా, మరో 7 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి. మొత్తం కేసుల్లో 573 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, 119 విదేశాల నుంచి వచ్చినవారివి. 55 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,456కు చేరింది. కరోనాతో మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 68కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,447గా ఉంది. -
వలస కార్మికులను రప్పించే ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : కరోనా భయం.. లాక్డౌన్తో ఉపాధి కరవు.. వెరసి వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. వారిపై ఆధారపడ్డ అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్డౌన్కు సడలింపులు వచ్చి తిరిగి పనులు ప్రారంభమైనా, వలస కూలీలు లేకపోవటంతో ఇప్పుడు ఆ రంగాల్లో పని మొదలుకావట్లేదు. అవి పట్టాలెక్కాలంటే కచ్చితంగా వలస కూలీలు తిరిగి రావాల్సిందే. కాదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగాలి. వలస కూలీలే కీలకంగా ఉన్న నిర్మాణ రంగంలో ఇప్పుడు ఈ దిశగా ఏర్పాట్లు మొదలయ్యాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కార్మికులను తిరిగి రప్పించే చర్యలు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు లక్ష మంది కార్మికులతో సంప్రదింపులు జరిపి వారు తెలంగాణకు తిరిగి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో 80 వేల మంది వరకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. నిర్మాణ రంగంలో కీలకంగా ఉండే దాదాపు 12 రకాల ట్రేడ్స్లో స్థానిక యువకులకు శిక్షణ ఇచ్చి పనిలోచేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) తీసుకుంది. జిల్లాకు వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. రంగంలోకి లేబర్ కాంట్రాక్టర్లు.. నిర్మాణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేసేవారు. వీరికి సంబంధించి లెక్కల్లో స్పష్టత లేదు. ఏ విభాగం కూడా వీరికి సంబంధించిన అంశాలను నేరుగా పర్యవేక్షించే పద్ధతి లేకపోవటంతో ఎంతమంది, ఏయే రాష్ట్రాలకు చెందిన వారు పనిచేస్తున్నారో లెక్కల్లేవు. అయితే వలస కూలీలను సమకూర్చే బాధ్యత లేబర్ కాంట్రాక్టర్లది. మ్యాన్ పవర్ సప్లయర్స్ తరహాలో వీరు వ్యవహరిస్తారు. బడా నిర్మాణ సంస్థలు తమకు ఎంతమంది కార్మికులు కావాలో వీరికి చెబితే, వీరు ఆయా రాష్ట్రాల్లో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి పనుల్లో పెట్టేవారు. వీరికి ఆయా రాష్ట్రాల్లోని లేబర్ కాంట్రాక్టర్లతో ప్రత్యక్ష సంబంధాలుంటాయి. ఇప్పుడు వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవటంతో వారిని తిరిగి రప్పించే బాధ్యత కూడా లేబర్ కాంట్రాక్టర్లకే అప్పగించారు. బడా నిర్మాణ సంస్థలే ఈమేరకు పురమాయించాయి. దీంతో రంగంలోకి దిగిన లేబర్ కాంట్రాక్టర్లు ఆయా రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్ఘఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నవారిలో కదలిక వస్తున్నట్టు సమాచారం. ముందు వెళ్లిన వారే.. సాధారణంగా వలస కార్మికులు ప్రతి సంవత్సరం వారి సొంత ప్రాంతాలకు వెళ్తారు. గత డిసెంబర్ నుంచి లాక్డౌన్ వరకు కూడా దాదాపు 50 వేల మందికిపైగా వెళ్లారు. లాక్డౌన్ తర్వాత దాదాపు రెండున్నర లక్షల మంది వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక గత డిసెంబర్ నుంచి మార్చి లోపు వెళ్లిన వారిపై లేబర్ కాంట్రాక్టర్లు దృష్టి సారించారు. వారు ఈ పాటికే తిరిగి పనుల్లోకి రావాల్సి ఉండగా, లాక్డౌన్ వల్ల సొంత ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారు. కొద్ది నెలలుగా పనుల్లేక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడినట్లు సమాచారం. దీంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పటంతో పాటు, నిర్మాణ స్థలాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపడుతున్నందున భయం లేదని పేర్కొంటున్నారు. ఆయా కార్మికులు ఉంటున్న ప్రాంతాల్లో కూడా కరోనా ప్రభావం ఉన్నందున, ఆ ప్రాంతం కూడా సురక్షితం కాదని వారు భావిస్తున్నారు. అదే తిరిగి తెలంగాణకు వస్తే డబ్బులు వస్తాయన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గల్ఫ్ నుంచి వచ్చిన వారి కోసం.. కరోనా భయంతో ఎడారి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ కార్మికులు తిరిగి వచ్చారు. వారు పనుల్లేకుండా ఖాళీగా ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణ రంగంలో వీరికి పనిచేసిన అనుభవం ఉంది. దీంతో వీరిని కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. అందులో వారు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గల్ఫ్ దేశాల్లో యంత్రాలతో పని ఎక్కువ. మన వద్ద మనుషులే చేస్తారు. యంత్రాలతో పనులకు అలవాటు పడ్డ వారికి స్వయంగా చేసే విషయంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీలైనంత తొందరలో ఈ మొత్తం ప్రక్రియలు పూర్తి చేసి నిర్మాణ రంగానికి ఊపు తేవాలని నిర్మాణ సంస్థలు, న్యాక్ యంత్రాంగం భావిస్తోంది. న్యాక్ కీలక భూమిక ఇప్పటికిప్పుడే యువత పనుల్లోకి వచ్చేలా జిల్లాకు వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్ణయించింది. కనిష్టంగా 30 వేల మంది సిద్ధమవుతారని అంచనా. 12 రకాల ట్రేడ్స్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ప్లంబింగ్, వైరింగ్, తాపీ పని, సెంట్రింగ్, రంగులు వేయడం మొదలు.. సైట్ సూపర్వైజింగ్ వరకు శిక్షణ ఇస్తారు. దశల వారీగా వీరిని సిద్ధం చేస్తారు. తరగతి గదుల్లో శిక్షణ ఇవ్వాలంటే.. ప్రస్తుతం లాక్డౌన్తో అనుమతి లేనందున పని ప్రదేశాల్లోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బడా నిర్మాణ సంస్థలతో న్యాక్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
వారంతా రోడ్లపై, రైల్వే స్టేషన్లలో ఎందుకున్నారు?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక్ రైళ్లలో పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదింపులు చేసి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రంలోని వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు పంపేందుకు ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వలస కార్మికులను ప్రభుత్వ ఖర్చులతోనే పంపాలని, సుప్రీంకోర్టు/కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విపత్తులు సంభవించినప్పుడు వలస కార్మికుల తరలింపు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు నిర్దిష్ట విధానాన్ని ఖరారు చేయాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని కూడా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. (మేరా భారత్ మహాన్ కావాలంటే..) రెండు వ్యాజ్యాలపై మరోసారి విచారణ ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులపై ఎస్.జీవన్కుమార్.. లాక్డౌన్ కారణంగా మేడ్చల్ రోడ్డులో మండుటెండలో నడిచి వెళ్లే వలస కార్మికులపై ప్రొఫెసర్ రమా శంకర్ నారాయణ మేల్కొటి దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. వలస కార్మికుల గురించి హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ కౌటూరు పవన్కుమార్ తమ నివేదికను ధర్మాసనానికి నివేదించారు. మేడ్చల్ జాతీయ రహదారిలో వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నారని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఇటుక బట్టీల్లో ఇంకా 20 వేల మంది వరకు వలస కార్మికులున్నారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. అయితే లక్షన్నర మంది వరకు ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులు ఉండిపోయారని పిటిషనర్ న్యాయవాది వసుధా నాగరాజన్ వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. నిజంగానే ప్రభుత్వం వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపి ఉంటే ఇప్పటికీ వారంతా రోడ్లపై, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో ఎందుకున్నారని ప్రశ్నించింది. (సీఎం ఇంటికి బాంబు బెదిరింపు) బస్సుల్ని డిపోలకే పరిమితం చేయడానికి బదులు వాటిని వినియోగించి వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు పంపొచ్చునని సూచన చేసింది. వలస కార్మికుల నుంచి టికెట్ల చార్జీలను వసూలు చేస్తే ప్రభుత్వమే చట్టాలను ఉల్లఘించినట్లు అవుతుందని హెచ్చరించింది. ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. రాష్ట్రంలో 1,081 ఇటుక బట్టీల్లో పనిచేసే 53,145 మంది కార్మికుల్లో 23,332 మందిని ఇప్పటికే తరలించామన్నారు. వలస కార్మికుల కోసం ఆహారం, వసతి, వైద్యం వంటివి కల్పిస్తున్నామన్నారు. అడ్వొకేట్ కమిషన్ పవన్కుమార్ వాదనలు వినిపిస్తూ.. వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. మేడ్చల్ రోడ్డులో వెళ్లే వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ పరిసరాలకు తీసుకురండి. వలస కార్మికులను హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిసరాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ‘ఈ విధంగా తరలించిన వారిని రైలు, బస్సుల్లో ఉచితంగా వారి ప్రాంతాలకు పంపే చర్యలు తీసుకోవాలి.. వారికి నివాసయోగ్యమైన ఫంక్షన్ హాల్స్లో వసతి ఏర్పాట్లు చేయాలి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాలకు శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపునకు రైల్వే శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలి. ఇలా చేయలేనప్పుడు సాధారణ రైళ్లలో వలస కార్మికుల కోసం 4 ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టాలి. ఇలా తరలించే వారి పేర్ల నమోదుకు వీలుగా తెలుగురాని వారి కోసం ప్రత్యేక చర్యలు అవసరం. బస్సుల్లో వారి రాష్ట్ర సరిహద్దులకు తరలించి అక్కడి నుంచి ఆయా రాష్ట్రాలు తమ కార్మికుల్ని తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలి. (సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక!) షెల్టర్లోని నివాసమున్న పిల్లలు, బాలింతలు, మహిళలు, వృద్ధులు, రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వీరికి సరైన ఆహారం, తాగునీరు, వైద్యం అందజేయాలి. ఇటుక బట్టీల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని వారి గురించి వివరాలు సేకరించి నివేదిక రూపొందించాలి. దాని మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు ఉచిత బస్సు రవాణా ఏర్పాట్లు చేయాలి. కార్మికుల తరలింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫలితాలను నివేదించాలి..’అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. -
మేరా భారత్ మహాన్ కావాలంటే...
ప్రపంచంలో ఐదవ అతి పెద్దఆర్థిక వ్యవస్థ అయిన భారతమాత గర్భంలో దాగివున్న అత్యంత దారు ణమైన పేదరికాన్ని కరోనా మహ మ్మారి ప్రపంచానికి బహిరంగ పరి చింది. దేశ విభజన సమయంలో చూసిన ఘోర దృశ్యాలను మళ్లా చూస్తున్నాం. వేల మైళ్లు కాలినడకన వెళ్లే కార్మికులు, వందల కిలోమీటర్లు గాయపడ్డ తండ్రిని సైకిల్ మీద తీసుకెళ్లిన సాహస బాలిక, కాలినడకతో వెళ్తూ ప్రసవించి, అప్పుడే జన్మించిన పసి గుడ్డుకు కొంగుకప్పి మళ్లీ కిలోమీటర్ల దూరం నడిచిన ఒక బీద భావి భారతమాత, ప్రాణం పోయినా సరే ఇంటికి చేరు కోవాలనే తపనతో ఏది దొరికితే దానిలో ప్రయాణించిన భారతదేశ ప్రగతి కారకులు, మన వలస కార్మికులు. దీనికితోడు వారిని తమ స్వస్థలానికి పంపే విషయంలో శ్రామిక్ రైళ్లు ఎవరు వేయాలి? ఖర్చు ఎవరు భరించాలన్న విషయంలో కూడా రాజకీయం. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటం లేకుండా లక్షలాదిమందిని రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పంపడం శుభపరిణామం. వివిధ సర్వేల ప్రకారం దాదాపు 50 కోట్ల శ్రమశక్తి ఉంటే, అందులో 20 శాతం అంటే 10 కోట్ల మంది వలస శ్రామికులు. అంతర్ రాష్ట్రాల వలస శ్రామికులు దాదాపు 6.5 కోట్ల నుండి 7 కోట్లు ఉంటారు. అందులో 30 శాతం రోజువారీ కూలీలు, 30 శాతం వివిధ నెలవారీ ఉద్యోగులు, 30 శాతం వివిధ అనధికార ఉద్యోగాలు, వ్యాపారాలలో ఉంటారు. ఇక వీధి విక్రేతలు, చిరు వ్యాపారులు దాదాపు 1.6 – 1.8 కోట్ల మంది. గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం ఉంటారు. వలస శ్రామికుల ఎగుమతి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి తెలం గాణకు, కొద్దిమంది తెలంగాణ నుండి ముఖ్యంగా స్కిల్డ్ వర్కర్లు ముంబై, గుజరాత్ వలస వెళ్తారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ నుండి 25 శాతం, బిహార్ నుండి 14 శాతం, రాజస్తాన్ నుండి 6 శాతం, మధ్యప్రదేశ్ నుండి 5 శాతం ఉంటారు. నిశితంగా గమనిస్తే ఉత్తర, ఈశాన్య భారత దేశం నుండి దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజ రాత్కు ఎక్కువ వలస వెళ్తారు. అదే విధంగా ఢిల్లీ, పంజా బ్లకు వెళ్తారు. సగటు వలస శ్రామికుల నెల ఆదాయం 7,000–12,000 రూపాయలు. పేదరికం అనే రోగానికి వలస శ్రామికుల సమస్య ఒక లక్షణం మాత్రమే. 231.85 లక్షల కోట్ల రూపాయల స్థూల దేశీయ ఉత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కానీ ఒక వ్యక్తి ఏడాది తలసరి ఆదాయం కేవలం 1,75,000 రూపాయలు మాత్రమే. అది కూడా అంబానీ నుండి హమాలీ వరకు ఉన్న ఆదాయం సగటు కలిపి చేస్తేనే. ప్రపంచంలో మన ర్యాంకు 140. ఇక అత్యధిక బిలియనీర్లు (102) ఉన్న దేశాలలో మాత్రం 4వ ర్యాంకు మనది. అమె రికా తలసరి ఆదాయం 50,57,025 రూపాయలతో 7వ స్థానంలో ఉంటే, చైనా 8,15,475 రూపాయలతో 70వ స్థానంలో ఉన్నది. భారతదేశ సంపద 2018 లెక్కల ప్రకారం సుమారు 900 లక్షల కోట్లు ఉంటే, అందులో 1 శాతం మంది దగ్గర 51.5 శాతం, 9 శాతం మంది దగ్గర 17.1 శాతం, 30 శాతం మంది దగ్గర 17.8 శాతం, 60 శాతం మంది దగ్గర 4.7 శాతం సంపద ఉంది. ప్రపంచీకరణ తరువాత సంపద పెరిగింది. కానీ ఆ సంపద టాప్ 10 శాతానికే దక్కింది. భారత్ ధనిక దేశం. కానీ అత్యధికమంది భారతీయులు పేద రికంలో ఉన్నారు. వలస శ్రామికులు కింద ఉన్న 60 శాతం లోని అతి పేదరిక వ్యాధిగ్రస్తులు. ఒక రాష్ట్ర ఆదాయం పెర గాలంటే ప్రకృతి సంపదతో పాటు సమర్థవంతమైన పాలన కూడా అవసరం. రాజకీయ వేధింపులు, అసమర్థ నాయ కత్వం వలన ప్రకృతి సంపద ఉన్న రాష్ట్రాలు కూడా అభి వృద్ధిలో వెనుకబడ్డవి. ఒకప్పుడు బెంగాల్ ఇవ్వాళ ఏం ఆలో చిస్తదో, రేపు భారత్ ఆలోచిస్తది అనే నానుడి ఉండేది. దశా బ్దాలుగా హింసాయుత రాజకీయాల వలన ఈ రోజు వెనుకబడిపోయింది. వలస కార్మికుల సామాజిక పరిస్థితులు గమనిస్తే అత్యధిక మంది హిందువులు, అందులో ప్రధానంగా దళిత, ఆదివాసీ, బీసీ వర్గాలు కనిపిస్తాయి. కులం శ్రామిక, ఆర్థిక దోపిడీ పునాదుల మీద ఏర్పడ్డ ధార్మిక ఫ్యూడల్ వ్యవస్థ. దాని ఫలితం ప్రపంచీకరణ తరువాత ఆర్థిక అసమానతలు అత్యంత వేగంగా పెరిగాయి. బహుజనులు ఆర్థిక ప్రగతి ఫలాలు అందుకునే అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయినవి. ఇది వర్ణ వ్యవస్థ వలన వచ్చిన మానసిక రోగం. వర్ణ వ్యవస్థ ఇంకా సమాజంలో పూర్తిగా సంక్రమించని ప్రాచీనకాలం అయిన నంద, మౌర్య, దక్షిణ భారత్లో పాండ్య, చోళరాజ్యాలు ఉన్నప్పుడు ప్రపంచంలో భారతదేశ జీడీపీ వాటా 23 శాతం. కానీ నేడు కేవలం 3 శాతం. పావర్టీ నిల్, మిడిల్ క్లాస్ ఫుల్, రెస్పాన్సిబుల్ రిచ్. అంటే 70 శాతం మిడిల్ క్లాస్, 20 శాతం అప్పర్ మిడిల్ క్లాస్, 10 శాతం రిచ్ క్లాస్ ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా పెరుగుతుంది. సంపద పెంచాలి – సంపద పంచాలి అనే నినాదం అమలు కావాలి. రాజకీయ అధికారం అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు అంబేడ్కర్. ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాలలో వారసత్వ సంపద పన్ను ఉంటది. ఫ్రాన్స్లో 75 లక్షలు, ఇంగ్లండ్, జర్మనీ, బెల్జియంలో 3 కోట్లు, జపాన్లో 1.75 కోట్లు, అమెరికాలో 38 కోట్ల ఆస్తి దాటి, తమ వారసులకు, అయినవారికి ఆస్తి ఇవ్వాలంటే 30–48 శాతం దాకా ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అందువల్లే బిల్గేట్స్, వారెన్ బఫెట్ లాంటి కుబేరులు ప్రభుత్వానికి పన్ను కట్టే బదులు, లక్షల కోట్ల సంపద సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. కానీ మనదేశంలో లక్ష కోట్ల ఆస్తి కూడా తమ వారసులకు ఒక్క పైసా పన్ను లేకుండా బదలాయించవచ్చు.! ప్రభుత్వాలు పేద, మధ్యతరగతికి ప్రధాన ఆర్థిక ఇబ్బం దులు కలిగించే విద్య, వైద్యం మీద ఎంతగా ఖర్చు పెడితే, అంతగా పేదరికాన్ని తగ్గించి, మధ్యతరగతిని పెంచవచ్చు. అంతిమంగా భారతదేశాన్ని 2050 నాటికి ప్రపంచంలో అత్యంత ఎక్కువ జీడీపీ ఉన్న దేశంగా తీర్చిదిద్దవచ్చు. కులమత వర్గరహిత సమతుల్య ఆర్థిక అభివృద్ధి, పరిశోధన రంగం బలోపేతం, పని సంస్కృతి, అవినీతి రహిత సమాజ నిర్మాణం, పరిపాలన సరళీకరణ, న్యాయ వ్యవస్థల బలో పేతం ద్వారా 2050 వరకు మేరా భారత్ను మహాన్గా ఆవిష్కరించవచ్చు. వ్యాసకర్త : డా. బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ, భువనగిరి -
కార్మికులకు ఓపిక లేకనే....అమిత్ షా
సాక్షి, ‘కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బస్సులను, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొంత మంది కార్మికులు ఓపిక పట్టలేక కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం నాడు ‘సీఎన్ఎన్–న్యూస్ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా వైరస్ను అరికట్టడంలో భాగంగా కేంద్రం మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించింది. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడం కోసం ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం బస్సులను అనుమతించింది. మే ఒకటవ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈలోగా కొంత మంది వలస కార్మికులు దొరికిన ప్రైవేటు వాహనం పట్టుకొని స్వస్థలాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తును వారు వెళుతున్న వాహనాలు ప్రమాదాలకు గురవడం వల్ల దాదాపు 200 మంది వలస కార్మికులు మరణించారు. కాలి నడకన బయల్దేరిన వారిలో కొందరు అలసిపోయి, ఎండవేడిని తట్టుకోలేక మరణించారు. మే 9 నుంచి మే 27 మధ్యన రైళ్లలో ఆకలికి తట్టుకోలేక, ఎండవేడికి జబ్బుపడి 80 మంది మరణించారని రైల్వే రక్షణ దళం లెక్కలే తెలియజేస్తున్నాయి. ‘ఐదారు రోజులపాటు జరిగిన కొన్ని సంఘటనలు బాధాకరం. ఆ తర్వాత వలస కార్మికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బస్సులను, రైళ్లను ఏర్పాటు చేసింది. అందుకోసం రాష్ట్రాలకు 11 వేల కోట్ల రూపాయలను అందజేసింది. బస్సుల ద్వారా 45 లక్షల మందిని, రైళ్లు ద్వారా 55 లక్షల మందిని స్వస్థలాకు చేర్చాం’ అని అమిత్ షా తెలిపారు. కొంత మంది మాత్రమే కాలినడకన ఇళ్లకు బయల్దేరారని షా తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది వలస కార్మికులు కాలి నడకన ఇళ్లకు బయల్దేరారని మీడియా లెక్కలు తెలియజేస్తున్నాయి. , , -
మరో 94 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. ఇ ప్పటివరకు కేసుల సంఖ్య 2,792కు చేరుకుంది. సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 79 నమోదయ్యాయి. అలాగే ఇతర జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశా రు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రా ష్ట్రానికి చెందిన కేసులు 2,358 ఉండగా, వలస కార్మికులు, సౌదీ అరేబియా, సడలింపుల తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కేసులు 434 ఉన్నాయి. అందులో వలస కార్మికులకు సంబంధించినవి 192, సౌదీ అరేబి యా నుంచి వచ్చినవి 212 కేసులు ఉ న్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 88 మంది చనిపోయారు. మొత్తం 1,491 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,213 మంది చికిత్స పొందుతున్నారు. గత 14 రోజు లుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భద్రాద్రి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేకు కరోనా.. హైదరాబాద్లో ఓ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. దీంతో ఆయనను సోమవారం జూబ్లీహిల్స్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. లాక్డౌన్ సమయంలో నిత్యం ప్రజల కు నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంలో ఆయ నకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిం ది. అలాగే, ఉస్మానియా మెడికల్ కాలేజీలో సోమవారం మరో ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. -
24 గంటల్లో 10,567 మందికి పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 34 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,366కు చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 10,567 మందికి పరీక్షలు నిర్వహించగా 105 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సోమవారం నమోదైన కేసుల్లో 8 కోయంబేడుకు సంబంధించినవి ఉండగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 28 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,676కు చేరుకుంది. ఇందులో 446 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, 234 కోయంబేడు కేసులు, 112 విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కోవిడ్ వల్ల కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 64కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,246గా ఉంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
ఖాట్మండూ: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది వలస కార్మికులు మృత్యువాత పడగా.. 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నేపాల్లోని సల్యాన్ జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు ఉపాధి కోసం భారత్లోని ఉత్తరప్రదేశ్లో గల బరేచ్ జిల్లాకు వలస వచ్చారు. కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వీరంతా ఓ ప్రైవేటు వాహనంలో స్వస్థలానికి పయనమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నేపాల్లోని బాంకే జిల్లా అడవి సమీపంలోకి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడిక్కడే మరణించారు.(కొత్త మ్యాప్పై నేపాల్ పార్లమెంటులో బిల్లు) ఈ ఘటన గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ‘‘భారత్ నుంచి వస్తున్న వలస కార్మికుల వాహనం ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్ జరిగింది. మృతదేహాలు, క్షతగాత్రులను నేపాల్గంజ్ సిటీలోని భేరి ఆస్పత్రికి తరలించాం. అతివేగం కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు భావిస్తున్నాం. మృతుల్లో 11 మంది పురుషులు, ఒక స్త్రీ ఉన్నారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉంది’’అని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. భారత్ నుంచి వస్తున్న పౌరుల కారణంగానే నేపాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని.. భారత్ వైరస్ ప్రాణాంతకమైనదంటూ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.(భారత్పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!) -
‘నా భర్తతో కలిసి ఉండలేను.. సాయం చేయండి’
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు సాయం చేస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్కు వేలల్లో విన్నపాలు పోటెతుతున్నాయి. అందులో కొన్ని స్వస్థలాలకు చేరవేయాలని వస్తుండగా మరి కొంతమంది విచిత్ర కోరికలు కోరుతున్నారు. అలా వింతైన ప్రశ్నలు, అభ్యర్థనలు వచ్చినప్పటికీ ఏమాత్రం విసుక్కోకుండా వారందరికీ ఓపిగ్గా సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో తన గర్ల్ఫ్రెండ్ను కలవాలని ఇటీవల ఓ వ్యక్తి సోనూసూద్ను కోరిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఎదురైంది. లాక్డౌన్ కాలంలో తన భర్తతో కలిసి ఉండలేకపోతున్నానని, తనను భర్తతో వేరు చేయాలని సుష్రిమా ఆచార్య అనే మహిళ సోనూసూద్కు ట్విటర్ ద్వారా అభ్యర్థించింది. (ప్రత్యేక విమానం.. సోనూసూద్పై సీఎం ప్రశంసలు) ‘సోనూసూద్.. జనతా కర్ఫ్యూ నుంచి లాక్డౌన్-4 వరకు నేను నా భర్తతోనే ఉంటున్నాను. ఇప్పుడు అతన్ని బయటకు పంపించండి. లేదా నన్ను మా అమ్మ వాళ్ల ఇంటికి పంపించగలరా.. ఎందుకంటే ఇకపై నేను అతనితో కలిసి ఉండలేను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సోనూసూద్ మహిళకు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం. ఏమంటారు’ అంటూ బదులిచ్చారు. (‘అలా జరిగితే నన్ను క్షమించండి’) I have a better plan .. let me send both of you to Goa😂 What say? https://t.co/XbYNFWWflK — sonu sood (@SonuSood) May 31, 2020 కాగా పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి కరోనా కోరల్లో చిక్కుకున్న వందలాది వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు సోనూసూద్ సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేరళలోని ఏర్నాకులంలో చిక్కుకున్న దాదాపు 180 మంది అమ్మాయిల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని స్వస్థలానికి చేర్చారు. ఇదిలావుండగా ఇటీవల సోనూసూద్ సాయం పొందిన ఓ వలస మహిళ కృతజ్ఞతా భావంతో తన పిల్లవాడికి సోనూసూద్ అని నామకరణం చేశారు. (ఆ నటుడు వాడిన పాస్కు నెటిజన్ల ఫిదా..) -
ఒక కుటుంబం ఆరు చపాతీలు..
లాక్డౌన్లో వలస కార్మికులకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి ఎంతో సేవాగుణం గలవారు చేస్తున్న సాయం గురించిన కథనాలు వింటున్నాం. చూస్తున్నాం. నోయిడాకు చెందిన ఎల్డికో గ్రీన్ మిడ్జ్ సొసైటీ మహిళలు మరో ప్రత్యేకమైన చొరవ తీసుకొని వలస కార్మికులకు, తమ ఇళ్లకు చేరుకోలేని వారికి పేదప్రజలకు సాయం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుండి ఆరు చపాతీలను సేకరించి పేదలకు పంచుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఎల్డికో గ్రీన్ మిడ్జ్ సొసైటీ భవన సముదాయాలలో నివసిస్తున్న మహిళలు పేదలకు ఏ విధంగానైనా సహాయం చేయాలనుకున్నారు. వారుంటున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్లలో దాదాపు 8వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ 100 ఇళ్లలో ఒక్కో కుటుంబం నుంచి ఆరు రొట్టెలను సేకరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా సేకరించినదానికి రోటీ బ్యాంకు అని పేరు పెట్టారు. రోటీ బ్యాంక్ దగ్గర వివిధరకాల కూరగాయలనూ ఉంచారు. ఇప్పటివరకు వేలాదిమంది పేదలకు ఈ రోటీ బ్యాంక్ నుండి సహాయం అందుతోంది. ఏకాభిప్రాయం ఈ సొసైటీలో నివసించే సుమితా వైద్య మాట్లాడుతూ ‘ఇక్కడ చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. వారు తమ కుటుంబాలను చూసుకుంటూనే వివిధ సంస్థలలో కూడా పనిచేస్తారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు ఎన్నో కిలోమీటర్ల దూరం నడుస్తున్నట్లు టీవీ న్యూస్ ఛానెళ్లలో చూస్తున్నాం. గ్రేటర్ నోయిడా, నోయిడాలో నివసిస్తున్న కార్మికుల బాధాకరమైన వార్తలను చూసి అందరం బాధపడ్డాం. ఆ తరువాత మహిళలందరితో మాట్లాడటం ద్వారా పేదవారికి సహాయం చేయడానికి ఒక ఏకాభిప్రాయం ఏర్పడింది. మహిళలందరూ కలిసి వలస కార్మికులకు ఒక కుటుంబానికి 6 రోటీలు ఇస్తామని నిర్ణయించుకున్నాం. దీనిలో సామాజిక కార్యకర్తల సహాయం కూడా తీసుకున్నాం’ అని వివరించారు. ఈ పనిలో దిగువ, మధ్య, ఎగువ అని తేడా లేకుండా మహిళలందరూ పాల్గొంటున్నారు. లాక్డౌన్ 2.0 నుండి ఈ మహిళలు సృష్టించిన రోటీ బ్యాంక్ వేలాది మంది పేదలకు రొట్టెలను పంపిణీ చేసే పని చేస్తూనే ఉంది. గృహిణి అంజలి సింగ్ మాట్లాడుతూ – ‘చిన్న పిల్లలున్న కార్మికులను గుర్తించాం. వారు తినడానికి చాలామంది బియ్యం ఇస్తున్నారు. కాని రోటీస్ రావడం లేదు. దీనితో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు. బృందాల వారీగా సేవ సామాజిక కార్యకర్త హరేంద్ర భాటి మాట్లాడుతూ ‘మహిళలందరూ ఉదయం 9 గంటల సమయంలో తమ ఇళ్లలో రోటీలను సిద్ధం చేస్తారు. ఒక వ్యక్తి పెట్టెను పట్టుకొని ప్రతి ఇంటికీ వెళ్లి బెల్ కొడతాడు. ఆ కుటుంబంలో ఉన్న మహిళ రోటీలను ఆ పెట్టెలో ఉంచుతుంది. ఇందుకోసం మహిళలు సొసైటీని మండలాలుగా విభజించి తమను తాము గ్రూపులుగా విభజించుకున్నారు. వారు ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. మొత్తం సొసైటీ నుండి ఆహారాన్ని సేకరించిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకు బాక్స్ మెయిన్ గేటుకు పంపిస్తారు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించేందుకు మరొక బృందం ఆ గేటు వద్దకు చేరుకుంటుంది. ఇలా బృందాలుగా సేవ చేస్తున్న ఎల్డికో గ్రీన్ మిడ్జ్ సొసైటీ మహిళలను అందరూ ప్రశంసిస్తున్నారు. -
మన బాధ్యత
వలస కార్మికుల కోసం ఎవరికి వీలైన సహాయం వాళ్లు చేస్తున్నారు. వాళ్లను సొంత ఊళ్లకు పంపుతూ కొందరు, వాళ్లకు కావాల్సిన సరుకులను అందిస్తూ మరికొందరు సహాయం చేస్తున్నారు. నిధీ అగర్వాల్ కూడా తన వంతు సహాయంగా వలస కార్మికులకు కావాల్సిన ఆహారాన్ని (బ్రెడ్ మరియు జామ్) అందిస్తున్నారు. వాటిని ఆవిడే స్వయంగా ప్యాక్ చేస్తున్నారు కూడా. ఇక్కడ ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘వలస కూలీలకు ఆహారం. వాళ్లకు సహాయపడటం మన బాధ్యత’’ అన్నారు నిధీ అగర్వాల్. -
రైల్వేల నిర్వాకంతోనే..
సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీల దుస్థితికి రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వాకమే కారణమని కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా మండిపడ్డారు. ‘శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారు..40 శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి..ప్రయాణీకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నా’యని ప్రియాంక ఆరోపించారు. పరిస్ధితులు ఇలా ఉంటే బలహీనంగా ఉన్నవారు రైళ్లలో ప్రయాణానికి దూరంగా ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొనడం దిగ్ర్భాంతికరమని ఆమె అన్నారు. కరోనా కట్టడికి ప్రకటించిన దేశవ్యాప్త లాక్డౌన్తో వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో వేలాది వలస కార్మికులు స్వస్థలాలకు తరలివెళుతూ పలువురు మార్గమధ్యలో తనువు చాలించిన ఘటనలు నివ్వెరపరిచాయి. చదవండి : ‘నాన్న నాకు ఇచ్చిన బహుమతులు ఇవే’ -
వలస కూలీలను అవమానపరిచినందుకు..
ఫిరోజాబాద్ : వలస కార్మికుల పట్ల చిన్నచూపుతో వ్యవహరించిన సీనియర్ రైల్వే అధికారిని సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గత సోమవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. డికె దీక్షిత్ ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్లో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గత సోమవారం దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా తన టీంతో కలిసి ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చారు. అయితే దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా బిస్కెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంతలో వలసకూలీలకు సంబంధించిన శ్రామిక్రైలు అక్కడికి చేరుకొంది.దీక్షిత్ వారికి కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వాలని తన టీంకు తెలిపాడు. (విశాఖ జిల్లాలో విషాదం) అయితే టీం సభ్యులు బిస్కెట్ పాకెట్లను వారి చేతికి అందివ్వకుండా బిస్కెట్ పాకెట్లను చింపి ఒక్కో బిస్కెట్ను కంపార్ట్మెంట్లోకి విసిరారు. ఈ సందర్భంగా దీక్షిత్ టీంలోని సభ్యుడు గట్టిగా అరుస్తూ..' ఈరోజు మా సార్ దీక్షిత్ పుట్టినరోజు. అందుకే బిస్కెట్లు పంచుతున్నాం' అంటూ పేర్కొన్నాడు. అయితే వలస కూలీలు మరికొన్ని బిస్కెట్ పాకెట్లు ఇవ్వాలని కోరితే మీకు ఇచ్చిన దాంట్లోనే సరిపెట్టుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేగాక కిందపడిన బిస్కెట్లు వేస్ట్ కాకుండా తీసుకొని తినేయండి అంటూ వలసకూలీల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది కాస్తా అక్కడి లోకల్ ఆఫీసర్ తన వాట్సప్ గ్రూఫ్లో షేర్ చేయగా వైరల్గా మారింది.('పటాసులు కాల్చండి.. డ్రమ్ములు వాయించండి') విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దీక్షిత్తో పాటు అతనితో ఉన్న టీమ్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.వలసకూలీలపై అవమానకరంగా ప్రవర్తించడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తన ట్విటర్లో పేర్కొంది. సరిగ్గా వారం కిందట ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆహరం కోసం వలసకూలీలు ఒకరిని ఒకరు తోసుకున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. వలసకూలీలపై వివక్ష చూపిస్తూ రైల్వే అధికారులు ఇలా చేయడం దారుణం అని అభివర్ణించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ రైల్వేశాఖ అధికారులను కోరింది. -
ఏపీ నుంచి సొంత రాష్ట్రాలకు 86,863 మంది వలస కార్మికులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 86,863 మంది వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో వీరిని స్వస్థలాలకు పంపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం వలస కార్మికులకు ప్రయాణ టికెట్లు, ఆహారంతోపాటు ప్రతి ఒక్కరికీ రూ.500 ఇచ్చి శ్రామిక్ రైళ్లలో వారిని పంపింది. నడిచి వెళుతున్న కార్మికులను ఎక్కడికక్కడ ఆపి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పునరావాస శిబిరాలకు తరలించారు. మొత్తం 281 పునరావాస శిబిరాలతోపాటు జాతీయ రహదారుల వెంబడి ఆహారం అందించేందుకు 110 క్యాంపులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 75 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను తరలించింది. రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు కార్మికుల తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని అధికారులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో.. ప్రస్తుతం ఒక్క పశ్చిమ బెంగాల్కు వెళ్లే కార్మికులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ వరదల కారణంగా ఈ నెల 26 వరకు శ్రామిక్ రైళ్లను పంపొద్దని అక్కడి ప్రభుత్వం కోరింది. రెండుమూడ్రోజుల్లో మూడు శ్రామిక్ రైళ్లలో వారిని తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మన రాష్ట్ర పరిధిలో 90 వేల మంది వలస కూలీలను 3 వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో ఆయా జిల్లాలకు పంపారు. గుంటూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో వలస కూలీలు ఇతర జిల్లాలకు తరలివెళ్లారు. ఏపీకి చెందిన 4,852 మంది వలస కూలీలు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, బెంగళూరు నుంచి ఆరు రైళ్లలో రాష్ట్రానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లి గుజరాత్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చింది. వలస కూలీల పట్ల రైల్వే ఉదారత ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం మీదుగా వెళ్లే వలస కూలీలకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహారాన్ని అందించింది. ఎన్జీవోలూ రైల్వే స్టేషన్లలో వలస కూలీలకు ఆహారాన్ని పంపిణీ చేశాయి. దాదాపు 3.5 లక్షల మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించామని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, విజయవాడ డివిజన్ మీదుగా ఈ నెల 2 నుంచి 25 వరకు 225 శ్రామిక్ రైళ్లు నడిచాయి. -
వలస కార్మికులొచ్చారు
నిజామాబాద్ అర్బన్: /జగిత్యాలక్రైం/కరీంనగర్ రూరల్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి శనివారం తొలి శ్రామిక్ రైలు వచ్చింది. ముంబై నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వచ్చిన ఈ ప్రత్యేక రైలులో 214 మంది ప్రయాణికులు దిగారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 162 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన వారు 23 మంది ఉన్నారు. అలాగే.. జగిత్యాల రైల్వేస్టేషన్లో 842 మంది, కరీంనగర్ స్టేషన్లో 44 మంది దిగారు. వలస కార్మికులు ప్లాట్ఫాంపై చేరుకోగానే పోలీసు భద్రత మధ్య ఆయా మండలాల వారీగా వైద్య ఆరోగ్య శాఖ పేరు, అడ్రస్, సెల్నంబర్లు సేకరించి, జూన్ 15 వరకు హోం క్వారంటైన్లో ఉండేలా చేతులపై స్టాంపులు వేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించారు.