Musi River
-
చతుర్భుజం.. మూసీ పునరుజ్జీవం..!
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో కాలుష్యమయంగా మారిన మూసీ నదికి నాలుగు దశల్లో పునరుజ్జీవం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతలో నదీ జలాల శుద్ధితోపాటు వర్షపునీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే రెండో దశలో ల్యాండ్స్కేపింగ్ను అభివృద్ధి చేసి నది సహజసిద్ధ లక్షణాన్ని పునరుద్ధరించాలనుకుంటోంది. ఇక మూడో విడతలో మూసీ పరీవాహక కారిడార్లలో రవాణా హబ్లను ఏర్పాటు చేయాలని, నాలుగో దశలో ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం కసరత్తు మొదలుపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) తొలి విడత పనులకు రూ. 5,863 కోట్లు అవసరమని అంచనా వేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం (రూ. 1,763 కోట్లు) నిధులను సమకూరిస్తే మిగిలిన 70 శాతం (రూ. 4,100 కోట్లు) నిధులను ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ (పీపీఆర్)ను అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టు పూర్తి..హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయిలో మూసీ పునరుద్ధరణకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. మూసీ నదిని శుద్ధి చేసి పర్యాటక, వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈస్ట్–వెస్ట్ కారిడార్ నిర్మాణం.. మూసీ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే కుటుంబాలకు పునరావాసం కల్పించడంతోపాటు మూసీ భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన భూముల కోసం ల్యాండ్ పూలింగ్ను ప్రభుత్వం చేపట్టనుంది. నది వెంట తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ కారిడార్ను నిర్మించనుంది. దీనివల్ల ఔటర్ రింగ్రోడ్ నుంచి ప్రధాన నగరంలోకి రవాణా సులువు కానుంది. అలాగే మూసీ చుట్టూ 16–18 ప్రాంతాల్లో హెరిటేజ్ బ్రిడ్జీలను నిర్మించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపారస్తుల కోసం స్థలాలను కేటాయించనుంది. మూసీ వెంబడి రిక్రియేషనల్ జోన్లు, పార్క్లను కూడా ఏర్పాటు చేయనుంది. రీసైకిల్ వాక్వేలు, పార్కింగ్ ప్లేస్లు.. మూసీ పరిసర ప్రాంతాల్లో రీసైకిల్ చేసిన వస్తువులు, ఉత్పత్తులతో వాక్ వేలు, పార్కింగ్ ప్రాంతాలను ప్రభుత్వం నిర్మించనుంది. అలాగే వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని రెయిన్ గార్డెన్లు, గ్రీన్ రూఫ్లను ఏర్పాటు చేయనుంది. వరదలు, విపత్తుల నిర్వహణకు ఎలివేటెడ్ స్ట్రక్చర్లు, ఫ్లడ్ బారియర్లను కట్టనుంది. వరద ముప్పును పసిగట్టడం, నీటి నాణ్యత, నీటి ప్రవాహాలను సమర్థంగా నిర్వహించడంతోపాటు వనరుల కేటాయింపు, ప్రణాళిక, నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్), కృత్రిమ మేథ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనుంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా నిధులను సమకూర్చే సంస్థలకు గ్రీన్బాండ్లను జారీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్పానర్ప్లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనుంది. -
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం పచ్చిఅబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మూ సీ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్కు సెపె్టంబర్లో పంపించిన ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని, కానీ, శాసనమండలి సాక్షిగా మంత్రి శ్రీధర్బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు సమాధానం చెప్పారని విమర్శించారు.ప్రపంచ బ్యాంకుకు మూసీ కోసం ఋణం అడిగిన సాక్ష్యాధారాల నివేదికల ప్రతులను ఆమె విడుదల చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ, హైదరాబాద్ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి భవంతులు కడతామని స్పష్టంగా పేర్కొందని కవిత విమర్శించారు. -
మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?
గత నలభై సంవత్సరాలుగా మూసీ నది మృత్యుగానం వినిపిస్తోంది. 1997లో ఈ వ్యాసకర్త మూసీ కాలుష్యం తీరు తెన్నులపై, దాని పరివాహక ప్రాంతంలోని గ్రామాలపై కాలుష్య ప్రభావం గురించి రాసిన పరిశోధనా వ్యాసంలోని అంశాలు... ఆ ప్రాంత ప్రజలను కదిలించాయి. ముఖ్యంగా ఎదులాబాద్ గ్రామ ప్రజలు చేసిన పోరాటం మరువలేనిది. మేధాపట్కర్, గజేంద్రసింగ్లు కూడా మూసీ కాలుష్యం, దాని ప్రభావం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఉద్యమానికి సంఘీబావం ప్రకటించారు. విషపూరిత రసాయనాలతో, మానవ, పశువుల విసర్జనాలతో నిండిన ఈ కలుషిత నీరే అత్యధిక ధాన్య (వడ్లు) ఉత్పత్తికి దోహదపడింది. నిజాం రాచరిక పాలన కాలంలో నిర్మించిన 23 కత్వల (చిన్న ఆనకట్టలు) ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఏర్పాటు జరిగింది. నేడు సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.‘పిలాయిపల్లి కాల్వ’, ‘బునాది గాని కాల్వ’ అనే రెండు కొత్త కాలువల నిర్మాణం ఇటీవల జరిగింది. అంటే అవే 23 కత్వల కింద ఆయకట్టు దాదాపు పదమూడు రెట్లు పెరిగిందన్నమాట! ఇదెలా సాధ్యమైనట్టు? 1925లో జంట నగరాలకు తాగునీటి సరఫరా రోజుకు 23 మిలి యన్ గాలన్స్గా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ ఈ రోజు రమారమి 600 మిలియన్ గాలన్స్గా ఉంది. ఇందులో 80 శాతం నీరు వాడిన తర్వాత తిరిగి మూసీలో కలుస్తోంది. ఈ కలుషిత నీరే నదిని జీవనదిగా మార్చింది. ఈ నీరే పైన ఉదహరించిన 2 లక్షల ఎకరాల వరి సాగుకు మూలం. లక్షలాది టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఎందరికో పని దొరుకు తోంది. అదే సమయంలో కాలుష్య జలాల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.హానికరమైన రసాయనాలతో నిండిపోయిన నది ఉపరితల జలాలు, భూగర్భజలాలు, ఆహార గొలుసంతా విషతుల్యమయింది. బియ్యం, పాలు, కాయగూరలు దేనికీ మినహాయింపు లేదు. బాధ్యతా రహితంగా కంపెనీలు రసాయన వ్యర్థాలను ట్రీట్మెంట్ చేయకుండా నదులు, చెరువులు, వాగుల్లోకి వదిలి వేస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. జంట నగరాల చుట్టూ ఉన్న కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాలు మూసీనే కాకుండా వందకు మించిన చెరువులకు కూడా మరణ శాసనం లిఖిస్తున్నాయి. నిజానికి ఇవ్వాళ దేశంలో చాలా నదుల స్థితి ఇదే. తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిమిత వనరులను జాతి శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచి ఉందన్న భారత సైన్స్ సంస్థ బాధ్యులు డాక్టర్ రామచంద్ర ప్రభు హెచ్చరికల్ని ప్రభుత్వాలు ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీలులేదు.జల వనరుల కాలుష్యం వల్ల ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు ‘నీతి ఆయోగ్’ లెక్క గట్టింది. ఈ మధ్యనే విడుదలయిన నదుల నీటి నాణ్యత ఇండెక్స్లో మూసీ నది నీటిలో ఆక్సిజన్ స్థాయులను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయులు 1–4 మధ్యన ఉండాల్సింది... నల్లగొండ జిల్లా వివిధ ప్రాంతాలలో 13, 15 స్థాయులుగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలలో 258 నదులపై స్విస్ సంస్థ ఒకటి ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. 2022 సంవత్సరంలో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా మారిన నదులలో మూసీ నది 22వ స్థానంలో ఉంది. నదిలో 48 రకాల రసాయన అవశేషాలు ఉన్నట్టు ఆ పరీక్షలలో తేలింది. ఈ రసాయనాల వల్ల మనుషులు వివిధ రకాల క్యాన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, గొంతునొప్పి వంటి రోగాల బారిన పడతారని తెల్చింది. ఈ రోగాల ముప్పు అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉంది. ప్రజలు, పశు పక్ష్యాదుల ఆరోగ్యాలకు ముంచుకొస్తున్న ముప్పు నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడటాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రక్షాళన, సుందరీకరణ చేసి తీరుతామని చెప్పటం ఒక శుభ పరిణామం. ఈ విషయంలో సీఎం సీరియస్గానే ఉన్నారనే విషయం స్పష్టంగానే కపిస్తోంది. అందుకు ఆయనను అభినందించాలి.చదవండి: నీటి యుద్ధాలు రానున్నాయా!అయితే ఈ సమస్యపై అధికార ప్రతిపక్షాల మధ్య సాగు తున్న వాదోపవాదాలు కొంత గందరగోళానికి దారి తీశాయి. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ప్రాజెక్టుపై తన కార్యచరణను తలకిందులుగా మొదలు పెట్టడమే కాకుండా హైడ్రాతో ముడిపెట్టింది. దాంతో నదిలో ఉన్న నివాసాల తొలగింపు మొదలైంది. ఇక్కడ రెండు విషయాల పట్ల ప్రభుత్వం స్పష్టంగా ఉండాలె. ఒకటి నది ప్రక్షాళన అయితే, రెండోది నది ప్రాంత సుందరీకరణ. ఈ రెండింటినీ ఏక కాలంలో చేపట్టాల్సిన అవసరం లేదు. ఏది ముందు ఏది తర్వాత అనేది ప్రశ్న. జవాబు స్పష్టమే! ముందు ప్రక్షాళన, తర్వాతే సుందరీకరణ. నది ప్రక్షాళన కోసం చేయాల్సిందేమిటి? కంపెనీల నుంచి వెలువడే హాని కరమయిన రసాయనాలను, మావన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదిలోనికి వదలొద్దు. వ్యర్థాల శుద్ధి కోసం సమగ్రమైన ప్రణాళిక అవసరం. పెట్టుబడి, పట్టుదల నిజాయితీతో కూడిన కార్యాచరణ ఎంతో అవసరం. ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక. నదికి మొలసిన ఈ నారీ పుండ్లను తొలగిస్తేనే సుందరీకరణ సాధ్యం.చదవండి: ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?ఈ సుందరీకరణకు ముందు జరగాల్సింది చాలా ఉంది. ముందు నది వైశాల్యాన్ని తేల్చాలి. దాని వాస్తవిక వైశాల్యం ఎంత ? భారీ వరద వస్తే ఎంత ఎత్తున పారుతుందో (నది పారు ప్రాంతం) గుర్తించాలి. దాని లోపల నివాసాలు ఉన్నట్లయితే తొలగించాల్సిన/సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భూసేకరణ చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంది. నిర్వాసితుల పునరావాసానికి, వారి ఆర్థిక సామాజిక, సాంస్కృతిక పునర్నిర్మాణానికి 2013 చట్టాన్ని పాటించాలి, ఇంకా మెరుగుపర్చుకోవాలి. నది ప్రక్షాళన, సుందరీకరణ ఎంత ముఖ్యమో ప్రజల జీవితాలు అంతకన్నా ముఖ్యం. ప్రాజెక్టు పేరుతో ఇప్ప టికే ఉన్న ఒక ఆర్థిక, సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నా మన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలె. అప్పుడే కూల్చిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆలోచనాపరంగా అడ్డంకులు ఉండవు. ప్రకటించిన ప్రాజెక్టులను ప్రజాగ్రహం మూలంగా వెనుకకు తీసుకోవాల్సిన అవసరం రాదు. ప్రభుత్వానికి ఈ విషయంలో సరైన సలహాలు అవసరం.- ఆచార్య కట్టా ముత్యం రెడ్డి ప్రెసిడెంట్, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ -
మూసీ కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది పరీవాహకంతోపాటు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తి సర్వే నిర్వహించాలని సూచించింది. ఇందుకు పిటిషనర్లు, ఆక్రమణదారులు సహకరించాలని చెప్పింది. అవసరమైతే అధికారులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ కొత్తపేట్లోని న్యూ మారుతీనగర్వాసులు దాఖలు చేసిన పిటిషన్లో ఈ మేరకు విచారణను ముగించింది. అధికారులు తమ ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూ మారుతీనగర్కు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకున్నామని.. ఆస్తిపన్ను, నల్లా పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి.. అధికారులకు, పిటిషనర్లకు పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు. హైకోర్టు సూచనలివీ... – ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమించినట్లు తేలితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలి. – మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలి. – పట్టణాభివృద్ధి శాఖ 2012లో జారీ చేసిన జీవో 168 ప్రకారం ఇచ్చిన బిల్డింగ్ రూల్స్ను కచ్చితంగా పాటించాలి. – మూసీలోని ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లోని కేసుల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలతోపాటు 2023 నవంబర్ 8న ఆక్రమణలపై జారీ చేసిన సర్క్యులర్లోని సూచనలను మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టులు పాటించాలి. – మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల స్థిరీకరణ కోసం అధికారులు చేపట్టే సర్వేలను పిటిషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోవద్దు. – సర్వే కోసం వెళ్లే నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి. – తెలంగాణ నీటిపారుదల చట్టం–1357 ఫస్లీ, వాల్టా చట్టం 2002లోని నిబంధనల ప్రకారం నదులు, నీటివనరులు, చెరువులు, సరస్సుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు, భూ కబ్జాదారులపై అధికారులు తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
లారీకి రూ.25 వేలు తీసుకుని కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్న ముఠా
-
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే... మానవీయంగా!
మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!- జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
ఏ తల్లి కన్నబిడ్డో..!
చాదర్ఘాట్: ఏ తల్లి కన్నబిడ్డో. ఓ పసికందు అనాథగా మారాడు. శనివారం ఉదయం వాహెద్నగర్ (ఓల్డ్ మలక్పేట్) మూసీ నది ఒడ్డున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పసికందు ఏడుస్తున్న శబ్దం విన్న స్థానికులు చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో అజంపురా డివిజన్లోని ముస్లిం మెటరి్నటీ హాస్పిటల్లో పసికందుకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఐ భరత్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
-
రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు.‘‘కోటిమంది డ్రైనేజీ నీళ్లు మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా?..రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యింది. డీపీఆర్ రావడానికి రెండేళ్లు పడుతుంది. ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయండి. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దు. హుస్సేన్ సాగర్లో కొబ్బరినీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్కి వెళ్లాడు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి’’ కిషన్రెడ్డి డిమాండ్ చేశారు...మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి. నల్లగొండ రైతులకు న్యాయం చేయండి. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సీఎం గా రేవంత్ పనిచేస్తారు’’ అంటూ కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
KTR: కేసులు పెడతామని ఎవరు బెదిరించినా భయపడొద్దు
-
KSR Live Show: మూసీ యుద్ధం..
-
ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా: రేవంత్రెడ్డి
సాక్షి, వరంగల్ జిల్లా: బీఆర్ఎస్, బీజేపీ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని.. జెండా, అజెండా పక్కనపెట్టి మూసీ అభివృద్ధికి ప్రయత్నించాలంటూ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు దోచుకోవడమే తెలుసు, ప్రజల కష్టాలు తెలియవంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.‘‘ఒకప్పుడు మూసీలో అరుదైన చేపలు బతికేవి. ఇప్పుడు మూసీ నదిలో చేపలు బతికే పరిస్థితి లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో కల్లును అమ్ముకునే పరిస్థితి లేదుమూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంత వాసులకు వరంగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు, కూరగాయలు, పాలు కలుషితం అయ్యాయి. మూసీ నీటితో పండించిన పంటలకు మంచి ధర రావడం లేదు. నల్గొండ జిల్లాను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ వెంటాడుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘మూసీ కాలుష్యంతో అణుబాంబు కంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. మోదీ సబర్మతి ఫ్రంట్ రివర్, గంగానది ప్రక్షాళన చేస్తే అద్భుతం అంటున్నారు. మరి మేం మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా?. మూసీ ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు?. ఎవరు అడ్డువచ్చినా మూసి ప్రక్షాళన చేసి తిరుతాం. ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
మూసీ నదిలో రేవంత్ రెడ్డి పర్యటన
-
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్పై, అమీన్పూర్ తహసిల్దార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
మూసీ పునరుజ్జీవ యాత్ర చేపట్టనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
-
ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ‘‘ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నిళ్లు ఇవ్వాల్సిందే. కృష్ణా, గోదవారి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. మూసీకి రిటైనింగ్ వాల్ కట్టాలి.. సీటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కులగణనకు మేం వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని అన్నారు. -
పేదల ఇళ్ల జోలికి రావద్దు: కిషన్ రెడ్డి
-
కిలోమీటర్కు రెండు వేల కోట్లా.. మూసీపై క్లారిటీ ఉందా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై సీఎం రేవంత్కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు అంటూ ఆరోపించారు.ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించింది.. ఇప్పుడు విషం కక్కుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా?.మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమని చెప్పు. అలా వెళ్తే ప్రజలు వాళ్లను గంప కింద కమ్ముతారనే భయం ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని మరోసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర కోట్ల ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే.బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
మూసీ పేరిట కాంగ్రెస్ భారీ దోపిడీ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు(శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు...మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసీని కాంగ్రెస్కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైందిసంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. -
మూసీ నివాసితులను వెంటాడుతున్న కూల్చివేతల భయం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నివాసితులను కూల్చివేతల దడ వెంటాడుతూనే ఉంది. నదీ ప్రక్షాళన రాజకీయ కేంద్ర బిందువుగా మారి తాత్కాలికంగా కూల్చివేతల ప్రక్రియ నిలిచినా.. భవిష్యత్తులో మళ్లీ వీటి బెడద తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నివాసితులు తమ ఇళ్లను రక్షించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటుండగా.. మరికొందరు సామాజిక కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోరాటం ఆందోళనలు సైతం ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు అధికారేతర రాజకీయ పక్షాలు అండగా తామున్నామంటూ పరీవాహక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల పర్యటనలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.కోర్టును ఆశ్రయించిన నివాసితులు మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2,166 నివాసాలు నదీ గర్భంలో ఉన్నట్లు డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల బృందం ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో 68 శాతం ఇళ్లకు మార్కింగ్ చేశారు. కొన్ని గృహాలను కూలీల సహకారంతో కూల్చివేశారు. దీంతో కొందరు మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, కొత్తపేటలోని దాదాపు 620 కుటుంబాలు కోర్డులో పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో 400 నివాసాలకు స్టే వచ్చింది. మరోవైపు ఇటీవల వేసిన ఆర్బీ మార్క్ను సైతం ఇళ్ల యజమానులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ కమిషన్కు దళిత కుటుంబాలు మూసీ పరివాహకంలో నివాసాలు కూల్చకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్ను దళిత కుటుంబాలు ఆశ్రయించాయి. కూలిపనులు చేసుకొని జీవనం సాగించే తమ ఇళ్లను అర్ధాంతరంగా కూల్చివేస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాదర్ఘాట్, శంకర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు పోస్టుకార్డు ఉద్యమం మూసీరివర్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి, గవర్నర్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లకు పోస్టు కార్డులు రాసి పంపించారు. గతంలో చేపట్టిన డ్రోన్ సర్వేపై ఆధారపడకుండా తిరిగి భౌతికంగా సర్వే చేస్తే మూసీకి దగ్గరలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లను వదిలే ప్రసక్తిలేదని నివాసితులు తేల్చి చెబుతున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొంటున్నారు.చదవండి: షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. డోర్లాక్ పేరుతో అడ్డగోలు బాదుడుపక్కా నిర్మాణాలతోనే సమస్య.. మూసీ పరీవాహక పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30 శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో శాశ్వత నిర్మాణాలతో సమస్య తీవ్రమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చేబుతున్నారు. దీంతో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. -
మూసీ అభివృద్ధికి కాదు.. మీ దోపిడీకి వ్యతిరేకం
నాగోలు (హైదరాబాద్): మూసీ పునరుజ్జీవం కో సం రూ.26 వేల కోట్లు మించని వ్యయాన్ని లక్షన్నర కోట్లు కావాలని చెబుతుంటే ఎలా అంగీకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మీరు చేసే దోపిడీకి వ్యతిరేకమని అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో కలిసి ఆయన నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నాగోల్లో 320 ఎంఎల్డీ సామ ర్థ్యంతో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభు త్వాలేనని ఆరోపించారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి కోసం రూ.3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తోందని చెప్పారు. మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ కట్టండి బీఆర్ఎస్ హయాంలో మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లు తలెత్తకుండా మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్ నిర్మించాలనుకున్నామన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని చెప్పారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తెలిపారు. మూసీకి రెండువైపులా రిటై నింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బంగారి లక్ష్మా రెడ్డి, వివేకానంద్గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. -
మూసీపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్
-
కేటీఆర్ అతి తెలివి.
-
మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్..!
-
సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్
-
మెగాస్టార్, సూపర్ స్టార్ను మించిన నటుడు రేవంత్: హరీష్ రావు
సాక్షి, తెలంగాణభవన్: రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మెగాస్టార్, సూపర్ స్టార్ను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఉంది. మూసీ పునరుజ్జీవనం అని చెబుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ పునరుజ్జీవనం అంటే నదీ జలాల శుభ్రంతో ప్రక్రియ ప్రారంభం కావాలి. కేసీఆర్ హయంలో మూసీలోకి గోదావరి నీళ్లు తెచ్చేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైంది.సీఎం మాటలతో అబద్దమే ఆశ్చర్యపోతోంది. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. శత్రుదేశాలపై దాడి చేసినట్టు పేదల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. మెగాస్టార్, సూపర్ స్టార్ను మించిన నటుడు రేవంత్ రెడ్డి. ఐదేళ్లలో రూ.లక్షా 50వేల కోట్లతో మూసీని ప్రక్షాళిస్తామన్నారు. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు.మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చర్చకు నేను సిద్ధం. రేపు(శనివారం) ఉదయం తొమ్మిది గంటలకు నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను రెడీ. సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్దాం. బాధితులకు మాట్లాడేందకు మీరు వస్తారా?. వారి వద్దకు వచ్చే దమ్ముందా? రివర్ ఫ్రంట్ ఏంటి..?. దాన్ని వెనుకున్న స్టంట్ ఏంటి? అని ప్రశ్నించారు. ముందు మూసీ వద్దకు పోదాం. తర్వాత కొండ పోచ్చమ్మ సాగర్, మల్లన్నసాగర్, కిష్టాపూర్ వద్దకు వెళ్దాం అన్నారు. మూసీలో పరివాహక ప్రాంతంలో నివాసం ఉండటానికి నేను సిద్ధం. 10వేల మందికి సహాయం అవుతుంది అనుకుంటే మూడు నెలలు కాదు నాలుగు నెలలు మూసీ పక్కనే నివాసం ఉంటాను. కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది నాకు కృతజ్ఞత ఉండాలని రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కృతజ్ఞత ఉండాలి. నేను మంత్రి అయినప్పుడు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ చేసిండు. నేను అమరవీరులకు నివాళులర్పిస్తుంటే.. రేవంత్ రెడ్డి నా వెనకాల నిలబడి హైట్ తక్కువ ఉంటాడు కదా.. కెమెరాల్లో కనపడాలని నక్కి నక్కి చూశాడు. మా మద్దతుతోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మూసీ సుందరీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్ -
పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది.👉ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది👉మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది👉మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (పర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అయింది👉మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించింది👉బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసింది👉మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కెసిఆర్ నాయకత్వానిది👉ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైంది. దేశంలోనే ధాన్యరాశిగా మారింది👉పేదల కంట కన్నీరు లేకుండానే Paris, Bogota, Mexico City, Montreal లను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకుంది👉మూసీ నదికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ పక్కన పెట్టుబడి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మనీ స్పిన్నింగ్ కోసమా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ?👉ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. సమావేశాల్లో తల కిందకి, మీదకి తిప్పితేనో అభివృద్ధి జరగదు👉ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటూ ప్రభుత్వ బడి పిల్లల ఇజ్జత్ తీయకు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడతారు. ప్రపంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు.పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందిఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది…— KTR (@KTRBRS) October 18, 2024 -
మూసీ నది సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూసీపై సీఎం తీరు అర్థరహితం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు అర్థరహితంగా ఉందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం కీలక ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపింది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ప్రతిపాదించి, చాలా వరకు పూర్తి చేసినట్లు కేటీ రామారావు పలు సందర్భాల్లో వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎస్టీపీల నిర్మాణ పనులను ఇటీవల కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సందర్శించారు. -
‘మూసీ’ ప్రజల జీవనప్రమాణాలు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: మురుగునీటితో నిండిన మూసీని బాగు చేస్తున్నట్టే.. పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరి గాలికి వదిలేయబోమని, వారి జీవన ప్రమాణాలు మారుస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, రాజకీయపక్షాల నాయకులు, సామాజిక నాయకుల సలహాలు, సూచనలు కూడా వింటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలు, అభివృద్ధి విజన్ను మూసీ పరీవాహక ప్రాంతవాసులకు వివరించా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీలో నివాసముంటున్న వారికి పట్టాలు ఉన్నా. లేకున్నా వారంతా తెలంగాణ బిడ్డలేనని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మూసీకి దగ్గరున్న ప్రభుత్వ భూముల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మూసీ నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళాసభ్యులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేసి సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వారికి చెప్పాలన్నారు. ప్రజలకు మేలు జరిగే సూచనలు ఇస్తే అమలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు. ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి ఆదాయ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో భట్టి ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేíÙంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదాయం పెంపునకు నిర్దిష్ట ప్రణాళికతో రావాలన్నారు. లొసుగులను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్య పన్నుల కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆయా విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల విక్రయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరాలంటే ఏం చేయాలో సీనియర్ అధికారులు ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్రాజ్, వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి రిజ్వీ, గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
Hydra: కూల్చివేతలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకం పరిధిలోని నివాసాల కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీగర్భం, బఫర్ జోన్లో గుర్తించిన నివాసాలకు పునరావాసం, పరిహారం అంశాలు తేల్చాకే కట్టడాల తొలగింపునకు ముందడుగు వేయాలని సర్కారు పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడటంతో రెవెన్యూ యంత్రాంగం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నదీ గర్భంలో సైతం రెడ్ మార్కింగ్ నిలిచిపోగా, నివాసాలు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్లకు తరలిన కుటుంబాల ఇళ్లను సైతం కొన్నింటిని మాత్రమే కూలీలతో కూల్చివేశారు. మిగతా కూల్చివేత పెండింగ్లో పడింది. కొన్ని ఉమ్మడి కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించినా..వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై మూసీ పరీవాహకం పరిధిలోని నివాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో అధికారులు ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. సర్కారు మాత్రం మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని పేర్కొంటున్నా...నివాసితులకు పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యగా తయారైంది. ఆదిలోనే హంసపాదు మూసీ ప్రక్షాళనకు ఆదిలోనే హంసపాదు ఎదురైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నదీ పరీవాహకం పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన నివాసాలపై రెడ్మార్కింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. నివాసితుల నుంచి త్రీవ వ్యతిరేకత ఎదురుకాగా, సగం ఇళ్లకు మాత్రమే రెడ్ మార్క్ వేసి వెనుకకు తగ్గక తప్పలేదు. మరోవైపు నివాసితులకు ప్రతిపక్ష పారీ్టల మద్దతు పెరగడంతో వారు సైతం ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో నదీగర్భంలో రెడ్మార్క్ వేసిన గృహాల జోలికి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పరీవాహక పరిధిలో 12,184 పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని రెండుగా వర్గీకరించి నదీగర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నదీగర్భంలో 2,166 నిర్మాణాలు ఉండగా, అందులో 288 భారీ నిర్మాణాలున్నాయి. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు గల బఫర్జోన్ పరిధిలో 7,851 ఆక్రమణలు, ఇందులో 1032 బడా నిర్మా ణాలున్నట్లు అ«ధికారులు గుర్తించారు. మిగతా పరిధిలో 3004 అక్రమ కట్టడాలున్నట్లు బయటపడింది. పునరావాసంపై అయోమయం మూసీ నదీ గర్భంలోని నివాసితులు పునరావాసం సమస్యగా తయారైంది. అధికార లెక్కల ప్రకారం 2166 డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉంటుంది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కుటుంబాలను పునరావాసం కల్పించాల్సిన ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో మొత్తం మీద ఖాళీగా ఉన్న గహాలు 500కు పైగా కూడా లేనట్లు తెలుస్తోంది. నివాసాలు ఖాళీ చేసిన సుమారు 10 శాతం కుటుంబాలకు పునరావాసం కల్పించగలిగారు. సైదాబాద్, హిమాయత్నగర్,æ నాంపల్లి మండలాల్లోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన 193 మందిని మలక్పేటలోని పిల్లిగుడిసెలు, జియా గూడ, ప్రతాపసింగారం, జంగంమెట్లోని రెండు పడకల గృహసముదాయానికి తరలించారు. మిగతా వారికి పునరావాసంపై ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
హైడ్రాపై హైరానా వద్దు.. హైదరాబాద్ అంటేనే రాక్స్, లెక్స్: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని భట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ..‘చెరువుల ఆక్రమణ హైదరాబాద్కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాక్స్, లెక్స్ అండ్ పార్క్స్. కాలక్రమేనా పార్క్స్ అండ్ లేక్స్ కబ్జాలకు గురి అయ్యాయి.చిన్న వర్షం పడితేనే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమే. మూసీపై ప్రజలకు కొందరు భ్రమలు కల్పిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు 2024 వరకు కబ్జాకు గురైన చెరువులపై సర్వే చేశారు. హైదరాబాద్లో 20 పార్కులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు. చెరువులు కబ్జా కాకూడదు అనేదే మా ఆలోచన. మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఎజెండా మాత్రమే కానీ.. వ్యక్తిగత ఎజెండాలు లేవు.మన ఆస్తులు మనకు కావాలి.. కాపాడుకోవాలి అని తెలంగాణ తెచ్చుకున్నాం. కోరి కొడ్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత మనమీద ఉంది. గత పాలకులు బాధ్యత లేకుండా పాలన చేశారు. కబ్జాకు గురైన కట్టడాలను కూల్చాలని కేటీఆర్, హరీష్ అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వక్రీకరిస్తున్నారు. మూసీ బాధితులకు ఆదుకుంటాం. ఇళ్లకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. మూసీ బాధితులను ఆదుకునేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. మూసీ గర్భం, ఎఫ్టీఎల్ వరకు మాత్రమే వెళ్తున్నాం.. బఫర్ జోన్ జోలికి వెళ్ళడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్ -
మూసీ ప్రక్షాళన.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..?
-
ఫామ్హౌస్లు కాపాడుకునేందుకు దీక్షలా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కబ్జాల కారణంగా మూసీ పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్హౌస్లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. చెరువుల ఆక్రమణతో మన బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావుకు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని అన్నారు ..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ఫామ్హౌస్లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పేదలకు రూ.500 కోట్లు ఇవొచ్చు కదా?. అంబర్పేటలో 200 ఎకరాల భూమి ఉంది. అది పేదలకు పంచుదాం.. ప్రతిపక్ష నేతలు ఏమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేసీఆర్, కేటీఆర్కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం 11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం 18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన -
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై శ్రీధర్బాబు స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే ప్రభుత్వం బద్నాం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే తన స్పందన అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రాకు ఆర్డినెన్స్కు ఆమోదం లభించిందన్నారు.మంత్రి శ్రీధర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి, సంక్షేమంపై చాలెంజ్ చేస్తాం. కత్తుల యుద్ధం చేస్తా అంటే నాలుగేళ్ల తర్వాత చేద్దాం. సంచులు మోసింది వాళ్లే అందుకే అదే గుర్తుకు వస్తుంది. ఇష్టారాజ్యం, అడ్డుగోలుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదు. పార్టీ పరంగా ఏమైనా తప్పులు జరిగితే రాహుల్ గాంధీ సరిచేస్తారు. అంతేగానీ మూసీ ప్రాజెక్ట్కు రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసి రెండు రోజులు వార్తల్లో ఉండాలి అనుకుంటున్నారు.డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఈటల రాజేందర్కు ఆహ్వానం అందలేదు అంటే సమీక్ష చేస్తాం. ప్రోటోకాల్ అంశంలో ఎక్కడ తప్పు జరిగిందో రివ్యూ చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే బీఆర్ఎస్ నేతలు బద్నాం చేస్తున్నారు. జహీరాబాద్కు పొల్యూషన్ కంపెనీలు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జహీరాబాద్కు త్వరలో హ్యుందాయ్ సంస్థ వస్తుంది.. అది పొల్యూషన్ సంస్థనా?. తెలంగాణ నుంచి కంపెనీలు తరలి వెళ్తున్నాయి అనేది అవాస్తవం.కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే నా స్పందన. నేను ఇప్పటి వరకు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు.. చేయను. కేటీఆర్, బండి సంజయ్, హరీష్ రావు నా మిత్రులు. కేవలం రాజకీయ అభిప్రాయాలు మాత్రమే వేరు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: కేటీఆర్పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రేవంత్కు ఈటల సవాల్.. ముక్కు నేలకు రాస్తా అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్దాం. ప్రజలు రేవంత్ను శభాష్ అంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీంతో.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు రాజకీయం మారిపోయింది.మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైరం ఉంటే మూసీ బాధితుల వద్దకు ఇద్దరం కలిసే వెళ్దాం. సెక్యూరిటీ లేకుండా అక్కడికి పోదాం. మూసీ పరివాహక ప్రాంత ప్రజల రేవంత్ను శభాష్ అంటే నేను అక్కడే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతాను. అలాగే, రాజకీయ సన్యాసం తీసుకుంటా. రేవంత్.. ప్రజల చేత ఇంతలా తిట్టించుకున్న నాయకుడు ఎవరూ లేరు.గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారు. కడుపు మండి మాట్లాడిన పేదలను ఐదు వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారు. అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్కు అధికారం నెత్తికెక్కింది. మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటీ ? డీపీఆర్ ఏంటీ?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులే లేవు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైందని రేవంత్ చెబుతున్నారు. మరి.. లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తున్నారు. కేసీఆర్ కూడా గతంలో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రేవంత్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. మోసం, అబద్ధానికి మారుపేరు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కేటీఆర్పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రూ. ఐదు కోట్ల భూమికి పరిహారం ఐదు లక్షలేనా?.. కాంగ్రెస్పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులు: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.ఈ మేరకు మంత్రి మంగళవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ను నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. -
బీఆర్ఎస్కు కోమటిరెడ్డి సవాల్.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షాలకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది విషయంలో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణను పది సంవత్సరాలు పాలించి బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఘాగు విమర్శలు చేశారు.మంత్రి కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ కోసం కేటీఆర్ వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు?.నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ. మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?.బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి. నేను 25ఏళ్ల కింద మూసీ నది కోసం దీక్ష చేశాను. జయశంకర్ అప్పుడు నాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
ప్రపంచ విషపూరిత నదుల్లో 23వ స్థానంలో మూసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విషపూరిత నదుల్లో హైదరాబాద్లోని మూసీ 23వ స్థానంలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మూసీ చుట్టుపక్కల ఉన్న బోర్ వాటర్ కూడా కలుíÙతమైందని, అందుకే దాని పక్కన ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. సోమవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పక్కన తాను నివాసం ఉన్నానని, ఆ బాధలు ఏంటో తనకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మూసీ, హైడ్రాపై కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేయలేని పనిని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నారన్నారు. కేటీఆర్ ఫామ్హౌస్ కట్టుకొని హాయిగా ఉండొచ్చునని, ఇటలీ నుంచి వచ్చే నీళ్లు కేటీఆర్ తాగుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు శనిలాగా దాపురించారని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. -
హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి ఆ విభాగం పని తీరుపై స్పష్టత ఇచ్చారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదన్న ఆయన.. ప్రజలతో పాటు సామాజిక మాధ్యమాలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.‘‘మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు. దీనిని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది’’ అని ఎక్స్ వేదిక ద్వారా తెలియజేశారు. అలాగే..HYDRAA has nothing to do with surveys on either side of the Musi River.HYDRAA is not evacuating the residents there.HYDRAA is not undertaking any demolitions there.No markings have been made on the houses in the Musi catchment area by HYDRAA authorities.The Musi…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024‘‘హైడ్రా అంటే కూల్చివేతలే కాదు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాలి.HYDRAA is not just about demolitions.HYDRAA's jurisdiction extends only up to the Outer Ring Road.Not only in the city, but across the state, and even in other states, demolitions are being attributed to HYDRAA on social media, creating unnecessary fear among people.HYDRAA…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024.. హైడ్రా ప్రధాన విధి ప్రకృతి వనరుల పరిరక్షణ. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం’’ అని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. చేశారు.సంబంధిత వార్త: ఎవరిని మెప్పించడం కోసం ఈ దూకుడు?.. తెలంగాణ హైకోర్టు సీరియస్ -
నాలాపై ఉన్న జీహెచ్ఎంసీని హైడ్రా కూల్చేస్తుందా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఏదేదో చెప్పిందని.. తీరా అధికారంలోకి వచ్చాక ఇంకేదో చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మూసీ సుందరీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మరోసారి ఆరోపించిన ఆయన.. హైడ్రా బాధితుల తరఫున పోరాడి తీరతామని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారాయన.తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది?. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంది. కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం అని ప్రకటించింది. ఎన్నికల ముందు తెలంగాణలో చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారు.హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట,ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పేదల ఇల్లు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ ఇందిరమ్మ,సోనియమ్మ చెప్పింది. వరి సాగులో తెలంగాణ టాప్ గా నిలిచింది ఇది కాళేశ్వరం ఘనత కాదా?. 2016లో బీఆర్ఎస్ హయాంలో చెరువులు, బఫర్, ఎఫ్.టి.ఎల్ డ్రా చేస్తూ జీవో ఇచ్చాం. మూసీలో మేము పేదల కడుపు కొట్టకుండా బ్యూటిఫికేషన్ చేశాం. ఎస్.టి.పి లు మేము పూర్తి చేశాం. మేము నిర్మాణం చేస్తే మీరు విధ్వంసం చేస్తున్నారుమూసీ కోసం లక్షా 50 వేల కోట్లా?తెలంగాణలో లంకెబిందెలు లేవని అంటున్నారు. మరి మూసీ అభివృద్ధి ఏం ఆశించి చేస్తున్నారు?. మరోవైపు మూసీకి లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు. 2,400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళనకు పెట్టిన బడ్జెట్ 40 వేల కోట్లు. సబర్మతి రివర్ ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఖర్చు అయింది. యమునా రివర్ ప్రాజెక్టుకు ఖర్చు అయింది వెయ్యి కోట్లు. అలాంటిది 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ అంటున్నారు. మూసీ సుందరీకరణ కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకులాగా ఉందా?. మూసీ ప్రాజెక్టుతో మురిసేది ఎంతమంది?. మూసీ సుందరీకరణతో ఒక్క ఎకరానికి అయినా నీళ్లు వస్తాయా?. ఇది స్కామ్ కాక మరి ఏం అవుతుంది.ఇల్లు అనేది పేద ప్రజల కళల సౌధం. మా నానమ్మ,అమ్మమ్మ ఊర్లు ప్రాజెక్టుల్లో మునిగిపోయాయి. 1994 లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని భాదితులు అంటున్నారు.అలాంటప్పుడు లక్షమంది ప్రజలను నిరాశ్రయులను చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?. ఇళ్లు కూలగొడుతుంటే ప్రజలు ఊరుకుంటారా?. లక్షలాది మంది జీవితం నాశనం చేస్తున్నారు.సెక్రటేరియేట్ కూడా కూలుస్తారేమో!హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎవరి కోసం హైడ్రా తీసుకొచ్చారు?. పేదల ఇళ్లు కూల్చాలని ఎవరు చెప్పారు?. ప్రభుత్వ వైఖరితో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా ఆఫీస్నే కూల్చాలి. రెండోదిగా జీహెచ్ఎంసీ ఆఫీసును కూల్చాలి. నాలాపై ఉన్న జీహెచ్ఎంసీ ఆఫీసును కూలుస్తారా?. ఎఫ్.టి.ఎల్ లో సెక్రటేరియట్ ఉందని రేవంత్ రెడ్డి కూలుస్తారేమో అని అనుమానం ఉంది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. మంత్రులు ఎందుకు మూసీ గురించి చెప్పడం లేదు. అధికారుల వెనక దాక్కుని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణపై డి.పి.ఆర్ రెడీ కాలేదు. డి.పి.ఆర్ రెడీ కాకుండా ఇళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు.చట్ట ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ కు చెప్పిన తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటికే మా నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ వాళ్లు మూసీ బాధితుల వద్దకు వెళ్లవద్దు.బాధితులకు మేం అండగా నిలబడతాము. బాధితులకు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తాము. సాగరహారం లాంటి ధర్నాలు తెలంగాణలో వచ్చే విధంగా ఉన్నాయి.సావాస దోషంతోనే మంత్రి మాటలు5 వేల రూపాయలకు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్బాబు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా పీసీసీ పదవిని అమ్ముకోవడం,సీఎం పదవిని అమ్ముకోవడం తెలంగాణ ప్రజలకు రాదు. సావాస దోషంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.రేవంత్ రెడ్డికి లక్కీడ్రాలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 50 కోట్లకు పీసీసీ పదవీ , 500 కోట్లకు సీఎం పదవీ నీ కాంగ్రెస్ అమ్ముకుంది. హామీలేమాయే?సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుండి వచ్చే మురికినీరు ఎక్కడికి పోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా?. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ళు కుంటలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి నివాసం ఎఫ్.టి.ఎల్ లో ఉంది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నీ సోదరుడి ఇళ్ళు కూలగొట్టు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంచారు. తెలంగాణలో పింఛన్లు ఎందుకు పెంచలేదు. రైతులకు ఇప్పటి వరకురైతు భరోసా ఇవ్వలేదు. ముందు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన హామీలు రేవంత్ రెడ్డి అమలు చేయాలి -
ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే ఊరుకోం
బండ్లగూడ: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. హైదరా బాద్లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో ఉన్న గంధంగూడ, బైరాగిగూడ మూ సీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధి తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆదివారం పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్రావు, మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ స్పీకర్ మధుసూద నాచారి, ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మాలతీనాగరాజ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రీయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్రావు మాట్లాడారు. ఫోన్ చేయండి.. అరగంటలో మీ ముందుంటామూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని హరీశ్రావు చెప్పారు. ‘ఆపదొస్తే ఫోన్ చేయండి... అర్ధ గంటలో మీ ముందుంటా. బుల్డోజర్లు వచ్చి నా, జేసీబీలు వచ్చానా ముందు మమ్మల్ని దా టాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘బలిసినోళ్ల కు దగ్గరుండి ఇళ్లు కట్టిస్తున్నావ్.. పేదల ఇళ్లను మా త్రం కూలగొడుతున్నావ్. ఇదెక్కడి న్యాయం? రేవంత్రెడ్డి.. నీ ప్రభుత్వ జీవితకాలం ఐదేళ్లు మాత్రమే.కానీ నువ్వు కూలగొట్టే పేదల ఇళ్లు వారి జీవితకా లం కల’అని హరీశ్రావు పేర్కొన్నారు. కొడంగల్ లోని సీఎం ఇల్లు రెడ్డికుంటలో ఉందని.. ఆ ఇంటిని రేవంత్ ముందుగా కూలగొట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మూసీ సుందరీకరణను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే తెలంగాణ భవన్కు రావాలని... అర్ధరా త్రి వచ్చినా బాధితులకు ఆశ్రయం ఇస్తామని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు.బడి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రాధాన్యత కాదా?ఎస్సీ, బీసీ హాస్టల్స్లో పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటే ప్రజలు నమ్మరని హరీశ్రావు పేర్కొన్నారు. పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రభుత్వ ప్రాధా న్యతా లేక రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేపట్టడం ప్రాధాన్యతో సీఎం చెప్పా లన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆడ పిల్లలకు టాయి లెట్స్ లేక వందల మంది లైన్లలో నిలబడుతున్నా రని.. వారి కోసం టాయిలెట్స్ కట్టడం ప్రభుత్వ ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు.ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గాంధీ ఆస్పత్రికి మందుల సరఫరా నిలిచిపోయిందని.. దీంతో రోగులకు మందులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కానీ సీఎం మాత్రం సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సాయంతో ఫోర్త్సిటీ నిర్మిస్తానని సీఎం అంటున్నారని విమర్శించారు. -
హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మూసీ నది సుందీరకరణ... ఉధృతంగా కొనసాగుతున్న బాధితుల ఆందోళనలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Operation Musi: మూసీ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా నిరసన గళం తీవ్రమవుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలకు రెండోరోజు శుక్రవారం తీవ్ర నిరసన ఎదురైంది. బాధితులు అడుగడుగునా అధికారులను అడ్డుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. రోడ్లపై బైటాయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపించారు. నిర్వాసితులకు కాంగ్రెసేతర పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. చైతన్యపురిలో బాధితుల ఆందోళనలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. కొత్తపేట మారుతినగర్లో ఒక యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే బృందాలు మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మొదటి విడతగా మూసీ నదీగర్భం (రివర్ బెడ్) పరిధిలోని నిర్మాణాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసే ప్రక్రియ గత రెండు రోజులుగా కొనసాగుతోంది. అయితే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ అందిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి, పక్కా గృహాలు నిరి్మంచుకున్న వారు మాత్రం కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనకు దిగుతున్నారు. దీంతో మార్కింగ్కు ఆటంకాలు తప్పడం లేదు. పునరావాసంపై అయోమయం మూసీ నిర్వాసితులకు పునరావాసంపై అయోమయం నెలకొంది. అర్హులైన నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసినప్పటికీ గతంలో జీఐఎస్ సర్వే ద్వారా గుర్తించిన గృహాలపైనే మార్కింగ్ వేస్తూ ఆ కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటిలో పక్కాగృహాలకు మార్కింగ్ వేయకపోవడం, ఆ కుటుంబాల వివరాలు సేకరించడం పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఆరు నెలల క్రితం మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మా ణాలున్నాయో గుర్తించింది. వాటిని జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)తో అనుసంధానం చేసింది. ప్రస్తుతం దాని ప్రకారమే రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించి ప్రత్యేక యాప్లో పొందుపర్చుతున్నారు.అన్ని గృహాలపై ఆపరేషన్ మూసీ ప్రక్షాళనలో భాగంగా మొదటి విడతగా నదీ గర్భంలోని నివాసాలపై ఆపరేషన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేత బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. దీంతో నదీగర్భం పరిధిలోని గల ఆర్బీ–ఎక్స్(రివర్ బెడ్) మార్కింగ్ పడిన గృహాలతో పాటు దాని వెంట ఉన్న గృహాలు సైతం కూలి్చవేయక తప్పని పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.నిర్వాసితుల తరలింపు మూసీ నిర్వాసితులైన 20 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించి పునరావాసం కలి్పంచినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం హిమాయత్నగర్ మండలంలోని శంకర్నగర్ కాలనీకి చెందిన 6 కుటుంబాలు, వినాయక వీధిలోని మూడు కుటుంబాలను మలక్పేట పిల్లిగుడిసెల సముదాయానికి, నాంపల్లిలోని 11 కుటుంబాలను ఆసిఫ్నగర్ జియాగూడ సముదాయానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. వేల సంఖ్యలో నివాసాలు.. మూసీ పరీవాహక పరి«ధి పొడువునా..నదీ గర్భంలో వేల సంఖ్యలో గృహాలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మాత్రమే డ్రోన్ సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే ఆధారంగా ప్రభుత్వం నదీ గర్భంలో సుమారు 2166 నివాసాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంటుంది. అందులో సుమారు 288 భారీ కట్టడాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్కో మండలంలోని పలు ప్రాంతాల్లో వందలాది గృహలు నదీ గర్భంలో ఉన్నప్పటికీ జీఐఎస్ డేటా ప్రకారమే గృహాలపై రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించడం విస్మయానికి గురిచేస్తోంది. -
మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ చెప్పారు. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో మూసీ పౌర సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్ నగర భవిష్యత్తును కాపాడాలంటే.. మూసీ నదిని పునరుద్ధరించాల్సిందేనని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏకపక్షంగా కాకుండా.. ఎన్జీవోలు, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి, తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టా ఉంటే పరిహారం, ప్రయోజనాలు త్వరలోనే బఫర్ జోన్లో నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియ చేపడతామని దాన కిశోర్ తెలిపారు. వారికి పునరావాస చట్టం ప్రకారం.. పరిహారం, ప్రయోజనాలు అందిస్తామని, ఆ తర్వాతే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థుల చదువు దెబ్బతినకుండా.. వారిని తరలించిన ప్రాంతంలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారిని గురుకులాల్లో కూడా చేర్పిస్తామన్నారు. మూసీ పునరావాస ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. -
‘రెడ్ మార్క్’ గోబ్యాక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది గర్భంలో, బఫర్జోన్లో నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేయడానికి వెళ్తున్న అధికారులకు అడుగడుగునా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఏళ్లకేళ్లుగా కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లను వదిలిపొమ్మనడం ఏమిటంటూ పరీవాహకంలోని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం రెండోరోజు శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు.రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపైనా తమ ఆక్రోశం వెళ్లగక్కారు. అభివృద్ధి అంటే ప్రజలకు మంచి జరగాలని.. తమను ముంచి చేసే అభివృద్ధి ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు మహిళలు బాధతో శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే బృందాలు ఇళ్ల మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మూసీ పరీవాహకంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే తరలివెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పక్కా ఇళ్లు కట్టుకున్నవారు కూల్చివేతను, తరలిపోవడాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే ఎలా బతకాలంటూ చైతన్యపురి వినాయక్నగర్ కాలనీలో మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మరో మహిళ తమ ఇల్లు పోతే ఎలాగనే కలతతో రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురిలో బాధితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి.. మూసీ పరీవాహకంలో లంగర్హౌస్లోని వివిధ బస్తీల్లోని ఇళ్లకు అధికారులు గురువారం రాత్రి మార్కింగ్స్ వేశారు. అలా మొఘల్నగర్ రింగ్రోడ్డు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి బాధితులు రాళ్లు పట్టుకొని ఉన్నారన్న హెచ్చరికలతో వెళ్లలేదు. అప్పటికే స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని.. రాత్రివేళ ఆందోళనలు వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. తహసీల్దార్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. మూడు గంటలు దిగ్బంధం కార్వాన్లోని జియాగూడ, పరిసర ప్రాంతాల వారు.. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని భారీ ఆందోళనకు దిగారు. ఇక్కడి ప్రధాన రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేసి.. అధికారులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చనివ్వబోమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంటిమీద కునుకు కరువు! మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. జీవితకాలం సంపాదించి కట్టుకున ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పాపం ముటగట్టుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఉదయం ఆరేడు గంటల నుంచే బస్తీల్లో అలజడి కనిపిస్తోంది. పెద్దలు పనులకు వెళ్లకుండా, పిల్లలను బడులకు పంపకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరెవరు బస్తీలోకి వస్తున్నారు, అధికారులు వస్తున్నారా అని ఆందోళనగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంటిని ఖాళీ చేసే మాటేలేదు 30ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పడు కూలగొడతామంటూ ఊరుకునే మాటే లేదు. ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. మేం అన్ని పన్నులు కడుతున్నాం. ఇక్కడే బతుకుతాం. – నవనీత, కమలానగర్ (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి02) భవిష్యత్తు ఆశలను కూల్చేస్తారా? పైసా పైసా కూడబెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే.. ఇల్లు మాత్రమేకాదు. భవిష్యత్తు ఆశలూ పోయినట్టే. మా బతుకులను బజారున పడేయొద్దు. – స్వప్న, గోల్నాక (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి03 ) అనుమతులు తీసుకుని ఇళ్లుకట్టుకున్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బ్యాంకు లోన్తో ఇళ్లు కట్టుకున్నాం. 70–80 ఏళ్ల వయసున్న వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? – లక్షి్మ, న్యూమారుతీనగర్ 56 ఏళ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికి వెళ్లాలి? 1968 నుంచి అంటే 56 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడివారంతా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. హైటెక్ సిటీ కంటే సేఫ్గా ఉంటున్నాం. ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట రోడ్ల పాలు చేస్తున్నారు. మేమేం కబ్జా చేసి ఇళ్లు కట్టుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? న్యాయం కోసం పోరాడుతాం. – ఉపేందర్, న్యూమారుతీనగర్ -
పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం
సాక్షి, హైదరాబాద్: మూసీనది పరీవాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకురావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీహాలుకు చారిత్రక ప్రాధాన్యం ఉందని, ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్లో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. జూబ్లీహాలును కూడా దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు.ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. హైకోర్టు భవనం, హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి కట్టడాలను కూడా పరిరక్షిస్తామని, ఇప్పటికే చారి్మనార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయిప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. పురాతన మెట్ల బావులను దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు ⇒ నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్కు వారు ఒప్పందపత్రాలు అందజేశారు. ⇒ ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ⇒ సాయిలైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. ⇒ భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనున్నది. ⇒ అడిక్మెట్ మెట్ల బావిని దొడ్ల డెయిరీ, ఫలక్నుమా బావిని ఆరీ్టసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనుంది. -
పేదల ఇండ్లపై బుల్డోజర్ యాక్షన్
-
హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మూసీ కార్యక్రమంలో రెండో రోజు కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు రెండో రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేయబోయే ఇళ్లకు నెంబరింగ్ ఇస్తూ మార్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. గురువారం దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తమ ఇళ్లకు మార్క్ చేయకుండా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు.. శని, ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ప్లాన్ చేసింది. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్ -
Telangana: మూసీ ‘రెడ్ మార్క్’!
సాక్షి, హైదరాబాద్: మూసీ కట్టడాలపై రెడ్ మార్క్ పడింది. పరీవాహకంలోని నివాసితుల గుండెల్లో ఆవేదన రేపుతోంది. పునరావాసం కింద ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకెందుకంటూ చాలా మంది గోడు వెళ్లబోసుకుంటున్నారు. కడుపుకట్టుకుని సొమ్ముదాచుకుని ఇళ్లు కట్టుకున్నామని, ఏళ్లకేళ్లుగా అక్కడే బతుకుతున్న తమను వెళ్లిపొమ్మంటే ఎలాగని ఆందోళన చెందుతున్నారు. పరీవాహకం వెంట సర్వే చేసి, ఇళ్లకు మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి సర్వే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. మొదటి విడతగా నదీ గర్భంలో ఉన్న కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సుమారు 25 ప్రత్యేక బృందాలు గత నివేదికల ఆధారంగా ఇళ్లను గుర్తించి ‘ఆర్బీ–ఎక్స్’ పేరుతో ఎరుపు రంగులో మార్కింగ్ చేస్తున్నాయి. ఆయా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి అక్కడికక్కడే ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నాయి. 12 వేల కట్టడాల గుర్తింపు హైదరాబాద్ నగరంలో సుమారు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ పరీవాహక ప్రాంతంలో 12వేలకుపైగా కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంయుక్తంగా సర్వే నిర్వహించి.. నదీ గర్భంలో ఉన్న, బఫర్జోన్లో ఉన్న ఇళ్లు, నిర్మాణాలుగా వర్గీకరించారు. నది గర్భంలో 2,166 కట్టడాలు ఉండగా.. అందులో 288 భారీ నిర్మాణాలు ఉన్నాయి. నది సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న బఫర్జోన్ పరిధిలో 7,851 కట్టడాలు ఉండగా.. అందులో 1,032 భారీ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి మొత్తంగా 30వేలకు పైగానే నివాసాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. చావనైనా చస్తాం.. కూల్చనివ్వం ‘‘ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. కరెంటు, నీటి బిల్లులు కడుతున్నాం. ఇప్పుడు కూల్చుతామంటే ఎలా? చావనైనా చస్తాం కానీ ఇళ్లను కూల్చనివ్వం.. ఇంత విషం ఇచ్చి ఆ పుణ్యంకూడా మీరే కట్టుకోండి..’’ అంటూ మూసీ పరీవాహకం పరిధిలోని చైతన్యపురి వినాయకనగర్ కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ రివర్బెడ్, బఫర్జోన్లలోని ఇళ్లను మార్కింగ్ చేయడానికి వచ్చిన సర్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి రంగు డబ్బాలను లాక్కుని పారబోశారు. వేసిన మార్కింగ్స్ను తుడిపేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారంటూ అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్వే బృందాలు వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ అధికారులకు ఇదే తరహా నిరసన ఎదురైంది.కడుపు కట్టుకుని కొనుక్కున్నాం.. ఇక్కడే సమాధి అవుతాం ‘‘మావి కబ్జా చేసుకుని కట్టుకున్న ఇళ్లు కావు.. కడుపు కాల్చుకుని దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లు మావి. కరెంట్, నీటి, ఇంటి పన్నులు చెల్లిస్తున్నాం. స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నాం. వీటిని వదిలి వసతులేవీ లేనిచోట ఎక్కడో అడవులలో కట్టిన డబుల్ బెడ్రూమ్లను ఇస్తామంటే వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాం. ఇంట్లోనే సమాధి అవుతాం..’’ అంటూ అత్తాపూర్ డివిజన్ భరత్నగర్ వాసులు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు ఆక్రమించి విల్లాలు నిర్మించుకున్న బడాబాబుల ఫాంహౌస్లు కూల్చివేయకుండా సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఏమిటంటూ మండిపడ్డారు.తొలివిడతగా నది గర్భంలో.. మూసీ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో నది గర్భంలో ఉన్న నివాసాల తొలగింపుపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,595, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కట్టడాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మూసీ పరీవాహకంలో ఇళ్లు తొలగిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు పునరావాసం కోసం 15వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది గర్భం, బఫర్ జోన్లలో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు. బఫర్ జోన్లో తొలగించే ఇళ్లు, నిర్మాణాలకు సంబంధించి.. పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నష్టపరిహారం చెల్లించి, భూసేకరణ చేపడతామని వివరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు కూడా అందజేస్తామని అంటున్నారు.ఎక్కడో దూరంగా ఇళ్లు ఇస్తుండటంపై.. మూసీ పరీవాహకంలో తొలి విడతగా ఇళ్ల తొలగింపుతో రెండు వేలకుపైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులు సైదాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో గతంలో కొందరు మూసీ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా.. తిరిగి వెనక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నాయి. నదీ గర్భం నుంచి తరలింపు ప్రారంభం మూసీ పరీవాహకంలోని కొత్తపేట భవానీనగర్ రోడ్డు నంబర్ 10లో నివాసం ఉంటున్న పదకొండు కుటుంబాలను అధికారులను తరలించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి వారితో ఆ కుటుంబాలతో మాట్లాడారు. వారి సమ్మతితోనే వనస్థలిపురం, ప్రతాపసింగారం, తిమ్మాయి గూడలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వ ఖర్చులతో డీసీఎంలలో సామగ్రిని తరలించారు. -
మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డిలో మాల్కాపూర్ చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బహుళ అంతస్తుల భవనాన్ని క్షణాల్లో కూల్చివేశారు.మాల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో, క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయంలో రాయి వచ్చి తలకు తగలడంతో హోంగార్డ్ గోపాల్ గాయపడ్డారు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు.. ఇళ్లకు మార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక, మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13వేల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. ఒక్కో టీమ్లో ఎమ్మార్వోతో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు.. సర్వే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
హైడ్రా పేరుతో హైడ్రామాలు..
-
మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతున్న సర్కార్
-
మూసీ వైపు హైడ్రా బుల్డోజర్లు.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా రోజు రోజుకి మరీంత దూకుడుగా వ్యవహారిస్తుంది. ఇక, తాజాగా మూసీ పరివాహక ప్రాంతంపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ ఇచ్చారు. మరోవైపు.. ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.మూసీ నదిలో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ ఏరియాల్లో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది. రెండు రోజుల్లోనే అక్రమ నిర్ణయాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకుంది. ఇక, మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 1350 మందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది.మరోవైపు.. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే నేడు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా బాధితుల వివరాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. అలాగే, వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే కూకట్పల్లి, అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ భూములును అక్రమించి నిర్మించిన కోట్ల రూపాయాల విల్లాలను నేలమట్టం చేసింది. అంతకుముందు నాగార్జున ఎన్ కన్వెషన్ సహా పలు నిర్మాణాను కూల్చివేసింది. ఇది కూడా చదవండి: ఫోన్ట్యాపింగ్పై స్పందించిన డీజీపీ -
మూసీ సుందరీకరణపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని.. గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీ(sewage treatment plants)ను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. ‘‘ రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు . గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. మా హయాంలో రూ. 4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించాం. .. మూసీ నదీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. లక్ష 50వేల కోట్లు.. 70వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది.ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ఇక రేవంత్ విచారణ.. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకైన నగరం హైదరాబాద్. STPలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తాం. .. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా?. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక మాటలే ఒక ఉదాహరణ. ప్రస్తుత ప్రభుత్వం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు. పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు’’ అని కేటీఆర్ అన్నారు. -
‘మూసీ’ నిర్వాసితులకు ‘డబుల్’ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరూ నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జల వనరుల పరిరక్షణలో పేదలు రోడ్డున పడవద్దని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు వారు సహకరించేలా ఒప్పించడంతోపాటు అర్హులైన పేదలకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ మంగళవారం జూబ్లీహిల్స్లోని నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు తేల్చండి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని.. ఆక్రమణల వివరాలన్నీ సేకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని సూచించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణపై పూర్తిస్థాయి డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు. నేటి నుంచే ‘మూసీ’ పునరావాస ప్రక్రియ! మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్లలో నివాసమున్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో.. పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభించనున్నారు. 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. బుధవారం నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్ బెడ్లోని 1,600 ఇళ్లను తొలగిస్తారు. వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్జోన్లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చుతోపాటు పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తారు. -
మూసీ నదికి పోటెత్తిన వరద.
-
విన్నపాలు వినవలె
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, ప్రల్హాద్ జోషిలతో సీఎం సమావేశమయ్యారు.మూసీ సుందరీకరణపై రాష్ట్ర సర్కారు దృష్టిమూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మొత్తం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని దేశంలో మరెక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. మూసీ సుందరీకరణతో పాటు దానిలో చేరే మురికినీటి శుద్ధికి, వరద నీటి కాల్వల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ రెండు చెరువులను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు తీరడంతో పాటు మూసీ నది పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని వివరించారు. నల్లా కనెక్షన్లకు రూ.16,100 కోట్లు అవసరంజల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. 2019 లెక్కల ప్రకారం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో 77.60 శాతం ఇళ్లకు నల్లా నీరు అందుతోందని, అయితే ఇటీవల తాము చేపట్టిన సర్వేలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని తేలిందని వివరించారు. ఆ ఇళ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, ఇందుకు మొత్తం రూ.16,100 కోట్లు అవసరమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2019లోనే ప్రారంభించినా నేటి వరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని, ఈ ఏడాది నుంచైనా నిధులు విడుదల చేయాలని కోరారు. సిలిండర్కు రూ.500 చెల్లించేలా చూడండితెలంగాణలో రూ.500కే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని సీఎం కోరారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తోందని తెలిపారు.అయితే వినియోగదారులు సిలిండర్కు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ అందుతుండడంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. కాబట్టి సబ్సిడీని ముందుగానే ఓఎంసీలకు చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడు వినియోగదారులు రూ.500 మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఒకవేళ అలా వీలుకాని పక్షంలో 48 గంటల్లోపు సబ్సిడీ మొత్తం వినియోగదారులకు అందేలా చూడాలని కోరారు.బియ్యం బకాయిలు విడుదల చేయండిధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని రేవంత్ కోరారు. 2014–15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల రాయితీని పెండింగ్లో పెట్టారని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. -
థేమ్స్ నదిలా మూసీ డెవలప్మెంట్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: లండన్లోని థేమ్స్ నదిలా మూసీ నదిని సుందరీకరణ చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్షమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.కాగా, సీఎం రేవంత్ శనివారం గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. లండన్లోని థేమ్స్ నదిలా మూసీ సుందరీకరిస్తాం.మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం. ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసాం. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి. వచ్చే పదేళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
"మంగళగిరిలో మూసీనది.."
-
మూసీ సుందరీకరణకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాలా రూ.60 వేల కోట్లు. దశల వారీగా మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన సర్కారు.. నది సుందరీకరణ, నిర్వహణ కోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. 2050 మాస్టర్ప్లాన్కు అనుగుణంగా నది పరిసరాలను జోన్ల వారీగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా మూసీ వెంట రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నదీ గర్భం నుంచి ఇరువైపులా కిలోమీటరు మేర ఇంపాక్ట్ ఏరియాగా ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు యంత్రాంగం.. ఇప్పటికే నది హద్దులు, ఆక్రమణలపై ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా జీఐఎస్ మ్యాపింగ్ను చేసింది. ఆక్రమణలే అడ్డంకి.. మూసీ రివర్ ఫ్రంట్ను పునరాభివృద్ధి చేయాలనే ఆలోచన తొలుత 1908లోనే వచ్చింది. 1990లో కాస్త ముందుకు కదిలినా.. పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు. మురుగునీరు, ఆక్రమణలే మూసీ పునరుజ్జీవానికి ప్రధాన అడ్డకుంలుగా నిలిచాయి. 55 కి.మీ మేర నదీ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వానికి కష్టతరమైన పనే అని అంటున్నారు. నది పునరుజ్జీవం కావడానికి 15–20 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణలు సుమారు 2వేల మేర ఉంటాయని అంచనా వేసిన యంత్రాంగం.. వీటిని తొలగించేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేనప్పటికీ, కొన్నిచోట్ల పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇలాంటి కట్టడాలు 10వేల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. భూ సేకరణ చట్టం కింద వీరికి పరిహారం చెల్లించడమా? ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమా? ఇతర మార్గాలేమిటనే కోణంలో అధ్యయనం చేస్తోంది. పాతబస్తీలో మూసీ కుచించుపోయిందున ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించే ఆలోచన కూడా చేస్తోంది. జంట జలాశయాల నుంచి రోజూ నీరు గుజరాత్లో నర్మదా నది నీటిని సబర్మతికి తీసుకెళ్లిన మాదిరే గోదావరిని ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు అనుసంధానం చేయాలనేది ప్రణాళిక. మురుగునీటితో నిండి ఉన్న మూసీ నదికి ఈ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా రోజుకు 1–2 టీఎంసీల జలాల విడుదలతో మురుగు శుద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు, మురుగు నీరు కూడా నదిలో కలుస్తున్నందున మూసీ కలుషితం అవుతుందని తేలడంతో అమృత్ పథకం కింద 39 మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తోంది. వీటిద్వారా వందశాతం శుద్ధి చేసిన నీటిని నదిలోకి విడుదల చేస్తారు. వీటికి అనుబంధంగా ప్రతి రోజు జంట జలాశయాల నుంచి నీటిని వదలడం ద్వారా నదీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా.. సందర్శకులను ఆకర్షించేలా రూపొందిస్తారు. మార్గమధ్యంలో పార్కులు, బోటింగ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సబర్మతి.. మూసీ కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో పుట్టి.. నార్సింగి ఔటర్ రింగ్రోడ్డు నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ వరకు 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దేశంలోనే నది పునరాభివృద్ధి ప్రాజెక్ట్ల్లో మూసీ రివర్ ఫ్రంట్ అత్యంత ప్రతిష్టాత్మకం. నీటి నిర్వహణ, ప్రణాళిక, రవాణా, పునరావాసం, పట్టణ పునరుజ్జీవం తదితరాల కోసం రూ.60 వేల కోట్ల వ్యయం, సుమారు 36 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్లోని సబర్మతి నది పునరాభివృద్ధికి మూసీకి దగ్గరి పోలికలున్నాయి, కాకపోతే సబర్మతి అహ్మదాబాద్ నగరంలో 11 కి.మీ. మేర మాత్రమే విస్తరించి ఉండగా.. మూసీ నది హైదరాబాద్లో 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. అదీగాక సబర్మతి కంటే మూసీ పరీవాహక ప్రాంతాలు ఎక్కువ ఆక్రమణకు గురవడంతోపాటు జనసాంద్రత కలిగిన ప్రాంతాలు కావడం గమనార్హం. ప్రాజెక్టు తొలి దశ అంచనా వ్యయమిలా వెస్ట్ కారిడార్– ఈస్ట్ కారిడార్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15,000 కోట్లు ట్రంక్ లైన్కు రూ.3,000 కోట్లు రివర్ లింకేజీకి రూ.3,000 కోట్లు మూసీ మొత్తం పరీవాహక ప్రాంతం: 110 చ.కి.మీ. ఆక్రమణలున్న ప్రాంతం: 55 చ.కి.మీ. -
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
మూసీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సోమవారం నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలోని 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీనదీ పరీవాహక ప్రాంతాలు సరిహద్దులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించారు. ప్రక్షాళనకు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలగించాల్సిన నిర్మాణాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది. అనంతరం సీఎం మాట్లాడుతూ వీలైనంత త్వరగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టాలని అధికారులకు చెప్పారు. మొదట క్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ పనులపై దృష్టి సారించింది. మూసీ నదిని మూడు ప్రధాన విభాగాలుగా విభజించి పనులు చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ చేపట్టారు. అందంగా.. ఆహ్లాదంగా... హైదరాబాద్ మహానగరానికి పడమటి నుంచి తూర్పు వరకు మెలికలు తిరుగుతూ వడ్డాణం అలంకరించినట్టుండే మూసీనది నిజాం కాలంలో పరవళ్లు తొక్కింది. నగరంలో 55 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్న మూసీనదికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు గతంలోనే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా పెద్దగా పురోగతి లేదు. ప్రసుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. మూసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తూర్పు–పడమర మధ్య మెట్రో మార్గం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లండన్లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మూసీ అభివృద్ధికి ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. సింగపూర్కు చెందిన ఓ సంస్థ ప్రభుత్వంతో ఇటీవల సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీకి రెండువైపులా ఎమ్యూస్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చి్రల్డన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్ బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, తారామతి బారదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ కూడా డిజైన్ చేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. -
‘మూసీ’పై సీఎంతో సింగపూర్ సంస్థ భేటీ
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వహణపై సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని తెలిపారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతోపాటు హైదరాబాద్లో మూసీ డెవలప్మెంట్ నమూనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో భవిష్యత్తులో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని.. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని కోరారు. ఇటీవల లండన్, దుబాయ్లలో పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించడం, పలు విదేశీ కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతోనూ చర్చించడం తెలిసిందే. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో మెయిన్హార్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తదితరులు ఉన్నారు. ఈ భేటీలో సీఎస్ శాంతికుమారి, పురపాలన, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. -
లండన్ థేమ్స్లా మూసీ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని.. హైదరాబాద్కు కూడా అటువంటి ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అటు మూసీ నది వెంబడి, హుస్సేన్సాగర్ చుట్టూ, ఉస్మాన్సాగర్ వంటి జలాశయాలు కేంద్రంగా హైదరాబాద్ అభి వృద్ధి చెందిందని చెప్పారు. మూసీకి పునర్వై భవం తీసుకొస్తే.. నది, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపక ల్పనలో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ బృందం బ్రిటన్లోని లండన్లో పర్యటించింది. ఆ నగరంలోని థేమ్స్ నదిని పరిశీలించి.. దానిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. తర్వాత థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సమా వేశమై చర్చించారు. విజన్ 2050కి అనుగుణంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నామని, దీనికి సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. అభివృద్ధితోపాటు సంరక్షణకు ప్రాధాన్యం దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్కెహల్ లివీ తదితరులు సీఎం రేవంత్ బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, అనుసరించిన విధానాలను తెలిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు ప్రాధాన్యమి చ్చినట్టు స్పష్టం చేశారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటంతోపాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజన ముండే రెవెన్యూ మోడల్ను ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకరిస్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లైన్, వివిధ సంస్థల భాగ స్వామ్యంపై చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎం రేవంత్పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సంతతి బ్రిటన్ ఎంపీలతో రేవంత్ భేటీ దావోస్ పర్యటన ముగించుకుని లండన్కు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అక్కడి భారత సంతతి ఎంపీలతో సమావేశమయ్యారు. ఓల్డ్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు భవనంలో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో.. ఏడుగురు బ్రిటన్ ఎంపీలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భారత్–బ్రిటన్ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యబంధం ఉందన్నారు. ఇరు దేశాలు మహాత్మాగాంధీ సందేశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. -
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
-
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి టీఎస్పీఎస్సీపై సమీక్ష చేపట్టారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాలలో పరీక్షల నిర్వహాణపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. టీఎస్పీఎస్సీకి కావాలసిన సిబ్బందిని, ఇతర వనరులు వెంటనే సమకూర్చాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మూసి అభివృద్ధి పై సమీక్ష: మూసి నది ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసిని పర్యటన ప్రాంతంగా డెవలప్ చేయాలని తెలిపారు. మూసి నది వెంట బ్రిడ్జీలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంతో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసిలో మురుగు నీటి తగ్గించే విధంగా అవసరమైన చోట మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహాణపై సమీక్ష: టెన్త్,ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గతంలోలాగా పేపర్ లీక్లు జరగకుండా జాగ్రత్తపడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ,ప్రైవేటు విశ్వ విద్యాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అవసరం ఎక్కడ ఉందో వాటి వివరాలు వెంటనే ఇవ్వాలన్నారు. -
మహావిషాదానికి 115ఏళ్లు, వందల మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు
‘సెప్టెంబర్ 28’... ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్ గంజ్ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టునాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు... ఈ ఏడాది సైతం సెప్టెంబర్ 28న అలనాటి వరద సమయంలో ఎంతో మందిని రక్షించిన చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ... నేటి పరిస్థితుల్లో నగరాభివృద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. ప్రాణాలు కాపాడిన చింతచెట్టు.. మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది.ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. 1914 లోనే సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సీఐబీ అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక... బాగ్ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశ యాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్.. ఎన్నో సమస్యలు ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించింది కాకపోతే... నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా బాగా పెరిగిపోయింది. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్ట గొడుగుల్లా మురికివాడలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’, ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్ ప్లానింగ్పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేశాయి. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం,మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం... మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూపోతే... ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్కు చక్కటి ‘ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్’ మాత్రమే. హైదరాబాద్లో మంచినీటి సమస్య పరిష్కారమయ్యింది. రహదారులు వృద్ధి చెందాయి. ఓ.ఆర్.ఆర్. లాంటివి ఎన్నో వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్.లు వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున సదుపాయాలను పెంచవలసి ఉంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్ కేసర్ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు. అభివృద్దితో పాటు సమస్యలూ.. అభివృద్ధితో పాటూ సమస్యలూ తలెత్తుతాయి. వీటిని దుర్కొనడానికి మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకం. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్కు 6 మాస్టర్ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అమలుచేయాలి. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. రెండవ దశ ఎమ్ఎమ్ టీఎస్ వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్ రైల్ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. హైదరా బాద్కు వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్ మాగ్నెట్స్గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి. వారసత్వాన్ని కాపాడుకోవాలి ఈ రోజున హైదరాబాద్ యావత్ దేశపు గ్రోత్ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించుకోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. అఫ్జల్ గంజ్ పార్క్ లో ఉన్న చింత చెట్టునూ, ఆ స్థలాన్నీ నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. హైదరాబాద్ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక లతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం. వ్యాసకర్త: ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఛైర్మన్ మొబైల్: 98480 44713 -
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం?
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీలో లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. Lakshmi's body, found during JCB-assisted garbage removal at #MoosarambaghBridge, is now taken for a postmortem. @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @shibasahu2012 #hyderabad #HyderabadRains pic.twitter.com/D5FumD59Cj — Sri Loganathan Velmurugan (@sriloganathan6) September 6, 2023 చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. కాగా, మూసీలో మహిళ మృతదేహం కొట్టుకురావడంతో.. గల్లంతైన లక్ష్మిగా గుర్తించారు. -
Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్/ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రాజధాని హైదరాబాద్ మహానగరంలో కురిసిన కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భందంలో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉధృతంగా మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత హైదరాబాద్లో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు మూసీలో వదలడంతో మూసారాంబాగ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మూసీ వాగు ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 9గంటల నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. #HyderabadRains Moosarambagh bridge is being closed from 9 Pm this evening due to increase in water levels in Musi as about 6000 cusecs is released from Osmansagar & Himayathsagar into Musi .. We will review the situation tomorrow pic.twitter.com/krWO8uqTyW — Arvind Kumar (@arvindkumar_ias) September 5, 2023 మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో :1013.18 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్ ఫ్లో : 3753.81క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 645.00 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం : 643.60 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46టీఎంసీలు..కాగా ప్రస్తుత నీటి నిల్వ : 4.09టీఎంసీలు ఉంది. చదవండి: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు జంట జలాశయాలకు భారీగా వరద నీరు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. -
HYD: ఉధృతంగా మూసీ.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో రాజేంద్రనగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఒడ్డున ఉన్న కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వేయడంతో చాదర్ ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాలలో ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళాలని అధికారులు ఆదేశించారు. అయితే తమకు పునరావాసం కేంద్రాలు ఏర్పాట్లు చేయకుండా.కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెల్లుతామని బాధితులు వాపోతున్నారు. #HyderabadRains కృష్ణానగర్ పూర్ణా టిఫిన్ గల్లీలో వరద భీభత్సం pic.twitter.com/ysY9c8D2nG — keshaboina sridhar (@keshaboinasri) September 5, 2023 ఇక.. ఇప్పటికే కురిసిన కుండపోత వానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలో ఏవైపు చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బేగంపేట ప్రకాశ్ నగర్ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రగతి భవన్ ఎదురుగానూ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. Water logging in several areas of #Hyderabad after hours of rains; these visuals from near #MoosapetMetro station; bike that was washed away in waters, got stuck in a manhole in #Borabanda & was retrieved #HyderabadRains @ndtv @ndtvindia pic.twitter.com/bgNdwV2aLe — Uma Sudhir (@umasudhir) September 5, 2023 పంజగుట్ట నుంచి బేగంపేట ఫ్లై ఓవర్ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. శంషాబాద్లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జీడిమెట్ల ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో నీరు నిలిచింది. కూకట్పల్లిలో 14 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. కూకట్పల్లి దీన్దయాల్ నగర్లోకి వరద నీరు చేరింది. ఫతేనగర్ రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంపేట ఈశ్వర విల్ల ఐదు అడుగుల మేర నీట మునిగింది. ఆల్వాల్ మచ్చబొల్లారంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నార్సింగిలోని బాలాజీ నగర్ కాలనీ చెరువును తలపిస్తోంది. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అతి భారీ వర్షాలు.. ట్యాంక్బండ్ వద్ద వరద ఉధృతి పరిశీలించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తగ్గిందన్నారు. మూసీ వరదను మానిటర్ చేస్తున్నాం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖ అధికారులతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావం కొంత తగ్గింది కుంభవృష్టిగా, ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, పలు కాలనీల్లో మాత్రం తాత్కాలికంగా వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడమేనని స్పష్టం చేశారు. వాళ్ల సెలవులు రద్దు హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించాం హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని . భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. చెరువులకు గండి పడే ప్రమాదం వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
బిగ్ అలర్ట్..ముసారాంబాగ్ బ్రిడ్జ్
-
బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న మూసీనది