Musi River
-
చతుర్భుజం.. మూసీ పునరుజ్జీవం..!
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో కాలుష్యమయంగా మారిన మూసీ నదికి నాలుగు దశల్లో పునరుజ్జీవం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతలో నదీ జలాల శుద్ధితోపాటు వర్షపునీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే రెండో దశలో ల్యాండ్స్కేపింగ్ను అభివృద్ధి చేసి నది సహజసిద్ధ లక్షణాన్ని పునరుద్ధరించాలనుకుంటోంది. ఇక మూడో విడతలో మూసీ పరీవాహక కారిడార్లలో రవాణా హబ్లను ఏర్పాటు చేయాలని, నాలుగో దశలో ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం కసరత్తు మొదలుపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) తొలి విడత పనులకు రూ. 5,863 కోట్లు అవసరమని అంచనా వేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం (రూ. 1,763 కోట్లు) నిధులను సమకూరిస్తే మిగిలిన 70 శాతం (రూ. 4,100 కోట్లు) నిధులను ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ (పీపీఆర్)ను అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టు పూర్తి..హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయిలో మూసీ పునరుద్ధరణకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. మూసీ నదిని శుద్ధి చేసి పర్యాటక, వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈస్ట్–వెస్ట్ కారిడార్ నిర్మాణం.. మూసీ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే కుటుంబాలకు పునరావాసం కల్పించడంతోపాటు మూసీ భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన భూముల కోసం ల్యాండ్ పూలింగ్ను ప్రభుత్వం చేపట్టనుంది. నది వెంట తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ కారిడార్ను నిర్మించనుంది. దీనివల్ల ఔటర్ రింగ్రోడ్ నుంచి ప్రధాన నగరంలోకి రవాణా సులువు కానుంది. అలాగే మూసీ చుట్టూ 16–18 ప్రాంతాల్లో హెరిటేజ్ బ్రిడ్జీలను నిర్మించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపారస్తుల కోసం స్థలాలను కేటాయించనుంది. మూసీ వెంబడి రిక్రియేషనల్ జోన్లు, పార్క్లను కూడా ఏర్పాటు చేయనుంది. రీసైకిల్ వాక్వేలు, పార్కింగ్ ప్లేస్లు.. మూసీ పరిసర ప్రాంతాల్లో రీసైకిల్ చేసిన వస్తువులు, ఉత్పత్తులతో వాక్ వేలు, పార్కింగ్ ప్రాంతాలను ప్రభుత్వం నిర్మించనుంది. అలాగే వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని రెయిన్ గార్డెన్లు, గ్రీన్ రూఫ్లను ఏర్పాటు చేయనుంది. వరదలు, విపత్తుల నిర్వహణకు ఎలివేటెడ్ స్ట్రక్చర్లు, ఫ్లడ్ బారియర్లను కట్టనుంది. వరద ముప్పును పసిగట్టడం, నీటి నాణ్యత, నీటి ప్రవాహాలను సమర్థంగా నిర్వహించడంతోపాటు వనరుల కేటాయింపు, ప్రణాళిక, నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్), కృత్రిమ మేథ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనుంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా నిధులను సమకూర్చే సంస్థలకు గ్రీన్బాండ్లను జారీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్పానర్ప్లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనుంది. -
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం పచ్చిఅబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మూ సీ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్కు సెపె్టంబర్లో పంపించిన ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని, కానీ, శాసనమండలి సాక్షిగా మంత్రి శ్రీధర్బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు సమాధానం చెప్పారని విమర్శించారు.ప్రపంచ బ్యాంకుకు మూసీ కోసం ఋణం అడిగిన సాక్ష్యాధారాల నివేదికల ప్రతులను ఆమె విడుదల చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ, హైదరాబాద్ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి భవంతులు కడతామని స్పష్టంగా పేర్కొందని కవిత విమర్శించారు. -
మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?
గత నలభై సంవత్సరాలుగా మూసీ నది మృత్యుగానం వినిపిస్తోంది. 1997లో ఈ వ్యాసకర్త మూసీ కాలుష్యం తీరు తెన్నులపై, దాని పరివాహక ప్రాంతంలోని గ్రామాలపై కాలుష్య ప్రభావం గురించి రాసిన పరిశోధనా వ్యాసంలోని అంశాలు... ఆ ప్రాంత ప్రజలను కదిలించాయి. ముఖ్యంగా ఎదులాబాద్ గ్రామ ప్రజలు చేసిన పోరాటం మరువలేనిది. మేధాపట్కర్, గజేంద్రసింగ్లు కూడా మూసీ కాలుష్యం, దాని ప్రభావం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఉద్యమానికి సంఘీబావం ప్రకటించారు. విషపూరిత రసాయనాలతో, మానవ, పశువుల విసర్జనాలతో నిండిన ఈ కలుషిత నీరే అత్యధిక ధాన్య (వడ్లు) ఉత్పత్తికి దోహదపడింది. నిజాం రాచరిక పాలన కాలంలో నిర్మించిన 23 కత్వల (చిన్న ఆనకట్టలు) ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఏర్పాటు జరిగింది. నేడు సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.‘పిలాయిపల్లి కాల్వ’, ‘బునాది గాని కాల్వ’ అనే రెండు కొత్త కాలువల నిర్మాణం ఇటీవల జరిగింది. అంటే అవే 23 కత్వల కింద ఆయకట్టు దాదాపు పదమూడు రెట్లు పెరిగిందన్నమాట! ఇదెలా సాధ్యమైనట్టు? 1925లో జంట నగరాలకు తాగునీటి సరఫరా రోజుకు 23 మిలి యన్ గాలన్స్గా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ ఈ రోజు రమారమి 600 మిలియన్ గాలన్స్గా ఉంది. ఇందులో 80 శాతం నీరు వాడిన తర్వాత తిరిగి మూసీలో కలుస్తోంది. ఈ కలుషిత నీరే నదిని జీవనదిగా మార్చింది. ఈ నీరే పైన ఉదహరించిన 2 లక్షల ఎకరాల వరి సాగుకు మూలం. లక్షలాది టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఎందరికో పని దొరుకు తోంది. అదే సమయంలో కాలుష్య జలాల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.హానికరమైన రసాయనాలతో నిండిపోయిన నది ఉపరితల జలాలు, భూగర్భజలాలు, ఆహార గొలుసంతా విషతుల్యమయింది. బియ్యం, పాలు, కాయగూరలు దేనికీ మినహాయింపు లేదు. బాధ్యతా రహితంగా కంపెనీలు రసాయన వ్యర్థాలను ట్రీట్మెంట్ చేయకుండా నదులు, చెరువులు, వాగుల్లోకి వదిలి వేస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. జంట నగరాల చుట్టూ ఉన్న కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాలు మూసీనే కాకుండా వందకు మించిన చెరువులకు కూడా మరణ శాసనం లిఖిస్తున్నాయి. నిజానికి ఇవ్వాళ దేశంలో చాలా నదుల స్థితి ఇదే. తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిమిత వనరులను జాతి శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచి ఉందన్న భారత సైన్స్ సంస్థ బాధ్యులు డాక్టర్ రామచంద్ర ప్రభు హెచ్చరికల్ని ప్రభుత్వాలు ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీలులేదు.జల వనరుల కాలుష్యం వల్ల ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు ‘నీతి ఆయోగ్’ లెక్క గట్టింది. ఈ మధ్యనే విడుదలయిన నదుల నీటి నాణ్యత ఇండెక్స్లో మూసీ నది నీటిలో ఆక్సిజన్ స్థాయులను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయులు 1–4 మధ్యన ఉండాల్సింది... నల్లగొండ జిల్లా వివిధ ప్రాంతాలలో 13, 15 స్థాయులుగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలలో 258 నదులపై స్విస్ సంస్థ ఒకటి ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. 2022 సంవత్సరంలో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా మారిన నదులలో మూసీ నది 22వ స్థానంలో ఉంది. నదిలో 48 రకాల రసాయన అవశేషాలు ఉన్నట్టు ఆ పరీక్షలలో తేలింది. ఈ రసాయనాల వల్ల మనుషులు వివిధ రకాల క్యాన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, గొంతునొప్పి వంటి రోగాల బారిన పడతారని తెల్చింది. ఈ రోగాల ముప్పు అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉంది. ప్రజలు, పశు పక్ష్యాదుల ఆరోగ్యాలకు ముంచుకొస్తున్న ముప్పు నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడటాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రక్షాళన, సుందరీకరణ చేసి తీరుతామని చెప్పటం ఒక శుభ పరిణామం. ఈ విషయంలో సీఎం సీరియస్గానే ఉన్నారనే విషయం స్పష్టంగానే కపిస్తోంది. అందుకు ఆయనను అభినందించాలి.చదవండి: నీటి యుద్ధాలు రానున్నాయా!అయితే ఈ సమస్యపై అధికార ప్రతిపక్షాల మధ్య సాగు తున్న వాదోపవాదాలు కొంత గందరగోళానికి దారి తీశాయి. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ప్రాజెక్టుపై తన కార్యచరణను తలకిందులుగా మొదలు పెట్టడమే కాకుండా హైడ్రాతో ముడిపెట్టింది. దాంతో నదిలో ఉన్న నివాసాల తొలగింపు మొదలైంది. ఇక్కడ రెండు విషయాల పట్ల ప్రభుత్వం స్పష్టంగా ఉండాలె. ఒకటి నది ప్రక్షాళన అయితే, రెండోది నది ప్రాంత సుందరీకరణ. ఈ రెండింటినీ ఏక కాలంలో చేపట్టాల్సిన అవసరం లేదు. ఏది ముందు ఏది తర్వాత అనేది ప్రశ్న. జవాబు స్పష్టమే! ముందు ప్రక్షాళన, తర్వాతే సుందరీకరణ. నది ప్రక్షాళన కోసం చేయాల్సిందేమిటి? కంపెనీల నుంచి వెలువడే హాని కరమయిన రసాయనాలను, మావన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదిలోనికి వదలొద్దు. వ్యర్థాల శుద్ధి కోసం సమగ్రమైన ప్రణాళిక అవసరం. పెట్టుబడి, పట్టుదల నిజాయితీతో కూడిన కార్యాచరణ ఎంతో అవసరం. ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక. నదికి మొలసిన ఈ నారీ పుండ్లను తొలగిస్తేనే సుందరీకరణ సాధ్యం.చదవండి: ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?ఈ సుందరీకరణకు ముందు జరగాల్సింది చాలా ఉంది. ముందు నది వైశాల్యాన్ని తేల్చాలి. దాని వాస్తవిక వైశాల్యం ఎంత ? భారీ వరద వస్తే ఎంత ఎత్తున పారుతుందో (నది పారు ప్రాంతం) గుర్తించాలి. దాని లోపల నివాసాలు ఉన్నట్లయితే తొలగించాల్సిన/సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భూసేకరణ చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంది. నిర్వాసితుల పునరావాసానికి, వారి ఆర్థిక సామాజిక, సాంస్కృతిక పునర్నిర్మాణానికి 2013 చట్టాన్ని పాటించాలి, ఇంకా మెరుగుపర్చుకోవాలి. నది ప్రక్షాళన, సుందరీకరణ ఎంత ముఖ్యమో ప్రజల జీవితాలు అంతకన్నా ముఖ్యం. ప్రాజెక్టు పేరుతో ఇప్ప టికే ఉన్న ఒక ఆర్థిక, సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నా మన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలె. అప్పుడే కూల్చిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆలోచనాపరంగా అడ్డంకులు ఉండవు. ప్రకటించిన ప్రాజెక్టులను ప్రజాగ్రహం మూలంగా వెనుకకు తీసుకోవాల్సిన అవసరం రాదు. ప్రభుత్వానికి ఈ విషయంలో సరైన సలహాలు అవసరం.- ఆచార్య కట్టా ముత్యం రెడ్డి ప్రెసిడెంట్, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ -
మూసీ కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది పరీవాహకంతోపాటు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తి సర్వే నిర్వహించాలని సూచించింది. ఇందుకు పిటిషనర్లు, ఆక్రమణదారులు సహకరించాలని చెప్పింది. అవసరమైతే అధికారులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ కొత్తపేట్లోని న్యూ మారుతీనగర్వాసులు దాఖలు చేసిన పిటిషన్లో ఈ మేరకు విచారణను ముగించింది. అధికారులు తమ ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూ మారుతీనగర్కు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకున్నామని.. ఆస్తిపన్ను, నల్లా పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి.. అధికారులకు, పిటిషనర్లకు పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు. హైకోర్టు సూచనలివీ... – ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమించినట్లు తేలితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలి. – మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలి. – పట్టణాభివృద్ధి శాఖ 2012లో జారీ చేసిన జీవో 168 ప్రకారం ఇచ్చిన బిల్డింగ్ రూల్స్ను కచ్చితంగా పాటించాలి. – మూసీలోని ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లోని కేసుల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలతోపాటు 2023 నవంబర్ 8న ఆక్రమణలపై జారీ చేసిన సర్క్యులర్లోని సూచనలను మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టులు పాటించాలి. – మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల స్థిరీకరణ కోసం అధికారులు చేపట్టే సర్వేలను పిటిషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోవద్దు. – సర్వే కోసం వెళ్లే నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి. – తెలంగాణ నీటిపారుదల చట్టం–1357 ఫస్లీ, వాల్టా చట్టం 2002లోని నిబంధనల ప్రకారం నదులు, నీటివనరులు, చెరువులు, సరస్సుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు, భూ కబ్జాదారులపై అధికారులు తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
లారీకి రూ.25 వేలు తీసుకుని కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్న ముఠా
-
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే... మానవీయంగా!
మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!- జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
ఏ తల్లి కన్నబిడ్డో..!
చాదర్ఘాట్: ఏ తల్లి కన్నబిడ్డో. ఓ పసికందు అనాథగా మారాడు. శనివారం ఉదయం వాహెద్నగర్ (ఓల్డ్ మలక్పేట్) మూసీ నది ఒడ్డున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పసికందు ఏడుస్తున్న శబ్దం విన్న స్థానికులు చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో అజంపురా డివిజన్లోని ముస్లిం మెటరి్నటీ హాస్పిటల్లో పసికందుకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఐ భరత్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
-
రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు.‘‘కోటిమంది డ్రైనేజీ నీళ్లు మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా?..రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యింది. డీపీఆర్ రావడానికి రెండేళ్లు పడుతుంది. ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయండి. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దు. హుస్సేన్ సాగర్లో కొబ్బరినీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్కి వెళ్లాడు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి’’ కిషన్రెడ్డి డిమాండ్ చేశారు...మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి. నల్లగొండ రైతులకు న్యాయం చేయండి. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సీఎం గా రేవంత్ పనిచేస్తారు’’ అంటూ కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
KTR: కేసులు పెడతామని ఎవరు బెదిరించినా భయపడొద్దు
-
KSR Live Show: మూసీ యుద్ధం..
-
ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా: రేవంత్రెడ్డి
సాక్షి, వరంగల్ జిల్లా: బీఆర్ఎస్, బీజేపీ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని.. జెండా, అజెండా పక్కనపెట్టి మూసీ అభివృద్ధికి ప్రయత్నించాలంటూ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు దోచుకోవడమే తెలుసు, ప్రజల కష్టాలు తెలియవంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.‘‘ఒకప్పుడు మూసీలో అరుదైన చేపలు బతికేవి. ఇప్పుడు మూసీ నదిలో చేపలు బతికే పరిస్థితి లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో కల్లును అమ్ముకునే పరిస్థితి లేదుమూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంత వాసులకు వరంగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు, కూరగాయలు, పాలు కలుషితం అయ్యాయి. మూసీ నీటితో పండించిన పంటలకు మంచి ధర రావడం లేదు. నల్గొండ జిల్లాను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ వెంటాడుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘మూసీ కాలుష్యంతో అణుబాంబు కంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. మోదీ సబర్మతి ఫ్రంట్ రివర్, గంగానది ప్రక్షాళన చేస్తే అద్భుతం అంటున్నారు. మరి మేం మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా?. మూసీ ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు?. ఎవరు అడ్డువచ్చినా మూసి ప్రక్షాళన చేసి తిరుతాం. ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
మూసీ నదిలో రేవంత్ రెడ్డి పర్యటన
-
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్పై, అమీన్పూర్ తహసిల్దార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
మూసీ పునరుజ్జీవ యాత్ర చేపట్టనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
-
ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ‘‘ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నిళ్లు ఇవ్వాల్సిందే. కృష్ణా, గోదవారి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. మూసీకి రిటైనింగ్ వాల్ కట్టాలి.. సీటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కులగణనకు మేం వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని అన్నారు. -
పేదల ఇళ్ల జోలికి రావద్దు: కిషన్ రెడ్డి
-
కిలోమీటర్కు రెండు వేల కోట్లా.. మూసీపై క్లారిటీ ఉందా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై సీఎం రేవంత్కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు అంటూ ఆరోపించారు.ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించింది.. ఇప్పుడు విషం కక్కుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా?.మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమని చెప్పు. అలా వెళ్తే ప్రజలు వాళ్లను గంప కింద కమ్ముతారనే భయం ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని మరోసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర కోట్ల ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే.బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
మూసీ పేరిట కాంగ్రెస్ భారీ దోపిడీ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు(శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు...మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసీని కాంగ్రెస్కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైందిసంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. -
మూసీ నివాసితులను వెంటాడుతున్న కూల్చివేతల భయం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నివాసితులను కూల్చివేతల దడ వెంటాడుతూనే ఉంది. నదీ ప్రక్షాళన రాజకీయ కేంద్ర బిందువుగా మారి తాత్కాలికంగా కూల్చివేతల ప్రక్రియ నిలిచినా.. భవిష్యత్తులో మళ్లీ వీటి బెడద తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నివాసితులు తమ ఇళ్లను రక్షించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటుండగా.. మరికొందరు సామాజిక కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోరాటం ఆందోళనలు సైతం ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు అధికారేతర రాజకీయ పక్షాలు అండగా తామున్నామంటూ పరీవాహక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల పర్యటనలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.కోర్టును ఆశ్రయించిన నివాసితులు మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2,166 నివాసాలు నదీ గర్భంలో ఉన్నట్లు డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల బృందం ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో 68 శాతం ఇళ్లకు మార్కింగ్ చేశారు. కొన్ని గృహాలను కూలీల సహకారంతో కూల్చివేశారు. దీంతో కొందరు మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, కొత్తపేటలోని దాదాపు 620 కుటుంబాలు కోర్డులో పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో 400 నివాసాలకు స్టే వచ్చింది. మరోవైపు ఇటీవల వేసిన ఆర్బీ మార్క్ను సైతం ఇళ్ల యజమానులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ కమిషన్కు దళిత కుటుంబాలు మూసీ పరివాహకంలో నివాసాలు కూల్చకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్ను దళిత కుటుంబాలు ఆశ్రయించాయి. కూలిపనులు చేసుకొని జీవనం సాగించే తమ ఇళ్లను అర్ధాంతరంగా కూల్చివేస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాదర్ఘాట్, శంకర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు పోస్టుకార్డు ఉద్యమం మూసీరివర్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి, గవర్నర్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లకు పోస్టు కార్డులు రాసి పంపించారు. గతంలో చేపట్టిన డ్రోన్ సర్వేపై ఆధారపడకుండా తిరిగి భౌతికంగా సర్వే చేస్తే మూసీకి దగ్గరలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లను వదిలే ప్రసక్తిలేదని నివాసితులు తేల్చి చెబుతున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొంటున్నారు.చదవండి: షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. డోర్లాక్ పేరుతో అడ్డగోలు బాదుడుపక్కా నిర్మాణాలతోనే సమస్య.. మూసీ పరీవాహక పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30 శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో శాశ్వత నిర్మాణాలతో సమస్య తీవ్రమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చేబుతున్నారు. దీంతో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. -
మూసీ అభివృద్ధికి కాదు.. మీ దోపిడీకి వ్యతిరేకం
నాగోలు (హైదరాబాద్): మూసీ పునరుజ్జీవం కో సం రూ.26 వేల కోట్లు మించని వ్యయాన్ని లక్షన్నర కోట్లు కావాలని చెబుతుంటే ఎలా అంగీకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మీరు చేసే దోపిడీకి వ్యతిరేకమని అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో కలిసి ఆయన నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నాగోల్లో 320 ఎంఎల్డీ సామ ర్థ్యంతో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభు త్వాలేనని ఆరోపించారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి కోసం రూ.3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తోందని చెప్పారు. మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ కట్టండి బీఆర్ఎస్ హయాంలో మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లు తలెత్తకుండా మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్ నిర్మించాలనుకున్నామన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని చెప్పారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తెలిపారు. మూసీకి రెండువైపులా రిటై నింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బంగారి లక్ష్మా రెడ్డి, వివేకానంద్గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. -
మూసీపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్
-
కేటీఆర్ అతి తెలివి.
-
మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్..!
-
సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్
-
మెగాస్టార్, సూపర్ స్టార్ను మించిన నటుడు రేవంత్: హరీష్ రావు
సాక్షి, తెలంగాణభవన్: రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మెగాస్టార్, సూపర్ స్టార్ను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఉంది. మూసీ పునరుజ్జీవనం అని చెబుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ పునరుజ్జీవనం అంటే నదీ జలాల శుభ్రంతో ప్రక్రియ ప్రారంభం కావాలి. కేసీఆర్ హయంలో మూసీలోకి గోదావరి నీళ్లు తెచ్చేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైంది.సీఎం మాటలతో అబద్దమే ఆశ్చర్యపోతోంది. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. శత్రుదేశాలపై దాడి చేసినట్టు పేదల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. మెగాస్టార్, సూపర్ స్టార్ను మించిన నటుడు రేవంత్ రెడ్డి. ఐదేళ్లలో రూ.లక్షా 50వేల కోట్లతో మూసీని ప్రక్షాళిస్తామన్నారు. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు.మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చర్చకు నేను సిద్ధం. రేపు(శనివారం) ఉదయం తొమ్మిది గంటలకు నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను రెడీ. సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్దాం. బాధితులకు మాట్లాడేందకు మీరు వస్తారా?. వారి వద్దకు వచ్చే దమ్ముందా? రివర్ ఫ్రంట్ ఏంటి..?. దాన్ని వెనుకున్న స్టంట్ ఏంటి? అని ప్రశ్నించారు. ముందు మూసీ వద్దకు పోదాం. తర్వాత కొండ పోచ్చమ్మ సాగర్, మల్లన్నసాగర్, కిష్టాపూర్ వద్దకు వెళ్దాం అన్నారు. మూసీలో పరివాహక ప్రాంతంలో నివాసం ఉండటానికి నేను సిద్ధం. 10వేల మందికి సహాయం అవుతుంది అనుకుంటే మూడు నెలలు కాదు నాలుగు నెలలు మూసీ పక్కనే నివాసం ఉంటాను. కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది నాకు కృతజ్ఞత ఉండాలని రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కృతజ్ఞత ఉండాలి. నేను మంత్రి అయినప్పుడు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ చేసిండు. నేను అమరవీరులకు నివాళులర్పిస్తుంటే.. రేవంత్ రెడ్డి నా వెనకాల నిలబడి హైట్ తక్కువ ఉంటాడు కదా.. కెమెరాల్లో కనపడాలని నక్కి నక్కి చూశాడు. మా మద్దతుతోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మూసీ సుందరీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్ -
పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది.👉ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది👉మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది👉మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (పర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అయింది👉మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించింది👉బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసింది👉మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కెసిఆర్ నాయకత్వానిది👉ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైంది. దేశంలోనే ధాన్యరాశిగా మారింది👉పేదల కంట కన్నీరు లేకుండానే Paris, Bogota, Mexico City, Montreal లను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకుంది👉మూసీ నదికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ పక్కన పెట్టుబడి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మనీ స్పిన్నింగ్ కోసమా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ?👉ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. సమావేశాల్లో తల కిందకి, మీదకి తిప్పితేనో అభివృద్ధి జరగదు👉ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటూ ప్రభుత్వ బడి పిల్లల ఇజ్జత్ తీయకు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడతారు. ప్రపంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు.పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందిఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది…— KTR (@KTRBRS) October 18, 2024 -
మూసీ నది సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూసీపై సీఎం తీరు అర్థరహితం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు అర్థరహితంగా ఉందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం కీలక ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపింది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ప్రతిపాదించి, చాలా వరకు పూర్తి చేసినట్లు కేటీ రామారావు పలు సందర్భాల్లో వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎస్టీపీల నిర్మాణ పనులను ఇటీవల కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సందర్శించారు. -
‘మూసీ’ ప్రజల జీవనప్రమాణాలు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: మురుగునీటితో నిండిన మూసీని బాగు చేస్తున్నట్టే.. పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరి గాలికి వదిలేయబోమని, వారి జీవన ప్రమాణాలు మారుస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, రాజకీయపక్షాల నాయకులు, సామాజిక నాయకుల సలహాలు, సూచనలు కూడా వింటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలు, అభివృద్ధి విజన్ను మూసీ పరీవాహక ప్రాంతవాసులకు వివరించా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీలో నివాసముంటున్న వారికి పట్టాలు ఉన్నా. లేకున్నా వారంతా తెలంగాణ బిడ్డలేనని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మూసీకి దగ్గరున్న ప్రభుత్వ భూముల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మూసీ నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళాసభ్యులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేసి సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వారికి చెప్పాలన్నారు. ప్రజలకు మేలు జరిగే సూచనలు ఇస్తే అమలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు. ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి ఆదాయ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో భట్టి ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేíÙంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదాయం పెంపునకు నిర్దిష్ట ప్రణాళికతో రావాలన్నారు. లొసుగులను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్య పన్నుల కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆయా విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల విక్రయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరాలంటే ఏం చేయాలో సీనియర్ అధికారులు ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్రాజ్, వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి రిజ్వీ, గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
Hydra: కూల్చివేతలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకం పరిధిలోని నివాసాల కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీగర్భం, బఫర్ జోన్లో గుర్తించిన నివాసాలకు పునరావాసం, పరిహారం అంశాలు తేల్చాకే కట్టడాల తొలగింపునకు ముందడుగు వేయాలని సర్కారు పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడటంతో రెవెన్యూ యంత్రాంగం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నదీ గర్భంలో సైతం రెడ్ మార్కింగ్ నిలిచిపోగా, నివాసాలు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్లకు తరలిన కుటుంబాల ఇళ్లను సైతం కొన్నింటిని మాత్రమే కూలీలతో కూల్చివేశారు. మిగతా కూల్చివేత పెండింగ్లో పడింది. కొన్ని ఉమ్మడి కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించినా..వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై మూసీ పరీవాహకం పరిధిలోని నివాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో అధికారులు ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. సర్కారు మాత్రం మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని పేర్కొంటున్నా...నివాసితులకు పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యగా తయారైంది. ఆదిలోనే హంసపాదు మూసీ ప్రక్షాళనకు ఆదిలోనే హంసపాదు ఎదురైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నదీ పరీవాహకం పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన నివాసాలపై రెడ్మార్కింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. నివాసితుల నుంచి త్రీవ వ్యతిరేకత ఎదురుకాగా, సగం ఇళ్లకు మాత్రమే రెడ్ మార్క్ వేసి వెనుకకు తగ్గక తప్పలేదు. మరోవైపు నివాసితులకు ప్రతిపక్ష పారీ్టల మద్దతు పెరగడంతో వారు సైతం ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో నదీగర్భంలో రెడ్మార్క్ వేసిన గృహాల జోలికి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పరీవాహక పరిధిలో 12,184 పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని రెండుగా వర్గీకరించి నదీగర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నదీగర్భంలో 2,166 నిర్మాణాలు ఉండగా, అందులో 288 భారీ నిర్మాణాలున్నాయి. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు గల బఫర్జోన్ పరిధిలో 7,851 ఆక్రమణలు, ఇందులో 1032 బడా నిర్మా ణాలున్నట్లు అ«ధికారులు గుర్తించారు. మిగతా పరిధిలో 3004 అక్రమ కట్టడాలున్నట్లు బయటపడింది. పునరావాసంపై అయోమయం మూసీ నదీ గర్భంలోని నివాసితులు పునరావాసం సమస్యగా తయారైంది. అధికార లెక్కల ప్రకారం 2166 డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉంటుంది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కుటుంబాలను పునరావాసం కల్పించాల్సిన ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో మొత్తం మీద ఖాళీగా ఉన్న గహాలు 500కు పైగా కూడా లేనట్లు తెలుస్తోంది. నివాసాలు ఖాళీ చేసిన సుమారు 10 శాతం కుటుంబాలకు పునరావాసం కల్పించగలిగారు. సైదాబాద్, హిమాయత్నగర్,æ నాంపల్లి మండలాల్లోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన 193 మందిని మలక్పేటలోని పిల్లిగుడిసెలు, జియా గూడ, ప్రతాపసింగారం, జంగంమెట్లోని రెండు పడకల గృహసముదాయానికి తరలించారు. మిగతా వారికి పునరావాసంపై ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
హైడ్రాపై హైరానా వద్దు.. హైదరాబాద్ అంటేనే రాక్స్, లెక్స్: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని భట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ..‘చెరువుల ఆక్రమణ హైదరాబాద్కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాక్స్, లెక్స్ అండ్ పార్క్స్. కాలక్రమేనా పార్క్స్ అండ్ లేక్స్ కబ్జాలకు గురి అయ్యాయి.చిన్న వర్షం పడితేనే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమే. మూసీపై ప్రజలకు కొందరు భ్రమలు కల్పిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు 2024 వరకు కబ్జాకు గురైన చెరువులపై సర్వే చేశారు. హైదరాబాద్లో 20 పార్కులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు. చెరువులు కబ్జా కాకూడదు అనేదే మా ఆలోచన. మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఎజెండా మాత్రమే కానీ.. వ్యక్తిగత ఎజెండాలు లేవు.మన ఆస్తులు మనకు కావాలి.. కాపాడుకోవాలి అని తెలంగాణ తెచ్చుకున్నాం. కోరి కొడ్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత మనమీద ఉంది. గత పాలకులు బాధ్యత లేకుండా పాలన చేశారు. కబ్జాకు గురైన కట్టడాలను కూల్చాలని కేటీఆర్, హరీష్ అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వక్రీకరిస్తున్నారు. మూసీ బాధితులకు ఆదుకుంటాం. ఇళ్లకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. మూసీ బాధితులను ఆదుకునేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. మూసీ గర్భం, ఎఫ్టీఎల్ వరకు మాత్రమే వెళ్తున్నాం.. బఫర్ జోన్ జోలికి వెళ్ళడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్ -
మూసీ ప్రక్షాళన.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..?
-
ఫామ్హౌస్లు కాపాడుకునేందుకు దీక్షలా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కబ్జాల కారణంగా మూసీ పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్హౌస్లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. చెరువుల ఆక్రమణతో మన బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావుకు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని అన్నారు ..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ఫామ్హౌస్లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పేదలకు రూ.500 కోట్లు ఇవొచ్చు కదా?. అంబర్పేటలో 200 ఎకరాల భూమి ఉంది. అది పేదలకు పంచుదాం.. ప్రతిపక్ష నేతలు ఏమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేసీఆర్, కేటీఆర్కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం 11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం 18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన -
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై శ్రీధర్బాబు స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే ప్రభుత్వం బద్నాం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే తన స్పందన అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రాకు ఆర్డినెన్స్కు ఆమోదం లభించిందన్నారు.మంత్రి శ్రీధర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి, సంక్షేమంపై చాలెంజ్ చేస్తాం. కత్తుల యుద్ధం చేస్తా అంటే నాలుగేళ్ల తర్వాత చేద్దాం. సంచులు మోసింది వాళ్లే అందుకే అదే గుర్తుకు వస్తుంది. ఇష్టారాజ్యం, అడ్డుగోలుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదు. పార్టీ పరంగా ఏమైనా తప్పులు జరిగితే రాహుల్ గాంధీ సరిచేస్తారు. అంతేగానీ మూసీ ప్రాజెక్ట్కు రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసి రెండు రోజులు వార్తల్లో ఉండాలి అనుకుంటున్నారు.డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఈటల రాజేందర్కు ఆహ్వానం అందలేదు అంటే సమీక్ష చేస్తాం. ప్రోటోకాల్ అంశంలో ఎక్కడ తప్పు జరిగిందో రివ్యూ చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే బీఆర్ఎస్ నేతలు బద్నాం చేస్తున్నారు. జహీరాబాద్కు పొల్యూషన్ కంపెనీలు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జహీరాబాద్కు త్వరలో హ్యుందాయ్ సంస్థ వస్తుంది.. అది పొల్యూషన్ సంస్థనా?. తెలంగాణ నుంచి కంపెనీలు తరలి వెళ్తున్నాయి అనేది అవాస్తవం.కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే నా స్పందన. నేను ఇప్పటి వరకు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు.. చేయను. కేటీఆర్, బండి సంజయ్, హరీష్ రావు నా మిత్రులు. కేవలం రాజకీయ అభిప్రాయాలు మాత్రమే వేరు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: కేటీఆర్పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రేవంత్కు ఈటల సవాల్.. ముక్కు నేలకు రాస్తా అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్దాం. ప్రజలు రేవంత్ను శభాష్ అంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీంతో.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు రాజకీయం మారిపోయింది.మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైరం ఉంటే మూసీ బాధితుల వద్దకు ఇద్దరం కలిసే వెళ్దాం. సెక్యూరిటీ లేకుండా అక్కడికి పోదాం. మూసీ పరివాహక ప్రాంత ప్రజల రేవంత్ను శభాష్ అంటే నేను అక్కడే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతాను. అలాగే, రాజకీయ సన్యాసం తీసుకుంటా. రేవంత్.. ప్రజల చేత ఇంతలా తిట్టించుకున్న నాయకుడు ఎవరూ లేరు.గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారు. కడుపు మండి మాట్లాడిన పేదలను ఐదు వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారు. అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్కు అధికారం నెత్తికెక్కింది. మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటీ ? డీపీఆర్ ఏంటీ?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులే లేవు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైందని రేవంత్ చెబుతున్నారు. మరి.. లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తున్నారు. కేసీఆర్ కూడా గతంలో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రేవంత్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. మోసం, అబద్ధానికి మారుపేరు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కేటీఆర్పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రూ. ఐదు కోట్ల భూమికి పరిహారం ఐదు లక్షలేనా?.. కాంగ్రెస్పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులు: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.ఈ మేరకు మంత్రి మంగళవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ను నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. -
బీఆర్ఎస్కు కోమటిరెడ్డి సవాల్.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షాలకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది విషయంలో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణను పది సంవత్సరాలు పాలించి బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఘాగు విమర్శలు చేశారు.మంత్రి కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ కోసం కేటీఆర్ వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు?.నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ. మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?.బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి. నేను 25ఏళ్ల కింద మూసీ నది కోసం దీక్ష చేశాను. జయశంకర్ అప్పుడు నాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
ప్రపంచ విషపూరిత నదుల్లో 23వ స్థానంలో మూసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విషపూరిత నదుల్లో హైదరాబాద్లోని మూసీ 23వ స్థానంలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మూసీ చుట్టుపక్కల ఉన్న బోర్ వాటర్ కూడా కలుíÙతమైందని, అందుకే దాని పక్కన ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. సోమవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పక్కన తాను నివాసం ఉన్నానని, ఆ బాధలు ఏంటో తనకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మూసీ, హైడ్రాపై కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేయలేని పనిని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నారన్నారు. కేటీఆర్ ఫామ్హౌస్ కట్టుకొని హాయిగా ఉండొచ్చునని, ఇటలీ నుంచి వచ్చే నీళ్లు కేటీఆర్ తాగుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు శనిలాగా దాపురించారని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. -
హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి ఆ విభాగం పని తీరుపై స్పష్టత ఇచ్చారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదన్న ఆయన.. ప్రజలతో పాటు సామాజిక మాధ్యమాలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.‘‘మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు. దీనిని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది’’ అని ఎక్స్ వేదిక ద్వారా తెలియజేశారు. అలాగే..HYDRAA has nothing to do with surveys on either side of the Musi River.HYDRAA is not evacuating the residents there.HYDRAA is not undertaking any demolitions there.No markings have been made on the houses in the Musi catchment area by HYDRAA authorities.The Musi…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024‘‘హైడ్రా అంటే కూల్చివేతలే కాదు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాలి.HYDRAA is not just about demolitions.HYDRAA's jurisdiction extends only up to the Outer Ring Road.Not only in the city, but across the state, and even in other states, demolitions are being attributed to HYDRAA on social media, creating unnecessary fear among people.HYDRAA…— HYDRAA (@Comm_HYDRAA) September 30, 2024.. హైడ్రా ప్రధాన విధి ప్రకృతి వనరుల పరిరక్షణ. చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం’’ అని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. చేశారు.సంబంధిత వార్త: ఎవరిని మెప్పించడం కోసం ఈ దూకుడు?.. తెలంగాణ హైకోర్టు సీరియస్ -
నాలాపై ఉన్న జీహెచ్ఎంసీని హైడ్రా కూల్చేస్తుందా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఏదేదో చెప్పిందని.. తీరా అధికారంలోకి వచ్చాక ఇంకేదో చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మూసీ సుందరీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మరోసారి ఆరోపించిన ఆయన.. హైడ్రా బాధితుల తరఫున పోరాడి తీరతామని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారాయన.తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది?. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంది. కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం అని ప్రకటించింది. ఎన్నికల ముందు తెలంగాణలో చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారు.హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట,ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పేదల ఇల్లు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ ఇందిరమ్మ,సోనియమ్మ చెప్పింది. వరి సాగులో తెలంగాణ టాప్ గా నిలిచింది ఇది కాళేశ్వరం ఘనత కాదా?. 2016లో బీఆర్ఎస్ హయాంలో చెరువులు, బఫర్, ఎఫ్.టి.ఎల్ డ్రా చేస్తూ జీవో ఇచ్చాం. మూసీలో మేము పేదల కడుపు కొట్టకుండా బ్యూటిఫికేషన్ చేశాం. ఎస్.టి.పి లు మేము పూర్తి చేశాం. మేము నిర్మాణం చేస్తే మీరు విధ్వంసం చేస్తున్నారుమూసీ కోసం లక్షా 50 వేల కోట్లా?తెలంగాణలో లంకెబిందెలు లేవని అంటున్నారు. మరి మూసీ అభివృద్ధి ఏం ఆశించి చేస్తున్నారు?. మరోవైపు మూసీకి లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు. 2,400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళనకు పెట్టిన బడ్జెట్ 40 వేల కోట్లు. సబర్మతి రివర్ ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఖర్చు అయింది. యమునా రివర్ ప్రాజెక్టుకు ఖర్చు అయింది వెయ్యి కోట్లు. అలాంటిది 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ అంటున్నారు. మూసీ సుందరీకరణ కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకులాగా ఉందా?. మూసీ ప్రాజెక్టుతో మురిసేది ఎంతమంది?. మూసీ సుందరీకరణతో ఒక్క ఎకరానికి అయినా నీళ్లు వస్తాయా?. ఇది స్కామ్ కాక మరి ఏం అవుతుంది.ఇల్లు అనేది పేద ప్రజల కళల సౌధం. మా నానమ్మ,అమ్మమ్మ ఊర్లు ప్రాజెక్టుల్లో మునిగిపోయాయి. 1994 లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని భాదితులు అంటున్నారు.అలాంటప్పుడు లక్షమంది ప్రజలను నిరాశ్రయులను చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?. ఇళ్లు కూలగొడుతుంటే ప్రజలు ఊరుకుంటారా?. లక్షలాది మంది జీవితం నాశనం చేస్తున్నారు.సెక్రటేరియేట్ కూడా కూలుస్తారేమో!హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎవరి కోసం హైడ్రా తీసుకొచ్చారు?. పేదల ఇళ్లు కూల్చాలని ఎవరు చెప్పారు?. ప్రభుత్వ వైఖరితో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా ఆఫీస్నే కూల్చాలి. రెండోదిగా జీహెచ్ఎంసీ ఆఫీసును కూల్చాలి. నాలాపై ఉన్న జీహెచ్ఎంసీ ఆఫీసును కూలుస్తారా?. ఎఫ్.టి.ఎల్ లో సెక్రటేరియట్ ఉందని రేవంత్ రెడ్డి కూలుస్తారేమో అని అనుమానం ఉంది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. మంత్రులు ఎందుకు మూసీ గురించి చెప్పడం లేదు. అధికారుల వెనక దాక్కుని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణపై డి.పి.ఆర్ రెడీ కాలేదు. డి.పి.ఆర్ రెడీ కాకుండా ఇళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు.చట్ట ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ కు చెప్పిన తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటికే మా నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ వాళ్లు మూసీ బాధితుల వద్దకు వెళ్లవద్దు.బాధితులకు మేం అండగా నిలబడతాము. బాధితులకు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తాము. సాగరహారం లాంటి ధర్నాలు తెలంగాణలో వచ్చే విధంగా ఉన్నాయి.సావాస దోషంతోనే మంత్రి మాటలు5 వేల రూపాయలకు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్బాబు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా పీసీసీ పదవిని అమ్ముకోవడం,సీఎం పదవిని అమ్ముకోవడం తెలంగాణ ప్రజలకు రాదు. సావాస దోషంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.రేవంత్ రెడ్డికి లక్కీడ్రాలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 50 కోట్లకు పీసీసీ పదవీ , 500 కోట్లకు సీఎం పదవీ నీ కాంగ్రెస్ అమ్ముకుంది. హామీలేమాయే?సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుండి వచ్చే మురికినీరు ఎక్కడికి పోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా?. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ళు కుంటలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి నివాసం ఎఫ్.టి.ఎల్ లో ఉంది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నీ సోదరుడి ఇళ్ళు కూలగొట్టు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంచారు. తెలంగాణలో పింఛన్లు ఎందుకు పెంచలేదు. రైతులకు ఇప్పటి వరకురైతు భరోసా ఇవ్వలేదు. ముందు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన హామీలు రేవంత్ రెడ్డి అమలు చేయాలి -
ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే ఊరుకోం
బండ్లగూడ: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. హైదరా బాద్లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో ఉన్న గంధంగూడ, బైరాగిగూడ మూ సీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధి తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆదివారం పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్రావు, మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ స్పీకర్ మధుసూద నాచారి, ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మాలతీనాగరాజ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రీయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్రావు మాట్లాడారు. ఫోన్ చేయండి.. అరగంటలో మీ ముందుంటామూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని హరీశ్రావు చెప్పారు. ‘ఆపదొస్తే ఫోన్ చేయండి... అర్ధ గంటలో మీ ముందుంటా. బుల్డోజర్లు వచ్చి నా, జేసీబీలు వచ్చానా ముందు మమ్మల్ని దా టాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘బలిసినోళ్ల కు దగ్గరుండి ఇళ్లు కట్టిస్తున్నావ్.. పేదల ఇళ్లను మా త్రం కూలగొడుతున్నావ్. ఇదెక్కడి న్యాయం? రేవంత్రెడ్డి.. నీ ప్రభుత్వ జీవితకాలం ఐదేళ్లు మాత్రమే.కానీ నువ్వు కూలగొట్టే పేదల ఇళ్లు వారి జీవితకా లం కల’అని హరీశ్రావు పేర్కొన్నారు. కొడంగల్ లోని సీఎం ఇల్లు రెడ్డికుంటలో ఉందని.. ఆ ఇంటిని రేవంత్ ముందుగా కూలగొట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మూసీ సుందరీకరణను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే తెలంగాణ భవన్కు రావాలని... అర్ధరా త్రి వచ్చినా బాధితులకు ఆశ్రయం ఇస్తామని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు.బడి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రాధాన్యత కాదా?ఎస్సీ, బీసీ హాస్టల్స్లో పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటే ప్రజలు నమ్మరని హరీశ్రావు పేర్కొన్నారు. పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రభుత్వ ప్రాధా న్యతా లేక రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేపట్టడం ప్రాధాన్యతో సీఎం చెప్పా లన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆడ పిల్లలకు టాయి లెట్స్ లేక వందల మంది లైన్లలో నిలబడుతున్నా రని.. వారి కోసం టాయిలెట్స్ కట్టడం ప్రభుత్వ ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు.ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గాంధీ ఆస్పత్రికి మందుల సరఫరా నిలిచిపోయిందని.. దీంతో రోగులకు మందులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కానీ సీఎం మాత్రం సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సాయంతో ఫోర్త్సిటీ నిర్మిస్తానని సీఎం అంటున్నారని విమర్శించారు. -
హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మూసీ నది సుందీరకరణ... ఉధృతంగా కొనసాగుతున్న బాధితుల ఆందోళనలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Operation Musi: మూసీ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా నిరసన గళం తీవ్రమవుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలకు రెండోరోజు శుక్రవారం తీవ్ర నిరసన ఎదురైంది. బాధితులు అడుగడుగునా అధికారులను అడ్డుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. రోడ్లపై బైటాయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపించారు. నిర్వాసితులకు కాంగ్రెసేతర పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. చైతన్యపురిలో బాధితుల ఆందోళనలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. కొత్తపేట మారుతినగర్లో ఒక యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే బృందాలు మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మొదటి విడతగా మూసీ నదీగర్భం (రివర్ బెడ్) పరిధిలోని నిర్మాణాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసే ప్రక్రియ గత రెండు రోజులుగా కొనసాగుతోంది. అయితే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ అందిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి, పక్కా గృహాలు నిరి్మంచుకున్న వారు మాత్రం కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనకు దిగుతున్నారు. దీంతో మార్కింగ్కు ఆటంకాలు తప్పడం లేదు. పునరావాసంపై అయోమయం మూసీ నిర్వాసితులకు పునరావాసంపై అయోమయం నెలకొంది. అర్హులైన నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసినప్పటికీ గతంలో జీఐఎస్ సర్వే ద్వారా గుర్తించిన గృహాలపైనే మార్కింగ్ వేస్తూ ఆ కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటిలో పక్కాగృహాలకు మార్కింగ్ వేయకపోవడం, ఆ కుటుంబాల వివరాలు సేకరించడం పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఆరు నెలల క్రితం మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మా ణాలున్నాయో గుర్తించింది. వాటిని జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)తో అనుసంధానం చేసింది. ప్రస్తుతం దాని ప్రకారమే రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించి ప్రత్యేక యాప్లో పొందుపర్చుతున్నారు.అన్ని గృహాలపై ఆపరేషన్ మూసీ ప్రక్షాళనలో భాగంగా మొదటి విడతగా నదీ గర్భంలోని నివాసాలపై ఆపరేషన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేత బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. దీంతో నదీగర్భం పరిధిలోని గల ఆర్బీ–ఎక్స్(రివర్ బెడ్) మార్కింగ్ పడిన గృహాలతో పాటు దాని వెంట ఉన్న గృహాలు సైతం కూలి్చవేయక తప్పని పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.నిర్వాసితుల తరలింపు మూసీ నిర్వాసితులైన 20 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించి పునరావాసం కలి్పంచినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం హిమాయత్నగర్ మండలంలోని శంకర్నగర్ కాలనీకి చెందిన 6 కుటుంబాలు, వినాయక వీధిలోని మూడు కుటుంబాలను మలక్పేట పిల్లిగుడిసెల సముదాయానికి, నాంపల్లిలోని 11 కుటుంబాలను ఆసిఫ్నగర్ జియాగూడ సముదాయానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. వేల సంఖ్యలో నివాసాలు.. మూసీ పరీవాహక పరి«ధి పొడువునా..నదీ గర్భంలో వేల సంఖ్యలో గృహాలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మాత్రమే డ్రోన్ సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే ఆధారంగా ప్రభుత్వం నదీ గర్భంలో సుమారు 2166 నివాసాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంటుంది. అందులో సుమారు 288 భారీ కట్టడాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్కో మండలంలోని పలు ప్రాంతాల్లో వందలాది గృహలు నదీ గర్భంలో ఉన్నప్పటికీ జీఐఎస్ డేటా ప్రకారమే గృహాలపై రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించడం విస్మయానికి గురిచేస్తోంది. -
మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ చెప్పారు. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో మూసీ పౌర సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్ నగర భవిష్యత్తును కాపాడాలంటే.. మూసీ నదిని పునరుద్ధరించాల్సిందేనని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏకపక్షంగా కాకుండా.. ఎన్జీవోలు, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి, తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టా ఉంటే పరిహారం, ప్రయోజనాలు త్వరలోనే బఫర్ జోన్లో నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియ చేపడతామని దాన కిశోర్ తెలిపారు. వారికి పునరావాస చట్టం ప్రకారం.. పరిహారం, ప్రయోజనాలు అందిస్తామని, ఆ తర్వాతే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థుల చదువు దెబ్బతినకుండా.. వారిని తరలించిన ప్రాంతంలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారిని గురుకులాల్లో కూడా చేర్పిస్తామన్నారు. మూసీ పునరావాస ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. -
‘రెడ్ మార్క్’ గోబ్యాక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది గర్భంలో, బఫర్జోన్లో నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేయడానికి వెళ్తున్న అధికారులకు అడుగడుగునా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఏళ్లకేళ్లుగా కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లను వదిలిపొమ్మనడం ఏమిటంటూ పరీవాహకంలోని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం రెండోరోజు శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు.రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపైనా తమ ఆక్రోశం వెళ్లగక్కారు. అభివృద్ధి అంటే ప్రజలకు మంచి జరగాలని.. తమను ముంచి చేసే అభివృద్ధి ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు మహిళలు బాధతో శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే బృందాలు ఇళ్ల మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మూసీ పరీవాహకంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే తరలివెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పక్కా ఇళ్లు కట్టుకున్నవారు కూల్చివేతను, తరలిపోవడాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే ఎలా బతకాలంటూ చైతన్యపురి వినాయక్నగర్ కాలనీలో మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మరో మహిళ తమ ఇల్లు పోతే ఎలాగనే కలతతో రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురిలో బాధితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి.. మూసీ పరీవాహకంలో లంగర్హౌస్లోని వివిధ బస్తీల్లోని ఇళ్లకు అధికారులు గురువారం రాత్రి మార్కింగ్స్ వేశారు. అలా మొఘల్నగర్ రింగ్రోడ్డు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి బాధితులు రాళ్లు పట్టుకొని ఉన్నారన్న హెచ్చరికలతో వెళ్లలేదు. అప్పటికే స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని.. రాత్రివేళ ఆందోళనలు వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. తహసీల్దార్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. మూడు గంటలు దిగ్బంధం కార్వాన్లోని జియాగూడ, పరిసర ప్రాంతాల వారు.. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని భారీ ఆందోళనకు దిగారు. ఇక్కడి ప్రధాన రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేసి.. అధికారులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చనివ్వబోమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంటిమీద కునుకు కరువు! మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. జీవితకాలం సంపాదించి కట్టుకున ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పాపం ముటగట్టుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఉదయం ఆరేడు గంటల నుంచే బస్తీల్లో అలజడి కనిపిస్తోంది. పెద్దలు పనులకు వెళ్లకుండా, పిల్లలను బడులకు పంపకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరెవరు బస్తీలోకి వస్తున్నారు, అధికారులు వస్తున్నారా అని ఆందోళనగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంటిని ఖాళీ చేసే మాటేలేదు 30ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పడు కూలగొడతామంటూ ఊరుకునే మాటే లేదు. ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. మేం అన్ని పన్నులు కడుతున్నాం. ఇక్కడే బతుకుతాం. – నవనీత, కమలానగర్ (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి02) భవిష్యత్తు ఆశలను కూల్చేస్తారా? పైసా పైసా కూడబెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే.. ఇల్లు మాత్రమేకాదు. భవిష్యత్తు ఆశలూ పోయినట్టే. మా బతుకులను బజారున పడేయొద్దు. – స్వప్న, గోల్నాక (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి03 ) అనుమతులు తీసుకుని ఇళ్లుకట్టుకున్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బ్యాంకు లోన్తో ఇళ్లు కట్టుకున్నాం. 70–80 ఏళ్ల వయసున్న వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? – లక్షి్మ, న్యూమారుతీనగర్ 56 ఏళ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికి వెళ్లాలి? 1968 నుంచి అంటే 56 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడివారంతా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. హైటెక్ సిటీ కంటే సేఫ్గా ఉంటున్నాం. ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట రోడ్ల పాలు చేస్తున్నారు. మేమేం కబ్జా చేసి ఇళ్లు కట్టుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? న్యాయం కోసం పోరాడుతాం. – ఉపేందర్, న్యూమారుతీనగర్ -
పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం
సాక్షి, హైదరాబాద్: మూసీనది పరీవాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకురావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీహాలుకు చారిత్రక ప్రాధాన్యం ఉందని, ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్లో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. జూబ్లీహాలును కూడా దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు.ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. హైకోర్టు భవనం, హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి కట్టడాలను కూడా పరిరక్షిస్తామని, ఇప్పటికే చారి్మనార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయిప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. పురాతన మెట్ల బావులను దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు ⇒ నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్కు వారు ఒప్పందపత్రాలు అందజేశారు. ⇒ ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ⇒ సాయిలైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. ⇒ భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనున్నది. ⇒ అడిక్మెట్ మెట్ల బావిని దొడ్ల డెయిరీ, ఫలక్నుమా బావిని ఆరీ్టసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనుంది. -
పేదల ఇండ్లపై బుల్డోజర్ యాక్షన్
-
హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మూసీ కార్యక్రమంలో రెండో రోజు కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు రెండో రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేయబోయే ఇళ్లకు నెంబరింగ్ ఇస్తూ మార్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. గురువారం దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తమ ఇళ్లకు మార్క్ చేయకుండా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు.. శని, ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ప్లాన్ చేసింది. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్ -
Telangana: మూసీ ‘రెడ్ మార్క్’!
సాక్షి, హైదరాబాద్: మూసీ కట్టడాలపై రెడ్ మార్క్ పడింది. పరీవాహకంలోని నివాసితుల గుండెల్లో ఆవేదన రేపుతోంది. పునరావాసం కింద ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకెందుకంటూ చాలా మంది గోడు వెళ్లబోసుకుంటున్నారు. కడుపుకట్టుకుని సొమ్ముదాచుకుని ఇళ్లు కట్టుకున్నామని, ఏళ్లకేళ్లుగా అక్కడే బతుకుతున్న తమను వెళ్లిపొమ్మంటే ఎలాగని ఆందోళన చెందుతున్నారు. పరీవాహకం వెంట సర్వే చేసి, ఇళ్లకు మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి సర్వే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. మొదటి విడతగా నదీ గర్భంలో ఉన్న కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సుమారు 25 ప్రత్యేక బృందాలు గత నివేదికల ఆధారంగా ఇళ్లను గుర్తించి ‘ఆర్బీ–ఎక్స్’ పేరుతో ఎరుపు రంగులో మార్కింగ్ చేస్తున్నాయి. ఆయా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి అక్కడికక్కడే ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నాయి. 12 వేల కట్టడాల గుర్తింపు హైదరాబాద్ నగరంలో సుమారు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ పరీవాహక ప్రాంతంలో 12వేలకుపైగా కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పోలీసు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంయుక్తంగా సర్వే నిర్వహించి.. నదీ గర్భంలో ఉన్న, బఫర్జోన్లో ఉన్న ఇళ్లు, నిర్మాణాలుగా వర్గీకరించారు. నది గర్భంలో 2,166 కట్టడాలు ఉండగా.. అందులో 288 భారీ నిర్మాణాలు ఉన్నాయి. నది సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న బఫర్జోన్ పరిధిలో 7,851 కట్టడాలు ఉండగా.. అందులో 1,032 భారీ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి మొత్తంగా 30వేలకు పైగానే నివాసాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. చావనైనా చస్తాం.. కూల్చనివ్వం ‘‘ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. కరెంటు, నీటి బిల్లులు కడుతున్నాం. ఇప్పుడు కూల్చుతామంటే ఎలా? చావనైనా చస్తాం కానీ ఇళ్లను కూల్చనివ్వం.. ఇంత విషం ఇచ్చి ఆ పుణ్యంకూడా మీరే కట్టుకోండి..’’ అంటూ మూసీ పరీవాహకం పరిధిలోని చైతన్యపురి వినాయకనగర్ కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ రివర్బెడ్, బఫర్జోన్లలోని ఇళ్లను మార్కింగ్ చేయడానికి వచ్చిన సర్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి రంగు డబ్బాలను లాక్కుని పారబోశారు. వేసిన మార్కింగ్స్ను తుడిపేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారంటూ అధికారులు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్వే బృందాలు వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ అధికారులకు ఇదే తరహా నిరసన ఎదురైంది.కడుపు కట్టుకుని కొనుక్కున్నాం.. ఇక్కడే సమాధి అవుతాం ‘‘మావి కబ్జా చేసుకుని కట్టుకున్న ఇళ్లు కావు.. కడుపు కాల్చుకుని దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లు మావి. కరెంట్, నీటి, ఇంటి పన్నులు చెల్లిస్తున్నాం. స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నాం. వీటిని వదిలి వసతులేవీ లేనిచోట ఎక్కడో అడవులలో కట్టిన డబుల్ బెడ్రూమ్లను ఇస్తామంటే వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాం. ఇంట్లోనే సమాధి అవుతాం..’’ అంటూ అత్తాపూర్ డివిజన్ భరత్నగర్ వాసులు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు ఆక్రమించి విల్లాలు నిర్మించుకున్న బడాబాబుల ఫాంహౌస్లు కూల్చివేయకుండా సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఏమిటంటూ మండిపడ్డారు.తొలివిడతగా నది గర్భంలో.. మూసీ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో నది గర్భంలో ఉన్న నివాసాల తొలగింపుపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,595, మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కట్టడాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మూసీ పరీవాహకంలో ఇళ్లు తొలగిస్తున్న నేపథ్యంలో.. బాధితులకు పునరావాసం కోసం 15వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది గర్భం, బఫర్ జోన్లలో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు. బఫర్ జోన్లో తొలగించే ఇళ్లు, నిర్మాణాలకు సంబంధించి.. పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నష్టపరిహారం చెల్లించి, భూసేకరణ చేపడతామని వివరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు కూడా అందజేస్తామని అంటున్నారు.ఎక్కడో దూరంగా ఇళ్లు ఇస్తుండటంపై.. మూసీ పరీవాహకంలో తొలి విడతగా ఇళ్ల తొలగింపుతో రెండు వేలకుపైగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్, రెవెన్యూ ఉన్నతాధికారులు సైదాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో గతంలో కొందరు మూసీ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించినా.. తిరిగి వెనక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నాయి. నదీ గర్భం నుంచి తరలింపు ప్రారంభం మూసీ పరీవాహకంలోని కొత్తపేట భవానీనగర్ రోడ్డు నంబర్ 10లో నివాసం ఉంటున్న పదకొండు కుటుంబాలను అధికారులను తరలించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి వారితో ఆ కుటుంబాలతో మాట్లాడారు. వారి సమ్మతితోనే వనస్థలిపురం, ప్రతాపసింగారం, తిమ్మాయి గూడలలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వ ఖర్చులతో డీసీఎంలలో సామగ్రిని తరలించారు. -
మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డిలో మాల్కాపూర్ చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బహుళ అంతస్తుల భవనాన్ని క్షణాల్లో కూల్చివేశారు.మాల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో, క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయంలో రాయి వచ్చి తలకు తగలడంతో హోంగార్డ్ గోపాల్ గాయపడ్డారు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు.. ఇళ్లకు మార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక, మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13వేల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. ఒక్కో టీమ్లో ఎమ్మార్వోతో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు.. సర్వే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
హైడ్రా పేరుతో హైడ్రామాలు..
-
మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతున్న సర్కార్
-
మూసీ వైపు హైడ్రా బుల్డోజర్లు.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా రోజు రోజుకి మరీంత దూకుడుగా వ్యవహారిస్తుంది. ఇక, తాజాగా మూసీ పరివాహక ప్రాంతంపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ ఇచ్చారు. మరోవైపు.. ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.మూసీ నదిలో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ ఏరియాల్లో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది. రెండు రోజుల్లోనే అక్రమ నిర్ణయాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకుంది. ఇక, మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 1350 మందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది.మరోవైపు.. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే నేడు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా బాధితుల వివరాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. అలాగే, వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే కూకట్పల్లి, అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ భూములును అక్రమించి నిర్మించిన కోట్ల రూపాయాల విల్లాలను నేలమట్టం చేసింది. అంతకుముందు నాగార్జున ఎన్ కన్వెషన్ సహా పలు నిర్మాణాను కూల్చివేసింది. ఇది కూడా చదవండి: ఫోన్ట్యాపింగ్పై స్పందించిన డీజీపీ -
మూసీ సుందరీకరణపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని.. గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీ(sewage treatment plants)ను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. ‘‘ రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు . గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. మా హయాంలో రూ. 4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించాం. .. మూసీ నదీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. లక్ష 50వేల కోట్లు.. 70వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది.ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ఇక రేవంత్ విచారణ.. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకైన నగరం హైదరాబాద్. STPలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తాం. .. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా?. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక మాటలే ఒక ఉదాహరణ. ప్రస్తుత ప్రభుత్వం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు. పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు’’ అని కేటీఆర్ అన్నారు. -
‘మూసీ’ నిర్వాసితులకు ‘డబుల్’ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరూ నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జల వనరుల పరిరక్షణలో పేదలు రోడ్డున పడవద్దని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు వారు సహకరించేలా ఒప్పించడంతోపాటు అర్హులైన పేదలకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ మంగళవారం జూబ్లీహిల్స్లోని నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు తేల్చండి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని.. ఆక్రమణల వివరాలన్నీ సేకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని సూచించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణపై పూర్తిస్థాయి డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు. నేటి నుంచే ‘మూసీ’ పునరావాస ప్రక్రియ! మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్లలో నివాసమున్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో.. పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభించనున్నారు. 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. బుధవారం నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్ బెడ్లోని 1,600 ఇళ్లను తొలగిస్తారు. వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్జోన్లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చుతోపాటు పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తారు. -
మూసీ నదికి పోటెత్తిన వరద.
-
విన్నపాలు వినవలె
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్ పూరి, ప్రల్హాద్ జోషిలతో సీఎం సమావేశమయ్యారు.మూసీ సుందరీకరణపై రాష్ట్ర సర్కారు దృష్టిమూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మొత్తం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని దేశంలో మరెక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. మూసీ సుందరీకరణతో పాటు దానిలో చేరే మురికినీటి శుద్ధికి, వరద నీటి కాల్వల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ రెండు చెరువులను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు తీరడంతో పాటు మూసీ నది పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని వివరించారు. నల్లా కనెక్షన్లకు రూ.16,100 కోట్లు అవసరంజల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. 2019 లెక్కల ప్రకారం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో 77.60 శాతం ఇళ్లకు నల్లా నీరు అందుతోందని, అయితే ఇటీవల తాము చేపట్టిన సర్వేలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని తేలిందని వివరించారు. ఆ ఇళ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, ఇందుకు మొత్తం రూ.16,100 కోట్లు అవసరమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2019లోనే ప్రారంభించినా నేటి వరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని, ఈ ఏడాది నుంచైనా నిధులు విడుదల చేయాలని కోరారు. సిలిండర్కు రూ.500 చెల్లించేలా చూడండితెలంగాణలో రూ.500కే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని సీఎం కోరారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తోందని తెలిపారు.అయితే వినియోగదారులు సిలిండర్కు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ అందుతుండడంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. కాబట్టి సబ్సిడీని ముందుగానే ఓఎంసీలకు చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడు వినియోగదారులు రూ.500 మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఒకవేళ అలా వీలుకాని పక్షంలో 48 గంటల్లోపు సబ్సిడీ మొత్తం వినియోగదారులకు అందేలా చూడాలని కోరారు.బియ్యం బకాయిలు విడుదల చేయండిధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని రేవంత్ కోరారు. 2014–15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల రాయితీని పెండింగ్లో పెట్టారని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, సురేష్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. -
థేమ్స్ నదిలా మూసీ డెవలప్మెంట్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: లండన్లోని థేమ్స్ నదిలా మూసీ నదిని సుందరీకరణ చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్షమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.కాగా, సీఎం రేవంత్ శనివారం గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. లండన్లోని థేమ్స్ నదిలా మూసీ సుందరీకరిస్తాం.మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం. ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసాం. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి. వచ్చే పదేళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
"మంగళగిరిలో మూసీనది.."
-
మూసీ సుందరీకరణకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాలా రూ.60 వేల కోట్లు. దశల వారీగా మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన సర్కారు.. నది సుందరీకరణ, నిర్వహణ కోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. 2050 మాస్టర్ప్లాన్కు అనుగుణంగా నది పరిసరాలను జోన్ల వారీగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా మూసీ వెంట రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నదీ గర్భం నుంచి ఇరువైపులా కిలోమీటరు మేర ఇంపాక్ట్ ఏరియాగా ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు యంత్రాంగం.. ఇప్పటికే నది హద్దులు, ఆక్రమణలపై ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా జీఐఎస్ మ్యాపింగ్ను చేసింది. ఆక్రమణలే అడ్డంకి.. మూసీ రివర్ ఫ్రంట్ను పునరాభివృద్ధి చేయాలనే ఆలోచన తొలుత 1908లోనే వచ్చింది. 1990లో కాస్త ముందుకు కదిలినా.. పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు. మురుగునీరు, ఆక్రమణలే మూసీ పునరుజ్జీవానికి ప్రధాన అడ్డకుంలుగా నిలిచాయి. 55 కి.మీ మేర నదీ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వానికి కష్టతరమైన పనే అని అంటున్నారు. నది పునరుజ్జీవం కావడానికి 15–20 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణలు సుమారు 2వేల మేర ఉంటాయని అంచనా వేసిన యంత్రాంగం.. వీటిని తొలగించేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేనప్పటికీ, కొన్నిచోట్ల పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇలాంటి కట్టడాలు 10వేల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. భూ సేకరణ చట్టం కింద వీరికి పరిహారం చెల్లించడమా? ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమా? ఇతర మార్గాలేమిటనే కోణంలో అధ్యయనం చేస్తోంది. పాతబస్తీలో మూసీ కుచించుపోయిందున ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించే ఆలోచన కూడా చేస్తోంది. జంట జలాశయాల నుంచి రోజూ నీరు గుజరాత్లో నర్మదా నది నీటిని సబర్మతికి తీసుకెళ్లిన మాదిరే గోదావరిని ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు అనుసంధానం చేయాలనేది ప్రణాళిక. మురుగునీటితో నిండి ఉన్న మూసీ నదికి ఈ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా రోజుకు 1–2 టీఎంసీల జలాల విడుదలతో మురుగు శుద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు, మురుగు నీరు కూడా నదిలో కలుస్తున్నందున మూసీ కలుషితం అవుతుందని తేలడంతో అమృత్ పథకం కింద 39 మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తోంది. వీటిద్వారా వందశాతం శుద్ధి చేసిన నీటిని నదిలోకి విడుదల చేస్తారు. వీటికి అనుబంధంగా ప్రతి రోజు జంట జలాశయాల నుంచి నీటిని వదలడం ద్వారా నదీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా.. సందర్శకులను ఆకర్షించేలా రూపొందిస్తారు. మార్గమధ్యంలో పార్కులు, బోటింగ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సబర్మతి.. మూసీ కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో పుట్టి.. నార్సింగి ఔటర్ రింగ్రోడ్డు నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ వరకు 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దేశంలోనే నది పునరాభివృద్ధి ప్రాజెక్ట్ల్లో మూసీ రివర్ ఫ్రంట్ అత్యంత ప్రతిష్టాత్మకం. నీటి నిర్వహణ, ప్రణాళిక, రవాణా, పునరావాసం, పట్టణ పునరుజ్జీవం తదితరాల కోసం రూ.60 వేల కోట్ల వ్యయం, సుమారు 36 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్లోని సబర్మతి నది పునరాభివృద్ధికి మూసీకి దగ్గరి పోలికలున్నాయి, కాకపోతే సబర్మతి అహ్మదాబాద్ నగరంలో 11 కి.మీ. మేర మాత్రమే విస్తరించి ఉండగా.. మూసీ నది హైదరాబాద్లో 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. అదీగాక సబర్మతి కంటే మూసీ పరీవాహక ప్రాంతాలు ఎక్కువ ఆక్రమణకు గురవడంతోపాటు జనసాంద్రత కలిగిన ప్రాంతాలు కావడం గమనార్హం. ప్రాజెక్టు తొలి దశ అంచనా వ్యయమిలా వెస్ట్ కారిడార్– ఈస్ట్ కారిడార్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15,000 కోట్లు ట్రంక్ లైన్కు రూ.3,000 కోట్లు రివర్ లింకేజీకి రూ.3,000 కోట్లు మూసీ మొత్తం పరీవాహక ప్రాంతం: 110 చ.కి.మీ. ఆక్రమణలున్న ప్రాంతం: 55 చ.కి.మీ. -
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
మూసీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సోమవారం నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలోని 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీనదీ పరీవాహక ప్రాంతాలు సరిహద్దులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించారు. ప్రక్షాళనకు చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలగించాల్సిన నిర్మాణాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది. అనంతరం సీఎం మాట్లాడుతూ వీలైనంత త్వరగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించేందుకు కసరత్తు చేపట్టాలని అధికారులకు చెప్పారు. మొదట క్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ పనులపై దృష్టి సారించింది. మూసీ నదిని మూడు ప్రధాన విభాగాలుగా విభజించి పనులు చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ చేపట్టారు. అందంగా.. ఆహ్లాదంగా... హైదరాబాద్ మహానగరానికి పడమటి నుంచి తూర్పు వరకు మెలికలు తిరుగుతూ వడ్డాణం అలంకరించినట్టుండే మూసీనది నిజాం కాలంలో పరవళ్లు తొక్కింది. నగరంలో 55 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్న మూసీనదికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు గతంలోనే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా పెద్దగా పురోగతి లేదు. ప్రసుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. మూసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తూర్పు–పడమర మధ్య మెట్రో మార్గం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లండన్లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మూసీ అభివృద్ధికి ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. సింగపూర్కు చెందిన ఓ సంస్థ ప్రభుత్వంతో ఇటీవల సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీకి రెండువైపులా ఎమ్యూస్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చి్రల్డన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్ బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలైన చార్మినార్, తారామతి బారదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ కూడా డిజైన్ చేస్తున్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. -
‘మూసీ’పై సీఎంతో సింగపూర్ సంస్థ భేటీ
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వహణపై సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని తెలిపారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతోపాటు హైదరాబాద్లో మూసీ డెవలప్మెంట్ నమూనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో భవిష్యత్తులో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని.. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని కోరారు. ఇటీవల లండన్, దుబాయ్లలో పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించడం, పలు విదేశీ కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతోనూ చర్చించడం తెలిసిందే. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో మెయిన్హార్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తదితరులు ఉన్నారు. ఈ భేటీలో సీఎస్ శాంతికుమారి, పురపాలన, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. -
లండన్ థేమ్స్లా మూసీ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని.. హైదరాబాద్కు కూడా అటువంటి ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అటు మూసీ నది వెంబడి, హుస్సేన్సాగర్ చుట్టూ, ఉస్మాన్సాగర్ వంటి జలాశయాలు కేంద్రంగా హైదరాబాద్ అభి వృద్ధి చెందిందని చెప్పారు. మూసీకి పునర్వై భవం తీసుకొస్తే.. నది, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపక ల్పనలో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ బృందం బ్రిటన్లోని లండన్లో పర్యటించింది. ఆ నగరంలోని థేమ్స్ నదిని పరిశీలించి.. దానిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. తర్వాత థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సమా వేశమై చర్చించారు. విజన్ 2050కి అనుగుణంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నామని, దీనికి సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. అభివృద్ధితోపాటు సంరక్షణకు ప్రాధాన్యం దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్కెహల్ లివీ తదితరులు సీఎం రేవంత్ బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, అనుసరించిన విధానాలను తెలిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు ప్రాధాన్యమి చ్చినట్టు స్పష్టం చేశారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటంతోపాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజన ముండే రెవెన్యూ మోడల్ను ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకరిస్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లైన్, వివిధ సంస్థల భాగ స్వామ్యంపై చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎం రేవంత్పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సంతతి బ్రిటన్ ఎంపీలతో రేవంత్ భేటీ దావోస్ పర్యటన ముగించుకుని లండన్కు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అక్కడి భారత సంతతి ఎంపీలతో సమావేశమయ్యారు. ఓల్డ్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు భవనంలో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో.. ఏడుగురు బ్రిటన్ ఎంపీలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భారత్–బ్రిటన్ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యబంధం ఉందన్నారు. ఇరు దేశాలు మహాత్మాగాంధీ సందేశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. -
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
-
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి టీఎస్పీఎస్సీపై సమీక్ష చేపట్టారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాలలో పరీక్షల నిర్వహాణపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. టీఎస్పీఎస్సీకి కావాలసిన సిబ్బందిని, ఇతర వనరులు వెంటనే సమకూర్చాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మూసి అభివృద్ధి పై సమీక్ష: మూసి నది ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసిని పర్యటన ప్రాంతంగా డెవలప్ చేయాలని తెలిపారు. మూసి నది వెంట బ్రిడ్జీలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంతో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసిలో మురుగు నీటి తగ్గించే విధంగా అవసరమైన చోట మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహాణపై సమీక్ష: టెన్త్,ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గతంలోలాగా పేపర్ లీక్లు జరగకుండా జాగ్రత్తపడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ,ప్రైవేటు విశ్వ విద్యాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అవసరం ఎక్కడ ఉందో వాటి వివరాలు వెంటనే ఇవ్వాలన్నారు. -
మహావిషాదానికి 115ఏళ్లు, వందల మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు
‘సెప్టెంబర్ 28’... ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్ గంజ్ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టునాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు... ఈ ఏడాది సైతం సెప్టెంబర్ 28న అలనాటి వరద సమయంలో ఎంతో మందిని రక్షించిన చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ... నేటి పరిస్థితుల్లో నగరాభివృద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. ప్రాణాలు కాపాడిన చింతచెట్టు.. మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది.ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. 1914 లోనే సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సీఐబీ అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక... బాగ్ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశ యాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్.. ఎన్నో సమస్యలు ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించింది కాకపోతే... నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా బాగా పెరిగిపోయింది. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్ట గొడుగుల్లా మురికివాడలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’, ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్ ప్లానింగ్పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేశాయి. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం,మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం... మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూపోతే... ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్కు చక్కటి ‘ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్’ మాత్రమే. హైదరాబాద్లో మంచినీటి సమస్య పరిష్కారమయ్యింది. రహదారులు వృద్ధి చెందాయి. ఓ.ఆర్.ఆర్. లాంటివి ఎన్నో వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్.లు వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున సదుపాయాలను పెంచవలసి ఉంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్ కేసర్ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు. అభివృద్దితో పాటు సమస్యలూ.. అభివృద్ధితో పాటూ సమస్యలూ తలెత్తుతాయి. వీటిని దుర్కొనడానికి మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకం. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్కు 6 మాస్టర్ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అమలుచేయాలి. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. రెండవ దశ ఎమ్ఎమ్ టీఎస్ వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్ రైల్ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. హైదరా బాద్కు వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్ మాగ్నెట్స్గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి. వారసత్వాన్ని కాపాడుకోవాలి ఈ రోజున హైదరాబాద్ యావత్ దేశపు గ్రోత్ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించుకోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. అఫ్జల్ గంజ్ పార్క్ లో ఉన్న చింత చెట్టునూ, ఆ స్థలాన్నీ నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. హైదరాబాద్ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక లతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం. వ్యాసకర్త: ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఛైర్మన్ మొబైల్: 98480 44713 -
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం?
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీలో లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. Lakshmi's body, found during JCB-assisted garbage removal at #MoosarambaghBridge, is now taken for a postmortem. @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @shibasahu2012 #hyderabad #HyderabadRains pic.twitter.com/D5FumD59Cj — Sri Loganathan Velmurugan (@sriloganathan6) September 6, 2023 చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. కాగా, మూసీలో మహిళ మృతదేహం కొట్టుకురావడంతో.. గల్లంతైన లక్ష్మిగా గుర్తించారు. -
Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్/ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రాజధాని హైదరాబాద్ మహానగరంలో కురిసిన కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భందంలో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉధృతంగా మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత హైదరాబాద్లో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు మూసీలో వదలడంతో మూసారాంబాగ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మూసీ వాగు ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 9గంటల నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. #HyderabadRains Moosarambagh bridge is being closed from 9 Pm this evening due to increase in water levels in Musi as about 6000 cusecs is released from Osmansagar & Himayathsagar into Musi .. We will review the situation tomorrow pic.twitter.com/krWO8uqTyW — Arvind Kumar (@arvindkumar_ias) September 5, 2023 మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో :1013.18 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్ ఫ్లో : 3753.81క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 645.00 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం : 643.60 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46టీఎంసీలు..కాగా ప్రస్తుత నీటి నిల్వ : 4.09టీఎంసీలు ఉంది. చదవండి: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు జంట జలాశయాలకు భారీగా వరద నీరు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. -
HYD: ఉధృతంగా మూసీ.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో రాజేంద్రనగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఒడ్డున ఉన్న కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వేయడంతో చాదర్ ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాలలో ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళాలని అధికారులు ఆదేశించారు. అయితే తమకు పునరావాసం కేంద్రాలు ఏర్పాట్లు చేయకుండా.కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెల్లుతామని బాధితులు వాపోతున్నారు. #HyderabadRains కృష్ణానగర్ పూర్ణా టిఫిన్ గల్లీలో వరద భీభత్సం pic.twitter.com/ysY9c8D2nG — keshaboina sridhar (@keshaboinasri) September 5, 2023 ఇక.. ఇప్పటికే కురిసిన కుండపోత వానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలో ఏవైపు చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బేగంపేట ప్రకాశ్ నగర్ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రగతి భవన్ ఎదురుగానూ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. Water logging in several areas of #Hyderabad after hours of rains; these visuals from near #MoosapetMetro station; bike that was washed away in waters, got stuck in a manhole in #Borabanda & was retrieved #HyderabadRains @ndtv @ndtvindia pic.twitter.com/bgNdwV2aLe — Uma Sudhir (@umasudhir) September 5, 2023 పంజగుట్ట నుంచి బేగంపేట ఫ్లై ఓవర్ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. శంషాబాద్లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జీడిమెట్ల ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో నీరు నిలిచింది. కూకట్పల్లిలో 14 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. కూకట్పల్లి దీన్దయాల్ నగర్లోకి వరద నీరు చేరింది. ఫతేనగర్ రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంపేట ఈశ్వర విల్ల ఐదు అడుగుల మేర నీట మునిగింది. ఆల్వాల్ మచ్చబొల్లారంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నార్సింగిలోని బాలాజీ నగర్ కాలనీ చెరువును తలపిస్తోంది. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అతి భారీ వర్షాలు.. ట్యాంక్బండ్ వద్ద వరద ఉధృతి పరిశీలించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తగ్గిందన్నారు. మూసీ వరదను మానిటర్ చేస్తున్నాం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖ అధికారులతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావం కొంత తగ్గింది కుంభవృష్టిగా, ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, పలు కాలనీల్లో మాత్రం తాత్కాలికంగా వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడమేనని స్పష్టం చేశారు. వాళ్ల సెలవులు రద్దు హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించాం హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని . భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. చెరువులకు గండి పడే ప్రమాదం వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
బిగ్ అలర్ట్..ముసారాంబాగ్ బ్రిడ్జ్
-
బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న మూసీనది
-
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
-
తెలంగాణ సర్కార్ భారీ ప్లాన్! మూసీ నదిపై ఏకంగా 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే
గచ్చిబౌలి: కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. మూసీ నది మీదుగా రూ. 10 వేల కోట్ల వ్యయంతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని ఖాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్ వెస్ట్ టు ఈస్ట్ మూసీ నదిపై ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం అధ్యయనం చేశామని, మూసీ సుందరీకరణతో ఆ ప్రాంతం రూపురేఖలు మారతాయన్నారు. నిర్మాణ సంస్థలు.. 50 చెరువుల దత్తత కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని 50 చెరువులను అభివృద్ధి చేసేందుకు వివిధ నిర్మాణ సంస్థలు వాటిని దత్తత తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో ‘క్రెడాయ్’ను భాగస్వామిని చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని చాలా చెరువుల్లో ప్రైవేటు పట్టాలు ఉన్నాయని, అయినా ప్రైవేటు భూముల యజమానులకు మరోచోట భూమి ఇస్తున్నామన్నారు. వారికి టీడీఆర్ కింద 200 శాతం విలువ కల్పిస్తున్నామని చెప్పారు. 13 చెరువులలో ఎఫ్టీఎల్ పట్టాలున్న వ్యక్తులకు 188 టీడీఆర్లు ఇచ్చి 115 ఎకరాల స్థలాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. ఎఫ్టీఎల్ పట్టాలున్న వ్యక్తులను టీడీఆర్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్లో భద్రకాళి చెరువును అభివృద్ధి చేసినంత గొప్పగా దుర్గం చెరువు కూడా లేదని, నాగర్కర్నూల్ చెరువును ట్యాంక్బండ్లా అభివృద్ధి చేసి బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. సీఎస్ఆర్ నిధులిస్తే జిల్లా కేంద్రాలలో చెరువుల అభివృద్ధి చేపడతామన్నారు. ఆఫీస్ స్పేస్లో మనమే నంబర్ వన్.. బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే, ఢిల్లీని మించి 2022లో ఆఫీస్ స్పేస్లో దేశంలోనే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓఆర్ఆర్ మీదుగా వస్తుంటే కనిపించిన భారీ భవనాలను చేస్తుంటే విదేశాలకు వెళ్లిన అనుభూతి కలిగిందన్నారు. నగరంలో శాంతిభద్రతలు బాగుండటంతోపాటు జీవన వ్యయం తక్కువగా ఉండటం, క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగుండటం వల్లే హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. 250కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరిస్తాం కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా మెట్రో రైలును 250 కి.మీ. విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 6,250 కోట్లతో మెట్రో ను రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించట్లేదని విమర్శించారు. యూపీలోని 10 నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు నిధులిస్తున్న కేంద్రం... తెలంగాణకు మొండిచేయి చూపుతోందని దుయ్యబట్టారు. రాచకొండలో ఫిలింసిటీ... ప్రపంచస్థాయి ఫిలింసిటీ ఏర్పాటుకు రాచకొండలో స్థలాన్ని గుర్తించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒలింపిక్స్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ తేవాలని సీఎం కేసీఆర్ దృష్టిలో ఉందన్నారు. వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 35 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. వచ్చే సంవత్సరంలో 50 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే తయారవుతాయన్నారు. లైఫ్సైన్స్ పరిశ్రమ 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగేలా ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. -
Hyderabad: కాలుష్యం..కాస్త తగ్గింది
సాక్షి, హైదరాబాద్: గతేడాది వరుస వర్షాలతో మూసీ కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజాగా విడుదల చేసిన 2022 వార్షిక నివేదిక స్పష్టం చేసింది. నది ప్రస్థానం పొడవునా 12 చోట్ల పీసీబీ శాస్త్రవేత్తలు నీటినమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జని్మంచిన మూసీ.. నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణాలో కలుస్తోంది. ప్రధానంగా అనంతగిరి నుంచి గ్రేటర్ సిటీకి సుమారు 100 కి.మీ వరకు మూసీ నదిలో కాలుష్యం అంతగా నమోదు కానట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. కానీ నగరంలోకి ప్రవేశించే బాపూఘాట్ నుంచి ప్రతాప సింగారం వరకు కాలుష్యం అధికంగా నమోదవడం గమనార్హం. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, బల్్కడ్రగ్, ఫార్మా వ్యర్థ జలాలు మూసీలోకి చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. నగర శివార్లు దాటిన అనంతరం కాలుష్య మోతాదు క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం. పరిమితులు కొన్ని చోట్ల సంతృప్తికరం.. కరిగిన ఆక్సిజన్: నదిలో వృక్ష, జంతు ఫ్లవకాలు, ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు 4 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉండాలి. ఈ విషయంలో నగరంలోని బాపూఘాట్, మూసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాప సింగారం ప్రాంతాల తోపాటు నగర శివార్లలోని పిల్లాయిపల్లిలో ఉండాల్సిన పరిమితి కంటే తక్కువగా ఉండడం గమనార్హం. మిగతా ప్రాంతాల్లో మూసీ నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు సంతృప్తికరంగా ఉండడం విశేషం. గాఢత: నది నీటిలో గాఢత 6.5 నుంచి 8.5 యూనిట్ల మధ్యలో ఉండాలని పీసీబీ పరిమితులు నిర్దేశిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో నదినీటిలో గాఢత పరిమితుల ప్రకారమే నమోదైంది. బీఓడీ: బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్గా పిలిచే ఈ మోతాదు ప్రతి లీటరు నీటిలో 30 మిల్లీగ్రాములకు మించరాదు. ఈ పరిమితులు అన్నిచోట్ల సంతృప్తికరంగానే ఉండడం విశేషం. కోలిఫాం బ్యాక్టీరియా: పీసీబీ పరిమితుల ప్రకారం ఈ బ్యాక్టీరియా మోతాదు 50 యూనిట్లకు మించరాదు. ఈ విషయంలో గండిపేట్, భీమారం బ్రిడ్జి, వాడపల్లి వద్ద మాత్రమే ఈ పరిమితుల ప్రకారం ఉండడం గమనార్హం. మిగతా చోట్ల ఈ మోతాదు శృతి మించింది. అమోనియా: ప్రతి లీటరు నీటిలో 1.2 మిల్లీగ్రాములు మించరాదు. పీసీబీ డేటా ప్రకారం అన్నిచోట్లా అమోనియా పరిమితుల ప్రకారమే నమోదవడం గమనార్హం. కొసమెరుపు.. జాతీయ స్థాయిలో అత్యంత కాలుష్యకారక నదుల జాబితాలో చేరిన మూసీలో కాలుష్యం గతేడాది కుండపోతగా కురిసిన వర్షాలతో ఒకింత తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గలేదని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టినా.. ఆ తర్వాత కాలుష్యం యథావిధిగా నమోదవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ నివేదికపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఈ విషయమై పీసీబీ ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించేందుకు నిరాకరించారు. మూసీ ప్రస్థానం పొడవునా పలు ప్రాంతాల్లో వార్షిక సరాసరి కాలుష్య మోతాదు ప్రతీ లీటరు నీటిలో మిల్లీ గ్రాముల్లో ఇలా ఉంది -
మూసీ ప్రక్షాళన పై ప్రధానితో చర్చించా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
అలర్ట్: మూసీ గ్రాస్లో లెడ్ ఆనవాళ్లు.. పాలు, మాంసం, పశుగ్రాసంలో..
సాక్షి, హైదరాబాద్: చారిత్రక మూసీ పరివాహక ప్రాంతంలో విరివిగా సాగవుతున్న గడ్డిలోనూ మానవ ఆరోగ్యానికి హానికారకంగా పరిణమించే లెడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు నేషనల్ రీసెర్చి సెంటర్ ఫర్ మీట్ (ఎన్ఆర్సీఎం) తాజా పరిశోధనలో తేలింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి పర్యవేక్షణలో ఎన్ఆర్సీఎం ఆధ్వర్యంలో పాలు, మాంసం, పశుగ్రాసంలో లెడ్ ఆనవాళ్లను పరిశీలించగా ఈ విషయం తేలింది. మూసీలో హుస్సేన్సాగర్ జలాలు అధికంగా చేరే నాగోల్– ఉప్పల్ మార్గంలో ఈ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు 21 ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరీక్షించగా.. ప్రతి లీటరు నీటిలో లెడ్ మోతాదు 61 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం)గా నమోదైనట్లు ఈ సంస్థ తాజా నివేదిక తెలిపింది. పీసీబీ నిబంధనల ప్రకారం ఈ మోతాదు 20 పీపీఎంకు మించరాదు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు అధికంగా చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక స్పష్టం చేసింది. లెడ్ మోతాదు అధికమైతే మానవ, పాడి పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదని నివేదిక వెల్లడించింది. కాలుష్యానికి కారణాలివీ.. నగరంలో రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా నిత్యం 1800 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో సుమారు 900 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా నీరు శుద్ది ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తోంది. ఈ మురుగు నీటిలో కూకట్పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్లోకి అటు నుంచి వచ్చి మూసీలోకి చేరుతున్న సుమారు 400 మిలియన్ లీటర్ల మేర ఫార్మా, బల్క్డ్రగ్ వ్యర్థ జలాలు కూడా ఉన్నాయి. ఈ జలాల చేరికతోనే లెడ్ తదిర హానికారక భారలోహ అవశేషాలు మూసీలోకి చేరుతున్నాయి. కలుషిత జలాలతో దుష్ఫలితాలు.. ►ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో నదిలో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాలు చనిపోతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. జీవావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. పశువులు దాహార్తి తీర్చుకునే పరిస్థితి ఉండదు. ►పరీవాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్న గడ్డి తిన్న పశువుల పాలల్లో కాలుష్య కారకాలు చేరడంతో ఇవి మానవ దేహంలోకి ప్రవేశిస్తున్నాయి. ►ఈ నీరు తాగిన వారు న్యుమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలోకి ప్రవేశించగానే కాలుష్య కాటు.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. 90 కి.మీ ప్రవహించి బాపూఘాట్ వద్ద నగరంలోకి ప్రవేశిస్తోంది. నగరంలో ఫార్మా, వాణిజ్య, గృహ వ్యర్థ జలాలు చేరుతుండడంతోనే మూసీ కాలుష్య కాసారమవుతోంది. -
Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ వస్తోందంటేనే గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు పుడుతోంది. ఏటా ఇదే నెలలో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు, జలాశయాలకు ఆనుకొని ఉన్న బస్తీలు, ప్రధాన రహదారులను నిండా ముంచుతున్నాయి. 1908వ సంవత్సరంలో మూసీ మహోగ్రరూపం దాల్చి నగరంలో సగభాగం తుడిచిపెట్టేసిన వరదలు కూడా ఇదే నెలలో.. సెప్టెంబర్ 28న సంభవించినట్లు చరిత్ర స్పష్టం చేస్తోంది. ఇక 2000, 2016 సంవత్సరాల్లోనూ ఇదే నెలలో కుండపోత వర్షాలు సిటీని అతలాకుతలం చేశాయి. చరిత్ర పుటల్లో హైదరాబాద్ వరదల ఆనవాళ్లివీ.. ►1591 నుంచి 1908 వరకు 14సార్లు వరద ప్రవాహంలో నగరం చిక్కుకుంది. ►1631, 1831, 1903లలో భారీ వరదలతో సిటీలో ధన, ప్రాణ నష్టం సంభవించాయి. ►1908 సెప్టెంబరు వరదలతో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి.15 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల పాటు జనజీవనం స్తంభించింది. ►1631లో కుతుబ్ షాహీ ఆరో పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో సంభవించిన వరదలకు నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ధ్వంసం అయ్యాయి. మూసీ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. ►1831లో అసఫ్ జాహీ నాలుగో మీర్ ఫరుకుందా అలీఖాన్ నాసరుదౌలా పాలనా కాలంలోనూ వరదలు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న చాదర్ఘాట్ వంతెన కొట్టుకుపోయింది. ►ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్ నెలలోనే భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. ఇక 1968, 1984, 2000, 2007, 2016, 2020లలో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ నిండుగా ప్రవహించింది. చదవండి: (విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) 1908.. సెప్టెంబరు 28న కొట్టుకుపోయిన సిటీ.. మూసీ నది 60 అడుగుల ఎత్తున ప్రవహిస్తూ మహోగ్ర రూపం దాల్చింది. కేవలం 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్గంజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులు. వరదనీరు ఇటు చాదర్ఘాట్ దాటి అంబర్పేట బుర్జు వరకు.. అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు పోటెత్తింది. చంపా దర్వాజా ప్రాంతంలోకి చేరడంతో అక్కడే ఉన్న పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో జనం ఎక్కారు. రెండు గంటల్లోనే నీటి ప్రవాహానికి పేట్లబురుజు కొట్టుకుపోయింది. వందల మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సెప్టెంబరు 28న సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. జనం హాహాకారాలు చేశారు. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. నాటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలినడక జనం మధ్యకు వచ్చారు. వరద బాదితుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ను ఆదేశించారు. నిరాశ్రయులకు తమ సంస్థానంలోని అన్ని భననాలను ప్రజల కోసం తెరిచిఉంచాలని కోరారు. పురానీ హవేలీతో పాటు అన్ని ప్యాలెస్ల్లో వైద్య శిబిరాలు, అన్న దానం ప్రారంభించారు. అన్ని «శాఖల సిబ్బందిని వరద బాధితుల సహాయం కోసం పని చేయాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. నాటి నుంచి సెప్టెంబర్ నెల వచ్చిందంటే నగర ప్రజలు వరదలకు భయపడుతూనే ఉన్నారు. -
4 వంతెనలు, 3 నెలల్లో టెండర్లు .. మూసీపై బ్రిడ్జీల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మూసీపై 4 హైలెవల్ వంతెనల నిర్మాణ బాధ్యతల్ని ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. నాలుగు బ్రిడ్జిల అంచనా వ్యయం రూ.168 కోట్లు. వీటి నిర్మాణంతో వానల సమయాల్లోనే కాకుండా అన్ని సమయాల్లోనూ రాబోయే అయిదారు దశాబ్దాలపాటు ప్రజలకు సాఫీ ప్రయాణం సాధ్యమయ్యేందుకు క్షేత్రస్థాయి సర్వే, తగిన డిజైన్లు, ఇతరత్రా పనుల కోసం కన్సల్టెన్సీల సేవలు పొందేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వీటికి సంబంధించిన డీపీఆర్లు మూడు నెలల్లో పూర్తిచేసి, దాదాపు ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బ్రిడ్జి పనుల్లో భాగంగానే అప్రోచ్లు, సర్వీస్రోడ్లు, ఫుట్పాత్లు, డ్రెయిన్లు, డక్ట్లు, సెంట్రల్ మీడియన్లు, కెర్బ్లు, స్ట్రీట్లైట్ల ఏర్పాటు వంటి పనులు సైతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సర్వేలో ప్రాధాన్యతనివ్వాల్సిన అంశాలు.. ►రోడ్డు వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు తగిన భద్రత. ►వీలైనంత తక్కువగా భూసేకరణ. ►నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు వీలైనంత తక్కువగా ఉండాలి. ►నిర్మాణం త్వరితంగా పూర్తయ్యేందుకు వినూత్న ఆలోచనలతో, ఆధునిక సాంకేతికతను వినియోగించాలి. ►కొత్త బ్రిడ్జిలు ఇలా ఉండాలి.. ►ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా నిరంతరం సాఫీ మూవ్మెంట్ ఉండాలి. ► బ్రిడ్జి వెడల్పు, లేన్లు పెంచి సామర్థ్యం పెంచాలి. ►ఫుట్ఫాత్ల కింద టెలికాం, విద్యుత్ తదితర కేబుళ్లకు డక్ట్లుండాలి. ►పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన సదుపాయాలుండాలి. ►ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు మార్కింగ్లుండాలి. ►మొత్తానికి ప్రజా రవాణా మెరుగవ్వాలి. పర్యాటక ఆకర్షణగా.. మూసారంబాగ్, చాదర్ఘాట్ల వద్ద బ్రిడ్జి పనులు పది రోజుల్లో ప్రారంభించి, 9 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఇటీవల మూసారాంబాగ్ బ్రిడ్జి ముంపు సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించినప్పటికీ, పనులు మొదలయ్యేందుకు సమయం పట్టనుంది. డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియకే మూడునెలలు పట్టనుంది. మూసీపై నిర్మించే బ్రిడ్జిల డిజైన్లు ప్రత్యేకంగా ఉండేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వాటికోసం పోటీలు కూడా నిర్వహించారు. డిజైన్లు మంత్రి పరిశీలనలో ఉన్నాయి. చదవండి: హైటెక్ స్టేషనండి.. రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసినా.. బండి ఆగదండి నిధులెలా..? నాలుగు బ్రిడ్జిలకు వెరసి రూ. 168 కోట్లు అవసరం కాగా, సదరు నిధుల్ని జీహెచ్ఎంసీ ఎలా సమకూర్చుకోనుందో ఇంకా స్పష్టత రాలేదు. డీపీఆర్ల తయారీకి మూడునెలల సమయమున్నందున ఆలోగా బ్యాంకులోన్లు తీసుకోవడమో, బాండ్ల ద్వారా సేకరించడమో చేసే అవకాశం ఉంది. లేదా జీహెచ్ఎంసీ ఖజానా నుంచే పనులు జరిగేకొద్దీ విడతల వారీగా చెల్లింపులు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. బ్రిడ్జిలు– అంచనా వ్యయాలు.. 1.మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్వేను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి :రూ. 39 కోట్లు 2. మూసారాంబాగ్ను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి:రూ.52కోట్లు 3.చాదర్ఘాట్ వద్ద హైలెవెల్ బ్రిడ్జి : రూ.42 కోట్లు 4. అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు -
Hyderabad: మూసీని చూసి మురుస్తున్న నగరవాసులు
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాల గేట్లను జలమండలి వరుసగా తెరుస్తోంది. మూసీలో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. నగరంలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ) మార్గంలో పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, మురికి వదిలింది. దీంతో చాదర్ఘాట్, మూసారాంభాగ్ వంతెనలపై నుంచి వీక్షిస్తే.. నదిలో నీరు స్వచ్ఛంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న సిటీజన్లు స్వచ్ఛ జల ప్రవాహం చూసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. మూసీ నీటిలో మల, మూత్రాదుల్లో ఉండే హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక సైతం స్పష్టం చేయడం గమనార్హం. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్ ఆక్సీజన్ డిమాండ్ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది. జూలై చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం.. మోస్ట్ ప్రాపబుల్ నంబరు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తేలింది. కొంచెం ఊరట... తెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో జంట జలాశయాలు, పలు నాలాల నుంచి మూసీలోకి వరద నీరు చేరుతుండడంతోనే మురుగు క్రమంగా వదులుతోంది. దీంతో వ్యర్థజలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పీసీబీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతున్న 1800 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తున్న 22 ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణమని భావిస్తున్నారు. మూసీ మురిసేదెప్పుడో? వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్ప్లాన్ సిద్ధంచేసి దాని ప్రకారం మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు), పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈటీపీ) నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు చేపడితేనే మూసీ నది ఉత్తరాదిలోని గంగా, సబర్మతి నదుల తరహాలో మెరుస్తుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని స్పష్టం చేస్తున్నారు. చదవండి: 16న ఏకకాలంలో ‘జనగణమన’ -
మూసీ నదికి తగ్గిన వరద
-
Hyderabad Floods Photos: నిండా ముంచేసిన మూసీనది (ఫొటోలు)
-
మూసీ ముంచేసి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ భాగ్యరేఖ చారిత్రక మూసీనది ఉగ్రరూపం దాల్చింది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలమండలి అధికారులు వరుసగా జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి వరద నీటిని వదిలిపెడుతున్నారు. బుధవారం ఏకంగా గండిపేట్కు 13, హిమాయత్సాగర్కు 8 గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీలో వరదనీటి ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. నగరంలో మూసీ ప్రవహించే బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ మునుపెన్నడూ లేనివిధంగా పరవళ్లు తొక్కుతోంది. ఇదే క్రమంలో చాదర్ఘాట్ మూసీ చిన్న వంతెనపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో ట్రాఫిక్పోలీసులు ఈ బ్రిడ్జీని మూసివేశారు. మూసారాంబాగ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. నగరంలో బుధవారం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్పేట్ కొత్త బ్రిడ్జీపైనుంచి వాహనాల రాక పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మూసీ పరివాహక ప్రాంతమైన మూసానగర్, కమలానగర్ పరిసరాలను మూసీ వరదనీరు చుట్టేసింది. మన్సూర్నగర్, చాదర్నగర్ సమీపంలోని ఇళ్లలో చేరిన నీరు అంబర్పేట్, మలక్పేట్, చాదర్ఘాట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రత్నానగర్, పటేల్నగర్, గోల్నాక ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదర్సా, శంకర్నగర్, మూసానగర్ నుంచి సుమారు రెండు వేల మందిని ఈ కేంద్రాలకు తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. జంట జలాశయాలకు వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇన్ఫ్లో భారీగా పెరుగుతుండడంతో రెండు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. బుధవారం ఉస్మాన్ సాగర్కు 13 గేట్లు, హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వరద చేరుతున్న జంట జలాశయాలను బుధవారం ఉదయం జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. సామాన్య ప్రజలు, సందర్శకులు జంట జలాశయాల వద్దకు రావొద్దని ఆయన కోరారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో జలమండలి నిరంతరం సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. జాతీయ రహదారి జలదిగ్బంధం జియాగూడ/దూద్బౌలి/అఫ్జల్గంజ్: జంట జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో పురానాపూల్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారి పూర్తిగా మునిగాయి. పురానాపూల్ వంతెన, సమాంతర వంతెనలు శిథిలావస్థకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై వరదనీరు పొంగిపొర్లుతుండగా అర్ధరాత్రి ప్రాంతంలో జియాగూడ దుర్గానగర్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్లిన లారీ, పురానాపూల్ నుండి అత్తాపూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు నీట మునిగాయి. పురానాపూల్ లోతట్టు ప్రాంతం కావడంతో వంతెన కానాలు సగానికి పైగా మునిగాయి. అలాగే జాతీయ రహదారి పక్కనే ఉన్న నివాసాలు, చాకిరేవులు నీట మునిగాయి. మూసీ సమీపంలోని మన్సూర్నగర్లో నీట మునిగిన ఇళ్లు కాలనీని ముంచెత్తిన వరద నీరు వ్యక్తిని కాపాడిన పోలీసులు అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో పురానాపూల్ ఇక్బాల్గంజ్ నుండి మూసీనదిలోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో జాతీయ రహదారికి రాగా అప్పటికే పొంగిపొర్లుతున్న నీటిలోకి పడిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న హబీబ్నగర్ ఇన్స్పెక్టర్ సైదబాబు, మంగళ్హాట్ ఎస్.ఐ రాంబాబు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని రక్షించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పురానాపూల్ మూసీనది పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మూసీనది పరివాహక ప్రాంతం జాతీయ రహదారిని సందర్శించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలన బండ్లగూడ: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్సాగర్ జలాశయాన్ని బుధవారం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంగళవారం హిమాయత్సాగర్ సరీ్వస్ రోడ్డులో వరదలో చిక్కుకుపోయిన యువకుడిని కాపాడిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ హెచ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవర్ మల్లాంగ్షా, హెల్పర్స్ రాకేష్, విజయ్లను సీపీ స్టీఫెన్ రవీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లవకుమార్రెడ్డిలు అభినందించారు. సహాయక చర్యలకు సిద్ధం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూసీ, ఈసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకా‹Ùగౌడ్ సూచించారు. జంట జలాశయాల గేట్లను ఎత్తడంతో బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జీ, హైదర్షాకోట్, గంధంగూడ, కాలనీలు, బస్తీలు, ఈసీ,మూసీ వాగులను ఆయన సందర్శించారు. సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సందర్శకులకు అనుమతి లేదు.. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్సాగర్కు వెళ్లే ఓఆర్ఆర్ సబ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంధకారంలో పరీవాహక ప్రాంతాలు మూసీ ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పలు సబ్స్టేషన్లకు వరద ముప్పు ఏర్పడింది. సబ్స్టేషన్లలోకి నీరు చేరడం, డిస్ట్రబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంబాగ్ డివిజన్ నార్సింగ్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ గండిపేట ఫీడర్ సహా 33/11 కేవీ సీబీఐటీ స బ్స్టేషన్లోకి గండిపేట చెరువు నీరు వచ్చి చేరింది. మెహిదీపట్నం డివిజన్ లంగర్హౌస్ సెక్షన్ పరిధిలోని బాపూఘాట్, లంగర్హౌస్ టుప్ఖాన్ బ్రిడ్జ్పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో దాని కింద ఉన్న ఆరు ఎల్టీ విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి ంది. పురానాపూల్, కుల్సుంపుర, రహీంపుర ఫీడర్ల పరిధిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్మాన్ఘడ్, చాదర్ఘట్, వెంకట్నగర్, శంకర్నగర్, మూసా నగర్, యశోద ఆస్పత్రి, హనుమాన్నగర్ ఫీడర్ల పరిధిలోని 12 గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. సరూర్నగర్ ఆర్కేపురం ప్రజయ్నివాస్ అపార్ట్మెంట్స్ ఫేజ్–1 మూడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీటమునిగాయి. వీటిలో రెండు డీటీఆర్లను పునరుద్ధరించారు. పురానాపూల్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన లారీ,సాలార్జంగ్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన ఆలయం ఆలయంలోకి నీరు.. దూద్బౌలి పరిధిలోని శివాలయఘాట్ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. నవగ్రహాల గుడి నీటిలో మునిగిపోయింది. పక్కనే ఉన్న నివాసితులు భయాందోళనకు గురయ్యారు. పురానాపూల్ శ్మశాన వాటికలో వరదనీరు పూర్తిగా నిండిపోవడంతో బుధవారం చనిపోయిన వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. దహన సంస్కారాలకు ఎలాంటి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదకరంగా ఎంజీబీఎస్ ప్రహరీ నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎంజీబీఎస్ వరద నీటిలో మునిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల గేట్లు ఎత్తడంతో మూసీ పరిహక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో మూసీ నది దారి మధ్యలో ఉండే ఎంజీబీఎస్ సైతం నీట మునిగింది. ఎంజీబీఎస్ చుట్టూ రహదారుల వెంట ఉన్న ప్రహరీ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలుతుందో ఏమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. (చదవండి: గాడి తప్పిన ‘గ్యాస్’!) -
హైదరాబాద్: మూసీ నదికి పోటెత్తిన వరద.. రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఉస్మాన్, హియాయత్సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్లోకి ఇన్ ఫ్లో 8000 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10700 క్యూ సెక్కులు ఉంది. దీంతో 8 గేట్లు 4 అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1789.10 అడుగులుగా ఉంది. రిజర్వాయర్లోకి ఇన్ ఫ్లో 8000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. 13 గేట్లు ఆరు అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని వదులుతున్నారు. రాకపోకలు బంద్ మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్ అయ్యారు. అంబర్పేట-కాచిగూడ, మూసారాంబాగ్- మలక్పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మరికొన్ని గంటల్లో అల్వాల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంఠ్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశ ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సీపీ సందర్శన ఉస్మాన్ సాగర్, ఓఆర్ఆర్ వద్ద వరద ప్రవాహాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. వర్షం ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడుతో కలిసి హిమాయత్ సాగర్ చెరువు, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు, గండిపేట చెరువులను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు పెరుగుతోందని, పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలదిపారు. పోటెత్తిన వరద మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నాలుగు అడుగుల ఎత్తిత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 5,733.36 క్యూసెక్కులు వస్తుండగా 17, 809 క్యూసెక్కులు కాగా. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి సామర్థ్యం 637.500 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.67 టీఎంసీలుగా కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం, రుద్రవల్లి, భూదాన్ పోచలంపల్లి మండలం జూలురు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవ్ బ్రిడ్జికి ఇరువైపుల వాహనదారులు, ప్రజలు ప్రయాణించకుండా బీబీనగర్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల వంతెనపై మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో భువనగిరి మండలం, భుల్లేపల్లి, వలిగొండ మండలం, సంగెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. -
దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. జంట నగరాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల నీటి తొలగింపు సమస్యగా మారి.. ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. వికారాబాద్, శంకర్పల్లిలో భారీగా వర్షం కురుస్తుండడంతో.. గండిపేట జలాయశానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. తాండూరు-వికారాబాద్, పరిగి-వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. Today - Moderate Rains During Evening/Night Time. Tomorrow - Heavy Rains Likely from Afternoon -Early Morning. — Hyderabad Rains (@Hyderabadrains) July 26, 2022 గరిష్టంగా వికారాబాద్లో 12 సెం.మీ, నగరంలో హస్తినాపురంలో వర్షపాతం నమోదు అయ్యింది. మూసారంబాగ్-గోల్నాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట్ రైల్వే స్టేషన్ కింద నీరు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నారు. #StayAway from power transformers, power poles & wires. #Heavy_rain #Massive_floods #rain #HyderabadRains #flood #floods #StayAlert.@TelanganaDGP @CommissionrGHMC @TelanganaCOPs @hydcitypolice @cyberabadpolice @TS_SheTeams @ts_womensafety @Rachakonda_tfc @sheteams_rck pic.twitter.com/L5dR4SpkfB — Rachakonda Police (@RachakondaCop) July 26, 2022 Mallepally area of #Hyderabad at night due to heavy #Rains pic.twitter.com/zArxpOaIMc — Sandeep Dhar (@sandeepdhar10) July 26, 2022 #ALERT Next 2hrs forecast ⚠️#HeavyRain continue all over #Vikarabad #Hanmakonda #Jangaon #Peddapalli #Mancherial #Adilabad #Gadwal . RAINS in Nizamabad, Kamareddy, Medak, Karimnagar, Mahabubnagar, Narayanpet, Sircilla, Asifabad and Jagitial districts Less rains in #Hyderabad pic.twitter.com/aEXSivW651 — Praja Sangram Yatra 3 (@sandeep_muttagi) July 26, 2022 -
మూసీ.. కాస్త మెరిసీ..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ జీవనరేఖ.. చారిత్రక మూసీ నది నీటి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. మూసీ నీటిలో హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడైంది. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది. మార్చి చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. మానవ మల, మూత్రాదుల్లో ఉన్న హానికారక కోలిఫాం బ్యాక్టీరియా ఉనికి కూడా తగ్గుముఖం పట్టడం విశేషం. ఈ బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం మోస్ట్ ప్రాపబుల్ నంబరు పరిమితులకు లోపలే ఉన్నట్లు తేలింది. కారణాలివే.. గతేడాది సీజన్లో భారీ వర్షాలు కురియడంతో మూసీ మురికి వదిలింది. ఎగువ ప్రాంతంలో ఉన్న హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాల గేట్లను వర్షాకాల సీజన్లో సుమారు పది సార్లు వదిలి వరద ప్రవాహాన్ని దిగువనకు వదిలిపెట్టారు. దీంతో వ్యర్థ జలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పీసీబీ, మూసీరివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతోన్న 1800 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తోన్న 22 ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణంగా కనిపిస్తోంది. మూసీ కష్టాలివే.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్ప్లాన్ సిద్ధం చేసి దాని ప్రకారం పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బ్లాక్ల వారీగా గుర్తింపు.. ఇక కూల్చివేతలే!
సాక్షి, హైదరాబాద్: సుందరీకరణలో భాగంగా మూసీ నది తీరప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీవాహక ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ సర్వే ద్వారా బ్లాక్ల వారీగా ఆక్రమిత నిర్మాణాలను గుర్తించింది. మండలాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసి అక్రమ నిర్మాణాల జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తోంది. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి సమగ్రంగా పరిశీలించనుంది. అనంతరం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అక్రమ నిర్మాణాలను తొలగింపునకు మార్గం సుగుమమం చేసుకుంటోంది. రెండున్నరేళ్ల క్రితమే.. ► నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతంలో ఆరు వేలకుపైగా ఆక్రమణ నిర్మాణాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా సర్వే నిర్వహించి సుమారు ఆక్రమణల సంఖ్య 8,529 పైనే ఉన్నట్లు తేల్చారు. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నది పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. ► మండలాల వారీగా మూసీ నది మొత్తం, పొడవు, ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్లతో పాటు కేటగిరీల వారీగా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. పరీవాహక ప్రాంతాంలో మండల వారీగా ఆక్రమణల సంఖ్య పరిశీలిస్తే.. ఆసిఫ్నగర్ మండలంలో ఆక్రమణల సంఖ్య 667, అంబర్పేట పరిధిలో 989, బహదూర్పురా 4,225, చార్మినార్ 73, గోల్కొండ 517, హిమాయత్నగర్ 499, నాంపల్లి 658, సైదాబాద్ పరిధిలో 902 ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వే మరోసారి.. మూసీ సుందరీకరణ వైపు వేగంగా అడుగులు పడుతుండటంతో ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, మూసీ రివర్ఫ్రంట్ డెవల్పమెంట్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మరోసారి సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ, ఆసిఫ్నగర్, బహదూర్పురా, చార్మినార్, నాంపల్లి, హిమాయత్నగర్, సైదాబాద్, అంబర్పేట్ మండలాల్లో పూర్తయింది. మొత్తం మీద నదిలో 978, బఫర్జోన్లో నదికి ఇరువైపులా 5,501 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’) ఇరువైపులా 50 మీటర్ల పరిధి.. మూసీ ఒడ్డు నుంచి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్లో గుర్తించిన నిర్మాణాలను కూల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రత్యేక నోటీఫికేషన్ల ద్వారా ఆక్రమణల వివరాల జాబితాలను ప్రకటించి వాటిని ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసులు, పీఎస్లు, మున్సిపల్, సంబంధిత ప్రభుత్వ ఆఫీసుల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అభ్యంతరాలుంటే సరైన డాక్యుమెంట్లతో పక్షం రోజులుగా సంబంధిత తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులో తెలియజేసేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత ఏకకాలంలో పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టనుంది. (చదవండి: భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి) -
మూసీపై హైకోర్టు సీజే వ్యాఖ్యలు.. ప్రక్షాళన ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీ జీవనాడి చారిత్రక మూసీ నదికి లండన్లోని థేమ్స్.. గుజరాత్లోని సబర్మతి తరహాలో మహర్దశ ఎప్పుడు పడుతుందా అని మహానగర సిటీజన్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హైకోర్టు సమీపంలో మూసీ నది మురుగు కాల్వను తలపిస్తోందని వ్యాఖ్యానించడంతో ఈ నది ప్రక్షాళన, సుందరీకరణ అంశం మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. ►మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా.. నగరంలో మూసీ ప్రవహిస్తోన్న 45 కి.మీ మార్గంలో (బాపూఘాట్– ప్రతాప సింగారం)ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, ప్రవాహ మార్గానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవడం, డ్రోన్లతో దోమల ఉద్ధృతి పెరగకుండా స్ప్రే చేయడం, పలు చోట్ల తీరైన నడకదారులు, హరిత వాతావరణం ఏర్పాటు చేయడం వంటి ఉపశమన చర్యలు తీసుకోవడం విశేషం. ►మరోవైపు ఇటీవలి కుండపోత వర్షాలకు నదిలో మురికి పైపైన కొట్టుకుపోయింది. మూసీ నీటిలో వృక్ష,జంతు ఫ్లవకాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ శాతం పెరగడం కూడా పెద్ద ఊరట. కానీ ఇవన్నీ పైపై మెరుగులేనని శాశ్వత పరిష్కార చర్యలు కావని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తుండడం గమనార్హం. ►మూసీ ప్రక్షాళన, సుందరీకరణపై సమగ్ర మాస్టర్ప్లాన్ తయారు చేసి అమలు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ ప్రణాళికల అమలుపై మూసీ కార్పొరేషన్, ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. సమగ్ర మాస్టర్ప్లాన్ అత్యవసరం.. ►మహానగరానికి మణిహారంలా ఉన్న చారిత్రక మూసీనది ప్రక్షాళన, సుందరీకరణపై సమగ్ర మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాల్సి ఉంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న మురుగునీరు ఈ నదిలో చేరకుండా ఇది ప్రవహించే మార్గానికి ఇరువైపులా రూ.3,865 కోట్ల అంచనా వ్యయంతో దశలవారీగా 31 ఎస్టీపీలను నూతనంగా నిర్మించాల్సి ఉంది. ►ఆయా పనులకోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు జారీచేసింది. పనులు తక్షణం ప్రారంభించి ఏడాదిలోగా ఈపనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇక సిటీలో నది ప్రవహించే మార్గంలో బాపూఘాట్– ప్రతాపసింగారం వరకు చేపట్టాల్సిన సుందరీకరణ పనులతోపాటు తీరైన రహదారులు, ఫ్లైఓవర్లు, నడకదారుల ఏర్పాటు, బోటింగ్ సదుపాయం కల్పించడం తదితర పనులపై సమగ్ర మాస్టర్ప్లాన్ను రూ.30 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలోనే మహర్దశ మూసీకి మహార్ధశ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. త్వరలో సమగ్ర మాస్టర్ప్లాన్ను సిద్ధంచేసి దాని ప్రకారం పనులు చేపడతాము. ఇటీవలి కాలంలో రూ.7 కోట్ల అంచనా వ్యయంతో మూసీ ప్రవాహ మార్గంలో తీరైన నడకదారులను అభివృద్ధి చేశాము. మూసీ ప్రవహించే మార్గాన్ని సమగ్ర సర్వే చేపట్టి...నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాము. – సుధీర్రెడ్డి, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ -
మూసీ నదిని చూసి మురుగునీటి కాలువ అనుకున్నా: హైకోర్టు చీఫ్ జస్టిస్
నాంపల్లి (హైదరాబాద్): పర్యావరణాన్ని రక్షించేందుకు కేవలం ప్రభుత్వంపైనే బాధ్యత వేయకుండా ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్విహార్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ నూతన కార్యాలయాన్ని ఆయన అథారిటీ చైర్మన్ జస్టిస్ ప్రకాశ్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ సతీష్ చంద్ర సభనుద్దేశించి మాట్లాడారు. ‘నేను మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు హుస్సేన్సాగర్ గురించి ఎంతో గొప్పగా విన్నా. మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు హుస్సేన్సాగర్ను చూడటానికి వెళ్లాను. అయితే, అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా. అలాగే హైకోర్టు దగ్గర ఉన్న మూసీ నదిని చూసి తొలుత మురుగునీటి కాలువని అనుకున్నా. కానీ, నా డ్రైవర్ అది నది అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా’అని జస్టిస్ సతీష్ చంద్ర చెప్పారు. తానొకరోజు విమానాశ్రయం వెళ్తోంటే కొందరు వ్యక్తులు సంచుల్లో చెత్తను తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేశారని, తన కుమారుడు కారు ఆపి ఆ చెత్తను చెత్తకుండీలో వేశారని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీకి ఐదుసార్లు క్లీన్ సిటీ అవార్డు వచ్చిందని, అక్కడి కలెక్టర్తోపాటు పలువురు అధికారులు మరుగుదొడ్ల పక్కనే పుట్ఫాత్పై భోజనం చేశారని చెప్పారు. నదులు, సరస్సులు, పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తున్న వారిపై ఈ అథారిటీతోపాటు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ఉండి కాలుష్య నియంత్రణకు పాటుపడాలని చీఫ్ జస్టిస్ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అథారిటీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు
సాక్షి, హైదరాబాద్: మూసీపై దాదాపు డజను కొత్త వంతెనలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం అవి వైవిధ్యంగా..విభిన్నంగా..కొత్త సొబగులతో అలరించేలా ఉండాలని భావిస్తోంది. అటు ట్రాఫిక్ చిక్కులు తీర్చడంతోపాటు ఇటు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా తగిన వాస్తుశిల్పాలతో ఉండాలని భావిస్తోంది. మూసీ వంతెనలపై సాఫీ ప్రయాణమే కాకుండా చూడ్డానికి కూడా అందంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దుర్గం చెరువు, ట్యాంక్బండ్లు పర్యాటక ప్రాంతాలుగా కొత్త సొగసులతో ఆకట్టుకుంటుండంతో మూసీలపై నిర్మించే ఈ కొత్త వంతెనలు కూడా వాటిలాగే ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండాలని యోచిస్తోంది. వీటన్నింటి అంచనా వ్యయం దాదాపు రూ.390 కోట్లు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఆర్డీసీఎల్ (హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)ల ఆధ్వర్యంలో వీటిని నిర్మించనున్నారు. చదవండి: నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం ఇలా ఉండాలి.. ► ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా కొత్త వంతెనలు దిగువ విధంగా ఉండాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ► చూడ్డానికి అందంగా..ఆకర్షణీయంగా ఉండాలి. ► హైదరాబాద్ వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించాలి. ► మూసీ వంతెనలపై నుంచి పరిసర ప్రజలకు సాఫీ ప్రయాణం సాగాలి. ► వివిధరోడ్లపై ట్రాఫిక్ సాఫీగా సాగేలా ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్. ► వీటి వినియోగం వల్ల మేజర్ కారిడార్లలో కూడా ట్రాఫిక్ నిర్వహణ మెరుగవ్వాలి. ► ప్రయాణ దూరం, ఇంధన ఖర్చు తగ్గాలి. ► బ్రిడ్జిలకు సమీపంలో వాణిజ్య సంస్థలు అభివృద్ధి చెందాలి. ఆస్తుల విలువ పెరగాలి. ► ఇతర ప్రధాన రహదారుల్లో కర్బన ఉద్గారాలు,ట్రాఫిక్ జామ్స్,ప్రయాణసమయం తగ్గాలి. ► పర్యాటకంగా అభివృద్ధి చెందాలి. చదవండి: బాబోయ్..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది! పాతవాటికి కూడా.. దాదాపు 54 కి.మీ. మేర ఉన్న మూసీపై కొత్తగా వచ్చే ఈ వంతెనలతోపాటు, పాత వంతెనలకు కూడా కొత్త సొగసులద్దనున్నారు. కొత్త వంతెనలు అందంగా కనిపించేందుకు తగిన వాస్తుశిల్ప డిజైన్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆర్ఎఫ్పీలు ఆహా్వనించారు. ఆర్కిటెక్చర్లో అనుభవజ్ఞులు, నిపుణులతోపాటు ఆర్కిటెక్చర్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. అంతేకాదు.. ఉత్తమ డిజైన్లతో ఎంపికైన వారికి మొదటి బహుమతికి రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతికి లక్ష రూపాయలు, మూడో బహుమతికి రూ.50వేలతోపాటు ముగ్గురికి కన్సొలేషన్గా రూ. 20వేల వంతున నగదు బహుమతులందజేయనున్నారు. సదుపాయం.. కొత్త బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే లంగర్హౌస్, పురానాపూల్, అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారికి ఎంతో సదు పాయం కలుగుతుంది. మూసీలోకి మురుగునీరు చేరకుండా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కొత్త వంతెనలు ఈ ప్రాంతాల్లోనే.. ♦ ఐకానిక్ వంతెన, అఫ్జల్గంజ్. ♦ మూసారాంబాగ్ వద్ద ♦ ఇబ్రహీంబాగ్ కాజ్వేపై మిస్సింగ్ లింక్ (కారిడార్ నెంబర్ 99) ♦ చాదర్ఘాట్ వద్ద ♦ సన్సిటీ– చింతల్మెట్ (పవర్ కారిడార్)మార్గంలో.. ♦ ఇన్నర్రింగ్రోడ్ –కిస్మత్పూర్లను కలుపుతూ.. ♦ బుద్వేల్ (ఐటీ పార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ) ♦ హైదర్షాకోట్ – రామ్దేవ్గూడ ♦ మూసీపై అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు ♦ మూసీ దక్షిణ ఒడ్డును ఉప్పల్ లేఔట్ను కలుపుతూ కొత్త బ్రిడ్జి. దక్షిణ ఒడ్డును కలిపేలా లింక్ రోడ్డు. ♦ ప్రతాప్సింగారం–గౌరెల్లి మార్గంలో. -
నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం
సూర్యాపేటరూరల్: ఓ మహిళ మూసీ వాగులో చిక్కుకుని రాత్రంగా నీటిలోనే జాగారం చేయాల్సి వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కొల్లూరు గ్రామానికి చెందిన కట్ట రాములమ్మ (65)కాలినడకన గ్రామాలు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉప్పల పహాడ్ గ్రామానికి వచ్చింది. శుక్రవారం భిక్షాటన చేసి టేకుమట్ల శివారులోని మూసీవాగులో కల్వర్టు ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నీళ్లులేకపోవడంతో భోజనం చేసి నిద్రపోయింది. అయితే రత్నపురం మూసీ ప్రాజెక్టు అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా మూసీ వాగుకు నీటి తాకిడి పెరిగింది. దీంతో నిద్రలో ఉన్న ఆమె నీటిలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఓ రాయి దొరకడంతో దాన్నిపట్టుకుని రాత్రంతా నీళ్లల్లో వణుకుతూ గడిపింది. కాపాడమని కేకలు వేస్తోన్న ఆమెను రాయినిగూడెం వాసులు గమనించి వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో పడవలు వేసుకుని వెళ్లి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం
సాక్షి, అంబర్పేట: మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. అంబర్పేట ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో వరద ఉధృతిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. ప్రవాహంలో మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉధృతిలో మృతదేహం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఘట్కేసర్ వైపు మృతదేహం కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మూసీ నది లో పెరుగుతున్న వరద ఉద్ధృతి ఫొటోలు
-
మూసారాంబాగ్: మూసీలో మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: గులాబ్ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతేరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో డెడ్బాడీ కలకలం సృష్టించింది. మూసీలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న మృతదేహం వెలుగు చూసింది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో మృతదేహం వెలికితీతకు అడ్డంకి ఏర్పడింది. చదవండి: గులాబ్ గుబులు..! సోషల్మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..! -
హిట్లర్ బతికుంటే కేసీఆర్ను చూసి ఏడ్చేవాడు: కోమటిరెడ్డి
హైదరాబాద్: మూసీ నదిని తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్లో మాట్లాడుతానని ఆయన అన్నారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్ను చూసి ఏడ్చేవాడని కోమటిరెడ్డి విమర్షించారు. సీఎం కేసీఆర్ వాసలమర్రికి రెండు సార్లు వస్తే.. ఎంపీగా నాకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరని దుయ్య బట్టారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఓడినట్లన్నారు. దళితులకు కేబినెట్లో స్థానం లేదు గాని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్కు తెలుసని విమర్షించారు. -
మూసీ సుందరీకరణ మట్టికొట్టుకుపోయింది
సాక్షి, ఉప్పల్: మూసీ సుందరీకరణ మట్టికొట్టుకుపోయింది. ప్రారంభానికి ముందే పనులు ఆనవాళ్లు కోల్పోయాయి. అధికారుల ముందుచూపు లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయలు నీళ్లపాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందుకు రూ.5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు ఉప్పల్ సమీపంలోని మూసీ తీరాన ఐదు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ల నిర్మాణం, మొక్కల పెంపకం చేపట్టారు. అందమైన పార్కులు తీర్చిదిద్దారు. కానీ వీటి నిర్వహణ విషయంలో ముందుచూపు ఆలోచన చేయలేదు. వరదలు వస్తే ఇవి ఉంటాయా..లేదా అన్నది పరిగణనలోకి తీసుకోలేదు. అధికారుల పర్యవేక్షణ సరిగాలేక కాంట్రాక్టర్లూ నాసిరకం పనులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలకు సుందరమైన పార్కు, మొక్కలు, వాకింగ్ ట్రాక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. -
మూసి రిజర్వాయర్ గేట్లను ఎత్తిన అధికారులు
-
మూసీకి శాపంగా మారుతున్న మార్గాలివే..
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు మూసీ సుందరీకరణ పేరిట కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుండగా.. మరోవైపు మూసీ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా మూసీనదికి బాపూఘాట్–ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గం శాపంగా మారింది. సిటీలోకి బాపూఘాట్ వద్ద ప్రవేశిస్తున్న మూసీలో కాలుష్య మోతాదు పెరిగినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడించింది. ఈ రూట్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న మురుగునీటితో మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదు అనూహ్యంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ రకాల జలచరాలు, వృక్ష జాతులు, జంతువుల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ శాతం (డీఓ) లీటరు నీటిలో 4 మిల్లీ గ్రాములుగా ఉండాలి. కానీ నగరంలో పలు చోట్ల 0.3 శాతంగా నమోదవడం గమనార్హం. ఇక బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్ నీటిలో 3 ఎంజీలను మించకూడదు. కానీ పలు చోట్ల 10 ఎంజీలకు పైగా నమోదైంది. సిటీలో మూసీ కాలుష్యం ఇలా.. మహానగరం పరిధిలో నిత్యం విడుదలవుతోన్న 1400 మిలియన్ లీటర్ల మురుగు జలాల్లో జలమండలి కేవలం 700 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను మాత్రమే శుద్ధి చేస్తోంది. మరో 700 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తున్నాయి. బల్క్ డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వెలువడుతోన్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా ట్యాంకర్ల ద్వారా మూసీలోకి డంప్ చేస్తున్నారు. బాపూఘాట్, మూసారాంబాగ్ వంతెన, నాగోల్, ఉప్పల్ నల్ల చెరువు, ఫీర్జాదిగూడా, ప్రతాపసింగారం వద్ద మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదు తాజాగా 0.3 మిల్లీగ్రాములుగా నమోదైంది. క సిటీ పరిధి దాటిన తరవాత..రుద్రవెల్లి వంతెన, వలిగొండ, కాసానిగూడా వద్ద కరిగిన ఆక్సిజన్ మోతాదు 5.6 పాయింట్లుగా నమోదవడం విశేషం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బాపూఘాట్ వద్ద 10, మూసారాంబాగ్ వద్ద 16, నాగోల్ వద్ద 15, ఉప్పల్ నల్ల చెరువు వద్ద 16, ఫీర్జాదిగూడ వద్ద 15, ప్రతాప సింగారం వద్ద 10 మిల్లీ గ్రాములుగా నమోదైంది. నగర పరిధి దాటిన తరవాత బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ రుద్రవెల్లి వంతెన వద్ద 5, వలిగొండ వద్ద 4.5, కాసానిగూడా వద్ద 4 యూనిట్లుగా నమోదవడం విశేషం. మొత్తంగా నగరంలో బాపూఘాట్–ప్రతాపసింగారం మార్గంలో మూసీ జలాల్లో కరిగిన ఆక్సిజన్ మోతాదు తగ్గి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో స్పష్టమైంది. మూసీకి ఆవల మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేయాలి. పలు చోట్ల ఎస్టీపీలను నిర్మించి మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాలను శుద్ధిచేయాలి. ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలివే.. అంబర్పేట్(142ఎంఎల్డి), నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు(80ఎంఎల్డి), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్ (30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డి),నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్–హయత్నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్,ఐడీపీఎల్ టౌన్షిప్,నాగారం కాప్రా చదవండి: ‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం -
‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో తాగునీరు, మూసీ సుందరీకరణ అంశాలు ప్రధాన పక్షాలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య కాక పుట్టిస్తున్నాయి. ఇవే ప్రధానాస్త్రాలుగా మూడు పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాగునీటి గోస తీర్చడంలో వైఫల్యం మీదంటే.. మీదంటూ కత్తులు దూసుకుంటున్నాయి. చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలు, ఆక్రమణలకు అధికార పార్టీనే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తుంటే, అరవై ఏళ్లుగా ఆవేదన పడుతున్న ప్రజల కన్నీళ్లను తుడిచేందుకే అనేక చర్యలు తీసుకున్నామని టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. అన్ని డివిజన్లలో తాగునీటి అంశమే ప్రధాన ఎజెండాగా సాగుతున్న విమర్శలతో ప్రచారం వేడెక్కుతోంది. ‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం ‘గ్రేటర్’ పోరులో ప్రధాన పార్టీల ప్రచారమంతా మూసీ చుట్టూనే తిరుగుతోంది. 250కిలోమీటర్ల మూసీ నది ప్రక్షాళనలో టీఆర్ఎస్ విఫలమైందని, ఆ పార్టీ నేతలే కబ్జాదారులుగా మారి ఆక్రమణలకు పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉస్మాన్సాగర్ నుంచి వడపల్లి వరకు మూసీ పరీవాహకంలో 490 పరిశ్రమల నుంచి 27 డ్రెయిన్ల ద్వారా రోజుకు 1,400 ఎంఎల్డీల మురుగు వచ్చి చేరుతున్నా, 800 ఎంఎల్డీలకు మించి శుద్ధి చేయట్లేదని అవి ఆరోపిస్తున్నాయి. మూసీ కంపు పోవాలంటే మాకు ఓటెయ్యాలంటూ 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందిన టీఆర్ఎస్.. మూసీ పరీవాహక ప్రాంతాల అభివృధ్ధికి రూ.1,400 కోట్లు వెచ్చిస్తామని చెప్పి మాట తప్పిందని బీజేపీ తన చార్జిషీట్లో నిలదీసింది. మూసీలోకి కాలుష్యకారకాల నియంత్రణ, కబ్జాల నియంత్రణ, ఆక్రమణల కూల్చివేతలు, నాలాల పునరుద్ధరణలో విఫలం కావడంతో ఇటీవల వరదలతో నగరం నీట మునిగిందని ఆరోపణలు గుప్పిస్తోంది. చెరువులు, కుంటల ఆక్రమణదారుల్లో అధికంగా టీఆర్ఎస్ నేతలే ఉన్నారంటూ కాంగ్రెస్ మరోవైపు ప్రచారం చేస్తోంది. మూసీ సుందరీకరణకు సబర్మతీ తరహా యాక్షన్ప్లాన్ ఏమైందంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. దీనిపై టీఆర్ఎస్ గట్టిగానే ప్రతిస్పందిస్తోంది. 60 ఏళ్లుగా మూసీ ప్రక్షాళనను పట్టించుకోని గత పాలకులు తమను విమర్శిస్తున్నారని ఎదురుదాడికి దిగుతోంది. మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి స్వచ్ఛందంగా మారుస్తామని సీఎం ప్రకటించారు. నదికి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించి, మురుగునీటి శుద్ధికి 59 ఎస్టీపీలు నిర్మిస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం వెల్లడించారు. చెరువుల కబ్జాల నివారణకు జీహెచ్ఎంసీ కొత్త చట్టంలో కఠిన నియమాలు పొందుపరుస్తామని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. వరదలతో నష్టపోయిన వారికి 10 వేల సాయం చేస్తా మని మాటిచ్చి.. కోట్ల రూపాయల మేర కార్యకర్తలే జేబులు నింపుకున్నారని విపక్షాలు ఎత్తిపొడుస్తుంటే, వరద ప్రాంతాల్లో కనీసం పర్యటిం చని వారు.. ప్రజల పక్షాన నిల్చిన వారిపై అభాండాలు మోపుతున్నారని అధికార పక్షం కౌంటరిస్తోంది. తాగునీటి గోసకు కారకులు మీరంటే మీరే.. హైదరాబాద్ తాగునీటి ఇక్కట్లపైనా పార్టీల మధ్య పెద్ద దుమారమే నడుస్తోంది. కృష్ణా నీళ్లను నాగార్జునసాగర్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీదుగా హైదరాబాద్కు తీసుకొచ్చిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. 20 టీఎంసీల ఎల్లంపల్లి బ్యారేజీ నిర్మాణాన్ని తమ హయాంలోనే పూర్తిచేశామని, దానిద్వారా హైదరాబాద్కు తాగునీటి అందించింది తామేనని అంటోంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిస్తామన్న ముఖ్యమంత్రి, బస్తీల్లో ఇంకా తాగునీటి గోస తీర్చలేకపోయారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఎత్తిచూపుతున్నారు. కాళేశ్వరం నుంచి లక్ష కోట్లతో తన సొంత ఫామ్హౌస్ దగ్గరి కొండపోచమ్మసాగర్ వరకు నీటిని ఎత్తిపోసిన ముఖ్యమంత్రి, హైదరాబాద్కు నీటిని తరలిస్తామన్న హామీని మాత్రం మరిచిపోయారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేస్తున్నారు. హుస్సేన్సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలా చేస్తామన్న హామీ ఏమైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం గట్టిగానే ప్రశ్నించారు. అయితే దీనిపై గట్టిగానే బదులిస్తున్న టీఆర్ఎస్.. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని యాభై ఏళ్లకు సరిపోయేలా తాగునీటి వసతుల కోసం కేశవాపురం రిజర్వాయర్ నిర్మిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. హుస్సేన్సాగర్ అభివృద్ధికి ఇప్పటికే రూ.289 కోట్లు, చెరువుల పనులకు రూ.376 కోట్ల మేర ఖర్చు చేశామని ప్రతిపక్షాలకు అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. -
హైదరాబాద్ను రక్షిస్తోన్న ‘అతిథి’..!
ఢాం..ఢాం.. గుండ్లు పేలుతున్నాయి.. చుట్టూ ఉన్న గుట్టల మాటున ఆ శబ్దం ప్రతిధ్వనిస్తోంది.హైదరాబాద్కు అతిథులుగా ఉన్నత ప్రముఖులు వచ్చినప్పుడు గన్ శాల్యూట్గా 21మార్లు తుపాకులను గాల్లోకి పేల్చడం ఆనవాయితీ.. ఇక్కడా ఓ అతిథిని ఆహ్వానిస్తూ డైనమైట్ పేలుళ్లు.. తొలుత 21.. ఆపై మొత్తంగా 101సార్లు. ఓ బృహత్తర పనికి శ్రీకారం చుట్టుకున్న సందర్భమది.గన్ శాల్యూట్ తీసుకున్న అతిథులతో భాగ్యనగరానికి ఒరిగిందేమిటో కానీ.. ఈ ప్రత్యేక శాల్యూట్ తీసుకున్న ‘అతిథి’మాత్రం నగరాన్నే రక్షిస్తోంది. ఆ అతిథి పేరు– ‘గండిపేట జలాశయం’.. ఉరఫ్ ఉస్మాన్సాగర్. సాక్షి, హైదరాబాద్: 1908 సెప్టెంబర్: జల ప్రళయాన్ని తలపించేలా మూసీ ఉప్పొంగింది. బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో రెండ్రోజుల ఏకధాటి వానలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. దాని తీరంలో అభివృద్ధి చెందిన ప్రధాన నగరం ధ్వంసమైంది. 15 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అంతకు పదిరెట్ల మంది నిరాశ్రయులయ్యారు. నగర పునర్నిర్మాణ బాధ్యతను నాటి ప్రఖ్యాత ఇంజినీర్, మైసూర్ స్టేట్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఆయన పూర్తిస్థాయి అధ్యయనం చేసి మూసీనది (ఈసీతో కలుపుకొని)పై రెండు జలాశయాలు నిర్మించాలని తేల్చారు. అందులో పెద్దది, ముఖ్యమైంది గండిపేట జలాశయం. (వినియోగంలో ఉన్న వందేళ్ల నాటి కార్యాలయం) 101 డైనమైట్లు పేల్చి.. గుట్టలు ఛిద్రంచేసి.. మార్చి 23, 1913: ప్రస్తుతం గండిపేట జలాశయం ఉన్నచోట అన్నీ గుట్టలే. మధ్యలో కొన్ని ఊళ్లు. వాటిని ఖాళీచేయించి గుట్ట భాగాలను డైనమైట్లు పెట్టి పేల్చేశారు. నాటి బ్రిటిష్ ఇండియా రెసిడెంట్ ఫినే, ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీ సమక్షంలో విశ్వవిఖ్యాత ఇంజినీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య స్వీయ పర్యవేక్షణలో 101 డైనమైట్లు పేల్చగా, గుట్టభాగాలు ఛిద్రమై మైదానంలాంటి ప్రాంతం ఏర్పాటైంది. అక్కడే ఓ భారీ మానవ నిర్మిత జలాశయం ఉద్భవించింది. 1913 మార్చిలో ప్రారంభమైన పనులు 1920 శీతాకాలం నాటికి పూర్తయ్యాయి. గండిపేట జలాశయం ప్రారంభ తేదీ, నెలలకు సంబంధించి కచ్చితమైన అధికారిక సమాచారమేదీ లేదని, అప్పటికే జోరుగా పడిన వర్షాలతో 1920 శీతాకాలం నాటికి గండిపేట నిండుకుండలా మారిందని, ఆ సమయంలోనే దాన్ని ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఈ చెరువు సేవలు ప్రారంభమై ఈ చలికాలంతో సరిగ్గా వందేళ్లవుతోంది. అంటే అదిప్పుడు ‘శత వసంతాల గండిపేట’అన్నమాట. 46 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయం నిర్మాణానికి అప్పట్లో రూ.56 లక్షలు ఖర్చయ్యాయి. కాగా, ఇది అందుబాటులోకి వచ్చిన ఏడాదే, అంటే 1920లో పనులు ప్రారంభమై 1927లో హిమాయత్సాగర్ జలాశయం సిద్ధమైంది. (నేటికీ వినియోగంలో ఉన్న రాన్సన్స్ అండ్ రేపియర్ లి కంపెనీ రూపొందించిన యంత్రాలు) రిటైర్మెంట్ కాదు.. టర్నింగ్ పాయింట్ ప్రస్తుతం కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వస్తూ నగర దాహార్తిని తీరుస్తున్నాయి. దీంతో కొంతకాలంగా ‘గండిపేటకు ఇక రిటైర్మెంటే’అనే మాటలు వినిపిస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు పొందుపరిచిన ఆంక్షలకు రేపోమాపో సడలింపులుంటాయని ముమ్మర ప్రచారం జరుగుతున్న వేళ, సరిగ్గా వందేళ్లలోకి గండిపేట అడుగుపెట్టిన సమయంలో పెద్ద ‘టర్నింగ్ పాయింట్’ఘటనే ఎదురైంది. 1908 నాటి వరదలకు నగరం ధ్వంసమైన నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి జలప్రళయం రాకుండా ఏర్పడ్డ గండిపేట.. తన అవసరాన్ని వందేళ్ల తర్వాత కూడా చాలా గట్టిగా గుర్తుచేసింది. తనను నిర్లక్ష్యం చేస్తే సిటీకి మళ్లీ ప్రళయం ముంచుకొచ్చినట్టేనని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలోని వందల కాలనీలు, బస్తీలు నీటమునిగిన విషయం తెలిసిందే. నెలైనా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జంట జలాశయాలు లేకుంటే ‘1908 బీభత్సం’కంటే పెద్ద ఉత్పాతాన్నే నగరం కళ్లచూడాల్సి వచ్చేది. ఉస్మాన్సాగర్–హిమాయత్సాగర్ జంట జలాశయాలు, వాటి చుట్టూ ఉన్న చిన్న చెరువులు పదిలంగా ఉంటేనే భవిష్యత్తులో మూసీ వరదల నుంచి సిటీ సురక్షితంగా ఉండగలదన్న విషయం స్పష్టమైంది. నగరాన్ని కాపాడేందుకు వందేళ్ల కింద పుట్టిన తాను (గండిపేట).. వందేళ్ల వయసులో తానింకా సిటీకి అవసరమేనన్న విషయాన్ని తేల్చిచెప్పింది. వెరసి తనను కాపాడుకుంటేనే మీరు సురక్షితంగా ఉంటారని నగరవాసిని గట్టిగానే హెచ్చరించింది. గండిపేట జలాశయాన్ని పరిరక్షించుకోవాలని, వర్షపు నీరు అందులోకి చేరకుండా అడ్డుపడే నిర్మాణాలను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. (యంత్రాలు రూపొందించిన సంస్థ పేరు) అవి లేకుంటే మనం ఉండం గండిపేట జలాశయం నిర్మాణ సమయంలో సామగ్రి, కూలీలను రైలులో తరలించేవారు. ఇందుకోసం నగరం నుంచి మూసీ తీరం వెంబడి గండిపేట వరకు న్యారోగేజ్ రైల్వేలైన్ వేశారు. నా చిన్నతనంలో ఆ పట్టాలను చూశాను. తర్వాత తొలగించారు. గండిపేట వందేళ్లయినా ఇంత కూడా చెక్కుచెదరలేదు. ఇంకో వందేళ్లు ఉంటుంది. జంటజలాశయాలు బాగుంటేనే నగరం పదిలమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వాటికి రక్షణగా ఉన్న ఆంక్షలు సడలిస్తే వాటికి ఉరి వేసినట్టే. అప్పుడు వరదల నుంచి నగరాన్ని కాపాడేదెవరు?. – అనురాధారెడ్డి, ‘ఇంటాక్’– హైదరాబాద్ కన్వీనర్ -
1908.. ఆ రెండు రోజులు
సాక్షి,హైదరాబాద్: 1908.. సెప్టెంబర్ 27, 28వ తేదీలు. ఈ రెండు రోజులు.. 429 సంవత్సరాల హైదరాబాద్ చరిత్రలో చెరగని చీకటి అధ్యాయాలు. అప్పటి వరకు ముత్యాల నగరంగా మురిసిపోయిన మహానగరం ఊహించని జల ప్రళయంతో విలవిల్లాడింది. ఏకంగా 15 వేల మంది ప్రాణాలు తీసిన రాకాసిగా మూసీ నది ఉగ్రరూపం చూపింది. హైదరాబాద్ పశ్చిమ భాగంలో మొదలైన భారీ వర్షంతో నగరానికి వరద ముప్పు ఉందన్న హెచ్చరికను సెప్టెంబర్ 27 తెల్లవారుజామున 2 గంటలకు జారీ చేసిన నాలుగు గంటల్లోనే మూసీ తీరంపై క్లౌడ్ బరస్ట్ (మేఘ విచ్ఛిత్తి) కావటంతో 27, 28 తేదీల్లో 36 గంటల పాటు ఉగ్రరూపాన్ని చూపింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంలోని రెయిన్గేజ్.. ఆ వర్షాన్ని 17 సెం.మీ.గా రికార్డు చేసింది. కుండపోత వర్షం మూసీ నది మట్టం నుంచి 27 తెల్లవారుజామున 20 అడుగుల ఎత్తుకు ఎగస్తూ.., 28 నాటికి 60 ఫీట్ల ఎత్తుతో ఉగ్రరూపాన్ని చూపి నదికి ఇరువైపులా ఉన్న.. కోల్సావాడీ(బొగ్గులబస్తి), ఘాన్సీబజార్, అఫ్జల్గంజ్, కోకాకీ తట్టీలను నిండా ముంచేసింది. ఏకంగా అఫ్జల్గంజ్లో 11 అడుగుల వరదనీరు నిలిచిపోయి హైదరాబాద్ రాష్ట్ర వ్యాపార సంస్థలు కుప్పకూలాయి. అంతే కాకుండా మూసీ ఉగ్రరూపానికి పురానాపూల్ నర్వా (1578లో నిర్మించిన ఓల్డ్ బ్రిడ్జి) 1860లో నిర్మించిన ముసల్లం, ఛాదర్ఘాట్ బ్రిడ్జీలు పూర్తిగా ధ్వంసం కాగా, నిజాం ఆస్పత్రి (ప్రస్తుతం ఉస్మానియా) ఆనవాళ్లు లేకుండా పోయింది. కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ–సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ పూర్తిగా నీట మునిగాయి. శవాల దిబ్బగా నగరం.. మూసీ ఉగ్రరూపానికి 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. మూసీలో కొట్టుకుపోయిన వారు కాకుండా నగరమంతా శవాల దిబ్బగా మారింది. మూసీ ఒడ్డున ఉన్న చింతచెట్టును ఎక్కి వందల మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈ ప్రళయంలో 15 వేల మంది చనిపోయారని 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రకటించారు. ఆయన స్వయంగా కాలినడకన నగరమంతా తిరుగుతూ శవాలను సామూహిక ఖననం చేయించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు సెలవు దినాలుగా ప్రకటించి తన నివాస గృహమైన పురానీ హవేలీతో పాటు అన్ని ప్యాలెస్లలో ఉచిత భోజన, వైద్య, వసతి కల్పించారు. వరద సహాయ చర్యల కోసం నిజాం ప్రభుత్వం 50 లక్షలు కేటాయిస్తే.. నగర ప్రముఖులు మరో కోటి రూపాయలు విరాళాలుగా అందజేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నిపుణుడు సయ్యద్ ఆజం హుస్సేనీ నేతృత్వంలోని కమిటీ ఏడాదిలో నివేదిక ఇచ్చింది. వరదలతో కనువిప్పు.. హైదరాబాద్ వరద విషాదంపై ఆజం హుస్సేనీ ఇచ్చిన నివేదికపై 1911లో పగ్గాలు చేపట్టిన ఉస్మాన్ అలీఖాన్ కార్యాచరణ ప్రకటించి ఇంజనీరింగ్ నిపుణుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నగర బాధ్యతలు అప్పగించారు. ఆయన సూచనల మేరకు అనేక రంగాల నిపుణులతో 1912లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు నగరానికి పశ్చిమాన 16 కి.మీ. దూరంలో 1920లో ఉస్మాన్సాగర్ (గండిపేట), 1927లో హిమాయత్సాగర్ను పూర్తి చేశారు. మూసీ పరివాహక ప్రాంతమంతా 60 అడుగుల ఎత్తుతో పటిష్టమైన ప్రహరీగోడ నిర్మించారు. 1931 నాటికి డ్రైనేజీ మాస్టర్ ప్లాన్లో భాగంగా నాటి అవసరాల మేరకు నగరంలో సుమారు 700 కి.మీ. మేర భూగర్భ డ్రైనేజీ సదుపాయం సమకూర్చారు. -
భారీ వరద: కుంగిన పురానాపూల్ వంతెన
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోకి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లున్నీ దెబ్బతిన్నాయి. భారీ వరదల కారణంగా మూసీ నదికి వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వరద పోటెత్తడంతో పరివాహ ప్రాంతాలను మూసీ ముంచెత్తింది. ఈ క్రమంలోనే పురానాపూల్ వంతెన సైతం దెబ్బతిన్నది. భారీ ప్రవాహం ధాటికి బ్రిడ్జ్ పిల్లర్పై పగుళ్లు ఏర్పడటంతో కొంతమేర కుంగింది. సమచారం అందుకున్న అధికారులు పురానాపూల్ వంతెనపై నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు. నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత రాకపోకలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల ముప్పు ఇంకా పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర వాసులు భయపడుతున్నారు. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులు భీతిల్లుతున్నారు. (నిజాంల ‘ప్లాన్’ బెస్ట్!) -
మూసీలో చిక్కుకున్న యువకులు
సూర్యాపేటరూరల్ : చేపల వేటకు వెళ్లి సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామ సమీపంలో గల మూసీ నదిలో చిక్కుకున్న ముగ్గురు యువకులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన షబ్బీర్, సోహెల్, కైఫ్లు వరదనీటిలో చిక్కుకొని కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇతర అధికారులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకొని మూసీ అధికారులతో మాట్లాడి వరద ఉధృతి తగ్గింపులో భాగంగా గే ట్లను కొంత మేర కిందకు దించారు. దీంతో స్థానికులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ముగ్గురు యువకులను తాళ్ల సహాయంతో కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వద్దన్నా చేపల వేటకు.. ఆదివారం ఉదయాన్నే ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు షబ్బీర్, సోహెల్, కైఫ్లు మూ సీ నదిలోకి చేపల వేటకు వెళ్తుండగా కేటీ అన్నారం గ్రామస్తులు మూసీ గేట్లు ఎత్తారని, చేపల వేటకు వెళ్తే ప్రమాదంలో పడుతారని చెప్పినప్పటికీ వారు వినలేదు. ఉదయం 9 గంటల ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ము గ్గురు సాయంత్రం సమయంలో వరదనీటిలో గల్లంతై కేకలు వేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి సూర్యాపేటరూరల్ ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ భాస్కరన్, సూర్యాపేట ఆర్డీఓ కాసుల రాజేంద్రకుమార్, సూ ర్యాపేటరూరల్ సీఐ విఠల్రెడ్డి, తహసీల్దార్ వెంకన్న, జెడ్పీటీసీ జీడి భిక్షం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మూసీ నదిలో చిక్కుకున్న యువకులను స్థానిక ప్రజలు, పోలీసు, అధికారుల భాగస్వామ్యంతో రెస్క్యూ చేసి కాపాడినట్లు జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ అ«ధికారులకు స్థానిక ప్రజలు సహకారం అందించడం అభినందనీయమన్నారు. వర్షాలు బాగా కురుస్తుండడంతో నదులు, వాగులు, నీటితో నిండి ప్రవహిస్తున్నాయని, ఈ సమయంలో నీటిలోకి వెళ్లడం ప్రమాదకరమన్నారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సంఘటనకు సంబంధించి సమాచారం అందగానే వేగంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలు అభినందనలు తెలిపారు. ముగ్గురు యువకులు క్షే మంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘పేట’ పోలీసులకు డీజీపీ అభినందన సూర్యాపేటరూరల్ : సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మూసీనదిలో చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం చిక్కుకుపోవడంతో స్థానికులు, పోలీసులు, అధికారుల సహాయంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందగానే స్థానిక ప్రజలు ముగ్గురు యువకులను కాపాడేందుకు అందించిన సహకారం అభినందనీయమని ఎస్పీ భాస్కరన్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా స్పందించిన డీజీపీ మహేందర్రెడ్డి రెస్క్యూ టీంలో పాల్గొన్న స్థానిక ప్రజలను, పోలీసులను, అధికారులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. -
మూసీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిలోని ‘డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా’పై పరిశోధన సాగనుంది. మందుల ఉత్పత్తి తర్వాత ఆయా కంపెనీల నుంచి విడుదలైన ‘యాంటీ బయోటిక్స్’వ్యర్థాల గాఢత మూసీలో అత్యధికస్థాయిలో ఉన్నట్టు ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో వీటిస్థాయి అధికస్థాయిలో ఉన్న మూసీతోపాటు తక్కువస్థాయిలో ఉన్న చెన్నైలోని అడయార్ నదిపైనా ఈ పరిశోధన జరగనుంది. ఇండో–యూకే ప్రాజెక్ట్లో భాగంగా బ్రిటన్ బర్మింగ్హమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ అధ్యయనంలో ఐఐటీ–హైదరాబాద్ కూడా భాగస్వామి కానుంది. ఈ కొత్త పరిశోధక ప్రాజెక్ట్ కోసం ఇండియా, యూకే కలిసి 1.2 మిలియన్ పౌండ్ స్టెర్లింగ్లు కేటాయించాయి. బ్రిటన్–ఇండియా ప్రభుత్వాల సహకారంతో 8 మిలియన్ల పౌండ్ స్టెర్లింగ్ల ఖర్చులో నిర్వహిస్తున్న యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) సైంటిఫిక్ రీసెర్చ్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ను కూడా చేపడుతున్నారు. తల్లుల నుంచి సోకే ‘సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ల’తో భారత్లో ప్రతిఏటా 58 వేల చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు, యూరప్ యూనియన్లో ప్రతి ఏడాది 28–38 వేల మధ్యలో ‘డ్రగ్ రెసిస్టెన్స్ పాథోజెన్ల’తో మరణాలు సంభవిస్తున్నట్టు అంచనా. నదుల్లోకి ప్రవేశించాక... ‘పర్యావరణంలో యాంటీ బయోటిక్స్ ఎంత త్వరగా క్షిణిస్తాయనేది మనకు తెలియదు. పెద్ద నదుల్లోకి ప్రవేశించాక, వర్షాలతో అవి ఏ మేరకు బలహీనమవుతాయన్న విషయమూ తెలియదు. ఏఎంఆర్ ఫ్లోస్ ప్రాజెక్ట్ ద్వారా యాంటీ బయోటిక్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి, అవి తట్టుకునే బ్యాక్టీరియాను ఎలా ఎంపిక చేసుకుని నదుల నెట్వర్క్ల ద్వారా ఎలా వ్యాపిస్తాయి, నదుల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయి, వరదల సందర్భంగా ఎక్కడి నుంచి అవి పంటపొలాల్లోకి, జనసమూహాల్లోకి వ్యాప్తి చెందుతాయి... అనే అంశాలను పరిశీలిస్తారు. నీటివనరుల్లో యాంటీ బయోటిక్స్ ఏ మేరకు కేంద్రీకృతమైతే నష్టం జరగదన్న దాని ప్రాతిపదికన పర్యావరణ ప్రమాణాలను రూపొందించే అవకాశం ఉంది’అని యూకే ప్రాజెక్ట్ లీడ్ హెడ్ డాక్టర్ జాన్ క్రెఫ్ట్ తెలిపారు. పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుందో... ‘మూసీ నది సూపర్బగ్లకు కేంద్రంగా ఉన్నట్టు గతంలోని పరిశోధనలతోనే మనకు తెలుసు. యాంటీ బయోటిక్స్ను తట్టుకునే బ్యాక్టీరియా పర్యావరణంలో ఎలా వ్యవహరిస్తుంది, దాని భవితవ్యం ఏమిటీ అన్నది తెలుసుకునేందుకు నీటి ప్రవాహాల నమూనాలను అంచనా వేయడం కీలకం. ఇతర దేశాలతో పాటు ఇతర నదులకు సరిపోయే నమూనాలను రూపొందించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం’అని ఇండియన్ ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్, ఐఐటీ–హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్ తాటికొండ వెల్లడించారు. -
రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, రంగారెడ్డి: వికారాబాద్లో దారుణం చోటు చేసుకుంది. రైలు ఇంజన్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైలు ఇంజన్ హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తోంది. ఇది గమనించి ఉద్యోగులు అక్కడి నుంచి తప్పుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఇంజన్ ఢీకొని ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగులు అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారిని నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు. -
మూసీ పరీవాహకంలో అరటిసాగు?
మూసీ పరీవాహకంలో కలుషిత నీటితో పండించే పంటలు తినడం వల్ల కేన్సర్ వంటి భయానక వ్యాధులు సంభవిస్తుండడంతో ప్రత్యామ్నాయంగా అరటి తోటల సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం.. అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. రైతులు, వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి గురువారం జరిగే సీఎం సమావేశానికి సిద్ధమైంది. కంది, పత్తికి సైతం ప్రాధా న్యమివ్వనుండడంతో వరి సాగు తగ్గే అవకాశముంది. సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సమగ్ర రైతు విధానంపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గురువారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమీక్ష కోసం సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తల అభిప్రాయాల మేరకు భూసారాన్ని బట్టి పండే పంటలను గుర్తిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పండించే వరికి బదులుగా కంది, పత్తి ఎక్కువగా సాగయ్యేలా చూడాలని, మూసీ పరీవాహకంలో అరటితోటలు వేయించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రైతులు, వివిధ వర్గాల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. జిల్లా కలెక్టర్తోపాటు ఉన్నతస్థాయి యంత్రాంగం సీఎం సమీక్ష సమావేశానికి హాజరై ప్రతిపాదనల నివేదిక అందజేయనున్నారు. ఎందుకంటే.. హైదరాబాద్ జంటనగరాలతో పాటు జిల్లా పరిధిలో రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల మూసీ జలాలు కలుషితమవుతున్నాయి. కలుషిత జలాల కారణంగా భూసారం కోల్పోవడమే కాకుండా పంట ఉత్పత్తులను తినడం వల్ల కేన్సర్ వంటి భయానక రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ఇందులో 95వేల ఎకరాలు దొడ్డురకం, 35ఎకరాల్లో సన్న రకాలను పండించారు. ఇందులో అత్యధికంగా 70వేల ఎకరాల్లో మూసీపరివాహకంలోనే సాగవుతుంది. అయితే విషతుల్యమైన మూసీ ఆయకట్టులో వరిసాగును తగ్గించి అరటితోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. విషతుల్యమైన మూసీ నీటి ప్రభావం అరటి పండ్లలో ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే మూసీ పరీవాహకంలో భూమి కూడా అరటితోటలకు అనుకూలమైనదిగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో భువనగిరి పరిసరాల్లో తమలపాకు తోటలు పెద్ద ఎత్తున పెంచేవారు. ఇక్కడి తమల పాకులకు అత్యంత డిమాండ్ ఉండేదని రైతులు చెబుతుంటారు. దీని దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. పత్తి, కంది పంటలకూ పెద్దపీట జిల్లాలో వరి విస్తీర్ణాన్ని తగ్గించి దాని స్థానంలో పత్తి, కంది పంటల విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈమేరకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో గత సీజన్లో 1.60లక్షల ఎ కరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సీజన్లో రెండు లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరి సాగుకంటే అధి కంగా పత్తిని ఇప్పటికే సాగు చేస్తున్నారు. అలా గే 27వేల ఎకరాల్లో సాగు చేసిన కందిని 50వేల ఎకరాలకు పెంచే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే జిల్లాలో 2019 వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి3,37,812ఎకరాల్లో సాగు చేయగా, 2020 వానాకాలం సీజన్లో 3,54,750 ఎకరాల్లో వ్య వసాయ సాగు అంచనా వేసింది. అయితే మా రిన ప్రభుత్వ విధానం నేపథ్యంలో వరిసాగును తగ్గించి పత్తి, కందిసాగును పెంచే దిశగా చర్యలు చేపడుతుంది.జిల్లా యంత్రాంగం తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. -
లాక్డౌన్లోనూ విషం చిమ్ముతోంది..
లాక్డౌన్ కారణంగా దేశంలోని ఎన్నో ప్రముఖ నదులు,నగరాలు సైతం కాలుష్యం నుంచి కాస్త ఉపశమనం పొందాయి. కానీ మన నగరంలోని మూసీ నది మాత్రం మారలే. ఎప్పటిలాగే విపరీతమైన కాలుష్యంతో వర్ధిల్లుతోంది. జనసంచారంలేకపోవడం, పరిశ్రమలు నడవకపోవడం తదితర కారణాలతో దేశంలోని గంగా, యమునా నదులు, ఢిల్లీ వంటి మహానగరాలు స్వచ్ఛంగా మారాయని ఇటీవల వెల్లడైంది. కానీ మూసీలో కాలుష్యం తగ్గకపోగా అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. దాదాపు 800 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తుండడంతోనే మూసీ కాలుష్య కాసారమవుతోందనితెలుస్తోంది. అతిముఖ్యమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) బాపూ ఘాట్ వద్ద 28 మిల్లీ గ్రాములు, నాగోల్ వద్ద 26, ప్రతాపసింగారం వద్ద 26 మిల్లీగ్రాముల మేర నమోదవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ వేళలోనూ చారిత్రక మూసీ మురికి వదలడంలేదు. కాలుష్య కోరల్లో చిక్కి నాడూ.. నేడు విలవిల్లాడుతూనే ఉంది. ఈ నదిలో కాలుష్యం మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ నీటిలో జలచరాలు బతికేందుకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ శాతం ప్రతి లీటరు నీటిలో 4 మిల్లీ గ్రాములుండాల్సి ఉండగా..కేవలం 1.06 మిల్లీగ్రాములే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ‘నమామి గంగే’ తరహాలో ఈ నది ప్రక్షాళనకు సర్కారు విభాగాలు నడుం బిగించకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. లాక్డౌన్ కారణంగా మహానగరం పరిధిలో ప్రస్తుతం శబ్ద, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినప్పటికీ మూసీ కాలుష్యం తగ్గకపోవడానికి ప్రధాన కారణం..బల్క్డ్రగ్, ఫార్మా కంపెనీలు, గృహ సముదాయాల నుంచి కాలుష్య జలాలు ఈ నదిలో కలుస్తుండడమేనని స్పష్టమౌతోంది. ప్రధానంగా నగరంలోకి మూసీ నది ప్రవేశిస్తోన్న బాపూఘాట్ నుంచి ప్రతాప సింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో కాలుష్యకాసారంగా మారడం గమనార్హం. గత పదేళ్లుగా ఈ నది ప్రక్షాళనకు సిద్ధంచేసిన మాస్టర్ప్లాన్లు కాగితాలకే పరిమితం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మూసీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినా అడుగు ముందుకు పడడంలేదు. మరోవైపు నగరం పరిధిలోని సుమారు 500కు పైగా ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించే ప్రక్రియ సైతం అటకెక్కడంతో మూసీ పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం మహానగరం పరిధిలోని గృహßæ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నిత్యం విడుదలవుతున్న 1,600 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో జలమండలి కేవలం 800 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను మాత్రమే ఏడు ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మరో 800 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తుండడంతోనే ఇది రోజురోజుకూ కాలుష్య కాసారమవుతోంది. పరిశ్రమల కాలుష్యంతో విలవిల... కొందరు పరిశ్రమల నిర్వాహకుల కాసుల కక్కుర్తి మూసీ ఉసురు తీస్తోంది. బల్క్డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వెలువడుతున్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను నిబంధనల ప్రకారం సమీపంలోని శుద్ధి కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో ట్యాంకర్కు రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట సెప్టిక్ ట్యాంకర్లు, నీళ్ల ట్యాంకర్లు, డీసీఎంల్లో నగర శివారుల్లోకి తరలించి మూసీలో డంప్ చేస్తుండటంతో మూసీ కాలుష్య కాసారమవుతోంది. కాలుష్య పరిమితులివీ.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటర్ నీటిలో కరిగిన ఆక్సీజన్ (డీఓ) పరిమాణం కనీసం 4 మిల్లీ గ్రాములుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదా కుంటలో జలచరాలు బతకవు. ఇక బయాలాజికల్ ఆక్సీజన్ డిమాండ్( బీఓడీ) విషయానికొస్తే లీటర్ నీటి లో 3 ఎంజీలను మించకూడదు. డీఓ తగ్గుతున్న కొద్దీ బీఓడీ పెరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఆ జల వనరుల్లో కాలుష్యం పెరుగుతుందని అర్థం. కాలుష్య కాసారమిలా... బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) బాపూ ఘాట్ వద్ద 28 మిల్లీ గ్రాములు, నాగోల్ వద్ద 26, ప్రతాపసింగారం వద్ద 26 మిల్లీగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఇది నిర్దేశిత పరిమితుల కంటే చాలా అధికం. ఇక నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ (డీఓ) శాతం 4 మిల్లీ గ్రాములుండాలి. కానీ బాపూఘాట్ వద్ద 1.6 ఎంజీ, నాగోల్ వద్ద 0.06 ఎంజీ, ప్రతాపసింగారం వద్ద 1.0 ఎంజీగా నమోదైంది. అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. నమామి గంగే తరహాలో ప్రక్షాళన ఎప్పుడో..? జాతీయస్థాయిలో కాలుష్యకారక నదులను ప్రక్షాళన చేసే క్రమంలో గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకు అవసరమైన నిధులు, సిబ్బంది.యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. కానీ జాతీయస్థాయిలో కాలుష్యకారక నదుల్లో నాలుగోస్థానం దక్కించుకున్న మూసీ నది ప్రక్షాళనపై అటు కేంద్రం..ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో భాగ్యనగర జీవనరేఖ అయిన మూసీ మురికి కూపంగా మారుతుండడం గమనార్హం. ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే.. మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండో దశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తి చేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు సుమారు రూ.5000 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం.. పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు, మరో పది ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎస్టీపీలు,ఈటీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్ (142ఎంఎల్డీ), నాగోల్(140ఎంఎల్డీ), నల్లచెరువు (80ఎంఎల్డీ), హైదర్షాకోట్ (30), అత్తాపూర్ (70ఎంఎల్డీ), మీరాలం(6ఎంఎల్డీ), ఫతేనగర్ (30ఎంఎల్డీ), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డీ), నాగారం(29ఎంఎల్డీ), కుంట్లూర్, హయత్నగర్ (24 ఎంఎల్డీ) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం కాప్రా. -
‘మూసీ’ స్థలాల్లో కబ్జాల జోరు!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది తీరప్రాంతాల్లోని ఖాళీ స్థలాలకు పర్యవేక్షణ కరువైంది. పరివాహక ప్రాంతంలో గుర్తించిన ఆక్రమిత స్థలాలు సైతం దర్జాగా మళ్లీ మళ్లీ కబ్జాలకు గురవుతున్నా.. పట్టింపు లేకుండా పోయింది. ప్రభుత్వ సైన్ బోర్డుల సాక్షిగా అక్రమార్కులు తమ అవసరాలకు అనుగుణంగా వాటిని వినియోగించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సరిగ్గా గతేడాన్నర క్రితం మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్ధలాల ఆక్రమితపై రెవెన్యూ యంత్రాంగం కొరఢా ఝలిపించింది. చార్మినార్ మండల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఆరు స్థలాల్లో ఆక్రమణలు తొలగించడంతో పాటు చాదర్ఘాట్ నుంచి ఇమ్లిబన్కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన వెలిసిన ప్రైవేటు ల్యాండ్ అనే బోర్డును తొలగించి ప్రభుత్వ సైన్బోర్డును ఏర్పాటు చేశా రు. ఖాళీ స్థలంలో అక్రమంగా నిలుపుతున్న వాహనాలను ఖాళీ చేయించి అక్కడి స్థలంలో సైతం మరో సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. అది కాస్త మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. యథాతథంగా ఖాళీ స్థలం ప్రయివేటు బస్సులు, వాహనాలకు అడ్డాగా మారింది. కొన్నిచోట్ల మళ్లీ గుడిసెలు వెలిశాయి. ఆక్రమిత స్థలాలు 8529 పైనే. నగరంలోని మూసీ ప్రరివాహక ప్రాంతంలో ఆక్రమిత స్థలాలు 8529 పైనే ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వాస్తవంగా గతేడాదిన్నర క్రితం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అథారిటీ సంయుక్తంగా మూసీ నదీ తీర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించి ఆక్రమిత స్థలాలను గుర్తించింది. ఇందుకు అప్పట్లో తొమ్మిది బృందాలు రంగంలో దిగి మూసీ నదీ పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్ధితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయి. మండలాల వారిగా మూసి నది మొత్తం, పొడవు,ఆక్రమణల ఫొటోలు, వీడియోగ్రాఫ్లతో పాటు కేటగిరిల వారిగా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాటి రక్షణ చర్యలు చేపట్టినా..అవి కాగితాలకే పరిమితమయ్యాయి. మండలాల వారిగా... నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మండల వారిగా ఆక్రమిత స్థలాలను పరిశీలిస్తే... ఆసిఫ్నగర్ మండలంలో 667, అంబర్పేట పరిధిలో 989, బహద్దూర్పురా పరిధిలో 4,225, చార్మినార్ పరిధిలో 73, గోల్కొండ పరిధిలో 517, హిమాయత్నగర్ పరిధిలో 499, నాంపల్లిలో 658, సైదాబాద్ పరిధిలో 902 ఆక్రమిత స్థలాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై రెవెన్యూ యంత్రాంగం అక్రమిత స్థలాలపై దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’
న్యూఢిల్లీ: తెలంగాణ గంగ మూసీ నదిని పరిరక్షించాలని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో భూగర్భ జాలాలు కలుషితమవుతున్నాయని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ నీటితో పండిన పంటలు తినడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. మూసీ నీరు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయని.. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఉపరాష్ట్రపతిని వెంకయ్యనాయుడిని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు జిరో ఆవర్లో లెవనెత్తినా కేంద్రం స్పందించలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారి చేయాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశామన్నారు. ట్రిట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, విరివిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసీని పరిరక్షించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
ముసి 'మూసీ'గా
సాక్షి, సిటీబ్యూరో: జాతీయస్థాయిలో కాలుష్యకారక నదుల్లో.. నాలుగో స్థానంలో నిలిచిన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన రెండో దశ పథకానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర జల శక్తి అభియాన్, ఎన్ఆర్సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి) పథకాల కింద.. 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు రూ. 5 వేల కోట్ల అంచనా వ్యయంతో జలమండలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన మూసీ ప్రక్షాళన పథకాలకు త్వరలో మోక్షం లభించనుంది. మూసీ పరివాహక ప్రాంతంలో మురుగునీటిని ప్రక్షాళన చేసేందుకు పదికి పైగా సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. మరో మూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటుచేస్తారు. ఈ పనులకు సంబంధించి జలమండలి సిద్ధంచేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను త్వరలో ఢిల్లీ వెళ్లనున్న జలమండలి అధికారులు జలశక్తి అభియాన్ ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. మూసీకి తీరనున్న కష్టాలు.. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నివాస ప్రాంతాల నుంచి వెలువడుతోన్న వ్యర్థాలతో మూసీనది మురికి కూపమైంది. నిత్యం నగరంలో 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈనదిలో కలుస్తోంది. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో మొదటిదశ ప్రక్షాళన పథకానికి శ్రీకారం చుట్టారు. నదీ పరివాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఏడు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజువారీగా వెలువడుతున్న 700 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధిచేసి నదిలోకి వదిలే ఏర్పాట్లుచేశారు. æప్రస్తుతం రెండోదశ ప్రక్షాళన పథకం కింద నిత్యం 700 మిలయన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేయనున్నారు. ఇందుకోసం రూ.5000 కోట్ల అంచనా వ్యయంతో 10 ప్రాంతాల్లో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటుచేసి పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధిచేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు సంబంధించి సర్వే, డిజైనింగ్ను ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ పూర్తిచేసిందన్నారు. ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని ఎన్ఆర్సిడి పథకం కింద కేంద్రం మంజూరు చేస్తుందని వివరించారు. కేంద్రం 60 శాతం నిధులను దశలవారీగా విడుదల చేయనుందని తెలిపారు. మరో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదీ ప్రాజెక్టు స్వరూపం.. పథకం: మూసీ ప్రక్షాళన రెండోదశ అంచనా వ్యయం: సుమారు రూ.5,000 కోట్లు (ఎన్ఆర్సిడి పథకం కింద కేంద్ర ఆర్థిక సహాయం 60శాతం, 40 శాతం నిధులు రాష్ట్రం) ఉద్దేశం: మూసీలో రోజువారీగా కలుస్తున్న 700 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేయడం. చేపట్టనున్న నిర్మాణాలు: మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం.. పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు. ఎస్టీపీలు ఎక్కడెక్కడ: అంబర్పేట్(142ఎంఎల్డి), నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు(80ఎంఎల్డి), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్(30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్(59ఎంఎల్డి), నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్–హయత్నగర్(24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం– కాప్రా ప్రత్యేకతలు: జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ నది ఉత్తర,దక్షిణ ప్రాంతాల్లో 574.59 చదరపు కిలోమీటర్ల పరిధిలో నాలాలు,పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధిచేసి తిరిగి నదిలోకి వదలనున్నారు.తద్వారా మూసీనది కాలుష్య కాసారం కాకుండా నివారించనున్నారు. పరివాహక ప్రాంతాల్లో ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా మార్చనున్నారు. -
మూసీ నదిని శుద్ధి చేస్తామని ప్రగల్భాలు
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ముఖ్యమంత్రి కేసీఆర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ సైతం.. మూసీ నదిని సబర్మతి నదిలా శుద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతారే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించరని ఎద్దేవా చేశారు. హైద్రాబాద్కు మంచి నీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను కబ్జాలను అడ్డుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ. 3వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 3రూపాయలు కూడా ఖర్చు చేయలేదంటూ ఆరోపించారు. 2001లో అప్పటి వాజపేయి ప్రభుత్వం నదుల ప్రక్షాళనకు నిధులను కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టించాయని పేర్కొన్నారు. బాపు ఘాట్ దగ్గర కూడా మూసీ దుర్గంధంగా మారటం బాధాకరమన్నారు. తాగు, సాగునీరు అందించే మూసీ దుర్గంధంగా మారడంతో పాటు నది పరివాహక ప్రాంతంలో పండిన కూరగాయలు సైతం విషతుల్యం అవుతున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. హైద్రాబాద్ను విశ్వనగరంగా మార్చుతామని.. చివరకు విషాద నగరంగా మార్చారంటూ దుయ్యబట్టారు. ముడుపులు తీసుకుని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను హుస్సేన్ సాగర్లో వదలడంతో డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీరుగా మారుస్తామన్న కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని, సీఎం కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. చదవండి: (మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు) -
మూసీ దోమ..మహా స్ట్రాంగ్
సాక్షి, హైదరాబాద్: గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి రోజువారీగా వచ్చిచేరుతోన్న మురుగు జలాలతో చారిత్రక మూసీనది మృతనదిగా మారుతోంది. దీని ప్రక్షాళన కాగితాలకే పరిమితమౌతుండటంతో డెంగీ, మలేరియా దోమలకు ఆలవాలమైంది. మహానగరంలో మూసీ ప్రవేశించే బాపూఘాట్ నుంచి ఘట్కేసర్ సమీపంలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో ఇది ప్రవహిస్తోంది. ఈమార్గం మొత్తం ఇప్పుడు డెంగీ, మలేరియా దోమల విజృంభనతో స్థానికులు రోగాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. నగరంలో సుమారు 3 వేలకుపైగా డెంగీ కేసులు నమోదు కాగా..వారిలో 30 మంది మృత్యువాతపడ్డారు. హైకోర్టు సైతం ఈ మరణాలపై అధికార యంత్రాంగాన్ని మందలించిన దృష్ట్యా మూసీ ప్రక్షాళన చర్చనీయాంశమైంది. కాలుష్యకారక నదుల్లో నాలుగో స్థానం.. నిత్యం మూసీలోకి చేరుతోన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ నది జాతీయస్థాయిలో కాలుష్యకారక నదుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఘనవ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు, ఇతర వ్యర్థాల చేరికతో డంపింగ్యార్డుగా మారి రసాయన కాలుష్యం పెరుగుతోంది. ఇలా ఇది దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. బాపూఘాట్–ప్రతాపసింగారం మార్గంలో(44 కి.మీ) దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏళ్లుగా వివిధ రసాయనాలను సైతం వంటబట్టించుకున్న అవి శక్తిమంతంగా మారి నియంత్రణకు లొంగడం లేదు. స్ప్రేలు, కాయిల్సూ, జెల్, లిక్విడ్స్ వంటివి వాడినా నిర్మూలన సాధ్యపడటం లేదు. ఈ కారణంగా నగరవాసులు మలేరియా, డెంగీ వంటి వ్యాధులు.. కొత్తకొత్త వైరస్లతో అనారోగ్యం పాలవుతున్నారు. కుళ్లిన పదార్థాలు, కార్బన్ డై ఆక్సైడ్ వాసన అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఆడ ఎనాఫిలిస్, క్యూలెక్స్, ఏడిస్ ఈజిప్టి తదితర దోమలు పుట్టి పెరుగుతున్నాయి. ఇవన్నీ సమీపంలో ఉన్న బస్తీలు, కాలనీలపై దండయాత్ర చేస్తుండటంతో వేలాదిమంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ దోమలు సుమారు 4 నుంచి 7 మిల్లీమీటర్లు ఉంటాయి. పగటివేళల్లోనే ఇవి అత్యధికంగా కుడతాయి. వీటి విజృంభన మూసీలో పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. దోమలు ప్రధానంగా కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురా, అంబర్పేట్, ఉప్పల్, ఎల్బీ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నా.. ఏమీ చేయలేని స్థితి. బల్దియా చేపట్టిన ఫాగింగ్, యాంటీ లార్వా కార్యక్రమాలు సత్ఫలితాన్నివ్వడంలేదు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామంటున్న యంత్రాంగం ప్రచారానికే పరిమితమౌతుండటం విమర్శలకు గురవుతోంది. అడుగు ముందుకు పడని ప్రక్షాళన... మూసీనది ప్రక్షాళన, సుందరీకరణ ఏళ్లుగా కాగితాలకే పరిమితమవడంతో ఘన, ద్రవ, రసాయన వ్యర్థాల చేరికతో కాలుష్య కాసారమౌతోంది. ప్రస్తుతం మూసీలోకి నిత్యం గృహ,వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 2 వేల మిలియన్ లీటర్ల (సుమారు 200 కోట్ల లీటర్లు) మురుగునీరు చేరుతోంది. ఇందులో జలమండలి 18 ఎస్టీపీల్లో సుమారు 700 మిలియన్లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలోకి వదులుతోంది. మిగతా మురుగునీరు శుద్ధి ప్రక్రియ లేనిదే. గుజరాత్లోని సబర్మతి నది తరహాలో దీన్ని ప్రక్షాళన చేయాలన్న సర్కారు సంకల్పం బాగానే ఉన్నా... ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. మూసీ తీరప్రాంత అభివృద్ధికి రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణకు, మరో రూ.3వేల కోట్ల అంచనాతో మురుగుజలాలు నదిలో కలవకుండా నగరం నలుమూలలా 60 మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. నిధుల కేటాయింపు లేదు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటుచేసి దీనికి చైర్మన్ను, సభ్యకార్యదర్శిని నియమించినప్పటికీ ఫలితంలేదు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలసాగు జరుగుతోంది. ఈ కూరగాయలనే మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిలో హానికారక మూలకాలు, రసాయనాల ఆనవాళ్లుండటంతో వీటిని తిన్నవారు రోగాలపాలవుతున్నారు.నగరం పొడవునా మూసీ నది గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలకు డంపింగ్ యార్డుగా మారడం కలచివేస్తోంది. ఈ దుస్థితి నగరవాసులను కన్నీరుపెట్టిస్తోంది. కాగితాలపైనే సుందరీకరణ ప్రాజెక్టు..గ్రేటర్లో మూసీ ప్రవహిస్తున్న మార్గంలో రోడ్లు, ఫ్లైఓవర్లు..పార్కులను తీర్చిదిద్దేందుకు రూ.3 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా వీటికి మోక్షం లేదు. ►రీచ్1: ఉస్మాన్సాగర్ హిమాయత్సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపూఘాట్వరకు (19 కి.మీ) రహదారిని తీర్చిదిద్దడానికి అంచనా వ్యయం రూ.647.98 కోట్లు ►రీచ్2: బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి (21.50)కి.మీ మార్గంలో రహదారి ఏర్పాటు రూ.2162.01కోట్లు ►రీచ్3: నాగోల్బ్రిడ్జి నుంచి ఔటర్రింగ్రోడ్డు (గౌరెల్లి) వరకు(15 కి.మీ)మార్గంలో అప్రోచ్ రోడ్ ఏర్పాటు రూ.155.52 కోట్లు -
విరిగిన మూసీ ప్రాజెక్టు గేటు
కేతేపల్లి:నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ రెగ్యులేటరీ గేట్ విరిగిపోయింది. దీంతో దిగువకు 5వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. 20 రోజులుగా హైదరాబాద్తో పాటు వరంగల్, జనగాం ప్రాంతాలలో కురిసిన వర్షాలకు మూసీ బిక్కేరు, వసంత వాగు ద్వారా మూసీ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చింది. ప్రాజె క్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులకు చేరడంతో 2 గేట్లను కూడా ఎత్తారు. నీటిమట్టం 644.5 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూసి మూసివేశారు. శనివారం సాయంత్రం 1,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా నీటిమట్టం 644.8 అడుగులకు చేరుకుంది. కాగా, రాత్రి 7 గంటల సమయంలో 6వ నంబర్ రెగ్యులేటరీ గేటు విరిగిపోయింది. ఈ గేటు ఇరువైపులా ఉన్న గొలుసు ఆధారంతో వేలాడుతోంది. గేట్ విరగడంతో దాదాపు 5వేల క్యూసెక్కుల మేర నీరు వృథాగా దిగువకు పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెల్లవారే సరికి ప్రాజెక్టులో ఐదారడుగుల మేర నీటిమట్టం తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మూసీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ఈఈ భద్రునాయక్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశమై గేటును సరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. -
తెప్పపై బైక్.. టికెట్ రూ.100
అర్వపల్లి: సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం–వంగమర్తి మధ్య మూసీనది కిలోమీటర్ మేర ప్రవహిస్తుంది. అయితే వర్షాలు రాని సమయాల్లో నదిలో నుంచి ఇసుకలోనే ఆ గ్రామాల మధ్య రాకపోకలు సాగిస్తారు. ఇప్పుడు మూసీనది ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో స్థానికులు కొందరు తెప్పలు ఏర్పాటు చేసి నది అవతలి ఇవతలి వైపునకు ప్రయాణికులను దాటిస్తున్నారు. ఒక బైక్ను తెప్పపై తీసుకెళ్తే రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. -
చార్సౌ సాల్ కాదు.. వేల ఏళ్ల వైభవం
భాగ్యనగరం అనగానే కులీ కుతుబ్షా 1591లో నిర్మించిన పట్టణం... అని చరిత్ర చెబుతుంది. మరి అంతకు పూర్వం సంగతేంటి? చరిత్ర పుటలు తిరగేస్తే 1518లో కుతుబ్షాహీ పాలన ఆరంభం కాకముందు ఢిల్లీ సుల్తానులు, అంతకు పూర్వం కాకతీయులు, వారికంటే ముందు చాళుక్యుల పాలన.. ఇలా కనిపిస్తాయి. కాకతీయుల కాలం కంటే పూర్వమే గోల్కొండ పట్టణం ఉండేదన్న సంగతిని చరిత్ర చెబుతుంది, కానీ ఎక్కడా ఆధారాలు కనిపించవు. దాదాపు మూడు వేల ఏళ్ల క్రితమే ఈ నగర ప్రాంతంలో మానవ సంచారం ఉందనడానికి ఇప్పుడు ఆధారాలు లభించాయి. రాతి యుగానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఆధారాలు వెలుగు చూడటం సహజమే. కానీ హైదరాబాద్ మహానగరంలో వాటి జాడలు దొరకడం అరుదు. నగరం మధ్య గుండా సాగుతున్న మూసీ నదిలో మూడు వేల ఏళ్ల క్రితం కొత్తరాతి యుగం జాడలు, దాని ఒడ్డున దాదాపు 1,500 ఏళ్ల క్రితం విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధ ఉద్దేశిక స్తూపాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ చరిత్ర కొత్త పుటను పరిచయం చేస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. –సాక్షి, హైదరాబాద్ బౌద్ధానికి తెలంగాణ నేలతో ఉన్న అనుబంధం అసాధారణం. బుద్ధుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆయన బతికున్న కాలంలోనే ప్రచారం మొదలైంది తెలంగాణ నుంచే అన్న విషయం ఇప్పుడిప్పుడే ఆధార సహితంగా రూఢీ అవుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బౌద్ధ ఉద్దేశిక స్తూపాలెన్నో విస్తరించి ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ప్రాచుర్యం కల్పించకపోవటంతో మరుగున పడిపోయాయి. ఇప్పుడు బుద్ధవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో కొత్త అన్వేషణ సాగుతుండటం కొంతలో కొంత శుభపరిణామం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అన్వేషణలోనే హైదరాబాద్ చరిత్రలో పురాతన కోణం వెలుగుచూడటం విశేషం. ఆ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎం.ఎ.శ్రీనివాసన్, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్ మూసీ తీరంలో రెండు రోజుల క్రితం జరిపిన అన్వేషణలో ఆధారాలు వెలుగు చూశాయి. దిల్సుఖ్నగర్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న కొసగుండ్ల నరసింహస్వామి దేవాలయంలో బౌద్ధం జాడలున్నాయన్న సంగతిని దాదాపు 4 దశాబ్దాల క్రితమే పురావస్తుశాఖ అధికారి పరబ్రహ్మచారి గుర్తించారు. ఇక్కడ దాదాపు ఐదో శతాబ్దం నాటి శాసనాన్ని ఆయన కనుగొన్నారు. ఆ తర్వాత అన్వేషణ ముందుకు సాగలేదు. తాజాగా బుద్ధవనం తరఫున ఈ ఇద్దరు ఆ దేవాలయం గుట్టపై అన్వేషించే క్రమంలో ఆసక్తికర విషయాలు గుర్తించారు. పెద్దగుండుపై విష్ణుకుండిల కాలానికి చెందిన గోవిందరాజ వర్మ ఏర్పాటు చేసిన శాసనాన్ని గుర్తించారు. ఇదే ప్రాంతంలో రెండు బౌద్ధ ఉద్దేశిక స్తూపాలను గుర్తించారు. సాధారణంగా బౌద్ధ స్తూపాల్లో బుద్ధుడి ధాతువు ఉంటుంది. కానీ ఉద్దేశిక స్తూపాలను నాటి ముఖ్యమైన బౌద్ధ సన్యాసుల స్మారకంగా నిర్మిస్తారు. ఇక్కడ తదనంతర కాలంలో ఏర్పాటు చేసిన ఓ శివలింగంతో కూడిన రాయి దిగువన ఉద్దేశిక స్తూపం ఉన్నట్టు గుర్తించారు. గుట్టకు ఆనుకుని వెనక వైపు ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో భూమిలో కూరుకుపోయి ఉన్న మరో ఉద్దేశిక స్తూపాన్ని గుర్తించారు. చెట్ల పొదలు, కొంత మట్టిని పక్కకు జరపగా వృత్తాకారంలో ఉన్న ఈ స్తూపం కనిపించింది. దాని చుట్టూ మట్టిని తొలగిస్తే ఆ స్తూపం పూర్తి ఆకృతి వెలుగు చూస్తుంది. నగరం నడిబొడ్డున బౌద్ధానికి చెందిన ఉద్దేశిక స్తూపం వెలుగుచూడటం ఇదే తొలిసారి. మూసీ మధ్యలో కొత్తరాతియుగం చిత్రాలు... చైతన్యపురికి సమీపంలోనే ఉన్న మూసీ నది మధ్యలో ఉన్న ఓ భారీ బండరాయి మూడు వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగం మానవ సంచారానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆ బండరాయిపై నాటి మానవులు గీసిన ఎరుపు వర్ణం చిత్రం కనిపించింది. దాదాపు మూడు అడుగుల పొడవుతో ఉన్న ఈ చిత్రంలో పశువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. రాతియుగంలో మానవులు సమూహంగా ఉంటూ ఆవాసయోగ్యంగా చేసుకున్న ప్రాంతాల్లో ఇలా చిత్రాలు గీయటం సహజం. నగరంలో కూడా ఇలా ఆవాసాలు ఎన్నో ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. పట్టణీకరణ క్రమంలో చాలా గుట్టలను క్వారీలతో మాయం చేయటంతో ఈ ఆధారాలు నాశనమయ్యాయి. గండిపేట సమీపంలోని కోకాపేటలో ఓ గుట్టపై ఇప్పటికీ అద్భుతమైన చిత్రాలున్నాయి. ఆ గుట్టలన్నీ క్వారీల పేరుతో కనుమరుగు కాగా, స్థానికుల చొరవతో ఈ చిత్రాలున్న ఒక్క గుండును మాత్రం వదిలేశారు. అది తప్ప రాక్ పెయింటింగ్స్ నగరంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మూసీ మధ్యలో పెద్ద గుండుపై కనిపించటం ఆసక్తిరేపుతోంది. ఆ చుట్టుపక్కన ఉన్న రాళ్లను జల్లెడ పడితే మరిన్ని చిత్రాలు కనిపించే అవకాశం ఉందని శ్రీనివాసన్ అంటున్నారు. ప్రత్యేక పద్ధతిలో ఆ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపించేలా చేయాల్సి ఉంది. నాటి మానవులు ఆయుధాలను నూరుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రూవ్స్ కూడా బండలపై ఉన్నాయి. వెలికితీసి పరిరక్షించాలని మంత్రికి వినతి ఇప్పుడు గుర్తించిన ఉద్దేశిక స్తూపాలను వెంటనే వెలికి తీసి పరిరక్షించాలంటూ బుద్ధవనం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండురోజుల క్రితం గుర్తించిన ఆధారాల వివరాలను హెరిటేజ్ తెలంగాణ విభాగం అధికారులకు, మంత్రి శ్రీనివాసగౌడ్కు అందజేశారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి స్తూపాలను పూర్తిగా వెలికి తీయాలని కోరారు. తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు వెలుగు చూస్తాయని శ్రీనివాసన్ అంటున్నారు. ఇది హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన విషయం అయినందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. -
కాలుష్య కోరల్లో మూసీ
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఈ నదిలో కాలుష్య మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. మహానగరం పరిధిలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నిత్యం విడుదలవుతున్న 1,600 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో జలమండలి కేవలం 800 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను మాత్రమే ఆరు ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మరో 800 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తుండడంతోనే ఇది రోజురోజుకూ కాలుష్య కాసారమవుతోంది. పరిశ్రమల కారణంగానే.. కొందరు పరిశ్రమల నిర్వాహకుల కాసుల కక్కుర్తి మూసీ ఉసురు తీస్తోంది. బల్క్డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వెలువడుతున్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను నిబంధనల ప్రకారం సమీపంలోని శుద్ధి కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో ట్యాంకర్కు రూ.10వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట సెప్టిక్ ట్యాంకర్లు, నీళ్ల ట్యాంకర్లు, డీసీఎంల్లో నగర శివారుల్లోకి తరలించి మూసీలో డంప్ చేస్తుండటంతో మూసీ కాలుష్య కాసారమవుతోంది. పరిమితులివీ.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటర్ నీటిలో డీఓ పరిమాణం కనీసం 4 ఎంజీలుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదా కుంటలో జలచరాలు బతకవు. బీఓడీ విషయానికొస్తే లీటర్ నీటి లో 3 ఎంజీలను మించకూడదు. డీఓ తగ్గుతున్న కొద్దీ బీఓడీ పెరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఆ జల వనరుల్లో కాలుష్యం పెరుగుతుందని అర్థం. మూసీ ప్రస్థానం ఇలా.. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లో పుట్టి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ప్రవహించి మిర్యాలగూడకు సమీపంలోని వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తోంది. మొత్తం 250 కి.మీ. ప్రవహిస్తోంది. దేశంలోని అత్యంత కలుషితమైన నదుల్లో ఇదీ చేరిందంటే.. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో నది నీటి నాణ్యతను పీసీబీ ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది. తాజాగా.. 2017లో కాలుష్య తీవ్రతపై ప్రత్యేక నివేదికను రూపొందించింది. ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే.. ♦ మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండో దశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తి చేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు రూ.2000 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ♦ మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం.. పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ♦ ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్ (142ఎంఎల్డీ), నాగోల్(140ఎంఎల్డీ), నల్లచెరువు (80ఎంఎల్డీ), హైదర్షాకోట్ (30), అత్తాపూర్ (70ఎంఎల్డీ), మీరాలం(6ఎంఎల్డీ), ఫతేనగర్ (30ఎంఎల్డీ), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డీ), నాగారం(29ఎంఎల్డీ), కుంట్లూర్, హయత్నగర్ (24 ఎంఎల్డీ) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం కాప్రా కాలుష్యమిలా.. ♦ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) బాపూ ఘాట్ వద్ద 28 మిల్లీ గ్రాములు, నాగోల్ వద్ద 26, ప్రతాపసింగారం వద్ద 26 మిల్లీగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఇది నిర్దేశిత పరిమితుల కంటే చాలా అధికం. ♦ నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ (డీఓ) బాపూఘాట్ వద్ద 1.6 ఎంజీ, నాగోల్ వద్ద 0.06 ఎంజీ, ప్రతాపసింగారం వద్ద 1.0 ఎంజీగా నమోదైంది. అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. -
మూట మూసీకే..
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ భగాయత్ లేఅవుట్లలోని ప్లాట్ల విక్రయాలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు సమకూరనున్న ఆదాయాన్ని మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు వెచ్చించనున్నారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో 67 ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. దీని ద్వారా సమకూరనున్న ఆదాయాన్ని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీ)కు బదలాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఉప్పల్ భగాయత్ లేఅవుట్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ, ఆ ప్లాట్లకు సంబంధించి నిర్మాణ అనుమతులు హెచ్ఎండీఏకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించిన ధర ప్రకారం గజం రూ.28 వేల చొప్పున విక్రయిస్తే... 1,31,579.31 గజాలకు రూ.368.42 కోట్లు వస్తాయి. అయితే ఆన్లైన్ వేలం కాబట్టి గజం ధర రూ.40 వేల వరకు వెళ్లే అవకాశం ఉందని, దాదాపు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంఆర్డీసీ ఈ నిధులను తొలి విడతలో పురానాపూల్ నుంచి చాదర్ఘాట్ వరకు మూసీ సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, వాక్వేస్, ఫుట్ఓవర్ బ్రిడ్జి, గార్డెనింగ్, కియోస్కోలు, బోటింగ్ సదుపాయాలకు వెచ్చించనున్నట్లు హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి. 13 ఏళ్లుగా ప్రక్రియ... 2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ కన్జర్వేషన్ అండ్ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ల్యాండ్పూలింగ్ కింద ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి హెచ్ఎండీఏ 733 ఎకరాలు సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు నీటి శుద్ధి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత స్థలం కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ఉప్పల్ భగాయత్ పేరుతో లేఅవుట్లు అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్సీ భూములు ఉండటంతో ప్లాట్ల కేటాయింపులో ఆలస్యమైంది. గతేడాది మార్చిలోనే భూములు కోల్పోయిన 1,520 మంది రైతులకు లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించింది. ఎకరం భూమి కోల్పోయిన వారికి వేయి గజాల చొప్పున ఇచ్చింది. 8,84,205 చదరపు గజాల్లో లేఅవుట్లు చేయగా 7,58,242 చదరపు గజాలు వీరికి కేటాయించింది. మిగతా 1,31,579.31 గజాల ప్లాట్లను ఏప్రిల్ 7, 8 తేదీల్లో వేలం వేయనుంది. గతేడాది సెప్టెంబర్లో గుజరాత్కు చెందిన ఈ ప్రొక్యూర్మెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్కు ఈ–వేలానికి, ఆర్థిక లావాదేవీల కోసం హెచ్డీఎఫ్సీ సహకారాన్ని తీసుకున్నారు. అయితే ఈ–వేలంలో 120కి మించి బిడ్డర్లు పాల్గొనకపోవడం, ఈ–వేలం సమయంలో సాంకేతిక సమస్య లు ఏర్పడడంతో అప్పటి కమిషనర్ జనార్దన్రెడ్డి వేలం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉప్పల్ భగాయత్ రెండో విడతలో 72 ఎకరాలు, మూడో విడతలో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను కూడా భవిష్యత్తులో వేలం వేయనుంది. -
అటవీ భూముల.. ఆక్రమణ!
సాక్షి, దామరచర్ల(నల్గొండ) : పక్కనే మూసీ, కృష్ణా నది.. నీటి వనరులు పుష్కలం.. చుట్టుపక్కల విస్తారమైన అటవీ ప్రాంతం.. ఇంకేముంది అక్రమార్కులు అడవిపై పడ్డారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కబ్జాపర్వం మొదలుపెట్టారు. కొందరు పంటలు సాగు చేసుకుంటుండగా, మరికొందరు క్రయ విక్రయాలు కూడా జరుపుతున్నారు. ఇదీ.. దామరచర్ల మండలంలోని అటవీభూముల్లో ఆక్రమణల తీరు. అధికారుల నిర్లక్ష్యం.. అక్రమార్కులకు వరంగా మారింది. దామరచర్ల మండలంలో వందలాది ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. ఇవి క్రయ విక్రయాలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టంలోని లొసుగులను ఆ«ధారంగా చేసుకొని కొందరు అధికారులు తప్పుడు పట్టాలు ఇచ్చారు. వందలాది ఎకరాలు పరాధీనం అవుతున్నా, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక్కడి వందలాది ఎకరాల డీఫామ్ పట్టా భూములు సైతం వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వం ఓవైపు హరితహారం పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుండగా, మరో పక్క కొందరు అవినీతి అధికారుల కారణంగా ఉన్న అడవి నాశనం అవుతోంది. మిర్యాలగూడ రేంజర్ పరిధిలో4,99,259.91 హెక్టార్ల అటవీ భూమలున్నాయి. అందులోని దామరచర్ల మండలం పలుగ్రామాల్లో అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ తంతు దశాబ్దకాలంగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దామరచర్ల రెవెన్యూ పరిధిలోని 430 సర్వే నంబర్లో 1,089 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిల్లో సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు కొంతమేర కేటాయించారు. డీఫామ్ పట్టాల భూముల్లో సైతం ఆక్రమణదారులు చేరారు. ఈ భూములన్నీ మూసీ నది పక్కన ఉండడం, లిప్టు సౌకర్యం ఉండటంతో దర్జాగా సాగు చేసుకుంటు న్నారు. కరెంట్, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకొని, బోర్లు వేసి çవరి, పత్తి లాంటి పంటలు పండించుకుంటున్నారు. వీటిని కొందరు వ్యక్తులు విక్రయాలు సైతం జరుపుతున్నారు. సర్వే నంబర్ 826లో 1097 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిల్లో సైతం పలువురు కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కొందరైతే తాము ఆక్రమించుకున్న అటవీ భూములను అమ్ముకుంటున్నారు కూడా. వీటిపై ఉన్నతాధికారులకు ఇప్పటికే పలువురు ఫిర్యాదు కూడా చేశారు. దామరచర్ల కనుచూపు మేరలోనే అటవీ భూముల అక్రమాల పర్వం జరుగుతున్నా, ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనుమరుగవుతున్న వనసంపద దామరర్ల మండలంలోని కృష్ణా, మూసీనది, అన్నమేరు వాగుల నడుమ వందలాది ఎకరాల్లో ఉన్న అటవీ భూముల్లోని వనసంపద కనుమరుగవుతోంది. విలువైన, సారవంతమైన భూములు కావడం, నీటి సౌకర్యం ఉండడంతో చెట్లు ఏపుగా పెరిగాయి. ఈ చెట్లను నరికి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. దామరచర్ల, నర్సాపురం, వాచ్యాతండా, కల్లేపల్లి, తాళ్లవీరప్ప గూడెం, గణేష్పాడ్, వాడపల్లి తదితర గ్రామాల్లోని అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికారుల్లో స్పష్టత కరువు సాగర్ నిర్వాసితుల కోసం దామరచర్లలోని సర్వేనంబర్ 430, నర్సాపురం సర్వేనంబర్ 826, గాంధీనగర్ సర్వేనంబర్ 441లోని అటవీ భూముల్లో కొంతభాగాన్ని డీ ఫారెస్టు చేసి పట్టాలు ఇచ్చారు. అయితే వీటిపై అధికారుల్లో స్పష్టత లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరు? వారికి ఏ సర్వేనంబర్లో ఎంతమేర భూములు.. ఎక్కడెక్కడ కేటాయించారు? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డీ ఫారెస్టు భూములు క్రయ విక్రయాలకు వీలుండడంతో, కొందరు అవినీతి అ«ధికారులు అక్రమ పట్టాలు ఇచ్చారు. వీటిని ఆసరాగా చేసుకొని కబ్జాల పర్వం సాగుతోంది. అటవీశాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి, నిజమైన డీఫామ్ పట్టాదారులను గుర్తిస్తే కబ్జాకు గురైన వందలాది ఎకరాల అటవీభూములును రక్షించే వీలుంది. తాజాగా మండలంలోని 430లో సర్వే చేస్తున్నందున, మిగిలిన చోట్ల కూడా సర్వే జరిపి కబ్జాదారుల కబంధ హస్తాలనుంచి అటవీ భూములను రక్షించాల్సి ఉంది. దీనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
మూసీలో వాజ్పేయి చితాభస్మం నిమజ్జనం
అనంతగిరి : భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి మరణం దేశానికి తీరని లోటని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని మూసీ జన్మస్థలంలో వాజ్పేయి అస్థికలు, చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు. వాజ్పేయి అస్థికలు తీసుకువచ్చిన హైదరాబాద్, లంగర్హౌస్, ఆరెమైసమ్మ, మెయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ పట్టణంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ప్రజలు, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూలమాలలు వేసి ఘనంగా సాగనంపారు మూసీ నదిలో కర్మయోగి వాజ్పేయి అస్థికలు నిమజ్జనం చేయడం ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తున్నామని ప్రజలు అభిప్రాయపడ్డారు. అస్థికల ర్యాలీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న తర్వాత గంగమ్మకు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చితాభస్మం, అస్థికలను నిమజ్జనం చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ ఇద్దరు ఎంపీలున్న పార్టీని దేశంలోనే అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. వాజ్పేయి అస్థికలను మూసీలో నదిలో కలపడానికి తాము వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన నదుల్లో వాజ్పేయి అస్థికలు కలుపుతున్నట్లు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాల కోసం ఆఖరువరకు పాటుపడిన నేత వాజ్పేయి అని కొనియాడారు. తన హయాంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లు వేయించారని గుర్తుచేశారు. దేశంలో గ్రామగ్రామా మహిళలకు గ్యాస్ పంపిణీని గ్రామగ్రామన అందేలా చేశారని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో సైతం అగ్ర దేశాలు ఆంక్షలు విధించినా ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన ప్రధానిగా ఖ్యాతిగడించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్రావు, రాష్ట్ర నాయకులు శేరి నర్సింగ్రావు, బొక్కా నర్సింహరెడ్డి, అంజన్కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు పాండుగౌడ్, మాధవరెడ్డి, సదానంద్రెడ్డి, రమేష్కుమార్, శివరాజు, సుచరితరెడ్డి,సాయికృష్ణ, రవిశంకర్, పోకల సతీష్, నరోత్తంరెడ్డి, కేపీరాజు, రాచ శ్రీనివాస్రెడ్డి, నందు, శంకర్, అమరేందర్రెడ్డి, సాయిచరణ్ రవితేజ పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
స్కైవే..సందిగ్ధం
కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగోదిగా నిలిచిన ‘మూసీ’ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరీకరణ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఇందులో భాగంగా చేపట్టనున్న ఈస్ట్– వెస్ట్ కారిడార్(స్కైవే)కు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు జారీచేసే అంశంపై ఎటూ తేల్చడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ నది సుందరీకరణ ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న ఈస్ట్– వెస్ట్ కారిడార్(స్కైవే) ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు జారీచేసే అంశంపై సందిగ్ధత వీడడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్లెవల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ)లు రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక ఏకపక్షంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ వేత్తలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హడావుడిగా నివేదిక రూపొందించారని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) నివేదించారని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు స్వరూపం.. రీచ్1: ఉస్మాన్సాగర్ హిమాయత్సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపూ ఘాట్వరకు(19 కి.మీ) చూడముచ్చటైన రహదారిని తీర్చిదిద్దడం. అంచనా వ్యయం రూ.647.98 కోట్లు రీచ్2: బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి(21.50)కి.మీ మార్గంలో రహదారి ఏర్పాటుకు రూ.2162.01కోట్లు రీచ్3: నాగోల్బ్రిడ్జి నుంచి ఔటర్రింగ్రోడ్డు (గౌరెల్లి) వరకు (15 కి.మీ) మార్గంలో అప్రోచ్ రోడ్ ఏర్పాటు రూ.155.52 కోట్లు. ప్రస్తుత దుస్థితి ఇదీ.. వికారాబాద్ జిల్లా అనంతగిరి మూసీ జన్మస్థానం. అక్కడినుంచి సుమారు 90 కి.మీ మేర ప్రవహించి ఈ నది బాపూఘాట్ వద్ద హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో ప్రవేశిస్తోంది. నిత్యం గృహ, వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 1400 మిలియన్ లీటర్ల మురుగునీరు నిత్యం ఈ నదిలోకి ప్రవేశిస్తోంది. ప్రధానంగా జీడిమెట్ల, బాలానగర్, సనత్నగర్ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థజలాలతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. కాగా మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాల్లో జలమండలి నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, అంబర్పేట్ మురుగు శుద్ధి కేంద్రాల్లో 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసి ఈ నదిలోకి వదిలిపెడుతోంది. మిగతా 700మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసేందుకు పదిచోట్ల నూతనంగా మురుగుశుద్ధి కేంద్రాలు, రెండుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని జలమండలి రూ.1200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నది జాతీయ స్థాయిలో కాలుష్యకారక నదుల్లో మూసీ నది నాలుగోస్థానంలో నిలవడం ఈ నది దుస్థితికి అద్దం పడుతోంది. మూసీ ప్రక్షాళన రెండోదశకు రూ.1200 కోట్లు అవసరం.. . మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకు రూ.1200 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం..పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్(142ఎంఎల్డి),నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు (80ఎంఎల్డి), హైదర్షాకోట్ (30), అత్తాపూర్ (70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్ (30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డి), నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్హయత్నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం కాప్రా పర్యావరణ ప్రభావనివేదిక లోపభూయిష్టం మూసీరివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. మూసీ ప్రవాహమార్గంలో ఏర్పాటుచేసిన పలు వాణిజ్య, నివాస సముదాయాలతో మూసీ రోజురోజుకూ మూసుకుపోతోంది. చాదర్ఘాట్ వద్ద మూసీ ప్రవాహమార్గంపైనే మెట్రో స్టేషన్,దాని పక్కనే ఎంజీబీఎస్ బస్స్టేషన్ ఏర్పాటుచేశారు. భారీ వర్షాలు,వరదలు వచ్చినపుడు వీటి మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. మూసీఅభివృద్ధి ప్రాజెక్టుపై పర్యావరణ వేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరవాతే పనులు మొదలుపెట్టాలి. మూసీ రివర్ మేనేజర్మెంట్ కమిటీ ఏర్పాటుచేసి చారిత్రక నదిని పరిరక్షించాలి.– ప్రొఫెసర్ నరసింహారెడ్డి,పర్యావరణవేత్త -
కేరళ ముప్పు హైదరాబాద్కు వస్తే..??
కేరళ పరిస్థితే మనకు ఎదురైతే.? తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అలాంటి ఉపద్రవం భాగ్యనగరాన్ని ముంచేయక ముందే మేల్కొంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని నాలాలను తక్షణమే విస్తరించాలని, మూసీ సామర్థ్యాన్ని పెంచాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో కేరళ తరహాముంపు ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని నాలాలను తక్షణమే విస్తరించి, వరదనీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయకపోతే.. మూసీ సామరŠాధ్యన్ని పెంచని పక్షంలో.. కేరళ తరహా ముప్పు హైదరాబాద్కూ పొంచి ఉందని వరద ప్రవాహాల నిపుణులు పేర్కొంటున్నారు. 2000 సంవత్సరంలో కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఇళ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. మారిన పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండైనా, వానైనా తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున హటాత్తుగా భారీ వర్షాలొచ్చే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. కేరళలో కురిసనట్లుగా భారీ వర్షాలు వస్తే నగరం మునిగిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. 2000 నాటి వరదలతోనే కిర్లోస్కర్, వాయెంట్స్ సొల్యూషన్స్ నివేదికల్లో నాలాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినా ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు. రెండేళ్లక్రితం వర్షాలతో తిరిగి నాలాల ఆధునీకరణ పనుల్లో కదలిక వచ్చినా ముందుకు సాగడం లేదు. నాలాలను ఆధునీకరించి, వరదనీరు వెళ్లే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వరదలనైనా బయటకు పంపించే మూసీ నది కబ్జాకు గురికావడంతో నీరు బయటకు వెళ్లడం లేదు. మూసీగుండా ప్రస్తుతం దాదాపు 50 క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్ధ్యం మాత్రమే ఉండటం రెండు రోజుల క్రితం జరిగిన ఇంజినీరింగ్ సదస్సులో చర్చకు వచ్చింది. మూసీకి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించే సామర్ధ్యం ఉంటేనే నగరం వరదముంపు బారిన పడకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకుగాను తగిన కార్యాచరణతో తక్షణం పనులు చేపట్టాని వారు పేర్కొన్నారు. ఆక్రమణలతో తగ్గిపోయిన మూసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఇరిగేషన్, తదితర శాఖలు ఆరేడేళ్ల క్రితం జరిపించిన అధ్యయ నంలో వెల్లడవడాన్నీ సదస్సు ప్రస్తావించింది. గంటకు 10 సెం.మీ.వర్షపాతాన్ని తట్టుకోవాలి.. గతంలో నిర్వహించిన అధ్యయనాలు, కమిటీల నివేదికలు గంటకు నాలుగు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేందుకు రూపొందించినవి. ప్రస్తుతం గంటకు రెండు సెంమీటర్ల వర్షాన్ని తట్టుకునే సామర్ధ్యం మాత్రమే నాలాలకు ఉంది. గత ఏడాది తక్కువ సమయంలోనే పది సెంటీమీటర్లు మించిన వర్షపాతం నమోదైంది. మూసీని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేయడమే కాక, ప్రభుత్వశాఖలు సైతం అభివృద్ధి పేరిట మూసీ స్థలంలో నిర్మాణాలు జరిపాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా వెంటనే తగు చర్యలు చేపట్టి మూసీ ప్రవాహ సామరŠాధ్యన్ని పెంచాల్సిన అవసరముందని, లేని పక్షంలో కేరళ కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉం దని హెచ్చరించారు. అందుకుగాను తగిన ఆలోచనలు, ప్రణాళికలు అవసరమని సూచించారు. 13 ప్రాంతాలు సమస్యాత్మకం.. మూసీలో అనేక ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోయి సమస్యాత్మకంగా మారాయి. మూసీప్రక్షాళన, సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వం మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మూసీ తీరం వెంబడి సర్వే నిర్వహించిన కార్పొరేషన్ 13 ప్రాంతాల్లో డెబ్రిస్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది. 14 మండలాల పరిధిలో 57.5 కి.మీ.ల మేర విస్తరించిన మూసీని మొత్తం ప్రక్షాళన చేసి, ప్రవాహ సామరŠాధ్యన్ని పెంచితేనే వర్షాకాల సమస్యలు తప్పుతాయని నిపుణులు భావిస్తున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: మూడ్రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పంటలకు ప్రాణం రావడంతో అన్నదాత ఆనందంలో మునిగిపోయాడు. గత 24 గంటల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రికార్డు స్థాయిలో 27 సెం.మీ. వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతో గోదావరి ఉధృతంగా మారింది. కుమురంభీం, ఎల్లంపల్లి, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమురం భీం, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో అనేకచోట్ల పంటలు నీటమునిగాయి. వరదనీరు రోడ్లను ముంచెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అధిక వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం పనులు జరుగుతున్న చోట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, సోమవారం కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లిలో వానలే వానలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెరిపినివ్వకుండా మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో గోదావరి ఉధృతి పెరిగింది. వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయి మత్తడి పోస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌస్, తూపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులకు రెండోరోజూ అంతరాయం ఏర్పడింది. ఏటూరునాగారం మండలంలోని రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన విద్యార్థి మాడకం మాసయ్య(16) జిల్లెలవాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని జంపన్నవాగు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలోని రెండు వంతెలన పైనుంచి అడుగు మేర నీరు ప్రవహించింది. జంపన్నవాగు నుంచి అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లే ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం దేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అన్నారం బ్యారేజీని చూసి తిరిగి వస్తున్న సందర్శకుల బస్సు ఆదివారం మహదేవపూర్ మండలం చండ్రుపల్లి వాగులో చిక్కుకుంది. స్థానికులు సుమారు గంట పాటు శ్రమించి బస్సును తాళ్ల సాయంతో బయటకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బొగత సందర్శనకు బ్రేక్ పడింది. జలపాతం వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో పర్యాటకులను రెండ్రోజుల వరకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోదావరిఖనిలో రెండు దారులను తాకుతూ ప్రవహిస్తోన్న గోదావరి భద్రాద్రి, ఆదిలాబాద్లో ప్రాజెక్టులు ఫుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడ్రోజుల నుంచి వానలు కురుస్తుండటంతో గుండాల, ఆళ్లపల్లి, పినపాక, పాల్వంచ మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం 16 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం 6 గేట్లు ఎత్తి 48 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32.5 అడుగులకు చేరింది. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు సింగరేణి ఏరియాల్లో గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండింది. కుంటాల జలపాతం వద్ద నీరు పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో 28 గేట్లు ఎత్తి 2,90,640 క్యూసెక్కుల నీటిని గోదారిలోకి వదులుతున్నారు. నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. కుమురం భీం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. కడెం ప్రాజెక్టు నుంచి కిందకు నీటిని వదులుతున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా కోల్బెల్ట్ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అటు పెద్దపల్లి జిల్లా కూడా తడిసిముద్దయింది. రామగుండంలోని న్యూపోరట్పల్లి, ఇందిరమ్మ, మేరు కాలనీలు జలమయమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి అదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జలకళను సంతరించుకుంది. జిల్లావ్యాప్తంగా 23.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సింగితం రిజర్వాయర్ నిండేందుకు సిద్ధంగా ఉంది. మూసీ పరవళ్లు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి వద్ద మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరద ఉధృతి కొనసాగడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దరావులపల్లి వద్ద బ్రిడ్జిపైనుంచి పారుతున్న మూసీ సాధారణం కంటే 695 శాతం అధికం! గత 24 గంటల్లో రాష్ట్రంలో సాధారణం కంటే 695 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో సరాసరి 8.8 మిల్లీలీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 70 ఎంఎంలు నమోదైంది. ఒక్కరోజులోనే పెద్దపల్లి జిల్లాలో 2,211 శాతం అధిక వర్షం కురిసింది. ఈ జిల్లాలో ఈ ఒక్క రోజు సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 9 ఎంఎంలు కాగా.. 208 ఎంఎంలు నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాలలోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు భారీ వర్షాలు కురిస్తున్నా తొమ్మిది జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. 32 గంటలు బిక్కుబిక్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లికి చెందిన నస్కూరి శ్రీనివాస్రావు వరదలో చిక్కుకొని 32 గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆయన పశువులను తీసుకుని శనివారం ఉదయం కిన్నెరసాని అవలి ఒడ్డున ఉన్న పొలానికి వెళ్లాడు. అయితే కిన్నెరసాని 13 గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుపోయాడు. సెల్ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇచ్చి నది మధ్యలో గడ్డపై ఉన్న మామిడితోటలోకి వెళ్లి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక బోటులో వెళ్లి శ్రీనివాస్సరావును సురక్షితంగా తెచ్చారు. వరదలపై జాగ్రత్త ; మంత్రి హరీశ్రావు ఆదేశం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నందున ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు, చెరువుల్లోకి వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి, ఫ్లడ్ కంట్రోల్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. ఎక్కడైనా కాల్వలు, చెరువు కట్టలు తెగే పరిస్థితి ఉంటే ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఆదివారమిక్కడ జలసౌధలో వరద పరిస్థితిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, నాగేందర్ రావు, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, చీఫ్ ఇంజనీర్లు శంకర్, సుధాకర్, మధుసూదన్ రావు ఇందులో పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 36 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో, 19 ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుతున్నట్టు ఇంజనీర్లు తెలిపారు. గోదావరి బేసిన్లో 16 ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్లో 3 ప్రాజెక్టులు నిండుతున్నట్లు వివరించారు. రెండ్రోజుల్లో మరో రెండు, మూడు ప్రాజెక్టులు నిండే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. గోదావరి బేసిన్లో దాదాపు 50 శాతం చెరువులు నిండినట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో 43,825 చెరువులకు 5,385 చెరువుల్లో వంద శాతం కన్నా ఎక్కువ నీరు చేరిందన్నారు. 5,311 చెరువులు 75 నుంచి 100 శాతం, 3,492 చెరువులు 50 నుంచి 75 శాతం, 26,303 చెరువులు 25 శాతం నిండాయని వివరించారు. -
మూసీ ఆక్రమణలు తొలగించండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: మూసీ నది ఒడ్డున వెలిసిన ఆక్రమణల తొలగిం పునకు చర్యలు తీసుకోవాలని మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్, జీహెచ్ఎంసీలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి, సుందరీకరణ ప్రాజె క్టుపై నగర మేయర్ రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్లతో కలసి మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. జీవనాధారం కోసం మూసీ ఒడ్డున తాత్కాలిక గృహాల్లో నివసిస్తున్న పేదలకు అందుబాటులో ఉన్న వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అధికారులు మూసీ నది అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. -
ముందు కాలుష్యరహితం.. తర్వాతే సుందరీకరణ
సాక్షి, హైదరాబాద్: మూసీ నదికి ముందు కావాల్సింది సుందరీకరణ కాదని, కాలుష్య రహిత ప్రవాహమని హైకోర్టు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో మూసీలో కాలుష్య కారకాలు కలవకుండా నిరోధించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని వెల్లడించింది. ఈ విషయంలో పీసీబీ ఏం చేస్తుందో తెలుసుకోవాలని భావిస్తున్నామంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ బి.రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతీ నదిలా మూసీని శుభ్రపరిచేలా ప్రభుత్వా న్ని ఆదేశించాలని నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవా రం ధర్మాసనం విచారణ చేపట్టి పైవిధంగా స్పందించింది. -
మూసీ ఎన్నేళ్లిలా?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జీవనాడి అయిన...చారిత్రక మూసీ నదిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు మళ్లీ న్యాయపోరాటం మొదలైంది. నదీ గర్భంలోకి చొచ్చుకొచ్చిన ఆక్రమణలను తక్షణం తొలగించాలని...ప్రవహించే నదిలో వ్యర్థాల డంపింగ్ను నిరోధించాలని, ప్రక్షాళనకు వీలుగా మురుగు శుద్ధి కేంద్రాలను తక్షణం నిర్మించాలని కోరుతూ ఇటీవల నగరానికి చెందిన ముగ్గురు న్యాయ విద్యార్థులు నయీం, అఫ్తాబ్, పవన్లు ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. మూసీ కాలుష్యం, ఆక్రమణలు, ప్రస్తుత దుస్థితిపై 400 పేజీల సమగ్ర నివేదికను, 500 ఫొటోలను ధర్మాసనానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో నది ప్రక్షాళనకు ఇప్పటివరకు తీసుకున్న..తీసుకుంటున్న చర్యలపై తక్షణం ధర్మాసనానికి నివేదించాలని ఆదేశిస్తూ జలమండలి, మున్సిపల్ పరిపాలన శాఖ, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 27న ధర్మాసనం తిరిగి విచారించనుంది. మూసీ కాలుష్యం ఇలా.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటరు నీటిలో కరిగిన ఆక్సిజన్ మోతాదు (డీవో) పరిమాణం కనీసం 4 మిల్లీ గ్రాములుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదాకుంటలో జలచరాలు బతకవు. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) విషయానికొస్తే లీటరు నీటిలో 3 ఎంజీలను మించకూడదు. డీవో తగ్గుతున్న కొద్దీ బీవోడీ పెరుగుతుంది. అలా జరుగుతుంటే ఆ జలవనరులో కాలుష్యం పెరుగుతుందని అర్థం. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) గండిపేట దగ్గర నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగానే ఉంది. లీటర్ నీటిలో 2 ఎంజీలుగా ఉంది. ఇక నగరంలోకి ప్రవేశించగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 25 నుంచి 37 ఎంజీల వరకు బీఓడీ నమోదైంది. కృష్ణా నదిలో కలిసే వాడపల్లి దగ్గర 4 ఎంజీలకు తగ్గింది. జూలైలో గండిపేట దగ్గర 2 ఎంజీలుండగా.. నాగోల్ దగ్గర 24, ప్రతాపసింగారం వద్ద 20 ఎంజీలుండగా వాడపలి కాసానిగూడ వద్ద 3 ఎంజీలకు తగ్గింది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్(డీవో) గండిపేట దగ్గర లీటరు నీటిలో 5.2 ఎంజీలుండగా.. నగరంలోకి రాగానే తగ్గింది. మూసారంబాగ్ నుంచి ప్రతాప సింగారం వరకు 0.2 ఎంజీల నుంచి 1 ఎంజీలకు తగ్గిపోయింది. ఇక పిల్లాయిపల్లి దాటగానే 1.9 ఎంజీలకు పెరిగింది. వాడపల్లిలో 4 ఎంజీల కంటే ఎక్కువగా ఉంది. ఇక గండిపేటలో 4.9 ఎంజీలుండగా.. నాగోలు, ప్రతాపసింగారం దగ్గర ’0’, కాసానిగూడ వద్ద 6.2 ఎంజీలకు పెరిగింది. ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే.. మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు రూ.1500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం..పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్(142ఎంఎల్డి), నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు(80ఎంఎల్డి), హైదర్షాకోట్(30), అత్తాపూర్(70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్(30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డి), నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్ హయత్నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్,ఐడీపీఎల్ టౌన్షిప్,నాగారం కాప్రా మూసీ ప్రస్థానం ఇదీ.. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లో పుట్టి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ప్రవహించి మిర్యాలగూడకు సమీపంలోని వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తోంది. మొత్తం 250 కి.మీ. ప్రవహిస్తోంది. నగరంలో బాపూఘాట్–ప్రతాపసింగారం వరకు సుమారు 45 కి.మీ ప్రవహిస్తోంది. దేశంలోని అత్యంత కలుషితమైన నదుల్లో ఈ నది నాలుగోస్థానం దక్కించుకుందంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మూసీని పరిరక్షించాల్సిందే చారిత్రక మూసీనది గృహ, వాణిజ్య, పారిశ్రామిక, జీవ వ్యర్థాల చేరికతో తీవ్ర కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఈ నదిని సమగ్ర పక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకురావాలి. నదీగర్భంలోనికి చొచ్చుకొచ్చిన అక్రమనిర్మాణాలను తక్షణం తొలగించాలి. నగరంలో మూసీ ప్రవాహిస్తోన్న మార్గం డంపింగ్ యార్డును తలపిస్తోంది. నదిలో చేరిన వ్యర్థాలను శుద్ధిచేయడంలో సంబంధిత విభాగాలు విఫలమవుతున్నాయి. – ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ వేత్త -
మూసీదెబ్బ!
నీరు లేకుంటే మనిషి లేడు.. జీవరాశి అంతా జలంపైనే ఆధారపడి జీవిస్తోంది. ఇప్పుడు ఈ నీరు గ్రేటర్ వాసులను కలవరపెడుతోంది. నేలను తవ్వితే ఉబికి వచ్చే పాతాళగంగ మహానగరంలో కలుషితమైంది. మూసీ పరీవాహక ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషతుల్యంగా మారినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ భూవిజ్ఙాన శాస్త్ర విభాగంనిపుణులు తేల్చారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో అధ్యయనం చేయగా భార లోహాలు భారీ స్థాయిలో కరిగి ఉన్నట్టు గుర్తించారు. ప్రధానంగా బాపూఘాట్–ఫీర్జాదీగూడ(44 కి.మీ) మార్గంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలనమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఆయా నమూనాల్లో కరిగిన ఘన విష పదార్థాలు అధికంగా ఉండడంతో నీటి రంగు పసుపు రంగులోకి మారినట్లు గుర్తించారు. ఈ నీటిలో ప్రమాదకరమైన ఆర్సెనిక్, లెడ్, జింక్తో పాటు మెగ్నీషియం, సెలీనియం, బోరాన్ తదితరాల ఆనవాళ్లు కనిపించడంఆందోళన కలిగిస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో భూగర్భ జాలలను ఉపయోగించుకోలేని దుస్థితి నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూవిజ్ఙాన శాస్త్ర విభాగం నిపుణుల తాజా అధ్యయనం ఇక్కడి నీరు భారలోహాలతో నిండిపోయాయని తేల్చింది. ఈ జలాలు కనీసం బట్టలుతకడం, పెంపుడు జంతువులు దాహార్తి తీర్చుకోవడం, గార్డెనింగ్ వంటి అవసరాలకూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మూసీలోకి నిత్యం పారిశ్రామిక వాడల నుంచి వచ్చి చేరుతున్న గరళజలాల్లో భార లోహాల ఉనికి ఉండడం.. కరిగిన ఘన పదార్థాల మోతాదు అధికంగా ఉండడంతో ఈ నీరు భూగర్భంలోకి క్రమంగా ఇంకుతున్న వైనంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు తేల్చారు. జల కాలుష్యం అధికంగాఉన్న ప్రాంతాలు.. భోలక్పూర్, ముషీరాబాద్, రాంనగర్, నల్లచెరువు, ఫీర్జాదీగూడ, ఉప్పల్, లంగర్హౌజ్, అంబర్పేట్, గోల్నాక, చాదర్ఘాట్, అఫ్జల్గంజ్. భూగర్భ జలాల్లో ఉన్న భార లోహాలివీ.. సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్. ప్రధాన కారణాలివీ.. ⇔ మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరుతున్నాయి. ఈ జలాలు క్రమంగా భూగర్భంలోకి ఇంకుతున్నాయి. ⇔ రోజువారీగా గ్రేటర్లో 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో 700 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు. ⇔ మిగతా 700 మిలియన్ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి కాకుండానే మూసీలో కలుస్తున్నాయి. ⇔ ఇందులో సుమారు 350 మిలియన్ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థ జలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భంలోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి. పారిశ్రామిక వాడల్లో పరిస్థితి ఇదీ.. మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాల, చెరువుల నీటి నమూనాలను గతంలో ఎన్జీఆర్ఐ (జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ) సేకరించి పరీక్షించింది. ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు అధికంగా ఉండడంతో పాటు భారలోహాల ఉనికి బయటపడింది. మోతాదు మించి ఘన పదార్థాలు ⇔ నాచారం– ఉప్పల్ ప్రాంతాల్లోని నీటి నమూనాలో కరిగిన ఘన పదార్థాల ఉనికి (టీడీఎస్) 1970 మి.గ్రా/లీటర్ నమోదైంది. ⇔ మాల్లాపూర్ ఐడీఏ ప్రాంతంలో నీటి నమూనాలో టీడీఎస్ 1720 ఎంజీ/లీ నమోదైంది. ⇔ చర్లపల్లి ఐడీఏలోని నమూనాలో టీడీఎస్ 2140 ఎంజీ/లీ నమోదైంది. ⇔ కాటేదాన్ ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1860 ఎంజీ/లీ నమోదైంది. ⇔ బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని నీటి నమూనాలో టీడీఎస్ 1530 ఎంజీ/లీ నమోదైంది. ⇔ ఖాజీపల్లి ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1810 ఎంజీ/లీ నమోదైంది. ⇔ బొంతపల్లి ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1280 ఎంజీ/లీ గా ఉంది. ⇔ పటాన్చెరు– బొల్లారం– పాశమైలారం ప్రాంతాల్లోని నీటి నమూనాల్లో టీడీఎస్ 1890 ఎంజీ/లీ నమోదైంది. ⇔ ఎన్జీఆర్ఐ చేసిన పరీక్షల్లోనూ ఇదే తరహా భారలోహలు ఉన్నట్టు నిర్ధారించింది. అనేక లోహాలు ప్రమాదస్థాయి మించకపోయినా ఏళ్లతరబడి పరిశ్రమల నుంచి విచక్షణారహితంగా విడుదల చేసిన రసాయన వ్యర్థాలకు ఇది నిదర్శమని పేర్కొంది. -
మూసీనదిలో కొట్టుకుపోయిన బైక్
అర్వపల్లి (తుంగతుర్తి) : మూసీ నదిలో బైక్ కొట్టుకుపోయింది. ఈ సంఘటన జాజిరెడ్డిగూడెం – వంగమర్తి గ్రామాల మధ్య గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం ఓగోడుకు చెందిన శివశంకర్ తన గ్లామర్ బైక్పై అర్వపల్లికి బయల్దేరాడు. హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మూసీనదికి ఇటీవల వరద ఉధృతి పెరిగింది. మూసీనదిలో జాజిరెడ్డిగూడెం–వంగమర్తి మధ్య వంతెన నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అయినా.. తుంగతుర్తి–నకిరేకల్ నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం ఈ దారి గుండా వెళ్తున్న శివశంకర్ బైక్తో సహా మూసీలో కొట్టుకుపోయాడు. దీంతో భయాందోళనకు గురైన శివశంకర్ కొద్ది దూరం వెళ్లాక బైక్ను వదిలేసి అతికష్టం మీద బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ బైక్ కనిపించకుండా పోయింది. ఇటీవలే రూ.65వేలు వెచ్చించి బైక్కొనుగోలు చేసినట్లు శివశంకర్ వాపోయాడు. బైక్ కోసం స్థానికులు నదిలో గాలిస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున రాకపోకలు సాగించవద్దని రోడ్డు నిర్మాణ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా కోరుతున్నారు. -
డంపింగ్ యార్డును తలపిస్తున్న మూసీ నది
-
మూసీ.. ముప్పు!
సాక్షి, హైదరాబాద్ : మూసీ నది.. ఒకప్పుడు ఈ నదిలో నాణెం వేస్తే పైకి కనిపించేదట. కానీ ఇప్పుడు మూసీకి బారెడు దూరంలో ఉన్నా ముక్కు పుటాలు పగిలిపోతున్నాయి. నిండా చెత్త చెదారంతో, హానికర కలుషితాలతో నది అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ప్రక్షాళనపై ప్రభుత్వాల నిర్లక్ష్యం, రోజురోజుకూ పెరుగుతున్న నగర జనాభా, వ్యర్థాలను నదిలోనే డంప్ చేస్తుండటం, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కలుషిత జలాలతో మూసీ నది వైతరణీ నదిని తలపిస్తోంది. నది వెంట ఉన్న బస్తీలు, కాలనీల వాసులు రోగాల బారిన పడుతున్నారు. గుజరాత్లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అడుగు ముందుకు పడటం లేదు. ప్రక్షాళన కోసం రూ.1,200 కోట్లతో, తీర ప్రాంత అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.3 వేల కోట్లతో రూపొందించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఏడాది కింద ‘మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినా.. నామమాత్రంగానే మిగిలిపోయింది. ఇక కొందరు నది వెంట ఈ కలుషిత నీటితోనే కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుండడంతో.. వాటిని తిన్నవారు రోగాల పాలవుతున్నారు. మూసీ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తోన్న బాపూఘాట్ ప్రాంతం నుంచి ప్రతాప సింగారం వరకు సుమారు 44 కిలోమీటర్ల పొడవునా మూసీ పరిస్థితిపై ‘సాక్షి’బృందం సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఈ సందర్భంగా ఎన్నో విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. బాపూఘాట్–చాదర్ఘాట్: చెత్తా చెదారం, మురుగు మధ్య.. నగరంలోకి మూసీ నది ప్రవేశించే లంగర్హౌస్ బాపూఘాట్ ప్రాంతం నుంచి పురానాపూల్, ముస్లిం జంగ్ బ్రిడ్జి, నయాపూల్, చాదర్ఘాట్ వరకు డంపింగ్ యార్డును తలపిస్తోంది. నది వెంట ఉన్న కాలనీలు, బస్తీల నుంచి మురుగు నీరంతా నదిలో కలుస్తోంది. ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలతో నిండి కనిపిస్తోంది. లంగర్హౌజ్ టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద నదిలోనే శ్మశాన వాటిక ఉంది. మృతదేహాలను దహనం చేయడం, ఇతర వ్యర్థాలన్నీ నదిలోకే చేరుతున్నాయి. నది ఒడ్డున దోబీ ఘాట్లు ఉన్నాయి. ఆ నీటితోనే బట్టలు ఉతుకుతున్నారు. అత్తాపూర్ బ్రిడ్జి వద్ద జీహెచ్ఎంసీ వాహనాలు భవన, మురుగు వ్యర్థాలను నదిలోనే డంప్ చేస్తున్నాయి. పలు చోట్ల నది వెంట ఆ నీటితోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. చాదర్ఘాట్–ఉప్పల్: మురికి గుంట చాదర్ఘాట్ వద్ద ఒకవైపు ఎంజీబీఎస్ బస్స్టేషన్, మరోవైపు రెండు మెట్రో కారిడార్లు కలిసే చోట నిర్మిస్తోన్న ఇంటర్ చేంజ్ మెట్రోస్టేషన్ నిర్మాణంతో మూసీ ఇరుగ్గా మారిపోయింది. చాదర్ ఘాట్ ప్రధాన వంతెన, దిగువ వంతెనలకు ఆనుకుని అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దానికితోడు చెత్తా చెదారం నిండి నది మురికినీటి గుంటలా మారిపోయింది. మూసారాంబాగ్, గోల్నాక, అంబర్పేట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి. మురికి నీరు నిలవడంతో దోమలు విపరీతంగా ఉండి.. సమీప ప్రాంతాల వాసులు రోగాలబారిన పడుతున్నారు. అంబర్పేట్ వద్ద మురుగు శుద్ధికేంద్రం వద్ద నది నీటిలోని చెత్తా చెదారాన్ని మాత్రమే తొలగిస్తున్నారు. హానికర రసాయనాలను తొలగించే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోవడం ఆందోళనకరం. ఉప్పల్– ప్రతాప్సింగారం: పచ్చని విషం నగరం నుంచి మూసీ నది బయటికి వెళ్లే ఫిర్జాదిగూడ, పర్వతాపూర్, కాచవాని సింగారం, ప్రతాప సింగారం ప్రాంతాల్లో మూసీ నది ‘పచ్చని విషాన్ని’వెదజల్లుతోంది. మూసీ కాలువలకే నేరుగా మోటార్లు బిగించి నీటిని తోడి.. పొలాలకు మళ్లిస్తున్నారు. ఈ కలుషిత నీటితోనే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, పుదీనా, గంగవాయిలి తదితర ఆకుకూరలు, పశువుల కోసం గడ్డి పండిస్తున్నారు. ఆకుకూరలను ఉప్పల్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మూసీ నీటిలోని విషపూరిత రసాయనాలు, హానికర పదార్థాలు ఈ పంటల్లోకి చేరుతున్నాయి. కాచవాని సింగారం, ప్రతాప సింగారం ప్రాంతంలో పలు చోట్ల బోర్లు వేసినా.. కలుషిత నీరే వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీనివల్ల చర్మవ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. పంటలకు మూసీ నీటిని తరలిస్తున్న సమయంలో చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తోంది. మూసీ జలాలు, కలుషిత గాలి కారణంగా ఇళ్లకు వినియోగించిన ఉక్కు తుప్పుపట్టి గోడలకు, పైకప్పులకు పగుళ్లు వస్తున్నాయని రియల్ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మూసీ దుస్థితి ఇదీ.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి.. బాపూఘాట్ వద్ద హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాప సింగారం వరకు సుమారు 44 కిలోమీటర్లు నగరంలో ప్రవహిస్తుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి నిత్యం 140 కోట్ల లీటర్ల మురుగునీరు నదిలోకి చేరుతోంది. పారిశ్రామిక వ్యర్థాలతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. నదిపై ఉన్న ఐదు మురుగు శుద్ధి కేంద్రాల్లో నిత్యం 70 కోట్ల లీటర్ల మురుగు నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మరో పది చోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు, పలు చోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని ప్రణాళికలు కూడా వేశారు. కానీ అమల్లోకి రాలేదు. మూసీ ప్రక్షాళన రెండోదశ ఏదీ? మూసీని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళనను తక్షణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.1,200 కోట్లు అవసరం. మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం పది సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. మరో నాలుగు చోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాల్సి ఉంది. దీనిపై జలమండలి ప్రతిపాదనలు రూపొందించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాగితాలపైనే సుందరీకరణ ప్రాజెక్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసీ ప్రవహిస్తున్న మార్గం వెంట రహదారులు, ఫ్లైఓవర్లు, పార్కులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు సౌకర్యం, ఇటు మూసీ సుందరీకరణకు తోడ్పడే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లతో ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. కానీ ఇదంతా కాగితాలకే పరిమితమైపోయింది. ఇందులో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపూఘాట్ వరకు (19 కిలోమీటర్లు, రూ.647.98 కోట్ల వ్యయం), బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు (21.50 కిలోమీటర్లు, రూ.2,162.01 కోట్లు వ్యయం), నాగోల్ బ్రిడ్జి నుంచి ఔటర్రింగ్ రోడ్డు (గౌరెల్లి) వరకు (15 కిలోమీటర్లు, రూ.155.52 కోట్లు వ్యయం) అంచనాలను రూపొందించారు. ఇవి అమల్లోకి వస్తే.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయి. దేశంలోనే నాలుగో స్థానం దేశంలోని అత్యంత కాలుష్యభరిత నదుల్లో మూసీ నాలుగో స్థానంలో ఉండడం నది దుస్థితికి అద్దం పడుతోంది. హైదరాబాద్ పరిధిలో నదిలో టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్), బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్–బీఓడీ)లు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళనకరంగా మారింది. దీంతో సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణం కనిష్ట స్థాయికి పడిపోయింది. వ్యర్థ రసాయనాలు అత్యధికంగా కలవడం వల్ల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ) కూడా బాగా పెరిగినట్లు తేలింది. సాధారణంగా నీటిలో సీఓడీ ఉండకూడదు. కానీ పరిస్థితి చేయిదాటింది. ఇక నీటి క్షారత (పీహెచ్) పెరిగింది. కొద్దినెలలుగా మూసీ నదిలో కాలుష్య పరిమితి ప్రమాదకర స్థాయిలో పెరిగిందని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. ఉండాల్సిన పరిమితి.. (ప్రతి లీటర్ నీటికి మిల్లీగ్రాముల్లో..) టీడీఎస్ (నీటిలో కరిగి ఉన్న ఘన పదార్థాలు): 500 బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్): 4 సీఓడీ (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్): 0 (అసలు ఉండరాదు) పీహెచ్ (నీటి ఆమ్ల/క్షార లక్షణం): 6.5 ఆకుకూరలు పండిస్తున్నాం.. ‘‘మూసీ నీటితోనే అన్ని రకాల ఆకుకూరలు పండిస్తున్నాం. రోజూ పొద్దున్నే ఉప్పల్ మార్కెట్కు తరలిస్తాం. మూసీ నీళ్లు బాగా లేవని తెలిసినా తప్పదు. బోరు వేసినా కలుషిత నీళ్లే వస్తున్నాయి..’’ – వీరమణి, ఫిర్జాదిగూడ ఏళ్లుగా బట్టలు ఉతుకుతున్నాం ‘‘మా తాతల కాలం నుంచి మేం లంగర్హౌజ్ టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద బట్టలు ఉతుకుతున్నాం. దాదాపు 25 మంది వరకు ఈ పనిలో ఉన్నాం. నదిలో నీటిని పక్కన ఏర్పాటు చేసుకున్న నీటి హౌజుల్లో నింపుకొని వాడుతున్నాం..’’ – కమల్సింగ్, లంగర్హౌస్ ఐదేళ్లుగా మెంతి పండిస్తున్నాం ‘‘గత ఐదేళ్లుగా మూసీ నది వెంట ఒడ్డుపై మెంతి పంట పండిస్తున్నాం. ఆరు వారాల్లోగా మెంతి పెరుగుతుంది. కిలోకు 400 కట్టలదాకా వస్తాయి. రూ.10కి ఎనిమిది కట్టల చొప్పున గుడిమల్కాపూర్లో విక్రయిస్తున్నాం..’’ – గజేందర్సింగ్, కార్వాన్ డంపింగ్ యార్డును తలపిస్తోంది ‘‘చెత్తా చెదారం, ప్లాస్టిక్ బ్యాగులు, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీనది డంపింగ్ యార్డుగా మారిపోయింది. పురానాపూల్–చాదర్ఘాట్ మధ్య ఒకప్పుడు సుందరంగా ఉండేది. ఇప్పుడు కాలుష్యకాసారంగా కనిపిస్తోంది. మురుగు నీటి శుద్ధి సరిగా జరగడం లేదు..’’ – ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి, పర్యావరణవేత్త -
పొంగిన మూసీ: రాకపోకలు బంద్
-
పొంగిన మూసీ: రాకపోకలు బంద్
సాక్షి, భువనగిరి: హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి యాదాద్రి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భాగ్య నగరంలోని వరద నీరంతా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆ నీరంతా రంగారెడ్డి జిల్లా మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి వస్తుంది. దీంతో మూసీ నదిపై ఉన్న పలు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీటి ఉధృతితో మునిగిపోయాయి. సమీప గ్రామాలకు రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. పోచంపల్లి, బీబీనగర్, రుద్రవెల్లి, వలిగొండ, అమ్మనబోలు ప్రాంతాల్లో కల్వర్టులపై నుంచి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అలాగే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద మూసీ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు కాగా ఇప్పటికే 643.80 అడుగులకు వరద నీరు చేరింది. ఆరు గేట్లను మూడు అడగుల మేరకు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. బయటకు రాలేని ప్రజలు మేడ్చల్ జిల్లా ఈస్ట్ ఆనంద్బాగ్లోని ఎన్.ఎం.డి.సి కాలనీ, షిరిడి నగర్, మల్కాజిగిరిలోని పటేల్ నగర్, దుర్గానగర్, వసంతపురి కాలనీ, మౌలాలిలోని ఆర్టీసి కాలనీలో రోడ్లపై నీటి ప్రవాహం తగ్గినా ఎన్ఎండీసీ కాలనీ, షిరిడి నగర్లో నాలా నిండి వర్షపు నీరు ఇళ్ళలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ఈస్ట్ అనంద్బాగ్ లో నాలా పొంగుతున్న, లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, కార్పొరేటర్ ఆకుల నర్సింగ్ రావు, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. -
సబర్మతీ తరహాలో మూసీ సుందరీకరణ
గుజరాత్ పర్యటనలో కేటీఆర్ - సబర్మతీ రివర్ డెవలప్మెంట్ - ఫ్రంట్ సందర్శన - టెక్స్టైల్స్ ఇండియా సదస్సులో ప్రసంగం సాక్షి, హైదరాబాద్: అహ్మదాబాద్లోని సబర్మ తీ నది తరహాలో మూసీ నది అభివృద్ధి, సుందరీకరణకు చర్యలు చేపడతామని రాష్ట్ర పురపాలన, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. టెక్స్టైల్స్ ఇండియా–2017 సదస్సులో పాల్గొనేందుకు గుజ రాత్లో పర్యటిస్తున్న ఆయన శనివారం రెండోరోజు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర అధికారులతో కలసి సబర్మతీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను సందర్శించారు. సబర్మతీ సుందరీకణలో ఎదురైన సమస్యలు, జనావాసాల తరలింపు, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను అక్కడి అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మూసీ సుందరీకరణ దిశగా నిధుల సమీకరణ, తొలి దశ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన గార్డెన్స్, వాక్వే, పార్కులు, రోడ్లను సందర్శించారు. టెక్స్టైల్స్కు భారీ ప్రోత్సాహకాలు.. రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేటీఆర్ శనివారం టెక్స్టైల్స్ ఇండియా సదస్సులో కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర టెక్స్టైల్స్ పాల సీ గురించి వివరించారు. వరంగల్లో నెలకొ ల్పనున్న మెగా టెక్స్టైల్ పార్కు గురించి ప్రస్తావించారు. రాష్ట్రం చేస్తున్న కార్యక్రమా లతో టెక్స్టైల్స్ రంగం మరింత ముందుకు పోతోందని, పెట్టుబడులు వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. సమర్థమైన నాయక త్వంలో నడుస్తున్న తెలంగాణ అన్ని రంగాల్లో బలోపేతం అవుతుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారని మంత్రి కేటీఆర్ కార్యాలయం తెలిపింది. సబర్మతీ ఆశ్రమంలో.. మహాత్మా గాంధీ జీవన విధానం అందరికీ ఆదర్శ మని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్ముడి నివాసం, ఆశ్రమం లోని పాఠశా లను తిలకించారు. మహాత్ముడు వినియో గించిన వస్తువులను, రాసిన లేఖలను పరిశీ లించారు. మంత్రికి అక్కడి విద్యార్థులు చర ఖాను బహుకరించారు. ఆశ్రమాన్ని సంద ర్శించడం ద్వారా మహాత్ముడి అతి సాధారణ జీవితం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మహాత్ముడు చూపిన బాటలో నే గ్రామాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామని, గ్రామ స్వరాజ్య స్థాపనే రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. -
‘మూసీ’ కష్టాలు తీరేదెప్పుడో..!
అర్వపల్లి(తుంగతుర్తి): మూసీ నదిలో వరద పారిందంటే చాలు.. అటు నకిరేకల్, ఇటు తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలకు రవాణా కష్టాలు వచ్చినట్లే. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చినప్పుడు నదిలో రాకపోకలు స్తంభిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో మూడ్రోజులుగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా ప్రజలు నడుముల్లోతు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను కలుపుతూ 365వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా.. మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే జాజిరెడ్డిగూడెం – వంగమర్తి మధ్య మూసీపై కిలోమీటరున్నర దూరం వంతెన నిర్మించనున్నారు. వంతెన నిర్మాణం కోసం ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు మట్టి నమూనాలు సేకరించి అంతా ఓకే చెప్పారు. కానీ పనులు ప్రారంభించలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజల ఎదురుచూస్తున్నారు. -
మూసీ ప్రక్షాళనపై ఉద్యమిద్దాం
దశల వారీ కార్యాచరణకు బీజేపీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనజీవనంతో ముడిపడిన మూసీ నది ప్రక్షాళనకు దశల వారీగా కార్యాచరణను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఘన చరిత్ర ఉన్నా ప్రస్తుతం కాలుష్యం బారిన పడి ఆరేడు జిల్లాల ప్రజలపై ప్రభావం చూపుతున్న మూసీ కాలుష్య సమస్యపై వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించింది. రాష్ట్రంలోని కోటిన్నర జనాభాపై మూసీ కాలుష్య దుష్పరిణాలు పడుతున్నందున, నది ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రాథమిక కసరత్తుతోపాటు, పూర్తి అవగాహన, సమాచారం కోసం నిపుణులతో సోమవారం సాయంత్రం వరకు బీజేపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.మనోహర్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ వేత్తలు కె.పురుషోత్తంరెడ్డి, నర్సింహారెడ్డి, సెంట్రల్ ల్యాబ్స్కు చెందిన అనంత్ హాజరయ్యారు. -
మూసీ బుగ్గపై బ్యూటీ స్పాట్
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది ఈ పేరు వినగానే కంపు కొట్టే వాసనే గుర్తుకొస్తుంది. ఈ ఇబ్బందికర వాతావరణాన్ని మార్చేందుకు నాగోల్ బ్రిడ్జ్ నుంచి ఉప్పల్ భగాయత్ లే అవుట్ డౌన్ బ్రిడ్జ్ వరకు సుందరీకరణ పనులు చేపట్టారు. ఏకో ఫ్రెండ్లీ వాతావరణం తలపించేలా పాత్వేస్, షోర్లైన్ ఇంప్రూవ్మెంట్, ల్యాండ్స్కేప్ పనులు ఆ ప్రాంతంలో శరవేగంగా సాగుతున్నాయి. హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగంతో పాటు అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే అన్ని పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. నది పక్కనే వాకింగ్ ట్రాక్లు మూసీ నది అనగానే వామ్మో అక్కడికెళ్లాలా అని ఉలిక్కిపడే నగరవాసులను అక్కడికి రప్పించేలా విలేజ్ కల్చర్ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. నగరంలోని ఒక పార్కు వెళితే కనిపించే దృశ్యాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బఫర్జోన్ గా పిలిచే ఈ రెండు కిలోమీటర్ల ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డును వేశారు. పార్కుల్లో సందర్శకులు నడిచేందుకు వాకింగ్ ట్రాక్లను కూడా నిర్మించారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడిచేలా అన్ని సౌకర్యాలను కల్పించారు. మధ్యలో సేదతీరేందుకు ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన బెంచ్ల మాదిరిగానే ఇక్కడా బెంచ్లు తెప్పిస్తున్నారు. రోడ్డువైపున గ్రిల్స్ బిగించారు. దాదాపు 1.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దోమలకు చెక్ పెట్టే మొక్కలు.. మూసీ నది ఒడ్డుకు వెళితే దోమలు వెంటబడి తరుముతాయి. దుర్వాసనకు అడుగు పడదు. ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయి. ఇకపై ఇటువంటి మాటలకు తావుండదు. హెచ్ఎండీఏ అధికారులు సువాసన వెదజల్లే మొక్కలు నాటుతున్నారు. తాగునీటి సౌకర్యం కోసం నల్లాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దోమల నివారణకు మెడిసినల్ ప్లాంట్లు నాటుతున్నారు. నక్షత్రవనం, తులసి మొక్కలు, వివిధ రకాల పూల మొక్కలు, లెమన్ గ్రాస్, లావెండర్, వాము తదితర మొక్కలను వరుస క్రమంలో పెడుతున్నారు. పాదచారులు మధ్యమధ్యలో సేదతీరేందుకు నీడనిచ్చే మొక్కలను కూడా నాటారు. ఇలా దాదాపు ఐదు లక్షల వరకు మొక్కలు నాటుతున్నట్టు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ కె.సత్యనారాయణ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తలపెట్టిన ఈ బ్యూటిఫికేషన్ పనులకు దాదాపు రూ.ఐదు కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు మరో నెలరోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. -
పడవ ప్రయాణం కాదు... బుడగ ప్రయాణం!
హైదరాబాద్కు ఓ మూసీ... ముంబైకి మీఠీ నది, అక్కడే విశాలమైన అరేబియా సముద్రం, ఢిల్లీలో యమునా నది! దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ మహానగరాల్లో నదులు, లేదంటే సుముద్రతీరం ఉన్నాయి. రోడ్డుపై వాహనాలతో వెళ్లడం కంటే నీటిపై పడవల్లో వెళ్లడం చౌక, కాలుష్యరహితం కూడా. ఇప్పుడు ఈ రెండు అంశాలను కలిపి చూస్తే... పక్కనున్న ఫోటోలేమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. అవునండి... ఇవి నీటి ట్యాక్సీలు! పడవలు, ఫెర్రీలతో అయ్యే కాలుష్యాన్ని, సమయం వృథా అవడాన్ని కూడా నివారించేందుకు ఫ్రాన్స్కు చెందిన ‘సీ బబుల్స్’ అనే సంస్థ వీటిని అదే పేరుతో అభివృద్ది చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది జల రవాణా కోసం ఊబర్ లాంటిది. స్మార్ట్ఫోన్ ఆప్ ద్వారా పనిచేస్తుంది. ఒక్కో సీబబుల్లో ఐదుగురు మాత్రమే వెళ్లగలరు. కాబట్టి... ఫెర్రీ, పడవ నిండేంత వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. పైగా దీని డిజైన్ కారణంగా ఇది అతితక్కువ ఇంధనాన్ని వాడుతుంది. నీటి ఉపరితలంపైకి విసిరేసిన కుండ పెంకు మాదిరిగా గాల్లో ఎగురుకుంటూ వెళుతుంది. బ్యాటరీల నుంచి శక్తిని గ్రహించి ఇంజిన్ దాదాపు 240 కిలోల చోదక శక్తిని అందుకుని గంటకు 13 కిలోమీటర్ల నుంచి 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌరశక్తి ద్వారా బ్యాటరీలను నింపుకునే అవకాశమూ ఉంది. అలెన్ థీబాల్ట్, ఆండర్స్ బ్రింగ్డాల్ అనే ఇద్దరు ఔత్సాహికులు అభివృద్ది చేసిన సీబబుల్ను ఎయిర్బస్, రాఫేల్ విమాన కంపెనీల్లో పనిచేసిన బోరిస్ ప్రాట్, ఫిలెప్పీ పెరియర్లు డిజైన్ చేశారు. వచ్చే నెలలో తొలిసారి ఈ సీబబుల్ను ప్యారిస్లో పరీక్షించనున్నారు. వచ్చే ఏడాదికల్లా మరో 10 - 15 వాహనాలను తయారు చేసి పరీక్షిస్తారు. ఆ తరువాత 15 భారతీయ నగరాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆలోచన. ప్రస్తుతానికి వీటిని డ్రైవర్ల సాయంతోనే నడుపుతున్నా... త్వరలోనే డ్రైవర్ల అవసరం లేని విధంగానూ మార్పులు చేయనున్నారు. -
మూసీలో మినీ విద్యుత్ కేంద్రం!
- హైకోర్టు-ఉస్మానియా ఆస్పత్రి మధ్య ఏర్పాటు చేసే యోచన - మూడు మెగావాట్ల సామర్థ్యంతో స్థాపనకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కుండపోత వర్షాలకు పోటెత్తిన వరదతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నదిలో మూడు మెగావాట్ల సామర్థ్యంతో మినీ విద్యుత్ కేంద్రం స్థాపిస్తే ఉపయుక్తంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు మూసీలో వరద ప్రవాహం, రోజువారీగా ప్రవహిస్తున్న నీటి పరిమాణం, ఏ ప్రాంతంలో దీన్ని స్థాపించాలన్న అంశంపై సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. వికారాబాద్ అనంతగిరి కొండల్లో నుంచి 90 కి.మీ. ప్రవహించి నగరంలో బాపూఘాట్ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 44 కి.మీ. మేర ప్రవహిస్తోంది. అయితే ఇప్పటికే నయాపూల్ బ్రిడ్జి (హైకోర్టు-ఉస్మానియా మధ్యన) ఆనుకొని నిర్మించిన రబ్బరు డ్యామ్ స్థానంలో 100 అడుగుల ఎత్తున డ్యామ్ నిర్మించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని కింద భూగర్భ విద్యుత్ కేంద్రం, టర్మైన్లను ఏర్పాటు చేయడంద్వారా వరద నీరు ఈ డ్యామ్లో నిల్వచేసేలా ఆలోచిస్తున్నారు. ఆ నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో ఆ ఒత్తిడికి టర్బైన్లు తిరిగి సుమారు 3 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని భావిస్తున్నారు. దీనంతటికీ రూ.300 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. 1,400 మిలియన్ లీటర్ల ప్రవాహం... మూసీ నదిలోకి నిత్యం గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి 1,400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ప్రవేశిస్తోంది. ఇందులో 600 మిలియన్ లీటర్ల నీటిని అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్ మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. మిగతాది మూసీలో కలిసిపోతోంది. ఇందుకోసం పదిచోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు, రెండు చోట్ల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు జలమండలి రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూసీలోకి ప్రవేశిస్తున్న నీటిని శుద్ధి చేసిన అనంతరం ఎస్టీపీల నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ప్రతిపాదిత డ్యామ్కు తరలించి... అక్కడ విద్యుదుత్పత్తి చేయడం సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ రోజువారీగా ఉత్పత్తి చేసే 3 మెగావాట్ల విద్యుత్ను పవర్గ్రిడ్కు అనుసంధానిస్తే నగరంలోని స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి నీటి పంపింగ్ కేంద్రాలకు అవసరమైన విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు. త్వరలో సర్వే... మూసీలోకి సీజన్లో ప్రవహించే వరద ప్రవాహం, రోజువారీగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న మురుగు, ఎస్టీపీల వద్ద శుద్ధిచేస్తున్న నీటి పరిమాణం, హైకోర్టు-ఉస్మానియా ఆస్పత్రి సమీపంలో వంద అడుగుల ఎత్తున డ్యామ్ నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాఖల ఆధ్వర్యంలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మినీ విద్యుత్ కేంద్రం నెలకొల్పడంతో మూసీ నది ప్రక్షాళనతోపాటు, సుందరీకరణ ప్రక్రియ కూడా సాధ్యపడుతుందని.. ఈప్రాంతం ప్రముఖ పర్యాటక ప్రాంతంగానూ వెలుగొందుతుందనేది నిపుణుల అభిప్రాయం. -
మూసీ వాగులో చిక్కుకున్న యువకులు
నల్లగొండ : నల్లగొండ జిల్లా వాగులో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. సూర్యాపేట మండలం కాసరబాద వద్ద మూసీ వాగులో ఆదివారం సాయంత్రం రమేష్, యాదయ్య అనే యువకులు అనూహ్యంగా చిక్కుకుపోయారు. రక్షించాలంటూ యువకులు ఆర్తనాదాలు చేస్తున్నారు. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని.. అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
మూసీకి భారీ వరద
నల్లగొండ: ఈ ఫోటోలు చూశారా.. నీళ్లు చూస్తే.. నాగార్జున సాగర్.. శ్రీశైలం డ్యామ్ ని తలపిస్తోంది కదూ.. కానీ.. ఇది మూసీ ప్రాజెక్టు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ లోని మూసీ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని చేరింది. దీంతో అధికారులు బుధవారం ప్రాజెక్టు ఎనిమిది ఏడు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నగరంలోని వరద మొత్తం వచ్చి మూసీలో చేరుతుండటంతో.. నది మూడింతలు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లగొండ జిల్లా పెద్దరావులపల్లి వద్ద మూసీ నది నీరు రోడ్డుపైకి చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భట్టుగూడెం-పెద్దరావులపల్లి వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నదిపై ఉన్న వంతెనలు సరిగ్గా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి-పోచంపల్లి మధ్య వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భువనగిరి, బీబీ నగర్ లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో వైపు భట్టుగూడెం- పెద్దరావులపల్లి వంతెన పై వాహనాల అనుమతి నిరాకరించారు. మూసీ వరదల కారణంగా.. పోచంపల్లికి వెళ్లే దారులన్నీ బంద్ అయ్యాయి. మూసీ గేట్లు ఎత్తివేత.. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. గత వారంలో కురిసిన వర్షానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 644 అడుగులకు చేరగా.. రాత్రి నుంచి వస్తున్న భారీ వరదకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని దాటేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఏడు ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ మేరకు డ్యామ్ ఏఈ రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. కేతుపల్లి వద్ద మూసీనది కి 33 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే స్థాయిలో నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. -
వరదలో చిక్కుకున్న యువకుడు క్షేమం
-
మూసీలో యువకుడి గల్లంతు.. గాలింపు
మోత్కూరు(నల్గొండ జిల్లా): మోత్కూరు మండలం పొడిచేడు వద్ద మూసీ నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం మూసీ నదిలో ఈత కొడుతుండగా మునిగిపోయాడు. యువకుడు మోత్కూరు మండలం బాసారం గ్రామానికి చెందిన పొట్టపాక ఉపేందర్(25)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక ప్రణాళికలు'
హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలంగాణ ఐటీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కోసం కొత్త యంత్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రూ. 500 కోట్లతో హుస్సేన్ సాగర్ను మంచినీటి సరుస్సుగా మారుస్తామని తెలిపారు.