Navy
-
ఘోర ప్రమాదం.. జాలర్లను రక్షించిన సైన్యం
ముంబై: అరేబియా సముద్రంలో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం జాలర్లతో వెళ్లిన ఓ బోటు మంటల్లో చిక్కుకుంది. అయితే భారత సైన్యం సకాలంలో స్పందించడంతో అందులో ఉన్నవాళ్లంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.శుక్రవారం వేకువజామున రాయ్గఢ్ జిల్లా అక్షి అలీబాగ్ వద్ద సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగి బోటు నుంచి పొగ వస్తుండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. బోటులో చిక్కుకున్న జాలర్లను క్షేమంగా బయటకు తెచ్చాయి.బోటు 80 శాతం కాలిపోగా.. 20 మంది జాలర్లు ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బోటు సాాకరక్షి గ్రామానికి చెందిన రాకేష్ మూర్తికి చెందిందిగా నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానప్పటికీ. . షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.#WATCH | Maharashtra: The fishing boat of one Rakesh Gan caught fire 6-7 nautical miles from the coast in Raigad district in In Akshi Alibaug, around 3-4 am. Indian Coast Guard and Indian Navy rescued all 18 crew members from the boat safely: Raigad SP(Video: Raigad Police) pic.twitter.com/6f4MFm0aQn— ANI (@ANI) February 28, 2025अलीबाग में मछली पकड़ने वाली नाव में लगी आग...20 नाविकों को बचाने की कोशिश जारी... @lokmattimeseng @DGPMaharashtra #alibaug @RaigadPolice pic.twitter.com/1oEwgCFGSU— Visshal Singh (@VishooSingh) February 28, 2025 -
72 గంటలు గడిచినా ఇంకా దొరకని 8 మంది ఆచూకీ
-
భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!
సాహాసయాత్రలకు కేరాఫ్గా అడ్రస్గా నిలుస్తున్న మహిళా నేవి అధికారులు మరో అరుదైన సాహసాన్ని నమోదు చేశారు. సాహసమే ఊపిరిగా సాగిపోతున్న లెఫ్టినెంట్ కమాండర్(Lieutenant Commander) దిల్నా కే లెఫ్టినెంట్ కమాండర్ రూప ఏ చారిత్రాత్మక విజయ పరంపరను కొనగిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు నేవి అధికారులు నావికా సాగర్ పరిక్రమ II యాత్ర మూడవ దశలో భాగంగా శనివారం ఐఎన్ ఎస్ తరణిలో(INSV Tarini) దక్షిణ అమెరికా దక్షిణ కొన వద్ద ఉన్న కేప్ హార్న్(Cape Horn)ను దాటారని భారత నౌకాదళ ప్రకటించింది. ఆ ప్రాంతం చేరుకోవడానికి ఇద్దరు మహిళా నావిక అధికారులు డ్రేక్ సముద్ర మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి దక్షిణ అమెరికాకు దక్షిణంగా బహిరంగ సముద్ర మార్గం ఉనికిని నిర్థారించిన ఇంగ్లిష్ అన్వేషకుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు మీదగా ఆ మార్గానికి పేరు పెట్టారు. ఈ ప్రాంతం తీవ్రమైన గాలులు, ఎత్తైన అలలతో కూడిన అనూహ్య వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. పైగా ప్రమాదకరమైన జలమార్గం కూడా. ఇలాంటి ప్రదేశాన్ని అలవొకగా దాటి మరో విజయ ఢంకా మోగించారు. ఈ కేఫ్ హార్న్ అంటార్కిటికా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచు ఖండానికి దగ్గరగా ఉన్న భూభాగాల్లో ఒకటి ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే అసాధారణమైన నావిగేషన్ నైపుణ్యం తోపాటు దక్షిణ మహాసముద్రంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. కాగా, ఈ నావికా సాగర్ పరిక్రమ II అనేది శాస్త్రీయ అన్వేషణ, సహకారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపును ఇది. అలాగే మహిళా నేవి అధికారులు తమ ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా తదుపరి గమ్యస్థానం వైపు పురోగమిస్తారు. అంతేగాక ఈ మిషన్ లక్ష్యాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్తారు. ఈ అధికారులు సాహసయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యినట్లయితే ప్రపంచంలో తొలిసారిగా ఇద్దరు మహిళా నావికా అధికారులు ప్రపంచ ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసిన వ్యక్తులుగా నిలుస్తారు. In persistent rains, Sea State 5, winds of 40kns (~75 kmph) and waves more than 5 metres, Lt Cdr Dilna K & Lt Cdr Roopa A, recorded their names in the annals of history by successfully crossing the #CapeHorn located at the southern tip of #SouthAmerica, while sailing on the third… pic.twitter.com/N1isyvHGMA— SpokespersonNavy (@indiannavy) February 15, 2025 (చదవండి: ఇంజెంక్షన్ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?) -
మోనికా ఓ మై డార్లింగ్..!
ఢిల్లీ : మోనికా ఓ మై డార్లింగ్..! అంటూ ఇండియన్ నేవీ బృందం చేస్తున్న డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జనవరి 26న గణతంత్ర దినోవ్సత వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో విన్యాసాలు చేసేందుకు భారత నావికాదళం బృందం సభ్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఎర్రకోట ముందు రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ విరామ సమయంలో ఉత్సాహం, వినోదాన్ని జోడిస్తూ నేవీ బృందం మోనికా ఓ మై డార్లింగ్ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. రిపబ్లిక్ డే పరేడ్లో బ్యాండ్ వాయించే నేవీ గ్రూప్ సభ్యులు మోనికా ఓ మై డార్లింగ్ సాంగ్ రిథమ్కు తగ్గట్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం సంబంధిత వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. Monica oh my darling ❤️ pic.twitter.com/m5XVOeRNzG— Prayag (@theprayagtiwari) January 20, 20252022లో బాలీవుడ్లో వాసన్ బాల డైరెక్షన్లో రాజ్కుమార్రావు, హ్యుమాఖురేషి, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో మోనికా ఓ మై డార్లింగ్ సినిమా క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో అంచిత్ థక్కర్ నేపథ్య సంగీతం డిఫరెంట్గా ఉంది. ఓల్డ్ మెలోడీ థీమ్లో సాగే మ్యూజిక్ ఆయా సన్నివేశాలకు కొత్తదనం తెచ్చింది. నేవీ బృందం డ్యాన్స్ వేసింది కూడా ఈ సినిమాలోని పాటకే. -
సత్తా చాటిన నౌకాదళం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఆర్కె బీచ్ వేదికగా తూర్పు నౌకాదళం సత్తా చాటింది. శనివారం సాయంత్రం బీచ్ వద్ద నౌకాదళం చేసిన విన్యాసాలు నౌకా దళం పటిష్టతను, ప్రతిభా పాటవాలను చాటి చెప్పాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గంటన్నర పాటు భారత నావికా దళ సంపత్తిని ప్రస్ఫుటం చేస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు చేసిన యుద్ధ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.నౌకాదళం, మెరైన్ కమాండోలు ఒళ్లు గగుర్పొడిచేలా సాహసోపేతమైన విన్యాసాలు చేశారు. యుద్ధ సమయంలో నేవీ కమాండ్ స్పందించే విధానం చూపరుల్ని ఆకట్టుకుంది. ఆయిల్ రిగ్ను పేల్చివేయడం, 8 వేల అడుగుల నుంచి పారాచూట్లతో నిర్దేశిత ప్రాంతంలో మెరైన్ కమాండోలు దిగడం వంటివి ఆకట్టుకున్నాయి. డార్నియర్ హెలికాప్టర్, హాక్ జెట్ ఫైటర్లు, నౌకలపై నుంచి జరిపే ఫైరింగ్తో పాటు దేశీయంగా అభివృధ్ధి చేసిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరలో నిర్వహించిన లేజర్, డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. సముద్రంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో అందరినీ ఆకట్టుకున్నాయి. 8న పీఎంచే రైల్వే జోన్కు శంకుస్థాపన: చంద్రబాబునావికాదళం ధైర్యం, సామర్థ్యాలను, దక్షతకు నిదర్శనంగా ఈ విన్యాసాలు నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వేజోన్కి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఎన్టీపీసీ–జెన్కో సంయుక్తంగా దేశంలోని తొలి భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. విశాఖలో త్వరలో టీసీఎస్ ఏర్పాటు కానుందని, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు వస్తాయని, వచ్చే సంవత్సరం విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు.నేవీకి నగర ప్రజల సహకారం మరువలేనిది: తూర్పు నావికా దళాధిపతిఎటువంటి సవాళ్లనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ చెప్పారు. విశాఖ వేదికగా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సామాజిక సేవ, పర్యావరణ కార్యక్రమాలలో తూర్పు నావికాదళం భాగమవుతోందని అన్నారు. ఇటీవల నిర్వహించిన నేవీ మారథాన్లో 14 వేల మందికి పైగా ప్రజలు, 9 దేశాలకు చెందిన వారు పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారని చెప్పారు. తూర్పు నావికాదళానికి విశాఖ ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు మంత్రులు, అధికారులు, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తదితరులు హాజరయ్యారు. -
‘రక్షణ’లో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్నాథ్ వెల్లడించారు. త్రివిధ దళాల సంయుక్త కమాండ్ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది. 9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం→ సైబర్, స్పేస్తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట. -
‘నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ ‘అతి’ 14 మంది ప్రాణాలు తీసింది’
ముంబై : నేవి చెందిన బోటు నడిపే డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ముంబై సముద్ర తీరంలో జరిగిన పెను విషాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ముంబై సముద్ర తీరంలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ‘నీల్కమల్’ అనే ఫెర్రీ (పడవ) దాదాపు 100 మందికి పైగా పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోటు దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పాయారు.వారిలో తన అత్త ప్రాణాలు కోల్పోయిందని గౌరవ్ గుప్తా అనే యువకుడు విచారం వ్యక్తం చేశారు. ఫెర్రీ ప్రమాదం ఘటనలో సురక్షితంగా బయటపడ్డ గౌరవ్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇండియన్ నేవీ చెప్పినట్లుగా నేవీ బోటు ఇంజిన్లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరగలేదని, నేవీ బోటు డ్రైవర్ అత్యుత్సాహం వల్లే భారీ ప్రాణ నష్టం సంభవించిందని వాపోయాడు. ‘‘నేను పాల్ఘర్ జిల్లాలోని నలసోపరాకు కూరగాయాల వ్యాపారం చేస్తున్నా. గత వారం నా వివాహానానికి ముంబై నుంచి మా అత్త, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. వారికి ఎలిఫెంటా గుహలు చూపించేందుకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నుంచి పడవలో బయలుదేరాము. మా అత్తతో పాటు, ఇతర ప్రయాణికులకు అదే చివరి రోజవుతుందని అనుకోలేదు. ఎలిఫెంటా ద్వీపం వైపు వెళుతుండగా నేవీకి చెందిన స్పీడ్ బోట్ 5 నుండి 6 మంది సిబ్బందితో మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా పక్కకు వచ్చింది. ఆ సమయంలో నేవీ బోటు డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు అత్యుత్సాహం ప్రదర్శించారు. బోటును అటూ ఇటూ తిప్పుతూ ఫోజులు కొట్టారు. నేవీ డ్రైవర్ చేస్తున్న విన్యాసాల్ని తోటి ప్రయాణికులు వీడియోలు కూడా తీశారు. చివరికి మా బోటును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ ఆ బోటును మా బోటుకు వైపుకు వేగంగా దూసుకొచ్చాడు. ఓవర్ టేక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ స్పీడ్ బోటు.. మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా ఢీకొట్టింది. దీంతో 100 మంది ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగింది. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు మమ్మల్ని రక్షించాయి’’అని అన్నారు.#MumbaiBoatAccident - Live video "Today afternoon, an #IndianNavy craft lost control while undertaking engine trials in #Mumbai Harbour due to engine malfunction. As a result, the boat collided with a passenger #ferry which subsequently capsized (#BoatCapsized ).""13… pic.twitter.com/9ifLLurccP— Surya Reddy (@jsuryareddy) December 18, 2024 నేవీ బోటు ఇంజిన్లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం తలెత్తిందనే వాదనను గుప్తా ఖండించారు. ఫెర్రీని ఢీకొట్టడానికి ముందు నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ సంతోషంగా ఉన్నారు. తాము ప్రయాణిస్తున్న బోటు ఎదురుగా వచ్చే మా ముందు విన్యాసాలు చేశారు. నేవీ బోటులో ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తితే.. అలా ప్రయాణం చేయరు కదా? అంత వేగంగా స్పీడు బోటును ఎలా నడిపారు అని ప్రశ్నించారు. కాగా, ఫెర్రీ బోటు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్గార్డ్, మత్స్యకారుల సహాయక చర్యల్లో పాల్గొని 101 మందిని కాపాడాయి. -
దామగుండం రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాజ్నాథ్ (ఫొటోలు)
-
రాడార్ ప్రాజెక్ట్ పై అపోహలు వద్దు ఏదైనా ప్రమాదం ఉంటే..
-
దేశ భద్రతే మాకు ముఖ్యం
-
హైదరాబాద్కు ఆక్సిజన్ ఆగనున్నదా?
దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు. దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి. దీనితో పాటు ఈ రాడార్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమ స్యలు పొంచివున్నాయి. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే! ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.– మోతె రవికాంత్ ‘ సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అధ్యక్షులు -
15న నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డిని.. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ అధికారులు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో గురువారం ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.సీఎంతో పాటు అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖకు కూడా వారు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ మేరకు మంత్రిని ఆమె నివాసంలో వారు కలుసుకున్న సందర్భంగా.. సురేఖ మాట్లాడుతూ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజలకు ఈ స్టేషన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. దేశంలోనే రెండో రాడార్ స్టేషన్ కేంద్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
శక్తి: ఆటుపోట్లకు వెరవని ‘షి’జర్నీ
ప్రమాదాల సముద్రం మీద 8 నెలల పాటు ప్రపంచ దేశాలు తిరిగి రావడానికి ఇద్దరు సాహస నేవీ మహిళా అధికారులు దిల్నా, రూపా అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరారు. కేవలం వారిద్దరు మాత్రమే ఉండే ఈ సాహసభరిత యాత్రలో వారు తోడు తీసుకెళుతున్నవి ఏమిటి? వారికి తోడుండేవి ఏమిటి? ఇంత సాహసం చేసే వీరిని చూస్తే ప్రతి అమ్మాయిలోనూ కలగదా సముద్రమంత సాహస భావన!‘గమ్యం ఎలాగూ ముఖ్యమే. కాని ప్రయాణం కూడా ముఖ్యం. ఈ యాత్రలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి’ అని అక్టోబర్ 2న గోవాలో జెండా ఊపి భవిష్యత్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడనున్న ‘నావికా సాగర్ పరిక్రమ–2’ను ప్రారంభించారు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి. కేవలం ఇద్దరు మహిళా నేవీ ఆఫీసర్లు ఐఎన్ఎస్వి తారిణి పేరున్న సెయిల్ బోట్లో ఎనిమిది నెలల పాటు చేయనున్న ఈ సాహసయాత్ర విజయవంతం కావాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.ఐదు అంచెల యాత్రయాభై ఆరు అడుగుల ΄పొడవుండే సెయిల్ బోట్ తారిణిలో కమాండర్లు దిల్నా, రూప ఒకరికి ఒకరు తోడుగా నిలిచి మొత్తం 23000 నాటికల్ మైళ్లు అంటే 40000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరిన వీరు ఈ యాత్రను ఐదు భాగాలుగా చేస్తారు. ⇒ గోవా నుంచి ఆస్ట్రేలియా 2.ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ 3. న్యూజిల్యాండ్ నుంచి ఫాక్ల్యాండ్ ఐలాండ్స్ (దక్షిణ పసిఫిక్ సముద్రం) 4.ఫాక్ల్యాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా 5. సౌత్ ఆఫ్రికా నుంచి గోవా. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు సాగుతున్న ఈ యాత్ర కోసం తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా.కే వ్యవహరిస్తుండగా.. మరో లెఫ్టినెంట్ కమాండర్ రూపా సారథ్యం వహిస్తున్నారు.మైక్రోప్లాస్టిక్స్పై పరిశోధన‘నావికా సాగర్ పరిక్రమ–2’ మన స్త్రీ శక్తిని నిరూపించడానికే కాదు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’తో అనుసంధానమై సముద్రజలాల్లోని మైక్రోప్లాస్టిక్స్ను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడనుంది. అలాగే ‘వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’తో కలిసి సముద్రాలలోని పుష్పపత్రాలు, భారీ సముద్ర జీవులపై కూడా పరిశోధనకు అవసరమైన సమాచారం కూడా సేకరిస్తారు. వీటన్నింటికి వీలుగా ‘తారిణి’ని సిద్ధం చేశారు. ఈ బోట్ ముందు భాగంలో మాస్ట్సెయిల్స్ ఉంటాయి.వెనుక భాగంలో రెండు స్టీరింగ్ వీల్స్, ఆటో పైలట్ సిస్టమ్, నెలకు 20 జీబీ వినియోగించుకునే సౌకర్యంతో కూడిన శాటిలైట్ యాంటెన్నా ఉంటుంది. సముద్ర జలాల్ని శుద్ధి చేసి గంటకు 30 లీటర్లు మంచినీరు ఇవ్వగల ఆర్వో ప్లాంట్ అమర్చారు. అవసరమైన సందర్భాల్లో వినియోగించుకునేందుకు 22 తాళ్లను అందుబాటులో ఉంచారు. ల్యాప్టాప్లు, మ్యూజిక్ సిస్టం సైతం బోట్లో ఉన్నాయి. బోట్ తయారీలో అధికభాగం ఫైబర్ గ్లాస్ను ఉపయోగించారు. వీరి యాత్రను జీపీఎస్ విధానం ద్వారా ట్రాక్ చేస్తూ ప్రయాణం ఎలా సాగుతోందో భారత నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.సోదరి ఇచ్చిన పాండా బొమ్మతో ‘ప్రయాణం చేయడానికి భయం లేదని చెప్పడం లేదు. కానీ అంతకుమించిన ఆత్మ విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటుందని నా సోదరి పాన్పాన్ అని పిలుచుకునే పాండా బొమ్మ ఇచ్చింది. దీంతోపాటు ఖగోళశాస్త్రవేత్త కార్ల్సాగన్ రచించిన పుస్తకాలు తోడు తీసుకెళ్తున్నాను’ అంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఈ సందర్భంగా.అమ్మ చేసిన ఊరగాయలతో‘సముద్రం ఒక గొప్ప గురువు. మాకు సహనాన్ని నేర్పిస్తుంది. బోట్ను మనం మంచిగా చూసుకుంటే, అది మనల్ని మంచిగా చూసుకుంటుందనే సూత్రాన్నే పాటిస్తాను. తరిణిలో మేమే ఇంజినీర్లం, ఎలక్ట్రీషియన్లం, కార్పెంటర్లం. వాతావరణ నివేదికల్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి. ఎనిమిది నెలల పాటు తరిణిలోనే మా నివాసం కాబట్టి పుస్తకాలు తెచ్చుకున్నా. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, సంగీత వాద్య పరికరాలతోపాటు అమ్మ చేసిన ఊరగాయలు, కాలికట్ చిప్స్, టాపియోకా చిప్స్ తీసుకెళ్తున్నా. ఈ ప్రయాణం మొత్తానికి సరిపడా దోశల పిండి కూడా మా వెంట తీసుకువెళుతున్నాం. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ రూ΄పొందించిన ప్రత్యేకమైన ఆహారాన్ని మాకు అందుబాటులో ఉంచారు’ అని తెలిపింది లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా. వీరి యాత్ర సఫలం కావాలని కోరుకుందాం. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం -
ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!
భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్ మైళ్లు (23,335 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపా ఈ యాత్రకు పూనుకున్నారు. వారి ప్రయాణాన్ని చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. ఇద్దరు మహిళా అధికారులు వచ్చే ఏడాది మే నెలలో గోవాకు తిరిగివస్తారు. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వీరిద్దరూ ప్రయాణం ఆరంభించారు. సముద్రాల పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా వీరు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కేరళలోని కాలికట్లో జన్మించిన దిల్నా 2014లో, పుదుచ్చేరికి చెందిన రూపా 2017లో ఇండియన్ నేవీలో చేరారు. (చదవండి: భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..) -
దామగుండం.. రాడార్ గండం!
సాక్షి, హైదరాబాద్: దామగుండం.. అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్రెడ్డి హాజరవుతారని సమాచారం. ఔషధ మొక్కలకు నిలయం.. వందల ఏళ్ల ఆలయం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టు పచ్చని చెట్లతో జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు, పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా రామలింగేశ్వరుని కొలుస్తున్నారు. అడవి మధ్యలో దేవాలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. కాగా రాడార్ నిర్మాణం కోసం.. ఈ అడవుల్లోని 2,900 ఎకరాల భూమిని నావికాదళం అధికారులు స్వా«దీనం చేసుకోనున్నారు. అయితే ఈ క్రమంలో 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్కూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, పశు పక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక రాడార్ చుట్టూ కంచె వేస్తే తాము ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. తమ అడవిలో తాము పరాయివారిగా మారుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేమిటీ నేవీ రాడార్? నౌకలు, జలాంతర్గాముల (సబ్మెరైన్ల)తో సమాచార మార్పిడిని (కమ్యూనికేషన్) మెరుగుపరుచుకునేందుకు నావికాదళం వెరీ లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్లను నిర్మిస్తుంది. దామగుండం సముద్రమట్టానికి 460 మీటర్ల ఎత్తులో ఉన్నందున శత్రు దేశాల కళ్లు కప్పి సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో కట్ట»ొమ్మన్ రాడార్ స్టేషన్ మాత్రమే ఉంది. దీన్ని 1990లో నిర్మించారు. వాస్తవానికి దామగుండంలో రెండో స్టేషన్ నిర్మించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించినా ముందుకుసాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇందుకోసం తూర్పు నావికాదళానికి కావాల్సిన 2,900 ఎకరాల భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ఈ స్టేషన్ను 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ భావిస్తోంది. రాడార్ నిర్మాణంతో పాటు ఇక్కడ దాదాపు 3 వేల మంది నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. రేడియేషన్ ముప్పు ఉండదంటున్న శాస్త్రవేత్తలు సాధారణంగా రాడార్ వ్యవస్థ చాలా తక్కువ (3– 30 కిలోహెడ్జ్) రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. పైగా ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఉంటాయని, వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి జరుగుతుందని పేర్కొంటున్నారు. 12 లక్షల చెట్లు తొలగింపు అవాస్తవం! ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆటవీ శాఖ అధికారులు మాత్రం ఇది అవాస్తవం అంటున్నారు. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని చెబుతున్నారు. కేవలం 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు ఫారెస్టు శాఖ అంచనా వేస్తోంది. రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రదేశాల్లో మాత్రమే చెట్లను తొలగిస్తారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అరుదైన జాతులు కనుమరుగు దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో అడవుల్లో పచ్చదనం పోతుంది. అరుదైన జంతు జాతులు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షలాది చెట్లను నరికేయడం చాలా దారుణం. సమీపంలోని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించాలి. – రుచిత్ ఆశ కమల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకెవరూ సహకరించడం లేదు. అసలు రాడార్ స్టేషన్తో ఎలాంటి పరిణామాలు ఉంటాయో సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు కూడా లేరు. దీంతో అది నిర్మించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు. – పి.వెంకట్రెడ్డి, పూడూరు గ్రామవాసి -
భారత మత్స్యకారులను పట్టుకున్న శ్రీలంక
తమిళనాడు తీరంలో రెండు పవర్ బోట్లతో పాటు తొమ్మిది మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకుంది. ఆ మత్స్యకారులు భారత సరిహద్దు దాటి చేపల వేట సాగిస్తున్నారని శ్రీలంక ఆరోపిస్తోంది. 535 బోట్లలో మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మన్నార్లో చేపల వేటకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా విదేవిధంగా శ్రీలంక భారత జాలర్లను పట్టుకుంది.జూలై ఒకటిన రామేశ్వరం ద్వీపం సమీపంలోని పాల్క్ బే సముద్ర ప్రాంతంలో పాంబన్ నుంచి చేపల వేటకు వెళ్లిన 26 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక నావికాదళానికి చిక్కారు. గత నెలలోనే శ్రీలంక నావికాదళం తమ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో 18 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. మూడు మత్స్యకారుల బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికిముందు కూడా శ్రీలంక నేవీ నలుగురు భారతీయ జాలర్లను అరెస్టు చేసి, వారి పడవను స్వాధీనం చేసుకుంది.ఈ ఏడాది జనవరిలో శ్రీలంక నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు శ్రీలంక 180 మందికి పైగా భారత జాలర్లను అరెస్టు చేసింది. గత ఏడాది 240 నుంచి 245 మందిని అరెస్టు చేసిన నేపధ్యంలో భారత్-శ్రీలంక సంబంధాల్లో వివాదాలు తలెత్తాయి. -
ఎవరెస్ట్ కీ బేటీ
కుమార్తెను ప్రోత్సహించడానికి తండ్రి ఎవరెస్ట్లా నిలబడితే ఏ కుమారై్తనా ఎవరెస్ట్ను అధిరోహించడానికి వెనుకాడదు. ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యతన తండ్రితో కలిసి తొమ్మిదో ఏటనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తాకగలిగింది. ఇప్పుడు తండ్రిని తోడు చేసుకుని ఎవరెస్ట్నే అధిరోహించింది. ఎవరెస్ట్ను ఎక్కిన బాలికలలో ఈమెది రెండో చిన్న వయసు. కామ్య సాహసయాత్ర విశేషాలు.కొన్ని విజయాలు పుట్టుకతోనే నిర్థారితమవుతాయి. ముంబైలోని నేవీ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ తాజా ఘన విజయం చూస్తే ఆ మాటే అనాలనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో 6 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలన్నీ అధిరోహించిందామె. మే 20న ఎవరెస్ట్ అధిరోహణతో నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన రెండవ చిన్న వయసు మౌంటెనీర్గా, మన దేశం నుంచైతే మొట్ట మొదటి చిన్న వయసు మౌంటనీర్గా రికార్డ్ సృష్టించింది. దీని వెనుక కామ్య తండ్రి కార్తికేయన్ ఉన్నాడు. తల్లి లావణ్య ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఊహ తెలిసిన వెంటనే కనిపించిన సహ్యాద్రి పర్వతాలున్నాయి.మూడేళ్ల వయసు నుంచేకావ్య తండ్రి కార్తికేయన్ నేవీలో ఆఫీసర్. అతని ΄ోస్టింగ్ లోనావాలాలో ఉండగా కావ్యాకు మూడేళ్లు. వీకెండ్స్లో ఆమె తల్లిదండ్రులిద్దరూ సహ్యాద్రి పర్వతాల్లో విహారానికి కావ్యను తీసుకెళ్లేవారు. ఐదారేళ్లు వచ్చేసరికి సహ్యాద్రిలో ఆమె కాళ్లు పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ప్రకృతి కామ్యను ఆకర్షించింది. పర్వతాలు హద్దుల్లేని ప్రయాణం చేయమని స్ఫూర్తినిచ్చాయి. కామ్యలోని చురుకుదనాన్ని చూసి పర్వతారోహణలో ఆమెను ప్రోత్సహించాలని కార్తికేయన్ నిశ్చయించుకున్నాడు.మొదటి లిట్మస్ టెస్ట్కామ్యకు 9 ఏళ్ల వయసు ఉండగా కార్తికేయన్ ఆమెను పర్వతారోహణలో నిలదొక్కుకోగలదో లేదో పరీక్షించడానికి లదాఖ్ తీసుకెళ్లాడు. అక్కడి మౌంట్ స్టాక్ కంగ్రీని 6000 అడుగుల ఎత్తు మేర ఆమె అధిరోహించింది. ప్రతికూల వాతావరణంలో ఆ వయసులో ఆమె చేసిన అధిరోహణ కార్తికేయన్కు నమ్మకమిచ్చింది. దాంతో తన కూతురు చిన్న వయసులోనే అన్ని ఖండాల్లోని పర్వతాలు అధిరోహించాలని అతడుప్రోత్సహించాడు. కామ్య ఆ సవాలును స్వీకరించింది. అలా మొదలైంది వారి ‘సాహస్’ యాత్ర.7 ఖండాల సాహస్కామ్య ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన శిఖరాలన్నీ అధిరోహించాలని నిశ్చయించుకుంది. ఆ యాత్రకు ‘సాహస్’ అని పేరు పెట్టుకుంది. ‘అయితే అది అంత సులువైన పని కాదు. మానసికంగా శారీరకంగా వైద్యానికి స్పందించే విధంగా మన శరీరం మనసు ఉండాలి. అందుకని నేను రోజుకు ఆరు గంటలు సైక్లింగ్, రన్నింగ్ చేసేదాన్ని’ అని తెలిపింది కామ్య. తన సాహస యాత్ర మొదలెట్టే ముందు ప్రఖ్యాత పర్వతారోహకుడు ఎం.ఎస్. కోలిని కలిస్తే ‘పర్వతాలు ఎన్నో కథలను నీకు ఇస్తాయి. అవి జీవితాంతం గొప్పగా నీతో మిగులుతాయి. గో అహేడ్’ అని ఆశీర్వదించాడు. కామ్య ఆగలేదు. తండ్రితో పాటు 2017లో కిలిమంజారో (ఆఫ్రికా), ఆ తర్వాతి సంవత్సరం మౌంట్ ఎల్బ్రుస్ (యూరప్), ఆ తర్వాత మౌంట్ కోసియుస్కొ (ఆస్ట్రేలియా), మౌంట్ అకొంకగువా (సౌత్ అమెరికా), మౌంట్ డెనాలి (నార్త్ అమెరికా) అధిరోహించింది. మే 20న మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా) అధిరోహించడంతో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్ ఒక్కటే చేరడం మిగిలింది.ఎవరెస్ట్ అధిరోహణమే 20న ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరడానికి ఏప్రిల్ 6 నుంచి కామ్య, ఆమె తండ్రి కార్తికేయన్ ప్రయాణం మొదలైంది. అధిరోహించేది ఎవరెస్ట్ కనుక ట్రైనింగ్, షాపింగ్, ΄్యాకింగ్, ట్రావెల్ పకడ్బందీగా ΄్లాన్ చేసుకున్నారు. మొదట ఖట్మాండు చేరుకుని అక్కడి నుంచి విమానం ద్వారా లుక్లా ఎయిర్΄ోర్ట్కు చేరుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు ఇది మొదటి మజిలీ. అక్కడి నుంచి ఆరోహణ ్రపారంభించి ఫాక్డింగ్ (2610 మీటర్లు) నుంచి నామ్చే బజార్ (3440 మీటర్లు) చేరుకున్నారు. అక్కడ విరామం తీసుకున్నాక టెంగ్బోచె (3860 మీటర్లు)కు ట్రెక్ సాగింది. ఆ తర్వాత లొబొచె (4940 మీటర్లు) చేరుకుని ఆ తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్నారు. ఇక్కడ ఆక్సిజన్ పరికరాలు ఉపయోగిస్తూ పర్వతారోహణ ఎలా చేయాలో, పైకి కొనసాగే సమయంలో సేఫ్టీ పరికరాలు ఎలా ఉపయోగించాలో ట్రయినింగ్ తీసుకున్నారు. శిఖరాగ్రం చేరుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేక΄ోవడంతో మే 15 వరకూ బేస్ క్యాంప్లోనే ఉండాల్సి వచ్చింది. మే 15న బయలుదేరి మే 20 మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు కామ్య ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది. 8, 849 మీటర్ల ఎత్తు ఉన్న ఎవరెస్ట్ శిఖరంపైన తన తండ్రితో పాటు నిలబడి కామ్య తన విజయాన్ని ఆస్వాదించింది. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించింది. -
శెభాష్ కామ్య..!
జంషెడ్పూర్: కామ్య కార్తికేయన్. 16 ఏళ్లు. చదివేది ప్లస్టూ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి చిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలికగా కూడా నిలిచింది. ఈ నెల 20వ తేదీన తండ్రితో కలిసి ఆమె ఈ ఘనత సాధించినట్లు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్(టీఎస్ఏఎఫ్) గురువారం తెలిపింది. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డు సాధించేందుకు కామ్య మరో అడుగు దూరంలోనే ఉన్నట్లు టీఎస్ఏఎఫ్ చైర్మన్ చాణక్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమనే విషయం కామ్య రుజువు చేసిందని, సాహసికులకు ఆమె ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ఈ సంస్థే కామ్యకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఏప్రిల్ ఆరో తేదీన తన బృందంతోపాటు కఠ్మాండుకు చేరుకున్న కామ్య..పూర్తిస్థాయి సన్నద్ధతతో మే 16వ తేదీన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి తండ్రి కార్తికేయన్తోపాటు సాహసయాత్రను ప్రారంభించింది. తండ్రితో కలిసి మే 20వ తేదీన వేకువజామున 8,848 మీటర్ల ఎత్తయిన శిఖరంపైకి చేరుకుందని టీఎస్ఏఎఫ్ వివరించింది. తాజా విజయంతో ఆరు ఘనతలను సాధించిన కామ్య.. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలన్న ధ్యేయానికి కేవలం అడుగు దూరంలో నిలిచిందని వెస్టర్న్ నేవీ కమాండ్ ‘ఎక్స్’లో పేర్కొంది. ఏడో లక్ష్యమైన అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్ను వచ్చే డిసెంబర్లో అధిరోహించేందుకు సిద్ధమవుతున్న కామ్య.. ఈ అరుదైన ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర పుటల్లో నిలవాలని కోరుకుంటున్నట్లు వివరించింది.నేవీ కమాండర్ ఎస్.కార్తికేయన్ కుమార్తె కామ్య. ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో ప్లస్టూ చదువుకుంటోంది. పర్వతారోహణ అంటే కామ్యకు చిన్ననాటి నుంచే ఎంతో ఆసక్తి. ఏడో ఏటనే, 2015లో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశిల పర్వతాన్ని అధిరోహించి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016లో 13,500 అడుగుల ఎత్తున్న మరింత కఠినమైన హరి కీ దున్ను, కేదార్నాథ్ శిఖరాలను అవలీలగా ఎక్కింది. అదేవిధంగా, 16,400 అడుగుల ఎత్తులో రూప్కుండ్ సరస్సుకు చేరుకుంది. అసా ధారణ విజయాలను నమోదు చేసిన బాలల కిచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పుర స్కారం కూడా కామ్య అందుకుంది. 2017లో నేపాల్లోని 17,600 అడుగుల ఎత్తున ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు చేరుకుని ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.ఎవరెస్ట్ కీ బేటీ– ప్రత్యేక కథనం ఫ్యామిలీలో -
సైనిక హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి
కౌలాలంపూర్: మలేసియా ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని 10 మంది చనిపోయారు. ఉత్తర పెరాక్ రాష్ట్రంలోని నేవీ కేంద్రం సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వచ్చే నెలలో జరిగే నేవీ వార్షికోత్సవాల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా పదుల సంఖ్యలో హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తున్నాయి. ఆ సమయంలో ఒక హెలికాప్టర్ పక్కకు జరగడంతో దాని రెక్క పక్కనే వస్తున్న మరో హెలికాప్టర్ రోటార్ను తాకింది. దీంతో, రెండు హెలికాప్టర్లు ఢీకొని కుప్పకూలాయి. వాటిలో ఉన్న ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం పది మంది వైమానిక దళ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. -
గాల్లో నేవీ హెలికాఫ్టర్లు ఢీ.. 10 మంది దుర్మరణం
మలేషియాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లు గాల్లోనే ఒకదాంతో మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. రాయల్ మలేషియన్ నేవీ పరేడ్ కోసం మంగళవారం ఉదయం లుముత్ నేవల్ బేస్లో రిహాల్సల్ జరిగాయి. ఆ సమయంలో రెండు హెలికాఫ్టర్లు ఆకాశంలోనే ఢీ కొట్టాయి. ముక్కలైన శకలాలు కింద మైదానంలో పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రెండు హెలికాఫ్టర్లలో పది మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటించుకుంది. మృతదేహాల గుర్తింపునకు కోసం నేవీ ఆస్పత్రికి మృతదేహాల్ని తరలించినట్లు తెలిపింది. ⚡Ten people are reported killed as two military #helicopters had a mid-air collision in #Malaysia during preparations for a naval military parade. The incident occurred in the town of Lumut at around 9:30 am during a training to mark the 90th anniversary of the Royal… pic.twitter.com/OEF3SDNG6a — Shafek Koreshe (@shafeKoreshe) April 23, 2024 -
విశాఖలో అమెరికా నేవీ (ఫొటోలు)
-
త్రివిధ దళాల హోలీ వేడుకలు.. (ఫోటోలు)
-
జాయింట్ ఆపరేషన్ సూపర్ సక్సెస్
న్యూఢిల్లీ: కచ్చితమైన వ్యూహం, సైనిక దళాల మధ్య సరైన సమన్వయం, పటిష్టమైన ప్రణాళిక ఉంటే ఎలాంటి ఆపరేషన్ అయినా విజయవంతం కావాల్సిందే. భారత వైమానిక దళం, నావికాదళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్తో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయ్యింది. సోమాలియా పైరేట్లు మూడు నెలల క్రితం హైజాక్ చేసిన సరుకు రవాణా నౌక ‘ఎంవీ రూయెన్’ను భారత వైమానిక దళం, నావికాదళం జాయింట్ ఆపరేషన్ ద్వారా విజయవంతంగా విడిపించాయి. ఈ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను నావికాదళం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని విడిపించారు. నౌకలో రూ.8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నుల సరుకు ఉందని, నౌకను ఇండియాకు చేరుస్తున్నామని నావికాదళం వెల్లడించింది. ఎంవీ రూయెన్ షిప్ను సముద్రపు దొంగల చెర నుంచి విడిపించడంలో భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్)కు చెందిన సి–17 టాక్టికల్ రవాణా విమానం కీలకంగా వ్యవహరించింది. జాయింట్ ఆపరేషన్లో భాగంగా రెండు కాంబాట్ రబ్బరైజ్డ్ రైడింగ్ క్రాఫ్ట్(సీఆర్ఆర్సీ) బోట్లను, ‘మార్కోస్’ మెరైన్ కమాండోలను ఈ విమానం ద్వారా భారత తీరానికి 2,600 కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రంపైకి క్షేమంగా జారవిడిచారు. కమాండోలు అపూర్వమైన ధైర్యసాహసాలతో సముద్రపు దొంగలను లొంగదీసుకున్నారు. మొత్తం ఆపరేషన్ 40 గంటలపాటు జరిగింది. -
విశాఖ సముద్ర జలాల్లో ఒళ్లు గగుర్పొడిచేలా యుద్ధ విన్యాసాలు (ఫొటోలు)
-
Visakha: నేటి నుంచి ‘మిలాన్’ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సిద్ధమైంది. 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ మహా నగరం... తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్–2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొననున్నాయి. మిలాన్ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్ను ఈ నెల 22వ తేదీన ఆర్కే బీచ్లో నిర్వహించనున్నారు. ఈ పరేడ్కు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. మిలాన్–2024 విన్యాసాలను ‘కమరడెరీ(స్నేహం)–కొహెషన్ (ఐక్యత)–కొలాబరేషన్(సహకారం)’ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 11 ‘మిలాన్’లు.. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణం, స్నేహ పూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు శత్రు సైన్యాలకు తమ బలం, బలగం గురించి తెలియజేసేందుకు ‘మిలాన్’ పేరుతో 1955 నుంచి విన్యాసాలు నిర్వహిస్తున్నారు. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్, ఇండొనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ‘మిలాన్’లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా.. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించడం వల్ల ఈ విన్యాసాలు జరగలేదు. ఈ విన్యాసాల్లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో అనూహ్యంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2022లో విశాఖలో నిర్వహించిన విన్యాసాల్లో 35 దేశాలు పాల్గొనగా, 2023లో అండమాన్లో జరిగిన విన్యాసాల్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి ఏకంగా 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. సాగర తీరంలో వివిధ దేశాల నౌకాదళాల సందడి భారత నౌకాదళ ఆహ్వానం మేరకు మిలాన్–2024లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల నౌకాదళాలతో విశాఖ సాగర జలాలు కిటకిటలాడుతున్నాయి. భారత్తోపాటు యూఎస్ఏ, రష్యా, జపాన్, యూకే, ఆ్రస్టేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండొనేషియా, ఫ్రాన్స్, ఈజిప్్ట, శ్రీలంక, వియత్నాం, మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్, ఫిజీ, టోంగా, టోగో, పెరూ తదితర 50దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు విశాఖ చేరుకుంటున్నాయి. ఈ చరిత్రాత్మకమైన ఈవెంట్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ నగర ప్రజలకు తూర్పు నౌకాదళాధికారులు విజ్ఞప్తి చేశారు. మిలాన్–2024 కార్యక్రమాలు ఇలా... ♦ మొదటగా ఈ నెల 19 నుంచి 23 వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ♦ 19న తొలి రోజు ప్రీ సెయిల్ డిస్కషన్స్, టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ బ్రీఫింగ్స్, అతిథులకు ఐస్ బ్రేకర్ డిన్నర్ ఉంటాయి. ♦ 20న హెల్త్ ట్రెక్, ఆగ్రా, తాజ్మహాల్ సందర్శన, యంగ్ ఆఫీసర్ల ఆత్మీయ కలయిక ఉంటాయి. ఆర్కే బీచ్లో సిటీ పరేడ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. ♦ 21న క్రీడాపోటీలు, మేరీటైమ్ టెక్నికల్ ఎక్స్పో–2024 ప్రారం¿ోత్సవం, భారత యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విజిట్, ద్వైపాక్షిక విన్యాసాలు, వివిధ దేశాల ప్రతినిధుల సిటీ టూర్, మిలాన్ విన్యాసాలు ప్రారం¿ోత్సవం, మిలాన్ విలేజ్ ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయి. ♦ 22న అంతర్జాతీయ మేరీటైమ్ సెమినార్ ప్రారంభం, ప్రీసెయిల్ డిస్కషన్స్, సిటీ టూర్, ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ♦ 23న బుద్ధగయ పర్యటన, సిటీ టూర్తో హార్బర్ ఫేజ్ విన్యాసాలు ముగుస్తాయి. ♦ 24 నుంచి 27 వరకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, ఎయిర్క్రాఫ్ట్లు, సబ్మెరైన్స్తో సీఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ♦ 28న వివిధ దేశాల యుద్ధ నౌకల నిష్క్రమణ ♦ ఈసారి విన్యాసాల్లో భారత నౌకాదళానికి చెందిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. -
భారత్, ఖతార్ బంధం సుదృఢం
దోహా: భారత్, ఖతార్ దేశాల బంధం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఖతర్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి శిక్షలు పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్ పాలకునితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ ఎమీర్ను కలవడం అద్భుతం. ఇరుదేశాల మధ్య భిన్నరంగాల్లో విస్తృతస్తాయి సహకారానికి ఈ భేటీ బాటలు పరుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్, ఖతార్ సిద్ధంగా ఉన్నాయి’’ అని భేటీ తర్వాత మోదీ ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. నేవీ అధికారులను విడిచిపెట్టినందుకు థాంక్యూ ‘ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్ ఎమీర్కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులను వదిలిపెట్టినందుకు ఖతార్ ఎమీర్కు మోదీ థాంక్యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్లో పర్యటించాల్సిందిగా ఆయనను మోదీ ఆహా్వనించారు’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. -
పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ
ఢిల్లీ: ఇరాన్ ఫిషింగ్ నౌకను కాపాడిన తర్వాత భారత నౌకాదళం మరో ఆపరేషన్ చేపట్టింది. సోమాలియ దుండగుల దాడి నుంచి పాకిస్థాన్ నౌకను ఐఎన్ఎస్ యుద్ధనౌక సుమిత్రా రక్షించింది. అందులో ప్రయాణిస్తున్న 19 మంది పాకిస్థానీయులను కాపాడింది. అల్ నయీమి అనే పాకిస్థాన్కు చెందిన పిషింగ్ నౌకపై సామాలియాకు చెందిన 11 మంది దుండగులు దాడి చేశారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్థాన్కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. పాకిస్థాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజాకర్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. ఇరాన్కు చెందిన ఓ ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది సోమవారం రక్షించారు. ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ సుమిత్రా.. 17 మంది ఇరాన్ దేశస్థులను రక్షించారు. ఇదీ చదవండి: ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ -
Drone Attacks: భారత నేవీ కీలక నిర్ణయం
ముంబై: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ దాడులు జరుగుతుండడంతో ఇండియన్ నేవి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్ఎస్ వార్షిప్పులను రంగంలోకి దింపింది. వీటితో పాటు తీరంలో పెట్రోలింగ్ విమానాలతో నిఘా ఉంచనుంది. ‘ఇటీవల వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని మూడు వార్షిప్పులను పశ్చిమ తీరంలో గస్తీ కోసం రంగంలోకి దింపాం. వీటికి మిసైళ్లను, డ్రోన్లను అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉంది. ఇవి కాక లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ విమానాలు తీరం వెంబడి నిఘా పెడతాయి. కోస్ట్గార్డ్లతో సమన్వయం చేసుకుని పరిస్థితిని నిషితంగా పరిశీలిస్తున్నాం’ అని నేవీ వెస్టర్న్ కమాండ్ అధికారి ఒకరు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి భారత్లోని మంగళూరు వస్తున్న క్రూడాయిల్ నౌక కెమ్ ఫ్లూటోపై పోర్బందర్ తీరానికి 400 నాటికల్ మైళ్ల దూరంలో ఇటీవలే డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ ప్రటించడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత ఎర్ర సముద్రంలో మరో క్రూడాయిల్ నౌకపైనా డ్రోన్ దాడి జరిగింది. మరోవైపు దాడి తర్వాత ముంబై డాక్యార్డుకు చేరుకున్న కెమ్ ఫ్లూటోను ఫోరెన్సిక్ అధికారులు తనిఖీ చేశారు. ఇదీచదవండి..ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’ -
నేవీ షిప్పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
పాక్కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత?
చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నిర్వహించబోతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ కసరత్తుపై పాక్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు చైనాపైననే అధికంగా ఆధారపడుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్- 2023 నివేదిక ప్రకారం 80వ దశకంలో ఆఫ్ఘన్ జిహాద్ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అమెరికా నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసేది. అయితే 2005 నుండి 2015 వరకు పాకిస్తాన్.. చైనా నుండి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. గత 15 ఏళ్లలో పాకిస్తాన్కు చైనా 8,469 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అంతకుముందు గత 50 ఏళ్లలో, చైనా.. పాకిస్తాన్కు 8794 మిలియన్ డాలర్ల (ఒక మిటియన్ అంటే రూ. 10 లక్షలు) విలువైన ఆయుధాలను అందించింది. ఇంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం అమెరికా, రష్యా నుండి కూడా గరిష్ట సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంటుంది. 2015 నుండి పాకిస్తాన్ ఆయుధ అవసరాలలో 75 శాతం చైనా తీరుస్తుంది. 2021లో పాకిస్తాన్.. చైనా నుండి హై-టు-మీడియం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ మిసైల్ను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో చైనా ఫిరంగి, రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్తో కలసి నావికా విన్యాసాలు చేపట్టనున్న సందర్భంగా చైనా తన ఆరు నౌకలను అరేబియా సముద్రంలో దించనుంది. ఈ నౌకల్లో గైడెడ్ మిస్సైల్ జిబో, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ జింగ్జౌ, లిని ఉన్నాయి. ఇది కాకుండా రెండు షిప్బోర్న్ హెలికాప్టర్లలో నావికాదళ సిబ్బంది విన్యానాల్లో పాల్గొననున్నారు. అలాగే చైనా టైప్-093 సాంగ్ కేటగిరీకి చెందిన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెరైన్ను కూడా మోహరించినుంది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ తెలిపిన వివరాల ప్రకారం సీ గార్డియన్- 2023 నావికా విన్యాసాల ఉద్దేశ్యం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం. ఇది కూడా చదవండి: కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్కూ తప్పని ముప్పు? -
విశాఖ సాగరతీరంలో వైజాగ్ నేవీ మారథాన్ 2023 (ఫోటోలు)
-
వైజాగ్ నేవీ మారథాన్ విజేతలు శిఖంధర్, ఆశా
విశాఖ స్పోర్ట్స్: విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 8వ ఎడిషన్ ఓపెన్లో శిఖంధర్, మహిళల్లో ఆశా విజేతలుగా నిలిచారు. వైజాగ్ నేవీ మారథాన్ పరుగు సాగరతీరంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి అథ్లెట్లు విజయమే లక్ష్యంగా ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగుపెట్టారు. ఔత్సాహికులు సరదాగా ఐదు కిలోమీటర్ల మేర ఫన్ రన్ చేపట్టారు. ఫుల్ మారథాన్ 42.2 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రేస్ను నిర్వహించి విజేతలకు బహుమతులందించారు. మారథాన్ రేస్, ఫన్ పరుగు ఆర్కే బీచ్ మీదుగా నేవల్ కోస్టల్ బ్యాటరీ వైపు వద్ద యూటర్న్ తీసుకుని.. కాళీమాత ఆలయం మీదుగా వీఎంఆర్డీఏ ఎంజీఎం పార్క్ వద్దకు చేరుకోగానే ముగిసింది. పది కిలోమీటర్ల పరుగు తెన్నేటి వద్ద యూ టర్న్ తీసుకోగా, హాఫ్ మారథాన్ పరుగు వీరులు రుషికొండ గాయత్రి కళాశాల దగ్గర యూ టర్న్ తీసుకున్నారు. పూర్తి మారథాన్లో అథ్లెట్లు ఐఎన్ఎస్ కళింగ సమీపంలోని చేపాలుప్పాడ దగ్గర యూ టర్న్ తీసుకుని ప్రారంభస్థానానికి చేరుకున్నారు. వీఎంఆర్డీఏ పార్క్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల ఓపెన్ హాఫ్ మారథాన్లో దీపక్ కుంబార్, 10 కిలోమీటర్ల పరుగులో సోనుకుష్వా విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం హాఫ్ మారథాన్లో లిలియన్ రుట్టో, 10 కిలోమీటర్ల పరుగులో మేరీగ్రేస్ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. -
కుప్పకూలిన నేవీ హెలికాప్టర్: ఒకరు మృతి
కొచ్చి: భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేవల్ బేస్లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. కేరళలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్తో సహా ఇద్దరు గాయ పడగా, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది. INS చేతక్ హెలికాప్టర్ నౌకాదళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు వాదన. వీరి బెయిల్ పిటీషన్లను పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు సంచలనం రేపుతోంది. నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్కు అందించా రనేది వారి ఆరోపణ. ఖతార్ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను, ఖతార్కు చెందిన అంతర్జాతీయ సైనిక కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్ చేసింది. వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా జైల్లోనే ఉన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్ ఉన్నారు. -
మెగా మిలిటరీ విన్యాసాలకు సిద్ధమవుతున్న ఇండియన్ నేవీ
ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం, గ్లోబల్గా జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో భారతనౌకాదళం తొమ్మిది రోజులపాటు నావికా విన్యాసాలు చేపట్టనుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరేబియా మహాసముద్రంలో జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 50కి పైగా దేశాల భాగస్వామ్యం కానున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ విన్యాసాలు పెంచడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న 'మిలన్' విన్యాసాల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయని అధికారులు తెలిపారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ విన్యాసాల్లో భాగంగా అధునాతన వైమానిక రక్షణ కార్యకలాపాలు, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, యాంటీ-సర్ఫేస్ డ్రిల్లు ఉంటాయని సమాచారం. మిలన్ను 1995లో భారత నావికాదళం ప్రారంభించింది. 2022లో 39 దేశాలు ఈ మిలన్లో పాల్గొన్నాయి. -
ముగిసిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ నెల 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్కు ప్రాతినిధ్యం వహించగా.. రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల మధ్య భాగస్వామ్యం బలోపేతం చేయడం, సామర్థ్యాల్ని మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతోపాటు ఇండో– పసిఫిక్ సముద్ర జలాల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఈ త్రైపాక్షిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజున వ్యూహాత్మక విన్యాసాలు, క్రాస్డెక్ ఆపరేషన్స్, హెలికాప్టర్ల క్రాస్డెక్ ల్యాండింగ్ తదితర విన్యాసాలు నిర్వహించారు. -
విశాఖ వేదికగా మిలన్–2024
సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖపట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్–2024 నిర్వహించనుంది. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. మిలన్–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకాదళాలు పాల్గొనే అవకాశముందని చెప్పారు. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పెందార్కర్ను సీఎం జగన్ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్ ముఖ్యమంత్రికి ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిశోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1.55 లక్షల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ఇంటర్ సర్విసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు–2023పై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆర్మీలో 1.36 లక్షలు, నౌకాదళంలో 12,500, వైమానికదళంలో ఏడువేల ఖాళీలున్నాయని చెప్పారు. రక్షణ రంగంపై అమెరికా, చైనా ఏటా తమ జీడీపీలో 3.38 శాతం (801 బిలియన్ డాలర్లు), 1.74 శాతం (293 బిలియన్ డాలర్లు) ఖర్చుచేస్తుంటే భారత్ కేవలం 77 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చుచేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంపై చేస్తున్న వ్యయం క్రమంగా తగ్గిపోతోందని చెప్పారు. ఈ బిల్లుపై వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా మాట్లాడారు. ఏపీలో ఇంటి ముంగిటే ఫ్యామిలీ డాక్టర్ సేవలు ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటే వైద్యసేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకం కింద నెలకొలి్పన వెల్నెస్ సెంటర్లకు ఇద్దరేసి వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని, నెలలో రెండుసార్లు వెల్నెస్ సెంటర్లను సందర్శించి గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ స్కీంను కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్యశ్రీ యోజన పథకంతో జోడించి అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కీం కింద అర్హులైన మొత్తం 1.41 కోట్ల కుటుంబాల్లో 61.47 లక్షల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో హెల్త్ కవరేజ్ అందుతుండగా మిగిలిన 80.23 లక్షల కుటుంబాలకు కవరేజ్ను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తోందని చెప్పారు. హైవేలతో మేజర్ పోర్టుల అనుసంధానం ఏపీ సహా దేశంలోని మేజర్ పోర్టులన్నింటికీ జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ ఉందని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2022–23లో ఏపీలోని పోర్టులు 133.32 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసినట్లు చెప్పారు. ఏపీలోని నాలుగు పోర్టులు బొగ్గు, నాలుగు పోర్టులు ఎరువులు, ఒక పోర్టు సిమెంటు, రెండు పోర్టులు పెట్రోలియం, పెట్రోకెమికల్స్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో పవన విద్యుత్తు సామర్థ్యం ఆంధ్రప్రదేశ్లో భూతలానికి 120 మీటర్ల ఎత్తులో 74.90 గిగావాట్లు, 150 మీటర్ల ఎత్తులో 123.33 గిగావాట్ల పవన విద్యుత్తు సామర్థ్యం ఉందని కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్.కె.సింగ్.. వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్రావు ప్రశ్నకు జవాబిచ్చారు. 4,552.12 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం ఆంధ్రప్రదేశ్లో 4,552.12 మెగావాట్ల సౌరవిద్యుత్తు సామర్థ్యం ఉన్నట్లు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్.కె.సింగ్.. వైఎస్సార్సీపీ సభ్యుడు పరిమళ్నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2022–23లో ఏపీలో 8,140.72 మిలియన్ యూనిట్లు సౌరవిద్యుత్తు ఉత్పత్తి అయినట్లు తెలిపారు. ఏపీలో నాలుగు సోలార్పార్కులు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఆఫ్ సోలార్, అ్రల్టామెగా సోలార్ పవర్ ప్రాజెక్టు పథకంలో భాగంగా నాలుగుచోట్ల సోలార్పార్కులు ఏర్పాటు చేసినట్లు విద్యుత్శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 1,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అనంతపురం సోలార్ పార్కుకు రూ.244.80 కోట్లు, 1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కర్నూలు సోలార్ పార్కుకు రూ.200.25 కోట్లు, 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అనంతపురం–2 సోలార్ పార్కుకు రూ.91.24 కోట్లు, 1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న కడప సోలార్ పార్కుకు రూ.54.25 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. అనంతపురం, కర్నూలు సోలార్ పార్కులు పూర్తిస్థాయిలోను, అనంతపురం–2 పార్కులో 400 మెగావాట్లు, కడప సోలార్ పార్కులో 250 మెగావాట్ల సామర్థ్యం అమల్లో ఉన్నట్లు చెప్పారు. 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగిరి సోలార్ పార్కు టెండరింగ్ దశలో ఉందని తెలిపారు. ఏపీలో 6,68,833 సికిల్సెల్ వ్యాధి స్క్రీనింగ్ టెస్ట్ల లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో 2023–24లో 6,68,833 సికిల్సెల్ వ్యాధి స్క్రినింగ్ టెస్ట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి ఎస్.పి.సింగ్ భగేల్ తెలిపారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కళ్లు, ఎముకలు, మెదడు అవయవాలను ప్రభావితం చేస్తుందని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. విశాఖ ఉక్కు భూమిపై ఆర్ఐఎన్ఎల్కు పవర్ ఆఫ్ అటార్నీ విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్మెంట్ లావాదేవీకి రూపురేఖలు ఇంకా ఖరారు కాలేదని కేంద్ర ఆరి్థకశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కారడ్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన 19,703.10 ఎకరాల భూమిని కేంద్ర ఉక్కుశాఖ పేరిట సేకరించారని చెప్పారు. ఈ భూమిని వినియోగించుకోవడానికి ఆర్ఐఎన్ఎల్కు పవర్ ఆఫ్ అటార్నీ ఉందని తెలిపారు. -
అగ్నిపథ్ స్కీమ్లో కీలక మార్పులు.. అగ్నివీర్లకు గుడ్న్యూస్!
ఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని త్రివిధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వారిని అగ్నివీర్లు అని పిలుస్తున్నారు. అయితే, అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అగ్నివీర్లకు శుభవార్త అందించింది. వివరాల ప్రకారం.. అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అగ్నివీర్ల కాల పరిమతి, వయస్సును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యూలర్ క్యాడర్ తీసుకోనున్నారు. అయితే దీనిని 25 నుంచి 50 శాతంకు పెంచాలనే కేంద్రం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జూన్ 2022లో ప్రారంభించబడిన అగ్నిపథ్ స్కీమ్ కింద 17.5-21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. అయితే, సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రతీ ఏడాది దాదాపు 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 1.18 లక్షల మంది కావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్ -
‘విక్రాంత్’కు బెర్త్ ఎక్కడ?
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేలా భారత్ నిర్మించిన అత్యాధునిక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను కొద్ది నెలల కిందట ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో ఇది చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఔటర్ హార్బర్లో భారీ బెర్త్ను ఏర్పాటు చేసేందుకు నేవీ, పోర్టు సిద్ధమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : ఐఎన్ఎస్ విక్రాంత్.. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక యుద్ధ నౌక. అప్పట్లో ఉన్న విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంగా చెప్పుకోవచ్చు. విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. ఎయిర్క్రాఫ్ట్కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేయడం వల్ల అతి తక్కువ సమయంలో టేకాఫ్కు వీలవుతుంది. ఏ భాగం మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దీంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. కేరళలోని కొచ్చి షిప్యార్డ్లో రెండు వేల మంది షిప్యార్డ్ అధికారులు, సిబ్బంది, 13 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 42,800 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. విక్రాంత్ నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చయింది. త్వరలోనే తూర్పు నౌకాదళంలోకి.. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ కీలకంగా మారనుంది. విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ దీని సొంతం. అందుకే విక్రాంత్ను కీలకమైన తూర్పు నౌకాదళానికి కేటాయించాలని రక్షణ మంత్రిత్వ శాఖ ముందుగానే నిర్ణయించింది. రాత్రి సమయంలోనూ మిగ్ విమానాలు, ఇతర ఎయిర్క్రాఫ్ట్లు విక్రాంత్పై ల్యాండింగ్, టేకాఫ్లను ఇటీవలే విజయవంతంగా నిర్వహించాయి. మరోసారి కొచ్చి షిప్యార్డులో తుది ట్రయల్స్ నిర్వహించిన తర్వాత.. విశాఖకు విక్రాంత్ రానుంది. ఈ ఏడాది చివరిలోనైనా లేదా 2024 తొలి నాళ్లలోనైనా.. తూర్పు నౌకాదళం నుంచి రక్షణ బాధ్యతలు చేపట్టనుందని ఇటీవలే భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ స్పష్టం చేశారు. బెర్త్ మ్యాపింగ్లో బిజీబిజీ సాధారణ యుద్ధ విమానాల కంటే.. భారీగా ఉండే విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ కోసం ప్రత్యేక బెర్త్ అవసరమవుతుంది. ఇప్పటివరకు తూర్పు నౌకాదళంలో 105 మీటర్ల పొడవు ఉన్న యుద్ధ నౌకలే అతి పెద్దవిగా ఉన్నాయి. వీటికి రెట్టింపు పొడవుతో విక్రాంత్ తయారైంది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో విక్రాంత్ నిర్మించారు. 14 అంతస్తులున్న ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో మొత్తం 2,300 కంపార్ట్మెంట్లున్నాయి. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోయే విక్రాంత్ను విశాఖలో ఎక్కడ బెర్తింగ్ చేయాలన్న దానిపై తూర్పు నౌకాదళాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. భారీ బెర్త్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ, తూర్పు నౌకాదళం పక్కపక్కనే ఉండటంతో ఎలాంటి భద్రతా లోపం లేకుండా.. విక్రాంత్ కోసం ప్రత్యేక బెర్త్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పోర్టు చైర్మన్ డా.అంగముత్తుతో ఇటీవలే తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమావేశమై చర్చించారు. ఔటర్ హార్బర్లోని ఓ బెర్త్ను విస్తరించి.. ప్రత్యేకంగా విక్రాంత్కు కేటాయించాలని భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు, మ్యాపింగ్ సిద్ధం చేసే పనిలో నౌకాదళాధికారులు తలమునకలయ్యారు. మరో రెండు నెలల్లో దీనికి సంబంఽధించిన రూట్ మ్యాప్ సిద్ధమయ్యాక.. రక్షణ మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అనుమతులు మంజూరైన వెంటనే.. పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. -
ప్రపంచంలోని టాప్ 10 నౌకాదళాలు
-
రక్షణ వలయంలో శ్రీనగర్
శ్రీనగర్: శ్రీనగర్లో నేటి నుంచి జీ–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఉగ్ర బెడద నేపథ్యంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తత ప్రకటించాయి. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్(ఎన్ఎస్జీ) కౌంటర్ డ్రోన్ బృందాలు గగనతలంపై కన్నేసి ఉంచాయి. సుందర దాల్ సరస్సుపై నేవీ మెరైన్ కమాండోలు గస్తీ చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరింపులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి. వివిధ దేశాల నుంచి హాజరయ్యే 60 మంది ప్రతినిధులు, 20 మంది జర్నలిస్టుల కోసం సమావేశాల వేదికైన షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ) వద్ద యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమిది. దీంతో, సమావేశ వేదికతోపాటు, వారు బస చేసే ప్రాంతం, ఆ పక్కనే ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణిపై ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు. ఉగ్రమూకలు ఐఈడీలతో విధ్వంసానికి పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషేమొహ్మద్కు చెందిన ఓ వ్యక్తిని ఆదివారం కుప్వారా జిల్లాలో సోదాల సమయంలో బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం కదలికల సమాచారాన్ని అతడు పాక్కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. పూంఛ్లో సరిహద్దులకు సమీపంలో మెంధార్ సెక్టార్ వద్ద అనుమానాస్పద కదలికలతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సోదాలు పూర్తయ్యేదాకా ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రజలను అధికారులు కోరారు. -
లంక నావికాదళం ఓవరాక్షన్.. సీఎం స్టాలిన్ ఫైర్
సాక్షి, చైన్నె: శ్రీలంక సేనలు తగ్గడం లేదు. మళ్లీ తమిళ జాలర్లపై దాడి చేశారు. ఈ ఘటన తమిళ జాలర్లలో ఆగ్రహాన్ని రేపింది. ఈనెలలో ఇప్పటికే రెండుసార్లు తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీఎం స్టాలిన్ సైతం తీవ్రంగా పరిగణించారు. దాడులు కట్టడి చేయాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయ శంకర్కు లేఖ కూడా రాశారు. అలాగే శ్రీలంక నావికాదళంపై వేదారణ్యం మైరెన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినా, తాము తగ్గేది లేదన్నట్టు శ్రీలంక సేనలు వ్యవహరిస్తున్నారు. కారైక్కాల్కు చెందిన అంజప్పర్ పడవలో మైలాడుతురైకు చెందిన 11 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారు. శనివారం రాత్రి కోడికరై వద్ద వేటలో ఉన్న వీరిపై శ్రీలంక సేనలు విరుచుకుపడ్డారు. వలలు, జీపీఎస్ తదితర పరికరాలను స్వాఽధీనం చేసుకున్నారు. అలాగే, సముద్రంలో దూకమని చెప్పి జాలర్లను చిత్రహింసలకు గురిచేశారు. సముద్రంలో ఈదుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జాలర్లు వేదనపడగా, శ్రీలంక సేనలు అనందించి వెళ్లారు. ఆ సేనలు వెళ్లడంతో అతి కష్టంపై ఒడ్డుకు చేరుకున్న జాలర్లు మత్స్యశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై జరిగిన దాడిని జాలర్ల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. శ్రీలంక సేనలు రోజురోజుకు విరుచుకుపడుతుండడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. -
షీ ఈజ్ అన్స్టాపబుల్
నేవీ వెల్నెస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని, నౌకాదళానికి చెందిన వివిధ విభాగాల మహిళలు ‘షీ ఈజ్ అన్స్టాపబుల్’ నినాదంతో ఈ నెల 14న దిల్లీలోని వార్ మెమోరియల్ నుంచి కారు యాత్ర చేపట్టారు. వివిధ నగరాల గుండా సాగిన ఈ కారు యాత్ర మహిళా యోధుల విజయాలను ప్రచారం చేస్తోంది. జైపూర్లోని ఒక కళాశాలలో... నావికా దళానికి చెందిన పాయల్ గుప్తా వికాస్ శ్రేయాన్, కుషాల్ పండేకర్లు గోవా నుంచి పోర్ట్ లూయిస్ (ఈస్ట్ ఆఫ్రికా) వరకు చేసిన సంచలన సముద్ర యాత్ర గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. వాతావరణ పరిస్థితులను తట్టుకొని 21 రోజుల పాటు 4.500 కి.మీ నాస్స్టాప్గా సాగిన ఈ సాహస సముద్రయాత్ర గురించి విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు నేవీలో చేరడానికి అవసరమైన విద్యార్హతల గురించి ఆసక్తిగా అడిగారు. బికనేర్లోని ఒక స్కూల్లో... లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి నేతృత్వంలో లెఫ్టినెంట్ కమాండర్లు ప్రతిభ జమ్వాల్, స్వాతి, విజయాదేవి, ఐశ్వర్య, పాయల్గుప్తాలు దేశీయంగా తయారుచేసిన ఐఎన్ఎస్వీ తరిణి నౌక ద్వారా వివిధ దేశాలు చుట్టి వచ్చిన ‘నావికా సాగర్ పరిక్రమ’ గురించి ‘షీ ఈజ్ అన్స్టాపబుల్’ బృందం చెప్పింది విన్న తరువాత విద్యార్థులు చప్పట్లు కొట్టారు. తమకు కూడా అలాంటి సాహసాలు చేయాలని ఉందని మనసులో మాట చె΄్పారు. నావికాదళానికి సంబంధించి మహిళల సాహసగాథలు మాత్రమే కాకుండా అలనాటి స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను చెప్పి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గుర్తు తెచ్చుకుంది ఈ బృందం. ఇలా ఎన్నో పట్టణాలలో స్కూల్, కాలేజీ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి నావికాదళ ప్రాముఖ్యత, నావికాదళంలో ఉద్యోగావకాశాల గురించి తెలియజేయడం మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాస కోణంలో ఈ బృందం సభ్యులు స్ఫూర్తిదాయకమై ఉపన్యాసాలు ఇచ్చారు. లైఫ్స్కిల్స్ గురించి వారికి అర్థమయ్యే భాషలో వివరించారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలను సందర్శించి అక్కడ ఉంటున్న వారితో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళల సముద్ర సాహసయాత్రలు ఆయా కాలాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ఆ యాత్రలలో ఎన్నో కథలు దాగున్నాయి. శక్తిమంతమైన స్ఫూర్తి ఉంది. వీటిని ప్రజలకు చేరువ చేయడం ‘షీ ఈజ్ అస్స్టాపబుల్’ యాత్ర ముఖ్య ఉద్దేశం. వచ్చిన స్పందన చూస్తే యాత్ర ఉద్దేశం నెరవేరిందని చెప్పవచ్చు. ‘నారీశక్తి స్ఫూర్తిని ప్రజల చెంతకు తీసుకువెళ్లడానికి, నావికాదళంలో చేరాలనే ఉత్సాహాన్ని యువతలో కలిగించడానికి ఈ యాత్ర ఉపయోగపడింది’ అంటున్నారు వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. 2,300 కి.మీల ఈ ఆల్–ఉమెన్ కారు యాత్ర ఈరోజు దిల్లీలో ముగుస్తుంది. -
వైజాగ్ లో ఘనంగా ముగిసిన నేవీ డే వేడుకలు
-
ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు
-
నేవి డే వేడుకులకు విశాఖ సర్వం సిద్ధం
-
అస్త్ర పరీక్షల కేంద్రంగా విశాఖ
నౌకాదళ ఆయుధ పరీక్షలకు విశాఖ కేంద్ర బిందువుగా మారనుంది. ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలో విశాఖలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే క్షిపణులు, రాకెట్ల పరీక్షా కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమవుతోంది. భారీ టార్పెడోల పరీక్షలకూ ఈ కేంద్రాన్ని వినియోగించుకునే వీలుంది. తీర ప్రాంత రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్సీ (ఈస్ట్రన్ నేవల్ కమాండ్) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. భీమిలిలో క్షిపణులు, రాకెట్ల పరీక్ష కేంద్రం ఇప్పటికే యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల స్థావరంగా ఉన్న విశాఖ తీరం తాజాగా మరో రెండు ముఖ్యమైన రక్షణ వ్యవస్థలకు కేంద్రంగా మారుతోంది. దేశంలోనే తొలిసారిగా భారీ టార్పెడోలు, అండర్ వాటర్ వెపన్స్ పరీక్ష కేంద్రాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) నిర్మించనుంది. భీమిలిలో అన్ని రకాల క్షిపణులు, రాకెట్లను పరీక్షించే కేంద్రం ఏర్పాటుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్గుప్తా ఇటీవల శంకుస్థాపన చేశారు. రెండు టన్నుల భారీ టార్పెడోలను సైతం... గత జూలైలో గుజరాత్ తీరంలోని భారత సముద్ర జలాల పరిధిలోకి పాకిస్థాన్కు చెందిన యుద్ధనౌక (పీఎన్ఎస్ అలంగీర్) చొచ్చుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మన నౌకాదళాలు వెంటనే గుర్తించడంతో పాకిస్థాన్ పాచికలు పారలేదు. మహారాష్ట్ర తీర ప్రాంతంలో కూడా ఓ విదేశీ చిన్న పడవ ఆయుధాలతో వచ్చింది. అయితే అది ఆస్ట్రేలియన్ దంపతులదని తేలింది. తీర రక్షణ ఎంత కీలకమన్న విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు నౌకాదళ కేంద్రంగా ఉన్న విశాఖ తీరంలో ఎన్విరాన్మెంటల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు బాధ్యతను ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా బీడీఎల్కు అప్పగించారు. ఇప్పటికే టార్పెడోలు, అండర్ వాటర్ వెపన్స్ తయారీ యూనిట్ను భారత్ డైనమిక్స్ విశాఖలోనే ఏర్పాటు చేసింది. అయితే వాటిని పరీక్షించే కేంద్రం లేకపోవడంతో దాన్ని కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని నౌకాదళం నిర్ణయించింది. దీనిలో భాగంగా 8 మీటర్ల పొడవు, 2 టన్నుల బరువైన భారీ టార్పెడోల్ని సైతం ఈ టెస్టింగ్ సెంటర్లో పరీక్షించేలా అత్యాధునిక వైబ్రేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. థర్మల్ చాంబర్, వాకింగ్ చాంబర్లను ఏర్పాటు చేసి అండర్ వాటర్ వెపన్స్నూ అణువణువూ పరీక్షించేలా యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం వైబ్రేషన్ టెస్ట్లతో పాటు పర్యావరణహిత పరీక్షలు కూడా ఇందులో నిర్వహించేలా ఏర్పాటవుతున్న ఈ పరీక్ష కేంద్రం నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో అండర్వాటర్ వెపన్స్, టార్పెడోల్ని మిత్ర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. క్రమంగా టార్పెడోలతో పాటు ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఆయుధాలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్నూ ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంటుందని ఈ సందర్భంగా నౌకాదళాధికారులు భావిస్తున్నారు. ఇతర ప్రయోగాలకూ వేదికగా భీమిలి సముద్ర గర్భంలో ఆయుధాలతో పాటు రాకెట్లు, క్షిపణులనూ పరీక్షించేందుకు వీలుగా భీమిలిలో స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటవుతోంది. ఐఎన్ఎస్ కళింగ సమీపంలోని కన్స్ట్రక్షన్ ఆఫ్ నేవల్ ఆర్న్మెంట్ టెస్టింగ్ కాంప్లెక్స్(సీఎన్ఏఐ)– ఈస్ట్ కాంప్లెక్స్లో దీన్ని నిర్మించేందుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్దాస్ గుప్తా కొద్దిరోజుల కిందట శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4.40 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. అన్ని రకాల క్షిపణులు, రాకెట్లను పరీక్షించడంతో పాటు వాటి జీవితకాలాన్ని పొడిగించేలా మార్పులు, ఇతర ప్రయోగాలకు వేదికగా భీమిలి మారనుంది. ఏర్పాటైన సంవత్సరం – 1968 మార్చి 1 కమాండింగ్ ఇన్ చీఫ్ – త్రీ స్టార్ ఫ్లాగ్ ఆఫీసర్ (వైస్ అడ్మిరల్ ర్యాంక్) ప్రస్తుత వైస్ అడ్మిరల్ – బిస్వజిత్ దాస్గుప్తా బలం – 58 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు ఫ్లాగ్ షిప్ – ఐఎన్ఎస్ జలశ్వ ఈఎన్సీ పరిధిలో నేవల్ బేస్లు – 15 విశాఖలో నేవల్ బేస్లు – 8 కొత్తగా నిర్మిస్తున్న నేవల్ బేస్లు – విశాఖలో–1, ఒడిశాలో 2 తూర్పు నౌకాదళం సిబ్బంది, అధికారులు – సుమారు 40,500 మంది (కె.జి.రాఘవేంద్రారెడ్డి – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) -
Agnipath Scheme: అగ్నిపథ్పై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు అగ్నిపథ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డీఎంఏ అడిషన్ సెక్రటరీ అనిల్పురి మాట్లాడుతూ.. ‘‘అగ్నిపథ్పై రెండేళ్లుగా అధ్యయం చేశాము. అగ్నిపథ్పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారు. 1989 నుంచి అగ్నిపథ్ పెండింగ్లో ఉంది. సగటు వయస్సును తగ్గించేందుకు సంస్కరణలు తీసుకువచ్చాము. సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే లక్ష్యం. ఆర్మీలోకి వచ్చి వెళ్లేందుకు చాలా అవకాశాలు కల్పించాము. మా కంటే ఇప్పడున్న యువత చాలా శక్తివంతమైనది. సెల్ఫోన్లు, డ్రోన్లతో యువత అద్భుతాలు చేస్తున్నారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుంది. ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించాము. అగ్నివీర్లు సైన్యంలో కొనసాగే వీలుంది. 'అగ్నివీర్స్' దేశ సేవలో తన జీవితాన్ని త్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం అందుతుంది. ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్ల నియామకం చేపడుతున్నాము. వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్మెంట్ సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతాం. భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుంది. అగ్నివీర్లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయి. ఆందోళనలకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ నెల ఎయిర్ఫోర్స్లో 24 నుంచి తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్-1 ఆన్లైన్ టెస్టు ఉంటుంది. డిసెంబర్ 30 నాటికి తొలిబ్యాచ్ ట్రైనింగ్కు వెళ్తారు. త్రివిధ దళాల్లో ఇకపై సాధారణ నియామకాలు ఉండవు. అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు జరుగుతాయి. సైన్యానికి క్రమశిక్షణ తప్పనసరి. విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటులేదు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దు. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదు. త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదు ’’ అని వ్యాఖ్యానించారు. 'Agniveers' will get a compensation for Rs 1 crore if he sacrifices his life in service of the nation: Lt Gen Anil Puri https://t.co/p4navR0VRZ pic.twitter.com/Z9Pj58L9Ew — ANI (@ANI) June 19, 2022 -
అగ్నిపథ్: ఆర్మీ రిటైర్డ్ జనరల్స్ సూచనలు ఇవే..
అగ్నిపథ్ పథకంపై రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వా లన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కేంద్రం ఏం చెప్పినా నిరాశలో ఉన్న యువత వినే పరిస్థితి లేదు. వారి అసంతృప్తిన చల్లార్చేలా పథకానికి చేయాల్సిన మార్పుచేర్పులను రిటైర్డ్ ఆర్మీ నిపుణులు ఇలా సూచిస్తున్నారు. కాలపరిమితి 12 ఏళ్లకు పెంచాలి అగ్నివీరులకు ప్రస్తుతం పేర్కొన్న నాలుగేళ్ల కాలపరిమితిని కనీసం 10 నుంచి 12 ఏళ్లకు పెంచాలని రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రఫుల్ భక్షి సూచించారు. ‘‘అప్పుడే సైన్యంలో చేరి సేవ చేసేందుకు యువత ముందుకొస్తుంది. పైగా కార్గిల్ వంటి యుద్ధాల్లో సత్తా చాటాలంటే 10–12 ఏళ్లయినా సైన్యంలో చేసి ఉండాలి. అదీగాక కేవలం ఆరు నెలల శిక్షణ కాలం అస్సలు చాలదు. నాలుగేళ్ల సర్వీసంటే గణతంత్ర పెరేడ్లలో పాల్గొనడానికే పనికొస్తారు’’ అన్నారు. సగం మందినైనా పర్మినెంట్ చేయాలి 25 శాతం మందినే పరి్మనెంట్ చేయడం సబబు కాదని మేజర్ జనరల్ (రిటైర్డ్) బిఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. ‘‘50 శాతానికైనా పెంచితే మేలు. మిగతా వారికి సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగాల్లో ఉద్యోగ హామీ ఇవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి’’ అని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలి అగ్నిపథ్పై భయాందోళనలు నెలకొనడంతో తొలుత కొన్ని రెజిమెంట్లలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, సాదక బాధకాలన్నీ తెలిసొచ్చాక అవసరమైన మార్పుచేర్పులతో పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని లెఫ్ట్నెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘కేవలం నాలుగేళ్ల ఉద్యోగానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఎందుకంత రిస్క్ తీసుకుంటారు?’’ అని ఆయనన్నారు. పథకాన్ని సమగ్రంగా ఆలోచించి రూపొందించినట్టు కనిపించడం లేదు. కనుక పైలెట్ ప్రాజెక్టుగా తెచ్చే ముందు కూడా మరిన్ని చర్చలు తప్పనిసరి’’ అన్నారు. మరింత చర్చ తప్పనిసరి పథకంపై మరింతగా చర్చ తప్పనిసరని బీఎస్ఎఫ్ మాజీ ఏడీజీ సంజీవ్ సూద్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల సరీ్వసు తర్వాత 75 శాతం మందిని ఇంటికి పంపేయడం పథకంలో ప్రధాన లోపమన్నారు. ఇలా ఏటా లక్షల్లో యువకులు సాయుధ బలగాలను వీడితే వారి భవిష్యత్తుతో పాటు దేశ రక్షణా ప్రమాదంలో పడుతుంది. ‘‘ఇంతమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఇతరత్రా ఉద్యోగాలెలా కల్పిస్తారు? పైగా కేవలం 6 నెలల శిక్షణతో మూడున్నరేళ్లకు సరీ్వసుకు తీసుకుంటే ఏ జవానూ పూర్తి సామర్థ్యంతో పని చేయలేడు’’ అన్నారు. పథకాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడమో, కొన్ని బెటాలియన్లలో పైలెట్గా చేపట్టడమో చేయాలని సూచించారు. సైనిక నియామకాలు.. ఏ దేశాల్లో ఎలా? అమెరికా అగ్రరాజ్యంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే. సైనికులు నాలుగేళ్లు విధుల్లో ఉంటారు. తర్వాత మరో నాలుగేళ్లు వారిని రిజర్వ్లో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. నాలుగేళ్లలో ప్రతిభ కనబరిచి మిలటరీనే వృత్తిగా తీసుకొని 20 ఏళ్లు సేవలందించిన వారికి మాత్రమే పింఛను, ఇతర భత్యాలుంటాయి. చైనా డ్రాగన్ దేశంలో నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవాళ్లంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరి రెండేళ్లు విధిగా పని చేయాలి. పూర్తికాలం సైనికులుగా చేసి రిటైరైన వారికి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి డిస్కౌంట్తో రుణాలు, పన్ను రాయితీలు ఇస్తారు. ఫ్రాన్స్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ముందు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి క్రమంగా ఐదేళ్ల దాకా పొడిగిస్తారు. 19 ఏళ్లు సరీ్వసులో ఉంటే పెన్షన్ ఇస్తారు. రష్యా సైన్యంలో నియామకాలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. నిర్బంధ, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలుంటాయి. నిర్బంధంగా చేరిన వారికి ఏడాది శిక్షణ, ఏడాది సరీ్వసు ఉంటుంది. తర్వాత వారు రిజర్వ్లో ఉంటారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న సైనికులకు కాంట్రాక్ట్ ముగిశాక సైనిక విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కలి్పస్తారు. ఇజ్రాయెల్ పురుషులతో పాటు మహిళలు కూడా నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిం దే. మగవారు 32 నెలలు, మహిళలు 24 నెలలు పని చేయాలి. వీరిలో 10% మందిని పూర్తి స్థాయి సైనికులుగా నియమిస్తారు. ఏడేళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారు 12 ఏళ్లు పదవిలో ఉంటారు. వారికే పెన్షన్ అందుతుంది. పాకిస్తాన్ నియామకాలు స్వచ్ఛందమే. 17–25 ఏళ్ల వారిని పోటీ పరీక్షల ద్వారా తీసుకుంటారు. పూర్తికాలం పని చేసిన వారికే పెన్షన్, ఇతర భత్యాలు. కొందరిని రిజర్వ్లో ఉంచుతారు. వారికి బెనిఫిట్సేమీ ఉండవు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. ఆర్మీలో చేరే వారు తప్పక తెలుసుకోండి
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. ‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది. దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు అమల్లో ఉన్నాయి. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)గా కూడా పిలిచే అగ్నిపథ్కు వచ్చే ఆదరణను బట్టి వీటితో పాటు ప్రస్తుత నియామక పద్ధతులన్నింటినీ నిలిపేస్తారని సమాచారం. కొత్త శకానికి నాంది: త్రివిధ దళాధిపతులు త్రివిధ దళాల్లో మానవ వనరుల విధానంలో కొత్త శకానికి అగ్నిపథ్ నాంది పలుకుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పథకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. దీనిపై త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సైనిక నియామక ప్రక్రియలో సమూల మార్పులకు అగ్నిపథ్ శ్రీకారం చుట్టనుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ‘‘భవిష్యత్తు సవాళ్లకు సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచడంలో, సైన్యం సగటు వయసును ప్రస్తుత 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గించడంలో అగ్నిపథ్ ప్రధాన పాత్ర పోషించనుంది’’ అన్నారు. కొత్త నియామకాల్లో అర్హత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. సైన్యం పనితీరు, సామర్థ్యం, సరిహద్దుల వెంబడి సన్నద్ధత తదితరాలను యథాతథంగా కొనసాగిస్తామని వివరించారు. ఈ పథకం కింద మహిళలను కూడా తీసుకుంటామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వివరించారు. యువ ప్రతిభను వాయుసేన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి అన్నారు. అగ్నిపథ్ను దేశ యువతకు గొప్ప అవకాశంగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అభివర్ణించారు. వారి సర్వీసు నైపుణ్యాలకు యూజీసీ గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. విపక్షాల పెదవి విరుపు అగ్నిపథ్ పథకాన్ని విప్లవాత్మక నిర్ణయంగా బీజేపీ అభివర్ణించగా విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది, ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల ప్రకటన కార్యరూపమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగారు భవిత కోసం యువతకు ఇదో అద్భుత అవకాశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నేతలు అన్నారు. రక్షణ రంగంలో పెన్షన్ల భారం తదితరాలను తగ్గించుకోవడానికి దేశ భద్రతను కేంద్రం పణంగా పెడుతున్నట్టు కన్పిస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు విమర్శించాయి. మాజీల మిశ్రమ స్పందన కొత్త పథకంపై మాజీ సైనికాధికారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఇది త్రివిధ దళాలకు మరణ శాసనంతో సమానమని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా విమర్శించారు. సైన్యంలో తరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాలు, నైతిక విలువలు, చిత్తశుద్ధి తదితరాలు ఇకపై లోపిస్తాయని మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్సింగ్ అన్నారు. సైన్యం సామర్థ్యాన్ని కూడా ఈ పథకం దెబ్బ తీస్తుందన్నారు. రక్షణ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలకు ఇది తొలి అడుగని మేజర్ జనరల్ (రిటైర్డ్) బీఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. పథకం స్వరూపం... ► ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ► త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ► ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ► వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ► త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ► సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ► విధుల్లో చేరేవారిని అగ్నివీర్గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ► వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ► నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ► సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ► గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ► మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. रक्षा क्षेत्र को मजबूत करने के लिए क्रांतिकारी पहल - #Agnipath योजना, योजना के माध्यम से #BharatKeAgniveer को मिलेगा राष्ट्र सेवा का अवसर!!@DefenceMinIndia @adgpi@indiannavy @IAF_MCC @SpokespersonMoD pic.twitter.com/lIBWzQFNzv— PIB in Bihar 🇮🇳 (@PIB_Patna) June 14, 2022 #Agnipath model is based on the All India merit-based selection process we are looking at the best to serve the armed forces between the age of 17.5 to 21 years. After the selection. pic.twitter.com/LB4zWFR7Pd— Krishana_Rajput# (@RajputKrishana) June 14, 2022 -
త్రివిధ దళాల్లో అగ్నిపథ్ నియామకాలు
-
ఈశాన్య బంగాళాఖాతంలో నౌకాదళ విన్యాసాలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): బంగ్లాదేశ్లోని పోర్టు మోంగ్లాలో భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక నౌకా విన్యాసాలు ఈ నెల 24న ప్రారంభమయ్యాయి. ఇవి ఈ హార్బర్లో 24, 25వ తేదీల్లో, ఈశాన్య బంగాళాఖాతంలో 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ ద్వైపాక్షిక విన్యాసాల్లో రెండు దేశాల నైపుణ్యాలు, సముద్ర తీర ప్రాంతం సామర్థ్యాలు ప్రదర్శించబడతాయి. భారత నౌకాదళం నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిస్సైల్ కరవెట్ కోరా నౌక, ఆఫ్ షోర్ గస్తీ నౌక సుమేధా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ నుంచి బీఎన్ఎస్ అబు ఉబైదా, ఆలీ హైదర్ అనే నౌకలు పాల్గొంటున్నాయి. -
భారత్–బంగ్లా ‘కార్పాట్’ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం, బంగ్లాదేశ్ నేవీ సంయుక్తంగా నిర్వహించే కోర్డినేటెడ్ పెట్రోల్ (కార్పాట్) ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ప్రారంభమైంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబీఎల్) వెంబడి 2018 నుంచి ప్రతి ఏటా ఇరుదేశాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటాయి. అక్టోబర్ 2020లో నిర్వహించిన అనంతరం కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు కార్పాట్ జరగలేదు. నాలుగో ఎడిషన్ని భారత్, బంగ్లాదేశ్ నౌకాదళాలు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభించాయి. భారత్ తరఫున గైడెడ్ మిసైల్ షిప్ ఐఎన్ఎస్ కోరా, ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్ ఐఎన్ఎస్ సుమేధతో పాటు మారీటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ గస్తీలో పాల్గొనగా.. బంగ్లాదేశ్ తరఫున బీఎన్ఎస్ అలీ హైదర్, బీఎన్ఎస్ అబూ ఉబైదాలు కార్పాట్లో పాలుపంచుకున్నాయి. సోమవారంతో ఈ గస్తీ కార్యక్రమం ముగియనుంది. -
ఈఎన్సీ చీఫ్తో ఇరాన్ నేవీ బృందం భేటీ
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నేవీ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ కమడోర్ ఫరామర్జి నసిరితో పాటు నలుగురు సభ్యుల బృందం గురువారం తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈఎన్సీలో వివిధ శిక్షణా కేంద్రాల పనితీరును ఆ బృందం సభ్యులకు వివరించారు. ఇరుదేశాల నావికాదళ సిబ్బంది శిక్షణకు సంబంధించిన అంశాలపై సహకారం అందించుకునే విషయంపై చర్చించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16న తూర్పు నావికాదళాన్ని సందర్శించిన ఇరాన్ నేవీ బృందం ఈఎన్సీలో శిక్షణా కేంద్రాల తీరుతెన్నులను పరిశీలించింది. -
కమలా హారిస్ రక్షణ సలహాదారుగా శాంతి సేథి
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రక్షణ సలహాదారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శాంతి సేథి నియమితులయ్యారు. జాతీయ భద్రతా సలహాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆమె సమన్వయం చేయనున్నారు. శాంతి 1993లో యూఎస్ నేవీలో చేరారు. యూఎస్ నౌకాదళంలో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ డికేటర్ నౌక ఇన్చార్జ్గా పనిచేశారు. యూఎస్ యుద్ధ నౌక కమాండర్గా వ్యవహరించిన తొలి ఇండో అమెరికన్ ఆమే. భారత్కు వచ్చిన యూఎస్ నౌకకు తొలి మహిళా కమాండర్ కూడా. చదవండి: (ఏడాది కాలంలో దాదాపు 8 లక్షల వీసాల జారీ: డొనాల్డ్ హెఫ్లిన్) -
మిలాన్ - 2022 : దూసుకొచ్చిన ఎయిర్క్రాఫ్ట్లు.. నీటిలో పేలిన బాంబులు (ఫోటోలు)
-
మిలాన్-2022 కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు (ఫోటోలు)
-
ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
విశాఖలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణం: సీఎం జగన్
అప్డేట్స్: ► సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ముగించుకుని సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు. ► ఐఎన్ఎస్ విశాఖపట్నం మీద డాల్ఫిన్ లైట్హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణజింకను ముద్రించినందుకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు. ► సిటీ పరేడ్లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్ తెలిపారు. ఇది అరుదైన వేడుక, విన్యాసాల పండగ అని అన్నారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్ఎస్ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు. ► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగ్గ రోజు అని అన్నారు. ► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్ ప్రారంభమైంది. సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను ప్రదర్శించారు. సముద్రతీరంలో నావికా దళం అబ్బురపరిచే విన్యాసాలు: 6000 అడుగుల ఎత్తులో 6 మంది ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతా, ఆపదలో ఉన్నవారిని కాపాడే సాహసం, సముద్రం తీరంలో వాహనాలతో శత్రువులపై ఛేజింగ్, మిషన్ గన్స్తో శత్రువులను వెంటాడే విధానం, శత్రువులు వెన్నులో వణుకు పుట్టించె విధంగా ధైర్యసాహసాల ప్రదర్శన, మిత్ర దేశాలతో పరస్పరం సహకరించుకొనే విధంగా విన్యాసాలు, యుద్ద నౌకల నుంచి గురి తప్పని టార్గెట్, సముద్ర తీరంలో హెలికాప్టర్ల గస్తీ విన్యాసాలును ప్రదర్శించారు. ► ఆర్కే బీచ్లో నేవీ ఆధ్వర్యంలో సాయంత్రం పరేడ్ జరగనుంది. మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. గంటన్నరపాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది పాల్గొంటారు. ► ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ► నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సీఎం వైఎస్ జగన్ సందర్శించారు. ► విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ దంపతులు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్కు తూర్పు నావికా దళం గౌరవ వందనం చేసింది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సాక్షి, విశాఖపట్నం: అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్–2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను బీచ్ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సిటీ పరేడ్ను ప్రారంభించనున్నారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖలో నౌకల పండుగ.. ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్–2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను బీచ్ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సిటీ పరేడ్ను ప్రారంభించనున్నారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఆదివారం జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఇలా.. బీచ్ రోడ్డులో కోలాహలంగా జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్ విశాఖ నగరానికి ఆదివారం రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మ. 2.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేవల్ డాక్ యార్డ్కి చేరుకుంటారు. 3.10 గంటలకు ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. అనంతరం నౌకాదళ సిబ్బందితో కలిసి దానిని పరిశీలిస్తారు. సా.4.10 గంటలకు నేవీ అధికారులతో గ్రూపు ఫొటో దిగుతారు. 4.20 నుంచి 4.40 వరకు ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సందర్శిస్తారు. అనంతరం ప్రభుత్వ సర్క్యూట్ హౌస్లో బస చేస్తారు. సా.5.30 గంటలకు ఆర్కే బీచ్కు చేరుకుని మిలాన్ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. 6.04 గంటలకు సిటీపరేడ్ను ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ దేశాల నౌకాదళ రక్షణ సిబ్బంది నిర్వహించే మార్చ్ పరేడ్ను తిలకిస్తారు. సా.6.50కు విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి గన్నవరం బయలుదేరుతారు. సాగర తీరంలో విద్యుత్ కాంతులతో నౌకలు ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ విన్యాసాలు ఇక భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు, మెరైన్ కమాండోల బహుముఖ కార్యకలాపాలు, యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించనున్నాయి. ఘనంగా మిలాన్–2022 ప్రారంభం నౌకా యానంలో భారత్కు ఐదువేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, పశ్చిమ తీరం ద్వారా 80 దేశాలతో వర్తకం సాగిస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్భట్ అన్నారు. ఆయన శనివారం విశాఖలో మిలాన్–2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో భారత్తో పాటు నాలుగు దేశాలతో మొదలైన మిలాన్ ఇప్పుడు 39 దేశాలకు విస్తరించటం అభినందనీయమన్నారు. మిలాన్ ద్వారా మారిటైం రంగంలో అక్రమ ఆయుధ రవాణా, టెర్రరిజం, సముద్ర దొంగలు, స్మగర్లకు అడ్డుకట్ట వేయటంపై చర్చించుకునేందుకు వేదిక కానుందన్నారు. ప్రపంచ అంతా ఒక కుటుంబం అనే నినాదంతో ఒకరికొకరం సహాయం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మిలాన్ లోగో, స్పెషల్ కవర్ను అజయ్భట్ ఆవిష్కరించారు. ఇక్కడ మిలాన్–22 నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత భారీ ఎత్తులో కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో అంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకారం ఆమోఘమని ఆయన కొనియాడారు. అనంతరం వివిధ రకాల స్టాల్స్తో కూడిన మిలాన్ విలేజ్ను ఆయన ప్రారంభించారు. -
త్రివిధ దళాధిపతీ అందుకో వందనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత త్రివిధ దళాధిపతికి నావికా దళం వందనానికి సర్వ సన్నద్ధమైంది. సముద్రంలో బారులు తీరిన యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ సాగర తీరం సందడి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్తో భారత నావికాదళ సేవలు, పరాక్రమం ఉట్టిపడేలా సోమవారం (21న) 12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్) అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నౌకా దళ సామరధ్యన్ని సమీక్షిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి ఆదివారం సాయంత్రం 5.20 కు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తూర్పు నావికా దళం అధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఆయనకు సాదర స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ఆదివారం రాత్రి తూర్పు నావికా దళం (ఈఎన్సీ) ప్రధాన కార్యాలయంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫ్లీట్ రివ్యూ మొదలవుతుంది. 21 గన్లతో రాష్ట్రపతికి సెల్యూట్ చేయడంతో కార్యక్రమం ప్రారంభమై, 11.45 గంటల వరకూ జరుగుతుంది. ఈ రివ్యూలో నావికాదళంతో పాటు కోస్ట్గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలు, నౌకా దళం జలాంతర్గాములు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటాయి. 10 వేల మంది నావికాదళ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పీఎఫ్ఆర్ గ్రూపు ఫోటో దిగడంతో పాటు తపాలా బిళ్లను, పోస్టల్ కవర్ను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 22వ తేదీ ఉదయం 10.20 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. వేడుకలు ఇలా.. త్రివిధ దళాలకు అధిపతి హోదాలో భారత రాష్ట్రపతి తన పదవీకాలంలో యుద్ధ నౌకలను సమీక్షించే కార్యక్రమమే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. విశాఖ తీరంలో 44 యుద్ధ నౌకలను ఒక్కో వరుసలో 11 చొప్పున నాలుగు వరుసల్లో నిలిపి ఉంచారు. వీటిని విశాఖ బీచ్ నుంచి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ప్రజలు కూడా వీక్షించవచ్చు. రాత్రి సమయంలో యుద్ధ నౌకలు విద్యుద్దీపాలంకరణతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష కోసం ఐఎన్ఎస్ సుమిత్ర నౌకను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. ప్రెసిడెంట్ యాచ్గా పిలిచే ఈ నౌక డెక్పై రాష్ట్రపతి ఆశీనులవుతారు. ఆయన పక్కన అశోక చక్ర ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఇదే యాచ్లో వేడుకల్లో పాల్గొనే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆశీసులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి అధిరోహించిన ఐఎన్ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే ఒక్కో యుద్ధనౌకలో ఉన్న నౌకా దళాల అధికారులు, సిబ్బంది టోపీలను చేతిలో ఉంచుకుని తిప్పుతూ గౌరవ వందనం సమర్పిస్తారు. చివరగా నౌకా దళ యుద్ధ విమానాలు ఏకకాలంలో పైకి ఎగురుతూ.. రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. అనంతరం సెయిలర్స్ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వాటర్ ఫ్రంట్ యాక్టివిటీస్, సముద్రంలో యుద్ధ విన్యాసాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, హాక్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్, మార్కోస్ నిర్వహించే వాటర్ పారాజంప్ వంటి విన్యాసాల్ని రాష్ట్రపతి తిలకిస్తారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగుతారు. తపాలా బిళ్ల, పోస్టల్ కవర్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సిన్హ్ జె చౌహాన్, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి కూడా పాల్గొంటారు. విశాఖ కేంద్రంగా మూడోసారి గతంలో విశాఖ కేంద్రంగా ఒక ఫ్లీట్ రివ్యూ, ఒక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగాయి. 2006లో తొలిసారి పీఎఫ్ఆర్ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. అనంతరం 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్నది రెండో పీఎఫ్ఆర్. భారత దేశంలో మొదటి ఫ్లీట్ రివ్యూ 1953 అక్టోబరు 19న ముంబైలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పటివరకు 11 పీఎఫ్ఆర్లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది 12వ ఫ్లీట్ రివ్యూ. -
విశాఖపట్నం : సాగరతీరంలో ‘ఉగ్ర అలజడి’ ( ఫోటోలు)
-
బాలీవుడ్ పాటకు నేవీ సిబ్బంది వార్మప్!
Republic Day Parade Rehearsal Warm-Up: ఇంతవరకు ఆర్మీ సిబ్బంది పరేడ్లో భాగంగా బాలీవుడ్లోని పలు ప్రముఖ దేశ భక్తిపాటలకు డ్యాన్స్లు చేసిన వైరల్ వీడియోలు చూశాం. అంతెందుకు భారత సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో కాపలాకాస్తున్న జవాన్లు సైతం కొన్ని ప్రముఖ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసి అందరీ మన్నలను పొందారు . అచ్చం అలానే నేవీ సిబ్బంది బాలీవుడ్ పాటకు అనుగుణంగా కదులుతూ తమ రోజువారి వ్యాయమాన్ని చేసి అందరీ దృష్టిని ఆకర్షించారు. అసలు విషయంలోకెళ్తే....భారత నేవీ సిబ్బంది వార్మప్ ఎక్స్ర్సైజ్లో భాగంగా బాలీవుడ్ పాట "దునియా మే లోగాన్ కో" పాటకు లయబద్దంగా డ్యాన్స్లు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజయ్ చౌక్లో భారత్ నావికాదళ సిబ్బంది రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్కి సంబంధించిన వార్మ్ అప్ ఎక్స్ర్సైజ్లో భాగంగా బాలీవుడ్ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అంతేకాదు డిఫెన్స్ సిబ్బంది నేవీ యూనిఫాం ధరించి, రైఫిల్స్ పట్టుకుని, అప్నా దేశ్ సినిమా నుంచి ఆర్డీ బర్మన్, ఆశా భోంస్లే పాడిన దునియా మే లోగోన్ కో లయకు అనుగుణంగా నృత్యం చేశారు. అయితే ఇది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగం కాదని నేవీ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. What a sight! This video will definitely give you goosebumps!🇮🇳 🇮🇳 Are you ready to witness the grand 73rd Republic Day celebrations with us? Register now and book you e-Seat today! https://t.co/kJFkcXoR2K @DefenceMinIndia @AmritMahotsav pic.twitter.com/3WZG30DWQ0 — MyGovIndia (@mygovindia) January 22, 2022 (చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!) -
INS రణ్వీర్ నౌకలో పేలుడు.. ముగ్గురు మృతి
సాక్షి, విశాఖపట్నం: ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ముంబై డాక్ యార్డ్లో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ రణ్వీర్ యుద్ధనౌకలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత నౌకాదళాధికారులు ధ్రువీకరించారు. మరో 11 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ముంబైలోని ఐ.ఎన్.ఎస్. అశ్విన్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఐఎన్ఎస్ రణ్వీర్లోని ఇంటర్నల్ కంపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన జరగ్గానే నౌకలోని ఇతర సిబ్బంది తక్షణమే స్పందించి.. పరిస్థితులను చక్కదిద్దడంతో పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా నౌకలో కీలక మెటీరియల్ ఏమీ దెబ్బతినలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మృతి చెందిన సెయిలర్స్ వివరాల్ని నౌకాదళం ఇంకా వెల్లడించలేదు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ సంభవించిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన నేవీ అధికారులు.. ప్రమాదానికి కారణాలను సమగ్రంగా అన్వేషించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా రణ్వీర్ సేవలు ఐఎన్ఎస్ రణ్వీర్ విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళంలో సేవలందిస్తోంది. 1986 అక్టోబర్ లో భారత నౌకాదళంలో చేరిన రణ్వీర్ యుద్ధనౌక సోవియట్ యూనియన్లో నిర్మితమైంది. 35 మంది అధికారులు సహా మొత్తం 320 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తుంటారు. రాజ్పుత్ క్లాస్ డిస్ట్రాయర్గా విధుల్లో చేరిన ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిపై పలు రకాల మిసైల్స్ను అమర్చారు. సముద్ర జలాల్లో గస్తీ కాయడం, సముద్ర దొంగలను, ఉగ్రవాదులను అడ్డుకోవడం, నావికా దౌత్యం, జలమార్గ కమ్యూనికేషన్స్ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలను ఈ నౌక నిర్వహిస్తోంది. 2008లో శ్రీలంకలో జరిగిన 15వ సార్క్ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని భద్రత వ్యవహారాల్లోనూ, సింగపూర్, ఇండోనేషియా దేశాల ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొని ఇరుదేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో రణ్వీర్ ముఖ్య భూమిక పోషించింది. క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్ కోసం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ నేతృత్వంలో రణ్వీర్ పని చేస్తోంది. వివిధ ఆపరేషన్లలో భాగంగా 2021 నవంబర్లో విశాఖ నుంచి బయలుదేరింది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ బేస్ అయిన విశాఖపట్నానికి ఈ నౌక మరికొద్ది రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ సమయంలో ప్రమాదం సంభవించిందని నేవీ అధికారులు చెబుతున్నారు. -
INS Khukri: రక్షణ సేవలో 32 ఏళ్లు.. 30 సార్లు ప్రపంచాన్ని చుట్టి..
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి సేవల నుంచి నిష్క్రమించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ యుద్ధనౌక శత్రు నౌక ఎటువంటిది, ఏ దేశానికి చెందినది అనేది లెక్క చెయ్యకుండా మిసైల్ దాడులతో ధ్వంసం చేయగలదు. మజ్గావ్ డాక్లో తయారైన ఐఎన్ఎస్ ఖుక్రి 1989లో భారత నౌకాదళంలో చేరింది. 32 ఏళ్లపాటు భారత రక్షణలో పాలుపంచుకున్న ఖుక్రి వీడ్కోలు కార్యక్రమాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాస్తమయం సమయంలో ఖుక్రి నౌకపై ఉన్న జాతీయ జెండా, నౌకాదళ పతాకాన్ని అవనతం చేసి, డీకమిషనింగ్ పెనెంట్ని కిందికి దించారు. అనంతరం ఖుక్రీలో పని చేసి రిటైర్ అయిన కమాండింగ్ అధికారుల్ని వైస్ అడ్మిరల్ బిస్వజిత్ అభినందించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఆర్మీ గూర్ఖా బ్రిగేడ్ లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ అనంతనారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా నిర్మించిన తొలి క్షిపణి కార్వెట్టి ఐఎన్ఎస్ ఖుక్రీ సేవలు ఉపసంహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాహసానికి ప్రతీక ఖుక్రి అంటే సాహసోపేతం అని అర్థం. 1971లో పాక్తో జరిగిన యుద్ధ సమయంలో శత్రువుల్ని మట్టికరిపించేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి పాక్ సముద్రజలాల వైపు దూసుకెళ్లింది. అయితే.. సబ్మెరైన్ పీఎన్ఎస్ హన్గోర్లో పొంచి ఉన్న పాక్ సైనికులు డయ్యు సమీపంలో ఖుక్రీని టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఖుక్రీతో పాటు ఆ నౌకలోని 18 మంది అధికారులు, 176 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఖుక్రి కమాండింగ్ అధికారి కెప్టెన్ మహింద్రనా«ధ్ ముల్లా తన లైఫ్ జాకెట్ని జూనియర్ ఆఫీసర్కి ఇచ్చి రక్షించి.. తాను ప్రాణాలు వదిలారు. ఖుక్రిని నాశనం చేసిన 48 గంటల్లోనే కరాచీ రేవుని భారత రక్షణ దళం స్వాధీనం చేసుకొని పాక్పై విజయం సాధించింది. భారత రక్షణ శాఖలో తిరుగులేని పోరాట స్ఫూర్తి రగిలించిన ఖుక్రి పేరుతో ఈ నౌకని నిర్మించారు. 1989 ఆగస్టు 23న పాత ఖుక్రి నౌకలో అసువులు బాసిన కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా సతీమణి సుధా ముల్లా దీనిని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సేవలందించింది. కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. ఇప్పటివరకూ ఖుక్రిలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. మొత్తం 6,44,897 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం 30 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చినంత. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఐఎన్ఎస్ ఖుక్రి విశేషాలివీ.. పొడవు 91.1 మీటర్లు బీమ్ 10.5 మీటర్లు డ్రాట్ 4.5 మీటర్లు బరువు 1,350 టన్నులు వేగం గంటకు 25 నాటికల్ మైళ్లు సామర్థ్యం 16 నాటికల్ మైళ్ల వేగంతో ఏకధాటిగా 7,400 కిమీ దూరం ప్రయాణించగలదు ఆయుధాలు పీ–20ఎం యాంటీషిప్ మిసైల్స్– 4, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్– 2, ఏకే–176 గన్ ఒకటి, ఏకే–630 గన్స్ 2 ఎయిర్క్రాఫ్ట్ హల్ ధ్రువ్ హెలికాఫ్టర్– 1 -
మిలాన్ మెరుపులు..46 దేశాలకు ఆహ్వానం!
సాక్షి, విశాఖపట్నం:మరోసారి అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సన్నద్ధమవుతోంది. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి.. సత్తా చాటిన మహా నగరం.. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ప్రతిష్టాత్మకమైన మిలాన్ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతోంది. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్ కోసం భారీ ఏర్పాట్లు చేసేందుకు ఇండియన్ నేవీ ఏడాది కాలంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భారత నౌకాదళం 46 దేశాలకు ఆహ్వానం పంపగా.. 30 దేశాలు పాల్గొంటున్నట్లు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. మిలాన్ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం. 2018 అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్సీ సమాయత్తమవుతోంది. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి నిత్యం తెలియజేసేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మార్చిలో జరగనున్న మిలాన్ బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ మిలాన్ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు. ఇప్పటివరకు 11 మిలాన్లు 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు కాగా, 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించడం వల్ల జరగలేదు. 2010 వరకూ 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో జరిగిన విన్యాసాల్లో దేశాల సంఖ్య రెట్టింపై ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద ఫ్లీట్ రివ్యూగా చరితకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ కమాండ్లో జరిగిన విన్యాసాల్లో ఏకంగా 17 దేశాలు పాల్గొన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్ విన్యాసాలు జరిగాయి. అతి పెద్ద మిలాన్గా రికార్డుకు అవకాశం మిలాన్–2022 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు అందించింది. భారత్తో పాటు యూఎస్ఏ, రష్యా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, వియత్నాం, మోజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్ మొదలైన దేశాలకు భారత నౌకాదళానికి చెందిన ప్రతినిధులు ఆహ్వానాలు అందించారు. ఇందులో ఇప్పటికే 30 దేశాలు తాము పాల్గొంటున్నట్లు అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశాలున్నాయి. 30 దేశాలు రానున్న నేపథ్యంలో అతి పెద్ద మిలాన్కు వేదికగా విశాఖ రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ప్రణాళిక సమావేశాల్ని నిర్వహించారు. తొలి సమావేశంలో 17 దేశాలకు చెందిన 29 మంది నౌకాదళ కీలకాధికారులు పాల్గొనగా.. తాజాగా విశాఖలోని వివిధ ప్రభుత్వ అధికారులతో తూర్పునౌకాదళం సమీక్ష నిర్వహించింది. ఏర్పాట్లు విషయంపై సుదీర్ఘంగా చర్చించింది. రెండు ఫేజ్లలో.. మిలాన్–2022 విన్యాసాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్లలో రెండు ఫేజ్లలో విన్యాసాలు నిర్వహించనున్నారు. చరిత్రాత్మకమైన ఈవెంట్ విజయవంతం చేసేందుకు విశాఖ ప్రజలంతా కృషి చెయ్యాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నట్లు నౌకాదళాధికారులు చెబుతున్నారు. -
మలబార్ సీఫేజ్ విన్యాసాలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక 25వ మలబార్–2021లో సీఫేజ్ విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. అమెరికాలోని గువాన్ సముద్ర జలాల్లో నాలుగు దేశాలు సంయుక్తంగా ఈ విన్యాసాల్లో తమ సత్తా చాటాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్డిఫెన్స్ ఫోర్స్(జేఎంఎస్డీఎఫ్)తో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళం ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో భారత యుద్ధనౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కద్మత్తో పాటు పీ8ఐ ఎయిర్క్రాఫ్ట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పీ8 ఎయిర్క్రాఫ్ట్ విన్యాసాలు, యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలు, వెపన్ ఫైరింగ్తో నౌకాదళాలు సత్తా చాటాయి. ఈస్ట్రన్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ తరుణ్సోబ్తి నేతృత్వంలో భారత బృందాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ నెల 29వ తేదీతో మలబార్ విన్యాసాలు ముగియనున్నాయని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
క్రాష్ అయిన నావీ హెలికాప్టర్: వీడియో వైరల్
మెక్సికో సిటీ: మెక్సికోలో ఓ నావీ హెలికాప్టర్ కుప్పకూలింది. లాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. హారికెన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ హెలికాప్టర్లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని నావికాదళ అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి:VIRAL VIDEO: ఇదేం సరదా? ప్రాణాంతకంగా మారిన ఛాలెంజ్ -
యుద్ధ నౌక సాక్షిగా
-
చైనా కాచుకో... రోమియో వచ్చేసింది
వెబ్డెస్క్ : ఇండియన్ నేవి ఇకపై శత్రు దుర్భేద్యం కానుంది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఒంటెద్దు పోకడలకు కళ్లెం వేపడనుంది. మరికొద్ది రోజుల్లోనే యూఎస్కి చెందిన MH 6 రోమియో హెలికాప్టర్లు భారత్కు చేరుకోనున్నాయి. ఇప్పటికే పైలెట్లు , ఇతర క్రూ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. యాంటీ సబ్మెరైన్ వార్లో శక్తివంతమైన MH 6 రోమియో హెలికాప్టర్లలో మూడింటిని జులై చివరి నాటికి భారత్కి అందిస్తామని యూఎస్ ప్రకటించింది. యాంటీ సబ్మెరైన్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్లో ఎదురులేని రోమియో హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటో చూడండి -
2 ఆక్సిజన్ ప్లాంట్లకు నేవీ మరమ్మతులు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణవాయువు కీలకంగా మారిన సమయంలో నెల్లూరు, శ్రీకాళహస్తిల్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లకు నౌకాదళం మరమ్మతులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగం, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగాల సహకారంతో నౌకాదళం ఈ పనులను దిగ్విజయంగా పూర్తి చేసింది. నెల్లూరులోని కృష్ణతేజ ఆక్సిజన్ ప్లాంట్ రోజుకు 400 అతి భారీ సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. రాష్ట్రంలో ఈ అతిపెద్ద క్రయోజనిక్ ప్లాంట్.. మరమ్మతులకు గురై ఆరేళ్లుగా మూతపడింది. శ్రీకాళహస్తిలో వీపీఎస్ఏ టెక్నాలజీతో పనిచేస్తూ నిమిషానికి 16 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ప్లాంట్ కూడా కొంతకాలంగా పనిచేయడం లేదు. కోవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం పెరుగుతోంది. ప్లాంట్లకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం తూర్పు నౌకాదళ సాయం కోరింది. దీంతో నౌకాదళం.. విశాఖలోని నేవల్ డాక్యార్డుకు చెందిన రెండు నిపుణుల బృందాలను వారం రోజుల కిందట డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా పంపించింది. కమాండర్ దీపయాన్ నేతృత్వంలో స్థానిక జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఈ బృందాలు 2 ప్లాంట్లకు మరమ్మతుల్ని ఆదివారం పూర్తిచేశాయి. నెల్లూరులోని కృష్ణతేజ ఆక్సిజన్ ప్లాంట్ను –186 డిగ్రీల క్రయోజెనిక్ ఉష్ణోగ్రత ఉండేలా చేశారు. ఇక్కడ 98% ఆక్సిజన్, 0% కార్బన్ మోనాక్సైడ్, 0.01% కార్బన్ డై ఆక్సైడ్ కలిసిన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. శ్రీకాళహస్తి ప్లాంటులో 93%పైగా ఆక్సిజన్, 0% కార్బన్ మోనాక్సైడ్, 0.01% కార్బన్ డై ఆక్సైడ్ కలిసిన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రెండు ప్లాంట్ల నుంచి రెండు రోజుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ల మరమ్మతులతో రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాకు గొప్ప ఊతం దొరికినట్లయిందని కేంద్ర రక్షణశాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
ముంబై: భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మంటలు చెలరేగి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు నేవీ ప్రతినిధి తెలిపారు. నౌకలోని సిబ్బంది పొగను గమనించి వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని అన్నారు. దీంతో సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, పెద్దగా నష్టం జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యుద్ద నౌక కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ఉందని, ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని నేవీ ప్రతినిధి అన్నారు. కీవ్-క్లాస్ అనే యుద్ధ నౌకను భారత్ 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసి, దానికి విక్రమాదిత్య చక్రవర్తి పై గౌరవార్థం ఐఎన్ఎస్ విక్రమాదిత్యగా పేరు పెట్టారు. 20 అంతస్తుల ఎత్తు, 22 డెక్స్తో సుమారు 1600 మంది సిబ్బంది సామర్ఠ్యం కలిగిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య పొడవు 284 మీటర్లు, 60 మీటర్ల బేస్తో మూడు ఫుట్బాల్ మైదానాల వైశాల్యం కలిగి ఉంది. -
ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
సాక్షి, విజయవాడ: ఆక్సిజన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్టీల్ ప్లాంట్, నేవీతో అధికారులు చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు భేటీ అయ్యారు. అన్ని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను తుర్పు నావికాదళం చేపట్టనుంది. ఆక్సిజన్ ప్లాంట్ లీకేజీలు, స్థితిగతులు, జాగ్రత్తలతో నిర్వహణకు తూర్పు నావికాదళం ముందుకొచ్చింది. అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎక్కడ అవసరమైతే అక్కడికి విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్లలోని సాంకేతిక లోపాలను సవరించేందుకు నేవీ సాయపడనుంది. సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా నుండి ఏపీకి ఆక్సిజన్ తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ తరలించేందుకు నేవీ అంగీకారం తెలిపింది. ఐఎన్ఎస్ కళింగ్ ఆస్పత్రిలో 60 బెడ్లు కోవిడ్కి కేటాయించేందుకు అంగీకరించింది. కంచరపాలెంలో 150 పడకల ఆస్పత్రికి మౌలిక సదుపాయాల కల్పనకు నేవీ అంగీకారం తెలిపింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చనుంది. గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకారం తెలిపింది. వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నారు. మే 15 నాటికి అందుబాటులోకి వస్తాయని స్టీల్ ప్లాంట్ సీఎండీ వెల్లడించారు. మే 30 నాటికి 250 పడకలు, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. అందుకు తగిన విధంగా వైద్యులను, మెడికల్ సిబ్బందిని అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు కోరారు. నేవీ, స్టీల్ ప్లాంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్, తూర్పు నావికాదళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. 850 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్ ప్లాంట్ అధికారులు వెల్లడించారు. ఆరు నెలల్లో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. చదవండి: కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష ముగ్గురాయి గనుల్లో పేలుడు, సీఎం జగన్ దిగ్భ్రాంతి -
భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ జలాల పరిధి విషయంలో భారత వాదనను సవాలు చేస్తూ, భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, ఈ వారం లక్షద్వీప్ సమీపంలోని భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్(ఎఫ్ఓఎన్ఓపీ)’ను నిర్వహించామని అమెరికా ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సముద్ర జలాల విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లం ఘించడం సరికాదని యూఎస్కు స్పష్టం చేసింది. దేశాల ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు(ఈఈజెడ్), కాంటినెంటల్ జోన్ల పరిధిలో ఇతర దేశాలు.. అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టడం, ముఖ్యంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు వినియోగించడం ‘యూఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ’కి వ్యతిరేకమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్ పాల్ జోన్స్ భారతీయ జలాల్లో ‘ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్’లో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత దేశం పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం. ఎఫ్ఓఎన్ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్కు ఉన్న స్వేచ్చను, హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్ ఏప్రిల్ 7న ప్రకటించింది. సముద్ర జలాల పరిధిపై భారత వాదనను సవాలు చేస్తూ, అంతర్జాతీయ నిబంధనల మేరకు లక్షద్వీప్కు పశ్చిమంగా 130 నాటికల్ మైళ్ల దూరంలో, భారత ఈఈజెడ్ పరిధిలో ఎఫ్ఓఎన్ఓపీ నిర్వహించామని పేర్కొంది. దీనిపై అమెరికాకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్కా సంధి వరకు అమెరికా నౌక ఆపరేషన్స్ జరిపింది. ఈ విషయంపై భారత అభ్యంతరాలను అమెరికా ప్రభుత్వానికి దౌత్య మార్గాల ద్వారా వెల్లడించాం’ అని శుక్రవారం భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ ఈఈజెడ్ పరిధిలో ఇతర దేశాలు మిలటరీ ఆపరేషన్లు నిర్వహించాలంటే తమ అనుమతి తప్పనిసరి అన్న భారత వాదనను అమెరికా కొట్టివేస్తోంది. -
ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్
దేశ రక్షణ దళాల్లో చేరడం చాలా మంది యువత కల. సైనిక దళాల్లో సవాళ్లతో కూడిన ఉజ్వల కెరీర్కు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (ఎన్డీఏ). ఇందులో అర్హత సాధిస్తే.. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో ఉన్నత స్థాయి హోదాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. దేశ రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి హోదాను పొందొచ్చు. సరైన ప్రణాళిక..పట్టుదలతో ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమయితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. 2021 ఏడాదికి గాను ఎన్డీఏ పరీక్షను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమ్యే అభ్యర్థులకు కోసం ఎగ్జామ్ టిప్స్... ఏటా రెండుసార్లు ► త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు, శిక్షణ ప్రక్రియను చేపట్టడానికి ఎన్డీఏను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఎన్డీఏ సువర్ణావకాశం. ► ఇంటర్/10+2 పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్డీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ 2021 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 900 మార్కులకు రాత పరీక్ష ఎన్డీఏ పరీక్ష ఏప్రిల్ 18న ఆఫ్లైన్లో జరుగనుంది. పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్– 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ–600 మార్కులు (ఇంగ్లిష్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్) పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో పేపర్కు 2.30 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. వ్యూహాత్మక ప్రిపరేషన్ ► పరీక్షకు నెల రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. ముఖ్యమైన టాపిక్స్పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ► గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం.. మాక్ టెస్టులను రాయడం వంటివి చేయాలి. ► మ్యాథమెటిక్స్కు సంబంధించి షార్ట్ ట్రిక్స్ను ఉపయో గించి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి. ఇచ్చిన టైమ్ను సద్వినియోగం చేసుకునే విధంగా మ్యాథమెటిక్స్ విభాగంపై దృష్టి పెట్టాలి. ► పేపర్–2కు సంబంధించి ఇంగ్లిష్లో 40శాతం వెయిటేజీని కవర్ చేసేవిధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఇందుకోసం న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్, వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు. ► పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్లపై పట్టు పెంచుకోవాలి. ► జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ► కరెంట్ అఫైర్స్కు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అవార్డులు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ► ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన రోజుల (ప్రముఖుల పుట్టిన తేదీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన రోజులు)గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ►ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ 900 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా స్టేజ్–1,2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్–2కు అనుమతిస్తారు. ►స్టేజ్–1: ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), వెర్బల్–నాన్ వెర్బల్ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు. ►స్టేజ్–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్లో జీడీ, జీపీఈ,పీజీటీ, హెచ్జీటీ, ఐఓటీ, కమాండ్ టాస్క్, షేక్ రేస్, ఇండివిడ్యువల్ లెక్చర్, ఎఫ్జీటీ వంటివి ఉంటాయి. ►సైకాలజీ టెస్ట్ : థిమాటిక్ అప్రెషన్ టెస్ట్(టీఏటీ), వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిచ్యూవేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్ఆర్టీ), సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్డీ) వంటి వాటితోపాటు కాన్ఫరెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ►పైన పేర్కొన్న రెండు స్టేజ్ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు జరిపి.. మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ►ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్ష. కాబట్టి అభ్యర్థులు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ► అభ్యర్థుల వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని పరీక్షించే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి. హైదరాబాద్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో జాబ్స్ -
గడ్డకట్టే నీటిలో అన్వేషణ.. ఎందుకంటే?
ఢిల్లీ: ఉత్తరాఖండ్లోని తపోవన్ సరస్సు లోతును కనుగొనడాన్ని ‘నేవీ డైవర్స్’ సవాల్గా తీసుకున్నారు. వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన భారీ కృత్రిమ సరస్సు సముద్రమట్టానికి 14 కిలో మీటర్లు పైకి ఎగిసి అల్లకల్లోలం సృష్టిస్తోందని తెలిపారు. ఈ విపత్తులో చాలా మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది జాడ తెలియటంలేదని పేర్కొన్నారు. తపోవన్ సరస్సు అత్యధికంగా గడ్డకట్టే పరిస్థితులను కలిగి ఉందని, అందుకే నేవీ అధికారులు సరస్సు లోతును కనుగొనడానికి ఎకోసౌండర్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. డామ్పై నీటి ఒత్తిడిని హై రిజల్యూషన్ ఉపగ్రహంతో అధ్యయనం చేస్తున్నారు. నీరు అధిక బరువును కలిగి ఉందని భవిష్యత్తులో ఎప్పుడైనా డ్యామ్ను ఢీకొట్టి మరో వరదకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ వరద సంభవించిన ప్రదేశంలో పర్యటించి వరదకు గల కారణాలను అధ్యయనం చేశారు. ఏ క్షణంలో అయినా వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి వైమానిక దళానికి చెందిన అత్యాధునిక లైట్ హెలికాప్టర్ను ఉపయోగిస్తామని తెలిపారు. చదవండి: ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు -
కుప్పకూలిన నేవీ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్-29కే
న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్క్రాఫ్ట్ మిగ్-29కే శిక్షణా విమానం ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ఇవాళ ఉదయం వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ఒక పైలట్ను సురక్షితంగా కాపాడారు. మరొకరు గల్లంతు అయినట్లు తెలిపారు. గల్లంతు అయిన పైలట్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టమని నేవీ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లో విశాఖపట్నం 'హానీట్రాప్' గూఢచర్యం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. గిటేలి ఇమ్రాన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ గుజరాత్లో అదుపులోకి తీసుకుంది. ఈ వ్యక్తి పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. విశాఖలోని నేవీ రహస్యాలను సేకరించేందుకు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ క్రమంలో నేవీ సిబ్బందికి భారీగా ముడుపులు అందజేసినట్టు విచారణలో వెల్లడయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ 11 మంది నేవీ సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంఖ్య 15కు చేరింది. హవాలా మార్గాల్లో నేవీ సిబ్బందికి నిధులు సమకూర్చినట్టు సదరు వ్యక్తి దర్యాప్తులో వెల్లడించినట్లు ఎన్ఐఏ తెలిపింది. (చదవండి: విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ ) పాకిస్తాన్కు చెందిన కొందరు గూఢచారులు.. భారత నౌకలు, జలాంతర్గాముల లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు జూనియర్ స్థాయి నేవీ అధికారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇందుకు గాను సోషల్ మీడియా ద్వారా అందమైన యువతులను వారు ఎర వేసి.. వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించారు. -
ఆయుధ సంపత్తిని పెంచుకునే పనిలో చైనా!
వాషింగ్టన్/బీజింగ్: శక్తిమంతమైన దేశంగా అవతరించే క్రమంలో చైనా భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకునే యోచనలో ఉంది. రానున్న పదేళ్లలో న్యూక్లియర్ వార్హెడ్లను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది. తద్వారా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని అణ్వాయుధ స్థావరాలతో పాటుగా వైమానిక, నావికా స్థావరాల నుంచి అణుబాంబులను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. అదే విధంగా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా పలు చర్యలు చేపట్టింది. ఇండో- ఫసిఫిక్ ప్రాంతంపై పైచేయి సాధించేందుకు వీలుగా పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, థాయ్లాండ్, సింగపూర్, ఇండోనేషియా, యూఏఈ, కెన్యా, సిచిల్స్, టాంజానియా, అంగోలా, తజకిస్థాన్ తదితర దేశాల్లో నావికా దళాలు మోహరించేందుకు వీలుగా స్థావరాల ఏర్పాటుపై దృష్టి సారించింది.(చదవండి: కీలక ప్రాంతాలపై పట్టుబిగించిన భారత్) ఇక నావికా దళంలో సుమారుగా 350 యుద్ధనౌకలు, సబ్మెరైన్లతో అమెరికా(293 యుద్ధ నౌకలు)ను మించిపోయిన డ్రాగన్ ప్రపంచంలోనే అతిపెద్ద నావల్ ఆర్మీ కలిగిన దేశంగా ఎదిగేలా ప్రణాళికలు రచిస్తోంది. అయితే అత్యాధునిక సాంకేతికత, సామర్థ్యం కలిగిన అమెరికా యుద్ధ వాహన నౌకలతో పోలిస్తే చైనా ఎయిర్క్రాఫ్ట్ల సామర్థ్యం తక్కువేనని తెలుస్తోంది. ఈ విషయాల గురించి యూఎస్ కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో పెంటగాన్ ప్రస్తావించింది. పాతకాలం నాటి మెరైన్లకు స్వస్తి చెప్పిన చైనా వాటి స్థానంలో అత్యాధునిక, బహుళ ప్రయోజనాలు కలిగిన యుద్ధ నౌకలను రూపొందించే పనిలో ఉన్నట్లు పేర్కొంది.(చదవండి: సరిహద్దు ఉద్రిక్తతలు.. చైనాలో ఆహార సంక్షోభం) అదే విధంగా పదాతి, వైమానిక, నౌకా స్థావరాల(న్యూక్లియర్ ట్రియాడ్ కెపాసిటీ) నుంచి అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అణ్వాస్త్రాలను తయారు చేసుకోవడానికి కావాల్సినంత పేలుడు సామాగ్రిని చైనా కలిగి ఉందని పేర్కొంది. గత కొంతకాలంగా అమెరికా- చైనాల మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో రక్షణ శాఖకు కేటాయించిన 700 బిలియన్ డాలర్లకు సంబంధించిన నిధుల బిల్లుపై యూఎస్ కాంగ్రెస్లో చర్చ సందర్భంగా ఈ మేరకు పెంటగాన్ వివరాలు సమర్పించింది. కాగా రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి కొనుగోలు తదితర మిలిటరీ కార్యకలాపాలకై గతేడాది భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా చైనా, భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని ది స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ సంస్థ(ఎస్ఐపీఆర్ఐ) వెల్లడించిన విషయం తెలిసిందే. 2018తో పోలిస్తే చైనా 2019లో మిలిటరీ మీద ఖర్చు చేసిన వ్యయం 5.1 శాతం పెరగగా.. చైనా, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ 6.8 శాతం ఎక్కువగా ఖర్చు చేసిందని నివేదికలో తెలిపింది. గతేడాది చైనా మొత్తంగా సైన్యం మీద 261 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా... భారత్ 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఇక ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి పనిచేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే గ్వడార్ పోర్టులో సరికొత్త నిర్మాణాలు చేపట్టిన చైనా.. అక్కడ భారీ ఎత్తున నావికా దళాలను మోహరించేందుకు సిద్ధమవుతోందని గతంలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నౌకా దళాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలతో పొరుగు దేశాలకు సరికొత్త సవాళ్లు విసిరేందుకు సిద్ధమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనా ప్లాన్; కౌంటర్కు సిద్దమవుతున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్లలో ఓడరేవుల ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి భారత్ కూడా దేశ ద్వీప భూభాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉత్తర అండమాన్లోని ఐఎన్ఎస్ కోహస్సా, షిబ్పూర్, నికోబార్లోని క్యాంప్బెల్ స్ట్రిప్ వద్ద ఎయిర్స్ట్రిప్ను పూర్తి స్థాయి యుద్ధ స్థావరాలుగా భారత్ అభివృద్ధి చేస్తుందని సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. లక్షద్వీప్లోని అగట్టి వద్ద ఉన్న ఎయిర్స్ట్రిప్ సైనిక కార్యకలాపాల కోసం అభివృద్ధిచేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ బే నుంచి మలక్కా స్ట్రెయిట్స్ వరకు, అరేబియా సముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్ వరకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు ద్వీపాలు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాలు. ప్రపంచ వాణిజ్యంలో సగానికి పైగా ఈ మార్గం ద్వారా జరుగుతున్నాయి అని ట్రై-సర్వీస్ కమాండర్ పేర్కొన్నారు. ప్రస్తుతం చైనా మరింత సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత 70 సంవత్సరాలుగా మరుగున పడిన థాయ్ కెనాల్ ప్రాజెక్ట్ను పొందటానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత్ ద్వీప భూభాగాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కూడా అత్యవసరమని భావిస్తోంది. బ్యాంకాక్కు దక్షిణాన 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలయ్ ద్వీపకల్పం ద్వారా థాయ్లాండ్ గల్ఫ్ను అండమాన్ సముద్రంతో అనుసంధానించడానికి ఈ కాలువ ప్రతిపాదించబడింది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ప్రధాన షిప్పింగ్ ఛానల్ మలక్కా జలసంధి. అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గం. దీనికి థాయ్ కెనాల్ ప్రత్యామ్నాయంగా మారనుంది. దీని ద్వారా భారత్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రయాణించే నౌకల దూరం కనీసం 1,200 కిలోమీటర్లు వరకు తగ్గిస్తుంది. థాయ్ కెనాల్ను పొందటానికి చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో భారత్ మరింత పటిష్టమైన చర్యలు చేపడుతోంది. చదవండి: పుల్వామా దాడులు.. చార్జిషీట్ దాఖలు -
కోవిడ్ యోధులకు సెల్యూట్
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్–19పై అలుపు లేకుండా ముందుండి పోరాడుతున్న యోధుల సేవలకు కృతజ్ఞతగా విశాఖలో నౌకాదళ హెలికాఫ్టర్ పూల వందనం సమర్పించింది. ఆస్పత్రుల్లో రాత్రిపగలు తేడా లేకుండా శ్రమిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, మీడియా సేవలను అభినందిస్తూ వాయుసేన ఆదివారం పూలవర్షం కురిపించి గౌరవ వందనం చేసింది. ► విశాఖ ఐఎన్ఎస్ డేగాలో బయలుదేరిన నేవీ హెలికాప్టర్ ప్రభుత్వ టీబీ, ఛాతీ ఆస్పత్రి, గీతం ఆస్పత్రులపై పూలవర్షం కురిపించింది. ► ఆస్పత్రుల బయట కరోనా యోధులకు నేవల్ ఆఫీసర్ ఇన్ఛార్జి కమెడోర్ సంజీవ్ ఇస్సార్ పుష్పగుచ్ఛాలు అందించి సెల్యూట్ చేశారు. వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ► బంగాళాఖాతం సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ జలశ్వ యుద్ధ నౌకపై సెయిలర్లు ‘థాంక్యూ’ అంటూ ఇంగ్లిష్ అక్షరాకృతిలో నిలుచుని కోవిడ్ యోధులకు గౌరవ వందనం సమర్పించారు. ► ఐఎన్ఎస్ సావిత్రి యుద్ధనౌకలో సెయిలర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ విన్యాసాలు నిర్వహించారు. ► రాత్రి 7.30 గంటలకు విశాఖ ఆర్కే బీచ్లో రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి కరోనాపై పోరాటం సాగిస్తున్న వారందరికీ వందనం సమర్పించారు. పచ్చరంగు కాంతి వెదజల్లే బాణసంచా కాల్చి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా మహమ్మారికి అడ్డుకట్టే వేసేందుకు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నాం. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బందికి అందరి సహకారంతో పాటు ప్రశంసలు లభించడం ఆనందంగా ఉంది. – బి.వెంకటరమణ, ఛాతీ ఆసుపత్రి ఇన్చార్జి మా బాధ్యత పెరిగింది నౌకాదళం స్ఫూర్తితో మా బాధ్యత మరింత పెరిగింది. విశాఖలో వ్యాధి వ్యాప్తిని చాలావరకు నియంత్రించాం. వెయ్యి మందికిపైగా పారా మెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలీసులు, పారిశుధ్య కార్మికుల సహకారంతో కరోనా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధ్దంగా ఉన్నాం’ – డాక్టర్ పీవీ సుధాకర్, ప్రిన్సిపల్ ఏఎంసీ -
కరోనా యోధులకు నేడు నేవీ సెల్యూట్
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారిని తరిమికొట్టే సమరంలో ముందు వరుసలో నిలిచిన వారందరికీ తూర్పు నౌకాదళం సెల్యూట్ చేయనుంది. ప్రజల తరఫున వారికి ఆదివారం వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న విశాఖలోని ఆస్పత్రులపై హెలికాప్టర్తో పూలవర్షం కురిపిస్తారు. అలాగే ఆర్కే బీచ్ సాగర తీరంలో గౌరవ వందనం చేస్తారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి కోవిడ్–19తో అవిశ్రాంతంగా పోరాడుతూ విధులు నిర్వర్తిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించి తూర్పు నౌకాదళం అధికారులు ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ► ముందుగా నగరంలోని ప్రభుత్వ టీబీ, ఛాతీ ఆస్పత్రులతోపాటు, గీతం, విమ్స్ ఆస్పత్రి సిబ్బందికి త్రివిధ దళాల బృందం కృతజ్ఞతలు తెలుపుతుంది. అనంతరం నేవీ హెలికాఫ్టర్ ఉదయం 9.15 నుంచి 9.45 గంటల మధ్య ప్రాంతంలో ఆకాశంపై చక్కర్లు కొడుతూ కోవిడ్ ఆస్పత్రులపై పూల వర్షం కురిపిస్తుంది. ► రెండో కార్యక్రమంలో రాత్రి 7.30 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్కే బీచ్ సాగర తీరంలో రెండు యుద్ధనౌకల్లో విద్యుద్దీపాలు వెలిగించి గౌరవ వందనం చేస్తారు. ► ఇక మూడోదిగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పచ్చని బాణసంచా కాల్చనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి శనివారం రాత్రి ఆర్కే బీచ్లో రిహార్సల్స్ నిర్వహించారు. -
కరోనా : మన నేవీ.. మహా భద్రం
విపత్తులు విరుచుకుపడినా.. మహమ్మారులు కబళించినా.. వారు మాత్రం విధులను విడిచిపెట్టరు. నిరంతరం దేశరక్షణలో నిమగ్నమయ్యే మన రక్షణ వ్యవస్థలోకి కరోనా వైరస్ చొరబడటం ఆందోళన రేపుతోంది. మొదట ఆర్మీలోకి.. తాజాగా నావికాదళంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి కలవరం రేపుతోంది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న 20 మంది నేవీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకినట్లు తేలడంతో మొత్తం నౌకాదళం అప్రమత్తమైంది. వారు పని చేస్తున్న వార్షిప్ మొత్తాన్ని లాక్డౌన్ చేశారు. ఈ పరిస్థితుల్లో విశాఖ కేంద్రంగా పని చేస్తున్న తూర్పు నౌకాదళం పరిస్థితి ఏమిటన్న సందేహాలు, ఆందోళనలు మొదలవ్వడం సహజం. అయితే.. జనతా కర్ఫ్యూ నాటి నుంచే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో తూర్పు నౌకాదళం సేఫ్ జోన్లో ఉన్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్తగా మూడు వారాల క్వారంటైన్ తర్వాతే సిబ్బందిని అత్యవసర విధులకు అనుమతిస్తున్నామని ఈఎన్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: భారతీయ నౌకాదళంలో కరోనా కలకలం రేగింది. దేశ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్ రక్షణ వ్యవస్థలోకి చొరబడకపోవడంతో త్రివిధ దళాలు ఇన్నాళ్లూ ఉపిరి పీల్చుకుంటూ వచ్చాయి. అయితే గత వారంలో ఆర్మీలోని కొందరికి.. ఇప్పుడు నేవీ సిబ్బందికి పాజిటివ్ రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వెస్ట్రన్ నేవల్ కమాండ్ ముంబైలోని ఐఎన్ఎస్ ఆంగ్రే నౌకలో విధులు నిర్వర్తిసున్నత 20 మంది ఉద్యోగులకు పాజిటివ్ సోకడంతో వారిని ముంబైలోని ఐఎన్ఎస్హెచ్ అశ్విని ఆస్పత్రిలో చేర్చారు. ఈ పరిణామాలతో తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. ఇక్కడ మొదటి నుంచే కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపడుతున్నందున కరోనా ముప్పు లేదని ఈఎన్సీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్వారంటైన్ పూర్తయ్యాకే విధుల్లోకి... కరోనాపై యుద్ధంలో భాగంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయవంతంగా పూర్తి చేసిన తూర్పు నౌకాదళం.. ప్రస్తుతం లాక్డౌన్నూ పటిష్టంగా అమలు చేస్తోంది. ఈఎన్సీ ప్రధాన కేంద్రంలో సుమారు వెయ్యిమంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్లో భాగంగా సేవలన్నీ నిలిపివేశారు. అత్యవసర సేవలు, భద్రతా విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్లో తొలి 14 రోజులు సిబ్బందిలో అవివాహితులతో పని చేయించారు. మిగిలిన సిబ్బందికి మూడు వారాల క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేనివారినే విధులకు అనుమతిస్తున్నారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మే 3 వరకు లాక్డౌన్ పొడిగించడంతో అత్యవసర విధులకు ఆటంకం కలగకుండా ఈఎన్సీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 50 శాతం ఉద్యోగులతో షిప్టుల వారీగా సేవలందిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగుల సేవలను అత్యవసరమైతేనే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఈఎన్సీ పరిధిలో ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉన్నారని నౌకాదళ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భద్రత విషయంలో రాజీలేదు కోవిడ్–19 విజృంభిస్తున్న వేళ.. తూర్పు నౌకాదళంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 200 పడకలతో ఐఎన్ఎస్ విశ్వకర్మ వద్ద క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ 14 రోజుల క్వారంటైన్లో ఉన్నాకే అనుమతి ఇస్తున్నాం. ఆఫ్షోర్ పెట్రోలింగ్కు వినియోగిస్తున్న నౌకలు, అత్యవసర విభాగాల్లో మాత్రం అందరూ విధులు నిర్వర్తిస్తున్నారు. శానిటైజర్లు, స్ప్రేయింగ్ చేస్తున్నాం. మాసు్కలు ధరించాలని నిబంధనలు విధించాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తీర భద్రత విషయంలో రాజీ పడటం లేదు. సవాళ్లను ఎదుర్కొడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈఎన్సీ ఆధ్వర్యంలో సహాయ చర్యలు కూడా నిర్వహిస్తున్నాం. – వైస్ అడ్మిరల్ అతుల్కుమార్జైన్, తూర్పు నౌకాదళాధిపతి -
అభ్యంతరం తెలుపలేదు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై విషం కక్కుతూ తప్పుడు కథనాలు రాస్తున్న ఓ వర్గం మీడియా బండారం మరోసారి బట్టబయలైంది. మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటు పట్ల నౌకాదళ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయంటూ పత్రికల్లో(సాక్షి కాదు) అసత్య కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో తామెలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదంటూ తూర్పు నౌకాదళం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని స్పష్టం చేసింది. అయినా.. తాము అభ్యంతరం వ్యక్తం చేశామంటూ కొన్ని పత్రికలు అసత్య కథనాలు రాయడం తగదని పేర్కొంది. కాగా, ఈ కథనాలపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
నేవీలో హనీట్రాప్: పోలీసు కస్టడీకి నిందితులు
సాక్షి, విజయవాడ: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ విచారణను వేగవంతం చేసింది. ఈ మేరకు 11 మంది నేవీ సిబ్బందిని ఎన్ఐఏ అధికారులు సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. విచారణలో భాగంగా నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు కోరారు. నిందితుల తరపు న్యాయవాది కోటంరాజు వెంకటేష్ శర్మ మాట్లాడుతూ న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నిందితులను ఈ నెల 17 నుంచి 22 వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుల రిమాండ్ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. పాకిస్తాన్ వలపు వల.. భారత నౌకాదళ సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్.. భారత నేవీ సిబ్బందిని టార్గెట్ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఏజెంట్లు ఫేస్బుక్లో యువతుల పేరుతో నేవీ ఉద్యోగులను ట్రాప్ చేసి భారత్ రహస్యాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ వలలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నేవీ సిబ్బంది చిక్కుకున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఎన్ఐఏ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలుపెట్టాయి. ఈ ఘటనతో నౌకాదళం ఒక్కసారిగా ఉలిక్కిపడగగా ఇంటిదొంగల పనిపట్టేందుకు విచారణ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పాక్ హనీట్రాప్లో పడి భారత నేవీ రహస్యాలను చేరవేసిన 11 మంది నేవీ సిబ్బందిని కోర్టులో హాజరుపర్చి విచారణ జరుపుతున్నారు. చదవండి: నేవీలో హానీట్రాప్పై ఎన్ఐఏ విచారణ! -
నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్ఐఏ!
రక్షణ దళాల్లో ఒకటైన నావికాదళంపై వలపు వల(హానీ ట్రాప్) విసిరి కీలకమైన రహస్యాలను చోరీ చేస్తున్న ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దృష్టి సారించింది. పాకిస్థాన్ ఏజెంట్లు ఫేస్బుక్లో యువతుల పేరుతో నేవీ ఉద్యోగులను పరిచయం చేసుకొని.. క్రమంగా వారిని ట్రాప్ చేసి రహస్యాలు రాబడుతున్నట్లు తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరిట ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఏడుగురు నేవీ సిబ్బందిని అరెస్టు చేయడం కలకలం రేపింది. దరిమిలా నేవీలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా మంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తుకు ఎన్ఐఏను రంగంలోకి దించుతున్నారు. ఆ సంస్థ అధికారులు రెండు మూడు రోజుల్లో తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చి విచారణ జరుపుతారని సమాచారం. సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సమాచారాన్ని శత్రుదేశం పాకిస్థాన్కు చేరవేస్తున్న ఏడుగురు ఇండియన్ సెయిలర్స్ని ఈ నెల 20న అరెస్టు చేసిన కేంద్ర నిఘా వర్గాలు లోతైన విచారణ చేపడుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఈ కేసుని సీరియస్గా తీసుకుంది. ఆపరేషన్ డాలి్ఫన్ నోస్లో వెల్లడైన నిజాల నిగ్గు తేల్చేందుకు రెండు మూడు రోజుల్లో ఎన్ఐఏ బృందం విశాఖ రానుంది. తూర్పు నౌకాదళంలో అధికారుల బృందాలతో మాట్లాడి మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు ఎన్ఐఏ ప్రయతి్నంచనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ సంఘటనతో అప్రమత్తమైన నౌకాదళం ఇకపై షిప్లలో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని బంద్ చేసినట్లు ఆదేశాలు జారీ చేసింది. వలపు వలలో చిక్కుకుని.. భారత నౌకాదళ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు శత్రుదేశం పాకిస్థాన్ దృష్టి సారించింది. 2017లో నౌకాదళంలో సెయిలర్స్గా చేరిన వారిని ఇందుకోసం టార్గెట్ చేసుకుని వలపు వల విసిరింది. ఆర్మీ జవాన్లపై ఈ ఏడాది జనవరిలో విసిరిన ఫేస్బుక్ వల మాదిరిగానే... వీరిపైనా అలానే అ్రస్తాన్ని సంధించింది. ఈ వలలో విశాఖ ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళానికి చెందిన ముగ్గురు సెయిలర్స్, ముంబయికి చెందిన ఇద్దరు, కర్వార్కు చెందిన మరో ఇద్దరు సెయిలర్స్ చిక్కుకున్నారు. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలుపెట్టాయి. డిసెంబర్ 20న ఏడుగురు సెయిలర్స్తోపాటు ఒక హవాలా బ్రోకర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం వీరంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరికొందరి ప్రమేయంపైనా అనుమానాలు పాకిస్థాన్ ఇంటర్ సరీ్వస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) చట్రంలో కేవలం ఏడుగురు సెయిలర్స్ మాత్రమే కాకుండా మరికొందరు కూడా చిక్కుకున్నారని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ డాలి్ఫన్ నోస్’ నిర్వహించిన సమయంలోనే ఇంకొందరు సెయిలర్స్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైనా.. కేవలం ఏడుగురి నుంచి మాత్రమే సమగ్ర సమాచారం పాక్కు చేరిందని భావించడంతో వారిపైనే దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నారు. అయితే మరికొందరు సెయిలర్స్ కూడా పాక్ హనీట్రాప్లో చిక్కుకొని నౌకలు, సబ్ మెరైన్స్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేశారనే కోణంలో నిఘా వర్గాలు విచారణ ముమ్మరం చేశాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం బంద్ కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్న సంఘటన వెలుగు చూడటంతో నౌకాదళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరికొంత మంది ఇంటి దొంగలు ఉన్నారన్న అనుమానాలను నిఘావర్గాలు వెల్లడించడంతో అప్రమత్తమైంది. ఇకపై నౌకల్లో, సబ్మెరైన్లలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారిగానీ, కెపె్టన్, సెయిలర్స్.. ఏ స్థాయి ఉద్యోగి కూడా స్మార్ట్ ఫోన్ వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వాట్సప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, టెలిగ్రామ్, టిక్టాక్, హైక్ మొదలైన సోషల్ మీడియా యాప్స్ని పూర్తిగా నౌకల్లో నిషేధిస్తున్నట్లు ఆదేశించింది. ఈ ఆదేశాలు కఠినంగా అమలు చెయ్యాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖకు ఎన్ఐఏ బృందాలు మరోవైపు ఇప్పటికే అరెస్టైన ఏడుగురు సెయిలర్స్ నుంచి నిజాలు రాబట్టేందుకు ఎన్ఐఏ బృందం ప్రయతి్నస్తోంది. అరెస్టైన సెయిలర్స్ సన్నీకుమార్, ఎస్.కుమార్శర్మ, ఎస్.దాస్, అకుమా, అశోక్కుమార్, వి.కుమార్, సోమనాథ్కు విజయవాడ ఎన్ఐఎ కోర్టు జనవరి 3 వరకూ రిమాండ్ విధించింది. వీరిచ్చిన సమాచారం మేరకు తూర్పు నౌకాదళంలో విచారణకు ఎన్ఐఎ బృందం రెండు మూడు రోజుల్లో రానుంది. 2018 అక్టోబర్ నుంచి పాకిస్థాన్కు ఈ సెయిలర్స్ సమచారం అందించడం ప్రారంభించారు. ముఖ్యంగా యుద్ధనౌకలు, సబ్మెరైన్ల కదలికలపై సమాచారం ఎప్పటికప్పుడు చేరవేశారు. ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది..? వివిధ జలాంతర్గాముల ప్రస్తుత స్థితి ఏమిటి.. ఇలా కీలకమైన సమాచారం చేరవేశారు. అయితే ఏయే నౌకలు, సబ్మెరైన్ల సమాచారం అందించారు., ఏయే సమయాల్లో అందించారు.. ఆ సమయంలో ఆయా నౌకలు, జలాంతర్గాములు ఎక్కడ ఉన్నాయి.. ఏ ఆపరేష న్లో ఉన్నాయి.. సెయిలర్స్ ఇచ్చిన సమాచారం వల్ల నౌకాదళానికి, దేశ భద్రతకు ఏ మేరకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. ఇలా పూర్తి సమాచారాన్ని సేకరించే దిశగా ఎన్ఐఏ బృందం ప్రయతి్నంచనుంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే తూర్పు నౌకాదళానికి సమాచారం ఇచ్చినట్లు నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం. -
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్గానూ కొనసాగుతారు. -
విశాఖ నేవీ కోస్ట్ కామాండర్కి సీఎం వైఎస్ జగన్ సన్మానం
-
నౌకాదళానికి మరో రక్షణ కవచం
భారత నౌకాదళంలో మరో రక్షణ కవచం చేరనుంది. భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్ నిర్మాణంతో విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ స్థానం సంపాదించింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో మాత్రం వెనకబడి ఉంది. ఈ రంగంలోనూ బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో భారత్.. విక్రాంత్ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ క్లాస్ యుద్ధనౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమవుతోంది. నిర్మాణానికి పదేళ్లు.. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి షిప్యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటోంది విక్రాంత్. జయమ్ సమ్ యుద్ధి స్పర్థః అనే రుగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా దీనిని రూపొందిస్తున్నారు. ‘నాతో యుద్ధమంటే నాదే గెలుపు’ అని ఈ శ్లోకానికి అర్థం. ►1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌకా డిజైన్ మొదలు పెట్టారు. ►2009లో కీలక భాగాల్ని పూర్తి చేశారు. ►2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్ని బయటికి తీసుకొచ్చారు. ►2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ►సముద్రంలో కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయి సేవలకు ఉపయోగించనున్నారు. ►2020లో భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. – ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇండియన్ నేవీలో కీలకమైన తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. ఇక భారత్దే పైచేయి.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మహా సముద్రం.. హిందూ మహాసముద్రం. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేధ్యంగా నిలవనుంది. 7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహా సముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని విక్రాంత్ సొంతం చేసుకుంది. విక్రాంత్కు కీలక బాధ్యతలు.. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ యుద్ధ విమాన వాహక నౌక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. ముఖ్యంగా నౌకాదళంలో చేరనున్న మిగ్–29 యుద్ధ విమానాలకు విక్రాంత్ ఉపయుక్తమవుతుంది. – వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్, తూర్పు నౌకాదళాధిపతి -
విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’
సాక్షి, వైజాగ్: విశాఖ కేంద్రంగా తీరప్రాంతానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న ఏడుగురు నేవీ అధికారులను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు, ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ నిర్వహించారు. ఓ హవాలా బ్రోకర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరందరినీ వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయస్థానం జనవరి 3వ తేదీవరకూ రిమాండ్ విధించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేవీరాడార్ ఏర్పాటు చేయొద్దు
సాక్షి, పూడూరు: దామగుండం అటవీ ప్రాంతంలో 2,900 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన నేవీరాడార్ కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ గురువారం పూడూరు మండల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో విద్యార్థులు మాట్లాడుతూ.. నేవీ రాడార్ ఏర్పాటు చేసి తమకు అన్యాయం చేయరాదని తమకు బతకాలని ఉందని, తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని, తమ ఆరోగ్యాలను పాడు చేయరాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. కేసీఆర్ తాత, మోదీతాత మాకు న్యాయం చేయలని కోరారు. నేవీరాడార్ ద్వారా విషపూరిత సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయరాదని వేడుకున్నారు. త్వరలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్కు, హైకోర్టు న్యాయమూర్తికు పోస్టుకార్డు ద్వారా ఉత్తరాలను రాస్తామని విద్యార్థులు తెలిపారు. -
కోస్తా తీరంలో త్రివిధ దళాల కసరత్తు
సాక్షి, కాకినాడ : సాగరతీరంలో త్రివిధ దళాల విన్యాసాల కసరత్తు నిర్వహించేందుకు ఆర్మీ, నేవీ సిబ్బంది కోస్తా తీరాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. మంగళవారం కాకినాడ సూర్యారావుపేట బీచ్లో యుద్ధట్యాంకర్లతో సైనికులు ట్రైల్రన్లు, గస్తీలు నిర్వహిస్తున్నారు. కాకినాడ బీచ్లో నేవెల్ ఎన్క్లేవ్ వద్ద ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఇండో–అమెరికా త్రివిధ దళాల విన్యాసాల కోసం రెండు రోజులుగా కసరత్తులు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ఆస్తి, ప్రాణనష్టం నివారణ కోసం, దేశరక్షణ, యుద్ధ సమయంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాల ఆధ్వర్యంలో నిర్వహించే విన్యాసాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం విశాఖ నేవెల్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘర్మోడే ఆధ్వర్యంలో స్కై డ్రైవింగ్ చేసిన ఎనిమిది మంది కమాండోలు పారాచూట్లతో సాగరతీరంలో దిగారు. యుద్ధనౌకలు ఇన్షోర్, ఆఫ్షోర్, కేజీ బేసిన్ వంటి ఆయిల్ క్షేత్రాల రక్షణ కల్పించడంలో ఆర్మీ సిబ్బంది చేసిన కసరత్తు ఆకట్టుకుంది. యుద్ధ సమయంలో శత్రుదేశాలకు చెందిన యుద్ధ నౌకలు, ఆయిల్ రిగ్లను నాశనం చేసేందుకు జెమినీ బోట్లలో వచ్చిన కమాండోలను సివరింగ్ ఆపరేషన్ ద్వారా సమర్థంగా తిప్పికొటిన ఆపరేషన్, సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు హెలికాఫ్టర్ ద్వారా చేసిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు, నేవీ క్రాస్ డెకింగ్, ఆర్మీ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కసరత్తులో త్రివిధ దళాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేవీ హెలికాప్టర్ తో గాలింపు
-
నేవీలో హై అలర్ట్
కోయంబత్తూర్/కొచ్చి: భారతీయ నేవీలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు తమిళనాడులోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ప్రారంభించిన నిఘా రెండో రోజూ కొనసాగింది. ‘ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమా చారం మేరకు నేవీ.. సముద్రాలు, తీర ప్రాంతాల్లో హై అలర్ట్ను విధించింది’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు శ్రీలం క నుంచి సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి చొర బడి వివిధ నగరాలకు వెళ్లినట్లు సమాచారం అందడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పా రు. గుజరాత్ తీరంలో పాక్ పడవలు గుజరాత్లోని కచ్ జిల్లాకు సమీపంలో గల హరామి నాలా ప్రాంతంలో పాక్కు చెందిన 2 మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. -
విశాఖలో మిలాన్ విన్యాసాలు
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను సమర్థవంతంగా నిర్వహించి తన సత్తా చాటిన తూర్పు నావికాదళం మరోసారి అంతటి కీలకమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. పలు దేశాల నావికాదళాలు పాల్గొనే మిలాన్ విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ విన్యాసాలు జరగనున్నాయని తూర్పు నావికాదళం(ఈఎన్సీ) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్ ప్రకటించారు. నేవీ ప్రధాన కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శత్రు దేశాలకు మన సాయుధ సంపత్తి, సైనిక బలగాల శక్తి సామర్థ్యాలు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే మిత్ర దేశాలతో అనుబంధాన్ని పటిష్ట పర్చుకోవాలన్నారు. ఈ రెండు లక్ష్యాల సాధనకు సంయుక్త విన్యాసాలు దోహదపడతాయన్నారు. ఆ లక్ష్యాలతోనే 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది అండమాన్ నికోబార్ దీవుల్లో నావికాదళం నిర్వహించిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది విశాఖలో నిర్వహించే మిలాన్లో అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి. సాక్షి, విశాఖపట్నం: నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్ విన్యాసాలకు తొలిసారిగా విశాఖ వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ప్రకటించారు. గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయని.. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్సీ సమాయత్తమవుతోందన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఇండోర్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎ.కె. జైన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మడే ఆధ్వర్యంలో ఆర్మ్డ్ గార్డులు, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, సీ క్యాడెట్లు, వివిధ నౌకలు, సబ్మెరైన్ల సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం గా వ్యవహరిస్తూ సముద్ర తీరంలో నిత్యం సన్నద్ధంగా ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ జైన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాలు పెరుగుతుండటం శుభపరిణా మమన్నారు. ఈ బంధం మరింత బలపరచుకునేందుకు మార్చి 2020లో జరగనున్న మిలా న్ బహుపాక్షిక విన్యాసాలను భారత నౌకాదళం నిర్వహిస్తోందన్నారు. ఇండియన్ ఫ్లీట్ రివ్యూ తర్వాత అంతటి చరిత్రాత్మకమైన ఈవెంట్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీచ్రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వైస్ అడ్మిరల్ నారాయణ్ ప్రసాద్ వీరమరణం పొందిన నౌకాదళ సిబ్బందికి ఘన నివాళులర్పించారు. -
ఆగని వరదలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం/బెంగళూరు/ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లోని వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు, గోడలు విరిగిపడటం తదితర కారణాలతో ఆదివారం నాటికి కేరళలో 72 మంది చనిపోగా, మధ్యప్రదేశ్లో 32 మంది మహారాష్ట్రలో 35 మంది, గుజరాత్లో 31 మంది, కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 201కు చేరుకుంది. మరోవైపు సహాయ చర్యలను ముమ్మరం చేసేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, నేవీ బృందాలతో పాటు వాయుసేనను(ఐఏఎఫ్) హెలికాప్టర్లను కూడా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. రోడ్డుమార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, తాగునీరు అందజేస్తున్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన హంపీలోకి వరదనీరు చొచ్చుకురావడంతో అధికారులు పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమిత్ షా ఏరియల్ సర్వే.. కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగాఆదివారం నాటికి కర్ణాటకలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడియూరప్ప, ఇతర ముఖ్యనేతలతో కలిసి బెళగావి, బాగల్కోటే, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం షా స్పందిస్తూ..‘ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. వర్షాలు కొంచెం తెరిపినిచ్చినప్పటికీ కొండచరియలు విరిగిపడే ప్రమాదముందనీ, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ సూచించారు. తన నియోజకవర్గమైన వయనాడ్కు చేరుకున్న రాహుల్ గాంధీ ఓ పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు. బాధితులకు తక్షణసాయం అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం వివక్ష చూపుతోంది: కాంగ్రెస్ వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయం విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ విమర్శించింది. పార్టీ ప్రతినిధి జైవీర్ షేర్గిల్ మాట్లాడుతూ..‘వరదలు లేకున్నా ఉత్తరప్రదేశ్కు రూ.200 కోట్లు కేటాయించి, వరదలతో అతలాకుతలమైన అస్సాంకు రూ.250 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతేడాది భారీ వర్షాలు, వరదలతో కేరళకు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం జరిగితే రూ.3 వేల కోట్లు్లమాత్రమే ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. సూపర్ పోలీస్.. సాక్షి, అమరావతి : గుజరాత్లో వరదలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు ఓ పోలీస్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మోర్బీ జిల్లా కల్యాణ్ పూర్ గ్రామంలోని పాఠశాలలో 43 మంది చిన్నారులు చదువుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉపాధ్యాయులు, పిల్లలు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ వరద ఉధృతికి బోట్లు ముందుకు కదలకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానిస్టేబుల్ పృథ్వీరాజ్ జడేజా ఇద్దరు బాలికల్ని భూజాలపై కూర్చోబెట్టుకుని నడుములోతులో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిని దాటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
వరదలో మహాలక్ష్మి ఎక్స్ప్రెస్
సాక్షి ముంబై: చిమ్మ చీకటి..చుట్టూ వరదనీరు.. విషకీటకాలు, పాముల భయం.. చిన్నారుల ఏడ్పులు.. మంచి నీరు కూడా అందని పరిస్థితి... ఇది ముంబై– కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికుల దుస్థితి. శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలు దేరిన ఈ రైలు ముంబై శివారు ప్రాంతమైన వాంగణీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో నిలిచిపోయింది. సుమారు 17 గంటల అనంతరం రైలులో చిక్కుపోయిన 1,050 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఎయిర్ఫోర్స్, నేవీ, ఆర్మీ, పోలీసులు, స్థానికుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగారు. ప్రయాణికులెవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లాస్ నది ఉప్పొంగింది. సెంట్రల్ రైల్వే మార్గంపై బద్లాపూర్, వాంగణీ ప్రాంతాల్లోని రైల్వేట్రాక్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినస్ నుంచి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరిన సీఎస్ఎంటీ–కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ రైలు వాంగణీ ప్రాంతంలో వరదలో చిక్కుకుంది. రాత్రంతా రైలులోనే... వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులు ఒకేచోట రాత్రంతా రైల్లోనే గడపాల్సి వచ్చింది. ఓ వైపు చుట్టూ వరద నీరు, చిమ్మచీకటి.. నీరు బోగీలోకి వస్తే ఏమవుతుందోననే భయాం దోళన. మరోవైపు విష కీటకాలు, పాములు ఏమైనా లోనికి వస్తే ఎలా అనే భయం... ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ల ద్వారా మిత్రులతోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా ఎవరికి తెలిసిన వారికి వారు ఫోన్లు చేసి, వీడియోలు పంపి సాయం కోరారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలతోపాటు వయోవృద్ధులు, వికలాంగులు కూడా ఈ రైలులో ఉన్నారు. వీరందరూ రాత్రంతా రైలు బోగీలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు వెంట తీసుకుచ్చిన నీరు, ఆహారం, పాలు అయిపోవడంతో పిల్లల ఏడ్పులతో అందరిదీ నిస్సహాయ స్థితి. ఊరట తెచ్చిన రైల్వే సిబ్బంది ప్రకటన.. రాత్రంతా తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య గడిపిన ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ప్రకటనతో కొంత ఊరట లభించింది. రైలు సిబ్బంది, పోలీసులు ఓ బ్లూ టూత్ మైక్ ద్వారా ప్రతి బోగీలోకి వెళ్లి ‘అందరం సురక్షితంగానే ఉన్నాం. ఎవరూ భయపడవద్దు. ఎవరూ కూడా తొందరపడి రైలు దిగవద్దు’అంటూ సూచనలు చేశారు. రెస్క్యూ టీమ్ వచ్చి అందరినీ రక్షిస్తుందని ప్రకటించారు. రెస్క్యూ టీమ్ రాక.. వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంతలోనే ఎన్డీఆర్ఎఫ్, నావిక దళం బృందాలు అక్కడికి చేరుకోవడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక బృందాలు ఎనిమిది రబ్బరు బోట్లు, ఇతర సామగ్రి తమ వెంట తెచ్చాయి. ముఖ్యంగా ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముందుగా పరిసరాలను పర్యవేక్షించారు. రబ్బరు బోట్లతో రైలు వద్దకు చేరుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడి నుంచి రైలు వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం స్థానికుల సాయం తీసుకున్నారు. రైలు వద్దకి చేరుకున్న అనంతరం బోట్ల ద్వారా ప్రయాణికులను బృందాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా 17 గంటల అనంతరం రైలులోని వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 2.20 గంటలకు ముగిశాయి. అనంతరం 14 బస్సులు, మూడు టెంపోల ద్వారా వారందరినీ సురక్షిత స్థలాలకు తరలించారు. తర్వాత వారి కోసం కళ్యాణ్ నుంచి ప్రత్యేక 19 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మన్మాడ్, దౌండ్ మార్గం మీదుగా ఈ రైలు కొల్హాపూర్కు చేరుకోనుంది. మరో 120 మందిని కాపాడిన బృందాలు ఆకస్మికంగా వరద చుట్టుముట్టడంతో బద్లాపూర్లోని ఓ పెట్రోల్ పంప్ భవనంపైకి చేరుకున్న 70 మందిని, షాహద్లోని ఓ రిసార్టులో ఉన్న మరో 46 మందిని ఎయిర్ఫోర్స్ సిబ్బంది కాపాడారని అధికారులు తెలిపారు. అలాగే, కల్యాణ్ జిల్లాలో 9 మందిని రక్షించినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. థానేలో రికార్డు స్థాయిలో శనివారం ఉదయానికి 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉల్హాస్ నగర్లో 200 మి.మీ. వాన కురిసింది. తక్షణం స్పందించిన కేంద్రం రైలు వరదలో చిక్కుకుందనే విషయం తెలిసిన వెంటనే కేంద్రం అప్రమత్తమయింది. ప్రయాణికులను రక్షించేందుకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా వెంటనే ముంబై లోని రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరమైన సామగ్రితో సంఘటన స్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి ఉదయం 9.40 గంటలకు చేరుకున్నాయి. అమిత్ షా విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ కూడా స్పందించి రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు, సుశిక్షితులైన 130 మంది సిబ్బంది కలిసి ఆహారం, మంచినీరు, సహాయక సామగ్రిని వెంట తీసుకుని వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖ అధికారులు వైద్య బృందాలను అక్కడికి పంపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తీసుకువచ్చిన బృందాలను అమిత్షా అభినందించారు. పరిమళించిన మానవత్వం.. మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటికి వచ్చిన అనంతరం స్థానిక గ్రామస్తులు వారికి అవసరమైనవి సమకూర్చారు. ముఖ్యంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. బద్లాపూర్లోని సహ్యాద్రి మంగళ కార్యాలయంలో వారందరికీ భోజనం, మంచి నీరు అందించి మానవత్వం చాటుకున్నారు. గర్భవతులు సురక్షిత స్థలాలకు: మహాలక్ష్మి రైలులోని సుమారు వెయ్యి మందిలో తొమ్మిది మంది గర్భవతులు. వీరిలో రేష్మా కాంబ్లే తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో ఆమెను ముందుగా తీసుకు వచ్చారు. రైలులో ఉన్న 9 నెలల చిన్నారితోపాటు ఆమె తల్లిని కూడా ఒడ్డుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా 37 మందితో కూడిన డాక్టర్ల బృందం సాయంతో గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు
న్యూఢిల్లీ: చైనా ఆర్మీలోని వివిధ ఇతర విభాగాల నుంచి నిధులు, వనరులను భారీ స్థాయిలో నౌకాదళానికి మళ్లించారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్వీర్ సింగ్ గురువారం చెప్పారు. ఈ విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సైనిక అభివృద్ధిపై చైనా రక్షణ శాఖ బుధవారమే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. తన మిలటరీ అభివృద్ధిని ఇండియా, అమెరికా, రష్యాల అభివృద్ధితో చైనా ఈ శ్వేతపత్రంలో పోల్చింది. అందులోని వివరాలను పరిశీలించిన మీదట కరమ్వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ నిర్వహించిన ‘నౌకల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’ అనే కార్యక్రమంలో కరమ్వీర్ సింగ్ ప్రసంగించేందుకు వచ్చి, అక్కడి విలేకరులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘చైనా తన శ్వేత పత్రంలోనే కాదు. గతంలోనూ ఈ వివరాలు చెప్పింది. ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి నిధులను, వనరులను నౌకాదళానికి వారు మళ్లించారు. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేశారు. మనం దీనిని జాగ్రత్తగా గమనిస్తూ, మనకున్న బడ్జెట్, పరిమితుల్లోనే ఎలా స్పందించగలమో ఆలోచించాలి’ అని అన్నారు. అనంతరం వేదికపై కరమ్వీర్ ప్రసంగిస్తూ 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నౌకా నిర్మాణ రంగం ఎంతగానో చేయూతనివ్వగలదని పేర్కొన్నారు. -
నౌకాదళం పటిష్టతకు కలసి పనిచేద్దాం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి,అమరావతి: నౌకాదళ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మరింత బలీయమైన శక్తిగా రూపుదిద్దుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. భారత నౌకాదళం, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కోరారు. తూర్పు నౌకాదళ అభివృద్ధికి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. భారత నావికాదళం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించి విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని స్వర్ణజ్యోతి ఆడిటోరియంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్సింగ్, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళ వ్యవస్థను శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నౌకాదళ అధికారులకు రాజ్నాథ్సింగ్ సూచించారు. తీర ప్రాంతంలో భద్రతపై జగన్ సమీక్ష భారత నౌకాదళం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. నావికా దళంలో తలెత్తే సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నౌకాదళం చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్కుమార్ జైన్ను అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో భద్రతపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. దాదాపు అరగంటకు పైగా ఈ సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరీ డైనింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మర్యాదపూర్వక విందులో రాజ్నాథ్సింగ్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, నావికాదళ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. అనంతరం రక్షణ మంత్రితో సీఎం జగన్ మాట్లాడారు. ఆ తర్వాత నౌకాదళ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను జగన్ తిలకించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో స్వయంగా రాజ్నాథ్సింగ్ వాహనం వరకూ వచ్చి వీడ్కోలు పలికారు. అంతకుముందు నావికాదళం అధికారులు స్వయంగా ఎయిర్పోర్ట్కు వచ్చి గార్డ్ ఆఫ్ హానర్తో వైఎస్ జగన్కు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట డీజీపీ గౌతమ్ సవాంగ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. తాడేపల్లి చేరుకున్న సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి తాడేపల్లికి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కోసం గురువారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్కు తరలించే ప్రతిపాదన కోసం శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేసీఆర్తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. 7.10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో వైఎస్సార్సీపీ శ్రేణులను కలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరకున్నారు. అక్కడ ఈస్ట్రన్ నేవల్ కమాండ్(ఈఎన్సీ) సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్మోహన్రెడ్డి వచ్చారు. -
దేనికైనా సిద్ధం..
సరిహద్దులో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలను గురువారం కూడా కొనసాగించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి వరుసగా ఏడోరోజూ తన కపట బుద్ధిని మరోమారు చాటింది. అయితే, దాయాది దేశం చేపట్టే ఎలాంటి దుందుడుకు చర్యలనైనా దీటుగా తిప్పికొడతామని భారత్ స్పష్టంచేసింది. బుధవారం దాడిపై పాక్ చేసినదానికి, చెప్పినదానికి పొంతనలేకపోవడాన్ని ఎండగట్టింది. భారత త్రివిధ దళాల ప్రతినిధులు సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి పాక్ దుర్నీతిని కళ్లకు కట్టారు. ఎఫ్–16 యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి పంపలేదన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ విమాన శకలాలను ప్రపంచానికి చూపారు. వర్ధమాన్ఒక ఎఫ్–16ను కూల్చేశారు.. భారత సైనిక స్థావరాలపై బుధవారం చేసిన దాడిలో పాకిస్తాన్ అత్యాధునిక ఎఫ్–16 యుద్ధవిమానాలను వినియోగించిందని ఐఏఎఫ్ ఎయిర్చీఫ్ మార్షల్ ఆర్జీకే కపూర్ తెలిపారు. ‘పాక్ చెరలోని వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ విడుదల కానుండటంపై మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నాం. పాక్ యుద్ధ విమానాలు భారత గగనతల ఉల్లంఘనకు పాల్పడటంతో భారత ఫైటర్జెట్లు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా పాక్కు చెందిన ఓ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని తన మిగ్–21 బైసన్ ఫైటర్ జెట్తో వర్ధమాన్ నేలకూల్చారు. అనంతరం ప్రమాదానికి గురైన విమానం నుంచి ప్యారాచూట్ ద్వారా తప్పించుకున్న వర్ధమాన్ను పాక్ సైన్యం అరెస్ట్ చేసింది’అని తెలిపారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.వి. కపూర్,నేవీ రేర్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్, ఆర్మీ మేజర్ జనరల్ సురిందర్సింగ్ మహల్ భారత ఆర్మీ స్థావరాలు సేఫ్ భారత సైనిక స్థావరాలపై దాడికి తాము ఎఫ్–16 ఫైటర్ జెట్లను వాడలేదని పాకిస్తాన్ బుకాయించడంపై కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో భారత ఫైటర్జెట్లు నేలకూల్చిన యుద్ధవిమానం నుంచి అమ్రాన్ క్షిపణుల శకలాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ మిస్సైళ్లను పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధవిమానాల్లో వాడుతోంది. ఈ దాడిలో భారత ఆర్మీ స్థావరాలకు నష్టం చేకూర్చడంలో పాక్ వైమానిక దళం విఫలమైంది. తాము రెండు భారత యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ అబద్ధాలు చెబుతోంది. నిజానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లో రెండు ప్యారాచూట్ల ద్వారా కిందకు దిగింది ఎఫ్–16 యుద్ధ విమానాల పైలట్లే. ఈ రెండు ఫైటర్జెట్లను భారత్కు చెందిన మిగ్–21 బైసన్ యుద్ధవిమానం కుప్పకూల్చింది. తొలుత ఇద్దరు భారత పైలట్లు తమ కస్టడీలో ఉన్నారన్న పాక్ ఆ తర్వాత మాట మార్చింది’అని విమర్శించారు. ఈ సందర్భంగా పాక్ ఎఫ్–16 యుద్ధవిమానాల్లో వాడిన అమ్రాన్ క్షిపణుల శకలాలను మీడియా ముందు ప్రదర్శించారు. ‘జెనీవా’ మేరకే వర్ధమాన్ విడుదల బాలాకోట్లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్ దాడులకు సంబంధించి సాక్ష్యాలను ఎప్పుడు, ఎలా విడుదల చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఇష్టమని కపూర్ అభిప్రాయపడ్డారు. çసుహృద్భావ చర్యల్లో భాగంగా భారత పైలట్ వర్ధమాన్ అభినందన్ను విడుదల చేస్తున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ చెప్పడంపై స్పందిస్తూ..‘దీన్ని మేం సుహృద్భావ చర్యగా పరిగణించడం లేదు. జెనీవా నిబంధనల ప్రకారమే వర్ధమాన్ను విడుదల చేస్తున్నారు. బాలాకోట్ దాడుల్లో ఉగ్రవాదులకు తీవ్రనష్టం చేకూర్చినట్లు మా దగ్గర పక్కా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. వైమానిక దాడిలో భాగంగా మేం సరైన లక్ష్యాలనే ఛేదించాం. ఈ దాడుల్లో జరిగిన నష్టం, చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యపై ఇప్పటికిప్పుడు ఓ అంచనాకు రావడం సరికాదు’అని వ్యాఖ్యానించారు. ఎలాంటి దాడినైనా తిప్పికొడతాం: ఆర్మీ సరిహద్దులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉందని ఆర్మీ మేజర్ జనరల్ ఎస్.ఎస్.మహల్ తెలిపారు. ‘భద్రతాపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనాఎదుర్కొనేందుకు సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచాం. భారత్–పాక్ల మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట గగనతల రక్షణ వ్యవస్థల ను ఏర్పాటు చేశాం. అలాగే ఆర్మీని హై అలర్ట్లో ఉంచాం. ప్రస్తుతం భారత్ పూర్తి సన్నద్ధతతో ఉంది. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్య ఎదురైనా తిప్పికొడతాం’అని హెచ్చరించారు. పాక్కు దిమ్మతిరిగేలా జవాబిస్తాం: నేవీ సముద్ర జలాల్లో పాక్ దుస్సాహసానికి పాల్పడితే దీటుగా తిప్పికొడతామని భారత నేవీ రేర్ అడ్మిరల్ దల్బీర్సింగ్ గుజ్రాల్ తెలిపారు. ‘భూ, వాయు, జల మార్గాల్లో దేశానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. పాక్ ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే త్వరితగతిన, ఊహకందని రీతిలో జవాబిస్తాం. భూ, వాయు, జలమార్గాల్లో పాక్ దాడిని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. త్రివిధ దళాలైన మేం దేశం, దేశప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు. బాలాకోట్ పైలట్ ప్రాజెక్టే.. పాకిస్తాన్లో జైషే ఉగ్రవాదులు లక్ష్యంగా భారత వాయుసేన(ఐఏఎఫ్) చేసిన దాడిపై ప్రధాని మోదీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్లో జరిగింది ‘పైలట్ ప్రాజెక్టు’ మాత్రమేననీ, నిజమైన ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానోత్సవం అనంతరం మాట్లాడుతూ..‘మీరంతా మీ జీవితాలను ల్యాబుల్లోనే గడుపుతారు. తొలుత పైలట్ ప్రాజెక్టును చేపట్టడం మీ అలవాటు. అనంతరం దాన్ని క్రమంగా విస్తరిస్తారు. ఇటీవల ఓ పైలట్ ప్రాజెక్టు(బాలాకోట్) జరిగింది. ఇప్పుడు నిజమైన ప్రాజెక్టును చేపట్టాలి. ఇంతకుముందు చేసింది ప్రాక్టీస్ మాత్రమే’ అని మోదీ పేర్కొన్నారు. దీంతో సభికులు ఒక్కసారిగా పెద్దఎత్తున కరతాళధ్వనులతో తమ హర్షాన్ని తెలియజేశారు. -
ఉగ్రవాదులతో మా యుద్ధం కొనసాగుతుంది : సైన్యం
-
ఉగ్రవాదులతో మా యుద్ధం కొనసాగుతుంది : సైన్యం
న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాలు గురువారం సాయంత్రం సంయుక్తంగా సమావేశం అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలు కీలక విషయాలపై మీడియాతో సమావేశం నిర్వహించారు. 'భారత సైనిక స్థావరాలపై పాక్ బాంబులు వేసింది. వాయుసేన వేగంగా స్పందించి వాటిని తిప్పికొట్టింది. ఫిబ్రవరి 27న ఉ.10 గంటలకు పాక్ విమానాలు చొరబడడాన్ని గమనించాము. వెంటనే వైమానిక దళం స్పందించింది. మిగ్ 21, సుఖోయ్, మిరాజ్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. మా దాడిలో పాక్కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాము. ఈ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలింది. ఈ ఆపరేషన్లో భారత్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మిగ్-21ను కోల్పోయాము. రెండు పాక్ విమానాలను భారత్ కూల్చింది. పాకిస్తాన్ అనేక అబద్ధాలు ఆడింది. ఇద్దరు పైలట్లు తమ ఆధీనంలో ఉన్నారని తప్పుడు సమాచారం చెప్పి, ఆ తర్వాత మాట మార్చింది. ఎఫ్-16 విమానాలు వాడలేదంటూ పాక్ కట్టుకథలు చెప్పింది. అయితే ఎఫ్-16 విమానాలు వాడిందనడాకి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల పాక్ కుట్రలు ఫలించలేదు' అని ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆర్జీకే కపూర్ తెలిపారు. ఈ సందర్భంగా పాక్ ఉపయోగించిన విమాన శకలాలను ఆర్మీ మీడియాకు చూపించింది. 'ఎల్ఓసీ వెంబడి చాలా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నాం. ఎల్ఓసీ వెంట భారత సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. పాక్ చర్యలు తిప్పి కొట్టేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. పధాతిదళాలు నిరంతరాయంగా గస్తీ నిర్వహిస్తున్నాయి' అని ఆర్మీ ఛీఫ్ మేజర్ జనరల్ సురేందర్ సింగ్ మహల్ చెప్పారు. 'ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారతీయ నావికా దళం సర్వసన్నద్ధంగా ఉంది. సముద్రం, భూమి నుంచి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దేశ రక్షణకు నేవీ ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా సిద్ధం' అని నేవీ ఛీఫ్ రేర్ అడ్మిరల్ దల్బీర్ సింగ్ గుజరాల్ అన్నారు. 'అభినందన్ రేపు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాము. జెనీవా ఒప్పందం ప్రకారమే అతన్ని తిరిగి పంపుతున్నారని భావిస్తున్నాము. త్రివిధ దళాలు ఒక్కటై దేశ భద్రతను కాపాడుతాయి. కేవలం ఉగ్ర శిబిరాలపై దాడి చేయడానికి మాత్రమే ఆపరేషన్ చేపట్టాము. కానీ పాక్ మాత్రం భారతీయ మిలిటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నించింది. దేశ రక్షణకు, ఈ ప్రాంత పరిరక్షణకు ఆర్మీ కట్టుబడి ఉంది. పాక్ ఏ రకంగా చొరబడటానికి ప్రయత్నించినా గట్టి బుద్ధి చెప్తాము. మా యుద్దం ఉగ్రవాదులతో కొనసాగుతుంది' అని భారత త్రివిధ దళాలు పేర్కొన్నాయి. -
ఫలించిన అమ్మ పోరాటం!
అనుమానాస్పదరీతిలో కన్నబిడ్డను కోల్పోయి రెండు దశాబ్దాలకుపైగా మానసిక క్షోభకు గురైన ఓ అమ్మ న్యాయస్థానంలో నెగ్గింది! ఆమె వేదనకు ముగింపు పలుకుతూ నౌకాదళ ఉద్యోగి అమర్ అశోక్ పల్దే మృతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఉత్వర్వులు జారీ చేసింది. అరుదైన చర్యగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ.. – సాక్షి, హైదరాబాద్ ఇది ఓ అమ్మ ఆవేదన... ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనురాధా అశోక్ పల్దే వయసు 70కి పైనే ఉంటుంది. దేశసేవ కోసం నౌకాదళంలో చేరిన ఆమె కుమారుడు అమర్ అశోక్ పల్దే దాదాపు రెండు దశాబ్దాల క్రితం కాకినాడ వద్ద నిర్వహించిన విన్యాసాల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నేవీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయాడని తేల్చారు. దీంతో కుమారుడి మృతిపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ ఆ తల్లి వేడుకున్నారు. దీనికి స్పందించకపోవడంతో న్యాయపోరాటం ప్రారంభించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా చేసిన ఆమె పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అమర్ అశోక్ పల్దే మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్దే మృతిపై స్వతంత్ర ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా స్థానిక అధికారులు సేకరించిన ఆధారాలను అవసరాన్ని బట్టి పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. నేవీ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకోవచ్చని తెలిపింది. సీబీఐ విచారణకు సహకరించాలని స్థానిక పోలీసులు, నేవీ అధికారులను ఆదేశించింది. ఓ తల్లి ఆవేదనకు సంబంధించిన కేసు కాబట్టి సీబీఐ తక్షణమే దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వరగా ముగిస్తుందనే ముగిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆ రోజు ఏం జరిగిందంటే.. నౌకాదళంలో సీమెన్–1గా ఎంపికైన అమర్ అశోక్ పల్దే కమాండ్ క్లియరెన్స్ డైవింగ్ టీంలో విధులు నిర్వర్తించేవారు. 1993 సెప్టెంబర్ 21న కాకినాడ వద్ద సముద్ర తీరంలో హలో జంప్ పేరుతో ఓ సన్నాహక కార్యక్రమం జరిగింది. దీని ప్రకారం డైవర్లు హెలికాఫ్టర్ నుంచి సముద్రంలోకి దూకి అక్కడి నుంచి తీరానికి ఈదుకుంటూ రావాలి. మొత్తం నలుగురు డైవర్లు సముద్రంలోకి దూకగా అమర్ మాత్రం తీరానికి చేరుకోలేదు. రెండు రోజుల తరువాత అతడి మృతదేహం సముద్ర జలాల్లో తేలుతూ కనిపించింది. అతడి మృతదేహంపై చనిపోకముందే కొన్ని గాయాలున్నట్లు కనుగొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రమాదవశాత్తే అమర్ మృతి చెందారని పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. మొదట బాంబే హైకోర్టులో.. నేవీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అనురాధా అశోక్ పల్దే తొలుత బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగినందున ఈ వ్యవహారంపై విచారణ జరిపే పరిధి తమకు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతుడి తల్లి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి 2016 జూన్ 7న తీర్పునిస్తూ అమర్ మృతిపై బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ చెప్పిన కారణాలు సంతృప్తికరంగా లేవన్నారు. బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీని మరోసారి నియమించాలన్న తీర్పును సవాలు చేస్తూ నేవీ అధికారులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాల్లో విశ్వాసం నెలకొల్పేందుకే... ‘అమర్ మృతిపై కాకినాడ పోలీసులు 1993లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఇంకా పెండింగ్లోనే ఉంది. కాకినాడ పోర్టు పరిధిలో ఘటన జరిగింది కాబట్టి స్థానిక పోలీసులే దర్యాప్తు జరపాలని నేవీ అధికారులు చెబుతున్నారు. నౌకాదళ నిబంధన ప్రకారం పునర్ దర్యాప్తు జరిపే అవకాశం లేదని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవాలని నావికాదళ అధికారులు అప్పీల్లో అభ్యర్థిస్తున్నారు. మరోవైపు తన బిడ్డది అసహజ మరణమంటూ దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని మృతుడి తల్లి కోరుతున్నారు. నౌకాదళం బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ విచారణ నివేదిక నేపథ్యంలో స్థానిక పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మా ముందున్న అన్ని ఆధారాలు, నేవీ చట్టాలను పరిశీలించాం. బాధితులు, మృతుల తల్లిదండ్రుల మనసులో విశ్వాసం నెలకొల్పేందుకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం. దీనివల్ల న్యాయ లక్ష్యం నెరవేరినట్లవుతుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో పరిహారం కోసం మృతుడి తల్లి కాకినాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించారు. నేవీ అధికారుల నిర్లక్ష్యం వల్లే అమర్ అశోక్ మరణం సంబంధించిందని తేల్చిన కోర్టు.. బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. -
నేవీ అమ్ములపొదిలోకి డీఎస్ఆర్వీ
ముంబై: భారత నావికాదళం అమ్ములపొదిలోకి మొట్టమొదటి జలాంతర్గామి సంరక్షణ వాహ నం వచ్చి చేరింది. ‘డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్వీ)’గా వ్యవహరించే ఈ వాహనం పాడైపోయిన జలాంతర్గామి, అందులోని సిబ్బందిని రక్షించడంతోపాటు రహస్య మిషన్లను సైతం సమర్థవంతంగా నిర్వహించగలదు. అతి త్వరలోనే ఇలాంటి మరో వాహనం నేవీలో చేరనుందని, అది విశాఖపట్నంలోని నావల్ బేస్ ఆధారంగా పనిచేయనుంది. ఈ రెండు వాహనాలు హిందూ మహాసముద్ర ప్రాంతంతోపాటు అవతల కూడా తన విధులు నిర్వహిస్తాయి. ఐఎన్ఎస్ సబర్మతి నౌకపై మోహరించిన ఈ డీఎస్ఆర్వీ ముంబై కేంద్రంగా పనిచేయనుంది. దీనిని స్కాట్లాండ్లోని జేఎఫ్డీ సంస్థ తయారు చేసింది. -
డిజిశాసనులు
స్త్రీల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇప్పటికీ మనకు ఆ దుశ్శాసనుడే గుర్తుకు వస్తాడు. టెక్నాలజీ పెరిగింది. స్త్రీలకు రక్షణా పెరిగింది. అయినప్పటికీ.. ఏదో ఒక మూల దుశ్శాసనులు డిజిటల్ వరల్డ్లోకి దూరి మగువల వలువల్ని లాగి.. విలువల్ని నాశనం చేస్తున్నారు. డిజిశాసనులై పట్టి పీడిస్తున్నారు. ఆమె పేరు శోభా సజ్జు. కేరళలోని కొచ్చి. భర్త పేరు సజ్జు. ఉద్యోగస్తుడు. ఆయన ఆఫీస్లోని వాట్సాప్ గ్రూప్లో ఒక అమ్మాయి న్యూడ్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది సజ్జు భార్య శోభ అంటూ అతడి కొలీగ్ లిట్లో ప్రచారం చేశాడు. ఒక యువతి కెమెరా వైపు తిరిగి దుస్తులు మార్చుకుంటున్న వీడియో అది. శోభా సజ్జు ఈ విషయం ఇంటి వరకు తెచ్చాడు సజ్జు. ఖంగు తింది శోభ. వీడియో చూసింది. మరింత షాక్. అసలు అందులో ఉన్నది తను కానేకాదు! ఎవరో ప్రచారం చేస్తే.. తన భర్త ఎలా నమ్మాడు? ఆమె వెళ్లి కమిషనర్కి కంప్లయింట్ ఇచ్చింది. కమిషనర్ సైబర్ సెల్కు కేసును రిఫర్ చేశారు. వీడియోను పరిశీలించిన పోలీసులు అందులో ఉన్నది తను కాదు అన్న శోభ మాటను ధృవపరిచారు. పైగా శోభలా మార్ఫింగ్ కూడా చేయలేదనీ నిర్ధారించారు. కాబట్టి తొలి విచారణకు ఆమె పోలీస్ స్టేషన్కు రావల్సిన అవసరమూ లేదని శోభతో చెప్పారు. కాని ఆమె భర్తను పిలిచారు. ఆ వీడియోలో ఉన్నది తన భార్య శోభే అని సజ్జు వాదించాడు. అప్పటికి శోభ తన తల్లిగారింట్లో ఉంది. భర్త నుంచి విడాకుల నోటీస్ కంప్లయింట్ ఇచ్చిన నాలుగు రోజులకు శోభకు భర్త నుంచి విడాకుల పిటిషన్ కాపీ అందింది. తన భార్య స్వయంగా తనే తన న్యూడ్ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిందనే అభియోగం కింద! శోభకు ఇది ఇంకో షాక్. ఈలోపు పోలీసులు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదని ఘంటాపథంగా రిపోర్ట్ ఇవ్వకపోయినా.. ఆమె కాదు అనే అర్థంలోనే అసంపూర్తి నివేదికను ఇచ్చారు. ఇంకోవైపు లిట్టో మీద ఐపీసీ సెక్షన్ కింద, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీని వల్ల శోభకు ఒనగూడిన లాభం ఏమీలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి స్పష్టమైన నివేదిక రాలేదు. అందుకే శోభ తన పోరాటం ఆపలేదు. వీడియోలో ఉన్నది తను కాదు అని పోలీసులు తేల్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా శోభే అని చెప్పలేదు. అందుకే తను కాదని అస్పష్టంగా చెప్పడం కాదు స్పష్టంగా చెప్తూ నివేదిక కావాలనే పట్టు వీడలేదు శోభ.పిల్లల్నీ దూరం చేశాడు! శోభకు ముగ్గురు పిల్లలు. ఈ గొడవ మొదలైనప్పటి నుంచి పిల్లలు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ప్రతి రెండో శనివారం పిల్లల్ని కలిసే విజిటింగ్ రైట్ను శోభకు ఇచ్చింది కోర్టు. నాలుగు శనివారాలు సాఫీగా గడిచాయి. అయిదో శనివారం వచ్చేసరికి.. పిల్లలతో ఆమె సరిగ్గా ప్రవర్తించట్లేదు కాబట్టి పిల్లలు ఆమెను కలవడానికి ఇష్టపడట్లేదంటూ భర్త రిపోర్ట్ చేశాడు. న్యూడ్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్గా వేసుకున్న డైవోర్స్ పిటిషన్కు ఈ కంప్లయింట్ కూడా తోడై పిల్లలను కలిసే విజిటింగ్ రైట్ను తాత్కాలికంగా కోల్పోయిన శోభకు గుండె ఆగినంత పనైంది. రెండోసారి కోర్టును ఆశ్రయించింది శోభ. న్యూడ్ వీడియో వ్యవహారం వెనక తన భర్త పాత్ర గురించి ఆరా తీయమని. ఆమె విజ్ఞప్తిని మన్నించింది కోర్టు. రీ ఇన్వెస్టిగేషన్లో ఆ వీడియోను మొదట పంపించిన ఫోరెన్సిక్ ల్యాబ్కి కాకుండా ఇతర ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపించమని కోరింది శోభ. కాని పోలీసులు మొదటి ల్యాబ్కే పంపించారు. నివేదిక కూడా మొదటిసారిలాగే అసంపూర్తిగా వచ్చింది. విసిగెత్తిపోయింది శోభ. అయినా తమాయించుకుని సైబర్ ఫోరెన్సిక్స్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ బాడీకి పంపించమని అడిగింది. ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ‘‘అందులో ఉన్నది మీరు కాదుకదా.. వదిలేయండి’ అనే సమాధానమిచ్చారు పోలీసులు. ఆఖరి ప్రయత్నంగా డీసీపీ లోక్నాథ్ బెహరాను కలిసింది. వీడియోను చూపించింది. వీడియో చూశాక.. ఆమెను చూశాడు లోక్నాథ్. ఇందులో ఉన్నది ససేమిరా నువ్వు కాదు అన్నాడు. ఇన్నాళ్లూ భరించావా? ‘‘ఎప్పుడో వచ్చేస్తే నీ పిల్లలు నీ దగ్గరుండే వాళ్లు కదమ్మా’’ అంటూ శోభ కేస్ ఇన్వెస్టిగేషన్ను ఎర్నాకులంలోని లాల్జీ. కే అనే ఏసీపీకి అప్పజెప్తూ ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేశాడు. లాల్జీ ఆ వీడియోను, సంబంధిత నివేదికను తిరువనంతపురంలో ఉన్న ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)కు పంపించాడు. ఆర్నెల్ల తర్వాత.. అంటే పదిరోజుల కిందట సీడాక్ పూర్తి నివేదికను ఇచ్చింది. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదు అని స్పష్టం చేస్తూ! ఆమె చేపట్టిన ఒక యుద్ధం ముగిసింది. విజేతగా నిలిచింది. ఇప్పుడిక పిల్లల కస్టడీ కోసం యుద్ధం ప్రారంభించింది. ‘‘నా భర్త నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే.. ఆ వీడియో నాది కాదు అని తేలగానే దాన్ని వదిలేసేదాన్ని. ఇవ్వకుండా మూలం తెలుసుకునేలా చేశాడు. మంచిదే అయింది. నేనొక మామూలు కుటుంబం నుంచి వచ్చా. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నా పోరాటంలో వాళ్లంతా తోడుగా ఉన్నా.. ఒంటరిగానే అనిపించింది. నా పిల్లలను కలవాలి. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోతుంది’’ అంటోంది శోభ. ఈమె పోరాట పటిమ తక్కిన వారికి స్ఫూర్తి కావాలి. బాధపడడం మాని, నిజాన్ని నెట్ నుంచి బయటికి కక్కించాలి. డబ్బులిస్తే వస్తారని ఫేక్ పోస్ట్ కోల్కతాలోని జయదేవ్పూర్లో ఓ కుటుంబం తన ఇంటి ముందు సీసీటీవీ బిగించుకుంది. ఇంటి తలుపులపై ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ భాషల్లో ‘ఈ ఇల్లు అలాంటిది కాదు. దయచేసి మమ్మల్ని వేధించకండి’ అని రాసి ఉన్న బోర్డును వేలాడదీసుకుంది. దీనంతటికీ కారణం.. ‘‘ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు డబ్బులిస్తే వస్తారు అని వాళ్ల ఫొటోలు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్లతో సహా ఆన్లైన్లో ఎవరో అప్లోడ్ చెయ్యడం! అప్పట్నుంచీ ఎవరెవరో ఫోన్లు చేసి ఆ ఇంట్లోని ఆడవాళ్లను మాటలతో చంపుతున్నారు. కొందరైతే నేరుగా ఇంటికే వచ్చి తలుపు తడుతున్నారు! అదెలా జరిగిందో ఆ ఇంటివారికి తెలియదు. ఆ ఇంటి యజమాని సైబర్ కేఫ్ నడుపుతుంటాడు. 27 ఏళ్ల భార్య, పెద్దవాళ్లయిన తల్లిదండ్రులు, 40 ఏళ్ల అక్క.. ఇదీ అతడి కుటుంబం. ‘‘అక్టోబర్ మొదటివారంలో నా పేరుతో, అడ్రస్తో ఎవరో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. మా ఇంట్లో వాళ్ల ఫోన్ నెంబర్లు, మెట్రో స్టేషన్కు మా ఇల్లు ఎంత దూరంలో ఉంటుందో వివరాలు ఇచ్చారు. తర్వాత నా తమ్ముడి ఫొటో (సైబర్కేఫ్ ఓనర్), మా నాన్న ఫొటో అప్లోడ్ చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి నాకు అసభ్యకరమైన వాట్సాప్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి’’ అని ఆ నలభై ఏళ్ల మహిళ కోల్కతా సైబర్ పోలీస్ సెల్కు ఫిర్యాదు చేశారు. ఆమెకు పెళ్లయింది. అక్కడికి కాస్త దగ్గర్లోనే తన అత్తమామలతో కలిసి ఉంటోంది. తరచు పుట్టింటికి వచ్చి వెళుతుంటుంది. ఇలాంటి వేధింపులే ఆమె ఆడపడుచుకూ (సైబర్ కేఫ్ యజమాని భార్య) వస్తున్నాయి. పైశాచికత్వానికి పరాకాష్ట అయిన ఈ ఆన్లైన్ క్రూరత్వంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఫొటోలు పంచి పెట్టాడు! అతను నేవీ కమాండర్. వయసు 39. భార్య ఒకప్పుడు ఆర్మీలో కెప్టెన్. కుటుంబం ఢిల్లీలో ఉంటోంది. అతడికి పుణె నుంచి ఢిల్లీకి పోస్టింగ్ పడడంతో అక్కడ ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే ఆమె భర్తను వదిలేసి, ఇద్దరు పిల్లలతో పుణె వచ్చి వేరుగా ఉంటోంది. మంగళవారం పుణె పోలీస్ స్టేషన్కి వెళ్లి భర్త మీద ఫిర్యాదు చేసింది. పోర్నోగ్రఫీ అంటే అతడికి పిచ్చి. పదకొండేళ్లుగా చెబుతోంది, ఆ పాడు అలవాటు మానుకొమ్మని. మానుకోలేదు. అత్తమామల చేత చెప్పించింది. మారలేదు. అక్టోబర్లో పుణె ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టింది. íపిటిషన్ ఇచ్చేందుకు కోర్టుకు వెళుతుంటే దారిలో ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఆమెను కలిశాడు. అతను కూడా నేవీ ఆఫీసరే. ఆమె భర్తకు స్నేహితుడు. తన భార్యతో కూడా ఆమె భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఈ వివరాలన్నీ స్టేట్మెంట్లో రాసిచ్చింది. ఫిర్యాదు స్టేట్మెంట్లో ఇవన్నీ వెల్లడించింది కానీ, ఇవన్నీ వెల్లడించడానికి ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. అసలు కేసు వేరు. భార్య ఫొటోలను, ఫ్రెండు భార్య ఫొటోలను, ఇంకో గుర్తు తెలియని మహిళ ఫొటోలను అశ్లీల చిత్రాలకు మార్ఫింగ్ చేసి తన జీ మెయిల్ అకౌంట్ నుంచి బట్వాడా చేస్తున్నాడట ఆమె భర్త. ఆ విషయం చెబుతూ ఈ వివరాలన్నీ ఇచ్చింది. పోలీసులు అతడిపై సెక్షన్ 509 (మహిళ గౌరవాన్ని కించపరిచి, అవమానాలపాలు చెయ్యడం), సెక్షన్ 67 (అశ్లీల సమాచారాన్ని, చిత్రాలను ముద్రించడం లేదా నెట్లో సరఫరా చెయ్యడం) కింద కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేసి విచారించడం కోసం భారత నౌకాదళంలోని అధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. – శరాది -
వైజాగ్లో నేవీ మారథాన్ 2018
-
ఇక విశాఖలో సింబెక్స్ సందడి
విశాఖసిటీ: నాలుగు రోజుల పాటు పోర్టు బ్లెయిర్లో అండమాన్ సముద్రం వేదికగా సాగిన సింబెక్స్–2018 సిల్వర్ జూబ్లీ విన్యాసాలు ఈ నెల 19 నుంచి విశాఖ వేదికగా జరగనున్నాయి. ఇందులో భాగంగా పోర్ట్ బ్లెయిర్ నుంచి భారత్, సింగపూర్ యుద్ధ నౌకలు, విమానాలు, హెలి కాప్టర్లు శుక్రవారం తూర్పునౌకాదళం ప్రధాన కేంద్రం విశాఖకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సింగపూర్ నౌకాదళ బృందానికి తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ కరమ్బీర్సింగ్ జ్ఞాపికలు అందించారు. భారత్ నౌకాదళం, రిపబ్లికన్ ఆఫ్ సింగపూర్ దేశాలు కలిసి పాతికేళ్లుగా సింబెక్స్ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అండమాన్ సముద్రంలో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో ఇరుదేశాలకు చెందిన 12 నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. రెండో విడత విన్యాసాలు విశాఖ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి తూర్పునౌకాదళం అంతా సిద్ధం చేసింది. పాల్గొనే నౌకలివే.. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ తరఫున ఆర్ఎస్ఎస్ ఫర్మిడబుల్, ఆర్ఎస్ఎస్ స్టెడ్ఫాస్ట్, ఆర్ఎస్ఎస్ యూనిటీ, ఆర్ఎస్ఎస్ విగార్, ఆర్ఎస్ఎస్ వాలియంట్, డీప్ సీ రెస్క్యూ వెహికల్ నౌకతో పాటు ఆర్చర్ క్లాస్ జలాంతర్గామి ఆర్ఎస్ఎస్ స్వార్డ్స్మాన్తో పాటు ఎయిర్క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు పాల్గొననున్నాయి. ఇక భారత యుద్ధ నౌకలైన రణ్వీర్ క్లాస్ యుద్ధ నౌక, ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కద్మత్, ఐఎన్ఎస్ కిర్చి, ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సుకన్య, ఐఎన్ఎస్ శక్తితో పాటు సింధుఘోష్ తరగతికి చెందిన సబ్మెరైన్ ఐఎన్ఎస్ సింధుకీర్తితో పాటు ఎయిర్క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు విశాఖ సముద్ర జలాల్లో విన్యాసాల్లో పాల్గొననున్నాయి. సింబెక్స్లో భాగంగా ఇరుదేశాల నౌకాదళాధికారుల విన్యాసాలు, కార్యచరణ సమావేశాలతో పాటు స్నేహపూర్వక వాలీబాల్, బాస్కెట్బాల్ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఈ నెల 18న జరగనున్న నేవీ మారథాన్లో సింగపూర్ నౌకాదళ బృందం పాల్గొననుంది. -
కేరళ వరదలు : డాబాపై అతిపెద్ద ‘థ్యాంక్స్’
కొచ్చి : ప్రకృతి ప్రకోపానికి కేరళ చివురుటాకులా వణికిపోతుంది. కేరళను ముంచెత్తిన వర్షాలతో ఎక్కడ చూసినా హృదయవిదారకర సంఘటనలే కనిపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్స్ అందిస్తున్న సహాయం అంతా ఇంతా కాదు. రేయింబవళ్లు శ్రమిస్తూ.. వరదల్లో బిక్కుబిక్కుమంటున్నవారిని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. సరైన సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఇతర ప్రభుత్వ బృందాలు రావడంతోనే తాము ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు కృతజ్ఞత భావంతో కన్నీంటిపర్యంతమవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, నేవి ఇతర బలగాలు అందిస్తున్న సహాయ చర్యల వీడియోలు, ఫోటోలు ఎప్పడికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. బలగాలు అందిస్తున్న సహాయ చర్యలకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతల మెసేజ్లు పంపిస్తూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ ఇంటి నుంచి నేవి రెస్క్యూ ఆపరేషన్స్కు అతిపెద్ద కృతజ్ఞత అందింది. అదేమిటంటే.. కొచ్చిలో ఓ ఇంటి డాబాపై అతిపెద్దగా ‘థ్యాంక్స్’ చెబుతూ పేయింట్ చేశారు. నేవి రెస్క్యూ ఆపరేషన్స్కు సెల్యూట్ చెబుతూ ఈ ‘థ్యాంక్స్’ మెసేజ్ పేయింట్ చేశారు. గత మూడు రోజుల క్రితమే ఆ ఇంటి నుంచి ఇద్దరు మహిళలను నావల్ ఏఎల్హెచ్ పైలెట్ సీడీఆర్ విజయ్ వర్మ కాపాడారు. ఈ ‘థ్యాంక్స్’ మెసేజ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యూలేట్ అవుతుంది. ఇది కేవలం ప్రజల మన్ననలు పొందడమే కాకుండా.. కేరళలో రెస్క్యూ ఆపరేషన్స్ అందిస్తున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. ఈ థ్యాంక్స్ మెసేజ్కు.. ‘ఇది మా ఇండియా’ అని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. మరో యూజర్ వావ్.. ఇది నేవి, మిలటరీ, ఎయిర్ ఫోర్స్, వాలంటీర్స్, ఇతరులకు మంచి బూస్ట్ను అందిస్తుందని చెప్పాడు. ఇటీవల నొప్పులతో సతమతమవుతున్న ఓ గర్భవతిని నేవి సిబ్బంది కాపాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. కేరళలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుణుడి ప్రకోపానికి బలైన కేరళకు యావత్ దేశం తమ వంతు సహాయం అందిస్తోంది. భారీ ఎత్తున విరాళాలు, ఆహారం, దుస్తులు పంపుతున్నారు. వరదల తాకిడికి తట్టుకోలేక ఇప్పటికే అక్కడ 370 మంది ప్రాణాలు విడిచారు. 19వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ, కేరళకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లను ప్రకటించారు. #Kerala: A 'Thanks' note painted on the roof of a house in Kochi from where the Naval ALH piloted by Cdr Vijay Varma had rescued two women on August 17. pic.twitter.com/lwxHkQwzXc Wow.. I hope this would be the biggest boost to the rescuers Navy, military,air force, volunteers and others etc..... — R.Praveen (@Real_Praveen003) August 20, 2018 — ANI (@ANI) August 20, 2018 -
నేటి నుంచి నేవీ ఎయిర్బేస్
కొచ్చి: కొచ్చి విమానాశ్రయం నీట మునిగి రాకపోకలు నిలిచిపోవడంతో విమానాల్ని సోమవా రం నుంచి కొచ్చిలోని నౌకాదళ విమానాశ్రయానికి మళ్లించనున్నారు. పౌర విమానాలు నడి పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్పారు. ఈనెల 26 వరకు కొచ్చి విమానాశ్రయాన్ని మూసే ఉంచాలని నిర్ణయించడం తెలిసిందే. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ముందుగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
నేవీ హెలికాప్టర్ ద్వారా నిండు గర్భవతిని..
-
వరదలు : పైలట్ చాకచక్యం.. తల్లీ బిడ్డ క్షేమం
కొచ్చి : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత మే నెల నుంచి ఇప్పటివరకూ 324మంది చనిపోయారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వరద తాకిడి తీవ్రతరమవడంతో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నేవీ 21 సహాయ, డైవింగ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ఓ గర్భిణిని రక్షించేందుకు నేవీ హెలికాప్టర్ పైలట్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం పలువురి మన్ననలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ అధికారి ట్విటర్లో పోస్ట్ చేశారు. వివరాలు.... సాజితా జబీల్ అనే మహిళ కొచ్చి ఎయిర్పోర్టు సమీపంలో నివాసం ఉంటున్నారు. నిండు చూలాలైన ఆమెకు శుక్రవారం ఉదయం నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే వారు నివాసం ఉంటున్న ప్రాంతమంతా వరద నీటితో నిండిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు.. నేవీ హెలికాప్టర్ ద్వారా ఆమెను సంజీవని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో హెలికాప్టర్లోకి ఎక్కించడానికి సుమారు 30 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విజయ్ వర్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. A pregnant lady with water bag leaking has been airlifted and evacuated to Sanjivani. Doctor was lowered to assess the lady. Operation successful — SpokespersonNavy (@indiannavy) August 17, 2018 -
థాయ్లాండ్ ఆపరేషన్లో డైవర్ మృతి
బ్యాంకాక్: థాయ్లాండ్ గుహలో చిక్కుకున్న పిల్లలు, వారి కోచ్ను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యల్లో ఓ డైవర్ మృతిచెందాడు. గతంలో నావికా దళంలో పనిచేసిన 38 ఏళ్ల సమన్ గునన్ పిల్లలకు ఆహారం, ఆక్సిజన్ అందించి తిరిగి వస్తుండగా శ్వాస ఆడక మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రొఫెషనల్ డైవర్ చనిపోవడం ఈ ఆపరేషన్ సంక్లిష్టతను తెలియజేస్తోంది. ‘గుహలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అందించేందుకు అతన్ని లోనికి పం పాం. కానీ దురదృష్టవశాత్తూ తిరిగొస్తూ శ్వాస ఆడక స్పృహ కోల్పోయాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయాం. అయినా పిల్లల్ని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయి’ అని నేవీ కమాండర్ తెలిపారు. -
అసంప్షన్ ద్వీపంపై ముందడుగు
న్యూఢిల్లీ: సీషెల్స్లోని అసంప్షన్ ద్వీపంలో నౌకాదళ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నేవల్ బేస్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్, సీషెల్స్ మధ్య అంగీకారం కుదిరింది. భారత పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు డేనీ ఫార్, ప్రధాని మోదీ మధ్య సోమవారం జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో హిందూ మహాసముద్రంలో భారత్ ప్రభావం పెరగనుంది. మోదీ, ఫార్ మధ్య సోమవారం రక్షణతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపైనా చర్చలు జరిగాయి. సీషెల్స్కు 10కోట్ల డాలర్ల (దాదాపు రూ.680కోట్లు ) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. దీని ద్వారా సీషెల్స్లో మిలటరీ మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని ఫార్ పేర్కొన్నారు. మా లక్ష్యం ఒక్కటే!: మోదీ ‘భారత్, సీషెల్స్లు కీలక వ్యూహాత్మక భాగస్వాములు. ప్రజాస్వామ్య విలువలను ఇరుదేశాలు గౌరవిస్తాయి. హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలు, సుస్థిరత నెలకొనాలన్నది మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. 2015లో సీషెల్స్ పర్యటనలో హామీ ఇచ్చినట్లుగా.. డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను సీషెల్స్కు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ద్వీప సముదాయ దేశ రక్షణ సామర్థ్యం, తీర ప్రాంత మౌలికవసతులు పెంచుకునేందుకు భారత్ అన్ని విధాలా సాయం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. సీషెల్స్లో మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, తీరప్రాంత భద్రత, వైట్ షిప్పింగ్ (మిలటరీయేతర వాణిజ్య నౌకల రవాణాపై సమాచార మార్పిడి), సీషెల్స్ దౌత్యాధికారులకు శిక్షణ (ఇరుదేశాల విదేశాంగ శాఖల మధ్య), గోవా సిటీ కార్పొరేషన్– సిటీ ఆఫ్ విక్టోరియా (సీషెల్స్) మధ్య పరస్పర సహకారంపై ఒప్పందాలు కుదిరాయి. భారత రాష్ట్రపతి కోవింద్ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వచ్చిన ఫార్ ఢిల్లీకి రాకముందే అహ్మదాబాద్, గోవాల్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా అలదాబ్రా జాతికి చెందిన రెండు భారీ తాబేళ్లను సీషెల్స్ అధ్యక్షుడు కానుకగా ఇచ్చారు. వీటిని హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉంచనున్నారు. ఫార్.. సోమవారం మోదీతో సమావేశం అనంతరం జరిగిన విందు సమావేశంలో సితార్ వాయించారు. ‘భారత్తో స్నేహబంధాన్ని సీషెల్స్ అధ్యక్షుడు ఫార్ వినూత్నంగా వ్యక్తపరిచారు. మోదీ ఏర్పాటుచేసిన విందులో సితార్ వాయిస్తూ.. పాట పాడారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొంటూ.. ఫార్ పాడిన పాటను ట్వీట్ చేశారు. ఆరోగ్యం జాగ్రత్త! రాష్ట్రపతి భవన్లో ఫార్ కోసం ఏర్పాటుచేసిన ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ కార్యక్రమంలో ఓ ఐఏఎఫ్ సైనికుడు వేసవి తాపం ధాటికి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, సహచరులు ఆయన్ను పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్సనందించారు. అయితే, కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ.. ఆ సైనికుడి వద్దకెళ్లి పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అసంప్షన్ కథేంటి? హిందూ మహాసముద్రంలోని సీషెల్స్లో పాగా వేయడం భారత్కు వ్యూహాత్మకంగా కీలకం. 115 ద్వీపాల సమూహమైన సీషెల్స్తో ఒప్పందం కారణంగా ఈ ప్రాంతంలో భారత్ తన ప్రభావం పెంచుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఈ సముద్రంలోని వివిధ దేశాల్లో తన మిలటరీ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అందుకే తన ప్రాభవాన్ని పెంచుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. 2015లోనే అసంప్షన్ ఐలాండ్ను అభివృద్ధి చేసేందుకు భారత్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. సీషెల్స్లో దీనిపై వ్యతిరేకత మొదలైంది. చైనా–భారత్ల మిలటరీ వ్యూహంలో చిక్కుకుపోతామనే భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమైంది. కాగా, ‘మా తీరప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్ ద్వీపంపై చర్చించాం. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం’ అని ఫార్ అన్నారు. -
తమిళనాడులో ఉగ్రవాదులు: కేంద్రమంత్రి
నాగర్కోయిల్: తమిళనాడులో ఉగ్రవాదులు ఉన్నారని కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. ఈ సంఘవిద్రోహ శక్తుల్ని ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రనిరసన తెలిపిన అన్నాడీఎంకే మంత్రులు, రాష్ట్రం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ‘ఉగ్రమూకల చేతిలో తమిళనాడు నాశనమైపోవడాన్ని ఓ తమిళుడిగా తాను చూడలేను’ అని ఆయన పేర్కొన్నారు. -
లాంచీ దుర్ఘటనలో 19మంది మృతి: కలెక్టర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపాన గోదావరిలో లాంచీ దుర్ఘటనలో 19మంది మృతి చెందినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఒక్కరు గల్లంతుకాగా అతని కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 17మంది ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. జియో సంస్ధతో ఒప్పందం చేసుకుని ఏజెన్సీలో నలభై ఏడుచోట్ల టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంటూరు నుండి కొండమొదలు వరకు బండి బాట నిర్మించేందుకు సిఎం ఆదేశాల మేరకు ప్రయత్నాలు ప్రారభిస్తామని, గోదావరిలో ప్రయాణికుల తరలింపుకు... సామాగ్రి తరలింపుకు వేరు వేరు సర్వీసు లాంచీలు నడుస్తాయన్నారు. ప్రస్తుతం పోలవరం ఎగువకు వెళ్ళే అన్ని రకాల సర్వీసు లాంచీలను నిలివేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కాగా గురువారం మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, నౌకా సిబ్బంది, స్థానికుల సహకారంతో వాడపల్లి, మంటూరు పరిసర ప్రాంతాల్లో బోట్ల సాయంతో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. కాగా ఎన్డీఆర్ఎఫ్, నావీ సిబ్బంది ఇరవై గంటల అనంతరం నదిలో మునిగిన లాంచీని భారీ క్రేన్ల సాయంతో వెలికితీసిన విషయం విదితమే. లాంచీ పూర్తిగా నేలపైకి రావడానికి వీలుకాక పోవడంతో నేవీ సిబ్బంది లాంచీ భాగాలను కత్తిరించి మృతదేహాలను బయటికి తీశారు. . -
‘వీర’....నారికి జోహార్
సైన్యం అంటేనే పురుషులు.....అనాదిగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. తొలుత మన దేశ సైన్యంలో మహిళలను కేవలం వైద్య సేవలు అందించడానికి మాత్రమే నియమించేవారు. 1992నుంచి ఈ పరిస్థితి మారింది. మహిళలను వైద్య సేవల నిమిత్తమే కాకుండ సైనిక సేవలను అందించేందుకు నియమించడం ప్రారంభించారు. తొలుత కేవలం జూనియర్ రేంజ్లో మాత్రమే తీసుకునేవారు. 2016, ఫిబ్రవరిలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ప్రకటన మేరకు ప్రస్తుతం సైనిక బలగాల్లో మహిళలను ఆర్మి, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ కేడర్లో నియమిస్తున్నారు. త్రివిధ దళాల్లో సేవలు అందించిన, అందిస్తున్న ధీర వనితల గురించి తెలుసుకుందాం. పునిత అరోరా సైన్యంలో రెండో అత్యుత్తమ స్థాయి అయిన లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకు, నేవీలో వైస్ అడ్మిరల్ స్థాయికి ఎదిగిన తొలి మహిళ పునిత. పంజాబీ కుటుంబంలో జన్మించిన పునిత 2004వరకూ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ బాధ్యతలు చూసుకున్నారు. ఈ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ కూడా పునిత అరోరా కావడం విశేషం. పద్మావతి బంధోపాధ్యాయ ఆమె ప్రస్థానం అడుగడుగునా ప్రత్యేకం. భారత వాయుసేనలో చేరిన తొలి మహిళ.ఇంతేనా ఉత్తర ధృవంలో పరిశోధనలు చేసిన తొలి మహిళే కాక వాయుసేనలో ఎయిర్ వైస్ మార్షల్ ర్యాంకుకు ఎదిగిన తొలి మహిళ కూడా పద్మావతి బంధోపాధ్యాయే. 1971 లో భారత్-పాక్ యుద్ధం సందర్భంగా ఆమె చేసిన సేవలకు గాను ‘‘విశిష్ట సేవా పురస్కారాన్ని’’ అందుకున్నారు. మిథాలి మధుమిత సైన్యంలో ప్రధానం చేసే ‘‘సేన’’ పతకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పతకాన్ని స్ధాయితో సంబంధం లేకుండా శత్రుసేనలు దాడి చేసినప్పుడు వ్యక్తిగత ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారికి ప్రధానం చేస్తారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని అందుకున్న తొలి సైనికురాలు లెఫ్టినెంట్ కల్నల్ మిథాలి మధుమిత. 2010, ఫిబ్రవరిలో కాబూల్లో భారత రాయబార కార్యాలయం వద్ద ఆత్మహుతి దాడి సమయంలో ఆమె ఒంటరిగాసంఘటన స్థలికి చేరుకుని దాదాపు 19మంది ఆధికారులను కాపాడినందుకు గాను 2011లో ప్రభుత్వం ఆమెను ‘‘సేన’’ అవార్డుతో సత్కరించింది. దివ్య అజిత్ కుమార్ సైనిక శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందులోను సైన్యంలో ఆఫిసర్గా శిక్షణ పొందే సమయంలో పలు ప్రత్యేక అంశాల్లో ప్రతిభను పరీక్షిస్తారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి శిక్షణానంతరం ఇచ్చే విశిష్ట పురస్కారం ‘‘స్వార్డ్ ఆఫ్ హనర్’’. ఇంతటి గౌరవాన్ని అతి పిన్న వయసులోనే (21ఏళ్లకే) పొందారు దివ్య అజిత్ కుమార్. అంతేకాదు భారత సైనిక చరిత్రలో ఓ మహిళ ఈ అవార్డు పొందడం ఇదే ప్రధమం. అంజనా భదురియా మైక్రోబయాలజీలో పీజీ చేసినప్పటికి ఆమె కోరిక మాత్రం సైన్యంలో చేరి దేశ సేవ చేయడం. అందుకు తగ్గట్టుగానే 1992లో భారత ప్రభుత్వం సైన్యంలో మహిళను చేర్చుకునేందుకు ‘‘మహిళల ప్రత్యేక ఎంట్రీ స్కీమ్’’ను ప్రవేశపెట్టింది. మహిళ క్యాడెట్ల తొలి బ్యాచ్ అదే. ఈ బ్యాచ్లో చేరి శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ అందుకున్న తొలి మహిళ అంజనా భదురియా. ప్రియ సేంవాల్ సైన్యంలో చేరతామంటే వద్దు అనే కుటుంబాలు నేటికి కోకొల్లలు. అలాంటిది తన భర్త సైన్యంలో వీరమరణం పొందినప్పటికి భర్త జ్ఞాపాకర్థం తాను తన నాల్గు సంవత్సారల కూతురిని సైతం వదిలి సైన్యంలో చేరిన మొదటి ఆర్మీ జవాన్ భార్యగా దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకుని చరిత్ర సృష్టించారు ప్రియ సేంవాల్. గనేవి లాల్జి గనేవి లాల్జి తన కుటుంబంలో సైన్యంలో చేరిన మూడో తరం వ్యక్తి. సాహసాలు అంటే ఎంతో ఇష్టపడే లాల్జి మనాలిలోని వెస్ట్రన్ హిమాలయన్ మౌంటేయినరింగ్ ఇనిస్టిట్యూట్లో మౌంటేయినరింగ్, స్కియింగ్లలో శిక్షణ తీసుకున్నారు.2011లో ఆమె సైన్యంలో చేరారు. అనతికాలంలోనే ఆర్మి కమాండర్కు కీలక సహాయకురాలిగా నియమితులైన తొలి మహిళగా కీర్తి గడించారు. గుంజన్ సక్సేనా 1994నుంచి భారత వాయుసేనలో మహిళలను తీసుకుంటున్నారు. 25ఏళ్ల గుంజన్ సక్సేనా నాటి తొలి బ్యాచ్లో ఒకరు. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళా ఐఏఎఫ్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా. కార్గిల్ యుద్ధ సమయంలో శత్రు స్థావరాల్లో గాయపడిన సైనికులను తీసుకురావడం, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి సైనిక దళాలను చేరవేయడం వంటి బాధ్యతలు నిర్వహించారు. విధినిర్వహణలోనే వీరమరణం పొందారు. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ప్రభుత్వం ‘‘శౌర్య వీర అవార్డు’’ను ప్రధానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ కూడా ఈమెనే. శాంతి తగ్గ మూడు పదులు దాటిన వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి...ఏ స్త్రీ అయినా ఇంటిపట్టునే ఉండాలనుకుంటుంది. కానీ శాంతి తగ్గ మాత్రం సైన్యంలో జవానుగా చేరారు. శరీర దృఢత్వ పరిక్షల్లో పురుషులకు ధీటుగా రాణించి బ్యాచ్లో మొదటి స్థానంలో నిలిచారు. శిక్షణ పూర్తయ్యాక 969 రైల్వె ఇంజనీర్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. - పిల్లి ధరణి -
కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : భారత నేవీ దళాన్ని ఉద్దేశించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘‘అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని’’ నేవీ విభాగాన్ని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ‘‘మేం మిమల్ని గౌరవిస్తాం. ఉగ్రవాదులు చొరబడే సరిహద్దుల్లో నేవీ అవసరం ఉంది. నావికాదళ అధికారులు వచ్చి దక్షిణ ముంబైలో స్థలం కావాలని నన్ను అడిగారు. నేవీకి చెందిన ప్రతిఒక్కరూ అక్కడే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఇకపై ఎవరికీ అంగుళం స్థలం కూడా ఇచ్చేది లేదు. ఈ విషయంలో మీరెవరూ నా దగ్గరకు రావొద్దు. పాక్ సరిహద్దుకు వెళ్లి పెట్రోలింగ్ చేస్కోండి’’ అని గడ్కరీ తెలిపారు. రోడ్డు మార్గం ప్రయాణాలకు వ్యయాలు భారీగా పెరిగిపోతున్న వేళ సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రానున్న రెండేళ్లలో 10,000 సీ ప్లేన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు నేవీ విముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆపరేటర్లు బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకోగా.. కోర్టు కూడా అందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గడ్కరీ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం అంటే నేవీ, డిఫెన్స్ మంత్రిత్వ శాఖలు కాదు. మేం. అలాంటిది మేం చేపట్టే అభివృద్ధి పనులకు అడ్డుతగలటం మంచిది కాదు’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. -
మూడోది.. మరింత పవర్తో!
సాక్షి, విశాఖపట్నం: నావికాదళంలో మూడో అణు జలాంతర్గామి సిద్ధమవుతోంది. అడ్వాన్స్ టెక్నాలజీ వెసల్(ఏటీవీ) ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞా నంతో తయారయ్యే ఐదు అణు జలాంతర్గాముల్లో ఇది మూడోది. విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో దీని నిర్మాణం జరుగుతోంది. దీనికి త్వరలో పేరు ఖరారు చేయనున్నారు. ఐఎన్ఎస్ అరిహంత్ను 2009 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సతీమణి గురు శరణ్ కౌర్,అరిధామన్ను నవంబర్లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తర్వాత అరిదామన్ పేరును అరిఘాత్గా మార్చారు. ఈ సబ్ మెరైన్ను ఈ ఏడాది ఆఖరికల్లా ప్రారంభించను న్నారు. మూడు అణుజలాంతర్గాములు విశాఖ జిల్లా రాంబిల్లి వద్ద ఉన్న నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ ‘ఐఎన్ఎస్ వర్ష’ స్థావరంగా విధులు నిర్వహించనున్నాయి. అధిక శక్తిశాలి... ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్లు 112 మీటర్ల పొడవుంటాయి. ఈ మూడో అణు జలాంతర్గామి ఒకింత పొడవు, వాటికంటే ఎక్కువ శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిహంత్లో కె–4 రకం సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్(ఎస్ఎల్బీఎం) నాలుగు ఉండగా మూడో సబ్మెరైన్లో ఎనిమిది ఉంటాయి. ఇవి 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలు గుతాయి. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, టార్పెడోలు, టార్పెడో ట్యూబ్లు ఉంటాయి. 6,000 టన్నులకు పైగా బరువును మోసుకెళ్లగలుగుతుంది. నీటిపైన గంటకు 15 నాటికల్ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్ మైళ్లకు పైగా వేగంతో పయనిస్తుంది. నీటి కింద 300 మీటర్ల దిగువ వరకు వెళ్లగలుగుతుంది. అరిహంత్కంటే మరింత శక్తిమంతమైన ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ను రూపొందించనున్నారు. ఇందులోని అణు రియాక్టర్లు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో డిజైన్ చేశారు. మొత్తం ఈ ఏటీవీ ప్రాజెక్టుకు 2.9 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇంగ్లండ్ దేశాలే అణుజలాంతర్గాములు కలిగి ఉన్నా యి. అరిహంత్ నూక్లియర్ సబ్మెరైన్ ప్రారంభంతో వీటి సరసన ఆరో దేశంగా భారత్ చేరింది. -
విశాఖలో సబ్ మెరైన్ ఉత్సవాలు
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్లో సబ్ మెరైన్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 39 మంది అధికారులు, 621మంది నావికులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పరేడ్ గ్రౌండ్కు విచ్చేసి పరేడ్ను తిలకించారు. గవర్నర నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా విచ్చేశారు. నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నౌకాదళంలో 1967 డిసెంబర్ 8న జలాంతర్గామి విభాగం ప్రారంభం కాగా తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి చేరింది. -
ఏకంగా ఆరు : చైనాకు వెన్నులో వణుకే!
సాక్షి, న్యూఢిల్లీ : చైనాను అంతర్జాతీయంగా ఇప్పటికే పూర్తిగా ఇరుకున పెట్టిన భారత్.. తాజాగా మరో అడుగు ముదుకేసింది, డోక్లాం వివాదం తరువాత సరిహద్దుల్లో భారత్ భద్రతను కట్టు దిట్టం చేసింది. ఇప్పటివరకూ న్యూక్లియర్ సబ్ మెరైన్లపై పెద్దగా దృష్టిపెట్టని భారత్.. ఏక కాలంలో ఆరు న్యూక్లియర్ సబ్ మెరైన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇదే విషయాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా స్పష్టం చేశారు. భారత నేవీ సామర్థ్యాన్ని ఇవి పరిపుష్టం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యాన్ని భారత్ సవాల్ చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల చతుర్భుజ కూటమికి స్థిరమైన ఆకృతిని తీసుకురావంలో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాకు చెక్ పెట్టే శక్తి ఒక్క భారత్కు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. -
విపత్తులు ఎదుర్కొనేందుకు సదా సన్నద్ధతతో ఉంటాం
విశాఖ సిటీ: భారత సాగర తీరంలో శాంతి భద్రతల్ని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తూర్పు నౌకాదళం సేవలందిస్తోందని ఈఎన్సీ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. జాతీయ విపత్తులను ఎదుర్కొనేందుకు నౌకాదళం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. నౌకాదళంలో సబ్మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న సబ్మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు కరమ్బీర్ సింగ్ తెలిపారు. 1968లో సేవలు ప్రారంభించిన తూర్పు నౌకాదళానికి 2018 మార్చి నాటికి 50 ఏళ్లు పూర్తవుతున్నా యన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ డిసెంబర్ 7, 8 తేదీల్లో జరిగే స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. -
ఆమెగా మారిన అతడు!
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో భారత నౌకాదళ సెయిలర్గా పనిచేస్తున్న మనీష్కుమార్ గిరి అలియాస్ సబి గిరిని ఉద్యోగం నుంచి తొలగించారు. 'నేవీ' అధికారులకు సమాచారం ఇవ్వకుండా 'లింగమార్పిడి' శస్త్రచికిత్స చేయించుకున్నందుకు సబిగిరిపై వేటు పడినట్టు తెలుస్తోంది. సొంత అభీష్టం మేరకే సబిగిరీ లింగమార్పిడి పరీక్ష చేయించుకుందని, భారత నౌకాదళ నిబంధనల ప్రకారం ఆమె (లేదా అతడిని) ఉద్యోగంలో కొనసాగించడం కుదరదని నేవీ పేర్కొంది. అయితే, నౌకాదళం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత త్రివిధ దళాల్లోకి మహిళలను సైతం తీసుకోవాలని, యుద్ధశిక్షణ రంగంలో వారిని నియమించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం.. ప్రతికూలమైనదేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్ల కిందట విశాఖపట్నంలో నేవీ సెయిలర్గా చేరిన మనీష్కుమార్ గిరి కొన్ని నెలల కిందట 22 రోజుల సెలవు తీసుకున్నాడు. ఈ సమయంలో అతడు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా 'లింగ మార్పిడి' ఆపరేషన్ చేయించుకొని.. సబీగా మారాడు. అనంతరం ఉద్యోగంలో తిరిగి చేరిన అతని ప్రవర్తనలో మార్పు రావడంతో అధికారులు ఈ విషయం గుర్తించారు. తాజాగా సబీగిరి మీడియాతో మాట్లాడుతూ తనను ఉద్యోగంలోనుంచి తొలగించాలన్న నేవీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. శరీరంలో అవయవాలు మారాయన్న కారణంతో తాను మానసికంగా 'అన్ఫిట్' అని ముద్రవేసి ఉద్యోగం నుంచి తీసేశారని, నేవీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళుతానని సబిగిరీ అంటున్నారు. -
చైనా నేవీలో కొత్త ఆయుధం
-
చైనా నేవీలో కొత్త ఆయుధం
బీజింగ్ : చైనా నేవీ మరింత బలోపేతం అయింది. ఇప్పటికే పలు యుద్ధవాహక నౌకలు ఉన్న చైనా నేవీలో గురువారం.. న్యూక్లియర్ సబ్ మెరైన్ చేరింది. ఇప్పటివరకూ ఉన్న సబ్ మెరైన్లలో ఇదే అత్యాధునికమైనదనే చైనా మీడియా అధికారికంగా ప్రకటించింది. తాజాగా చేరిన కొత్త సబ్ మెరైన్తో చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ల సంఖ్య 69కి చేరిందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అంచనా వస్తున్నారు. అత్యాధునిక న్యూక్లియర్ సబ్ మెరైన్ను డలియన్ షిప్ యార్డులో చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సబ్మెరైన్కు సంబంధించిన పేరు, వివరాలను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. అయితే దీనిని టైప్-096 సబ్ మెరైన్గా నిపుణులు భావిస్తున్నారు. -
దూసుకొచ్చిన యుద్ధనౌక.. కాల్పులు
పర్షియన్ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా కాల్పులు జరిపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పర్షియన్ గల్ఫ్ వైపు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ యుద్ధనౌకను పలుమార్లు ఆగాలని అమెరికాకు చెందిన థండర్బోల్ట్ బోటు పలుమార్లు హెచ్చరించింది. ఇరాన్ నౌక హెచ్చరికలను ఖతరు చేయకపోవడంతో దాన్ని వెంబడించింది. దాదాపు 150 యార్డుల చేరువలో ఇరు ఓడలు సముద్రంలో వెళ్లినట్లు అమెరికా నేవీ వర్గాలు తెలిపాయి. అంత దగ్గరలో ప్రయాణించడం కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించాయి. అప్పటికీ ఇరాన్ నౌక వెనక్క తగ్గకపోవడంతో వరుసగా కాల్పులు జరిపినట్లు వివరించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేరు తెలపడానికి ఇష్టపడని పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన నౌకలు డే టైమ్లో విన్యాసాలు నిర్వహిస్తుండగా.. ఇరాన్ నౌక ఈ చర్యకు దిగినట్లు వెల్లడించారు. -
త్రివిధ దళాల ఉమ్మడి విధాన పత్రం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: భారత్ ఎదుర్కొంటున్న భద్రతా పరమైన ముప్పుల్ని సమష్టి కృషితో సమర్ధంగా తిప్పికొట్టే లక్ష్యంతో ఆర్మీ, నౌక దళం, వాయుసేనలు మంగళవారం ఉమ్మ డి విధాన పత్రాన్ని ఆవిష్కరించాయి. దేశం ఎదుర్కొంటున్న భద్రత పరమైన ముప్పు ల్ని ఈ పత్రంలో ప్రస్తావించారు. సరిహ ద్దుల వెంట దాడులు, జమ్మూ కశ్మీర్లో సాగుతున్న పరోక్ష యుద్ధం, వివిధ ప్రాంతా ల్లో వామపక్ష తీవ్రవాదం ముఖ్య సమస్య లుగా పేర్కొన్నారు. త్రివిధ దళాల భద్రతా సిబ్బందికి ఉమ్మడి శిక్షణతో పాటు, ఏకీకృత కమాండ్ అండ్ కంట్రోలింగ్ విధానం అవలంభించాలని నిర్ణయించారు. ఈ విధాన పత్రాన్ని చైర్మన్ ఆఫ్ ద చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, నేవీ చీప్ అడ్మిరల్ సునీల్ లాంబా ఆవిష్కరించగా.. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వాయు సేన చీఫ్ బీఎస్ ధనోవాలు పాల్గొన్నారు. -
విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: సముద్ర ఉపరితల లక్ష్యాలను ఛేదించడంలో భారత్ మరో ముందడుగు వేసింది. ప్రాజెక్టు 75 ద్వారా నిర్మించిన స్కార్పియో తరగతి కల్వరి జలాంతర్గామి నుంచి తొలిసారి నావికా దళం ప్రయోగించిన నౌక విధ్వంసక క్షిపణి.. ఉపరితలంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిం చింది. ఈ మేరకు రక్షణ శాఖ గురువారం ప్రయోగం వివరాలు వెల్లడించింది. ‘ ఈ క్షిపణి ఆవిష్కరణతో మరో మైలురాయిని అధిగమించాం. తాజా ప్రయోగంతో నావికాదళం ఉపరితల రక్షణ సామర్థ్యం పెరిగింది’ అని పేర్కొంది. సముద్ర ఉపరితల ప్రమాదాలను ఎదుర్కోడానికి భారత్ వద్ద ఉన్న 6 డీజిల్/ఎలక్ట్రిక్ జలాంతర్గాముల్లో ఈ క్షిపణులను ప్రవేశపెడతామని వెల్లడించింది. భారత్లో నిర్మించిన స్కార్పియో తరగతికి చెందిన తొలి జలాంతర్గామి కల్వరిని ఫ్రెంచ్ నావికా రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ ఎస్ రూపొందించగా.. ముంబైలోని మజ్గావ్డక్లో నిర్మించారు. క్షిపణిని విజయ వంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. -
12 మంది భారతీయుల అరెస్ట్
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారనే కారణంతో శ్రీలంక నేవీ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పనీర్సెల్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి.. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక నేవీ అనుసరిస్తున్న విధానానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరిన మరుసటి రోజే ఈ అరెస్టులు చోటు చేసుకోవడం గమనార్హం. రామేశ్వరం ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీనాధ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పంబన్ నుంచి మూడు బోట్లలో 20 మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. నిషేధించిన వలలతో చేపల వేటకు వెళ్లిన వీరిని, శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకోనే సమయంలో ఒక బోట్లో ఎనిమిది మంది అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశారు. మిగిలిన రెండు బోట్లలోని 12 మందిని శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకొని కంగేసంతురాయ్ పోర్ట్కు తరలించారు. -
కెప్టెన్ అర్జున్ వర్మ
బాబాయ్ వెంకటేశ్.. అబ్బాయ్ రానా.. ఇద్దరూ ఒకేరోజు అభిమానులను ఖుషీ చేశారు. మంగళవారం వెంకటేశ్ పుట్టినరోజు కానుకగా ‘గురు’ టీజర్ విడుదల చేశారు. బుధవారం అబ్బాయ్ రానా పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్నే (మంగళవారం) ‘ఘాజీ’లో రానా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రెండూ కొన్ని గంటల వ్యవధిలోనే విడుదలయ్యాయి. రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే, అన్వేశ్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నిరంజన్రెడ్డిలు నిర్మిస్తున్న చిత్రం ‘ఘాజీ’. 1971 నాటి ఇండో–పాక్ యుద్ధ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నేవీ అధికారి అర్జున్ వర్మ పాత్రలో రానా నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘తొలి భారతీయ జలాంతర్గామి చిత్రమిది. సాంకేతిక పరంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం కొత్త ఒరవడి సృష్టిస్తుంది. నీటి అడుగున చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. వచ్చే ఫిబ్రవరి 17న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. తాప్సీ, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, నాజర్ నటించిన ఈ చిత్రానికి ‘కె’ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. -
తేజస్ జెట్లను వినియోగించలేం: నేవీ
న్యూఢిల్లీ: దేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్ కు సేవలను అందుకోగల సామర్ధ్యం భారత విమానవాహక నౌకలకు లేదని భారతీయ నేవీ పేర్కొంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, అడ్మిరల్ సునీల్ లాన్బా ఓ ప్రకటన విడుదల చేశారు. తేజస్ అధిక బరువు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అధిక బరువు కలిగిన జెట్లను విమానవాహక నౌకలపై వినియోగించడం అసాధ్యమని చెప్పారు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ నేవీకి ఉపయోగపడుతుందని తాము భావించామని చెప్పారు. దురదృష్టవశాత్తూ తేజస్ జెట్ల అధిక బరువు విమానవాహక నౌక సామర్ధ్యానికి కంటే ఎక్కువ ఉందని చెప్పారు. ప్రస్తుతం మిగ్-29కే జెట్లను విమానవాహక నౌక విక్రమాదిత్యపై వినియోగిస్తున్నామని, తర్వలో దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్ మీద కూడా మిగ్-29కేలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. నేవీ వద్ద ఉన్న విమానవాహక నౌకల సామర్ధ్యానికి తగిన విధంగా ఉండే సరికొత్త జెట్ల కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు చెప్పారు. తేజస్ జెట్లకు సరిపడే విమానవాహక నౌక అవసరం నేవీకి ఉందని లాన్బా అన్నారు. నేవల్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీవోను నేవీ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కాగా, తేజస్ ను భారతీయ వాయుదళంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి కొనుగోలు చేసిన విమానవాహక నౌకల సామర్ధ్యానికి.. మనం సొంతగా తయారుచేసే జెట్లు సరితూగకపోతే కాలానుగుణంగా టెక్నాలజీలో వచ్చిన మార్పులు అందుకు కారణంగా భావించవచ్చు. దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్(విమానవాహక నౌక)పై కూడా తేజస్ ను వినియోగించలేమని నేవీ చెప్పడం దూరదృష్టి లేకుండానే దేశీయ జెట్లు, విమానవాహక నౌకలను తయారు చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మిగ్ విమానాలకు ప్రత్యామ్నాయంగా ఓ ఫైటర్ డెవలప్ మెంట్ ను చేయాలని 1980ల్లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1999లో విక్రాంత్ ను అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. -
నేవీ కొలువుకు జేఈఈ తప్పనిసరి
న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా ప్రపంచం ముందడుగు వేస్తున్న నేపథ్యంలో భారతీయ నౌకాదళం కొత్త చర్యలకు ఉపక్రమించింది. అత్యాధునిక సాంకేతిక కలిగిన యుద్ధ నౌకలు, ఆయుధాలు, సెన్సార్లను విధి నిర్వహణలో వినియోగించాల్సివుండటంతో అందుకు తగిన వారిని కొలువులకు ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తొలుత బీ.టెక్ పట్టభద్రులను ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొనడం వెనుక ఆంతర్యం ఇదే. తాజాగా 10+2 బీ.టెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ లో ప్రవేశాన్ని పొందాలంటే కచ్చితంగా జేఈఈ(మెయిన్స్)లో ర్యాంకు సాధించాలని పేర్కొంది. దీంతో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితాల్లో ఇంటర్ లో సాధించిన మార్కుల ఆధారంగా నేవీలో ప్రవేశం దుర్లభంగా మారింది. ఎస్ఎస్ బీ ఇంటర్వూల ద్వారా ఉత్తమ అభ్యర్ధులను నేవీకి ఎంపిక చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. జేఈఈ రాంక్యుల వివరాలను నేవీకి అందించేందుకు సీబీఎస్ఈ ఒప్పుకున్నట్లు తెలిపారు. 2017 జేఈఈ(మెయిన్స్) నుంచి అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను మొదట ఎస్ఎస్ బీ ఇంటర్వూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. -
నేవీలోకి ఐఎన్ఎస్ తిహయు
విశాఖలో ప్రారంభించిన నావికాదళ ప్రధానాధికారి బిస్త్ బీచ్రోడ్టు (విశాఖపట్నం): వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ తిహయును తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్సీఎస్ బిస్త్ బుధవారం ఇక్కడ ప్రారంభించారు. దీన్ని కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) నిర్మించింది. ఇప్పటిదాకా ఈ సంస్థ భారత నేవీ కోసం ఇలాంటివి 18 అటాక్ క్రాఫ్ట్లను తయారు చేసింది. ఈ సందర్భంగా బిస్త్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు మేకిన్ ఇండియాలో భాగంగా నేవీ నాలుగు వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ల తయారీకి ఆర్డరు ఇచ్చిందని చెప్పారు. వీటిలో రెండు తూర్పు నావికాదళానికి కేటాయించారన్నారు. ఇందులో మొదటి దైన ఐఎన్ఎస్ తార్ముగ్లి నౌకను ఈ ఏడాది మే 23న ప్రారంభించామన్నారు. గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో ఇది పయనిస్తుందని తెలిపారు. ఈ నౌకలో నలుగురు అధికారులు, 41 మంది సిబ్బంది పని చేస్తారన్నారు. 315 టన్నుల బరువును తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ నౌకలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 30ఎంఎం సీఆర్ఎన్ 91 గన్తోపాటు 11 మెషీన్ గన్లను అమర్చారని, 2,720 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజన్తో ఇది పయనిస్తుందన్నారు. ఈ యుద్ధ నౌకకు అండమాన్లోని తిహయు దీవి పేరు పెట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో జీఎస్ఆర్ఎస్ఈ చైర్మన్ రియర్ అడ్మిరల్ ఎ.కె.వర్మ, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ అడ్మిరల్ మేహ ష్ సింగ్, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. -
పోరుబందర్ నేవల్ బేస్లో పేలుడు శబ్ధం
-
నడి సంద్రంలో భయం భయంగా..
- విశాఖ నుంచి పోర్ట్బ్లెయిర్ వెళుతూ నిలిచిపోయిన నౌక - స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖకు నౌక సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి పోర్ట్బ్లెయిర్కు వెళ్తున్న ప్రయాణికుల నౌక నడిసంద్రంలో దాదాపు 24 గంటల పాటు నిలిచిపోయింది. ఇందులో 506 మంది ప్రయాణికులు, సుమారు 50 మంది సిబ్బంది ఉన్నారు. ఒకరోజంతా సముద్రం లో నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాం దోళనలకు గురయ్యారు. నౌక నిలిచిన సమాచారంతో జిల్లా అధికారులు నేవీ, కోస్ట్గార్డ్లను అప్రమత్తమయ్యారు. స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖ తీరానికి రప్పించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్కు వెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ నుంచి 506 మంది ప్రయాణికులతో ఎంవీ హర్షవర్ధన నౌక బయల్దేరింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత నౌకలోని ఒక జనరేటర్ పాడైంది. కాసేపటికి అనూహ్యంగా మరో జనరేటర్ కూడా పాడవ్వడంతో ఇంజన్లు పనిచేయడం మానేశాయి. దీంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు నౌకలోని అధికారులు సమాచారం అందించారు. అక్కడ్నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో నౌకను నిలిపివేశారు. మంగళవారం రాత్రి నుంచి సాంకేతిక నిపుణులు జనరేటర్లకు మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. బుధవారం రాత్రి వరకు మరమ్మతులు కొనసాగాయి. కాగా, ప్రయాణికుల్లో 150 మంది మహిళలు, 15 మంది పిల్లలున్నట్లు సమాచారం. వీరంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. -
త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. శనివారం ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ 7లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రహ, నౌకదళం ఉప అధిపతి వైస్ అడ్మిరల్ కేబీ సింగ్తో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. నౌకదళం చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా ఢిల్లీలో లేకపోవడంతో ఆయన బదులు కేబీ సింగ్ వచ్చారు. యురిలో సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడికి బదులిచ్చే విషయంపై ప్రధాని మోదీ చర్చించారు. -
ఉగ్రవేటను నిలిపివేసిన నేవీ
ఉగ్ర అనుమానితుల కోసం నేవీ చేపట్టిన వెతుకులాటను శుక్రవారం సాయంత్రం నిలిపివేసింది. ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా నవీ ముంబైలోని ఓ నేవల్ బేస్కు సమీపంలో తిరుగుతుండగా తాము చూశామని కొంతమంది విద్యార్థులు గురువారంచెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్న 91 ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఎన్ఎస్ జీ కమాండోలను కూడా రంగంలోకి దించిన నేవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ ను నిలిపివేశారు. వెతుకులాటను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంపై నేవీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
లోగుట్టు లీక్!
మన రక్షణ అవసరాలను తీర్చడానికి అడుగు ముందుకేసినప్పుడల్లా ఏవో అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా నౌకాదళం సమకూర్చుకొనబోయే స్కార్పిన్ జలాంతర్గాముల శక్తిసామర్థ్యాలకు సంబంధించిన సవివరమైన డేటా ఆస్ట్రేలియాకు చెందిన పత్రికలో వెల్లడై ప్రకపంనలు సృష్టిస్తున్నది. 22,457 పత్రాల్లో ఉన్న ఆ వివరాలన్నీ అత్యంత కీలకమైనవి. స్కార్పిన్ గమనంలో ఉండగా దాన్నుంచి ఎంత పౌనఃపున్యంలో ధ్వని వెలువడుతుందన్న దగ్గరినుంచి... దాని కనిష్ట, గరిష్ట వేగం, వేర్వేరు వేగాల్లో ఉన్నప్పుడు దాని ప్రొపెల్లర్లనుంచి వెలువడే ధ్వని వివరాలు, సముద్ర జలాల్లో అది చూడగల లోతులు, వివిధ స్థాయిల్లో దాని సామర్థ్యం తీరు, శత్రు నౌకలపై దాడి చేశాక వెనుదిరగడంలో, వాటి దాడికి అంద కుండా ముందుకు కదలడంలో దాని పటిమ, శత్రు నౌకలనూ, టార్పెడోలనూ, క్షిపణులనూ ధ్వంసం చేయడంలో దానికుండే సామర్థ్యం వగైరాలన్నీ ఆ డేటాలో ఉన్నాయి. ఈ డేటాను అధ్యయనం చేస్తే స్కోర్పిన్ను ఎదుర్కొనడానికి అనువైన రక్షణ ఏర్పాట్లను చేసుకోవడం ప్రత్యర్థులకు పెద్ద కష్టం కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే లీకైన వివరాలన్నీ జలాంతర్గామికి చెందిన బ్లూ ప్రింట్ లోనివేనని, దాని చోదన, ఆయుధ వ్యవస్థల వివరాలు అందులో ఉండవు గనుక అదంత ప్రమాదం కాదని మరికొందరి అభిప్రాయం. రక్షణమంత్రి మనోహర్ పరీకర్ సైతం ఈ లీకు వల్ల ఏర్పడగల ముప్పేమీ లేదన్న వాదనతోనే ఏకీభవి స్తున్నారు. నిజానికి స్పార్పిన్ ప్రపంచంలోని జలాంతర్గాములతో పోలిస్తే అన్ని విధాలా మెరుగైనదన్న పేరుంది. అది నిలకడగా దాదాపు 50 రోజులపాటు నీటి అడుగున ఉండగలదు. మన నౌకాదళం వద్ద ప్రస్తుతం 13 జలాంతర్గాము లున్నా వాటిలో కొన్ని అవసాన దశకు చేరుకున్నాయి. పైగా ఇప్పటి అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవు. సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న వర్త మానంలో అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే తప్ప ప్రత్యర్థులపై ఆధిక్యత సాధ్యం కాదు. స్కార్పిన్లు ఆ లోటు తీరుస్తాయనుకుంటున్న తరుణంలో ఈ లీకులు వెలుగులోకొచ్చాయి. స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన నిర్మాణ పనులు పదేళ్లక్రితం మొదలయ్యాయి. అవి దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆఖరు కల్లా ఆరు జలాంతర్గాములనూ మన నౌకాదళానికి అప్పగించే అవకాశాలున్నాయం టున్నారు. ఈ దశలో వాటì డిజైన్ను సవరించడం కూడా కష్టమంటు న్నారు. ఈ లీకులు మన దేశాన్ని ఇరకాటంలో పడేయటానికా లేక డీసీఎన్ఎస్ సంస్థపై కక్ష తీర్చుకోవడానికా అన్నది ఇంకా తేలవలసి ఉంది. లీకుల వల్ల జరిగిన నష్టమెంత అన్నదానిపై ఎటూ సమీక్ష ఉంటుంది. దేశ భద్రతతో ముడిపడిన అంశం గనుక అసలు అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో రాబట్టడం ఇప్పుడు ముఖ్యం. జలాంతర్గాముల్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా మనకు ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. 1981లో పశ్చిమ జర్మనీతో కుదిరిన హెచ్డీ డబ్ల్యూ జలాంతర్గాముల కొనుగోళ్ల ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశంలో జలాంతర్గాముల నిర్మాణ కార్యక్రమం అట కెక్కింది. అందులో సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టేశాక 1999లో మళ్లీ కదలిక వచ్చింది. 2005లో రూ. 18,000 కోట్ల విలువైన ఆరు జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేసేందుకు, దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్ని బదిలీ చేసేందుకు ఫ్రాన్స్కు చెందిన డీసీఎన్ఎస్ సంస్థతో ఒప్పందం ఖరారైంది. అయితే ఆ మరుసటి ఏడాదే ఇందుకోసం 4 శాతం ముడుపులు చెల్లించారని గుప్పుమంది. ఈ వ్యవహారంలో డీసీఎన్ఎస్కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని 2009లో కాగ్ సైతం చెప్పింది. అయితే అది ఎత్తి చూపిన లోపాలు ప్రాజెక్టును ఆపేయవలసినంత ముఖ్యమైనవి కాదని నిర్ణయించారు. ఆ తర్వాత పనులు మొదలయ్యాయి. జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేయడానికి అను వుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం, దాని రూపకల్పనపై ఇక్కడివారికి శిక్షణనివ్వడం ఒప్పందంలో కీలకాంశాలు. లీకులతో ముప్పేమీ ఉండబోదన్న పరీకర్ ప్రకటన వాస్తవం కాదని దీన్ని బయటపెట్టిన పాత్రికేయుడు కామెరాన్ స్టీవర్ట్ అంటున్నాడు. భారత్, ఫ్రాన్స్లు రెండూ జరిగిన నష్టాన్ని తగ్గించి చూపు తున్నాయని, తన దగ్గరున్న మిగిలిన సమాచారం వెల్లడిస్తే అసలు కథ ఏమిటో వెల్లడవుతుందంటున్నాడు. రేపో మాపో ఆ పని చేస్తానంటున్నాడు. అందు వల్ల పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా లీకు వల్ల నష్టం ఉన్నదనో, లేదనో చెప్పడం తొందరపాటే అవుతుంది. అది దేశ భద్రతకు చేటు తెస్తుంది. పైకి ఏం చెప్పినా శత్రు దేశాల అంతర్గత భద్రతా వ్యవస్థ తీరుతెన్నుల గురించి ఆరా తీయడం, అందుకోసం వారు చేసుకుంటున్న ఏర్పాట్లపై నిఘా ఉంచడం ఎవ రైనా చేసే పనే. అవతలివారి సమాచారాన్ని రాబడితే తప్ప మనం చేసుకుంటున్న ఏర్పాట్ల లోటుపాట్లేమిటో సంపూర్ణంగా తెలియదు. అదే సమయంలో మనకు సంబంధించిన సమాచారం కాస్తయినా బయటకు పొక్కకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అడపా దడపా శత్రు దేశాల గూఢచారులుగా వ్యవహ రిస్తున్నవారు పట్టుబడుతుంటారు. రక్షణ కొనుగోళ్లు ఆషామాషీగా జరిగే వ్యవ హారం కాదు. టెండర్లు పిలవడం దగ్గర్నుంచి సంస్థల ఎంపిక వరకూ ఎన్నో జాగ్ర త్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ స్థాయిలో రాజీపడినా కాంట్రాక్టు దక్కని సంస్థ దాని కూపీ లాగి యాగీ చేస్తుంది. బోఫోర్స్ తుపాకుల స్కాం బయటపడ్డాక కొను గోళ్లలో దళారుల ప్రమేయాన్ని అంగీకరించరాదన్న విధానం పెట్టుకున్నా ముడు పులు చేతులు మారుతూనే ఉన్నాయి. అవి ఏదో ఒక దశలో బయటపడి అనిశ్చితి ఏర్పడుతోంది. ఇప్పుడు లీకైంది ముడుపుల సంగతి కాక ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలు. భారత్లోనే లీక్ అయి ఉండొచ్చునని డీసీఎన్ఎస్ అంటుండగా అది అసాధ్యమని పరీకర్ గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంలో పటిష్టమైన దర్యాప్తు జరిపి దోషుల్ని పట్టుకోనట్టయితే నష్టపోయేది ఫ్రాన్సే. -
నాలుగేళ్లలో 41 ఎయిర్ క్రాషెస్
న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో మిలిటరీకి సంబంధించి 41 గగనతల ప్రమాదాలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదాలకు గురైన వాటిలో విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయని, 65 మంది మృత్యువాత పడ్డారని చెప్పింది. అయితే, సామాన్య పౌరులెవరూ ఈ ప్రమాదాల కారణంగా చనిపోలేదని స్పష్టం చేసింది. లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో 'ఏప్రిల్ 1, 2012 నుంచి జూలై 2016 మధ్య అంటే నాలుగేళ్లలో శిక్షణలో ఉన్న హెలికాప్టర్లు, విమాన ప్రమాదాలు 41 చోటుచేసుకున్నాయి. వీటివల్ల 65 మంది చనిపోయారు. ఇందులో వైమానిక విభాగానికి చెందిన ఎయిర్ క్రాష్ లు ఎక్కువగా (28) ఉన్నాయి. అలాగే పాదాతి దళానికి చెందిన హెలికాప్టర్ల ప్రమాదాలు ఏడు జరగగా.. నావికా దళానికి చెందిన ప్రమాదాలు నాలుగు జరిగాయి' అని ఆయన చెప్పారు. -
అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్..
అమెరికాః కళ్ళజోడు పెట్టుకుంటే చాలు ప్రపంచాన్ని మన ముందుంచే టెక్నాలజీల్లో ఇప్పటివరకూ వర్చువల్ రియాలిటీదే మొదటి స్థానం. దూరంగా ఉన్న అద్భుతాలను కళ్ళముందే ఉన్నట్లుగా తిలకించే అత్యద్భుత పరిజ్ఞానం అది. ఇప్పుడు అనేక సంస్థలు ఈ వర్చువల్ రియాలిటీ పరికరాలను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరో అడుగు ముందుకేసి మరి కాస్త పరిజ్ఞానాన్ని జోడించి మనిషి జీవితంలో భాగమయ్యే ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అమెరికా నేవీ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. ఇది ఓ ఐరన్ మ్యాన్ సామర్థ్యాన్ని అందిస్తుందని యూఎస్ నేవీ చెప్తోంది. నిజ జీవితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కనిపించే దృశ్యాలను చూసి ఆనందించే అవకాశం వర్చువల్ రియాలిటీలో ఉంటే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మాత్రం కనిపించే దృశ్యాల సారాంశాన్ని, చరిత్రను సైతం తెలియజేస్తుంది. ప్రస్తుతం అమెరికా నేవీ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. నీటి అడుగు భాగంలో సంచరించేందుకు డైవర్స్ దీన్ని వాడినప్పుడు.. వారికి ఐరన్ మాన్ చిత్రంలా వాస్తవిక సామర్థ్యాన్ని కలిగించేట్లు చేస్తుందని యూఎస్ నేవీ ఇంజనీర్ డెన్నిస్ గ్లఘెర్ చెప్తున్నారు. పనామా సిటీ డివిజన్ లోని నేవల్ సర్ఫేస్ వార్ఫేర్ సెంటర్ లో గల్లఘెర్ సహా 20 మంది బృందం ఈ అభివృద్ధిలోని డైవర్స్ ఆగ్మెంటెడ్ విజన్ డిస్ప్లే కు సంబంధించిన మొదటి దశను పూర్తి చేశారు. ఇందులో పొందుపరిచిన హై రిజల్యూషన్ సిస్టమ్ ద్వారా డైవర్స్ కు సెక్టార్ సోనార్, టెక్ట్స్ మెసేజ్, ఫొటోలు, డయాగ్రమ్ లు, వీడియోలను వాస్తవ కాలంలో సందర్శించే అవకాశం ఇస్తుంది. తాము అభివృద్ధి పరిచిన ఈ సాధనం ద్వారా నీటిలో మునిగిపోయిన ఓడలు, కూలిపోయిన విమానాలు వంటి వాటిని సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుందని, వాటిని వెతికేందుకు వెళ్ళే బృందాలకు ఈ హెల్మెట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని, అత్యంత సహాయ పడుతుందని నేవీ చెప్తోంది. ఈ అక్టోబర్ నాటికి హెల్మెట్ రూప కల్పన పూర్తిచేయడంతోపాటు.. నీటిలో పరీక్షలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్లు నేవీ తెలిపింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ లోని అధిక రిజల్యూషన్ సోనార్ ద్వారా సముద్రంలోని, నీటి అడుగు భాగంలో వీడియోలు తీసుకోవడంతోపాటు, అనేక సూక్ష్మ విషయాలను కూడ పరిశీలించ వచ్చునని, ఇది అనేక విధాలుగా డైవర్లకు సహాయ పడుతుందని నేవీ వివరిస్తోంది. -
యూట్యూబ్ లో 'జెట్' ల్యాండింగ్ హల్ చల్
మనిషి మెదడుకు కాస్త పదును పెడితే అద్భుతాలను ఆవిష్కరించగలడు, చరిత్రను సృష్టించగలడు అనేందుకు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఓ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికన్ యుద్ధ నౌక యూఎస్ఎస్ బతాన్ టేకాఫ్ అవ్వడం ప్రశాంతంగానే జరిగినా... ల్యాండ్ అయ్యే సమయంలో విమానానికి ముందు చక్రాలు తెరచుకోపోవడంతో అత్యంత ఉత్కంఠతను రేపింది. సమయస్ఫూర్తితో ఓ పైలట్ జెట్ విమానాన్ని ల్యాండ్ చేసిన విధానం, చూపరులకు గగుర్పాటును కలిగేట్లు చేస్తోంది. ఎటువంటి సమస్యా లేకుండా టేకాఫ్ అయిన విమానం... ఆకాశంలోకి ఎగిరాక అనుకోని అవాంతరాలు ఏర్పడితే ఏం చేయాలో.. మెరైన్ క్రాప్స్ పైలట్ విలియమ్ మహోనీ సమయస్ఫూర్తిని చూస్తే తెలుస్తుంది. ఎవి-8బి ల్యాండింగ్ సమయంలో ఏర్పడ్డ సాంకేతిక కారణాలతో విమానం ప్రమాదంలో చిక్కుకుందని తెలిసిన పైలట్... సమయస్ఫూర్తితో వ్యవహరించడం పెను ప్రమాదాన్ని తప్పించింది. జెట్ యుద్ధ విమానం ఫ్రంట్ వీల్స్ తెరుచుకోవడం లేదని గమనించిన పైలట్... ఏమాత్రం భయపడకుండా... ధైర్యంగా వ్యవహరించాడు. విమానాన్ని సురక్షితంగా కిందికి దించేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ను అధికారులకు తెలిపి వారివద్ద అనుమతి తీసుకున్నాడు. నౌకపై విమానాన్ని దింపేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయించుకొన్నాడు. విభిన్నంగా స్టూల్ పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించాడు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తిని వేనోళ్ళ అభినందించారు. 2014 జూన్ నెలలో ఫైటర్ జెట్ విమానం ల్యాండింగ్ ఘటనకు సంబంధించిన అరుదైన వీడియో... ఇప్పుడు ఇంటర్నెట్లో అందర్నీ ఆకట్టకుంటోంది. లక్షలకొద్దీ కామెంట్లు, వేలకోద్దీ షేర్లతో హల్ చల్ చేస్తోంది. -
తీర ప్రాంతాల్లోకి అమెరికా చొరబాటు
వాషింగ్టన్: అనుమతి లేకుండా తమ సముద్ రతీర ప్రాంతాల్లోకి అనుమతి లేదంటూ ప్రపంచ దేశాలు చేసిన వ్యాఖ్యలను అమెరికా తనదైన శైలిలో ఉల్లంఘించింది. గత ఏడాది దాదాపు 13 దేశాల్లో అమెరికా యుద్ధ నౌకలతో పాటు మిలటరీ విమానాలను తిప్పినట్లు పెంటగాన్ ప్రకటించింది. వీటిలో చైనా, భారత్, ఇండోనేసియా, ఇరాన్, లిబియా, మలేసియా, మాల్దీవులు, ఒమన్, ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాలు ఉన్నాయి. అయితే, ఎన్నిసార్లు ఆయా దేశాల తీరప్రాంతాల్లో అమెరికా దళాలు ప్రవేశించాయనే విషయాన్ని మాత్రం పెంటగాన్ వెల్లడించలేదు. ప్రపంచ దేశాలలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే అర్హత ఉందని చెప్పడానికి మాత్రమే ఇలా చేశామని పెంటగాన్ తెలిపింది. ఫ్రీడం నావిగేషన్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో తైవాన్, నికార్ గువా, అర్జెంటీనాల్లో ఒక్కసారి మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది. చైనా సొంతగా తయారు చేసుకున్న ద్వీపాల ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో అనేకసార్లు ప్రయాణించినట్లు, ఇక చైనా నుంచి సంకేతాలు అంది ఆగిపోయినట్లు ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న మిలటరీ ల్యాండ్ వద్ద ఎక్కువగా సంచరించనున్నట్లు యూఎస్ ఫసిఫిక్ కమాండ్ అడ్మిరల్ హ్యరీ హ్యారీస్ చెప్పారు. ఇక 2014లో అమెరికా 19 దేశాల తీరప్రాంతాల్లో ప్రవేశించింది. వీటిలో ఇరాన్, ఫిలిప్ఫీన్స్ లు ముందువరుసలో ఉన్నాయి. -
లంచం కేసులో జైలుపాలైన నేవీ అధికారి
అమెరికా నౌకాదళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారి లంచం కుంభకోణంలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఓ మలేషియన్ ఢిఫెన్స్ కాంట్రాక్టరుకు విలువైన సమాచారం అందించిన కేసులో డానియల్ డుసెక్కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ఓ లగ్జరీ హోటల్లో వేశ్యల సేవలు అందుకునేందుకు గాను ఎక్స్చేంజి ఆఫర్లో సమాచారాన్ని అందించడంతో సదరు అధికారి ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డుసెక్కు శిక్షలో భాగంగా 70,000 డాలర్ల జరిమానాతోపాటు నౌకాదళానికి 30,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ శిక్ష పడ్డ అమెరికాకు చెందిన సైనికాధికారుల్లో లంచం కుంభకోణంలో పట్టుబడ్డ డుసెక్ అత్యధిక ర్యాంక్ లో ఉన్న అధికారి. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 46 నెలల పాటు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి జానిస్ సమ్మర్టినో ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లకు సమాచారం అందించి, వేశ్యల సేవలు అందుకోవడం కూడా లంచం పరిధిలోకి వస్తుందంటూ అనూహ్య తీర్పును ఇచ్చిన కోర్టు... డుసెక్ కు జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. 49 ఏళ్ల డుసెక్.. జనవరి 2015న తాను లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తూ కోర్టు ముందు క్షమాపణలు కోరాడు. -
చైనా బోట్ను ముంచేశారు
బ్యూనస్ ఎయిర్స్: చైనా బోట్ను అర్జెంటీనా ముంచేసింది. నిబంధనలు అతిక్రమించి తమ దేశ సముద్ర జలాల్లో ప్రవేశించి అక్రమంగా చేపలుపడుతుండటం చూసి ఫైరింగ్ చేసింది. దీంతో ఆ బోట్ సముద్రంలో మునిగిపోయినట్లు స్పష్టం చేసింది. అర్జెంటినా అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. బ్యూనస్ ఎయిర్స్ 1,460 కిలోమీటర్ల దూరంలోని ప్యూరిటో మాడ్రిన్ కోస్తా తీరం దగ్గర తమ దేశ నౌకను ముంచివేసినట్లు అర్జెంటీనా ప్రకటించిందని, దీనిపై తాము తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, సీరియస్గా తీసుకుంటున్నామని చైనా ప్రకటించింది. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించినట్లు చైనా అధికారులు తెలిపారు. -
28 మంది భారతీయుల అరెస్ట్
కొలంబో: శ్రీలంక నేవీ అధికారులు 28 మంది భారతీయ మత్స్యకారులను ఆదివారం అరెస్ట్ చేశారు. తమ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులంతా పుదుకొట్టై, పంబన్, ట్యుటికొరిన్ ప్రాంతాలకు చెందిన వారని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీనాథ్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు కంగెసంతురాయ్ పోర్ట్కు తరలించారు. ఈ ఘటనలో మత్స్యకారులకు చెందిన మూడు బోట్లను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీ అధికారులు భారత జాలర్లను అరెస్టు చేయడం ఇటీవలి కాలంలోనే ఇది నాలుగో సారి కావడం గమనార్హం. -
‘విశ్వ’రూప విశాఖ
కడలితీరం కదనరంగంగా మారింది.. దాన్ని అనుకొని ఉన్న బీచ్రోడ్డు అంతర్జాతీయ దళాల కదన కుతూహలాన్ని చాటే కవాతుకు వేదికగా.. కళాక్షేత్రంగా భాసిల్లింది. సుమారు రెండు గంటలపాటు సుమారు 2 లక్షల మందిని ప్రత్యక్షంగా.. మరికొన్ని వేలమందిని పరోక్షంగా తమ అద్భుత విన్యాసాలు, ప్రదర్శనలతో నావికాదళం కట్టిపడేసింది. సరిగ్గా సాయంత్రం 4.35 గంటలు.. అలల హోరు.. సందర్శకుల కేరింతలతో సందడిగా ఉండే సాగర తీరంలో ఒక్కసారిగా అలజడి.. ఆకాశంలో విమానాలు, హెలికాప్టర్ల చక్కర్లు.. వాటిలోంచి సర్రున నీటిపై వాలిన పారాట్రూపర్లు.. కమెండోలు.. అంతలోనే తుపాకుల మోతలు.. బాంబుల వర్షం.. మరోపక్క ఆయిల్ రిగ్ పేల్చివేత.. ఇలా వరుస విన్యాసాలతో యుద్ధంలో కనిపించే దృశ్యాలను కళ్లుదుట ఆవిష్కరిస్తూ.. లక్షలాది ప్రజలను గగుర్పాటుకు గురి చేశారు. ఇక చీకట్లు ముసురుకుంటున్న వేళ.. సుమారు 24 దేశాల నావికాదళాల కవాతు కనువిందు చేసింది. ఒక్కో దేశానికి చెందిన దళం ముఖ్యఅతిథి ప్రధానమంత్రి సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతుంటే.. ఆ దేశానికే చెందిన కళాకారులు తమ సంప్రదాయ వేషధారణతో అనుసరించారు. వాటితోపాటు పలు ప్రభుత్వ శాఖల శకటాలుతో కూడిన కార్నివాల్ వేడుకను శోభాయమానం చేసింది. అంతకుముందు ప్రధాన వేదిక వద్ద భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయం నృత్యప్రదర్శన అదరహో అనిపించింది. తీరంలో కొలువుదీరిన యుద్ధనౌకల నుంచి ఆకాశంలోకి సంధించిన బాణసంచా వెలుగులు.. వాటికి పోటీగా లేజర్ కిరణాల జిలుగులు కార్యక్రమానికి అద్భుతమైన ముగింపునిచ్చాయి. మొత్తంగా అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో కీలకమైన సిటీ పరేడ్, విన్యాసాల ఘట్టం.. ‘విశ్వ’రూపం సంతరించుకొంది.. విశాఖ ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. -విశాఖ సిటీడెస్క్ -
విశాఖలో ఐఎఫ్ఆర్ ప్రదర్శన ప్రారంభం
విశాఖపట్నం: విశాఖ సాగరతీరంలో నావికాదళ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ గురువారం సాయంత్రం పారంభమైంది. 'విక్టరీ ఎట్ సీ' స్థూపం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరవీరులకు నివాళులర్పించారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఆర్కే ధోవన్, తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంతోష్ సోని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాలు... సముద్ర జలాల ద్వారా ఐక్యత అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో 52 దేశాల నౌకా దళాలు పాల్గొంటున్నాయి. భారతదేశం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండవసారి. -
126 మంది భారత జాలర్ల విడుదల
కొలంబో: భారత్కు చెందిన 126 మంది జాలర్లను శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. తమ సముద్రజలాల్లో చేపలు వేటాడుతున్నారనే నెపంతో శ్రీలంక నేవి అధికారులు వీరిని గతంలో అరెస్ట్ చేశారు. అయితే గత కొంత కాలంగా భారత్, శ్రీలంక అధికారుల మధ్య జాలర్ల విడుదలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నేడు శ్రీలంక ప్రభుత్వం జాలర్లను భారత్కు అప్పగించింది. వీరిలో 78 మంది జాలర్లను కన్కేసంతురాయ్ తీరం వద్ద 'సాగర్' నౌకా సిబ్బందికి అప్పగించగా, మిగిలిన వారిని 'రాజ్ కమల్' నౌకా విభాగానికి అప్పగించినట్లు శ్రీలంక నావీ స్పోక్స్ పర్సన్ అక్రమ్ అలవి వెల్లడించారు. ఇటీవలి కాలంలో భారత్, శ్రీలంక దేశాల మధ్య మత్స్యకారుల విడుదల విషయం ద్వైపాక్షిక సంబంధాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక పర్యటన సందర్భంగా కూడా మత్స్యకారుల అంశం చర్చకు వచ్చింది. అలాగే భారత జాలర్లపై విధించిన భారీ జరిమానాలపై కూడా పునరాలోచించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. -
ఐఎన్ఎస్ కొచ్చి జలప్రవేశం