noida
-
ఫ్యామిలీని ‘డిజిటల్ అరెస్ట్’ చేసి రూ. కోటి దోచేశారు..!
నోయిడా: ‘సైబర్ నేరగాళ్ల(Cyber Scam)తో జాగ్రత్త.. వారి వద్ద నుంచి ఏ రకంగానైనా కాల్స్ రావొచ్చు.. మీ ఖాతాలు ఖాళీ చేసే పన్నాగం కావొచ్చు’ అనేది మనకు మొబైల్ ఫోన్లో గత కొంత కాలంగావినిపిస్తున్న కాలర్టోన్. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ కాలర్ టోన్ను ప్రతీ ఒక్కరికీ చేరే ప్రయత్నం చేస్తూ వస్తోంది.అయినా సైబర్ మోసాలు(cyber fraud) ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు సరికొత అవతారం ఎత్తుతున్నారు. ఏదో ఒక రూపంలో దోచుకుంటూనే ఉన్నారు. గత నెలలో బెంగళూరు టెకీ నుంచి రూ. 11కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా నోయిడాకు చెందిన ఒక ుకుటుంబం నుంచి రూ. 1 కోటి ఎత్తుకుపోయారు.ఈ రెండు ఘటనల్లో సైబర్ నేరగాళ్లది విన్నూత్న శైలి. తాము ప్రభుత్వ అధికారులమని చెప్పి మరీ జనాలకు టోకరా వేస్తున్న వైనం గుబేలు పుట్టిస్తోంది. మనకు ప్రభుత్వ అధికారుల్ని కాల్స్ వస్తున్నాయో లేదో తెలుసుకునే లోపే ‘డిజిటల్ అరెస్టు’తో జనాల్ని భయాందోళనకు గురి చేసి వారు పని వారు చాకచక్యంగా కానిచ్చేస్తున్నారు.ఢిల్లీలోని నోయిడా(Noida)కు చెందిన ఓ కుటుంబం డిజిటల్ అరెస్టు గురైంది. ఆ కుటుంబానికి చెందిన ముగ్గుర్ని డిజిటల్ అరెస్టు చేశారు. ఆ కుటుంబం నుంచి అయిదు రోజుల్లో వాళ్లు కోటి రూపాయలు కాజేశారు. ప్రభుత్వ అధికారులమని చెబుతూ.. మోసానికి పాల్పడ్డారు. దీనిపై తాజాగా కేసు నమోదైంది.సైబర్ నేరంపై చంద్రబాబన్ పలివాల్ అనే ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.ఫిబ్రవరి 1వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి టెలికాం రెగ్యులేటరీ బోర్డుకు ఫోన్ చేయాలని, లేదంటే సిమ్ కార్డు బ్లాక్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి.. మళ్లీ మరొక ఫోన్.. మీ కేసు ముంబై క్రైమ్ బ్రాంచ్ వద్ద ఉందని బెదిరింపులు. పది నిమిషాల తర్వాత మళ్లీ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ వీడియో కాల్. ముంబైలోని కొలావా పోలీస్స్టేషన్ నుంచి చేస్తున్నట్లు ఆ వీడియె కాల్లో బెదిరింపులు.ఆ వీడియో కాల్లో చంద్రబాన్పై 24 కేసులు నమోదు అయినట్లు కూడా నకిలీ ఆఫీసర్ పేర్కొన్నాడు. మనీ ల్యాండరింగ్ కోణంలోనూ సీబీఐ విచారణ కొనసాగుతున్నట్లు తెలిపాడు. వీడియో కాల్స్ ద్వారా తన భార్య, కూతుర్ని డిజిటల్ అరెస్టు చేసినట్లు చంద్రబాన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము అడిగిన మొత్తాన్నిచెల్లించకుంటే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది సదరు ముఠా. ఆ భయంతో కోటి 10 లక్షలు చెల్లించినట్లు చంద్రబాన్ ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ క్రైమ్, ఇక్కడ ైసైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ అధికారులమని మోసగించడమే డిజిటల్ అరెస్ట్. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, మెస్సేజ్లు చేసి మోసానికి పాల్పడతారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా పంథాను సైబర్ నేరగాళ్లు ఎంచుకున్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.వారితో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..! -
అధికారులకు అరగంట శిక్ష!
అధికారులు ప్రజలతో వ్యవహరించే తీరు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటుంది. ఆ టైంలో చూసేవాళ్లకు రక్తం మరిగిపోతుంటుంది. వాళ్లు ఉన్నది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా! అనుకుంటాం. అయితే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఇక్కడ ఓ ఉన్నతాధికారి భలే శిక్ష విధించారులేండి.అది నోయిడా అథారిటీ కార్యాలయం. సోమవారం నాడు ఓ వృద్ధ జంట తమ పని కోసం అక్కడికి వచ్చారు. చాలాసేపు దాకా అక్కడున్నవాళ్లెవరూ వాళ్లను పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వాళ్లు అలా నిలబడే ఉండిపోయారు. ఇది నోయిడా అథారిటీ సీఈవో లోకేష్ ఎం గమనించారు. మరో అరగంట పోయాక చూస్తే.. ఆ వృద్ధ జంట అలాగే నిలబడి ఉన్నారట!. దీంతో.. ఆయన తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు.వెంటనే.. బయటకు వచ్చి అరగంట పాటు నిలబడి పని చేయండి అని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు. అలా నిలబడి పని చేస్తే.. ఆ వృద్ధ జంట పడ్డ కష్టమేంటో మీకు తెలుస్తుంది అని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ సర్!.. ప్రస్తుతం ఆ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.In Noida Authority, an elderly couple was struggling to get their file approved but faced complete neglect. Witnessing this, the CEO took a bold step – ordered all employees to stand and work for 30 minutes as punishment!#CEO #Noida pic.twitter.com/RrZMOAc4xn— Sneha Mordani (@snehamordani) December 17, 2024 -
ఒత్తిడిలో ఉన్నారా...? ఉద్యోగం ఉఫ్
సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు. అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. యస్ అని చెబుతున్నారా? పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్మేడమ్’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్నెస్ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు. వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం. ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలో ‘యస్’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ శితిజ్ డోగ్రా చేసిన ఒక పోస్ట్తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందించింది. ‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది. ‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు. -
Delhi: రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని రీజియన్లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయ్యింది. నోయిడాలో రూపొందుతున్న విమానాశ్రయంలో.. సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్, టేకాఫ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో.. వచ్చే ఏడాది నుంచి ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఇండిగోకు విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో మాత్రమే నోయిడా ఎయిర్పోర్టుకు బయలు దేరింది. అవసరమైన భద్రతా తనిఖీల తర్వాత రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ రీజియన్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు నోయిడా ఎయిర్పోర్ట్ రెండవ ప్రధాన విమానాశ్రయంగా మారనుంది, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్లో ఉంది. అధునాతన హంగులు, సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్లో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. #WATCH | Uttar Pradesh: Noida International Airport Limited (NIAL) conducts the first flight validation test for Noida International Airport ahead of the airport’s commercial opening in April 2025. pic.twitter.com/C3axT4mZeH— ANI (@ANI) December 9, 2024 -
Uttar Pradesh: విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు పొడిగింపు
నోయిడా: ఉత్తరప్రదేశ్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో ఆఫ్లైన్ తరగతుల నిర్వహణను పొడిగించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలనా అధికారులు నవంబర్ 25 వరకు అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆఫ్లైన్ తరగతులపై నిషేధాన్ని నవంబర్ 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం ఇటీవల ఆఫ్లైన్ తరగతులను నిలిపివేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 'చాలా తీవ్రమైన' కేటగిరీకి చేరుకోవడంతో ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు ఆఫ్లైన్ తరగతులను నిలిపివేశారు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డియోస్) ధరమ్వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్లో శనివారం గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్, అశోక్ విహార్, ఆనంద్ విహార్, బవానా, డీటీయూ, ద్వారక, చాందినీ చౌక్, జహంగీర్పురి, నరేలా, నెహ్రూ నగర్, మందిర్ మార్గ్, పట్పర్గంజ్, రోహిణి, వజీర్పూర్, పంజాబీ బాగ్ తదితర ప్రాంతాల్లో వాయునాణ్యత 400 కంటే ఎక్కువ నమోదైంది. ఇది కూడా చదవండి: 8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ -
PKL 11: యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం.. పాయింట్ల పట్టికలో పైపైకి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో మాజీ చాంపియన్ యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా జరుగుతున్న రెండో అంచె పోటీల్లో ఆదివారం యు ముంబా జట్టు ఉత్కంఠ పోరులో 35–33తో యూపీ యోధాస్పై గెలిచింది.యు ముంబా తరఫున అజిత్ చవాన్, రోహిత్ రాఘవ్ చెరో 8 పాయింట్లతో రాణించగా... యూపీ యోధాస్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభంలో ఆకట్టుకున్న యూపీ జట్టు ప్రత్యర్థిపై పైచేయి కనబర్చినా దాన్ని చివరి వరకు కొనసాగించలేక పోయింది.ఇక తాజా సీజన్లో యు ముంబా 8 మ్యాచ్లాడి 5 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘టై’తో 29 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు.. ఎనిమిది మ్యాచ్ల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న యూపీ యోధాస్ 20 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఓటమిమరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 39–23 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. హరియాణా స్టీలర్స్ తరఫున రాహుల్ 8 పాయింట్లు... వినయ్, రెజా చెరో 7 పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (7 పాయింట్లు) మినహా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. హరియాణా 26 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు... గుజరాత్ జెయింట్స్ 7 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో పట్నా పైరేట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇప్పటి వరకు పుణెరి పల్టన్ అస్థానంలో కొనసాగుతోంది. -
త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
జేవార్: ఉత్తరప్రదేశ్లోని జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. నవంబర్ 15న తొలిసారిగా ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కానుంది. రెండవ దశ ట్రయల్ ఆపరేషన్లో భాగంగా విమానం నవంబర్ 15న ఇక్కడ ల్యాండ్ కానుంది. డిసెంబర్ 15 వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ట్రయల్ రన్ రెండవ దశలో అకాసా, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు ప్రతిరోజూ ఇక్కడ రాకపోకలు సాగిస్తాయన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ట్రయల్లో ప్రతిరోజూ ఇక్కడి నుంచే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతాయన్నారు.డిసెంబరు 20 నాటికి ట్రయల్ రన్ డేటాను డీజీఈసీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీని తర్వాత ఎయిర్డోమ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేయనున్నారు. మార్చి 20 నాటికి లైసెన్స్ వస్తుందని ఎయిర్పోర్ట్ అథారిటీ భావిస్తోంది. 2025 ఏప్రిల్ 17 నుంచి జేవార్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు రాకపోకలు కొనసాగనున్నాయి. మొదటి రోజు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఇందులో జ్యూరిచ్, సింగపూర్, దుబాయ్ నుండి మూడు అంతర్జాతీయ విమానాలు సహా రెండు కార్గో విమానాలు కూడా ఉన్నాయి.ముందుగా 30 విమానాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 25 దేశీయ, మూడు అంతర్జాతీయ, రెండు కార్గో విమానాలు ఉన్నాయని అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రన్వే, గాలి ప్రవాహం, మొదటి దశ ట్రయల్స్ను పరిశీలించిన తర్వాత దీనికి ఆమోదం తెలిపింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, డెహ్రాడూన్తో సహా పలు పెద్ద నగరాలకు తొలుత కనెక్ట్ కానుంది.ఇది కూడా చదవండి: మహాప్రాణులకు మళ్లీ జీవం! -
అప్పుడు జపాన్లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రెట్టీ కూల్ అంటూ కొన్ని ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే.. వాషింగ్ మెషీన్లో మహిళా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదొక పాడ్-స్టైల్ హోటల్. ఇలాంటి టెక్నాలజీ మొదటిసారిగా 1979లో జపాన్ పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు నోయిడాలో కనిపించింది.ఇదీ చదవండి: మస్క్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: ఇదే జరిగితే..ట్రావెల్ వ్లాగర్ ఇందులో ఉండటానికి రూ. 1000 చెల్లించి, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే గడిపింది. ఇందులో ఒక మంచం, అద్దం, కంట్రోల్ ప్యానెల్, ఛార్జింగ్ పాయింట్స్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి వాటితో పాటు మహిళల కోసం ప్రత్యేకమైన వాష్రూమ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ప్రెట్టీ కూల్ అంటూ అభివర్ణించారు. -
నోయిడా హత్య కేసు.. లేడీ డాన్ అరెస్ట్
ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ హత్య కేసులో ఎట్టకేలకు లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలో ఈ ఏడాది జనవరి 19న ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ కారులోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్పై వచ్చిన హంతకుల ముఠా కాల్పులు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. 8 నెలల తర్వాత కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్స్టర్ కపిల్ మాన్ ఆదేశాల మేరకే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.బాధితుడు సూరజ్ మాన్.. గ్యాంగ్స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు. కపిల్ మాన్.. పర్వేష్ మాన్ మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. తన తండ్రిని పర్వేష్ మాన్ హత్య చేశాడంటూ కపిల్ మాన్ పగ పెంచుకున్నాడు. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ హత్యకు ప్లాన్ వేశాడు.ఇదీ చదవండి: చెప్పులు వేసుకుని రావద్దన్న డాక్టర్పై దాడి.. వీడియో వైరల్అయితే, తన భార్య అయిన.. లేడీ డాన్ కాజల్ ఖత్రీ సాయంతో ప్రణాళిక అమలు చేశాడు. కాగా, కపిల్ మాన్, పర్వేష్ మాన్ ఇద్దరూ ఢిల్లీలోని మండోలి జైల్లోనే ఉన్నారు. కాజల్ ఖత్రీ తలపై రూ.25 వేలు పారితోషికం ఉందని ఢిల్లీ పోలీసు అధికారి సంజయ్ భాటియా వెల్లడించారు. నోయిడాలో హత్యకు గురైన సూరజ్ మాన్ కేసులో కాజల్ను అరెస్ట్ చేసి నోయిడా పోలీసులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. -
Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి
నోయిడా: యూపీలోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఒక యువకునిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కలకలం చెలరేగింది. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం నోయిడా సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఉన్న ఫుడ్ కోర్టులో ఒక యువకునిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడిని నవేంద్ర కుమార్ ఝాగా పోలీసులు గుర్తించారు.ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటన గురించి అదనపు సీపీ శివ హరి మీనా మాట్లాడుతూ ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలు మెట్రో స్టేషన్ 137 కింద సమావేశమయ్యాయన్నారు. అయితే ఇంతలోనే ఒక వర్గానికి చెందిన వారు నవేంద్ర కుమార్ ఝాపై కాల్పులు జరిపారన్నారు.బుల్లెట్ నవేంద్ర తలకు తగిలిందని, ఆసుపత్రిలో చేర్పించాక అక్కడ మృతి చెందాడన్నారు. నవేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పులు జరిపినవారిని గుర్తించామని, ఇరువర్గాలు వారు ఘజియాబాద్కు చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్టార్ 82లోని ఆస్తి విషయంలో వీరి మధ్య వివాదం నడుస్తోందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు -
ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మోసాలకు బలైపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నవారు కోకొల్లలు. ఇటీవల ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ మహిళ సుమారు రూ. 27 లక్షలు పోగొట్టుకుంది.నోయిడాలోని సెక్టార్ 82లో నివాసం ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 'జ్యోత్సానా భాటియా'కు ఆగస్టు 31న టెలికాం కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపింది. మొబైల్ ఫోన్ పోయినట్లయితే.. యాక్టివేట్ అయ్యే ఈసిమ్ కొత్త ఫీచర్ల గురించి కాలర్ ఆమెకు చెప్పినట్లు వెల్లడించింది. కాలర్ చెప్పేది నిజమని నమ్మని భాటియా 'ఈసిమ్'కు మారేందుకు అతడు సూచించిన విధంగా చేసింది. ఇందులో భాగంగానే ఆమె మొబైల్కు వచ్చిన ఒక కోడ్ ఎంటర్ చేయమని అడగగా.. ఆమె అది కూడా పూర్తి చేసింది.కాలర్ చెప్పినవన్నీ చేసిన తరువాత ఆమె సిమ్ డీయాక్టివేట్ అవుతుందని.. మరో రెండు మూడు రోజుల్లో ఫిజికల్ సిమ్ వస్తుందని చెప్పాడు. మూడు రోజుల తరువాత కూడా ఆమెకు సిమ్ రాలేదు. దీంతో ఆమె కస్టమర్ కేర్ సిబ్బందికి కాల్ చేసింది. వారు డూప్లికేట్ సిమ్ కోసం సర్వీస్ సెంటర్ వద్దకు రావాలని సూచించారు. ఆమె వారు చెప్పినట్లుగా సర్వీస్ సెంటర్ వద్ద డూప్లికేట్ సిమ్ తీసుకుని ఫోన్లో వేసుకుని యాక్టివేట్ చేసింది.మొబైల్ నెంబర్ యాక్టివేట్ అవ్వగానే.. బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు డిడెక్ట్ అయినట్లు వరుస మెసేజ్లు వచ్చాయి. సైబర్ నేరస్థుడు తన ఫిక్డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీసుకున్నట్లు, కొంత డబ్బు ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమె పేరుమీద రూ. 7.40 లోన్ కూడా తీసుకున్నట్లు తీసుకుంది.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం సైబర్ నేరగాడు.. మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ అప్లికేషన్ హ్యాక్ చేసి.. ఈ మెయిల్ ఐడీలను సైతం మార్చేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. మొత్తం మీద ఆమె రూ. 27 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపింది. నిందితున్న పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.ఈ-సిమ్ అంటే..ఈ-సిమ్ అనేది ఒక డిజిటల్ సిమ్ కార్డు. కాబట్టి ఈ-సిమ్ ఉపయోగిస్తే.. ఫిజికల్ సిమ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనిని అధికారిక వెబ్సైట్లో లేదా సర్వీస్ సెంటర్లలో పొందవచ్చు. ఈ-సిమ్ పొందాలనుకునేవారు టెలికామ్ ఎగ్జిక్యూటివ్ను కలిసిన తరువాత మారడం ఉత్తమం. -
అంతా అనుకున్నట్టే.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు
అందరూ ఊహించిందే జరిగింది. నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "నోయిడాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు చేయబడింది. ఐదవ రోజు ప్రారంభంలోనే అంపైర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం బ్లాక్ క్యాప్స్ శ్రీలంకకు పయనం కానున్నారు అని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్లో రాసుకొచ్చింది.కాగా ఈ సిరీస్ వాస్తవానికి సెప్టెంబర్ 9న ప్రారంభమవ్వాల్సింది. కానీ కుండపోత వర్షం వల్ల మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అయితే తొలి రెండు రోజులు పగలు సమయంలో పెద్దగా వర్షం కురవనప్పటకి.. మైదానాన్ని గ్రౌండ్ స్టాప్ సిద్దం చేయలేకపోయారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడమే అందుకు కారణం. గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు. ఆ తర్వాత మరింత వర్షాలు కురవడంతో గ్రౌండ్ మొత్తం చిన్నపాటి చెరువులా తయారైంది. ఆఖరి మూడు రోజులు కనీసం ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియం కూడా రాలేదు. అంటే నోయిడా మైదానంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు. చివరికి టాస్ పడకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలని భావించిన అఫ్గానిస్తాన్కు నిరాశే ఎదురైంది.చదవండి: IPL 2025: రోహిత్ ముంబై ఇండియన్స్తోనే కొనసాగాలి.. ఎందుకంటే? -
వదలని వరుణుడు.. కివీస్-అఫ్గాన్ నాలుగో రోజు ఆట రద్దు
గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు అయ్యే దిశగా సాగుతోంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట సైతం రద్దు అయింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి షాహీద్ విజయ్ సింగ్ పాఠిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలోని ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.అంతేకాకుండా ప్రస్తుతం నోయిడాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో కప్పిఉంచారు. ఈ క్రమంలోనే గురువారం జరగాల్సిన నాలుగో రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. అయితే ఆఖరి రోజైన శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో టెస్టు మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకు పోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే విషయంపై ప్రముఖ ప్రెజెంటర్ ఆండ్రూ లియోనార్డ్ మాట్లాడుతూ.. రేపు కూడా వాతావారణం ఇలాగే ఉంటుంది. ఇది నిజంగా రెండు జట్లకు నిరాశ కలిగించే వార్త.న్యూజిలాండ్ తమ ఆసియా పర్యటనను ప్రారంభించేందుకు భారత్కు వచ్చింది. ఈ టూర్లో అఫ్గాన్తో పాటు భారత్,శ్రీలంకతో టెస్టు సిరీస్లు కివీస్ ఆడనుంది. మరోవైపు అఫ్గానిస్తాన్ టెస్టు క్రికెట్ చాలా అరుదుగా ఆడుతుంది. కివీస్ వంటి బలమైన జట్టును ఎదుర్కొనేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ ప్రకృతి మాత్రం వారి ఆశలను అడియాశలు చేసింది. మళ్లీ రేపు కలుద్దాం అని పేర్కొన్నారు.నిరాశలో అఫ్గాన్-కివీ ఫ్యాన్స్.. కాగా వాస్తవానికి ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ సోమవారం(సెప్టెంబర్ 9) ప్రారంభం అవ్వాలి. కానీ మ్యాచ్ కంటే ముందు కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు.దీంతో మైదానం రెడీ చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమించారు. అయితే సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది కష్టపడ్డారు. ల్యాండ్స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు.కానీ ఔట్ ఫీల్డ్ మాత్రం చిత్తడి ఉండటంతో ఆటగాళ్లు భద్రత దృష్ట్యా అంపైర్లు రెండు రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు కూడా మైదానం కూడా సిద్దం కాలేదు. దీంతో మూడో రోజు కూడా టాస్ పడకుండానే రద్దు అయింది. అయితే ఎలాగైనా మైదాన్ని సిద్ద నాలుగు రోజు(గురువారం) 98 ఓవర్లు పాటు ఆటను నిర్వహించాలని అంపైర్లు భావించారు. కానీ మళ్లీ నోయిడాలో వర్షం రావడం, మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా మారడంతో నాలుగో రోజు ఆటను కూడా రద్దు చేశారు. అయితే నోయిడా స్టేడియం పరిస్థితులపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఆంసతృప్తి వ్యక్తం చేశారు. తాము ఇంకెప్పుడూ నోయిడాకు రామంటూ అఫ్గాన్ క్రికెటర్లు సైతం వ్యాఖ్యానించారు.చదవండి: ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్ట్ మ్యాచ్లు -
Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం?
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా.. కనీసం టాస్ పడకుండానే ముగిసిపోయింది. కాగా 2017లో టెస్టు హోదా సంపాదించిన అఫ్గన్ జట్టు.. తటస్థ వేదికలపై తమ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్తో తొలిసారిగా టెస్టు ఆడేందుకు వేదికగా భారత్ను ఎంచుకుంది.సోమవారమే మొదలు కావాలి.. కానీభారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించి తమ రాజధాని కాబూల్కు దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియానికి విచ్చేసింది. ఇందులో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం అఫ్గన్- కివీస్ జట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకావాలి.. కానీ రెండు రోజుల పాటు ఆటగాళ్లు మైదానంలో దిగే పరిస్థితి లేకపోయింది. ఆట ముందుకు సాగడమే గగనమైంది.తొలి రెండు రోజులు వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆటకు సిద్ధం కాలేదు. గత రెండు వారాల క్రితం నోయిడాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి అదే విధంగా... మైదానాన్ని ఆటకు వీలుగా ఆరబెట్టే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి తలెత్తింది. కేవలం నోయిడా స్టేడియంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే అఫ్గనిస్తాన్ జట్టుకు భంగపాటు ఎదురవుతోంది. రెండోరోజు ఆట జరిపించేందుకు మంగళవారం మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.ల్యాండ్స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చినా అవుట్ఫీల్డ్ పొడిబారలేదు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేసినా ఫలితం శూన్యం. దీంతో కనీసం మూడో రోజైనా పరిస్థితి మెరుగపడుతుందని అఫ్గన్- న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూశారు.ఇప్పుడిక వర్షంఅయితే, ఈరోజు వర్షం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాన కురుస్తున్న కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్స్మెన్. దీంతో మూడో రోజు కూడా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మరో రెండు రోజుల పాటూ నోయిడాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఫ్గన్- కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోయే దుస్థితి నెలకొంది.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
అయ్యో పాపం!.. అఫ్గనిస్తాన్ జట్టుకు ఏమిటీ ‘పరీక్ష’?
న్యూజిలాండ్తో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన అఫ్గనిస్తాన్ జట్టుకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సరైన వసతిలేని కారణంగా రెండో రోజు ఆట కూడా రద్దైపోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మంగళవారం నాటి ఆట ముగిసిపోయింది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో స్టేడియం నుంచి నిష్క్రమించినట్లు సమాచారం.కారణం ఇదేకాగా స్వదేశంలో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితిలేని కారణంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తొలిసారిగా కివీస్తో టెస్టు ఆడేందుకు భారత్లోని గ్రేటర్ నోయిడా మైదానాన్ని ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కూడా ఆమోదం రావడంతో అఫ్గన్ జట్టు నోయిడాకు చేరుకుంది.ఇక షెడ్యూల్ ప్రకారం సోమవారమే(సెప్టెంబరు 9) అఫ్గన్- కివీస్ ఏకైక టెస్టు ఆరంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా కురిసిన భారీ వానల కారణంగా నోయిడా స్టేడియం అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రౌండ్స్మెన్ ఎంతగా కష్టపడినా ఫలితం లేకపోయింది. ఈ స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి మళ్లీ ఎండకాస్తే తప్ప గ్రౌండ్ ఆరే పరిస్థితి లేదు. అయితే, రెండురోజులుగా నోయిడాలో వర్షం లేకపోయినా.. వాతావరణం మాత్రం పొడిగా లేదు. అయినప్పటికీ సూపర్ ఫ్యాన్లతో ఆరబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే కాస్త పరిస్థితి మెరుగైనా ఆట మొదలుపెట్టేందుకు అనుకూలంగా లేకపోయింది. రెండో రోజు కూడా టాస్ పడకుండానేఈ నేపథ్యంలో టాస్ పడకుండానే అఫ్గన్- న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసిపోయింది. దీంతో రెండో రోజు నుంచి అరగంట ఎక్కువసేపు మ్యాచ్ నిర్వహిస్తామని అంపైర్లు తెలిపారు. అయితే, ఈ రోజు(మంగళవారం) కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ అధికారులు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కివీస్కు నష్టమేమీ లేదు.. కానీనోయిడా స్టేడియం మేనేజ్మెంట్ వల్ల తమ చారిత్రాత్మక మ్యాచ్కు అవరోధాలు ఎదురవుతున్నాయని.. మరోసారి ఇక్కడకు రాబోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-2025 సైకిల్లో ఈ మ్యాచ్ భాగం కాదు కాబట్టి న్యూజిలాండ్కు పెద్దగా వచ్చే నష్టమేమీలేదు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్తో టెస్టు ఆడి.. సత్తా చాటాలని భావించిన అఫ్గన్ ఆటగాళ్లకే తీవ్ర నిరాశ ఎదురైంది.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’
న్యూజిలాండ్తో తమ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్కు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నోయిడా స్టేడియంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కనీస వసతులు కూడా లేవంటూ పెదవి విరిచారు. ఇలాంటి చోట ఇంకోసారి అడుగు కూడా పెట్టబోమంటూ ఘాటు విమర్శలు చేశారు.తటస్థ వేదికలపైకాగా తమ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి తాము ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలపై ఆడుతోంది అఫ్గన్ జట్టు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్ వేదికగా ప్రత్యర్థి జట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ పాతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను హోం గ్రౌండ్గా చేసుకుని పలు మ్యాచ్లు ఆడింది అఫ్గన్ జట్టు. వర్షం కురవనేలేదు.. అయినా..ఈ క్రమంలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టుతో తొలిసారి టెస్టు ఆడేందుకు సిద్ధమైన మరోసారి నోయిడాకు విచ్చేసింది. అయితే, సోమవారం(సెప్టెంబరు 9) మొదలుకావాల్సిన అఫ్గన్- కివీస్ మ్యాచ్కు ప్రతికూల పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఫలితంగా ఇరుజట్ల మధ్య మొదలుకావాల్సిన ఏకైక టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. నిజానికి సోమవారం ఏమాత్రం వర్షం కురవనేలేదు. కానీ కొన్నిరోజుల పాటు కురిసిన కుండపోత వర్షాల వల్ల నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్ ఏమాత్రం అనుకూలంగా లేదు.ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేదుదీంతో ఆటగాళ్లు మైదానంలో దిగే అవకాశమే లేకపోవడంతో పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా చేసేదేమి లేక తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేకపోవడంతో మైదానం తడారిపోయేందుకు ఎండకాయాల్సిందే! కాబట్టి.. దీని కారణంగా మ్యాచ్పై ఎన్నిరోజులు ప్రభావం పడుతుందో స్పష్టంగా చెప్పడం కష్టం.చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోముఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇక్కడి పరిస్థితి చెత్తగా ఉంది. ఇంకోసారి ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాం. ఇక్కడ కనీస వసతులు లేవు. మా ఆటగాళ్లు కూడా నిరాశకు లోనయ్యారు. నిజానికి.. గతంలో మేము ఇక్కడకు వచ్చినపుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది.మాకు సొంతగడ్డ లాంటిదిఅందుకే ముందుగానే సంబంధిత అధికారులతో మాట్లాడాము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని స్టేడియం వాళ్లు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు కాగానే.. అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది బీసీసీఐ, ఏసీబీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తమకు సొంతగడ్డ లాంటిదని.. ఇక్కడ తాము ఆడబోయే మ్యాచ్కు మంచి వేదికను ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటంతో అతడు కూడా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కాగా 2017లో టెస్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడి మూడింట గెలిచి.. ఆరింట ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్తో అఫ్గన్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే! చదవండి: ముషీర్ ఖాన్కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
Afg vs NZ Day 1: ఒక్క బంతి పడకుండానే ముగిసిన ఆట
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు మొదటిరోజే ఆటంకం కలిగింది. వర్షం తాలూకు ప్రభావం కారణంగా ఒక్క బంతి పడకుండానే తొలి రోజు ఆట ముగిసిపోయింది. ఫలితంగా మ్యాచ్ను ఘనంగా ఆరంభించాలనుకున్న ఇరుజట్లకు చేదు అనుభవమే మిగిలింది.మూడింట విజయాలుకాగా 2017లో టెస్టు జట్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్... ఇప్పటి వరకు సంప్రదాయ ఫార్మాట్లో తొమ్మిది మ్యాచ్లు ఆడింది. టీమిండియాతో ఒకటి, ఐర్లాండ్తో రెండు, బంగ్లాదేశ్తో రెండు, వెస్టిండీస్తో ఒకటి, జింబాబ్వేతో రెండు, శ్రీలంకతో ఒక టెస్టులో పాల్గొంది. వీటిలో జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్లపై ఒక్కో మ్యాచ్లో గెలుపొందింది. ఈ క్రమంలో న్యూజిలాండ్తో తొలిసారి టెస్టు మ్యాచ్కు ఆడేందుకు సిద్ధమైంది.ఆటగాళ్ల క్షేమమే ముఖ్యంతమదేశంలో ఇందుకు అనుకూల పరిస్థితులు లేని నేపథ్యంలో భారత్ వేదికగా కివీస్తో పోటీకి అన్నిరకాలుగా సన్నద్ధమైంది. గ్రేటర్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా నోయిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవుట్ఫీల్డ్ మొత్తం పూర్తిగా తడిచిపోయింది. ఈరోజు కాస్త ఎండగానే ఉన్నా.. అవుట్ఫీల్డ్ మాత్రం పూర్తిగా ఆరలేదు.రోజుకొక అరగంట ఎక్కువ?గ్రౌండ్స్మెన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహిస్తే.. ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతను దృష్ట్యా తొలిరోజు ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు కుమార్ ధర్మసేన, షర్ఫూద్దౌలా తెలిపారు. రేపటి నుంచి నాలుగురోజుల పాటు మ్యాచ్ను నిర్వహిస్తామని వెల్లడించారు.అనూహ్య పరిస్థితుల్లో తొలిరోజు ఆట రద్దైన కారణంగా మిగిలిన నాలుగు రోజులు అరగంట ఎక్కువసేపు ఆట కొనసాగిస్తామని తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆట మొదలవుతుందని పేర్కొన్నారు. కాగా స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ గాయం కారణంగా కివీస్తో టెస్టుకు దూరమయ్యాడు.న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్.అఫ్గన్తో టెస్టు మ్యాచ్కు న్యూజిలాండ్ జట్టుటామ్ లాథమ్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, మ్యాచ్ హెన్రీ, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, విలియం ఒరూర్కీ. The buildup is 🔛!While we wait for the start of the game, check out these glimpses of the current scenes in Greater Noida. 👍#AfghanAtalan | #GloriousNationVictoriousTeam pic.twitter.com/aLC5SZGoaW— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2024 -
ఎకో విలేజ్లో కలుషిత నీరు.. 200 మంది అస్వస్థత
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా వెస్ట్లోని ఎకో విలేజ్- 2 సొసైటీలో కలుషిత నీరు తాగి, 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారు. అధికారులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడాలోని ఎకో విలేజ్- 2లో రెండు రోజుల క్రితం ట్యాంక్ను రసాయనాలతో శుభ్రం చేశారు. ఆ తరువాత ఈ ట్యాంకు నీటిని తాగిన 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఉదంతం గురించి సొసైటీలో ఉంటున్న వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వాటర్ ట్యాంక్ను రసాయనాలతో శుభ్రం చేశారని, అయితే వాటర్ ట్యాంక్లో ఇంకా రసాయనం మిగిలి ఉందని, దాని కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తాము బయటి నుంచి నీరు తెచ్చుకుని వినియోగించుకుంటున్నామన్నారు. -
సినిమాను తలపించేలా.. చిన్న ‘పార్కింగ్’ గొడవ.. పెద్ద రచ్చ.. వీడియో వైరల్
ఢిల్లీ: నోయిడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇరుగుపొరుగు ఇళ్ల వారు రోడ్డుపైనే కొట్టుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UPpic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024 -
వెంబడిస్తున్న టీఎస్ఐని కారుతో ఢీకొట్టి..
ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్(టీఎస్ఐ)ను కారుతో బలంగా ఢికొట్టి, తీవ్రంగా గాయపరిచిన ఉదంతం వెలుగు చూసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జై ప్రకాష్ సింగ్ నోయిడాలోని రజనీగంధా కూడలిలో విధులు నిర్వహిస్తుండగా, అతనికి అనుమానాస్పద వాహనం గురించిన సమాచారం అందింది. వెంటనే ఆయన ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని డ్రైవర్ కారును అత్యంత వేగంగా పోనిచ్చాడు.వెంటనే జై ప్రకాష్ సింగ్ ఒక స్కూటీ లిఫ్ట్ తీసుకొని కారును వెంబడించి, అట్టా రెడ్ లైట్ దగ్గర ఓవర్టేక్ చేసి కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ఆ కారు డ్రైవర్ స్కూటీని ఢీకొట్టి, జై ప్రకాష్ సింగ్ను తీవ్రంగా గాయపరిచి, కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. టీఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్లో ట్విస్ట్!
తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్ గుప్తా ఎపిసోడ్పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించారు. తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తన భర్త గత కొంత కాలంగా కెరియర్ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నా భర్త విపిన్ రెండుసార్లు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉపశమనం పొందేందుకు తిరుమల దర్శనం అనంతరం నోయిడా వెళ్లినట్లు చెప్పారు. అన్నీ అవాస్తవాలేఈ సందర్భంగా తాను విపిన్ను వేధిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ‘నేను నా భర్తను వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ వేధించలేదు. అదే జరిగితే, అతనిని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను? ఆచూకి కోసం సోషల్ మీడియాలో పోస్ట్లు ఎందుకు పెడతాను’ అని ప్రశ్నించారు. మానసికంగా కృంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పారు.బెదిరింపులు ఎక్కువయ్యాయ్తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని వాపోయారు శ్రీపర్ణ దత్త. నా భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు సైబర్ నేరస్తులు మెసేజ్లు పంపినట్లు వెల్లడించారు. భార్య పోరు పడలేకేగతవారం బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించే ఐటీ ఉద్యోగి విపిన్ గుప్త ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్ జాడకోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్తా పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విపిన్ను బుజ్జగించడంతో కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విపిన్ మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావస కేంద్రానికి పంపించారు. -
టెక్కీ: జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో గత 12 రోజులుగా కనబడకుండా పోయిన టెక్కీ విపిన్ గుప్తా ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొడిగేహళ్లి పోలీసులు నోయిడాకు వెళ్లి అతనిని తీసుకువచ్చారు. మాన్యతా టెక్పార్క్ కంపెనీలో ఐటీ ఇంజినీర్గా పనిచేస్తున్న విపిన్ గుప్తా, భార్య పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. 4వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో చెప్పకుండా తన కవాసకి బైక్లో వెళ్లిపోయాడు. గంట తరువాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1.80 లక్షలు డ్రా అయ్యాయి. ఫోన్ కూడా స్విచాఫ్ చేసుకున్నాడు. రెండు రోజుల తరువాత భార్య కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతికిపెట్టాలని సోషల్ మీడియా ద్వారా పోలీసు శాఖకు వేడుకుంది. డబ్బుల కోసం తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసారని వాపోయింది. విషయం రచ్చ కావడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గుప్త కోసం వేట ప్రారంభించగా నోయిడాలో ఉన్నట్టు గుర్తించి తీసుకువచ్చారు. కుటుంబ కలహాల కారణంగా మనశ్శాంతి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు అతడు చెబుతున్నాడు. భార్యాభర్తల కలహం పోలీసులను పరుగులు పెట్టించింది. -
వాట్సాప్లో రేవ్ పార్టీ ప్లాన్.. గేటెడ్ కమ్యూనిటీలో 35 మంది మైనర్లు..
లక్నో: గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లో అక్రమంగా జరుగుతున్న రేవ్ పార్టీని నోయిడా పోలీసులు భగ్నం చేశారు. ఇక, రేవ్ పార్టీలో డ్రగ్స్, మద్యం సేవిస్తున్న కాలేజ్ స్టూడెంట్స్(మైనర్ల)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి వీరంతా రేవ్ పార్టీకి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. నోయిడాలోని సూపర్నోవా రెసిడేన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో కొందరు మైనర్లు గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీ ప్లాన్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ప్లాట్ నుంచి కేకలు, మద్యం బాటిళ్లు బయటకు విసిరేయడంతో రేవ్ పార్టీ విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు రేవ్ పార్టీపై సమాచారం ఇచ్చారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఐదుగురు నిర్వాహకులతో సహా 35 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. #WATCH : Exclusive photos and video of rave party organised by college students at a flat of a Supernova society in Noida.Students threw empty liquor bottles from the balcony, shattering them on the ground floor.Police have detained 39 individuals, including the main… pic.twitter.com/RXlu8lgRUr— upuknews (@upuknews1) August 10, 2024అనంతరం, విచారణ సందర్భంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ రేవ్ పార్టీ కోసం కాలేజ్ స్టూడెంట్స్ ఎంట్రీ ఫీజ్ వసూలు చేసినట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఫీమేల్ సింగిల్స్ రూ. 500లు, జంటలకు రూ.800, పురుషులకు రూ.1000 వసూలు చేసినట్టు చెప్పారు. రేవ్ పార్టీ కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు తెలిపారు. ఇక, ఈ పార్టీలో మద్యం, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలం నుంచి హుక్కా, ఖరీదైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇవి హర్యానాకు చెందిన మద్యం బాటిళ్లుగా పోలీసుల నిర్ధారించారు. ఇక, అరెస్ట్ అయిన వారిపై మైనర్లు, బాలికలు ఉన్నట్టు సమాచారం. -
నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్శర్మకు జూన్ నెల కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు మెసేజ్ వచ్చింది.ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్కు ఫోన్ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్లోనూ విద్యుత్ వాడామని సమాధానమిచ్చాడు.దీంతో బసంత్శర్మ విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వారు చెక్చేసి చూడగా ఎర్రర్ కారణంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. -
‘వాట్సాప్ గ్రూప్లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి. కానీ, పని చేసే చోట ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంది. వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి.. ఆమె తినే తీరు, మాట్లాడే విధానం.. ఇలా తోటి ఉద్యోగులు అన్నింటా ఆమెను హేళన చేస్తూ వచ్చారు. అది పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. భరించలేక లేఖ బలవన్మరణానికి పాల్పడిందామె.నోయిడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేసే శివాని త్యాగి ఆత్మహత్య ఘటన ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్గా మారింది. ఘజియాబాద్లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందామె. ఆరు నెలలపాటు ఆఫీస్లో తోటి ఉద్యోగులు ఆమెను వేధించారని, అది భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని శివాని కుటుంబం ఆరోపిస్తున్నారు. వీటికి తోడు..ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారాయన.వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, పైఅధికారులు ఆమెను ఆపుతూ వచ్చారు. అయితే ఓ సహోద్యోగిణితో వాగ్వాదంలో శివాని ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు తొలగింపు నోటీసులు ఇచ్చారు. శివాని అది తట్టుకోలేకపోయింది అని ఆమె సోదరి మీడియాకు చెబుతూ కంటతడి పెట్టింది. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం
ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలోని ఓ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లాజిక్స్ మాల్లోని ఓ బట్టల దుకాణంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు, షాప్ నిర్వాహకులు, జనాలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. సమాసచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది... వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్పడం ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా మాల్లోని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మాల్ బయట పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అయితే మాల్ లోపల పొగలు కమ్ముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.VIDEO | Fire breaks out at Logix Mall, Wave City Centre, #Noida. Several fire tenders at the spot. More details are awaited(Source: Third Party) pic.twitter.com/9gQR1wmIuV— Press Trust of India (@PTI_News) July 5, 2024 -
4 BHK ఫ్లాట్ ధర రూ. 15 కోట్లు.. నోయిడా టెక్కీ పోస్టు వైరల్
నోయిడా: రోజులు గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో అయినా చిన్నచిన్న ఇళ్ల నిర్మాణం నుంచి లగ్జరీ ప్రాజెక్టుల వరకు రేట్లు ఆకాశంలోనే ఉన్నాయి. సొంతింటిలో జీవించడం ప్రతి ఒక్కరి కల కావడంతో ఎంత డబ్బులు వెచ్చించినా ఒక ఇంటిని సొంతం చేసుకునేందుకు అందరూ తాపత్రయ పడుతుంటారు.ఇక లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనడమంటే కోట్లు వెచ్చించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ ఇంటి ధర తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ నోయిడాలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ ధర ఏకంగా రూ. 15 కోట్ల ధరగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్సీఆర్కు చెందిన ఓ ఇంజనీర్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది.కాశిష్ అనే వ్యక్తి విట్టీ ఇంజనీర్ అనే ఇన్స్టా అకౌంట్లోని పోస్టు ప్రకారం.. నోయిడా సెక్టార్ 124 కు వర్చువల్ టూర్కు వెళ్లాడు. అక్కడ ఏటీఎస్ నైట్స్ బ్రిడ్స్ ప్రాజెక్ట్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ధరను చూశారు. 4 BHK ఫ్లాట్ ధరను రూ. 15 కోట్లకు అమ్ముతున్నట్లు బోర్డు ఉంది. అలాగే 6 BHK ఫ్లాట్ ధర 25 కోట్లు అని ఉంది. ఇది చూసిన కాశిష్.. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెట్టుబడులు పెట్టినా సొంత ఇంటిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఈ అపార్ట్మెంట్లు ఎవరు కొంటున్నారో ఆశ్యర్యం వేస్తుంది.. వారు ఏ పని చేస్తారని ప్రశ్నించారు. నేను అయితే ఎన్ని ఉద్యోగాలు మార్చుకున్నా, ఎంత వ్యాపారం చేసినా లేదా పెట్టుబడి పెట్టినా ఈ సమాజంలో 4BHKను కొనుగోలు చేయగలనా?" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Witty Engineer (@wittyengineer_) ఈ వీడీయో వైరల్గా మారింది. దాదాపు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అపార్ట్మెంట్ల అధిక ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు. నోయిడా రియల్ ఎస్టేట్ మధ్యతరగతి భారతీయులకు అందుబాటులో లేకుండా పోతుందని కొందరు పేర్కొన్నగా.. 15 కోట్లతో యూరప్ లేదా యూఎస్లో పౌరసత్వంతోపాటు ఎక్కడైన ఒక అపార్ట్మెంటే కొనవచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది ల్గజరీ ప్రాజెక్ట్ అని, విశాలమైన ప్రదేశం, విలాసవంతమైన సౌకర్యాల వల్ల అంత ధర ఉందని వివరిస్తున్నారు. -
వాహనదారులకు షాక్.. సీఎన్జీ ధరలు పెంపు
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన రేట్లు జూన్ 22 ఉదయం 6 గంటలకు అమల్లోకి వచ్చాయి. సీఎన్జీ ధర కేజీకి ఒక్క రూపాయి పెరిగింది. ఈ పెరుగుదల తరువాత, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎన్జీ కేజీ ధర రూ .75.09 కు చేరింది.ఈ పెరుగుదల ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని అనేక నగరాల్లో సీఎన్జీ రిటైల్ ధరలను ప్రభావితం చేయనుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లలో సీఎన్జీ ధరలు ఒక్క రూపాయి పెరిగాయి. ఈ నగరాల్లో ఇప్పటి వరకు రూ.78.70 ఉన్న కేజీ సీఎన్జీ ధర ఇప్పుడు రూ.79.70కి చేరింది. ఇక ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్లో సీఎన్జీ రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతోపాటు కర్నాల్, కైతాల్లలో కూడా సీఎన్జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇతర నగరాల్లో ధరలుహర్యానాలోని రేవారీ, మీరట్, ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ, రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో కూడా నేటి నుంచి సీఎన్ జీ ధరలు పెరిగాయి. రేవారీలో సీఎన్జీ ధరలు కేజీకి రూ .78.70 నుంచి రూ .79.70 కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్, ముజఫర్ నగర్, షామ్లీలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది. రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో ఇప్పుడు సీఎన్జీ ధర ఒక రూపాయి పెరిగింది. ఇక్కడ రూ.81.94 ఉన్న కేజీ సీఎన్జీ ధర రూ.82.94కు పెరిగింది. -
ఢిల్లీలో మారిన వాతావరణం... ఉన్నట్టుండి వర్షం
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నోయిడా-ఘజియాబాద్లో ఉన్నట్టుండి వర్షం కురిసింది. బలమైన గాలులతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల చినుకులు పడ్డాయి.గత కొన్నాళ్లుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. కాగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో నేడు (గురువారం) పగటిపూట తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఇది ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని పేర్కొంది. వర్షాలు కురవనున్న నేపధ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన చినుకులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి 12 గంటల తర్వాత ఎన్సీఆర్లో బలమైన గాలులు వీచాయి. హాపూర్లోని సింబావోలిలో ఎనిమిది గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
యూనివర్సిటీ వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. పరారీలో భర్త, అత్త? ..?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఘోరం వెలుగుచూసింది. గౌతమ్ బుద్దా యూనివర్సిటీలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్లో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను భర్త, అత్తే హత్య చేసి అక్కడి నుంచి పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్ ఆసపత్రిలో పనిచేస్తున్నట్లు తేలింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా తెలిపారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. -
115 మంది పోలీసులు ‘అదృశ్యం’!
దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో యూపీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల కోసం యూపీలోని కాన్పూర్ నుంచి నోయిడాకు వెళ్లిన 115 మంది పోలీసులు అదృశ్యమైన ఉదంతం వెలుగు చూసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడా పోలీస్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలో, కాన్పూర్ నుండి వచ్చిన 138 మంది పోలీసులలో 115 మంది అదృశ్యమైనట్లు తేలింది. ఈ పోలీసులకు దాద్రీలోని అన్షు పబ్లిక్ స్కూల్లో వసతి సౌకర్యం కల్పించారు. నోయిడా పోలీసులు ఈ గైర్హాజరైన పోలీసులపై కేసు నమోదు చేశారు. అలాగే ఈ విషయాన్ని డీజీపీ హెడ్క్వార్టర్లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా ఇలాంటి పలు ఘటనలు వెలుగులోకి రావడంతో, ఎన్నికల విధులకు హాజరైన పోలీసులను రోజువారీగా లెక్కించాలని అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ అమితాబ్ యష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అదృశ్యమైన పోలీసులు ఎన్నికల విధులకు గైర్హాజరై, వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
కరుడుగట్టిన స్క్రాప్ మాఫియా డాన్, ప్రియురాలి అరెస్ట్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానా, అతని గర్ల్ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు థాయ్లాండ్లో అరెస్ట్ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో గ్యాంగ్స్టర్. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్ ఝా థాయ్లాండ్లో పట్టుబడ్డాడు.నోయిడా పోలీసులు థాయ్లాండ్ పోలీసులతో నిత్యం టచ్లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రవీంద్రనగర్లో 16 మంది గ్యాంగ్స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్ మెటీరియల్ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్ మెటీరియల్ డీలర్ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాపింగ్కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్ గోడౌన్లను గ్యాంగ్స్టర్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్ అయ్యారు.ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. రవి తన గర్ల్ఫ్రెండ్ కాజల్ ఝాకు బహుమతిగా ఇచ్చిన రు.100 కోట్ల బంగాళాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉంది. దీనిని కాజల్ ఝా పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. గౌతంబుద్ధనగర్, బులంద్ షహర్లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.ఉద్యోగం కోసం గ్యాంగ్స్టర్ రవిని సంప్రదించిన కాజల్ ఝా తర్వాత అదే గ్యాంగ్లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్చార్జీగా వ్యవహరిస్తున్నారు. -
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్లోనే సివిల్స్ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
నామినేషన్లలోనే సగం మంది అవుట్!
నోయిడా: లోక్సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉత్తర ప్రదేశ్లోని రెండు స్థానాల్లో దాఖలైన నామినేషన్లలో సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్లో 60 శాతం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో దాదాపు 56 శాతం మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు. ఘజియాబాద్లో 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఆమోదించినట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పక్కనే ఉన్న గౌతంబుద్ధ్ నగర్లో 34 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయని, వారిలో 15 మంది అభ్యర్థులు చెల్లుబాటయ్యారని పేర్కొంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 69 నామినేషన్లు రాగా అందులో 40 తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్లో నామినేషన్ల తిరస్కరణ 60 శాతం కాగా, గౌతమ్బుద్ధ్నగర్లో 55.89 శాతంగా నమోదైంది. అధికారిక జాబితా ప్రకారం.. ఘజియాబాద్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే గౌతమ్బుద్ధ్నగర్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. -
ఈసారి కొడితే హ్యాట్రిక్..!
గౌతమ్ బుద్ధ్ నగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నోయిడా అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. ఢిల్లీ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ లోక్సభ నియోజకవర్గంలో హ్యాట్రిక్పై బీజేపీ కన్నేసింది. జీబీ నగర్లోని నోయిడా, జేవార్, దాద్రీ, బులంద్షహర్లోని సికింద్రాబాద్, ఖుర్జాలతో కూడిన మొత్తం ఐదు సెగ్మెంట్లలో గౌతమ్ బుద్ధ్ నగర్ నియోజకవర్గంలో 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నకల్లోనూ అవే ఫలితాలను అంచనా వేస్తోంది. ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవే బీజేపీ బలాలు తమ ప్రభుత్వం చేపట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, దాద్రీ, బోడకిలో రవాణా సౌకర్యాలు, రైలు, మెట్రో విస్తరణ కారిడార్లు, సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక కేంద్రాలతో పాటు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన డాక్టర్ మహేష్ శర్మపై బీజేపీ విశ్వాసంతో ఉంది. గౌతమ్ బుద్ధ నగర్ రాజకీయ చరిత్రలో డాక్టర్ మహేష్ శర్మ విజయ పరంపర దశాబ్దం క్రితమే మొదలైంది. 2014 ఎన్నికలలో డాక్టర్ శర్మ 5,99,702 ఓట్లు, 50 శాతం ఓట్లతో మొదటిసారి విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నరేంద్ర భాటిని 2,80,212 ఓట్ల తేడాతో ఓడించారు. తరువాత, 2019 ఎన్నికలలో 8,30,812 ఓట్లు, 59.64 శాతం ఓట్లతో మరోసారి గెలుపొందారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నోయిడా పేరుతో ప్రసిద్ధి చెందిన గౌతమ్ బుద్ధ్ నగర్ లోక్సభ స్థానానికి రెండో దశలో ఉత్తరప్రదేశ్లోని ఇతర నియోజకవర్గాలతో పాటు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటి ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్లో 2,302,960 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,268,324 మంది పురుషులు, 1,034,503 మంది మహిళలు కాగా 133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు. ఇక నియోజకవర్గంలో 3,297 పోస్టల్ ఓట్లు, 5,482 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. -
జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలుడు నాసాకి ఎంపికయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్ అతడు చేసిన రూ. 150ల ప్రాజెక్టు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నిర్వహించే ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ టీమ్లో సెలక్టయ్యేలా చేసింది. ఓ సాదాసీదా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ నాసాకి ఎంపికవ్వడమే కాకుండా తన అద్భుత మేధాతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బాలుడు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీలోని చిన్నగ్రామమైన ఛాయ్సన్కు చెందిన 15 ఏళ్ల ఉత్కర్ష్ అనే బాలుడు నాసాకు వెళ్తున్నాడు. పదోవతరగతి చదువుతున్న ఈ ఉత్కర్ష్ జనవరిలో సైన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో వివిధ పాఠశాల విద్యార్థులంతా సుమారు రూ. 25 వేల నుంచి లక్షలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ప్రిపేర్ చేస్తే, ఉత్కర్ష్ కేవలం రూ. 150ల ప్రాజెక్టుతో పాల్గొన్నాడు. అంతమంది విద్యార్థుల మందు నిలబడగలనా? అనుకున్న ఉత్కర్ష్ ..తన అద్భుత ప్రతిభతో తయారు చేసిన వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదికూడా తక్కువ మొత్తంలో ప్రాజెక్టుని ప్రజెంట్ చేయడంతో ఉత్కర్షని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిలో ఉన్న ఆ అసాధారణ మేధస్సే నాసా హ్యుమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్(హెచ్ఈఆర్సీ) అని పిలిచే ఇంజనీర్ డిజైన్ ఛాలెంజ్ 2024లో పాల్గొనే కైజెల్ టీమ్లో ఉత్కర్షని భాగమయ్యేలా చేసింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మానవ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులనే భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ని నిర్వహిస్తుంది. ఆ రోవర్ ఛాలెంజ్లో ఉత్కర్ష్ తన బృందంతో కలసి పాల్గొననున్నాడు. ఈ ఛాలెంజ్ వచ్చే నెల ఏప్రిల్ 18 నుంచి 20, 2024 వరకు జరుగుతుంది. ఇక ఉత్కర్ష నేపథ్యం వచ్చేటప్పటికీ..ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. ఉత్కర్ష్ తన తాత సురేంద్ర సింగ్ చేసే వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా. చిన్నతనంలోనే ఉత్కర్ష్ బ్రెయిన్ హేమరేజ్కి గురయ్యి దాదాపు మూడు నెలలు వెంటిలేటర్ ఉన్నట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. "మృత్యముఖం నుంచి కాపడుకున్నా మా బిడ్డ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంపిక కావడం అన్నది మాకెంతో గర్వంగా ఉంది". అని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక ఉత్కర్ష్ తోపాటు పదోవతరగతి చదువుతున్న టౌరుకు చెందిన లోకేష్ కుమార్, గుహ, గురుగ్రామ్కి చెందిన పల్లవి, ఫరీదాబాద్కి చెందిన అరుణ్ కుమార్, పానిపట్ నుంచి రోహిత్ పాల్, నోయిడా నుంచి ఓమ్ తదితర విధ్యార్థులు ఎంపికయ్యారు. ఎంత్రీఎం ఫౌండేష్ ఈ వైఎంఆర్డీ టీమ కైజెల్కి మద్దతు ఇస్తుంది. నాసా నిర్వహించే ఈ ఇంజనీరింగ్ ఛాలెంజ్లో భారత్ తరుఫు నుంచి ఎనిమిది టీమ్లను ఎంపిక చేయగా, వాటిలో ఎన్జీవో మద్దతు గల జట్టే ఈ కైజెల్ టీమే. (చదవండి: స్నానమే ఆమెకు శాపం! చేసిందా..నరకమే..!) -
Delhi: ఢిల్లీలో భారీ వర్షం..
ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లో మార్చి 2 న వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. లక్నో, బిజ్నోర్, మీరట్, బరేలీ, రాంపూర్, రాయ్ బరేలీ, గోరఖ్పూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్లలో జల్లులు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. Nowcast-1 Fresh scattered thunderclouds are developing all over #Delhi & #Ncr and #Haryana region to bring on/off spells of light-mod rains with isol heavy burst w/ #hailstorm followed by gusty winds upto 20-50km/h in #Delhi,#Gurgaon,#Ghaziabad, #Noida in next 3 hrs#DelhiRains https://t.co/k1ykuNUpLy pic.twitter.com/zKKl3CkLcJ — IndiaMetSky Weather (@indiametsky) March 2, 2024 వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం ఢిల్లీ-ఎన్సిఆర్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణం చల్లగా మారనుంది. మార్చి 2న పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మెరుపులు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానాలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 2న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. Temperature is going to drop today 🥶I just kept warm clothes in bed 🙄#Delhirains pic.twitter.com/K62B7dpJ1E — Kritika vaid (@KritikaVaid91) March 2, 2024 And it's raining here in Delhi.. #DelhiRains pic.twitter.com/RruuQbouRL — Ankit Sinha (@imasinha) March 2, 2024 -
మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం!
భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ 'టీసీఎస్' (TCS) నోయిడాలో సుమారు 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో అతిపెద్ద ఆఫీస్ స్పేస్లలో ఒకటి కానున్నట్లు సమాచారం. లీజుకు తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం రిటర్న్ టు ఆఫీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే TCS కంపెనీ తమ ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని ఫైనల్ వార్ణింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ స్థలం నోయిడా ఎక్స్ప్రెస్వేలోని అసోటెక్ బిజినెస్ క్రెస్టెరాలో ఉంది. ఆఫీస్ స్పేస్ అవసరాలకు ఐటీ కంపెనీలు ప్రధాన కారణమని, వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు వల్ల రాబోయే రోజుల్లో ఆఫీసులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ ఆఫీసులకు రావడం మొదలుపెడితే.. ఆఫీస్ స్థలాలు ఎక్కువ అవసరమవుతాయి. దీంతో నోయిడా ప్రాంతంలో ఆఫీసులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ జెన్పాక్ట్, సెలెబల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు కూడా ఆఫీసు స్థలాలను లీజుకు తీసుకున్నాయి. ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! రిటర్న్ టు ఆఫీస్ TCS కంపెనీలో ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిన ఉద్యోగులందరూ కూడా మార్చి ఆఖరినాటికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీ డెడ్లైన్ విధించినట్లు సమాచారం. కంపెనీలో పనిచేసి ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి టీసీఎస్ సిద్ధమైంది. -
Dilli Chalo 2.0: ఢిల్లీ సరిహద్దులో యుద్ధవాతావరణం
అష్ట దిగ్బంధనంలో దేశ రాజధాని ఢిల్లీ సింగు బోర్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరనసన కారులు శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు #WATCH | Protesting farmers vandalise flyover safety barriers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/vPJZrFE0T0 — ANI (@ANI) February 13, 2024 పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడిక్కడ రహదారులను మూసివేసిన పోలీసులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహిద్దుల్లో పటిష్ట భద్రత కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతుల డిమాండ్ #WATCH | Protesting farmers throw police barricade down from the flyover at Shambhu on the Punjab-Haryana border as they march towards Delhi to press for their demands. pic.twitter.com/oI0ouWwlCj — ANI (@ANI) February 13, 2024 ఢిల్లీ వ్యాప్తంగా నెలరోజులపాటు 144 సెక్షన్ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న భద్రతా బలగాలు అంబాల హైవేపైకి భారీగా రైతులు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం రైతుల చలో ఢిల్లీ రహదారులను మూసివేసిన పోలీసులు పలుచోట్ల అతినెమ్మదిగా కదులుతున్న వాహనాలు ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. పంజాబ్,హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత సరిహద్దుల వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు రైతుల టియర్ గ్యాస్ ప్రయోగం ఢిల్లీ ముట్టడికి రైతుల యత్నం 2020 ఉద్యమం తరహాలో పోరుగు సిద్ధమైన రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదన్న రైతులు ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలతో బయల్దేరిన రైతులు ధీర్ఘకాలిక ఉద్యమాన్ని కొనసాగించాలని రైతులు నిర్ణయం మంత్రులతో చర్చలు విఫలం కావడంతో మొదలైన రైతుల మార్చ్ శాంతియూతంగా ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం సాక్షి, ఢిల్లీ: రైతుల ఢిల్లీ ఛలో యాత్రతో నగర సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది. ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు.. అంబాల హైవే పైకి చేరారు. #WATCH | Police use tear gas drones at the Haryana-Punjab Shambhu border to disperse protesting farmers. pic.twitter.com/LcyGpDuFbv — ANI (@ANI) February 13, 2024 మరోవైపు.. పంజాబ్, హర్యానాల నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తేఉన్నారు. ఇంకోపక్క రైతన్నల ఢిల్లీ ఛలో ప్రభావంతో.. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపు.. తనిఖీలతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహదనదారులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. రైతుల మెగా మార్చ్ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్ దిమ్మెలు, కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు. #Traffic snarls on the highway from #Gurugram towards #DelhiPolice place concrete slabs on the road as a part of measures to stop farmers from marching to Delhi#DelhiNCR #FarmersProtest pic.twitter.com/oqCel5wEUf — cliQ India (@cliQIndiaMedia) February 13, 2024 అలాగే అత్యవసరాల వస్తువులను సైతం అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎన్హెచ్ 48పై కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆందోళనకు తరలివస్తున్న రైతుల్ని పంజాబ్ పోలీసులు అనుమతిస్తుండడం గమనార్హం. #WATCH | Punjab Police allows protesting farmers to cross Rajpura bypass to head towards Haryana's Ambala onward to Delhi for their protest to press for their demands pic.twitter.com/yCMvdNnD8t — ANI (@ANI) February 13, 2024 ఇదిలా ఉంటే.. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. మంగళవారం ఉదయం పంజాబ్, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. #WATCH | Delhi Police personnel and barricades deployed at ITO intersection, section 144 CrPC imposed, in view of farmers' protest march to Delhi demanding a law guaranteeing MSP for crops pic.twitter.com/ZSUhHhFFA7 — ANI (@ANI) February 13, 2024 కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపుభగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Fatehgarh Sahib in Punjab. pic.twitter.com/WE7mXiPu9J — ANI (@ANI) February 13, 2024 #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Shambhu Border. pic.twitter.com/tKEF6iEHkZ — ANI (@ANI) February 13, 2024 సోమవారం నాడు.. యాత్రను విరమించుకోవాలని సూచించిన కేంద్రం.. రైతుసంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా సోమవారం దాదాపు అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్సింగ్ పంధేర్ తదితరులతో సమాలోచనలు జరిపింది. డిమాండ్లు ఏంటంటే.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటరుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం, మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉండిఉంటే.. వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ మార్చ్ యథాతథంగా కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్సింగ్ పంధేర్ ప్రకటించారు. మరోవైపు రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆంక్షల వలయంలో హస్తిన రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల పాటు సెక్షన్-144 విధిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనను సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Jharoda border) pic.twitter.com/xcFCYaeoMz — ANI (@ANI) February 13, 2024 -
ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టారు. దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
Delhi: రైతుల భారీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు
ఢిల్లీ: వందలాది మంది రైతులు నిరసన తెలుపుతూ.. పార్లమెంట్ వరకు చేపట్టిన ర్యాలీని నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్స్ను దాటడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిత్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దానికి సంబంధించన వీడియో వైరల్ మారింది. నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ రూట్లో నిరసన ర్యాలీ చేట్టవద్దని ముందుగా సమాచారం అందించినా రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. దీంతో అక్కడ అధికంగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. VIDEO | Hundreds of protesting farmers stopped by police near Mahamaya Flyover in Noida as they try to march to the Parliament. Farmer groups in Noida and Greater Noida have been protesting since December 2023, demanding increased compensation and developed plots for the land… pic.twitter.com/FcSN2etfyH — Press Trust of India (@PTI_News) February 8, 2024 అయితే నోయిడాలోని పలు గ్రామాల రైతుల తాము పార్లమెంట్ బయట తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతామని ప్రకటించారు. తాము ట్రాక్టర్లు, బస్సులతో రాజాధాని ఢిల్లీకి నిరసనగా ప్రవేశిస్తామని తెలిపారు. వారంతా మహామాయ ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని ఢిల్లీవైపు బయలుదేరుదామని నిర్ణయించుకున్నారు. కాగా.. ఒక్కసారిగా వందలది మంది రైతులు తమ వాహనాలతో గుమిగూడటంతో ట్రాఫిక్ అంతరాయంతో పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రైతులను ర్యాలీ ముందుకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. నివాస అవసరాల కోసం సేకరించిన మొత్తం భూమిలో 10 శాతం, 64.7 శాతం పెంచిన భూ పరిహారం, రెసిడెన్షియల్ ప్లాట్లపై వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి, ఇతర ప్రయోజనాల కోసం తమ డిమాండ్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని భారతీయ కిసాన్ ఏక్తా సంఘ్ నాయకుడు సుఖ్బీర్ యాదవ్ మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో రైతులమంతా పార్లమెంట్ వద్దకు నిరసన ర్యాలీ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. చదవండి: Delhi: కూలిన మెట్రో స్టేషన్ వాల్... పలువురికి గాయాలు! -
అలా చేస్తే 'డ్రైవింగ్ లైసెన్స్' క్యాన్సిల్.. ఇలాంటి రూల్ మంచిదేనా?
భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయడానికి 'ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్' ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి మూడు కంటే ఎక్కువ చలాన్స్ పొందిన డ్రైవర్ లేదా రైడర్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు పౌరులను హెచ్చరించారు. ఆ తరువాత కూడా ఇదే మళ్ళీ పునరావృతమైతే.. వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా.. ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, వరుసగా మూడు కంటే ఎక్కువ చలాన్లు పొందిన వ్యక్తి లైసెన్స్ను రద్దు చేయవచ్చని నిర్ణయించారు. రెడ్ లైట్ జంపింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటి నేరాలకు సంబంధించి పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: చేతులు లేని మహిళకు డ్రైవింగ్ లైసెన్స్.. సీఎం చేతుల మీదుగా.. కేవలం నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఈ ఏడాది జరిగిన 1000 రోడ్డు ప్రమాదాల్లో సుమారు 400 మంది మరణించినట్లు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ వరకు ట్రాఫిన్ నిబంధలనను ఉల్లంఘించిన వాహనదారులు 14 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇందులో 69906 ఓవర్ స్పీడ్, 66867 రెడ్ లైట్ జంపింగ్, 10516 డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడినందు చలాన్ జారీ చేశారు. -
పిస్టల్తో పారిపోయిన రేపిస్టు... ఎట్టకేలకు అదుపులోకి
నోయిడా: ఒక కస్టమర్పై ఆమె ఫ్లాట్లో అత్యాచారానికి పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ ఆదివారం ఎట్టకేలకు మళ్లీ చిక్కాడు. నోయిడాకు చెందిన డెలివరీ బాయ్ సుమిత్ శర్మ శుక్రవారం ఒక స్థానిక అపార్ట్మెంట్లో పార్సిల్ డెలివరీ సందర్భంగా ఫ్లాట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు శనివారం అతన్ని ఖరీపుర్లో అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దారిలో అతను పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయాడు. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతనికోసం వేట సాగించారు. ఎట్టకేలకు వారి కంటబడ్డ సుమిత్ కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో కాలికి తూటా దిగి పట్టుబడ్డాడు. అతనికి, సోదరునికి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
నిఠారి హంతకులెవరు?
కనీవినీ ఎరుగని ఘోరం జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికవుతుంది. చానెళ్లలో ప్రధాన చర్చ నీయాంశంగా మారుతుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. కారకులను ఉరికంబం ఎక్కించాలంటూ జనం డిమాండ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్కౌంటర్ చేయాలని గొంతెత్తుతారు. తీరా కాలం గడిచాక, న్యాయస్థానాల్లో విచారణలు వాయిదాల్లో సాగాక నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారు. అన్ని కేసుల్లోనూ కాకపోవచ్చుగానీ, కొన్నింటి విషయంలో ఇలాగే జరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం దక్కలేదని ఆక్రోశించాలో, అమాయకులకు విముక్తి లభించిందని భావించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. మరి దోషులెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం పెనుసంచలనం సృష్టించిన ‘నిఠారీ హత్యల’ కేసుల్లో నిందితులుగా భావించిన సురేందర్ కోలీ, మోనిందర్ సింగ్ పంధేర్లు తాజాగా అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నిర్దోషులుగా బయటపడటం బహుశా ఎవరూ ఊహించని ముగింపు. ఎందుకంటే 2005–06 మధ్య వారిద్దరూ చేశారని చెప్పిన నేరాల జాబితా చాలా పెద్దది. వారి చేతుల్లో ఏకంగా 18 మంది బాలికలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. ఒంటరిగా కనబడిన నిరుపేద బాలికలకూ, మహిళలకూ మాయమాటలు చెప్పి బంగ్లాలోకి తీసుకెళ్లటం, వారిని హతమార్చటం నేరగాళ్లు అనుసరించిన విధానం. హత్యల తర్వాత మృతదేహాలపై కోలీ, పంధేర్లు లైంగికదాడి జరిపే వారనీ, నరమాంస భక్షణ చేసేవారనీ వచ్చిన కథనాలు వెన్నులో వణుకు పుట్టించాయి. మృత దేహాలపై లైంగిక దాడి తర్వాత శరీర భాగాలను ఇంటి వెనకున్న కిటికీ నుంచి విసిరేసేవారని కూడా ఆ కథనాల సారాంశం. ఎప్పటికప్పుడు వీరందరి అదృశ్యంపైనా ఫిర్యాదులొచ్చినా పోలీసులు నిర్లక్ష్యం వహించటంవల్లే ఇన్ని హత్యలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. తీరా ఇన్నేళ్లు గడిచాక పోలీసులు సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయారనీ, వారి దర్యాప్తు ఆద్యంతం అస్తవ్యస్థంగా సాగిందనీ హైకోర్టు తేల్చింది. వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు మురికి కాల్వలో పుర్రె భాగం దొరకటంతో ఈ కేసుల డొంక కదిలింది. ఆ తర్వాత 8 మంది పిల్లల ఎముకలు ఇంటి వెనుక దొరికాయి. నిందితులపై 2009లో బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, సైకలాజికల్ అసెస్మెంట్స్ వంటి శాస్త్రీయ పరీక్షలు చేశారని వార్తలొచ్చాయి. ‘హఠాత్తుగా నాలో దయ్యం నిద్ర లేచేది. ఎవరినో ఒకరిని మట్టుబెట్టాలన్న వాంఛ పుట్టుకొచ్చేది’ అని కోలీ చెప్పినట్టు కూడా మీడియా కథనాలు తెలిపాయి. నిందితులిద్దరిపైనా 19 కేసులు నమోదుకాగా, వీటిని విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 12 కేసుల్లో కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించగా, రెండు కేసుల్లో పంధేర్ దోషిగా తేలాడు. అతనికి కూడా మరణశిక్ష పడింది. దోషులు అప్పీల్ చేసుకోగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక కేసులో మినహా అన్నింటి లోనూ కోలీ నిర్దోషిగా బయటపడ్డాడు. పంధేర్కు అన్ని కేసుల నుంచీ విముక్తి లభించింది. వీరిద్దరి పైనా బలమైన సాక్ష్యాధారాలూ లేవని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నోయిడా సెక్టార్లోని నిఠారి అప్పట్లో ఒక చిన్న గ్రామం. ఇప్పుడు పట్టణంగా మారింది. మన నేర న్యాయవ్యవస్థ మాత్రం ఎప్పట్లాగే లోపభూయిష్టంగా ఉంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు దాన్నే నిర్ధారించింది. మీడియాలో ప్రముఖంగా ప్రచారంలోకొచ్చి, ఆందోళనలు మిన్నంటే కేసుల్లో పోలీసు లపై వాటి ప్రభావం, ఒత్తిళ్లు అధికంగా వుంటాయనటంలో సందేహం లేదు.వాటిని సాకుగా చూపి ఆదరాబాదరాగా ఎవరో ఒకరిని నిందితులుగా తేల్చాలనుకోవటం సరికాదు. సాక్ష్యాధారాల సేక రణలో కూడా పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారనీ, నిందితులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి తేల్చటానికే ఉత్సాహం ప్రదర్శించారనీ హైకోర్టు తప్పుబట్టిందంటే దర్యాప్తు ఎలా అఘోరించిందో అర్థం చేసుకోవచ్చు. చాన్నాళ్లక్రితం కేంద్ర ప్రభుత్వ కమిటీ మనుషుల అదృశ్యాల వెనక శరీర అవయవాల వ్యాపారం సాగించే సంఘటిత ముఠాల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నిఠారి హత్యల విషయంలో ఆ కోణంలో దర్యాప్తు సాగలేదు. థర్డ్ డిగ్రీ విధానాలను ఉపయోగించటం ద్వారా పోలీసులు కేసు తేల్చేశారన్న అభిప్రాయం జనంలో కలిగించవచ్చుగానీ, న్యాయస్థానాల్లో విచారణ సమయానికి ఇవన్నీ మటుమాయమవుతాయి. సంశయాతీతంగా సాక్ష్యా ధారాలుండకపోతే, మమ్మల్ని కొట్టి ఒప్పించారని నిందితులు చెబితే చివరికి కేసు వీగి పోతుంది. కేవలం ఒక వ్యక్తి లేదా ఇద్దరు ఇంతమందిని హతమార్చారనీ, మరెవరి ప్రమేయమూ ఇందులో లేదనీ నిర్ధారించాలంటే అందుకు దీటైన సాక్ష్యాధారాలుండాలి. అవి శాస్త్రీయంగా సేకరించాలి. ఎక్కడ అశ్రద్ధ చేసినా, ఏ చిన్న లోపం చోటుచేసుకున్నా మొత్తం కుప్పకూలిపోతుంది. దానికి తోడు ప్రతీకారంతో రగిలిపోతూ తక్షణ న్యాయం కావాలని రోడ్డెక్కే ధోరణులు మొత్తం దర్యాప్తును అస్తవ్యస్థం చేస్తున్నాయి. జనాన్ని సంతృప్తిపరచటం కోసం దొరికినవారిని నిందితులుగా తేల్చి పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ సీబీఐ అప్పీల్ చేస్తుంది. అక్కడే మవుతుందన్నది చూడాల్సివుంది. అత్యాధునిక ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అంతరిక్షంలో ఘనవిజయాలు నమోదు చేస్తున్నాం. కానీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటంలో, దానికి వృత్తిగత నైపుణ్యాలను అలవాటు చేయటంలో విఫలమవుతున్నాం. క్రిమినల్ కేసుల్లో సత్వర దర్యాప్తు, పకడ్బందీ సాక్ష్యాధారాల సేకరణ ప్రాణప్రదం. వాటిని విస్మరిస్తే కేసులు కుప్ప కూలు తాయి. నేరగాళ్లు తప్పించుకుంటారు. నిఠారి నేర్పుతున్న గుణపాఠాలివే. -
పార్కింగ్ కోసం గొడవ.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/iTA7e29Hu6 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్లో జల ప్రళయం.. 29 మంది మృతి.. -
స్వాతంత్య్ర వేడుకల్లో సీమా హైదర్.. జేజేలు కొడుతూ..
లక్నో: పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ ఉత్తరప్రదేశ్లో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. ప్రియుడు సచిన్ కోసం స్వదేశం దాటిన ఈ వివాహిత తిరంగ జెండాను ఎత్తి నినాదాలు చేస్తోంది. యూపీలో 'హర్ గర్ తిరంగ' వేడుకల్లో భాగంగా నోయిడాలో తన తరుపున వాదించిన లాయర్తో సహా కలిసి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్గా మారాయి. అయితే.. పాక్ దేశీయురాలు సీమా హైదర్కు ఇటీవల ఓ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. 'కరాచీ టు నోయిడా' పేరుతో నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ముందుకొచ్చారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. మహారాష్ట్రకు చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేనా(ఎమ్ఎన్ఎస్) సీమా హైదర్కు హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఆమె తన బాలీవుడ్ మూవీ ఆఫర్ను తిరస్కరించానని తాజాగా ప్రకటించారు. #Pakistan national #SeemaHaider was seen hoisting the Tricolour at her house in #Noida as part of #HarGharTiranga campaign ahead of #IndependenceDay.https://t.co/NUvcWcZMeB — IndiaToday (@IndiaToday) August 14, 2023 తన పిల్లలతో కలిసి పాకిస్థాన్ వదిలి నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చేరింది సీమా హైదర్. తన ప్రియుడు సచిన్తో కలిసి నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తోంది. తాను తన ప్రియునితోనే ఉంటానని పాక్ పంపించవద్దని రాష్ట్రపతికి కూడా ఇటీవల అప్పీల్ చేసింది. సీమా మిస్టరీ.. 2019లోనే సిమా హైదర్, సచిన్ ఆన్లైన్ గేమ్ పబ్జీలో పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత సచిన్ కోసం ఆమె దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వెళ్లింది. అక్కడి నుంచి భారత్ చేరుకుంది. పాకిస్థాన్ ఆర్మీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో యూపీ యాంటీ టెర్రర్ విభాగం, ఇంటెలిజన్స్ విచారణ జరిపింది. సచిన్తోనే గాక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువకులతో పబ్జీలో ఆమెకు పరిచయం ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: అజిత్తో రహస్య భేటీ.. ఇంట్లో వ్యక్తిని కలిస్తే తప్పేంటన్న శరద్ పవార్ -
తెగిన లిఫ్ట్ వైర్, 8వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో..
నోయిడా: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని ప్రమాదాలతో రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్లోని లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు జారడంతో గుండెపోటుకు గురై ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో గురువారం ఈ ఘోరం వెలుగుచూసింది. నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి 73 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో 8 ఫ్లోర్లు కిందకు జారిపడింది. అయితే లిఫ్ట్ గ్రౌండ్ను ఢీకొట్టకుండా మధ్య అంతస్తుల్లో చిక్కుకుపోయింది. ఊహించని పరిణామంతో లిఫ్ట్లో ఒంటరిగా ఉన్న మహిళ స్పృహతప్పి పడిపోయింది. కాసేపటికి గమనించిన సిబ్బంది మహిళను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది. అయితే మహిళ తల వెనక, మోచేతి వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. లిఫ్ట్ పడిపోవడం వల్ల ఆమెకు ఈ గాయాలైనట్లు పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని ఆకస్మిక ఘటనతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అపార్ట్మెంట్కు చెందిన వందలాది మంది సొసైటీ కాంప్లెక్స్ బయటకు వచ్చి జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వృద్ధురాలి మృతికి యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చదవండి: ఎట్టకేలకు సీఎం ‘కుర్చీ’లో కూర్చున్న అజిత్ పవార్ -
ఢిల్లీ: వరుణుడి ప్రతాపం.. రోడ్లు జలమయం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతాన్ని మరోసారి వరుణుడు ముంచెత్తాడు. బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో నగర వాసులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్కు విపరీతంగా విఘాతం కలుగుతోంది. బుధవారం భారీ నుంచి అతి భారా వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పిడుగులతో కూడిన వర్షం కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజా వర్షాలతో యమునా నదికి వరద పోటెత్తుతోంది. మళ్లీ డేంజర్ మార్క్కు చేరుకునే అవకాశం ఉండడంతో.. అధికారుల్లో అందోళన నెలకొంది. #WATCH | UP: Noida wakes up to rain lashing parts of the city (Visuals from Noida Sector 20) pic.twitter.com/MMBJ7ExuAa — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 26, 2023 #WATCH | Rain lashes parts of the national capital. Visuals from Shantipath. pic.twitter.com/3uosfVnTa9 — ANI (@ANI) July 26, 2023 -
ఇలా అయితే థియేటర్లో సినిమాలు చూసినట్లే?, వైరల్గా మారిన పాప్కార్న్ బిల్
మనలో చాలా మందికి సినిమా థియేటర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సినిమాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాం. కానీ మహమ్మారి రాకతో సినిమా థియేటర్లలో సందడి తగ్గింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ల హవా పెరిగింది. కోవిడ్కు ముందు తమకు నచ్చిన అభిమాన హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసిన సినీ లవర్స్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం థియేటర్లో సినిమా చూడడం ఖర్చుతో కూడుకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు సినిమా టిక్కెట్ల కోసం ఖర్చుతో పాటు స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలతో సినీ ప్రేక్షకుల జేబుకు చిల్లు పడుతుందని వాపోయాడు ఓ నెటిజన్. ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన తనకు పాప్ కార్న్ బిల్లు చూసి కళ్లు బైర్లు కమ్మాయంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. Rs 460 for 55gm of cheese popcorn, Rs 360 for 600ml of Pepsi. Total Rs 820 at @_PVRCinemas Noida. That’s almost equal to annual subscription of @PrimeVideoIN. No wonder people don’t go to cinemas anymore. Movie watching with family has just become unaffordable. pic.twitter.com/vSwyYlKEsK — Tridip K Mandal (@tridipkmandal) July 1, 2023 ఇటీవల ట్విటర్ యూజర్ త్రిదీప్ కె మండల్ నోయిడాలోని పీవీఆర్ సినిమాస్లో సినిమా చూశాడు. అందుకు అతనికైన ఖర్చు అక్షరాల రూ.820. సినిమా టికెట్ ధర వేరే ఉంది. పాప్కార్న్ ధర రూ.460, కూల్డ్రింక్కి రూ. 360కి చెల్లించాల్సి వస్తుందంటూ ఆ బిల్లును ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు, ఒక్క సినిమా కోసం నేను ఖర్చు చేసిన మొత్తం ధరతో ఏడాది పాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్లో కావాల్సినన్ని సినిమాల్ని చూడొచ్చు. అందుకే ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఇష్ట పడడం లేదు అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్ను 1.2 మిలియన్లకు పైగా వీక్షించగా, 17.8k లైక్ కొట్టారు. తినడానికి కాదుగా దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సినిమా థియేటర్లలో అధిక ధరల్ని ఎలా భరించగలం? సినీ లవర్స్ థియేటర్లకు వెళ్లకుండా మానుకోవడంలో ఆశ్చర్యం లేదని ఓ నెటిజన్ చేయగా.. పాప్కార్న్ డబ్బుల్ని ఆదా చేసుకోండి. ఇంటికెళ్లి భోజనం చేయండి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. థియేటర్కు వెళ్లి సినిమా మాత్రమే చూడండి. తినడం కోసం మాత్రం వెళ్లొద్దంటూ సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడీ ఈ అంశం నెట్టింట్లో వైరల్గా మారింది. Ghar se khaana kha ke niklo sabhi — dr_vee (@dr_vee95) July 2, 2023 50 స్క్రీన్లను మూసేస్తున్న మల్టీప్లెక్స్ల దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు వెంటాడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది. దీంతో వరుస నష్టాల నుంచి బయటపడేందుకు మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఎవరీ లలితాజీ.. సర్ఫ్ ఎక్సెల్ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు? -
బిల్ ఎంత పని చేసింది!.. రెస్టారెంట్లో కొట్టుకున్న సిబ్బంది, కస్టమర్లు!
సాధారణంగా అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి హోటల్కు వెళ్లి నచ్చిన ఫుడ్ని ఆరగించడం ఇటీవల ట్రెండ్గా మారింది. బిల్లు ఎక్కువైనా పర్లేదు కడుపు నిండా తినాల్సిందేనని కొందరు తెగ లాగించేస్తుంటారు. ఇదే తరహాలో ఓ కుటుంబం కూడా రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేసింది. అంతా అయ్యాక, వెయిటర్ బిల్లు తెచ్చాడు. బిల్లు చూసి ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆహార పదార్థాలే కాకుండా బిల్లుపై సర్వీస్ చార్జీలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. రూ. 970 సర్వీస్ ఛార్జీ ఎందుకు విధించారని, హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో హోటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు ట్వీట్ రూపంలో తమకు చేదు అనుభవాన్ని నెటిజన్లకు ఇలా పంచుకున్నారు.. “ఈరోజు మేము నా కుటుంబంతో కలిసి నోయిడాలోని స్పెక్ట్రమ్ మాల్, సెక్టార్-75లో ఉన్న రెస్టారెంట్ ఫ్లోట్ బై ఫ్యూటీ ఫ్రీకి వెళ్లాం. ముందుగా సిబ్బంది మెనూ కార్డ్లో ఉన్న కొన్ని పుడ్ ఐటమ్స్ను ఆర్డర్ చేస్తే.. అవి లేవని చెప్పాడు. సరే అని మేము సర్దుకుని రెస్టారెంట్లో ఉన్న అందుబాటులో ఉన్న ఆహారాన్ని తెప్పించుకుని తిన్నాము. కాసేపు అనంతరం రెస్టారెంట్ సిబ్బంది మా భోజన ఖర్చుకు సంబంధించిన బిల్లు తీసుకువచ్చి మా ముందు ఉంచాడు. అయితే సర్వీస్ ఛార్జీ ఎక్కువగా ఉందని.. దాన్ని తొలగించి బిల్ ఇవ్వమని కోరాము. కానీ సిబ్బంది కుదరదంటూ మొండిగా వాదించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి నా సోదరుడిపై దుర్భాషలాడడంతో పాటు నాపై కూడా దాడి చేశాడని వాపోయాడు. Customers, restaurant employees clash over ‘service charge’ at Noida’s Spectrum Mall Read: https://t.co/xs0tE4fX6M pic.twitter.com/0iI0nr0QmC — Express Delhi-NCR (@ieDelhi) June 19, 2023 చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
మరణించాడనుకుంటే, మోమోలు తింటూ కనిపించాడు
భాగల్పూర్: బిహార్లో భాగల్పూర్కు చెందిన నిశాంత్ కుమార్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ ఆయన మరణించాడనే భావించారు. అయితే హఠాత్తుగా ఒక రోజు నోయిడాలో మోమోలు తింటూ ఆయన బావమరిదికే దొరకడం విశేషం. భాగల్పూర్లోని నౌగాచికి చెందిన నిశాంత్ కుమార్ ఒక పెళ్లి కోసం తన అత్త మామల ఇంటికి ఈ ఏడాది జనవరిలో వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో సుశాంత్ తండ్రి తన కుమారుడిని అతని అత్తింటి సభ్యులే హత్య చేశాడని ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య రచ్చ వీధికెక్కింది. సుశాంత్ బావమరిది ఒక రోజు నోయిడా వెళితే అక్కడ మోమోలు అమ్మే దుకాణం దగ్గర ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆకలేస్తోందని మోమోలు అడిగితే దుకాణం దారుడు అతనిని పొమ్మని కసురుకుంటున్నాడు. దీంతో జాలిపడ్డ రవిశంకరే డబ్బులు ఇచ్చి అతనికి మోమోలు ఇమ్మని చెప్పాడు. ఆ తర్వాత అతని పేరేంటని అడగ్గా నిశాంత్ కుమార్ అని తమది బిహార్ అని చెప్పడంతో నిర్ఘాంత పోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశాంత్ నోయిడాకి ఎలా చేరాడో, ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడో పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. -
లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం!
నోయిడా: నోయిడాలోని ఒక అపార్ట్ మెంట్ సముదాయంలో వింత నోటీసు ఒకటి జారీ చేసింది సొసైటీ కమిటీ. సాయంత్రం వేళ సొసైటీలో వాకింగ్ చేస్తున్న కొందరు మహిళలు నైటీలలో వస్తుంటే పురుషులు మాత్రం లుంగీలలో వచ్చి పార్కు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. వారలా తిరగడం కొందరికి అసౌకర్యం కలిగించడంతో నేరుగా వెళ్లి సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది సొసైటీ పెద్దలు సీరియస్ గా రియాక్టయి ఇకపై కాలనీ బహిరంగ ప్రదేశాల్లో నైటీలను, లుంగీలను నిషేదిస్తూ సొసైటీ నివాసులందరికీ నోటీసులు పంపించారు. నోయిడాలోని హిమసాగర్ అపార్ట్ మెంట్స్ లోని సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కాలనీ వాసులు రోజంతా భగభగ మండుతున్న ఎండ తాకిడికి ఉక్కిరిబిక్కిరై ఉండటంతో ఉపశమనం కోసం సాయంత్రం పూట చల్లగాలికి కాలనీ కామన్ ఏరియాల్లోనూ, కమ్యూనిటీ పార్కుల్లోనూ వాకింగ్ చేస్తుంటారు. వేసవికాలం కాబట్టి చాలామందికి ఇది దైనందిన జీవితంలో భాగమే. చూడలేకపోతున్నాం.. కానీ ఆ కాలనీలోని వాసులు మహళలైతే నైటీల్లోనూ పురుషులైతే లుంగీల్లోనూ వాకింగ్ చేస్తుండటమే అసలు తగువుకు తెరతీసింది. వారలా తిరుగుతుండటం చూసి కొందరికి అసౌకర్యంగా అనిపించి వెంటనే సొసైటీ పెద్దలను కలిసి.. బహిరంగ ప్రదేశాల్లో లుంగీ, నైటీల్లో వాకింగ్ చేస్తుంటే చూడలేకున్నాం తక్షణమే చర్యలు తీసుకోండని ఫిర్యాదు చేశారట. ఇంకేముంది అప్పటికప్పుడు సమావేశమై అపార్ట్ మెంట్ వాసుల వస్త్రధారణ విషయమై కూలంకషంగా చర్చించి హిమసాగర్ వాసులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసు సిద్ధం చేసి జూన్ 10న కాలనీ వాసులందరికీ పంపించారు సొసైటీ పెద్దలు. ఇదే నోటీసు.. సోసైటీ పరిధిలో తిరిగేవారికి డ్రెస్ కోడ్.. మన కాలనీలోని పార్కుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ తిరిగేటప్పుడు మీ వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరకరంగానూ అసౌకర్యంగానూ ఉండకుండా చూసుకోగలరు. ఇకపై ఎవ్వరూ ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో వేసుకునే లుంగీలు, నైటీలు వంటి దుస్తులు వేసుకుని తిరగవద్దని అభ్యర్ధిస్తున్నామని రాశారు. తప్పేముంది - ముమ్మాటికీ తప్పే దీంతో కాలనీ వాసుల్లో కొందరు ఒక్కసారిగా ఖంగుతున్నారు. అసలే వేసవికాలం.. ఎండలు భగ్గుమంటున్నాయి.. రిలాక్స్ గా ఉంటుందని లుంగీలు, నైటీలు వేస్తుకుంటుంటాం. ఎవరికో అసౌకర్యంగా ఉందని వద్దంటే ఎలా అని వాపోతున్నారు. మరికొంత మంది మాత్రం ఇది చాలా మంచి నిర్ణయమని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. హిమసాగర్ అపార్ట్ మెంట్ కమిటీ జారీ చేసిన ఈ నోటీసు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే.. -
గూగుల్ ఫోన్లకు ఎఫ్1 ఇన్ఫో రిపేర్ సర్వీసులు
బెంగళూరు: గూగుల్ పిక్సల్ ఫోన్ల విక్రయానంతర పూర్తి స్థాయి సేవలను ఫ్లిప్కార్ట్ అనుబంధ సంస్థ అయిన ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ భారత్లో ఆఫర్ చేయనుంది. నోయిడాలో కేంద్రీకృత మరమ్మతుల కేంద్రంతోపాటు, దేశవ్యాప్తంగా 27 పట్టణాల్లో సర్వీస్ సెంటర్ల ద్వారా ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ సేవలు అందించనుంది. ఫోన్ను తీసుకోవడం, పరీక్షించడం, మరమ్మతులు చేయడం, తిరిగి కస్టమర్కు అందించే సేవలను ఆఫర్ చేయనున్నట్టు ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ ప్రకటించింది. ఫోన్లకు మరమ్మతులు చేయాల్సి వస్తే నోయిడాలోని ప్రధాన సర్వీస్ సెంటర్కు పంపించి పూర్తి చేస్తారు. -
సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ.. 33 మంది అరెస్టు
గ్రేటర్ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసలు తెలిపిన కథనం మేరకు.. సెక్యూరిటీ గార్డులు యూనివర్సిటీ క్యాంపస్లోని మున్షీ ప్రేమ్చంద్ హాస్టల్లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. అదికాస్త తీవ్రమై ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుడంతో తాము ఘటన స్థలానికి చేరుకుని ఆయా వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో ప్రైవేటు గార్డులు, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులను స్వీకరించామని, దీనిపై సత్వరమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, క్యాంపస్ వెలుపల సెక్యూరిటీ గార్డు, విద్యార్థులు కర్రలు చేతపట్టుకుని ఘర్షణ పడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి) -
‘ఆమెది భరించలేని మోసం.. గుండెలోతుల్లో ఆ బాధను అనుభవించా!’
-
కుక్కలు పగబట్టాయా?.. పార్క్లో మహిళను వెంబడించి..
నోయిడా: కొద్దిరోజులుగా కుక్కల దాడితో గాయపడుతున్న, మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ఏదో ఒక చోట కుక్కల దాడుల కారణంగా ఎవరో ఒకరు గాయపడుతూనే ఉన్నారు. ఇక, ఇటీవల యూపీలోని గుర్గావ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిపై కుక్కల గుంపు దాడి చేసిన ఘటనలో అతను మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటన మరువక ముందే తాజాగా నోయిడాలో ఓ మహిళపై శునకాలు దాడి చేశాయి. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్-78లోని మహాగున్ మోడరన్ సొసైటీలోని ఓ పార్కులో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నడుచుకుంటూ వెళుతున్నది. ఈ సందర్భంగా మహిళపై కొన్ని వీధికుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. దీంతో, కుక్కల బారినుండి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా అవి వెంటపడ్డాయి. కుక్కల గుంపు నుండి తన కుక్కను, తనను తాను రక్షించుకునేందుకు ఆమె పరుగు తీసింది. ఈ క్రమంలో కుక్కల దాడిలో ఆమెకు స్వల్ప గాయలయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Disturbing scenes from Noida's Mahagun Mezzaria Society where stray dogs attack a woman and her pet. Thanks to the Dog Lovers in every such society where they neither adopt them nor they’ll allow others to evict them from the complex.https://t.co/rSYRvyhfOv — Rishi Bagree (@rishibagree) April 19, 2023 ఇది కూడా చదవండి: మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి -
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి. ‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు. చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు. అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్ప్రెస్కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు. ‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్. అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర. అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు. కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు. హెల్మెట్ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది. -
పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..
ఇటీవల కాలంలో కొందరూ పనిలొంచి తీసేసిన లేక వారి తీరు నచ్చక పనిలో పెట్టుకోకపోయిన, లేదా వారి మంచి కోసమే చివాట్లు పెట్టినా పగలు పెంచేసుకుంటారు. ఆ తర్వాత ఆత క్షణికావేశంలో పిచ్చి పనులు చేసి కటకటాల పాలవ్వడమే గాక జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. అచ్చం అలాంటి ఘటనే నొయిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..నొయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీలో ఓ వ్యక్తి క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఐతే అతని పనితీరు నచ్చక అతన్ని పనిలోంచి తీసేయాలని నిశ్చయించుకున్నారు. దీంతో రగిలిపోయిన అతను డజనుకు పైగా కార్లపై యాసిడ్ పోసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో కార్లన్ని ఘోరంగా డ్యామేజ్ అయ్యాయి. దీనికి గల కారణమేమిటని..సమీపంలోని సీసీటీవీ ఫుట్జ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇదంత సదరు క్లీనర్ రామ్రాజ్ పని అని తెలిసి షాక్ గురువుతారు సోసైటీ వాసులు. ఆ వీడియోలో కనిపించిన అగంతుకుడిని రామ్రాజ్గా గుర్తించి సోసైటీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ట్రాక్ చేసి అపార్టమెంట్ వాసుల వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వారంతా సదరు క్లీనర్పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఐతే విచారణలో క్లీనర్ తనకు ఎవరో యాసిడ్ ఇచ్చారంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ..పోలీసులు అతన్ని నేరస్తుడిగా అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ క్లీనర్ సోసైటీలో 2016 నుంచి పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #बेरोजगार हो जाने के गुस्से की #आग ऐसी भड़की की 15 गाड़ियों के अंदर #तेजाब डाल दिया इस शख्स ने 😳 मामला #Noida के #Sector_75 की सोसायटी का है, जहां के कार सफाईकर्मी को नौकरी से निकाल दिया गया था. pic.twitter.com/sUhIvTyBPl — Ruby Arun रूबी अरुण روبی ارون 🇮🇳 (@arunruby08) March 17, 2023 (చదవండి: 216 జడ్జీల పోస్టుల భర్తీకి సిఫారసులు రాలేదు) -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మరొకరు అరెస్ట్
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో మరో అరెస్టు జరిగింది. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ను సీఐడి అదుపులోకి తీసుకుంది. నోయిడాలో అతడ్ని అరెస్టు చేసింది. ఈయనను ట్రాన్సిట్ వారంట్పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడు. ప్రోగ్రామ్ అసలు ధర రూ.58కోట్లు ఉంటే దానిని రూ.3,300కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టాడు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడ్డాడు. రూ.3,300కోట్లను ప్రాజెక్టు ధరగా నిర్ణయించి ప్రభుత్వ వాటా కింద రూ.371కోట్లు కొట్టేసిన ఘనులు. సిమెన్స్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలను సైతం భాస్కర్ అండ్ కో పూర్తిగా మార్చేసింది. రూ.3,300కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రైవేటు సంస్థలు మిగిలన వ్యయం భరించాలి. ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా.. కేవలం ప్రభుత్వం వాటా రూ.371కోట్ల వర్క్ ఆర్డర్ రిలీజ్ చేసే విధంగా భాస్కర్ ఎంవోయూను మార్చేశాడు. యూపీ క్యాడర్ ఐఏఎస్ అయిన తన భార్య అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈఓగా నియమించుకునేందుకు అప్పటి సీఈఓ సుబ్బారావుతో లాలూచీ పడ్డారు. తన భార్యను డిప్యూటీ సీఈఓగా నియమించుకునే సమయంలో తమకు ఈప్రాజెక్టుతో సంబంధం ఉందని భాస్కర్ దంపతులు ఎక్కడా ప్రకటించలేదు. ప్రభుత్వ నిధులు విడుదలయ్యేందుకు ప్రాజెక్టు విలువను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించుకునేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ ద్వారా ప్రాజెక్టును స్టడీ చేయించారు. ఈ సంస్థ అధికారులను ప్రభావితం చేయడం ద్వారా ప్రాజెక్టు విలువను పెంచుకున్నారు. నిధులను దారి మళ్లించేందుకు భాస్కర్ ఆప్టస్ హెల్త్ కేర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. చదవండి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక మలుపు.. చంద్రబాబు అవినీతికోట బద్దలు! -
గర్ల్ఫ్రెండ్తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
నోయిడా: గర్ల్ఫ్రెండ్తో గొడవపడి అపార్ట్మెంట్ 20వ అంతస్తు నుంచి దూకేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలోని సెక్టార్ 168 హై రైస్ సొసైటీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. హరియాణా సోనిపత్కు చందిన ఈ టేకీ వయసు 26 ఏళ్లు. బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఊద్యోగం చేస్తున్నాడు. చండీగఢ్కు చెందిన యువతిని(25) కలిసేందుకు నోయిడా వెళ్లాడు. ఆన్లైన్ యాప్ ద్వారా ఈ రూం బుక్ చేసుకున్నారు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడేందుకు యువతి కిందకు వెళ్లింది. ఈ సమయంలోనే 20వ అంతస్తు నుంచి టేకీ కిందకు దూకేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కెఫే టేబుల్స్పై పడ్డాడు. దీంతో ఆ టేబుల్స్ విరిగిపోయాయి. అక్కడ భోజనం చేస్తున్న ఓ మహిళకు గాయాలు కూడా అయ్యాయి. అక్కడున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఇద్దరూ గురువారం రోజే ఆపార్ట్మెంట్కి వచ్చారని పోలీసులు చెప్పారు. కలిసి మద్యం కూడా తాగారని పేర్కొన్నారు. ఆయితే శుక్రవారం రోజు గర్ల్ఫ్రెండ్ తన స్నేహితురాలిని కూడా అపార్ట్మెంట్కు పిలిచింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోయింది. దీంతో మరో యువతిని అపార్ట్మెంట్కు ఎందుకు పిలిచావని సాఫ్ట్వేర్ ఉద్యోగి తన గర్ల్ఫ్రెండ్తో గొడవపడ్డాడు. ఈ విషయంపైనే ఇద్దరి మద్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె అతడికి బాల్య స్నేహితురాలని పేర్కొన్నారు. అతను త్వరలో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడని, అందుకే ఓసారి స్నేహితురాలిని కలవాలనుకున్నాడని వివరించారు. చదవండి: భార్యకు భారం కాకూడదని భర్త అఘాయిత్యం.. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్ -
ఉద్యోగం నుంచి తీసేశారని..బీపీఓ కంపెనీ హెడ్పై కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్ సింగ్ అనే వ్యక్తి గేట్రర్ నోయిడా సెక్టార్2లో ఎన్సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్ సద్రూల్ ఇస్లాం అనూప్ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. ఐతే గత నెల అనూప్ మేనేజర్ సద్రూల్ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్ అంగీకరించ లేదు. దీంతో అనూప్ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్ దేశీయ తుపాకీతో మేనేజర్ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్ సద్రూల్ని హుటాహుటినా కైలాష్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
అదే దారుణం: బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు.. డెలివరీ ఏజెంట్ మృతి
లఖ్నవూ: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఘటన తరహాలోనే ఉత్తర్ప్రదేశ్లోనూ జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి అతి సమీపంలోని నోయిడాలో నూతన ఏడాది వేడుకల వేళ ఓ డెలివరీ ఏజెంట్ను ఓ కారు ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్విగ్గీలో డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్న కౌషల్గా గుర్తించారు. నూతన ఏడాది రాత్రి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు కౌషల్. నోయిడా సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ సమీపంలో అతడి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. కౌషల్ మృతదేహాన్ని గమనించిన కారు డ్రైవర్ సమీపంలోని ఆలయం వద్ద కారును నిలిపేసి అక్కడి నుంచి పారిపోయాడు. కౌషల్ సోదరుడు అమిత్ బాధితుడికి ఆదివారం రాత్రి 1 గంటకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ను సంఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పాడు. అమిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. -
న్యూయర్ వేడుకల్లో.. సెల్ఫీల కోసం..
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో కొత్త సంవత్సరం వేడుక రసాభాసగా మారింది. అంతా చక్కగా న్యూ ఇయర్ వేడుకులు ఆనందంగా జరుపుకుంటుండగా కొందరు వ్యక్తుల కారణంగా ఘర్షణకు దారితీసింది. ఈ మేరకు నోయిడాలోని గౌర్ సిటీ ఫస్ట్ అవెన్యూ సోసైటీలో న్యూ ఇయర్ వేడుకల్లో కొందరూ వ్యక్తులు ఇద్దరు మహిళలతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు యత్నించారు. దీన్ని ఆ మహిళల భర్తలు వ్యతిరేకించడంతో వారికీ, ఆయా వ్యక్తులకు మధ్య వాగ్వాదం తలెత్తింది.నిందితులు ఆ మహిళల భర్తలను కొట్టడంతో అక్కడే ఉండే నివాసితులు, సెక్యూరిటీ గార్డు ఈ ఘటనపై జోక్యం చేసుకున్నారు. ఐతే నిందితులు వారిపై కూడా దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఆ అపార్ట్మెంట్ సోసైటీకి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, తన స్నేహితుడి భార్యతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు కొందరూ వ్యక్తులు యత్నించినట్లు పోలీసులకు తెలిపాడు.దీనికి వారు అభ్యంతర చెప్పడంతో తనపై, అతడి స్నేహితుడిపై దాడి చేశారని, అలాగే వారిని కాపాడేందుకు జోక్యం చేసుకున్న నివాసితులు, సెక్యూరిటీ గార్డుపై కూడా దారుణంగా దాడి చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Big Fight At Noida New Year Party After Women "Forced" For Selfies https://t.co/gDlae7A0mD pic.twitter.com/G5oxm5CGIL— Breaking News (@feeds24x7) January 1, 2023(చదవండి: న్యూ ఇయర్ రోజున విషాదం.. టూర్కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..) -
నోయిడాలో పనిమనిషి మీద ఓనర్ దాష్టీకం
-
బలవంతంగా లాక్కొని వెళ్లి.. ఇదేం చర్య? వాళ్లూ మనుషులే కదా!
బుధవారం ఒక వీడియో వైరల్ అయ్యింది. ఢిల్లీ నోయిడాలోని ఒక సొసైటీలో 20 ఏళ్ల పనిమనిషిని ఆమె యజమాని బలవంతంగా లాక్కుని పోయే వీడియో అందరూ చూశారు. ‘పని చేయను మొర్రో’ అంటున్నా వినకుండా ఆ పనిమనిషిని తన ఇంటికి తీసుకెళ్లి హింసించింది ఆ యజమాని. ఇటీవల మనిమనుషులను హింసించి వార్తలకెక్కుతున్న యజమానులు ఎక్కువగా ఉన్నారు. పని మనుషులు స్త్రీలు. ఇంట్లో పని చేయించునేది స్త్రీలే. సమ దృష్టితో పని చేయించుకోకపోతే కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అశాంతితో గడపాల్సి వస్తుంది. ► పని మనుషులతో పని విధానం ఎలా ఉండాలి? లోకంలో పని మనుషుల మీద ఉన్నన్ని జోకులు మరెవరి మీదా ఉండవు. పని మనుషులు ‘డిమాండ్స్’ పెట్టడం గురించి ఈ జోకులన్నీ ఉంటాయి. వారి పని పద్ధతి గురించి కూడా జోకులుంటాయి. ‘పని మనుషులు’ కూడా ‘ఇంత పని మాత్రమే చేస్తాం’... ‘ఇంత జీతానికే చేస్తాం’ అని డిమాండ్ చేయడం ‘యజమానులకు’ వింతగా, నవ్వులాటగా, సహించలేని వ్యవహారంగా అనిపిస్తుంది. కాని ఈ యజమానులు లేదా వారి పిల్లలు ఉద్యోగాల్లో చేరేటప్పుడు తప్పనిసరిగా పని స్వభావం, పని గంటలు, జీతం తెలుసుకుని అందుకు అంగీకారమైతేనే చేరుతారు. పని మనుషులు మాత్రం తమ వద్ద అలా ఉండటాన్ని భరించలేరు. ► తాజా ఘటన పని మనుషులు ‘అతీగతీ’ లేని వారు అనే భావనతో వారితో ఎలాగైనా వ్యవహరించవచ్చని యజమానులు అనుకుంటే వారు పోలీసు కేసుల వరకూ వెళ్లాల్సి ఉంటుందని నోయిడాలో జరిగిన తాజా ఘటన తెలియచేస్తోంది. నోయిడా సెక్టర్ 120లో షెఫాలీ కౌల్ అనే మహిళ తన వద్ద పని చేసే 20 ఏళ్ల అనిత అనే అమ్మాయిని లిఫ్ట్లో నుంచి తన ఫ్లాట్కు ఈడ్చుకుంటూ వెళ్లే వీడియో వైరల్ అయ్యింది. ఆమె వద్ద పని చేసే ఒప్పందం అక్టోబర్తో ముగిసినా ఇంకా పని చేయవలసిందేనని ఆమె బలవంతం చేస్తున్నదని, ఇంట్లో నిర్బంధిస్తోందని, తిడుతోందని, కొడుతోందని అనిత తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీడియో ఇందుకు సాక్ష్యం పలుకుతోంది. నేరం రుజువైతే షెఫాలీ కౌల్కు శిక్ష తప్పదు. దేశంలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మనకు సేవ చేసేవారు మనకంటే తక్కువ అనే భావన పాతుకుపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ► పని మనుషులు నిస్సహాయులు పనికి సంబంధించిన ఎటువంటి గ్యారంటీ లేని నిస్సహాయులుగానే పని మనుషులు వున్నారు. యజమానులు వారిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసేయొచ్చు. వారికి కనీస వేతన చట్టం వర్తించదు. సెలవులు ఉండవు. ప్రసూతి సెలవులు చాలా పెద్ద మాట. రోజూ వచ్చిపోతూ పని చేసే పని మనుషుల కంటే ఇంట్లోనే ఉంటూ పని చేసే వారికి యజమానులు చెడ్డవాళ్లయితే నరకం కనిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. తమ వద్దే గతి లేకుండా ఉన్నారన్న ఉద్దేశంతో వీరి చేత చాకిరి విపరీతంగా చేయించడమే కాదు... ఏదైనా తప్పు జరిగినా/మాట వినకపోయినా దండన కూడా ఉంటుంది. ఆ దండన– ► జీతం ఆపడం ∙ ►ఆకలికి మాడ్చడం ► నిద్ర లేకుండా పని చేయించడం ► కొట్టడం ∙హింసించడం ► దొంగతనం నిందలు వేయడం కొన్ని సంఘటనల్లో లైంగిక దాడులు కూడా జరపడం. ఇవన్నీ శిక్షార్హమైన నేరాలని యజమానులు గుర్తుంచుకుంటే మంచిది. కాని యజమానుల ధోరణి అహంతో నిండి ఉంటోంది. కొంత కాలం క్రితం ముంబైలోని ఒక సొసైటీలో పని మనుషులందరూ తమకు జీతాలు తక్కువ ఉన్నాయని పనిలోకి రాబోమని ఈ సొసైటీ ఎదుట ధర్నా చేశారు. అప్పుడు యజమానులు తగ్గి జీతం పెంచారు. కాని కొన్ని నెలల్లోనే ఎవరైతే ఆ ‘విప్లవం’ లేవదీశారో వారందరి పని పోయింది. మెల్ల మెల్లగా తీసేశారు. మళ్లీ తక్కువ జీతానికి పని చేసే వాళ్లే పనిలో కుదరాల్సి వచ్చింది. ► పని మనుషులూ మనుషులే పని మనుషులూ మనుషులే. పని మనుషులుగా ఇళ్లల్లో పని చేసేది, చేయాల్సింది స్త్రీలే. వీరంతా నిరుపేద వర్గం నుంచి వచ్చినవారే అయి ఉంటారు. వారికి కుటుంబాలు ఉంటాయి... పిల్లలు ఉంటారు... బాధ్యతలు ఉంటాయి... అనారోగ్యాలు ఉంటాయి... భర్తల నుంచి ఏదో ఒక మేరకు వొత్తిళ్లు ఉంటాయి... సమస్యలు ఉంటాయి... అని గుర్తుంచుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఉండి ఆ ఇబ్బందుల్లో బతుకు గడవడానికి వారు పనిలో చేరుతారు. ఇంటికి సంబంధించిన ‘మురికి’ని శుభ్రం చేస్తారు. వారి సహాయం, శ్రమ లేకుండా ఇళ్లు శుభ్రపడవు. యజమానులు సౌకర్యంగా తమ పనులు చేసుకోలేరు. అందువలన వారితో స్నేహంగా, సమదృష్టితో వ్యవహరించడం అవసరం. వారి అవసరాలు అన్నీ తీర్చాల్సిన పని లేదు కాని ఒక్కోసారి వారి బాధను పట్టించుకోవడం కూడా అవసరమే. కుటుంబంలో ఒకరిగా మారి దశాబ్దాల పాటు పని చేసిన మనుషులు, పని మనిషిని కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే యజమానులు ఎందరో ఉన్నారు. కాని అలా కాకుండా ‘మనం అనేవాళ్లం... వాళ్లు పడేవాళ్లు’ అనే భావన ఉంటేగనక అలాంటి భావనను మార్చుకోక తప్పదు. కొందరి ఇళ్లల్లో పని మనుషులు నెలకు మించి నిలువరు. పని మనుషులను మార్చుతూ వెళతారు కాని తాము మారరు. ఇవి చేయండి ► మీకు ఎన్ని పని గంటలు కావాలో ముందే స్పష్టంగా చెప్పండి ఏమేమి పనులు చేయాలో తప్పనిసరిగా ముందే చెప్పండి వారానికి ఒకరోజు సెలవు (ఒక పూటైనా) ఇవ్వండి ∙ అనారోగ్యం ఉంటే బలవంతంగా పని చేయించకండి ∙ పండగలకు బక్షీసు ఇవ్వండి ∙ చీటికి మాటికి జీతం కోయకండి ∙పరుష పదజాలం ఉపయోగించకండి పని చేస్తుంటే వెంట ఉంటూ అజమాయిషీ చేయకండి ► మీరు తినలేనివి పెట్టకండి. -
రెచ్చిపోయిన కాలేజీ విద్యార్థులు.. టయోటా కార్లతో స్టంట్స్ చేస్తూ..
కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై రెచ్చిపోయారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఢిల్లీ సరిహద్దులోని గ్రేటర్ నోయిడాలో ఉన్న అమిటీ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు తమ ఖరీదైన కార్లతో హల్చల్ చేశాడు. నడిరోడ్డుపై కార్లతో స్టంట్లు చేశారు. కొందరు విద్యార్థులు నోయిడాలోని సెక్టార్ 126లో రెండు తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ కార్లతో ఖాళీ రోడ్లపై విన్యాసాలు చేశారు. పంజాబీ ర్యాప్ పాటను హోరెత్తిస్తూ ప్రమాదకరంగా 360 డిగ్రీల స్టంట్లు చేశారు. ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఒక కారుతో స్టంట్స్ చేస్తూ అక్కడున్న వారిని భయాందోళనలకు గురిచేశారు. ఇక, విద్యార్థుల కారు స్టంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్గా మారి పోలీసులకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. అయతే, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఆ విద్యార్థులు ఖరీదైన కార్లతో ఈ విన్యాసాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, విద్యార్థుల ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NOIDA एमिटी यूनिवर्सिटी में रहीशजादों की स्टंटबाजी, फॉर्च्यून से ड्रिफ्ट मरते वीडियो वायरल PS 126@noidapolice@noidatraffic @Uppolice pic.twitter.com/4W9hVh8zBm — हिमांशु शुक्ला (@himanshu_kanpur) December 23, 2022 -
తండ్రికి గుండె నొప్పి వచ్చిందని..కారుని వేగంగా పోనివ్వడంతో...
ఒక వ్యక్తి తండ్రికి గుండె నొప్పి రావడంతో రక్షించుకోవాలన్న తాపత్రయంలో కారుని వేగంగా పోనిచ్చి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....నోయిడాలోని బహ్లోల్పూర్ నివాసి ప్రదీప్ సింగ్ తండ్రి భూప్ సింగ్ అతని భార్య తొమిదేళ్ల కుమార్తె బులంద్షహర్లో ఉన్న పచౌటా ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా హఠాత్తుగా తండ్రికి గుండె నొప్పి వచ్చింది. దీంతో తండ్రిని రక్షించుకోవాలన్న ఆత్రుతలో కారుని వేగంగా పోనిచ్చాడు. కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి హైవే సమీపంలోని గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ భార్య, తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. అతడి తండ్రిని ఘజియాబాద్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, భార్యని కోట్ దాద్రిలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ప్రమాదంలో అతని భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా, అతని తండ్రి మాత్రం చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ప్రదీప్, అతడి భార్య, కుమార్తె సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ని తరలిస్తున్న వ్యాన్పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు) -
పానీపూరీ తింటున్న చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు.. తాగిన మైకంలో!
లక్నో: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. తాగిన మైకంలో కారును రోడ్డు పక్కన పానీపూరీ తింటున్న ముగ్గురు చిన్నారులపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నోయిడా సెక్టర్ 45లోని సదర్పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రియా(6), అను(15), అంకిత(18) అనే ముగ్గురు అక్కచెల్లెల్లు పానీపూరీ(గోల్గప్పా) తినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద తింటుండగా.. అదే సమయంలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలవ్వగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరేళ్ల రియా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు పోలీసు అధికారి రాజీవ్ బల్యాన్ తెలిపారు. మరో బాలిక అను వెన్నుముకకు గాయాలు అవ్వగా, అంకితకు చిన్న గాయాలైనట్లు పేర్కొన్నారు. అయితే బాధితురాలి తల్లి పక్కన నిల్చున్నందున తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ మద్యం సేవించి అతివేంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. కారు ఢీకొట్టడంతో గప్చుప్ బండి బోల్తా పడినట్లు చెప్పారు. అలాగే పక్కనే ఉన్న ఇటుకల గోడ కూడా పడిపోయినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో గుమిగూడిన జనం డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కారుని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురిని చంపి ఆత్మహత్యగా నాటకం...పట్టించిన మొబైల్ ఫోన్
మహారాష్ట్ర: కూతురిని ఆత్మహత్య నాటకం పేరుతో నమ్మించి కన్నతండ్రే హతమార్చాడు. ఈ ఘటన నాగ్పూర్లోని కలమ్మా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...కూతురుని ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం ఆడదామని చెప్పి తమ బంధువుల పేర్లతో సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు స్టూల్ మీద నుంచోమని చెప్పి తాను ఫోటో తీస్తూ... స్టూల్ లాగేసి ఏమి తెలియనట్లు బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తే పోలీసులను పిలిపించి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఆమె గదిలోని సూసైడ్ నోట్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసును దర్యాప్తు చేసే విషయమే తండ్రిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతని మొబైల్ ఫోన్ని పరిశీలించగా.. కూతురు ఉరివేసుకున్న ఫోటోను చూసి ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో గట్టిగా ప్రశ్నించగా...తాను చంపినట్లు ఒప్పుకున్నాడు. తన మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు అని ఆమె చనిపోయిన తర్వాత మరో వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. ఐతే ఆమె కూడా తనను వదిలి వెళ్లిపోవడంతో... ఆమెకు బుద్ది వచ్చేలా చేసేందుకు ఇలా కూతురి చేత ఆత్మహత్య నాటకం ఆడించానని చెప్పాడు. ఆమె ఉరివేసుకునే ముందు మొత్తం ఐదు సూసైడ్ నోట్లు రాయించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసు: మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా: నళిని శ్రీహరన్) -
నిందితుడు అరెస్టు కాకూడదని..కారుతో సెక్యూరిటీ గార్డుని ఢీ కొట్టి...
అత్యాచార కేసులోని నిందితుడు అరెస్టును తప్పించుకునే క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దూసుకెళ్లాడు. దీంతో సదరు సెక్యూరిటీ గార్డుకి తీవ్ర గాయలపాలయ్యాడు. ఈ ఘటన నోయిడాలోని అమ్రపాలీ జోడియాక్ సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....నీరజ్ సింగ్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన సహోద్యోగిని అత్యాచారం చేసినట్లు సింగ్పై కేసు నమోదైంది. ఆ కేసు విషయమై పోలీసులు అతన్న అరెస్టు చేసేందుకు పలుమార్లు అపార్ట్మెంట్ సోసైటికీ వచ్చినా... సింగ్ కనిపించకుండా తప్పించుకుని తిరగుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు సింగ్ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారం అందడంతో సదరు సోసైటికి వచ్చారు పోలీసులు. దీన్ని పసిగట్టిన సింగ్ తన కారుతో తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో సింగ్ని సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సింగ్ చాలా కర్కశత్వంగా అతనిపై నుంచి కారుని దూసుకెళ్లిపోయాడు. ఇంతలో మరో అధికారి అతని కారుని వెంబడించి సదరు నిందితుడు సింగ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. (చదవండి: చికిత్స సమయంలో పేషెంట్ని కొట్టిన డాక్టర్!) -
18 మందితో వెళ్తున్న మినీ బస్లో మంటలు.. క్షణాల్లో..!
లఖ్నవూ: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగటాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యూపీలోని గ్రేటర్ నోయిడా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో మినీ బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులోంచి మంటలు, నల్లటి పొగ వస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగటంతో నోయిడా ఎక్స్ప్రెస్వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. #Noida एक्सप्रेसवे पर एक मिनी बस में आग लग गई । हादसे के वक्त बस में 18 यात्री सवार थे जिन्होंने बस से कूद कर खुद की जान बचाई । थाना एक्सप्रेसवे के इलाके में पंचशील अंडर पास के नजदीक बस में आग लगी । बस ग्रेटर नोएडा से नोएडा की तरफ आ रही थी #Video pic.twitter.com/4AsqCp3RcP — Amit Choudhary (@amitchoudhar_y) November 6, 2022 ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం -
వాతావరణ కార్యకర్త ఫోన్ చోరీ...ఫేస్బుక్లో లైవ్ రికార్డు చేస్తుండగా....
నొయిడా: వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం మొబైల్ ఫోన్ని గుర్తు తెలియని వ్యక్తులు రెప్పపాటులో లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు 11 ఏళ్ల బాలిక లిసిప్రియ నొయిడాలో తన అనుచరులతో కలిసి ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉండేలా... కాకర్స్ కాల్చకుండా దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలనే దానిపై ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగలు ఆమె ఫోన్ని లాక్కుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా తనకు సహాయం చేయమంటూ ట్విట్టర్లో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ నొయిడా అదనపు డీసీపీ సాద్మియాన్ కేసు నమోదు మొబైల్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మణిపూర్కి చెందిన లిసిప్రియ కంగుజం వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న పర్యావరణ కార్యకర్త. కీలకమైన వాతావరణ మార్పు సమస్యలపై పలువురు ప్రపంచ నేతలను కలిసింది కూడా. అంతేగాదు ఆ బాలిక కాప్ 25 వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించి అందరీ మన్ననలను పొందింది. ఇటీవల చత్తీస్గఢ్ బొగ్గు వ్యతిరేక నిరసనలో పాల్గొంది. అలాగే 2020లో వాషింగ్టన్లో ఎర్త్డేని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది. (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ..
లక్నో: ఓయో హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి.. అక్కడికి వెళ్లే జంటల వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నలుగురు సభ్యులు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్లో రూమ్స్ బుక్చేసి కమిషన్ తీసుకుంటారు. క్రమంలోనే రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడ ఉండేందుకు వచ్చిన జంటల ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో రికార్డు చేస్తారు. అనంతరం ఆ వీడియోను సంబంధిత జంటలకు పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అడిగిన మొత్తం అప్పజెప్పకుంటే ఇవ్వకుంటే రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తామని బెదిరింపులకు ప్పాలడుతున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుంటే వేధింపులకు గురిచేస్తామంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఓ బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అంతేగాక వీరు ఐఫోన్ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ అక్రమంగా ఓ ల్ సెంటర్ను కూడా నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్లుగా గుర్తించారు. వీరి నుంచి 11 ల్యాప్టాప్లు, 21 మొబైల్ ఫోన్లు, 22 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ స్కామ్లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. -
రూ.10తో బర్గర్ షాప్లోకి పదేళ్ల పాప.. చిరునవ్వుతో బయటకు..!
నోయిడా: ప్రస్తుత కాలంలో బర్గర్లు, పిజ్జాలు అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాగే ఓ చిన్నారి బర్గర్ షాప్కు వెళ్లి బర్గర్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న రూ.10 నోటును తీసిచ్చింది. కానీ, ఆమె ఆర్డర్ చేసిన బర్గర్ ధర రూ.90. ఆ విషయం ఆ చిన్నారికి తెలియదు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఆ పాప బర్గర్ తింటూ చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఇంతకీ లోపల ఏం జరిగిందనే విషయాన్ని బర్గర్ కింగ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. నొయిడాలోని బొటానికల్ మెట్రో స్టేషన్కు దగ్గర్లోని బర్గర్ కింగ్ షాపులోకి 10 ఏళ్ల పాప వచ్చింది. తన పాకెట్లో ఉన్న రూ.10 అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది. అయితే, దాని ధర రూ.90 ఉన్నప్పటికీ అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారిని చూసి క్యాష్ కౌంటర్లోని వ్యక్తి మిగిలిన రూ.80 చెల్లించాడు. బర్గర్ అసలు ధర ఆ పాపకు చెప్పకుండానే కేవలం రూ.10కే బర్గర్ను తెప్పించి ఇచ్చాడు. దీంతో బర్గర్ అందుకున్న ఆనందంలో ఆ చిన్నారి చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న సోషల్ మీడియా యూజర్ అమాయకంగా బర్గర్ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి ఫొటో తీశారు. ఆ ఫోటోను లైఫ్ మెంబర్ అనే ట్విటర్లో షేర్ చేయటంతో వైరల్గా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బర్గర్ కింగ్ సంస్థ యాజమాన్యం చిన్నారికి బర్గర్ అందించిన ఉద్యోగి ధీరజ్ కుమార్గా గుర్తించింది. తమ షాపులోకి వచ్చిన చిన్నారి పట్ల ధీరజ్ ప్రవర్తించిన తీరుకు ప్రశంసలు కురిపించింది. అంతే కాదు ఆ వ్యక్తిని సన్మానించింది. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది బర్గర్ కింగ్ ‘ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మా నోయిడా బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రెస్టారెంట్లో పని చేస్తున్న ధీరజ్ కుమార్ తన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్నారు.’ అంటూ జరిగిన సంఘటనను గుర్తు చేసుకూంటూ పలు ఫోటోలు షేర్ చేసింది. #WorldFoodDay2022 पर मेरी नज़र में इससे खूबसूरत तस्वीर और नही हो सकती.. काउंटर स्टाफ के सुनहरे भविष्य की हार्दिक शुभकामनाएं 💖💐@anandmahindra@IAmSudhirMishra @News18India @RandeepHooda @BurgerKing ...👌👌👍💐 pic.twitter.com/RcAp3cKR7R — Life Member (IFTDA) (@Life_Mem_IFTDA) October 19, 2022 This #WorldFoodDay, Dheeraj Kumar, working at our Noida Botanical Garden Metro Station restaurant, has inspired us all with his beautiful act of kindness. We had a very special guest who walked into our restaurant asking for a #burger but had only ₹10 with her. (1/3) pic.twitter.com/89oXh07sOB — BurgerKingIndia (@burgerkingindia) October 20, 2022 ఇదీ చదవండి: యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ యూనివర్సిటీ నోటీసులు -
ఎంత ఘోరం? పసికందు పేగులు తీసిన వీధి కుక్క
నోయిడా: తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలీ పనులు చేసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల పసికందుపై ఓ వీధి కుక్క దాడి చేసింది. పేగులు బయటకు తీయటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ 100లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి శునకాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలీ పని చేసుకునే ఓ కుటుంబం తమ 7 నెలల పాపతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యదార్థ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావటం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయనా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయటం ఇదేం మొదటి సారి కాదని, ప్రతి 3-4 నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. నోయిడా హౌసింగ్ సొసైటీ ముందు స్థానికుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ విషయంపై ఏఓఏ స్పందించారు. నోయిడా అథారిటీతో మాట్లాడామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇదీ చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి -
అబుదాబి పోలీసుల నిర్బంధంలో నోయిడా వ్యక్తి... ఆ తర్వాత...
నోయిడా: నోయిడాకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారవేత్తను అబుదాబి పోలీసులు నేరస్తుడిగా భావించి నిర్బంధించారు. ఆ వ్యాపారస్తుడిని తాము గాలిస్తున్న నేరస్తుడిగా పొరబడి ఒక రాత్రంతా జైల్లో ఉంచారు. పైగా అతనిని నేరస్తుడిగా అంగీకరించమంటూ బలవంతం చేశారు. దీంతో ప్రవీణ్ కుమార్ కుటుంబం అతనను విడుదల చేయాలంటూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడమే కాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. దీంతో ప్రవీణ్ కుమార్ని అబుదాబి పోలీసులు వెంటనే వదిలేశారు. తాము పొరపడి బంధించినట్లు అబుదాబీ పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా హబీబ్పూర్కు చెందిన సదరు వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...విమానాశ్రయంలో అబుదాబి సీఐడీ తనను అదుపులోకి తీసుకుని నిర్బంధించిందని, తర్వాత వదిలిపెట్టినట్లు వదిలి మళ్లీ తాను బయలుదేరుతున్న సమయంలో రెండోసారి నిర్బంధించారని తెలిపారు. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని తనను విడుదలయ్యేలా చేసినందుకు ప్రధాని మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కి ధన్యావాదాలు తెలిపారు. తనను శనివారం అబుదాబి పోలీసులు విడిచిపెట్టినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామన భారత్కి తిరిగి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్కి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఐతే ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేయడంతోనే త్వరితగతిన చర్యలు తీసుకోగలిగనట్లు అధికారులు తెలిపారు. (చదవండి: విజయపురలో పరువు హత్య?) -
గూగుల్కు అదానీ డేటా సెంటర్ లీజ్, నెలవారీ అద్దె రూ.11కోట్లు
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన అదానీ ఎడ్జ్ కనెక్స్.. నోయిడాలోని తన డేటా కేంద్రంలో 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రెయిడెన్ ఇన్ఫోటెక్కు లీజ్కు ఇచ్చింది. రెయిడెన్ గూగుల్కు చెందిన సంస్థ. నెలవారీ అద్దె రూ.11 కోట్లు చెల్లింపుపై పదేళ్ల కాలానికి ఈ డీల్ కుదిరినట్టు సీఆర్ఈ మ్యాట్రిక్స్ అనే సంస్థ వెల్లడించింది. చదరపు అడుగుకు ప్రతి నెలా రూ.235 చెల్లించేలా ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. తొలుత వార్షిక అద్దె రూ.130.89 కోట్లు కాగా, తర్వాత ఏటా ఒక శాతం పెంచేందుకు అంగీకారం కుదిరింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ సేకరించిన పత్రాల ఆధారంగా గత నెలలోనే ఈ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణకు గాను 2021 ఫిబ్రవరిలో అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటును ప్రకటించడం తెలిసిందే. చెన్నై, నవీ ముంబై, నోయిడా, వైజాగ్, హైదరాబాద్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది సంస్థ లక్ష్యంగా ఉంది. -
దారుణంగా కొట్లాడుకున్న ఫుడ్ డెలివరి మ్యాన్, సెక్యూరిటీ గార్డు... షాక్లో స్థానికులు
నోయిడా: ఫుడ్ డెలివర్ మ్యాన్, సెక్యూరిటీ గార్డుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటన నోయిడా గార్డెనియా సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సబీ సింగ్ అనే జోమాటో ఫుడ్ డెలవరీ మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ రామ్ వినయ్ల మధ్య ఎంట్రీ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరి ఒకరినోకరు గాయపరుచుకునే వరకు వచ్చింది. మొదటగా ఫుడ్ డెలివరీ మ్యాన్ సబీ సింగ్ సెక్యూరిటీ గార్డుని కొట్టడం, నెట్టడం వంటివి చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గార్డు కర్ర తీసుకుని ఫుడ్ డెలివరీ వ్యక్తి పై దాడి చేశాడు. దీంతో ఇద్దరు కాసేపు కర్రలతో ఘోరంగా కొట్టుకున్నారు. స్థానికులు ఆపేందుకు యత్నించిన ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాసేపటికి ఫుడ్ డెలవరీ మ్యాన్ స్ప్రుహ తప్పి నేలపై పడిపోయాడు. దీంతో ఘటనా స్థలం వద్ద ఉన్న స్థానికులు అతనికి సపర్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాని చేరుకుని ఇరువురి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: వెండి వస్తువుల కోసం ఏకంగా వృద్ధురాలి కాలు నరికి...) -
సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్ పట్టుకుని...
ఇటీవలకాలంలో మహిళలు సెక్యూరిటీ గార్డుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు గురించి తురుచుగా వింటున్నాం. గ్రేటర్ కమ్యూనిటీ అపార్టమెంట్లో ఉంటున్న కొంతమంది నివాసితులు సెక్యూరిటీ గార్డుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లను కొట్టడం లేదా అసభ్యంకరంగా తిట్టి అవమాన పరిచే హేయమైన చర్యలకు దిగుతున్నారు. అచ్చం అలానే నోయిడాలోని ఒక మహిళ ఒక సెక్యూరిటీ గార్డుపై వీరంగం సృష్టించింది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నోయిడాలోని అజ్నార్ సోసైటీలో పనిచేస్తున్న ఒక గార్డు పట్ల ఒక మహిళ చాలా అమానుషంగా ప్రవర్తించింది. సదరు గార్డు టోపీ లాక్కుని, కాలర్ పట్టుకుని దుర్భాషలాడింది. పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను ఆపేందుకు ప్రయత్నించకుండా అలా చూస్తోంది. ఇంతలో మరో సెక్యూరిటీ గార్డు వచ్చి బాధితుడుని ఆ మహిళ నుంచి వెనక్కి లాగేందుకు యత్నించాడు. ఈ మేరకు పోలీసులు సదరు బాధితుడు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. (చదవండి: భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...) -
ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: ఫోటో వైరల్
భర్త నిరాధరణకు గురైతే ఆ స్త్రీ పరిస్థితి వర్ణానాతీతం. అందులోనూ పిల్లల తల్లి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడొక ఒక మహిళ కూడా అలానే ఏడాది చిన్నారితో జీవన పోరాటం సాగిస్తోంది. వివరాల్లోకెళ్తే...చంచల్ శర్మ అనే మహిళ ఏడాది వయసు ఉన్న కొడుకుని నడుంకి కట్టుకుని మరీ ఈ రిక్షాని నడుపుతోంది. ఐతే ఒక మహిళ ఇలా డ్రైవింగ్ చేయడాన్ని స్థానిక ఈ రిక్షా డ్రైవర్లు నిరాకరించారు. అంతేగాదు ఆమె నోయిడాలోని ఒక నిర్ధిష్ట రహదారిలో డ్రైవ్ చేసేందుకు కూడా ససేమిరా అంటూ గొడవ చేశారు. ఐతే ఆమె ట్రాఫిక్ పోలీసులు, ఏ1బీ అవుట్ పోస్ట్ సిబ్బంది మద్దతుతో సమస్యలను అధిగమించింది. సదరు మహిళ భర్త ఆమెను వేధింపులకు గరిచేయడంతో అతన్ని వదిలేసి వచ్చి తన కాళ్లపై తాను గౌరవప్రదంగా జీవించేందుకు తాపత్రయ పడుతోంది. ఆ క్రమంలోనే ఆమె ఈ రిక్షా డ్రైవర్గా జీవనోపాధిని ఎంచుకుంది. లాల్ కువాన్కి చెందిన చంచల్ శర్మ కొన్ని రోజులు తన తల్లి లేదా చెల్లితో కలిసి ఉంటానని వెల్లడించింది. ఈ మేరకు చంచల్ శర్మ మాట్లాడుతూ...మూడేళ్ల క్రితం 2019లో దాద్రీలోని ఛయాన్సా గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత నుంచి చిత్రహింసలకు గురి చేసి వేధించడంతో పుట్టింటికి వచ్చేసినట్లు తెలిపింది. తన భర్త పేరు చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. కోర్టులో కేసు నడుస్తోందని కూడా చెప్పింది. తన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడని, తనకు నలుగు చెల్లెళ్లు ఉన్నారని చెప్పింది. ఆమె తల్లి కూరగాయాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటుందని తెలిపింది. (చదవండి: నాకు 30 ఆమెకు 12 అంటూ... షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బైడెన్)