Om Raut
-
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న హిస్టారికల్ మూవీ..
-
ఆదిపురుష్కు మంచి వసూళ్లు వచ్చాయ్.. ప్రభాస్తో పాటు ఆ హీరో..
ఫ్లాప్ అవడం వేరు, అప్రతిష్ట మూటగట్టుకోవడం వేరు. కొన్ని కథలు బాగున్నా కలెక్షన్స్ కూడబెట్టడంలో విఫలమై ఫ్లాప్గా నిలుస్తాయి. మరికొన్ని భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఊరిస్తూ ఊదరగొడుతూ బాక్సాఫీస్ ముందుకు వచ్చి అట్టర్ఫ్లాప్గా నిలుస్తాయి. అంతేనా దారుణంగా ట్రోలింగ్కు గురవుతాయి. ఆదిపురుష్ సినిమా రెండో కోవలోకి వస్తుంది.ఆదిపురుష్పై ట్రోలింగ్భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అంతేకాదు, నటీనటుల లుక్పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. వానరాలను చూపించిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. ఇలా ఒక్కటేమిటి, బోలెడు తప్పులను జనాలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ దర్శకుడు ఓం రౌత్ను ఏకిపడేశారు.బానే ఆడిందిఅయితే తన సినిమాకేమైందంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ మరాఠీ షోలో మాట్లాడుతూ.. సినిమాను విమర్శించడం వేరు, బాక్సాఫీస్ వద్ద దాని పనితీరు వేరు. ఆదిపురుష్ సినిమానే ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇది మొదటి రోజు ఒక్క ఇండియాలోనే రూ.70 కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. అంటే బాక్సాఫీస్ వద్ద బానే ఆడింది.నేను పట్టించుకోనుఇక్కడ డబ్బులు పోలేదు. కాకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు థియేటర్లో కొన్ని సీన్లు రికార్డు చేసి ఆన్లైన్లో ట్రోల్ చేశారు. అలాంటివాటిని నేనసలు పట్టించుకోను. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా తమ పాపులారిటీని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకునే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు సల్మాన్ ఖాన్. వారి ఇమేజ్ చెక్కుచెదరదువీరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా వీరి ఇమేజ్ అలాగే ఉంటుంది. సినిమా వైఫల్యంతో సంబంధం లేకుండా వారి క్రేజ్ అలాగే కొనసాగుతుంది అన్నారు. ఇకపోతే దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.393 కోట్లు వసూలు చేసింది.చదవండి: ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు -
‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది: ‘రామాయణ్’సీత
రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు. -
ప్రభాస్ ఆదిపురుష్పై ట్రోల్స్.. డైరెక్టర్ను భయపెట్టారు: నటుడు కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరెకెక్కించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణాన్ని ఇప్పటి సినీ ప్రియులకు అనుగుణంగా తెరకెక్కించడంలో ఓం రౌత్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆదిపురుష్పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీపై వచ్చిన విమర్శలపై ఆదిపురుష్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళను విమర్శించడం సరికాదని హితవు పలికారు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ..నటీనటులను, చిత్రబృందాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ..'మీకు సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. అంతే నటీనటులను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమా తీయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. మీకు నచ్చితేనే సినిమా చూడండి. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఓం రౌత్ అలాంటి భయపడలేదు. ట్రోల్స్ పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం' అని అన్నారు. తాజాగా బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. కాగా.. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ చిత్రంలో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్లో ఈ కామెంట్స్ చేశారు. -
హను-మాన్కు హిట్ టాక్.. ఆదిపురుష్ డైరెక్టర్ను ఆడేసుకుంటున్నారు!
సినిమా బాగుంటే నెత్తిన పెట్టేసుకుంటారు జనాలు. అదే సినిమా షెడ్డుకెళ్లిపోయిందంటే మాత్రం చిత్రయూనిట్ను చెడుగుడు ఆడేసుకుంటారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద రిలీజైన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటినుంచే ట్రోలింగ్ బారిన పడింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్తో ఈ ప్రయోగాలేంటని అభిమానులు మండపడ్డారు. ఆ గ్రాఫిక్స్, గెటప్స్ మార్చమని మొత్తుకున్నారు. ఓం రౌత్పై ట్రోలింగ్ అబ్బే, దర్శకుడికి ఏది నచ్చితే అదే ఫైనల్! ఓం రౌత్ ఎవరి సలహాలను, సూచనలను పట్టించున్న పాపాన పోలేదు. చివరకు ఏమైంది? సినిమా భారీ డిజాస్టర్గా నిలిచిపోయింది. ఆ సమయంలో ఓం రౌత్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. తాజాగా మరోసారి ఓం రౌత్పై సెటైర్లు వేస్తున్నారు సినీ లవర్స్. కారణం హను-మాన్ మూవీ. ఈ సినిమాకు ఓం రౌత్కు సంబంధం ఏంటనుకుంటున్నారా? మరేం లేదు. ఆదిపురుష్ అంత డిజాస్టర్ అవడానికి పేలవమైన వీఎఫ్ఎక్స్ కూడా ఓ ప్రధాన కారణం. వీఎఫ్ఎక్స్ వల్లే సినిమా.. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ విజయానికి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ప్రధాన బలంగా మారింది. ఇంకేముంది.. జనాలు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ఆకాశానికెత్తుతున్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ను మళ్లీ ఆడేసుకుంటున్నారు. 'హనుమాన్ సినిమా ఆడే థియేటర్లలో ఓం రౌత్ కోసం ఓ సీటు వదిలేయండి', 'చిన్న సినిమా అయినా ఎలా తీశారో చూసి నేర్చుకో..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓం రౌత్.. ఆదిపురుష్ సినిమాను రూ.500 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించాడు. ప్రశాంత్ వర్మ.. హను-మాన్ చిత్రాన్ని కేవలం రూ.25 కోట్లలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్(ట్విటర్)లో నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో కింది ట్వీట్స్లో మీరే చూసేయండి.. After watching #Hanuman, i want to say #Omraut come to my cabin.#JaiShreeRam 🚩 #JaiHanuman 🚩 pic.twitter.com/e2V06FFEPR — Sanatani 🚩🔱 (@Vadapallisree) January 12, 2024 #Hanuman - #OmRaut will receive more criticism in the days to come than what he received after #Adipurush#PrasanthVarma will receive more offers and calls from producers spanning from North to South pic.twitter.com/7NC4l4eJLX — Daily Culture (@DailyCultureYT) January 11, 2024 Aa budget ki oka range output and response ante 🔥🔥🔥🔥🔥 Next movie in theatres #HanuMan 🛕 Still cannot forget what #OmRaut did to #Aadipurush with spectacular cast and budget …#HanuMan pic.twitter.com/mmcyrY9EsW — Vineeth K (@DealsDhamaka) January 11, 2024 Audience to #OmRaut after watching #Hanuman 😂😂🔥#HanumanOnJan12th pic.twitter.com/cSJetincsc — Asif (@DargaAsif) January 11, 2024 Everywhere in the world, wherever there is an #Hanuman show, I request the producer and distributor to keep one seat for #OmRaut Ji 🙏🏻 - Prashanth Varma pic.twitter.com/cKuDJa0nHz — भल्लालदेव (@bhallal_deva1) January 12, 2024 Audience attacking #Omraut after watching #Hanuman #PrashanthVarma bagane irikinchesavu ga 🤣🤣🤣#HanumanOnJan12th #HanumanReview #TejaSajja pic.twitter.com/kqrpbNYXGt — Cgma Memes 🗿 (@CgmaMemes) January 11, 2024 Pb fans to @omraut after watching #Hanuman vfx#Omraut #HanumanReview #HanumanOnJan12th pic.twitter.com/v772YAGRIh — Siddu Prabhas (@Siddhartha_002) January 11, 2024 చదవండి: హను-మాన్ రివ్యూ, సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే? భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!
జీవితంలో రెండో ఛాన్స్ ఉంటుందేమో గానీ సినిమాల్లో ఉండదు. అందుకే తీస్తున్నప్పుడు సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మధ్య అలా 'ఆదిపురుష్' విషయంలో జరిగింది. దర్శకుడు ఓం రౌత్ని అయితే ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. బండబూతులు తిట్టారు. దీంతో ప్రభాస్ 'కల్కి' జాగ్రత్త పడింది. అలా జరగకూడదని ముందే డిసైడ్ అయి ఓ పని చేసింది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 AD'. ప్రాజెక్ట్ k అనే వర్కింగ్ టైటిల్తో మొన్నటివరకు నడిపించారు. కొన్నిరోజుల ముందు అమెరికాలో జరిగిన కామికాన్ ఫెస్ట్లో టైటిల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్పై బోలెడన్ని విమర్శలు రాగా, గ్లింప్స్ మాత్రం బాగానే అనిపించింది. ఇప్పుడు వీటన్నింటిపై వచ్చిన రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తోంది. (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) ఇందులో భాగంగా గ్లింప్స్ వీడియోలో గ్రాఫిక్స్పై ఎలాంటి రివ్యూలు వచ్చాయనేది దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఆ ఫొటోని నిర్మాత ప్రియాంక దత్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీటిని బట్టి ముందు ముందు గ్రాఫిక్స్ ఎలా ఉండనేది జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వల్ల 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్కి కౌంటర్లు పడుతున్నాయి. అదేంటి 'కల్కి' గ్లింప్స్ గ్రాఫిక్స్ రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తే.. ఓం రౌత్ని ఎందుకు తిడుతున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది సెప్టెంబరులో 'ఆదిపురుష్' టీజర్ విడుదల చేయగానే ప్రతి ఒక్కరూ దర్శకుడిని విమర్శించారు. గ్రాఫిక్స్ సరిచేసేందుకు మరో ఆరు నెలలు సమయం తీసుకున్నప్పటికీ పెద్దగా మార్పులేం చేయలేకపోయాడు. దీంతో సినిమా రిలీజైన తర్వాత ఆ తిట్లు తప్పలేదు. ఇలా తమ మూవీ విషయంలో తప్పు జరగకుండా 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త తీసుకోవడం మంచి పనే. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) -
ఆదిపురుష్ డైరెక్టర్ పోస్ట్.. ఓ రేంజ్లో ఆడేసుకున్న నెటిజన్స్ !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: ఎక్కడైనా సరే 'తగ్గేదేలే'.. ఐకాన్ స్టార్ అరుదైన రికార్డ్!) ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ రచయిత మనోజ్ ముంతశిర్ డైలాగ్స్ రాశారు. పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఆదిపురుష్ను రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అయితే సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు దాటి పోవడంతో ఓం రౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తనకు ఇష్టమైన ఆలయాలను సందర్శించానని ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఓం రౌత్ ఇన్స్టాలో రాస్తూ.. 'శ్రీ మంగేశి దేవాలయం, శ్రీ శాంతదుర్గ దేవాలయం దర్శనం చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తరచుగా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటా. ఈ రెండు పవిత్ర స్థలాలు నన్ను నా మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటా.' అని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. కొంతమంది రూ.600 కోట్లను ఆగం చేశావు కదా కామెంట్స్ చేయగా.. మరికొందరేమో అన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరొకరు రాస్తూ దయచేసి మీరు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయవద్దని సలహా ఇస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!) View this post on Instagram A post shared by Om Raut (@omraut) -
ఆదిపురుష్ 2 కి సిద్ధమైన ఓంరౌత్.. ప్రభాస్ రియాక్షన్..
-
ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్నెస్ ఏంట్రా బాబు!) అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్లైన్లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్లో హెచ్డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: RRR Sequel: రామ్చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!) -
తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా మేకర్స్ చేసిన పొరపాట్లతో కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్లో అడుగు పెట్టిన 'సినిమా' ) మనోజ్ ముంతశిర్ తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. విజువల ఎఫెక్ట్స్ మినహాయిస్తే.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. దీంతో రచయిత మనోజ్ ముంతశిర్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. (ఇది చదవండి: 15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి) View this post on Instagram A post shared by Manoj Muntashir Shukla (@manojmuntashir) -
Adipurush Movie: దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు గుర్తించారా? (ఫోటోలు)
-
మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్పై నటుడు ఆగ్రహం!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్) అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్ఫుల్గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు. విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన. ఆదిపురుష్ వివాదం ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ గుర్తొచ్చేది 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. మనం వాటిని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయాం. కానీ 'ఆదిపురుష్'పై వచ్చినన్నీ వివాదాలు మరే మూవీ విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. నిరాశపరిచిన 'ఆదిపురుష్'! 'బాహుబలి' తర్వాత ప్రభాస్.. పలు వైవిధ్యమైన సినిమాల్ని ఒప్పుకొన్నాడు. 'సాహో' యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, 'రాధేశ్యామ్' ఓ లవ్ స్టోరీ, ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్' మైథలాజికల్ చిత్రం. 'బాహుబలి' తప్పితే మిగతా మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు సాధించాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి! ఇలా అంటే ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. అయినా ఇదే నిజం! (ఇదీ చదవండి: 'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!) నో చెప్పిన ప్రభాస్! 'ఆదిపురుష్'లో రాముడిగా చేసిన ప్రభాస్ ని ఎవరూ పెద్దగా ఏం అనడం లేదు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ని బూతులు తిడుతున్నారు. ఇదంతా చూసి కూడా ప్రభాస్ దగ్గరకు సీక్వెల్ ప్రతిపాదనతో వెళ్లాడట. దీన్ని డార్లింగ్ హీరో సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంపైనే ఇన్ని వివాదాలు వచ్చాయి. సీక్వెల్ తీస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయోనని ప్రభాస్ భయపడి ఉండొచ్చు బహుశా! కలెక్షన్స్ ఎంత? తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్ల వసూళ్లు సాధించిన 'ఆదిపురుష్'.. నాలుగురోజు నుంచి డల్ అయిపోయింది. చెప్పాలంటే రోజురోజుకీ దారుణంగా పడిపోయాయి. అలా మొత్తంగా పది రోజుల్లో రూ.450 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం లెక్కలు చూస్తుంటే భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. అవి ఎంతనేది కొన్ని రోజులైతే క్లారిటీ వచ్చేస్తుంది. #Adipurush goes from strength to strength at the Global Box Office and collects Rs 450 CR in 10 days. Continues its steady march at the box office!#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @TSeries @Retrophiles1 @UV_Creations @peoplemediafcy… pic.twitter.com/ErYJ1F8Mce — People Media Factory (@peoplemediafcy) June 26, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కానీ అంతే అంతేస్థాయిలో విమర్శల దాడి ఎదుర్కొంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్కు ఇవన్నీ అవసరమా?) తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ ఆదిపురుష్ చిత్రం చూశానని తెలిపారు. అయితే ఈ చిత్రంలో రెండు అంశాలు మాత్రమే తనకు నచ్చాయని వెల్లడించారు. కానీ ఈ సినిమా చూసేందుకు ఎందుకు వచ్చానా? అనిపించిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. 'నేను ఆదిపురుష్ సినిమా చూశా. ఈ చిత్రంపై నాకు చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ చాలా నిరాశకు గురి చేసింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఈ చిత్రం ఎవరు తీశారు? నేను ఎందుకు సినిమా చూసేందుకు వచ్చానా అనిపించింది. హనుమాన్ను ఓ వీధి భాష మాట్లాడే వారిలా చూపించారు. సినిమాలో నాకు నచ్చినవి రెండే అంశాలు బాగున్నాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. ఈ రెండు మినహాయిస్తే ఈ మూవీ చూసిన వారికి నిరాశ తప్పదు. సినిమా థియేటర్లో నా పక్కన కూర్చున్నవారు సైతం సినిమా బాగాలేదన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తప్పా.. చిత్రంలో ఏం లేదని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ రామాయణం పేరుతో ప్రజలకు ఏం చూపిస్తున్నారంటూ మండిపడ్డారని.' తెలిపారు. (ఇది చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని! ) -
ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు!
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీ జూన్ 16న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రంలోని పాత్రలు, డైలాగ్స్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ తమ తప్పులను అంగీకరించి.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన డైలాగ్స్ మార్చేశారు. దీంతో ప్రస్తుతం థియేటర్లలో మార్చిన సినిమానే ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురవగా.. ఐదో రోజుకు వచ్చేసరికి భారీస్థాయిలో పడిపోయాయి. దీంతో మళ్లీ ప్రేక్షకుల కోసం ఆదిపురుష్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మల్టీప్లెక్స్ల్లో టికెట్ల ధరను భారీగా తగ్గించారు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఈ ఆఫర్ చెల్లదని తెలిపారు. ఈ టికెట్లపై 3D గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే.. ) View this post on Instagram A post shared by T-Series (@tseries.official) -
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!
ఒక సినిమా చేస్తున్నప్పుడే హీరోలకు అది హిట్ అవుతుందా లేదా అనేది దాదాపుగా తెలిసిపోతుంది. ఒకవేళ ఏమైనా తేడా కొడితే రిజల్ట్ గురించి హీరోలు పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. వీలైనంత వరకు సైలెంట్ గానే ఉంటారు. 'ఆదిపురుష్' విషయంలో మాత్రం రిజల్ట్ గురించి హీరో ప్రభాస్ ముందే పసిగట్టేశాడా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓ పాత వీడియోలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే ఈ కొత్త డౌట్స్ వచ్చేలా చేస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. థియేటర్లలోకి రాకముందు కొన్ని విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత మరింతగా వివాదాలకు కారణమవుతోంది. కొందరికి ఈ మూవీ నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే ప్రభాస్ కి ఎందుకో సందేహం వచ్చింది. కానీ డైరెక్టర్ ఓం రౌత్.. ఇతడి మాట వినలేదనిపిస్తుంది. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ టైంలో ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇదే నిజమనిపించేలా ఉన్నాయి. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) 'ఆదిపురుష్ షూటింగ్ నాలుగు రోజులు జరిగిన తర్వాత నాకెందుకో ఔట్ఫుట్ మీద డౌట్ వచ్చింది. నేను ఈ సినిమా చెయ్యొచ్చా? ఇంతకుముందు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. మిగతా చిత్రాల విషయంలో తప్పు జరిగినా పర్లేదు కానీ రామాయణం విషయంలో తప్పు జరగకూడదు. ఆదిపురుష్ విషయంలో మనం తప్పు చేయకూడదు అని ఓం రౌత్ ని అడిగాను. అతను.. 'మీరు అలాంటి భయలేం పెట్టుకోవద్దు. సినిమా బాగా వస్తుంది, నేనున్నాను' అన్నాడు' అని ప్రభాస్ ఈ పాత వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్.. ప్రభాస్ ముందే 'ఆదిపురుష్' రిజల్ట్ ఊహించినట్లున్నాడు. అది చెబితేనే ఓం రౌత్ వినలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా 'రామాయణం' ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినా 'ఆదిపురుష్' విషయంలో జరిగినంత రచ్చ అయితే ఎప్పుడు జరగలేదు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్లు వసూలు చేసింది. సోమవారానికి దారుణంగా పడిపోయింది. కేవలం రూ.35 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ వారం నిలబడితేనే సినిమా గట్టెక్కుతుంది. లేదంటే నష్టాలు తప్పవేమో అనిపిస్తోంది. (ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!) -
Adipurush Mistakes: ఆదిపురుష్ మూవీ.. ఓం రౌత్ చేసిన అతిపెద్ద బ్లండర్స్ ఇవే!
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శల దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సినిమాలోని పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డైలాగ్స్, పాత్రల వేషధారణపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా విడుదలైన తర్వాత కూడా ఆదిపురుష్పై విమర్శల దాడి ఆగడం లేదు. అసలు మీరు రామాయణమే కాదంటూ నెటిజన్స్తో పాటు కొందరు నటీనటులు సైతం విమర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు ) ఇవన్నీ పక్కనబెడితే దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు ఏంటి? అసలు ఎక్కడ ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారు. రామాయణంలో పాత్రలకు ఆధునిక సాంకేతికతను జోడించడం సినిమాను దెబ్బతీసిందా? లేక పాత్రలను తీర్చిదిద్దడంలో.. వాస్తవాన్ని చూపించడంలో విఫలమయ్యారా? అనేది ఓ సారి పరిశీలిద్దాం. ఆదిపురుష్పై ఇంతలా విమర్శలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది. విమర్శలకు దారితీసిన ప్రధాన తప్పిదాలివే! 1. రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు. 2. సినిమాలోని హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్ను మారుస్తామని నిర్మాతలు ప్రకటించారు. 3.పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. 4. సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో రాముడు, సీత అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించారు. 5. డైలాగ్స్ పక్కన పెడితే చిత్రనిర్మాతలు రాఘవ అని కూడా పిలువబడే రాముడిని కోపంగా, మరింత దూకుడుగా ఉండే వ్యక్తిగా ఆదిపురుష్లో చూపించారు. ఇది కూడా సినిమాకు ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి. 6. పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. 7. ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెట్టిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు. (ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఇలాంటి పొరపాట్లతో ఆదిపురుష్ టీం ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకుంది. వాస్తవానికి భిన్నంగా పాత్రలను చూపించిన ఓం రౌత్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఏదేమైనా పురాణ ఇతిహాసాలను తెరపై చూపించాలంటే వాస్తవాలను మరో కోణంలో చూపిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రాబోయే సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతారని ఆశిద్దాం. -
‘ఆదిపురుష్’కు దెబ్బ మీద దెబ్బ.. రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు!
‘ఆదిపురుష్’ సినిమా మొదలెట్టినప్పుడు ఆ చిత్రానికి ఎంత హైప్ వచ్చిందో ప్రస్తుతం అంతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో బ్యాన్ చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి వేషధారణ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇన్ని వివాదాల నడుమ ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనొక భక్తుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్’ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవైపు భారీగా కలెక్షన్లను రాబడుతున్నా అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మాట్లాడుతూ.. ‘హనుమంతుడు దేవుడు కాదు. ఆయనొక భక్తుడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న వివాదాల నడుమ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆదిపురుష్ చిత్రానికి మరింత మైనస్గా మారే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని రెచ్చగొట్లే వ్యాఖ్యలు చేయకు అంటూ హెచ్చరిస్తున్నారు. “बजरंग बली भगवान नहीं हैं भक्त हैं हमने उनको भगवान बनाया बाद में” -@manojmuntashir तुम मूर्ख हो मनोज, मौन हो जाओ अभी भी समय है। pic.twitter.com/PSqLXpJ04q — BALA (@erbmjha) June 19, 2023 చదవండి: Salaar Movie: 'సలార్' కొత్త పోస్టర్ లో ఉన్నవి అవేనా? -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
Adipurush: సినిమాను బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ
ప్రభాస్ రాముడిగా భారీ బడ్జెట్తో నిర్మించిన ‘ఆదిపురుష్’కు భారీగా విమర్శలు వస్తున్న తరుణంలో మూవీ మేకర్స్కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే సోమవారం నాడు మూవీకి భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఇన నుంచి కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఈ తరుణంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. అంతే కాకుండా ఓటీటీలో కూడా సినిమా ప్రదర్శన జరగకుండా చూడాలని కోరారు. ఈ సినిమాలో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి పాత్రలను మలిచిన తీరు బాగాలేదని లేఖలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Adipurush: సోమవారం దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. కారణం ఇదే) భారతీయ ఇతిహాసమైన రామాయణం ఇమేజ్ను చెడగొట్టేలా ఆదిపురుష్ ఉంది. ఇందులోని డైలాగ్లు హిందూ మనోబావాలు దెబ్బతినేలా ఉన్నాయి. సినిమా కూడా చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్లా చిత్రీకరించారని ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు లేఖలో తెలిపారు. కాబట్టి సినిమా డైరెక్టర్ ఓం రౌత్తో పాటు రచయిత మనోజ్ ముంతాషిర్పై కేసు నమోదు చేసి భారతీయలు ప్రతిష్టను కాపాడాలంటూ వారు కోరారు. ఇలాంటి సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: లిటిల్ మెగా ప్రిన్సెస్ గురించి చిరు ఏమన్నారంటే?) All India Cine Workers Association write to Prime Minister Narendra Modi, requesting him to "stop screening the movie and immediately order a ban of #Adipurush screening in the theatres and OTT platforms in the future. "We need FIR against Director Om Raut, dialogue writer… pic.twitter.com/jYq3yfv05c — ANI (@ANI) June 20, 2023 -
ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈనెల 16న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది. (ఇది చదవండి: 'ఆదిపురుష్' రైటర్కు బెదిరింపులు.. చంపేస్తామని! ) అయితే ఈ సినిమాపై అంతేస్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆదిపురుష్పై రోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదిపురుష్పై శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఈ చిత్రానికి రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆదిపురుష్పై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు. ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ..'రామాయణానికి ఆదిపురుష్ను మించిన అగౌరవం ఇంకొకటి లేదు. దర్శకుడు ఓం రౌత్కు రామాయణంపై కొంచెం కూడా పరిజ్ఞానం లేదు. మనోజ్ రాసిన డైలాగ్స్, స్క్రీన్ప్లే చూసి నిద్రమాత్రలు కూడా సిగ్గుపడతాయి. ఇప్పటి వరకూ ఎంతోమంది రచయితలు రామాయణాన్ని రాశారు. ఆ రచనలతో ఈ సినిమాకు అస్సలు పోలికలే ఉండవు. హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ను స్ఫూర్తిగా తీసుకున సినిమా తీసినట్లు చూస్తేనే తెలిసిపోతుంది. సినిమాటిక్ స్వేచ్ఛ తీసుకోవాలనుకుంటే.. ఫిక్షనల్ సినిమా చేయాల్సింది. కథను అవమానించేలా చూపించకూడదు. ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్. రామాయణం గురించి ఆదిపురుష్ మేకర్స్ కంటే కూడా సాధారణ పిల్లాడికే బాగా తెలుసు. అసలు ఈ సినిమాకు రూ.600 కోట్లు ఎలా ఖర్చు చేశారో అర్థం కావడం లేదు' అంటూ విమర్శలు చేశారు. (ఇది చదవండి: ఉపాసన- రామ్చరణ్ బిడ్డకు సర్ప్రైజ్.. ఆర్ఆర్ఆర్ సింగర్ అదిరిపోయే గిఫ్ట్!) -
'ఆదిపురుష్' రైటర్కు బెదిరింపులు.. చంపేస్తామని!
'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. రైటర్ మనోజ్ ముంతాషిర్ గత కొన్నిరోజుల నుంచి హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం సినీ వర్గాలు, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? మాట మార్చడమే కారణమా? 'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. అయితే ఒరిజినల్ స్టోరీతో పోల్చి చూస్తే.. ఇందులో కొన్ని సీన్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకొందరు ట్రోల్స్ చేశారు. ఈ విషయమై తాజాగా స్పందించిన రైటర్ మనోజ్.. తాము తీసింది రామాయణం కాదని, కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకొచ్చారు. Mumbai Police provides security to dialogue writer of #Adipurush, Manoj Muntashir after he sought a security cover citing a threat to his life. Police say that they are investigating the matter. (File photo) pic.twitter.com/1WiWiOhclo — ANI (@ANI) June 19, 2023 (ఇదీ చదవండి: రావణుడు లుక్పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!) ఫ్యాన్స్ కి మండింది! అయితే 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఒకలా మాట్లాడిన రైటర్ మనోజ్.. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మాట మార్చడం అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకు పర్వాలేదు గానీ ఓ వ్యక్తి మాత్రం చంపేస్తా అంటూ సదరు రైటర్ ఇంటికి లెటర్ పంపించాడు. దీంతో ఇతడు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఇతడికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ లేఖ ఎవరు పంపించారనేది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. హద్దులు దాటుతున్న అభిమానం ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయం. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం వరకు ఓకే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం ఏదైనా సినిమాలో చిన్న సీన్ నచ్చకపోయినా సరే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. 'ఆదిపురుష్' రైటర్ విషయంలోనూ జరిగిందిదే అనిపిస్తోంది. ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియా వల్ల విపరీత పోకడలు కనిపిస్తుండటం భయం కలిగిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
నిజం చెప్తున్నా, ప్రభాస్ అంత ఈజీగా ఒప్పుకోలేదు: ఆదిపురుష్ డైరెక్టర్
డార్లింగ్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య జూన్ 16న రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్కు మాత్రం ఎటువంటి ఢోకా లేనట్లు కనిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నిజం చెప్తున్నా.. ప్రభాస్ ఈ సినిమాను అంత ఈజీగా ఒప్పుకోలేదు. కరోనా సమయంలో ప్రభాస్కు ఫోన్ చేసి మాట్లాడాను. నేను ఏ రోల్ చేయాలని ఆశిస్తున్నావ్? అని ప్రభాస్ అడిగాడు. జూమ్ కాల్.. ఆ తర్వాత హైదరాబాద్కు శ్రీరాముడి పాత్రలో అంటే రాఘవుడిగా నటించాలని చెప్పాను. నువ్వు సీరియస్గా అంటున్నావా? అని అడిగితే అవునని బదులిచ్చాను. అయినా ఇలా జూమ్ కాల్లో స్క్రిప్ట్ వివరించడం ఎలా కుదురుతుంది? అన్నాడు. నేను వెంటనే ఆలస్యం చేయకుండా హైదరాబాద్లో వాలిపోయాను. కథ చెప్పాను, పూర్తిగా విన్నాక అతడు ఓకే అన్నాడు. నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడు. నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ దేవుడి దయ వల్ల భవిష్యత్తులో కూడా అతడు నావెంట ఉంటే బాగుండు. ఇప్పటి జనరేషన్ కోసం ఆదిపురుష్ ఆదిపురుష్లో రాఘవుడి పాత్రకు నేను అనుకున్న ఏకైక ఛాయిస్ ప్రభాసే.. నేను అనుకున్నట్లే అతడు దొరికాడు. ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కోసం తీసింది. యువత కోసం తీశాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్పై చూపించడం అసాధ్యం. అందుకే నేను యుద్ధకాండ భాగం తీసుకున్నాను. ఈ అధ్యాయంలో రాముడు పరాక్రమవంతుడిగా ఉంటాడు, నేను కూడా అదే చూపించడానికి ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు ఓం రౌత్. చదవండి: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. మూడో రోజు ఎన్ని కోట్లంటే? -
అలా అంటున్నవారంతా తెలివి తక్కువ వాళ్లే!: ఆదిపురుష్ డైరెక్టర్
ఆదిపురుష్ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. అంతే భారీగా విమర్శలు సైతం వస్తున్నాయి. దశరథుడిగా ప్రభాస్ లుక్ బాలేదని, కొన్ని డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ చాలా పేలవంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆదిపురుష్ టీం కొన్ని తప్పులను సరిదిద్దుకునేందుకు రెడీ అయింది. ముఖ్యంగా హనుమంతుడితో చెప్పించే మాస్ డైలాగ్స్ను తీసేసి ఆ స్థానంలో కొత్తవి చేర్చనున్నట్లు ప్రకటించారు. రామాయణం తెలుసంటే అబద్ధమే అయినప్పటికీ ఈ ట్రోలింగ్ ఆగడం లేదు. మరీ ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్కు అసలు రామాయణం తెలుసా? అని ఆడేసుకుంటున్నారు. నటీనటులను ఓం రౌత్ సరిగా వాడుకోలేకపోయాడని నెట్టింట రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఈ నెగెటివ్ రివ్యూలపై ఓం రౌత్ స్పందించాడు. 'బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి స్పందన వస్తుందన్నది ముఖ్యం. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇకపోతే నాకు రామాయణం అంతా తెలుసని చెప్తే అది అబద్ధమవుతుంది. ఎందుకంటే రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదని నేను భావిస్తున్నాను. అంత ఈజీ కాదు నాకూ, మీకూ తెలిసిన రామాయణం ఉడుత చేసే సాయమంత ఉంటుంది. నాకు అర్థమైన కొంత భాగాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్పై చూపించడం అంత సులువు కాదు, అందుకే యుద్ధకాండలోని కొంత భాగంపై నేను దృష్టి సారించా. అయినా రామాయణాన్ని సంపూర్ణంగా గ్రహించడం అంత సులువేమీ కాదు. నాకు రామాయణం మొత్తం తెలుసు అని ఎవరైనా అంటున్నారంటే వాళ్లు తెలివి తక్కువ వాళ్లైనా అయి ఉండాలి లేదంటే అబద్ధమైనా చెప్తుండాలి' అని చెప్పుకొచ్చాడు ఓం రౌత్. ఇకపోతే ఆదిపురుష్ మొదటి రోజు రూ.140 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.100 కోట్లు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే! చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? నన్ను, నా తల్లిని తిడుతున్నారు: ఆదిపురుష్ రచయిత -
ప్రేక్షకుల నుంచి అభ్యంతరం.. ‘ఆదిపురుష్’ టీమ్ కీలక నిర్ణయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.రెండు రోజుల్లోనే ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది డైలాగ్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లంకలో ఆంజనేయస్వామి చెప్పే డైలాగ్ని నెట్టింట ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో ఇలాంటి సంభాషణలు పెట్టడం ఏంటని రామ భక్తులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల సూచనల మేరకు కొన్ని డైలాగ్స్ని మారుస్తామని వెల్లడించింది. (చదవండి: ఆదిపురుష్’ పేరు పురాణాల్లో ఎక్కడినుంచి వచ్చింది?) ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ను చూడవచ్చు’ అని చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. డైలాగ్స్ మార్పు పెద్ద సాహసమే అయినప్పటికీ.. ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. We hold immense gratitude for your valuable perspectives and thoughts! Your constant love and support is what keeps us going ❤️ Jai Shri Ram 🙏 Book your tickets on: https://t.co/2jcFFjFeI4#Adipurush now in cinemas near you! ✨ #Prabhas @omraut #SaifAliKhan @kritisanon… pic.twitter.com/EtaDsNsShz — T-Series (@TSeries) June 18, 2023 -
‘ఆదిపురుష్’ పేరు పురాణాల్లో ఎక్కడినుంచి వచ్చింది?
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. టెక్నికల్గా సినిమా బాగుందని.. కానీ కథ, కథనమే బాగోలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని వక్రీకరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్నికి ‘ఆదిపురుష్’అనే పేరు ఎందుకు పెట్టారనేది చాలా మంది మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. మన తెలుగు వాళ్లకు తెలిసినంతవరకు రాముడిని దండరాముడు, అయోధ్య రాముడు, కౌసల్యా తనయుడు, సీతాపతి, ఇనకుల చంద్రుడు, రామచంద్రుడు..ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఆరాధిస్తాం. కానీ వాల్మీకి రామాయణంతో పాటు ఇతర రామాయణాల్లో ఎక్కడ రాముడికి ఆదిపురుష్ అనే పేరే లేదని పండితులు చెబుతున్న మాట. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఎక్కడయినా ఆదియోగి అంటే శివుడు. ఎప్పుడు పుట్టాడో తెలియని అనే అర్థంలో విష్ణువును ఆదిపురుషుడు అంటున్నాం. ఎప్పుడు పుట్టాడో తెలిసిన రాముడికి కూడా అదే అన్వయమవుతుందని సినిమావారు భావించి ఈ పేరు పెట్టారేమో. లేదంటే ఆదిపురుషుడైన విష్ణువు రాముడిగా పుట్టాడనే కోణంలో ఈ చిత్రానికి ‘ఆదిపురుష్’ అని టైటిల్ పెట్టి ఉండవచ్చు. అయితే తమ చిత్రానికి ‘ఆదిపురుష్’ అన్న పేరు ఎంచుకోవడం వెనుక కారణం ఏంటో చిత్రబృందం క్లారిటీ ఇస్తే బాగుండేది. -
మేము తీసింది రామాయణం కాదు. . ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై ఆదిపురుష్ కథ రచయిత స్పందించారు. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న విమర్శలకు రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా సమాధానమిచ్చారు. (ఇది చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి!) మనోజ్ ముంతశిర్ మాట్లాడుతూ.. 'మేము తీసింది రామాయణం కాదు.. మేము రామాయణం నుంచి స్ఫూర్తి పొందాం. ఈ విషయాన్ని మేం డిస్క్లైమర్లో కూడా ప్రస్తావించాం. రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఓ భాగం ఆధారంగానే ఆదిపురుష్ను తెరకెక్కించాం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం కూడా. దీని గురించి మరోసారి వివరణ ఇస్తున్నా. మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీశాం. అంతే కానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు.' అని అన్నారు. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్పై తాజాగా రచయిత ఇచ్చిన వివరణపై సినీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో!. (ఇది చదవండి: నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో ) -
'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ ఎలా ఉంది? మీలో చాలామందిని ఈ ప్రశ్న అడిగితే.. బాగానే ఉంది కానీ..? అని అక్కడే ఆగిపోతారు. ఇంకాస్త బాగా తీసుంటే బాగుండేది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రామాయణం ఆధారంగా తీసిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. అలానే మన ప్రభాస్ హీరోగా నటించడంతో చాలామంది ఈ మూవీ హిట్ అవ్వాలని బలంగా కోరుకున్నారు. రియాలిటీలో జరిగింది, జరుగుతున్నది ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు 'ఆదిపురుష్' విషయంలో ఇలా అనుకోవడానికి కారణాలేంటి? ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఒప్పుకొన్న మూవీస్ లో 'ఆదిపురుష్' కాస్త స్పెషల్. ఎందుకంటే ఇందులో డార్లింగ్ హీరో.. శ్రీరాముడిగా నటించాడు. ఇప్పటివరకు మనకు రాముడు అంటే నీలమేఘ శ్యాముడిగానే తెలుసు. కానీ 'ఆదిపురుష్' రాముడికి మీసాలు పెట్టడం, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం.. ఫ్యాన్స్ కి నచ్చుండొచ్చేమో గానీ రాముడి భక్తులకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ప్రశాంత చిత్తమైన రాముడిని.. బలపరాక్రమశాలిగా చూపించడం కూడా కాస్త వింతగా అనిపించింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!) డైరెక్టర్ ఓం రౌత్.. రామాయణాన్ని అలానే తీసుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ 'ఆదిపురుష్' చూస్తుంటే అసలు రామాయణం పూర్తిగా చదివే తీశాడా అనే డౌట్ వచ్చింది. కొన్ని సన్నివేశాల్లో మనకు తెలిసినది ఒకటైతే.. ఇందులో చూపించింది మరోలా ఉంది. ఇక గ్రాఫిక్స్ విషయంలో ఓం రౌత్ ఆలోచన ఏంటనేది ఇప్పుడు సగటు రాముని భక్తులకు అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది. మనకు తెలిసిన రామాయణం ప్రకారం.. సీతను రావణుడు ఎత్తుకెళ్లిపోతే జఠాయు పక్షి రాముడికి ఈ విషయం చెబుతుంది. 'ఆదిపురుష్'లో మాత్రం రాముడు, లక్ష్మణుడు స్వయంగా చూస్తారు. చివర్లో బాణంతో రావణాసురుడిని చంపే రాముడు.. సీతని ఎత్తుకెళ్తుంటే ఏం చేయలేకపోతాడు. ఇది ఓ విధంగా రామాయణాన్ని వక్రీకరించడం కిందకే వస్తుంది. అలానే హాలీవుడ్ మూవీల్లో కార్టూన్స్ లాంటివి 'ఆదిపురుష్'లో చాలా చోట్ల కనిపిస్తాయి. పిల్లలకు అవి నచ్చొచ్చేమో గానీ పెద్దోళ్లకు రామాయణం గురించి తెలిసిన వాళ్లకు మాత్రం షాకింగ్ గా అనిపిస్తుంది. మనకు తెలిసినంతవరకు రావణాసురుడు.. సీతని ఎత్తుకెళ్లడం తప్పితే చాలావరకు సౌమ్యంగానే ఉంటాడు. 'ఆదిపురుష్' లో మాత్రం కరుడుగట్టిన విలన్ లా కనిపిస్తాడు. అనకొండలతో మాసాజ్ చేయించుకోవడం మరీ విడ్డూరం. శివభక్తుడిగా మనందరికీ తెలిసిన రావణాసురుడు.. ఇందులో దాదాపు 90 శాతం సీన్లలో నామాలు లేకుండానే కనిపిస్తాడు. అలానే సినిమాలో ఎవరికీ కూడా ఒరిజినల్ పేర్లు పెట్టలేదు. దీనికి రీజన్ ఏంటనేది అంతుచిక్కని ప్రశ్న. ఇదంతా పక్కనబెడితే సినిమాలోని మంచి మంచి సీన్స్ చాలావరకు సగంలోనే కట్ అయిపోతుంటాయ్. ఇలా 'ఆదిపురుష్' విషయంలో పలు పొరపాట్లు జరగడం.. సగటు సినీ ప్రేక్షకుడికి బాధ కలిగించాయనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: జపనీస్లో 30 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. అప్పట్లోనే 80 కోట్లు!) -
Adipurush: సినిమా రిలీజ్ తర్వాత తొలిసారి ట్వీట్ చేసిన ఓం రౌత్
ప్రభాస్ కీలక పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్ ’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాపై డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. కానీ నెటిజన్స్ మాత్రం దర్శకుడు ఓం రౌత్ని ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది) దీంతో 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సినిమాపై ఆయన ఓ ట్వీట్ చేశారు. థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలను ఒకచోటకు చేర్చి ట్విటర్లో షేర్ చేశాడు. 'జై శ్రీరామ్' అంటూ దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని తెలిపాడు. ఆదిపురుష్ కథపై వస్తున్న విమర్శలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. Jai Shri Ram 🙏🏼 pic.twitter.com/oyXY57U7Lz — Om Raut (@omraut) June 17, 2023 (ఇదీ చదవండి: ఓం రౌత్ను ప్రభాస్ డైలాగ్తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) -
జపనీస్లో 30 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. అప్పట్లోనే 80 కోట్లు!
'ఆదిపురుష్'.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే డిస్కషన్. ఫ్రెండ్స్, నెటిజన్స్ ఇలా ఎవరిని తీసుకున్నా సరే వాళ్ల మధ్య హాట్ టాపిక్ ఈ మూవీనే. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులని అలరించడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయింది. మరోవైపు 'ఆదిపురుష్'ని దాదాపు 30 ఏళ్ల క్రితం జపనీస్ లో వచ్చిన 'రామాయణ్' మూవీతో పోల్చి చూస్తున్నారు. దీంతో ఆ చిత్రం కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా ప్రత్యేకత? రామాయణం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రకరకాల మాధ్యమాల్లో రాముడి కథని మనం వింటున్నాం, చూస్తూనే ఉన్నాం. తెలుగులో కొన్నాళ్ల ముందు దర్శకుడు బాపు.. 'శ్రీ రామరాజ్యం' తీసి జనాల్ని భక్తి పారవశ్యంలో ముంచారు. ఇప్పుడు రిలీజైన 'ఆదిపురుష్' వల్ల మరోసారి ఈ ఇతిహాసం గురించి మాట్లాడుకునే ఛాన్స్ దక్కింది. మన దేశంలో రామాయణం ఆధారంగా సినిమాలు, సీరియల్స్ బోలెడన్నీ వచ్చాయి. కానీ అసలు ఏ మాత్రం సంబంధం లేని జపాన్ లో కూడా 1992లోనే 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' అనే యానిమేటెడ్ మూవీ తీశారు. హిట్ కూడా కొట్టారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!) వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన సినిమాల్లో ఈ జపనీస్ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు! 1980లో జపనీస్ యానిమేటర్ యుగో సాకో తొలిసారి మనదేశాన్ని సందర్శించారు. ఆ టైంలో రామాయణాన్ని విజువల్ గా చూపిద్దామనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో దాదాపు 60 సార్లు భారతదేశానికి వచ్చివెళ్లారు. 1985లో ఈయన అయోధ్యని దర్శించినప్పుడు.. రామాయణాన్ని డాక్యుమెంటరీగా తీయాలని ఫిక్స్ అయ్యారు. Ramayan: Legend of Prince RamThis film was made by Japanese n was scheduled to release in India Jan 1993But due to Babri incident in Dec 1992, Congress banned it n it cud never release in Indianominated for Oscars in 2001Watch this song of that filmGoosebumps guaranteed pic.twitter.com/0Oh11qB6M1— STAR Boy (@Starboy2079) October 4, 2022 ఆ తర్వాత యుగో సాకో.. ఫాదర్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్ మోహన్ తోపాటు 450 మందితో కలిసి పనిచేసి, రామాయణాన్ని ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ గా తీర్చిదిద్దారు. దీన్ని ఎందుకు యానిమేషన్ లో తీయాల్సి వచ్చిందో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'రాముడు దేవుడు. ఎవరైనా యాక్టర్ కంటే యానిమేషన్ లో తీస్తేనే బెస్ట్' అని సాకో చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్) జపనీస్ థియేటర్లలో 1992లో రిలీజైన 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్ రామ'.. అక్కడి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. మన దగ్గర మాత్రం ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడమే దీనికి కారణమని పలు మీడియా రిపోర్ట్స్ చెప్పుకొచ్చాయి. ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్'ని దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తే.. జపనీస్ రామాయణాన్ని 1992లోనే రూ.80 కోట్ల జపనీస్ యెన్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలోని పాత్రలకు పలువురు హిందీ ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పారు. అయితే జపనీస్ 'రామాయణ్' మూవీని స్పూర్తిగా తీసుకునే ఓం రౌత్ 'ఆదిపురుష్' తీశాడని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియదు. ఒకవేళ తీశాడే అనుకున్నా.. ఇప్పుడున్న టెక్నాలజీ, యాక్టర్స్, బడ్జెట్ ఉపయోగించి ఇంకా బాగా తీయొచ్చు. కానీ ఆ విషయంలో ఓం రౌత్ పూర్తిగా ఫెయిలయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే టైంలో 'ఆదిపురుష్' కంటే జపనీస్ లో వచ్చిన 'రామాయణ' బెటర్ అని మాట్లాడుకుంటున్నారు. After hearing reviews and leaked pics of #SaifAliKhan in #Adipurush i think indian producers and Japanese anime company should again collaborate for Ramayan anime long series where they can give all story of Ramayana in details.#AdipurushReview pic.twitter.com/O43yUvjavK— axay patel🔥🔥 (@akki_dhoni) June 16, 2023 (ఇదీ చదవండి: Adipurush Review: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) -
ఓం రౌత్ను ప్రభాస్ డైలాగ్తోనే ఆడుకుంటున్న నెటిజన్లు
రామాయణం ఆధారంగా ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' లో ప్రభాస్ , కృతి సనన్ జంటగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల ముందు ఎంత క్రేజ్ వచ్చిందో, ఉదయం ఆట ముగియగానే ఆ క్రేజ్ పోయే విధంగా.. సినిమా బాగోలేదని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో నెటిజన్స్ దర్శకుడు ఓం రౌత్ని ట్రోల్స్ చేస్తున్నారు. అతను రావణాసురిడి పాత్ర మలచిన తీరుతో పాటు రామాయణం చూపెట్టే విధానం ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. (ఇదీ చదవండి: ప్రభాస్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?) ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. కొందరు అయితే 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. 'అయోధ్య'లో సినిమా ప్రమోషన్ చేస్తున్న సమయంలో 'ఆదిపురుష్' వీడియో చూసి నెటిజన్స్ విమర్శించారు. విఎఫ్ఎక్స్తో పాటు రావణుడి పాత్ర కూడా బాగోలేదని కామెంట్ చేశారు. దీంతో ఈవెంట్ అయ్యాక ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్తో.. 'ఓం! కమ్ టు మై రూమ్' అన్నాడు. తాజాగా నెటిజన్లు అదే మాటను వైరల్ చేస్తున్నారు. సినిమా చూసి బయటకి వచ్చిన వారు తాజాగా దర్శకుడుని తప్పుబడుతూ..'ఓం! కమ్ టు మై రూమ్' అని అంటున్నారు. (ఇదీ చదవండి: ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్గా 'సితారా పాప'కు గుర్తింపు) -
Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ మూవీ స్టిల్స్
-
Adipurush Review: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆదిపురుష్ నటీనటులు: ప్రభాస్, కృతీసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్, దేవదత్త నాగే, తదితరులు నిర్మాణ సంస్థ: టీ సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్ దర్శకత్వం: ఓం రౌత్ సంగీతం: అజయ్- అతుల్ నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళణి ఎడిటర్: అపూర్వ మోతివాలే, ఆశీష్ మాత్రేలు విడుదల తేది: జూన్ 16, 2023 యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్.. శ్రీరాముడిగా తొలిసారి ఒక పౌరాణిక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగింది. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో.. అప్పటి నుంచి ఆదిపురుష్పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇక తిరుపతిలో నిర్వహించిన ప్రిరిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం కథేంటంటే.. వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ఓం రౌత్. రాములవారి వనవాసం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తండ్రి కోసం రాఘవ్(ప్రభాస్) తన సతీమణి జానకి (కృతి సనన్) తో కలిసి వనవాసం కి వెళ్తారు. వీరితో పాటు శేషు( సన్నీసింగ్)కూడా అడవి బాట పడతారు. ఓ రోజు లంక అధిపతి రావణ్ సోదరి శూర్పణఖ రాఘవ్ని చూసి మనసుపడుతుంది. తాను వివాహితుడని చెప్పడంతో జానకిపై దాడి చేస్తుంది శూర్పణఖ. ఈ క్రమంలో శేషు సూర్పణఖ ముక్కు కోస్తాడు. తన చెల్లి మాటలు విని రావణ్ భిక్షువు రూపంలో వచ్చి జానకిని అపహరించుకొని లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. తన జానకిని తిరిగి తీసుకురావడానికి రాఘవ్ పడిన కష్టాలు ఏంటి? అతనికి భజరంగ్(దేవదత్త నాగే), వానర సైన్యం ఎలాంటి సహాయం అందించింది? చివరకు లంకేశ్ని ఎలా హతమార్చారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రాముడి గురించి, రామాయణం గురించి దాదాపు అందరికి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మరి ఆదిపురుష్ ప్రత్యేక ఏంటి? అంటే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి విజువల్ వండర్లా కథను తీర్చిదిద్దడం. ఈ క్రమంలో రామాయణంలోని ప్రామాణికతను పక్కనపెట్టి కమర్షియల్ కోసం క్రియేటివ్ ఫ్రీడమ్ని తీసుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. కథ,కథనం కంటే టెక్నికల్ అంశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. లంకను ఆవిష్కరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాలు త్రీడీ ఎఫెక్ట్స్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. అమరత్వం కోసం రావణుడు దీక్ష చేయడం.. బ్రహ్మ ప్రత్యేక్షమై వరాలు ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్తో రాఘవ్(ప్రభాస్) ఎంట్రీ ఉంటుంది. ఎప్పుడైతే జానకిని రావణుడు అపహరించి లంకతో తీసుకెళ్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. జానకీ అపహరణ, జటాయువుతో రావణ్ ఫైట్, వాలీ, సుగ్రీవుల పోరాట ఘట్టాలతో ఫస్టాఫ్ విజువల్ వండర్లా సాగుతుంది. అయితే ఈ కథంతా చాలావరకు తెలిసిందే కావడంతో..పెద్దగా ఆసక్తికలిగించదు. ఇక సెకండాఫ్లో రామసేతు నిర్మాణం, భజరంగ్ సంజీవని పర్వతాన్ని ఎత్తడం, ఇంద్రజిత్తో పోరాటం, రావణ్, రాఘవ్ల మధ్య ఫైట్ సీన్స్ విజువల్స్ పరంగా ఆకట్టుకుంటాయి, కానీ కృత్రిమత్వం ఎక్కువగా ఉండడంతో ఎమోషనల్గా కనెక్ట్ కాలేరు. భావోద్వేగాలు పండకపోవడం, కథనం ఆసక్తికరంగా సాగకపోవడం ఈ సినిమాకు మైనస్. అలాగే సుదీర్ఘంగా సాగే పోరాట సన్నివేశాలు కూడా అంతకగా ఆకట్టుకోలేవు. రామాయణం గురించి తెలియనివారికి, చిన్నపిల్లలకు ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. రాఘవ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. అతని ఆహార్యం ఆ పాత్రకు బాగా సెట్ అయింది. అయితే ఇంతవరకు రాముడిని మనం నీలిమేఘ శ్యాముడుగానే చూశాం. కానీ ఈ సినిమాలో ఓ కొత్త రాముడిని చూస్తాం. ఇలా చూడడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక జానకిగా కృతిసనన్ తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె పాత్రకు నిడివి చాలా తక్కువనే చెప్పాలి. రావణ్గా సైఫ్ అలీఖాన్ అద్భుతంగా నటించాడు. కానీ ఆయన పాత్రని తీర్చిదిద్దన విధానం మాత్రం సహజత్వానికి దూరంగా ఉంది. భజరంగ్గా దేవదత్త నాగె చక్కగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తన పాత్ర హైలైట్ అయింది. శేషుగా సన్నీ సింగ్ పర్వాలేదనిపించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్-అతుల్ సంగీతమే. జై శ్రీరామ్ పాటతో పాటు మిగిలిన పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'ఆదిపురుష్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దాదాపు ప్రతిఒక్కరూ రాముని భక్తిలో మునిగిపోతున్నారు. థియేటర్లని దేవాలయాలుగా మార్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్నిచోట్ల తొలిరోజు షోలన్నీ దాదాపు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇదే టైంలో 'ఆదిపురుష్' ఓటీటీ డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రభాస్ తోపాటు సైఫ్ అలీఖాన్, కృతిసనన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. గతేడాది టీజర్ రిలీజ్ టైంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా.. రిలీజ్ కి ముందు కాస్త హైప్ క్రియేట్ చేసుకుంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'ఆదిపురుష్' ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. రీసెంట్ గా ఇది చెప్పారు గానీ బిగ్ స్క్రీన్ పై బొమ్మపడిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని భాషలకు కలిపి రూ.150 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్ నడుస్తోంది. దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో? (ఇదీ చదవండి: ఓ రేంజులో 'ఆదిపురుష్' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత?) -
Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్కు ఎలా పరిచయం?
టాలీవుడ్ నుంచి బాలీవుడ వరకు అందరి చూపు ప్రభాస్ 'ఆదిపురుష్' పైనే ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో తాజాగా అందరి చూపు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్పై పడింది. ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మారుమోగుతోంది. ఎవరితను..? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్ని సినిమాలు చేశాడు? అంటూ గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అతను ముంబయిలో పుట్టాడు.. తల్లి నీనా టెలివిజన్ నిర్మాత అయితే కాగా తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, రాజ్యసభ సభ్యుడు కూడా.. ఓం రౌత్ తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అందుకే ఇతనికి సినిమాలంటే ఫ్యాషన్ ఏర్పడింది. (ఇదీ చదవండి: Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే) మొదట అతను బాల నటుడిగా పని చేశాడు, అలాగే కాలేజీలో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా 'కారమతి కోట్' అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేశాడు. మరాఠీ భాషలో 'లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్' అనేది ఆయనకు మొదటి సినిమా. ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరూ కలిపి 'నీనా రౌత్ ఫిలిమ్స్' పేరుతో నిర్మించారు. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అతనికి వచ్చింది. మొదటి సినిమాతోనే అక్కడ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. (ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ) ప్రభాస్తో ఓం రౌత్ పరిచయం ఎక్కడ జరిగిందంటే టి సిరీస్ సంస్థతో ప్రభాస్కు మంచి అనుబంధం వుంది. సాహో , రాధే శ్యామ్ సినిమాల సమయంలో వారి సంస్థతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అప్పటికే అదే సంస్థలో వున్న ఓం రౌత్ అప్పుడు జపాన్కి చెందిన సినిమా 'రామాయణ: ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ' అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా నుండి స్ఫూర్తి పొందాడు. ఇది 1992లో జపాన్లో విడుదల అయింది. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి ఆధునిక సాంకేతిక సాయంతో ఎందుకు రామాయణం తీయకూడదు అనే ఆలోచన వచ్చి అదే విషయాన్ని టి సిరీస్ సంస్థ ప్రతినిదులకు చెప్పడంతో.. అలా ఆదిపురుష్కు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత టీ సిరీస్ వల్ల అతనికి ప్రభాస్ పరిచయం అయ్యాడు. మొత్తానికి ఓం రౌత్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు అన్ని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?
'ఆదిపురుష్'.. మీలో చాలామంది ఈ సినిమా గురించే ఆలోచిస్తున్నారు కదా!? లేదని మాత్రం చెప్పకండి ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హవా అంతా 'ఆదిపురుష్'దే. ఎక్కడా చూసినా జైశ్రీరామ్ పాటనే వినిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే 'ఆదిపురుష్' హిట్ అనేది ఇండస్ట్రీకే కాదు ప్రభాస్ కి కూడా చాలా అంటే చాలా ముఖ్యం.. ఎందుకో తెలుసా? డార్లింగ్ ప్రభాస్.. కొన్నేళ్ల ముందు ఈ పేరు కేవలం తెలుగు ఆడియెన్స్ కి మాత్రమే తెలుసు. ఆరడుగుల కటౌట్, సూపర్ ఫిజిక్.. మాస్ సినిమాలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ. ఫ్యాన్స్ అరిచిగోల చేయడానికి ఇంతకంటే ఏం కావాలి. అయితే రాజమౌళి మాత్రం ప్రభాస్ లో 'బాహుబలి'ని చూశాడు. తెలుగు సినిమాతోపాటు ప్రభాస్ రేంజ్ని ఓ రేంజ్లో పెంచేశాడు. పాన్ ఇండియా స్టార్ ని చేసి పడేశాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' సినిమా గురించి ఇవి మీకు తెలుసా?) 'బాహుబలి' తర్వాత ప్రభాస్.. చాలా సినిమాలు ఒప్పుకొన్నాడు. వాటిలో 'సాహో', 'రాధేశ్యామ్' ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ పూర్తిస్థాయిలో మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా పడలేదే అనే లోటు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. చాలామంది 'సలార్' మూవీతో ఈ కోరిక తీరుతుందని అనుకున్నారు. కానీ 'ఆదిపురుష్' సీన్ లోకి వచ్చింది. 'ఆదిపురుష్' టీజర్ గతేడాది సెప్టెంబరులో రిలీజ్ కాగానే.. మూవీలోని గ్రాఫిక్స్ పై చాలా ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. డైరెక్టర్ ఓం రౌత్ ని.. ఫ్యాన్స్ బండబూతులు తిట్టారు. దీంతో మరో రూ.100 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ లో మార్పులు చేశారు. ట్రైలర్స్ లో ఆ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే 'ఆదిపురుష్' ఎలా ఉండబోతుందా అని తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే మరికొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ సినిమా హిట్ అయితేనే ప్రభాస్ ఇమేజ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. లేదంటే మాత్రం మళ్లీ 'సలార్' కోసమో, 'ప్రాజెక్ట్ K ' కోసమో ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలి మరి 'ఆదిపురుష్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో? (ఇదీ చదవండి: Shaitan Review: ‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ) -
'ఆదిపురుష్' సినిమా గురించి ఇవి మీకు తెలుసా?
'జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్'.. దీన్ని పాటలా పాడితే చాలు మీలో చాలామందికి టక్కున గుర్తొచ్చే మూవీ 'ఆదిపురుష్'. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమా రిలీజ్కు రెడీ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న థియేటర్లని దేవాలయాలుగా మార్చేందుకు సిద్ధమైపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు జనరల్ ఆడియెన్స్ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. 'ఆదిపురుష్' పేరు చెప్పగానే ప్రభాస్, కృతిసనన్, డైరెక్టర్ ఓం రౌత్ అని అంటారు. అంతకు తప్పితే పెద్దగా డీటైల్స్ ఎవరికీ తెలియవు. ఇందులో సౌత్ యాక్టర్స్ ఎవరూ లేకపోవడం కూడా దీనికి కారణం అయ్యిండొచ్చు. కాబట్టి ఈ టైంలో 'ఆదిపురుష్' గురించి పెద్దగా తెలియని 10 ఆసక్తికర విషయాలే ఈ స్పెషల్ స్టోరీ. (ఇదీ చదవండి: ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!) 1.'ఆదిపురుష్' సినిమాని 1992లో వచ్చిన 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని డైరెక్టర్ ఓం రౌత్ తీశారట. అది యానిమేషన్.. ఇప్పుడేమో రియల్ యాక్టర్స్ తో తీశారు. 2.'ఆదిపురుష్'కి మొదట్లో అనుకున్న బడ్జెట్ రూ.400 కోట్లు. కానీ గతేడాది టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ విషయమై ఘోరంగా విమర్శలు వచ్చాయి. ఫలితంగా మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు. దీంతో ఓవరాల్ బడ్జెట్ రూ.500 కోట్లకు చేరుకుంది. 3. హీరోయిన్ గా ఫస్ట్ కృతిసనన్ ని అనుకోలేదు. జానకి పాత్ర కోసం అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అడ్వాణీ, కీర్తి సురేష్ ఇలా చాలామంది పేర్లు పరిశీలించారట. 4.'ఆదిపురుష్' కోసం దర్శకుడు ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం విశేషం. 5.2021లో షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దిరోజులకు.. ముంబయిలో వేసిన సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు. అలాంటి సెట్స్ మళ్లీ వేసి షూట్ పూర్తి చేశారు. 6. జూన్ 6న తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దీనికోసం మూవీ టీమ్ దాదాపు రూ.2 కోట్లకు పైనే ఖర్చు చేశారట. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' టికెట్స్ రేట్ల పెంపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!) 7.థియేటర్లలో కంటే ముందు అంటే జూన్ 13న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'ఆదిపురుష్' స్క్రీనింగ్ ఉందని ప్రకటించారు. కారణాలేంటో తెలియదు గానీ ఆ స్క్రీనింగ్ ని రద్దు చేసుకున్నారు. 8.'ఆదిపురుష్' కోసం ప్రభాస్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. దీంతో దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డు సృష్టించాడు. 9.'ఆదిపురుష్'ని త్రీడీతోపాటు ఐమ్యాక్స్ ఫార్మాట్ లోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో ఐమ్యాక్స్ వెర్షన్ ని క్యాన్సిల్ చేశారు. హాలీవుడ్ మూవీ 'ద ఫ్లాష్' దీనికి కారణమని తెలుస్తోంది. 10. తెలుగు, హిందీలో 'ఆదిపురుష్' షూటింగ్ ఒకేసారి జరిగింది. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు, హిందీలో కుదరలేదు. దీంతో అతడికి శరద్ కేల్కర్ గొంతు అరువిచ్చాడు. అంతకు ముందు బాహుబలి హిందీ వెర్షన్ కి ఇతడే చెప్పడం విశేషం. - ఐవీవీ సుబ్బరాజు (ఇదీ చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) -
Adipurush : మరికొద్ది గంటల్లో రిలీజ్.. ప్రచారం ఎక్కడ?
సినిమా తెరకెక్కించడం ఒకెత్తు అయితే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తారు నిర్మాతలు. పక్కా ప్రణాళికతో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. విడుదల రోజు వరకు తమ సినిమా పేరుని ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేస్తారు. చిన్న సినిమాలు వారం, పది రోజుల ముందు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే.. పాన్ ఇండియా సినిమాలు అయితే నెల ముందే ప్రచారం మొదలెడతాయి. ఇక రాజమౌళి లాంటివాడైతే సినిమా షూటింగ్ నుంచే ప్రమోషన్స్కి ప్రణాళికలు వేస్తాడు. ఆర్ఆర్ఆర్ విషయంలో కేవలం ప్రమోషన్స్కే రూ.20 కోట్ల వరకు కేటాయించినట్లు వార్తలు వినిపించాయి. అంతలా సినిమా ప్రమోషన్స్కి ప్రాధాన్యత ఇస్తారు మన దర్శకనిర్మాతలు. కానీ ఆదిపురుష్ యూనిట్ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. సినిమా విడుదలకు ఒక్క రోజు(జూన్ 16న) మాత్రమే మిగిలి ఉన్నా.. ఎలాంటి ప్రచార కార్యక్రమం చేపట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్లో అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్ కార్యక్రమాలే చేపట్టలేదు. (చదవండి: ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!) ఇటీవల తిరుపతిలో భారీ స్టాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేపట్టారు. అదే రోజు యాక్షన్ ట్రైలర్ని రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. కనీసం మీడియా ఇంటర్వ్యూలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, కృతీసనన్ కూడా తిరుపతి ఈవెంట్ తర్వాత సినిమా గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. ట్రెండింగ్లో ‘ఆదిపురుష్’ ఆదిపురుష్ విషయంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రబృందం ప్రమోషన్స్కి దూరంగా ఉన్నప్పటికీ.. సినిమా పేరు మాత్రం నెట్టింట ట్రెండింగ్గా మారింది. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించే చర్చిస్తున్నారు. టికేట్లు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి. ఒకనొక దశలో టికెట్ బుకింగ్ వెబ్సైట్లు క్రాష్ అయ్యానంటే ఆదిపురుష్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారాలే ఈ సినిమాకు రూ. 100 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జై శ్రీరామ్ నినాదానికి, ప్రభాస్కు ఉన్న క్రేజ్ ‘ఆదిపురుష్’కి బాగా కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మూడో ప్రయత్నమే ‘ఆదిపురుష్’.. ఓంరౌత్ అతిపెద్ద సాహసం
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారత్ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో (జూన్ 16) ప్రేక్షకులముందుకు రానుంది. ప్రస్తుతం నెట్టింట ఆదిపురుష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమాను తెరకెక్కించిన ఓంరౌత్ గురించి తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఆరా తీస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. ఇతిహాసాలను, పురాణ గాథలను సినిమాగా మలచడం దర్శకుడికి కత్తిమీద సాములాంటిదే. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు.. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. అందుకే ఇలాంటి సబ్జెక్టులను టచ్ చేసేందుకు దర్శకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు మాత్రమే ఇలాంటి చిత్రాలను తెరకెక్కిసారు. కానీ ఆదిపురుష్ను తెరకెక్కించిన డైరెక్టర్కి ఎక్కువ అనుభవం ఉందనుకుంటే పొరపాటే. కేవలం రెండు సినిమాల అనుభవంతోనే రూ. 500 కోట్ల బడ్జెట్తో ‘ఆదిపురుష్’ని తెరకెక్కించాడు. ముంబైలో పుట్టి పెరిగిన ఓంరౌత్.. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా పొందిన తర్వాత సీనీ రంగంలోకి అడుగుపెట్టాడు. తన తాత జేఎస్ బాండేకర్ డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్, ఎడిటర్ కావడంతో ఓంరౌత్కు చిత్ర పరిశ్రమపై ఇష్టం పెరిగింది. ఇందుకోసం ఉన్నత విద్య పూర్తయిన తర్వాత న్యూయార్క్లోని ప్రముఖ యూనివర్సీటీలో సినిమాలకు సంబంధించిన కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రైటర్గా, డెరెక్టర్గా ఎమ్టీవీ నెట్వర్క్లో కొన్నాళ్ల పాటు పని చేశాడు. ‘సిటీ ఆఫ్ గోల్డ్’, హాంటెడ్-3డీ’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. మరాఠీ చిత్రం లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్ (2015)తో దర్శకుడిగా మారాడు. తొలి సినిమానే దర్శకుడిగా ఓంరౌత్కు ఫిల్మ్ఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఓంరౌత్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘తాన్హాజీ’(2020). పిరియాడికల్ యాక్షన్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓంరౌత్కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక మూడో చిత్రమే పాన్ ఇండియాస్టార్ ప్రభాస్తో ప్లాన్ చేశాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఓంరౌత్కు ఎలాంటి అవార్డులను తెచ్చిపెడుతుందో చూడాలి. (చదవండి: ఆ ప్లేస్లో ప్రభాస్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్) -
ఆ ప్లేస్లో ప్రభాస్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. (ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ భామ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో ప్రభాస్తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి ప్రభాస్తో కలిసి పనిచేయడం ఎలా ఉందని కృతి సనన్ను ప్రశ్నించగా వాటికి సమాధానమిచ్చింది ముద్దుగుమ్మ. కృతి మాట్లాడుతూ.. 'ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారిని గౌరవిస్తారు. మొదట్లో అతను సిగ్గుపడేవాడు. నేను తొలిసారి నటించిన తెలుగు సినిమా గురించి మాట్లాడటం ప్రారంభించా. మనకు రాని భాషలో నటించడం చాలా కష్టమని నాకు తెలియదు అని చెప్పా. ఆ తర్వాతే ప్రభాస్ నాతో మాట్లాడారు. నేను మామూలుగానే మాట్లాడేదాన్ని. కానీ ప్రభాస్ చాలా ఒపెన్గా ఉండేవారు. ఆయన చాలా సైలెంట్గా తన పని చేసుకోపోయేవారు. ప్రభాస్ కళ్లతోనే తన భావాలను వ్యక్తం చేస్తాడు. ఆదిపురుష్లో రాఘవగా ప్రభాస్ను తప్ప మరొకరిని ఊహించుకోలేను.' అని అన్నారు. గత కొంతకాలంగా కృతి, ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. - ఐవీవీ సుబ్బరాజు (ఇది చదవండి : షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) -
కృతి సీతలా ఫీలవలేదు, వాళ్లంతా ఈ సినిమానే మర్చిపోతారు: నటి
మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేస్తున్న ఆదిపురుష్ సినిమా మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ ఓం రౌత్ అక్కడి నుంచి వెళ్లిపోతున్న హీరోయిన్ కృతీ సనన్ను హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టి సాగనంపాడు. ఆలయ ప్రాంగణంలో అనుచితంగా ప్రవర్తించిన వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వారు సినిమాతో కనెక్ట్ కాలేరు తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి దీపిక చిఖిల స్పందించింది. 'ఈ జనరేషన్లో ఉన్న నటీనటులతో ఇదే పెద్ద సమస్య. వాళ్లకు ఎలాంటి పాత్రను పోషించాము, అందులో ఎంత లీనమైపోవాలన్నది తెలియదు. కనీసం ఆ పాత్ర ఎమోషన్స్ను కూడా పట్టుకోలేరు. అలాంటివారికి రామాయణం అంటే కేవలం ఒక సినిమా మాత్రమే! ఆధ్యాత్మికంగా ఆ సినిమాతో వారు కనెక్ట్ కాలేరు. కృతీ సనన్ కూడా ఈ జనరేషన్ హీరోయినే కదా! సీత పాత్రలో తరించిపోయా హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం మంచి సాంప్రదాయం అని ఈ తరం వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ సినిమా చేసినప్పటికీ ఆమె తనకు తాను సీతగా భావించలేదు. నేను కూడా గతంలో సీత పాత్ర చేశాను. కానీ అందులో జీవించి తరించిపోయాను. ఇప్పటి తరం వాళ్లు కేవలం వాటిని ఒక పాత్రలాగే చూస్తున్నారు. సినిమా అయిపోయాక దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు, తన రోల్ అయిపోయిందని ఫీలవుతారు. మా కాలికి నమస్కరించేవాళ్లు కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. సెట్లో కనీసం మా పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు. అలాంటి దేవుళ్ల పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా కాలికి నమస్కరించేవారు. మమ్మల్ని నటులుగా కాకుండా నిజమైన దేవుళ్లలాగే భావించేవారు. హగ్గులకు, ముద్దులకు ఆస్కారమే ఉండేది కాదు. ఆదిపురుష్ రిలీజవగానే ఇందులో పని చేసినవాళ్లంతా ఈ సినిమాను మర్చిపోయి మరో ప్రాజెక్ట్లో బిజీ అవుతారు. కానీ మా కాలంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉండేది. అలాంటి పనులు చేయలేదు పైనున్న భగవంతులే ఈ లోకంలోకి వచ్చారన్నంతగా మమ్మల్ని భక్తిపారవశ్యంతో చూసేవారు. అందుకే ప్రజల మనసులు నొప్పించే పనులను మేమెప్పుడూ చేసేవాళ్లమే కాదు' అని చెప్పుకొచ్చింది దీపిక. కాగా ఆమె రామానంద్ సాగర్ డైరెక్ట్ చేసిన రామాయణ్ సీరియల్లో సీతగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా నటించాడు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే! -
ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మూవీకి సంబంధించిన పదివేల టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!) 'శ్రీరాముని ప్రతి అధ్యాయం గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మన నడవాలి. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా అందిస్తాం. టికెట్ల కోసం గూగుల్ ఫాం నింపితే చాలు. టికెట్స్ నేరుగా పంపిస్తాం. ' అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. (ఇది చదవండి: ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!) #Adipurush: 10,000+ tickets would be given to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by TKF & Karthikeya2 Producer Abhishek Agarwal! Fill the Google form with your details to avail the tickets.https://t.co/1cGGJZ5xcf pic.twitter.com/SWWomcahZ9 — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 7, 2023 10,000+ tickets would be given to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free by TKF & Karthikeya2 Producer Abhishek Agarwal! Fill the Google form with your details to avail the tickets. https://t.co/qUQdLJiPi4#Prabhas #Adipurush pic.twitter.com/xpyf2aVHLS — Prabhas RULES (@PrabhasRules) June 7, 2023 -
తిరుమలలో హీరోయిన్కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్
ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉండగా ఇందులో ఆదిపురుష్ మొదట రిలీజ్ కానుంది. జూన్ 16న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్తో బిజీ అయిన చిత్రయూనిట్ మంగళవారం(జూన్ 6) గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టింది. ఇకపోతే ఇప్పటికే ప్రభాస్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నాడు. తాజాగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ మరికొందరు టీమ్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత కృతి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్ ఆమెకు ముద్దు పెట్టి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఆదిపురుష్ ఈవెంట్లో మెరిసిన కృతీ సనన్.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పిన హీరో.. అమ్మాయిలంటే చులకనా? -
తిరుపతిలో అట్టహాసంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆదిపురుష్ మా అదృష్టం : ప్రభాస్
‘ఏడు నెలల క్రితం ‘ఆదిపురుష్’ ట్రైలర్ను నా ఫ్యాన్స్ కోసం త్రీడీలో చూపించమని, వారి రెస్పాన్స్ చూడమని ఓం రౌత్తో చెప్పాను. ఫ్యాన్స్ చూపిన ధైర్యం, ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. నిజానికి ‘ఆదిపురుష్’ను సినిమా అనకూడదు. ఇది రామాయణం. ఈ సినిమా చేయడం మా అదృష్టం’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, జానకిగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవ దత్తా, లంకేశ్వరుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ వంశీ, ప్రమోద్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. (చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) ఈ సందర్భంగా మంగళవారం తిరుపతిలో జరిగిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘ఓ సందర్భంలో ‘రామాయణం’ చేస్తున్నావా? అని చిరంజీవిగారు అడిగారు. అవును.. సార్ అన్నాను.. ‘అది నిజంగా అదృష్టం. అందరికీ దొరకదు. నీకు దొరికింది’ అన్నారు. ‘ఆదిపురుష్’ వేడుకకు వచ్చిన చినజీయర్స్వామిగారికి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిగారికి, తిరుపతి పోలీసులకు థ్యాంక్స్. స్టేజ్ మీద తక్కువగా మాట్లాడి, ఎక్కువగా సినిమాలు చేస్తాను. ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తాను’’ అన్నారు. పెళ్లి గురించి అభిమానులు అడగ్గా. ‘‘పెళ్లా.. ఎప్పుడైనా..తిరుపతిలోనే చేసుకుంటాలే...’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు ప్రభాస్. త్రిదండి చినజీయర్ స్వామీజీ మాట్లాడుతూ– ‘‘రామాయణంలో ఉండే అరణ్యకాండ, యుద్ధకాండలో ఉన్న ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం ఉండదు. రాముడి పాత్రలో సమాజానికి మళ్లీ ఓ కొత్త ఆధ్యాత్మిక చైతన్య తరంగాన్ని అందిస్తున్న ప్రభాస్గారికి, సీతగా చేసిన కృతీ సనన్, దర్శకుడు ఓం రౌత్ అండ్ టీమ్కు, ముఖ్యంగా ‘జై శ్రీరామ్’ మంత్రాన్ని పాడిన అజయ్, అతుల్కు బ్లెస్సింగ్స్. జై శ్రీరామ్’’ అన్నారు. మరో ముఖ్య అతిథి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ – ‘‘రామాయణంలో కొన్ని ప్రధాన ఘట్టాలను తీసుకుని ‘ఆదిపురుష్’ సినిమా నిర్మించడం జరిగింది. మన భారతదేశ చిత్రపరిశ్రమకు ఇంకా గొప్ప పేరు తీసుకువచ్చే విధంగా ఈ సినిమాని చిత్రీకరించారు. హాలీవుడ్లో ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి భారీ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చాయి. ఆ స్థాయిలో గతంలో ప్రభాస్ నటించిన ‘బాహుమలి’ మన తెలుగు పరిశ్రమకే కాకుండా భారత చిత్రపరిశ్రమకే ఎంతో కీర్తి తెచ్చింది. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ కూడా భారీ గ్రాఫిక్స్తో అదే స్థాయిలో రూపొందింది. మన భారతదేశ చరిత్రకు రామాయణం, మహాభారతం.. ఈ రెండూ గొప్ప ఇతిహాసాలు. అటువంటి రామాయణంలోని కొన్ని ఘట్టాలను తీసుకుని ఆధునిక టెక్నాలజీతో ఈ ‘ఆదిపురుష్’ని చేయడం అనేది గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా యువతీ యువకులకు ఆదర్శంగా ఉండేలా, వారికి కళ్లకు కట్టేలా ఇలాంటి గొప్ప సినిమా నిర్మించినందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఓం రౌత్ మాట్లాడుతూ– ‘‘తన తండ్రి కోసం భూషణ్కుమార్ ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు. తనకు మాత్రమే కాదు.. నాక్కూడా ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఇక డార్లింగ్ (ప్రభాస్) లేకపోతే ఈ సినిమా చేయడం నాకు సాధ్యం అయ్యేది కాదు. ‘ఆదిపురుష్’ చేశామంటే అది మన డార్లింగ్ వల్లే. ‘ఆదిపురుష్’ నా సినిమానో, మీ సినిమానో, డార్లింగ్ సినిమానో కాదు.. ఇది భారతీయ సినిమా. రామాయణం కథ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి హనుమంతులు వస్తారని మా అమ్మగారు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ థియేటర్లో అయినా ‘ఆదిపురుష్’ షో ప్రదర్శితమవుతుంటే అక్కడ ఓ సీటును ఖాళీగా ఉంచాలని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ను కోరుతున్నాను. ఎందుకంటే హనుమాన్ వచ్చి చూస్తారు (భావోద్వేగంతో..). ఆశీర్వదిస్తారు’’ అన్నారు. భూషణ్కుమార్ మాట్లాడుతూ – ‘‘రాముడి సినిమా చేయాలనే మా నాన్న గుల్షన్కుమార్గారి కల ఓం రౌత్గారితో నెరవేరింది. రామాయణాన్ని నిర్మించినందుకు మా నాన్న గర్వపడతారు. ఈ సినిమాని ఓం చూపించిన విధానం అద్భుతం. ఇవాళ ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది సినిమా కాదు.. ఒక ఎమోషన్. మా నాన్నగారే నాకు రాముడు’’ అన్నారు. -
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) కాగా.. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తాజాగా తిరుపతిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫైనల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!) -
‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన నటిస్తున్న మైథలాజికల్ డ్రామా చిత్రం ‘ఆదిపురుష్’ . రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుక ఫుల్ వీడియోని ఇక్కడ వీక్షించండి. -
ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది) ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తాజాగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. జూన్ 6న జరుగుతున్న ఈవెంట్కు మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. తిరుపతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ కావడంతో చిత్రబృందం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. కేవలం క్రాకర్స్ కోసమే ఆదిపురుష్ నిర్మాతలు రూ.50 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ పాల్గొననుండడంతో అభిమానులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఈవెంట్ కోసం చిత్రబృందం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) స్టేడియంలో ఈ వేడుక జరుగుతోంది. అయితే ఈవెంట్ ఖర్చు విషయంపై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ థియేటర్లో అక్కడ ఎవరూ కూర్చోకండి) -
అనుకున్నది సాధించిన ఓం రౌత్ ప్రభాస్ ఫుల్ హ్యాపీ..!
-
కళ్ళు చెదిరే రీతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 150కి పైగా కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి విక్రయించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ చిత్రం నాన్-థియేట్రికల్ వసూళ్ల పరంగా కొత్త బెంచ్మార్క్ను సృష్టిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. (ఇది చదవండి: పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి షాకింగ్ నిర్ణయం!) -
ఆదిపురుష్.. నెవర్ బిఫోర్ ఫీట్
ఆదిపురుష్ టీమ్ మరోసారి చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే సెట్ అయిన బెంచ్ మార్క్ ను మరోమెట్టు పైకి తీసుకువెళ్లేలా.. మూవీ టీమ్ రెండో పాటను విడుదల చేయబోతోంది. ఈ తరహాలో ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమా పాటా విడుదల కాలేదు. "రామ్ సియా రామ్" అంటూ సాగే ఈ గీతాన్ని ఈ నెల 29న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) ఈ గీతాన్ని సంగీత ద్వయం సచేత్ - పరంపర స్వరపరచడంతో పాటు వారే పాడారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక సెన్సేషనల్ గా ఉండబోతోన్న ఈ పాట ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. సినిమాలకు సంబంధించి దేశ చరిత్రలోనే ఇదో సంచలనం కాబోతోంది. ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది -
ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా జై శ్రీరామ్ అనే సాంగ్ను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) 'ఎవరు ఎదురు రాగలరు మీ దారికి.. ఎవరుకుంది ఆ అధికారం.. పర్వతా పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి' అంటూ పాట ప్రారంభంలో ప్రభాస్ చెప్పే డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ అంటూ సాగే ఈ పాటకు అజయ్ - అతుల్ ద్వయం స్వరాలు సమకూర్చగా.. ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. రావణుడితో యుద్ధానికి సన్నద్ధయ్యే సందర్భంలో ఈ సాంగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆదిపురుష్ టీమ్ కి మరో స్వీట్ న్యూస్ అందనుందా..
-
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
-
దిమ్మ తిరిగే రేంజులో రికార్డులు బద్ధలు కొడుతున్న ఆదిపురుష్
రామాయణ కథ అందరికీ తెలుసు.. దీనిపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి, విజయం సాధించాయి. తాజాగా మరోసారి రామాయణ కథను కళ్లకు కట్టినట్లు చూపించడానికి వస్తోంది ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం(మే 9న) రిలీజైంది. తాజాగా ఈ ట్రైలర్ రికార్డులు బద్ధలు కొడుతూ కోట్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతోంది. 'తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే 70 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అన్ని భాషల్లోనూ కేవలం పది నిమిషాల్లో లక్ష వ్యూస్ వచ్చిపడ్డాయి. హిందీలో 5 నిమిషాల్లో, తెలుగులో 9 నిమిషాల్లో లక్ష లైక్స్ సాధించింది' అని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు ఓం రౌత్. కాగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలుపుకుని 55 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. తాజాగా ఆదిపురుష్ ఆ రికార్డును భూస్థాపితం చేసింది. గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. #AdipurushTrailer breaking records all over! 🏹🔥 Trailer out now: https://t.co/hax5G3AXlO Jai Shri Ram 🙏 #Adipurush #Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @manojmuntashir pic.twitter.com/Pn8Ctq2qWH — Om Raut (@omraut) May 10, 2023 చదవండి: మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. ఈ లొల్లేందన్న రాహుల్ -
ఆదిపురుష్ ట్రైలర్ సంచలనం 1000 కోట్లు పక్కా..!
-
ఒక్కోక్కడికి ఇచ్చి పడేసారు వామ్మో మామూలుగా రెచ్చిపోలేదుగా
-
థియేటర్ లో ఆదిపురుష్ ట్రైలర్ చూసి రచ్చ రచ్చ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
-
ఆదిపురుష్.. టీజర్కి, ట్రైలర్కి తేడా ఏంటి?
ఆదిపురుష్...ఈ సినిమా టీజర్ ఏకంగా ఏడు నెలల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ పాటికి ఆదిపురుష్ రిలీజ్ అయ్యి, థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీకి కూడా వచ్చి ఉండాలి. కానీ ఆ ట్రైలర్ క్వాలిటీ, దాని పై నడిచిన రచ్చతో సినిమా టీమ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రభాస్ చెప్పినా కూడా ఫ్యాన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మరి అప్పటి టీజర్ కి,ఇప్పటి ట్రైలర్ కి తేడా ఏంటి?...ఈ ఏడునెలల గ్యాప్ లో ఏం మ్యాజిక్ జరిగింది? (చదవండి: ఆదిపురుష్' ట్రైలర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్) నిజానికి ఈ సినిమా మోషన్ కాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కింది అనేది అప్పుడు బాగా వినిపించిన టాక్. కనిపించిన విజువల్స్ కూడా అదే మాట చెప్పాయి. అయితే సినిమా వాయిదా పడిన తరువాత ఓం రౌత్ మళ్ళీ చాలా రీ వర్క్ చేశాడు. చాలా చోట్ల ప్రభాస్ క్లోజ్ లు షూట్ చేసి ఇన్సర్ట్ చేశారు. ఎక్కడయితే కార్టూన్ అని కామెంట్స్ వచ్చాయో ఆ చోట్ల వీఎఫ్ఎక్స్ రీ వర్క్ చేయించారు. ఆర్ఆర్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అయితే పనిలో పనిగా వీఎఫ్ఎక్స్ రిపెయిర్ టైం లోనే ఆర్ఆర్ కూడా మళ్ళీ చేయించారని టాక్. దీనంతటి కోసం మరో 100 కోట్లు ఖర్చు చేశారు అని తెలుస్తుంది. (చదవండి: మహిళా అభిమాని దురుసుతనం.. స్టార్ సింగర్కు గాయం! ) అలాగే ట్రైలర్ లో టీజర్ లో కనిపించినట్టుగా లెంగ్తీ షాట్స్ లేకుండా కట్ చేశారు. ఏదయితేనేం మొత్తానికి ఆది పురుష్ సినిమాకి టీజర్ తెచ్చిన డార్క్ స్పాట్ ని ట్రైలర్ తో క్లియర్ చేశారు. సరయిన స్టార్ వేల్యూ ఉన్నసినిమా రాక వెలవెల బోతున్న బాక్స్ ఆఫీస్ కి ఆదిపురుష్ గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చుకోబోతుంది. ఈ ట్రైలర్ చూశాక సినిమాని ప్రీ పోన్ చెయ్యమని డిమాండ్స్ వినిపించడం విశేషం. -
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆదిపురుష్
-
మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేస్తోంది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతిసనన్ సీతలా కనిపించనుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ రాగా, ఇటీవలె జూన్16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం..ఇందులో భాగంగా ట్రైలర్ అప్డేట్ అందించారు. ఈ సినిమా ట్రైలర్ను మే9న గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ట్రైలర్ని ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్లో లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్లోబల్ ఈవెంట్గా ట్రైలర్ లాంచ్ను గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. Jai Shri Ram जय श्री राम జై శ్రీరాం ஜெய் ஸ்ரீ ராம் ಜೈಶ್ರೀರಾಂ ജയ് ശ്രീറാം Trailer releasing on 9th May 2023#Adipurush #Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @manojmuntashir pic.twitter.com/WxkpGGrg6P — Om Raut (@omraut) May 6, 2023 -
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..105 థియేటర్స్లో ‘ఆదిపురుష్’ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేశాయి. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి జానకి పాత్రలో ఉన్న కృతి సనన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రబృందం. (ఇది చదవండి: ఆదిపురుష్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!) 105 థియేటర్లలో ట్రైలర్ ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈనెల 9న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 3డీ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏపీ, తెలంగాణలో 105 థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. మరోసారి వాయిదా! అయితే ఈసారి కూడా ఆదిపురుష్ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిపురుష్ విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని మేకర్స్ తెలిపారు. త్వరలో ప్రమోషన్లు ప్రారంభమవుతాయని చిత్రబృందం వెల్లడించారు. మే 9 సాయంత్రం 5.30 గంటలకు ట్రైలర్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్.. జానకి పోస్టర్ రిలీజ్.. పాపిట సింధూరంతో..) కాగా.. గతంలో టీజర్పై వివాదం తలెత్తడంతో కొన్ని రోజులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్లో మరిన్ని మార్పులు చేసేందుకు చిత్రబృందం మూవీ విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈసారి కూడా వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల కానుంది. #AdipurushTrailer Coming On 9th May!! It will be screened in 105 theaters in AP/TG. #Prabhas #Adipurush pic.twitter.com/6ARid6Vpio — Prabhas (@PrabhasRaju) May 4, 2023 -
అమరం.. అఖిలం.. సీతారాముల ప్రియనామం
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. శనివారం ‘సీతా నవమి’ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రామ్ సియా రామ్’ ఆడియో టీజర్ను విడుదల చేశారు. ఈ గీతాన్ని సచేత్ పరంపర స్వరపరిచారు. కాగా ఈ పాటలోని కృతీ సనన్ లుక్ని విడుదల చేశారు. ‘‘అమరం, అఖిలం, ఈ నామం.. సీతారాముల ప్రియ నామం’ అంటూ చిత్రదర్శకుడు ఓం రౌత్ ఈ పాటను ఉద్దేశించి ట్వీట్ చేశారు. భూషణ్కుమార్, క్రిషణ్కుమార్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, రాజేష్ నాయర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. -
ఒక్క పాటతో ఆదిపురుష్ లెక్కలు పూర్తిగా మాయం...డైరెక్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
-
ఆదిపురుష్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్. అక్షయ తృతీయ సందర్భంగా ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'మా బలమేదంటే మీ పై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే... మహిమాన్విత మంత్రం నీ నామమే.' అంటూ సాగింది. చివర్లో జై శ్రీరామ్ నామస్మరణతో హోరెత్తించింది. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మోషన్ పోస్టర్లను ప్రభాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మీరు ఛార్ ధామ్ దర్శించుకోలేదా.. అయితే జై శ్రీరామ్ నామాన్ని జపించండి చాలు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. గతంలో ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
మూడు రోజుల ముందే ఆదిపురుష్ ప్రివ్యూ..
-
ఆదిపురుష్లో భాగం కావడం అదృష్టం: ప్రభాస్
‘‘న్యూయార్క్లోని ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఆదిపురుష్’ చిత్రం వరల్డ్ ప్రీమియర్ను ప్రదర్శించనుండటం గర్వంగా ఉంది. మన దేశ నైతికతకు అద్దం పట్టే ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం’’ అన్నారు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా జూన్ 7 నుంచి 18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్లో భాగంగా జూన్ 13న ‘ఆదిపురుష్’ చిత్రం వరల్డ్ ప్రీమియర్ని (త్రీడీ) ప్రదర్శించనున్నారు. (చదవండి: అదిరిపోయేలా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్.. 1000 మంది ఫైటర్స్తో యాక్షన్ సీక్వెన్స్) ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మన భారతీయ చిత్రాలను ఇతర దేశాల్లో చూడటం, ముఖ్యంగా ‘ఆదిపురుష్’ ప్రపంచ స్థాయికి చేరుకోవడం ఒక నటుడిగానే కాకుండా భారతీయుడిగా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఆదిపురుష్’ సినిమా కాదు.. భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథ. మన సంస్కృతిలో బాగా పాతుకుపోయిన కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతుండటం హ్యాపీ’’ అన్నారు ఓం రౌత్. ‘‘భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మనందరికీ నిజంగా గర్వకారణం’’ అన్నారు నిర్మాత భూషణ్ కుమార్. కృతీ సనన్ , సైఫ్ అలీఖాన్ , సన్నీ సింగ్ నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ ప్రమోద్, వంశీ. -
Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’కు అరుదైన గౌరవం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ట్రిబెకా ఫెస్టివల్’లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓంరౌత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఈ ఫెస్టివల్లో ఆదిపురుష్ని ప్రదర్శించడం ఖచ్చితంగా గొప్ప విషయం అని, ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ‘సంతోషానికి మించిన విషయం ఇది. 2023 జూన్ 13న ‘ఆదిపురుష్’ న్యూయార్క్లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్లో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాని ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ఆదిపురుష్ టీమ్ సభ్యులందరికి కృతజ్ఞతలు. ఆ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’అని ఓం రౌత్ ట్వీట్ చేశాడు. జూన్ 7 నుంచి 18 వరకు ట్రిబెకా ఫెస్టివల్ వేడుకలు జరగనున్నాయి. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా పడింది. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. Beyond Excited and Honored! Adipurush, the epic saga of courage and devotion, is set to make its world premiere at the prestigious #TribecaFestival on the 13th of June in New York. pic.twitter.com/bUiKWR6H4b — Om Raut (@omraut) April 18, 2023 -
వివాదాల పురుష్... ఇప్పుడు మరో మరక
-
హనుమాన్ గుడి లో ఆదిపురుష్ డైరెక్టర్ ప్రత్యేక పూజలు
-
హైదరాబాద్లోని ఆలయంలో ఓం రౌత్ ప్రత్యేక పూజలు, ఫొటోలు వైరల్
ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ హైదరాబాద్లో సందడి చేశారు. గురువారం(ఏప్రిల్ 6న) హైదరాబాద్ కర్మన్ఘాట్లోని ప్రముఖ హానుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆదిపురుష్ టీం, పలువురు ప్రముఖులు ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఓం రౌత్ను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆలయానికి భారీగా తరలివచ్చారు. హైదరాబాద్లోని హనుమాన్ ఆలయంలో ఓంరౌత్ పూజలు చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి హనుమాన్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్-కృతిసనన్ జంటగా నటించిన ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్పై ట్రోల్ చేశారు. కార్టున్ బొమ్మలా ఉందని, సీతకు మెడలో తాళి, కాళ్లకు మెట్టలు లేవంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆది పురుష్ మూవీ మొదటి నుంచి ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ ఓం రౌత్పై ఫ్యాన్స్, నెటిజన్లతో పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో గత జనవరిలో విడుదల కావాల్సిన ఈ మూవీని జూన్కి వాయిదా వేశారు. జూన్ 16ను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Jai Shri Ram 🏹 Jai Shri Ram 🏹 #OmRaut visited Karmanghat Hanuman Temple, Hyderabad on the occasion of #HanumanJayanti to seek blessings for his upcoming movie Adipurush.#Adipurush releases globally IN THEATRES on June 16, 2023, In 3D.#Prabhas @omraut #SaifAliKhan… pic.twitter.com/VgRMsSNP6u — Vamsi Kaka (@vamsikaka) April 6, 2023 -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆది నుంచి వివాదాలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఆదిపురుష్ పేరేమో గానీ ఆది నుంచి వివాదాలే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై వివాదాలు ఇప్పుడే వీడేలా కనిపించడం లేదు. మొదట టీజర్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ ఆగ్రాహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ తాజా పోస్టర్ని డిజైన్ చేశారు మేకర్స్. తాజాగా ఈ పోస్టర్పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జానీ లేకుండా శ్రీరాముడిని వేషధారణలో చూపించినందుకు సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేశారు. చిక్కుల్లో ఆదిపురుష్ మార్చి 30న రామ నవమి సందర్భంగా రిలీజైన 'ఆదిపురుష్' పోస్టర్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మేకర్స్పై పోలీసులకు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. ముంబయికి చెందిన సంజయ్ దీనానాథ్ తివారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామాయణ సహజ స్ఫూర్తికి, స్వభావానికి భిన్నంగా శ్రీరాముడిని వేషధారణలో పోస్టర్లో చూపించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో సంజయ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన 'జానేవు' అనే పవిత్రమైన దారాన్ని రాముడు, లక్ష్మణ్ ధరించకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆది నుంచి వివాదాలు 'ఆదిపురుష్'ను మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గతంలో రిలీజైన టీజర్పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా.. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
సీత మెడలో తాళి, కాలికి మెట్టలు కూడా లేవు, ఏం చేస్తున్నార్రా మీరంతా!
ఊపిరి సినిమాలో కార్తీ.. నాగార్జున బర్త్డేకు అందరినీ పిలిచి కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేస్తాడు. నాగ్ కూడా వావ్.. సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోతుంటాడు. కానీ పక్కకు వెళ్లాక మాత్రం ప్రతి సంవత్సరం చేసేది ఇదే కదా! ఇందులో సర్ప్రైజ్ ఏముందని డీలా పడిపోతాడు. ఆదిపురుష్ టీమ్ కూడా అచ్చంగా ఇలాగే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు (మార్చి 30) శ్రీరామనవమి కావడంతో ఏదైనా ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని అంచనా వేశారు ప్రభాస్ అభిమానులు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఎప్పటిలాగే ఓ పోస్టర్తో సరిపెట్టింది చిత్రయూనిట్. ప్రతి ఇళ్లలో ఉండే శ్రీరాముడి ఫోటో ఎలా ఉంటుందో దాదాపు అలాగే ఉందీ పోస్టర్. ఇది చూసిన అభిమానులు సర్ప్రైజ్కు బదులు షాకవుతున్నారు. 'దేవుడి పోస్టర్ను దింపారు కదరా సామీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'నాకైతే ముఖాలను మార్ఫ్ చేశారనిపిస్తోంది, ఇక సినిమా ఎలా ఉంటుందో?', 'బడ్జెట్ బొక్క.. ఏమీ మారలేదు, పోస్టర్ డిజైన్ కూడా రాకపోతే పెద్ద పెద్ద సినిమాలు తీయడం ఎందుకో..', 'సీతమ్మ కాళ్లకు మెట్టలు లేవు, మెడలో మంగళసూత్రం లేదు, పాపిట్లో సింధూరం లేదు..', 'అసలు కృతి సీతలా కాదు కదా ఆమె చెలికత్తెలా కూడా లేదు', 'లక్ష్మణ, హనుమంతులకు గడ్డమా? మీకన్నా ఫ్యాన్ ఎడిట్స్ బాగున్నాయ్ కదరా..', 'ఇదంతా వర్కవుట్ అవ్వదు కానీ ఓటీటీలో రిలీజ్ చేయండి' అని ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16న విడుదల కానుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. Mantron se badhke tera naam Jai Shri Ram मंत्रों से बढ़के तेरा नाम जय श्री राम మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi pic.twitter.com/YjmncsvqwG — UV Creations (@UV_Creations) March 30, 2023 Nikante Fans editing better baga unnay kadha ra.. chala mistakes unnay intha time thisukoni em chesav asalu.. Better to release in OTT — PsPk Cult Harsha 🌟 (@Harshavamshi143) March 30, 2023 Lord Sri Rama with a moustache. Lord Lakshmana with a beard. Which scriptures is this description taken from? — Ovo (@VanKhomain) March 30, 2023 Ramudu look lo Namam edho teda ga undi! Zoom chesthe pixellation. Entra 500cr tho meeru chesthundi. — #SSMB28--- MaSS Avatar ! 🔥🔥🔥 (@sreekirx) March 30, 2023 -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. డైరెక్టర్పై ఫ్యాన్స్ ఆగ్రహం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. కానీ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆదిపురుష్ రిలీజ్కు ముందు అప్ డేట్స్ ఇస్తే ఫ్యాన్స్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి దాదాపు ఏడాదికి పూర్తవుతున్న అప్ డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఉగాదికి కూడా ఆదిపురుష్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. పలువురు అగ్రహీరోల సినిమాల నుంచి అప్ డేట్స్ వచ్చినా కూడా ఆదిపురుష్ వెనకపడిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. రామాయణం ఇతిహాసం కావడంతో ఈనెల 30న శ్రీరామనవమి సందర్భంగానైనా అప్డేట్ ఇస్తారా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ విషయంలో డైరెక్టర్ ఓం రౌత్ సీరియస్గా లేరని మరికొందరు ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరి అభిమానులను దృష్టిలో ఉంచుకొని త్వరలో ఏమైనా అప్ డేట్ ఇస్తారా? లేక ఎప్పటిలాగే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతారా అన్నది వేచి చూడాల్సిందే. -
ఆ సిరీస్ చూడలేకపోయా.. కానీ ఇప్పుడు గర్వంగా ఉంది: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది భామ. ఆ తర్వాత ప్రభాస్ సరసన మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్లో నటిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా పౌరాణిక ఇతిహాసం ఆదిపురుష్లో సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆదిపురుష్ చిత్రబృందంతో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని.. ప్రేక్షకులు తనను వారితో సమానంగా గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఇక ఈ సినిమాలో సీత పాత్ర తనకెంతో నచ్చిందని కృతి సనన్ పేర్కొంది. తన చిన్నతనంలో రామానంద్ సాగర్ సూపర్ హిట్గా నిలిచిన దూరదర్శన్ సిరీస్ 'రామాయణ్'ని చూడలేకపోయానని తెలిపింది. అయితే ఈ చిత్రం యువతరానికి నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక విజువల్ వండర్గా అలరిస్తుందని ఆమె పేర్కొంది. కృతి సనన్ మాట్లాడుతూ..' ఆదిపురుష్ లాంటి సినిమా చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి సినిమాలతో పిల్లలకు విజ్ఞానం పెరుగుతుంది. విజువల్ మెమరీ అన్నిటికంటే బలంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఇలాంటి ఇతిహాసాన్ని పిల్లలకు తెలియజేయడానికి ఉత్తమ మార్గం. వారి మనస్సులో రామాయణాన్ని ముద్రించటం చాలా ముఖ్యం.' అని అన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఊహించని రీతిలో అభిమానులు నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
ఆ ముగ్గురిలో ప్రభాస్నే పెళ్లాడతా.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్లో మొదటిసారి ప్రభాస్తో నటిస్తోంది భామ. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్తో నటించడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిది ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్ నటి కావడంతోనే కృతిసనన్ బాగా ఫేమస్ అయింది. (చదవండి: ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్) దీంతో ఆమె గతంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో ముద్దుగుమ్మ షాక్కు గురైంది. అవకాశం వస్తే ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్.. ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్ కూడా' అంటూ దిమ్మతిరిగే ప్రశ్న అడిగారు. దీనికి కృతి సమాధానమిస్తూ.. 'కార్తిక్ ఆర్యన్ను ఫ్లర్ట్, టైగర్తో డేటింగ్. ఇక ప్రభాస్తో పెళ్లి' అని నవ్వుతూ సమాధానమిచ్చింది ఆదిపురుష్ భామ. ప్రస్తుతం ఆమె భేదియా(తోడేలు) ప్రమోషన్స్లోనూ ప్రభాస్ గురించి కృతిసనన్ మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ చేయనున్నారు. If ever get a chance I will marry #Prabhas. -@kritisanon ❤ Ok ika fix aipondi North Vadina ani 🥳🥳🥰 #Prakrithi pic.twitter.com/Q67ppL7WIy — Dps Nayak™ 💔 (@NayakTweetz) November 25, 2022 -
ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్
పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ టీజర్ను పలువురు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావించినా కొన్ని కారణాలతో జూన్కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. (చదవండి: మహేశ్ బాబు పాటకు కృతీసనన్ డ్యాన్స్.. వీడియో వైరల్) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ కృతిసనన్ స్పందించింది. సినిమా ఆలస్యానికి గల అసలు కారణాన్ని వివరించింది భామ. ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి భేడియా మూవీ ప్రమోషన్లలో కృతి సనన్ బిజీగా ఉంది. ఇటీవలే ఓ ఈవెంట్లో ఆదిపురుష్ విడుదల ఆలస్యానికి గల కారణాలపై ఆమెను ప్రశ్నించారు. దీనికి నటి బదులిస్తూ.. 'ఆదిపురుష్ చిత్రబృందం పట్ల చాలా గర్వంగా ఉంది. ఇది చాలా గొప్ప చిత్రం. ఇది మనమందరం గర్వించదగ్గ కథ. మన చరిత్రలో భాగం. ఈ సినిమాను సాధ్యమైనంత ఉత్తమంగా చేయాలి. దీనిపై ఇప్పటికే ఓం రౌత్ నోట్లో వివరించారు.' అంటూ వివరించింది. కాగా..కార్తిక్ ఆర్యన్తో కలిసి షెహజాదాలో కృతి సనన్ కనిపించనుంది. టబు, కరీనా కపూర్లతో కలిసి ది క్రూలో సనన్ కూడా నటిస్తోంది. గతంలో ఈ సినిమా టీజర్ చూసిన అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు.రామాయణం లాంటి అద్భుతమైన మహాకావ్యం ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో రాముడుతో సహా ఇతరుల పాత్రలను వక్రీకరించారంటూ విమర్శించారు. -
ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇటీవల వివాదాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది. మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం గతంలో అధికారిక ప్రకటన ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేసి ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అందించారు మేకర్స్. చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ విషయాన్ని డైరెక్టర్ ఓంరౌత్ తెలియజేస్తూ సోమవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆదిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 16న ‘ఆదిపురుష్’ను విడుదల చేయనున్నాం. భారతదేశం గర్వించే సినిమాగా దీన్ని మీ ముందుకు తీసుకురావాలని మేం నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి’’ అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం కానుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. जय श्री राम…#Adipurush releases IN THEATRES on June 16, 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @RETROPHILES1 @UV_Creations @Offladipurush pic.twitter.com/kXNnjlEsib — Om Raut (@omraut) November 7, 2022