Prashanth Varma
-
ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 'ఛావా' విలన్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం 'జై హనుమాన్' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే దీని షూటింగ్ మొదలవొచ్చు. దీనితోపాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)అయితే మహాకాళి సినిమాని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు అనే మహిళా దర్శకురాలు స్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి 'ఛావా' విలన్ పాత్రధారి అక్షయ్ ఖన్నా వచ్చి చేరాడు. మన దేశంలో వస్తున్న తొలి లేడీ సూపర్ హీరో మూవీ ఇది అని అంటున్నారు. ఇందులోనూ అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలోనే కనిపిస్తారా? మరేదైనా కీలక పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో హీరోగా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో చాన్నాళ్లు నటించలేదు. ఛావా మూవీలో ఔరంగజేబుగా అదరగొట్టేయడంతో ఇప్పుడు వరస అవకాశాలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?) -
ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?
ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులు చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేస్తాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2.. ఇలా చాలానే ఉన్నాయి.ఇవి సరిపోవంటూ ఈ మధ్యే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ సినిమా ఒకటి ఓకే అయింది. దీని లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని టాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. 'బక' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు)టైటిల్ చూడగానే మీకు కూడా విచిత్రంగా ధ్వనించి ఉంటుంది. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడుగా. అతడి కథనే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ప్రశాంత్ వర్మ రాశాడని, అందుకే సింపుల్ గా 'బక' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ చిత్రమని అంటున్నారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని టాక్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ప్రభాస్ 'బ్రహ్మరాక్షస్'లో ట్రెండింగ్ హీరోయిన్?
సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్లని పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ బ్యూటీకి మాత్రం వరస అవకాశాలొస్తున్నాయి. చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులుండగా.. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ?గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే. బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా సరే దుల్కర్ సల్మాన్ 'కాంత', విజయ్ దేవరకొండ 'కింగడమ్', రామ్ కొత్త మూవీలో ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)పై మూడు కాకుండా సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్సయ్యారట. ఇలా చేతినిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారట.రీసెంట్ గా ప్రశాంత్ వర్మ-ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఇందులోనే హీరోయిన్ గా భాగ్యశ్రీని పరిశీలించారట. అందులో భాగంగానే శుక్రవారం లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిందట. దాదాపు ఓకే అని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం భాగ్యశ్రీ.. లక్ తోక తొక్కేసినట్లే.(ఇదీ చదవండి: మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!) -
Prashanth Varma: త్వరలో ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ సినిమా!
-
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
నెగటివ్ షేడ్స్లో ప్రభాస్.. ప్రశాంత్ వర్మ భారీ ప్లాన్!
ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేయాల్సిన ‘స్పిరిట్’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. (చదవండి: ఆ కారణంతో దిల్ రాజు సినిమాను రిజెక్ట్ చేశా: దుల్కర్ సల్మాన్)అయితే ప్రభాస్ తర్వాతి చిత్రాలపై ఫిల్మ్నగర్లో కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాను ప్రభాస్ చేస్తారని, అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఓ కొత్త చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన రాజ్కుమార్ హిరాణీ కూడా ప్రభాస్తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్.(చదవండి: ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం) మరి... ‘రాజాసాబ్, ఫౌజి, స్పిరిట్’ చిత్రాల తర్వాత ప్రభాస్ తర్వాతి చిత్రం ఎవరి డైరెక్షన్లో ఉంటుంది? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బ్రహ్మరాక్షస’ సినిమాలో ప్రభాస్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఇక ఈ సినిమాను రణ్వీర్ సింగ్తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కొన్ని కారణాల వల్ల ప్లాన్ మార్చి, ప్రభాస్తో చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. -
ప్రభాస్తో ప్రశాంత్ వర్మ సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా?
హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్తో సినిమా రానుందని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని, ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఈ చిత్రం భాగం కావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. (చదవండి: జపాన్లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా)అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ పేరిట మహాకాళి, అధీరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ డేట్స్ కూడా కొన్నాళ్ల పాటు దొరకడం కష్టమే. (చదవండి: డ్యాన్స్ మాస్టర్తో పాటు అతడి భార్యపైనా కేసు)ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ఇవ్వన్ని పూర్తవ్వాలంటే కనీసం మూడున్నరేళ్లయినా పడుతుంది. ఆ తర్వాత కానీ ప్రభాస్ డేట్స్ ఖాలీగా ఉండవు. ఒకవేళ ప్రశాంత్ వర్మతో సినిమా ఉన్నా..ఇప్పట్లో అయితే ప్రారంభం అయ్యే చాన్స్ లేదు. మరి... ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా రూమర్గానే మిగిలిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
జై హనుమాన్లో ‘కాంతార’ హీరో!
‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. (చదవండి: నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్)చిరంజీవి, రామ్చరణ్ వంటి స్టార్స్ను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ హీరో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. మరి... ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించనున్నారనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
మోక్షజ్ఞ ఎంట్రీ షురూ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎం తేజస్వినీ నందమూరి సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు (సెప్టెంబర్ 6) సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాపై, నా కథపై బాలకృష్ణగారు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మన ఇతిహాసాల నుండి పొందిన స్ఫూర్తితో ఈ కథ ఉంటుంది’’ అన్నారు. ‘‘మోక్షజ అరంగేట్రానికి సరి΄ోయే కథను ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారు. ఇప్పటికే నటన, ఫైట్స్, డ్యాన్స్లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకున్నారు’’ అని సుధాకర్ చెరుకూరి అన్నారు. -
హనుమాన్ సీక్వెల్ కి కోలీవుడ్ స్టార్..
-
మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఇతనేనా!
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయన డెబ్యూ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఇస్తాడని ఓ సినిమా వేడుకలో బాలయ్య చెప్పాడు. దీంతో ఈ నందమూరి హీరోని వెండితెరకు పరిచయం చేసే డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు యువ దర్శకులు మోక్షజ్ఞ కోసం కథలు సిద్ధం చేశారట. కొంతమంది అయితే బాలయ్యకు కథలు కూడా వినిపించి.. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. కానీ బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను ‘హను-మాన్’ ఫేం ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. మోక్షజ్ఞ బర్త్డే(సెప్టెంబర్ 6, 2024) నాడు సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. తన పాత్ర కోసం మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడట. గతంలో కొంచెం బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ..ఇటీవల బాగా సన్నబడ్డారు. స్టైలిక్ లుక్తో ఫోటో షూట్ నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు. మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించబోన్నారని సమాచారం. -
ప్రశాంత్ - రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!
-
గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి: తేజ సజ్జ
‘‘సత్యం’ థియేటర్లో వందరోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్లో మా ‘హను–మాన్’ వంద రోజుల పండగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 25 కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ‘హను–మాన్’ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్రెడ్డిగారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి’’ అన్నారు. ‘‘ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి’ వంటివి.. నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. అయితే ఇప్పుడు సినిమా అంటే ఓ వీకెండ్ అయిపోయింది. ఇలాంటి తరంలో వందో రోజు కూడా థియేటర్స్కు వచ్చి ఆడియన్స్ మా సినిమా చూస్తున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో రాబోయే సినిమాల్లో అన్ని పరిశ్రమల నుంచి పెద్ద నటీనటులు కనిపిస్తారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ.‘‘నా కాలేజీ రోజుల్లో సినిమాల వంద రోజుల ఫంక్షన్స్ చూసేవాడిని. అలాంటిది నేను నిర్మించిన సినిమా వంద రోజులు జరుపుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘హను–మాన్’ వంద రోజుల వేడుక చేసుకోవడం హ్యాపీగా ఉంది’’అన్నారు చైతన్య. ఐమాక్స్ త్రీడీలో జై హనుమాన్... ‘హను–మాన్’కు సీక్వెల్గా ‘జై హనుమాన్’ రానుంది. మంగళవారం (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసి, భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందించనున్న ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
అంజనాద్రి 2.0.. 'జై హనుమాన్' వీడియో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా 'జై హనుమాన్' రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా స్పెషల్ మ్యూజిక్ థీమ్ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్ -1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్.. 'వెల్కమ్ టు అంజనాద్రి 2.0' అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఆపై టైటిల్ నేమ్ అయిన #Jai Hanuman హ్యాష్ట్యాను కూడా దానికి జత చేశారు. ఫైనల్గా ఈ వీడియోకు 'హనుమాన్' నుంచి 'రఘునందన' పాటను అటాచ్ చేయడం విశేషం. హనుమాన్ సినిమా ముగింపులోనే పార్ట్2 ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్' తెరకెక్కుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ విడుదల కావచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్ వర్మ.. మరీ ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా ఫైనల్ చేయలేదు. ఇకపోతే హనుమాన్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
'జై హనుమాన్' ప్రాజెక్ట్ను పక్కనపెడుతున్న ప్రశాంత్ వర్మ.. కారణం ఇదేనా?
భారీ సినిమాలతో పోటీ పడి ఈ సంక్రాంతి రేసులో విన్నర్గా నిలిచిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే హనుమాన్ సినిమాకు సీక్వెల్గా 'జై హనుమాన్' ఉంటుందని.. అది 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. 'హనుమాన్' సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ ఇప్పుడు 'జై హనుమాన్' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన తీయబోయే సినిమా 'జై హనుమాన్' ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్ ప్రాజెక్ట్కు సంబంధించి ఆయన అనుకున్న నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో మరికొంత సమయం పడుతుందని సమాచారం. దీంతో ఆయన డైరెక్ట్ చేసి పెండింగ్లో ఉన్న మరో ప్రాజెక్ట్ను మళ్లీ పట్టాలెక్కించాలని ఉన్నారట. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న 'ఆక్టోపస్' సినిమాపై ఆయన ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్తో తెరకెక్కనుందని టాక్. ఇందులో ఐదుగురు మహిళా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్తుందని గతంలో ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్లు జై హనుమాన్ ప్రాజెక్ట్కు కాస్త బ్రేక్ ఇచ్చి 'ఆక్టోపస్' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం ఎవరికీ తెలియదు. అనుపమ కూడా గతంలో లేడి ఓరియెంటెడ్ చిత్రమైన బటర్ ఫ్లై ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.. త్వరలో ఆమె డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే లైన్లో ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ చిత్రం కూడా త్వరగా పూర్తి చేసుకుని థియేటర్లోకి వస్తే ఈ బ్యూటీకి మరో కొన్ని ప్రాజెక్ట్లు వచ్చే ఛాన్స్ ఉంది. -
'హనుమాన్' ఓటీటీ రిలీజ్పై డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా 'హనుమాన్' సినిమా విడుదలైంది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్తో దుమ్మురేపింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే పలు ఓటీటీలలో వచ్చేశాయి. కానీ ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్ విరామం లేకుండా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇప్పటి వరకు మా చిత్ర యూనిట్కు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.' అని తెలిపారు. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్పై నెటిజన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్ చేసేది ఏంటి..? ఆలస్యానికి కారణాలు ఏంటి..? కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా..? మీరు చేస్తున్న అతికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొదట హనుమాన్ సినిమా మార్చి 2 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. అప్పుడు జరగలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అన్నారు. అప్పుడూ లేదు. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీ లేదు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్తో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలయని పరిస్థితి అని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన సినిమాకు తాము ఎంతగానో సోషల్మీడియాలో ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఇలా గేమ్స్ అడుతున్నారా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికి అయితే హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. #HanuMan OTT streaming delay was not intentional! We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap! Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗… — Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024 -
ఫ్యాన్స్కు హనుమాన్ టీం సర్ప్రైజ్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. తాజాగా ఓటీటీ రిలీజ్పై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ మూవీ ఈనెల 16 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా కలర్స్ సినీఫ్లెక్స్ ఛానెల్లో మార్చి 16 రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగు ఆడియన్స్తో పాటు సౌత్ ఫ్యాన్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Brahmaand ka sabse pehla SUPERHERO ab aayega aapke TV screens par! 🔥📺 16 March raat 8 baje, dekhiye #HanuMan ka World Television Premiere, Hindi mein pehli baar, Colors Cineplex aur JioCinema par.@tejasajja123 @Actor_Amritha @Primeshowtweets @RKDStudios @Colors_Cineplex… pic.twitter.com/0Uq7qg6Efh — Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024 -
హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. The #HanuManRAMpage is not over yet❤️🔥 Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥 Book your tickets now! - https://t.co/nM6rXb7n54#HanuMan 🔥 Nizam Release by @MythriOfficial A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6 — Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024 -
'హనుమాన్' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తక్కువ బడ్జెట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్ విజువల్స్ చూస్తే అందుకు అయిన ఖర్చు రూ. 100 కోట్లు ఉంటుందేమో అని ఎవరైనా చెప్తారు. కానీ కేవలం రూ. 50 కోట్లతో ఈ సినిమాను క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కోసం నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా తన వంతుగా ఎంత చేయాలో అంత చేశారని గతంలో ప్రశాంత్ కూడా తెలిపారు. కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం చక్కర్లు కొడుతోంది. సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాత, దర్శకుడి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. హనుమాన్కు వచ్చిన లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో ప్రశాంత్ గొడవ పడ్డారని పలు వెబ్సైట్స్లలో ప్రచారం జరిగింది. రూ.30 కోట్లు తనకు షేర్గా ఇవ్వాలని నిర్మాతపై ఆయన ఒత్తిడి తెస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. (ఇదీ చదవండి : సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్) అంతే కాకుండా ఈ చిత్రానికి సీక్వెల్గా రానున్న 'జై హనుమాన్'కు సంబంధించి కొంత అడ్వాన్స్తో పాటుగా లాభాల్లో వాటా కావాలని ముందే ఆయన అడిగినట్లుగా వైరల్ అయింది. తన షరతులను ఒప్పుకోకపోతే సీక్వెల్ కోసం పనిచేయనని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. నిర్మాత నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫోన్ చూసుకుంటూ సరదాగా ఉన్నారు. తమపై వస్తున్న నెగెటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నట్లు అందులో రాసుకొచ్చారు. తాము హనుమాన్ స్పిరిట్ను కొనసాగిస్తున్నామని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఒక్క పోస్ట్తో తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు ఆయన చెక్ పెట్టేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత చక్కగా ఉన్న వీరిద్దరి మధ్య ఇలాంటి వార్తలో చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నం చేశారో తెలియాల్సి ఉంది. Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddy pic.twitter.com/2O5J6BqwPH — Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024 -
బిగ్గెస్ట్ మార్క్కు చేరుకున్న 'హనుమాన్' కలెక్షన్స్
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది హనుమాన్ మూవీ. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ఎప్పుడో సాధించేసింది. తాజాగా ఇప్పటి వరకు హనుమాన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. కేవలం 25 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి హనుమాన్ సినిమా కలెక్షన్లు భారీగానే కొనసాగుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మరో రూ. 50 కోట్లు రాబట్టవచ్చని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. 92ఏళ్ళ సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ బీట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా 'జై హనుమాన్' రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయినట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. 'ఆన్స్క్రీన్తో పాటు, ఆఫ్ స్క్రీన్లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు.' అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు. రాముడిగా మహేశ్బాబు అయితే సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్లో కూడా రాముడి పాత్రను మహేశ్ ముఖంతో రీక్రియేట్ చేసి చూసినట్లు ఆయన తెలిపారు. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
హను-మాన్ ఎఫెక్ట్.. ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్?
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాలు సాధిస్తాయి. చిన్న సినిమాలే అయినా వందల కోట్ల వసూళ్లను సాధించి, మేకర్స్ తలరాతనే మార్చేస్తాయి. తాజాగా ‘హను-మాన్’ టీమ్ ఆ అద్భుతాన్ని సృష్టించింది. సంక్రాంతి బరిలో అతి చిన్న చిత్రంగా వచ్చిన ‘హను-మాన్’.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఊహించని కలెక్షన్స్తో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ. 275 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరబోతుంది. ఈ ఒక్క చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ తలరాతనే మార్చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్లో చిన్న దర్శకుల లిస్ట్లో ఉన్న ప్రశాంత్..ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. తన సినిమాకు వందల కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు..ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘హను-మాన్’ తర్వాత నాకు రూ.100, 200 కోట్ల బడ్జెట్తో సినిమా చేసే ఆఫర్లు కూడా వచ్చాయి. అంతేకాదు రూ. 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. హను-మాన్ మూవీ చూసిన ఓ ఎన్నారై నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. మన ఇతిహాసాలతో ఇలాంటి సినిమా చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అన్నారు. అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు. పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. చెప్పిన బడ్జెట్లో సినిమా తీసే డైరెక్టర్ని కాదు నేను. ఈ విషయం మొదట్లోనే నిర్మాతలకు చెప్తాను. నేను ఒక 10 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే..దాన్ని 50 కోట్ల సినిమాలా చూపిస్తాను. 40 కోట్లతో తీస్తే..దాన్ని రూ.150 కోట్ల సినిమాలా తీస్తాను. మార్కెట్ను అంచనా వేసుకొని సినిమాను తెరకెక్కిస్తాను’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రూ.1000 కోట్ల ఆఫర్ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మకు అంత పెద్ద ఆఫర్ రావడం గొప్ప విషయమే. ఒకవేళ ప్రశాంత్ వర్మ అంత పెద్ద బడ్జెట్తో సినిమా తీస్తే..అది కచ్చితంగా రూ.2000 కోట్లను వసూలు చేస్తుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
హనుమాన్ సూపర్ హిట్.. డైరెక్టర్కు కళ్లు చెదిరే గిఫ్ట్!
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్, నెల్సన్కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఆ పాత్రలకు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్!
హనుమాన్ మూవీతో బ్లాక్బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే జోరులో మరో చిత్రానికి రెడీ అవుతున్నారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ జై హనుమాన్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడు, రాముడి పాత్రలకు ఎవరు చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పాత్రలకు స్టార్ హీరోలు నటించే అవకాశముందని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'జై హనుమాన్ మూవీ స్కేల్ చాలా పెద్దది. ఈ చిత్రంలో పెద్ద స్టార్స్ నటించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాల విషయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఆ పాత్ర మనం బయట చూసే హనుమాన్లా ఉండదు. ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులు రెడీగా ఉన్నారు. అయితే చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చు. మెగాస్టార్కు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను కలవలేదు. అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ముందు ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పలేం. రాముడిగా నా మనసులో ఉన్న నటుడైతే మహేశ్బాబు. ఎందుకంటే సోషల్మీడియాలో రాముడిగా క్రియేట్ చేసిన మహేశ్ బాబు ఫొటోలను చూశా. మా ఆఫీస్లో కూడా ఆయన ముఖంతో రీక్రియేట్ చేసి చూశాం' అని అన్నారు. అంతే కాకుండా జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. -
ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?
'హనుమాన్' సినిమా రచ్చ బాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం.. సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. మూడోవారంలోనూ థియేటర్లలో ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. అదలా ఉండగా ఇప్పుడు 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమ్ తెచ్చుకున్న హీరోగా మారిన తేజ సజ్జా.. 'హనుమాన్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకున్న ఈ చిత్రం.. అన్నిచోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభంలో థియేటర్ల సమస్య వచ్చింది గానీ ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని చోట్ల సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. 'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. ప్లాన్ ప్రకారం 5-6 వారాల్లోపే ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా హిట్ తెచ్చుకోవడంతో పాటు వసూళ్లు ఇంకా వస్తుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి తొలి రెండు వారాల్లో రావొచ్చని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?) -
'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?
సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్'.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇంకా ఊపు తగ్గట్లేదు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో కనిపించారు. అయితే ఇదే వేడుకలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన భార్య గురించి చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్తో నిరూపించుకున్న ఇతడు.. హీరో నాని నిర్మించిన 'అ!' మూవీతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రంతోనే విషయమున్నుడని ప్రూవ్ చేసుకున్నాడు. దీని తర్వాత 'కల్కి', 'జాంబీరెడ్డి' లాంటి చిత్రాలతో మనోడిలో విషముందని అందరూ అనుకునేలా చేశాడు. ఇక 'హనుమాన్'తో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని షేక్ చేసి పడేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) ప్రశాంత్ వర్మని చూస్తే యంగ్గా కనిపిస్తున్నాడు. దీంతో అతడు ఇంకా సింగిల్ ఏమోనని అనుకున్నారు. కానీ నాలుగేళ్ల క్రితమే సుకన్య అనే అమ్మాయిని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. అంటే లాక్డౌన్ టైంలో పెళ్లి అయిపోవడం, అప్పటికి ఇతడు చిన్న డైరెక్టర్ కావడంతో ఎవరికీ తెలీదు. తాజాగా 'హనుమాన్' సక్సెస్ ఈవెంట్లో స్పీచ్ మొదలుపెట్టడమే.. తనకు అండగా నిలిచిన భార్యకు థ్యాంక్స్ చెప్పడంతో షురూ చేశాడు. అలా ప్రశాంత వర్మకు పెళ్లయిపోయిందని, అందమైన భార్య ఉందని అందరికీ తెలిసింది. పాలకొల్లుకు చెందిన ప్రశాంత్ వర్మ.. పెద్దల కుదిర్చిన సంబంధంతోనే సుకన్యని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు తప్పితే ఈమె గురించి పెద్దగా విషయాలేం బయటకు రాలేదు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
రాజమౌళిపై కోపం వచ్చింది.. ఎందుకంటే: హనుమాన్ డైరెక్టర్
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమాను తీశారంటూ ప్రశాంత్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. జక్కన్న టీమ్లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'ఆయన మేకింగ్ విధానం చాలా ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇంజినీరింగ్లో ఉండగానే ఆయనకు చాలాసార్లు మెయిల్స్ పంపించా. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. టాలెంట్ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది. అదే సమయంలో నాకు ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి చాలా నేర్చుకున్నా' అని అన్నారు. అంతే కాకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. వారితో సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు. అలాంటి వారికోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత డెడ్లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ టామ్ క్రూయిజ్ వచ్చినా.. నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తానని ప్రశాంత్ వర్మ అన్నారు. -
జై హనుమాన్ లో రామ్ చరణ్ పాత్ర అదేనా..?
-
జై హనుమాన్ లో రామ్ చరణ్ రోల్ ఏంటంటే..!
-
హను–మాన్లో అదే పెద్ద సవాల్
ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్ ‘హను–మాన్’లో మేజర్ హైలైట్. క్లైమాక్స్లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్తో మేజిక్ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్ చేసిన పెద్ద సవాల్ అంటున్నారు వీఎఫ్ఎక్స్ నిపుణుడు ఉదయ్ కృష్ణ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేసిన ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్ ఎఫెక్ట్స్లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్’ చిత్రం చేసే చాన్స్ రావడం పూర్వజన్మ సుకృతం. వీఎఫ్ఎక్స్ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్ బెల్స్’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్ ఫిల్మ్ ‘అర్జున్: ది వారియర్ ప్రిన్స్’, పూర్తి స్థాయి వీఎఫ్ఎక్స్ మూవీ ‘అల్లాదీన్’ వంటివి చేశానని ఉదయ్కృష్ణ తెలిపారు. -
హనుమాన్ సీక్వెల్లో ఆంజనేయుడిగా స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ
హనుమాన్ సినిమా హిట్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ట్రెండింగ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది ఈ చిత్రం. హనుమాన్ విజయంతో దానికి సీక్వెల్గా జై హనుమాన్ చిత్రం ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించాడు. జై హనుమాన్ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్లో తేజ హీరో కాదని ఆయన తేల్చి చెప్పారు. సూపర్ హీరో కథలకు ఇతిహాసాలలోని దేవుళ్లకు ముడిపెట్టి తెరకెక్కించేందుకు తన వద్ద 12 కథలు ఉన్నాయని ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలసిందేజ ఈ క్రమంలో వచ్చిన చిత్రమే 'హను-మాన్'. దీనికి రానున్న సీక్వెల్ హను-మాన్ కంటే వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్' ఉంటుందని ఆయన తెలిపారు. కానీ సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదు.. కానీ, అందులో హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడని చెప్పాడు. సీక్వెల్లో హీరో ఆంజనేయ స్వామి అని ఆ పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తారని ఆయన పేర్కొన్నాడు. జై హనుమాన్ చిత్రం 2025లో కచ్చితంగా విడుదల చేస్తామని ప్రశాంత్ తెలిపాడు. ఈలోపు తను డైరెక్ట్ చేసిన అధీర,మహాకాళీ విడుదల అవుతాయని క్లారిటీ ఇచ్చాడు. హనుమాన్ సీక్వెల్లో రామ్ చరణ్ నటించనున్నాడని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఆ స్టార్ హీరో ఎవరో క్లారిటీ రానుంది. -
హనుమాన్ చిత్రానికి జీవం పోసిన ఉదయ్ కృష్ణ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా తాజాగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. హనుమాన్లో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా హనుమాన్ భారీ విగ్రహాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందులోని విజువల్స్ అన్నీ అబ్బురపరిచేలా ఉన్నాయి. హనుమాన్ అద్భుతాల వెనుక గ్రాఫిక్స్ మాంత్రికుడు ఉదయ్ కృష్ణ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న ఆయన హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే "హనుమాన్" చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉదయ్ చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత సత్తా ప్రశాంత్ వర్మలో ఉందని ఆయన పేర్కొన్నారు. తేజ సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన "హనుమాన్" జనవరి 12న విడుదలై విజయ దుందుభి మ్రోగిస్తోంది. సినిమా విడుదలకు ముందే టీజర్ విజువల్స్ చూసిన ప్రేక్షకుల్లో హనుమాన్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ - కథనాలకు ఉదయ్ కృష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో "హనుమాన్" చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన "హనుమాన్" సాధిస్తున్న సంచలన విజయం... ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెన్నికగన్న ఉదయ్ ప్రస్తుతం "బీస్ట్ బెల్స్" పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్లోనే నెలకొలిపే సన్నాహాల్లో ఉన్నారు. సినిమా ముగింపులో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు ఆయన జీవం పోయడం ఈ చిత్రం కోసం తాను ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజస్లలో ముఖ్యమైనదని చెబుతున్న ఉదయ్... మన తెలుగు దర్శకులు కలలుగనే ఎంత గొప్ప విజువల్ అయినా... సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా చెబుతున్నారు. -
'హనుమాన్' కలెక్షన్స్.. తొలి భారతీయ సినిమాగా రికార్డు
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం ఖాతాలో భారీ రికార్డ్ చేరింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్లో దుమ్మురేపింది. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి. ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితం నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్క్రీన్స్లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్ సినిమాకు 'బై వన్ గెట్ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బుక్ మైషోలో 'MIRAJBOGO' అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు. जय श्री राम 🙏 With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥 2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥 Nizam Release by @MythriOfficial ❤️🔥 A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/S1gjf0RKYr — Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2024 -
ఆర్సి పురం పటాన్చెరులో ఆసియా వైష్ణవి మల్టీప్లెక్స్ లాంచ్ చేసిన హీరో
-
అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నేడు ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు భారత్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రామమందిర ప్రారంభోత్సవ వేళ 'హను-మాన్' టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఈ సినిమా ప్రతి టికెట్పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్లో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుంచి రూ. 5 రామమందిరానికి కేటాయించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. గూస్బంప్స్ వచ్చాయి: నాగా చైతన్య హనుమాన్ చిత్రం విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ కూడా అభినందించారు. సమంత కూడా సినిమా బాగుందంటూ ఆ చిత్ర మేకర్స్ను మెచ్చుకున్నారు. తాజాగా హీరో నాగచైతన్య మనుమాన్ చిత్రాన్ని చూశారు. చిత్ర యూనిట్ను అభినందిస్తూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. హనుమాన్ కథతో పాటు తెరపైకి తీసుకువచ్చిన తీరు చాలా అద్భుతం అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అభినందించారు. హనుమంతుగా తేజ సజ్జా అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంతసేపు గూస్బంప్స్ వచ్చాయని నాగ చైతన్య తెలుపుతూ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
అయోధ్యకు ఎన్ని కోట్లు అయితే అని కోట్లు ఇస్తాం..!
-
రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్
చిన్న సినిమా అన్నారు. అలానే న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి తోడు సరిపడా థియేటర్లు దొరకలేదు. అయితేనేం 'హనుమాన్' చిత్రబృందం అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధింగా కలెక్షన్స్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. తేజసజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన 'హనుమాన్'.. సూపర్ హీరో కాన్సెప్ట్తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తీరతామని నమ్మారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) కేవలం రూ.55 కోట్లతో తీసిన 'హనుమాన్' సినిమాకు.. జస్ట్ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బెన్ఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూళ్లు వచ్చినప్పటికీ నార్త్, ఓవర్సీస్లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సరాసరి రూ.25 కోట్ల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు సాధించి... ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం 'హనుమాన్' టీమ్కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక నాలుగు రోజుల్లో ఈ రేంజు వసూళ్లు వచ్చాయంటే.. లాంగ్ రన్లో రూ.300-400 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) small film - BIG JUSTICE from the audience ❤️ The Humongous Roar of #HANUMAN Resounded at the Box-Office 💪 1️⃣0️⃣0️⃣ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 4 days ᴡɪᴛʜ ʟɪᴍɪᴛᴇᴅ ꜱᴄʀᴇᴇɴꜱ & ᴍɪɴɪᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 💥#HanuManCreatesHistory -… pic.twitter.com/4LNGkhYz8f — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2024 -
ప్రముఖ డైరెక్టర్ బూతులు తిట్టి వెళ్లగొట్టాడు: హనుమాన్ దర్శకుడు
హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతోంది. సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలను వెనక్కు నెడుతూ హనుమాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చూస్తుంటే ఈ మూవీ.. ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోనున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆఫీస్ బాయ్లా చూశాడు ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే షార్ట్ఫిలింస్, డాక్యుమెంటరీలు చేశాను. నేను అందుకున్న సర్టిఫికెట్లను ఓ సూట్కేసులో పెట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సులిస్తారేమోనని తిరిగేవాడిని. అది చూసిన చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని పంపించేశారు. కొన్నిరోజులకు పరిస్థితి అర్థమై అవేమీ లేకుండా తిరిగాను. ఓ సారి ఒకరి రికమండేషన్తో ఓ డైరెక్టర్ను కలిశాను. ఆయన ముందు కూర్చున్న రెండు నిమిషాలకే రేయ్, నీళ్లు తీసుకురారా అన్నాడు. బూతులు తిట్టారు ఆఫీస్ బాయ్ను పిలుస్తున్నాడేమోనని దిక్కులు చూస్తుంటే నిన్నేరా అన్నాడు. వెంటనే నేను కిచెన్లో నుంచి నెమ్మదిగా ఆఫీస్ బయటకు వచ్చేశాను. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. ఇటీవల ఆ దర్శకుడు సాయం కోసం మా ఆఫీస్కు వచ్చాడు. ఆయనకు నేనెవరో గుర్తులేదు. నేను కూడా గతాన్ని తవ్వకుండా తనకు కావాల్సిన సాయం చేసి పంపించేశాను. ఒకసారైతే పెద్ద డైరెక్టర్, నిర్మాత మాట్లాడుకుంటున్నారు. నేను వారికి కొంత దూరంలో నిలబడ్డాను. నన్ను చూసి.. నీకిక్కడ ఏం పనిరా.. వెళ్లిపో అని బూతులు తిట్టారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా తర్వాత ఆ వ్యక్తే నా భుజంపై చేయి వేసి అందరికీ నన్ను మావాడే.. మా వాడే.. అని చెప్పుకుతిరిగాడు. ఇండస్ట్రీలో ఇవి సర్వసాధారణమే కావచ్చు. కానీ నేను తట్టుకోలేకపోయాను. చిన్నప్పటినుంచి ఇంట్లో నన్ను ఒక్కమాట అనేవారు కాదు. ఎవరి దగ్గరా ఒక మాట పడేవాడిని కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఈ ఇండస్ట్రీ నాకు కరెక్ట్ కాదు, వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ నిలదొక్కుకున్నాను అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. -
' వాటిని భోగి మంటల్లో వేయడం మరిచిపోయా'.. వారికి ప్రశాంత్ వర్మ కౌంటర్!
ఈ ఏడాది సంక్రాంతికి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన సినిమాను తీశారంటూ పలువురు సినీ ప్రమఖులు ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కొందరు నకిలీ ప్రొఫైల్స్తో సోషల్ మీడియాలో మా టీమ్ పట్ల కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. కానీ నిన్న జరిగిన భోగి వేడుకల్లో వాటిలో మంటల్లో విసిరివేయడం మరిచిపోయా అంటూ.. అలాంటి వారిని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ చురలకంటించారు. ప్రశాంత్ వర్మ తన ట్వీట్లో రాస్తూ.. 'కొందరు నకిలీ ప్రొఫైల్స్తో మాపై విపరీతంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో మా టీంను ట్రోల్ చేశారు. ఇంకా అలాంటి చెత్తను నిన్న భోగి మంటల్లో వేయడం మరిచిపోయా. ఏది ఏమైనా 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు' అనే విషయం మరోసారి రుజువైంది. తమ తిరుగులేని మద్దతును అందించిన సినీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమపై వచ్చిన నెగెటివిటీని తొక్కేసి.. ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం మరింత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది. ' అంటూ పోస్ట్ చేశారు. అయితే హనుమాన్ రిలీజ్కు ముందే పెద్దఎత్తున వివాదం నడిచింది. ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో సినిమాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. కానీ ప్రశాంత్ వర్మ చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పొంగల్ పోటీ తీవ్రం కావడంతో రవితేజ మూవీ ఈ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బహుశా సినిమా రిలీజ్కు ముందు జరిగిన వివాదాన్ని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్కుమార్,సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 12 భాషల్లో విడుదల హనుమాన్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. I've encountered a significant amount of propaganda surrounding our team, along with the proliferation of fake profiles across social media. It seems like some of this digital debris has been forgotten to be thrown in yesterday's Bhogi fire. However, I express my sincere… — Prasanth Varma (@PrasanthVarma) January 15, 2024 -
హనుమాన్ పార్ట్-2 కాదు.. ఏకంగా సినిమానే: ప్రశాంత్ వర్మ తండ్రి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ వచ్చింది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమా తీశారంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు సైతం హనుమాన్ మేకర్స్ను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత వర్మ తండ్రి తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. (ఇది చదవండి: మెగా హీరో బర్త్డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!) ఆయన మాట్లాడుతూ.. 'హనుమాన్ తీసినోడు మా అబ్బాయే. నా లైఫ్లో ఫస్ట్ టైమ్ ఇలాంటి అనుభవం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ పార్ట్-2 కాదు. హనుమాన్పై ఏకంగా సినిమానే వస్తది.' అంటూ దర్శకుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో అభినందించేందుకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే తాను జ్వరంతో బాధపడుతున్నాననీ.. ఆరోగ్యం కుదుటపడగానే అందరినీ కలుస్తానంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మీ శరత్కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. Proud Moment for Prasanth Varma Family #HanuMan 👏👏 Bro @PrasanthVarma, you achieved your dream. You made your father proudly say he is my son 🥹@tejasajja123 #HanuManRAMpage @NirvanaCinemas pic.twitter.com/JjHeyfqdcy — EPIC (@Koduri_526) January 13, 2024 -
ప్రశాంత్ వర్మ హను-మాన్.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం హను-మాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేశ్బాబుతో చిత్రంతో పోటీలో నిలిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే దాదాపు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గుంటూరు కారం కంటే హనుమాన్కు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచి సైతం విపరీతమైన స్పందన వస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. -
టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైపోయింది. 'హను-మాన్', 'గుంటూరు కారం' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. రెండింటిని పోల్చి చూసుకుంటే చాలామంది 'హను-మాన్' వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ 'హను-మాన్' టీంలో ఎవరికెంత ఇచ్చారు? 'హను-మాన్' టాక్ ఏంటి? ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. వీటిలో చాలామంది మహేశ్ 'గుంటూరు కారం' హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికంటే బెటర్ రివ్యూస్ ఇప్పుడు 'హను-మాన్' మూవీకి వస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్, ఆంజనేయుడి సెంటిమెంట్తోపాటు కంటెంట్ కూడా భలే క్లిక్ అయింది. గురువారం సాయంత్రం ప్రీమియర్స్ పూర్తవగానే.. అందరూ 'జై హనుమాన్' నామజపం చేస్తున్నారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) అదే టైంలో దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కేవలం రూ.55 కోట్ల బడ్జెట్తో ఈ రేంజు సినిమా తీశాడంటే.. మరికాస్త బడ్జెట్ ఇచ్చుంటే వేరే లెవల్ మూవీ తీసేవాడని అనుకుంటున్నారు. సరే ఇది పక్కనబెడితే ఈ మూవీకి నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్.. రూ.10 కోట్లు కూడా దాటలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 'హను-మాన్' సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సెటిల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి గానూ ఇతడికి రూ.2 కోట్లు ఇచ్చారట. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య పారితోషికం అందుకున్నాడట. మిగతా నటీనటుల్లో హీరోయిన్ అమృత అయ్యర్-రూ 1.5 కోట్లు, వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. కోటి, వినయ్ రాయ్ రూ.65 లక్షలు, వెన్నెల కిశోర్ రూ.55 లక్షలు, గెటప్ శీను రూ.35 లక్షలు అనే టాక్ వినిపిస్తుంది. మిగతా నటీనటులకు కాస్తోకూస్తే ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే రూ.10 కోట్ల లోపే రెమ్యునరేషన్ తేల్చేశారనమాట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
హను-మాన్కు హిట్ టాక్.. ఆదిపురుష్ డైరెక్టర్ను ఆడేసుకుంటున్నారు!
సినిమా బాగుంటే నెత్తిన పెట్టేసుకుంటారు జనాలు. అదే సినిమా షెడ్డుకెళ్లిపోయిందంటే మాత్రం చిత్రయూనిట్ను చెడుగుడు ఆడేసుకుంటారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద రిలీజైన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటినుంచే ట్రోలింగ్ బారిన పడింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్తో ఈ ప్రయోగాలేంటని అభిమానులు మండపడ్డారు. ఆ గ్రాఫిక్స్, గెటప్స్ మార్చమని మొత్తుకున్నారు. ఓం రౌత్పై ట్రోలింగ్ అబ్బే, దర్శకుడికి ఏది నచ్చితే అదే ఫైనల్! ఓం రౌత్ ఎవరి సలహాలను, సూచనలను పట్టించున్న పాపాన పోలేదు. చివరకు ఏమైంది? సినిమా భారీ డిజాస్టర్గా నిలిచిపోయింది. ఆ సమయంలో ఓం రౌత్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. తాజాగా మరోసారి ఓం రౌత్పై సెటైర్లు వేస్తున్నారు సినీ లవర్స్. కారణం హను-మాన్ మూవీ. ఈ సినిమాకు ఓం రౌత్కు సంబంధం ఏంటనుకుంటున్నారా? మరేం లేదు. ఆదిపురుష్ అంత డిజాస్టర్ అవడానికి పేలవమైన వీఎఫ్ఎక్స్ కూడా ఓ ప్రధాన కారణం. వీఎఫ్ఎక్స్ వల్లే సినిమా.. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ విజయానికి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ప్రధాన బలంగా మారింది. ఇంకేముంది.. జనాలు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ఆకాశానికెత్తుతున్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ను మళ్లీ ఆడేసుకుంటున్నారు. 'హనుమాన్ సినిమా ఆడే థియేటర్లలో ఓం రౌత్ కోసం ఓ సీటు వదిలేయండి', 'చిన్న సినిమా అయినా ఎలా తీశారో చూసి నేర్చుకో..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓం రౌత్.. ఆదిపురుష్ సినిమాను రూ.500 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించాడు. ప్రశాంత్ వర్మ.. హను-మాన్ చిత్రాన్ని కేవలం రూ.25 కోట్లలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్(ట్విటర్)లో నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో కింది ట్వీట్స్లో మీరే చూసేయండి.. After watching #Hanuman, i want to say #Omraut come to my cabin.#JaiShreeRam 🚩 #JaiHanuman 🚩 pic.twitter.com/e2V06FFEPR — Sanatani 🚩🔱 (@Vadapallisree) January 12, 2024 #Hanuman - #OmRaut will receive more criticism in the days to come than what he received after #Adipurush#PrasanthVarma will receive more offers and calls from producers spanning from North to South pic.twitter.com/7NC4l4eJLX — Daily Culture (@DailyCultureYT) January 11, 2024 Aa budget ki oka range output and response ante 🔥🔥🔥🔥🔥 Next movie in theatres #HanuMan 🛕 Still cannot forget what #OmRaut did to #Aadipurush with spectacular cast and budget …#HanuMan pic.twitter.com/mmcyrY9EsW — Vineeth K (@DealsDhamaka) January 11, 2024 Audience to #OmRaut after watching #Hanuman 😂😂🔥#HanumanOnJan12th pic.twitter.com/cSJetincsc — Asif (@DargaAsif) January 11, 2024 Everywhere in the world, wherever there is an #Hanuman show, I request the producer and distributor to keep one seat for #OmRaut Ji 🙏🏻 - Prashanth Varma pic.twitter.com/cKuDJa0nHz — भल्लालदेव (@bhallal_deva1) January 12, 2024 Audience attacking #Omraut after watching #Hanuman #PrashanthVarma bagane irikinchesavu ga 🤣🤣🤣#HanumanOnJan12th #HanumanReview #TejaSajja pic.twitter.com/kqrpbNYXGt — Cgma Memes 🗿 (@CgmaMemes) January 11, 2024 Pb fans to @omraut after watching #Hanuman vfx#Omraut #HanumanReview #HanumanOnJan12th pic.twitter.com/v772YAGRIh — Siddu Prabhas (@Siddhartha_002) January 11, 2024 చదవండి: హను-మాన్ రివ్యూ, సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే? భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
Hanuman OTT Rights: భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా నేడు (జనవరి 12న) విడుదలైన హనుమాన్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఒకరోజు ముందే అంటే నిన్ననే భారీగా ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. తెలుగులో 'సూపర్మ్యాన్' జోనర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ఆ లోటు తీర్చడమే కాదు.. ఏకంగా బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో కథానాయకుడు తేజ సజ్జా రోల్ చాలా చక్కగా ఉంటుంది. తనలోని ఉన్న టాలెంట్ మొత్తాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించాడు. అందుకే అతను తెరపై కనిపించినప్పుడు విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్ వర్మ తీశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్కు తగ్గట్లు సినిమా ఉండటంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడవచ్చని సమాచారం. (ఇదీ చదవండి: Hanu Man Review : ‘హను-మాన్’ మూవీ రివ్యూ) ఏదేమైనా మార్చి నెలలో హనుమాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు సినిమా ఎండ్ కార్డ్లో ఉంటుంది. 2025లో జై హనుమాన్ పేరుతో పార్ట్-2 వస్తుందని దర్శకుడు ప్రకటించాడు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్కుమార్,సముద్రఖని వంటి నటీనటులు హనుమాన్లో నటించారు. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్ని పెంచుకొని 12 భాషల్లో విడుదల అయ్యేలా ప్రాజెక్ట్ను సిద్ధం చేశారు. పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలిచి హిట్ టాక్తో దూసుకుపోతున్నాడు. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే.. హనుమాన్ సినిమాపై విడుదల ముందు నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ హీందీ వర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వర్షన్ రూ. 11 కోట్లకు హనుమాన్కు సంబంధించిన హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్టైనింగ్ సంస్థ 'జీ5' ఈ హక్కుల్ని దక్కించుకుంది. ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత భారీ ధర పలకటం విశేషమని అప్పట్లో సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. -
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్స్టోరీ రొటీన్గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో కథ సింపుల్గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్స్ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘హను-మాన్’ గురించి ఈ విషయాలు తెలుసా?
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హను-మాన్ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం... ♦ ‘జాంబి రెడ్డి’ తర్వాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరి చుట్టే కథ తిరుగుతంది. ♦ హను-మాన్ షూటింగ్ 2021 జూన్ 5న ప్రారంభమైంది. వట్టినాగుపల్లిలో ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్థాయిలోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ నిర్మాత ప్రొత్సాహంతోనే పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దారు. మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతుంది. ♦ ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు ♦ ఈ చిత్రం మొత్తం ఫుటేజీ నిడివి 2.45 గంటలు. సెన్సార్ తర్వాత ఇది 2.38 గంటలు అయింది. సినిమాకు ఏది అవసరమో దాన్నే షూట్ చేశామని, కేవలం ఐదారు నిమిషాలు ఫుటేజ్ మాత్రమే వృధా అయిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ♦ ఈ సినిమాను గతేడాది మే 12న విడుదల చేయాల్సింది. కానీ వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేస్తూ.. చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. ♦ ఈ చిత్రంలో మొత్తం 1600 వీఎఫెక్స్ ఫాట్స్ ఉన్నాయట. వానరం, ఎలుకలు, చిరుత, పులి ఇవన్నీ వీఎఫెక్స్ సాధ్యమైయ్యాయని దర్శకుడు చెప్పాడు. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కొత్తతరం వీఎఫెక్స్ టీమ్తో పని చేశారట. ఔట్ఫుట్ మాత్రం అద్భుతంగా ఉంది. ♦ ఓ సారి అడవిలో షూటింగ్ చేస్తున్న సమయంలో తేజ సజ్జకు తృటిలో ప్రమాదం తప్పిందట. చెట్టుకింద ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తుంటే.. ఓ పాము తేజ సజ్జదగ్గరకు వచ్చిందంట. డైరెక్టర్ మానిటర్లో చూస్తే అది పాములా కనిపించలేదట. పక్కనే ఉన్న వ్యక్తి చెప్పబోతుంటే డైరెక్టర్ పట్టించుకోలేదట. షాట్ పూర్తయిన తర్వాత అక్కడ పాము ఉందని చెప్పడంతో అంతా భయంతో పరుగులు తీశారట. ♦ ఈ చిత్రంలో 'వాన' హీరో వినయ్ రాయ్ విలన్ రోల్లో కనిపించనుండగా, అషికా రంగనాథ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడిగా చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా చెప్పలేదు. -
Hanuman Movie: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. గూస్బంప్స్ ఖాయం!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: 'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్) ఈ నేపథ్యంలో ఇప్పటికే హనుమాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూను వెల్లడించారు. ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైనర్ను అందించాడని అన్నారు. కథ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్బంప్స్ ఖాయమంటున్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. హనుమాన్ చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆయన 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ మూవీని హిందీలో చూసిన ఆయన తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. #OneWordReview...#HanuMan: FASCINATING. Rating: ⭐️⭐️⭐️½ Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd — taran adarsh (@taran_adarsh) January 11, 2024 -
హను-మాన్ కోసం రెండేళ్లు కష్టపడ్డా: సంగీత దర్శకుడు
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం హను-మాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ విడుదలయ్యాక ప్రతి ఒక్కరు బీజీఎం బాగుందని కామెంట్ చేశారు. వాస్తవానికి ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు. ఆయన అందించిన నేపథ్య సంగీతంపై చిత్ర యూనిట్తో పాటు సీనీ ప్రియులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రాణం పెట్టి సంగీతం అందించానని చెబుతున్నాడు గౌరహరి. దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి సంగీతాన్ని సమకూర్చారట. ఇప్పటి వరకు విడుదల అయిన బీజీఎమ్, హనుమాన్ చాలీసా ,శ్రీరామ దూత స్తోత్రం ,ఎంత ప్రభంజనం సృష్టించాయో మనకు తెలుసు. ఆ పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటే దానికోసం గౌర హరి ఎంత ఎఫర్ట్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ విజన్ కు తగ్గట్టుగా, తీసిన విజువల్స్ ను మరోక మెట్టు ఎక్కించడంలో సంగీత దర్శకుడిగా గౌర హరి వంద శాతం విజయం సాధించాడని చిత్ర బృందమే పేర్కొంది అంటే గౌరహరి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యాడ్స్, టీవీ సీరియల్స్తో ఆయన సంగీత ప్రస్థావన మొదలు పెట్టి నేడు పాన్ ఇండియా సినిమా హనుమాన్కు పనిచేసే స్థాయికి ఎదిగారు గౌరహరి. మరి ఈ చిత్రంతో గౌరహరి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అవుతారో లేదో చూడాలి. -
‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్
హనుమాన్ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో చాలా సినిమాలే ఉన్నాయి. గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ చిత్రాలతో పాటు తమిళ్ డబ్ సినిమాలు అయిన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయాలన్' చిత్రాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి సినిమాలకు థియేటర్లు దొరకడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రితం విడుదలైన హనుమాన్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తమ సినిమాకు ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. 2024 సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్గా గుంటూరు కారం ఉంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కడంతో సాధారణంగా ఎక్కువ థియేటర్లు ఈ చిత్రం వైపే మొగ్గు చూపుతాయి. దీంతో 'హనుమాన్'ను వాయిదా వేసుకోవాలంటూ ఇప్పటికే పలువురు తమ మూవీ టీమ్ను సంప్రదించారంటూ ఆయన తెలిపారు. హనుమాన్ సినిమాను ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సెన్సార్ విషయంలోనూ కూడా కొందరు ఇబ్బంది పెట్టారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్ని జరిగినా తాము ముందుగా అనుకున్నట్లే 'హనుమాన్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిముషాలు ఉండనుంది. హనుమాన్ కోసం ప్రభాస్ జనవరి 12న హనుమాన్ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ విభాగంలో సుమారు 1500 థియేటర్లలో హనుమాన్ విడుదల కానుందని సమాచారం. కానీ అక్కడ సినిమాకు బజ్క్రియేట్ కావాలంటే ఒక డైనోసార్ను దింపాలి. అదే పని ఇప్పుడు మేకర్స్ చేస్తున్నారు. హనుమాన్ ప్రమోషన్స్లో భాగంగా త్వరలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభాస్ను తీసుకొచ్చేందుకు తనతో పాటు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందంటూ ప్రశాంత్ తెలిపారు. -
నీ రాక అనివార్యం హనుమా..విజువల్ వండర్లా ‘హను-మాన్’ ట్రైలర్
తేజా సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్’. ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ డైలాగ్స్.. అద్భుతమైన విజువల్స్తో ట్రైలర్ అదిరిపోయింది. క్వాలిటీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రాజీ పడనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘యతో ధర్మ స్తతో హనుమ..యతో హనుమ..స్తతో జయ’అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పల్లెటూరిలో ఉండే హీరోకి ఒక స్పెషల్ పవర్ ఉండడం.. విలన్(వినయ్ రాయ్) ఆ పవర్ కోసం ప్రయోగాలు చేయడం.. హీరో గురించి తెలిసి అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తే హనుమంతుడు ఎలా కాపాడాడు? అసలు హీరోకి ఉన్న స్పెషల్ పవర్ ఏంటి? మామూలు వ్యక్తికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? రాక్షససంహారం చేయడానికి హనుమంతుడు ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘పోలేరమ్మ మీద ఒట్టు..నా తమ్ముడి మీద చేతులు పడితే ఒక్కొక్కరికి టెంకాయలు పగిలిపోతాయి’ అని వరలక్ష్మీ శరత్ కుమార్ చేసే ఫైట్ సీన్ ట్రైలర్కి స్పెషల్ అట్రాక్షన్. ‘నీకు కనబడుతుంది ఒకడి ఉన్మాదం మాత్రమే కానీ దాని వెనుక ఒక ఉపద్రవం దాగిఉంది’, ‘కలియుగంలో ధర్మంకోసం పోరాటే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు.. నీ వెంటా ఉన్నాడు..మానవాళి మనుగడను కాపాడుకోవడం కోసం నీ రాక అనివార్యం హనుమా’ లాంటి డైగాల్స్తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. -
సంక్రాంతి థియేటర్స్ లో హనుమాన్ తో పండగ చేసుకుందాం
-
హనుమంతుణ్ణి నమ్మాం, ఆయన వల్లే ఇది.. : డైరెక్టర్
‘‘హను–మాన్’ చిత్రాన్ని చిన్నదిగా స్టార్ట్ చేశాం. అయితే మా మూవీ హనుమంతుని వలే భారీ ప్రాజెక్టు అయ్యింది. మేము హనుమంతుణ్ణి, కథని నమ్మాం. అద్భుతమైన విజువల్ ట్రీట్గా రూపొందిన ‘హను–మాన్’ అందరి అంచనాలు అందుకుంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నేడు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘తెలుగులో గొప్పదర్శకులు చాలా అద్భుతమైన చిత్రాలు తీశారు. వాళ్ల కంటే నేను బెటర్గా తీయలేను. నాకంటూ ఒక యూనిక్ జోనర్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో భాగంగా కొత్త జోనర్స్పై దృష్టి పెట్టాను. ఆ క్రమంలో ‘అ, కల్కి, జాంబి రెడ్డి’ సినిమాలు చేశాను. తర్వాత నాకు ఇష్టమైన సూపర్ హీరో కథతో ‘హను–మాన్’ తీశా. హనుమంతుని కథలో జరిగిన ఒక కీలక ఘటనని తీసుకొని ఈ మూవీ చేశాం. ‘హను–మాన్’ టీజర్ విడుదలైన తర్వాత రాజమౌళిగారిని కలిశాను. ఆయన ఇచ్చిన సూచనలతో మాకు చాలా సమయం కలిసొచ్చింది. జూలై ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ని(పీవీసీయూ) నా బర్త్ డే కానుకగా నేడు అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘అధీర’ ఫిల్మ్ రూపొందుతోంది. బాలకృష్ణగారితోనూ ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా హనుమాన్. జాంబిరెడ్డి లాంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా విడుదలైన టీజర్తో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. దీంతో రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ గ్రాఫిక్ పనులు, ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని తెలిపారు. కాగా ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
Hanu-Man: అంజనాద్రి కోసం పోరాటం
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హను–మాన్’. అమృతా అయ్యర్ కథానాయిక. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారంతో పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హనుమంతుని శక్తులను పొందిన హీరో అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడు? అనేది చిత్ర కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్గా ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తాం’’ అన్నారు. -
'హనుమాన్'కి గ్రాఫిక్స్ హాలీవుడ్ కాదు.. మన హైదరాబాద్లోనే
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజనాద్రి (Anjanadri) అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవలె ఈ సినిమా టీజర్ విడుదలై జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విశేషంగా ఆకట్టుకుంది. దీనికి మరో ప్రధాన కారణం "వి.ఎఫ్.ఎక్స్". హాలీవుడ్ స్టాండర్డ్స్ ను తలదన్నేలా కనిపిస్తున్న ఈ గ్రాఫిక్స్ అద్దింది హైదరాబాద్ కు చెందిన "హేలో హ్యూస్ స్టూడియోస్" సంస్థ. దీంతో ఈ గ్రాఫిక్స్ కంపెనీ గురించి పలువురు టాలీవుడ్ దర్శకులు చర్చించుకుంటున్నారు. -
అదే హనుమాన్ కథ, ఇది పాన్ వరల్డ్ చిత్రం: ప్రశాంత్ వర్మ
ఇది పాన్ వరల్డ్ చిత్రం ‘‘మన తెలుగు సినిమాలు ‘ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ పాన్ వరల్డ్ వెళుతున్నాయి. మా ‘హనుమాన్’ కూడా పాన్ వరల్డ్ ఫిల్మ్. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా ఉంటుంది’’ అని ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘హనుమాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. చదవండి: అదిరిపోయిన 'హనుమాన్' టీజర్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన హనుమాన్ పేరుతో ఇంత పెద్ద సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు ఎక్కువ అయినా నిరంజన్ రెడ్డిగారు రాజీపడలేదు. పౌరాణిక పాత్ర అయిన హనుమాన్పై తొలిసారి పూర్తి స్థాయి సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘‘స్పైడర్ మాన్, సూపర్ మాన్ ఫిక్షనల్ హీరోలు. కానీ, హనుమాన్ మన చరిత్ర. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడు? అనేది ఈ సినిమా’’ అన్నారు. ‘‘హనుమాన్’తో త్వరలోనే థియేటర్లో కలుద్దాం’’ అన్నారు అమృత. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? -
అదిరిపోయిన 'హనుమాన్' టీజర్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. కొండలు, లోయలు, జలపాతాల నడుమ విజువల్ వండర్గా టీజర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు. The Ancients Shall Rise Again✊ Taking you all into a whole new surreal world of #HanuMan 💪#HanuManTeaser OUT NOW❤️🔥 - https://t.co/euGU07T7Ha 🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #PVCU#SuperHeroHanuMan pic.twitter.com/QCcSNvx1Nu — Prasanth Varma (@PrasanthVarma) November 21, 2022 -
'హనుమాన్' టీజర్.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం హనుమాన్. తేజసజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇదివరకే రిలీజ్ కావాల్సి ఉండగా సూపర్ స్టార్ కృష్ణ మృతితో వాయిదా పడింది. తాజాగా హనుమాన్ టీజర్పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. ఈనెల 21న ఈ సినిమా టీజర్ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ను వదిలారు. కాగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. #HanuManTeaser on NOV 21st @ 12:33PM💥 🌟ing @tejasajja123#SuperHeroHanuMan ❤️🔥@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsmusicsouth pic.twitter.com/Ecnoo1hHji — Prasanth Varma (@PrasanthVarma) November 19, 2022 -
'హనుమాన్' టీజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తేజసజ్జా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో కీలక అప్డేట్ను వదిలారు. ఈ సినిమా టీజర్ను ఈనెల 7న రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు ప్రశాంత్ వర్మ. కాగా ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. -
బాలయ్య 'అన్ స్టాపబుల్' సీజన్-2 నుంచి క్రేజీ అప్డేట్
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్షో ‘అన్స్టాబుల్ విత్ ఎన్బీకే’. సెలబ్రిటీలతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. ఇక ‘అన్స్టాపబుల్’ సెకండ్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ఆహా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ షోకు సంబంధించి మరో సాలిడ్ అప్డేట్ వదిలారు. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ టీజర్ను రేపు(మంగళవారం)విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి బాలయ్య లుక్ను ఆహా విడుదల చేసింది.దులో బాలకృష్ణ క్యాప్ పెట్టుకుని, డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన టీజర్ రేపు సా. 6గంటలకు విజయవాడలో లాంచ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
'హనుమాన్'పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో అప్డేట్ వచ్చింది. నేడు(మంగళవారం) హీరో తేజ సజ్జా పుట్టినరోజు కావడంతో ఆయనకి విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు.ఈ సినిమా నుంచి అసలైన గిఫ్ట్ ఈ దసరాకి అందిస్తానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. కాగా ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. Happy birthday my Super Hero @tejasajja123 🤗 Gift #Dussehra ki yisthaa! 😉#HanuMan #HappyBirthdayTejaSajja 🥳#SuperHeroHanuMan🔶@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets @tipsofficial pic.twitter.com/qMBLw6TdCH — Prasanth Varma (@PrasanthVarma) August 23, 2022 -
పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆ హీరో.. అదరగొడుతున్న పోస్టర్
యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగించాయి. తాజాగా విడుదలైన మరో పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ మైఖెల్ పాత్రలో హీరో వినయ్ రాయ్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన పోస్టర్ను రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ చూస్తుంటే ఇందులో వినయ్ రాయ్ అత్యంత బాడాస్ ఈవిల్ మ్యాన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లాంగ్ సూట్లో చుట్టూ డ్రోన్స్తో ఉన్న వినయ్ రాయ్ పోస్టర్ థ్రిల్లింగ్గా ఉంది. వినయ్ రాయ్ ఇంతకుముందు నీవల్లే నీవల్లే, వాన సినిమాలో హీరోగా అలరించాడు. కాగా ఈ మూవీలో ఓ కీరోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్న విషయం తెలిసిందే. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు -
పదిమంది హీరోయిన్లతో ప్రశాంత్ వర్మ సినిమా!
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘అ’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సూపర్ హీరో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం ప్రశాంత్ వర్మ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. పది మంది హీరోయిన్లతో డిఫరెంట్ సబ్జెక్ట్తో కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ను సంప్రదించడం, ఆమె ఓకే చేయడం చకాచకా జరిగిపోయాయని తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్ కూడా పాపులారిటీని బట్టి తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. -
డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ అవుట్
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా అధీర అనే మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు విడుదల చేశారు. ఈ ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’ను హాలీవుడ్లో రెంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ను చూపించారు. చూస్తుంటే మరో సూపర్ హీరో సినిమాను ప్రశాంత్ వర్మ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. -
100 రోజులు పూర్తి.. సెలబ్రేట్ చేసుకున్న ‘హను-మాన్’ టీమ్
వినూత్న కథలతో సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా హానుమాన్. తేజ సజ్జ హీరోగా చేస్తున్న ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుందని ఓ వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. చాలా మంది ఈ చిత్రం కోసం కష్టపడుతున్నట్లు తెలిపారు. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. Thank you my cast & crew for bearing with me these 100 DAYS! ♥️ I promise to make this film worth all your efforts & handwork! 🙏🏼 HANU🔶MAN@tejasajja123 @Actor_Amritha @varusarath5 @Niran_Reddy @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets#HanuManTheOrigin pic.twitter.com/8cXNqOrubY — Prasanth Varma (@PrasanthVarma) March 17, 2022 -
హను-మాన్: తేజ సజ్జా లుక్ అదిరిందిగా!
మొదటి సినిమానే ‘అ!’ వంటి వినూత్న కథతో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కూడా కల్కి, జాంబీరెడ్డి వంటి డిఫరెంట్ జోనర్లనే కథ వస్తువుగా తీసుకున్నాడు. కాగా ఆయన మరోసారి ‘హను-మాన్’ వంటి వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని మాలయాళ స్టార్ హీరో, మహానటి ఫేం దుల్కర్ సల్మాన్ శనివారం (సెప్టెంబర్ 18న) విడుదల చేశాడు. తేజ సజ్జ హీరోగా చేస్తున్న ఈ సినిమాని శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ హను-మాన్ చిత్రం కోసం అంజనాద్రి అనే కొత్త, ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. వీడియోలో తేజ సజ్జా అడవిలో పరిగెత్తడం, జారడం, దూకడం, స్లింగ్షాట్ను షూట్ చేయడం కనిపిస్తుంది. సూపర్ హీరో గట్టిగా భూమిని తాకినప్పుడు..అతని పంచింగ్ పవర్ ఏంటో చూపించారు. సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కాగా ఇంతకుముందు రిలీజ్ చేసిన `హను-మాన్` టైటిల్ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో జాంబీ రెడ్డి కాంబీనేషన్ మ్యాజిక్ రిపిట్ చేస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది ఈ సినిమాని తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయనున్నట్లు మూవీ టీం తెలిపింది. అత్యాధునిక వీఎఫ్ఎక్స్తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోనే జరుగుతోంది. అయితే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
కథ చెప్పేందుకు వెళ్తే హీరో నన్ను వర్షంలో నిలబెట్టాడు: డైరెక్టర్
వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అ, కల్కి, వంటి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మ ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్లో జాంబీ జోనర్ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. దర్శకుడిగా సత్తా చాటుతున్న ఆయన ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలినాళ్లలో తనకు ఎదురైన అవమానాల గురించి వెల్లడించాడు. 'ఓ హీరోకు కథ చెప్పడానికి వాళ్ల ఇంటికి వెళ్లాను. ముందుగానే ఆయనకి కాల్ చేసి రమ్మంటేనే వెళ్లాను. అయితే అక్కడికి చేరుకోగానే పెద్ద వర్షం మొదలైంది. దీంతో నేను గేటు బయటే ఉండి ఆయనకు కాల్ చేశాను. అయినా నన్ము లోపలికి రమ్మనకుండా అలానే వర్షంలో వెయిట్ చేయించాడు. ఆ రోజు వర్షంలో నేను తడిసిపోతూ, ఆయన ఇంటివైపు చూస్తూ నిలబడ్డాను. కిటికీలోంచి ఆ హీరో నన్ను చూస్తుండటం నేను గమనించాను. కనీసం లోపలికి కూడా పిలవకుండా బయటే నిలబెట్టడంతో చాలా కోపం వచ్చింది. అయినా తమాయించుకొని ఆ హీరోకు కథ చెప్పి సినిమా కూడా చేశాను' అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తేజ సజ్జాతో కలిసి హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
యంగ్ హీరో తేజా సజ్జ షాకింగ్ రెమ్యునరేషన్!
చెల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఓ బేబి సినిమాతో చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిపరెంట్ జానర్తో తొలిసారే ప్రయోగం చేసిన తేజ ఇప్పుడు జోరు మీదున్నాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం హను-మాన్ అనే చిత్రంలో తేజ నటిస్తున్నాడు. జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్గా ఫిక్షనల్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం తేజ సజ్జ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో చేరిపోయాడు. హను-మాన్ చిత్రం కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేశాడట. ఇటీవలె జాంబిరెడ్డి సినిమాతో ఆకట్టుకున్న తేజ ప్రస్తుతం ఉన్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయల రెమ్యునరేషన్ను తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. -
ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ'
చెల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఇటీవలె క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ జాంబిరెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జాంబీస్ లాంటి కొత్త జోనర్తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘హనుమాన్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం. ఇక మరో ఇంటట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం వరలక్ష్మి శరత్కుమార్ను సంప్రదించారట. ఇటీవలె తెలుగులో ఆమె నటించిన క్రాక్, నాంది సినిమాలకు మంచి ఆధరణ లభించింది. ముఖ్యంగా వరలక్ష్మి పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. చదవండి : వైరల్ : షూటింగులో హీరో విశాల్కు తప్పిన పెద్ద ప్రమాదం సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు -
ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కొత్త మూవీ, టైటిల్ ఖరారు
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన నాలుగవ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘హనుమాన్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక దీనికి సంబంధించిన టీజర్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. పురాణ ఇతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీజర్ ద్వారా మేకర్స్ స్పష్టం చేశారు. తెలుగులోనే ఒరిజినల్ సూపర్ హీరో ఈ మూవీ ఉండనుందని వారు పేర్కొన్నారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. నేపథ్య సంగీతంతో దైవిక అనుభూతిని కలిగించించేలా ఉండటంతో ప్రేక్షకులను విశేషం ఆకట్టుకుంటోంది. వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ జానర్తో ‘అ!’ మూవీని నేషనల్ అవార్డ్ దక్కేలా వినూత్నంగా తెరకెక్కించాడు ఆయన. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ లీడ్ రోల్ వచ్చిన కల్కి మూవీని సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు అందించాడు. ఈ మూవీకి స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల సౌత్లో తొలిసారిగా జాంబీల జానర్లో జాంబీరెడ్డి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది. -
నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేసిన 'జాంబిరెడ్డి' డైరెక్టర్
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. 'క్రొత్త సినిమాటిక్ యూనివర్స్' అంటూ ఓ పోస్టర్ను విడదుల చేశాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న 4వ సినిమా ఇది. తొలి సినిమా నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. రేపు మే29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ మేరకు రేపు శనివారం ఉదయం 9గంటల 9నిమిషాలకు సినిమా ప్రకటన ఉండబోతుందంటూ ప్రశాంత్ వర్మ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. అ, కల్కి, వంటి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మ ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్లో జాంబీ జోనర్ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం ఇటీవలె టీఆర్పీ రేటింగుల్లో కూడా దూసుకుపోయింది.జాంబిరెడ్డి తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం పీవీ4పై అంచనాలు నెలకొన్నాయి. 𝐀 𝐍𝐞𝐰 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐭𝐢𝐜 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐞 💥 Any guesses, which Genre it might be?? 🤔 pic.twitter.com/6boSr7mzBT — Zombie Varma (@PrasanthVarma) May 28, 2021 చదవండి :తెలుగులో హీరోగా చేయనున్న విజయ్ సేతుపతి! ‘పెళ్లి సందD’ కి క్రేజీ ఆఫర్... ఓటీటీలో విడుదలకు సిద్దం! -
మళ్లీ భయపెట్టడానికి జాంబీలు వస్తున్నాయి!
Zombie Reddy: తెలుగు ప్రేక్షకులకు తొలిసారి జాంబీలను పరిచయం చేసిన సినిమా జాంబీ రెడ్డి. హాలీవుడ్కు మాత్రమే పరిమితమైన ఇలాంటి కొత్త జోనర్ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జా ఈ మూవీతో హీరోగా మారాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ మధ్యే ఓటీటీ‘ఆహా’లో విడుదలై 9.7 టీఆర్పీ రేటును సాధించింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రానుందట. తాజాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఈ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడని, దీనిపై హీరో తేజతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. . ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘ఒక గన్ను 6 బులెట్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం జాంబీరెడ్డి 2 ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నాడట. మరి జాంబీ రెడ్డి సీక్వెల్పై వస్తోన్నవార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఆ డైరెక్టర్కు బేబమ్మ నో చెప్పడమేంటి? బన్నీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘పుష్ప’ -
'జాంబీ రెడ్డి'కి బెదిరింపులు: దర్శకుడు
‘‘లాక్ డౌన్ తర్వాత ఆరంభించిన ఫస్ట్ చిత్రం మా ‘జాంబిరెడ్డి’. మొదట్లో ఇద్దరు ముగ్గురుతో ఉన్న సీన్స్ చేశాం.. ఒక్కో వారం గ్యాప్ తీసుకొని చేయడం వల్లే సినిమా ఇంత ఆలస్యం అయ్యింది.. లేదంటే మా సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మన సినిమాల్లో లవ్ జానర్ ఎలానో జాంబీ కూడా ఒక జానర్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ అల్లుకుని ఈ సినిమా తీశా. హాలీవుడ్లో ఇప్పటికే జాంబీ సినిమాలు తీసినవాళ్లకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ సినిమా అనుకున్నాను. కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది. ఒక తెలియని విషయాన్ని మనకు తెలిసిన విషయానికి కనెక్ట్ చేసి చెప్తే సులభంగా అర్థమవుతుంది. త్రివిక్రమ్గారు ఈ విధంగా చేస్తుంటారు. మహాభారతం, భాగవతంతో కలిపి తన సినిమాల్లో చెబుతుంటారాయన. అలా నేను కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేద్దామనుకొని జాంబీ కాన్సెప్ట్కి ఫ్యాక్షన్ యాడ్ చేశాను. ‘జాంబిరెడ్డి’ టైటిల్ పెట్టినప్పుడు చాలానే బెదిరింపులు వచ్చాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఇండస్ట్రీలో భిన్నమైన స్వరాలు వినిపించాయి. ‘ఇలాంటి జానర్ మేం చేద్దాం అనుకున్నాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాదేమో అని వదిలేశాం’ అని కొందరు.. ‘మంచి ఐడియా’ అని మరికొందరు అన్నారు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ‘నువ్వు సాధించావ్’ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో పెద్ద హీరో అయితే మార్కెట్ పరిధి బాగుండేది. కానీ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టేదేమో? త్వరగా సినిమా చెయ్యాలనుకున్నాను.. తేజ సరిపోతాడనిపించి తీశాను. మా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యాక హిందీ రీమేక్కి అవకాశాలొచ్చాయి. సమంతగారికి చెప్పింది ‘జాంబిరెడ్డి’ కథ కాదు.. వేరేది. మేమిద్దరం ఆ స్క్రిప్ట్ని నమ్మాం.. కానీ నిర్మాత దొరకలేదు. నా దగ్గర ప్యాన్ ఇండియా కథలు కూడా ఉన్నాయ్. ‘జాంబిరెడ్డి’ విజయం సాధించి మంచి పేరు వస్తే, సీక్వెల్ని ప్యాన్ ఇండియా స్థాయిలో తీస్తాం’’ అన్నారు. -
‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: ‘అ, కల్కి’ వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజ్శేఖర్ వర్మ నిర్మించారు. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించారనే సస్పెన్స్కు తెరదించుతూ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది. బాల నటుడిగా అందరి ప్రశంసలు పొంది, సమంత లీడ్ రోల్ చేసిన ‘ఓ బేబీ’లో ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమవుతున్నాడు. నేడు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ గద పట్టుకొని ఉండగా, జాంబీలు అతనిపై దాడి చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఇక మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. తన వెనకవైపు చిరంజీవి బొమ్మ ఉన్న షర్ట్ ధరించి స్టైల్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తేజ. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్ , కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటì . -
‘ఇది ‘అ!’ కన్నా క్రేజీగా ఉంటుంది కానీ..’
రెండేళ్ల క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అ!’ చిత్రం ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది. వాల్పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా సీక్వెల్ను ఆశించారు కొందరు ప్రేక్షకులు. ఇప్పుడు ‘అ!’ సీక్వెల్ స్క్రిప్ట్ను పూర్తి చేసినట్లు వెల్లడించారు ప్రశాంత్ వర్మ. ‘‘అ! 2’ కోసం నన్ను అడుగుతూ, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారందరికీ ధన్యవాదాలు. దాదాపు ఏడాది క్రితమే ‘అ! 2’ స్క్రిప్ట్ను పూర్తి చేశాను. ఇది ‘అ!’ కన్నా క్రేజీగా ఉంటుంది. కథ అంతకు మించి ఉంటుంది. కానీ సెట్స్పైకి తీసుకువెళ్లలేకపోతున్నాను. ఎందుకుంటే స్క్రిప్ట్లోని క్రేజ్నెస్కి తగ్గ క్రేజీ ప్రొడ్యూసర్ కుదరడం లేదు. నన్ను నమ్మండి. ప్రయత్నించి చాలా అలసిపోయాను. కాబట్టి జరగాల్సినప్పుడే అది (‘అ!2’ షూటింగ్ను ఉద్దేశించి) జరుగుతుంది’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు ప్రశాంత్వర్మ. -
క్రైమ్ పార్ట్నర్
ఓ నేరస్తుడ్ని పట్టుకోవడానికి అఖిల్ వేయనున్న ప్లాన్కు హెల్ప్ చేయడానికి రెడీ అవుతున్నారట నివేదా థామస్. ‘అ!, కల్కి’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా నివేథా ధామస్ పేరును చిత్రబృందం పరిశీలిస్తోందని తెలిసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు అఖిల్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మతో చేయనున్న సినిమా ఆరంభం అవుతుంది. -
‘అ!’ సీక్వెల్లో టాప్ స్టార్స్!
యంగ్ హీరో నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రశాంత్ వర్మకు ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. ఇటీవల కల్కి సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ప్రశాంత్, త్వరలో అ! సినిమాకు సీక్వెల్ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తోనే రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. -
'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా కసండ్ర, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం `అ!`. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66 జాతీయ అవార్డుల్లో `అ!` చిత్రం మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా..నిర్మాత నాని మాట్లాడుతూ ``కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ను స్టార్ట్ చేశాం. తొలి ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో `అ!` సినిమాను రూపొందించాం. సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహానిచ్చింది. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా ఎంటైర్ యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్`` అన్నారు. -
కొత్త గెటప్
‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు అఖిల్. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ మధ్యనే ప్రారంభమైంది. అప్పుడే తదుపరి సినిమాను లైన్లో పెడుతున్నారట అఖిల్. ‘అ!, కల్కి’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని తెలిసింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని టాక్. ఇందులో అఖిల్ లుక్ సరికొత్తగా, ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటుందట. అందుకే ‘బొమ్మరిల్లు’ భాస్కర్తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారట. -
మరోసారి ‘అ!’ అనిపిస్తారా?
అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ కల్కి సినిమాతోనూ తన ఇమేజ్ను కాపాడుకున్నాడు. ప్రస్తుతం క్వీన్ రీమేక్కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఈ యువ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. తొలి రెండు చిత్రాలను ప్రయోగాత్మక కథలతో తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమా కోసం లేడీ ఓరియంటెడ్ కథను సిద్ధం చేశాడు. ఈ సినిమాలోనూ తన తొలి చిత్ర కథానాయకి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనున్నారు. అంతేకాదు సినిమాను తమన్నాతో కలిసి కాజల్ స్వయంగా నిర్మించే ఆలోచనలో ఉన్నారట. చాలా కాలంగా నిర్మాతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాజల్ ఈ సినిమాతో తన ప్రొడక్షన్ హౌజ్ను ప్రారంభించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
అలాంటి పాత్రలైతే విలన్గా చేస్తా : రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్తో దూసుకుపోతున్న సందర్భంగా రాజశేఖర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? నా నటనకు మంచి పేరు వచ్చింది. నా లుక్స్, నా మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారు. కథ, నా క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ టేకింగ్... అన్ని బాగున్నాయని అంటున్నారు. మీ సినిమాలలో మీ క్యారెక్టర్ డామినేటింగ్గా ఉంటుంది. ఇందులో అండర్ ప్లే చేసినట్టున్నారు? క్యారెక్టర్ పరంగా నేను డామినేట్ చేశానా? అండర్ ప్లే చేశానా? అనేది పక్కన పెడితే... ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఫైట్ బాగున్నాయని అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా నా అభిమానులకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరూ ఐదేసి సార్లు సినిమా చూస్తున్నారు. ‘సార్... ఇప్పుడే రెండోసారి సినిమా చూసాం మళ్లీ వెళుతున్నాం, సార్... ఫ్యామిలీతో కలిసి మళ్లీ సినిమాకి వెళ్తున్నాం’ అని ఫోనులు చేస్తుంటే... నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది. సినిమాలో మీ స్టైలింగ్ మీద చాలా కాన్సంట్రేట్ చేసినట్టున్నారు? పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్తే చాలు... నేను డైటింగ్ చేయడం, వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫిట్నెస్ మీద దృష్టి పెడతా. ఇన్షర్ట్ చేసుకుంటే పొట్ట కనిపించకూడదు. ఇందులో పోలీస్ క్యారెక్టర్ కావడంతో కాస్త ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం? నేను ఉన్న ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ డైలాగ్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ వివరించినప్పుడు మీరు ఏమన్నారు? సినిమాలో రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెప్తాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక రోజు వచ్చి సన్నివేశాన్ని వివరించారు. ‘ప్రశాంత్! సన్నివేశాన్ని భలే రాశారే’ అన్నాను. ఆ రోజు షూటింగ్ చేసేశాం. రెండోసారి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్కి వచ్చింది. తనతో ఆ డైలాగ్ గురించి చెప్పాను. ‘ఇది మీ డైలాగే కదా!’ అంది. (నవ్వుతూ) అప్పటివరకు నాకు అది నా డైలాగే అనే సంగతి కూడా నాకు గుర్తు లేదు. కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసి మీ పిల్లలు ఏమన్నారు? వాళ్లకు సినిమా బాగా నచ్చింది. పిల్లలు ఇద్దరూ మెచ్చుకున్నారు. అంతే కాదు, వాళ్ల స్నేహితులు సినిమా చూసి... ‘మీ నాన్నగారు యంగ్ హీరోలకు ధీటుగా ఫైట్స్ చేశారు’ అని చెప్పారట. దాంతో మరింత సంతోషపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ లవ్ ట్రాక్ను కూడా చాలా బాగా డీల్ చేశారు. మీరు చూస్తే అందులో ఎక్కడా హీరో హీరోయిన్ మధ్య టచింగ్స్ ఉండవు. అదా శర్మతో నా పెయిర్ సూపర్ ఉందని మా అమ్మాయిలు చెప్పారు. రాహుల్ రామకృష్ణ కోణంలో కథను చెప్పారు. ఎందుకలా? స్క్రీన్ప్లేలో అదొక స్టైల్. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తే రొటీన్ అవుతుందని ఇలా ప్రయత్నించాం. రాహుల్ రామకృష్ణ కోణంలో కథ చెప్పడం వల్ల క్లైమాక్స్కు అంత పేరు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు అలా చెప్పడం వల్ల థ్రిల్ ఫీలవుతున్నారు. మీరు, బాలకృష్ణగారు కలిసి సినిమా చేస్తారనే వార్త వినిపిస్తోంది! చాలా వినిపిస్తున్నాయి. చిరంజీవిగారు, నేను చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. విలన్గా చేయడానికి సిద్ధమేనా? నేను రెడీ. (నవ్వుతూ) నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు... ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. అరవింద సమేత వీరరాఘవ, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా. ‘దొరసాని’తో శివాత్మిక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తండ్రి, కుమార్తె కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా? ఉంది. అయితే... ఇప్పుడు కాదు. పెద్దమ్మాయి శివాని కూడా కథానాయికగా పరిచయమైన తర్వాత చేస్తాం. నిజానికి, దొరసాని కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్ కి చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది. నిన్న విడుదలైన దొరసాని ట్రైలర్ చూసి సావిత్రిగారితో కొందరు పోలుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా? ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్ సత్తారు గారు గరుడవేగ 2 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. -
‘కల్కి’ మూవీ రివ్యూ
-
‘కల్కి’ మూవీ రివ్యూ
టైటిల్ : కల్కి జానర్ : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తారాగణం : రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేతా, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా సంగీతం : శ్రావణ్ భరద్వాజ్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : సీ కల్యాణ్, శివాని, శివాత్మిక గరుడవేగ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్, అ! లాంటి డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కల్కి. రాజశేఖర్ను మరోసారి యాంగ్రీ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. తొలి సినిమాతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని కల్కి నిలబెట్టిందా..? ఈ థ్రిల్లర్తో రాజశేఖర్ మరో సక్సెస్ అందుకున్నాడా..? కథ : కల్కి.. కథ అంతా 1980ల కాలంలో సాగుతుంది. రజాకార్ల దాడుల్లో రాజు చనిపోవటంతో కొల్లాపూర్ సంస్థానం బాద్యతలు రాణీ రామచంద్రమ్మ తీసుకుంటారు. సంస్థానం మీద కన్నేసిన ఆ ప్రాంత ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా), పెరుమాండ్లు (శత్రు) రాణీని చంపి సంస్థానాన్ని హస్తగతం చేసుకొని ప్రజలను హింసిస్తుంటారు. తరువాత నర్సప్ప, పెరుమాండ్లు మధ్య కూడా గొడవలు రావటంతో ఊరు రణరంగంలా మారుతుంది. ప్రజలు నర్సప్ప అరాచకాల్ని భరించలేక, ఎదురుతిరగలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు. అదే సమయంలో పట్నం నుంచి వచ్చిన నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు(సిద్దు జొన్నలగడ్డ)ను దారుణంగా హత్య చేస్తారు. హత్యకు కారణం నర్సప్ప అని కొందరు, కాదు పెరుమాండ్లు చంపాడని మరి కొందరు, కాదూ రాణీ రామచంద్రమ్మ దెయ్యం అయి వచ్చి చంపిందని మరికొందరు అనుకుంటుంటారు. ఈ హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కల్కి(రాజశేఖర్)ని ప్రత్యేకంగా అపాయింట్ చేస్తారు. కొల్లాపూర్ వచ్చిన కల్కి, జర్నలిస్ట్ దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) సాయంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. కల్కి ఈ కేసు ఎలా చేదించాడు..? అసలు శేఖర్ బాబు ఎలా చనిపోయాడు.? ఎవరు చంపారు..? ఈ కథతో ఆసిమా(నందితా శ్వేత)కు సంబంధం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : గరుడ వేగ సక్సెస్తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్, కల్కి పాత్రలో జీవించాడు. అక్కడక్కడా లుక్ పరంగా కాస్త ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా మరోసారి యాంగ్రీ హీరోగా సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్లోనూ ఆకట్టుకున్నాడు. అదా శర్మ పోషించిన హీరోయిన్ పాత్రకు కథలో ఏ మాత్రం ప్రాదాన్యం లేదు. కేవలం ఓ పాట కోసమే ఆమెను తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందితా శ్వేత.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచి నటిగా పేరున్న నందితా ఈ సినిమాతో మరోసారి తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సినిమాను నడిపించే పాత్రలో రాహుల్ రామకృష్ణ ఆకట్టుకున్నాడు. సీరియస్ మోడ్లో సాగే కథనంలో అప్పుడప్పుడు తనదైన కామిక్ టైమింగ్తో మెప్పించాడు. విలన్గా అశుతోష్ రాణా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో శత్రు, నాజర్, సిద్దు జొన్నలగడ్డ, చరణ్దీప్, పూజితా పొన్నాడ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఇది పూర్తిగా ప్రశాంత్ వర్మ మార్క్ సినిమా. రెండో ప్రయత్నంగా పీరియాడికల్ థ్రిల్లర్ను ఎంచుకున్న ప్రశాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్ప్లే, థ్రిల్లింగ్ ట్విస్ట్లతో మంచి కథా కథనాలను రెడీ చేసుకున్నాడు. అయితే చెప్పాల్సిన కథ రెండున్నర గంటలకు సరిపడా లేకపోవటంతో కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అర్థంకాని స్క్రీన్ప్లే ప్రేక్షకులను తికమకపెడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ కమర్షియల్ ఫార్మాట్ కోసం కావాలనే ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ ట్విస్ట్లతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్ను కట్టిపడేశాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం, పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్ నేపథ్యం సంగీతంతో వావ్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. శివేంద్ర సినిమాటోగ్రఫి కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. 80ల నాటి లుక్ తీసుకురావటంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి. సీ కల్యాణ్తో కలిసి స్వయంగా సినిమాను నిర్మించిన రాజశేఖర్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రూపొందించాడు. ప్లస్ పాయింట్స్ : నేపథ్య సంగీతం క్లైమాక్స్ ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్ మైనస్ పాయింట్స్ : హీరోయిన్ పాత్ర స్క్రీన్ప్లే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ సాంగ్స్ - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
బాలయ్య ‘అ’ దర్శకుడితోనా!
తన చర్యలతో అభిమానులకు షాక్ ఇచ్చే నందమూరి బాలకృష్ణ, అప్పుడప్పుడూ సినిమాల విషయంలోనూ అలాంటి షాక్లే ఇస్తుంటాడు. ఎవరూ ఊహించని కాంబినేషన్లో సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసి అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు బాలయ్య. తాజాగా మరోసారి అలాంటి క్రేజీ కాంబినేషన్ తెరమీదకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. శుక్రవారం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ వర్మ ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా బాలయ్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిపారు. గతంలో అ! సినిమా ప్రమోషన్ సమయంలోనూ ఇలాంటి కామెంట్సే చేశాడు ప్రశాంత్. దీంతో బాలకృష్ణ.. ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా త్వరలోనే పట్టాలెక్కే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో చూడాలి. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కల్కి’
యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి. శివాని, శివాత్మిక, వైట్ లాంబ్ టాకీస్ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా ట్రైలర్లో హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే లాంటి డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై హైప్ మరింత పెంచాయి. రాజశేఖర్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కల్కి పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. గరుడవేగ తర్వాత కల్కితో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణాలు కీలక పాత్రల్లో నటించారు. -
కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!
గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ రావటంతో ట్రైలర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోమవారమే ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం ఉదయం రిలీజ్ చేశారు. ట్రైలర్లోనే సినిమా లైన్ ఎంటో చెప్పేశారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే నరసప్ప తమ్ముడు శేఖర్ బాబు హత్య కేసు చుట్టూ తిరుగుతుంది కల్కి కథ. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారిగా రాజశేఖర్, జర్నలిస్ట్గా రాహుల్ రామకృష్ణలు కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, నాజర్, స్కార్లెట్ మెలిష్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా, శత్రులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీ కల్యాణ్తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కల్కి’.. మాకు ఈ ఎదురుచూపులేంటి?
‘గరుడవేగ’ విజయవంతం అయ్యే సరికి యాంగ్రీస్టార్ రాజశేఖర్ మళ్లీ ఫామ్లోకి వచ్చారు. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన రాజశేఖర్కు ఈ చిత్రం ఘన విజయాన్ని ఇచ్చింది. ఈ మూవీ ఇచ్చిన బూస్ట్తో మళ్లీ అదే ఎనర్జితో సినిమాలను చేస్తున్నారు. యంగ్ టాలెంటెండ్ ప్రశాంత్ వర్మతో తీస్తున్న ‘కల్కి’ చిత్రం ఇప్పటికే భారీ హైప్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ విడుదల చేయడంలో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయాల్సిన ట్రైలర్ను సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సాంకేతికలోపం తలెత్తడంతో ఇప్పటికీ విడుదల చేయలేకపోయింది చిత్రబృందం. దీంతో ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం ఇంకెంతసేపు ఎదురుచూడాల్సి వస్తుందో మరి. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నందితా శ్వేత, పూజిత పొన్నాడ, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారు. -
జూన్ 28న రాజశేఖర్ ‘కల్కి’ విడుదల!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన ‘హార్న్ ఓకే’ పాటను బుధవారం రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. లలిత కావ్య పాడిన ఈ పాటను కేకే రాశారు. మధుర మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ‘పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా చేస్తున్నాడు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘డిఫరెంట్ మాస్ ఎంటర్టైనర్ సినిమా కల్కి. ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేసి తమకు ట్రైలర్ ఎంత నచ్చిందో చెప్పారు. సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్లోనూ టాప్ ట్రెండ్స్ లో నిలిచింది. రాజశేఖర్ గారి ఇమేజ్కి తగ్గ విధంగా, కొత్త తరహా సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి’ అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో... థియేటర్లలో ప్రేక్షకులకు కల్కి అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు’ అని అన్నారు. -
ఫుల్ జోష్లో రాజశేఖర్..!
‘గరుడవేగ’ ఇచ్చిన విజయంతో యాంగ్రీ మెన్ రాజశేఖర్ ఫుల్ స్వింగ్లోకి వచ్చేశారు. ఈ సినిమా మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తాను ఎంచుకునే కథలపై దృష్టి పెట్టారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి చేస్తున్న రాజశేఖర్.. ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్తో అంచనాలను పెంచేశారు. తాజాగా మరో చిన్న వీడియోను కమర్షియల్ ట్రైలర్ పేరిట విడుదల చేశారు. ఈ కమర్షియల్ ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో రాజశేఖర్ ఫుల్ జోష్లో నటించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్లో వచ్చే.. గీతాప్రభోదం.. అటుపై ఆయన మ్యానరిజంలో చెప్పే డైలాగ్.. చివర్లో ఆయన స్టైల్ డ్యాన్స్పై ఫైర్ అవ్వడం.. ఈ ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. మొత్తానికి మరో హిట్ గ్యారెంటీ అన్న ధీమాలో చిత్రబృందం ఉండగా.. సినీ అభిమానుల్లో సైతం ఈ సినిమా పట్ల ఉత్కంఠనెలకొంది. ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. -
‘కల్కి’ టీజర్ వచ్చేసింది!
‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి. గరుడవేగ సినిమా సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. అందులో భాగం ఈ రోజు టీజర్ను రిలీజ్ చేశారు. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ను ఆసక్తికరంగా రూపొందించారు. గ్రాండ్ విజువల్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. నిర్మాత సీ కల్యాణ్తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రేపే ‘కల్కి’ టీజర్
‘గరుడవేగ’ హిట్తో మళ్లీ సక్సెస్ను అందుకున్న యాంగ్రీమెన్ రాజశేఖర్.. తన తదుపరి ప్రాజెక్ట్ల విషయంలో జాగ్రత్త వహించారు. అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి ఓ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. మోషన్ పోస్టర్స్తోనే సినిమాపై హైప్ను క్రియేట్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 10) ఉదయం 10:10:10 (పది గంటల పది నిమిషాల పది సెకన్ల)కు మూవీ టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. Now amidst all the chaos.. Kalki teaser will be out tomorrow. Hope you guys will love it. April 10th at 10hr 10min 10sec. #KalkiTeaser @PrasanthVarma @eyrahul @adah_sharma @Nanditasweta @ProducerCKalyan pic.twitter.com/FXhqrcRObk — Dr.Rajasekhar (@ActorRajasekhar) April 9, 2019 -
నిర్మాతలుగా స్టార్ హీరోయిన్లు..!
స్టార్ హీరోలు నిర్మాతలుగా మారి వారి సినిమాలను సొంత బ్యానర్లో నిర్మించడమే కాకుండా.. చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే వీరి బాటలోనే హీరోయిన్లు కూడా నడుస్తున్నట్లు కనపిస్తోంది. కాజల్ అగార్వాల్, తమన్నాలు నిర్మాతలుగా మారబోతోన్నారని సమాచారం. కాజల్ అగర్వాల్, తమన్నాలు భాగస్వామ్యులుగా అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించబోతోన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా కల్కి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తైయిన తరువాత ఈ చిత్రం పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. మరి నిర్మాతలుగా మారుతున్న ఈ హీరోయిన్లకు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి. -
‘కల్కి’ టీజర్ : అదరగొడుతున్న రాజశేఖర్!
‘గరుడవేగ’ ఇచ్చిన సక్సెస్తో హీరో రాజశేఖర్లో మంచి జోష్ కనబడుతోంది. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదరుచూసిన ఈ హీరోకు సరైన టైమ్లో సరైన సినిమా పడింది. ఈ సినిమా అంచనాలకు మించి ఆడటంతో రాజశేఖర్ తదుపరి ప్రాజెక్ట్పై అందరి దృష్టి నెలకొంది. నేడు (ఫిబ్రవరి 4) రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ టీజర్ను రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో ఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ టీజర్తో అదరగొట్టేస్తున్నాడు. 1980 నేపథ్యంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ క్రైమ్ బ్యాగ్రౌండ్లో ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి కల్కితో మరో విజయాన్ని సొంతం చేసుకునేలా ఉన్నారు రాజశేఖర్. సి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. -
రేపు ‘కల్కి’ టీజర్ విడుదల
‘గరుడవేగ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో రాజశేఖర్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ను ఈ మూవీతో సాధించారు రాజశేఖర్. మళ్లీ ‘కల్కి’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ ‘అ!’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడిగా మంచి పేరును సంపాదించాడు. తన తదుపరి చిత్రంగా.. 1980 నేపథ్యంలో సాగే డిఫరెంట్ స్టోరీతో కల్కి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్తోనే ఆకట్టుకుంది. రాజశేఖర్ పుట్టినరోజు (ఫిబ్రవరి 4)న ఈ చిత్ర టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేస్తారా.?
ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన సినిమా మణికర్ణి. ఈ సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించటం ప్రధా పాత్రధారి కంగనాతో వివాదం కారణంగా క్రిష్ తప్పుకోవటంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా టైటిల్స్లో దర్శకులుగా కంగనా, క్రిష్ పేర్లు కనిపించాయి. అయితే మేజర్ పార్ట్ డైరెక్ట్ చేసిన తనకే ఎక్కువ క్రెడిట్ దక్కాలంటూ సోషల్ మీడియా వేదిక గొడవపడుతున్నారు. అలాంటి పరిస్థితే ఓ సౌత్ సినిమాకు కూడా ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్కు రీమేక్గా తెరకెక్కుతున్న సౌత్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మీ. ఈసినిమాకు ముందుకు షో ఫేం నీలకంఠ దర్శకత్వం వహించాడు. తరువాత లీడ్ యాక్టర్ తమన్నాతో వివాదం కారణంగా నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మిగతా భాగానికి అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో సినిమాకు దర్శకుడిగా క్రెడిట్ ఎవరికి ఇస్తారు. ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చేట్టయితే ముందుగా ఎవరి పేరు వేస్తారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన దట్ ఈజ్ మహాలక్ష్మీ టీం పోస్టర్లు, టీజర్లను దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేసింది. మరి సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా లేక మరో వివాదానికి తెరతీస్తారా చూడాలి. -
లండన్ దాకా డోల్బాజే అంటున్న తమన్నా
తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మి. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్తో ఆకట్టుకోగా తాజాగా ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రధాన పాత్ర మహాలక్ష్మి పెళ్లి వేడుకు సంబంధించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సంగీతమందించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతమందించిన ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. -
మహాలక్ష్మి పెళ్లి సందడి మూడు రోజుల్లో..!
బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్కు దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్తో ఆకట్టుకోగా త్వరలో ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. జనవరి 16న సినిమాలో పెళ్లివేడుకకు సంబంధించిన పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్లు లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. -
వైరల్ అవుతోన్న ‘కల్కి’ మోషన్ పోస్టర్!
‘గరుడవేగ’ సినిమాతో ఫామ్లోకి వచ్చారు డా.రాజశేఖర్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటంతో రాజశేఖర్ హవా మళ్లీ మొదలైంది. యాంగ్రీ యంగ్మెన్గా రాజశేఖర్ ఎన్నో మరుపురాని హిట్స్ ఇచ్చారు. అయితే గరుడవేగ రిలీజై చాలా రోజులవుతున్నా.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘అ!’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. మంచి ప్రయత్నంగా మిగిలినా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. అయితే రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తన తదుపరి ప్రాజెక్ట్గా ఎంచుకున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. ఆదా శర్మా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. -
మహాలక్ష్మి సందడి మొదలవుతోంది..!
బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు వర్షన్కు దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్తో ఆకట్టుకోగా డిసెంబర్ 21న టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్లు లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. -
రిస్కీ స్టంట్స్ చేస్తున్న సీనియర్ హీరో
చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ మరో ప్రయోగం చేస్తున్నారు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్లో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ షూటింగ్లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారట. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదా శర్మ, నందిత శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
వెబ్ సిరీస్కి దర్శకత్వం
‘అ!’ సినిమాతో ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత సగం కంప్లీట్ అయిన సినిమాకి దర్శకుడిగా మారి ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమాను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్తో ఓ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఈ గ్యాప్లో ఓ వెబ్ సిరీస్ కూడా డైరెక్ట్ చేసే ప్లాన్లో ఉన్నారట దర్శకుడు. ఈ వెబ్ సిరీస్ను ఘట్టమనేని మంజుల నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి అని సమాచారం. మరి ఈ సినిమా జానర్ ఏంటి? పెద్ద యాక్టర్స్ నటిస్తారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. -
సూపర్ స్టార్ సోదరి కొత్త ఇన్నింగ్స్
ఘట్టమనేని వారసురాలిగా వెండితెర మీద సత్తా చాటుతున్న నటి, నిర్మాత, దర్శకురాలు మంజుల. అభిమానుల ఆంక్షల మధ్య వెండితెరకు పరిచయం అయిన మంజుల తొలి సినిమా షోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత అడపాదడపా నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్పై పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారిన మంజుల త్వరలో మరో రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న డిజిటల్ ట్రెండ్కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్ను నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్కు అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలో అధికారక ప్రకటన వెలుడవనుంది. -
కల్కి షురూ
పవర్ఫుల్ పాత్రలతో పాటు కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు కథానాయకుడు డా. రాజశేఖర్. గతేడాది ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తర్వాతి చిత్రానికి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ‘అ!’ వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తర్వాతి చిత్రం ఉంటుందని రాజశేఖర్ ఓ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్రబృందం ‘కల్కి’ టైటిల్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో రాజశేఖర్కి జోడీగా అంజలి కనిపించనున్నారనే వార్త షికారు చేస్తోంది. -
‘అ!’ అనిపించేలా ‘కల్కి’
నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అ!. లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం దట్ ఈజ్ మహాలక్ష్మీ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైటిల్ లోగోను రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం రిలీజ్ చేశారు. శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్ టీజర్ను ఆసక్తికరంగా రూపొందించారు. నిర్మాత సీ కల్యాణ్తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
1983లో ఏం జరిగింది?
1983లో ఇండియాకు తొలిసారి వరల్డ్ కప్ వచ్చింది. చిరంజీవి ‘ఖైదీ’ రిలీజైంది. అలాగే ఓ మర్డర్ కూడా జరిగింది. ఆ మర్డర్ చేసింది ఎవరు? తెలియదు. ఆ మిస్టరీ ఛేదించేందుకు సిద్ధమయ్యారు హీరో రాజశేఖర్. సెకండ్ ఇన్నింగ్స్లో ‘పీయస్వి గరుడ వేగ’తో సూపర్ సక్సెస్ అందుకున్న రాజశేఖర్ స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. 1980లో జరిగే పీరియాడికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ–లుక్ను విడుదల చేశారు. ఆగస్ట్ 26న ఈ చిత్రం టైటిల్ను అనౌన్స్ చేయనున్నారు. -
హింట్ ఇచ్చారు
చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ తర్వాతి చిత్రంపై తొందర పడకుండా ఆచి తూచి అడుగులేస్తున్నారు. తదుపరి చిత్రాన్ని చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ‘గరుడవేగ’ తర్వాత రాజశేఖర్ చేయబోయే సినిమాపై ఫిల్మ్నగర్లో వార్తలు హల్చల్ చేస్తున్నా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా తన తర్వాతి సినిమాపై రాజశేఖర్ ఓ హింట్ ఇచ్చి రూమర్లకు తెరదించారు. ‘‘నా తర్వాతి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. అది ఆసమ్గా (awe some) ఉంటుంది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఆయన తర్వాతి చిత్రం ‘అ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మతోనే అన్న క్లారిటీ వచ్చిందంటున్నారు సినీ జనాలు. ‘అ’ వంటి వైవిధ్యభరిత చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రశాంత్. ప్రస్తుతం తమన్నా లీడ్ రోల్లో ‘క్వీన్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు ప్రశాంత్. సో.. ఆ సినిమా పూర్తయ్యాక రాజశేఖర్ సినిమా పట్టాలెక్కనుందన్నమాట. -
రాజశేఖర్ ‘అ’సమ్!
సీనియర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తరువాత గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తదుపరి చిత్రాన్ని చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఆ సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చాలా రోజులుగా రాజశేఖర్ చేయబోయే సినిమాలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా తాను చేయబోయే సినిమాపై ఈ యాంగ్రీ హీరో ఓ హింట్ ఇచ్చారు. ‘నా నెక్ట్స్ ప్రాజెక్టు గురించి నేను చెప్పగలిగింది ఒక్కటే. ఆ సినిమా ఆసమ్ (AWEsome) గా ఉండబోతోంది’. అంటూ తన ట్విటర్ పేజ్లో కామెంట్ చేశారు. దీంతో రాజశేఖర్ తదుపరి చిత్రం అ! (Awe) చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అన్న క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వర్మ ప్రస్తుతం తమన్నా లీడ్ రోల్ తెరకెక్కుతున్న క్వీన్ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాజశేఖర్ సినిమా పనులు ప్రారంభించనున్నారు. Well.. all I can say about my next project is that, it’s going to be AWEsome! — Dr.Rajasekhar (@ActorRajasekhar) 28 June 2018 -
‘అ’ దర్శకుడేనా?
కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘క్వీన్’ సినిమా ఎంతటి భారీ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి నీలకంఠ దర్శకుడు. అయితే.. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవడంతో కొత్త దర్శకుడు ఎవరా? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. గతంలో కొందరి దర్శకులు పేర్లు వినిపించినా తాజాగా ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన ‘అ’ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ దర్శకుడితో ‘క్వీన్’ తెలుగు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. -
క్వీన్ కోసం ‘అ’ దర్శకుడు
బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రీమేక్ పనులు జరుగుతున్నాయి. అయితే తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇతర భాషల్లో రీమేక్ పనులు జరుగుతున్నా తెలుగు వర్షన్ను మాత్రం పక్కన పెట్టేశారు. తాజా మరో దర్శకుడితో క్వీన్ తెలుగు రీమేక్ను కొనసాగించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. నాని నిర్మాతగా మారి రూపొందించిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ, క్వీన్ తెలుగు రీమేక్కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అ సినిమా కమర్షియల్గా విజయం సాధించకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్ కు మంచి స్పందన వచ్చింది. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తమిళ వర్షన్లో కాజల్, మలయాళ వర్షన్లో మంజిమా మోహన్, కన్నడ వర్షన్లో పరుల్ యాదవ్లు లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. -
ఐశ్వర్య డైరెక్షన్లో రాజశేఖర్!
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమయిన యాంగ్రీ యంగ్మాన్ రాజశేఖర్ కెరీర్ మళ్లీ ‘గరుడవేగ’తో ఊపందుకుంది. దీంతో ఆయన మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను అంగీకరించిన సినిమాలు అన్నీ కొత్త కథలే అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా కెరీర్ను ప్రారంభించి, మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందారు ఐశ్వర్య ధనుష్. ఇటీవలే రాజశేఖర్ను కలిసి సినిమా కథను వినిపించారని, ద్విభాష చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రవీణ్ సత్తారుతో, ‘అ!’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్వర్మతో కూడా రాజశేఖర్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కూడా డిఫరెంట్ జానర్లో తెరకెక్కబోతున్నాయని సమాచారం. వీటన్నింటిలో ఏది ముందు సెట్స్పైకి వెళ్తుందో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. -
అ! దర్శకుడితో రాజశేఖర్
చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న యాంగ్రీ హీరో త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారట. కొత్త సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తోనే ఉండనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రయోగాత్మకంగా తెరకెక్కిన అ! సినిమాతో పరిచయం అయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ యువ దర్శకుడు రాజశేఖర్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు కల్కి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. జూన్ లేదా జూలై మాసాల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెల్లనుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ మహిళా దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఒక సినిమా, మరో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ వరుస సినిమాలతో రాజశేఖర్ తిరిగి ఘన వైభవాన్ని అందుకుంటాడేమో చూడాలి. -
అ!.. చిరు, బాలయ్యల మల్టీ స్టారర్..?
నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు విశ్లేషకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఓవర్ సీస్లో అ! మంచి వసూళ్లు రాబడుతుండటంతో అందరి దృష్టి దర్శకుడు ప్రశాంత్ వర్మపై పడింది. లఘు చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్, వెండితెర మీద కూడా తొలి సినిమాతోనూ తనదైన ముద్ర వేశాడు. అ! సక్సెస్ సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ యువ దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు ఓ భారీ మల్టీ స్టారర్ చేయాలన్న కోరిక ఉందంటున్నాడు ప్రశాంత్. మెగాస్టార్ చిరంజీవి, నటసింహాం బాలకృష్ణలతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని వెల్లడించాడు. గతంలోనూ ఈ కాంబినేషన్లో సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. మరి ప్రశాంత్ అయినా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకొస్తాడేమో చూడాలి. -
వర్మ వీక్ పాయింట్పై కొట్టేశాడు
సాక్షి, సినిమాలు : విలక్షణ సినిమాలు, వివాదాలు.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ప్రతీ విషయాన్ని చాలా క్యాజువల్గా తీసుకునే వర్మ.. ఎవరైనా తన జోలికొస్తే మాత్రం ధీటుగానే స్పందిస్తుంటాడు. అలాంటి వర్మనే ఆశ్చర్యపోయేలా చేశాడు ఓ యువ దర్శకుడు. టాలీవుడ్లో అ! చిత్రంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాడు. వైవిధ్య భరితమైన కాన్సెప్ట్, సాహసోపేతమైన స్క్రిప్ట్తో చిత్రం తెరకెక్కించాడంటూ విమర్శకులు అతనిపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ యువ దర్శకుడు ఓ పోస్టుతో వార్తల్లో నిలిచాడు.‘జనాలంతా నన్ను ఆర్జీవీతో పోలుస్తుంటారు. కానీ, నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్యే రెండే కామన్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఇంటిపేరు.. రెండోది శ్రీదేవి ... అంటూ ట్వీట్ చేశాడు. అది చూసి వర్మ తన ఫేస్ బుక్ పేజీలో ‘అ!’ అంటూ రిప్లై ఇచ్చేశాడు. నటి శ్రీదేవి అంటే వర్మకు ఎంత ప్రత్యేకమైన అభిమానమో తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్ పాయింట్ పేరిట ఆమె పేరు ప్రస్తావన తెచ్చిన ప్రశాంత్.. వర్మను ఎక్కడో టచ్ చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. -
ధన్యవాదాలు చెబుతున్నారు
‘‘ఇలాంటి జానర్లో సినిమా చేయాలని ముందుగానే అనుకున్నాను. కొందరికి ఒక్కసారి చూసిన వెంటనే అర్థం అవుతుంది. మరికొందరికి రెండు మూడు సార్లు చూశాక అర్థం అవుతుంది. నా నెక్ట్స్ మూవీ కూడా ఇలానే ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు ముఖ్య తారలుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘అ!’. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు ప్రశాంత్ వర్మ పాత్రికేయులతో చెప్పిన విశేషాలు. ► నేను ఇంజనీరింగ్ చేశాను. డాక్యుమెంటరీలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్,యాడ్ ఫిల్మ్స్ చేశాను. ‘అ!’ సినిమాకు ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. ఒరిజినల్గా ఏమైనా రాద్దాం అనుకున్నాను. ఎక్స్ప్రెషనిజమ్ అనే జానర్లో క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాను. ఈ సినిమాను నేనే స్వయంగా నిర్మిద్దాం అనుకున్నాను. చేప వాయిస్ ఓవర్ కోసం వెళ్తే నానీగారు ‘నేనే నిర్మిస్తా’ అన్నారు. ► నానీగారికి కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాను. ఆ తర్వాత సినిమా సెట్స్పైకి వెళ్లింది. ఈ సినిమా నేను చేసుంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ నానీగారు నిర్మాత కాబట్టి ఆయనకున్న క్రెడిబులిటీ పాడు చేయకూడదు. ఇదే విషయాన్ని ఆయనకు ముందే చెప్పా. ఆయన కాన్ఫిడెంట్గా సినిమా చేద్దాం అన్నారు. ► ఈ సినిమా నా కోసం కంటే నానీ, ప్రశాంతీగారి కోసం, రాబోయే యువ దర్శకుల కోసం హిట్ కావాలని కోరుకున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్లీ చూడలేనేమో అని కొందరు, ఇంకా కొత్త కథలు రాయాలని మరికొందరు అన్నారు. ఇవే నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్. సినిమా చూసి కంగ్రాట్ చెప్పకుండా థ్యాంక్స్ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. ► కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఇలాంటి సినిమా చేయాలని ముందే అనుకున్నాను. కష్టమేమీ అనిపించలేదు. ఈ సినిమాతో అందన్నీ మెప్పించాలని ఏం అనుకోలేదు. నేను అనుకున్న జానర్ ఆడియన్స్ను మెప్పించాలనే ఉద్దేశంతోనే చేశాను. ► డబ్బు, అవార్డుల కోసం ఈ సినిమా చేయాలేదు. మా టీమ్లో ఎవరో ఒకరికి అవార్డ్ వస్తుంది అనుకుంటున్నాను. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాము. ఈ సినిమా కంటే ముందు చాలామంది నిర్మాతలకు కథలు చెప్పాను. స్టార్ట్ అవుతాయనుకుంటుండగా ఆగిపోయాయి. నా దగ్గర సుమారు 30కి పైగా కథలు ఉన్నాయి. -
‘అ!’ మూవీ రివ్యూ
టైటిల్ : అ! జానర్ : థ్రిల్లర్ తారాగణం : కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి సంగీతం : మార్క్ కె రాబిన్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : నాని, ప్రశాంతి వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. అయితే నాని తొలి ప్రయత్నంగా ఎంచుకున్న సినిమా కథాంశం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. కేవలం కథ, దర్శకుడిని నమ్మి నాని చేసిన ప్రయత్నం ఫలించిందా..? దర్శకుడు నాని నమ్మకాన్ని నిలబెట్టాడా..? కథ : కళి (కాజల్).. జీవితంలో ఎన్నో చేదు అనుభావాలతో విసిగిపోయి తన పుట్టిన రోజున ఓ తీవ్ర నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చివరి సారిగా చిత్ర (ప్రగతి) నిర్వహిస్తున్న ఫుడ్ కోర్ట్లో కూర్చోని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సమయంలో రాధమ్మ(ఈషా రెబ్బా)తను ప్రేమించిన క్రిష్ (నిత్యామీనన్)ను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి అదే ఫుడ్ కోర్ట్కు వస్తుంది. ఈజీ మనీకోసం తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఓ దొంగతనం ప్లాన్ చేసిన మీరా(రెజీనా) అదే ఫుడ్ కోర్ట్లో పనిచేస్తుంటుంది. తనకు తాను గ్రేటెస్ట్ మెజీషియన్ అనుకునే యోగి (మురళీశర్మ) రెస్టారెంట్ లో ఉన్న చిన్నపాప మ్యాజిక్ చేస్తుంటే ఆమెతో గొడవ పడతాడు. అక్కడే డోర్ బాయ్గా పనిచేస్తున్న శివ తన చిన్నప్పుడే దూరమైన అమ్మనాన్నలు చూడాలన్న కోరికతో టైం మెషీన్ తయారు చేసే పనిలో ఉంటాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్క చెఫ్ అని అబద్ధం చెప్పి నలభీమ (ప్రియదర్శి) అదే ఫుడ్కోర్ట్ లో ఉద్యోగంలో చేరతాడు. ఇలా ఒకే చోట చేరిన ఈ వ్యక్తలకు ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఏంటి..? కళి తీసుకున్న నిర్ణయం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నిడివి తక్కువే అయినా సినిమాలో కీలక పాత్ర కాజల్దే. అందుకు తగ్గ హవా భావాలతో కళి పాత్రకు ప్రాణం పోసింది కాజల్. కళి తరువాత ఆకట్టుకున్న మరో పాత్ర రెజీనా. మీరాగా కనిపించేందుకు చాలా కష్టపడ్డ రెజీనా పర్ఫామెన్స్తోనూ మెప్పించింది. డ్రగ్స్కు అలవాటు పడిన అమ్మాయిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టామ్ బాయ్ తరహా పాత్రలో నిత్యామీనన్, ఆమె లవర్గా ఈషా రెబ్బాలు ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు లుక్స్ పరంగానూ మెప్పించారు. ఇక వంట రాని చెఫ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటనతో పాటు కామెడీ కూడా పండించాడు. ముఖ్యంగా చేప, చెట్టు, ప్రియదర్శి కాంబినేషన్లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. మెజీషియన్గా మురళీశర్మ కూడా అద్భుతంగా నటించాడు. టైం మెషీన్ తయారు చేయాలని భావించిన సైంటిస్ట్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు. ఇతర పాత్రలో ప్రగతి, రోహిణి, దేవదర్శిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మనిషి జీవితంలోని అనుభవాలు వాటి తాలుకా ప్రతిస్పందనల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక్కో ఎమోషన్ను ఒకో పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు. కోపం, బాధ, ప్రేమ, పగ, ఆవేశం లాంటి భావాలకు ప్రతీరూపాలుగా క్యారెక్టర్స్ వెండితెర మీద ఆవిష్కరించాడు. తొలి అర్థభాగం మొత్తం సినిమాలోని పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలు పెట్టడం ఆడియన్స్ లో అసహనం కలిగిస్తుంది. అయితే ఆడియన్స్ బోర్ ఫీల్ అయిన ప్రతీసారి అ! అనిపించే ట్వీస్ట్ తో షాక్ ఇచ్చాడు డైరెక్టర్. సినిమా టైటిల్కు తగ్గట్టుగా అవాక్కయ్యేలా చేసే ట్విస్ట్లు సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ అవి రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కు ఏ మేరకు రీచ్ అవుతాయన్నదే చూడాలి. చేపకు నాని, చెట్టుకు రవితేజ చెప్పిన వాయిస్ ఓవర్ సినిమాలకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. ఓ డిఫరెంట్ జానర్ తెరకెక్కిన సినిమాను అదే స్థాయి కెమెరా టెక్నిక్స్తో మరింత కొత్తగా మార్చాడు. మార్క్ కె రాబిన్ సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. టైటిల్ లో వచ్చే పాటతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్తోనూ అ! అనిపించాడు రాబిన్. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతగా నాని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించాడు. ప్రతీ ఫ్రేమ్ను కొత్తగా చూపించేందుకు యూనిట్ పడిన తపన తెర మీద కనిపిస్తుంది. అయితే రొటీన్ ఫార్ములా సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ప్లస్ పాయింట్స్ : లీడ్ క్యారెక్టర్స్ నటన స్క్రీన్ ప్లే సంగీతం మైనస్ పాయింట్స్ : అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నాని గట్స్కు హ్యాట్సాఫ్
సాక్షి, సినిమా : హీరోగా వరుస సక్సెస్లు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని.. అ! చిత్రంతో నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. టీజర్, ట్రైలర్, ప్రోమోలు, ప్రమోషన్లతో బాగానే హైప్ తీసుకొచ్చిన నాని.. ఇప్పుడు మౌత్ టాక్పై కూడా దృష్టిసారించాడు. అందుకే సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు ఇక్కడ ప్రత్యేక షో వేయించి వారితో అభిప్రాయాలను చెప్పిస్తున్నాడు. వెన్నెల కిషోర్, అనుపమ పరమేశ్వరన్, అడివి శేష్, దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, నటుడు శశాంక్, డిజైనర్ నీరజ్ కోన, రాహుల్ రవీంద్రన్ ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని వీక్షించి తమ ట్విటర్లో ట్వీట్లు చేశారు. ‘అ చిత్రం కొత్త తరహా కాన్సెప్ట్తో కూడిన చిత్రమని, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుందని, దర్శకుడు ప్రశాంత్ టేకింగ్ కొత్తగా.. ఆకట్టుకునేలా ఉందని, ముగింపు ఓ కవిత్వంలా ఆహ్లాదంగా అనిపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా నిర్మాతగా ఇలాంటి చిత్రం నిర్మించాలంటే చాలా గట్స్ ఉండాలంటూ ప్రతీ ఒక్కరూ నానిని ప్రశంసిస్తున్నారు. కాజల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల, ఇషా రెబ్బా, మురళీ శర్మ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. మరి ఈ చిత్రం నానికి నిర్మాతగా సక్సెస్ అందిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగితే చాలూ. #Awe creates a new genre of film making. It is a seamless blending of all genres..a film that encompasses the best aspects of each genre without being limited. No wonder @NameisNani bhayya backed this one😌🙏🏼 and @prasanthvarma gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/x4M2tPtBbV — vennela kishore (@vennelakishore) 14 February 2018 Thanks & kudos to @NameisNani & @PrashantiTipirn for backing #Awe A true blue concept film with a poetic finish! — Adivi Sesh (@AdiviSesh) 14 February 2018 Watched a superb & out of the box movie #awe. @NameisNani proved to be an intelligent as a producer also. Needs lot of guts to produce this kind of intelligent THIKKA cinema 😃👏👏👏. Kudos to the director @prasanthvarma and his team for the brilliant technical work! Cheers guys! — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) 14 February 2018 Awe : a feeling of reverential respect mixed with fear or wonder.😲🤯 Last night I experienced the same when I was watching #AWE .. truly inspiring... a new approach to cinema with good values.. @NameisNani @PrashantiTipirn @prasanthvarma good work 👌🏻👌🏻 — Anupama Parameswaran (@anupamahere) 15 February 2018 #AWEstruck What a crazy film 🤘🏻 Kudos to @NameisNani n @PrashantiTipirn for backing @prasanthvarma n his unique story #AWE Good luck guys..Wishing Huge Success 👍🏻👍🏻 Great job by entire cast n crew 👌🏻👌🏻 This is real Hatke — Shashank (@ActorShashank) 14 February 2018 #Awe pushes boundaries .. in every possible direction! One has to appreciate the amazing passion this team had to believe in something like this and make it come to life. @NameisNani Wishing u and ur team an amazing run starting Feb 16th ❤️👍🏻😊 — Neerajaa Kona (@NeerajaKona) 14 February 2018 -
‘అ!’లో కాజల్
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా ‘అ!’. విభిన్న కథతో, ఆసక్తికరమై నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అ!’... నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ వస్తున్నాడు. నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, ఇషా రెబ్బా, రెజీనా, మురళీ శర్మ, ప్రియదర్శిలతో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించే ఓ చేప, చెట్టు పాత్రలను కూడా ఇప్పటికే పరిచయం చేశారు. తాజాగా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న కాజల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ‘అ!’ యూనిట్. గులాబి పువ్వుతో ఉన్న కాజల్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ‘అ!’లో ఆమె క్యారెక్టర్ గురించి హింట్ ఇస్తూ నిర్జీవ ఆత్మ అంటూ పరిచయం చేశారు. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. -
అప్పుడు ఈగ... ఇప్పుడు చేప..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘అ!’ అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిత్యామీనన్. రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాని నిర్మాతగానే కాక మరో కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే ఆ పాత్ర కూడా తెర వెనుకకే పరిమితం కానుంది. ఈ సినిమాలో కనిపించే ఓ చేప పాత్రకు నాని డబ్బింగ్ చెపుతున్నాడు. తాజాగా ఆ చేప క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే మేజర్ పార్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. Playing an interesting role in my next .. been learning swimming coz the script demands ;))#AWE https://t.co/VDmOAuUPHK — Nani (@NameisNani) 23 December 2017 -
హీరోగా బాల నటుడు
మరో బాలనటుడు హీరోగా మారుతున్నాడు. కొన్నేళ్ళ క్రితం వచ్చిన ‘చూడాలని ఉంది’, ‘బాచి’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’ తదితర చిత్రాల్లో బాలనటునిగా అలరించిన తేజ సజ్జా హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ‘పంజా’, ‘అలియాస్ జానకి’ చిత్రాల నిర్మాత నీలిమ తిరుమలశెట్టి సంఘమిత్ర ఆర్ట్స్ పతాకంపై ప్రశాంత్వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రాచీథాకర్ నాయిక. నీలిమ మాట్లాడుతూ,‘‘పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. అక్టోబర్లో చిత్రీకరణ మొదలుపెట్టి జనవరిలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్, కెమెరా: విష్ణు.