Ravi Teja
-
విలేజ్లో మిస్టరీ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం సుమారు పది నెలల తర్వాత సడెన్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్గా తెరకెక్కించారు.మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో వచ్చిన ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’ సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిన్ హత్యతో సినిమా కథ మొదలౌతుంది. ఆపై ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ఇంపాక్ట్తో కథ ఉంటుంది. లవ్ స్టోరీకి మర్డర్ మిస్టరీ అంశాలను జోడించారు. కానీ, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిల్ను షార్ట్ కట్లో రానా పేరుతో ప్రమోట్ చేశారు. ఐఎమ్డీబీలో 8.5 రేటింగ్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలామంది కొత్తవారే నటించారు. కానీ, నటన పరంగా వారికి మంచి మార్కులే పడ్డాయి. -
క్రేజీ కాంబినేషన్?
హీరో రవితేజ(Ravi Teja), దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే ఫిల్మ్నగర్ సర్కిల్స్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల రవితేజను కలిసి ఓ కథను వినిపించారట కిశోర్ తిరుమల.ఈ స్క్రిప్ట్ నచ్చ డంతోప్రాథమికంగా రవితేజ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, కథ మొత్తం పూర్తయిన తర్వాత ఫైనల్ నరేషన్ విని ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయం తీసుకుంటారని టాక్. మరి.. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ సెట్ అవుతుందా? వేచి చూడాలి. -
రవి తేజ కు, నాకు దేవుడు ఇచ్చిన వరం అదే
-
గ్రీన్ సిగ్నల్?
రవితేజ(Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’ మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత రవితేజ నెక్ట్స్ మూవీకి ఎవరు దర్శకత్వం వహించనున్నారనే చర్చ జరుగుతోంది. కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ‘మ్యాడ్’ చిత్రంతో దర్శకునిగా హిట్ సాధించి, ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ని డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించారట.స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. దీంతో స్క్రిప్ట్పై మరింత ఫోకస్ పెట్టారట కల్యాణ్ శంకర్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని, అన్నీ కుదిరితే 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని రవితేజ అండ్ టీమ్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారని సమాచారం. -
మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీ రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ‘సామజవరగమన చిత్రానికి రైటర్గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా నటించిన ధమాకా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇవాళ మాస్ మహారాజా బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మాస్ జాతర మూవీ గ్లింప్స్ను ఫ్యాన్స్కు పరిచయం చేశారు. దాదాపు 61 సెకన్ల పాటు వీడియో గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే మాస్ జాతరను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం మే 09న థియేటర్లలో సందడి చేయనుంది. The Swag.The Energy.The Vibe. 🔥🔥🔥𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is here to deliver an ALL ROUND SHOW! 😎❤️🔥#MassJathara ~ Mass Rampage Glimpse out now 💥— https://t.co/1s6R68jgYG #HappyBirthdayRaviTeja garu ❤️@sreeleela14 @BhanuBogavarapu @vamsi84… pic.twitter.com/Tp9Zn1vouZ— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2025 -
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ.. మాస్టర్స్ చదివేందుకు 2022లో అమెరికాకు వెళ్లాడు. వాషింగ్టన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొడుకు మృతిచెందాడన్న వార్త తల్లిదండ్రులను కలచివేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెంకు చెందిన కొయ్యడ చంద్రమౌళి–సువర్ణ దంపతులు కొంతకాలం నుంచి ఆర్కే పురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు రవితేజ (26), ఒక కుమార్తె ఉన్నారు. రవితేజ ప్రస్తుతం కనెక్టికట్లో ఓ రెస్టారెంట్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కారు అద్దెకు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికి వెళ్లారు. అయితే, దుండగులు అప్పటికే చోరీకి పాల్పడి.. పారిపోయే క్రమంలో రవితేజ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. రవితేజ ఎంతసేపటికీ తిరిగి రెస్టారెంట్కు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టిన లొకేషన్కు వెళ్లి చూడగా రవితేజ మృతదేహం కనిపించింది. ఈ సమాచారాన్ని సోమవారం తెల్లవారుజామున రవితేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవితేజ సోదరి ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో హైదరాబాద్లోని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రీన్హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మాస్టర్ డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమానికి రావాలని రవితేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్పోర్ట్, వీసా తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడంతో వారు విషాదంలో మునిగిపోయారని బంధువులు చెప్పారు. డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడుతాను గత శనివారం కొడుకుతో మాట్లాడానని చంద్రమౌళి చెప్పారు. తనకు త్వరలోనే మంచి జాబ్ వస్తుందని... మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడన్నారు. త్వరలోనే నీకు మంచి గిఫ్టు ఇస్తానన్నాడని, అయితే అది ఇదేనా అంటూ ఆయన భోరున విలపించారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్కు వచ్చేలా చూడాలని చంద్రమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. రవితేజ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి సహాయం చేస్తానని చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. -
గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య
తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శనివారం గోవా వెళ్లారు. రెండు రోజుల పాటు గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్గోవా జిల్లా కలంగూట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్ యజమాని డిమాండ్ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకున్నాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
గోవాలో దారుణ హత్యకు గురైన రవితేజ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
-
రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్పై ప్రకటన
మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా రీరిలీజ్ కానుంది. ఈమేరకు తాజాగా విడుదులైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, థియేటర్లలో డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2008లో విడుదలైన 'నేనింతే' చిత్రంలో రవితేజ,శియా గౌతం జోడీగా మెప్పించారు. పూరి దర్శకత్వానికి చక్రి సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజికల్గా ఈ చిత్రంలోని చాలా పాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.సుమారు 16 ఏళ్ల తర్వాత నేనింతే చిత్రం రీరిలీజ్ కానుంది. రవితేజ బర్త్డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఈమరకు ఒక పోస్టర్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ చూపించాలని చాలామంది హైదరాబాద్ వస్తుంటారు. అలా కృష్ణ నగర్లో అడుగుపెట్టిన వారి కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. దర్శకుడు పూరి జగన్నాథ్ నేనింతే మూవీని తెరకెక్కించాడు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడం వెనుక దాగి ఉన్న కష్టాలను చాలా ఎమోషనల్గా ఈ మూవీలో పూరి చూపించాడు. ఈ మూవీ కమర్షియల్గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఉత్తమ నటుడిగా రవితేజకు నంది అవార్డు దక్కింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ మాటల రచయితగా పూరీ జగన్నాథ్, ఉత్తమ ఫైట్ మాస్టర్స్గా రామ్ లక్ష్మణ్లకు నంది అవార్డ్స్ లభించాయి.నేనింతే సినిమాలో రవితేజకు జోడీగా శియా గౌతమ్ హీరోయిన్గా తొలి పరిచయం అయింది. ఆమెకు అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. నేనింతే చిత్రంలో శియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ముంబయికి చెందిన వ్యాపార వేత్తతో రీసెంట్గా ఆమె పెళ్లి కూడా అయిపోయింది. నేనింతే చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. ఇదే మూవీలో డైరెక్టర్లు హరీష్ శంకర్, వీవీ వినాయక్, కోన వెంకట్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా గెస్ట్ రోల్స్ కనిపించడం విశేషం. -
డిష్యూం... డిష్యూం...
విలన్స్ బెండు తీస్తున్నాడు లక్ష్మణ్ భేరి. డిష్యూం... డిష్యూం అంటూ అదిరిపోయే ఫైట్ చేస్తున్నాడు. ఈ లక్ష్మణ్ భేరి ఎవరంటే... రవితేజ అన్న మాట. రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మాస్ జాతర’లో ఆయన పాత్ర పేరు ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత చిత్రయూనిట్ అరకు వెళ్లనుందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తెచ్చిన రవితేజ!?
తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు గానీ కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి ఇష్టపడరు. మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించారు. కానీ రవితేజ మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తోందట.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తీస్తున్న ఓ సినిమాకు రవితేజ కూతురు మోక్షద.. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుందట. గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత నటుడు అయ్యాడు. బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ') -
అరకులో ‘మాస్ జాతర’... రవితేజతో భారీ యాక్షన్ సీక్వెన్స్!
అరుకులో మాస్ జాతర చేయనున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్లైన్. హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’కు ఓ రైటర్గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబరు మూడో వారంలో అరకులో ప్రారంభం కానుందని సమాచారం. ముఖ్యంగా అరకు, ఆ తర్వాత పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు లొకేషన్స్లో ‘మాస్ జాతర’ చిత్రీకరణ జరగనుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొంత టాకీ పార్టుతో పాటు, ఓ యాక్షన్ సీక్వెన్స్ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 09న విడుదల కానుంది. -
స్టార్ హీరోలను మెప్పిస్తున్న యంగ్ డైరెక్టర్స్
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్కుమార్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్హిట్ ఫిల్మ్తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్నగర్ భోగట్టా. కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్కు వినిపించగా, శౌర్యువ్కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్కెరీర్లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు. -
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
మళ్ళీ రీమేక్ వైపు చూస్తోన్న రవితేజ..
-
రవితేజ 'మాస్ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆర్టీ75 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Get ready for a Re-Sounding Entertainer 💥Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇BLASTING the screens with highly MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣 Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024 -
ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్డేట్ వచ్చేసింది!
ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్ అనే టైటిల్ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024 -
పొంగల్ పోరు.. సీన్ మారుతోంది!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయి. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, దర్శక – నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. కానీ ఫైనల్గా బెర్త్ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతి సమయం సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆయా చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్లోకి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో వేరే సినిమాలు సంక్రాంతికి సై అంటున్నాయి. ఇలా సంక్రాంతి సినిమా సీన్ మారుతోంది. ఇక 2025 సంక్రాంతి బాక్సాఫీస్ పోరులోకి వెళదాం.సంక్రాంతికి వస్తున్నాం... కానీ! ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్ని పెట్టుకుని మరీ వెంకటేశ్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, అతని భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా స్పేస్ ఉంటుంది కాబట్టి తమ బేనర్లోని ఈ రెండు చిత్రాలనూ ‘దిల్’ రాజు పండగ బరిలో దింపుతారని ఊహించవచ్చు. ఆఫీసర్ వస్తారా? ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్స్లోకి రావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల నిర్మాతల రిక్వెస్ట్, వివిధ సమీకరణాల నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో విడుదలైంది. దీంతో 2025 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రవితేజ భుజానికి గాయమైంది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా అనే విషయంపై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ రెడీ సంక్రాంతి బరికి సిద్ధమయ్యారు రామ్చరణ్. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తొలుత 2024 క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు ‘దిల్’ రాజు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల ట్రేడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సూచనల మేరకు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ను 2024 క్రిస్మస్ నుంచి 2025 సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా నిర్మాత ‘దిల్’ రాజు ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘గేమ్ చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, నవీన్చంద్ర, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఇది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల విధులు, హక్కులు, వారికి ఉండే ప్రత్యేక అధికారాలు వంటి అంశాల నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ఉంటుందని టాక్.నార్త్ ఇండియాలో... ఈ సంక్రాంతి పండక్కి బాలకృష్ణ 109వ చిత్రం థియేటర్స్లోకి రానుంది. కేఎస్ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా టైటిల్, రిలీజ్ డేట్పై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని, కథకు నార్త్ ఇండియా నేపథ్యం ఉంటుందని, విలన్గా బాబీ డియోల్, ఓ పోలీసాఫీసర్ పాత్రలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కనిపిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. మజాకా ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్స్లో ‘మజాకా’ సెలబ్రేషన్స్ ఖాయం అంటున్నారు హీరో సందీప్ కిషన్. రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ తీసిన నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్న చిత్రం ఇది. మహేంద్రగిరి దేవాలయం సంక్రాంతి వంటి పెద్ద పండక్కి మీడియమ్, స్మాల్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సంక్రాంతికి ఇలాంటి చిత్రాలు రెండు అయినా వస్తుంటాయి. ఏ చిత్రం ఆడియన్స్కు నచ్చితే అది పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ కోవలో వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా, బ్రహ్మానందం మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది.2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. కానీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కావడం లేదు. ‘విశ్వంభర’ సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని, రామ్చరణ్– ‘దిల్’ రాజుగార్ల కోసం చిరంజీవిగారితో మాట్లాడి ‘విశ్వంభర’ రిలీజ్ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. ఇక ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.అలాగే 2025 సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యపడేలా లేదు. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కానీ ఓటీటీ డీల్స్, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్స్ వంటి అంశాలను పరిశీలించుకుని ‘తండేల్’ సినిమా సంక్రాంతి రిలీజ్పై చిత్రయూనిట్ ఓ స్పష్టతకు వస్తారట. ‘లవ్స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ బాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో స్ట్రయిట్ చిత్రాలతో పాటు ఒకటీ లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్కు రెడీ అవుతుంటాయి. ఇలా 2025 సంక్రాంతికి అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్లోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. – ముసిమి శివాంజనేయులు -
'మిస్టర్ ఇడియట్' మూవీతో హీరోగా రవితేజ వారసుడి ఎంట్రీ..(ఫొటోలు)
-
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన
మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్.. ట్వీట్ వైరల్
తెలుగు స్టార్ హీరో రవితేజ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయమై ట్విటర్లో పోస్ట్ పెట్టాడు. సర్జరీ సాఫీగా సాగిందని, విజయవంతంగా పూర్తయిందని.. దీంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు, మద్ధతుకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)రీసెంట్గా 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వచ్చిన రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. షూటింగ్లో భాగంగా రవితేజ గాయపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే రవితేజ గాయపడిన ఫొటో ఇదేనంటూ ఓ ఫేక్ పిక్ని తెగ వైరల్ చేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
ఆరు వారాలు విశ్రాంతి
స్క్రీన్పై జోష్గా కనిపించే రవితేజ సినిమాలు చేయడంలోనూ అంతే జోష్గా ఉంటారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంటారు. కాగా ఈ బిజీ షెడ్యూల్కి ఆరు వారాలు బ్రేక్ పడింది. కొన్నాళ్లుగా రవితేజ తన 75వ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఈ మధ్య యాక్షన్ సీన్ చేస్తుండగా రవితేజ కుడి చేతికి గాయం అయింది. కండరం చిట్లినా లెక్క చేయకుండా షూటింగ్ చేస్తుండటంతో గాయం పెద్దదైందట.చివరికి శస్త్ర చికిత్స వరకు దారి తీసింది. హైదరాబాద్కి చెందిన ఓ ఆస్పత్రిలో గురువారం ఆయనకు సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఈ గాయం తగ్గడానికి ఆరు వారాలు పడుతుందని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పీఆర్ టీమ్ పేర్కొంది. దాంతో రవితేజ 75వ చిత్రం షూటింగ్కి తాత్కాలిక బ్రేక్ పడింది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. -
హీరో రవితేజకు సర్జరీ.. షూటింగ్లో గాయం
మాస్ మహారాజ రవితేజకు సర్జరీ జరిగింది. ఇటీవల తన 75వ సినిమా చిత్రీకరణ సమయంలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. కుడిచేతికి గాయమైనప్పటికీ లెక్క చేయకుండా షూట్ కొనసాగించాడు. దురదృష్టవశాత్తూ నొప్పి తీవ్రతరం కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అనంతరం విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. హీరోను ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.సినిమాల విషయానికి వస్తే.. రవితేజ ఇటీవలే మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ మాస్ హీరో తన 75వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ‘సామజవరగమన’ వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దీనికి కోహినూర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు.చదవండి: టారోట్ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి! -
పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్
రీసెంట్గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?) -
హీరో లను మించిపోయిన హీరోయిన్స్
-
పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి
ఆగస్టు 15. థియేటర్లలోకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు వచ్చాయి. వీటిలో రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో పాటు 'ఆయ్' అనే మరో చిన్న మూవీ కూడా రిలీజైంది. కాన్ఫిడెన్స్తో ముందు రోజే అంటే ఆగస్టు 14నే బచ్చన్ ప్రీమియర్స్ వేశారు. అయితే అప్పడే డివైడ్ టాక్ వచ్చింది. మూవీలో సీన్లపై ఘోరంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ జాగ్రత్త పడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇదేదో ముందే చేసుంటే టాక్ పాజిటివ్గా వచ్చి ఉండేదేమో? ఏదైతేనేం తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తెలుసుకున్న బచ్చన్ టీమ్.. నిడివిలో మార్పు చేయడం మంచిదే.లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇలా నిడివి తగ్గించడం మరి 'మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి? ఇప్పటికే 'ఆయ్'తో పాటు డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే హిందీ మూవీ 'స్త్రీ 2' కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇలా వీటిని తట్టుకుని బచ్చన్ మూవీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది. -
రవితేజ-భాగ్యశ్రీ కాంట్రవర్సీ స్టెప్.. స్పందించిన హరీశ్ శంకర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. కథ-కథనం బాలేకపోయినా.. సంగీతం మాత్రం అదిరిపోయిందని అంతా అంటున్నారు. పాటల విషయంలో హరీశ్ మరోసారి తన మార్క్ చూపించారని కొనియాడుతున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్కే సినిమాకు ప్లస్ పాయింట్ అని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే ‘సితార్’ పాటలో రవితేజ-భాగ్యశ్రీ బోర్సే వేసిన ఓ స్టెప్పు మాత్రం కాంట్రవర్సీకీ దారి తీసింది. (చదవండి: మిస్టర్ బచ్చన్ రివ్యూ)కొంతమంది నెటిజన్స్ ఆ స్టెప్పు తాలుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరీశ్ శంకర్ని ట్రోల్ చేస్తున్నారు. చర్చనీయాంశమైన ఆ స్టెప్పు గురించి తాజాగా హరీశ్ శంకర్ స్పందించాడు. పాటలకు హీరోహీరోయిన్లు చేసే డ్యాన్స్ని ఫ్లోలో చూస్తే బాగుంటుందని.. స్క్రీన్ షాట్ తీస్తే ఇబ్బందిగానే కనిపిస్తుందని అని అన్నాడు.‘వాస్తవానికి ఆ పాటకు ఆ స్టెప్ అవసరం లేదని నాక్కుడా అనిపించింది. అయితే షూటింగ్ మొదటి రోజే ఆ పాటను షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మూమెంట్ని మొదటి రోజే నేను వద్దు అంటే బాగోదేమో అని ఆగిపోయాను. షూటింగ్ బిజీలో పడి అది పట్టించుకోలేదు. సెన్సార్లో కూడాఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్ని ఫ్లోలో చూడాలి. అలా కాకుండా స్క్రీన్ షాట్ తీసి చూస్తే చాలా వరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది’ అని హరీశ్ చెప్పుకొచ్చాడు. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
హరీశ్ శంకర్.. ఇటువైపు రాకండి అంటూ వార్నింగ్ ఇచ్చిన అభిమాని
డైరెక్టర్ హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' విడుదలకు ముందే ఇచ్చిన హైప్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. రవితేజ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, తాజాగా సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. సినిమా బాగాలేదంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ రవితేజ్ ఇమేజ్తో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి. కానీ, సినిమా చూసిన ప్రేక్షకులు, రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఘూటుగానే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సినిమా పర్వాలేదు అంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మిస్టర్ బచ్చన్ పెద్ద రాడ్ సినిమా అంటూ ఫైర్ అవుతున్నారు.తమ అభిమాన హీరో నటించిన సినిమాను విడుదలరోజే చూడాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫస్ట్ చాయిస్గా పెట్టుకుంటారు. అయితే, తాజాగా అక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ అభిమాని ఒకరు దర్శకుడు హరీశ్ శంకర్పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ బచ్చన్ సినిమా బాగాలేదంటూ మీడియా వారితో తెలిపాడు. దర్శకుడు హరీశ్ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వస్తే అభిమానులు చితక్కొడుతారని కామెంట్ చేశాడు. సినిమాలో విషయం ఉన్నా.. డైరెక్షన్ విభాగంలో లోపాలు ఉన్నాయని రవితేజ అభిమాని చెప్పుకొచ్చాడు. కేవలం హీరోయిన్తో పాటల కోసమే సినిమా తీశారేమో అనిపించేలా మిస్టర్ బచ్చన్ ఉందని కామెంట్ చేశాడు. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న దర్శకుడు ఇంత చెత్త సినిమా తీయడమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. హరీశ్ శంకర్ గారు.. దయచేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు రాకండి అంటూ వారు కామెంట్ చేశారు.అందమైన హీరోయిన్ పెట్టి రవితేజ సినిమాను నడిపించేద్దామని డైరెక్టర్ అనుకున్నారేమో అనే అభిప్రాయం నెటిజన్లలో వస్తుంది. ఇలాంటి సినిమాలు తీసి అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారనే కామెంట్లు వస్తున్నాయి. తమ డబ్బు రీఫండ్ చేస్తారా సార్ అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎప్పుడు రావొచ్చు?
రవితేజ లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేశారు కానీ టాక్ అయితే పాజిటివ్గా రాలేదు. రవితేజ ఎనర్జీ, కొత్తమ్మాయి భాగ్యశ్రీ గ్లామర్ పరంగా ఏ లోటు లేనప్పటికీ మిగతా విషయాలు పరమ రొటీన్గా ఉన్నాయని చూసిన వాళ్లు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా తేలిపోయింది.(ఇదీ చదవండి: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ)2018లో హిందీలో వచ్చిన సినిమా 'రైడ్'. ఓ సాధారణ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటిపై రైడ్ చేసి ఎలా చెమటలు పట్టించాడనేదే స్టోరీ. దీనికి కాస్త ఎంటర్టైన్మెంట్ , రవితేజ మార్క్ వినోదం జోడించి తీసిన తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్'. హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీ గ్లామర్, డ్యాన్సుల వల్ల కాస్త హైప్ పెరిగింది. కానీ ఈ అంచనాల్ని మూవీ అందుకోలేకపోయిందని అంటున్నారు.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన మూవీస్ అన్నీ థియేటర్లలో రిలీజైన 28 రోజుల తర్వాత వచ్చేస్తున్నాయి. బచ్చన్ కూడా నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబరు రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
పాత రవితేజను కొత్తగా చూస్తారు: హరీష్ శంకర్
⇒ ఉత్తర భారతదేశంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఉంటుంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. ఈ సినిమాలో హీరో బచ్చన్ పాత్రలో నిజాయితీ ఉన్న హీరోయిజమ్ ఉంటుంది. 1980లో లక్షల రూపాయలంటే పెద్ద మొత్తం. అంత మొత్తం లంచం రూపంలో వస్తుందన్నా కూడా ఓ అధికారి ఒప్పుకోలేదు.. లొంగలేదు. నాకు ఈ పాయింట్ నచ్చింది. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ జీవితంలో ప్రేమ, ఫ్యామిలీ, రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించి రవితేజగారి క్యారెక్టర్ను డిజైన్ చేశాను.ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతారు. హిందీ ‘రైడ్’కు, ‘మిస్టర్ బచ్చన్’కు...అజయ్ దేవగన్కు, రవితేజకు మధ్య ఉన్నంత తేడా ఉంది. ‘రైడ్’లో అజయ్ దేవగన్ రోల్ సెటిల్డ్గా ఉంటే... ‘మిస్టర్ బచ్చన్’లో రవితేజగారి రోల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఉంటుంది. ఇక ఈ కథకు ఓ కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవడం జరిగింది. జిక్కీ పాత్రలో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తారు. జగపతిబాబుగారు ఎంపీ పాత్రలో కనిపిస్తాను. ⇒నేను సినిమా చూడని రోజులు ఉన్నాయేమో కానీ పాటలు వినకుండా ఉన్న రోజులు లేవు. ఓ సినిమా దర్శకుడిగా నేను విఫలం అయ్యానేమో కానీ... సంగీతం విషయంలో కాదు. నా ఫ్లాప్ మూవీ ‘షాక్’లోని ‘మధురం..’ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. ట్యూన్స్ సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల లిరికల్ వీడియోలు లేట్గా విడుదల అవుతున్న రోజులివి. అలాంటిది వారం రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చారు మిక్కీ జే మేయర్. ఆయన చాలా ప్రతిభావంతుడు. మాస్ సాంగ్స్ చేయలేదు అంటే ఆయనకు రాక కాదు... చాన్స్ రాలేదు అంతే. ⇒ చలం, యండమూరిగార్ల నవలలు చదివి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సాహిత్యంలో మంచి పట్టు ఉంది నాకు. అలాంటి నేను ‘షాక్’ సినిమా తీస్తే మూడేళ్లు ఆడియన్స్ నన్ను షాక్లో ఉంచారు. ఆ వెంటనే ‘మిరపకాయ్’ సినిమా తీశాను. ఇక ‘ఇడియట్, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి సినిమాలు చేసిన రవితేజగారు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని అప్పట్లో ‘నా ఆటోగ్రాఫ్..’, ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు, ఈగల్’ సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరణ దక్కలేదు.కానీ ‘ధమాకా’ అంటే హిట్ ఇచ్చారు. అందుకే ‘మిస్టర్ బచ్చన్’లో పాత రవితేజనే కొత్తగా చూపిస్తున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ గారు లేకపోతే ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇంత గ్రాండ్గా వచ్చేది కాదు. ఆగస్టు 15న రిలీజ్ చేసేవాళ్లం కాదు. ఆడియన్స్కు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తున్నాం. -
రవితేజను భయపెట్టిన అభిమాని.. అసలేం జరిగిందంటే?
మాస్ మహారాజా రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడతుండడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో గ్రాండ్గా నిర్వహించారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్తో పాటు చిత్రయూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. అయితే ఈవెంట్ మధ్యలో రవితేజ మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఓ అభిమాని ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చాడు. దీంతో రవితేజ అతన్ని ఆగు ఆగు గట్టిగా అరుస్తూ.. అభిమాని వద్దకు వెళ్లి అలా రాకూడదని అతనికి సూచించాడు. ఇలా వచ్చి మమ్మల్ని భయపెట్టకండ్రా బాబు.. అలా టప్పున వచ్చేస్తే మే భయపడతాం అంటూ రవితేజ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Orai Ila Tappana Rakandra Babu Bayapadtham 😂😂🔥🔥🔥🔥#RaviTeja #MrBachchan pic.twitter.com/XBBfgSBlCe— Srinivas (@Srinivasrtfan2) August 12, 2024 -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్ఫుల్గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్ బచ్చన్’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. మా డ్యాన్స్ మాస్టర్ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్ కో–ఆర్డినేటర్ పృథ్వీ చాలా కామ్గా ఉంటాడు. నాలుగు ఫైట్స్లో ఒక్క ఫైట్ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్ సభ్యులు కూడా బాగా హార్డ్వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ట్యూన్స్ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్ చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి, మా కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా హ్యాట్రిక్కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ అతిథులుగాపాల్గొన్నారు. -
'నల్లంచు తెల్లచీర' మాస్ సాంగ్కు స్టెప్పులేసిన మిస్టర్ బచ్చన్
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. నల్లంచు తెల్లచీర అంటూ సాగే ఈ మాస్ సాంగ్నుశ్రీరామ చంద్ర, సమీర భరద్వాజ్ ఆలపించారు. భాస్కరభట్ల ఈ పాటను రచించారు. మాస్ ఆడియన్స్ విజిల్ వేసేలా ఈ సాంగ్ ఉంది. -
రవితేజ కోహినూర్?
‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మరో సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్లో 75వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాతో ‘సామజవరగమన’ వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే పాత్రలో రవితేజ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ‘కోహినూర్’ను వర్కింగ్ టైటిల్గా పెట్టుకుని యూనిట్ వర్క్ చేస్తోందని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ భోగట్టా. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఆ పిచ్చి మన వాళ్లకే ఉంది: రవితేజ
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అన్ని వారి వారి బర్త్డే సందర్భంగా మళ్లీ థీయేటర్స్లో సందడి చేస్తున్నాయి. ఆ సినిమాలు విడుదలైనప్పుడు రానన్ని కలెక్షన్స్ రీరిలీజ్ టైమ్లో వస్తున్నాయంటే.. పాత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు. తాజాగా మహేశ్ బాబు మురారి సినిమా ఆయన బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజై దాదాపు 7.32 కోట్ల కలెక్షన్స్ని రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే పాత సినిమాలు మళ్లీ థియేటర్స్లోకి వచ్చి భారీగా కలెక్షన్స్ రాబట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తుందని అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రీరిలీజ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రీరిలీజ్ ట్రెండ్ మన(టాలీవుడ్) దగ్గరే ఉంది. నిజంగా మన ప్రేక్షకులను దేవుళ్లు అనొచ్చు. వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో ఈ రీరిలీజ్ కలెక్షన్స్ని చూస్తే అర్థమవుతుంది. ఒక పాత సినిమాను మార్నింగ్ 6.30 థియేటర్స్కి వెళ్లి చూడడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే ఉదయం 7 గంటలకు వెళ్లి చూసేవాళ్లం. అవి కొత్త సినిమాలు కాబట్టి అంత మార్నింగ్ వెళ్లేవాళం. కానీ ఇప్పటి ప్రేక్షకులు ఉదయం 5 గంటలకే వెళ్లి చూస్తున్నారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు’ అని రవితేజ అన్నారు. ఇక నీకు ఏ సినిమా రీరిలీజ్ కావాలని ఉంది అని యాంకర్ అడగ్గా.. అమితాబ్ బచ్చన్ ‘షోలే’ అని రవితేజ బదులిచ్చాడు. కాగా, గతంలో రవితేజ ‘విక్రమార్కుడు’, ‘వెంకీ’ సినిమాలు కూడా రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. -
రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. సూపర్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్కు ముందు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నల్లంచు తెల్లచీర అనే లిరికల్ సాంగ్ను ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో రవితేజ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. హీరోయిన్తో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న ప్రోమోను అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈనెల 15న మిస్టర్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో గ్రాండ్గా నిర్వహించనున్నారు. This isn’t something I usually do, but this time, it’s for you all 😘#NallanchuThellacheera from #MrBachchan out Tomorrow, August 12th ❤🔥 pic.twitter.com/NokEYn4y0z— Ravi Teja (@RaviTeja_offl) August 11, 2024 -
అందుకే పదిహేనుకే వస్తున్నాం: టీజీ విశ్వప్రసాద్
‘‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభించినప్పుడే మే లేదా జూన్లోగా పూర్తి చేసి, ఆగస్ట్ 9న విడుదల చేయాలనుకున్నాం. అయితే సాంగ్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ తేదీన రిలీజ్ చేయలేదు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ వాయిదా పడటంతో ఆగస్ట్ 15 సరైన తేదీ అని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జోడీగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘రవితేజగారితో మేం నిర్మించిన ‘ధమాకా’ మంచి హిట్టయింది.‘ధమాకా’కి ప్లస్లా ‘మిస్టర్ బచ్చన్’ ఉంటుంది. హరీష్ శంకర్, రవితేజలది క్రేజీ కాంబినేష్. ‘మిస్టర్ బచ్చన్’ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. ఇందులో వినోదం, మాస్, యాక్షన్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. హరీష్కి, మిక్కీ జె. మేయర్కి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అంత గ్రాండ్ ఔట్పుట్ తీసుకొచ్చారు. పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. ఆగస్ట్ 15కి తెలుగులో రెండు పెద్ద సినిమాలు ‘మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్’ వస్తున్నాయి.థియేటర్ల పరంగా ఈ రెండింటికీ ఎలాంటి సమస్య రాదు. పైగా లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తెలుగుతో పాటు హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నాం. మా సంస్థ నుంచి దాదాపు 15 సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిలో కన్నడంలో మూడు సినిమాలు, హిందీలో బాబీ డియోల్తో ఒక సినిమా, రెండు ఇంగ్లిష్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్గారి ‘రాజా సాబ్’ షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ ఏడాదిలోపు చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. -
ఆ ఈలలు అమితానందాన్నిచ్చాయి: భాగ్యశ్రీ బోర్సే
‘‘నటి అవ్వాలనుకున్నప్పుడు భవిష్యత్ ఎలా ఉంటుందా అనిపించింది. దీనికి తోడు కొందరు కెరీర్లో వేగంగా ముందుకు వెళ్తుంటారు. వారిలా అవకాశాలు నాకు ఎప్పుడు వస్తాయా? అనే ఆలోచన కూడా ఉండేది. అయితే ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నేను వేదికపైకి రాగానే ప్రేక్షకులు చేసిన హంగామా, ఈలలు చూసి నాకు అమితానందం కలిగింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లొచ్చాయి (ఆనందంతో..)’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే చెప్పిన సంగతులు.⇒ నా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా నైజీరియాలోని లాగోస్కు షిఫ్ట్ అయ్యాం. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యుయేషన్లో ఉండగానే మోడలింగ్ చేయమని నన్ను చాలామంది ప్రోత్సహించడంతో ట్రై చేద్దామనుకున్నాను. ఈ ఫీల్డ్ నాకు బాగా నచ్చింది. మెల్లిగా కెమెరా భయం కూడా ΄ోయింది. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను ⇒ ‘మిస్టర్ బచ్చన్’లో తెలుగు మార్వాడీ అమ్మాయి జిక్కీపాత్రలో కనిపిస్తాను. కథలో జిక్కీపాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మిస్టర్ బచ్చన్ (రవితేజపాత్ర)ను మోటివేట్ చేసేలా నా రోల్ ఉంటుంది. అయినా మహిళలు లేకుండా ఏ కథ పూర్తి కాదని నా అభి్ర΄ాయం. తెలుగు భాష మీద పట్టు సాధించి, జిక్కీపాత్రకు నేనే డబ్బింగ్ చెబుతానని హరీష్ శంకర్గారిని అడిగితే ఆయనప్రోత్సహించారు ⇒ హీరోగా రవితేజగారికి చాలా అనుభవం ఉంది. కానీ ఆయన ఓ కొత్త నటుడిగా సెట్స్లో కష్టపడతారు. పీపుల్ మీడియా వంటి ప్రముఖ సంస్థ ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది. నాకు డ్యాన్స్ బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఈ సినిమాలోని ‘రెప్పల్ డప్పుల్’, ‘సితార’పాటలకు మంచి స్పందన లభిస్తుండటం సంతోషాన్నిచ్చింది. ఇక నా నెక్ట్స్ మూవీస్ గురించి త్వరలో చెబుతాను. -
రవితేజ నా రూమ్ మేట్: టాలీవుడ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇందులో ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సందర్భంగా రవితేజ గురించి టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మిస్టర్ బచ్చన్తో పాటు డబుల్ ఇస్మార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నా రూమ్ మేట్ రవితేజ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారని అన్నారు. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి వచ్చాడో తనకు తెలుసన్నారు. నేను, రవితేజ ఎనిమిదేళ్ల పాటు రూమ్మేట్స్ అని వైవీఎస్ చౌదరి వెల్లడించారు. -
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అదిరిపోయే HD స్టిల్స్
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పని ఇంపార్టెంట్... పేరు కాదు
‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే...’ అనే డైలాగ్తో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ట్రైలర్ప్రారంభం అవుతుంది. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘నోప్రాబ్లమ్ సార్.. నాకు పని ఇంపార్టెంట్.. పేరు కాదు, ఉయ్ ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా, ఆగస్టు 15న ఏం జరిగిందో తెలుసా మీకు.. ఆ రోజు 70ఎంఎం స్టీరియో ఫోనిక్ ‘షోలే’ రిలీజ్ అయింది’ అంటూ రవితేజ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. -
రవితేజ 'మిస్టర్ బచ్చన్' మాస్ ట్రైలర్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈమేరకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. -
హీరోయిన్కు లేని ఇబ్బంది మీకెందుకు: హరీశ్ శంకర్
సినిమా పరిశ్రమలో మనం ఎక్కువగా వినే మాట ఏజ్ గ్యాప్.. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం కనిపిస్తే చాలు ఒక్కోసారి ట్రోల్స్ కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఇందులో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు. అయితే, వీరిద్దరితో తెరకెక్కిన ఒక సాంగ్ను కొద్దిరోజుల క్రితం మేకర్స్ విడుదల చేశారు. అందులో వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ క్లియర్గా కనిపిస్తుందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే, తాజాగా చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ- భాగ్య శ్రీ బోర్సే కేవలం నటిస్తున్నారని ముందుగా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ గ్యాప్ అనేది ఈ సినిమాలో మాత్రమే జరగడంలేదు. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఒక యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించరు. సినిమా కోసం ఒక్కోసారి 25 ఏళ్ల వయసు ఉన్న యువతి కూడా 50 ఏళ్లు ఉన్నట్లుగా కనిపించాల్సి ఉంటుంది. దీనినే స్క్రీన్ ఏజ్ అంటారని హరీశ్ శంకర్ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారని ఆయన గుర్తు చేశారు. రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా చిత్రాన్ని కూడా ఓ ఉదాహరణగా హరీశ్ చెప్పారు.‘మిస్టర్ బచ్చన్’లో రవితేజ సరసన నటించేందుకు హీరోయిన్కు ఎలాంటి సమస్య లేదు. ఆమెకు అడ్డురాని ఏజ్ గ్యాప్ మీకెందుకు అంటూ నెటిజన్ల తీరును తప్పుపట్టారు. ఈ విషయంలో హీరోయిన్కు సమస్య లేదు. కానీ ట్రోలర్స్కు వచ్చిన బాధ ఏంటో తనకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఏజ్ గ్యాప్ గురించి ఆమెకు (భాగ్యశ్రీ) ఎలాంటి సమస్య లేదు. ఇంతటితో ఇలాంటి కామెంట్లు ఆపేస్తే మంచిదని హరీశ్ తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ ఫ్రెండ్షిప్డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
మాస్ మహారాజా మిస్టర్ బచ్చన్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ చిత్రాన్ని హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.మిస్టర్ బచ్చన్ ట్రైలర్ను ఈ నెల 7వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు రవితేజ పోస్టర్ను షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్ సాంగ్ అత్యధిక వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. #MrBachchan MASS MAHA TRAILER on August 7th 🔥 pic.twitter.com/pcq8kv0pVm— Ravi Teja (@RaviTeja_offl) August 5, 2024 -
గుండె ఒట్టు పెట్టుకున్నాదే...
‘అల్లరిగా అల్లికగా అల్లేసిందే నన్నే...’ అంటూ మొదలవుతుంది ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘జిక్కీ’. రవితేజ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సె కథానాయిక. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాలోని ‘జిక్కీ...’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.‘‘నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే... గట్టుదాటి గట్టిగానే కొట్టుకున్నదే... పట్టుపట్టి పిల్లా చెయ్యి పట్టుకున్నదే...’, ‘నా మనసే నీకే చిక్కి... దిగనందే మబ్బుల్ ఎక్కి... నీ బొమ్మే చెక్కి... రోజూ నిన్నే పూజించానే జిక్కీ...’ అనే లిరిక్స్తో ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో వనమాలి సాహిత్యం అందించిన ఈపాటను కార్తీక్, రమ్య బెహరాపాడారు. -
మిస్టర్ బచ్చన్ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా తొలిపరిచయం అవుతుంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది.ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ తప్పుపట్టారు. సినిమా చూసిన తర్వాత ఇదే కామెంట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. కాన్సెప్ట్ రైడ్ సినిమా కావచ్చునేమో కానీ, ఆయన తెరకెక్కించే తీరు మాత్రం ప్రత్యేకతను తప్పకుండా చాటుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
రవితేజ, హరీశ్ శంకర్ పై కోపానికి కారణం అదేనా..?
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
8 రోజుల అనంతరం తెనాలికి చేరిన రవితేజ మృతదేహం
తెనాలిరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్కు చెందిన తాడిబోయిన రవితేజ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. అమెరికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రవితేజ భౌతికకాయాన్ని అంబులెన్స్ ద్వారా తెనాలి తీసుకు వచ్చారు. ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి రవితేజ మృతి చెందిన విజయం తెలిసిందే. రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి కొడుకుకు మంచి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసింది. ఓవైపు చదువుకుంటూనే కోకోకోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడపెట్టుకున్న రవితేజ ఎంఎస్ కోసం గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. అక్కడ టెక్సాస్లో ట్రైన్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్నేహితులతో కలిసి అక్కడ స్విమ్మింగ్పూల్లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాదాపు ఎనిమిది రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం రవితేజ భౌతికకాయం తెనాలి చేరుకుంది. తెనాలిలో భారీ ఊరేగింపుగా రవితేజ భౌతికకాయాన్ని ఐతానగర్లోని నివాసానికి తీసుకువెళ్లారు. రజక చెరువు సెంటర్ నుంచి లింగారావు సెంటర్ మీదుగా రవితేజ నివాసానికి రాత్రికి భౌతికకాయం చేరుకుంది. రవితేజ భౌతిక భౌతికకాయాన్ని చూసి తల్లి జయలక్ష్మి, సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబానికి చెందిన తాము కొడుకు ప్రయోజకుడవుతాడని అమెరికా పంపిస్తే అనుకోని ప్రమాదంలో అతడు మృతి చెందాడంటూ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి జయలక్ష్మి గుండెల విసేలా రోదించారు. శనివారం ఉదయం రవితేజ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. -
మాస్ మహారాజా 'మిస్టర్ బచ్చన్'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే సితార్ అనే సాంగ్ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెప్పల్ డప్పుల్ అంటూ సాగే పాటను విడుదల చేయగా యూట్యూబ్లో దూసుకెళ్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇండిపెండెన్స్ డే రోజున ఈ సినిమా రిలీజ్ కానుంది. Here’s #ReppalDappul from #MrBachchan for you all :))- https://t.co/fnoX3aw9VREnjoy the beats now! pic.twitter.com/dltXxgEkvb— Ravi Teja (@RaviTeja_offl) July 25, 2024 -
రెప్పల్ డప్పుల్
హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రధారులు.పనోరమా స్టూడియోస్ అండ్ టి–సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రెప్పల్ డప్పుల్...’ అంటూ సాగే రెండోపాట లిరికల్ వీడియోను ఈ నెల 25న విడుదల చేయన్నుట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
బచ్చన్ ఫిక్స్
‘మిస్టర్ బచ్చన్’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు మేకర్స్.‘‘మిస్టర్ బచ్చన్’ పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూవీని విడుదల చేస్తున్నాం. ఆగస్ట్ 14న ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఆగస్ట్ 19న రక్షా బంధన్ సెలవు ఉంటుంది. 5 రోజుల లాంగ్ వీకెండ్ మా మూవీకి ప్లస్ అవుతుందనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మాస్ మహారాజా వచ్చేస్తున్నాడు.. మిస్టర్ బచ్చన్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా హీరో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో వీరిద్దరి కాంబోలో షాక్, మిరపకాయ్ లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇటీవలే సితార్ అనే సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాస్ లుక్లో ఉన్న పోస్టర్ను కూడా పంచుకున్నారు. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. Get Ready!!#MrBachchan is Arriving..MASSive entertainment begins from this August 15th 🤙Premieres on AUG 14th.. pic.twitter.com/xkSEy5EUkW— Ravi Teja (@RaviTeja_offl) July 21, 2024 -
టార్గెట్ పంద్రాగస్ట్.. గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్గా థియేటర్స్లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.మిస్టర్ బచ్చన్ రెడీరవితేజ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్లోకి రానుందని సమాచారం.కేజీఎఫ్ కథకేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది. డబుల్ ఎనర్జీపంద్రాగస్ట్కు థియేటర్స్లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్లో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.చిన్న కథ కాదు‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్పై మరో అప్డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. మేం ఫ్రెండ్సండి....మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. పుష్ప వాయిదా పడటంవల్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది. -
కాంబినేషన్ రిపీట్?
‘పవర్’ మూవీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పవర్’. 2014లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే రవితేజ, బాబీల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రవితేజ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నారట బాబీ. త్వరలోనే రవితేజకి ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట దర్శకుడు.అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అవుతుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారని భోగట్టా. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
మాస్ మహారాజ ఫిట్నెస్
-
'కంగ్రాట్స్..నోబెల్ ప్రైజ్కు దరఖాస్తు చేసుకో'.. నెటిజన్కు డైరెక్టర్ కౌంటర్!
మాస్ మహరాజా రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సితార్ అంటూ సాగే సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అయితే ఈ సాంగ్పై నెటిజన్స్ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్లను కేవలం ఓ వస్తువులాగే చూపిస్తారని మండిపడుతున్నారు. 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్యశ్రీతో అలాంటి స్టెప్స్ వేయింటడమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.అయితే దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించారు. నెటిజన్కు రిప్లై ఇస్తూ..'కంగ్రాట్స్.. చాలా బాగా కనిపెట్టావ్.. నోబెల్ ప్రెజ్కు దరఖాస్తు చేసుకో.. అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు.. దీన్ని నువ్వు ఇలాగే కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్ను ప్రశ్నిస్తూ ఉండాలి.. నీలాంటి వారికి ఎప్పుడు వెల్కమ్ చెబూతూనే ఉంటా' అని ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇలాంటివి కేవలం సినిమాలాగే చూడాలంటూ మరికొందరు నెటిజన్స్ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాటర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Congratulations for the discovery.. i think you should apply for Nobel Prize… 👍👍 And pls continue objectifying film makers…. We welcome you https://t.co/g6J2pR0NXK— Harish Shankar .S (@harish2you) July 10, 2024 -
పట్టుచీర కట్టుకోమ్మా...
‘చిట్టి గువ్వలాంటి చక్కనమ్మా... బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా...’ అంటూ మొదలవుతుంది ‘మిస్టర్ బచ్చన్’లోని ‘సితార్’ సాంగ్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. బుధవారం ‘సితార్...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. కశ్మీర్ వ్యాలీలో ఈ మెలోడీ డ్యూయెట్ను రవితేజ, భాగ్యశ్రీ కాంబినేషన్లో చిత్రీకరించారు. చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాటకు సాహితి సాహిత్యం అందించగా సాకేత్, సమీరా భరద్వాజ్ పాడారు. -
కశ్మీర్లో మిస్టర్ బచ్చన్
కశ్మీర్లో మెలోడీ డ్యూయెట్ పాడుతున్నాడు మిస్టర్ బచ్చన్ . రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో జరుగుతోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.‘‘నాలుగు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారంతో ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. విజువల్ ఫీస్ట్గా ఉంటూనే ఎమోషనల్ ఎలిమెంట్తో ఈ సాంగ్ ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ తొంభై శాతం పూర్తయింది. మిగతా భాగాన్ని త్వరగా చిత్రీకరించేలా శరవేగంగా పని చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే హిందీ హిట్ ఫిల్మ్ అజయ్ దేవగన్ ‘రైడ్ ’(2018)కు తెలుగు రీమేక్గా ‘మిస్టర్ బచ్చన్ ’ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. -
ఓవర్ చేయకు అంటూ డైరెక్టర్కు రవితేజ పంచ్
ప్రస్తుతం మాస్ మహారాజ ఫోకస్ అంతా మిస్టర్ బచ్చన్ మీదే ఉంది. ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ ఎంతగా కష్టపడుతున్నాడనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నాడు హరీష్. హీరోకు మెడనొప్పి ఉన్నా సరే షూటింగ్కు డుమ్మా కొట్టకుండా సెట్కు వచ్చాడంటూ ఓ ఫోటో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఇటీవల సినిమా నుంచి టీజర్, ట్రైలర్కు బదులుగా షో రీల్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా హరీష్.. ఎక్స్(ట్విటర్)లో రవితేజ ఫోటో షేర్ చేశాడు. 'ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప! కశ్మీర్ లోయలో షూటింగ్ బాగా జరిగింది. త్వరలోనే హైదరాబాద్కు వచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన రవితేజ.. 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా' ఉంది అని ఫన్నీగా స్పందించాడు.ఈ సినిమాలో హీరో.. బిగ్బీ అమితాబ్ బచ్చన్కు పెద్ద అభిమాని. అందుకు సంకేతంగానే టైటిల్ మిస్టర్ బచ్చన్ అని పెట్టారు. 2019లో హిందీలో వచ్చిన అజయ్ దేవ్గణ్ 'రైడ్' సినిమాకు ఇది రీమేక్గా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. Over cheyaku roiiiii .. Nee dishtey tagilela undhi..!! https://t.co/Rr57r1APYP— Ravi Teja (@RaviTeja_offl) June 23, 2024 చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ -
మాస్ బచ్చన్
శత్రువులు చుట్టుముట్టారు... అయినా బచ్చన్ కంగారుపడలేదు. కంగారు అంటే ఏంటో అతనికి తెలియదు. ధైర్యానికి చిరునామా లాంటివాడు. వచ్చినవాళ్లను వచ్చినట్లు ఇరగదీశాడు బచ్చన్. ఏ రేంజ్లో రఫ్ఫాడించాడో తెలియాలంటే ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షో రీల్ వీడియోను సోమవారం విడుదల చేశారు.ఈ వీడియోలో రవితేజ చేసిన మాస్ ఫైట్, ఆగ్రహంతో జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ని రవితేజ అనుకరించడం తదితర విజువల్స్ కనిపించాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: అయాంకా బోస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
నా పెళ్లికి రండి.. టాలీవుడ్ సెలబ్రిటీలకు వరలక్ష్మి ఆహ్వానం (ఫోటోలు)
-
ధమాకా రిపీట్.. రవితేజతో మరోసారి జోడీ కడుతున్న శ్రీలీల (ఫోటోలు)
-
క్రేజీ కాంబో ఫిక్స్.. ధమాకా చూపించనున్న రవితేజ, శ్రీలీల
-
'ధమాకా' కాంబో రిపీట్.. రవితేజ 75వ సినిమా ప్రారంభం (ఫోటోలు)
-
రవితేజ, శ్రీలీల జోడీ రిపీట్.. సంక్రాంతికి విడుదల
కొన్నేళ్లుగా టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది నుంచి వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు,ఈగల్ వంటి చిత్రాలతో దూకుడు మీద ఉన్నాడు రవితేజ. హరీశ్ శంకర్ దర్వకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. అయితే తాజాగా రవితేజ తన 75వ చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు.‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు రవితేజ, శ్రీలీల. తాజాగా ఈ జోడీ రిపీట్ అయింది. తాజాగా నేడు ఈ సినిమా షూటింగ్ను పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కునుంది. తొలి సన్నివేశంలో రవితేజ, శ్రీలీల జంటగా కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలతో తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి" అని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
జోడీ రిపీట్?
‘ధమాకా!’ (2022) సినిమాలో తొలిసారి జంటగా నటించి ఆడియన్స్ను మెప్పించారు రవితేజ, శ్రీలీల. తాజాగా ఈ జోడీ రిపీట్ కానున్నట్లుగా తెలిసింది. రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించనున్నారు. ఇది రవితేజ కెరీర్లో 75వ చిత్రం కావడం విశేషం.ఇందులో లక్ష్మణ్ భేరి అనే పాత్రలో కనిపించనున్నారు రవితేజ. ఈ సినిమా చిత్రీకరణ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. మరి.. ఈ ‘ధమాకా!’ జోడీ రిపీట్ అవుతుందా? వేచి చూడాలి. కాగా ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఓటీటీలో రవితేజ సినిమా అరుదైన ఘనత.. తొలిసారి దివ్యాంగుల కోసం
సినిమా చూడటం అంటే చాలామందికి సరదా. ఎందుకంటే ఏదో పనిచేసి అలసిపోయినా వాళ్లు.. కాసేపు అలా కూర్చొని మూవీ చూస్తుంటే వచ్చే కిక్ వేరు. కానీ దివ్యాంగులకు మాత్రం ఈ అవకాశం లేదు. కానీ ఇకపై పరిస్థితి మారింది. ఇప్పుడు వాళ్ల కోసం కూడా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఓ తెలుగు సినిమా ఇలా అరుదైన ఘనత సాధించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా గతేడాది దసరాకి థియేటర్లలో రిలీజైంది. గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. జనాల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమాని ఇండియన్ సైన్ లాంగ్వేజ్లోకి ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే సినిమా ప్లే అవుతుంటే మరోవైపు ఓ అమ్మాయి సైగలతో ఏం మాట్లాడుకుంటున్నారో చూపిస్తూ ఉంటుంది.దీని ద్వారా సినిమాలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి. 'టైగర్ నాగేశ్వరరావు'తో మొదలైన ఈ ట్రెండ్.. రాబోయే రోజుల్లో మిగతా తెలుగు సినిమాల విషయంలోనూ పాటించొచ్చు.(ఇదీ చదవండి: 'జయ జయహే తెలంగాణ'.. కీరవాణి వద్దు!) A new chapter in inclusivity in Indian Cinema ✨#TigerNageswaraRao is the 𝐅𝐈𝐑𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 to have an OTT Release in the 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐒𝐈𝐆𝐍 𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄 ❤️🔥Streaming now on @PrimeVideoIN 🔥https://t.co/rbR0n6vYU4 🥷Mass Maharaja @RaviTeja_offl… pic.twitter.com/koX2nFfFww— Abhishek Agarwal 🇮🇳( Modi Ka Parivar) (@AbhishekOfficl) May 27, 2024 -
ఇచ్చినమాట నిలబెట్టుకున్న రవితేజ
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్తో అమర్ దీప్ చౌదరి మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్లో అమర్ ఆటతీరు పట్ల కొందరు నెటిజన్లు తప్పుపట్టినా.. అతనిలోని ఎమోషనల్ కోణం చాలామందికి నచ్చింది. అందుకే బిగ్ బాస్ ఫైనల్ వరకు చేరుకుని రన్నర్గా నిలిచాడు. టాలీవుడ్ మాస్మహారాజా రవితేజ అంటే అమర్కు చాలా ఇష్టం. ఇదే విషయాన్ని చాలా సమయాల్లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అమర్ చూపిన అభిమానానికి ఫిదా అయిన రవితేజ కూడా ఒక ఆఫర్ ప్రకటించాడు. తన నటించబోయే సినిమాలో ఒక మంచి పాత్ర ఇస్తున్నట్లు బిగ్ బాస్ వేదికగా ప్రకటించాడు.తాజాగా రవితేజను అమర్ దీప్ కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. నా డ్రీమ్ నిజం అయిందంటూ అమర్ చెప్పుకొచ్చాడు. రవితేజతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలిపాడు. దీంతో అభిమానులు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇచ్చిన మాటను రవితేజ నిలిబెట్టుకున్నారని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ రేసు నుంచి తప్పుకుంటే రవితేజ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని హోస్ట్ నాగార్జున చెప్పగానే అమర్ కూడా అందుకు రెడీ అంటూ.. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దానిని గమనించిన రవితేజ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు అదే స్టేజీ మీద మాట ఇస్తాడు. 105 రోజులు కష్టపడ్డావ్ ఆట పూర్తి అయ్యే వరకు ఉండమని రవితేజ కోరుతాడు. దీంతో ఫుల్ ఖుషి అయిన అమర్కు ఎట్టకేలకు తన అభిమాన హీరోతో కలిసి నటించే ఛాన్స్ దక్కింది.రవితేజ ఒకవైపు మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తూనే మరోవైపు తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ను కూడా లాంచ్ చేశాడు. రవితేజ 75వ సినిమాని ‘సామజవరగమన’ రచయిత భాను బొగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ ‘RT75’ పేరుతో ఒక పోస్టర్ కూడా విడుదలైంది. అమర్ ఈ రెండు చిత్రాలలో దేనిలో నటిస్తున్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by Amardeep G (@amardeep_chowdary) -
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మాస్ మహరాజ్ రవితేజ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మాధవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "మిస్టర్ ఇడియట్". పెళ్లి సందడి ఫేమ్ డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా కనిపించనుంది.. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ను రవితేజ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు అల్ ది బెస్ట్ చెప్పారు.టీజర్ చూస్తే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్లో కనిపిస్తోంది. టీజర్ కాలేజీ సీన్స్, కామెడీ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
-
ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్
ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్ అంటున్నారు మిస్టర్ బచ్చ న్ . హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేష న్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చ న్ ’. ‘నామ్ తో సునాహోగా’ అనేది ట్యాగ్లై న్ . భాగ్యశ్రీ బోర్సే హీరోయి న్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ టాకీ పార్ట్ చిత్రీకరణ జరిపారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం ఈ వారంలో అమెరికా వెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని ఫిల్మ్నగర్ సమాచారం. హరీష్ శంకర్ ఆల్రెడీ అమెరికా వెళ్లి లొకేష న్ ్స పరిశీలిస్తున్నారని తెలిసింది. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ స్వరకర్త. ఇదిలా ఉంటే హిందీ హిట్ మూవీ ‘రైడ్’ (2018)కు తెలుగు రీమేక్గా ‘మిస్టర్ బచ్చ న్ ’ తెరకెక్కుతోందని సమాచారం. -
రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి
మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ రూట్లో మాస్ మహారాజ రవితేజ అడుగులు వేశారు. ఏషియన్ గ్రూప్స్ వారితో థియేటర్ బిజినెస్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్ట్లో రవితేజ పేర్ టాప్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలో దూసుకుపోతున్న రవితేజ హైదరాబాద్లోని దిల్షుక్నగర్లో ఆయన పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఏషియన్ రవితేజ (ART)పేరుతో భారీ మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. ART సినిమాస్ పూజా కార్యక్రమంలో మోక్షద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ కూడా పాల్గొనడం విశేషం. మొత్తం ఆరు స్క్రీన్స్తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో గ్రాండ్గా ఓపెన్ కాబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు (AMB), అల్లు అర్జున్ (AAA), విజయ్ దేవరకొండ (AVD) వంటి స్టార్స్తో సంయుక్తంగా ఏషియన్ గ్రూప్స్ భారీ మల్టీఫ్లెక్స్లను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్లోకి రవితేజ (ART) చేరిపోయాడు.