Skill Development Scam
-
బాబుతో సీఐడీ దోస్తీ
-
చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సీఐడీ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.జోక్యం అవసరం లేదన్న సీఐడీతాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఐడీ పిటిషన్ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
వాంగ్మూలాలు మార్చేసి.. ‘సుప్రీం’ను ఏమార్చాలి
సాక్షి, అమరావతి : సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది.సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
మూడు నెలల్లో బాబు అవినీతి కేసులు ముగించేలా కుట్రలు
-
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
బాబు అవినీతి బాగోతాన్ని మడతెట్టేద్దాం..
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు కుట్రదారు, లబ్ధిదారుగా సాగించిన కుంభకోణాల కేసులను పూర్తిగా నీరుగార్చే కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది! అందుకోసం ఇప్పటికే డీజీపీ, సీఐడీ కార్యాలయాలను పూర్తిగా ఆ పనిలో నిమగ్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఢిల్లీ నుంచి ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాదిని రప్పించి కేసుల కొట్టివేత కుట్రలను వేగవంతం చేయడం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం ఆధారాలతో సహా బట్టబయలయ్యాయి. వాటిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందులో స్కిల్ స్కామ్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్ట్ చేయగా... ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ నాలుగు కేసులూ సీఐడీ విచారణలోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ కేసుల దర్యాప్తును నీరుగార్చి ఏకంగా కేసులను కొట్టి వేసేందుకు కార్యాచరణ చేపట్టారు. అన్ని కేసుల నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో కూడా దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించినట్లు తెలిసింది.నేను చెప్పినట్టు చేయండి.. ఆ కేసులను మూసేద్దాంస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున వాదించిన ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఏకంగా రోజుకు రూ.కోటికి పైగా ఫీజు చెల్లించి మరీ ఆయన్ను ప్రత్యేకంగా రప్పించారు. కానీ ఆయన వాదనను ఏసీబీ న్యాయస్థానం సమ్మతించలేదు. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయినా సరే అదే న్యాయవాది చంద్రబాబు కేసుల విచారణను ఇటు విజయవాడలో అటు ఢిల్లీలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ సీనియర్ న్యాయవాది సోమవారం హఠాత్తుగా విజయవాడలో వాలారు. జీ హుజూర్ అంటూ రాష్ట్ర పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసలు ఓ ప్రైవేట్ న్యాయవాదితో పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు సమావేశం కావడం ఏమిటని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఆ సమావేశం సాగింది.స్కిల్స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడం... అనంతరం ఆ కేసులను మూసివేయడం... అందుకు ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి.... ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి...? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది అంశాలవారీగా వివరించారని తెలుస్తోంది. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలు పూర్తిగా సహకరించాలని ఆయన తేల్చిచెప్పారు. అందుకు పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు తలూపినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ న్యాయవాది పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో మంగళవారం కూడా సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన ప్రభుత్వంచంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటకెక్కించేసింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల చార్జిషీట్లను సీఐడీ గతంలో న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సీఐడీకి పంపింది.అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సీఐడీ అధికారులకు అందచేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను నీరుగార్చేలా కూటమి పెద్దలు సీఐడీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఐడీ ఆ చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించలేదు. కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయడం లేదు.‘సుప్రీం’లో విచారణకు సహాయ నిరాకరణస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. 2023లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నిర్భీతిగా ఉల్లంఘించారు. కేసుల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడవద్దని న్యాయస్థానాలు స్పష్టమైన షరతులు విధించాయి. అయితే చంద్రబాబు దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ.. రెడ్బుక్ పేరిట హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.షరతులు ఉల్లంఘించినందున చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ 2023 డిసెంబర్లోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ హఠాత్తుగా రూటు మార్చేసింది. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై విచారణకు సహకరించడం లేదు. సుప్రీం కోర్టులో సీఐడీ వాదనను వినిపించాల్సిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు.అది సరైన పద్ధతి కాదని సుప్రీం కోర్టు చెప్పినా తీరు మారడం లేదు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణకు ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా పాల్గొన్నారు. వాదనలు వినిపించకుండా.. తాను ఢిల్లీలో లేనందున వాయిదా వేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిసారీ వాయిదాలు కోరడం సరైన చర్య కాదని వ్యాఖ్యానిస్తూ కేసు విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.సీబీఐకి అప్పగించాలి.. న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలిన్యాయ నిపుణుల సూచనస్కిల్ స్కామ్, ఇతర కేసుల దర్యాప్తు, తాజా పరిణామాలను గమనిస్తున్న న్యాయ నిపుణులు చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని సూచిస్తున్నారు. సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గడువు కోరిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుపై కేసుల దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించాలని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో మద్యం సిండికేట్ కేసు దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.షరతులు ఉల్లంఘిస్తున్న బాబు⇒ స్కిల్ స్కామ్ కేసులో న్యాయస్థానం విధించిన బెయిల్ షరతులను ఎన్నికల ముందు, ఆ తర్వాత చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా బేఖాతర్ చేస్తున్నారు. తన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ఓటీటీ చానల్ కోసం నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్న చంద్రబాబు న్యాయస్థానాల షరతులంటే ఏమాత్రం లెక్కలేదనే రీతిలో షరతులను ఉల్లంఘిస్తూ మాట్లాడారు. ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టబోనని బెదిరింపులకు దిగడం గమనార్హం.⇒ హిందుస్థాన్ టైమ్స్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సదస్సులోనూ చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించి స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడారు. అధికారులను బెదిరించే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నించారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.విచారణ సందర్భంగా అప్పటి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వర్చువల్గా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుతం తాను ఢిల్లీలో లేనని, విచారణకు నేరుగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ముకుల్ రోహత్గి కోరారు. దీంతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. -
చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు
-
చంద్రబాబు సహా వాళ్లంతా కుంభకోణాల్లో నిందితులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సీఐడీ అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేశ్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తిమంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీల్లోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు.2014–19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తిలక్ పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థలన్నీ చంద్రబాబు తదితరులకు క్లీన్చీట్ ఇచ్చి వారిపై నమోదైన కేసులన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నాయని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. రూ.కోట్ల కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోందని, అందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసిందని తెలిపారు. అధికారుల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు ‘ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఐజీ, సీఐడీ అదనపు డీజీ, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్ను కోరగలరు. అయితే వీరంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పనితీరు మదింపు నివేదికలు (ఏపీఏఆర్) ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దే ఉంది. అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాలపై దర్యాప్తు చేసిన అధికారుల వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఇది నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీనిపై మధుసూదన్రెడ్డి న్యాయపోరాటం చేసి తిరిగి ఉద్యోగం పొందారు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారనేందుకు ఇదో ఉదాహరణ. అంతేకాక ఆ కుంభకోణాలపై నిష్పాక్షికంగా, వృత్తిపరంగా దర్యాప్తు చేసిన, దర్యాప్తులో పాలుపంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కనపెట్టారు’ అని తిలక్ వివరించారు.ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో ఐదుగురు ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారు. సీఐడీ దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులుగా ఉన్న వీరిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ను కోరే ఆస్కారమే లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చైర్మన్గా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఆర్డీఏ పురపాలక శాఖ పరిధిలో పనిచేస్తుంది. దానికి నారాయణ మంత్రిగా ఉన్నారు. సీఆర్డీఏకు నారాయణ వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు.వీరిద్దరూ ఆ కుంభకోణాల్లో నిందితులు. సీఆర్డీఏ, పురపాలక శాఖ అధికారులందరూ వీరి నియంత్రణలో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొందరి సాక్ష్యాలను కింది కోర్టు నమోదు చేసింది. మరికొందరి సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్నీ రికార్డులను చంద్రబాబు, నారాయణ పరిశీలించే అవకాశం ఉంది అని తిలక్ తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ బెదిరించేలా మాట్లాడుతున్నారు‘బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేశ్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా, అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచి్చన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు.క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా? చేస్తున్నారా? అన్న విషయాలు కేసు డైరీల్లో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరులు అధికారులను, దర్యాప్తును శాసించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వారిపై నమోదయిన కేసులకు సంబంధించిన కేసు డైరీలను, చార్జిషిట్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి’ అని తిలక్ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వెలుగులోకి సరికొత్త విషయాలు
-
ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిధుల మళ్లింపు నిజమే... నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
-
నిధుల మళ్లింపు నిజమే
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎలా మొదలైంది.. నిధులు ఎలా మళ్లించారు.. ఎంత మొత్తంలో మళ్లించారు.. అందులో ఎవరెవరు ఉన్నారు.. ఎన్ని సూట్కేస్ కంపెనీలు ఏర్పాటు చేశారు.. ఏ ఏ దేశాల్లో ఆ కంపెనీలున్నాయి.. ఆ కంపెనీల ప్రతినిధులు ఎవరు.. వారికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును నడిపిన వ్యక్తులకు మధ్య సంబంధం ఏమిటి.. మళ్లించిన నిధులను తిరిగి ఎలా నగదు రూపంలో తీసుకున్నారు.. ఇలా పలు కీలక విషయాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ద్వారా పూసగుచ్చినట్లు బట్టబయలు అయ్యాయి. ఇకపై సాగనున్న దర్యాప్తులో ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర నిగ్గు తేలనుంది.సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లో సాగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈడీ సాగించిన దర్యాప్తులో మొత్తం రూ.151 కోట్ల మేర నిధులను పలు కంపెనీలకు మళ్లించినట్లు తేలింది. ఇందులో విదేశీ కంపెనీల ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలను సేకరించింంది. ఈ వివరాలన్నింటినీ ఇటీవల ఓ కేసులో హైకోర్టు ముందు ఉంచింది. ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించి, ఆ నిధులను తిరిగి డబ్బు రూపంలో ఎలా పొందారో ఈడీ తన కౌంటర్లోసు స్పష్టంగా వివరించింది. ఇప్పటి వరకు ఈడీ తన దర్యాప్తును ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు పరిమితం చేసింది. దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో ఇకపై స్కిల్ కుంభకోణంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై దృష్టి సారించనుంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా మొదలైంది.. ఏకపక్ష నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు.. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర, ఆయన జోక్యం, ఇతర అధికారుల పాత్రపై ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టనుంది. మళ్లించిన ప్రజాధనం చివరకు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ ఇప్పటికే ప్రాథమికంగా తేల్చిన నేపథ్యంలో ఈడీ ఈ అంశంపై కూడా లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.ఇదీ కుంభకోణం..నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు 2015లో చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినయ్ ఖన్వీల్కర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందం ప్రకారం శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్ను డిజైన్ టెక్ అందించాలి. ⇒ ఈ ప్రాజెక్టులో మొత్తం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో క్లస్టర్ను రూ.546.84 కోట్లతో ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం మొత్తం వ్యయం రూ.3,281.40 కోట్లు. ఇందులో 90 శాతం నిధులు.. అంటే రూ.2,951 కోట్లను సీమెన్స్, డిజైన్ టెక్ భరిస్తాయి. మిగిలిన 10 శాతం అంటే రూ.330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ⇒ అయితే సీమెన్స్, డిజైన్ టెక్లు తమ వాటా నిధులను ఇవ్వక ముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.330 కోట్లను ఆ కంపెనీలకు ఇచ్చేసింది. ఇదంతా కూడా అప్పటి మంత్రి మండలి ఆమోదం లేకుండానే జరిగిపోయింది. చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కిక్కురు మనకుండా ఆయన చెప్పినట్లు చేసేశారు.⇒ ఇదిలా ఉండగా 2018లో షెల్ కంపెనీ అయిన ఏసీఐ.. (అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసియా) లిమిటెడ్) నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు తయారు చేసి పలువురికి లబ్ధి చేకూరుస్తున్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. సుమన్ బోస్ తదితరులు తమ అక్రమ కార్యకలాపాలకు ఈ ఏసీఐ కంపెనీని వాడుకున్నారు. 2019లో ఈ మొత్తం కుంభకోణం గురించి పుణేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.⇒ ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో జరిగినట్లు తేలింది. దీంతో ఆయన్ను ఏ1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు మొదలు పెట్టింది. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్కిల్ కుంభకోణంలో సీఐడీ తన దర్యాప్తును పక్కన పెట్టేసింది. అయితే ఈడీ తన దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది.స్కిల్ కుంభకోణానికి సంబంధించి హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ , సింగపూర్ కంపెనీలకు, యూకే బేస్డ్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఇలా డిజైన్ టెక్ నుంచే నిధుల మళ్లింపు మొదలు.. ⇒ దర్యాప్తులో భాగంగా ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను ఈడీ విశ్లేషించింది. డిజైన్ టెక్ నుంచి పొందిన నిధుల్లో దాదాపు రూ.58 కోట్లను స్కిల్లర్ ఎంటర్ప్రైజస్, ఆ తర్వాత ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ పద్ధతిలో వచ్చిన డబ్బును పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు స్కిల్లర్ కంపెనీ వ్యవహారాలు చూసే వ్యక్తి శిరీష్ షా ఈడీ విచారణంలో అంగీకరించారు.⇒ స్కిల్లర్ నుంచి వచ్చిన సొమ్ముతో స్కిల్ డెవలప్మెంట్ సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి వస్తువులను గానీ, సేవలను గానీ అందించలేదు. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ నిధులను డిజైన్ టెక్ కంపెనీ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్కు, స్కిల్లర్ తిరిగి ఆ నిధులను ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ తేల్చి చెప్పింది. నిధుల మళ్లింపుకు సహాయ పడిన వారి వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, వస్తువులు, సేవలు.. ఏవీ అందించలేదని వారు అంగీకరించారు. నకిలీ, కల్పిత పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్లు, తప్పుడు బిల్లులు సృష్టించినట్లు కూడా వారు ఈడీ ఎదుట ఒప్పుకున్నారు.⇒ ఏసీఐ నుంచి వచ్చిన నిధులను నగదు రూపంలో మార్చినట్లు కూడా వారు అంగీకరించారు. ఈ విషయాలన్నింటినీ ఎంట్రీ ప్రొవైడర్లయిన యోగేశ్ గుప్తా, మనోష్ కుమార్ జైన్ ఈడీ వద్ద నిర్ధారించారు. ఈ షెల్ కంపెనీలేవీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్తో సంబంధం ఉన్న కంపెనీలు కాదని కూడా ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది.⇒ ఈ గొలుసు లావాదేవీల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని యోగేశ్ గుప్తా, ముకుల్ అగర్వాల్కు అందచేసినట్లు సావన్ జాజూ ఈడీకి తెలిపారు. నగదు విషయంలో ముకుల్ చంద్ర అగర్వాల్.. యోగేశ్ గుప్తా వద్దకు వెళ్లినట్లు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాల ద్వారా వచ్చిన నిధులను నగదు రూపంలో వీరు అందుకున్నట్లు కూడా స్పష్టమైంది. ⇒ ఏసీఐ మాత్రమే కాకుండా ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రో వెస్ట్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్లను నిధుల మళ్లింపు కోసం వాడుకున్నారు. ఇందుకు బోగస్ బిల్లులను చూపారు. తద్వారా స్కిల్లర్ నుంచి నేరుగా ని«ధులు పొందారు. ఇలా ఇప్పటి వరకు రూ.151 కోట్ల మేర నిధులను మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.ప్రజా ధనాన్ని మళ్లించేందుకే స్కిల్లర్ ఏర్పాటు స్కిల్లర్ తనకొచ్చిన నిధుల్లో నుంచి కొంత భాగం ముకుల్ అగర్వాల్కి చెందిన నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు బదలాయించింది. అక్కడి నుంచి ఆ నిధులు ముకుల్ చంద్ర, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి, అతని నియంత్రణలో పని చేసే కంపెనీల ఖాతాల్లోకి చేరాయి. ముకుల్ చంద్ర అగర్వాల్ పలు కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటన్నింటిపై తనకు నియంత్రణ ఉండేలా చూసుకున్నారు.ప్రభుత్వానికి చెందిన అత్యధిక భాగం నిధులు ఈ కంపెనీల మధ్యే సర్కులేట్ అయ్యాయి. సుమన్ బోస్ అవసరాల కోసమే ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ముకుల్ చంద్ర అగర్వాల్ ఈడీ ముందు అంగీకరించి, ఆ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే సుమన్ బోస్ తన విదేశీ బ్యాంకు ఖాతాలను మూసేశారు. దీనిపై కూడా ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. పలు విదేశీ కంపెనీలతో బోస్కు సంబంధాలున్నాయన్న విషయం కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. నేరపూరిత చర్యల ద్వారా బదలాయించిన మొత్తాలను ఆ షెల్ కంపెనీల ద్వారా తిరిగి నగదు రూపంలో పొందిన విషయాన్ని కూడా ఈడీ గుర్తించింది. ప్రజాధనం దోచేసేందుకే సుమన్ బోస్ మిలాఖత్⇒ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్, టాలెంట్ ఎడ్జ్, ఏసీఐ, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్, డిజైన్ టెక్ కంపెనీలు, వారి యజమానులతో కలిసి సుమన్బోస్ పని చేశారని సీమన్స్ నివేదిక స్పష్టం చేసింది. సీమెన్స్ ప్రస్తుత ఎండీ కూడా ఇందుకు సంబంధించిన సంభాషణలు, వాట్సాప్ చాట్లు, ఇతరత్రా పలు వివరాలను ఈడీకి అందజేశారు. డిజైన్ టెక్ వికాస్ ఖాన్వీల్కర్, సుమన్ బోస్ల మధ్య డబ్బు తరలింపును కూడా ఈడీ గుర్తించింది.⇒ ముకుల్ అగర్వాల్, సురేష్ గోయల్ తనకు సన్నిహిత మిత్రులన్న విషయాన్ని సుమన్ బోస్ ఈడీ ముందు అంగీకరించారు. డీసాల్ట్ ప్రస్తుత చిరునామా, ఎస్ఎస్ఆర్ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చిరునామా ఒకే విధంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో సురేశ్ గోయల్ సతీమణి ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నారు. పలు ఇతర కంపెనీలు కూడా ఇదే చిరునామాపై రిజిస్టర్ అయి ఉన్నాయి. నిధుల మళ్లింపు వ్యవహారంలో సుమన్ బోసే మాస్టర్ మైండ్, ఇందుకు ఖాన్వీల్కర్, సురేశ్ అగర్వాల్ల సాయం తీసుకున్నారు.⇒ సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తులసీదాస్ శివ కుమార్కు చెందింది. ఇతను సీమెన్స్ సుమన్ బోస్కు అత్యంత సన్నిహితుడు. గతంలో సీమెన్స్లో పని చేశాడు. ఈ కంపెనీకి రూ.3,48,95,191 మళ్లించారు. మరో సింగపూర్ కంపెనీ అయిన ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్కు రూ.74.51 లక్షలు, యూకేకు చెందిన ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్కు రూ.73.67 లక్షలు జమ చేశారు. ఈ మొత్తాలన్నీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీ) నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొందిన నిధులు. నిధుల మళ్లింపులో కీలక వ్యక్తులు - సుమన్ బోస్ (స్కిల్ ప్రాజెక్ట్ రూపకర్త)- వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ (డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ)- ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ ఎంటర్ప్రైజస్ సిగ్నేటరీ, సుమన్ బోస్ సన్నిహితుడు, నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కీలక వ్యక్తి )- సురేష్ గోయల్ (సుమన్ బోస్ స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్, ముకుల్ అగర్వాల్ కోసం డబ్బు నిర్వహించిన వ్యక్తి)- శిరీష్ షా (ఏసీఐ వ్యవహారాలు చూసే వ్యక్తి, ఎంట్రీ ఆపరేటర్)- సావన్ కుమార్ జాజు (ఎంట్రీ ఆపరేటర్)- యోగేష్ గుప్తా (ఎంట్రీ ఆపరేటర్)- మనోజ్ కుమార్ జైన్ (ఎంట్రీ ఆపరేటర్)- తులసీదాస్ శివకుమార్ అలియాస్ టి.శివకుమార్ (సింగపూర్ – బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్, సుమన్ బోస్ సన్నిహితుడు)ఈడీ బయటపెట్టిన షెల్ కంపెనీలు...⇒ మెసర్స్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఎస్డబ్ల్యూ)⇒ మెసర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డీటీఎస్పీఎల్)⇒ స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్)⇒ అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏసియా లిమిటెడ్ (ఏసీఐ) (షెల్ కంపెనీ)⇒ కాడెన్స్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ (షెల్ కంపెనీ)⇒ ఈటీఏ గ్రీన్ బిల్డ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఎస్పీఎల్) (షెల్ కంపెనీ)⇒ ఎస్ఎం ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ప్రో వెస్ట్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ మెసర్స్ టాలెంట్ ఎడ్జ్ (షెల్ కంపెనీ)⇒ డిఅసాల్ట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డీఎస్ఐపీఎల్) (గతంలో బోస్, ముకుల్ అగర్వాల్, నరేష్ గోయల్ పని చేసిన కంపెనీ)⇒ ఎస్ఎస్ఆర్ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ కంపెనీలో సురేష్ గోయల్ భార్య డైరెక్టర్. డిఅసాల్ట్ సిస్టమ్స్ కంపెనీదీ ఇదే చిరునామా)⇒ బెన్ రీసర్చ్ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ)⇒ ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు)⇒ ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్ (యూకే కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు) -
మూడేళ్లయినా చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్పోర్ట్ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్పోర్ట్ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడిసుమన్ బోస్ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. -
బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. ‘‘కేసులను నీరుగార్చే కుట్ర’’ శీర్షికతో వచ్చిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది కానీ.. ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తనకు తానే సాటి అని బాబు ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసుకున్నారు మరి! ఈ తాజా కథనంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే...గతంలో సీఐడీ అధికారులు ఎవరినైతే అవినీతి కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారో.. వారికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నదట! ఇది అత్యంత అరుదైన ఘటనే. అప్పట్లో స్కామ్లకు పాల్పడిన వారు ఇప్పుడు అధికారంలో ఉండటం దీనికి కారణమవుతోంది. అయితే నైతిక విలువలు పాటించేవారైతే.. తప్పు చేయలేదని నమ్మేవారైతే తామే నిందితులుగా ఉన్న కేసుల జోలికి అధికారంలోకి వచ్చినా అస్సలు పోరు. నిజం కోర్టులు నిగ్గుతేలుస్తాయని వదిలేస్తారు. ఈ కాలంలో ఇంతటి ఉదాత్త స్వభావాన్ని ఆశించలేము కానీ నిందితులే కేసు సమీక్షకు దిగడం దేశ చరిత్రలో సరికొత సంప్రదాయానికి తెరతీస్తుందన్నది మాత్రం సత్యం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు, స్కామ్ లపై, 2019-24 వరకు ప్రభుత్వాన్ని నడిపించిన వైసీపీ విచారించింది. సీఐడీ, సిట్ వంటి సంస్థలు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిర్దిష్ట అభియోగాలతో చంద్రబాబు, తదితరులపై కేసులు పెట్టింది. ఆ కేసులలో ఛార్జ్షీట్లు వేసేందుకు సమయం బాగా అవసరమైంది. అయితే ఈలోగా ప్రభుత్వం మారి టీడీసీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కేసులను నీరుకార్చడానికి, వీలైతే వాటి నుంచి తప్పించుకోవడానికి సన్నద్దం అవుతున్నారని వార్తలు సూచిస్తున్నాయి బాబు ఇలా చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే తనపై కేసులు పెట్టిన సీఐడీ, సిట్లే ఇప్పుడు బాబుకు ప్రెజెంటేషన్ ఇస్తూండటం మాత్రం హైలైట్. ఇంకో విషయం ఈ కేసుల్లో విచారణ చేసిన అధికారులతో కాకుండా.. చంద్రబాబు నియమించుకున్న అధికారులు ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అంటే అవన్నీ తప్పుడు కేసులని, వాస్తవాలు లేవని, గత ప్రభుత్వంలోని అధికారులు కక్షకట్టి కేసులు పెట్టారని ఇప్పటి అధికారులతో చెప్పించుకునే ప్రయత్నం అన్నమాట! ఒక కేసు నిందితుడే అధికారం అడ్డుపెట్టుకుని తీర్పునిచ్చే విధంగా తన అభిప్రాయాలను ఈ ప్రెజెంటేషన్ సాకుతో వెల్లడించబోతున్నారన్నమాట. చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసు విషయంలో కొన్ని చర్యలు తీసుకుంది. సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు చంద్రబాబు లేదా, ఇతర ముఖ్యులవి కావు. నిధులను మళ్లించిన డిజిటెక్ సంస్థవి. ఈడీ ఈ సంస్థ అధికారులతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులను కూడా గతంలోనే అరెస్ట్ చేసిన విషయం ఇక్కడ ఒకసారి చెప్పుకోవాలి. ప్రధాన నిందితుల్లో ఒకరైన చంద్రబాబును అప్పట్లో ఏపీ సీఐడి అరెస్ట్ చేసినా ఆయనపై ఈడీ ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం ఊహించదగినదే. ప్రస్తుతం ఆయన పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉంది. తదుపరి చర్య తీసుకోవడానికి కేంద్రంలోని సంబంధిత మంత్రులు ఆమోదం ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. పైడి ఎప్పుడు అవకాశం ఉన్నా దేశ ప్రధాని మోడీతో భేటీ అయిన ఫోటోలు కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తిపై ఈడి చర్య తీసుకోవడం కష్టమే.గతంలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన వెంటనే వారిలో ఇద్దరిపై ఉన్న కేసుల విచారణ వేగం మందగించింది. ఆ నలుగురు ప్రధానితో కలిసి కూర్చున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వారికే అంతటి సదుపాయం కలిగినప్పుడు ఇప్పడు చంద్రబాబు మరింత పవర్ ఫుల్ గా ఉన్నందున కేసు నీరుకారిపోకుండా ఉంటుందా అన్నది చర్చనీయాంశం. స్కిల్ స్కామ్లో సుమారు రూ.300 కోట్ల అవ్యవహారాలు జరిగాయన్నది అభియోగం. డొల్ల కంపెనీలకు భారీ ఎత్తున డబ్బు చేరితే అందులో కొంత మనీ లాండరింగ్ మార్గాల్లో నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాల్లోకి వచ్చిందని సీఐడీ అభియోగాలు మోపింది. కానీ అప్పట్లో కేసు విచారించిన అధికారులు ఇప్పుడు టీడీపీ కారణంగా శంకరగిరి మాన్యాలు పట్టారు. పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని వేధిస్తోంది. ఏదో కేసులో ఇరికించి సస్పెన్షన్ వేటు వేసేందుకూ వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. వలపు వల విసిరి మోసగించే నటి ఒకరిని రంగంలోకి దింపి ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బాబు ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురు ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై తదుపరి చర్యల కోసం అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనుమతి రావడం కల్లే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో ఆడియో వాయిస్ తో సహా దొరికిపోయారు. దానిని ఆయన ఎంత సమర్థంగా మేనేజ్ చేసుకున్నారో తెలిసిందే. ఛార్జ్షీట్లో సుమారు 30 సార్లు చంద్రబాబు పేరు ఉన్నా, ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన పేరు చేర్చకుండా అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై కొందరు ప్రముఖుల ద్వారా ప్రభావితం చేయగలిగారని అంటారు. అంతేకాదు. 2019 ఎన్నికల తర్వాత ఆయన కార్యదర్శి ఇంటిపై సీబీటీడీ అధికారులు దాడి చేసి, సుమారు రూ. రెండు వేల కోట్ల విలెవూర అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఆ కేసునే ఆయన ముందుకు సాగకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలను సమర్థంగా మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు వారితో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక ఎవరు ఆ కేసు జోలికి వెళతారు?.ఈడీ అధికారులు నిజంగానే ఈ కేసు లోతుపాతులను విచారించాలని అనుకుంటే ముందుగా షెల్ కంపెనీలకు వచ్చిన డబ్బు, టీడీపీ ఆఫీస్ ఖాతాకు చేరిన డబ్బు గురించి ఆరా తీయాలి. ఆ విషయాన్ని వెల్లడి చేయాలి. కేసు అక్కడదాకా వెళితే అది గొప్ప విషయమే అవుతుంది. కేంద్రంలోని బీజేపీతో ఏదైనా గొడవ వస్తే జరుగుతుందేమో కానీ, అంతవరకు కదలకపోవచ్చు. స్కిల్ స్కామ్ను నీరుగార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి డిజిపికి లేఖ రాశారు. కాని ఆయన మాత్రం ఏమి చేస్తారు? ఆయన కూడా టీడీపీ ప్రభుత్వం నియమించిన వారే కదా! చంద్రబాబు ఏమి చెబితే అది చేయవలసిందే కదా? చంద్రబాబు, తదితర టీడీపీ నేతలపై వచ్చిన స్కామ్ కేసులను సీబీఐకి అప్పగించాలని ఒక పాత్రికేయుడు, సామాజిక వేత్త కెబిజి తిలక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేం. గతంలో చంద్రబాబు తనపై కేసు పెట్టడానికి ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోలేదంటూ సుప్రీం కోర్టులో వాదించారు. సెక్షన్ 17 వర్తిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కానీ సుప్రీం కోర్టు ఆ కేసులో ఇప్పటికీ తీర్పు ఇవ్వకుండా ఉండిపోయింది. అంతేకాదు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కాని గౌరవ హైకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన ఆరోగ్య నివేదిక ఆధారంగా బెయిల్ ఇవ్వడం ఏమిటా అని పలువురు విస్తుపోయారు. తనకు రకరకాల వ్యాధులు ఉన్నాయని చెప్పిన ఆయన, విడుదల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా టూర్లు చేశారు.కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది. అయినా తన బావమరిది బాలకృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొని కేసు గురించి ప్రస్తావించి, తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారట. ఈ పరిస్థితిలో ఏ అధికారి ఈ కేసులను ముందుకు తీసుకువెళతారు? ఏ విధంగా చంద్రబాబు, ఇతర ముఖ్య నిందితులు కోర్టుకు వరకు వెళ్లకుండా చూడవచ్చో అన్నదానిపైనే అధికారులు గురిపెడతారు. ఈ కేసుల రికార్డులను తారుమారు చేయవచ్చని పొన్నవోలు అన్నారు. ఆయన ఎంత వాపోయినా అది వృథా ప్రయాసగానే మిగిలిపోవచ్చు. దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసుల విషయంలో ఒక నిర్దిష్ట విధానం రూపొందించుకోకపోతే , అసలు స్కాములు జరిగినట్లా? కాదా? అన్నదానిపై ప్రజలకు స్పష్టత రాకుండా పోతుంది. అధికారంలో ఉంటే ఎలాంటి కేసు నుంచైనా తప్పించుకోవచ్చన్న భావన మరింతగా ప్రబలుతుంది.ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్ను కోరే ప్రతిపాదన పెండింగ్లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించగా సస్పెన్షన్పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్టెక్కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
ఈడీ నీకెక్కడ క్లీన్చిట్ ఇచ్చింది?
ఈ నెల 15వ తేదీన ఈడీ విడుదల చేసిన ప్రెస్నోట్లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఈ కేసులో నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా పేర్కొంది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది.’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిషి (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో స్పెషలిస్టు. అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీకు క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చిందో చూపాలి..’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. టీడీపీ పాలనలో జరిగిన స్కిల్ స్కామ్పై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు చేసి.. అన్ని ఆధారాలతోనే ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేసిందని, స్కామ్ జరిగినట్లు నిర్ధారించిందని, దానికి తార్కాణమే ఆ కుంభకోణంలో పాత్రధారులైన డిజైన్ టెక్ ఎండీ, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సహా నలుగురిని అరెస్ట్ చేసి రెండు విడతల్లో రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని వివరించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనుసాగుతోందని ఈడీ తేల్చిచెబుతూ మీడియాకు ప్రకటన విడుదల చేస్తే.. దాన్ని పట్టుకుని తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... ఆస్తులు అటాచ్ చేస్తే.. క్లీన్చిట్ ఇచ్చినట్టా? సిల్క్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన ప్రెస్నోట్లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈడీ గుర్తించింది. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లు కలిసి ఏపీ ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారని, డొల్ల కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రజాధనాన్ని స్వాహా చేశారని నిర్ధారించింది. ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారినట్టు కూడా తేల్చింది. అందుకే ఇంతకు ముందే డిజైన్ టెక్ సిస్టమ్స్ సంస్థకు సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా నిందితులు అయిన వికాస్ వినాయక్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లను అరెస్టు చేసినట్టు వెల్లడించింది. తాజాగా మరో రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా ప్రెస్నోట్లో తెలియజేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా ప్రకటించింది. ఆ ప్రెస్నోట్ చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు సుమన్ బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ నిందితులు. ఎందుకంటే చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో 13 సార్లు.. 13 చోట్ల ఫైళ్లపై సంతకాలు పెట్టారు. వాళ్లకు రూ.371 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం మళ్లీ డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. కాబట్టే నలుగురిని అరెస్టు చేసింది. ఆస్తులను అటాచ్ చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో అక్రమ కేసు పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టులా చంద్రబాబుకు ఎటువంటిసంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ..’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిíÙ (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. దీనికి చంద్రబాబు తనకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు మార్చేసుకున్నారు. అసలు ఇంకెవ్వరికీ చదువు రాదనుకుంటాడా... ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాడా చంద్రబాబు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి మీడియా సామ్రాజ్యాన్ని పెట్టుకుని ఎంతకైనా గోబెల్స్ ప్రచారం చేయగలననే అతి విశ్వాసం ఉన్నా కూడా... ఈ మాదిరిగా వక్రీకరించడం ఎవరి వల్లా కాదు!. ఈడీ అటాచ్లపై బాబు మాట్లాడరేం! ఈ స్కామ్లో ఈడీ అరెస్టు చేసిన మనుషులకు, ఆస్తులు అటాచ్ చేసిన సంస్థలకు డబ్బులు ఎవరు ఇచ్చారు..? చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? జర్మనీకి చెందిన ఒరిజినల్ సీమెన్స్ కంపెనీ ఆ డబ్బులు తమకు ముట్టలేదని, ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని చెప్పడం వాస్తవం కాదా? సదరు కంపెనీ ప్రతినిధి నోయిడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలంగా ఇవ్వడం వాస్తవం కాదా? సీమెన్స్ సంస్థ ఈ డబ్బు పక్కదారి పట్టిందనే విషయాన్ని తమ అంతర్గత పరిశోధనలో కనుగొన్నామని.. అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండీ సుమన్ బోస్ కంప్యూటర్లు, ఫోన్లను పరిశీలిస్తే బయటకు వచ్చిందని.. డబ్బు పుణే నుంచి హైదరాబాద్కు వెళ్లిందని.. సాక్షాత్తు సీమెన్స్ తమ అంతర్గత పరిశోధనలో వెల్లడైందని రిపోర్టు ఇచ్చిందా..? లేదా?. ఈ కేసులో నిందితుల ఆస్తుల ఆటాచ్మెంట్పై మాత్రం చంద్రబాబు మాట్లాడరు. కానీ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటాడు. చంద్రబాబును ఈడీ అరెస్టు చేయదా?సిల్క్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబును, ఆయన పీఏ శ్రీనివాస్ను భవిష్యత్తులో ఈడీ అరెస్టు చేయదా? ప్రజాధనాన్ని డొల్ల కంపెనీలు సృష్టించి బయటకు పంపడం.. అలా వెళ్లిన డబ్బులు మళ్లీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకోవడం అంటే ఇది కాదా? ఇద్దరు ఐఏఎస్ అధికారులు మేజిస్ట్రేట్ ముందు సెక్షన్–164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాము చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశామని చెప్పారు. ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ల ఎదుట కనిపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ‘న్యాయం గెలిచింది.. నిజం నిలిచింది..’ అని ఎలా అంటారు? కంటికి కనిపించే ఆధారాలు ఉన్నాయి. స్కామ్ నిజమే అని ఈడీ కూడా ధ్రువీకరించుకుని అరెస్టులు చేసింది... ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. అయినా చంద్రబాబు లడ్డూలు విషయం మాదిరిగా.. ఇసుక, మద్యం స్కామ్ల తరహా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజంగా మనుషులేనా.. అందరూ ఆలోచన చేయాలి. -
చంద్రబాబు స్కిల్ స్కామ్ పై ED లెటర్.. వైఎస్ జగన్ రియాక్షన్
-
స్కిల్ స్కాం నిర్ధారించిన ఈడీ.. వణికిపోతున్న చంద్రబాబు..!
-
బాబుకు మళ్లీ జైలు తప్పదా?
-
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
దీని అర్థమేంటి చంద్రబాబూ..ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్కు పాల్పడిన నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్, భారత్లో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్చంద్ అగర్వాల్, సురేశ్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తు లను జప్తు చేశాం. గతంలోనే డిజైన్టెక్కు చెందిన రూ.31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేశ్లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. – ఈడీసాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్ ప్రచారం చీప్ ట్రిక్ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్ చేస్తూ మరీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడిగుతూ తిమ్మినిబమ్మి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ఈడీ స్పష్టం చేయడంతోపాటు, చంద్రబాబుతోపాటు తాము ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ తేల్చి చెప్పడంతో టీడీపీ ఎత్తుగడ బెడిసికొట్టింది. బోగస్ ఇన్వాయిస్లతో ప్రజాధనం కొల్లగొట్టారు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. అంతేకాదు అసలు ఆ ప్రాజెక్ట్నే చేపట్టలేదని, పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేసినట్టు గుర్తించామని తెలిపింది. ఆ నిధులను సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్.. తమ సన్నిహితులు ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా అక్రమంగా దారి మళ్లించినట్టు వెల్లడించింది. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించి.. అక్కడి నుంచి తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించామని తెలిపింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్షీట్ను దాఖలు చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టైంది.టీడీపీ ఫేక్ ట్రిక్ ఇదీ..⇒ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతోనే చంద్రబాబును గతేడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ⇒ ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసి స్కిల్ స్కామ్లో నిధులు కొల్లగొట్టిన తీరును నిరూపిస్తోంది. తాను నిధులు కొల్లగొట్టడంలో పాత్రధారులుగా చేసుకున్న షెల్ కంపెనీల ప్రతినిధులు వికాస్ ఖన్విల్కర్, సుమన్బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక రెండో విడతలో వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ ఆస్తులను అటాచ్ చేసింది. అదీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బేంబేలెత్తిస్తోంది. ⇒ ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో మంగళవారం రాత్రి నుంచి వైరల్ చేసింది. ఏకంగా ఈడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలకు ముందు వెనుకా రెండు వాక్యాలు జోడించడం ద్వారా ట్యాంపర్ చేసి ఈ ప్రచారం చేయడం గమనార్హం. ⇒ ఈడీ పేరుతో రూపొందించిన ఆ ఫేక్ ప్రకటనను టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఆ తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేట్టు చేయడం చంద్రబాబు మార్కు మీడియా మేనేజ్మెంట్కు నిదర్శనం.ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఈడీ చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ చేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. తాము చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ హైదరాబాద్ విభాగం అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. షెల్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని కూడా ఈడీ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఫేక్ ట్రిక్తో తాము చేసిన తప్పుడు ప్రచార ఎత్తుగడ బెడిసి కొట్టడంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ మౌన ముద్ర దాల్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో సీఐడీ సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకునే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ–1గా సీఐడీ పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపించింది. అంటే చంద్రబాబు.. ఏ–1గా ఉన్న ఎఫ్ఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరో వైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అటువంటిది ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని, టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం. స్కిల్ కేసులో ఇప్పటికే పాత్రధారులైన షెల్ కంపెనీల ప్రతినిధుల బండారాన్ని బయటపెట్టిన ఈడీ.. ఇక అసలు సూత్రధారి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చేందుకు ఉద్యుక్తమవుతున్నట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
అది ‘క్లీన్ చిట్’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈడీ దర్యాప్తుతో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి చెప్పారు. అయినా క్లీన్చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో ఇదే కచ్చితంగా తేలుతుందని స్పష్టం చేశారు.సతీష్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు. కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని, అందుకే అటాచ్మెంట్ రాగానే వణికిపోతున్నారని, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని అన్నారు. ఈడీ ప్రెస్నోట్లో క్లీన్చిట్ విషయం లేకపోయినా, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని చెప్పారు. క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులని, విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చిట్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారని ప్రశి్నంచారు. నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని, వాటికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబే 13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా అని నిలదీశారు. బాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకెళ్లిందన్నారు. ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉంటే, ఈడీ క్లీన్చిట్ ఇచి్చందని ఎలా చెప్పుకుంటారని అన్నారు. -
చంద్రబాబు మళ్ళీ జైలుకే...? రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, ఇసుక, మద్యంలో దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్న ఇసుక డంప్ను టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఖాళీ చేసిందని ఆరోపించారు. మద్యంలో టీడీపీ సిండికేట్ల వల్ల తెలంగాణా కంటే తక్కువ ఆదాయం వచ్చిందని, 90 శాతం టీడీపీఐ వారికే వచ్చాయని, మిగిలిన 10శాతం షాపులు వారిని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అక్రమాలను, అబద్ధపు హామీలను ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విజయవాడ వరదల్లో వచ్చిన విరాళాలు కూడా జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో, ఏమైపోతుందోననే ఆందోళన కలుగుతోందన్నారు. ప్రభుత్వ దురాగతాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు. వీళ్ళ అకృత్యాలు ప్రజలకు తెలియకుండా మీడియా గొంతు నొక్కుతున్నారని, టీవీ9, సాక్షి, ఎన్టీవీలతో పాటు మరి కొన్ని ఛానళ్లను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.‘స్కిల్ కేసులో చంద్రబాబును ఆనాడు అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బార్యా, పిల్లలు, దత్త పుత్రుడు అంతా గోల చేశారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు జరిగింది. ఇప్పుడు ఈడీ వారి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇప్పుడు స్కిల్ అక్రమాలు చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసేందుకు చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశాడు. షెల్ కంపెనీలతో 370 కోట్లు కొట్టేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారు. సీమెన్స్ సంస్థ పేరు చెప్పుకుని.. డిజైన్ టెక్ అనే షెల్ కంపెనీ ద్వారా నిధులు కొట్టేశారు. ఆ ఫైల్ డ్రాఫ్ట్ పై అన్నీ చోట్ల చంద్రబాబు సంతకం ఉంది. జరిగిన అక్రమాలన్నీ నిజమే కాబట్టే ఈడి ఆస్తులు అటాచ్ చేసింది.’ అని పేర్కొన్నారు. -
దోచుకోవడంలో చంద్రబాబు ‘స్కిల్’ నిజమే (ఫొటోలు)
-
స్కిల్ స్కామ్ అంటే ఏంటి? అందులో చంద్రబాబు అవినీతి ఎంత
-
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
ఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో సిమెన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ,పూణేలలోని రూ.23 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.నకిలీ ఇన్ వాయిస్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. డీటీసీఎల్ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. స్కిల్ కుంభకోణం కేసు..ప్రభుత్వంలో వణుకుస్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో పేరుతో చంద్రబాబు తన హయాంలో రూ. 240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు గతంలోనే 13 చోట్ల ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టినట్టు నిర్ధారించింది.రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లకు పెంచేసి గోల్మాల్ చేసిన చంద్రబాబు ఇదే కేసులో 52 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ కేసు ఆధారంగా సిమెన్స్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాట్ చేసింది. దీంతో స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈడీ తాజా అటాచ్మెంట్తో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు. -
సచివాలయంలో పెండ్యాల ప్రత్యక్షం
సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో విదేశాలకు పరారైన పెండ్యాల శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చారు. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శ్రీనివాస్ అమెరికాలో అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు. నల్లమూటలు బాబు బంగ్లాకు చేర్చించి పెండ్యాలే2014 – 19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పెండ్యాల శ్రీనివాస్కు ఉన్న రెండు ఈ మెయిల్ ఐడీలకు మెయిల్చేయడంతోపాటు హైదరాబాద్లోని ఆయన చిరునామాకు స్పీడ్పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె సీఐడీ అధికారులకు తెలిపారు. నోటీసులు జారీ కాగానే పెండ్యాల శ్రీనివాస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు ఓ మెయిల్ ద్వారా తెలిపి వెళ్లిపోయారు.మెమో జారీ చేసినా బేఖాతరు.. సస్పెన్షన్పెండ్యాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి, మెమో జారీచేసింది. అధికారులు హైదరాబాద్లోని పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో ఆఫీసుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని పెండ్యాల శ్రీనివాసరావును ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఆ మెమోను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అనుసరించి పెండ్యాల శ్రీనివాస్ను ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 30న సస్పెండ్ చేసింది.బాబు రాగానే మళ్లీ ప్రత్యక్షంకాగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందన్నది సుస్పష్టమవుతోంది. ఎందుకంటే స్కిల్ కుంభకోణం కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయి 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్ను సీఐడీ సాక్షిగా పేర్కొంది. దాంతో ఆ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండ్యాల శ్రీనివాస్ను కూడా ఒక సాధనంగా వాడుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. స్కిల్ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండ్యాల శ్రీనివాస్ తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే. -
చంద్రబాబు Ex-Ps సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని దరఖాస్తు
-
ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్!స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్పై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం. -
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. -
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
-
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్ను సృష్టించి స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్బాల్ మ్యాచ్లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్తోపాటు ఈశ్వరన్ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పేర్కొంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానం పిటిషన్లో తెలిపింది. -
స్కిల్ స్కామ్ లోనే చిప్పకూడు పార్ట్ -2 కి సిద్ధమౌతోన్న లూటీరత్న
-
దొరికాడు దొంగ
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షెల్ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహాలో షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్స్కామ్కు పాల్పడి షెల్కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ♦ టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ♦ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ♦ పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్ టెక్ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ ప్రాజెక్ట్లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీకి డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు. ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్ స్కామ్లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి 2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. స్కిల్ స్కామ్ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 జమ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్స్కామ్లో చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ చార్జ్షీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీఎండీ–సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్కర్ తదితర కంపెనీల అధికారులు -
బాబుకు ‘ఈడీ’ వేడి
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది! హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్లు ఆధారాలున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరైనదేనని పేర్కొంది. ఈ కేసులో హవాలా మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల మధ్య చాలా సారూప్యతలు న్నాయి. ఇప్పటికే స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి. ‘ఆప్’ చేతికి రూ.50 కోట్లు ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మళ్లించినట్లు ఈడీ నిర్థారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో రూ.50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. ఈ మేరకు గోవాలో ఆప్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అభ్యర్థి వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం. కేజ్రీవాలే బాధ్యత వహించాలి మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం రాజకీయ పార్టీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సంఘం. కంపెనీల చట్టం ప్రకారం ఓ కంపెనీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సముదాయం. రెండు వేర్వేరు చట్టాల ద్వారా నమోదైన రాజకీయ పార్టీ, కంపెనీల నిర్వచనం మాత్రం ఒకటే. కాబట్టి అక్రమ నిధులు పొందిన ఓ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగానే అక్రమంగా నిధులు పొందిన రాజకీయ పార్టీపై కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు’ అని న్యాయమూర్తి ప్రకటించారు. ‘మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ పార్టీకి జాతీయ సమన్వయకర్త (అధ్యక్షుడు)గా ఉన్న కేజ్రీవాలే అందుకు బాధ్యత వహించాలి. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఆయన అరెస్ట్ సరైనదే’ అని తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్లో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు – బాధ్యత వహించాల్సింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్లో కొల్లగొట్టిన నిధులు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ నిధులు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్వర్క్ గుట్టును సిట్ బయట పెట్టింది. అందులో రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీహిల్స్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలున్నాయి. వాటిల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 చొప్పున జమ చేశారు. జూబ్లీ హిల్స్లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయి నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్ సమయంలో ‘పే–స్లిప్’లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి. ఇక బాబుపై ఈడీ కొరడా! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి సిట్ పూర్తి ఆధారాలను ఈడీకి అందచేసింది. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్తోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది. తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతోపాటు సిట్ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది. -
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్టెక్ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్ను అరెస్ట్ చేసింది. డిజైన్టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు -
బాబు బెయిల్ రద్దు పిటిషన్: ఏప్రిల్ 16న పూర్తి విచారణ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్ 16న ఈ పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దుపై ఏప్రిల్ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. -
స్కిల్ స్కాం నుంచి చంద్రబాబును కాపాడేందుకు..
-
‘స్కిల్’ కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందేనని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ షరతుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చింది. వచ్చే ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తామని.. ఆ తర్వాత చంద్రబాబు కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని నివేదించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకొని రికార్డుల్లో లేని అంశాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. దీంతో చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రకటనలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లు అందజేయడానికి ఏపీ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ ఏం కోరుకుంటోందని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని రోహత్గి విన్నవించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని, ఈ సమయంలో బెదిరింపు ప్రకటనలను తేలిగ్గా తీసుకోరాదని తెలిపారు. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అప్పీల్ కోర్టు ముందుందన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుడి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని.. అధికారుల పేర్లన్నీ ఒక పుస్తకంలో రాస్తున్నట్లు చెబుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీరి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బెదిరింపు ప్రకటనలు చేసేవారికి బెయిల్ ప్రయోజనం, స్వేచ్ఛ లభించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ సీఐడీ అనుబంధ పిటిషన్పై స్పందించడానికి తమకు సమయం కావాలని కోరారు. దీంతో రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవసరమనుకుంటే పిటిషనర్ కూడా స్పందించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టు: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు రెండు వారాలు సమయం ఇచ్చింది. కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వ పిటిషన్పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. చంద్రబాబు బెయిల్ రద్దుపై జవాబు చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డివలప్మెంట్ కుంభకోణంలో దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అధికారుల పనిపడతామని హెచ్చరిస్తున్నారు. ఇలా మాట్లాడుతూ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారు. కనుక, వెంటనే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరారు. దీంతో, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు.. చంద్రబాబు తరఫు లాయర్లను ఆదేశించింది. ఈ సందర్భంగా తమకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా కోరారు. దీంతో, కౌంటర్ దాఖలు చేసేందుకు ధర్మాసనం రెండు వారాలు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
స్కిల్ స్కాం కేసులో నేడు మాజీ IAS లక్ష్మినారాయణ పిటిషన్ పై విచారణ
-
చంద్రబాబు స్కిల్ స్కాంలో అప్రూవర్ గా చంద్రకాంత్ షా
-
ప్రతివాదులుగా ఎల్లో మీడియా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించడంతోపాటు కేసు కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పునిచ్చినందుకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ఏసీబీ కోర్టు జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లు, కామెంట్లు పెట్టడంపై దాఖలైన క్రిమినల్ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఎల్లో మీడియా చానల్స్ టీవీ 5, మహాన్యూస్, మైరా మీడియా సంస్థలను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై యూట్యూబ్లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్ ఎల్ఎల్సీని ఆదేశించింది. కాగా.. తమ మాధ్యమాల్లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ఇప్పటికే తొలగించామని ప్రముఖ ఆన్లైన్ సామాజిక మాధ్యమ సంస్థలైన ఎక్స్, ఫేస్బుక్ హైకోర్టుకు నివేదించాయి. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో పలువురికి ఇంకా నోటీసులు అందచేయాల్సి ఉందని, అందువల్ల నోటీసులు అందజేసేందుకు మరికొంత గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పచ్చ సైన్యం అసభ్య, అభ్యంతరకర పోస్టులు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డిని లక్ష్యం చేసుకుంటూ సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. కులం పేరుతో కూడా వారిని దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది వసంత్కుమార్ లిఖితపూర్వకంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే హైకోర్టు న్యాయవాది ఎం.సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సైతం ఆ లేఖలకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు, విమర్శలు చేసిన వారిపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఆ పోస్టులను తొలగించలేదు తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను యూట్యూబ్ ఇప్పటికీ తొలగించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించిన వెంటనే సామాజిక మాధ్యమ సంస్థలు తమ ఆన్లైన్ వేదికలపై ఉన్న పోస్టులన్నింటినీ తొలగించాల్సి ఉంటుందని, ఆ సంస్థ ఆ పని చేయలేదని తెలిపారు. యూట్యూబ్ తరఫున సీనియర్ న్యాయవాది సజన్ పువయ్య వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు లేదా కేంద్రం నియమించిన అ«దీకృత అధికారి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే తాము ఆ పోస్టులను తొలగిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అసభ్య, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్ను ఆదేశించింది. ఎల్లో మీడియా చానళ్లను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ నేతలకు గతంలోనే నోటీసులు ఈ లేఖలను వాటితో పాటు జత చేసిన సోషల్ మీడియా తాలూకు కామెంట్లు, పోస్టింగ్లు, విమర్శలు, దూషణలను పరిశీలించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సస్పెన్షన్లో ఉన్న న్యాయాధికారి ఎస్.రామకృష్ణ, మువ్వా తారక్కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లారావు, కళ్యాణి, ఎన్.చిరంజీవి, చైతన్య కుమార్రెడ్డి, ఆనంద్, కిషోర్కుమార్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు టీడీపీ నేతలతో సహా గూగుల్ ఇండియా, ట్విట్టర్ కమ్యూనికేషన్స్, ఫేస్బుక్ ఇండియాలతో కలిపి మొత్తం 27 మందికి నోటీసులు ఇచ్చింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని వీరందరినీ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
చంద్రకాంత్ షా స్టేట్మెంట్ను అడ్డుకునేందుకు బాబు విశ్వ ప్రయత్నాలు
-
స్కిల్ కేసు: ఈ నెల 29కి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో అప్రూవర్గా మారతానని ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షా వేసిన పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదులు కౌంటర్ వేయడానికి సమయం కోరారు. కేసులో సీఐడి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డును ఏసిబి కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు విచారణను 29కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో అప్రూవర్గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని కోర్టుకి చంద్రకాంత్ షా ఆధారాలు సమర్పించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఎ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషించారని చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఎ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016లో తనని కలిశారని తెలిపారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లని ఇవ్వాలని వారు కోరినట్లు పిటిషన్లో చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానని తెలిపారు. బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చెప్పారు. ఆ రూ.65కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలు పన్నుతున్నారు. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు
సాక్షి, నెల్లూరు: స్కిల్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని అన్నారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు పట్ల కక్ష సాధింపు లేదు కాబట్టే జైలులో ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు. తాజాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. ప్రభుత్వం తరపున కోర్టులో నేను వాదనలు వినిపించాను. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొందరు అంటున్నారు. జీవో నెంబర్-4లో స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదు. జీవో ప్రకారం జరగడం లేదని అప్పటి అధికారులు చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినలేదు. అప్పట్లో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు ముందుకు సాగారు. ఎల్లో మీడియా విశ్వప్రయత్నం.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం చట్ట పరంగానే విచారణ చేసింది. ప్రజాధనం కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగింది. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. స్కిల్ స్కామ్ పేరుతో రూ.371కోట్లను చంద్రబాబు కాజేశారు. రాజకీయ కక్ష అనే మంత్రజాలంతో పాపాన్ని కడిగేసుకోవాలని టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా విశ్వ ప్రయత్నం చేసింది. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదనలు.. చంద్రబాబు వయసుకు గౌరవం ఇచ్చి జైలులో సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. చంద్రబాబు పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాము. జైలు మన్యువల్లో లేనివి కూడా చంద్రబాబుకు అందించాము. చంద్రబాబుకు అన్ని సదుపాయాలు కల్పించినా కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కూడా కల్పించాము. ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించినా కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది. చంద్రబాబు అరెస్టు సక్రమమే అని న్యాయస్థానం తెలిపింది. కోర్టుల్లో వ్యతిరేక తీర్పు వస్తే వ్యవస్థల్ని మేనేజ్ చేశారని కొందరు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదించాను. కొందరు ఢిల్లీ నుంచి వచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్: అంబటి
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు ఆర్థిక బలంతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుకి మద్దతుగా.. ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. దొరకని దొంగలా ఇన్నాళ్లు చెలామణి అయిన చంద్రబాబు.. స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. రూ. 371 కోట్లు లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. హైకోర్టులో కూడా 17 ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని వాదించారని ప్రస్తావించారు. ఈ కేసును కొట్టివేయాలని కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని అన్నారు. వంద కారణాలు చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. చదవండి: రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు ‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాగా దిట్ట. దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. జైల్లో ఉంటేనే చంద్రబాబు ఆరోగ్యం బాలేదా? ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ వందల కోట్లు కాజేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్. వైఎస్సార్సీపీని ఓడించే సత్తాలేక.. ప్రతి ఒక్కరితో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు అర్ధమైంది. చట్టం నుంచి ఆయన తప్పించుకోలేరు. పవన్ క్యలాణ్ కుడా అవినీతి పరుడే. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అనుకూలంగా పవన్ మద్దతు ఇస్తుంటాడు’ అని అంబటి మండిపడ్డారు. చదవండి: -
డిఫెన్స్లో చంద్రబాబు.. పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి?
పబ్లిక్ సర్వెంట్స్పై వచ్చే అవినీతి అభియోగాల మీద విచారణ జరపడానికి ముందుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలా?. ఈ రూల్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందా? వర్తించదా?. దీనిని తేల్చడానికి సుమారు నాలుగు నెలల వ్యవధి తీసుకున్న గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 2018లో వచ్చిన చట్ట సవరణ ఆయనకు వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, వర్తించదని మరో న్యాయమూర్తి చెప్పడంతో ఈ వ్యవహారం చీఫ్ జస్టిస్ కోర్టులోకి వెళ్లింది. ఆయన దీనికి ఏం పరిష్కారం చూపుతారో ఇప్పుడే చెప్పలేం. అదే సమయంలో చంద్రబాబుపై వచ్చిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయకపోవడం, ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించకపోవడంతో ఈ ఉత్తర్వులు శరాఘాతంగా మారాయి. చంద్రబాబుకు ఒక జడ్జీ ఎక్కడా అసలు ఊరట కల్పించలేదు. 17ఏ పేరుతో అవినీతి కేసుల్లో రక్షణ కల్పించలేమని జస్టిస్ బేలా అభిప్రాయపడ్డారు. మరో జడ్జీ అనిరుధ్ బోస్ మాత్రం 2018కి ముందు కేసులకు కూడా గవర్నర్ అనుమతి అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడైనా అనుమతి తీసుకోవచ్చని చెప్పారు. ఈ అంశంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు లేకపోవడం గమనార్హం. చంద్రబాబు ఎలాగోలా ఈ కేసు నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు వృథా అయినట్లే అనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక చంద్రబాబు అరెస్టు చెల్లదని, రిమాండ్ సరికాదని చెప్పి ఉంటే ఈపాటికి చంద్రబాబు పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి ఏపీ ప్రభుత్వంపైన, సీఐడీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడేవారు. సుప్రీంకోర్టు అలా చేయకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ నేతలు, వారికి సంబంధించిన మీడియా ఛానళ్లు, టీడీపీ మద్దుతారులైన కొంతమంది లాయర్లు మాత్రం స్వరం తగ్గించి ఈ తీర్పు ఆధారంగా సీఐడీ చంద్రబాబుపై ఉన్న వివిధ కేసులలో ముందుకు వెళ్లకూడదన్నట్లు మాట్లాడటం ప్రారంభించారు. అనిరుధ్ బోస్ ఇచ్చిన తీర్పులోని ఒక భాగమైన 17ఏ సెక్షన్ వర్తిస్తుందన్న పాయింట్ను మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీకి భజన చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు ఎవరూ అధైర్యపడవవద్దని, అంతిమ విజయం మనదేనని అనడం ద్వారా పరిస్థితిని తెలియచెప్పారు. ఇంతకాలం స్కిల్ డెవలప్మ్మెంట్ కార్పొరేషన్ కేసులో అసలు అవినీతే జరగలేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా ఈ కేసు ముందుకు వెళ్లజాలదని ప్రచారం చేశారు. అంతే తప్ప తాము స్కామ్కు పాల్పడలేదని వాదించడానికి అంతగా సుముఖత చూపలేదు. తమ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతిస్తుందని వారు అనుకున్నారు. కానీ, సుప్రీంకోర్టు అందులోను ఒక న్యాయమూర్తి మాత్రమే 17ఏ లోని ఒక భాగం వరకే కొంత అనుకూల తీర్పు ఇచ్చినా, ఆయన కూడా ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని చెప్పడంతో చంద్రబాబుకు ఆ ఉపశమనం కూడా లేకుండా చేసినట్లయింది. అంటే దీని అర్ధం ఈ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ కేసులో అవినీతి ఉందన్న నమ్మకానికి వచ్చినట్లే అనుకోవాలి. ఒకవేళ ఇద్దరు జడ్జీలు 17ఏ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, కేసు ఏమీ పోదు. కేవలం గవర్నర్కు ఫైల్ పంపించి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. గవర్నర్ స్థాయిలో మేనేజ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. కానీ, సుప్రీంకోర్టు 17ఏపై తీర్పు ఇవ్వకుండా, ఇద్దరు జడ్జీలు పరస్పర విరుద్దమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే టైమ్లో చంద్రబాబు కోరిన విధంగా కేసును క్వాష్ చేయకపోవడంతో సీఐడీకి దీనిపై తదుపరి విచారణ కొనసాగించడానికి స్వేచ్ఛ వచ్చినట్లయిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 17ఏపై తదుపరి తీర్పు ఇవ్వడానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది. అదంతా అయ్యే సరికి ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. అంతదాకా ఎందుకు చంద్రబాబు కేసులో ఈ తీర్పు రావడానికి సుప్రీంకోర్టు నాలుగు నెలల వ్యవధి తీసుకోవడం కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ కేసును ప్రముఖ లాయర్ ప్రశాంత భూషణ్ వేసిన కేసుకు జత చేస్తారేమోనని అనుకున్నారు. ఎందువల్లనో అలా చేయకుండా కొంత టైమ్ తీసుకుని తీర్పు వెలువరించారు. కాగా చివరి క్షణంలో కూడా టీడీపీ లాయర్ సిద్దార్ద్ లూథ్రా ఈ కేసులో చంద్రబాబుపై ఉన్న రిమాండ్పై ప్రత్యేకంగా తీర్పు వచ్చేందుకు యత్నించినా ఫలించలేదట. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎక్కడా తప్పు చేయలేదన్నట్లుగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ అవినీతి కేసులో పలు ఆధారాలు ఉన్నప్పట్టికీ టీడీపీవారి కన్నా ఎక్కువగా రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు భుజాన వేసుకుని అసలు అవినీతే లేదన్నట్లుగా ప్రొజెక్టు చేయడానికి నానా తంటాలు పడ్డారు. టీడీపీ ఖాతాకు అక్రమంగా కోట్ల రూపాయల నిధులు వెళ్లాయని సీఐడీ కొన్ని పత్రాలను చూపించినా వీరు దబాయిస్తుంటారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఈ విచారణకు రాకుండా అమెరికాకు పారిపోయినా అసలేమీ జరగనట్లు నటిస్తుంటారు. ఈడీ అధికారులు ఇదే కేసులో నలుగురిని అరెస్టు చేసినా అదేదో చంద్రబాబుకు సంబంధంలేని వ్యవహారంగా కలరింగ్ ఇవ్వడానికి యత్నించారు. విశేషం ఏమిటంటే ఒక పక్క మొత్తం కేసును కొట్టివేయాలని హైకోర్టులోనూ, ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు లాయర్లు చాలాకాలం ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు వేయలేదు. కానీ క్వాష్ పిటిషన్పై అనుకూలంగా తీర్పు రాదని భావించారేమో తెలియదు కానీ, వారు ఆలస్యంగా బెయిల్ పిటిషన్ వేశారు. తదుపరి హైకోర్టులో తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు చూపి బెయిల్ పొందారన్న అభిప్రాయం ఉంది. అది వేరే సంగతి. ఇక్కడ కొన్ని విషయాలను పోల్చి చూడాలి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు నెలల తరబడి జైలులో ఉన్నారు. వారిపై అంతా కలిపి వంద కోట్ల అవినీతి ఆరోపణ కూడా లేదు. అదే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల్లో అనేక వందల కోట్ల అభియోగాలు ఉన్నాయి. అయినా ఆయన సత్వరమే బయటకు రాగలిగారు. ఇక సుప్రీంకోర్టు వరకు వెళ్లి అసలు కేసే లేకుండా చేసుకోవాలని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్లు ఖర్చు చేసి వాదనలు వినిపించారు. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. వచ్చే ఎన్నికలలో దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబుకు కొన్నికేసులలో బెయిల్ వచ్చింది. మరి కొన్ని కొత్త కేసులు ఉన్నాయి. వాటిలో కూడా బెయిల్ తెచ్చుకుంటారా? లేక అరెస్టు అవుతారా? అన్నది చూడాలి. చంద్రబాబుపై అవినీతి కేసు లేకుండా బయటకు వస్తారని ఆశించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దీనిని సమర్ధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతించి ఉంటే దానిని తమకు రాజకీయంగా మైలేజీ వచ్చేలా ఎన్నికల ప్రచారం సాగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ తీర్పును వక్రీకరించడానికి వారు ప్రయత్నించవచ్చు. ఈ కేసులో టీడీపీ ఖాతాకు చేరిన నిధులు, తదితర అంశాలలో సీఐడీ కనుక వేగంగా ముందుకు వెళితే చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో నష్టం కలగవచ్చు. మరే కేసులో అయినా అరెస్టు అయినా, లేక సీఐడీ వద్దకు తరచుగా విచారణకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చినా తెలుగుదేశం, జనసేన క్యాడర్ నైతికంగా దెబ్బతింటుంది. ప్రజలలో దీనిని ఎలా సమర్ధించుకోవాలో తెలియని ఆందోళన ఎదరువుతుంది. టీడీపీతో పొత్తులో చేరడం వల్ల తాము కూడా అనవసరంగా అవినీతికి మద్దతు ఇచ్చినట్లయిందని జనసేన కార్యకర్తలు అనుకునే అవకాశం ఉంటుంది. దీంతో జనసేన వారు తమ సపోర్టు కావాలనుకుంటే మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేయవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడుకు ఈ తీర్పు పెద్ద షాక్ వంటిదని చెప్పాలి. ఎన్నికలలో దీని ప్రభావం పడకుండా ఉండటానికి ఆయన ఎంత కష్టపడ్డా అంత పలితం ఉండకపోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
డజన్ల కొద్దీ పిటిషన్లు..కోట్లు ఛార్జ్ చేసే లాయర్లు..చివరికి న్యాయమే గెలిచింది
-
కెఎస్ఆర్ లైవ్ షో: చారిత్రాత్మక తీర్పు బాబుకు బిగుస్తున్న ఉచ్చు
-
అడ్డంగా దొరికిన బాబు..పక్కా ప్లాన్ తోనే స్కాం
-
స్కిల్ స్కాంలో చంద్రబాబుకు భారీ షాకిచ్చిన న్యాయమూర్తులు
-
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్.. కేసును కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరణ..ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకరణ
-
చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
ప్రజా కోర్టులో కూడా చంద్రబాబు శిక్ష తప్పదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: పలు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పులపై అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదన్నారు. మంత్రి అమర్నాథ్ కామెంట్స్.. – చంద్రబాబు బోనులో దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందే. – సుప్రీం కోర్టు తీర్పును తప్పుదోవ పట్టించేలా ఎల్లో మీడియా ప్రచారం. – కోర్టులో చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ దొరకలేదు. – ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు సెక్షన్ 8 అన్నాడు. – నేడు 17ఏ అంటున్నాడు..కానీ తప్పు చేశాడా లేదా అన్నది మాత్రం చెప్పడం లేదు. – చంద్రబాబు చేసిన తప్పులను ప్రజలు కూడా గమనిస్తున్నారు. – ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడే రోజు త్వరలోనే ఉంది. – లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? – రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్. – అలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇచ్చిన తీర్పేంటి..? మీరు చేసే ప్రచారం ఏంటి..? – కొన్ని చానళ్లు గొప్ప విజయం సాధించాం.. చంద్రబాబుకు ఏదో ఊరట కలిగింది. – ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. – దీన్ని చూస్తే 2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో నేడు అదే విధంగా కనిపిస్తోంది. – అసలు జరిగిన కేసేంటి.. వాదనలేంటి? ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ కలగలేదు. – వాస్తవానికి ముందుగా గమనించాల్సింది ఏంటంటే 17ఏ వర్తిస్తుందా లేదా అనేది అది ఒక ప్రొసీజరల్ సెక్షన్ మాత్రమే. – 2018లో అమల్లోకి వచ్చిన ఈ సెక్షన్ ఈ కేసుకు వర్తించదు.. స్కిల్ స్కాం అనేది 2015 ప్రాంతంలోనే జరిగింది. – ఈ క్రమంలో చంద్రబాబు, వారీ పార్టీ వారు, వారి లాయర్లు ఎక్కడా బాబు తప్పుచేయలేదు అనడం లేదు. – రూ. 370 కోట్ల ప్రజా ధనాన్ని నేను దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో లేదు. – గవర్నర్ అనుమతి లేదనో, స్పీకర్ చెప్పలేదనో 17ఏ ని చూపించి క్వాష్ చేయండని కోరారు. ఇద్దరు జడ్జిలు రిమాండ్ ప్రక్రియలో లోపం లేదనే ఏకాభిప్రాయాన్ని చెప్పారు.. – ఈ రోజు ఇచ్చిన తీర్పులో జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. – అయితే ఇద్దరూ కామన్గా రిమాండ్ తీసుకోవడంలో అంతా పద్దతి ప్రకారమే జరిగిందని చెప్పారు. – గతంలో కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారు. – సెక్షన్ 8 అమల్లో ఉంది.. మీకూ పోలీసులున్నారు.. మాకూ ఉన్నారు.. మీకూ ఏసీబీ ఉంది మాకూ ఉంది అంటూ మాట్లాడారు. – ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. – గతంలో సెక్షన్ 17ఏ అనేది వర్తించదని దాదాపు 6 కోర్టులు చెప్పాయి. – అంత క్లియర్గా ఉంటే.. దానికి అనుగుణంగా విచారణ సంస్థలు ఫైట్ చేస్తున్నాయి. – ఈ రోజు వచ్చిన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు బోనులో నిలబడి న్యాయస్థానం, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సి ఉంది. – 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదు. – ఈ రోజు వచ్చిన తీర్పును వారికి నచ్చినట్లు అన్వయించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. – ఎంత సేపూ తప్పు చేయలేదని చెప్పరు.. చేసిన విధానం బాగాలేదంటూ మాట్లాడుతున్నారు. – మీరు చేసిన దొంగపని విచారణ సంస్థలు, కేంద్ర సంస్థలు అంగీకరించాయి కాబట్టి ఆయన రిమాండ్కు వెళ్లాడు. – ఈ రోజు కేసు కొట్టేసినట్లు ఎల్లో మీడియా బాకాలు కొట్టుకుంటోంది. – ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చేతికి పడిన సంకెళ్లు, ఆయనపై పడ్డ మచ్చను నిరూపించుకోవాలి. – వీటన్నిటికన్నా మించి రేపు ప్రజా క్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు చేసిన తప్పును ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడే రోజు త్వరలోనే ఉంది. ప్రశ్నలు–సమాధానాలు: – క్యాబినెట్లో పెట్టినదానికి, స్కిల్ స్కాంలో చేసిన దానికి అసలు సంబంధమే లేదు. – అసలు ఫైల్ ముఖ్యమంత్రి వద్దకే రాదంటూ మంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. అసలు గెలవకుండానే మంత్రి అయిన వ్యక్తికి అంతకంటే ఏం తెలుస్తుంది..? – 17ఏ అనేది నీకు, జరిగిన అవినీతికి సంబంధం లేదు అనేది కాదు కదా? – దాన్ని కేసుకు ముడిపెట్టి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. – నా సీటు గురించి మీరెందుకు గాబరా పడుతున్నారు..? మూడు లిస్టులు కాకపోతే.. నాలుగు.. లేదంటే పార్టీకి పనిచేస్తా. లేని పార్టీకి ఎవరైతే మాకెందుకు..?: – ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? – గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 0.4 శాతం నోటా కంటే తక్కువ వచ్చింది. – అటువంటి లేని పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరం. – రాజకీయాల్లో ఉన్న వాళ్లకు అన్నదమ్ములు చాలా మందికి ఉంటారు. ఉన్నోరంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా? – ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాదు కదా ఓట్లేసే వారు లేరు. – దానికి ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయం కారణం.. మనం కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టింది వారు. – రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితే నరికిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని ప్రజలు అనుకున్నారు. అలానే లేకుండా చేశారు. – నాకు తెలిసి ఆ పార్టీ ప్రభావం జీరో అనేదే నా అభిప్రాయం. -
ACB కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న జస్టిస్ బోస్
-
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
-
సెక్షన్ 17A వర్తిస్తుందన్న చంద్రబాబు తరపులాయర్లు
-
బాబు, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారానికి తెరపడింది: పొన్నవోలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో సుప్రీం తీర్పులపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తీర్పు అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడేందుకు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయింది. సుప్రీంకోర్టులో ఈరోజు పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. కేసు విషయంలో నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ ఊగిపోయారు. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు తీరు తేటతెల్లమయింది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడింది. బాబు గోబెల్స్ ప్రచారానికి, ఎల్లో మీడియా అసత్యాలకు తెరపడింది అంటూ కామెంట్స్ చేశారు. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. ఇది కూడా చదవండి: బాబు రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం -
3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు
సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్దకు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఐఆర్ఆర్ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు. -
‘స్కిల్డ్’ క్రిమినల్ చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం చంద్రబాబు అంతులేని అక్రమాలకు ఓ మచ్చు తునక మాత్రమే. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట చంద్రబాబు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. జర్మనీకి చెందిన సీమెన్స్కి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో కాగితాలపై ప్రాజెక్టు సృష్టించారు. రూ.370 కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. సీమెన్స్ పేరుతో జీవో జారీ చేసి తన బినామీ కంపెనీ డిజైన్టెక్తో ఒప్పందం చేసుకున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రూ.271 కోట్లు విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా అక్రమార్జనను తన నివాసానికే చేరవేశారు. ఈ అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడంతో చంద్రబాబు అక్రమాలు బట్టబయలయ్యాయి. స్కిల్ స్కామ్ సృష్టికర్త చంద్రబాబేనని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆధారాలతో సహా వెల్లడైంది. దీంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్షిట్ నమోదు చేసింది. టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గతేడాది సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తరువాత అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సాగించిన స్కిల్ స్కామ్ ఇలా సాగింది.. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. అంతా బాబు ముఠానే.. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా 4 పోస్టులు కట్టబెట్టారు. నేరుగా నిధులు మంజూరు జరిగేలా కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు.. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు సీమెన్స్కి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90% కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. టెండర్లు లేకుండా తన బినామీ కంపెనీకి ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకే ఈ ఎత్తుగడ వేశారు. నో రూల్స్... సీమెన్స్– డిజైన్ టెక్ ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ నోట్ ఫైల్లో పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల నిబంధనలకు విరుద్ధమని వారించినా చంద్రబాబు లెక్క చేయలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లు నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, తరువాత ఆ ఫైల్ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు పీవీ రమేశ్ తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్ ఫైళ్లలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమరి్పంచి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబు బంగ్లాకు రూ.241 కోట్లు చేరవేశారు. కేసులో కీలక నిందితులు ఏ–1 చంద్రబాబు, నాటి ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, నాటి కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, నాటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్, నాటి ఫైనాన్షియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, డిజైన్టెక్ ఎండీ ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్లోని తమ ఎండీ సుమన్ బోస్ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్వర్క్ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. మదింపు బూటకం.. నివేదిక నాటకం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు సరైందేనంటూ ‘సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) థర్డ్ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ చంద్రబాబు అడ్డగోలుగా వాదించి అడ్డంగా దొరికిపోయారు. తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని, కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేసింది. వాస్తవానికి అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. కొరడా ఝుళిపించిన ఈడీ ఈ స్కామ్పై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి అవి ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు వెళ్లాయి? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు ఇప్పటికే నిర్ధారించింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా నాడు ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. బాబు అవినీతి నెట్వర్క్ ఇదిగో.. టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. ♦ అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్కి మనోజ్ అక్రమ నిధులను తరలించిన పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్కు ఉడాయించారు. -
స్కిల్ కేసు.. ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, గుంటూరు: చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై దాఖలైన పిటిషన్ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. స్కిల్ స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. ఇతర కారణాలతో నోటీసులు వెనక్కి విషయాన్ని ప్రస్తావించారాయన. పైగా ఈ కేసులో కొందరు ప్రతివాదులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా ప్రతివాదులకు పేపర్ ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో.. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు. -
Dec 15th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 7:00 PM, Dec 15, 2023 ఏమైనా చేయండి.. యువగళం ముగింపు సక్సెస్ చేయండి టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు విజయోత్సవ సభకు లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్న చంద్రబాబు సభ సక్సెస్ కాకపోతే లోకేష్ ఊరుకోడని చెబుతోన్న చంద్రబాబు ఎంత ఖర్చయినా సరే.. నాది బాధ్యత, జనాలను తీసుకురావాలని పిలుపు ఇప్పటికే రంగంలోకి దిగిన లోకేష్ కోటరీ ప్రతీ నియోజకవర్గ ఇన్ఛార్జ్కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టార్గెట్లు జనం తగ్గితే ఎమ్మెల్యే టికెట్లు కష్టమని హెచ్చరిస్తోన్న లోకేష్ కోటరీ లోకేష్ సభ సక్సెసయితేనే పార్టీకి మనుగడ ఉంటుందని హెచ్చరికలు 6:55 PM, Dec 15, 2023 మరి.. మీరెందుకు కుప్పం వచ్చారు బాబు.? : పేర్ని నాని రాజకీయాల్లో ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారు చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ ఫర్ అయ్యారు మేం వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారు వైనాట్ 175కి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగులు పట్టవు జగన్ ను ఓడించాలి, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజుకు ఇచ్చారు : పేర్ని నాని 5:05 PM, Dec 15, 2023 జనసేనకు రాంరాం.. ఒంటరిగానే తెలంగాణలో పోటీ : బీజేపీ పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు మా టార్గెట్ లోకసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్ కు కిషన్ రెడ్డి పిలుపు డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు : స్పష్టం చేసిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమాన పోరాటాలుంటాయి లోకసభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్దం కావాలి సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయి కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది 5:02 PM, Dec 15, 2023 చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కోవర్ట్ : RGV జనసేన స్థాపనకు కారణమే చంద్రబాబు : రాంగోపాల్ వర్మ మరోమాటలో జనసేనలో పవన్, చంద్రబాబుకు కోవర్టు వారిద్దరి మధ్య పొత్తు అనే దానికి అర్థమే లేదు ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగోలేదు తెలంగాణాలో కేసీఆర్ కు ఉన్నంత బలమైన అపొజిషన్ ఏపీలో లేదు రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ అపొజిషన్ గా వచ్చి సీఎం అయ్యారు : ఆర్జీవీ 4:23 PM, Dec 15, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా ACB కోర్టులో IRR అలైన్మెంట్ కేసు విచారణ వాయిదా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పైనా విచారణ వాయిదా తదుపరి విచారణలు జనవరి 30కి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏం జరిగిందంటే? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ఏం జరిగిందంటే? ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 3:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు : సజ్జల ఆస్తుల కోసమే చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్నాడు మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు చంద్రబాబుకు ఎందుకు..? చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు ఎందుకు వెళ్లాడు..? మంగళగిరికి లోకేష్కు సంబంధం ఏంటీ..? ఏపీకి చంద్రబాబు గెస్ట్లా మాత్రమే వస్తాడు 1:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు సచివాలయంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారులు,సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎన్నికలకు ఎలా వెళ్తారో చెబుతారని అనుకున్నాం..! మా ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు? తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా? తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా? ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? తుఫాన్ పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశాం అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి? హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడు.! చంద్రబాబు కి ప్రజామోదం లేదు .2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టో చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారు హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, లోకేష్,ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదు చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదు అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారు చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక భోగస్ ఫోరమ్ ను పెట్టారు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తెలియదా? నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా? సిటిజన్ ఫోరమ్ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్ ను దించుతుంది మేం చాలా ఆత్మ నిబ్బరంగా ఉన్నాం...బలంగా ఉన్నాం ఏబీఎన్ డిబేట్లలో అనలిస్ట్ లు తగ్గినట్లున్నారు చంద్రబాబు ఏబీఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నాం చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి 11:31 AM, Dec 15, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 8:13 AM, Dec 15, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 7:23 AM, Dec 15, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 7:10 AM, Dec 15, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:56 AM, Dec 15, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ -
Dec 14th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:54 PM, డిసెంబర్ 14, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:24 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు భ్రమలు ఇంకా తొలగలేదు : మంత్రి కాకాని చంద్రబాబుకీ పూర్తిగా పిచ్చి పట్టిందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.. పోలవరాన్ని తానే డిజైన్ చేసానని చెప్పుకోవడం సిగ్గుచేటు.. పోలవరం ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది వైస్సార్ ఐతే.. దాన్ని పూర్తి చేసేది సీఎం YS జగన్ మిగ్చామ్ తుఫాన్ లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. చంద్రబాబు హయాంలోనే రైతులు నష్టపోయారనే విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి.. వ్యవసాయమే దండగ అని మాట్లాడిన చంద్రబాబు.. రైతులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం.. టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. రుణమాఫీ చేస్తానని చెప్పి.. రైతులను బాబు మోసం చెయ్యలేదా..? తుఫాన్ సమయంలో కష్టపడి పని చేసిన అధికారులను తక్కువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆత్మ స్తుతి.. పర నిందతో చంద్రబాబు బతుకుతున్నారు.. 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఐతే.. అప్పటి నుంచి ఒక్క సాగునిటీ ప్రాజెక్ట్ ను అయినా చేపట్టారా..?? చంద్రబాబు సిగ్గు లేకుండా.. తుఫాన్, వరదలు విషయంలో మాట్లాడుతున్నారు.. మోసాలు చెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. అయన జైలుకు వెళ్తే జనాలు ఆత్మహత్య లు చేసుకున్నారని చెప్పడం సిగ్గుచేటు.. అలిపిరిలో చంద్రబాబు మీద బాంబ్ దాడి జరిగితే రాష్టంలో ఒక్కరూ కూడా పట్టించుకోలేదు.. రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీని నీ హయాంలో ఎప్పుడైనా ఇచ్చావా..?? 2015 లో జాతీయ రహదారి తెగిపోతే ఐదేళ్లు పట్టించుకోలేదు.. వైసీపీ హయాంలో ఆ హైవే పనులు పూర్తి చేసాం.. NDA లో భాగస్వామిగా ఉన్నప్పుడు.. నిధులు తీసుకురాగలిగావా..? రైతులను, ప్రజలను ఆదుకున్న చరిత్ర చంద్రబాబు కీ లేదు.. పని చేసే వ్యక్తి జగన్.. ఫోటోలకు పోజులు ఇచ్చేది చంద్రబాబు.. ఆస్తి, ప్రాణ నష్టాలు జరక్కుండా జిల్లా యంత్రాంగం తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే.. ఒక్క రైతు కూడా కనిపించలేదు.. వైసీపీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉన్నట్టుంది 5:42 PM, డిసెంబర్ 14, 2023 మా తలుపులు తెరిచే ఉన్నాయి.. రండి బాబు రండి అభ్యర్థుల కోసం ఆశగా ఎదురుచూస్తోన్న చంద్రబాబు వైసీపీలో మంచివాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచిస్తాం : చంద్రబాబు జనసేనతో పొత్తులో ఉన్నాం.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాం అయినా YSRCP నుంచి అసంతృప్తితో ఎవరైనా మంచి అభ్యర్థి వస్తే పార్టీలోకి తీసుకుంటాం ఈసారి త్వరగానే అభ్యర్ధులను ప్రకటిస్తాం : చంద్రబాబు YSRCP నుంచి ఎవరైనా అసమ్మతిదారులు బయటకు వస్తారేమో.. 5:12 PM, డిసెంబర్ 14, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 4:10 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 4:05 PM, డిసెంబర్ 14, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాంకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ బాబు ముందస్తు బెయిల్పై వాదనలు సీఐడీ తరపున పూర్తయిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు 4:02 PM, డిసెంబర్ 14, 2023 దొంగ ఓట్లు కేరాఫ్ తెలుగుదేశం ఢిల్లీలో మీడియాతో ఎంపీ విజయసాయిరెడ్డి దొంగ ఓట్లు చేర్పిస్తున్న టీడీపీ నేతలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు టీడీపీ నేతల నిర్వాకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం టీడీపీ నేతల దొంగ ఓట్ల వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని కోరాం టీడీపీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం అమెరికా సర్వర్ లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు తండ్రి పేరు, ఇంటి పేరు మార్చి ఒకే ఓటర్ ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం వీలైనంత త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాం మా విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించింది : ఎంపీ విజయసాయిరెడ్డి 3:52 PM, డిసెంబర్ 14, 2023 ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్ విడుదల చేసే లోకేష్ ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.! హెరిటేజ్ లో రూ.20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... మార్కెట్లో దాని విలువ రూ.70 వేల కోట్లు .! మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్లో ఉన్న ఆస్తుల విలువెంత.? మదీనాగూడలో 14 ఎకరాల ఫాంహౌజ్ విలువెంత? జూబ్లీహిల్స్లో కట్టిన ఇంద్రభవనం విలువెంత? లోకేష్.. ప్లీజ్ తొందరగా ప్రెస్ మీట్ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.? 2:52 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు అంటే నమ్మక ద్రోహం చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్ కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీని నాశనం చేశాడు ఎస్సీ బీసీ ఎస్టీలను మోసం చేసి దగాచేశాడు ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడు పోలవరంను నాశనం చేసింది చంద్రబాబే అధికారం కోసం జగనన్న సంక్షేమ పాలనపై యెల్లో మీడియాతో విషపు రాతలు సీఎం జగన్ చేతల మనిషి.. ఆయనపై బాబు కుట్రలు పని చేయవు ఏపీ ప్రజలు చంద్రబాబును గమనిస్తున్నారు చంద్రబాబు పాలనలో సామజిక న్యాయం అందని ద్రాక్ష జగన్ పాలనలో సామాజిక న్యాయం విప్లవాత్మకంగా అమలైంది యువగళంకు ప్రజాబలం లేదు...లోకేష్ కి మెదడు లేదు లోకేష్. మాతో చర్చలకు సిద్దామా? మీ ఆఫీస్కే వస్తాం 2:00 PM, డిసెంబర్ 14, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 1:30 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య.. 17ఏ కాపాడలేదు : న్యాయనిపుణులు రేపో, మాపో 17aపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు తప్పు చేయలేదని ఇప్పటివరకు ఏ కోర్టుముందు కూడా చెప్పని చంద్రబాబు అరెస్ట్కు ముందస్తు అనుమతి లేదని మాత్రం సాంకేతికంగా డొంక తిరుగుడు వాదనలు వినిపిస్తోన్న చంద్రబాబు లాయర్లు చంద్రబాబు పిటిషన్కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి(అక్టోబర్, నవంబర్లలో జరిగిన విచారణ సందర్భంగా) స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే 17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది 17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్కమ్ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్కు గురవుతారు రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది 2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్ను బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:44 PM, Dec 14, 2023 తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే ►పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నారంటే.. ► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి ► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది ► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి ► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు 1,56,88,569 అంటే 49.95% ► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే ► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1 ► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.! ఒకసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా? ► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరి పొలిటికల్ కెరియర్లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్, పవన్ మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్కు షాక్ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి గాజువాకలో పవన్ కళ్యాణ్ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి 12:15 PM, Dec 14, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 11:15 AM, Dec 14, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 10:12 AM, Dec 14, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 8:19 AM, Dec 14, 2023 ఐఆర్ఆర్ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ చంద్రబాబు ముందస్తుబెయిల్ పై విచారించనున్న హైకోర్టు రుషికొండలో నిర్మాణాలపై నేడు ఏపీ హైకోర్టు విచారణ జనసేన నేత మూర్తి పిటిషన్ పై విచారించనున్న హైకోర్టు 7:33 AM, Dec 14, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకి సలహాలు, సూచనలు చెప్పే స్వేచ్ఛ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు లేదు. జనసేన పార్టీలో ఎవ్వరైనా టీడీపీ పార్టీని విమర్శిస్తే వైయస్ఆర్సీపీ పార్టీ కోవర్టులుగా చిత్రీకరిస్తాడు. జనసైనికులు కోవర్టులు కాదు.. చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్టు - ఆకుల… pic.twitter.com/BO1LwpuGIe — YSR Congress Party (@YSRCParty) December 13, 2023 7:28 AM, Dec 14, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:53 AM, Dec 14, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 6:51 AM, Dec 14, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నేటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ నేటికి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు -
సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేదా ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో పలు చిక్కులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. మనీలాండరింగ్ కూడా జరిగిందని వివరించింది. సీఆర్డీఏ పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణాలపై 2020లోనే సీఐడీ దర్యాప్తు చేపట్టిందని, వీటిపై దర్యాప్తు చేయాలని సీబీఐని కూడా కోరినట్లు తెలిపింది. సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపామంది. ఇందుకు జీవోలు కూడా జారీ చేశామని తెలిపింది. ఉండవల్లి వ్యాజ్యంలో కోర్టు ఏ ఆదేశాలు జారీ చేసినా కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ తెలిపారు. ఇతర మార్గాల్లోనోటీసులు పంపేందుకు అనుమతివ్వండి నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కొందరికి అందాయని, కొందరు తిరస్కరించారని, డోర్ లాక్, ఇంట్లో లేరు వంటి కారణాలతో కొన్ని వెనక్కి వచ్చాయని ఉండవల్లి తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వివరించారు. నోటీసులు అందని వారికి పత్రికలు, వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపేందుకు అనుమతివ్వాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇప్పటి వరకు సీఐడీ చేసిన దర్యాప్తు వివరాలతో ఓ నివేదికను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్లాక నివేదికపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. నోటీసులు అందని వారికి వాటిని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
Dec 13th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:24 PM, Dec 13, 2023 చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అంటే ఇష్టం లేదు : మంత్రి అమర్నాథ్ విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదు టీడీపీ, జనసేనలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు పవన్ అజ్ఞాతవాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి 6:04 PM, Dec 13, 2023 దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబే : ధర్మాన శ్రీకాకుళం : చంద్రబాబు ఏ రోజైనా దళితులను పట్టించుకున్నారా? : మంత్రి ధర్మాన అవినీతికి తావులేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కట్టడం కాదు ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబుకు కనిపించదు : మంత్రి ధర్మాన 5:33 PM, Dec 13, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 4:22 PM, Dec 13, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరినీ ఎవరూ నమ్మరు : సజ్జల మీడియాతో YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదు పవన్ ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారు 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు కరోనాలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఎకానమీ దెబ్బతినలేదు ఎల్లోమీడియాలో వార్తలు రాయించుకుని చంద్రబాబు ఒక భ్రమలో బతుకుతన్నారు పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారు చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ సర్దుకుంటాయి టీడీపీ అనే శిధిలపార్టీని చంద్రబాబు ఏలుకుంటున్నారు ఎల్లోమీడియానే టీడీపీని, చంద్రబాబును నడిపిస్తోంది వారు పగటికలలు కంటున్నారు అదే కలలు కంటూ అలాగే వారు భ్రమల్లో ఉండాలని కోరుకుంటున్నాం వై నాట్ 175 అనే లక్ష్యంతోనే మేము పని చేస్తున్నాం జగన్ ఏం తప్పు చేస్తారా? ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు అసలు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో లేదో కూడా తెలియని దుస్థితి 3:45 PM, Dec 13, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 3:03 PM, Dec 13, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు 2:44 PM, Dec 13, 2023 ఐఆర్ఆర్ పిటిషన్ రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఇవాళ కూడా జరిగిన విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 1:14 PM, Dec 13, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 12:44 PM, Dec 13, 2023 నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు IRR కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు 12:25 PM, Dec 13, 2023 స్కిల్ స్కాం కేసు CBI అప్పగించాల్సిందే ఏపీ హైకోర్టులో స్కిల్ కేసు వ్యవహారం స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ కొందరు ప్రతివాదులకు నోటీసులు అందలేదని, మరికొందరు నోటీసులు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారన్న పిటిషనర్ పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం ఉండవల్లి పిటిషన్ విచారణ 2 వారాలు వాయిదా 12:05 PM, Dec 13, 2023 బాబు కేరాఫ్ తమిళనాడు తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో చంద్రబాబు పర్యటన శ్రీరామానుజార్ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు సమానత్వం కోసం శ్రీ రామానుజులు పాటు పడ్డారు : చంద్రబాబు 11:55 AM, Dec 13, 2023 పార్టీ ఆఫీసుకు దారేది.? మూడు నెలల విరామం తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్న చంద్రబాబు మ.2 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు సమక్షంలో కుప్పం కార్యకర్తలతో భేటీ సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభపై చంద్రబాబు మంతనాలు ఇప్పటికే యువగళం గురించి పార్టీ సీనియర్ల ఫిర్యాదు కీలకమైన ఉత్తరాంధ్రను విస్మరించామంటోన్న సీనియర్లు 200 కిలోమీటర్ల (భోగాపురం-ఇచ్ఛాపురం) విస్మరించడంపై తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందంటున్న సీనియర్లు లోకేష్ను ఒప్పించలేం.. ఇక్కడితో ముగించాలన్న యోచనలో చంద్రబాబు 11:15 AM, Dec 13, 2023 చంద్రబాబు మిత్రుడికి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో తనపై అవమానకరమైన వార్తలు ప్రచురించినందుకు కేసు కోర్టులో కేసు వేసిన నమస్తే దినపత్రిక ఎడిటర్ ముత్యాల సైదేశ్వరరావు కోర్టుకు హాజరు కాకపోవటంతో ఎండి రాధాకృష్ణ ,మరో నలుగురికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ 10:45 AM, Dec 13, 2023 రాష్ట్రానికి చంద్రబాబు చేసింది సున్నా : ధర్మాన చోడవరంలో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు మంత్రి టిడిపి హయాంలో వ్యవసాయం మైనస్ గ్రోత్ లోకి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం గ్రోత్ పెరిగింది.. టిడిపి హయాంలో GDP 16 వ స్థానంలో ఉంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 4 స్థానంలో ఉంది.. రైతులకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అయిపోతారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎప్పుడూ కట్టుబడి ఉండరు.. 2 లక్షల 40 వేల కోట్ల రూపాయల పేదల ఖాతాల్లో సీఎం జగన్ వేశారు.. రూపాయి అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నారు.. డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు.. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు.. ప్రైవేట్ స్కూల్స్ కంటే అద్భుతంగా ప్రభుత్వం స్కూల్స్ ను తయారు చేశారు.. ఓట్లు కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తేలేదు.. పిల్లల భవిష్యత్ కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తెచ్చారు.. రానున్న రోజుల్లో విద్య వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది.. పసుపు కుంకుమ పేరుతో మహిళను చంద్రబాబు మోసం చేశారు.. రైతు రుణ మాఫీ చేస్తామని మోసం చేశారు.. అర్హత ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వస్త్తే జన్మ భూమి బ్రోకర్లను తెస్తారు.. 10:05 AM, Dec 13, 2023 జనసేను టిడిపికి అద్దెకిచ్చారు : నందిగం సురేష్ చోడవరం : నందిగామ సురేష్ కామెంట్స్ చంద్రబాబు బడుగు,బలహీన వర్గాలను అవమానించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది. ఆకలి తీర్చే నాయకుడు కావాలో.. మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది? రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువలనే టిడీపిని ప్రజలు పక్కన పెట్టారు. టిడిపికి- జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అవసరం అయినపప్పుడు పార్టీని అప్పుడప్పుడు తాకట్టు పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో డిపాజిట్లు రాలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు. జగన్ మోహన్ రెడ్డిపై సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను కాల్చి చంపినది చంద్రబాబు కాదా! 7:50 AM, Dec 13, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:50 AM, Dec 13, 2023 చంద్రబాబు కేసులు - స్టేటస్ చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (నిన్న), డిసెంబర్ 13(నేడు) విచారణ. చంద్రబాబు కేసులు @ హైకోర్టు హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ కేసు విచారణ ఈరోజుకి వాయిదా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 6:30 AM, Dec 13, 2023 తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా? చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా? ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు? .@Naralokesh, don’t spill your yellow media venom on our state. You’ve proven yet again that you can only vomit lies when you open your mouth. The Central Government's data on the floor of parliament speaks louder than your disgusting lies. Andhra Pradesh's unemployment rate is… https://t.co/zQMnXeDEeB pic.twitter.com/RB1x6T4Txy — YSR Congress Party (@YSRCParty) December 12, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అభియోగాలేంటీ? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జూలై 22,2015 & ఏప్రిల్ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు. -
Dec 12th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 5:25 PM, Dec 12, 2023 మ్యానిఫెస్టోపై ముందుకు పడని అడుగు ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు జనసేన ఎజెండాలో అయిదు అంశాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్తో విడతలవారీగా చర్చలు జరిపిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల తర్వాత మారిన చంద్రబాబు ప్లాన్ ఏం చేస్తే ఆకట్టుకోవాలనుకునే దానిపై మంతనాలు మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు 1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ 2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు. 3. అమరావతే రాజధానిగా కొనసాగింపు. 4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం. 5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన. 6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం. 7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం. 8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన. ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు కొత్తగా 47 సంక్షేమ పథకాలు పెట్టాలంటున్న హరిరామజోగయ్య మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ 2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు 4:45 PM, Dec 12, 2023 చంద్రబాబు కేసులు @ హైకోర్టు హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ కేసు విచారణ రేపటికి వాయిదా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా 4:31 PM, Dec 12, 2023 విశాఖకు కార్యాలయాల తరలింపును వ్యతిరేకిస్తూ పిటిషన్ విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలిస్తున్నారంటూ పిటిషన్ కార్యాలయాల తరలింపు నిలిపివేయాలని కోరిన రాజధాని పరిరక్షణ సమితి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు 4:22 PM, Dec 12, 2023 చెన్నైకి చంద్రబాబు కాసేపట్లో చెన్నై చేరుకోనున్న చంద్రబాబు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరంబుదూర్కు బాబు రామానుజర్ ఆలయంలో పూజలు నిర్వహించనున్న బాబు అనంతరం మైలాపుర్ లోని చంద్రబాగ్ అవెన్యూ కు అక్కడ నాగాలాండ్ గవర్నర్ ఐలా గణేశన్ ఇంట్లో భేటీ 3:45 PM, Dec 12, 2023 తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా? చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా? ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు? .@Naralokesh, don’t spill your yellow media venom on our state. You’ve proven yet again that you can only vomit lies when you open your mouth. The Central Government's data on the floor of parliament speaks louder than your disgusting lies. Andhra Pradesh's unemployment rate is… https://t.co/zQMnXeDEeB pic.twitter.com/RB1x6T4Txy — YSR Congress Party (@YSRCParty) December 12, 2023 2:55 PM, Dec 12, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఏపీ హైకోర్టు:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్పై హైకోర్టులో విచారణ సిఐడి తరఫున వాదన వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ శ్రీరాం కేసులో అభియోగాలేంటీ? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జూలై 22,2015 & ఏప్రిల్ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 2:50 PM, Dec 12, 2023 చంద్రబాబు కేసులు - స్టేటస్ చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (ఈ రోజు) విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (ఈరోజు) విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 2:30 PM, Dec 12, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 1:30 PM, Dec 12, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు పిటిషన్ ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కోర్టు నంబర్ -6లో.. ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన.. చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 12:05 PM, Dec 12, 2023 YSRCP మార్పులపై TDP పిచ్చి వ్యాఖ్యలు.. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి బాబు.. వైసీపీ అంతర్గత పరిణామాలపై స్పందించిన టీడీపీ బడుగు బలహీన వర్గాలకు సీట్లు మార్చడం ఏంటి? సీట్లు మార్చినా.. YSRCPకి కష్టం : తెలుగుదేశం 2019 ఎన్నికల్లో కుప్పకూలిన టీడీపీ కంచుకోటలు అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్ గల్లంతు 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్కు మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టీడీపీ, జనసేన సమన్వయం 2019లో పవన్కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్ ఎజెండా అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి అసలు జనసేన 2019లో కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం 11:15 AM, Dec 12, 2023 ఇసుక కేసు @ హైకోర్టు ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబు పిటిషన్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు హైకోర్టులో ఇవ్వాళ మధ్యాహ్నం విచారణ సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్ ఇసుక కేసు పూర్వపరాలేంటీ? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్చగా భూగర్భ వనరుల దోపిడి చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే.. బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం 2014లో మహిళా సంఘాల ముసుగులో ఇసుక దోపిడీ పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం స్మగ్లర్ల ముఠా చేతికి భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందన్న లాయర్ శ్రావణ్కుమార్ పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కిన నటి బాబు ప్రభుత్వం పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర తీవ్రంగా ఆక్షేపించిన NGT అయినా ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించిన రైతులు ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ కమిటీ చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో 2019 జనవరి 17–18న కమిటీ పరిశీలన స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక సమర్పణ ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్కు NGT అల్టిమేటం ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానా మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 4, 2019లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావన 10:05 AM, Dec 12, 2023 17a పిటిషన్లో ఊరట కోసం బాబు ఆరాటం త్వరలో స్కిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం తాను తప్పు చేయలేదని చెప్పకుండా ముందస్తు అనుమతి చుట్టు బాబు వాదనలు అసలు స్కిల్ స్కాంలో ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్టెక్ సంస్థలు ఒప్పందం ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు కీలక ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన సీఐడీ 8:30 AM, Dec 12, 2023 ఫైబర్ నెట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ నేడు సుప్రీంకోర్టులో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్పై విచారణ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరణ దీంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు విచారణ జరుపనున్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కోర్ట్ నంబర్-6లో ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు 7:30 AM, Dec 12, 2023 నేడు ఐఆర్ఆర్, ఇసుక కేసులో విచారణ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్పై నేడు హైకోర్టులో మధ్యాహ్నం విచారణ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు పిటిషన్పై హైకోర్టులో మధ్యాహ్నం విచారణ ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్ 6:45 AM, Dec 12, 2023 అమరావతి.. అసలు నిజాలు.. తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..? అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో సభ అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి అమరావతి గురించి జడ శ్రవణ్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా?. 6:35 AM, Dec 12, 2023 చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్ నందమూరి వంశస్తులను రాజకీయాల్లో చంద్రబాబు ఎదగనివ్వడు. లోకేష్ కోసమే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు దేవుడి దయ వల్లే జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దేవుడు దయ వల్లే అప్పటి ఘోర కారు ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ బయటపడ్డాడు. నందమూరి వంశస్తులు తన కొడుక్కి పోటీ రాకుండా చంద్రబాబు చూస్తున్నాడు. కాబట్టి నందమూరి వంశస్తులను రాజకీయాల్లో ఎదగనివ్వడు. - ఎమ్మెల్యే కొడాలి నాని#PappuLokesh#EndOfTDP#CorruptBabuNaidu pic.twitter.com/NyLJKoI1F9 — YSR Congress Party (@YSRCParty) December 11, 2023 భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా? హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు అక్టోబర్ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ ఒక్కో కుటుంబానికి పాత డేట్తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా? నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? ఈ నెల 20న యువగళానికి మంగళం ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్ సంకేతాలు ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ విశాఖలో ఏం జరుగుతోంది? విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా.. ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ? పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ? అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి నాగుల్ మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం.. -
Dec 11th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates.. 06:15 PM, Dec 11, 2023 తెలంగాణ ఎన్నికలను చూసి తెలుగుదేశం పగటి కలలు : పోసాని విజయవాడలో మాట్లాడిన APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చంద్రబాబు చేసేది తప్పుడు రాజకీయం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు సర్వనాశనం చేస్తారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి టీడీపీ ఓట్లేయలేదు పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు కమ్మ వాళ్లు ఓట్లు వేయలేదు చంద్రబాబే కమ్మ వాళ్లను ఓటెయ్యొద్దని చెప్పాడు పవన్ కి ఎక్కువ ఓట్లొస్తే ఏపీలో ఎక్కువ సీట్లు అడుగుతాడు అందుకే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు దెబ్బకొట్టాడు కాపుల ఓట్లు చంద్రబాబుకి వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటు కాపులను దెబ్బతీసిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా..? మోడీ మూడు రాష్ట్రాల్లో గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడు కాంగ్రెస్ కి తెలంగాణలో మద్దతిచ్చి BRSని ఓడించాలనుకున్నాడు హైదరాబాద్ లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ కి ఒక్క సీటు రాలేదు చంద్రబాబుని హైదరాబాద్ లోని సెటిలర్లంతా చీ కొట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ మోసం చేయడానికి ప్రజలు అమాయకులు కాదు 05:55 PM, Dec 11, 2023 ఈ నెల 20న యువగళానికి మంగళం ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్ సంకేతాలు ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ 05:05 PM, Dec 11, 2023 యశోద ఆస్పత్రికి చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించా: చంద్రబాబు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా మళ్లీ కేసీఆర్ ప్రజా సేవ చేయాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ త్వరగా కోలుకుంటారు కేసీఆర్ తో మాట్లాడాలి అనిపించి వచ్చా కేసీఆర్ కు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయి: చంద్రబాబు 04:00 PM, Dec 11, 2023 బండారు అరెస్ట్ పిటిషన్ @ హైకోర్టు బండారు సత్యనారాయణ అరెస్టుపై హైకోర్టులో విచారణ మంత్రి రోజాపై నీచమైన వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి మరిచి దిగజారి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడంతో అన్ని వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కేసు పెట్టి బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు తన అరెస్ట్ అక్రమని బండారు పిటిషన్ CC ఫుటేజ్ సమర్పించిన బండారు తరపు న్యాయవాదులు ఫోటోలను కోర్టుకు అందజేసిన పోలీసులు 4 వారాల తర్వాత తుది విచారణ చేపడతామన్న హైకోర్టు 03:05 PM, Dec 11, 2023 విశాఖలో ఏం జరుగుతోంది? విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా.. ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ? పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ? 02:55 PM, Dec 11, 2023 అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి నాగుల్ మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం.. 02:40 PM, Dec 11, 2023 కెసిఆర్కు చంద్రబాబు పరామర్శ హైదరాబాద్: కేసీఆర్ను పరామర్శించనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3.20 గం.కు కేసీఆర్ ను పరామర్శించనున్న చంద్రబాబు ఇటీవల KCRకు తుంటిమార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ 02:20 PM, Dec 11, 2023 ఉరవకొండ టీచర్కు CPSకు భలే లింకు పెట్టారే.! అనంతపురం జిల్లా ఉరవ కొండలో ఓ టీచర్ ఆత్మహత్యయత్నం వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటనకు వెంటనే సీపీఎస్ అంశాన్ని ముడిపెట్టేసిన తెలుగుదేశం, ఎల్లో మీడియా బురదజల్లడమే మా లక్ష్యం అంటూ ఆత్మహత్యాయత్నం ఘటనకు విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తించిన చంద్రబాబు, తెలుగుదేశం టీం అసలు సీపీఎస్ పాలసీని ఎవరు తీసుకువచ్చారు? 2003లో దీన్ని అడాప్ట్ చేసుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? మరి ఆ విధానాన్ని నాడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదు? 1996 నుంచి 2004 వరకూ సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పటి ఎన్డీయేలోతానే చక్రం తిప్పానని చంద్రబాబు పదేపదే గొప్పలు చెప్పుకుంటారు. మరి CPS ప్రాసస్ను ఎందుకు వ్యతిరేకించలేదు? అదిరాకుండా ఎందుకు అడ్డుకోలేదు.? ఉద్యోగులకు మేలు చేసేలా మంచి ప్రత్యామ్నాయాన్ని ఎందుకు తీసుకురాలేదు? వైఎస్సార్సిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేసింది GPS రూపంలో మంచి ప్రయత్నామ్యాన్ని తీసుకు వచ్చింది కదా ఎంతో అధ్యయనం చేశాక, ఉద్యోగుల ప్రయోజాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకుంది. GPSను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి కూడా. ఇంతకంటే గొప్ప ప్రత్యామ్నాయం లేదని ఉద్యోగులంతా హర్షం వ్యక్తంచేశారు కూడా చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GPSను పరిగణనలోకి తీసుకుంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బాటలోనే నడిచేందుకు సిద్ధం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లోమీడియా, ప్రతిపక్షాలు ఇప్పుడు విషం చిమ్ముతున్నాయి అసలు కుటుంబ సభ్యులు ఏమన్నారో మీరే చూడండి. అనంతపురం: టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆయన భార్య శివలక్ష్మి, బావ ఆదినారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదు ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది డిప్రెషన్ తో బాధపడుతూ నా భర్త మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశారు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దు టీచర్ మల్లేష్ భార్య శివలక్ష్మి , బావ ఆదినారాయణ 02:10 PM, Dec 11, 2023 అసైన్డ్ భూముల కేసు వాయిదా అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టు విచారణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన నారాయణ సీఐడీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా 01:22 PM, Dec 11, 2023 అమరావతి.. అసలు నిజాలు.. తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..? అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో సభ అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి అమరావతి గురించి జడ శ్రవణ్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా? (ఫైల్ఫోటో : లోకేష్తో జడ శ్రవణ్) 12:42 PM, Dec 11, 2023 చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు రేపు తమిళనాడు వెళ్లనున్న చంద్రబాబు శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు మళ్లీ రేపు రాత్రికి తిరిగి విజయవాడకు చంద్రబాబు 12:02 PM, Dec 11, 2023 బెజవాడ తమ్ముళ్ల టికెట్ పంచాయతీ విజయవాడ వెస్ట్లో టీడీపీ నేతల సీటు పంచాయితీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా హాట్ కామెంట్స్ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న పరోక్ష విమర్శలు పశ్చిమ స్థానంలో నేను పోటీ చేస్తా.. లేదా నాగుల్ మీరా పోటీ చేస్తారు ఎవరు పడితే వాళ్లు మాకే టికెట్ అంటే కుదరదు : బుద్ధా వెంకన్న నిబద్ధత గల మమ్మల్ని కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోం : నాగుల్ మీరా (ఫైల్ ఫోటో : సమన్వయ కమిటీ సమావేశంలో బుద్ధా వెంకన్న) 11:15 AM, Dec 11, 2023 భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా? హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు అక్టోబర్ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ ఒక్కో కుటుంబానికి పాత డేట్తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా? నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? (ఫైల్ ఫోటో : నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరీ పరామర్శ) 10:22 AM, Dec 11, 2023 జనసేన అభ్యర్థులు కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారా? ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టిడిపి వర్గాలు తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా? చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.! ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు 10:09 AM, Dec 11, 2023 పాదయాత్రకు విశేష స్పందన : నారా లోకేష్ అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ పాదయాత్రకు అద్భుత స్పందన వస్తే ముందే ఎందుకు ముగిస్తున్నారు? 200 కిలోమీటర్ల నడకను ఎందుకు తగ్గించుకున్నారు? విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఎందుకు చిన్నచూపు చూస్తారు? మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు 9:29 AM, Dec 11, 2023 ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా? ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది? చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా? 9:17 AM, Dec 11, 2023 అసైన్డ్ భూముల స్కాం.. ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో విచారణ అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామీలపై సీఐడీ కేసు నమోదు ముందస్తు బెయిల్ మంజూరు, కేసులను క్వాష్ చేయాలంటూ నారాయణ, ఆయన బినామీల పిటిషన్లు 8:21 AM, Dec 11, 2023 కిషన్.. పవన్.. ఓ ప్రచారం నేను పవన్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి నాపై సోషల్మీడియాలో వస్తు్న్న ప్రచారం అవాస్తవం కొందరు కావాలని నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు వారిపై పోలీసులకు ఫిర్యాుదు చేస్తా ఎన్డీయేలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలో దిగాం: అసలేం జరిగిందంటే..? సోషల్ మీడియాలో నిన్న జరిగిన ప్రచారం ఏంటంటే... పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నీ నమ్ముకొని గ్రేటర్ లో నష్టపోయాం పవన్ తో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా విలువ తగ్గించారు ఆ సంగతి గ్రహించే పొత్తుని ఉప సంహరించుకోవాలని అధిష్టానం సూచించింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పొయింది. సొంతంగా పోటీ చేసి ఉంటే కనీసం గ్రేటర్ పరిధిలో 4-5 సీట్లు గెలిచే అవకాశం ఉండేది కనీసం మా కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేదని అనిపించింది. హైదరాబాద్ వెలుపల సీట్లు, ఓట్లు సాధించినా, సిటీలో పోటీ ఇవ్వలేకపోయాం గట్టి పోటీ ఇచ్చి గెలుస్తామని భావించిన లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, కుత్భూలాపూర్, యాకుత్పురా, ఉప్పల్, రాజేంద్రనగర్ సీట్లు కేవలం పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగానే ఘోరంగా ఓడిపోయం సెటిలర్స్ లో ఉన్న కాపు, కమ్మ సామాజిక వర్గం నాతోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మించాడు. ఈ ప్రచారం వెనక ఎవరి హస్తం ? తెలంగాణలో ముగిసిన ఎన్నికలు ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తుతో పోటీకి నిర్ణయం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల చర్చలు తనకు కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు అలాగే ఐదు ఎంపీ టికెట్లు కావాలని అడుగుతున్న పవన్ కళ్యాణ్ అయితే 20 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని అలాగే 3 ఎంపీ టికెట్లు ఇస్తామని చెబుతున్న టీడీపీ తెలంగాణలో బీజేపీతో 8 సీట్లకే ఒప్పుకున్నందుకు ఏపీలో 20 సీట్లు సరిపోతాయన్నది చంద్రబాబు లెక్క. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విలువను తగ్గించేందుకు సోషల్ మీడియాను టీడీపీ అస్త్రంగా చేసుకుంటుందన్న ఆరోపణలు గతంలోనూ సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పలుకుట్రలు అమలు చేసిందన్నది జనసేన సైనికుల ఆరోపణ పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలుమార్లు చంద్రబాబు లోకేష్లను నేరుగా విమర్శించాడు. 2018-2019 మధ్య కాలంలో తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని దెబ్బతీసేలా టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శ తాజాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టీడిపి నేతల హస్తం ఉందని అనుమానిస్తున్నారు తద్వారా పవన్, జనసేన విలువను తగ్గించి ఆ పార్టీకి వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా ఒప్పించవచ్చన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 6:39 AM, Dec 11, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 6:33 AM, Dec 11, 2023 ముందు నుయ్యి వెనక గొయ్యి తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్ ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్ 6:31 AM, Dec 11, 2023 పవన్కు వెన్నుపోటుకు బాబు రెడీ సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు -
Dec 10th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates.. 4:18PM, Dec 10, 2023 లోకేష్ పేరు ఎత్తితేనే బెంబేలెత్తుతోన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి యువగళం పాదయాత్ర తమ నియోజకవర్గాల్లో వద్దే వద్దుంటున్న నేతలు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాదయాత్ర రద్దు పార్టీ వైఖరిపై అయ్యన్న కినుక చేతులెత్తేసిన చోడవరం, మాడుగుల నేతలు చేసేదిలేక రూట్ మ్యాప్ మార్పు....!! షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావు పేట నుంచి కోటవురట్ల మీదుగా నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అనకాపల్లి, పరవాడ, గాజువాక చేరుకుని నగరంలోకి ప్రవేశించి పెందుర్తి మీదుగా భీమిలి చేరుకోవాలి కానీ.. టీడీపీ నేతల అసంతృప్తితో షెడ్యూల్ మార్చారు తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 11న పాయకరావు పేటలో ప్రవేశించి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా నగరంలోకి ప్రవేశించి ఈ నెల 20 లేదా 21న భీమిలిలో ముగించాలని నిర్ణయించారు ఇందులో నర్సీపట్నం, చోడవరం మాడుగులలను తీసేశారు చంద్రబాబుపై అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఓకే చేయకపోవడం.. గంటాకు ప్రాధాన్య ఇవ్వడం.. గంటా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం..ఓ NRIను వెతుకుతుండటం అయ్యన్నకు ఏమాత్రం నచ్చడంలేదని టీడీపీ క్యాడర్ చెప్పుకుంటున్నారు డబ్బులు దండగా జనాలు రాకపోవడంతో పాదయాత్ర వద్దు బాబోయే అని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు 3:20PM, Dec 10, 2023 టికెట్ల పేరుతో కార్యకర్తలతో ఆటాడుకుంటున్న చంద్రబాబు తేల్చుడు కాదు అంతా నాన్చుడు మంత్రమే పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో సీటు పంచాయితీ విజయవాడ : వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న బుద్ధా వెంకన్న బీసీ అభ్యర్థిగా చంద్రబాబు తనకే సీటు ఇస్తారన్న బుద్ధా టీడీపీ సీటు ఎంఎస్ బేగ్కు ఇప్పిస్తానన్న కేశినేని నాని కేశినేని చిన్ని వర్గంలో బుద్ధా వెంకన్న, కేశినేని నాని వర్గంలో ఉన్న ఎంఎస్ బేగ్ కేశినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్యంతో సీటు పై ఎటూ తేల్చకుండా పెండింగ్లో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఖరారు చేసిన జనసేనకి ఇవ్వాల్సి వస్తే మళ్లీ వెన్నుపోటు తప్పదు అంటున్న తమ్ముళ్లు 3:18PM, Dec 10, 2023 ఏపీ ఎన్నికలకు 4 నెలల ముందే.. సీఎం రేస్ నుంచి పవన్ కల్యాణ్ అవుట్..!! నమ్ముకున్న వాళ్లను.. తడిగుడ్డతో గొంతు ఎలా కోయాలో.. పవన్ కల్యాణ్కు తెలిసినంతగామరెవ్వరికీ తెలియదు. జనసేన పుట్టినప్పటి నుంచి.. ఇప్పటి వరకూ జనసేన జెండా మోసిన వాళ్లను తన స్వార్ధ రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ మోసం చేస్తూనే ఉన్నాడు. పవన్ కల్యాణ్ను దగ్గరుండి చూసిన.. ఆయన మనస్తత్వాన్ని బాగా తెలిసిన వాళ్లు.. ఆయనను వదిలేసి వారి దారి వారు చూసుకున్నారు. పవన్ కల్యాణ్ను నడిపించేది.. చంద్రబాబేనని.. జనసేన పుట్టిందే చంద్రబాబు కోసమని.. తెలిసిన వాళ్లు జనసేన ఆఫీస్ దరిదాపుల్లోకి .. కూడా వెళ్లడం లేదు. జనసేన ఆఫీస్లో దశాబ్దం పాటు .. పని చేసిన సందీప్, మెగా ఫ్యామిలీ కోసం ఎంతో కృషి చేసిన.. ఆయన తల్లి పద్మావతి కూడా.. జనసేనను వదిలేసి వచ్చారంటేనే.. పవన్ కల్యాణ్ విపరీతమైన మనస్తత్వాన్ని.. అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేస్తే.. జనసేనకు ఒక్క చోట కూడా.. డిపాజిట్ రాలేదు. కొల్లాపూర్లో బర్రెలక్కకు 5,700 వస్తే...జనసేన అభ్యర్ధులకు.. ఒక్క కూకట్పల్లిలో మినహా.. మిగిలిన 7 చోట్ల 3 వేల ఓట్లు కూడా దాటలేదు. తెలంగాణ ఎన్నికల తరువాత.. చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. భేటీ తరువాత పవన్ మాటలు చూస్తుంటే.. ఆయనే తాను సీఎం రేస్లో లేనట్లేనని.. ప్రకటించినట్లుంది. టీడీపీ తనకు సీఎం పదవి.. కేటాయించే పరిస్థితి లేనట్లు జనసేన శ్రేణులకు పవన్ సంకేతాలు. టీడీపీ అభ్యర్ధులను.. జనసేన క్యాడర్ గెలిపించాలట.!! అప్పుడే ఈయనకు సీఎం ఛాన్స్ అట..!! బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడుతాడా..? ఈ మాటలు జనసేన క్యాడర్ నమ్మితే.. అంతకంటే తిక్కలి వాళ్లు.. పిచ్చి వాళ్లులేనట్లే..!! టీడీపీ అత్యధిక సీట్లు తీసుకుని.. అత్యధిక సీట్లు గెలిస్తే.. పవన్ను అసలు పట్టించుకుంటారా..? ఇంట్లో చెత్త బుట్టను చూసినట్లు చూస్తారు..!! తొలి నుంచి పవన్ మాటలు.. చిత్రవిచిత్రమైన మాటలే..! ఒకసారి సీఎం రేసులో ఉన్నాను అంటాడు.. ఒకసారి సీఎం రేసులో లేనంటాడు.. మరోసారి రెండు చోట్ల ఓడించారు.. సీఎం పదవికి అర్హుడునేనా అంటాడు..! పవన్ను నమ్ముకుంటే.. జనసేన శ్రేణులు, కాపులు నట్టేట మునిగినట్లే.. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలి. 2:21 PM, Dec 10, 2023 ముందు నుయ్యి వెనక గొయ్యి తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్ ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్ 2:18 PM, Dec 10, 2023 పవన్కు వెన్నుపోటుకు బాబు రెడీ సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు 12:30 PM, Dec 10, 2023 విపత్తుపై చంద్రబాబు నీచ రాజకీయాలు: మంత్రి కాకాణి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు విపత్తు సమయంలో ఏ నేత అయినా ప్రజలకు అండగా నిలవాలి కానీ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు విపత్తు సమయంలో టీడీపీ నేతలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు టీడీపీ నేతలు కేవలం ప్రెస్మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటి? రైతులను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు రైతులను అవమానకరంగా మాట్లాడింది చంద్రబాబే వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడింది చంద్రబాబే చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు విపత్తుసమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటి? విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం విపత్తుల సమయంలో ప్రజలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. 11:30 AM, Dec 10, 2023 బుద్ద వెంకన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవా? తెలంగాణలో అసలు మీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా రాదని మీకు ముందే అర్థమైందా? లేక కాంగ్రెస్ పార్టీకి బాగా ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేస్తామని బాలకృష్ణతో ప్రకటనలు ఎందుకు ఇప్పించారు? చివరికి మీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు కూడా మీరు వెన్నుపోటు పొడిచారా? ఎంత ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్కు తాకట్టు పెట్టారు? ఇన్నాళ్లు పోటీ చేసిన మీకు కూడా వెన్నుపోటు తప్పదని మీరు అనుమానిస్తున్నారా? మీకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉందా? చంద్రబాబు, లోకేష్లను బెదిరిస్తున్నారా? లేక మీ బాధ చెప్పుకుంటున్నారా? తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకోలేదు తెలంగాణ ఎన్నికలతో చంద్రబాబుకు ఏం సంబంధం? నాకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉంది విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తా.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న 7:20 AM, Dec 10, 2023 పచ్చ బ్యాచ్ అప్పుడలా.. ఇప్పుడిలా.. పచ్చ పిచ్చికి మందులు కూడా పనిచేయడం లేదుగా.. కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? అప్పుడిలా... ఇప్పుడిలా... ఈ పిచ్చికి మందులు కూడా పనిచేయటం లేదు.. pic.twitter.com/WxS7JUfQa1 — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 9, 2023 నారా లోకేష్కు స్ట్రాంగ్ కౌంటర్.. ఇవన్నీ మర్చిపోతే ఎలారా గజ్జి.. 🐕#EndOfTDP pic.twitter.com/T7QvxFGBzu — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 9, 2023 7:15 AM, Dec 10, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 7:00 AM, Dec 10, 2023 ప్రశ్నిస్తా అనే పవన్కు వైఎస్సార్సీపీ ప్రశ్న టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్ కళ్యాణ్ సూత్రీకరించాడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను ఆదేశిస్తున్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!! టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?! పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది అదే మాట జనసైనికులను పవన్ అనవచ్చన్న మాట..! ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..? అసలు అబ్రహం లింకన్తో పవన్ పోల్చుకోవడం ఏంటీ..? అబ్రహం లింకన్ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మరీ.. పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. -
నేను దొరికే దొంగను కాదు ?..నోరు జారిన చంద్రబాబు..
-
Dec 9th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates 09:01PM, Dec 09, 2023 ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా? ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది? చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా? 03:24PM, Dec 09, 2023 ప్రశ్నిస్తా అనే పవన్కు వైఎస్సార్సీపీ ప్రశ్న టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్ కళ్యాణ్ సూత్రీకరించాడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను ఆదేశిస్తున్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!! టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?! పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది అదే మాట జనసైనికులను పవన్ అనవచ్చన్న మాట..! ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..? అసలు అబ్రహం లింకన్తో పవన్ పోల్చుకోవడం ఏంటీ..? అబ్రహం లింకన్ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మరీ.. పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు 12:22 PM, Dec 09, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 12:05 PM, Dec 09, 2023 గుంటూరులో చంద్రబాబు పర్యటన 2వ రోజు ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన బాపట్ల, పర్చూరు, ప్రత్తిపాడులో చంద్రబాబు పర్యటన పర్చూరు లో డ్రెయిన్ను పరిశీలిన ప్రత్తిపాడు, పెదనంది పాడులో రైతులతో చంద్రబాబు ముఖాముఖి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం దొరుకుతుందన్న ఆశతో చంద్రబాబు పర్యటనలు అంతటా సానుకూలంగా కనిపిస్తుండడంతో మరింత శోధన తుపాను ప్రభావాన్ని ప్రభుత్వ లోపంగా చూపించడానికి సర్వ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్కు తుపానులేమి కొత్తకాదు : YSRCP చంద్రబాబు హయాంలో రైతును పట్టించుకున్నదే లేదు, పంటనష్టాన్ని భరించింది లేదు అసలు వ్యవసాయమే దండగ అన్నది, ఒంటబట్టించుకున్నది చంద్రబాబే ఇప్పుడు ఎన్నికల సమయంలో సానుభూతి కోసం తిరిగితే ఎవరు నమ్ముతారు? 11:45 AM, Dec 09, 2023 చంద్రబాబు ట్రైనింగ్ అంటే ఏమనుకున్నారు.? చంద్రబాబు బాటలోనే తెలుగుదేశం నాయకులు మహిళా ఉద్యోగినిపై నోరు పారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ITDA PO ఉద్యోగిని మందా రాణిపై నోరుపారేసుకున్న సోమిరెడ్డి ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బెదిరింపుల వ్యవహారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఐటిడిఏ పీవో 11:00 AM, Dec 09, 2023 పచ్చ బ్యాచ్కు వైఎస్సార్సీపీ కౌంటర్.. చంద్రబాబుకు 2019లోనే ప్రజలు బుద్ది చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉనికి కూడా ఉండదు. బాబు.. రాష్ట్రానికి, రాజకీయాలకు చేసిన హామీ అంతా ఇంతా కాదు. చంద్రబాబు అనే రాజకీయ విష వృక్షాన్ని 2019 ఎన్నికల్లోనే ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారు. రానున్న ఎన్నికల్లో ఇక ఆ విషపు వృక్షం ఉనికి కూడా తీసి సముద్రంలో వేస్తారు. రాష్ట్రానికి, రాజకీయాలకు మీరు చేసిన హాని అంతా ఇంతా కాదు.. అన్నిటికీ ప్రజలు మరొక్కసారి సమాధానం చెబుతారు. https://t.co/2PNjSlOon1 — YSR Congress Party (@YSRCParty) December 9, 2023 7:15 AM, Dec 09, 2023 కోర్టు షరతులు ఉల్లంఘించిన చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించి మరీ చంద్రబాబు ఉపన్యాసం తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తన కేసు గురించి ప్రస్తావన స్కిల్ స్కాం గురించి మాట్లాడకూడదని చెప్పిన హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రసంగం తప్పు చేయకుండా తనను జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యలు బెయిల్ షరతులు చంద్రబాబు ఉల్లంఘించినందున బెయిల్ రద్దును కోరవచ్చంటున్న న్యాయ నిపుణులు. 7:05 AM, Dec 09, 2023 50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు పవన్ కళ్యాణ్కు తెగేసి చెబుతోన్న కాపులు ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి? అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి? 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.! 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.! అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.? తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.! ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.? అసలు కాపులెందుకు రాజీ పడాలి? అసలు కాపులు సీఎం జగన్ను ఎందుకు వ్యతిరేకించాలి? సీఎం జగన్ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు నాన్ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్నాథ్ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.? నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్ వాటిని ఎత్తేయించాడు చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్లో ఫంక్షన్ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.? చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు? లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు సంకర జాతి, బ్రీడ్.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా? పవన్ చెప్పాడని గుడ్డిగా జగన్ మీద కక్ష పెంచుకోగలమా? దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు (ఫైల్ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 7:00 AM, Dec 09, 2023 ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం ఫామ్ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి తప్పుడు డిక్లరేషన్తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష 6:50 AM, Dec 09, 2023 ఓటర్లతో చంద్రబాబు రాజకీయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు. మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు? గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది? తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది? మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది? ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది? ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు? అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు? పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు? కేసు ఎందుకు వాయిదా పడిందంటే.? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం -
బాబు కోర్టు ధిక్కారం
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లి అక్కడ తన అరెస్టు, జైలు గురించి ప్రసంగించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తన అరెస్టు గురించి మాట్లాడి కోర్టులంటే తనకు లెక్కలేదన్నట్లుగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అక్టోబర్ 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి ఎక్కడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడకూడదని హైకోర్టు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా పేర్కొంది. కేసులోని విషయాల గురించి బయట ఎక్కడా చర్చించవద్దని స్పష్టంచేసింది. అలాగే, హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తప్పకుండా పాటించాలని, స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అయితే, చంద్రబాబు మాత్రం వీటిని బహిరంగంగా ఉల్లంఘించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోటలో శుక్రవారం తుపాను బాధితులను పరామర్శించి అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. తుపాను దెబ్బకు అన్ని విధాలుగా నష్టపోయి రైతులు ఆందోళనలో ఉంటే చంద్రబాబు మాత్రం అక్కడకు వెళ్లి తనను అన్యాయంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు గురించి మాట్లాడారు. ఇలా బెయిల్ షరతులను చంద్రబాబు బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ను రద్దుచేయాలని కోరవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లుగా టెక్నికల్గా, లీగల్గా తప్పుచేయలేదు.. తనలాంటి వాళ్లను కూడా జైల్లో పెట్టేయగలుగుతున్నారని, బాధ కలగదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా తానెక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదని, టెక్నికల్గా, లీగల్గా ఒక్క తప్పూ చేయకుండా ఉన్నానని, అలాంటి తనను జైల్లో పెట్టారని చెప్పారు. ఎలాంటి తప్పు కూడా చేయకుండా ఉన్న పళంగా కేసు బుక్చేసి లోపలేశాడని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూడా మనిషినేనని, తనకూ బాధలు ఉంటాయని, తనకూ మనసు ఉంటుందని, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందంటూ ప్రజల సానుభూతి కోసం ఆయన ప్రయత్నించారు. తన కోసం 52 రోజులుగా అందరూ వీరోచితంగా పోరాడారని, తనను అరెస్టుచేస్తే అందరినీ బెదిరించవచ్చనే ఉద్దేశంతో సీఎం ఇలా చేసినట్లు చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. న్యాయకోవిదుల విస్మయం.. బెయిల్ షరతులను ఉల్లంఘించి తాను అరెస్టయిన కేసు గురించి చంద్రబాబు మాట్లాడడంపై న్యాయకోవిదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బెయిల్ పొందినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పి బయటకు వచ్చాక ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అందుకు సంబంధించిన విషయాల గురించి కాకుండా తాను జైలుపాలవడం, కేసుల గురించి మాట్లాడడం ఏమిటనే ప్రశ్నలు సాధారణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. ఇక అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చినప్పుడు కూడా రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు గంటల తరబడి ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఆయన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. తనకు అరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని భారీఎత్తున ర్యాలీలు చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులోనే ఆయనకు రిమాండ్ విధించినప్పుడు సైతం న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తిని అసభ్యపదజాలంతో ధూషిస్తూ పోస్టులు పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయన కుమారుడు లోకేశ్, ఇతర నాయకులు కోర్టులను మేనేజ్ చేశారంటూ న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు. చివరికి అదే న్యాయ వ్యవస్థ నుంచి చంద్రబాబు బెయిల్ పొంది బయటకొచ్చారు. ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ స్కిల్ కుంభకోణం గురించి రాజకీయ ఉపన్యాసం చేయడం గమనార్హం. -
Dec 8th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates 5.33 PM, 8th Dec 2023 ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం ఫామ్ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి తప్పుడు డిక్లరేషన్తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష 5.15 PM, 8th Dec 2023 ఓటర్లతో చంద్రబాబు రాజకీయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు? గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది? తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది? మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది? ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది? ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు? అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు? పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు? (నిజాంపేట - ప్రగతి నగర్ ప్రాంతంలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రం) 4.55 PM, 8th Dec 2023 బెయిల్ కండీషన్లను ఉల్లంఘించిన చంద్రబాబు స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు నిబంధనలు ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై మాట్లాడిన బాబు కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ‘లీగల్ గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారు’ : చంద్రబాబు అరెస్ట్ చేసినందుకు CID పోలీసులను, రిమాండ్కు పంపినందుకు కోర్టును తప్పుబట్టిన చంద్రబాబు 3.35 PM, 8th Dec 2023 కేసు ఎందుకు వాయిదా పడిందంటే.? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం 3.15 PM, 8th Dec 2023 50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు పవన్ కళ్యాణ్కు తెగేసి చెబుతోన్న కాపులు ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి? అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి? 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.! 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.! అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.? తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.! ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.? అసలు కాపులెందుకు రాజీ పడాలి? అసలు కాపులు సీఎం జగన్ను ఎందుకు వ్యతిరేకించాలి? సీఎం జగన్ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు నాన్ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్నాథ్ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.? నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్ వాటిని ఎత్తేయించాడు చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్లో ఫంక్షన్ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.? చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు? లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు సంకర జాతి, బ్రీడ్.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా? పవన్ చెప్పాడని గుడ్డిగా జగన్ మీద కక్ష పెంచుకోగలమా? దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు (ఫైల్ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 3.04 PM, 8th Dec 2023 అంటే అన్నామంటారు కానీ.. బర్రెలక్క కంటే అన్యాయం కాదా? జనసేన అనేది ఒక పొలిటికల్ కాంట్రాక్ట్ పార్టీ : మంత్రి గుడివాడ అమర్ చంద్రబాబు కోసమే పనిచేసే వ్యాపార సంస్థ అది.. తెలంగాణ రిజల్ట్తో పవన్కళ్యాణ్కు మతి చెడింది పవన్ కల్యాణ్ కంటే.. బర్రెలక్క(శిరీష)నయమనిపిస్తుంది అబ్రహం లింకన్ కాదు..నారా లింకనే పవన్ కు స్ఫూర్తి ప్రజల్లో ఎటువంటి స్థాయి, బలం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ జగన్ గారిని విమర్శించి తన స్థాయి పెంచుకోవాలని పవన్ చూస్తున్నాడు. విశాఖ ఉక్కుపై అబద్ధాల కబుర్లు చాలించు పవన్..! ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం ఏంటి పవన్ కల్యాణ్..? పార్టీ పెట్టి పదేళ్లయినా సొంత నియోజకవర్గం ఏంటో చెప్పలేదు.? 2.45 PM, 8th Dec 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు జనవరి 19కి వాయిదా ఢిల్లీ: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా విచారణ చేసిన జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్ పై గత విచారణలో నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ కామెంట్స్ చేయవద్దని బాబుకు షరతులు విధించిన కోర్టు 1.30 PM, 8th Dec 2023 విశాఖ కార్యాలయాల కేసుపై విచారణ విశాఖకు క్యాంప్ కార్యాలయాలు తరలిస్తున్నారని పిటిషన్ జీవో 2283ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన ఏజీ శ్రీరామ్ పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేయడాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ గతంలో పిల్ అంశాన్ని ఇప్పుడు రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ రాజధాని తరలింపుపై స్టే ఇవ్వాలంటూ రైతుల పిటిషన్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ అడ్వకేట్ జనరల్ వాదనలు రైతుల తరఫున లాయర్ ఉన్నం మురళీధర్ రావు వాదనలు రైతు సమాఖ్య పిటిషన్లకు విచారణ అర్హత ఉందని వాదన రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి : మురళీధర్ ఇరుపక్షాల లాయర్ల మధ్య హోరాహోరీ వాదనలు రెండు సంఘాల్లోని రైతులు కోర్టు ఫీజు చెల్లించాలని ఆదేశం విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు 12.13 PM, 8th Dec 2023 అయ్యా.. పవనాలు.. కాస్తా వెనక్కి తిరిగి చూసుకో: YSRCP చురకలు తెలంగాణలో బీజేపీ, ఏపీలో టీడీపీ : అడపాశేషు పవన్ ఎవరితోనైనా ఎప్పుడైనా పొత్తు పెట్టుకోగలడు పవన్ ను నమ్ముకుంటే తెలంగాణలో బీజేపీకి పట్టినగతే ఇక్కడ కూడా పవన్ తీరు అక్కడ అమ్మాయి...ఇక్కడ అబ్బాయి సినిమాలాగే ఉంది అక్కడ పోతే బీజేపీ పోయిందని వదిలేశాడు ఇక్కడ చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు ఒక సినిమా పోతే....మరో సినిమా అన్నట్లుంది పవన్ విధానం ఏపీకి ఏం చేశాడని పవన్ ను ప్రజలు నమ్మాలి? పవన్ ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తున్నారు జనసేనకు కచ్చితంగా ప్రజలే సమాధానం చెబుతారు : అడపా శేషు చంద్రబాబును సీఎం చేస్తామన్నది జనసేన పగటికల పార్టీ పెట్టి పదేళ్లయ్యింది....ఏం సాధించావ్ పవన్? : వెల్లంపల్లి చంద్రబాబుకి ఊడిగం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్ రాజకీయ విలువల్లేని వ్యక్తి పవన్ ధైర్యం ఉంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలి టీడీపీ నుంచి 29 సీట్లు అడుక్కోవడానికి సిగ్గులేదా? : వెల్లంపల్లి పవన్కు డిపాజిట్లు రాలేదు, కమిట్మెంట్ లేదు తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు : అమర్నాథ్ తెలంగాణలో స్థిర నివాసమున్న మీ బలం ఏమిటో తేలిపోయింది అబ్రహం లింకన్ గురించి కాదు.... చంద్రబాబుతో ఉన్న లింకుల గురించి పవన్ మాట్లాడితే మంచిది రాజకీయాలపై పవన్ కు ఏమాత్రం కమిట్మెంట్ లేదు ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కాదు.... శాటిలైట్ సెంటర్ అని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా అత్తారింటికి దారేది అంటే పవన్ 3 దారులు వెతుక్కోవాలి : అమర్నాథ్ 11.30 AM, 8th Dec 2023 తుపాను రూపంలో చంద్రబాబుకు అవకాశం జైలు జీవితం తర్వాత ప్రజా జీవితంలోకి చంద్రబాబు ఎప్పుడెప్పుడా అని ఇన్నాళ్లు ఎదురుచూస్తోన్న బాబు తుపాను రూపంలో చంద్రబాబుకు దొరికిన అవకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు దెంబతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న చంద్రబాబు రైతులకు చంద్రబాబు పరామర్శ పొన్నూరు, వేమూరు,తెనాలి, బాపట్లలో పర్యటన రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటన 11.00 AM, 8th Dec 2023 బర్రెలక్క స్థాయిలో కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు: మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్కు తెలంగాణలో వచ్చిన ఫలితమే ఏపీలో కూడా వస్తుంది. అందుకు నిన్న సభ మరోసారి రుజువు చేసింది. విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే మీరు రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు నిన్న విశాఖ వేదికగా పవన్ విమర్శలు చేశారు వ్యక్తి గతంగా సీఎం జగన్పై అవాస్తవ విమర్శలు చేశారు తెలంగాణ ఫలితాలు చూశాక పవన్కు మతి భ్రమించినట్టు కనిపిస్తుంది సోషల్ మీడియాలో చూస్తే బర్రెలక్క స్థాయిలో పవన్ సేన పోటీ పడింది బర్రెలక్కను తక్కువ చేయడం లేదు.. ఆమె స్థాయి కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ మీకు ఏపీకి సంబంధం ఏంటి?. మీరు ఏపీలో ఎంతకాలం వున్నారు?. పవన్ మీ నియోజకవర్గం ఏంటో చెప్పగలరా? ఎక్కడకు వెళ్తే అక్కడ మా నియోజక వర్గం అంటారు అబ్రహం లింకన్కు మీకు సంబంధమేంటి?.. మీది చంద్రబాబు లింకన్ సంబంధం పవన్ కళ్యాణ్ది ది పొలిటికల్ కాంట్రాక్ట్. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం 10:00 AM, Dec 8, 2023 నేడు చంద్రబాబు పిటిషన్పై విచారణ నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్గా కామెంట్స్ చేయవద్దని చంద్రబాబుకు కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపిన కోర్టు.. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన కోర్టు. ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు బెయిల్ కండిషన్లు అన్నీ యథాతధం స్కిల్ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో తొలగించిన హై కోర్ట్ హైకోర్టు తొలగించిన షరతును తిరిగి చంద్రబాబుకు విధించిన సుప్రీంకోర్టు ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ. 6:40 AM, Dec 8, 2023 సీఐడీ పిటిషన్పై నేడు విచారణ నేడు ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ 16వ నంబర్ కోర్టులో 51 ఐటమ్గా లిస్టైన చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పవన్కు షాకిచ్చిన ప్రజలు.. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత తొలిసారి విశాఖకు పవన్. పవన్కు షాకిచ్చిన విశాఖ ప్రజలు. ఏఎస్ రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా హోటల్లోనే ఉండిపోయారు. చివరకు కుర్చీలు తీసేసి గ్రౌండ్లో సగం వరకే వేసినా అవి కూడా నిండలేదు. ప్రజలను సభకు తీసుకురావడంలో విఫలమయ్యారంటూ జన సైనికులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన @PawanKalyan కు ప్రజలు షాకిచ్చారు. ఏఎస్ రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా హోటల్లోనే ఉండిపోయారు. చివరకు… pic.twitter.com/Fk5UOCtWUw — YSR Congress Party (@YSRCParty) December 7, 2023 6:30 AM, Dec 8, 2023 లారీ కింద దూరిన కుక్కలకు.. టీడీపీ కుక్కలకూ తేడాలేదు: కొడాలి నాని ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క ఆ లారీ అదే మోస్తందనుకుంటుంది రేవంత్ రెడ్డిని టీడీపీ వాళ్లే సీఎం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు సిగ్గులేకుండా గాంధీభవన్లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారు చంద్రబాబు అధికారంలోకి రావటం పగటి కల అంతరిక్షం నుంచి వచ్చినా గుడివాడలో వైఎస్సార్సీపీని ఓడించలేరు ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీ చేస్తే తెలంగాణలో మాదిరే అవుతుంది సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు మేం టీడీపీ వెనుక నడవడం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నాం జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు సీఎం ఎవరనేది చంద్రబాబు, నేను కూర్చొని నిర్ణయం తీసుకుంటాం అన్నీ ప్రజలకు చెప్పే చేస్తాం.. మీ ఆత్మగౌరవం ఎప్పుడు తగ్గించను ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు మేం ఎవరికి బీ పార్టీ కాదు డొంక తిరుగుడు పనులు నేను చేయను ఎవరు నాతో వచ్చినా రాకున్నా నేను నడుస్తూనే ఉంటా. 6:30 AM, Dec 8, 2023 ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో మరో కీలక పరిణామం టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కొరడా ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు రూ.34 కోట్ల పెనాల్టీ విధింపు కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న అమ్మకం దారు GST నిబంధనలను తుంగలో తొక్కిన ఫాస్ట్లైన్ టెక్నాలజీస్ ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీ ఏపీ ఫైబర్నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే విచారణలో పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్న ఫాస్ట్లేన్ మాజీ ఎండీ విప్లవ్కుమార్ నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ గుర్తింపు (చంద్రబాబు సన్నిహితుడు) టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్లేన్ను ఏర్పాటు చేసినట్టు తెలిపిన విప్లవ్ కుమార్ ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఇంగ్రామ్ ఫాస్ట్లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు తెలిపిన ఇంగ్రామ్ సెప్టెంబర్ 2020 నుంచి కార్యకలపాలు నిలిపివేసిన ఫాస్ట్లేన్ ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్లేన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్ ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను తిరిస్కరించిన హైకోర్టు సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న విచారణకు రానున్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్కిల్ కుంభకోణంలో కీలక పరిణామం A13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సీఐడీ అధికారులు అప్రూవర్గా మారుతున్నట్లు కోర్టు ఎదుట తెలిపిన చంద్రకాంత్ షా తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసు వాయిదా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు రూ.కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు కేసు నుంచి తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ విచారణ వాయిదా వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం,పిటిషనర్ తరఫు న్యాయవాదులు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం -
Dec 6th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 5:02 PM, Dec 6, 2023 ముసుగు తీసేద్దామా? తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తర్జనభర్జన అర్జంటుగా కాంగ్రెస్తో చేతులు కలపాలని ఆరాటపడుతోన్న చంద్రబాబు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కలిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తోన్న చంద్రబాబు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్కు చెప్పిన చంద్రబాబు అసలు తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించిందే తెలుగుదేశమని చెబుతోన్న చంద్రబాబు ఇటీవల గాంధీభవన్లో జరిగిన విజయోత్సవాల్లో కాంగ్రెస్ జెండాతో పాటు రెపరెపలాడిన తెలుగుదేశం పచ్చజెండాలు బీజేపీని ఇక్కడితో విడిచిపెట్టేయాలని పవన్ కళ్యాణ్పై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం తెలంగాణ తరహాలో ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ కలుపుకోవచ్చంటున్న చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్కు సహకరించాం కాబట్టి, ఏపీలో కాంగ్రెస్ సహకారం తీసుకుందామంటోన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు వచ్చిన ఓట్ల గురించి కూడా సమావేశంలో ప్రస్తావన కాంగ్రెస్ కలిసిరాకపోతే.. ఏపీలో జనసేనకు తెలంగాణ సీనే రిపీట్ అవుతోందని భావిస్తోన్న చంద్రబాబు 4:59 PM, Dec 6, 2023 తెలంగాణలో ఏం జరిగింది? నెంబర్లు ఏం చెబుతున్నాయి? అసలు నిజాలు బయటపెడుతోన్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడింది గ్రేటర్ హైదరాబాద్లోనే గ్రేటర్లోని 29 సీట్లలో బీఆర్ఎస్ 18 స్థానాల్లో విజయం 3 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్పై ఇంకా ఆగ్రహంగానే ఉన్న సీమాంధ్రులు చంద్రబాబు, చంద్రబాబు సామాజిక వర్గం ఎంత రెచ్చగొట్టినా..దక్కని ఫలితం అయినా తమ వల్లే కాంగ్రెస్ గెలిచిందని ప్రచారం చేసుకుంటోన్న తెలుగుదేశం 4:52 PM, Dec 6, 2023 కిం కర్తవ్యం.? హైదరాబాద్ : చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్కల్యాణ్ చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అధినేత పవన్ తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ నవంబర్ 4న ఉమ్మడి మ్యానిఫెస్టోపై చర్చించిన ఇరువురు నేతలు ఇప్పటివరకు అడుగు ముందుకు పడని మ్యానిఫెస్టో తెలుగుదేశం ప్రతిపాదనలకు అదనంగా తనవంతుగా కొన్ని హామీలను చేర్చిన జనసేన ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతిపాదనలపై నోరు మెదపని చంద్రబాబు తరుచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం 4:33 PM, Dec 6, 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ఇసుక ఉచిత పాలసీ, ఐఆర్ఆర్ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సీఐడీ సమయం కోరడంతో వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఈనెల 12 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 4:02 PM, Dec 6, 2023 ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఉంటుందేమో? : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇండియా కూటమిలో చంద్రబాబు చేరొచ్చు తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం టీడీపీ పని చేసింది కాంగ్రెస్ గెలిచాక గాంధీభవన్ లో టీడీపీ సంబరాలు చేసుకుంది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ మా పొత్తు జనసేనతో మాత్రమే : విష్ణువర్ధన్ రెడ్డి 3:52 PM, Dec 6, 2023 ఎన్నికలు పారదర్శకంగా జరగాలి : వైఎస్సార్సిపి ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు తాను చేసిన తప్పులను ఇతరుల పైకి నెడతారు ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్దాలు చెప్పాలని బాబు ప్రయత్నిస్తున్నారు : మంత్రి చెల్లుబోయిన 3:33 PM, Dec 6, 2023 ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి : YSRCP రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిసిన మంత్రులు, వైఎసార్సీపీ నేతలు కలిసిన వారిలో మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలంగాణ లో ఓటువేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన మంత్రులు 4 లక్షల 30 వేల 264 మందికి తెలంగాణ , ఏపీలో ఓట్లు ఉన్నాయి ఆధారాలతో సహా ఈసీకి అందించాం డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైఎసార్సీపీ విధానం ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం డూప్లికేట్ ఓట్లు చేర్పించిందే చంద్రబాబు తాజాగా HMDA పరిధిలో పలు చోట్ల ఓట్ల బూత్లు తెరిచిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారు? : మంత్రి జోగి రమేష్ 3:02 PM, Dec 6, 2023 మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన NRI ఆస్పత్రి ఇప్పుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటోన్న వాటాదారులు మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు ఆస్పత్రి నిధులు మళ్లించారంటూ విజయవాడలో కేసు రూ. 400 కోట్లు మళ్లించినట్టు సురేష్ పై ఆరోపణలు కోర్టు ఆదేశాలతో సురేష్ తో పాటు 39 మందిపై కేసు చాలా మంది NRIల నుంచి బ్లాక్ మనీ సేకరించినట్టు ఆరోపణలు 2:20 PM, Dec 6, 2023 హైకోర్టులో విశాఖ కేసు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ పిటిషన్ విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు కార్యాలయాలు తరలింపునుకు సంబంధించిన జీవో 2283ను సవాల్ చేస్తూ పిటిషన్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ఏజీ శ్రీరామ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ శ్రీరాం ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ శ్రీరామ్ పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దాఖలు చేయాల్సి ఉంది రాజధాని తో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదా ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది కానీ పిటిషనర్లు తెలివిగా కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్న ఏజీ ఫోరమ్ షాపింగ్ పై పలు జడ్జిమెంట్లు ఉదహరించిన ఏజీ శ్రీరామ్ తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు 11:00 AM, Dec 6, 2023 ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్: ఓ సామాన్యుడు జనసేన అధినేత పవన్కు బిగ్ షాక్ ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్ పవన్కు ఏపీలో ఇల్లు లేదు. ఓటు హక్కు కూడా లేదు. అలాంటి వ్యక్తి సీఎం జగన్కు పోటీనే కాదు. ఈసారి కూడా గెలిచేది సీఎం జగనే. ఈ రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఆయనకు ఇల్లు లేదు. ఓటు హక్కు కూడా లేదు. అలాంటి వ్యక్తి నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం @ysjaganకు పోటీనే కాదు. ఈసారి కూడా గెలిచేది జగన్ గారే. మళ్ళీ ఆయనే సీఎం. - జగనన్న పాలనపై సామాన్యుడి మనోగతం… pic.twitter.com/QSPwuY0fHy — YSR Congress Party (@YSRCParty) December 6, 2023 7:05 AM, Dec 6, 2023 జనసేన, టీడీపీ నేతలెక్కడ? నాడు కరోనా సమయంలో, నేడు వరదల సమయంలో కనిపించని జనసేన, టీడీపీ నేతలు కానీ, అంతా సద్దుమణిగిన తర్వాత సుద్దులు చెప్పడానికి గుంపులుగా వస్తారు. నాడు కరోనా సమయంలో , నేడు వరదల సమయంలో టిడిపి , జనసేన నేతలు ఎక్కడా కనిపించలేదు ! కానీ .... అంతా సద్దుమణిగిన తర్వాత సుద్దులు చెప్పడానికి గుంపుగా బయటకు వస్తారు !#BanYellowMedia#BanTDP — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 5, 2023 7:00 AM, Dec 6, 2023 సిగ్గుండాలి చంద్రబాబు, పవన్.. కళ్లు కనపడుతున్నాయా పవన్? చెవులు వినబడుతున్నాయా చంద్రబాబు? వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వాలంటీర్లు.. కళ్లు కనపడుతున్నాయా @Pawankalyan? చెవులు వినబడుతున్నాయా చంద్రబాబూ @ncbn? వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వాలంటీర్లు… Volunteer system is the biggest strength of Andhra Pradesh. ☝🏻#CycloneReliefMeasuresInAP#YSJaganCares#AndhraPradesh#VolunteerSystem#APVolunteers pic.twitter.com/tl8OgBtmXg — YSR Congress Party (@YSRCParty) December 5, 2023 6:50 AM, Dec 6, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! 6:50 AM, Dec 6, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర. 6:45 AM, Dec 6, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?. -
Dec 5th: చంద్రబాబు కేసు అప్డేట్స్
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో మరో కీలక పరిణామం టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కొరడా ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు రూ.34 కోట్ల పెనాల్టీ విధింపు కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న అమ్మకం దారు GST నిబంధనలను తుంగలో తొక్కిన ఫాస్ట్లైన్ టెక్నాలజీస్ ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీ ఏపీ ఫైబర్నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే విచారణలో పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్న ఫాస్ట్లేన్ మాజీ ఎండీ విప్లవ్కుమార్ నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ గుర్తింపు (చంద్రబాబు సన్నిహితుడు) టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్లేన్ను ఏర్పాటు చేసినట్టు తెలిపిన విప్లవ్ కుమార్ ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఇంగ్రామ్ ఫాస్ట్లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు తెలిపిన ఇంగ్రామ్ సెప్టెంబర్ 2020 నుంచి కార్యకలపాలు నిలిపివేసిన ఫాస్ట్లేన్ ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్లేన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్ ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను తిరిస్కరించిన హైకోర్టు సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న విచారణకు రానున్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్కిల్ కుంభకోణంలో కీలక పరిణామం A13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సీఐడీ అధికారులు అప్రూవర్గా మారుతున్నట్లు కోర్టు ఎదుట తెలిపిన చంద్రకాంత్ షా తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసు వాయిదా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు రూ.కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు కేసు నుంచి తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ విచారణ వాయిదా వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం,పిటిషనర్ తరఫు న్యాయవాదులు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం దిగజారుడు రాజకీయాలకు బాబు, పవన్ నిదర్శనం తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు : ఎంపీ నందిగం సురేష్ తెలంగాణ లో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా రాలేదు ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది వైఎస్సార్ సీపీ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి నువ్వు లీడర్ ఎలా అవుతావు.. లోకేష్? కాకినాడ : లోకేష్ పై ద్వారంపూడి ఫైర్ లోకేష్ పాదయాత్ర కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నట్టుంది ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నీస్ధాయి సరిపోదు, నువ్వు ఎమ్మెల్యే కూడా కావు నీ ఎర్ర బుక్కు మడత పెట్టుకో కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదా పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్ను అడుగు కాకినాడలో టాప్ ముగ్గురు బియ్యం ఎగుమతిదారుల్లో ఆయన ఒకరు, పైగా మీ సామాజిక వర్గమే లేని ఆరోపణలు చేయడం లోకేష్కు తగదు దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యావు నేను ప్రజా క్షేతంలో రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యాను. లోకేష్ పొలిటికల్ ఎంట్రీ తరువాతే చంద్రబాబు పతనం ప్రారంభమైంది ఏపీ బాగుపడాలంటే టిడిపి పోవాలి తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ ప్రభావం లేదు టిడిపిని సపోర్ట్ చేసిన సాప్ట్ వేర్ ఇంజనీర్ ల వల్ల కాంగ్రెస్ గెలవలేదు తెలంగాణ ఎన్నికల్లో పరాజయానికి పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్ చంద్రబాబు సామాజిక వర్గం ఉడుత ఊపులు ఏమయ్యాయి? చించేస్తాం , 'పొడి' చేస్తాం ... అంటూ ఘీంకారాలు మా బాబును అరెస్ట్ చేస్తే కెసిఆర్ కేటీఆర్ ఖండించలేదంటూ శాపనార్థాలు తెలంగాణ ఎన్నికల్లో మా తడఖా చూపుతామని బెదిరింపులు తమిళనాడు శశికళ తరహాలో శపథాలు కట్ చేస్తే ... గ్రేటర్లో హైదరాబాద్ (15 ), ఉమ్మడి రంగారెడ్డి (14 ) లో మొత్తం 29 స్థానాలు TRS 17 స్థానాల్లో, MIM 7 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో గెలుపు చంద్రబాబు శిష్యులుండే నియోజక వర్గాల్లో TRSకు 2018 కంటే ఎక్కువ మెజారిటీ -
Dec 3rd: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 07:14 AM, Dec 3, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర 07:08 AM, Dec 3, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 07:05 AM, Dec 3, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! -
Dec 2nd: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 3:25 PM, Dec 2, 2023 మాట మీద నిలబడలేదు.. సారీ : పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు మాటమీద నిలబడలేదు దాని వల్ల అవమానాలు ఎదుర్కొన్నాం వ్యవస్థాపక సభ్యుడిగా ఆ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్తున్నా తెలుగు ప్రజల ఐక్యతకు కట్టుబడి ఉన్నాను 2014 ఎన్నికల్లో రాష్ట్ర క్షేమం కోసమే పోటీ చేయలేదు నా దృష్టిలో పడాలని బ్యానర్లు కట్టిన వ్యక్తి 2014లో మంత్రి అయ్యారు అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల బాగోగులను పట్టించుకోలేదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన కోసం పని చేస్తా, జెండా ఎగురవేస్తా నా ప్రాణం పోతే భావితరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి : పవన్ కళ్యాణ్ 2:27 PM, Dec 2, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర 1:07 PM, Dec 2, 2023 దోచుకోవడానికే పొత్తు : తోపుదుర్తి అనంతపురం : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈనెల 4న రాప్తాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియజేసేందుకు బస్సు యాత్ర దేశంలో ఏ సీఎం ఆచరణలో చేయలేని పనులను సీఎం జగన్ చేశారు సీఎం జగన్ రాష్ట్రంలో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు ఇచ్చారు టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అధికారం కోసమే టీడీపీ, జనసేన కలిసి వస్తున్నారు జగన్ ప్రజల ముందుకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టే విధంగా చంద్రబాబు విధానాలు ఉన్నాయి చంద్రబాబుకు దేశ, విదేశీ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి 1:07 PM, Dec 2, 2023 సమయం లేదు.. నేను వస్తే తప్ప పార్టీ బాగుపడదు జైలుకెళ్లిన తర్వాత చంద్రబాబుకు జ్ఞానోదయం రిపేర్ చేయలేనంత దారుణంగా పార్టీ దెబ్బతిందని అర్థం చేసుకున్న చంద్రబాబు కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కావడంతో చంద్రబాబులో ఆవేదన తాను జైలుకెళ్తే పార్టీని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని సీనియర్లపై ఇటీవల ఆగ్రహం తానే పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తానని చెబుతోన్న చంద్రబాబు వారం రోజుల్లో పార్టీ కార్యకలాపాలో నిమగ్నం కానున్న చంద్రబాబు ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచ్ ల సంఘం నిర్వహించే సమావేశాల్లో పాల్గొనున్న చంద్రబాబు ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప సమావేశాలకు చంద్రబాబు రాష్ట్రంలో ఓట్ల గురించి కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవాలని చంద్రబాబు నిర్ణయం పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీ వెళ్లేలని చంద్రబాబు యోచన తమకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్న చంద్రబాబు ఈ నెల 6 నుంచి 8వ తేదీ లోపు సమయం ఇవ్వాలని లేఖ రాయనున్న చంద్రబాబు 12:42 PM, Dec 2, 2023 కాపులెవరూ హర్షించరు : ఆమంచి వైఎస్ఆర్ సీపీ అంటే దివంగత వైఎస్ఆర్ పాలనకు కొనసాగింపు జనసేన పార్టీ టీడీపీని అధికారంలోకి తేవాలని యత్నిస్తోంది పవన్ టీడీపీకి మద్దతివ్వడాన్ని కాపు సామాజికవర్గం హర్షించదు ప్రభుత్వాన్ని విధానపరంగా విమర్శిస్తే సరిచేసుకుంటాం టీడీపీకి మేలు చేసేందుకే పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు పవన్కు ప్రజలే బుద్ధి చెబుతారు : ఆమంచి కృష్ణమోహన్ 12:30 PM, Dec 2, 2023 దండుపాళ్యం బ్యాచ్ చంద్రబాబుదే : టీజేఆర్ దొంగలకు దోచిపెట్టిన దండుపాళ్యం ముఠా చంద్రబాబుదే: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు రుణాలు మాఫీ చేస్తానని రైతులకు ద్రోహం చేసింది చంద్రబాబే వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు సీఎం జగన్ రైతులకు అన్ని విధాలు అండగా ఉంటున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ అసత్యాలు మాట్లాడుతున్నారు 12:02 PM, Dec 2, 2023 చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు విజయవాడ: ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, భువనేశ్వరి కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు సాయంత్రం విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు దంపతులు రేపు సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్న చంద్రబాబు ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయాలకు చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రల అనంతరం భవిష్యత్ కార్యాచరణ : చంద్రబాబు ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడను : చంద్రబాబు 11:32 AM, Dec 2, 2023 పవన్కు పార్టీ కార్యకర్తలపైనే ఎందుకు కోపం? : YSRCP జనసేన పొత్తులకు.. పవన్ కల్యాణ్ మాటలకు అర్ధాలే వేరులే..!!! రాజకీయ ప్రయోజనాలే కానీ.. రాజకీయ సిద్దాంతాల్లేవా? ఏపీలో టీడీపీతో.. తెలంగాణలో బీజేపీతో..ఏ రోటికాడ ఆ పాట పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. పార్టీ కార్యకర్తలెవరూ విమర్శలు చేయకూడదట...!! పైగా తన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాడట..!!! చెప్పేవాడు పవన్కళ్యాణ్ అయితే.. వినేవాడు..? టీడీపీ వెనుక జనసేన వెళ్లడం లేదట..!!! టీడీపీ కలిసి వెళ్తుందట..!!! రెండింటికీ తేడా ఏంటో.. పవన్ కల్యాణ్ చెబితే బాగుండేది. ఆయన్ను మోదీ..అమిత్ షా..చంద్రబాబు అర్ధం చేసుకున్నారట..!! కానీ.. జనసైనికులే అర్ధం చేసుకోలేదట..!! ఇంతకంటే జనసైనికులకు .. అవమానం ఉంటుందా..? జనసేన పుట్టినప్పటి నుంచి..జెండా పట్టింది, ఫ్లెక్సీ కట్టింది.. రోడ్డెక్కి డబ్బులు ఖర్చు పెట్టింది జనసైనికులు. జనసేన జెండా పట్టని.. మోదీ, అమిత్ షా, చంద్రబాబులు.. తనను అర్థం చేసుకున్నారని చెప్పడం.. జనసైనికులు అర్థం చేసుకోలేదని.. పవన్ చెప్పడంలో అంతర్యమేంటీ? తనను విమర్శించేవారిని.. కోవర్టులుగా పరిగణిస్తామనడం దేనికి సంకేతం? అసలు జనసేన పార్టీలో చంద్రబాబు కోవర్ట్ పవన్ కల్యాణ్ కాదా? రేపు ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రశ్నిస్తున్నారు.. నన్ను గెలిపించేలేని వారు.. ఆ ప్రశ్న అడగకూడదని పవన్ అనడం.. ఎమ్మెల్యేగా గెలిపించలేరు కాబట్టి.. ఎప్పటికీ సీఎం కాలేనని చెప్పడం చాతకానితనం కాదా? ఇప్పుడు పవన్ కల్యాణ్ గురించి ఆలోచించి.. నడవాల్సింది కాపులే... పవన్ వెంట నడిచే కాపులకు ఎప్పటికైనా వెన్నుపోటు తప్పదు 11:16 AM, Dec 2, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? 08:54 AM, Dec 2, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 08:30 AM, Dec 2, 2023 కాపులకు అన్యాయం చేశారా.? అంతే సంగతులు ఏలూరు : పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి 60 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలి : హరిరామజోగయ్య కాపులకు అన్యాయం జరక్కుండా జనసేన చూసుకోవాలని సూచన 07:04 AM, Dec 2, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! 06:56 AM, Dec 2, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! 06:48 AM, Dec 2, 2023 ఫైబర్గ్రిడ్ కేసు జనవరి 5కి వాయిదా ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు -
Dec 1st: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 6.25 PM, Dec 1, 2023 ఫైబర్గ్రిడ్ కేసు జనవరి 5కి వాయిదా ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 6.25 PM, Dec 1, 2023 తెలుగుదేశానికి జనసేన సైనికులు జై కొట్టాలి ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది : నాదెండ్ల మనోహర్ జనసేన, టీడీపీ సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నాం ఏ కార్యక్రమం జరిగినా టీడీపీతో కలిసి పనిచేయాలని పవన్ ఆదేశించారు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొనాలి వ్యక్తిగత విషయాలకు ఎవరూ పోవద్దు : నాదెండ్ల మనోహర్ 5.35 PM, Dec 1, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! (సమన్వయ కమిటీ భేటీలో లోకేష్తో పవన్) 5.10 PM, Dec 1, 2023 టీడీపీ నేత కొల్లు రవీంద్ర పై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడటమనే ఒక శాపం ఇచ్చాడు బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా సామాజిక సాధికారిక యాత్ర విజయంతం పై పట్టలేనంత కోపం ఈర్ష్య,ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు మదరాసు స్థలం మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు మీ హయాంలో పోర్ట్ కట్యకుండానే 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్ పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్ మెడికల్ కాలేజీ నా హాయం అంటున్నావు కనీసం ఒక్క జీఓ అయిన యిచ్చావా...ఇస్తే చూపించు ఈరోజు పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి చలవే ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్ ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం కానీ నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి 5.10 PM, Dec 1, 2023 మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జనసేనకు యువతే పెద్ద బలం మన పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉంది ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు నన్ను, నా భావజాలన్ని నమ్మే యువత మా వెంట వస్తున్నారు యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశాం నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తా కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే మన పార్టీకి ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చింది సమాజాన్ని ఎలా చూస్తామనే దాని పై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉంది నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది కష్టాల్లో ఉన్నాం, సాయం చేయాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పనిచేశాయి YSRCPని తట్టుకోవాలంటే కలిసి పనిచేయాలని వాళ్లు చెప్పారు అవమానం జరిగినా, దెబ్బపడినా మరిచిపోను విభజన సమయంలో ఏం కావాలో ఎవరూ గట్టిగా అడగలేదు రాష్ట్రానికి ఏం ఇస్తే ఎలాంటి లాభమో ఏ నేతలూ ఆలోచించలేదు ఒక కులం మీద రాజకీయాలు నడపలేం.. సాధ్యం కాదు కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని కోరుతున్నా ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యం పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేకమంది బెదిరించారు ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆ నాయకులకు చెప్పా మాకు ప్రజలు ముఖ్యం.. నాయకులు కాదు.. అనివార్య పరిస్థితుల్లోనే 2014లో తెదేపాకు మద్దతిచ్చాం ఆ రోజుల్లో పార్టీని నడపలేకపోయాం.. నిలబడలేకపోయాం డబ్బు లేకున్నా పట్టుదలగా పదేళ్లపాటు పార్టీని నడిపాం ఇప్పుడు మాత్రం ప్రాణం పోయేవరకు నిలబడతాం మనపార్టీ నుంచి వెళ్లిపోయినవారు తిట్టినా పట్టించుకోను మనం తెదేపా వెనుక నడవడం లేదు.. కలిసి నడుస్తున్నాం షణ్ముఖ వ్యూహంలో చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం ఏ మతం వారినైనా సనాతన ధర్మం స్వీకరిస్తుంది.. కలుపుకుంటుంది ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేస్తే ఎవరినైనా గౌరవిస్తాం మనం ఎన్ని మాట్లాడుకున్నా పోలింగ్ రోజు అనేది చాలా కీలకం: పవన్ కల్యాణ్ 4.50 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా వేసిన హైకోర్టు CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 4.05 PM, Dec 1, 2023 పొత్తుల్లో సీట్లు పోతాయి.. ఏమనుకోవద్దు.! మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం, పాల్గొన్న రాష్ట్రస్థాయి నాయకులు తెలుగుదేశంతో పొత్తును ముందుకు తీసుకెళ్లడం పై చర్చ క్షేత్రస్థాయిలో చాలా విభేదాలున్నాయని రెండు పార్టీల్లో ప్రచారం విభేదాలను పక్కనబెట్టి పొత్తు కోసం త్యాగాలు చేయాలని పవన్ పిలుపు 3.45 PM, Dec 1, 2023 కిం కర్తవ్యం.? అమరావతి: సాయంత్రం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ చంద్రబాబు కరకట్ట ఇంట్లో భేటీ పార్లమెంట్ సమావేశాల్లో ఏం చేయాలన్న దానిపై చర్చ ఢిల్లీలో ఏం చేయాలన్నదానిపై టీడీపీ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్న చంద్రబాబు 3.00 PM, Dec 1, 2023 కరకట్ట ఇంటికి చంద్రబాబు కరకట్ట ఇంటికి వచ్చిన చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టులో జనసమీకరణకు టిడిపి ప్రయత్నాలు అందుబాటులో ఉన్నవారంతా రావాలంటూ పిలుపులు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి టీడీపీ ర్యాలీ 2.30 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై హైకోర్టులో తిరిగి జరుగుతోన్న వాదనలు మధ్యాహ్న భోజన విరామం తర్వాత మళ్లీ మొదలైన వాదనలు సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు 1.00 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు బ్రేక్ లంచ్ బ్రేక్ తర్వాత హైకోర్టులో వాదనలు కొనసాగే అవకాశం 12.30 PM, Dec 1, 2023 జనసేనలో సీట్ల సెగ, పవన్కు తగులుతున్న వేడి కాపుల ప్రతినిధిగా రాజకీయాలు నడపాలని పవన్ కళ్యాణ్ వ్యూహం తాజాగా జైలు ముందు తెలుగుదేశంతో పొత్తు తర్వాత కాపుల్లో జ్ఞానోదయం తమను పవన్ కళ్యాన్ కేవలం ప్యాకేజీ కోసం వాడుకుంటున్నాడని కాపుల అనుమానం ప్రతీ మీటింగ్లో తెలుగుదేశం పార్టీకి జై కొట్టాలని కాపులకు సూచిస్తోన్న పవన్కళ్యాణ్ టికెట్లు రాకపోయినా.. సీట్లు త్యాగం చేయాలని కాపులకు పిలుపునిస్తోన్న పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు నియోజకవర్గంలో చేసిన శ్రమ, పడ్డ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో అన్న అనుమానాలు కాపు నాయకుల సీట్లన్నీ తెలుగుదేశానికి ఇచ్చేస్తే.. తమ పరిస్థితి ఏంటన్న సందేహాలు తెలంగాణలో 8 సీట్లకు రాజీ పడ్డట్టు.. ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లకు రాజీ పడితే తమ పరిస్థితి ఏంటని భయాలు త్యాగం చేయడమంటే.. తెలుగుదేశానికి జై కొట్టడమా? కాపుల రాజకీయ భవిష్యత్తుకు ఫుల్స్టాప్ పెట్టడమా? ఇంతకీ తెలుగుదేశంతో పొత్తు జనసేనకు లాభమా? లేక పార్టీ మూసుకునేంత నష్టమా? 12.30 PM, Dec 1, 2023 కాపులకు అన్యాయం చేశారా.? అంతే సంగతులు ఏలూరు : పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి 60 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలి : హరిరామజోగయ్య కాపులకు అన్యాయం జరక్కుండా జనసేన చూసుకోవాలని సూచన (ఫైల్ ఫోటో : హరిరామ జోగయ్యతో పవన్ కళ్యాణ్) 12.00 PM, Dec 1, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఏపీ హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు తనకు కావలసిన వారికి లబ్ది చేకూర్చడం కోసం IRR అలైన్మెంట్ లో చంద్రబాబు మార్పులు చేశారు లింగమనేని రమేష్ ఇంట్లో చంద్రబాబు ఉండటానికి కారణం IRR ద్వారా రమేష్ కు లబ్ది చేకుర్చటమే ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుంది చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు, పార్టీ, పార్టీ సభ్యులకు లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు రాజధాని గుర్తించటానికి ముందే రాజధాని సమీపంలోనే కీలక ప్రాంతాల్లో భూములను చంద్రబాబు సన్నిహితులు కొన్నారు 11:40 AM, Dec 1, 2023 బాబు క్వాష్ కొట్టేయడమే మిగిలిందా.? ►నేడో, రేపో బాబు క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు ►17ఏ సెక్షన్ను తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు ►చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు ►CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు ►17ఏ సెక్షన్ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న బాబు లాయర్లు ►ఏ చట్టం అయినా, ఏ సెక్షన్ అయినా అవినీతిని అడ్డుకునేదే తప్ప.. సమర్థించేది కాదన్న CID లాయర్లు ►నేరం ముందే జరిగింది, దర్యాప్తు ముందే మొదలయింది, కాబట్టి చంద్రబాబుకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్న CID లాయర్లు ►సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం ►సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు బృందం కోటి ఆశలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. మిగిలింది బెయిల్ పిటిషన్ మాత్రమే. ►క్వాష్ పిటిషన్పై నిర్ణయం తర్వాతే బెయిల్ పిటిషన్ గురించి పరిశీలించే అవకాశం 11:33 AM, Dec 1, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టిడిపి సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! 11:22 AM, Dec 1, 2023 లోకేష్ ప్రకటనలేంటీ? వాస్తవాలేంటీ? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్ పాదయాత్రలో లోకేష్ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ? అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు 11:15 AM, Dec 1, 2023 బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్ ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్రోల్ మెంట్ చేయించిన టీడీపీ తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు 11:00 AM, Dec 1, 2023 ఇవ్వాళ చంద్రబాబు కేసుల స్టేటస్.! ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ 10:42 AM, Dec 1, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? 9:20 AM, Dec 1, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 08:24 AM, Dec 1, 2023 తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు బాబు ఝలక్ ఏపీలో పవన్ ఎక్కువ సీట్లు అడగకుండా కట్టడి రాజకీయ అపరిపక్వతతో అవకాశాన్ని జారవిడుచుకున్నామంటున్న జనసేన నేతలు మరోసారి తన నైజాన్ని చాటుకున్న కరివేపాకు రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు పొత్తుల కోసం అర్రులు చాస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్కు గట్టి షాక్ ఏపీలో జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం లేకుండా తెలంగాణ ఎన్నికలను వినియోగించుకున్న చంద్రబాబు తెలంగాణలో జనసేన ఎక్కడా గెలవకుండా, వీలైతే డిపాజిట్లు కూడా రాకుండా చంద్రబాబు ఎత్తుగడ రాజకీయ వర్గాల్లో చర్చ ఒకపక్క బీజేపీతో అంటకాగుతూనే టీడీపీతో కలసి పోటీ చేస్తానంటూ రాజమహేంద్రవరం జైలు వద్ద పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది అక్కడ ఎన్నికలకు దూరంగా ఉంటూ అస్త్ర సన్యాసం చేసిన టీడీపీ లోపాయికారీగా కాంగ్రెస్కు సహకారం అందించిన విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు స్నేహహస్తం సాచిన టీడీపీ శ్రేణులు బీజేపీ–జనసేన కూటమికి దూరంగా నిలిచేలా పావులు కదిపిన చంద్రబాబు 07:59 AM, Dec 1, 2023 నేడు జనసేన విస్తృతస్థాయి సమావేశం మంగళగిరిలో పవన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం జనసేన, టీడీపీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్న పవన్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైఎస్సార్సీపీని ఎదుర్కోగలమని వివరించనున్న పార్టీ అధ్యక్షుడు పొత్తుల విషయంలో టిడిపి తో పేచీ పడకుండా రాజీ పడాలని ముఖ్య నేతలకు సూచించనున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లతోనే సర్దుకోవాలని ఇప్పటికే సంకేతాలిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు లోకేష్ పర్యటనల్లో తెలుగుదేశానికి జై కొట్టాలని జనసేన సైనికులకు సూచనలు, టికెట్ దక్కకుండా నిరాశ పడకుండా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యవర్గానికి నేడు సూచించనున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా రాబోయే ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ గారి ప్రజాబలం ముందు వాళ్ళు నిలవలేరు. అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్న @ysjagan గారి విజయం తథ్యం.#PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/s5pjyHTHYh — YSR Congress Party (@YSRCParty) November 30, 2023 07:49 AM, Dec 1, 2023 తెలుగుదేశం, జనసేన పొత్తుల వెనక పాలిట్రిక్స్ ఏంటీ? : YSRCP చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ జై పవన్ కల్యాణ్ అని ఎందుకు అంటున్నారు? లోకేష్కు ఇంకా రాజకీయం ఒంటబట్టలేదు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు చంద్రబాబు పెట్టుకున్న ఆశల్లో పది శాతం కూడా చేరలేకపోయాడు మిగిలింది పార్టీ కాడి మోసేవారొకరు కావాలి అందుకే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పరువును తాకట్టు పెట్టేశారు తనకు సరిసాటి అయిన పవన్ కళ్యాణ్ను ఎంచుకున్నాడు రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవని పవన్.. ఇప్పుడు లోకేష్కు ఆశ, భరోసా తెలంగాణలో బీజేపీతో పవన్ ఉంటాడు..!! టీడీపీ ఏమో కాంగ్రెస్కు పరోక్ష మద్దతు.. ఏపీలో మాత్రం మళ్లీ టీడీపీ - జనసేన స్నేహం..!! అసలు వీళ్లు రాజకీయం చేస్తున్నారా..? వ్యభిచారం చేస్తున్నారా...? 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 38 శాతం. జనసేనకు వచ్చిన ఓట్లు 5 శాతం.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం. టీడీపీ - జనసేన ఓట్లు కలిపినా.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు అన్ని లేవు. 2024లో టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు.. మరింత దెబ్బ పడబోతుంది...!!! ఇప్పటివరకు ఏ బీసీ ఓట్ల మీదయితే టిడిపి నమ్మకం పెట్టుకుందో..ఆ బీసీ ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడబోతున్నాయి. ఈ భయంతోనే ... పవన్ కల్యాణ్ పాట అందుకున్నారు.. చంద్రబాబు , లోకేష్...!!!! రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు.. పాదయాత్రలో లోకేష్.. వారాహి ఎక్కి పవన్ ప్రజలకు ఏం చెబుతారు..? మేం నీతిమంతులమని చెబుతారా..? మేం నిప్పులమని చెబుతారా..? మేం స్కామ్లు చేయలేదని చెబుతారా..? మీరు నీతిమంతులైతే.. మీరు స్కామ్లు చేయకపోతే.. మీరు నిప్పులే అయితే.. ధీమాగా సింగిల్గా పోటీ చేయండి 07:15 AM, Dec 1, 2023 హస్తినలో కిం కర్తవ్యం? చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ పార్లమెంట్లో ఏ ఏ అంశాలు చర్చించాలన్నదానిపై చంద్రబాబు బ్రీఫింగ్ డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్న పార్లమెంటు సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని భావిస్తోన్న తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ కోసం సర్వశక్తులు ఒడ్డిన చంద్రబాబు, తెలుగుదేశం అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితేనే.. చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు పార్లమెంటులో బీజేపీని ఇప్పటికిప్పుడు ఏం అనొద్దు, అదే సమయంలో తెర వెనక కాంగ్రెస్తో మంతనాలు కొనసాగించాలని చంద్రబాబు వ్యూహం -
Nov 30th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 4:02 PM, Nov 30, 2023 ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు : మల్లాది విష్ణు విజయవాడ: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి 2019లో చంద్రబాబు ఘోర పరాజయం పొందినా బుద్ధి రాలేదు : మల్లాది ఆంధ్ర రాష్ట్రంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, లోకేష్ గోబెల్స్ కు వారసులు ఎల్లో మీడియాలో నీచ రాతలు రాయించుకొని టిడిపి నేతలు ఆనందాన్ని పొందుతున్నారు సీఎం జగన్ సంక్షేమ పథకాలన్నీ కాపీ కొడతారు మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను చూసి చంద్రబాబు ఏడుపే ఏడుపు టీడీపీ నేతలు ప్రతిరోజు టన్నుల టన్నుల బురద జల్లుతున్నారు గోబెల్స్లా విష ప్రచారం చేస్తున్నారు విజయవాడలో దేవాలయాలను కూల్చివేసింది చంద్రబాబే రాజమండ్రి పుష్కరాల్లో 30 మందిని చంపింది చంద్రబాబే చంద్రబాబుకి జైల్లో ఉంటే అన్ని రోగాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో తిరగాలంటే ముందు దేవాలయాలకు క్షమాపణ చెప్పాలి విజయవాడలో ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చి ఆంజనేయస్వామిని ట్రాక్టర్లో తీసుకువెళ్లారు ఐదు జిల్లాల కలెక్టర్ల పై చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చాడు టిడిపి మంత్రులు అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా? ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రతిపక్షంగా ఎప్పుడైనా వ్యవహరించిందా 4:02 PM, Nov 30, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు డిసెంబర్ 12కి వాయిదా ఏపీ హైకోర్టు: ఇసుక కేసు వాయిదా ఇసుక కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 2:02 PM, Nov 30, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు డిసెంబర్ 12కి వాయిదా ఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఫైబర్ నెట్ కేసు ను డిసెంబర్ 12 తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం కేసు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం డిసెంబర్ 12 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేస్తామన్న న్యాయస్థానం 1:52 PM, Nov 30, 2023 హస్తినలో కిం కర్తవ్యం? చంద్రబాబు అధ్యక్షతన రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ పార్లమెంట్లో ఏ ఏ అంశాలు చర్చించాలన్నదానిపై చంద్రబాబు బ్రీఫింగ్ డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్న పార్లమెంటు సమావేశాలు అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని భావిస్తోన్న తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ కోసం సర్వశక్తులు ఒడ్డిన చంద్రబాబు, తెలుగుదేశం అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితేనే.. చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు పార్లమెంటులో బీజేపీని ఇప్పటికిప్పుడు ఏం అనొద్దు, అదే సమయంలో తెర వెనక కాంగ్రెస్తో మంతనాలు కొనసాగించాలని చంద్రబాబు వ్యూహం 1:33 PM, Nov 30, 2023 తిరుమలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి తిరుపతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు కుటుంబసభ్యులతో రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు రాత్రికి తిరుమలలో బస చేయనున్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం అమరావతికి రానున్న చంద్రబాబు డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు డిసెంబర్ 3న విశాఖకు రానున్న చంద్రబాబు డిసెంబర్ 3న సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్న చంద్రబాబు డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు 12:05 PM, Nov 30, 2023 ఆ సలహా ఇచ్చింది ఎవర్రా? తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం లోకేష్కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి? పవన్ కళ్యాణ్కు జై కొట్టమని లోకేష్కు సలహా ఇచ్చింది ఎవరు? తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్కు అర్థమవుతోందా? తన కెరియర్తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు కాపుల కోసం పవన్కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం? అసలు పవన్కళ్యాణ్కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్కు ఏం లాభం? పైగా పవన్ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు? 11:45 AM, Nov 30, 2023 ఆడలేక మద్దెల ఓడు చందాన టిడిపి తీరు ఏపీలో ఎన్నికలపై తప్పుడు ప్రచారం సోషల్మీడియాలో తెలుగుదేశం దుష్ప్రచారం ఏపీలో ఎన్నికలు ముందస్తుగా వస్తాయని తెగ పోస్టులు ఎల్లో మీడియాలోనూ అవే సంకేతాలిస్తూ వార్తలు ముందస్తుకు అవకాశం లేదని స్పష్టంగా చెబుతోన్న ప్రభుత్వం ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి : సజ్జల లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు : సజ్జల ఎన్నికలు ఎప్పుడొచ్చినా YSRCP సిద్ధంగా ఉంది: సజ్జల టిడిపి, జనసేన చేసే ప్రచారం నమ్మొద్దని సూచన 10:50 AM, Nov 30, 2023 చంద్రబాబు కేసు సుప్రీంలో ఎప్పుడంటే.? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు చంద్రబాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది మధ్యాహ్నం 2 తర్వాత బెంచ్ మీదకు చంద్రబాబు పిటిషన్ వచ్చే అవకాశం (చదవండి.. ఫైబర్గ్రిడ్ కేసులో నిధులెలా పక్కదారి పట్టించారు?) 10:45 AM, Nov 30, 2023 చంద్రబాబు తిరుమల పర్యటన ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో చంద్రబాబు పర్యటన మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు తిరుమలలో రాత్రి బస చేయనున్న చంద్రబాబు నాయుడు రేపు ఉదయం శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకోనున్న చంద్రబాబు 10:32 AM, Nov 30, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు డిసెంబర్ 5కు వాయిదా ఐఆర్ఆర్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ చంద్రబాబును కస్టడీకి కోరుతూ గతంలో పీటీ వారెంట్ వేసిన సీఐడీ విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసిన న్యాయస్థానం CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 10:14 AM, Nov 30, 2023 తెలుగుదేశం, జనసేన పొత్తుల వెనక పాలిట్రిక్స్ ఏంటీ? : YSRCP చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ జై పవన్ కల్యాణ్ అని ఎందుకు అంటున్నారు? లోకేష్కు ఇంకా రాజకీయం ఒంటబట్టలేదు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు చంద్రబాబు పెట్టుకున్న ఆశల్లో పది శాతం కూడా చేరలేకపోయాడు మిగిలింది పార్టీ కాడి మోసేవారొకరు కావాలి అందుకే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పరువును తాకట్టు పెట్టేశారు తనకు సరిసాటి అయిన పవన్ కళ్యాణ్ను ఎంచుకున్నాడు రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవని పవన్.. ఇప్పుడు లోకేష్కు ఆశ, భరోసా తెలంగాణలో బీజేపీతో పవన్ ఉంటాడు..!! టీడీపీ ఏమో కాంగ్రెస్కు పరోక్ష మద్దతు.. ఏపీలో మాత్రం మళ్లీ టీడీపీ - జనసేన స్నేహం..!! అసలు వీళ్లు రాజకీయం చేస్తున్నారా..? వ్యభిచారం చేస్తున్నారా...? 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 38 శాతం. జనసేనకు వచ్చిన ఓట్లు 5 శాతం.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం. టీడీపీ - జనసేన ఓట్లు కలిపినా.. వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు అన్ని లేవు. 2024లో టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు.. మరింత దెబ్బ పడబోతుంది...!!! ఇప్పటివరకు ఏ బీసీ ఓట్ల మీదయితే టిడిపి నమ్మకం పెట్టుకుందో..ఆ బీసీ ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడబోతున్నాయి. ఈ భయంతోనే ... పవన్ కల్యాణ్ పాట అందుకున్నారు.. చంద్రబాబు , లోకేష్...!!!! రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు.. పాదయాత్రలో లోకేష్.. వారాహి ఎక్కి పవన్ ప్రజలకు ఏం చెబుతారు..? మేం నీతిమంతులమని చెబుతారా..? మేం నిప్పులమని చెబుతారా..? మేం స్కామ్లు చేయలేదని చెబుతారా..? మీరు నీతిమంతులైతే.. మీరు స్కామ్లు చేయకపోతే.. మీరు నిప్పులే అయితే.. ధీమాగా సింగిల్గా పోటీ చేయండి 10:04 AM, Nov 30, 2023 నమ్మకం లేకే పొత్తులు పెట్టుకున్నారు.. దమ్ముంటే సింగిల్గా రండి : YSRCP 40 ఏళ్ల చరిత్ర... 25 ఏళ్ల అధికారం.. కానీ.. జనసేనకు జై అంటోన్న టీడీపీ..!!! దీని అర్ధం ఏమంటే.. దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్దంగా ఉందని..!! తెలుగోడి ఆత్మగౌరవం నుంచి.. పుట్టిన పార్టీ టీడీపీ జాతీయ స్థాయిలో... లోక్ సభలో ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ ఎన్టీఆర్ నాయకత్వంలో .. కాంగ్రెస్ పునాదులను కదిలించిన పార్టీ టీడీపీ. 1983-89, 1994-2004, 2014-19లో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ..!!!! 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ.. ఇప్పుడు 5 శాతం ఓటు బ్యాంక్ ఉన్న జనసేనకు.. జై కొడుతోంది....!!!! ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కున్న తరువాత.. పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి.. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి .. పోవడం దీనికి ప్రధాన కారణం. చంద్రబాబు ప్రజలను నమ్ముకోకుండా.. మీడియా నమ్ముకోవడం.. టీడీపీ ప్రస్తుత దుస్థితికి కారణం. 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1995లో మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. చంద్రబాబు సీఎం సీటు ఆక్రమించాడు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ఉమ్మడి ఏపీలో 185 సీట్లు గెల్చుకున్నాడు. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంలో .. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కొట్టుకుపోయింది. 47 సీట్లకు పరిమితమైంది. 2009లో చంద్రబాబు గ్రాండ్ అలయన్స్.. ఏర్పాటు చేసినా వైఎస్ఆర్ సునామీలో.. కొట్టుకుపోయాడు. 2009లో వైఎస్ఆర్ అకాల మరణంతో.. చంద్రబాబు రాజకీయంగా బతికాడే కానీ.. లేకపోతే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడేది 2014లో విభజిత ఏపీలో.. చంద్రబాబు బీజేపీ, పవన్ కల్యాణ్లను పక్కన .. పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే... టీడీపీ గెల్చిన సీట్లు 102...!! 2019లో టీడీపీ ఘోరంగా ... 23 సీట్లకే పరిమితమైంది..!!! 08:54 AM, Nov 30, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్ పాదయాత్రలో లోకేష్ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ? అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు 07:54 AM, Nov 30, 2023 చంద్రబాబు పిటీ వారెంట్పై విచారణ వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్పై విచారణ విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్ 5కు వాయిదా ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ భూ దోపిడీకి పాల్పడిన కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు ఇందులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై కేసు నమోదు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ 07:43 AM, Nov 30, 2023 నోటీసులు అందని వారికి మీరే అందజేయండి చంద్రబాబు ‘స్కిల్’ కేసులో ఉండవల్లి అరుణ్కుమార్కు హైకోర్టు వెసులుబాటు విచారణ డిసెంబర్ 13కి వాయిదా స్కిల్ స్కాం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్కుమార్ పిటిషన్ నోటీసులు అందని వారికి వాటిని ఆయనే అందజేయవచ్చని హైకోర్టు వెసులుబాటు నోటీసులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే దాఖలు చేయవచ్చు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో అనేక క్లిష్టమైన అంశాలు సీబీఐ దర్యాప్తు చేయడమే సబబుగా ఉంటుందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ సరైన చిరునామాలు లేకపోవడం వల్ల పలువురికి నోటీసులు అందలేదని తెలిసిన ధర్మాసనం 07:27 AM, Nov 30, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? చంద్రబాబు స్కాం సిత్రాలు…! Unveiling the ‘Scam Sitralu of @ncbn’ series, exposing Chandrababu’s scams. Stay tuned for full episodes.#CBNScamSitralu pic.twitter.com/REzeh8q7Au — YSR Congress Party (@YSRCParty) November 29, 2023 07:20 AM, Nov 30, 2023 నేడు తిరుపతికి చంద్రబాబు అమరావతి : నేడు సాయంత్రం తిరుపతికి చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు దర్శనం తర్వాత తిరుపతి నుంచి విజయవాడకు చంద్రబాబు 07:15 AM, Nov 30, 2023 బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్ ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్రోల్ మెంట్ చేయించిన టీడీపీ తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు -
Nov 29th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 6:42 PM, Nov 29, 2023 బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్ ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్రోల్ మెంట్ చేయించిన టీడీపీ తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు 6:22 PM, Nov 29, 2023 బీటెక్ రవికి బెయిల్ బీటెక్ రవికి బెయిల్ మంజూరు చేసిన కడప కోర్టు పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవిని పాత కేసులో ఈ నెల 14న అరెస్ట్ చేసిన పోలీసులు నారా లోకేష్ పర్యటనలో పోలీసులపై దౌర్జన్యం చేసిన బీటెక్ రవి బీటెక్ రవి దాడిలో ఓ పోలీసు కాలుకు గాయం, ఫ్యాక్చర్ క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచిన సమయంలో సింహాద్రిపురంలో బీటెక్ రవి వివాదస్పద వ్యాఖ్యలు "జూదం మా బ్లడ్లోనే ఉంది" అంటూ నాడు బీటెక్ రవి వ్యాఖ్యలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి దందాలు, దౌర్జన్యాలు 6:15 PM, Nov 29, 2023 ఎస్సీలంతా YSRCPకే ఓటేస్తే పరిస్థితి ఎలా? గుంటూరు తెదేపా కార్యాలయంలో ఎస్సీ విభాగం సమావేశం తెలుగుదేశం కార్యాలయంలో భేటికి హాజరైన టిడిపి, జనసేన నేతలు ఎస్సీల ఓట్లన్నీ YSRCPకే పడతాయని ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం, జనసేన ఉధృతంగా ప్రచారం చేయాలి మరో సారి ఎస్సీలంతా YSRCPకే అవకాశం ఇస్తే మన పరిస్థితి ఏంకావాలి? తెలుగుదేశం, జనసేన పొత్తు జయప్రదం చేయడానికైనా ఎస్సీలు కలిసిరావాలి 5:45 PM, Nov 29, 2023 రేపు తిరుపతికి చంద్రబాబు అమరావతి : రేపు సాయంత్రం తిరుపతికి చంద్రబాబు డిసెంబర్ 1న శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు దర్శనం తర్వాత తిరుపతి నుంచి విజయవాడకు చంద్రబాబు 5:20PM, Nov 29, 2023 చంద్రబాబు చరిత్ర అంతా నేరాల మయమే : అనిల్కుమార్ యాదవ్ కృష్ణాజిల్లాలో మాట్లాడిన మాజీ మంత్రి,అనిల్ కుమార్ యాదవ్ సామాజిక సాధికార యాత్ర ఎందుకో రాష్ట్రమంతా పర్యటించి తెలియజేస్తున్నాం బిసిలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పాడు చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50% శాతం అవకాశం కల్పించారు 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బిసిలమైన మేము సున్నాలమే మీ దృష్టిలో సున్నాలమైన మమ్మల్ని జగన్ మోహన్ రెడ్డి నాయకులను, మంత్రులను చేశారు మన తరాలు...తలరాతలు మారాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు గతంలో ఎంతమందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలు ఇచ్చాడు ఓ పది వేల మందికి కత్తెరలు, ఇస్త్రీపెట్టెలతో మసిపూసి మారేడుకాయ చేశారు నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండని చెప్పే ధైర్యం జగనన్నకు తప్ప ఎవరికైనా ఉందా ప్రజలను ముంచేందుకు మళ్లీ తండ్రీ కొడుకులు రెఢీ అవుతున్నారు చంద్రబాబు మత్స్యకారుడిని తోలుతీస్తానన్నాడు జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించారు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారు విశాఖలో బోట్లు తగలబడితే కేవలం నాలుగు రోజుల్లో వారికి సాయం అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం కులం పేరుతో ఒకాయన పార్టీ పెట్టాడు చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తానంటున్నాడు కాపులంతా ఆలోచన చేయాలి రాబోయే ఎన్నికలు బక్కవాడికి...బలిసినోడికి మధ్య యుద్ధం తండ్రిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క బిసి మంత్రి కూడా లేడు కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక బిసినైన నన్ను మంత్రిని చేశారు గొర్రెలు,పశువులు కాసేవాడికి పదవులిచ్చారని టీడీపీ నేతలు ఎగతాళి చేశారు ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా గొర్రెలు,పశువుల కాపరే ఏసు ప్రభువు పుట్టింది కూడా పశువుల పాకలోనే మాలాంటి గొర్రెలు,పశువులు కాసే వ్యక్తులు పాలు పితికి ఇస్తే...వాటి పై సంపాదించిన వేలకోట్లే మీ హెరిటేజ్ ఆస్తి 4:50PM, Nov 29, 2023 లోకేష్ పై మంత్రి అంబటి ఫైర్ తూర్పు గోదావరి : లోకేష్ పాదయాత్ర ఓ కామెడీ షో ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు టీడీపీ కి లోకేష్ శనిలా దాపురించారు : అంబటి 4:05PM, Nov 29, 2023 YSRCPది నమ్మకం, TDPది మోసం కురుపాంలో వైఎస్సార్సిపి బస్సు యాత్ర ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ : వైసీపీ నేతలు హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబువి గోబెల్స్ ఆలోచనలైతే ... సీఎం జగన్వి గ్లోబల్ ఆలోచనలు రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగనన్నే భవిష్యత్తు అంటున్నారు బాబూ.. మీదంతా నాటకం అంటున్నారు అర్హులైన అందరికీ సంక్షేమ పధకాలు అందించిన నాయకుడు జగన్ చంద్రబాబు మాటలు నమ్మితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే నిజం చెప్పే అలవాటు చంద్రబాబుకు లేదు చంద్రబాబు మేనిఫెస్టో వెబ్ సైట్ లో ఉండదు మా పాలనలో మేలు జరిగితేనే ఓటు వేయండని జగన్ చెబుతున్నారు జగన్ను ఓడిస్తామంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్ ఢీ కొట్టేందుకు వీరంతా ఒక్కటవుతున్నారంటేనే అయన బలం అర్ధమవుతుంది వైఎస్ జగన్ కు జనబలమే ఆయుధం 3:45PM, Nov 29, 2023 మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్కు సీఐడీ జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-19గా ఉన్న వరుణ్ కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కోరిన సీఐడీ తదుపరి విచారణ డిసెంబర్ 6వ తేదీకి వాయిదా 3:40PM, Nov 29, 2023 ఇన్నర్రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా తదుపరి విచారణ శుక్రవారం(డిసెంబర్1కి)వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 3:30PM, Nov 29, 2023 స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన ఉండవల్లి కొందరికి మాత్రమే నోటీసులు అందాయన్న పిటిషనర్ తరఫు లాయర్లు తదుపరి విచారణ డిసెంబర్ 30కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 3:20PM, Nov 29, 2023 చంద్రబాబు కేసు : సుప్రీంకోర్టులో వాయిదా చంద్రబాబుకు ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టులో విచారణ వాయిదా తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా వేసిన ధర్మాసనం చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా 3:10PM, Nov 29, 2023 నారాయణ క్వాష్ పిటిషన్ వాయిదా అసైన్డ్ భూముల కుంభకోణంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మాజీ మంత్రి నారాయణ ఆయన బినామీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ తదుపరి విచారణ డిసెంబర్ 11కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 1:56 PM, Nov 29, 2023 పవన్ కళ్యాణ్ను రాజకీయనాయకుడిగా లెక్కలోకి తీసుకోవడం లేదు విజయవాడలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరుగుతాయి అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అవకాశాలు పెరుగుతున్నప్పుడు సాంకేతికత వచ్చినపుడు కులవృత్తులు కూడా మారుతాయి. కత్తెర్లు, ఇస్త్రిపెట్టెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా? లేక ఉన్నత చదువు.. మారుతున్న భవిష్యత్ వైపు అడుగులు వేయిస్తున్న జగన్ కావాలా? అనేది ఆలోచించాలి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒకటి కాదు మూడు చేస్తామని చెప్తాడు జగన్ రూపాయి చేస్తే చంద్రబాబు పది చేస్తానంటారు ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అని నమ్మితేనే ఓట్లేయమబే నాయకుడు జగన్ మాత్రమే ఇలాంటి వారిని రాజకీయాలలో ఎప్పుడైనా చూశారా? బిసిల అభ్యున్నతికి జగన్ ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం జగన్ ఆలోచన. అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా చేయూత ఇస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు స్వార్థపూరిత ఆలోచనలతో హామీలు ఇస్తున్నారు ఎన్నికలప్పుడు చిల్లర వేషాలు వేసే నాయకులు కావాలా? పూర్తి స్థాయి చేయూత అందించే వారు కావాలా? జగన్ రూపాయి చేస్తే నేను 10 రూపాయలు చేస్తా అని చంద్రబాబు అంటున్నారు 2014-19 మధ్యలో ఎందుకు చేయలేదు? నావల్ల మేలు జరిగితేనే ఓటు వేయండి అని జగన్ అడుగుతున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ ను మేము లెక్కల్లోకి తీసుకోవడం లేదు చంద్రబాబు కావాలా? జగన్ కావాలా? తేల్చుకోవాలి 1:56 PM, Nov 29, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్ పాదయాత్రలో లోకేష్ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ? అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు (ఇటీవల సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ మాట్లాడుతుండగా అలకిస్తోన్న లోకేష్) 1:06 PM, Nov 29, 2023 ఓటుతో తెలుగుదేశం దుర్మార్గ రాజకీయాలు: మంత్రి జోగి రమేష్ ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ వాళ్లు మాపై ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు చెబుతారు లక్షల ఓట్లు చేర్పించారని ఇంకోరోజు రాయిస్తారు ఎలాగో ఓడిపోతామని తెలిసే ఇలాంటి రాతలు రాయిస్తున్నారు ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మేం మొదటి నుంచి చెబుతున్నాం ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం తెలుగుదేశం దురుద్దేశపూర్వకంగా కొందరికి రెండు, మూడు చోట్ల ఓట్లు చేర్పించినట్టు తెలిసింది తెలంగాణలో ఉన్నవారి ఓట్లను కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు ఈ అక్రమాలకు పక్కా ప్లాన్తో టిడిపి చేయిస్తోంది వీటిపై మళ్లీ పచ్చమీడియాలో వార్తలు రాయిస్తోంది ఎన్నికల సంఘం విచారణలో ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ప్రతీ ఓటును ఆధార్తో లింకు చేస్తే తెలుగుదేశం దుర్మార్గాలన్నీ బయటకు వస్తాయి 70 రోజులు పారిపోయిన లోకేష్.. మంత్రులకు భయం చూపుతాడా? వచ్చే ఎన్నికల్లో మేమే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పుల్స్టాప్ పెడతాం 12:39 PM, Nov 29, 2023 చంద్రబాబు, లోకేష్లకు అడ్డం తిరిగిన టిడిపి ఆస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా? (ఫైల్ ఫోటో : ఇటీవల లోకేష్తో జడ శ్రవణ్) 12:19 PM, Nov 29, 2023 వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..! చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్ ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ బాలకృష్ణ చేసిన "అన్స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా? 12:01 PM, Nov 29, 2023 నారాయణ పిటిషన్ వాయిదా అసైన్డ్ భూముల కేసులో మాజీమంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ వాయిదా 11:55 AM, Nov 29, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మలుపుల కేసు @ హైకోర్టు ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్పై విచారణ ఎల్లుండికి వాయిదా ఐఆర్ఆర్ మాస్టర్ప్లాన్లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 11:23 AM, Nov 29, 2023 స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ స్కిల్ స్కాం కేసులో మరింత లోతుగా విచారణ జరిపించడంతో పాటు సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ కొందరికే నోటీసులు అందాయని, మరి కొందరికి అందలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన పిటిషనర్ తరఫున న్యాయవాదులు 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చాం మిగతా వారి అడ్రస్లు తప్పుగా ఉండటంతో అవి చేరలేదని కోర్టుకు తెలిపిన రిజిస్ట్రార్ వీరికి పర్సనల్ నోటీసులు ఇవ్వటానికి అనుమతి కోరిన పిటిషనర్ కొత్త అడ్రసులతో మళ్లీ ఫ్రెష్ నోటీసులు ఇవ్వటానికి అనుమతి ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసిన హైకోర్టు 11:03 AM, Nov 29, 2023 చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు.. విచారణ వాయిదా చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టులో విచారణ తదుపరి విచారణ జనవరి రెండోవారానికి వాయిదా వేసిన ధర్మాసనం ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో వినతి 10:54 AM, Nov 29, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామిలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ 10:06 AM, Nov 29, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో వినతి 9:23 AM, Nov 29, 2023 తెలుగుదేశం హామీలు, వాగ్దానాలంటే ఇలా ఉంటాయి మరి.! చంద్రబాబు అరెస్ట్ అయితే 150 మంది చనిపోయారు అని చెప్పినారు అని పచ్చ మీడియాలో తెగ ప్రచారం చేశారు. వాళ్లకు భువనేశ్వరి చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేసి ఆర్ధిక సాయం చేస్తారని దండోరా వేశారు నిజం గెలవాలి అని భువనేశ్వరీని రంగంలోకి దింపారు 3 కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వగానే ఖర్చు పెరిగిపోయిందని గుర్తొచ్చింది మిగిలిన 147 మంది సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయారు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ల సంగతి ఆక్..పాక్..కరివేపాక్..! అంతేలే.. వాళ్ల ఘన చరిత్ర తెలియంది కాదు 2014లో అయితే ఏకంగా మ్యానిఫెస్టో మాయం చేశారు ఎన్నో చెబుతారు.. అన్నీ సందర్భాన్ని బట్టి మరిచిపోతారు.. జనం కూడా మరిచిపోయారనుకుని మళ్లీ మాయమాటలు చెబుతున్నారు 7:38 AM, Nov 29, 2023 సెక్షన్ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం సెక్షన్ 17aతో ముడిపడి ఉన్న చంద్రబాబు కేసులు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్కిల్ కేసులో అరెస్ట్ కాగానే సెక్షన్ 17a రాగం అందుకున్న చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ మెలిక నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోని చంద్రబాబు సుప్రీంకోర్టులో సెక్షన్ 17aపై సుదీర్ఘ వాదనలు CID తరపున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వేర్వేరు కేసుల్లో సెక్షన్ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించిన ఇరు పక్షాలు సెక్షన్ 17aను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్న రాజ్యాంగ నిపుణులు చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన తప్పించుకునే అవకాశం ఉండరాదంటున్న నిపుణులు సెక్షన్ 17aపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి వేర్వేరు కేసుల్లో ముందడుగు 7:09 AM, Nov 29, 2023 ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముఖ్య నేతల అపాయింట్మెంట్లు లేక నిరాశతో తిరుగు ప్రయాణం ఢిల్లీలోని జాకీర్హుస్సేన్ మార్గ్లో ఉన్న ప్రముఖ హోటల్లో బస చేసిన చంద్రబాబు మంగళవారం ఉదయం టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రామ్మోహన్నాయుడులతో భేటీ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ అనంతరం సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు గుంటూరు ప్రభాకర్, గుంటూరు ప్రమోద్, ప్రేరణ తదితరులు కలిశారు. సుప్రీంకోర్టులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్నెట్ కేసులపై న్యాయవాదులతో చర్చ సోమవారం మధ్యాహ్నం తన సతీమణితో కలిసి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ విందుకు హాజరు ఈ పర్యటనలో పలువురు ముఖ్య నేతలను ఆయన కలుస్తారనే ప్రచారం జరిగింది కానీ, ఎవరి అపాయింట్మెంట్లు లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన చంద్రబాబు 7:01 AM, Nov 29, 2023 లోకేష్ చెబుతున్నదేంటీ? వాస్తవాలేంటీ? లోకేష్ : స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? వాస్తవాలు: 3300 కోట్ల ‘స్కిల్’ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదు అని సీమెన్స్ కంపెనీ చెప్పింది ఆ పేరుతో టెండర్ లేకుండా రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్కు డబ్బు చేరినట్టు ఆధారాలు సేకరించింది వారి మధ్య కోడ్ భాషలో నిధుల హవాలా జరిగినట్టు తేల్చింది రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో రూ.241 కోట్లు హవాలా మార్గంలో 6 షెల్ కంపెనీల ద్వారా మళ్లీ బాబుకు చేరినట్టు తేల్చింది ఈ స్కిల్ కుంభకోణం డబ్బులో రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి ఒకసారి అమరావతి కాంట్రాక్టర్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో లోకేష్ అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ నిర్మాణ వ్యయంలో (20 శాతం) రూ.119 కోట్లు ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని కాంట్రాక్టర్ అయిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఆగష్టు 4న కేంద్ర సంస్థ ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) రూ.2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లబ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పడం లేదేందుకు లోకేష్? 6:59 AM, Nov 29, 2023 చంద్రబాబుకు ‘సుప్రీం’ నోటీసులు బెయిల్ రద్దుపై డిసెంబర్ 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయండి స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే బెయిల్ రద్దుపై విచారణ జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టీకరణ తదుపరి విచారణ 11వ తేదీకి వాయిదా -
చంద్రబాబుకు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన బెయిలు రద్దు పిటిషన్లో సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపింది. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిలు రద్దుచేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఏపీ సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిలు సమయంలో హైకోర్టు విధించిన షరతులు పొడిగించాలని కోరారు. దీంతోపాటు కేసు గురించి పబ్లిక్ డొమైన్లో ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలన్నారు. ఈ సమయంలో.. కోర్టులో ఉన్న అంశాలపై శాఖ అధికారులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ ఆరోపించారు. ఇరుపక్షాలకు ఈ షరతు వర్తించేలా చూడాలని అభ్యర్థించారు. అగర్వాల్ వాదనకు ఏపీ సీఐడీ తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అభ్యంతరం తెలిపారు. షరతులనేవి నిందితులకే వర్తిస్తాయని.. ప్రభుత్వానికి వర్తించవని చెప్పారు. అయితే, మీరు వాయిదా కోరుతున్నారా.. అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రతివాదికి నోటీసులు జారీచేయాలని రోహత్గి బదులిచ్చారు. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్లో మెరిట్స్పై నిర్ధారణలు ఉన్నాయని, ఇది రూ.300 కోట్ల ప్రజాధనం మళ్లించిన కేసు అని వివరించారు. ఏపీ సీఐడీ విజ్ఞప్తిని ధర్మాసనం అనుమతించింది. చంద్రబాబుకు నోటీసులు జారీచేస్తున్నామని, నవంబరు 3వ తేదీన ఏపీ హైకోర్టు విధించిన షరతుల్లో బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం లేదా పాల్గొనడం మినహా అన్నీ వర్తిస్తాయని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు డిసెంబర్ 8కి వాయిదా
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను సుప్రీంకోర్టు డిసెంబర్ 8కి వాయిదా వేసింది. బాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారించింది. ప్రాథమిక వాదనల అనంతరం కేసును వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు డిసెంబర్ 8వ తేదీకి విచారణ వాయిదా బెయిల్ కండిషన్లు అన్నీ యథాతధం స్కిల్ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో తొలగించిన హై కోర్ట్ హైకోర్టు తొలగించిన షరతును తిరిగి చంద్రబాబుకు విధించిన సుప్రీంకోర్టు ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా స్కిల్ స్కాం కేసులో ఇటీవల బాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది .అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు బాబుపై పలు ఆంక్షలు విధించింది. సెక్షన్ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. చంద్రబాబు కేసులన్నీ సెక్షన్ 17a తో ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ కాగానే సెక్షన్ 17a రాగం అందుకున్నారు. తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ మెలిక పెట్టారు. నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోకుండా.. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు లాయర్లు ఇవే వాదనలు వినిపించారు. గత నెలలో సుప్రీంకోర్టులోనూ సెక్షన్ 17aపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. CID తరపున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వేర్వేరు కేసుల్లో సెక్షన్ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించాయి ఇరు పక్షాలు. మొత్తమ్మీద ఈ కేసులో కీలకమైన సెక్షన్ 17a, దాని చుట్టూ ఇరుపక్షాలు చేస్తున్న వాదనలను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. చదవండి: గత రెండు నెలలుగా గాడి తప్పిన తెలుగుదేశం -
చంద్రబాబు కేసు.. సీఐడీ పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈరోజు చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్ 64గా లిస్ట్ అయ్యింది. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరింది. ఏపీ సీఐడీ పిటిషన్లో కీలక అంశాలు.. చంద్రబాబుకు బెయిల్ విషయంలో పరిధి దాటింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది మినీ ట్రయల్ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం -
Nov 28th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 3:00 PM, Nov 28, 2023 సెక్షన్ 17aపై ఇప్పటివరకు ఏ కోర్టు ఏమి చెప్పింది? పట్నా హైకోర్టు ‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ కర్ణాటక హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ (డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది) సెక్షన్ 17aను కోర్టులు ఏ రకంగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాయి? ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు సీఐడీ న్యాయవాదుల వాదనలను పట్నా, కర్ణాటక కేసులు బలపరుస్తున్నాయి చంద్రబాబు ఈ సెక్షన్ ద్వారా రక్షణ పొందడానికి ఎందుకు అర్హులు కారో సులభంగా అర్థం చేసుకోవచ్చు కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదని పట్నా కోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్లో కూడా ప్రజాధనం రూ.371 కోట్లు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారిమళ్లించారని కేంద్ర జీఎస్టీ అధికారులు నిగ్గు తేల్చారు. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ కింద రక్షణ పొందలేరు స్కిల్ స్కామ్లో చంద్రబాబు పూర్తి అవగాహనతోనే అవినీతికి పాల్పడ్డారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు కీలక పోస్టులు కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తూ నోట్ ఫైళ్లపై 13 సంతకాలు చేశారు. సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది. ఏపీ ఏసీబీకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆయన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. కాబట్టి ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించదు ఆన్నది కర్ణాటకలో డీకే శివకుమార్ కేసు ద్వారా స్పష్టమైంది. స్కిల్ స్కామ్లో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిపి ప్రజాప్రతినిధిపై కేసు పెట్టడం చెల్లదన్న డీకే శివకుమార్ వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పూర్తిగా అసంబద్దమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2:50 PM, Nov 28, 2023 సెక్షన్ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం సెక్షన్ 17aతో ముడిపడి ఉన్న చంద్రబాబు కేసులు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్కిల్ కేసులో అరెస్ట్ కాగానే సెక్షన్ 17a రాగం అందుకున్న చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ మెలిక నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోని చంద్రబాబు సుప్రీంకోర్టులో సెక్షన్ 17aపై సుదీర్ఘ వాదనలు CID తరపున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వేర్వేరు కేసుల్లో సెక్షన్ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించిన ఇరు పక్షాలు సెక్షన్ 17aను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్న రాజ్యాంగ నిపుణులు చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన తప్పించుకునే అవకాశం ఉండరాదంటున్న నిపుణులు సెక్షన్ 17aపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి వేర్వేరు కేసుల్లో ముందడుగు 2:40 PM, Nov 28, 2023 చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు CID దాఖలు చేసిన పిటిషన్లో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు డిసెంబర్ 8వ తేదీకి విచారణ వాయిదా బెయిల్ కండిషన్లు అన్నీ యథాతధం స్కిల్ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి 2:30 PM, Nov 28, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ పిటిషన్లో CID వాదనలు చంద్రబాబుకు బెయిల్ విషయంలో పరిధి దాటింది సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది మినీ ట్రయల్ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం 1:30 PM, Nov 28, 2023 బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు : YSRCP ఏలూరు జిల్లా : కైకలూరులో YSRCP బస్సుయాత్రలో మంత్రి,కారుమూరి నాగేశ్వరరావు జగన్ మోహన్ రెడ్డి చెప్పినవి...చెప్పనివి చేస్తున్న గొప్ప మనిషి క్యాబినెట్ లో 70% బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయంతో అధికారం కట్టబెట్టిన ఆ సామాజికవర్గానికి మేలు చేశారు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బిసిలకు ఏం చేశాడు? చంద్రబాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించావా? వందల కోట్లకు చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలను సైతం కౌంటర్లు పెట్టుకుని చంద్రబాబు అమ్మేసుకున్నాడు ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు మా వాళ్లకే పనులు చేయండని కలెక్టర్లకు చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఓటేసినా ..వేయకపోయినా అందరికీ మంచి చేయమని చెప్పారు రాజకీయంగా ఇక చంద్రబాబు పనైపోయింది ఈ ప్రభుత్వం పై కుళ్లుతో చంద్రబాబు,ఎల్లో మీడియా బురద జల్లుతున్నారు సామాజిక న్యాయం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డే మళ్లీ కావాలని ప్రజలు కోరుతున్నారు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు, పవన్ కళ్యాణ్ చీల్చడానికి ఏమీ లేదు 12:00 PM, Nov 28, 2023 లోకేశ్, చంద్రబాబుకు విజయసాయి కౌంటర్ ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి. ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్ గారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 28, 2023 RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) పెరిగింది. చంద్రబాబు హయాంలో (2018-19) కంటే ఇప్పుడు రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగులీనుతోంది. గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేది. పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ! RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) చంద్రబాబు గారి హయాంలో (2018-19) కంటే రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగులీనుతోంది. గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేది. పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 28, 2023 11:09 AM, Nov 28, 2023 లోకేష్ చెబుతున్నదేంటీ? వాస్తవాలేంటీ? లోకేష్ : స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? వాస్తవాలు : 3300 కోట్ల ‘స్కిల్’ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదు అని సీమెన్స్ కంపెనీ చెప్పింది ఆ పేరుతో టెండర్ లేకుండా రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్కు డబ్బు చేరినట్టు ఆధారాలు సేకరించింది వారి మధ్య కోడ్ భాషలో నిధుల హవాలా జరిగినట్టు తేల్చింది రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో రూ.241 కోట్లు హవాలా మార్గంలో 6 షెల్ కంపెనీల ద్వారా మళ్లీ బాబుకు చేరినట్టు తేల్చింది ఈ స్కిల్ కుంభకోణం డబ్బులో రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి ఒకసారి అమరావతి కాంట్రాక్టర్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో లోకేష్ అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ నిర్మాణ వ్యయంలో (20 శాతం) రూ.119 కోట్లు ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని కాంట్రాక్టర్ అయిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఆగష్టు 4న కేంద్ర సంస్థ ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) రూ.2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లబ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పడం లేదేందుకు లోకేష్? 10:52 AM, Nov 28, 2023 తెలుగుదేశం హామీలు, వాగ్దానాలంటే ఇలా ఉంటాయి మరి.! చంద్రబాబు అరెస్ట్ అయితే 150 మంది చనిపోయారు అని చెప్పినారు అని పచ్చ మీడియాలో తెగ ప్రచారం చేశారు. వాళ్లకు భువనేశ్వరి చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేసి ఆర్ధిక సాయం చేస్తారని దండోరా వేశారు నిజం గెలవాలి అని భువనేశ్వరీని రంగంలోకి దింపారు 3 కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వగానే ఖర్చు పెరిగిపోయిందని గుర్తొచ్చింది మిగిలిన 147 మంది సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయారు బెయిల్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ల సంగతి ఆక్..పాక్..కరివేపాక్..! అంతేలే.. వాళ్ల ఘన చరిత్ర తెలియంది కాదు 2014లో అయితే ఏకంగా మ్యానిఫెస్టో మాయం చేశారు ఎన్నో చెబుతారు.. అన్నీ సందర్భాన్ని బట్టి మరిచిపోతారు.. జనం కూడా మరిచిపోయారనుకుని మళ్లీ మాయమాటలు చెబుతున్నారు 10:33 AM, Nov 28, 2023 మా పాదయాత్రకు బ్రేక్ పడింది.. సారీ.. మళ్లీ వస్తున్నా 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత కొనసాగుతున్న యువగళం బ్రేక్ విషయాన్ని కవర్ అప్ చేసేందుకు ప్రచారం పెంచాలని అడుగుతోన్న లోకేష్ అన్ని కులాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్లు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు టార్గెట్లు పెడుతోన్న టిడిపి అధిష్టానం లోకేష్ను అన్ని కులాల వారి దగ్గరకు తీసుకెళ్లాలని ఆదేశం ఇవ్వాళ బీసీ సంఘాల నేతలతో లోకేష్ సమావేశం అనంతరం చేనేత కార్మికులతో లోకేష్సమావేశం ఆ తర్వాత దివ్యాంగులతో లోకేష్ భేటీ ఆ తర్వాత గంగిరెడ్డి సామాజికవర్గీయులతో లోకేష్ భేటీ మధ్యాహ్నం కాపులతో లోకేష్ సమావేశం భోజనం సమయంలో ఎస్సీలతో లోకేష్ భేటటీ ఆ తర్వాత కొందరు యువకులు, విద్యార్థులతో మాట, ముచ్చట సాయంత్రం గున్నేపల్లిలో స్థానికులతో లోకేష్ సమావేశం రాత్రి ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి సమీపంలో లోకేష్ బస ఎల్లో మీడియాలో ప్రచారం బాగా రావాలని సూచించిన లోకేష్ 10:33 AM, Nov 28, 2023 చంద్రబాబు కేసు @ ఐటం నెంబర్ 64 ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఐటెం నెంబర్ 64 గా లిస్ట్ అయిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని వినతి 10:14 AM, Nov 28, 2023 క్షమించడానికైనా ఓ లెక్క ఉండాలప్ప.! క్షమించాలి... ప్లీజ్.. నన్ను క్షమించాలి : లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చినందుకు క్షమించాలి నిజాలు ఎప్పుడు చెబుతావు లోకేష్ ? : YSRCP తండ్రి జైలుకు వెళ్లగానే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఢిల్లీ పారిపోయావు అరెస్ట్ చేయబోమని కోర్టులో CID చెప్పిన తర్వాతైనా పాదయాత్ర ప్రారంభించలేదు.! పాదయాత్ర చేయకపోతే పరువు పోతుందని పార్టీ సీనియర్లు చెప్పినా వినలేదు.! నేను నడవను గాక.. నడవనంటూ హైదరాబాద్కు పరిమితమయ్యావు శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు నడవమని చంద్రబాబు చెబితే వినలేదు.! విశాఖతో సరిపెడతానంటూ పేచి పెట్టిన విషయం ప్రజలకెందుకు చెప్పలేదు? పార్టీకి ఏం ప్రయోజనం ఉంటే నాకెందుకు? నేనేందుకు నడవాలని గొడవ పెట్టుకున్న విషయం ఎందుకు చెప్పలేదు? చేసిందంతా చేసి.. ఇప్పుడు జనం మధ్యలోకొచ్చి క్షమించమని అడుగుతున్నావా? 8:55 AM, Nov 28, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఐటెం నెంబర్ 64 గా లిస్ట్ అయిన కేసు పిటీషన్లో కీలక అంశాలు: బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించింది దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది ఇదీ చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి 8:49 AM, Nov 28, 2023 చంద్రబాబు సచ్చీలుడని కోర్టు చెప్పలేదు: ఎంపీ మార్గాని భరత్ స్కిల్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు అన్ని విషయాలను పరిశీలించింది తప్పు జరిగిందని నిర్ధారించుకున్నాకే చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానాలేమీ చంద్రబాబు సచ్చీలుడని బెయిల్ ఇవ్వలేదు స్కిల్ స్కాం జరిగింది కాబట్టే సెంట్రల్ జైలులో 52 రోజులు రిమాండ్లో ఉన్నారు స్కిల్ స్కామ్ జరగలేదని స్పష్టంగా ఎక్కడా చంద్రబాబు తరఫు న్యాయవాదులు చెప్పడం లేదు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రజాధనం రూ.375 కోట్లను అడ్డదార్లలో ఇంటికి సూట్ కేసుల ద్వారా రప్పించుకున్నది వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తామేమీ ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ కంపెనీ స్పష్టంగా చెప్పింది 7:11 AM, Nov 28, 2023 నేడు సుప్రీంకోర్టు ముందుకు స్కిల్ స్కాం కేసు స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు బెయిల్ను సుప్రీంకోర్టులో సవాలు చేసిన CID నేడు విచారణకు రానున్న CID పిటిషన్ సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశారు. మరి 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు అమలు చేసిన నాలుగు పథకాలు చెప్పగలరా? అయినా ఎల్లో మీడియా మాత్రం ఏవో ఘోరాలు జరిగిపోతున్నట్టు గగ్గోలు పెడుతోంది. - వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… pic.twitter.com/NkLQgvOZg7 — YSR Congress Party (@YSRCParty) November 27, 2023 7:00 AM, Nov 28, 2023 ఢిల్లీలో దిగగానే రాజకీయం షురూ.! ఢిల్లీకి చంద్రబాబు రాగానే ఎయిర్పోర్టుకు వచ్చేసిన రఘురామ కృష్ణరాజు హైదరాబాద్లోనూ చంద్రబాబును కలిసిన రఘురామ కృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోన్న రఘురామ కృష్ణరాజు గత కొన్నాళ్లుగా తెలుగుదేశం ఎజెండాను ఫాలో అవుతోన్న రఘురామ కృష్ణరాజు ఎల్లోమీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడంలో సిద్ధహస్తుడైన రఘురామ అబద్దాలు, అసత్యాలు, నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న రఘురామ చంద్రబాబు కోసం ఢిల్లీలో లాయర్ల ఆఫీసులు తిరిగిన రఘురామ లోకేష్ ఢిల్లీలో ఉన్నన్నాళ్లు కావాల్సిన ఏర్పాట్లు చేసిన రఘురామ 6:59 AM, Nov 28, 2023 ఢిల్లీకి చంద్రబాబు టిడిపి లాయర్ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు చంద్రబాబుతో పాటు వెంట వెళ్లిన నారా భువనేశ్వరి రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్ రద్దు పిటిషన్ ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్ 17ఏ కేసు క్వాష్ పిటిషన్పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ఎయిర్పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలికిన కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామకృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు 6:56 AM, Nov 28, 2023 స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ 6:53 AM, Nov 28, 2023 ఈనెల 30న తిరుమల వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ 1న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు అదే రోజు అమరావతి తిరిగిరానున్న చంద్రబాబు తర్వాత రోజుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాలకు చంద్రబాబు -
Nov 27th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 07:29PM, Nov 27, 2023 ఈనెల 30న తిరుమల వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ 1న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు అదే రోజు అమరావతి తిరిగిరానున్న చంద్రబాబు తర్వాత రోజుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు డిసెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాలకు చంద్రబాబు 6:05 PM, Nov 27, 2023 ప్రభుత్వంపై పచ్చపత్రికల విషం ఇంకెన్నాళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్, YSRCP ప్రభుత్వంపై టన్నుల కొద్దీ విషాన్ని చిమ్ముతున్న రామోజీ, రాధాకృష్ణ ఎల్లో మీడియా ఉగ్రవాదం స్థాయి దాటి.. బరితెగించింది. సచ్ఛీలుడివైనట్లు ప్రవచనాలు వల్లిస్తే ఎలా రామోజీ..? ఆ పత్రికలు టీడీపీ కరపత్రాల స్టేజ్ దాటిపోయి.. కరదీపికలుగా మారాయి. జగన్ గారు 99 శాతం హామీలు అమలు చేస్తే.. మిగిలిన ఆ ఒక్క శాతం మీద రాస్తారు బాబు కోసం..ఇక్కడేదో ఘోరాలు జరుగుతున్నట్లు నిత్యం రోత రాతలు చంద్రబాబు అక్రమాల సంగతేంటీ? పారదర్శకంగా ఇసుక విధానం అమలు చేస్తున్నాం ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగినప్పుడు మీ రాతలేమయ్యాయి? నాడు ఎన్జీటీ వంద కోట్ల పెనాల్టీ వేసినప్పుడు మీ రాతలు ఏమయ్యాయి ..? కానుకల పేరుతో హెరిటేజ్ మజ్జిగ టెండర్ను కొట్టేసింది చంద్రబాబు కాదా..? ఉచితంగా పత్రిక పంచుతారా? అసలు నీకు 175 స్థానాలకూ అభ్యర్థులున్నారా బాబూ..? విషాన్ని మరింత ఎక్కించేందుకు ఉచితంగా ఈనాడు పంపిణీ వీళ్ల ఎల్లో రాతలతో చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నాడు. రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు జగన్గారు అండగా నిలిచారు అందుకే మేం ఇంత ధీమాగా ఉన్నాం. మా ప్రభుత్వంలో టీడీపీ వారికి ఒక్కరికైనా సంక్షేమం ఆగిందా? చివరికి రాజకీయాన్ని వ్యభిచారంలా చంద్రబాబు అండ్ కో మార్చారు లోకేశ్ పాదయాత్రపై భయాన్ని పరిచయం చేసే వాడివి ఢిల్లీ ఎందుకు పారిపోయావ్ లోకేశ్..? అసలు భయం, భయపడటం అనే ప్రశ్న రాజకీయాల్లో ఎందుకొస్తుంది..? ఆఫ్ చేసిన లోకేశ్ టేప్ రికార్డర్ మళ్లీ మొదలైంది 5:15 PM, Nov 27, 2023 ఢిల్లీలో దిగగానే రాజకీయం షురూ.! ఢిల్లీకి చంద్రబాబు రాగానే ఎయిర్పోర్టుకు వచ్చేసిన రఘురామ కృష్ణరాజు హైదరాబాద్లోనూ చంద్రబాబును కలిసిన రఘురామ కృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోన్న రఘురామ కృష్ణరాజు గత కొన్నాళ్లుగా తెలుగుదేశం ఎజెండాను ఫాలో అవుతోన్న రఘురామ కృష్ణరాజు ఎల్లోమీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడంలో సిద్ధహస్తుడైన రఘురామ అబద్దాలు, అసత్యాలు, నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న రఘురామ చంద్రబాబు కోసం ఢిల్లీలో లాయర్ల ఆఫీసులు తిరిగిన రఘురామ లోకేష్ ఢిల్లీలో ఉన్నన్నాళ్లు కావాల్సిన ఏర్పాట్లు చేసిన రఘురామ 4:25 PM, Nov 27, 2023 ఢిల్లీకి చంద్రబాబు ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి లాయర్ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు చంద్రబాబుతో పాటు వెంట వెళ్లిన నారా భువనేశ్వరి రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్ రద్దు పిటిషన్ ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్ 17ఏ కేసు క్వాష్ పిటిషన్పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ఎయిర్పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలికిన కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామకృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు 3:45PM, Nov 27, 2023 లోకేష్పై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ విజయవాడ: లోకేష్ ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేశాడా? చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటే లోకేష్ మాట్లాడలేదు అంబేద్కర్ విగ్రహం ముళ్లపొదల్లో పెట్టాలని బాబు చూశాడు చంద్రబాబు దళితులను అవమానించాడు.. దాడులు చేయించాడు బాబు, జగన్కు నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి లోకేష్కు, చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదు ఐదేళ్ల పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు మాకు సమవుజ్జీకాని వ్యక్తి,రాజకీయాల్లో లేని లోకేష్కు మేం సమాధానం చెప్పనవసరం లేదు 2:50PM, Nov 27, 2023 ఎల్లోమీడియా టీడీపీ కరపత్రం స్టేజ్ దాటిపోయింది: సజ్జల 2014-18 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏం చేశారు? ఇప్పుడు టీడీపీ పెట్టిన వంద పథకాలు ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు నాడు కనీసం ఒక పథకాన్ని అయినా బాబు పూర్తిగా అమలు చేశారని చెప్పగలరా? టీడీపీ నేతలు బరితెంగించారు. గతంలో ఉచితంగా ఇసుక అని చెప్పారు. ఇసుక ఉచితమైతే దెందలూరు ఎమ్మెల్యే ఎమ్మార్వోతో ఎందుకు అలా ప్రవర్తించారు ఇసుక ఉచితమైతే.. జేసీబీలు ఎవరు పెట్టారు. ఎన్జీటీ వంద కోట్ల పెనాల్టీ ఎందుకు వేసింది. చంద్రబాబు పెట్టిన పథకాలు ఉంటే కదా జగన్ వచ్చి తీసివేయడానికి. ఇసుక అక్రమ దందాలో అందినకాడికి టీడీపీ నేతలు దోచుకున్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతీచోటా ఇసుక దందా చేసింది టీడీపీనే మా ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ అర్హత ఉన్న వారికి ఎక్కడైనా పథకం ఆగిందా చెప్పాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు సవాల్ ఎల్లోమీడియా టీడీపీ కరపత్రం స్టేజ్ దాటిపోయింది 2:47 PM, Nov 27, 2023 క్షమించడానికైనా ఓ లెక్క ఉండాలప్ప.! క్షమించాలి... ప్లీజ్.. నన్ను క్షమించాలి : లోకేష్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చినందుకు క్షమించాలి నిజాలు ఎప్పుడు చెబుతావు లోకేష్ ? : YSRCP తండ్రి జైలుకు వెళ్లగానే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఢిల్లీ పారిపోయావు అరెస్ట్ చేయబోమని కోర్టులో CID చెప్పిన తర్వాతైనా పాదయాత్ర ప్రారంభించలేదు.! పాదయాత్ర చేయకపోతే పరువు పోతుందని పార్టీ సీనియర్లు చెప్పినా వినలేదు.! నేను నడవను గాక.. నడవనంటూ హైదరాబాద్కు పరిమితమయ్యావు శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు నడవమని చంద్రబాబు చెబితే వినలేదు.! విశాఖతో సరిపెడతానంటూ పేచి పెట్టిన విషయం ప్రజలకెందుకు చెప్పలేదు? పార్టీకి ఏం ప్రయోజనం ఉంటే నాకెందుకు? నేనేందుకు నడవాలని గొడవ పెట్టుకున్న విషయం ఎందుకు చెప్పలేదు? చేసిందంతా చేసి.. ఇప్పుడు జనం మధ్యలోకొచ్చి క్షమించమని అడుగుతున్నావా? 2:27 PM, Nov 27, 2023 మద్యం కేసు .. తీర్పు రిజర్వ్ ఏపీ హైకోర్టు: గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు పూర్తయిన ఇరుపక్షాల వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు 2:15 PM, Nov 27, 2023 నిజాలు చెప్పవా.. నారా లోకేష్.? లోకేష్ చంద్రబాబును జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుందని అనుకున్నారు స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? వ్యవస్ధలను మేనేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారు నాపై కూడా సిఐడి కేసులు పెట్టారు.. ఒక్క ఆధారం లేదు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా లోకేష్ వ్యాఖ్యలపై YSRCP సూటి ప్రశ్నలు చంద్రబాబు, లోకేష్ తప్పు చేయలేదని కోర్టుకు ఎందుకు చెప్పలేదు? 17a సెక్షన్ కింద మినహాయింపు ఎందుకు అడుగుతున్నారు? గవర్నర్ ముందస్తు అనుమతి అంటున్నారు తప్ప.. మా తప్పేమీ లేదని ఎందుకు చెప్పరు? మీ వాదనలో పస ఉంటే.. సుప్రీంకోర్టు దాకా ఎందుకు? ప్రజల ముందు అబద్దాలు ఇంకెన్నాళ్లు చెబుతారు? CID కోర్టుకు ఇచ్చిన ఆధారాల గురించి ప్రజలకు చెప్పరా? 2:04 PM, Nov 27, 2023 మద్యం కేసు @ హైకోర్టు మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పై విచారణ లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు 1:30 PM, Nov 27, 2023 బీటెక్ రవి రిమాండ్ పొడిగింపు బీటెక్ రవికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు వచ్చే నెల 11 వరకు రిమాండ్ పొడిగించిన కడప మెజిస్ట్రేట్ బీటెక్ రవిని కడప కోర్టు నుంచి జైలుకు తరలింపు నారా లోకేష్ పర్యటనలో పోలీసులపై దౌర్జన్యం చేసిన బీటెక్ రవి బీటెక్ రవి దాడిలో ఓ పోలీసు కాలుకు గాయం, ఫ్యాక్చర్ క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచిన సమయంలో సింహాద్రిపురంలో బీటెక్ రవి వివాదస్పద వ్యాఖ్యలు "జూదం మా బ్లడ్లోనే ఉంది" అంటూ నాడు బీటెక్ రవి వ్యాఖ్యలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి దందాలు, దౌర్జన్యాలు 12:48 PM, Nov 27, 2023 సంగం డెయిరీ పేరిట టిడిపి మోసం ఏలూరు జిల్లా : సంగం డెయిరీ చైర్మన్,టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతుల డిమాండ్ ఏలూరు స్పందన లో ఫిర్యాదు చేసిన రైతులు బోనస్ 14% ఇస్తామని ఆశ చూపి తమని మోసం చేశారని ఫిర్యాదు అడిగితే.. దాడులు చేశారని చెప్పిన చింతలపూడి, దెందులూరు కు చెందిన రైతులు పాడి రైతులకు పార్టీలు ఆపాదిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోపరేటివ్ సొసైటీ నీ కంపెనీ యాక్ట్ లోకి తెచ్చి రైతులను మోసం చేస్తున్నారనీ స్పష్టం చేసిన రైతులు సంగం డెయిరీ యాజమాన్యం నుండి తమకు రావలసిన 14% బోనస్ ఇప్పించాలని కోరుతున్న రైతులు భవిష్యత్తులో పాడి రైతులు నష్టపోకుండా సంగం డెయిరీ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు 12:28 PM, Nov 27, 2023 సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ 10:04 AM, Nov 27, 2023 రేపు సుప్రీంకోర్టు ముందుకు స్కిల్ స్కాం కేసు స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు బెయిల్ను సుప్రీంకోర్టులో సవాలు చేసిన CID రేపు విచారణకు రానున్న CID పిటిషన్ 9:43 AM, Nov 27, 2023 ఇసుక కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇసుక కుంభకోణం ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు చంద్రబాబు వచ్చాక పలు మార్పులు తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్లు అప్పగిస్తున్నామని ప్రకటన మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యం చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు CID నమోదు చేసిన కేసులో చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్ పై విచారణ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్న చంద్రబాబు APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ ఇసుక స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్లు విచారణకు చంద్రబాబు సహకరిస్తారు, ముందస్తు బెయిల్ ఇవ్వండి 2016లో కేబినెట్ ఆమోదంతోనే అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది 2019లో సీఎంగా చంద్రబాబు పదవీకాలం ముగిసింది 2023లో APMDC ఫిర్యాదు చేసింది : చంద్రబాబు లాయర్లు 9:30 AM, Nov 27, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : నవంబర్ 28వరకు చంద్రబాబుపై ఆంక్షలు, చికిత్స చేయించుకున్న వివరాలు సమర్పించాలని ఆదేశం కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 29కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 30కి వాయిదా పడ్డ విచారణ 8:45 AM, Nov 27, 2023 యువగళం.. హస్యగళం.? లోకేష్ యాత్రపై అంబటి చురకలు ఎవరి కోసం? ఎందు కోసం? ప్రజలు నవ్వుకోడానికి తప్ప యువగళం ఇంకెందుకు? ప్రారంభమయిన "హాస్యగళం" విని, చూసి........నవ్వుకోండి ! @naralokesh — Ambati Rambabu (@AmbatiRambabu) November 27, 2023 8:45 AM, Nov 27, 2023 యువగళం.. ఎంతవరకు? రాజమండ్రి వచ్చిన లోకేష్ చాలా రోజుల తర్వాత ప్రజల ముందుకు వస్తోన్న లోకేష్ వాయిదాల పర్వం తర్వాత మొదలైన యువగళం అప్పుడు విరామం ప్రకటించిన పొదలాడు నుంచే యాత్ర ప్రారంభం ఉదయం 10:19 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం ప్రజల దృష్టి ఏమార్చేందుకు పార్టీ శ్రేణులను భారీగా రప్పించిన తెలుగుదేశం ఘనస్వాగతం పలికి లోకేష్లో జోష్ తీసుకురావాలని సూచించిన చంద్రబాబు పాదయాత్రలో కచ్చితంగా పాల్గొనాలని అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జ్లకు ఆదేశం పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురంలోకి పాదయాత్ర ఇప్పటివరకు 209 రోజుల్లో 2,852 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర రాజోలు, పి. గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో యాత్ర జనసేన కార్యకర్తలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు కచ్చితంగా కనిపించాలని పవన్కళ్యాణ్కు ఆదేశాలు లోకేష్ యాత్ర విజయవంతమయిందన్న పేరు వస్తేనే కూటమికి మనుగడ అంటోన్న చంద్రబాబు 8:42 AM, Nov 27, 2023 ఢిల్లీకి చంద్రబాబు, క్వాష్పై కింకర్తవ్యం? ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు తమ లాయర్ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్లనున్న చంద్రబాబు చంద్రబాబుతో పాటు వెళ్లనున్న నారా భువనేశ్వరి రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్ రద్దు పిటిషన్ ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్ 17ఏ కేసు క్వాష్ పిటిషన్పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు 8:24 AM, Nov 27, 2023 నోరు జారి.. కడుపుమంట బయటపెట్టి..! నేడు బండారు అరెస్ట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల కేసులో బండారు అరెస్ట్ పై పిటిషన్ 8:04 AM, Nov 27, 2023 మద్యం కేసు @ హైకోర్టు అమరావతి: మద్యంకేసుపై నేడు హైకోర్టులో విచారణ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ఇష్టానుసారంగా తన వాళ్ల మద్యం కంపెనీలకు అనుమతులిచ్చిన చంద్రబాబు చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం 7:41 AM, Nov 27, 2023 టీడీపీ నిర్వాకం.. లండన్లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా ఇళ్లలోకి చొరబడి వివరాలు సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ మేనిఫెస్టో వెబ్సైట్కి ఆ వివరాలు అనుసంధానం ఆ సమాచారం అంతా లండన్లోని సర్వర్లో నిక్షిప్తం ఇందుకోసం ప్రజల ఫోన్ నంబర్లు, వారి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి రాజకీయ అవసరాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టిన చంద్రబాబు ఓటర్ల తనిఖీ పేరుతో వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగేలా వ్యవహరిస్తూ.. అడ్డదారుల్లో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలపై ప్రజలు తిరగబడుతున్నారు. మొన్న రాజంపేటలో నిన్న నెల్లూరులో టీడీపీ కార్యకర్తలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. #EndOfTDP pic.twitter.com/LrEKkEzYXa — YSR Congress Party (@YSRCParty) November 26, 2023 7:00 AM, Nov 27, 2023 నేటి నుంచే లోకేష్ యువగళం పాదయాత్ర యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభం కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్ ఈరోజు ఉదయం 10.19 గంటలకు యువగళం పాదయాత్ర ప్రారంభం మొదటి రోజు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ ఇచ్చాపురం వరకు చేయాలన్న చంద్రబాబు, విశాఖతో సరిపెడతానన్న చిన్నబాబు 6:50 AM, Nov 27, 2023 నేడు ఢిల్లీకి చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్కు హాజరుకానున్న చంద్రబాబు రేపటి వరకు ఢిల్లీలోనే చంద్రబాబు బస 6:45 AM, Nov 27, 2023 స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ మంగళవారం చంద్రబాబు పిటిషన్పై సుప్రీంలో విచారణ పిటిషన్లో కీలక అంశాలు: బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది కేసు మెరిట్స్ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్ పిటిషన్ సమయంలోనే వ్యాఖ్యానించింది దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో బెయిల్ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను హరించడమే ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు దర్యాప్తు సమయంలో బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది 6:40 AM, Nov 27, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రచారం ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 6:30 AM, Nov 27, 2023 నవంబర్ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు నవంబర్ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్ 30తో తెలంగాణ ఎన్నికలు సైకిల్ రిపేర్కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి? ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్ వినడాయే? రెగ్యులర్గా ఏపీలో ఉండి వారాహి యాత్ర చేయమంటే పవన్ వినడాయే? నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే? కనీసం సింగిల్గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే? పవన్ కళ్యాణ్ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా? ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు? ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది? కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి? జనసేనకు కేటాయించే సీట్లపై టీడీపీ క్యాడర్కు ఏమని చెప్పాలి? -
స్కిల్ స్కామ్ సూత్రదారి చంద్రబాబే అనడానికి పక్కా ఆధారాలు.. పరారీలో కీలక సాక్ష్యులు... రెగ్యులర్ బెయిల్ మీద చంద్రబాబు...
-
హైకోర్టు తీర్పును రద్దు చేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. ఇందులో నారా చంద్రబాబు నాయుడిని ప్రతివాదిగా చేర్చింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. హైకోర్టు స్కిల్ కుంభకోణంలో సీఐడీ చేసిన ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లి చంద్రబాబుకు క్లీన్చీట్ ఇచ్చిందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఒకవైపు కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని చెబుతూ, మరో వైపు సీఐడీ ఆరోపణలు, అందుకు సమర్పించిన ఆధారాలు, ఇతర అంశాల పూర్వాపరాల్లోకి వెళ్లి హైకోర్టు తీర్పు వెలువరించిందని వివరించింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు లోతుల్లోకి వెళ్లకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా హైకోర్టు వ్యవహరించిందని స్పష్టం చేసింది. హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ను డిశ్చార్జ్ పిటిషన్ను విచారించినట్లు విచారించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపించింది. ‘హైకోర్టు స్కిల్ కుంభకోణం కేసు లోతుల్లోకి వెళ్లి మరీ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్దం. ట్రయల్ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉంది. బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఏకంగా 39 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది. రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్దంగా హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది’ అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్ధేశించిన పరిధుల అతిక్రమణ ‘ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదు. దానిని రద్దు చేయాలి. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టంగా తేల్చిన న్యాయపరమైన కొలమాలన్నింటినీ హైకోర్టు తన తీర్పు ద్వారా అతిక్రమించింది. బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సాక్ష్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించడం, కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీవ్రంగా తప్పుపట్టింది. మినీ ట్రయల్ కూడా నిర్వహించకూడదని చెప్పింది, అయితే హైకోర్టు ఏకంగా ట్రయల్ నిర్వహించింది. బెయిల్ మంజూరు సందర్భంగా సీఐడీ ఆరోపణలను, వారి తీవ్రతను, డాక్యుమెంట్ల విశ్వసనీయతను, సాక్ష్యాల విలువను హైకోర్టు తన తీర్పులో తేల్చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక కొలమానాలన్నింటికి విరుద్దంగా వ్యవహరించింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ నమోదు చేసిన కేసు ప్రభావితం అయ్యేలా హైకోర్టు వ్యవహరించింది. దుర్వినియోగం చేసిన నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారని తేల్చేందుకు నిర్ధిష్ట ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశాల జోలికి వెళ్లరాదు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న బెయిల్ పిటిషన్ను అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వర్గాలు సీఐడీ దర్యాప్తునకు అడ్డుగోడలా నిలబడ్డాయి. సీఐడీ సమన్లకు ఏ మాత్రం సహకరించలేదు. సీఐడీ సమన్లకు టీడీపీ వర్గాలు స్పందించలేదన్న వాస్తవాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మనీ లాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిధులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై నిర్ధిష్ట ఆధారాలున్నాయి. వాటిని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. అన్నీ అంశాలపై ఏపీ సీఐడీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపు జరగలేదని తేల్చడం ద్వారా హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. స్కిల్ కుంభకోణానికి సంబంధించి సీమెన్స్ కంపెనీ అంతర్గతంగా నిర్వహించిన విచారణను, దాని తాలుకు నివేదికను హైకోర్టు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అసలు ఆ నివేదికలో ఏమీ లేదని తేల్చేసింది’ అని వివరించింది. స్పష్టంగా నగదు జాడలు ‘ప్రాజెక్టు విలువ రూ.36 కోట్లు అని చంద్రబాబు తదితరులు చెబుతున్నారు. అలా అయితే గత ప్రభుత్వం రూ.370 కోట్లు ఎందుకు విడుదల చేసినట్లు? మిగిలిన రూ.280 కోట్లు దారి మళ్లినట్లే. ఎంవోయూ, జీవో ప్రకారం అందచేయాల్సిన సాంకేతికతను సీమెన్స్, డిజైన్ టెక్లు అందించలేదన్నది వాస్తవం. అయితే సీఐడీ ఈ అంశాన్ని లేవనెత్తలేదని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. వాస్తవానికి రిమాండ్లోనూ, హైకోర్టు వాదనల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తాం. ఫోరెన్సిక్ ఆడిట్ను ప్రతికూల కోణంలో చూడటం ద్వారా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించినట్లయింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొత్తం విజయమైందని, దీని ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు తేల్చింది. ఇలా చెప్పడం ద్వారా హైకోర్టు తప్పు చేసింది. హైకోర్టు చెప్పింది ఎంత మాత్రం వాస్తవం కాదు. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చే అధికారం చంద్రబాబుకు ఉందని హైకోర్టు తేల్చింది. ఒకవేళ అలాంటిది ఉందని అనుకున్నా, చంద్రబాబు తన, షెల్ కంపెనీల స్వీయ లబ్ధి కోసం దురుద్దేశపూర్వకంగా ఆ అధికారాన్ని ఉపయోగించారు. ఈ విషయాన్ని హైకోర్టు తన తీర్పులో పూర్తిగా విస్మరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి సీమెన్స్, డిజైన్టెక్ ఉద్యోగులు ఇచ్చిన వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ప్రాజెక్టులో రాజకీయ జోక్యం ఉందని, ప్రాజెక్టు అమలుకు అడ్డువచ్చిన వారిని 24 గంటల్లో బదిలీ చేశారన్న వాంగ్మూలాలను పట్టించుకోలేద’ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం! ‘సీమెన్స్, డిజైన్టెక్ నుంచి రావాల్సిన 90 శాతం నిధులు రాలేదని, అందువల్ల ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం నిధులను చెల్లించడం సరికాదన్న అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోని విషయాన్ని హైకోర్టు పూర్తిగా విస్మరించింది. అవినీతి నిరోధక చట్టం మౌలిక సూత్రాల నుంచి, పబ్లిక్ సర్వెంట్ అధికారం దుర్వినియోగం వంటి వాటి నుంచి హైకోర్టు దూరంగా వెళ్లింది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే విషయంపై హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంత మాత్రం హేతుబద్దమైనవి కావు. తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడం, కీలక నిందితులు సీఐడీ ముందుకు రాకపోవడం వంటి వాటి విషయంలో చంద్రబాబు పాత్ర ఉన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. దర్యాప్తును ప్రభావితం చేయడం, సాక్షులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తుకు విఘాతం కలిగేలా కొందరు నిందితులు మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు సహకరించడం లేదు. చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా క్లీన్ చిట్ ఇచ్చే అంశంగా పరిగణించి ఆదేశాలు ఇచ్చినట్లు ఉంది. వీటన్నింటిరీత్యా చంద్రబాబు జుడీషియల్ రిమాండ్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో వివరించింది. క్వశ్చన్ ఆఫ్ లా.. హైకోర్టు తీర్పులో పలు అంశాలపై అనుమానాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ‘క్వశ్చన్ ఆఫ్ లా’కి సంబంధించి పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ఎదుట ఉంచింది. హైకోర్టు కసరత్తులో న్యాయపరమైన విధానం లోపించిందా? దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, నిందితుడి నేరానికి సంబంధించిన అంశాలపై హైకోర్టు వ్యాఖ్యలు న్యాయపరమైన అంశాలకు విరుద్ధంగా ఉన్నాయా? బెయిల్పై పిటిషనర్ల వాదనలు లేనప్పుడు హైకోర్టు విస్తృతమైన తీర్పు ఇవ్వగలదా? పీసీ చట్టం 1988 ప్రకారం అధికారిక నిర్ణయాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా భావించొచ్చా? అధికారం, అధికార వినియోగం, అధికారిక పరిధి లేకపోవడం, అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం, ఇతరులకు సొమ్ము రూపంలో లబ్ధి చేకూర్చడం తదితరాలపై హైకోర్టు నిర్ణయం సరైనదేనా?’ అనే ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచింది. నిరంజన్సింగ్ వర్సెస్ ప్రభాకర్ రాజారామ్, సుమిత్ శుభాచంద్ర గంగ్వాల్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో తీర్పులతోపాటు స్కిల్ స్కామ్ కేసులో సాక్ష్యాధారాలను వివరించే అంశాన్ని హైకోర్టు పదేపదే తిరస్కరించిందని పేర్కొంది. సంగీతబెన్ వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావిస్తూ ప్రస్తుత కేసులో హైకోర్టు ఆయా అంశాలను పరిశీలించకుండా బెయిల్ కేసును మినీ ట్రయల్గా మార్చిందని, ట్రయల్ కోర్టు పనితీరును విస్మరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒక్క కేసు పరిశీలనతోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టవచ్చని నివేదించింది. -
ఓటర్ ఐడీకార్డు తీసుకొని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు
-
చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడికి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ను పూర్తిస్థాయి బెయిల్గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తాత్కాలిక బెయిల్ సందర్భంగా జారీచేసిన బెయిల్ బాండ్ ఆధారంగా చంద్రబాబును విడుదల చేయాలని ఆదేశించింది. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడంగానీ చేయరాదంటూ అప్పట్లో విధించిన షరతులను హైకోర్టు సడలించింది. అయితే, బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, పరిధి దాటినట్లనిపిస్తోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. చంద్రబాబు నాయుడు లేవనెత్తని పలు అంశాల జోలికి హైకోర్టు వెళ్లింది. వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండకూడదు. అందువల్ల హైకోర్టు తీర్పు లోపభూయిష్టం. బెయిల్ దశలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించింది. ఆధారాల గురించి హైకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాల విషయంలో పరిధి దాటింది. దర్యాప్తు కొనసాగుతుండగా దర్యాప్తులో లోపాలను ప్రస్తావించింది. బెయిల్ పిటిషన్ విచారణను అడ్డంపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు అడ్డుగోడలా నిలిచాయి. సీఐడీ కోరిన వివరాలు ఏ మాత్రం అందజేయలేదు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి తీర్పునివ్వడం ద్వారా కింది కోర్టు అధికారాల్లో హైకోర్టులో జోక్యం చేసుకున్నట్లయింది. వాస్తవానికి బెయిల్ కేసుల్లో కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లకూడదు. బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగే సమయంలో చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలను వినిపించలేదు. దీనిపై సీఐడీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ అభ్యంతరాన్ని హైకోర్టు రికార్డ్ కూడా చేసింది. ఈ బెయిల్ పిటిషన్ విషయంలో హైకోర్టు తీరు అసాధారణం. ఆరోపణలు, దర్యాప్తుపై కింది కోర్టు చేయాల్సిన పూర్తిస్థాయి ట్రయిల్ను హైకోర్టు నిర్వహించినట్లయింది.’ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
Nov 21st: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 4:45PM, Nov 21, 2023 ఫైబర్నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ కోర్టు ఆదేశం చంద్రబాబు సన్నితులైన ఏడుగురు నిందితులకు చెందిన రూ. 114 కోట్ల ఆస్తుల జప్తునకు సీఐడీని ఆదేశించిన ఏసీబీ కోర్టు రూ. 114 కోట్ల ఆస్తుల జప్తు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు మరో నిందితుడి ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్ ఫైబర్నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోయమయ్యాయని ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు ఈ కేసులో ఏ-1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ-25గా చంద్రబాబు పేర్లు తుమ్మలు గోపీచంద్, ఆయన భాయ్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్గూడ, జూబ్లిహిల్స్ కాలనీ, చిన్న మంగళారంలో ఇళ్లు రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్, ఫైబర్ సొల్యూషన్స్ డైరెక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరులో ఇంటి స్థలం, విశాఖ కిర్లంపూడి లే అవుట్లోని ఒక ప్లాట్ అటాచ్ 4:08PM, Nov 21, 2023 చంద్రబాబు కేసులో ఏపీ హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతంగా లేదు పొన్నవలు సుధాకర్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్కిల్ స్కాం కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది బెయిల్ స్టేజ్ లోనే సాక్షాలు లేవని ఏపీ హైకోర్ట్ అనడం సరైనది కాదు హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది ఇది అసాధారణమైన విషయం చార్జీ షీట్ వేయనంతవరకు దర్యాప్తు కొనసాగుతున్నట్లే టిడిపి అకౌంట్లో ఊరు పేరు లేని నగదు జమయింది దీనిపైన దర్యాప్తు జరుగుతోంది ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది సిమెన్స్ అంతర్గత నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్లో అక్రమాలు బయటపడ్డాయి ఏపీ హైకోర్టు ఈ కేసులో మినీ ట్రయల్ జరిపింది మినీ ట్రైలర్ నిర్వహించడం చట్ట విరుద్ధం ఇది సామాజిక ఆర్థిక కుంభకోణం 371 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచేశారు 3:50PM, Nov 21, 2023 ఎల్లో గ్యాంగ్పై సజ్జల ఫైర్ పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోంది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఆ పార్టీ ఏ మాత్రం తీసిపోదు దొంగల పార్టీ అధికారంలోకివస్తే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మోసం చేయడంలో కొత్త టెక్నిక్స్ టీడీపీకి బాగా తెలుసు చంద్రబాబుకు అమలు చేయాలనే ఉద్దేశం లేని హామీలు ఇచ్చారు హామీల అమలేదని అడుగుతారని వెబ్సైట్ నుంచి తొలగించారు ఓటర్ ఐడీకార్డు తీసుకుని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు వ్యక్తిగత సమాచారం సేకరించి వారి ప్రైవసీకి భంగం కల్గిస్తున్నారు రాత పూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో.. మరి దీనిని ఏమంటారు 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తూ నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నారు లెక్కవేసి టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందిసిస్టమ్లోకి అనుమతి లేకండా చొరబడి వ్యక్తిగత డేటాను టీడీపీ సేకరించింది ఈ డేటాతో టీడీపీ బ్లాక్ మెయిల్ చేయొచ్చు.. ఏమైనా చేయొచ్చు ఇంత డబ్బులు వస్తాయని చెబుతున్న వీళ్లను ఏ చట్టం ప్రకారం శిక్షించాలి అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఓటర్లను ప్రలోభానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు మనిషికి ఏవైతే ఉండకూడదో అన్ని చంద్రబాబుకు ఉన్నాయి చంద్రబాబు ఆలోచనలు ఎంత వికృతమైనవో దీని ద్వారా తెలుస్తోంది ఓట్లను తొలగిస్తున్నారని ఈనాడు అసత్య వార్తలు అడ్డదారుల్లో అధికారంలోకిరావడానికి ఓట్లను గత టీడీపీ ప్రభుత్వం తొలగించింది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈనాడు తప్పుడు కథనాలు 3:42PM, Nov 21, 2023 చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టులో సవాల్ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని పిటిషన్ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని వినతి దర్యాప్తు దశలోనే కేసులో సాక్షాలు లేవని చెప్పడం హైకోర్టు తన పరిధిని అతిక్రమించడమేనని పిటిషన్లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే నిలిపివేయాలని వినతి 3:40PM, Nov 21, 2023 గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 2:44PM, Nov 21, 2023 విజయవాడ: బెయిల్ ఆర్డర్లో మినీ ట్రయల్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది హైకోర్టు సీనియర్ న్యాయవాది కోటంరాజు వెంకటేశ్ శర్మ చంద్రబాబు స్కిల్ స్కామ్లో నిర్దోషిగా బయటపడలేదు చంద్రబాబుకి అనారోగ్య కారణాలతోనే బెయిల్ మాత్రమే వచ్చింది కేసు ఐఓ ఎపుడూ పిలిచినా చంద్రబాబు వెళ్లాల్సిందే....అడిగిన డాక్యుమెంట్లు ఇవ్చాల్సిందే సుప్రీంకోర్టు సూచనలని హైకోర్టు అతిక్రమించింది బెయిల్ ఆర్డర్లో మినీ ట్రయల్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది బెయిల్ ఆర్డర్లో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించినట్లు కనపడుతోంది బెయిల్ ఆర్డర్ సంక్షిప్తంగా ఉండాలని పలు కేసులలో సుప్రీంకోర్టు ఉదహరించింది పార్టీ ఖాతాలలోకి నిదుల మల్లింపుపై సీఐడీ విచారణకి టిడిపి సహకరించటం లేదు విచారణ జరుగుతుండగానే టిడిపి ఖాతాల నిధులపై కోర్టు ఒక నిర్ణయానికి ఎలా వస్తుంది సీఐడీ వాదనలని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు క్రింది కోర్టులో ట్రయల్ సమయంలో నిర్దారించాల్సిన విషయాలని హైకోర్టు బెయిల్ సమయంలో ఎలా ఇచ్చింది సీఐడీ సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్తోంది సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ పై విచారణ జరుగుతుంది సాక్షులని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు ఐటి నోటీసులు అందుకోగానే మనోజ్ పార్ధసాని, పిఎ పెండ్యాల శ్రీనివాస్ లు పారిపోయారు చంద్రబాబు చుట్టూ ఉన్నవాళ్లే ఎందుకు పారిపోతున్నారు...మిగతా వాళ్లు ఎందుకు పరారీలో లేరు వారు పారిపోతే లబ్ది పొందేది చంద్రబాబే ఈ విషయాలని సీఐడీ కోర్టు ముందు ఆధారాలుంచినా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని హైకోర్టు పట్టించుకోలేదు తమ ఆదేశాలని పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు విచారిస్తుంది ఈ విషయంలో సీఐడీకి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు ఉంటుందనుకుంటున్నా గతంలో అనేక కేసులలో బెయిల్ ఇచ్చిన సందర్బంలో ముద్దాయిలకి కండీషన్స్పై ఇచ్చేవారు నిందితుల పాస్ పోర్ట్ సీజ్ చేసేవారు ...ఐఓ ముందు వారానికి ఒకసారో...రెండుసార్లో హాజరవ్వాలని ఇచ్చేవారు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చే సమయంలో ఎటువంటి కండీషన్స్ పెట్టలేదు పిటీషన్ లో పేర్కొనని వాటిపై కూడా హైకోర్టు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది 1:30 PM, Nov 21, 2023 నారా చంద్రబాబు నాయుడు.. ఏ కేసు.? స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ స్కాం @ హైకోర్టు స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : నవంబర్ 28వరకు చంద్రబాబుపై ఆంక్షలు, చికిత్స చేయించుకున్న వివరాలు సమర్పించాలని ఆదేశం కేసు : స్కిల్ స్కాం @ సుప్రీంకోర్టు అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం @ హైకోర్టు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 24కి వాయిదా పడ్డ విచారణ 1:28 PM, Nov 21, 2023 మద్యం కేసు : కొల్లు పిటిషన్ ►ఏపీ హైకోర్టులో కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ►పాస్ ఓవర్ అడిగిన పిటిషనర్ తరఫున న్యాయవాదులు ►లంచ్ బ్రేక్ తర్వాత విచారించనున్న హైకోర్టు ►మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కొల్లు పిటిషన్ 1:23 PM, Nov 21, 2023 బాబు బెయిల్పై విచారణ వాయిదా ►మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా ►విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన ఏపి హైకోర్టు ►స్కిల్ స్కాంలో ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 1:22 PM, Nov 21, 2023 ఢిల్లీకి AP CID టీం ►సుప్రీంకోర్టులో పిటిషన్ కోసం ఢిల్లీకి ఏపీ సీఐడీ లీగల్ టీమ్ ►ఢిల్లీ చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న CID 1:12 PM, Nov 21, 2023 బీటెక్ రవి బెయిల్ @ కడప ►తెలుగుదేశం నేత బీటెక్ రవి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసిన కడప కోర్టు ►కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెదేపా నేత బీటెక్ రవి ►ఈనెల 14న బీటెక్ రవిని అరెస్టు చేసిన వల్లూరు పోలీసులు ►లోకేష్ పర్యటన సందర్భంగా పోలీసులపై బీటెక్ రవి దౌర్జన్యం ►కడప ఎయిర్పోర్టు ముందు ASIపై బీటెక్ రవి దాడి ►పది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న బీటెక్ రవి 12:22 PM, Nov 21, 2023 జడ్జిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై హైకోర్టులో విచారణ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత జడ్జిలపై అసభ్యకర పోస్టులపై విచారణ ►క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ►తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా 12:04 PM, Nov 21, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 23కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 10:36 AM, Nov 21, 2023 జైలు ఎపిసోడ్ నేర్పిన పాఠాలేంటీ? ► చంద్రబాబుకు ఎన్నో విషయాలపై స్పష్టత ఇచ్చిన జైలు జీవితం ► పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం విషయంలో ఉన్నదంతా డొల్లే ► ఎన్టీఆర్కు చంద్రబాబు ఉన్నట్టు, చంద్రబాబుకు మరొకరు లేరన్న విషయంపై స్పష్టత ► లోకేష్పై, చినబాబు నాయకత్వంపై ఇప్పటివరకు పెట్టుకున్నవన్ని భ్రమలే ► పార్టీలో ఉన్న సీనియర్ల వల్ల ఫలితం శూన్యం ► అచ్చెన్న, యనమల, గోరంట్ల, సోమిరెడ్డి, పయ్యావుల, కోట్ల.. పేరుకే సీనియర్లు ► కష్టకాలంలో ఏ సీనియర్ కూడా పార్టీని నడిపించే సత్తా లేదని సుస్పష్టం ► పార్టీ సీనియర్లలో కొరవడిన సబ్జెక్ట్ నాలెడ్జ్ ► పవన్ కళ్యాణ్ను నమ్ముకోవడం పార్టీ దౌర్భాగ్యం అని తేలినా.. ఏమి చేయలేని వైనం ► పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ రుపాయి ఖర్చు పెట్టలేదని క్లారిటీ ► మీడియాలో కనిపించే మై"కింగ్"లు వేరు, క్షేత్రస్థాయిలో పని చేసే వారు వేరు అన్నదానిపై స్పష్టత ► కిం.. కర్తవ్యం.? ఏం చేస్తే పార్టీ పట్టాలెక్కుతుంది? చంద్రబాబు మంత్రాంగాలు 10:15 AM, Nov 21, 2023 ఫైబర్ నెట్ స్కాంలో నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్పై నేడు విచారణ ►నిన్న ఏసీబీ జడ్జి సెలవుతో విచారణ నేటికి వాయిదా ►ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులకి సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ ప్రతిపాదన ►ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు ►ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ -25గా చంద్రబాబు పేర్లు 09:28 AM, Nov 21, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ 09:15 AM, Nov 21, 2023 చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ►సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం ►పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది ►హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది ►దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ నేతలు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు ►సీఐడీ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకు టీడీపీ ఇవ్వలేదు ►కేసుల మూలల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్ కోర్టు అధికారాలను బెయిల్ దశలోనే న్యాయపరిధిని దాటడమే అవుతుంది ►బెయిల్ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదు 08:11 AM, Nov 21, 2023 స్కిల్ స్కాంలో చంద్రబాబుకు శిక్షపడటం ఖాయం: సజ్జల ►మెడికల్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చితే సత్యం గెలిచినట్లా? ►స్కిల్ స్కాం కేసులో బెయిల్ వచ్చినంతమాత్రాన చంద్రబాబు నిర్దోషి కాడు ►చంద్రబాబు స్కాం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.. సూత్రధారి ఆయనే ►బెయిలిస్తేనే కేసు కొట్టేసినట్లుగా సంబరాలు చేసుకుంటారా? చంద్రబాబుకు బెయిల్ కేవలం విచక్షణతోనే హైకోర్టు ఇచ్చింది. @ncbn తన ఆరోగ్యంపై మొదటి నుంచి తప్పుడు మెడికల్ రిపోర్టులు తెచ్చి కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రజల్లోకి వస్తేనే మంచిది. 2014 నుంచి 2019 వరకు చేసిన మోసాలు ప్రజలకు తెలియాలి. - వైయస్ఆర్సీపీ… pic.twitter.com/sk4fHtyaz6 — YSR Congress Party (@YSRCParty) November 20, 2023 07:53 AM, Nov 21, 2023 స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి ►ఆయన కార్యాలయమే అంతా చేసింది ►కేబినెట్ ఆమోదం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ►స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ – ఇన్నోవేషన్ శాఖల ఏర్పాటూ నిబంధనలకు విరుద్ధమే ►జీవోకు విరుద్ధంగా ఒప్పందం ►ప్రాజెక్టు వ్యయంలో 90% సీమెన్స్ – డిజైన్ టెక్ భరిస్తాయన్న జీవో ►ఈ అంశం ఆ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో లేదు ►కంపెనీలు నిధులివ్వనందున ప్రభుత్వ వాటా విడుదల చేయొద్దన్న అధికారులు ►ఆ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిధుల విడుదల ►షెల్ కంపెనీల ద్వారా తరలింపు ►స్పష్టం చేసిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ►గత నెల చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు 07:10 AM, Nov 21, 2023 స్కిల్ కుంభకోణంలో.. చంద్రబాబుకు బెయిల్ ►చికిత్స కోసం ఇచ్చిన తాత్కాలిక బెయిల్ స్థానంలో రెగ్యులర్ బెయిలు ►తాత్కాలిక బెయిలు షరతులు...ఈ నెల 29 నుంచి సడలింపు ►హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు ఉత్తర్వులు ►నిధుల విడుదలకు ఆదేశాలిచ్చినంత మాత్రాన బాబు నేరం చేసినట్లు కాదు ►అలాగే, నిధులు మళ్లించారనటానికి కూడా ఆధారాల్లేవని వ్యాఖ్యలు ►తాను ఈ దశలో ‘మినీ ట్రయల్’ నిర్వహించడం లేదని చెప్పిన జడ్జి ►కానీ పూర్తి విచారణ జరిపేసినట్లుగా వ్యాఖ్యలపై న్యాయవర్గాల విస్మయం ►ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతామన్న ఏపీ ప్రభుత్వం ►వాస్తవానికి బాబుకు కేటరాక్ట్ ఆపరేషన్ చెయ్యాలనటంతో తాత్కాలిక బెయిలు ►ఆ తర్వాత ఆస్పత్రి ఇచ్చిన నివేదికతో.. రెగ్యులర్ బెయిలు కోసం పిటిషన్ ►దానిపైనే విచారణ... కేసు మెరిట్స్ జోలికి వెళ్లటం లేదని చెప్పిన జడ్జి ►కానీ బాబు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేయటంతో న్యాయవర్గాల విస్మయం ►కేసు మెరిట్స్పై విచారణ జరిపి... బాబు పాత్రకు ఆధారాలున్నాయని స్పష్టంగా తేల్చిన ఏసీబీ కోర్టు ►దానిపై తదుపరి విచారణను కొనసాగిస్తున్న సీఐడీ... పలు కీలక ఆధారాలు లభ్యం ►ఈ దశలో విచారణ పూర్తికాకముందే హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు!! ►బెయిల్ దశలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడ్డ ప్రభుత్వం ►ఈ విషయంలో ‘సుప్రీం’ కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని వ్యాఖ్య -
స్కిల్ కుంభకోణంలో.. చంద్రబాబుకు బెయిల్
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడికి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ను పూర్తిస్థాయి బెయిల్గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తాత్కాలిక బెయిల్ సందర్భంగా జారీచేసిన బెయిల్ బాండ్ ఆధారంగా చంద్రబాబును విడుదల చేయాలని ఆదేశించింది. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడంగానీ చేయరాదంటూ అప్పట్లో విధించిన షరతులను హైకోర్టు సడలించింది. ఈ నెల 29 నుంచి (మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తరువాత) షరతుల సడలింపు ఉంటుందని తెలిపింది. మిగిలిన షరతులన్నీ యథాతథంగా ఉంటాయని స్పష్టంచేసింది. వైద్య నివేదికలను ఈ నెల 28లోపు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కు కాకుండా విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించాలని చంద్రబాబును ఆదేశించింది. అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తనపై స్కిల్ కుంభకోణం కేసు నమోదు చేసిందంటూ చంద్రబాబు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన కేసు కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో చంద్రబాబు వాదనను ఆమోదించలేకున్నామని తేల్చిచెప్పింది. గత ప్రభుత్వ హయాంలోనే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా స్కిల్ కుంభకోణం కేసు తెరపైకి వచ్చిందన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి చేసిన వాదనను హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ తీర్పులో వెలువరించిన అభిప్రాయాలన్నీ కూడా ఈ బెయిల్ పిటిషన్కే పరిమితమని హైకోర్టు స్పష్టంచేసింది. తదుపరి జరిగే విచారణపై తమ వ్యాఖ్యల ప్రభావం ఉండబోదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ‘‘మేం కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా భావించకూడదు. మేమేమీ ఈ దశలో ఈ కేసులో మినీ ట్రయల్ నిర్వహించాలని అనుకోవటం లేదు’’ అని వ్యాఖ్యానిస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించారు. ఇందులో.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం తరఫున చంద్రబాబు 10 శాతం నిధులను విడుదల చేసినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని పేర్కొనటం విశేషం. కానీ, 90 శాతం పెట్టుబడులు పెట్టనున్నదంటూ సీమెన్స్ పేరిట అగ్రిమెంట్ జరగటం గానీ... సీమెన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకముందే చంద్రబాబు ప్రభుత్వం మొత్తం నిధులను విడుదల చేసి, వాటిని రకరకాల కంపెనీల్లోకి మళ్లించి విత్డ్రా చేయటాన్ని గానీ న్యాయమూర్తి ప్రస్తావించలేదు. పైపెచ్చు మినీ ట్రయల్ నిర్వహించటం లేదంటూనే... పూర్తి స్థాయి విచారణ నిర్వహించినట్లుగా బాబు పాత్రకు సంబంధించి న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేయటంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ తీర్పులోని వ్యాఖ్యల ద్వారా హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలకు భిన్నంగా వ్యవహరించిందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ఈ తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఐడీ నిర్ణయించింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. బెయిలుపై విచారణ జరుపుతూ కేసుపై వ్యాఖ్యలా? వాస్తవానికి చంద్రబాబుకు తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయని, కంటికి చికిత్స చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరటంతో కోర్టు గతనెలాఖర్లో తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పలు షరతులతో మంజూరు చేసిన ఈ బెయిలు ప్రకారం చంద్రబాబు హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఆసుపత్రి వైద్యులిచ్చిన నివేదిక ఆధారంగా ఇపుడు ఆయన లాయర్లు రెగ్యులర్ బెయిలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి... తాను కేసు మెరిట్స్ జోలికి వెళ్లటం లేదంటూనే... తన వ్యాఖ్యలు ఈ విచారణ వరకే పరిమితమని చెబుతూనే... కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ నేత లోకేశ్ సైతం... ‘న్యాయం గెలిచింది’ అంటూ ట్వీట్ చేయటం.. టీడీపీ వర్గాలు తాము కేసు గెలిచేసినట్లుగా సంబరాలు చేసుకోవటం గమనార్హం. వాస్తవానికి రిమాండ్ కోసం సీబీఐ అడిగినపుడు ఏసీబీ కోర్టులో కేసు మెరిట్స్పై విస్తృతంగా వాదనలు జరిగాయి. సీబీఐ తనవద్దనున్న సాక్ష్యాలను అందజేసింది. అవన్నీ చూసిన మీదట... బాబు పాత్రపై తగిన ఆధారాలున్నాయని నిర్ధారిస్తూ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కానీ హైకోర్టులో మినీ ట్రయల్ కాదంటూనే న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేయటంపై న్యాయవర్గాలే విస్మయం వ్యక్తంచేశాయి. నిధులు కొల్లగొట్టడంపై పూర్తి వివరాలు సమర్పణ చంద్రబాబు మొదట తన తాత్కాలిక బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపారు. దీంతో జస్టిస్ మల్లికార్జునరావు కంటి శస్త్రచికిత్స నిమిత్తం ఈ నెల 28 వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అనంతరం.. ప్రధాన బెయిల్పైనా ఆయనే విచారణ జరిపారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగ వివేకానందలు సుదీర్ఘ వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అండ్ కో ఎలా నిధులను కొల్లగొట్టింది, వాటిని ఎలా మళ్లించింది, హవాలా మార్గంలో ఆ నిధులు తిరిగి ఎలా టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరాయో వివరించారు. ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు పొందిన ఆర్థిక లబ్ధిని ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. నోట్ల రద్దు సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన నిధుల వివరాలను కోర్టుకు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు ఈ నెల 16న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. లిస్ట్ కాకుండానే అకస్మాత్తుగా తీర్పు ఈ నేపథ్యంలో.. సోమవారం నాటి కేసు విచారణ జాబితాలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ కాలేదు. అకస్మాత్తుగా ఉ.11 గంటల సమయంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై మ.2.15 గంటలకు తీర్పునిస్తున్నట్లు జస్టిస్ మల్లికార్జునరావు పేషీ నుంచి రిజిస్ట్రీకి సమాచారం అందింది. దీంతో రిజిస్ట్రీ ఈ విషయాన్ని సీఐడీ న్యాయవాదులకు అధికారికంగా తెలియజేసింది. అనంతరం, ఆన్లైన్లో కూడా స్క్రోల్ చేసింది. ఆ తరువాత మ.2.15 గంటలకు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. తీర్పులో ప్రధాన పాఠాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. న్యాయమూర్తి తన తీర్పులో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లలేదని, మినీ ట్రయల్ నిర్వహించలేదని పేర్కొన్నప్పటికీ, తీర్పు మాత్రం అందుకు భిన్నంగా సాగింది. తీర్పులోని ముఖ్యాంశాలివీ... పూర్తిస్థాయి పరిశీలన అవసరంలేదు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా పూర్తిస్థాయి సాక్ష్యాన్ని పరిశీలించాల్సిన అవసరంలేదు. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అన్నది మాత్రమే చూడాలి. మళ్లించిన రూ.370 కోట్లను చంద్రబాబు నగదు రూపంలో తీసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదు. 1–6–2014 నుంచి 31–12–2018 వరకు తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల నుంచి తీసుకున్నట్లు సీఐడీ చెప్పింది. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి. పైగా ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. సీఐడీ విశ్లేషణ, అభిప్రాయాల ఆధారంగా మళ్లించిన నిధులు తిరిగి టీడీపీ ఖాతాలకు చేరాయనేందుకు నిర్ధిష్టంగా ఓ ముగింపునకు రాలేం. నిధుల మళ్లింపు విషయంలో సీఐడీ ప్రాథమిక ఆధారాలను సమరి్పంచలేకపోయింది. సీమెన్స్కు చెందిన సుమన్ బోస్, డిజైన్ టెక్కు చెందిన ఖన్విల్కర్ మధ్య పలు వాట్సాప్, ఎస్ఎంఎస్ మెసేజ్లు నడిచాయని సీఐడీ చెప్పింది. అందులో పేర్కొన్న కరెన్సీ నోట్ల నెంబర్లు ఈ కేసుకు సంబంధించినవే అని అనేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. సబ్ కాంట్రాక్టర్ల ఎగవేతకు చంద్రబాబుని బాధ్యుడిగా చేయలేరు ఇక సీమెన్స్కు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులు విడుదల చేసినట్లు సీఐడీ చెప్పింది. అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు నిధులు విడుదల చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదని సీఐడీ వాదించలేదు. నిధుల విడుదలకు చంద్రబాబు మొగ్గు చూపినంత మాత్రాన, నేరంలో ఆయన పాత్ర ఉన్నట్లు కాదు. ని«ధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాల్లేవు. సబ్ కాంట్రాక్టర్ల ఎగవేతకు చంద్రబాబును బాధ్యుడిగా చేయలేరన్న ఆయన తరఫు సీనియర్ న్యాయవాదితో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. ఉల్లంఘనల గురించి అధికారులు చంద్రబాబుకు తెలియజేశారనేందుకూ ఎలాంటి ఆధారాల్లేవు. షౌజయత్ ఖాన్ అనే వ్యక్తి సీఐడీ ముందు ఇచ్చిన వాంగ్మూలం, సీమెన్స్ ఎండీ మాథ్యు థామస్ ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా కూడా నేరంలో చంద్రబాబు పాత్రకు ప్రాథమిక ఆధారాలను చూపలేదు. అయితే, ఈ దశలో ఈ వాంగ్మూలాలు సరైనవా? కావా? అన్న అంశాల జోలికి ఈ కోర్టు వెళ్లడంలేదు. బెయిల్ పిటిషన్ విషయంలో కేసు లోతుల్లోకి వెళ్లి మినీ ట్రయల్ నిర్వహించాల్సిన అవసరంలేదు. బెయిల్ మంజూరు సమయంలో సుదీర్ఘ కారణాలను సైతం తెలియజేయడం అనవసరం. అంతిమంగా అన్నీ అంశాలను ట్రయల్ కోర్టు జడ్జి తేలుస్తారు. పరిధి దాటినట్లనిపిస్తోంది ‘బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది. చంద్రబాబు నాయుడు లేవనెత్తని పలు అంశాల జోలికి హైకోర్టు వెళ్లింది. వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండకూడదు. అందువల్ల హైకోర్టు తీర్పు లోపభూయిష్టం. బెయిల్ దశలో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించింది. ఆధారాల గురించి హైకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాల విషయంలో పరిధి దాటింది. దర్యాప్తు కొనసాగుతుండగా దర్యాప్తులో లోపాలను ప్రస్తావించింది. బెయిల్ పిటిషన్ విచారణను అడ్డంపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తునకు అడ్డుగోడలా నిలిచాయి. సీఐడీ కోరిన వివరాలు ఏ మాత్రం అందజేయలేదు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి తీర్పునివ్వడం ద్వారా కింది కోర్టు అధికారాల్లో హైకోర్టులో జోక్యం చేసుకున్నట్లయింది. వాస్తవానికి బెయిల్ కేసుల్లో కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లకూడదు. బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగే సమయంలో చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలను వినిపించలేదు. దీనిపై సీఐడీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ అభ్యంతరాన్ని హైకోర్టు రికార్డ్ కూడా చేసింది. ఈ బెయిల్ పిటిషన్ విషయంలో హైకోర్టు తీరు అసాధారణం. ఆరోపణలు, దర్యాప్తుపై కింది కోర్టు చేయాల్సిన పూర్తిస్థాయి ట్రయిల్ను హైకోర్టు నిర్వహించినట్లయింది.’ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. చంద్రబాబు పార్టీ ప్రణాళికలను ప్రభావితం చేసినట్లవుతుంది.. బెయిల్ మంజూరు చేయడం, తిరస్కరించడం పూర్తిగా కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ విచక్షణాధికారాన్ని న్యాయబద్ధంగా, మానవత్వ, కారుణ్య దృష్టితో ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కేసులో చంద్రబాబు మినహా మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిల్ లేదా ముందస్తు బెయిల్పై ఉన్నారు. 2021లో కేసు నమోదు చేయడానికి ముందు సీఐడీ 140 మందికి పైగా సాక్షులను విచారించి 4వేల పేజీల డాక్యుమెంట్లను సేకరించింది. దర్యాప్తు ముగింపు దశకు చేరిందనేందుకు ఇదే ఆధారమంటూ కేసు కొట్టివేత కోసం చంద్రబాబు దాఖలు చేసిన మరో వ్యాజ్యంలో ఇదే హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. అన్నీ డాక్యుమెంట్లు కూడా ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నాయి. చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. అందువల్ల ఆయన విదేశాలకు పారిపోయే అవకాశంలేదు. అంతేకాక.. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, బెదిరించడంగానీ, సాక్ష్యాలను తారుమారు చేయడంగానీ జరగదు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు, దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారనేందుకు సీఐడీ ఆధారాలను చూపలేదు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ సీఐడీ ముందు హాజరుకాకపోవడమన్నది ఇక్కడ అంత ప్రాధాన్యత విషయం కాదు. మధ్యంతర బెయిల్ సందర్భంగా ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనడం, నిర్వహించడం చేయరాదని చంద్రబాబును ఆదేశించడం జరిగింది. ఇప్పుడు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసే సమయంలో కూడా అలాంటి షరతులు విధిస్తే అది చంద్రబాబు రాజకీయ పార్టీ ప్రణాళికలను ప్రభావితం చేస్తుంది. పది నిమిషాల్లోనే టీడీపీకి తీర్పు కాపీ.. మరోవైపు.. హైకోర్టు తీర్పు వెలువరించిన 10 నిమిషాల్లోనే తీర్పు కాపీ తెలుగుదేశం వర్గాలకు చేరిపోవడం గమనార్హం. దీంతో ఈ తీర్పు కాపీని వారు విస్తృతంగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. టీడీపీ న్యాయవాదులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. -
స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం కీలక పాత్ర పోషించిందనడానికి స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ అక్టోబరు 9న ఇచ్చిన తీర్పులో ఈ విషయాన్ని అంశాలవారీగా వివరించింది. బెయిల్ పిటిషన్ను తిరస్కరించడానికి కారణాలను వివరిస్తూ న్యాయస్థానం ప్రస్తావించిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్కిల్ ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న రికార్డులు, వివిధ జీవోలు, ఎంవోయూ (ఒప్పందం), నిధుల చెల్లింపు, సీఆర్పీసీ 161 వాంగ్మూలాలు, సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు, నోట్ ఫైళ్లు, జీవోలు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జీఎస్టీ, ఐటీ అధికారుల దర్యాప్తులో సేకరించిన వివిధ ఆధారాలను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నట్టు కూడా కోర్టు వివరించింది. కేబినెట్కు తెలియకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం నుంచి ప్రైవేటు వ్యక్తులకు ఒకటికి మించి పోస్టులు కట్టబెట్టడం, ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల, షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపు.. ఇలా పలు అక్రమాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కార్యాలయం పాత్రను వివరిస్తూ తన 44 పేజీల తీర్పులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.. ►సీమెన్స్ కంపెనీ, డిజైన్టెక్ కంపెనీలతో అప్పటి సీఎం చంద్రబాబు కార్యాలయం ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినట్టు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఆయన చొరవతోనే గంటా సుబ్బారావు (ఏ–1)ను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి తీసుకున్నారని తెలుస్తోంది. ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి ముందు నుంచే ఆ సంస్థ ఎండీ, సీఈవోగా గంటా సుబ్బారావు, డైరెక్టర్గా కె.లక్ష్మీనారాయణలను నియమించాలని అప్పటి సీఎం కార్యాలయం నుంచి కరస్పాండెన్స్ నడిచింది. ►ప్రైవేటు వ్యక్తి అయిన గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ, సీఈవో పోస్టులతో పాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ – ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వహించిన సమావేశాల్లోనే ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ మీటింగ్ మినిట్స్ వెల్లడిస్తున్నాయి. ►కేబినెట్ ఆమోదం లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ – ఇన్నోవేషన్ శాఖలను ఏర్పాటు చేసింది. ►స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సీమెన్స్ – డిజైన్ టెక్ కంపెనీలు భరిస్తాయని జీవోలో పేర్కొన్న అంశం ఆ రెండు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం(ఎంవోయూ)లో లేదు. అంతేకాదు.. బ్యాంకు గ్యారెంటీ గురించి కూడా ప్రస్తావించలేదు. ప్రభుత్వం, సీమెన్స్ – డిజైన్టెక్ కంపెనీలు సమకూర్చాల్సిన నిధుల వాటా గురించి ప్రస్తావించకుండానే ఒప్పందం కుదర్చుకున్నారు. ఆ ఒప్పందం ఫైల్ను అప్పటి సీఎం చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఆయన కార్యాలయమే ఆ ఫైల్ను ఆమోదించింది. ►సీమెన్స్ – డిజైన్టెక్ కంపెనీల వాటా 90 శాతం నిధులను సమకూర్చనందున ప్రభుత్వం వాటా 10 శాతం నిధులను విడుదల చేయడంపై ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం తన వాటాæ 10 శాతం నిధులను డిజైన్టెక్ కంపెనీకి చెల్లించింది. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, అప్పటి సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశాల్లోనే ఈ నిధులు చెల్లించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని నోట్ఫైళ్లు స్పష్టం చేస్తున్నాయి. ►డిజైన్టెక్ కంపెనీకి ప్రభుత్వం చెల్లించిన నిధుల్లో రూ.241 కోట్లను బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి షెల్ కంపెనీల ద్వారా మళ్లించారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. డిజైన్టెక్ కంపెనీ సమర్పించిన ఇన్వాయిస్లలో పేర్కొన్న మొత్తానికి, ప్రాజెక్టు అసలు వ్యయానికి మధ్య పొంతన లేదు. ►ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో భాగస్వాములైన సీమెన్స్ – డిజైన్టెక్ కంపెనీలకు చెల్లించిన నిధుల దుర్వినియోగంపై ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నాయి. -
‘చంద్రబాబు డైరెక్షన్లోనే స్కిల్ స్కామ్’
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఎల్లో మీడియ హడావుడి చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అసలు కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించకుండా ఏదో హడావుడి చేస్తూ రాజకీయ సానుభూతి సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు(సోమవారం) స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది.కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించడం లేదు. ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోంది. స్కిల్ స్కామ్తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలి. రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగిందో ఆధారాలున్నాయి. ఆధారాలన్నీ సీఐడీ తరపు లాయర్లు కోర్టులో సమర్పించారు. ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారు. షెల్ కంపెనీల పేరుతో అవినీతి జరిగింది. ఫేక్ ఇన్వాయిస్లతో రూ. 241 కోట్లు దోచేశారు. కిలారి రాజేశ్, పెండ్యాల శ్రీనివాస్లకు నోటీసులిచ్చారు. ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడ్డాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే స్కిల్ స్కామ్ జరిగింది. వివిధ స్టేజీల్లో స్కిల్ స్కామ్ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు పెట్టారు. ఏ రోజు కూడా స్కిల్ స్కామ్ జరగలేదని చంద్రబాబు లాయర్లు వాదించలేదు. గంటా సుబ్బారావును ఐదు పదవుల్లో కూర్చోబెట్టారు. నిధులు దారి మళ్లాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. చంద్రబాబు త్వరలో విజయయాత్ర చేస్తామంటున్నారు. అనారోగ్యం ఉంటే విజయయాత్ర ఎలా చేస్తారు?’ అని ప్రశ్నించారు. బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోలేదు సీఎం నిధులు విడుదల చెయ్యమంటేనే చేశామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశాడు. అందుకే చంద్రబాబు పాత్ర ఈ కేసులో దొరికింది. 73 ఏళ్ల ముసలాయన కాబట్టి బెయిల్ ఇమ్మని అడిగారు. బెయిల్ కోసం గుండె జబ్బు నుండి చాలా రోగాలు చూపించారు. బెయిల్ వచ్చినంత మాత్రాన అంత అయిపోలేదు. చంద్రబాబు లోపల ఉన్నా ఒకటే..బయట ఉన్నా ఒకటే. చంద్రబాబు బయట ఉంటే 2014 నుండి 2019 వరకు ఏం చేశాడో చెప్పాల్సి వస్తుంది. ఈ కేసులో చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదు.ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి..విచారణ ఎదుర్కోక తప్పదు. దేశంలోనే ఓ ప్రముఖ కేసుగా ఈ స్కామ్ కేసు ఉంది. హైకోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చింది.అరెస్ట్ అయినప్పుడు నుండి కేసు కోసం చంద్రబాబు మాట్లాడట్లేదు.ఇదొక్కటే కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం కేసులు ఎదుర్కోవాల్సిందే’ అని సజ్జల తెలిపారు. -
Nov 20th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 4:35PM, Nov 20, 2023 చంద్రబాబుకు బెయిలే వచ్చింది.. నిర్దోషి అని తీర్పు కాదు: మంత్రి అంబటి వచ్చింది బెయిలే... నిర్దోషి అని తీర్పు కాదు రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ , ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు......... మూల్యం చెల్లిస్తారు ! వచ్చింది బెయిలే... నిర్దోషి అని తీర్పు కాదు రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ , ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు......... మూల్యం చెల్లిస్తారు !@JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) November 20, 2023 4:25PM, Nov 20, 2023 చంద్రబాబు డైరెక్షన్లోనే స్కిల్ స్కామ్: సజ్జల రామకృష్ణారెడ్డి ►చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది ►కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించడం లేదు ►ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోంది ►స్కిల్ స్కామ్తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలి ►రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగిందో ఆధారాలున్నాయి ►ఆధారాలన్నీ సీఐడీ తరపు లాయర్లు కోర్టులో సమర్పించారు ►ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారు ►షెల్ కంపెనీల పేరుతో అవినీతి జరిగింది ►ఫేక్ ఇన్వాయిస్లతో రూ. 241 కోట్లు దోచేశారు ►కిలారి రాజేశ్, పెండ్యాల శ్రీనివాస్లకు నోటీసులిచ్చారు ►ఐటీ శాఖ నోటీసుల్లో అన్ని లింకులు బయటపడ్డాయి ►చంద్రబాబు డైరెక్షన్లోనే స్కిల్ స్కామ్ జరిగింది ►వివిధ స్టేజీల్లో స్కిల్ స్కామ్ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు పెట్టారు ►ఏ రోజు కూడా స్కిల్ స్కామ్ జరగలేదని చంద్రబాబు లాయర్లు వాదించలేదు ►గంటా సుబ్బారావును ఐదు పదవుల్లో కూర్చోబెట్టారు 3:40PM, Nov 20, 2023 చంద్రబాబు బెయిల్ ఆర్డర్లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ►స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అనడం సరికాదు ►చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిందన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ►ఇది బెయిల్ పిటిషన్ మాత్రమే కాబట్టి స్కిల్ స్కామ్ కేసు లోతుల్లోకి వెళ్లి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదు ►ట్రయల్ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా విచారణకు వస్తాయి ►ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ను చట్ట ప్రకారం విచారించాలి. 2:15 PM, Nov 20, 2023 స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ ►రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన రాష్ట్ర హైకోర్టు ►ఇప్పటికే ఆరోగ్య కారణాలతో బెయిల్ మీదున్న చంద్రబాబు ►పాత బెయిల్ ప్రకారం నవంబర్ 28న జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు ►నవంబర్ 28న వెళ్లాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్ బెయిల్ ►నవంబర్ 30న ACB కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని సూచించిన హైకోర్టు ►మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయి ►చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలి ►ఈనెల 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చు ►సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యుషన్ వాదనకు ఆధారాల్లేవు ►నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం ►ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవు ►ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు ►కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ►విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ►రిమాండ్ ఖైదీగా సెప్టెంబర్ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు ►జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు ►కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు ►మొదట సెప్టెంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు ►రాజమహేంద్రవరంసెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు ►సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్. దీన్ని అక్టోబర్ 5 వరకు కొనసాగించారు ►జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది ►చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు. ►కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ వసతి కల్పించారు ►నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు ►చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది ►వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి ►తన కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు ►బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అక్టోబర్ 31వ తేదీన చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. 2:15 PM, Nov 20, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? ►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం ►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం ►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం ►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు ►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి ►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ ►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST ►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు ►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ ►నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID ►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ ►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు ►సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ ►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 2:05 PM, Nov 20, 2023 ఫైబర్నెట్ కేసులో విచారణ వాయిదా ►విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్ కేసును విచారించిన ఏసీబీ కోర్టు ►టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఆస్తులు అటాచ్ చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు ►తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు 1:55 PM, Nov 20, 2023 చంద్రబాబు మాకు మద్ధతు తెలపడం సంతోషకరం : రేణుకా చౌదరీ ►తెలంగాణలో టిడిపి పోటీ చేయలేదు : రేణుకా చౌదరీ ►టిడిపి పోటీ చేయకుండా మాకు మద్దతు తెలపడం సంతోషం : రేణుకా చౌదరీ ►ఏపీలో ప్రచారానికి నన్ను పిలుస్తున్నారు : రేణుకా చౌదరీ ► రాష్ట్ర విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయి : రేణుకా చౌదరీ 1:10 PM, Nov 20, 2023 ఆస్తుల అటాచ్పై విచారణ ►నేడు సిఐడి పిటిషన్ పై ఏసీబి కోర్టులో విచారణ ►ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తులు అటాచ్ మెంట్ చేయాలని ఏసీబి కోర్టులో సిఐడీ పిటిషన్ ►ACB కోర్టు ముందు ఇరుపక్షాల వాదనలు 1:05 PM, Nov 20, 2023 ఇవ్వాళ బెయిల్ పిటిషన్పై తీర్పు.? ►స్కిల్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ఇచ్చే అవకాశం ►మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ►బెయిల్ పిటిషన్ పై ఇటీవల పూర్తయిన వాదనలు, తీర్పు రిజర్వ్ ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్ధ లూథ్రా ►సిఐడీ తరపున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి 12:45 PM, Nov 20, 2023 కొల్లు పిటిషన్ వాయిదా ►మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 12:36 PM, Nov 20, 2023 లోకేష్ పాదయాత్ర హడావిడి దేనికి సంకేతం ►సెప్టెంబర్ 9న బాబు అరెస్ట్ తర్వాత అర్థంతరంగా పాదయాత్ర ఆపేసిన లోకేష్ ►ఆ తర్వాత నెల రోజులు ఢిల్లీకి పరిమితమైన లోకేష్ ►ఇప్పుడు నవంబర్ 24నుంచి ప్రజల్లోకి లోకేష్ వస్తాడంటూ ఎల్లో మీడియా ప్రచారం ►చంద్రబాబు విడుదలై మూడు వారాలవుతోంది. ►చిక్కు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పచ్చమీడియా పాదయాత్ర ప్రచారం ►మరి ఇన్నాళ్లు లోకేష్ ఏం చేశాడు? ►హఠాత్తుగా ఇప్పుడెందుకు పాదయాత్ర గుర్తుకొచ్చింది? ►ఢిల్లీలో చాలా రోజుల పాటు లోకేష్ చేసిన కార్యక్రమాలేంటీ? ►అత్యంత రహస్యంగా లోకేష్ చక్కదిద్దిన పనులేంటీ? ►తెలంగాణలో ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి లోకేష్ ఎవరెవరిని కలిసాడు? ►రేవంత్ కోసం అర్థరాత్రిళ్లు ఎవరెవరి దగ్గరకు లోకేష్ వెళ్తున్నాడు? ►ఇప్పుడు పాదయాత్ర కేవలం విశాఖ వరకే అని ఎందుకు పరిమితి? ►దానికి చంద్రబాబు పాదయాత్రకు లింకు ఎందుకు? ►రాష్ట్రం అంటే విశాఖ వరకేనా? ►ఉత్తరాంధ్రలో భాగమైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మీకు కనిపించవా? 12:03 PM, Nov 20, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టిడిపి సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా? చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం ►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే .. ►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే.. ►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే ►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి. ►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది ►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు ►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు ►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.! 11:30 AM, Nov 20, 2023 నేడు సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి కేసు విచారణ ►నేడు సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి కేసుపై విచారణ జరుగనుంది. ►యూరీ రెడ్డి పిటషన్పై విచారణ చేపట్టనున్న హృషికేశ్ రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్. ►మార్గదర్శిలో షేర్లను రామోజీరావు బలవంతంగా బదలాయించారని ఏపీ సీఐడీకి యూరీరెడ్డి. ►సీఐడీ దర్యాప్తుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు. ►హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన యూరీరెడ్డి. 11:20 AM, Nov 20, 2023 స్కిల్ స్కాంలో బాబు పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు ►స్కిల్ స్కాంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం తీర్పు ►నాలుగు రోజుల క్రితం ఇరుపక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ►ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు. 9:45 AM, Nov 20, 2023 ఫైబర్నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో నిందితులకి సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ ప్రతిపాదన ►ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు ►ఈ కేసులో ఏ-1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ-25గా చంద్రబాబు పేర్లు ►ఫైబర్ నెట్ స్కాంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్కి ఆస్తులతో పాటు పలు కంపెనీల ఆస్తుల అటాచ్ చేయాలని ప్రతిపాదన ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారంలలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్లోని ఇల్లులు అటాచ్ ►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేసిన సీఐడీ ►ఈ కేసు విచారణలో భాగంగా నిందితుల ఆస్తుల అటాచ్మెంట్పై ఇప్పటికే సీఐడీ పరిధిని ప్రశ్నించిన న్యాయస్ధానం ►నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి సీఐడీకి పూర్తి అధికారాలున్నాయని ఏసీబీ కోర్టుకి స్పష్టం చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు ►సీఐడీ పిటిషన్పై నేడు కొనసాగనున్న విచారణ. 7:00 AM, Nov 20, 2023 లోకేశ్ యువగళం పున:ప్రారంభం? ►ఈనెల 24 నుంచి లోకేశ్ యువగళం పునఃప్రారంభం? ►పార్టీ కార్యకర్తల నుంచి ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పాదయాత్ర ప్రారంభించాలని లోకేశ్ యోచన ►చంద్రబాబు అరెస్టు కారణంగా చూపి యువగలం యాత్రకు మంగళం పాడిన లోకేశ్ ►విశాఖలో ముగించే యోచనలో టీడీపీ అధిష్టానం ►టీడీపీ అధినేత అరెస్టుతో సెప్టెంబర్ 9న నిలిచిన యువగళం పాదయాత్ర ►పాదయాత్ర నిలిచిపోయిన చోట నుంచే తిరిగి ప్రారంభించాలని నిర్ణయం ►చంద్రబాబు గతంలో విశాఖలో ముగించిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ►అదే సెంటిమెంటుతో విశాఖలోనే లోకేష్ పాదయాత్ర ముగించాలని నిర్ణయం ►ఎన్నికలు వేళ పాదయాత్రను కుదించే యోచనలో పార్టీ వర్గాలు 6:50 AM, Nov 20, 2023 టీడీపీ సీనియర్లలో అంతర్మథనం..! ►టీడీపీ యువనేతల్లో తమ భవిష్యత్తుపై చిగురించని ఆశలు..! ►టీడీపీ పని అయిపోయింది.. టీడీపీ సీనియర్లలో అంతర్గతంగా జరుగుతోన్న చర్చ ఇది. ►టీడీపీలో ఉంటే..లోకేష్ను నమ్ముకుంటే మనకు భవిష్యత్తు ఉండదు ►టీడీపీ యువ నేతల్లో అంతర్గత చర్చ ►ఈ రెండు చర్చల సబ్జక్ట్ వేరైనా లైన్ ఒక్కటే ►టీడీపీని చంద్రబాబు కాదు కదా..ఎవరూ బతికించలేరనేది ►టీడీపీ నేతల అంతర్గత చర్చల సారాంశం. ►చంద్రబాబుపై కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ►మరోవైపు.. బెయిల్ షరతులు బేఖాతరు చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో హడావుడి చేసిన భువనేశ్వరి ఏమయ్యారు..? ►చంద్రబాబును అరెస్ట్ చేయగానే ఢిల్లీ పారిపోయి దాక్కున్న లోకేష్పై టీడీపీ క్యాడర్లో నమ్మకం ఏమాత్రం లేదు. ►చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు..భువనేశ్వరి తీరు..లోకేష్ చేతులెత్తేసి ఢిల్లీ పారిపోవడం చూసిన.. ►టీడీపీ నేతలు మింగలేక కక్కలేక టీడీపీలో ఉంటున్నారు. ►తెలంగాణ తరహాలోనే.. 2024 తరువాత ఏపీలో జెండా పీకేయాల్సి వస్తుందని.. ►టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ►నవంబర్ 28న చంద్రబాబు జైలుకు వెళ్తే... వాట్ నెక్ట్స్..? ►భువనేశ్వరికి మాట్లాడటమే తెలియడం లేదు ►లోకేష్కు రాజకీయాలు ఏమాత్రం తెలియదు ►మరీ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైపు వేళ్లు చూపెడుతున్నాయి..!! ►పురందేశ్వరి అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆమె.. టీడీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. 6:45 AM, Nov 20, 2023 బాబు క్వాష్ కొట్టేయడమే మిగిలిందా.? ►సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు ►గత వారమంతా దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవులు ►17ఏ సెక్షన్ను తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు ►చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు ►CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు ►17ఏ సెక్షన్ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న బాబు లాయర్లు ►ఏ చట్టం అయినా, ఏ సెక్షన్ అయినా అవినీతిని అడ్డుకునేదే తప్ప.. సమర్థించేది కాదన్న CID లాయర్లు ►నేరం ముందే జరిగింది, దర్యాప్తు ముందే మొదలయింది, కాబట్టి చంద్రబాబుకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్న CID లాయర్లు ►సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం ►సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు బృందం కోటి ఆశలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. మిగిలింది బెయిల్ పిటిషన్ మాత్రమే. -
Nov 19th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates.. 03:45 PM, Nov 19, 2023 క్వాష్ కొట్టేస్తే కిం కర్తవ్యం.? ►క్వాష్ కొట్టేస్తే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే చంద్రబాబు మంత్రాంగం ►తమ వాదనల్లో అంత బలం లేదని తెలుగుదేశంలో అంతర్గతంగా చర్చ ►తప్పు చేయలేదని చెప్పుకోకుండా.. గవర్నర్ అనుమతి తీసుకోలేని చెబితే కోర్టు ఎలా నమ్ముతుంది? ►13 సంతకాలు పెట్టి అడ్డంగా దొరికిన తర్వాత 17a సెక్షన్ కలవరిస్తే.. ఎలా ఊరట కలుగుతుంది? ►బాబు క్వాష్ పిటిషన్ కొట్టేయడం ఖాయమన్న యోచనలో పార్టీ అధిష్టానం ►తాను మళ్లీ జైలుకు వెళ్తే ఎవరెవరు ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ప్లాన్ రెడీ ►జైలుకు వెళ్లగానే సానుభూతి మంత్రం అందుకోవాలని పార్టీ క్యాడర్కు సూచన ►భువనేశ్వరీ మళ్లీ పర్యటనలు ప్రారంభించాలని, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ►రాష్ట్రంలో ఒక వైపు లోకేష్, మరో వైపు పవన్ కళ్యాణ్ పర్యటనలు జరిగేలా చూడాలని క్యాడర్కు పిలుపు ►మరోవైపు జనసేనతో సమన్వయ సమావేశాల్లో తమ పార్టీకి అడ్వాంటేజ్ ఉండేలా చూసుకోవాలని సీనియర్లకు సూచనలు ►పేరుకే జనసేనతో పొత్తు, తెలంగాణ తరహాలో పదో, పదిహేనో సీట్లకు పరిమితం చేయాలన్న యోచనలో బాబు ►జైలుకు వెళ్లేకంటే ముందే మానిఫెస్టో విషయం తేల్చాలని నిర్ణయం 03:25 PM, Nov 19, 2023 బాబు క్వాష్ కొట్టేయడమే మిగిలిందా.? ►సుప్రీంకోర్టుకు రేపటితో ముగియనున్న సెలవులు ►గత వారమంతా దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవులు ►17ఏ సెక్షన్ను తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు ►చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు ►CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు ►17ఏ సెక్షన్ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న బాబు లాయర్లు ►ఏ చట్టం అయినా, ఏ సెక్షన్ అయినా అవినీతిని అడ్డుకునేదే తప్ప.. సమర్థించేది కాదన్న CID లాయర్లు ►నేరం ముందే జరిగింది, దర్యాప్తు ముందే మొదలయింది, కాబట్టి చంద్రబాబుకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్న CID లాయర్లు ►సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం ►సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు బృందం కోటి ఆశలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. మిగిలింది బెయిల్ పిటిషన్ మాత్రమే 03:03 PM, Nov 19, 2023 గబ్బర్ సింగ్కు వేళాయే.! ►తీవ్ర ఒత్తిడితో ఎట్టకేలకు షెడ్యూల్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ ►ఈ నెల 26న కూకట్పల్లిలో ప్రచారం చేస్తారని ప్రకటన ►తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి చంద్రబాబు ససేమిరా ►ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఓట్లు చీల్చొద్దని ఇప్పటికే పవన్కళ్యాణ్కు చంద్రబాబు సూచన ►చంద్రబాబు సూచనతో ఇప్పటివరకు తెలంగాణ వైపు కన్నెత్తి చూడని పవన్ కల్యాణ్ ►కేవలం ప్రధాని సభకు నామమాత్రంగా వచ్చి వెళ్లిన పవన్ కళ్యాణ్ ►బీజేపీ నుంచి, జనసేన 8 మంది అభ్యర్థుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ►పార్ట్టైం పొలిటిషియన్గా ఉండాలనుకుంటే పోటీ ఎందుకు చేశారని ప్రశ్న ►చివరికి కూకట్పల్లిలో కనిపించి రావాలని డిసైడ్ అయిన పవన్ కళ్యాణ్ ►మదిలో చంద్రబాబు, చుట్టున్న మనుష్యుల కోసం కమలం పార్టీ కోసం ►తమ అధ్యక్షుడికి ఎంతటి చిక్కొచ్చి పడిందని జనసేనలో ఆవేదన 02:30PM, Nov 19, 2023 టీడీపీ సీనియర్లలో అంతర్మథనం..! ►టీడీపీ యువనేతల్లో తమ భవిష్యత్తుపై చిగురించని ఆశలు..! ►టీడీపీ పని అయిపోయింది.. టీడీపీ సీనియర్లలో అంతర్గతంగా జరుగుతోన్న చర్చ ఇది. ►టీడీపీలో ఉంటే..లోకేష్ను నమ్ముకుంటే మనకు భవిష్యత్తు ఉండదు ►టీడీపీ యువ నేతల్లో అంతర్గత చర్చ ►ఈ రెండు చర్చల సబ్జక్ట్ వేరైనా లైన్ ఒక్కటే ►టీడీపీని చంద్రబాబు కాదు కదా..ఎవరూ బతికించలేరనేది ►టీడీపీ నేతల అంతర్గత చర్చల సారాంశం. ►చంద్రబాబుపై కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ►మరోవైపు.. బెయిల్ షరతులు బేఖాతరు చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో హడావుడి చేసిన భువనేశ్వరి ఏమయ్యారు..? ►చంద్రబాబును అరెస్ట్ చేయగానే ఢిల్లీ పారిపోయి దాక్కున్న లోకేష్పై టీడీపీ క్యాడర్లో నమ్మకం ఏమాత్రం లేదు. ►చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు..భువనేశ్వరి తీరు..లోకేష్ చేతులెత్తేసి ఢిల్లీ పారిపోవడం చూసిన.. ►టీడీపీ నేతలు మింగలేక కక్కలేక టీడీపీలో ఉంటున్నారు. ►తెలంగాణ తరహాలోనే.. 2024 తరువాత ఏపీలో జెండా పీకేయాల్సి వస్తుందని.. ►టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ►నవంబర్ 28న చంద్రబాబు జైలుకు వెళ్తే... వాట్ నెక్ట్స్..? ►భువనేశ్వరికి మాట్లాడటమే తెలియడం లేదు ►లోకేష్కు రాజకీయాలు ఏమాత్రం తెలియదు ►మరీ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైపు వేళ్లు చూపెడుతున్నాయి..!! ►పురందేశ్వరి అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆమె.. టీడీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. 12:15 PM, Nov 19, 2023 పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్ ►పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్.. ►బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి 2019లో విశాఖపట్నం లోక్సభ స్థానంలో సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే ►మేడంకు NOTAకు పడిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయి. ►33,892 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు ►అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి బీజేపీ పెద్ద సాహసమే చేసింది. బిజెపి అభ్యర్థిగా పురంధేశ్వరి గారు 2019లో విశాఖపట్నం లోక్ సభ స్థానంలో సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోవాల్సిందే. మేడంకు NOTAకు పడిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయి. 33,892 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2023 10:15 AM, Nov 19, 2023 టీడీపీ పనైపోయిందా!.. విజయసాయి కౌంటర్ ►చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే ►పార్టీలో నారా లోకేష్, భువనేశ్వరి అందరూ ఏమయ్యారు? ►ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా! ►తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? ►లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? ►ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ.. ►బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో కాదు సుమా!. చంద్రబాబుకు అనారోగ్యం - బెయిల్ షరతులు సరే-- పార్టీలో లోకేష్ - భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా! తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2023 9:45 AM, Nov 19, 2023 నాదెండ్లతో పవన్కు వెన్నుపోటు తప్పదా? ►నాదెండ్ల మనోహర్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ►నాదెండ్ల మనోహర్కు సామాన్యుడికి కౌంటర్ ►జనసేన కోసమా.. టీడీపీ కోసమా?. ►నాదెండ్ల మాటలు, చేతలు టీడీపీకి అనుకూలమే.. ►జనసేనకు లబ్ధి చేకూర్చేలా లేవు. ►రాబోయే రోజుల్లో పవన్కు వెన్నుపోటు తప్పదా?. నాదెండ్ల మనోహర్ జనసేన కోసం పనిచేస్తున్నాడా..? లేదా టీడీపీ కోసమా..? అతని మాటలు, చేతలు అన్నీ టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి తప్ప జనసేనకి లబ్ధి చేకూర్చేలా మాత్రం లేవు. దాంతో పవన్ కళ్యాణ్కి రాబోయే రోజుల్లో వెన్నుపోటు తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.… pic.twitter.com/pKNg1BhI3g — YSR Congress Party (@YSRCParty) November 19, 2023 8:00 AM, Nov 19, 2023 రేవంత్ ఆశల్లో వాస్తవాలెంత? లాజిక్ ఏముంది? ►చంద్రబాబు అరెస్ట్పై సానుభూతి వెల్లువెత్తుతుందన్న ఆశల్లో రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్ అంశం వల్ల తెలంగాణలో మాకు లాభం : రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్కు గల కారణాలపై మీడియాలో సంపూర్ణంగా చర్చ ►చంద్రబాబుపై ఏ ఏ కేసులున్నాయి? వాటి వెనక ఎన్ని రకాల సాక్షాలున్నాయి? ►చంద్రబాబు స్వయంగా ఎక్కడెక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టి నిధులు పక్కదారి పట్టేలా చేశాడు? ►చంద్రబాబు లాయర్ల వాదన ACB కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ►చంద్రబాబు తప్పు చేయలేదు అని ఆయన తరపు లాయర్లు ఏ కోర్టు ముందుకూడా ఎందుకు చెప్పలేదు? ►మా బాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న ఓ పసలేని వాదననే చర్వితచర్వణంగా ఎందుకు వినిపించారు? ►కనీసం సాధారణ బెయిల్కు కూడా చంద్రబాబుకు అర్హత లేదని కోర్టులు ఎందుకు నమ్మాయి? ►కేవలం ఆపరేషన్ చేయించుకునేందుకు మాత్రమే అని చెప్పి మరీ బెయిల్ ఎందుకిచ్చాయి? ►తప్పు చేశాడు, సాక్షాలున్నాయి, చట్ట ప్రకారం అరెస్టయ్యాడని స్పష్టంగా తెలిసినప్పుడు సానుభూతి ఎందుకొస్తుంది? ►ఆంధ్రప్రదేశ్లోనే జనాలు చంద్రబాబును పట్టించుకోనప్పుడు తెలంగాణలో సానుభూతి ఎందుకొస్తుంది? ►నిజంగా సానుభూతే వచ్చే పరిస్థితే ఉంటే తెలుగుదేశమే స్వయంగా పోటీ చేసేది కదా..! ►అంటే తెలుగుదేశానికి రాని సానుభూతి కాంగ్రెస్ పార్టీకి వస్తుందని పచ్చమీడియా ఊదరగొట్టేది అసత్యాలే కదా.! ►చంద్రబాబుకు సానుభూతి వచ్చే అవకాశముంటే.. పవన్ కళ్యాణ్ పరిస్థితేంటీ? ►తెలంగాణలో తమ పరిస్థితి జీరో అని తెలిసే కదా.. టిడిపి పోటీ చేయలేదు? అలాగే జనసేన కేవలం 8 చోట్ల జనాన్ని నిలబెట్టింది.! ►జనసేన తరపున, మిత్రపక్షం బీజేపీ తరపున ప్రచారానికి రాకుండా పవన్ కళ్యాణ్ ముఖం చాటేశాడు కదా.! 7:10 AM, Nov 19, 2023 బలహీనులపై టీడీపీ నేతల దౌర్జన్యం.. ►బలహీనులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకు పెరుగుతోంది. ►అకారణంగా గొర్రెల కాపరిపై దాడి. ►రెచ్చిపోయిన చింతమనేని ►గతంలోనూ దళితులపై ఇలాగే నోరుజారి, మహిళా ఎమ్మార్వోపై దుసురు ప్రవర్తన బలహీనులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అధికారం ఇవ్వలేదనే అక్కసుతో చింతమనేని ప్రభాకర్ రౌడీలా రెచ్చిపోతున్నాడు. అకారణంగా గొర్రెల కాపరిని అసభ్యపదజాలంతో దూషించి.. పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం ఒక గొర్రెను తన కారులో తీసుకుపోయాడు. గతంలోనూ దళితులపై… pic.twitter.com/wvyTiOM6h0 — YSR Congress Party (@YSRCParty) November 18, 2023 7:00 AM, Nov 19, 2023 చంద్రబాబు జబ్బుల్లో నిజమెంత? ►నిజంగానే ఇంత సీరియస్ జబ్బులుంటే ఏ టెస్ట్లు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నాడా? నమ్మబుద్ధి కావడం లేదన్నది నిపుణుల మాట ►నారా చంద్రబాబునాయుడు 73 సంవత్సరాల వయసులో AIG హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ►చంద్రబాబుకున్న జబ్బులు ఏంటంటే.. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్, గిడ్డినెస్, నిద్రలేమి, లో బ్యాకెట్, డిస్కంఫర్టనెస్ మరియు చర్మవ్యాధులు ఇక్కడ రెండు ప్రధానంగా డాక్టర్లు చెప్పిన విషయాలు #ఒకటి : కరోనరీ ఆర్డినరీ డిసీజ్ ఉంది #రెండు : హైపర్ ట్రాఫిక్ కార్డియోమియోపతి ఉంది #హైపర్ ట్రాపిక్ కార్డియోమయోపతి ఉంది, ప్రీవియస్ రిపోర్ట్స్ లో LV క్లాట్ ఉంది, డయాబెటిస్ ఉంది, స్కిన్ డిసీస్ ఉంది. ►వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి అంటూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలీ. ►ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్ నిత్యం కూడా షెడ్యూల్లో ఉండాలి అని రిఫర్ చేశారు. ►వికిల్గోకి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారు ►ఎరిట్రియా ప్రోన్ ఉంది అంటే గుండె కొట్టుకోవడంలో సడన్గా వేరియేషన్స్ పరిస్థితులు ఉన్నప్పుడు ఇది చెబుతారు. ►ఇటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అనస్తీషియా ఇవ్వడం చాలా హై రిస్క్ ►ఇన్ని సమస్యలున్నప్పుడు ఏ డాక్టర్ కూడా అనస్తీషియా ఇవ్వడానికి అంత ధైర్యం చేయడు. ►రెండో తారీఖున అడ్మిట్ కావటం, మూడో తారీఖున సర్జరీ చేసి డిశ్చార్జ్ చేయడం కూడా అయిపోయింది. ►ఈ రిపోర్ట్స్ తీసుకుని ఏ డాక్టర్ అయినా చూపిస్తే దీనిని ఆపరేట్ చేస్తారా? ►ఇదే విషయాన్ని ప్రశ్నించిన మంత్రి డాక్టర్ సీదీరి అప్పలరాజు ►కంటి చూపు తగ్గిపోయింది అనే విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు ►గౌరవ న్యాయస్థానం కూడా అనుమతించడం జరిగింది. ►CP కాల్షియం స్కోర్ 2019లో రిపోర్టు ప్రకారం 916 ఉంది ►ఇప్పుడు స్కోర్ అయితే 1611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వారు చెప్పడం జరిగింది. ►ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఆపరేషన్ ఎలా చేశారు? ►క్యాల్షియం స్కోరు ఇంత తక్కువ సమయంలో పెరిగితే ఏ కార్డియాలజిస్ట్ అయిన ముందుగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ వెంటనే చేస్తారు ►కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్తరీస్ ఎలాగ ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది ►అలా తెలిసినప్పుడు ఆయనకి సరైన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ►ఎందుకు చేయలేదు అంటే కేవలం బెయిల్ పొడిగించు కోవడానికి ఒక వండివార్చిన కథనమని మంత్రి సీదీరి అప్పలరాజు అనడాన్ని ఏ వైద్య నిపుణుడయినా ఖండించగలరా? ►పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు.. గుండె ఎనలార్జ్ అయిన విషయాన్ని పరీక్షించి.. ఆ ఎక్సెస్ పోర్షన్ను ట్రీట్చేస్తారు ►ఆ కారణంగా గుండె కొట్టుకోవడంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తారు. ►ఇంకా చంద్రబాబు తనకు కరోనార్ ఆర్డినరీ వ్యాధి ఉందని చెబుతున్నారు కాబట్టి దానికి సంబంధించి బైపాస్ సర్జరీ చేయాలి.. ►అయోగ్టిక్ స్టినోసిస్ ఉంది అన్నారు, డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు ►నిజంగా ఇవి గానీ నిజమైతే అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి. ►డెఫినిటివ్ ఇన్వెస్టిగేషన్ డెఫినేట్ ట్రీట్మెంట్ ఏమీ చేయకుండానే ఆపరేషన్ చేసేస్తారా? ►ఒక ప్రముఖ సంస్థకు సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించడం కాదా? ►హైపర్ ట్రాఫిక్ కార్డియామయోపతి ఉన్నప్పుడు కరోనరీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మందులు ఎందుకు వాడడం లేదు? ►LV క్లాట్ ఉన్నప్పుడు జీవితాంతం దానికి తగ్గ మందులు వాడాలి కదా.? ►మందులు ఏవైనా కనీసం రాయాలి కదా? అవేవీ ప్రిస్క్రిప్షన్లో ఎందుకు లేవు? ►ఇవి సీదీరి అప్పలరాజు ప్రశ్నలే కాదు.. ఆరోగ్య శాస్త్రం తెలిసిన వారెవరయినా అడిగేవే. ►తనకు జబ్బులున్నాయని, వాటి కోసం బెయిల్ కావాలని అడిగినందుకే ఇంత లోతుగా విశ్లేషణ ►న్యాయస్థానానికి చెప్పిన విషయాలు నిజాలు కావా? అన్నది అత్యంత కీలకమైన అంశం 6:55 AM, Nov 19, 2023 బెయిల్పై బాబు వర్గంలో భిన్నాభిప్రాయాలు ►చంద్రబాబు బెయిల్పై తెలుగుదేశంలో భిన్నమైన అభిప్రాయాలు ►52 రోజులు చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల తెలుగుదేశానికి మేలు జరిగింది.! ►ఇన్నాళ్లు మనకు అన్యాయం జరిగిందని కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాం ►ఇప్పుడు చెప్పుకోడానికి ఏం లేదు.! చేయడానికి ఏమీ లేదు.! ►లోకేష్ కోసమైనా చంద్రబాబు త్యాగం చేయాలేమో.. ►లోకేష్ నాయకుడిగా ఎదగాలంటే.. చంద్రబాబు రాజకీయాలకు దూరంగా ఉండడం బెటరేమో ►చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత జనం అరెస్ట్ గురించే మాట్లాడడం లేదు ►జైల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల అనవసరంగా జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది ►ఇలాగే ఉంటే లోకేష్బాబును పట్టించుకునే వారెవరు? ►ఇప్పటికైనా పార్టీలో సమూలంగా మార్పులు జరగాలి ►పార్టీలేదు.. xxx లేదు అన్న అచ్చెన్నను ఇంకెన్నాళ్లు భరించాలి? ►యనమల, బుచ్చయ్యచౌదరీ, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడిని నమ్ముకుని పార్టీ ఎన్నాళ్లు ప్రయాణం చేస్తుంది? ►కొత్త నీరు లేక, పక్క పార్టీ జనసేనను నమ్ముకుంటే తెలుగుదేశానికి సమాధి కాదా? ►పార్టీ తీరుపై తెలుగుదేశం కార్యకర్తల్లో ఆందోళన, అసహనం. 6:50 AM, Nov 19, 2023 జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన ►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు ►ఇప్పటికే కంటి ఆపరేషన్ పేరిట మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబు ►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు ►నవంబర్ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు ►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు ►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు ►వయస్సు అనేది తనకొక నెంబర్ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు ►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు ►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు 6:45 AM, Nov 19, 2023 చంద్రబాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే. 6:40 AM, Nov 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం ►స్కాంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ►టీడీపీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చారు.. వారి చర్యల వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల నష్టం ►దీన్ని కాగ్ సైతం ధ్రువీకరించింది ►కొల్లుకు డబ్బు ముట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది ►ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు ►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్ ►తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా 6:30 AM, Nov 19, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? ►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం ►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం ►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం ►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు ►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి ►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ ►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST ►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు ►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ ►నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID ►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ ►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు ►సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ ►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 6:30 AM, Nov 19, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ స్కాం అంశం : మధ్యంతర బెయిల్ స్టేటస్ : అనారోగ్యం కారణంగా మంజూరు వివరణ : నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్ కేసు : స్కిల్ స్కాం అంశం : రెగ్యులర్ బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ కేసు : ఇసుక కుంభకోణం అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు. 6:30 AM, Nov 19, 2023 రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం ఒక వర్గం : కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.? ఒక వర్గం : ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి. -
మాలాంటి చిన్న నేతలకు కూడా ‘ఫండ్స్’ అందేలా చూడండి సార్!
మాలాంటి చిన్న నేతలకు కూడా ‘ఫండ్స్’ అందేలా చూడండి సార్! -
తప్పించుకునే ప్రసక్తే లేదు..
-
చంద్రబాబుకు షాక్..అప్రూవర్ గా మారతానని చంద్రకాంత్ షా పిటిషన్
-
బాబుకు ముడుపులు చేరవేసినందుకే యోగేష్ గుప్తాకు ఐటీ నోటీసులిచ్చింది: చంద్రకాంత్ షా
-
స్కిల్ కుంభకోణం కేసులో కీలక మలుపు
-
Nov 18th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates 06:04 PM, Nov 18, 2023 నిమ్మగడ్డ ముసుగు తీసి రాజకీయాలు చేస్తున్నారా? : YSRCP ►ఎన్నికలు సమీపిస్తోన్నవేళ ముసుగు తీసిన నిమ్మగడ్డ రమేష్బాబు చౌదరీ ►YSRCPపై బురద జల్లడం, ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే రమేష్ బాబు పని ►కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి పని మొదలుపెట్టిన రమేష్ బాబు నిమ్మగడ్డ ►పేరుకు సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ, పని చేసేదంతా తెలుగుదేశం డైరెక్షన్ మేరకు ►రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేసిన నిమ్మగడ్డకు గతంలో ఏం జరిగిందో తెలియదా? ►ఇప్పుడు అర్జంటుగా నీతులు వల్లించవలసిన అవసరం ఏమొచ్చింది? ►మూడేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అడ్డంకులు సృష్టించినప్పుడు ఏమయ్యాయి ఈ నీతులు? ►ఒకసారి జరపవద్దని, మరోసారి జరపాలని, ఫలితాలు వచ్చిన కొద్దీ మాట మార్చినప్పుడు ఎటు పోయింది నైతికత? 05:55 PM, Nov 18, 2023 బెయిల్పై బాబు వర్గంలో భిన్నాభిప్రాయాలు ►చంద్రబాబు బెయిల్పై తెలుగుదేశంలో భిన్నమైన అభిప్రాయాలు ►52 రోజులు చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల తెలుగుదేశానికి మేలు జరిగింది.! ►ఇన్నాళ్లు మనకు అన్యాయం జరిగిందని కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాం ►ఇప్పుడు చెప్పుకోడానికి ఏం లేదు.! చేయడానికి ఏమీ లేదు.! ►లోకేష్ కోసమైనా చంద్రబాబు త్యాగం చేయాలేమో.. ►లోకేష్ నాయకుడిగా ఎదగాలంటే.. చంద్రబాబు రాజకీయాలకు దూరంగా ఉండడం బెటరేమో ►చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత జనం అరెస్ట్ గురించే మాట్లాడడం లేదు ►జైల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల అనవసరంగా జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది ►ఇలాగే ఉంటే లోకేష్బాబును పట్టించుకునే వారెవరు? ►ఇప్పటికైనా పార్టీలో సమూలంగా మార్పులు జరగాలి ►పార్టీలేదు.. xxx లేదు అన్న అచ్చెన్నను ఇంకెన్నాళ్లు భరించాలి? ►యనమల, బుచ్చయ్యచౌదరీ, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడిని నమ్ముకుని పార్టీ ఎన్నాళ్లు ప్రయాణం చేస్తుంది? ►కొత్త నీరు లేక, పక్క పార్టీ జనసేనను నమ్ముకుంటే తెలుగుదేశానికి సమాధి కాదా? ►పార్టీ తీరుపై తెలుగుదేశం కార్యకర్తల్లో ఆందోళన, అసహనం 05:30 PM, Nov 18, 2023 రేవంత్ ఆశల్లో వాస్తవాలెంత? లాజిక్ ఏముంది? ►చంద్రబాబు అరెస్ట్పై సానుభూతి వెల్లువెత్తుతుందన్న ఆశల్లో రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్ అంశం వల్ల తెలంగాణలో మాకు లాభం : రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్కు గల కారణాలపై మీడియాలో సంపూర్ణంగా చర్చ ►చంద్రబాబుపై ఏ ఏ కేసులున్నాయి? వాటి వెనక ఎన్ని రకాల సాక్షాలున్నాయి? ►చంద్రబాబు స్వయంగా ఎక్కడెక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టి నిధులు పక్కదారి పట్టేలా చేశాడు? ►చంద్రబాబు లాయర్ల వాదన ACB కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ►చంద్రబాబు తప్పు చేయలేదు అని ఆయన తరపు లాయర్లు ఏ కోర్టు ముందుకూడా ఎందుకు చెప్పలేదు? ►మా బాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న ఓ పసలేని వాదననే చర్వితచర్వణంగా ఎందుకు వినిపించారు? ►కనీసం సాధారణ బెయిల్కు కూడా చంద్రబాబుకు అర్హత లేదని కోర్టులు ఎందుకు నమ్మాయి? ►కేవలం ఆపరేషన్ చేయించుకునేందుకు మాత్రమే అని చెప్పి మరీ బెయిల్ ఎందుకిచ్చాయి? ►తప్పు చేశాడు, సాక్షాలున్నాయి, చట్ట ప్రకారం అరెస్టయ్యాడని స్పష్టంగా తెలిసినప్పుడు సానుభూతి ఎందుకొస్తుంది? ►ఆంధ్రప్రదేశ్లోనే జనాలు చంద్రబాబును పట్టించుకోనప్పుడు తెలంగాణలో సానుభూతి ఎందుకొస్తుంది? ►నిజంగా సానుభూతే వచ్చే పరిస్థితే ఉంటే తెలుగుదేశమే స్వయంగా పోటీ చేసేది కదా..! ►అంటే తెలుగుదేశానికి రాని సానుభూతి కాంగ్రెస్ పార్టీకి వస్తుందని పచ్చమీడియా ఊదరగొట్టేది అసత్యాలే కదా.! ►చంద్రబాబుకు సానుభూతి వచ్చే అవకాశముంటే.. పవన్ కళ్యాణ్ పరిస్థితేంటీ? ►తెలంగాణలో తమ పరిస్థితి జీరో అని తెలిసే కదా.. టిడిపి పోటీ చేయలేదు? అలాగే జనసేన కేవలం 8 చోట్ల జనాన్ని నిలబెట్టింది.! ►జనసేన తరపున, మిత్రపక్షం బీజేపీ తరపున ప్రచారానికి రాకుండా పవన్ కళ్యాణ్ ముఖం చాటేశాడు కదా.! 05:05 PM, Nov 18, 2023 చంద్రబాబు పాలసీ దోచుకో, దాచుకో ►తణుకు సామాజిక సాధికారత బస్సు యాత్రలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ►గతంలో ఏ పార్టీ ఉంటే వారి పార్టీ వారికే చేసుకునేవారు.. ►గతంలో చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్లో మా వారికే చేయాలని ఆదేశించేవారు ►జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కులమత ప్రాంతీయ బేధాలు లేకుండా అందరికీ సంక్షేమ అందాలని చెబుతున్నారు ►సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటే లేదు ►పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను చేరువు చేశారు ►మనబడి, నాడు-నేడు, గోరుముద్ద, విద్యా కానుకతో సీఎం జగన్ మేనమామ లాగా పేదలకు అండగా నిలిచారు ►మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు ►గతంలో చంద్రబాబు దాచుకో దోచుకో పంచుకో అన్న రీతిలోనే పాలన సాగించాడు ►చంద్రబాబు ఏరకంగా దాచుకున్నాడు జైలు వూసలు ఏ విధంగా లెక్కపెడుతున్నాడు ప్రజలందరూ చూస్తున్నారు ►బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చంద్రబాబు వాడుకున్నాడు, ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు ►చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా బడుగు బలహీన వర్గాలు వారిద్దరిని నమ్మరు ►ప్రజలు జగనే కావాలి అంటున్నారు 04:45 PM, Nov 18, 2023 టిడిపి+జనసేన=సున్నా ►మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కామెంట్స్ ►సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం పేదరికం ►తన సామాజిక వర్గం వారే మంత్రి పదవులు ఇవ్వలేదని వెళ్లిపోయారు.. ►అచ్చెన్నాయుడు బీసీ సమావేశాలు పెట్టడానికి సిగ్గు లేదా? ►బీసీలకు మీరేం చేశారు మేమేం చేసామో చర్చకు సిద్ధం ►స్కాముల్లో ఇరుక్కుపోయి స్కీములను విమర్శిద్దాం అంటే కుదరదు ►ఇది అవినీతి రహిత పారదర్శక ప్రభుత్వం ►చంద్రబాబు అబద్ధం జగన్ నిజమే అని ప్రజలు నిశ్చయించుకున్నారు 04:25 PM, Nov 18, 2023 ముఖ్యమంత్రిగా జనానికి ఏ రకంగానూ మేలు చేయని వ్యక్తి చంద్రబాబు ►తాడేపల్లిలో మాట్లాడిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ►స్వాతంత్ర్యం వచ్చాక అతిపెద్ద భూపంపిణీని సీఎం జగన్ చేశారు ►ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను జగన్ చేశారు ►20 సంవత్సరాలు నిండిన అసైన్డు భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు ►అమరావతిలో టీడీపీ నేతలు అసైన్డు భూములను బలవంతంగా లాగేసుకున్నారు ►అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని పేదలను భయపెట్టారు ►పరిహారం కూడా తక్కువ ఇచ్చారు ►22A లో ఉన్న భూములకు కూడా సీఎం పరిష్కారం చూపారు ►లంక భూములను ఏ, బీ, సీ కేటగిరీగా విభజించి అసైన్డు పట్టాలిచ్చారు ►30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ ది ►ప్రపంచంలో మరెవరూ ఇంతగా చేసిన దాఖలాలు లేవు ►గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు? ►ఎస్సీ, ఎస్టీల శ్మశాన వాటికల కోసం భూములు ఇచ్చిన ఘనత జగన్దే ►చంద్రబాబు14 ఏళ్లు సీఎం గా ఉండి ఏం చేశారు? ►పేద ప్రజల ఆత్మగౌరవం గురించి ఆయన ఎందుకు ఆలోచించలేదు? ►మనకోసం ఎవరు ఆలోచిస్తున్నారో వారికే అండగా నిలవాలి ►నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అనే లీడర్ని గతంలో ఎప్పుడైనా చూశామా? ►వారందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న జగన్ కి అండగా నిలుద్దాం ►కులగణన ద్వారా రానున్న రోజుల్లో మరింత మేలు జరగబోతోంది ►కులగణన చేయటం అనేది పెద్ద దేశభక్తికి నిదర్శనం 03:45 PM, Nov 18, 2023 సమాజాన్ని దెబ్బ తీసే వైరస్ బాబు ►విశాఖ : సామాజిక సాధికార సభలో అనిల్ కుమార్ యాదవ్ ►సగానికి పైగా పదవులను తన సామాజిక వర్గానికి బాబు కట్టబెట్టారు ►ఒక ఊరులో ఇద్దరే బాగు పడాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి.. ►ఒక యాదవ్నైనా నాకు రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం కల్పించారు ►యాదవులకు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు.. ►శ్రీకృష్ణుడు కూడా గేదేలను కాసుకున్నారు.. ►బీసీలను తోకలు కత్తిరిస్తామని బెదిరించారు.. ►పార్టీ పెట్టే సీఎం కాకూడదు అనుకున్న వ్యక్తి పవన్.. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్.. ►పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ►అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు. ►తండ్రి జైల్లో ఉంటే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్.. 02:50 PM, Nov 18, 2023 బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? ►విజయవాడ : చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వెలంపల్లి ఫైర్ ►చంద్రబాబు, లోకేేష్, పవన్కు సిగ్గుశరం ఉందా? ►జలీల్ ఖాన్ ఇంటి ముందు, జనసేన నేతల ఇంటి ముందు కూడా మేమే రోడ్లు వేశాం ►విజయవాడలో అత్యధికంగా రోడ్లు వేసింది మేమే ►గత ఐదేళ్లు చంద్రబాబు,పవన్ కలిసి ఏం పీకారు ►మీరు రోడ్లు వేస్తే మేం ఈరోజు రోడ్లు వేయాల్సిన అవసరం ఉండేదా ►మీ హయాంలో ఏం చేశారో...మా హయాంలో ఏం చేశారో చర్చిద్దాం ►పవన్ కళ్యాణ్ వస్తాడో...లోకేష్ వస్తాడో చర్చకు మేం సిద్ధం ►మీ ఇద్దరిలో ఎవరొస్తారో తేల్చుకోండి ►400 కోట్లతో కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది ►చంద్రబాబు,లోకేష్, పవన్ దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలి ►తెలంగాణలో ఎనిమిది మందిని నిలబెట్టి పార్టీని నట్టేట ముంచేశాడు ►నెలకొక సారి ఏపీకి వచ్చి ఈ రాష్ట్రం గురించి మాట్లాడే పవన్ మనకు అవసరమా? ►చంద్రబాబు జైలు కెళ్లాడు.. లోకేష్ ఏమైపోయాడు... ఎక్కడికి పోయాడు.? ►రాజకీయం కోసం 150 మంది చనిపోయారన్నారు ►నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర ఏమైపోయింది? ►చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే చనిపోయిన 150 మంది బ్రతికి వచ్చేశారా? ►భర్త బయటికి రాగానే భువనేశ్వరి వాళ్లను వదిలేశారు 01:45 PM, Nov 18, 2023 చంద్రబాబు జబ్బుల్లో నిజమెంత? ►నిజంగానే ఇంత సీరియస్ జబ్బులుంటే ఏ టెస్ట్లు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నాడా? నమ్మబుద్ధి కావడం లేదన్నది నిపుణుల మాట ►నారా చంద్రబాబునాయుడు 73 సంవత్సరాల వయసులో AIG హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ►చంద్రబాబుకున్న జబ్బులు ఏంటంటే.. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్, గిడ్డినెస్, నిద్రలేమి, లో బ్యాకెట్, డిస్కంఫర్టనెస్ మరియు చర్మవ్యాధులు ఇక్కడ రెండు ప్రధానంగా డాక్టర్లు చెప్పిన విషయాలు #ఒకటి : కరోనరీ ఆర్డినరీ డిసీజ్ ఉంది #రెండు : హైపర్ ట్రాఫిక్ కార్డియోమియోపతి ఉంది #హైపర్ ట్రాపిక్ కార్డియోమయోపతి ఉంది, ప్రీవియస్ రిపోర్ట్స్ లో LV క్లాట్ ఉంది, డయాబెటిస్ ఉంది, స్కిన్ డిసీస్ ఉంది. ►వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి అంటూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలీ. ►ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్ నిత్యం కూడా షెడ్యూల్లో ఉండాలి అని రిఫర్ చేశారు. ►వికిల్గోకి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారు ►ఎరిట్రియా ప్రోన్ ఉంది అంటే గుండె కొట్టుకోవడంలో సడన్గా వేరియేషన్స్ పరిస్థితులు ఉన్నప్పుడు ఇది చెబుతారు. ►ఇటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అనస్తీషియా ఇవ్వడం చాలా హై రిస్క్ ►ఇన్ని సమస్యలున్నప్పుడు ఏ డాక్టర్ కూడా అనస్తీషియా ఇవ్వడానికి అంత ధైర్యం చేయడు. ►రెండో తారీఖున అడ్మిట్ కావటం, మూడో తారీఖున సర్జరీ చేసి డిశ్చార్జ్ చేయడం కూడా అయిపోయింది. ►ఈ రిపోర్ట్స్ తీసుకుని ఏ డాక్టర్ అయినా చూపిస్తే దీనిని ఆపరేట్ చేస్తారా? ►ఇదే విషయాన్ని ప్రశ్నించిన మంత్రి డాక్టర్ సీదీరి అప్పలరాజు ►కంటి చూపు తగ్గిపోయింది అనే విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు ►గౌరవ న్యాయస్థానం కూడా అనుమతించడం జరిగింది. ►CP కాల్షియం స్కోర్ 2019లో రిపోర్టు ప్రకారం 916 ఉంది ►ఇప్పుడు స్కోర్ అయితే 1611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వారు చెప్పడం జరిగింది. ►ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఆపరేషన్ ఎలా చేశారు? ►క్యాల్షియం స్కోరు ఇంత తక్కువ సమయంలో పెరిగితే ఏ కార్డియాలజిస్ట్ అయిన ముందుగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ వెంటనే చేస్తారు ►కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్తరీస్ ఎలాగ ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది ►అలా తెలిసినప్పుడు ఆయనకి సరైన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ►ఎందుకు చేయలేదు అంటే కేవలం బెయిల్ పొడిగించు కోవడానికి ఒక వండివార్చిన కథనమని మంత్రి సీదీరి అప్పలరాజు అనడాన్ని ఏ వైద్య నిపుణుడయినా ఖండించగలరా? ►పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు.. గుండె ఎనలార్జ్ అయిన విషయాన్ని పరీక్షించి.. ఆ ఎక్సెస్ పోర్షన్ను ట్రీట్చేస్తారు ►ఆ కారణంగా గుండె కొట్టుకోవడంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తారు. ►ఇంకా చంద్రబాబు తనకు కరోనార్ ఆర్డినరీ వ్యాధి ఉందని చెబుతున్నారు కాబట్టి దానికి సంబంధించి బైపాస్ సర్జరీ చేయాలి.. ►అయోగ్టిక్ స్టినోసిస్ ఉంది అన్నారు, డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు ►నిజంగా ఇవి గానీ నిజమైతే అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి. ►డెఫినిటివ్ ఇన్వెస్టిగేషన్ డెఫినేట్ ట్రీట్మెంట్ ఏమీ చేయకుండానే ఆపరేషన్ చేసేస్తారా? ►ఒక ప్రముఖ సంస్థకు సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించడం కాదా? ►హైపర్ ట్రాఫిక్ కార్డియామయోపతి ఉన్నప్పుడు కరోనరీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మందులు ఎందుకు వాడడం లేదు? ►LV క్లాట్ ఉన్నప్పుడు జీవితాంతం దానికి తగ్గ మందులు వాడాలి కదా.? ►మందులు ఏవైనా కనీసం రాయాలి కదా? అవేవీ ప్రిస్క్రిప్షన్లో ఎందుకు లేవు? ►ఇవి సీదీరి అప్పలరాజు ప్రశ్నలే కాదు.. ఆరోగ్య శాస్త్రం తెలిసిన వారెవరయినా అడిగేవే. ►తనకు జబ్బులున్నాయని, వాటి కోసం బెయిల్ కావాలని అడిగినందుకే ఇంత లోతుగా విశ్లేషణ ►న్యాయస్థానానికి చెప్పిన విషయాలు నిజాలు కావా? అన్నది అత్యంత కీలకమైన అంశం 01:45 PM, Nov 18, 2023 మెడికల్ రిపోర్ట్స్పై డాక్టర్ సీదిరి అప్పలరాజు అనుమానాలు ►బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు బాబూ ?: ►చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్గా పరిశీలించాను. ►చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. ►గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు. ►సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు. ►ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ►మెడికల్ రిపోర్ట్స్లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు. ►ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు. ►బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు చంద్రబాబు గుండె సైజు పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్లో ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా బాబుకు కంటి ఆపరేషన్ చేయరు. బెయిల్ పొడగించుకోవడానికే ఈ మెడికల్ రిపోర్టు స్టోరీ అల్లుతున్నారు. అయినా బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు… pic.twitter.com/3AtDBI2rQl — YSR Congress Party (@YSRCParty) November 17, 2023 12:47 PM, Nov 18, 2023 మద్యం కుంభకోణం.. చంద్రబాబు సొంతం ►మద్యం కుంభకోణం .. చంద్రబాబు కనుసన్నల్లోనే ►మంత్రి మండలిలో చర్చలేకుండానే వరుసగా జీవోలు జారీ ►స్కాంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర రెండో నిందితుడు ►టీడీపీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చారు.. ►వారి చర్యల వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల నష్టం ►దీన్ని కాగ్ సైతం ధ్రువీకరించింది ►అప్పటి అధికార పార్టీకి చెందిన నేత డిస్టిలరీకి సైతం ఇదే రీతిలో లబ్ధి ►కొల్లుకు డబ్బు ముట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది ►ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు ►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్ ►తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా 12:17 PM, Nov 18, 2023 మ్యానిఫెస్టోపై కిం కర్తవ్యం.? ►ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో ►మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు ►తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు ►జనసేన ఎజెండాలో అయిదు అంశాలు ►మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు 1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ 2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు. 3. అమరావతే రాజధానిగా కొనసాగింపు. 4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం. 5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన. 6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం. 7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం. 8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన. ►ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు ►ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన ►టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు ►ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు ►కొత్తగా 47 సంక్షేమ పథకాలు పేదలకు పెట్టాలంటున్న హరిరామజోగయ్య ►మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు ►గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ ►2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు 10:13 AM, Nov 18, 2023 జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన ►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు ►ఇప్పటికే కంటి ఆపరేషన్ పేరిట మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబు ►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు ►నవంబర్ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు ►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు ►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు ►వయస్సు అనేది తనకొక నెంబర్ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు ►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు ►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు 10:05 AM, Nov 18, 2023 చంద్రబాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే. 7:16 AM, Nov 18, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం ►స్కాంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ►టీడీపీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చారు.. వారి చర్యల వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల నష్టం ►దీన్ని కాగ్ సైతం ధ్రువీకరించింది ►కొల్లుకు డబ్బు ముట్టడంపై దర్యాప్తు కొనసాగుతోంది ►ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు ►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్ ►తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా 7:13 AM, Nov 18, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? ►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం ►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం ►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం ►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు ►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి ►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ ►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST ►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు ►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ ►నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID ►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ ►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు ►సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ ►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 7:10 AM, Nov 18, 2023 పచ్చమీడియాలో రేవంత్రెడ్డి ఇంటర్వ్యూలు ►అనుకోకుండా నిజాలు బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి ►మీరు ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టరు కదా అన్న ప్రశ్నకు రేవంత్ సూటి సమాధానాలు ►అవినీతి ఉందని ఆరోపించాం, అక్రమాలు జరిగాయని చెప్పాం. కాబట్టి కెసిఆర్ కుటుంబం మీద కేసులు పెడతామన్న రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్ కావడం మీకు కలిసొచ్చింది కదా అన్నదానికి అవునన్న రేవంత్ ►చంద్రబాబుతో తనకు చాలా రోజులుగా మంచి సాన్నిహిత్యం ఉందన్న రేవంత్ ►చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు పర్సనల్గా చాలా బాధకు గురి అయ్యానన్న రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్ ఓట్ల పరంగా కాంగ్రెస్కు ఉపయోగపడుతుందన్న రేవంత్ ►చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ అంశం సున్నితంగా మారిందన్న రేవంత్ ►ఏపీలో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పోటీలో ఉన్నాడు. ►తెలంగాణలో పవన్కళ్యాణ్కు తక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం ఏపీలో ఆ కూటమిపై పడుతుందన్న రేవంత్ 7:09 AM, Nov 18, 2023 స్కిల్ కుంభకోణం కేసులో కీలక మలుపు ►చంద్రబాబు సన్నిహితుడు యోగేశ్ గుప్తానే పాత్రధారి ►ఆయన చెబితేనే వాటిని ఇచ్చా.. ►పూర్తి కుట్రను వెల్లడిస్తా.. అప్రూవర్గా అనుమతించండి ►ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా పిటిషన్ ►చంద్రబాబు సన్నిహితుడు యోగేష్ గుప్తా అమరావతి తాత్కాలిక సచివాలయం, టిట్కో ప్రాజెక్టుల కాంట్రాక్టులు కేటాయింపులో నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకుని చంద్రబాబుకు చేరవేశారు ►అందుకే యోగేష్ గుప్తకు ఐటీ శాఖ కూడా నోటీసులు ఇచ్చింది ►స్కిల్స్ స్కామ్ లో యోగేష్ గుప్తా A-22 గా ఉన్నారు ►నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితుడు యోగేష్ గుప్తా కీలక పాత్ర పోషించారు ►స్కిల్ కేసులో మరొక నిందితుడు సావన్ కుమార్ జాజు తో కలిసి యోగేష్ గుప్తా తనను సంప్రదించారు ►డిజైన్ టెక్ ,స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్లు ఐటీ సేవలు అందిస్తున్నట్లుగా బోగస్ ఇన్వాస్ లు కావాలని అడిగారు ►ఏసీఐ కంపెనీ పేరిట స్కాల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిసులు డిజైన్ టెక్ కంపెనీకి 2 బోగస్ ఇన్వాయిసులు ఇచ్చారు ►సీమెన్స్ -డిజైన్ టెక్ కంపెనీలతో స్కిల్ డెవపల్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుని స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు నమ్మించినందుకే బోగస్ ఇన్వాయిస్లు తమ నుంచి తీసుకున్నారు ►బోగస్ ఇన్వాయిసుల విలువ మేరకు 67 కోట్ల 87 లక్షల 39వేల 313 రూపాయలు ఏసీఐ కంపెనీ బ్యాంకు జమ చేశారు ►సావన్ కుమార్ చెప్పిన పలు షెల్ కంపెనీలకు ఆ నిధులను తాను మళ్లించానని తెలిపారు -
బోగస్ ఇన్వాయిస్లతో ‘స్కిల్’ నిధులు స్వాహా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసు కీలకమలుపు తిరిగింది. షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది స్పష్టమైంది. ఈ బాగోతంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్వర్క్ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కాం కేసులో నిందితుడు (ఏ–13)గా ఉన్న ఆయన తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ స్కాంలో బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా.. ఈ కేసులో తాను అప్రూవర్గా మారి స్కిల్ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులు, తెరవెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్ షాను సీఐడీ గతంలో అరెస్టుచేయగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు. యోగేశ్ గుప్తానే కథ నడిపారు.. ఇక ఈ కేసులో చంద్రబాబు సన్నిహితుడు యోగేశ్ గుప్తా పాత్ర మరోసారి బయటకొచ్చింది. అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాలు, టిడ్కో ప్రాజెక్టు కాంట్రాక్టుల కేటాయింపులో నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు వసూలుచేసి చంద్రబాబుకు చేరవేయడంలో యోగేశ్ గుప్తా పాత్రధారిగా ఉన్నారు. అందుకే ఈయనకు ఐటీ శాఖ కూడా నోటీసులిచ్చి విచారించింది. అలాగే, స్కిల్ స్కాం కేసులోనూ యోగేశ్ గుప్తా నిందితుడుగా (ఏ–22) ఉన్నారు. నిధుల అక్రమ తరలింపులో ఈయన కీలకపాత్ర పోషించారని చంద్రకాంత్ షా తన అప్రూవర్ పిటిషన్లో వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడు సావన్ కుమార్ జజూ (ఏ–26)తో కలిసి యోగేశ్ గుప్తా 2016లో ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షాను సంప్రదించారు. డిజైన్టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్లు.. ఐటీ సేవలు అందించినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు కావాలని కోరారు. అనంతరం.. ఏసీఐ కంపెనీ పేరిట స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్టెక్ కంపెనీకి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చారు. సీమెన్స్–డిజైన్టెక్ కంపెనీలతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు నమ్మించేందుకే బోగస్ ఇన్వాయిస్లు తమ నుంచి తీసుకున్నట్లు తాను గుర్తించానని చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఈ బోగస్ ఇన్వాయిస్ల విలువ మేరకు రూ.64,87,39,313 ఏసీఐ కంపెనీ బ్యాంకు ఖాతాలో జమచేశారు. అనంతరం సావన్కుమార్ చెప్పిన పలు షెల్ కంపెనీలకు ఆ నిధులను చంద్రకాంత్ షా బదిలీ చేశారు. మరోవైపు.. స్కిల్ స్కాం నిధులు రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు సీఐడీ తాజాగా గుర్తించింది. ఇందులో రూ.64.87 కోట్లు ఏసీఐ కంపెనీ బోగస్ ఇన్వాయిస్లతోనే అక్రమంగా తరలించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. చంద్రకాంత్ షా అప్రూవర్ పిటిషన్పై విచారణకు డిసెంబర్ 5న హాజరుకావాలని కోర్టు ఆయన్ని ఆదేశించింది. దాంతో స్కిల్ స్కాం దర్యాప్తులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. -
బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మానవతా దృక్ఫథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు న్యాయ వాదులు అఫిడివిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరారని.. చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప, ఎక్కడా తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. ‘‘చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం చచ్చిపోతున్నారని పచ్చ మీడియా వార్తలు రాసింది. చనిపోయిన వాళ్లని ఓదార్చుతామని, నిజం గెలవాలని భవనేశ్వరి యాత్ర చేపట్టారు. బయటకు వచ్చాక యాత్ర ఎందుకు ఆపేశారు? అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ డ్రామాలపై నిజం గెలవాలని మేమూ డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్గా పరిశీలించాను. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు. బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు ఎందుకు’’ అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు. బెయిల్ పొడిగించుకోవడానికి ఈ మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ రిపోర్ట్స్లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు. ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు. బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు’’ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? -
Nov 17th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions And Political Updates 6:58 PM, Nov 17, 2023 మద్యం కుంభకోణం కేసులో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ ►లిక్కర్ పాలసీ ఇతరులకు ఆర్థిక లాభాలను అందించడానికే మార్చబడింది ►క్యాబినెట్లో తీర్మానం చేయకుండానే నిబంధనలను తొలగించారు ►ప్రివిలేజ్ ఫీజును తొలగించే నిబంధనకు సంబంధించి క్యాబినెట్లో చర్చించకుండానే A2, A3 నిర్ణయం తీసుకున్నారు ►రాష్ట్రానికి వేల కోట్ల నష్టం వచ్చింది ►ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఏపీ తన నివేదికలో నివేదించారు ►ప్రభుత్వానికి నష్టం వచ్చింది దీంతోపాటుగా ప్రైవేటు వ్యక్తులు లాభ పొందారు ►ఎస్పీవై విషయంలో క్విట్ ప్రోకో జరిగిందని అనుమానాలు ఉన్నాయి ►లిక్కర్ పాలసీ క్యాబినెట్ నిర్ణయమని క్రిమినల్ చట్టాలు దీనికి వర్తించమని పిటిషనర్లు చెబుతున్న వాదన సరికాదు ►ఇతరులకు లబ్ధి చేకూర్చడానికి కుట్రపూరితంగా అప్పటి ప్రభుత్వం ఈ నేరానికి పాల్పడింది ►ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే నిర్ధారించింది ►తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసిన కోర్టు 6:40 PM, Nov 17, 2023 మెడికల్ రిపోర్ట్స్ పై డాక్టర్ సీదిరి అప్పలరాజు అనుమానాలు ►బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు బాబూ ?: ►చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్గా పరిశీలించాను. ►చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. ►గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు. ►సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు. ►ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ►మెడికల్ రిపోర్ట్స్లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు. ►ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు. ►బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు 04:34 PM, Nov 17, 2023 పచ్చమీడియాలో రేవంత్రెడ్డి ఇంటర్వ్యూలు ►అనుకోకుండా నిజాలు బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి ►మీరు ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టరు కదా అన్న ప్రశ్నకు రేవంత్ సూటి సమాధానాలు ►అవినీతి ఉందని ఆరోపించాం, అక్రమాలు జరిగాయని చెప్పాం. కాబట్టి కెసిఆర్ కుటుంబం మీద కేసులు పెడతామన్న రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్ కావడం మీకు కలిసొచ్చింది కదా అన్నదానికి అవునన్న రేవంత్ ►చంద్రబాబుతో తనకు చాలా రోజులుగా మంచి సాన్నిహిత్యం ఉందన్న రేవంత్ ►చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు పర్సనల్గా చాలా బాధకు గురి అయ్యానన్న రేవంత్ ►చంద్రబాబు అరెస్ట్ ఓట్ల పరంగా కాంగ్రెస్కు ఉపయోగపడుతుందన్న రేవంత్ ►చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ అంశం సున్నితంగా మారిందన్న రేవంత్ ►ఏపీలో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పోటీలో ఉన్నాడు. ►తెలంగాణలో పవన్కళ్యాణ్కు తక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం ఏపీలో ఆ కూటమిపై పడుతుందన్న రేవంత్ 04:09 PM, Nov 17, 2023 ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ ►నిందితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన సీఐడీ ►అక్రమాలకు పాల్పడ్డవారి వద్ద ఉన్న ఆస్తులు ఏవైనా అటాచ్ చేసే అధికారం ఉందని కోర్టుకు తెలిపిన సీఐడీ న్యాయవాదులు ►తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 2:03 PM, Nov 17, 2023 మ్యానిఫెస్టోపై కిం కర్తవ్యం.? ►ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో ►మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు ►తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు ►జనసేన ఎజెండాలో అయిదు అంశాలు ►మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు 1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ 2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు. 3. అమరావతే రాజధానిగా కొనసాగింపు. 4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం. 5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన. 6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం. 7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం. 8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన. ►ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు ►ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన ►టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు ►ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు ►కొత్తగా 47 సంక్షేమ పథకాలు పేదలకు పెట్టాలంటున్న హరిరామజోగయ్య ►మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు ►గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ ►2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు 1:50 PM, Nov 17, 2023 మద్ధతు తెలపడానికి ఏదో ఒక విధానం ఎంచుకోండి : టిడిపి శ్రేణులకు బాబు సూచనలు ►నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్ధతు తెలపడానికి ఏదో ఒక పద్ధతి ఎంచుకోవాలంటోన్న బాబు ►కుల, సంఘాలు లేదా ఉద్యోగ సంఘాలు లేదా వృత్తిపరమైన సంఘాల సమావేశానికి కాంగ్రెస్ అభ్యర్థులను ఆహ్వానించాలని సూచన ►తెలుగుదేశం పేరిట కాకుండా.. ఇతర మార్గాల్లో బహిరంగ మద్ధతు ప్రకటిస్తున్నట్టు చెప్పాలంటున్న బాబు ►కాంగ్రెస్ కోసం యూనియన్లకు (లేబర్, డ్రైవర్, ఆటో...) ఏంతైనా ఇవ్వాలని సూచన 1:40 PM, Nov 17, 2023 తెలంగాణ రాజకీయాల కోసం చంద్రబాబు మంత్రాంగం ►తెలంగాణ ఎన్నికల వేళ మంత్రాంగాలతో చంద్రబాబు బిజీ బిజీ ►పది ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో చంద్రబాబు ఫోన్ చర్చలు ►ఎంత ఖర్చైనా పెట్టండి, కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నించాలంటూ సూచనలు ►కాంగ్రెస్ గెలిస్తేనే.. తెలుగుదేశానికి మనుగడ అంటూ చెబుతున్నట్టు సమాచారం ►రేవంత్ కోసం ఇప్పుడు మీరు కష్టపడితే.. భవిష్యత్తుల్లో రేవంత్ మీ కోసం కష్టపడతాడని చెబుతున్న చంద్రబాబు 1:03 PM, Nov 17, 2023 సమన్వయం వెనక టిడిపి భారీ స్కెచ్ ►జనసేనతో సమన్వయ సమావేశాల వెనక తెలుగుదేశం భారీ స్కెచ్ ►175 నియోజకవర్గాలకు గాను 10 నుంచి 12కు జనసేనను పరిమితం చేసేందుకు సమన్వయం పేరుతో వ్యూహం ►జనసేన అభ్యర్థులను రెండు వర్గాలుగా విభజించడం, ఆనక వారి మధ్య చిచ్చు పెట్టడం ►జనసేనను విభజించి పాలించేలా చేసి.. చివరికి బలహీనపరిచి ఆ స్థానంలో టిడిపి ఎంట్రీ ఇవ్వడం ►ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన శక్తియుక్తులు ఏమున్నాయో తెలుసుకునేందుకు టిడిపికి అద్భుతమైన అవకాశం ►ఒక నియోజకవర్గంలో జనసేనకు ఒక అభ్యర్థి ఉన్నాడంటే.. ఏ రకంగా దెబ్బతీయవచ్చో.. తెలుసుకునే వ్యూహం ►తెలుగుదేశం అభ్యర్థిని ముందుగానే జనసేనలో జొప్పించడం, జనసేన అభ్యర్థిగా బరిలో దించడం ►పేరుకు పొత్తు గానీ, పార్టీని విలీనం చేస్తే ఎన్ని ప్రయోజనాలో.. అన్నింటిని చేజిక్కించుకోవడం ►ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు స్వయంగా ఫోన్లు చేసి ఏం చేయాలో వివరించిన చంద్రబాబు ►తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎలాంటి లబ్ది పొందాడో చెప్పి గేమ్ ప్లాన్ వివరిస్తోన్న చంద్రబాబు ►టిడిపి విష రాజకీయానికి గిలగిలలాడుతోన్న జనసేన కార్యవర్గం ►పార్ట్టైం పొలిటిషియన్ పవన్ కళ్యాణ్ వచ్చేది లేదు, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేసేది లేదంటున్న జనసేన నాయకులు 12:32 PM, Nov 17, 2023 యువగళానికి మంగళం ►చినబాబు లోకేష్ సూపర్ బిజీ ►ఇక యువగళానికి మంగళం పలకాలన్న యోచనలో పార్టీ ►ఇన్నాళ్లు వేర్వేరు కారణాలతో పాదయాత్రకు రాలేనన్న లోకేష్ ►ఇప్పుడు అవసరం ఉన్నా.. నడవలేనంటున్న లోకేష్ ►ముందు తనకొక నియోజకవర్గం కావాలంటోన్న లోకేష్ ►రాష్ట్రమంతా తిరగలేను, తన నియోజకవర్గంలో పర్యటన జరుపుకోవాలన్న యోచనలో లోకేష్ 12:13 PM, Nov 17, 2023 కాపులను గుంపగుత్తగా పవన్ అమ్మేస్తున్నారు : KA పాల్ ►కాపులకు రాజ్యాధికారం రాకపోవడానికి కాపు నాయకులే కారణం ►వంగవీటి రంగా ఆత్మఘోషిస్తోంది ►రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీతో కలవరు...ఉండరు ►1000 కోట్ల ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి కాపులను అమ్మేశాడు ►2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు ►మేం పెదకాపులమని చెప్పుకోవడానికి వాళ్లకి సిగ్గులేదా ►అమ్ముడు పోయిన కాపులతో మీరు ఉంటారా? ప్యాకేజీ స్టార్ తో మీరు ఉంటారా? ►కాపులను వెనక్కి నెట్టేసిన అన్నదమ్ములతో ఉంటారా? ►గుండు గీయించుకున్న కాపులు రావాలా? గుండు గీసే కాపులు కావాలా? ►1500 కోట్లకు 30 సీట్లకు పవన్ అమ్ముడుపోయాడు.! ►2014 నుంచి 19 వరకూ ఏపీని చంద్రబాబు అప్పుల పాలు చేశాడు ►ఈ రాష్ట్రాన్ని దరిద్రాంధ్ర ప్రదేశ్ గా మార్చాడు ►టీడీపీ,జనసేన పార్టీలు మీటింగ్ లలో కొట్టుకుంటున్నాయి ►అవి సమన్వయ సమావేశాలు కాదు ►బుర్రా బుద్ధి లేని మీటింగ్లు జరుగుతున్నాయి 11:30 AM, Nov 17, 2023 సమన్వయం కాదు అన్నీ సమస్యలే ►టిడిపి-జనసేన మధ్య క్షేత్రస్థాయిలో కుదరని సమన్వయం ►మొన్న పిఠాపురం.. నిన్న అనకాపల్లి.. నేడు జగ్గయ్య పేట.. ►ఘర్షణకు దిగుతోన్న టీడీపీ - జనసేన కార్యకర్తలు ►జగ్గయ్య పేటలో టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశం రచ్చరచ్చ ►టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనని జ్యోతుల నెహ్రు ప్రకటన ►పవన్ కల్యాణ్ కూడా తన వైపే ఉన్నాడని చెప్పిన జ్యోతుల ►జగ్గయ్యపేట జనసేన ఇంచార్జి సూర్యచంద్రకు సీటు కేటాయిస్తే పొత్తుకు రాం రాం ► జ్యోతుల నెహ్రు ప్రకటనతో ఆత్మీయ సభ నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయిన సూర్యచంద్ర ►చాలా నియోజకవర్గాల్లో కుదరని సయోధ్య ►నాలుగు రోజులుగా టీడీపీ - జనసేన వ్యవహారశైలి చూస్తోన్న ప్రజలు 10:40 AM, Nov 17, 2023 స్కిల్ స్కాం : కోడ్ భాషలో కొల్లగొట్టారు ►కోర్టు ముందు కుంభకోణం ఎలా జరిగిందో వివరించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►హవాలా మార్గంలో స్కిల్ లో దోచిన డబ్బు మళ్లించారు ►చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్కు డబ్బు ముట్టింది ►వారి మధ్య కోడ్ భాషలో నిధుల మళ్లింపు గురించి చర్చ జరిగింది ►371 కోట్ల స్కిల్ కుంభకోణం లో 241 కోట్లు హవాలా మార్గంగా లో బాబుకు చేరాయి ►ఈ స్కిల్ కుంభకోణం డబ్బులో రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి ►ఆ వివరాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించడం లేదు ►సహనిందితుల ద్వారా చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు ►బెయిల్ కోసం తప్పుడు మెడికల్ రిపోర్టు కోర్టు ముందుంచారు ►గుండె జబ్బన్నారు.. ఈసీజీలో అలాంటిదేమీ లేదు ►ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించుకునేలా ఆదేశాలివ్వండి హైకోర్ట్ లో సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి 9:30 AM, Nov 17, 2023 ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ పిటిషన్పై నేడు విచారణ ►ఫైబర్ గ్రిడ్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో నిందితులకి సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ ప్రతిపాదన ►ఇప్పటికే సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు ►ఈ కేసులో ఏ-1గా వేమూరి హరికృష్ణ, ఏ-11గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఏ-25గా చంద్రబాబు పేర్లు. ►ఫైబర్ నెట్ స్కాలో నిందితులైన తుమ్మల గోపీచంద్కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్తులు అటాచ్ చేయాలని ప్రతిపాదన ►గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారంలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్లోని ఇల్లులు అటాచ్ ►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేసిన సీఐడీ. ►సీఐడీ పిటిషన్పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు 8:30 AM, Nov 17, 2023 టీడీపీ-జనసేన కార్యకర్తల కుమ్ములాట కృష్ణా జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో తన్నులాట టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం, కుమ్ములాట. కృష్ణా జిల్లాలో ఆత్మీయ సమావేశం పేరుతో టీడీపీ-జనసేన కాక్యకర్తల కుమ్ములాట! pic.twitter.com/EYuOqU3p0H — YSR Congress Party (@YSRCParty) November 16, 2023 7:30 AM, Nov 17, 2023 చంద్రబాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే. 7:35 AM, Nov 17, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు: స్కిల్ స్కాం అంశం: మధ్యంతర బెయిల్ స్టేటస్: అనారోగ్యం కారణంగా మంజూరు వివరణ: నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి కేసు : స్కిల్ స్కాం అంశం: క్వాష్ పిటిషన్ స్టేటస్: సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ: ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్ కేసు : ఇసుక కుంభకోణం అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ: నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ: నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: మంజూరు చేసిన హైకోర్టు వివరణ: ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు: ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ: నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు: మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ: నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు. 7:20 PM, Nov 17, 2023 తెలంగాణకు దారేది? ►తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని పవన్ కల్యాణ్ ►పవన్ కోసం జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ ఎదురుచూపులు ►తెలంగాణలో 111 చోట్ల బీజేపీ, 8 చోట్ల జనసేన అభ్యర్థులు ►ఇప్పటిదాకా ప్రచారానికి రాని పవన్ కల్యాణ్ ►ప్రధాని మీటింగ్ తర్వాత ముఖం చాటేసిన పవన్ ►అసలు పవన్ కల్యాణ్ వస్తాడా? రాడా? అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ►అటు ఆంధ్రప్రదేశ్లోనూ కనిపించని పవన్ కళ్యాణ్ ►పార్ట్టైం పాలిటిక్స్కు పవన్ పరిమితమయ్యాడని జనసేనను నమ్ముకున్నవారి ఆవేదన ►ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రానున్న హోంమంత్రి అమిత్ షా ►కనీసం అమిత్షా పర్యటన సందర్భంగానైనా పవన్ కనిపిస్తాడని ఆశలు 7:10 PM, Nov 17, 2023 జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన ►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు ►ఇప్పటికే కంటి ఆపరేషన్ పేరిట మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబు ►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు ►నవంబర్ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు ►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు ►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు ►వయస్సు అనేది తనకొక నెంబర్ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు ►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు ►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు 7:05 AM, Nov 17, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? ►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం ►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం ►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం ►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు ►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి ►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ ►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST ►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు ►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ ►నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID ►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ ►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు ►సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ ►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. -
దోచేసిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించారు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు తదితరులు లూటీ చేసిన డబ్బు మొత్తాన్ని హవాలా మార్గంలో మళ్లించారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తనకు సంబంధించిన చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా రూ. 10 నోట్లను వినియోగించి కావాల్సిన చోటుకు హవాలా మార్గంలో నిధులను మళ్లించారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా జరిగిన వారి చాటింగ్ వివరాలను ఆయన కోర్టుకు వివరించారు.నిధులు మళ్లింపు, డబ్బు జమకు వారి మధ్య కోడ్ భాషలో సంభాషణలు జరిగాయని తెలిపారు. సీమెన్స్ ప్రతినిధి మాథ్యూ థామస్ అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు వాంగ్మూలం ఇచ్చారని ఆయన కోర్టుకు వివరించారు. 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన సీమెన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక ముందే చంద్రబాబు ప్రభుత్వం రూ. 270 కోట్లను ముందుగానే విడుదల చేసేసిందని, ఈ విషయంలో ప్రతీ దశలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులను విడుదల చేయాలని కోరగానే, ఆ నిధులను విడుదల చేసినట్లు అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ తన నోట్ఫైల్లో పేర్కొన్నారని, ఇదంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుధాకర్రెడ్డి కోర్టుకు వివరించారు. టీడీపీ ఖాతాల్లోకి నిధులు స్కిల్ కుంభకోణం నిధుల్లో కొంత భాగం అంతిమంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో చేరాయని, ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ కోరితే ఆ పార్టీ వర్గాలు ఇవ్వడం లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. సీఐడీ ఇచ్చిన నోటీసులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కిల్ కుంభకోణంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి నిధుల దుర్వినియోగాన్ని ధ్రువీకరించిన శరత్ అసోసియేట్స్పై ఈ కేసులో నిందితుడైన వికాస్ ఖన్వీల్కర్తో చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా వద్ద ఫిర్యాదు చేయించారన్నారు. ఇలా చేయించడం ద్వారా ఈ కేసులో కీలక సాక్షి అయిన శరత్ అసోసియేట్స్ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక చంద్రబాబు అరెస్ట్ తర్వాత దర్యాప్తుకు విఘాతం కలిగేలా సుమన్ బోస్, ఖన్వీల్కర్లు మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని.. ఆ పిటిషన్ కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. గుండె జబ్బన్నారు.. ఈసీజీలో అలాంటిదేమీ లేదు కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో సహనిందితుల ద్వారా సాక్షులను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని ఏఏజీ తెలిపారు. తమ పార్టీ నేతల ద్వారా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, స్టేట్మెంట్లు ఇప్పించడం, పోలీసులపై కేసులు పెట్టించడం వంటివి చేస్తున్నారని వివరించారు. బెయిల్ పొందేందుకు వీలుగా తప్పుడు మెడికల్ రిపోర్ట్ను కోర్టు ముందుంచారని ఆయన తెలిపారు. తాజా మెడికల్ రిపోర్టులో చంద్రబాబు ‘హైపర్ట్రోపిక్ కార్టియోపతి విత్ ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్’తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారని.. ఇది శుద్ధ అబద్ధమని, ఆ వ్యాధితో బాధపడేవారికి వైద్యులు ఐసీడీ అనే పరికరాన్ని అమరుస్తారని తెలిపారు. ఇదేమీ అసాధారణ వ్యాధి కాదన్నారు. ఆ జబ్బు ప్రభావం ఈసీజీ ద్వారా తెలుస్తుందని, అయితే చంద్రబాబు ఈసీజీలో అలాంటిది ఏమీ లేదని ఆయన వివరించారు. కేవలం బెయిల్ కోసం ఈ మెడికల్ రిపోర్టును సృష్టించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వైద్యుల బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకునేలా చంద్రబాబును ఆదేశించాలని కోరారు. చంద్రబాబును ఢిల్లీ ఎయిమ్స్కు తీసుకెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తనకు కావాల్సిన చోట చికిత్స పొందేందుకు చంద్రబాబుకు అనుమతినివ్వడం ద్వారా ఈ కోర్టు ఓ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించిందని, రాజమండ్రి జైలులో ప్రస్తుతం 2 వేల మంది ఖైదీలు ఉన్నారని, వారంతా కూడా కోర్టుకొచ్చి తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరే ప్రమాదం ఉందన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించేలా వైద్య నివేదికలు వాస్తవానికి మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పలు షరతులు విధించిందని, చంద్రబాబు వైద్య నివేదికలను రాజమండ్రి జైలు సూపరింటెండెంట్కు సీల్డ్ కవర్లో ఇవ్వాలని వైద్యులను ఆదేశించిందని ఏఏజీ తెలిపారు. అయితే వైద్యులు నేరుగా చంద్రబాబుకే ఆ నివేదికలు ఇచ్చారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని చెప్పారు. హైదరాబాద్లో కూడా చంద్రబాబు కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. తీర్పు రిజర్వు సీఐడీ వాదనలకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. నిధుల మళ్లింపుతో చంద్రబాబునాయుడుకు సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్నారు. ఆయన షరతులను ఉల్లంఘించలేదని తెలిపారు. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న సుధాకర్రెడ్డి రెండో రోజూ గురువారం తన వాదనలను కొనసాగించారు. కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదు.. స్కిల్ కుంభకోణంలో సీఐడీ పలు కీలక విషయాలను హైకోర్టు ముందుంచింది. కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా ఎలా మళ్లించారు.. వాటిని తిరిగి టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి ఎలా తీసుకొచ్చారు.. డీమానిటైజేషన్ సమయంలో డబ్బును ఎలా మార్పిడి చేశారు.. తదితర వివరాలను సీఐడీ లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచింది. ఈమేర అదనపు కౌంటర్ను కోర్టులో దాఖలు చేసింది. 2014 జూన్ 1 నుంచి 2018 జూన్ వరకు మొత్తం రూ. 65.86 కోట్లు టీడీపికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని సీఐడీ వివరించింది. అంతేకాక 2016 నవంబర్, 2017 జనవరి మధ్య మొత్తం నగదు డిపాజిట్లన్నీ కూడా రూ. 500, రూ. 1,000 నోట్ల ద్వారా మాత్రమే జరిగిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించామని సీఐడీ తెలిపింది. డీమానిటైజేషన్ను నవంబర్ 8న ప్రకటించారని, అందువల్ల ఈ రూ. 500, రూ. 1,000 జమ లావాదేవీలన్నీ కూడా అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయంది. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన వారి వివరాలేవీ సరిగా లేవని, కేవైసీ నిబంధనలు అసలు పాటించలేదని సీఐడీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంత మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని, తామిచ్చిన నోటీసులకు సైతం సరైన రీతిలో స్పందించడం లేదని వివరించింది. చంద్రబాబు ప్రభావితం చేస్తున్న కారణంగా కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని విదేశాలకు పారిపోయారని సీఐడీ తన అదనపు కౌంటర్లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. -
సాక్షులను బెదిరిస్తున్న చంద్రబాబు
-
Nov 16th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, & Political Updates 04:55 PM, Nov 16, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు ►చంద్రబాబు తరపు వాదనలు వినిపించిన సిద్ధార్ధ్ లూథ్రా ►తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు 04:24 PM, Nov 16, 2023 చంద్రబాబువి తప్పుడు హెల్త్ రిపోర్డులు: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సీఐడీ తరపున హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు ►చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు ►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు ►చట్టం ముందు అందరూ సమానులే ►ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి ►అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు ►కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది ►చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు ►చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్కు తరలించారు ►బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్ల ద్వారా ఈ విషయం బయటపడింది ►బోస్, కన్వేల్కర్ మెస్సేజ్ల ఆధారంగా డబ్బు హైదరాబాద్కు చేరినట్లు తెలిసింది ►సీమెన్స్ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు ►చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు ►చీఫ్ సెక్రటరీ తన లెటర్లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు 04:12 PM, Nov 16, 2023 స్కిల్ స్కాం కేసులో అప్రూవర్గా మారిన సిమెన్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ షా ►షాను వచ్చే నెల 5వ తేదీన ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశం ►స్కిల్ స్కాం కేసులో అప్రూవర్గా మారినట్లు ఏసీబీ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన A13గా ఉన్న సిదీష్ చంద్రకాంత్ షా ►సిదీష్ చంద్ర కాంత్ షా దాఖలు చేసిన పిటిషన్ను నిన్న విచారించిన ఏసీబీ కోర్టు ►వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►స్కిల్ స్కాం కేసులో ఇప్పటికే మొత్తం 37 మందిని నిందితులుగా చేర్చిన సీఐడీ 04:10 PM, Nov 16, 2023 హైదరాబాద్: చంద్రబాబును కలిసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ►చంద్రబాబు తో చర్చలు జరిపిన రఘురామకృష్ణరాజు ►టీడీపీ తరపున తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న రఘురామ 02:57 PM, Nov 16, 2023 స్కిల్ స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి 02:48 PM, Nov 16, 2023 చంద్రబాబు మెడికల్ రిపోర్టుపై ఎల్లో మీడియా హడావుడి: సజ్జల రామకృష్ణారెడ్డి ►జైలులో ఉన్నంతసేపు ప్రాణాంతక వ్యాధులున్నట్టు ప్రచారం చేశారు ►బెయిల్ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారు ►చంద్రబాబు మెడికల్ రిపోర్టుపై ఎల్లోమీడియా హడావుడి చేస్తోంది ►అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు ►కోర్టు అనుమతిస్తే బెయిల్ వస్తుంది ►ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చింది ►ఇప్పుడు ఆ బెయిల్ పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు ►ఏఐజీలో ఉన్నది వైద్యులా లేక రాజకీయ నేతలా? ►చంద్రబాబుకు నిజంగా ఆ పరిస్ధితి ఉంటే వెంటనే ట్రీట్ మెంట్ ఇవ్వాలి ►డాక్టర్ల నుంచి అలాంటి రిపోర్ట్ తెచ్చుకోవడం చంద్రబాబు చాకచక్యంలా కనిపిస్తోంది ►మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా లేక రాజకీయ నేతలా? ►చంద్రబాబు జైలులో ఉన్నా బయట ఉన్నా మాకేం ఇబ్బంది లేదు ►ఈ మొత్తం వ్యవహారంలో స్కాం జరిగిందన్న విషయం పక్కకి పోతోంది ►చంద్రబాబు తరపు లాయర్లు కూడా స్కాంపై వాదించడం లేదు ►ఈస్కాం తాను చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారు 11:30 AM, Nov 16, 2023 టీడీపీ-జనసేన సమన్వయంలో గందరగోళం ►దిగువ స్థాయి నేతల మధ్య కుదరని రాజీ ►నియోజకవర్గాల్లో బయటపడుతున్న విభేదాలు ►పిఠాపురం సమావేశంలో ఫైటింగ్ సీన్ ►అనకాపల్లి, అమలాపురంలోనూ ఘర్షణలు ►నందిగామ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్. ►పొత్తుపై ఎదురు తిరుగుతున్న జనసైనికులు. 10:50 AM, Nov 16, 2023 పురంధేశ్వరీ.. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? ►బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి ఎంపీ విజయసాయి కౌంటర్ ►ఏపీలో ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన సీఎం జగన్ను తిట్టడమే మీ పని. ►మీ నాన్నకు వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పని ఏమంటారు?. ►దయచేసి చెప్పగలారా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? . చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? — Vijayasai Reddy V (@VSReddy_MP) November 16, 2023 10:30 AM, Nov 16, 2023 ఎల్లో బ్యాచ్ దొంగ హామీలతో తస్మాత్ జాగ్రత్త! ►టీడీపీ, జనసేన ఇద్దరూ తోడు దొంగలు ►600 దొంగ హామీలు ఇచ్చి, 6 లక్షల కోట్లకుపైగా ప్రజాధనాన్ని దోచేసిన తోడు దొంగలు. ►మళ్లీ ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఏపీని దోచుకోవడానికి వస్తున్నారు. ►ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్త! 600 దొంగ హామీలు ఇచ్చి, 6 లక్షల కోట్లకు పైగా ప్రజాధనాన్ని దోచేసిన తోడు దొంగలు @JaiTDP @JanasenaParty, ఉమ్మడి మేనిఫెస్టో అంటూ మళ్లీ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు… తస్మాత్ జాగ్రత్త ఆంధ్రుడా! — YSR Congress Party (@YSRCParty) November 16, 2023 10:20 AM, Nov 16, 2023 జనసేన నేతల మధ్య తన్నులాట.. ►అనకాపల్లిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం ►ఈ సమావేశం సందర్భంగా జనసేన నాయకుల మధ్య తన్నులాట ►జనసైనికులకు నోటీసులు జారీ. ►తన్నులాటపై మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశం. 10:15 AM, Nov 16, 2023 టీడీపీ, జనసేనకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ►ప్రతిపక్ష నేతలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ►చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను నాదెండ్ల భాస్కర్ చదువుతున్నారు. ►చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప ►పవన్తో పాటు, నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. ►ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్ కల్యాణ్కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారు. 10:05 AM, Nov 16, 2023 స్కిల్ స్కాంలో విరాళాలు 100 కోట్లపైనే.. ►స్కిల్ స్కాంలో టీడీపీ అకౌంట్లోకి వెళ్లినవి రూ.27కోట్లు కాదు. ►విరాళాల రూపంలో టీడీపీ అకౌంట్లోకి వెళ్లినవి దాదాపు రూ.100కోట్లపైనే.. 10:00 AM, Nov 16, 2023 డ్రామా కింగ్ చంద్రబాబు.. ►అనారోగ్యం అంటూ డ్రామాలతో జైలు నుంచి బయటకు.. ►రాత్రిళ్లు నిద్రపోకుండా 14 గంటలు కారులో కూర్చుని ప్రయాణం ►అరెస్ట్కు ముందు రోజంతా బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. ►వయసు నాకు నంబర్ కాదంటూ వ్యాఖ్యలు ►బెయిల్ కోసం మాత్రం 14 రకాల జబ్బులు ఉన్నాయని డ్రామాలు. ►చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఊరికే అన్నారా.. జైలు నుంచి బయటికి వచ్చాక.. రాత్రిళ్ళు నిద్రపోకుండా 14 గంటలు కారులో కూర్చొని ప్రయాణించాడు అరెస్ట్ కు ముందు రోజంతా బహిరంగ సభల్లో పాల్గొని నేను ముసలోన్ని కాను వయసు నాకు ఒక నెంబర్ మాత్రమే అని చెప్పాడు బెయిల్ కోసం మాత్రం14రకాల జబ్బులు ఉన్నాయి అని చెబుతాడు,ఎన్టీఆర్ ఊరికే అన్నాడా pic.twitter.com/iw7SSJTc6Q — YSRCP IT WING Official (@ysrcpitwingoff) November 16, 2023 9:00 AM, Nov 16, 2023 ఏపీ ఎడిషనల్ సొలిసిటర్ జనరల్గా నరసింహశర్మ ►ఏపీ హైకోర్టు ఎడిషనల్ సొలిసిటర్ జనరల్గా నరసింహశర్మ ►ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం ►ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఏఎస్జీగా ఉన్న నరసింహశర్మ ►ఏపీ హైకోర్టులో రెగ్యులర్ ఏఎస్జీని నియమించే వరకు బాధ్యతల్లో కొనసాగనున్న నరసింహ శర్మ 8:55 AM, Nov 16, 2023 స్కిల్ కేసులో బాబు పిటిషన్పై మధ్యాహ్నం విచారణ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడు విచారించనున్న హైకోర్టు ►వాదనలు వినిపించనున్న చంద్రబాబు లాయర్లు, సీఐడీ లాయర్లు 8:10 AM, Nov 16, 2023 పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్ ►తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతివ్వాలని సలహా ఇచ్చింది మీరే కదా పురంధేశ్వరి! ►మీ ఆస్తులు, నివాసాల కోసం కాంగ్రెస్ను గెలిపించుకుంటున్నారా?. ►రాజకీయంగా ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! ►బీజేపీ గురించి కాకుండా సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నారు. 8:05 AM, Nov 16, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? ►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం ►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం ►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం ►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు ►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి ►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ ►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST ►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు ►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ ►నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID ►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ ►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు ►సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ ►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 8:00 AM, Nov 16, 2023 టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత ►మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలకు చంద్రబాబు, పవన్ అంగీకారం ►11 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపకల్పన. ►నేడు మినీ మేనిఫెస్టోకు ఆమోదముద్ర. ►ఈనెల 18, 19న ఉమ్మడి ఆందోళనలు 7:00 AM, Nov 16, 2023 ఏపీ హైకోర్టుకు చంద్రబాబు హెల్త్ రిపోర్టు.. ►చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ను ఏపీ హైకోర్టుకు అందజేసిన ఆయన లాయర్లు ►చంద్రబాబు గుండె పరిమాణం పెరిగింది. ►బ్లాక్స్ ఉండడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తక్కువగా ఉందన్న న్యాయవాదులు ►గుండె వాల్వ్లలో ఇబ్బందులు ఉన్నాయి: బాబు లాయర్ల 6:55 AM, Nov 16, 2023 రాజధానికి భూమలిచ్చిన కేసుపై తీర్పు రిజర్వ్ ►రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కేసు, హైకోర్టులో పిటిషన్ ►పిటిషన్ వేసిన అమరావతి రాజధాని రైతు సమాఖ్య రాజధాని రైతు పరిరక్షణ సమితి ►ఇరుపక్షాల తరపున పూర్తయిన వాదనలు ►తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయమూర్తి ►అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్న న్యాయమూర్తి 6:50 AM, Nov 16, 2023 ►నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ►నేడు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ 6:45 AM, Nov 16, 2023 నేడు కొల్లు రవీంద్ర పిటిషన్పై విచారణ ►మద్యం కేసులో కొల్లు రవీంద్ర పిటిషన్పై నేడు విచారణ ►కొల్లు రవీంద్ర పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ►మద్యం కేసులో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ ►మద్యం కంపెనీలకు చట్టవిరుద్ధంగా అనుమతి ఇచ్చారంటూ కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు 6:40 AM, Nov 16, 2023 స్కిల్ స్కాం కేసు విచారణ నేటికి వాయిదా ►స్కిల్ స్కాం కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు ►విచారణ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసిన హైకోర్టు ►మిగిలిన వాదనలు నేడు వింటామన్న ఏపీ హైకోర్టు 6:35 AM, Nov 16, 2023 నేడు ఏపీ హైకోర్టులో స్కిల్ కేసుపై విచారణ ►స్కిల్ కేసులో యోగేష్ గుప్తా ముందస్తు బెయిల్పై విచారణ ►స్కిల్ కేసులో మనీలాండరింగ్లో కీలకంగా ఉన్న గుప్తా ►బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ వేసిన సీఐడీ అధికారులు ►స్కిల్ కేసులో ఏ22గా ఉన్న యోగేష్ గుప్తా ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా గుప్తా పేరు -
Nov 15th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, & Political Updates 6:16 PM, Nov 15, 2023 ముగ్గురు మహానుభావులు.. ఎక్కడున్నారయ్య.? ►గుంటూరు జిల్లాలో మాట్లాడిన మంత్రి జోగిరమేష్ ►సైకిల్ తుప్పుపట్టింది ...గ్లాసు పగిలిపోయింది ►చంద్రబాబు,లోకేష్, పావలా కళ్యాణ్ ఎక్కడున్నారో తెలియడం లేదు ►చంద్రబాబు బోనెక్కాడు... బయటికొచ్చి హైదరాబాద్ పారిపోయాడు ►లోకేష్ ఎటు పోయాడో కనిపించడం లేదు ►పవన్ కళ్యాణ్ అడ్రస్ లేకుండా పోయారు ►సామాజిక న్యాయం గురించి ఒక్కరైనా మాట్లాడతాడేమోనని చూస్తున్నాం ►కానీ టీడీపీ,జనసేన నేతలు పారిపోయారు ►వెనుకబడిన వర్గాలను రాజ్యసభ మెట్లెక్కించాలంటే జగనన్నకే సాధ్యం ►చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పాలేరులా తయారయ్యారు ►పిల్లలకు విద్యా కానుక కిట్ ఇవ్వడం మీకు తప్పుగా కనిపిస్తోందా? ►ఏం పాపం చేశాం మేము... మా పిల్లలకు విద్యాకానుకలొద్దా? ఇంగ్లీష్ మీడియం వద్దా? ►మాకు మేలు జరుగుతుంటే మీకెందుకు కడుపు మంట? 5:36 PM, Nov 15, 2023 తెలంగాణకు దారేది? ►తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని పవన్ కల్యాణ్ ►పవన్ కోసం జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ ఎదురుచూపులు ►తెలంగాణలో 111 చోట్ల బీజేపీ, 8 చోట్ల జనసేన అభ్యర్థులు ►ఇప్పటిదాకా ప్రచారానికి రాని పవన్ కల్యాణ్ ►ప్రధాని మీటింగ్ తర్వాత ముఖం చాటేసిన పవన్ ►అసలు పవన్ కల్యాణ్ వస్తాడా? రాడా? అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ►అటు ఆంధ్రప్రదేశ్లోనూ కనిపించని పవన్ కళ్యాణ్ ►పార్ట్టైం పాలిటిక్స్కు పవన్ పరిమితమయ్యాడని జనసేనను నమ్ముకున్నవారి ఆవేదన ►ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రానున్న హోంమంత్రి అమిత్ షా ►కనీసం అమిత్షా పర్యటన సందర్భంగానైనా పవన్ కనిపిస్తాడని ఆశలు 5:20 PM, Nov 15, 2023 జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన ►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు ►ఇప్పటికే కంటి ఆపరేషన్ పేరిట మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబు ►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు ►నవంబర్ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు ►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు ►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు ►వయస్సు అనేది తనకొక నెంబర్ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు ►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు ►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు 4:45 PM, Nov 15, 2023 చంద్రబాబుకు గుండె జబ్బు ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టుకు డాక్టర్ల నివేదిక సమర్పించిన టిడిపి లాయర్లు ►చంద్రబాబు గుండె పరిణామం పెరిగింది : టిడిపి లాయర్లు ►చంద్రబాబు గుండెలో బ్లాక్స్ ఉండడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తక్కువగా ఉంది ►చంద్రబాబు గుండె వాల్వ్ లలో ఇబ్బందులు ఉన్నాయి : టిడిపి లాయర్లు ►చంద్రబాబుకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది : టిడిపి లాయర్లు ►చంద్రబాబు శరీరంలో ఉండాల్సిన దాని కంటే కాల్షియం శాతం అధికంగా ఉంది : టిడిపి లాయర్లు ►ఇటీవల చంద్రబాబు గుండెజబ్బు గురించి మాట్లాడిన కొడుకు లోకేష్ ►చంద్రబాబుకు పుట్టినప్పటి నుంచే గుండెలో రంధ్రాలున్నాయని తెలిపిన లోకేష్ 3:45 PM, Nov 15, 2023 స్కిల్ స్కాం@హైకోర్టు ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వాయిదా ►తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 3:20 PM, Nov 15, 2023 మనకెందుకు పొత్తు.? : భగ్గుమన్న జనసేన నేతలు ►అనకాపల్లి జనసేన లో రెండు వర్గాల మధ్య విభేదాలు ►టీడీపీతో సమన్వయ కమిటీ సమావేశంలో రెండుగా వీడిన జనసేన నేతలు ►మనకెందుకు పొత్తు అంటూ తీవ్రంగా మండిపడ్డ ఒక వర్గం ►ఇన్నాళ్లు పడ్డ శ్రమ బూడిదలో పోసినట్టయిందంటూ ఆవేదన ►జనసేన నేతలు భాస్కర్ రావు, గోపి వర్గాల మధ్య తోపులాట 3:15 PM, Nov 15, 2023 స్కిల్ స్కాం@హైకోర్టు ►చంద్రబాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలు హైకోర్టుకు ఇచ్చిన టిడిపి లాయర్లు ►వైద్యుల సూచనల నివేదికను మెమో ద్వారా కోర్టుకు ఇచ్చిన లాయర్లు ►టిడిపి లాయర్లు : కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యుల నివేదిక ►టిడిపి లాయర్లు : అనారోగ్య సమస్యల నుంచి కోలుకునేందుకు మందులు వాడాలని వైద్యుల సూచన ►టిడిపి లాయర్లు : ఐదు వారాలపాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చిన వైద్యులు ►టిడిపి లాయర్లు : ఆపరేషన్ చేసిన కంటికి ఐదు వారాలు ఇన్ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలన్న వైద్యులు ►టిడిపి లాయర్లు : ఐదు వారాలు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని వైద్యుల సూచన 3:12 PM, Nov 15, 2023 స్కిల్ స్కాం@హైకోర్టు ►స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ తరఫు న్యాయవాది ►చంద్రబాబు కంటి శస్త్రచికిత్స వైద్య నివేదిక కోర్టుకు అందజేత ►వైద్య నివేదికను హైకోర్టుకు అందజేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు 3:02 PM, Nov 15, 2023 స్కిల్ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది? ►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ స్కాం ►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం ►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం అంటూ ప్రచారం ►సీమెన్స్ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం ►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు ►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల పక్కదారి ►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్ ►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్) ►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST ►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు ►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ ►నిధులన్నీ సూట్కేస్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్కమ్టాక్స్ శాఖ ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్మెంట్లను గుర్తించిన CID ►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్ ►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు ►సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ ►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు ►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు ►రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. (ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు) 2:50 PM, Nov 15, 2023 బాబు తప్పు చేశారు.. ఇవీ ఆధారాలు : CID ►ఏపీ హైకోర్టు: CID అదనపు కౌంటర్ దాఖలు ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ కు సంబంధించి అదనపు కౌంటర్ ►కౌంటర్లో పలు కీలకమైన జడ్జిమెంట్లు ఉదాహరించిన సిఐడి 2:44 PM, Nov 15, 2023 తెలుగుదేశం పాలనలో జరిగింది మోసం : మల్లాది విష్ణు ►విజయవాడ : 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రజలను దగా చేసింది. ►టీడీపీ ఓట్లను ఎక్కడ తొలగించారో చర్చకి రావాలి. ►సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ కాదు.. తెలుగుదేశం పార్టీ బీ టీం ►మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుకు భజన టీంని ఏర్పాటు చేశాడు ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ. 27 కోట్లు చంద్రబాబు ఎలా దారి మళ్ళించాడో నిమ్మగడ్డ రమేష్ చెప్పాలి. ►నిన్న గుంటూరులో సమావేశమైంది చంద్రబాబు తొత్తులు. ►చంద్రబాబు అరెస్టు చట్ట ప్రకారం జరిగింది. ►యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఎలా పనిచేసాడో అర్థం కావట్లేదు ►యనమల రామకృష్ణుడు మతిపోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ►లోకేష్ కి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే అర్హత లేదు. ►ఆరోగ్యశ్రీ వ్యవస్థని టిడిపి ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. ►వైయస్సార్ ఆరోగ్య శ్రీ ని చంద్రబాబు దుర్భుద్ధితో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు. ►కరోనా టైంలో నువ్వు నీ బాబు హైదరాబాదులో దాక్కున్నారు. ►నిమ్మగడ్డ రమేష్, యనమల రామకృష్ణుడు, లోకేష్ అబద్ధాల ప్రచార కోరుగా మారారు 2:25 PM, Nov 15, 2023 కాచుకుంటారా ఓపెన్ ఛాలెంజ్ : వెల్లంపల్లి ►చంద్రబాబు,పవన్,లోకేష్ లకు వెలంపల్లి ఓపెన్ ఛాలెంజ్ ►చంద్రబాబు,లోకేష్,పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే పులివెందులలో పోటీ చేయాలి ►పోటీ చేసేందుకు నియోజకవర్గమే లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ►నాదెండ్ల మనోహర్ కు కళ్ళు మందగించినట్టు ఉన్నాయి ►సామాన్యుడికి మంచి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చూసి ఓర్వలేక పోతున్నారు ►వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతీ పిల్లాడికి అమ్మ ఒడి ఇస్తున్నాం ►టీడీపీ మాదిరి కకుర్తి పడే పద్ధతి మా ప్రభుత్వానికి లేదు 2:20 PM, Nov 15, 2023 బండారు హెబియస్ కార్పస్ ►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ భార్య పిటిషన్ పై విచారణ ►పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హెబియస్ కార్పస్ పిటిషన్ ►CC టీవీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించడానికి సమయం కోరిన పోలీసులు ►విచారణ ఈనెల 27కి వాయిదా వేసిన హైకోర్టు 2:15 PM, Nov 15, 2023 బాబు బెయిల్@హైకోర్టు ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభం ►స్కిల్ కేసులో చంద్రబాబు కు బెయిల్ ఇవ్వొద్దని కోరిన సీఐడీ ►280 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ 1:55 PM, Nov 15, 2023 హైకోర్టులో కొల్లు రవీంద్ర పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కొల్లు రవీంద్ర పిటిషన్ ►నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులిచ్చారన్న ఆరోపణలతో కేసు ►సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కొల్లు పిటిషన్ ►కొల్లు రవీంద్ర పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు 12:10 PM, Nov 15, 2023 బాబు పిటిషన్పై సీఐడీ అదనపు కౌంటర్ దాఖలు ►స్కిల్ స్కాంలో చంద్రబాబు పిటిషన్పై హైకోర్టులో విచారణ. ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై అదనపు కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ. ►కౌంటర్లో పలు కీలకమైన జడ్జిమెంట్లు ఉదహరించిన సీఐడీ. 11:27 AM, Nov 15, 2023 అసైన్డ్ భూముల కుంభకోణం కేసు ►అసైన్డ్ భూముల స్కాంలో దాఖలైన 9 పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొంత మంది దాఖలు చేసిన 9 క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ►తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు 10:55 AM, Nov 15, 2023 స్కిల్ స్కాంలో బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ ►స్కిల్ స్కాంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►అదనపు కౌంటర్ దాఖలు చేస్తామన్న సీఐడీ తరఫు న్యాయవాదులు. ►పాస్ ఓవర్ అడిగిన సీఐడీ తరఫు న్యాయవాదులు. ►ఈరోజు మధ్యాహ్నం విచారించనున్న ఏపీ హైకోర్టు. 10:16 AM, Nov 15, 2023 నేడు హైకోర్టులో చంద్రబాబు, నారాయణ కేసుల విచారణ ►స్కిల్ కుంభకోణం బెయిల్ పిటిషన్పై విచారణ ►అసైన్డ్ భూముల కుంభకోణంలో తనపై కేసును కొట్టేయాలంటూ నారాయణ దాఖలు చేసిన 2 క్యాష్ పిటిషన్లపై విచారణ ►స్కిల్ స్కాంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ ►అసైన్డ్ భూముల కుంభకోణంలో నారాయణ బినామి అంజనీకుమార్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన 2 పిటిషన్లపై విచారణ ►మద్యం కుంభకోణంలో మందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కొల్లు రవీంద్ర పిటిషన్ 9:44 AM, Nov 15, 2023 బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే. 7:20 AM, Nov 15, 2023 టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. ►నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి వెళ్లనున్న చంద్రబాబు. ►సమయం ముంచుకొస్తుండటంతో చంద్రబాబు, టీడీపీలో కలవరం. ►ఈలోగా కోర్టుల్లో ఊరట లభిస్తుందన్న ఆశలో చంద్రబాబు, టీడీపీ ►అత్యాశకు పోయి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి కోర్టులను ఇరకాటంలో పెట్టిన టీడీపీ లీగల్ టీం. ►ఇప్పుడు ఒకదానికి మరొకటి చిక్కుకుపోయి అసలుకే మోసం వచ్చే పరిస్థితి. ►కేసులో బెయిల్ కోసం అడగకుండా క్వాష్ కోసం పట్టుబట్టడంతో సీన్ రివర్స్. 6:58 AM, Nov 15, 2023 టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు ►హవాలా మార్గంలో చేరినట్టు గుర్తించిన సీఐడీ ►ఇతర కుంభకోణాల నిధులు కూడా చంద్రబాబు పార్టీ ఖాతాలోకే ►ఈ నిధుల గుట్టు రట్టు చేసేందుకు విచారణ వేగవంతం ►మొదట స్కిల్ స్కామ్లో కార్యాచరణకు ఉపక్రమణ ►టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ.. ►18న తాము కోరిన వివరాలతో సిట్ కార్యాలయానికి రావాలని పేర్కొన్న సీఐడీ 6:55 AM, Nov 15, 2023 తెలంగాణ రాజకీయాలతో చంద్రబాబు బిజీ బిజీ ►వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు మంత్రాంగం ►విడతల వారీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వర్చువల్ మీటింగ్లు ►రేవంత్ రెడ్డికి పూర్తిగా అండగా ఉండాలని తెలంగాణ పార్టీ నేతలకు పిలుపు ►చంద్రబాబు ఆదేశాలతో నిన్న తుమ్మలను పార్టీ కార్యాలయానికి పిలిచిన ఖమ్మం టిడిపి నేతలు ►పూర్తి స్థాయిలో మద్ధతిస్తాం, ఆర్థికంగా అండగా నిలుస్తాం, ఇంకేం కావాలంటూ తుమ్మలకు ఆఫర్ ►తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే ఎలాంటి సపోర్ట్ కావాలంటూ తెలంగాణ టిడిపి నేతల ఎదురు ఆఫర్లు ►అన్ని జిల్లాల్లో టిటిడిపి నేతలకు చంద్రబాబు నుంచి ఫోన్లు ►ఇక్కడ కాంగ్రెస్ ఉంటేనే.. మనకు ప్రయోజనం అంటూ చంద్రబాబు సందేశాలు 6:49 AM, Nov 15, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు: స్కిల్ స్కాం అంశం: మధ్యంతర బెయిల్ స్టేటస్: అనారోగ్యం కారణంగా మంజూరు వివరణ: నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి కేసు : స్కిల్ స్కాం అంశం: క్వాష్ పిటిషన్ స్టేటస్: సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ: ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్ కేసు : స్కిల్ స్కాం అంశం: రెగ్యులర్ బెయిల్ పిటిషన్ స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ: నవంబర్ 15కి వాయిదా పడ్డ కేసు కేసు : ఇసుక కుంభకోణం అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ: నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ: నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: మంజూరు చేసిన హైకోర్టు వివరణ: ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు: ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ: నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు: మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం: ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్: హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ: నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు. రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం: ముందయితే ఎలాగైనా లోకేష్ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి రెండో వర్గం: ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం ఒక వర్గం: కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి రెండో వర్గం: అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.? ఒక వర్గం: ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు రెండో వర్గం: పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి 6:47 AM, Nov 15, 2023 చంద్రబాబుకు ముంచుకొస్తున్న జైలు ముహూర్తం ►రాజకీయ చర్చలతో బిజీ బిజీగా చంద్రబాబు ►తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు సర్వ ప్రయత్నాలు ►సామాజిక వర్గం, టిటిడిపి నేతలతో నిరంతరాయంగా చర్చలు ►కేసుల రూపంలో వెంటాడుతున్న తప్పులు, అక్రమాలు ►వరుస పిటిషన్లతో కోర్టులపై ఒత్తిడి తెచ్చే కుట్ర -
టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమ నిధుల తరలింపునకు టీడీపీ ప్రధాన కార్యాలయం కేంద్రబిందువుగా మారిందని సీఐడీ గుర్తించింది. వివిధ కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధులను గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్టు విశ్వసిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతోపాటు చంద్రబాబుపై నమోదైన ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అసైన్డ్ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనం హవాలా మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఈ మేరకు సీఐడీ దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. దీంతో టీడీపీ ఖాతాల్లో చేరిన నిధుల లోగుట్టును రట్టు చేసే దిశగా సీఐడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. అందులో మొదటగా స్కిల్ స్కామ్ కేసులో కార్యాచరణకు ఉపక్రమించింది. ఈ కేసులో టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. తాము కోరిన వివరాలతో ఈ నెల 18న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హవాలా మార్గంలో రూ.27 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కొల్లగొట్టిన రూ.241 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరినట్టు సీఐడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లను డిజైన్ టెక్ వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అందులో రూ.27 కోట్లను టీడీపీ ఖాతాలో జమ చేసినట్టు సీఐడీ ఇటీవల గుర్తించింది. ఆ నిధులు పార్టీ బ్యాంకు ఖాతాలోకి ఎలా వచ్చాయన్నదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. దీనిపై ప్రాథమిక ఆధారాలు సేకరించాక సీఐడీ నెల క్రితం టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాల లావాదేవీలు వివరాలు తెలపాలని పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. దీంతో కంగుతిన్న టీడీపీ బ్యాంకు లావాదేవీల వివరాలను తెలిపేందుకు నాలుగు వారాల గడువు కావాలని సీఐడీకి సమాధానం ఇచ్చింది. నాలుగు వారాల గడువు ముగిశాక కూడా టీడీపీ ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. అంటే టీడీపీ బ్యాంకు ఖాతాల్లో చేరిన నిధుల్లో ఏదో గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమైంది. దాంతో సీఐడీ మరింత దూకుడు పెంచింది. టీడీపీ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను తెలపాలని టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు పంపింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పేరిట ఆ నోటీసులు జారీ చేసింది. ఇతర కుంభకోణాలపైనా.. నెల క్రితం పోస్టులో పంపిన నోటీసులపై స్పందించని టీడీపీ.. ప్రస్తుతం ప్రత్యక్షంగా పంపిన నోటీసులపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం స్కిల్ స్కామ్కు సంబంధించిన రూ.27 కోట్ల వివరాలే కాకుండా మొత్తం బ్యాంకు లావాదేవీల వివరాలు సీఐడీకి వెల్లడించాల్సిన అనివార్యత ఏర్పడింది. తద్వారా టీడీపీ అక్రమ నిధుల తరలింపు నెట్ వర్క్ గుట్టురట్టు కానుంది. ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఎంతమేర తరలించారో నిగ్గు తేల్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
Nov 14th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, & Political Updates 7:24 PM, Nov 14, 2023 ఇదెక్కడి సమన్వయం?.. రచ్చ రచ్చే! ► పొత్తు తర్వాత బయటపడుతున్న జనసేన-టీడీపీ కేడర్ మధ్య విబేధాలు ► ఇవాళ కాకినాడ పిఠాపురంలో అదే సీన్ ► పాత టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన రెండు పార్టీల సమన్వయ కమీటీ సమావేశం రచ్చ రచ్చ ► గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వర్మ ► ఈసారి సీటు తనకు ఇవ్వాలన్న నియోజకవర్గ జనసేన ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ► మహమహులే గత ఎన్నికల్లో ఓడిపోయారంటూ వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్యే వర్మ ► పవన్ కల్యాణ్ గురించే ఆ వ్యాఖ్యలంటూ వాగ్వాదానికి దిగిన జనసేన కేడర్ ► పరస్పర దూషణలు, కుర్చీల విసిరివేతతో ఉద్రిక్తత 2:24 PM, Nov 14, 2023 ఉండవల్లి కేసులో ఏం జరగవచ్చు? ► చంద్రబాబు స్కిల్ కేసును CBIకి అప్పగించాలంటూ హైకోర్టులో గత నెలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పిటిషన్ ► దీనికి సంబంధించి ఇప్పటికే 44 మందికి నోటీసులు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి ► సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఐడీలకు నోటీసులు ► కుంభకోణంలో కీలక నిందితులైన చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అప్పటి అధికారులు గంటా సుబ్బారావు, డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, డిజైన్టెక్ ఎండీ వికాస్ వినయ్ కన్వీల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, సంజయ్ డాగా, ఐఏఎస్ అధికారిణి అపర్ణ ఉపాధ్యాయ సహా 44 మందికి హైకోర్టు నోటీసులు ► ఈ కేసును CBI దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పిన CID ► అభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ► CBI దర్యాప్తు చేపడితే EDతో మరింత సులభంగా కలిసి ముందుకెళ్లే అవకాశం ► CBI, ED దర్యాప్తు వల్ల కేసు లోతుల్లోకి వెళ్లడం సులభం ► ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి నిధులు ఎలా మళ్లించాయో కనిపెట్టడం సులువు ► ఏ రకంగా చూసినా ఈ కేసును CBIకి అప్పగిస్తేనే పూర్తి కుంభకోణం బయటపడుతుందంటున్న నిపుణులు 1:42 PM, Nov 14, 2023 బాబును, బాబు మ్యానిఫెస్టోను నమ్మితే.. వెన్నుపోటే మిగిలేది.! : మంత్రి అంబటి రాంబాబు ► బాబు రుణమాఫీ అని మహిళలను మోసం చేశారు ► బంగారు రుణాలు మాఫీ అని చంద్రబాబు చేతులెత్తేశాడు ► సీఎం జగన్ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు ► ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదు ► చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ తప్ప ఇతర పార్టీ వారు ఒక్కరూ వెళ్లలేదు ► చంద్రబాబు అవినీతిలో పవన్ కు వాటా ఉందా లేదా? ► కాపులను బీసీల్లో కలుపుతామని టీడీపీ వారు మోసం చేశారు ► ముద్రగడను చిత్రహింస పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు ► వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు ► ఖమ్మంలో వారి సామాజిక వర్గం వారు చంద్రబాబును విమర్శలు చేస్తున్నారని దాడికి యత్నించారు ► 30 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది ► 2024లో పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నిక ఇది ► 175కు 175 ఇచ్చి జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ► రాజకీయాల్లో పార్టీని నాశనం చేసుకుని అమ్ముడు పోకూడదు ► బాబు పల్లకి మోసేందుకు జనసేనను పవన్ నాశనం చేసుకుంటున్నాడు 1:42 PM, Nov 14, 2023 ఇదేం మ్యానిఫెస్టో.. దీంతో ఏం గెలుస్తాం? ► జనసేన నుంచి బయటికొస్తున్న వ్యతిరేకతలు ► TDP, జనసేన మ్యానిఫెస్టోపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య విమర్శలు ► TDP, జనసేన మినీ మేనిఫెస్టో తీవ్ర నిరాశకు గురి చేసింది: హరిరామ జోగయ్య ► ఈ మేనిఫెస్టో YSRCP సంక్షేమ పథకాలకు ఏ మాత్రం ధీటుగా లేదు : హరిరామ జోగయ్య ► ఆంధ్రప్రదేశ్లోని 4 కోట్ల ప్రజలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టో ఉండాలి : హరిరామ జోగయ్య ► హరిరామజోగయ్య తరహాలోనే మరికొందరు బయటికొచ్చి విమర్శించేందుకు సిద్ధమైన నేతలు 1:23 PM, Nov 14, 2023 సమన్వయంగా ఏం సాధిద్దాం? ►నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం, జనసేన సమన్వయ సమావేశాలు ►మూడు రోజులపాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ►భవిష్యత్తుకు గ్యారెంటీ, ఓటర్ లిస్టు పరిశీలన పై సమావేశాల్లో చర్చ ►ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన తెలుగుదేశం, జనసేన సమావేశాలు ►క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలే అజెండాగా సమన్వయ సమావేశాలు ►జైలు ముందు నాయకులు పొత్తు ప్రకటించారు కానీ, గ్రౌండ్ లెవల్ సీన్ డిఫరెంట్గా ఉందంటున్న క్యాడర్ ►ఇన్నాళ్లు టిడిపిని ఎందుకు విమర్శించారు? ఇప్పుడు ఎందుకు చక్కనెక్కారు? ►ఇంకెన్నాళ్లు ఎజెండా పక్కనబెట్టి పక్క పార్టీ జెండా మోద్దాం? ►అసలు జనసేనకు ఎన్ని సీట్లిస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు? ►రెండు పార్టీల మ్యానిఫెస్టో అంటూ ఒకటే తయారు చేస్తున్నారు, దానికి గ్యారంటీ ఏంటీ? ►తెలంగాణ తరహాలో జనసేన అభ్యర్థులుగా టిడిపి నేతలే బరిలో దిగుతారా? ►అసలు పవన్కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు? ►మీకే నియోజకవర్గాల్లో గ్యారంటీ లేకుంటే.. రెండు పార్టీల భవిష్యత్తుకు ఏం గ్యారంటీ ఉంటుంది? ►క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్ను తెలుగుదేశం నేతలు అసలు పట్టించుకోవడం లేదు, దానికేమంటారు? ►కొన్ని చోట్లయితే మరీ వివక్ష చూపిస్తున్నారు, సభలు పెట్టుకుంటే వచ్చి జెండా పట్టుకోమంటున్నారు? ►జనసేన క్యాడర్ నుంచి తెలుగుదేశం పొత్తుపై బయటికొస్తున్న వ్యతిరేకత 1:12 PM, Nov 14, 2023 పవన్ కళ్యాణ్ పని చేస్తోంది బీజేపీ కోసమా? టిడిపి కోసమా? ►తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ►బీజేపీ 111 సీట్లలో పోటీ చేస్తుండగా, పవన్ పార్టీ జనసేన 8 చోట్ల పోటీ ►అయినా మనసంతా చంద్రబాబే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న పవన్ కళ్యాణ్ ►తన అభ్యర్థులు 8 మంది బరిలో ఉన్నా.. ప్రచారం వైపు తిరిగి చూడని పవన్ కళ్యాణ్ ►కేవలం ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు తప్ప .. మళ్లీ తెలంగాణలో కనిపించని పవన్ కళ్యాణ్ ►పాపం.. బీజేపీ నేతలు మాత్రం ప్రతీ కటౌట్లో పవన్కళ్యాణ్ ఫోటోలు పెట్టి మరీ ప్రచారం ►అయినా బీజేపీ కోసం గానీ, జనసేన కోసం గానీ ప్రచారం చేయని పవన్ కళ్యాణ్ ►పరోక్షంగా కాంగ్రెస్కు అనుకూలంగా పావులు కదుపుతున్న పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు డైరెక్షన్లో నామమాత్రంగా తెలంగాణలో కనిపిస్తోన్న పవన్ కళ్యాణ్ 1:04 PM, Nov 14, 2023 తెలంగాణ రాజకీయాలతో చంద్రబాబు బిజీ బిజీ ►వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు మంత్రాంగం ►విడతల వారీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వర్చువల్ మీటింగ్లు ►రేవంత్ రెడ్డికి పూర్తిగా అండగా ఉండాలని తెలంగాణ పార్టీ నేతలకు పిలుపు ►చంద్రబాబు ఆదేశాలతో నిన్న తుమ్మలను పార్టీ కార్యాలయానికి పిలిచిన ఖమ్మం టిడిపి నేతలు ►పూర్తి స్థాయిలో మద్ధతిస్తాం, ఆర్థికంగా అండగా నిలుస్తాం, ఇంకేం కావాలంటూ తుమ్మలకు ఆఫర్ ►తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే ఎలాంటి సపోర్ట్ కావాలంటూ తెలంగాణ టిడిపి నేతల ఎదురు ఆఫర్లు ►అన్ని జిల్లాల్లో టిటిడిపి నేతలకు చంద్రబాబు నుంచి ఫోన్లు ►ఇక్కడ కాంగ్రెస్ ఉంటేనే.. మనకు ప్రయోజనం అంటూ చంద్రబాబు సందేశాలు 12:40PM, Nov 14, 2023 మీ సొంత బిజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా?: ఎంపీ విజయసాయిరెడ్డి ►కారంచేడు 145 పోలింగ్ బూత్ల బీజేపీ పడిన ఆరు ఓట్లలో మీ ఓటు ఉందా ? ►మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశఖ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలోని సిద్ధాంతాలు గాలికి వదిలేసి మీరు ఎన్నిరోజులు ఉంటారు? ►గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు..వైజాగ్లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్లీ! కారంచేడు 145వ పోలింగ్ బూత్ లో బీజీపికి పడిన 6 ఓట్లలో అసలు పురందేశ్వరి గారి ఓటు ఉందా? మీ సొంత బిజెపి అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బిజెపి లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్దాంతాలు గాలికి వదిలేసే… pic.twitter.com/dCFECqOAeO — Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2023 8:00AM, Nov 14, 2023 పురందేశ్వరి, రామోజీలపై విజయసాయిరెడ్డి ఫైర్ ►చంద్రబాబు కోసమే పురందేశ్వరి పనిచేస్తన్నారు ►బీజేపీలో ఎన్నాళ్లు ఉంటారో చెప్పగలరా? ►ఎప్పటికప్పుడు పార్టీలు మార్చగల నైపుణ్యం పురందేశ్వరి సొంతం ►చంద్రబాబు కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు ►రామోజీ ఎందుకింత కడుపు మంట? ►‘ఎందుకీ ఎంపీలు?’ అంటూ రామోజీ తన కడుపు మంటను ‘ఈనాడు’ ద్వారా బయటపెట్టారు ► ‘ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, విభజన హామీల అమలు కోసం పార్లమెంట్ను స్తంభింపజేసిన వైఎస్సార్సీపీ ఎంపీలంటూ ఈనాడులో రాసింది మరిచిపోయావా? ►రామోజీ.. హోదా వద్దు ప్యాకేజి ముద్దు అన్న చంద్రబాబేమో పోరాట యోధుడా? 7:00AM,Nov 14, 2023 నవరత్నాలు కాపీ పేస్ట్.? ►మా మ్యానిఫెస్టోలో 11 అంశాలు : యనమల ►నవరత్నాల పేరుతో ఉన్న స్కీములన్నీ రద్దు చేశారు: యనమల ►అంటే మీ లక్ష్యం నవరత్నాలను రద్దు చేయడమేనా? : YSRCP ప్రస్తుతం YSRCP ఇస్తోన్న నవరత్నాలు 1. రైతు భరోసా 2. ఆరోగ్యశ్రీ 3. అమ్మఒడి 4. పింఛన్ల పెంపు 5. పేదలందరికీ ఇళ్ళు 6. ఫీజు రీయింబర్స్ మెంట్ 7. జలయజ్ఞం 8. మద్యపాన నిషేధం 9. ఆసరా, చేయూత ►ఇవే పథకాలను తిప్పి/మార్చి కొత్తగా ప్యాకింగ్ చేయాలన్న యోచనలో టిడిపి+జనసేన ►ఇన్నాళ్లు నవరత్నాలను తప్పుబట్టిన వాళ్లే ఇప్పుడు కాపీ కొట్టేందుకు సిద్ధమైన వైనం ►2014లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత టిడిపి+జనసేనదే 6:40AM, Nov 14, 2023 తెలంగాణలో కాంగ్రెస్కు జైకొట్టిన తెలుగుదేశం తమ్ముళ్లు ►కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో మద్ధతు తెలుపుతోన్న తెలుగుదేశం ►చేతులు కలిపిన కాంగ్రెస్, టిడిపి ►అంతా ఓపెన్గానే జరుగుతున్న వ్యవహరాలు ►ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ►తుమ్మలను ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన టీడీపీ ►టీడీపీ మద్దతును స్వాగతించిన తుమ్మల నాగేశ్వరరావు ►మరోవైపు టిడిపి మా తల్లిగారిల్లు అని ప్రకటించిన రేవంత్ ►రేవంత్ గెలుపుకోసం శ్రమిస్తామని చెప్పిన టిడిపి నేతలు చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ స్కాం అంశం : మధ్యంతర బెయిల్ స్టేటస్ : అనారోగ్యం కారణంగా మంజూరు వివరణ : నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్ కేసు : స్కిల్ స్కాం అంశం : రెగ్యులర్ బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 15కి వాయిదా పడ్డ కేసు కేసు : ఇసుక కుంభకోణం అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు. రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం ఒక వర్గం : కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.? ఒక వర్గం : ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి -
Nov 13th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 6:00 PM, Nov 13, 2023 నవరత్నాలు కాపీ పేస్ట్.? ►మా మ్యానిఫెస్టోలో 11 అంశాలు : యనమల ►నవరత్నాల పేరుతో ఉన్న స్కీములన్నీ రద్దు చేశారు: యనమల ►అంటే మీ లక్ష్యం నవరత్నాలను రద్దు చేయడమేనా? : YSRCP ప్రస్తుతం YSRCP ఇస్తోన్న నవరత్నాలు 1. రైతు భరోసా 2. ఆరోగ్యశ్రీ 3. అమ్మఒడి 4. పింఛన్ల పెంపు 5. పేదలందరికీ ఇళ్ళు 6. ఫీజు రీయింబర్స్ మెంట్ 7. జలయజ్ఞం 8. మద్యపాన నిషేధం 9. ఆసరా, చేయూత ►ఇవే పథకాలను తిప్పి/మార్చి కొత్తగా ప్యాకింగ్ చేయాలన్న యోచనలో టిడిపి+జనసేన ►ఇన్నాళ్లు నవరత్నాలను తప్పుబట్టిన వాళ్లే ఇప్పుడు కాపీ కొట్టేందుకు సిద్ధమైన వైనం ►2014లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసిన ఘనత టిడిపి+జనసేనదే 5:50 PM, Nov 13, 2023 ముగిసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటి ►ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయం ►విడివిడిగా హామీలు ఇవ్వొద్దని నిర్ణయం ►ఏదైనా మ్యానిఫెస్టోలోనే ఉండాలని నిర్ణయం ►ఉమ్మడి మేనిఫెస్టో కోసం కమిటీ ఏర్పాటు ►కమిటీలో ముగ్గురు చొప్పున రెండు పార్టీల సభ్యులు ►మినీ మేనిఫెస్టో రూపొందించిన తర్వాత కమిటీ ఆమోదానికి..! ►మినీ మేనిఫెస్టోలో ఉమ్మడిగా 11 అంశాలు ►ఏ విధంగా జనం ముందుకెళ్లాలి? ►ఏ విధంగా ఓటర్లను నమ్మించాలి? ►ఏ విధంగా ప్రజాకర్షక పథకాలను వల్లె వేయాలి? ►తాము పొత్తు ఎందుకు పెట్టుకున్నామో ఎలా వివరించాలి? ►తమ ఉమ్మడి ఎజెండా ఏంటో ప్రజలకు ఎలా చెప్పాలి? ►ఇన్నాళ్లు సంక్షేమాన్ని ఎందుకు వ్యతిరేకించామో చెప్పకుండా మ్యానిఫెస్టోను ముందుకు ఎలా తీసుకెళ్లాలి? 4:00 PM, Nov 13, 2023 తెలంగాణలో కాంగ్రెస్కు జైకొట్టిన తెలుగుదేశం తమ్ముళ్లు ►కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో మద్ధతు తెలుపుతోన్న తెలుగుదేశం ►చేతులు కలిపిన కాంగ్రెస్, టిడిపి ►అంతా ఓపెన్గానే జరుగుతున్న వ్యవహరాలు ►ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ►తుమ్మలను ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన టీడీపీ ►టీడీపీ మద్దతును స్వాగతించిన తుమ్మల నాగేశ్వరరావు ►మరోవైపు టిడిపి మా తల్లిగారిల్లు అని ప్రకటించిన రేవంత్ ►రేవంత్ గెలుపుకోసం శ్రమిస్తామని చెప్పిన టిడిపి నేతలు 3:00 PM, Nov 13, 2023 టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ ►టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం ►ఎన్టీఆర్ భవన్ లో భేటీ ►టీడీపీ-జనసేన నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున మేనిఫెస్టో కమిటీ ►టీడీపీ నుంచి యనమల, అశోక్ బాబు, పట్టాభి ►జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ►ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన పై చర్చ ►టీడీపీ ప్రతిపాదించిన సూపర్ సిక్స్, జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం పై చర్చ ►ఉమ్మడి మ్యానిఫెస్టో పై రూపకల్పనపై ప్రాథమిక అవగాహన వచ్చేందుకు చర్చలు 2:22 PM, Nov 13, 2023 ఈ పుట్టింటి, అత్తారింటి సీక్రెట్ల సంగతేంటీ రేవంత్? ►రేవంత్ ప్రకటనపై YSRCP చురకలు ►తనకు TDP పుట్టినిల్లు, కాంగ్రెస్ అత్తారిల్లు అని ప్రకటించిన రేవంత్ .@revanth_anumula ఇంతకూ కాంగ్రెస్ తో పెళ్ళి చేసినందుకు మీ పుట్టింటి @JaiTDP వాళ్ళు ఎన్ని వేలకోట్లు కట్నం ఇచ్చారు. ఆ కట్నంతోనే పీసీసీ పదవి కొన్నావా? భవిష్యత్తులో అత్తగారింట్లో గొడవ వస్తే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతావా? పుట్టింటి గౌరవం కాపాడే తాపత్రయంతో మళ్ళీ టీడీపీలో చేరిపోతావా?… pic.twitter.com/KYgBIB50pv — YSR Congress Party (@YSRCParty) November 13, 2023 2:13 PM, Nov 13, 2023 మ్యానిఫెస్టో సంగతి తర్వాత.? మీ లెక్కల సంగతి తేల్చండి : YSRCP ►ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు: ఎంపీ నందిగం సురేష్ ►2 ఎకరాలతో రెండు లక్షల కోట్ల ఎలా సంపాదించారో సీక్రెట్ చెప్పమని చంద్రబాబును అడుగుతున్నా ►పేదలు ఇంగ్లీషు మీడియం చదివితే పోటీ వస్తారేమోనని కోర్టుకెళ్లారు ►అమ్మఒడి పథకాన్ని ఆపాలని కోర్టుకు వెళ్లారు ►తల్లి ఖాతాకు రూ.15 వేలు వేస్తే కేసు వేయించారు ►తన మనవడి ఖాతాలో మాత్రం చంద్రబాబు రూ.250 కోట్ల ఆస్తి వేశారు ►దోపిడి సొమ్ములో కుటుంబసభ్యులందరికీ వాటాలిచ్చారు ►బాబు దృతరాష్ట్రుడి కౌగిలి రాష్ట్రానికి అవసరం లేదు 2:02 PM, Nov 13, 2023 మ్యానిఫెస్టోపై ఇంత నాన్చుడు ఎందుకు? ►మ్యానిఫెస్టోపై కొలిక్కి రాలేకపోతోన్న తెలుగుదేశం, జనసేన ►అసలు ఏం ఉండాలన్నదానిపై కొరవడిన స్పష్టత ►YSRCP కంటే బాగుండాలన్నది మాత్రమే తాపత్రయం ►అంతే తప్ప మాట మీద నిలబడాలన్నదానిపై లేని గ్యారంటీ ►మ్యానిఫెస్టోలో మళ్లీ తెరమీదికి వచ్చిన సామాజిక వర్గాలు ►ఇరు పార్టీల్లో అప్పుడే ఒకరిపై మరొకరికి అనుమానం ►తెలుగుదేశం ఇచ్చే మ్యానిఫెస్టో పాయింట్లపై జనసేనకు డౌట్లు ►మేం చెప్పుకునేది ఏం లేదా? అంటూ ప్రశ్నిస్తోన్న జనసేన నాయకులు ►ఇంతకీ మ్యానిఫెస్టో ఇప్పుడు విడుదల చేయాలా? లేదా? ►నవంబర్ 28న చంద్రబాబు జైలుకు వెళ్తే పరిస్థితి ఏంటీ? ►సంక్షేమంపై ఇన్నాళ్లు మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెనక్కి తీసుకుంటారా? ►మేం వస్తే ఇదిస్తాం అని ఇప్పుడెలా చెబుతున్నారు? ►ఇదే సరైన పద్ధతి అయితే ఇన్నాళ్లు సంక్షేమాన్ని ఎందుకు తప్పుబట్టారు? ►పైగా ఎల్లోమీడియాలో శ్రీలంకలా మారిపోతోందని విషప్రచారం ఎందుకు చేశారు? ►ఇప్పటిదాకా చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని ఒప్పుకుంటారా? 1:20 PM, Nov 13, 2023 కాసేపట్లో టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ ►నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం ►ఎన్టీఆర్ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు మేనిఫెస్టో కమిటీ భేటీ ►టీడీపీ-జనసేన నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున మేనిఫెస్టో కమిటీ ►టీడీపీ నుంచి యనమల, అశోక్ బాబు, పట్టాభి ►జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ►మేనిఫెస్టో కసరత్తుపై చర్చించనున్న కమిటీ 12:25 PM, Nov 13, 2023 చంద్రబాబు శిష్యులు మరి.! ►ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ ►YSRCP కార్యకర్త బెనర్జీపై గత నెల 28న కత్తితో దాడి ►దాడి ఘటనలో ఇద్దరు తెలుగుదేశం నాయకులతో పాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి పాత్ర ►గత 17 రోజులుగా అజ్ఞాతవాసంలో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ►పార్టీ నేతలతో కలిసి ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ప్రవీణ్ అరెస్ట్ 11:55 AM, Nov 13, 2023 నైపుణ్యం ఏది? ఎక్కడ? అంటూ పచ్చమీడియా వార్తలు ►నాలుగేళ్లలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 12 లక్షల 59 వేల మందికి శిక్షణ ►175 నియోజకవర్గాల్లో 192 స్కిల్ హబ్స్ లో శిక్షణ ►25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 26 స్కిల్ కాలేజీల ఏర్పాటు ►ప్రతినెల 52 జాబ్ మేళాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ►1,60,000 మందికి మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా శిక్షణ, సర్టిఫికెట్లు ►ఉపాధి కల్పనకు 50కి పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు ►తిరుపతిలో 50 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు ►పులివెందులలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పరిశ్రమల ప్రాంగణంలో స్కిల్ స్పోక్ ఏర్పాటు 11:15 AM, Nov 13, 2023 తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన, అసహనం ►చంద్రబాబు దేశంలో, అంతర్జాతీయంగా పేరున్న నాయకుడని నేను అనుకుంటున్నాను ►ఆయన్ను అరెస్ట్ చేస్తే టిడిపిలో దిక్కు, మొక్కు లేని పరిస్థితి వచ్చింది ►నాకు పార్టీతో సంబంధం లేదు, అయినా మాట్లాడుతున్నాను ►అలాంటిది పార్టీ వాళ్లు ఎందుకు నోరు విప్పడం లేదు? ►రాజమండ్రి జైలుకు వెళ్లి తెలుగుదేశం పార్టీని కాపాడతానని పవన్ కళ్యాణ్ చెప్పడం నాకు సిగ్గు అనిపించింది ►ఆయనకు పార్టీలో ఏ పదవి లేదు, పక్క పార్టీ నుంచి వచ్చి చెప్పారు ►మనం కలిసి ఉంటామని, పొత్తు పెట్టుకుంటామని జైలు ముందు ప్రకటించారు ►40 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి ఇంకెవరు దిక్కు లేరా? ►ఇంకొకరి మద్ధతు లేకుండా.. సొంతంగా నిలబడలేదా? ►ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం ►గత కొన్నేళ్లుగా చంద్రబాబు నడిపిస్తున్నాడు ►చంద్రబాబు జైలుకు వెళ్లితే తెలుగుదేశం పార్టీని పట్టించుకునే నాథుడే లేడా? ►తెలుగుదేశం పార్టీలో ఇంకెవరూ లేరా? ►పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చాలా మంది పదవులు అనుభవించారు ►ఏమైపోయారు; ఎందుకు బయటకు రావడం లేదు? ఎందుకీ నిర్లిప్తత? 10:00 AM, Nov 13, 2023 టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. ►నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి వెళ్లనున్న చంద్రబాబు. ►సమయం ముంచుకొస్తుండటంతో చంద్రబాబు, టీడీపీలో కలవరం. ►ఈలోగా కోర్టుల్లో ఊరట లభిస్తుందన్న ఆశలో చంద్రబాబు, టీడీపీ ►అత్యాశకు పోయి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి కోర్టులను ఇరకాటంలో పెట్టిన టీడీపీ లీగల్ టీం. ►ఇప్పుడు ఒకదానికి మరొకటి చిక్కుకుపోయి అసలుకే మోసం వచ్చే పరిస్థితి. ►కేసులో బెయిల్ కోసం అడగకుండా క్వాష్ కోసం పట్టుబట్టడంతో సీన్ రివర్స్. 8:45 AM, Nov 13, 2023 బాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే: యువకుడి అభిప్రాయం ►స్కిల్ స్కాం సూత్రధారి చంద్రబాబే. ►అనారోగ్య కారణాలతోనే బాబుకు మధ్యంతర బెయిల్ ►చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే. చంద్రబాబుకు అనారోగ్య కారణాలతోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే. ఎంతమంది కలిసి పొత్తులతో వచ్చినా అందరికీ మంచి చేస్తున్న సీఎం @ysjagan గారు ఈసారి కూడా గెలవడం ఖాయం. - ఓ యువకుడి అభిప్రాయం#PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/6Ao6J2Muqp — YSR Congress Party (@YSRCParty) November 13, 2023 8:30 AM, Nov 13, 2023 ఇసుకపై పచ్చ విషం.. ►ఇసుక తవ్వకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం. ►తప్పుడు కథనంతో విషం కక్కి ప్రజల్లో అపోహలు సృష్టించడమే ఎల్లో మీడియా లక్ష్యం. ►ఇసుకకు టెండర్ పెట్టింది సీఎంవో అంటూ నిస్సిగ్గుగా తప్పుడు కథనం వండివార్చాడు రామోజీ. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై పారదర్శక విధానాలను అమలు చేస్తోంది. అయినా ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు కథనంతో విషం కక్కి ప్రజల్లో అపోహలు సృష్టించడమే పనిగా పెట్టుకుంది పచ్చ పత్రిక ఈనాడు. తాజాగా ఇసుకకు టెండర్ పెట్టింది సీఎంవో అంటూ నిస్సిగ్గుగా తప్పుడు కథనం వండివార్చాడు… pic.twitter.com/9c6esJqqgk — YSR Congress Party (@YSRCParty) November 12, 2023 8:00 AM, Nov 13, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ స్కాం అంశం : మధ్యంతర బెయిల్ స్టేటస్ : అనారోగ్యం కారణంగా మంజూరు వివరణ : నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్ కేసు : స్కిల్ స్కాం అంశం : రెగ్యులర్ బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 15కి వాయిదా పడ్డ కేసు కేసు : ఇసుక కుంభకోణం అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు. 7:50 AM, Nov 13, 2023 రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం ఒక వర్గం : కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.? ఒక వర్గం : ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి -
అనకాపల్లి బరిలో బైరా దిలీప్ .. డిపాజిట్లు కూడా రావు: అయ్యన్న పాత్రుడు
స్కిల్ స్కాం కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడు దొరికిపోవడంతో టిడిపి శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్టీయార్ హయాంలో టిడిపికి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా నియోజక వర్గాల్లో టిడిపికి అభ్యర్ధులు కూడ లేని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి. అక అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా లోకల్ లో ఎవరూ లేకపోవడంతో దిలీప్ చక్రవర్తి అనే క్యాండిడేట్ ను దిగుమతి చేసుకుంది టిడిపి. దీనిపై పార్టీలోని మాజీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు పార్లమెంటు నియోజక వర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధించి టిడిపిని తుడిచి పెట్టేసింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతయ్యింది. నాలుగున్నరేళ్లుగా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టేవారే కరవయ్యారు. చోడవరం, మాడుగుల, ఎలమంచిలి వంటి నియోజక వర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు కూడా లేరు. ఈ నేపథ్యంలో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం నుంచి బరిలో దింపడానికి పార్టీ నాయకత్వం కోట్లకు పడగలెత్తిన దిలీప్ చక్రవర్తి అనే సంపన్నుణ్ని దిగుమతి చేసుకుంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారంతో పార్టీ సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. మాజీ మంత్రులు చింత కాయల అయ్యన్నపాత్రుడు , బండారు సత్యనారాయణలు అనకాపల్లి ఎంపీ సీటు నుండి పోటీ చేయాలని తహ తహ లాడుతున్నారు. తాము లేదా తమ తనయులను బరిలో దింపాలని వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఆకాశంలోంచి ఊడిపడ్డట్లు దిలీప్ చక్రవర్తి పేరు బయటకు రావడంతో పార్టీ నేతలు మండి పడుతున్నారు. తమలో ఎవరికి సీటు ఇచ్చినా గెలవకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు వస్తాయని ..అదే దిలీప్ వంటి బయటి వ్యక్తులను దింపితే డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టికే తీసుకెళ్తున్నారు. ఒక పక్క స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడి కారణంగా పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిపోయిందని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. స్కిల్ స్కాంతో పాటు మరో డజనుకు పైగా అవినీతి కేసుల్లో చంద్రబాబు ఉన్నట్లు సాక్ష్యాధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తుండడంతో టిడిపి నేతల్లో ఒక విధమైన నిరాశ నిస్సృహ ఆవరించేసిందని అంటున్నారు. -
Nov 12th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 04:30 PM, Nov 12, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ స్కాం అంశం : మధ్యంతర బెయిల్ స్టేటస్ : అనారోగ్యం కారణంగా మంజూరు వివరణ : నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్ కేసు : స్కిల్ స్కాం అంశం : రెగ్యులర్ బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 15కి వాయిదా పడ్డ కేసు కేసు : ఇసుక కుంభకోణం అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు 03:33 PM, Nov 12, 2023 పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ► సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో పురందేశ్వరి ► తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు ► వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు ► దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే ► పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే. పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023 11:40 AM, Nov 12, 2023 పాదయాత్ర నిలిపివేస్తే పరువు గోవిందా.! ► లోకేష్ తీరుపై తెలుగుదేశంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం ► ఇప్పటివరకు నడిచిన క్రెడిట్ అంతా పోతోందని ఆవేదన ► ఎల్లో మీడియాలో వస్తున్న అప్డేట్స్ ప్రకారం టిడిపి ఇన్సైట్స్ ఇలా ఉన్నాయి రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం ఒక వర్గం : కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.? ఒక వర్గం : ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి 11:25AM, Nov 12, 2023 లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా? ►మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు ► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు ► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన ► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు ► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు 1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ ► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా? 2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం ► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం ► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం 3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ► పెనమలూరులో ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్ ► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు ► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం ► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం 4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు ► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు ► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన ► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం ► తెలుగుదేశం, జనసేన సామాజిక వర్గం రెండు వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు ఇవ్వాలన్న లోకేష్ 11:22AM, Nov 12, 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు విడుదల తర్వాత మారిన టీడీపీ తీరు ►చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇక నిజం యాత్రకు ఫుల్స్టాప్ పెడతారని పార్టీలో టాక్ ►చంద్రబాబు ఇంటికొచ్చారు, నేను రాలేనని చెబుతున్నట్టు సమాచారం ►ఇప్పటికే లోకేష్ పేరుతో ఎన్నో యాత్రల ప్రచారం ►ముందు యువగళం, తర్వాత మేలుకో తెలుగోడా, ఆ తర్వాత మరొకటి ► ఢిల్లీకి వెళ్లడం, తిరిగి రావడం తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు ససేమిరా ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ముందు తన నియోజకవర్గం ఫైనల్ చేసుకుంటానంటున్న లోకేష్ 11:22AM, Nov 12, 2023 భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా? ► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు ► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ ► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను ► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర ► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు? ► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు? ► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా? 11:20AM, Nov 12, 2023 టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి.ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023 9:20 AM, Nov 12, 2023 పురంధేశ్వరి.. సీఐడీకి ఆధారాలివ్వాలి: విజయసాయి ►చంద్రబాబు ఏ-3గా ఉన్న లిక్కర్ స్కాం కేసుపై విజయసాయి కామెంట్స్ ►ఈ కేసులో తన వద్ద ఉన్న ఆధారాలను పురంధేశ్వరి.. సీఐడీకి అందజేయాలి. ►ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. ►వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలి. చంద్రబాబు గారు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023 8:00 AM, Nov 12, 2023 చంద్రబాబు మళ్లి జైలుకు వెళ్లాల్సిందే: సామాన్యుడి మనోగతం ►స్కిల్ స్కాంలో చంద్రబాబు నిందితుడు. ►కంటి ఆపరేషన్ కోసమే బాబుకు కోర్టు మధ్యంతర బెయిల్. ►షరతుల ప్రకారం ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే.. ►సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయం. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చింది. షరతుల ప్రకారం ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే. సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్న సీఎం వైయస్ జగన్ గారే ఈసారి కూడా గెలవడం ఖాయం. - యువకుడి మనోగతం#PublicVoice #AndhraPradesh… pic.twitter.com/8EMCUXQ3mr — YSR Congress Party (@YSRCParty) November 12, 2023 7:15, Nov 12, 2023 ఎల్లో మీడియా కమ్మ జర్నలిస్టులకు స్పెషల్ ఆతిథ్యం ►స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ నుండి బెయిల్ వచ్చే వరకు.. ►టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసిన 8 మంది కమ్మ జర్నలిస్టులకు లోకేశ్ ఆతిథ్యం ►ప్రత్యేకంగా వీరితో సమావేశమై స్కిల్ కేసును ప్రజల్లో తప్పుదారి పట్టేలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు కితాబు ►ఇదే సమావేశానికి టీడీపీ బీట్ చూసే సీనియర్ రిపోర్టర్ది వేరే సామాజిక వర్గం అని అతనికి ఆహ్వానం అందించలేదు! 7:00 AM, Nov 12, 2023 బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే. 6:50 AM, Nov 12, 2023 యథేచ్ఛగా ఇసుక లూటీ సాగించిన చంద్రబాబు ►కేబినెట్ కళ్లుగప్పి ఖజానాకు కన్నం ►మెమో, జీవోలు మంత్రివర్గం ఆమోదం లేకుండానే జారీ ►ఒకపక్క ఉచితమంటూనే మరోపక్క జరిమానాలు.. కావాల్సిన వారికి సంతర్పణకే ►ఇప్పుడు పారదర్శకంగా తవ్వకాలతో ఖజానాకు రూ.770 కోట్ల ఆదాయం ►నాడు రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన బాబు.. అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలు ►కరకట్ట నివాసం పక్కనే కొల్లగొడుతున్నా మొద్దునిద్రను ఆక్షేపించిన ఎన్జీటీ -
చంద్రబాబు స్కామ్ కేసులో సీఐడీకి తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు
-
Nov 11th : చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 8:04 PM, Nov11, 2023 మాట్లాడితే వ్యవస్థలంటారు.. మరి మీరు చేసిందేంటీ? ►కేసులు పెట్టించుకుంటే 48 గంటలలో హైకోర్టు నుంచి బెయిల్ ఇప్పిస్తానని చెప్పింది లోకేష్ కాదా? ►ఆలయాలపై దాడులు చేసి, తిరిగి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసి అశాంతి సృష్టించడానికి యత్నించింది టీడీపీ, జనసేన కాదా? ►అంగళ్లులో రెచ్చిపోయి కార్యకర్తలతో పోలీసులపై దాడులు చేయించింది చంద్రబాబు కాదా? ►పవన్ కళ్యాణ్ కాని, చంద్రబాబు నాయుడు కాని, లోకేష్ కాని తమ సభలలో ఎలా ప్రజలను రెచ్చగొట్టలేదా? ►ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మీటింగ్లు పెట్టింది చంద్రబాబు కాదా! ►కందుకూరులో జరిగిన తొక్కిసలాటకు కాని, గుంటూరు తొక్కిసలాటకు కాని, తద్వారా పదకుండు మంది మరణానికి గాని కారణం టీడీపీ కాదా? ►వాటినన్నిటిని సమర్ధించే దుస్థితికి పవన్ కళ్యాణ్ చేరుకోవడం కనిపించడం లేదా ►వలంటీర్ల మొదలు ఎవరిని పడితే వారిని పవన్ నోటికి వచ్చినట్లు దూషించడం సరైన చర్యా! పైగా ప్రభుత్వంపై ఆరోపణా? 6:52 PM, Nov 11, 2023 బాలకృష్ణకు అర్థం కావడానికి ఆలస్యమవుతోందా? ► కుటుంబసభ్యులపైనే చాణక్య నీతిని ప్రదర్శిస్తోన్న చంద్రబాబు ► అరెస్టయినపుడు రెండు రోజులు బాలకృష్ణ హడావిడి చూసి అర్జంటుగా ప్లాన్ మార్చిన బాబు ► ఇప్పటికిప్పుడు తెలంగాణకు వెళ్లి పార్టీని గెలిపించాలని బాలకృష్ణకు అసైన్మెంట్ ► బావ ఆదేశాలు అర్థం కాక.. తలపట్టుకుని హైదరాబాద్ వచ్చిన బాలకృష్ణ ► ఆ వెంటనే భీకర ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామని ప్రకటించిన బాలకృష్ణ ► నెల గడవకముందే బాలకృష్ణ స్టేట్మెంట్ను చెత్తబుట్టలో వేసేసిన బాబు ► అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీనే చేయబోవడం లేదని పార్టీ ప్రకటన ► బాబుకు ముందే ఇవన్నీ తెలిసి మరీ బాలకృష్ణను తెలంగాణకు పంపారని పార్టీలో చర్చ ► లోకేష్కు ఎలాంటి కష్టం రాకుండా అన్ని అడ్డంకులు తొలగించే పనుల్లో చంద్రబాబు 5:32 PM, Nov 11, 2023 బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే 4:03 PM, Nov 11, 2023 దొంగ ఓట్లపై దొంగాట ఆడుతుందెవరు? ►పక్కా ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లంటూ తెలుగుదేశం, పచ్చమీడియా ప్రచారం ►ఇటీవల దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు అంటూ CECకి ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు ►పలు చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒక అడ్రస్ లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడితో చాలా ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదు ►ఇదే విషయంపై దర్యాప్తులో బయటపడుతున్న అసలు నిజాలు ►టిడిపి నేతలు బలంగా ఉన్న చోట బోలెడు బోగస్ ఓట్లు ►ఇలాంటి ఓట్లను తొలగిస్తుంటే, అక్రమంగా టీడీపీ ఓట్లు తీసేస్తున్నారంటూ పచ్చమీడియా గగ్గోలు ►నిజమైన వ్యక్తుల ఓట్లు ఒక వేళ పోతే, ఆన్లైన్లో ధృవపత్రాలు పెట్టి మళ్లీ ఓటు పొందే అవకాశం ►అయినా బోగస్ ఓట్లు ఉండాలంటూ పచ్చమీడియా గగ్గోలు ►దొంగాట ఆడేది, గగ్గోలు పెట్టేది రెండూ టిడిపికి సంబంధించిన వాళ్లే 03:33 PM, Nov 11, 2023 టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు ►ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ►ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఇరు పార్టీల నిర్ణయం ►కమిటీలో టీడీపీ సభ్యులుగా యనమల, పట్టాభి, అశోక్ బాబు ►జనసేన తరఫున వరప్రసాద్, శశిధర్, శరత్ లకు కమిటీలో చోటు ►ఈ నెల 13న సమావేశం కానున్న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ 01:33 PM, Nov 11, 2023 తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ? ►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ? ►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్ సిటీ కట్టాడు ►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు ►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు కింది ఫోటో చూడండి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టీడీపీది కాదు 10:36 AM, Nov 11, 2023 2019 ఎన్నికల్లో కుప్పకూలిన టీడీపీ కంచుకోటలు ► అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం ► కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం ► పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు ► ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి ► శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి ► 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి ► పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. ► ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి ► ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్ గల్లంతు ► 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి ► అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్కు మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టీడీపీ, జనసేన సమన్వయం ► 2019లో పవన్కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు ► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్ ఎజెండా ► అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు ► ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి అసలు జనసేన కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది? ► తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు ► ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది ► జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం 08:37 AM, Nov 11, 2023 నోటీసులు పంపడంలో జాప్యం ఎందుకైంది? ►స్కిల్ కేసులో ఉండవల్లి పిల్పై హైకోర్టు విచారణ ►చంద్రబాబు, తదితరులకు నోటీసుల జారీలో జాప్యంపై ధర్మాసనం విస్మయం ►బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్కు ఆదేశం ►తదుపరి విచారణ 29కి వాయిదా 08:00 AM, Nov 11, 2023 యథేచ్ఛగా ఇసుక లూటీ సాగించిన చంద్రబాబు ►కేబినెట్ కళ్లుగప్పి ఖజానాకు కన్నం ►మెమో, జీవోలు మంత్రివర్గం ఆమోదం లేకుండానే జారీ ►ఒకపక్క ఉచితమంటూనే మరోపక్క జరిమానాలు.. కావాల్సిన వారికి సంతర్పణకే ►ఇప్పుడు పారదర్శకంగా తవ్వకాలతో ఖజానాకు రూ.770 కోట్ల ఆదాయం ►నాడు రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన బాబు.. అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలు ►కరకట్ట నివాసం పక్కనే కొల్లగొడుతున్నా మొద్దునిద్రను ఆక్షేపించిన ఎన్జీటీ 07:19 AM, Nov 11, 2023 బాబు గజగజ ►స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు ► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు ►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి ►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్ బాబు ►టెన్షన్లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్ ►స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్ కో ఈ ఉహా చిత్రాలకేం గానీ… ఇటు చూడు @JaiTDP, అప్పట్లో మీ బాబు @ncbn చేసిన నాటకాలు అంతా ఇంతా కాదు. ఈ అతి మీరు మర్చిపోయారేమో, మేము మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. అదిగో అక్కడ బులెట్ ట్రైన్, ఇదిగో ఇక్కడ మెట్రో ట్రైన్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి మీరు ప్రజల్ని ఏమార్చిన తీరు… https://t.co/syhKLkfCSN pic.twitter.com/r4LM2nDHOY — YSR Congress Party (@YSRCParty) November 10, 2023 07:10 AM, Nov 11, 2023 తెలంగాణలో ముసుగు తొలగించిన టీడీపీ ►కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారంలోకి దిగిన టీడీపీ ►చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్రెడ్డి కోసం రంగంలోకి టీడీపీ నేతలు ►నామినేషన్ల పర్వం ముగియగానే.. కాంగ్రెస్ ప్రచారానికి బహిరంగ మద్దతు ఇచ్చిన టీడీపీ ► కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు ►కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో కలగలిసిన టీడీపీ జెండాలు 07:08 AM, Nov 11, 2023 అసైన్డ్ భూముల స్కాంలో క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా ►ఈనెల 22వ తేదీకి విచారణ వాయిదా వేసిన హైకోర్టు ►స్కిల్ స్కాంలో బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 15కి వాయిదా ►ఉండవల్లి పిటిషన్పై విచారణ వాయిదా ►తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన కోర్టు -
కేసు రీ ఓపెన్..హైకోర్టులో చంద్రబాబుకు షాక్
-
Nov 10th : చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 09:09 PM, Nov 10, 2023 కుంభకోణాల్లో పీహెచ్డీ.. లూటీ రత్న ►అవినీతి పుట్టకతో అబ్బిన విద్య ►ఓనమాల దశలోనే కుట్రలు, కుతంత్రాలు నేర్చారు ►ఎమ్మెల్యే కాకముందే ఎన్నో వేషాలు ►కుంభకోణాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన కుట్రదారు ►టూటీ రత్న.. నారా చంద్రబాబు నాయుడు 08:50 PM, Nov 10, 2023 తెలంగాణలో ముసుగు తొలగించిన టీడీపీ ►కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారంలోకి దిగిన టీడీపీ ►చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్రెడ్డి కోసం రంగంలోకి టీడీపీ నేతలు ►నామినేషన్ల పర్వం ముగియగానే.. కాంగ్రెస్ ప్రచారానికి బహిరంగ మద్దతు ఇచ్చిన టీడీపీ ► కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు ►కాంగ్రెస్ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో కలగలిసిన టీడీపీ జెండాలు 4:51 PM, Nov 10, 2023 ఫైబర్నెట్ కేసులో ఏసీబీ కోర్టు విచారణ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్ ►సీఐడీ పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ ►ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే చెప్పిన సుప్రీం కోర్టు ►ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ తరపు లాయర్లు ►విచారణ వచ్చే నెల 1 కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 4:22 PM, Nov 10, 2023 2019 ఎన్నికల్లో కుప్పకూలిన టిడిపి కంచుకోటలు ► అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం ► కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం ► పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు ► ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి ► శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి ► 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి ► పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. ► ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి ► ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్ గల్లంతు ► 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి ► అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్కు 4:05 PM, Nov 10, 2023 మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టిడిపి, జనసేన సమన్వయం ► 2019లో పవన్కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు ► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్ ఎజెండా ► అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు ► ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి పార్టీ పోటీ చేసిన సీట్లు గెలిచిన సీట్లు వచ్చిన ఓట్లు ఓట్ల శాతం పోటీచేసిన చోట ఓట్ల శాతం YSRCP 175 151 1,56,88,569 49.95% 49.95% TDP 175 23 1,23,04,668 39.17% 39.17% జనసేన 137 1 17,36,811 5.53% 7.04% BJP 173 0 2,64,437 0.84% 0.85% ► అసలు జనసేన కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది? ► తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు ► ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది ► జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం 3:55 PM, Nov 10, 2023 మా కమ్మలు తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేస్తారు: TDP నేతల ప్రకటనలు అసలు తెలంగాణలో కమ్మల బలమెంత? ► ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం 1985లో అత్యధికంగా ఎనిమిది మంది గెలుపు ► మిగిలిన ఎన్నికలలో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే పరిమితం ► ఉమ్మడి రాష్ట్రంలో 1994లో అత్యధికంగా గెలిచిన కమ్మనాయకులు ► 1994లో ఏకంగా 53 మంది కమ్మ నాయకులు ఎమ్మెల్యేలుగా విజయం ► అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు కమ్మలు ► 2018లో సిర్పూరులో కోనేరు కోనప్ప, జూబ్లీహిల్స్లో మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, మిర్యాలగూడలో భాస్కరరావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్కుమార్ గెలుపు ► 2019లో ఏపీలో 17 మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి 22మంది గెలుపు ► 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది కమ్మల విజయం ► ఉమ్మడి ఏపీలో 2009లో 27 మంది కమ్మలు ఎమ్మెల్యేలుగా గెలుపు ► 2004లో 35 మంది, 1999లో 43, 1994లో 53, 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలుపు 3:50 PM, Nov 10, 2023 కిలారు పిటిషన్పై విచారణ ►కిలారు రాజేష్ లంచ్మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ►సీఆర్పీసీ 160,91 నోటీసులు, ఇల్లీగల్ అంటూ రిట్ పిటిషన్ ►సిఐడీ అధికారులు తనను విచారణలో బెదిరించారని పిటిషన్ లో పేర్కొన్న కిలారు రాజేష్ ►స్కిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కిలారు రాజేష్ 3:35 PM, Nov 10, 2023 గుంటూరులో సైకిల్ తొక్కేదెవరు? ►గుంటూరు లోక్సభ స్థానంలో పోటీకి టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ విముఖత.? ►రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించని గల్లా ►ఇటీవలి కాలంలో గుంటూరు వైపు తిరిగి చూడని గల్లా ►ఢిల్లీ లేదా హైదరాబాద్లో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్న గల్లా 3:22 PM, Nov 10, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు 30వ తేదీకి వాయిదా ►విజయవాడ : ఏపీ ఫైబర్ గ్రిడ్ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ ►ఈనెల 30వ తారీకు వరకు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేస్ పిటి వారెంట్ పై ఎలాంటి అరెస్టులు చేయవద్దన్న సుప్రీంకోర్టు ►ACB కోర్టు లో మెమో దాఖలు చేసిన సిఐడి తరుపున న్యాయవాదులు ►వచ్చే నెల ఒకటవ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏసిబి కోర్టు ►ఏపి ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డిన కేసులో అస్తులు అటాచ్మెంట్ చేయాలని ఏసిబి కోర్టులో పిటిషన్ పై విచారించిన ఏసిబి కోర్టు ►విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసిన ఏసిబి కోర్టు 3:03 PM, Nov 10, 2023 తమ్ముడి సీన్ అంతేనా? ►తెలంగాణలో 8 సీట్లతో సరిపెట్టుకున్న పవన్కళ్యాణ్ ►జనసేన స్థాయికి 8 సీట్లు సరిపోతాయని సూత్రీకరణ ►ఇచ్చిన 8 సీట్లలోనూ 2 సీట్లలో బీజేపీ లీడర్లే పోటీ ►బీజేపీలో ఉంటే టికెట్ సమస్య కాబట్టి.. పార్టీ మారి జనసేన నుంచి పోటీ చేస్తోన్న ఇద్దరు ►తెలంగాణ వ్యవహారాల పట్ల తెలుగుదేశం వెరీ హ్యాపీ ►తెలంగాణలో 8 ఇచ్చారు కాబట్టి.. ఏపీలో 16తో సరిపెట్టాలన్న యోచనలో తెలుగుదేశం నేతలు ►ఆ 16లోనూ ఆరు చోట్ల తమ వాళ్లనే జనసేనలోకి పంపాలన్న ప్లాన్ ►మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆటలో అరటిపండు అయిందంటున్న రాజకీయ విశ్లేషకులు 2:43 PM, Nov 10, 2023 అబద్దాలతో మోసం చేయడమే తెలుగుదేశం వ్యూహం ►తాడేపల్లిలో మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు ►అబద్దాలను సృష్టించటం, ఎల్లోమీడియాలో ప్రచారం చేయటమే టీడీపీ, జనసేన పని ►రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భయం సృష్టించాలని వారి ప్లాన్ ►నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ►చిత్తూరు డైరీని చంద్రబాబు సర్వనాశనం చేశారు ►మ్యాక్స్ చట్టం తెచ్చి తన మనుషులకు డెయిరీలను కట్టబెట్టారు ►సంగం డెయిరీ, విశాఖ డెయిరీ, కృష్ణా డెయిరీలను అలాగే తన వారి చేతిలో పెట్టారు ►ప్రభుత్వానికి చెందిన సంగం డెయిరీ ధూళిపాళ్ళ నరేంద్రకు ఎలా వెళ్లింది? ►73 ఎకరాల భూములు సంగం డెయిరీకి ఉండేవి ►ఆ భూములపై రూ.150 కోట్ల వరకు అప్పు తెచ్చుకున్నారు ►ధూళిపాళ్ళ నరేంద్ర కబ్జా చేసిన భూములు, డెయిరీలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి ►ప్రభుత్వ ఆస్థులను కొల్లగొట్టటంలో టీడీపీ వారికి ఉన్నంత స్కిల్ మరెవరికీ లేవు ►ప్రభుత్వ ఆస్తులను దోచుకునే టీడీపీ నేతలు మాపై ఆరోపణలు చేయటం ఏంటి? ►కోఆపరేటివ్ యాక్టులోకి సంగండెయిరీ, హెరిటేజ్ డెయిరీలను మార్చి ప్రభుత్వ సాయం అడగండి ►అమూల్ పేరు వింటేనే టీడీపీ నేతలకు నిద్ర పట్టటం లేదు ►అమూల్ రాకముందు సంగం డెయిరీ వారు 58 రూపాయలు రైతులకు ఇచ్చేవారు ►అమూల్ వచ్చాక రూ.69.35 లు ఇస్తున్నారు ►అమూల్ రాకముందు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో రైతులకు మద్ధతు ధర పెంచేవారు ►అమూల్ వచ్చాక బలవంతంగా రైతులకు పెంచి ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది ►ఇది తట్టుకోలేకనే అమూల్ పై ఎల్లోమీడియాలో విషం కక్కుతున్నారు ►3.73 లక్షల మంది రైతులు అమూల్ కి పాలు పోస్తున్నారు ►అమూల్ వలన 4,490 కోట్ల అదనపు లబ్ది రైతులకు చేకూరింది ►జనసేన పరిస్థితి విచిత్రంగా ఉంది ►తెలంగాణలోని ఒక పార్టీ నుండి, ఏపీలో మరొక పార్టీ నుండి స్క్రిప్టు వస్తుంది ►నాదెండ్ల మనోహర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది ►చంద్రబాబు పాలనలో ఆదరణ పథకం కింద ఏ ఒక్క కుటుంబమైనా బాగుపడిందా? ►టీడీపీ, జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయి ►గత ఎన్నికలలో కూడా ఒప్పందం మేరకే వేర్వేరుగా పోటీలో ఉన్నారు ►అమరావతి ఎవరి రాజధాని? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే అమరావతి పై ఎందుకు ప్రేమ చూపుతున్నారు ►పార్టీని పవన్ అమ్మేశాడని జనసైనికులు గుర్తించాలి ►ఏపీలో మద్యం బ్రాండ్లను పురంధేశ్వరి టేస్టు చేస్తున్నారేమో తెలీదు ►ఇప్పుడు ఉన్నవన్నీ చంద్రబాబు పర్మిషన్ తో వచ్చినవే ►కాబట్టి పురంధేశ్వరి వెళ్లి చంద్రబాబునే ప్రశ్నించాలి ►ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాస్త గౌరవం ఉండేది ►బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక తేడా వచ్చింది ►బీజేపీలో ఉన్న క్యాడరే పురంధేశ్వరితో విభేదిస్తున్నారు ►పురంధేశ్వరికి అంత ఇష్టం ఉంటే టీడీపీలో చేరితే మంచిది 2:35 PM, Nov 10, 2023 CBIకి స్కిల్ కేసు అప్పగించాల్సిందే.! ►స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా ►ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ►నోటీసులు ఇవ్వడంలో జాప్యంపై విచారణ జరపాలని రిజిస్ట్రీకి సూచించిన జడ్జి ►సీబీఐకి కేసు అప్పగింతలో మాకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్ ►విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన హైకోర్టు 2:05 PM, Nov 10, 2023 స్కిల్ కేసులో కిలారు రాజేష్ పిటిషన్ ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టుకు టీడీపీ నేత కిలారు రాజేష్ కొత్త వాదన ►స్కిల్ కేసులో తనకు CRPC 100 కింద నోటీసులు ఇచ్చి విచారణలో బెదిరించారంటూ కిలారు రాజేష్ పిటిషన్ ►క్వాష్ పిటిషన్ వేసిన రాజేష్ లాయర్ ఆదినారాయణరావు ►లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించిన ఏపీ హైకోర్టు ►కిలారు రాజేష్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ 12:30 PM, Nov 10, 2023 కమలం కోసం ఎదురుచూపులు ►పశ్చిమగోదావరి జిల్లాలో మాట్లాడిన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ► టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉంది: జోగయ్య ►ఈ కూటమికి జనరంజకమైన ఉమ్మడి మేనిఫెస్టో అవసరం ►వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రకటించాలి : జోగయ్య జోగయ్య వ్యాఖ్యలపై వైఎస్సార్సిపి సీరియస్ ►టిడిపి-జనసేన గెలవలేదని అర్థమయిందా? ►దేశంలో ఉన్న పార్టీలన్నింటిని కలుపుకుంటే తప్ప పరువు మిగలదని అవగతమయిందా? ►మీకు నిజంగా బలమే ఉంటే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయడం లేదు? ►ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని కడుపు చించుకున్నారు కదా.! ►ఎన్నికలు రాగానే అమలు చేయలేని పథకాలు ప్రకటించి జనాల్ని మోసం చేయాలనుకుంటున్నారా? 11:50 AM, Nov 10, 2023 ఉండవల్లి పిటిషన్పై విచారణ వాయిదా ►స్కిల్ స్కాం కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ ►ఉండవల్లి పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ►తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన కోర్టు 11:00 AM, Nov 10, 2023 అసైన్డ్ భూముల స్కాంలో క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా ►అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో బాబు, నారాయణ క్వాష్ పిటిషన్ ►బాబు, నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రీ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారించాలని హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు ►సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా ►ఈనెల 22వ తేదీకి విచారణ వాయిదా వేసిన హైకోర్టు 10:55 AM, Nov 10, 2023 స్కిల్ స్కాంలో బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►స్కిల్ స్కాంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 15కి వాయిదా 8:45 AM, Nov 10, 2023 కంటి ఆపరేషన్ కోసం బాబుకు మధ్యంతర బెయిల్: సామాన్యుడు ►చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ►టీడీపీ ఈ విషయాన్ని దాచిపెట్టి.. నిజం గెలిచిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ►ఎంతమంది కలిసి పొత్తులతో వచ్చినా 2024లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఈ విషయాన్ని దాచిపెట్టి.. నిజం గెలిచిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎంతమంది కలిసి పొత్తులతో వచ్చినా 2024లో వచ్చేది జగనన్న ప్రభుత్వమే. - సామాన్యుడి మనోగతం#PublicVoice… pic.twitter.com/7awryHjz84 — YSR Congress Party (@YSRCParty) November 10, 2023 8:02 AM, Nov 10, 2023 ►విజయవాడ : నేడు ఫైబర్ నెట్ కేసులో సీఐడీ పిటిషన్ పై విచారణ ►ఏడుగురి ఆస్తుల అటాచ్మెంట్ కోసం సీఐడీ పిటిషన్ 8:00 AM, Nov 10, 2023 నేడు పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ►నేడు ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుపై విచారణ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ ►ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబు ►నేడు ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐ విచారించాలని పిటిషన్ ►నేడు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ►మాజీ మంత్రి నారాయణపై పెట్టిన అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసును రీ ఓపెన్ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ 6:40 AM, Nov 10, 2023 చంద్రబాబుకు కొత్త టెన్షన్స్ ►స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు ► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు ►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి ►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్ బాబు ►టెన్షన్లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్ ►స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్ కో 6:30 AM, Nov 10, 2023 అయోమయంలో తెలుగుదేశం ►నవంబర్ 28న సాయంత్రం 5గంటలకు తిరిగి జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు ►ఈలోగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం కోటి ఆశలతో ఎదురుచూపులు ►ప్రస్తుతం అనారోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్ మీద ఉన్న చంద్రబాబు ►17ఏ సెక్షన్ను చూపించి కేసు కొట్టేయించుకోవాలన్న వ్యూహంలో బాబు లాయర్లు ►బాబు క్వాష్ పిటిషన్పై నవంబర్ 28 తర్వాత ఉత్తర్వులిస్తామన్న సుప్రీంకోర్టు ►అంటే చంద్రబాబు జైలుకు వెళ్లిన ఒకటి, రెండు రోజుల తర్వాత ఉత్తర్వులు వచ్చే అవకాశం ►ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు జైలుకే పరిమితం అయ్యే అవకాశం ►చంద్రబాబు బయట ఉంటేనే మ్యానిఫెస్టో విడుదల చేయాలన్న యోచనలో తెలుగుదేశం ►చంద్రబాబు చుట్టే ముడిపడి ఉన్న టిడిపి వ్యవహారాలు ►నవంబర్ 30 తర్వాతే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానంటోన్న లోకేష్ ►అప్పటివరకు పాదయాత్ర జోలెత్తవద్దంటున్న చినబాబు ►సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నా.. టిడిపిలో కనిపించని జోష్ తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ? ►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ? ►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్ సిటీ కట్టాడు ►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు ►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు కింది ఫోటో చూడండి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టిడిపిది కాదు కిందివి చదివిన తర్వాత మరిన్ని విషయాలు నిర్దారించుకోండి ►విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►వైజాగ్ NAD ఫ్లై ఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►బెజవాడ బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసేసాడు. ►రెండో ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ మొదలుపెట్టి, ఏడాదిలో జగనే పూర్తి చేసాడు. ►కృష్ణా నది రిటైనింగ్ వాల్ సీఎం జగనే స్టార్ట్ చేసి పూర్తి చేసాడు. ఇంకొకటి స్టార్ట్ చేసాడు. ►తిరుపతిలోని సేతు ఫ్లైఓవర్ అందంగా సీఎం జగన్ ప్రభుత్వమే పూర్తి చేసింది ►అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి సీఎం జగనే మొదలుపెట్టి, పూర్తి చేసాడు. ఇవే కాదు ►భోగాపురం ఎయిర్పోర్టుకి అన్ని అనుమతులు సాధించి, సీఎం జగనే మొదలు పెట్టి పనులు చేస్తున్నాడు. ►వెలిగొండ18 కి.మీ. మొదటి టన్నెల్ సీఎం జగనే పూర్తి చేసాడు. రెండో టన్నెల్ కూడా జగనే పూర్తి చేయబోతున్నాడు. ►ఒక రూపు లేని పోలవరాన్ని కూడా సీఎం జగనే ఒక రూపుకు తెచ్చాడు. స్పిల్ వే, అప్పర్, లోయర్ కాఫర్ డ్యాములు సీఎం జగనే పూర్తి చేసాడు. ►అప్రోచ్, స్పిల్ పైలట్ ఛానెళ్ళు కూడా సీఎం జగనే పూర్తి చేసాడు. నిర్వాసితులకు వేల ఇల్లు ఈ ప్రభుత్వమే కట్టించింది ►16 మెడికల్ కాలేజీలు సీఎం జగనే మొదలుపెట్టాడు, 5 పూర్తి చేసాడు. ►4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు సీఎం జగనే మొదలుపెట్టాడు, పనులు పరుగులు పెట్టిస్తున్నాడు. సీఎం జగన్ కాబట్టే చేస్తున్నాడు. ►ఇవే కాక, వేల పాఠశాలలను, విద్యాసంస్థలను సీఎం జగనే మార్చాడు. నాడు నేడు కింద రూపురేఖలు మొత్తం మార్చేశాడు. ►లక్షల ఇళ్లు సీఎం జగనే కట్టిస్తున్నాడు. ►వేల సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు సీఎం జగనే మొదలు పెట్టి, పూర్తి చేస్తున్నాడు. ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబుకి తాత్కాలిక కట్టడాలు తప్ప, ఒక్కటి ఏదైనా ఉందా ? మరెలా విజనరీ అయ్యాడు? రాజధాని ప్రాంతంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయాడు అసలు ఎలా మోస్తున్నారు ? హైదరాబాద్ రింగు రోడ్డు, ఎయిర్పోర్టు నుండి ఏదీ మొదలుపెట్టింది లేదు. పూర్తి చేసిందీ లేదు కానీ అన్నీ నేనే చేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టిస్తాడని ప్రచారం చేస్తున్నారు. అందుకే .. జగనే చేసాడు... జగనే చేస్తాడు... ఏదైనా జగనే చేయగలడు... అన్న నమ్మకం ప్రజల్లో ఉంది ►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేడన్నారు, చేశాడు. ►CPS రద్దు చేయలేడన్నారు, చేశాడు. PRC ఇవ్వలేడన్నారు, ఇచ్చాడు. -
Nov 9th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 09:17 PM, Nov 9, 2023 బాబు గజగజ ►స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు ► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు ►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి ►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్ బాబు ►టెన్షన్లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్ ►స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్ కో 05:59 PM, Nov 9, 2023 తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ? ►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ? ►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్ సిటీ కట్టాడు ►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు ►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు కింది ఫోటో చూడండి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టిడిపిది కాదు కిందివి చదివిన తర్వాత మరిన్ని విషయాలు నిర్దారించుకోండి ►విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►వైజాగ్ NAD ఫ్లై ఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►బెజవాడ బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసేసాడు. ►రెండో ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ మొదలుపెట్టి, ఏడాదిలో జగనే పూర్తి చేసాడు. ►కృష్ణా నది రిటైనింగ్ వాల్ సీఎం జగనే స్టార్ట్ చేసి పూర్తి చేసాడు. ఇంకొకటి స్టార్ట్ చేసాడు. ►తిరుపతిలోని సేతు ఫ్లైఓవర్ అందంగా సీఎం జగన్ ప్రభుత్వమే పూర్తి చేసింది ►అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి సీఎం జగనే మొదలుపెట్టి, పూర్తి చేసాడు. ఇవే కాదు ►భోగాపురం ఎయిర్పోర్టుకి అన్ని అనుమతులు సాధించి, సీఎం జగనే మొదలు పెట్టి పనులు చేస్తున్నాడు. ►వెలిగొండ18 కి.మీ. మొదటి టన్నెల్ సీఎం జగనే పూర్తి చేసాడు. రెండో టన్నెల్ కూడా జగనే పూర్తి చేయబోతున్నాడు. ►ఒక రూపు లేని పోలవరాన్ని కూడా సీఎం జగనే ఒక రూపుకు తెచ్చాడు. స్పిల్ వే, అప్పర్, లోయర్ కాఫర్ డ్యాములు సీఎం జగనే పూర్తి చేసాడు. ►అప్రోచ్, స్పిల్ పైలట్ ఛానెళ్ళు కూడా సీఎం జగనే పూర్తి చేసాడు. నిర్వాసితులకు వేల ఇల్లు ఈ ప్రభుత్వమే కట్టించింది ►16 మెడికల్ కాలేజీలు సీఎం జగనే మొదలుపెట్టాడు, 5 పూర్తి చేసాడు. ►4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు సీఎం జగనే మొదలుపెట్టాడు, పనులు పరుగులు పెట్టిస్తున్నాడు. సీఎం జగన్ కాబట్టే చేస్తున్నాడు. ►ఇవే కాక, వేల పాఠశాలలను, విద్యాసంస్థలను సీఎం జగనే మార్చాడు. నాడు నేడు కింద రూపురేఖలు మొత్తం మార్చేశాడు. ►లక్షల ఇళ్లు సీఎం జగనే కట్టిస్తున్నాడు. ►వేల సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు సీఎం జగనే మొదలు పెట్టి, పూర్తి చేస్తున్నాడు. ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబుకి తాత్కాలిక కట్టడాలు తప్ప, ఒక్కటి ఏదైనా ఉందా ? మరెలా విజనరీ అయ్యాడు? రాజధాని ప్రాంతంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయాడు అసలు ఎలా మోస్తున్నారు ? హైదరాబాద్ రింగు రోడ్డు, ఎయిర్పోర్టు నుండి ఏదీ మొదలుపెట్టింది లేదు. పూర్తి చేసిందీ లేదు కానీ అన్నీ నేనే చేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టిస్తాడని ప్రచారం చేస్తున్నారు. అందుకే .. జగనే చేసాడు... జగనే చేస్తాడు... ఏదైనా జగనే చేయగలడు... అన్న నమ్మకం ప్రజల్లో ఉంది ►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేడన్నారు, చేశాడు. ►CPS రద్దు చేయలేడన్నారు, చేశాడు. PRC ఇవ్వలేడన్నారు, ఇచ్చాడు. నిశ్శబ్దంగా ఆయనే అన్నీ చేస్తాడు. జనానికి అన్నీ చేస్తున్నాడు కాబట్లే అందుకే పచ్చమీడియాకు కళ్ల మంట : YSRCP 05:46 PM, Nov 9, 2023 అసలు జనసేన ఎటు వైపు? ►ఎన్డీఏలో మేం భాగస్వామిగా ఉన్నాం : నాదెండ్ల మనోహర్ ►తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ►తెలంగాణలో బీజేపీ పొత్తుతో పోటీ చేస్తున్నాం : నాదెండ్ల మనోహర్ ►మరి, ఏపీలో మీ స్టాండ్ ఏంటీ? ►బీజేపీతో పొత్తులో ఉన్నవాళ్లు తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ►రాజకీయ పార్టీగా మీకు కొన్ని విలువలు ఉండాలి కదా.! ►ఒక పార్టీతో అధికారికంగా పొత్తు, మరో పార్టీతో అనధికారికంగా పొత్తు ఉంటుందా? ►అసలు మీ మీద మీకు నమ్మకం లేదా? ►గోడ మీద పిల్లిలా ఎటు అవకాశం వస్తే అటు ఫిరాయిస్తారా? 05:06 PM, Nov 9, 2023 దీపావళి సెలవుల తర్వాతే బాబు క్వాష్పై కదలిక ►చంద్రబాబు క్వాష్పై సుప్రీంకోర్టు స్పష్టత ►దీపావళి సెలవుల తర్వాతే క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామన్న సుప్రీంకోర్టు ►నవంబర్ 12 నుంచి 19 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ►సుప్రీంకోర్టు సెలవుల అనంతరం క్వాష్ పిటిషన్పై సమయం వెచ్చించనున్న బెంచ్ ►నవంబర్ 30 లేదా డిసెంబర్ మొదటి వారంలో క్వాష్పై తీర్పు వచ్చే అవకాశం ►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న చంద్రబాబు నాయుడు 04:55 PM, Nov 9, 2023 అయోమయంలో తెలుగుదేశం ►నవంబర్ 28న సాయంత్రం 5గంటలకు తిరిగి జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు ►ఈలోగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం కోటి ఆశలతో ఎదురుచూపులు ►ప్రస్తుతం అనారోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్ మీద ఉన్న చంద్రబాబు ►17ఏ సెక్షన్ను చూపించి కేసు కొట్టేయించుకోవాలన్న వ్యూహంలో బాబు లాయర్లు ►బాబు క్వాష్ పిటిషన్పై నవంబర్ 28 తర్వాత ఉత్తర్వులిస్తామన్న సుప్రీంకోర్టు ►అంటే చంద్రబాబు జైలుకు వెళ్లిన ఒకటి, రెండు రోజుల తర్వాత ఉత్తర్వులు వచ్చే అవకాశం ►ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు జైలుకే పరిమితం అయ్యే అవకాశం ►చంద్రబాబు బయట ఉంటేనే మ్యానిఫెస్టో విడుదల చేయాలన్న యోచనలో తెలుగుదేశం ►చంద్రబాబు చుట్టే ముడిపడి ఉన్న టిడిపి వ్యవహారాలు ►నవంబర్ 30 తర్వాతే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానంటోన్న లోకేష్ ►అప్పటివరకు పాదయాత్ర జోలెత్తవద్దంటున్న చినబాబు ►సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నా.. టిడిపిలో కనిపించని జోష్ 03:54 PM, Nov 9, 2023 అంటే.. నడుస్తాడా లేదా.? అన్నది లోకేష్ చెప్పాలేమో.? ►లోకేష్ పాదయాత్రపై దీపావళి తర్వాత నిర్ణయిస్తాం : అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బెయిల్ విషయంలో మరింత క్లారిటీ వచ్చాక వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి సభలు పెడతాం ►ఆ ఉమ్మడి సభల్లో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు : అచ్చెన్నాయుడు 01:54 PM, Nov 9, 2023 విజయవాడలో టీడీపీ -జనసేన యాక్షన్ కమిటీ భేటీ ►సంయుక్త సమావేశానికి నారా లోకేష్ హాజరు ►టిడిపి నుంచి అచ్చెన్నాయుడు, పయ్యావుల,యనమల, పితాని, నిమ్మల - జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస ►యశస్వి,బొమ్మిడినాయకర్ హాజరు ►మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిద్దాం? ►ఉమ్మడి కార్యాచరణ ఎప్పుడు మొదలెడదాం? ►ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఒక కరపత్రం కావాలి కదా.! ►ఎలా ఉండాలి? ఎవరెవరు ఏం చేయాలి? రూపకల్పనపై చర్చ ►ఓట్లు, ఓటర్ల జాబితాపై ఇంటింటికి తిరగాలని ప్రణాళిక ►నియోజకవర్గాల స్ధాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నిర్ణయం 11:53 AM, Nov 9, 2023 ►ఫైబర్నెట్ కేసులో విచారణ వాయిదా ►ఈనెల 30కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►ఫైబర్నెట్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తున్నాం: సుప్రీంకోర్టు ►స్కిల్ స్కాం క్వాష్ పిటిషన్లోని కొన్ని అంశాలు ఫైబర్నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయి ►క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ చేస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం ►దీపావళి సెలవుల అనంతరం స్కిల్ కేసు తీర్పు వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు ►ఆరోగ్యకారణాల రీత్యా చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పై ఉన్నారన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►సుప్రీంకోర్టులో కేసు ముగిసేవరకు అరెస్టు చేయబోమన్న నిబంధన కొనసాగించాలన్న సిద్ధార్ధ లూథ్రా ►స్కిల్డెవలప్మెంట్ కేసులో తీర్పు పెండింగులో ఉన్నందున విచారణ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దన్న సుప్రీంకోర్టు ►స్కిల్డెవలప్మెంట్ కేసులో దీపావళి సెలవుల తర్వాత తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు ►స్కిల్ స్కాం కేసులో బాబు క్వాష్ పిటిషన్పై ఈనెల 23లోగా తీర్పు వచ్చే అవకాశం ►కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న 17-ఏ పిటిషన్పై దీపావళి సెలవుల తర్వాత తీర్పు 11:00 AM, Nov 9, 2023 కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా ►మద్యం స్కాంలో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్పై విచారణ ►తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►మద్యం కుంభకోణంలో ఏ2గా ఉన్న కొల్లు రవీంద్ర 8:00 AM, Nov 9, 2023 సుప్రీంలో లిస్ట్ అయిన కేసు.. నేడు ఫైబర్ నెట్ స్కామ్పై విచారణ ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసుపై విచారణ ►11వ నెంబర్ ఐటెంగా లిస్ట్ అయిన కేసు ►ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్ట్ ►హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన చంద్రబాబు ►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►స్కిల్ స్కాం కేసులో తాము తీర్పు ఇచ్చేవరకు ఆగాలని, గత విచారణలో సూచించిన సుప్రీంకోర్టు ►స్కిల్ స్కాంలో 17A పై తీర్పు ఎప్పుడు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాఫ్ట్కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంపై అవినీతి ఆరోపణలు 7:30 AM, Nov 9, 2023 జనసేన పవన్కు బిగ్ షాక్.. ►పవన్ కల్యాణ్కు షాకిచ్చిన ఓయూ విద్యార్థులు ►పవన్ ఒక బ్రోకర్.. రాజకీయాల్లో ఒక ఐటమ్ స్టార్ ►ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు. రాజకీయాల్లో పవన్ ఒక ఐటమ్ స్టార్ , ఒక బ్రోకర్ ఇక్కడ ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోం... తరిమికొడతాం - ఓయూ విద్యార్థులు pic.twitter.com/a4LZ7hJ4as — 𝙈𝙖𝙣𝙖 𝙔𝙨𝙧𝙘𝙥 (@ManaYsrcp7) November 8, 2023 6:56 AM, Nov 9, 2023 చంద్రబాబుకు సజ్జల కౌంటర్ ►మేనిఫెస్టోలో హామీల సంగతేంటి బాబు. ►బాబు మర్చిపోయినా మా దగ్గర ఆధారాలున్నాయి. 2014 టీడీపీ మేనిఫెస్టోని చంద్రబాబు అధికారంలోకి రాగానే వెబ్సైట్ నుంచి తీసేశాడు. ఆ మేనిఫెస్టోలో ఏడాదికి 12 సిలిండర్లని ఇస్తానని బాబు హామీ ఇచ్చాడు. కానీ.. గెలిచిన తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఏడాదికి మూడు సిలిండర్లని ఇస్తానని హామీ ఇస్తున్నాడు. బహుశా పాత హామీని అందరూ మర్చిపోయి… pic.twitter.com/N2hxwPBb31 — YSR Congress Party (@YSRCParty) November 8, 2023 6:55 AM, Nov 9, 2023 అబద్ధాలతో ఎల్లో మీడియా దోస్తీ: YSRCP ►చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎల్లో మీడియా కృషి. ►జర్నలిజం విలువలకి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. ►కొన్నేళ్లుగా బాబు మోచేతి నీళ్ల కోసం నిస్సిగ్గుగా నిజాల్ని దాచేస్తూ.. అబద్ధాలతో దోస్తీ చేస్తున్నారు... 6:50 AM, Nov 9, 2023 నేడు టీడీపీ పీఏసీ భేటీ ►నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ భేటీ ►చంద్రబాబు నివాసంలో ఈరోజు జరగనున్న పీఏసీ భేటీ ►టీడీపీ-జనసేన జేఏసీ భేటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చ ►ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై కసరత్తు ►ఓటర్ల జాబితా పరిశీలనలో జనసేనతో కలిసి పని చేసేందుకు ప్రణాళికలు 6:40 AM, Nov 9, 2023 సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై బుధవారం వెలువడని తీర్పు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ►ఈరోజు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►నవంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని గత విచారణలో చంద్రబాబు లాయర్లకు చెప్పిన ద్విసభ్య ధర్మాసనం ►ఫైబర్ పిటిషన్ విచారణ కంటే ముందే స్కిల్ పిటిషన్పై తీర్పు ఇస్తామంటూ స్పష్టీకరణ ►ఆ లెక్కన.. నేడు తీర్పు ఇచ్చాకే పిటిషన్ విచారించాల్సి ఉన్న బెంచ్ ►లేకుంటే ఫైబర్ పిటిషన్పైనా విచారణ వాయిదా పడే ఛాన్స్ ►సుప్రీం పిటిషన్పైనే ఆధారపడిన ఏసీబీ కోర్టు పీటీ వారెంట్ నిర్ణయం ►సుప్రీం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు(Chandrababu)పై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ► ఫైబర్ నెట్ కేసులో.. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగం -
స్కిల్ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం?!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్డెవలప్మెంట్ కుంభకోణం కేసులో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోనుందా?. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై బుధవారం సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులోనే చంద్రబాబును ఏపీ నేర దర్యాప్తు విభాగం (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్-సీఐడీ) అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 09వ తేదీ నుంచి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరకు.. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఈ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించారు. తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అయితే అప్పటికే స్కిల్ కేసు కీలక దర్యాప్తు దశలో ఉండడంతో.. ఆ పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఉత్కంఠకు తెర దించుతూ ఆ పిటిషన్ను విచారణకు చేపట్టింది ద్విసభ్య ధర్మాసనం. క్వాష్ పిటిషన్పై విచారణ సమయంలో.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారాయన. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని రోహత్గీ వాదించారు. ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో స్కిల్ కేసులో చంద్రబాబు వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు ఫైబర్నెట్ కేసులో ఇదే బెంచ్ ముందు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే.. స్కిల్ స్కాంలో క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించిన తర్వాతే ఫైబర్నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. ఫైబర్నెట్ పిటిషన్ను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అదే రోజున స్కిల్ స్కాం పిటిషన్ తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. ఈలోపు చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తితో నవంబర్ 09కి ఫైబర్నెట్ కేసు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం.. నవంబర్ 8వ తేదీన(రేపు) చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడిస్తామని ఇరుపక్షాలకు తెలిపింది. స్కిల్ స్కాంలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పింర్పించింది కూడా. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి పేరు నమోదు అయ్యింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసింది.ఆపై ఏసీబీ కోర్టు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో 52 రోజులపాటు చంద్రబాబు ఉన్నారు. అయితే కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. -
‘ప్రజలు ఛీ కొట్టినా నారా లోకేష్కు బుద్ది రాలేదు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు ఉందా? అని ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. దొంగచాటుగా మంత్రి అయిన లోకేష్.. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదని, ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా లోకేష్కు బద్ది రాలేదని జోగి రమేష్ దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్కు ఈడీ, ఐటీ ఎవరి పరిధిలో ఉన్నాయో తెలియదా? అని జోగి రమేష్ నిలదీశారు. కక్షసాధింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని, చంద్రబాబు పాపం పండింది కాబట్టే దొరికిపోయారని అన్నారు. ‘సీఎం జగన్ హీరో.. లోకేష్ జీరో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని సీఎం జగన్ హీరో అయ్యారు. చంద్రబాబు తప్పు చేయలేదని లోకేష్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? 3,300 కోట్ల దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు ఆధారాలతో సహా స్కిల్ స్కామ్ కేసులో బాబు దొరికిపోయారు కనుకే జైలుకు వెళ్లాడు. స్కాం బయట పడ్డాక రిమాండ్కు వెళ్లారు. రాజ్ భవన్ బయట లోకేష్ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. చంద్రబాబుని అరెస్టు చేశారనీ, జైలుకు పంపారని ఏడుపు మొదలెట్టాడు. అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? గవర్నర్కు ప్రజాస్వామ్యం, చట్టం గురించి తెలియదని లోకేష్ అనుకుంటున్నారు. సిద్దార్దలూత్ర లాంటి గంటకు కోటన్నర తీసుకునే లాయర్లతో వాదించినా ఎందుకు బెయిల్ రాలేదు?. కన్ను బాగలేదు, కాలు బాగులేదని చెప్పుకుని బయటకు వచ్చారు. చంద్రబాబుకు మెడికల్ గ్రౌండ్స్లేనే తప్ప సాధారణ బెయిల్ ఎందుకు రాలేదో తెలుసుకో లోకేష్. మమ్మల్ని తొక్కితాడంట. ఆల్రెడీ మేము తొక్కేసి, తాట తీశాం అన్న సంగతి తెలుసుకో. ఇదే స్కిల్ స్కాంలో ఈడీ అధికారులు నలుగురిని అరెస్టు చేశారని ఎందుకు చెప్పలేదు?. సీఐడీ మా పరిధిలో ఉందన్నావు సరే మరి ఈడీ, ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వలేదా? టీడీపీకి కాదు, తన జాతికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. అధికారం ఉంటే మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాదా?. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యూహాలు వేసినా టీడీపీ అడ్రస్ గల్లంతే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఒక తాటి మీదకు వచ్చి జగనే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇది గుర్తు పెట్టుకుని లోకేష్ పిచ్చిప్రేలాపనలు మానుకోవాలి’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
ఇది చంద్రబాబు గజదొంగల ముఠా
-
ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడు నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులకు అదనంగా ఎలాంటి షరతులు విధించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎక్కడా బహిరంగ ర్యాలీలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయరాదని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. అలాగే బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఆయన్ను ఆదేశించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులకు అదనంగా తాజా షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కోర్టు షరతులను ఉల్లంఘించకుండా చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించాలన్న సీఐడీ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సహేతుక ఆంక్షలే.. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స నిమిత్తం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధించిన షరతులకు అదనంగా మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు కేవలం అరోగ్య పరిస్థితి ఆధారంగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తాజా ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పునరుద్ఘాటించారు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇచ్చిన మధ్యంతర బెయిల్ను కస్టోడియల్ బెయిల్తో సమానంగా పరిగణించడనికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. ‘చంద్రబాబును చూడకుండా ప్రజలను నియంత్రిస్తూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. మధ్యంతర బెయిల్ పిటిషన్లో చంద్రబాబు ఎక్కడా ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరలేదు. మెడికల్ బెయిల్కు అదనంగా బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు చంద్రబాబు అనుమతి కోరి ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మా ముందున్న ఆధారాలను పరిశీలించిన తరువాత రాజకీయ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా చంద్రబాబును ఆదేశించేందుకు ఈ కోర్టు సుముఖత చూపుతోంది. ఇది చంద్రబాబు ప్రాథమిక హక్కులను హరించడం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది కోర్టు విధిస్తున్న సహేతుక ఆంక్ష మాత్రమే. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో ఈ నెల 31న విధించిన షరతులకు అదనంగా ఈ షరతులు విధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
24 గంటలూ రాజకీయం.. రోగాలు ఉన్నట్టా.. లేనట్టా?
-
బాబుకు అనారోగ్యమా! అర్ధరాత్రి వరకు ఊరేగింపులో ఎలా పాల్గొన్నారు?
ఎలాగైతేనేమీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా అయినా జైలు నుంచి బయటపడ్డారు. ఆయన లాయర్లు కోర్టులో చేసిన వాదనకు, జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి చాలా తేడా కనిపించింది. కోర్టులలో లాయర్లు చెప్పింది వింటే చంద్రబాబుకు ఏదో చాలా సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుకోవాల్సి వచ్చేది. ఆయన వృద్దుడు అయినందున జైలులో అనేక బాధలు పడుతున్నారేమో అన్న అనుమానం కల్పించగలిగారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర టీడీపీ మీడియా సంస్థలైతే అమ్మో.. చంద్రబాబుకు అలా.. అయ్యో చంద్రబాబుకు ఇలా .. అంటూ సానుభూతి కధనాలు రోజూ ప్రచారం చేసి జనాన్ని గందరగోళానికి గురి చేయడానికి యత్నించారు. మానవత్వంతో దయతలచి.. పాపం.. న్యాయమూర్తి కూడా మానవత్వంతో జాలి తలిచి కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపారు. ఏవో కొన్ని కండిషన్లు పెట్టి బెయిల్ ఇచ్చి, ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది, తిరిగి నవంబర్ 28న జైలుకు రమ్మని చెప్పారు. ఆ వెంటనే చకచకా విడుదల ప్రక్రియ జరిగి చంద్రబాబు జైలు బయట ఉన్న టీడీపీ కార్యకర్తలను, నేతలను కలుసుకున్నారు. అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా.. ఆ సందర్భంగా ఆయన కొద్దిసేపు మాట్లాడినప్పుడు, జనంలో ఉన్నప్పుడు అసలు బలహీనంగానే కనిపించలేదు. ఎప్పటి మాదిరే తనదైన శైలిలో మైకు కూడా పుచ్చుకున్నారు. తనకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపి, తాను తప్పు చేయలేదని మరోసారి తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అంత అనారోగ్యం ఉందని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి వరకు ఊరేగింపులో పాల్గొనగలగడం అంటే ఏమని అనుకోవాలి? జైలులో ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ప్రచారం చేశారు. చంద్రబాబు కుటుంబం, వారి లాయర్లు, చంద్రబాబు ఆరోగ్యం ఏదో బాగా క్షీణించిపోయిందేమోనన్న అనుమానాలు రేకెత్తించారు. అబద్దాలేనని తేలిపోయింది.. లోకేష్ సైతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పైన, భదత్రపైన చెప్పినవన్ని అబద్దాలేనని తేలిపోయింది. న్యాయ వ్యవస్థలో అబద్దాలు ఆడి తాత్కాలిక బెయిల్ పొందవచ్చని రుజువు చేసిన ఘనత మాత్రం తెలుగుదేశంకే దక్కింది. మామూలుగా అయితే ఇలాంటి కేసులలో న్యాయమూర్తులు మెడికల్ బోర్డులకు రిఫర్ చేస్తుంటారు. కాని ఇక్కడ చంద్రబాబు సీనియారిటీ, ఆయన చేసిన పదవులు ఉపయోగపడ్డాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం చంద్రబాబు కోరుకున్నట్లుగా టెంపరరీ బెయిల్ ఇచ్చి ఉండవచ్చు. వ్యవస్థలను ప్రభావితం చేయడానికి అదే సమయంలో పూర్తి స్థాయి కండిషన్లు పెట్టకపోవడం కూడా కొంత ఆశ్చర్యం కలిగించింది. మళ్లీ సీఐడీ చంద్రబాబు ర్యాలీలు చేయకుండా, రాజకీయ ప్రసంగాలు చేయకుండా, మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరవలసి వచ్చింది. దానికి కొంతమేర అనుమతించి, మళ్లీ విచారణ చేపడతామని అన్నారు. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ఎప్పటికప్పుడు న్యాయస్థానాలలో విచారణకు రావడానికి ఒక రోజు ముందు టీడీపీ ఏదో ఒక కార్యక్రమం పెట్టి వ్యవస్థలను ప్రభావితం చేయడానికి కూడా పరోక్షంగా గట్టి యత్నమే చేశారు. ఆ విషయంలో కొంత మేర సఫలం అయినట్లే అనిపిస్తుంది. బెయిల్ను కూడా దుర్వినియోగం చేసిన టీడీపీ లోకేష్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేశారని ఇంతకాలం ఆరోపించేవారు. మరి ఏ వ్యవస్థను ఆయన మేనేజ్ చేసి తండ్రికి తాత్కాలిక బెయిల్ తెప్పించారో చెప్పాలి. కేవలం మానవత్వ రీత్యా ఇచ్చిన బెయిల్ను కూడా టీడీపీ దుర్వినియోగం చేసింది. అదేదో మొత్తం కేసును కొట్టివేసినట్లు హడావుడి చేశారు. టపాసులు పేల్చేశారు. న్యాయం గెలిచిందని, నిజం గెలిచిందని ప్రచారం చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రాజమండ్రి జైలు వద్ద మళ్లీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఈ ఒక్క ఉదంతం చాలు ఇంకో సంగతి చెప్పాలి. జైలు వెలుపల చంద్రబాబు మనుమడు దేవాన్ష్ కూడా కలిశాడు. మరి ఆయనకు ఇప్పుడైనా నిజం చెప్పారో లేదో. తాత జైలులో నుంచి బయటకు వచ్చారని చెప్పారో లేక ఏదో విదేశం నుంచి అక్కడకు వచ్చారని చెప్పారో తెలియదు. అన్నం మెతుకు పట్టుకుంటే చాలు అది ఉడికిందో, లేదో చెప్పడానికి, టీడీపీని అబద్దాల పార్టీగా మార్చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలు. ఈ ఏభై రెండు రోజులు టీడీపీకాని, చంద్రబాబు కాని చేసిన విన్యాసాలు గమనిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైనా పరిశోధన చేయదలిస్తే మంచి సబ్జెక్ట్ అవుతుంది. వారికి పీహెచ్డీ రావడం ఖాయం. ఒక్కటే గగ్గోలు.. న్యాయ వ్యవస్థను డబ్బు ఉంటే ఎలా వాడుకోవచ్చో, ఎన్ని రకాల పిటిషన్లు వేయవచ్చో, ఎలా వాదనలు చేయవచ్చో తెలుసుకోవాలంటే చంద్రబాబు జైలు ఉదంతం ఒక పర్ఫెక్ట్ సబ్జెక్టు అని భావించవచ్చు. నిజానికి జైలుకు వెళ్లడానికిముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్ని బీరాలు పలికేవారు. నన్నుఏమి పీకలేవని పదే, పదే సవాల్ చేస్తుండేవారు. తన ఆరోగ్యం ఫిట్, తనకు వయసు ఒక సంఖ్య మాత్రమేనని గొప్పలు చెప్పేవారు. తీరా అన్ని ఆధారాలతో సహా ఆయనను అరెస్టు చేశాక ఒక్కటేగగ్గోలు. ఉన్నవి లేనివి అబద్ధాలు వల్లించి.. చివరికి తన భార్యను సైతం రోడ్డు ఎక్కించి ఉన్నవి, లేనివి అబద్దాలు చెప్పించారు. ఆయా కోర్టులలో చంద్రబాబు తరపున వేసిన పిటిషన్లు ఒక రికార్డు అవుతుందని అనుభవజ్ఞులైన లాయర్లు చెబుతున్నారు. ఒకసారి అసలు కేసుమొత్తం కొట్టివేయాలని అంటారు. ఇంకోసారి ముందస్తు బెయిల్అం టారు. మరోసారి మద్యంతర బెయిల్ అంటారు. అసలు కేసు మెరిట్స్ చర్చకు రాకుండా ఎన్ని జాగ్రత్తలు అయినా తీసుకుంటారు. తొలుత వెకేషన్ బెంచ్లో టీడీపీ లాయర్లు చేసిన నాట్ బిఫోర్ మి విన్యాసం కూడా ఒక చరిత్రే. మానిప్యులేషన్స్లో చంద్రబాబు దిట్ట జైలు నుంచి బయటపడడానికి ఎన్ని ట్రిక్కులు ప్లే చేశారో! ఇవన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే.. ఇలాంటి వ్యక్తా.. ఉమ్మడి ఏపీని, విభజిత ఏపీ పదమూడున్నరేళ్లు పాలించింది అని విస్తుపోవల్సిందే. మానిప్యులేషన్స్ చంద్రబాబు దిట్ట అని అంతా భావిస్తారు. ఒకవైపు కేసు కొట్టివేయడానికి కోట్లు వెచ్చించి లాయర్లను రంగంలో దించారు. మరో వైపు ఎలాగొలా మధ్యంతర బెయిల్పై బయటకు రావలని కొత్త ,కొత్త ఎత్తుగడలు వేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఒక్కోసారి ఒక్కో మాట చెప్పారు. భద్రత గురించి ఎన్ని కల్పితాలు అయినా చెప్పడానికి వెనుకకాడ లేదు. అప్పుడేమో సేఫ్.. ఇప్పుడు అన్సేఫా? నకిలీ లేఖలు సృష్టించారంటే ఏమని అనుకోవాలి. కోర్టువారికి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు రాసిన ఒక లేఖ చూడండి. ఎన్ని అబద్దాలు, అడ్డగోలు ఆరోపణలు చేశారో ఇట్టే తెలిసిపోతుంది. రాజమండ్రి జైలులో ఆయనకు భయమేస్తున్నదట. ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని, తీవ్రవాదులు వచ్చి తనపై దాడి చేస్తారేమోనని. మరి అంత భద్రతా సమస్య ఉన్న వ్యక్తి ఇంతకాలం జనం మధ్యలో రోడ్ల మీద ఎలా తిరగగలిగారు! అప్పుడేమో సేఫ్. జైలులో భధ్రతావలయంలో ఉంటేనేమో అన్ సేఫ్..చిత్రమే. జైలు నుంచి విడుదల అయిన తర్వాత అంతమంది జనంలో ఎలాంటి జంకు లేకుండా నిలబడి మాట్లాడారు. మరి దీనిని ఏమనాలి? ఆయన భద్రత ఏమైపోయింది. ఆయన అనారోగ్యం ఏమైపోయింది? దొంగ బుద్ది తెలిసిపోయింది. తనకు కంటి ఆపరేషన్ చేయాలట.. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా తప్పు లేదు. కానీ అత్యధికం అబద్దాలే అవుతుండడమే బాధాకరం. చంద్రబాబు ఆరోగ్యం గురించి భువనేశ్వరి మాట్లాడుతూ చాలా ధైర్యంగా ఉన్నారు. మానసికంగా ఆయనను ఎవరూ దెబ్బతీయలేరని అంటారు. ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనని ఇంకోసారి అంటారు. అధికారులు వీటన్నిటికి జవాబు ఇస్తే దానిని మాత్రం పట్టించుకోరు. ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి మీడియాలు ఆ వివరాలను దాచేయాలని విశ్వయత్నం చేశాయి. చంద్రబాబు రాసిన లేఖ వివరాలను మొదటి పేజీలో ప్రచురించిన ఈ పత్రికలు, జైళ్ల శాఖ డీఐజీ ఇచ్చిన కౌంటర్ను మాత్రం కప్పిపుచ్చే యత్నం చేశాయి. అక్కడే వీరి దొంగ బుద్ది తెలిసిపోయింది. ఉగ్రవాదం కన్నా, ఆర్ధిక ఉగ్రవాదమే ప్రమాదరకమని బాబే చెప్పారు జైలులోకి ఎవరో గంజాయి విసిరారట. ఆ విషయాన్ని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? జైలులో చాలా తీవ్రమైన నేరాలు చేసినవారు ఉన్నారట. జైళ్లకు వెళ్లేది నేరాలు చేశారన్న అభియోగాలపైనే కదా! ఆయన కోసం మంచి వారెవరో వెతుక్కొచ్చి జైలులో పెట్టలేరు కదా అని ఒక విశ్లేషకుడు చమత్కరించారు. పోనీ ఆయన చేసింది మంచి పనా! ప్రభుత్వ సొమ్మును స్వాహా చేయడం చాలా పెద్ద నేరమని, ఉగ్రవాదం కన్నా, ఆర్ధిక ఉగ్రవాదమే ప్రమాదరకమని, హత్యల కన్నా ఘోరమని చంద్రబాబే కదా గతంలో లెక్చర్లు ఇచ్చింది. ఆ విషయం మర్చిపోయి ఉంటారు! అయినా జైలు అధికారులు చెప్పినదాని ప్రకారం చంద్రబాబుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అసలు ఆయన స్నేహ బ్లాక్లో ఏ గదిలో ఉన్నది కూడా రహస్యంగానే ఉంచారట. చిత్రమేమంటే ముఖ్యమంత్రి సీఎ జగన్ ఒకసారి చంద్రబాబును ఉద్దేశించి ముసలాయన అని అన్నారు. అంతే ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేను ముసలివాడిని కాదు. జగన్ కంటే ఫిట్, ఇరవైనాలుగు గంటలు పని చేస్తానని బహిరంగ సభలలో సమాధానం చెప్పేవారు. తీరా జైలులో పడ్డాక, అమ్మో నా వయసు 73 ఏళ్లు.. ఈ ఏజ్లో ఇలా నిర్బంధిస్తారా? నాకు ఆ జబ్బు ఉంది.. ఈ జబ్బు ఉంది.. కంటి శుక్లాలు ఆపరేషన్ జరగాలి... అని బెయిల్ వచ్చిందాకా గోలగోల చేశారు. ఇకపై రాజకీయ యాత్రలు చేయబోనని చెప్పగలరా! తెలుగుదేశం నేతలు, ఆయన కుటుంబ సభ్యులు, వారి లాయర్లే చంద్రబాబును ముసలాయన అని చెబుతున్నారు. కోర్టులో కూడా అదే వాదన వినిపిస్తున్నారు. వీటన్నిటిని పరిశీలిస్తే నిజంగానే ఆయనకు భద్రత సమస్య ఉంటే ఆయన ఇకపై రాజకీయ యాత్రలు చేయబోనని చెప్పగలరా! అనారోగ్య సమస్య ఉంటే రాజకీయం కోసం ఎండలు, దుమ్ము,ధూళిలోకి వెళ్లకుండా ఉంటానని అనగలరా! అనలేరు. ఎందుకంటే కోర్టులకు ,ప్రజా కోర్టులకు ఆయన అన్నీ అబద్దాలు చెబుతున్నారు కనుక. యధాప్రకారం ఇక భువనేశ్వరి కూడా ఆయన బాటలోనే ఉన్నవి, లేనివి కల్పించి చెబుతూ యాత్రలు చేస్తున్నారు. టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, బండ్ల గణేష్ వంటివారు అతిగా ఏడ్చేస్తున్నట్లు మాట్లాడిన తీరు మరీ ఏహ్యంగా ఉంది. నిత్యం అసత్యాలతో ప్రజలలో సానుభూతి రాజకుమారి తన నటనతో భువనేశ్వరిని మెప్పించాలని చూశారు. భువనేశ్వరి చక్కగా నవ్వుతూ కనిపిస్తుంటే, ఈమె మాత్రం తెచ్చిపెట్టుకున్న గద్గద స్వరంతో దేవాన్ష్ తాతగారు ఎక్కడున్నారని అడుగుతున్నాడా? అని ప్రశ్నించారు. దానికి కొద్దిగా తడుముకున్న భువనేశ్వరి వెంటనే ఓ అబద్దం చెప్పేశారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లారని అతనికి చెబుతున్నారట. ఇప్పుడు స్వయంగా దేవాన్ష్ను జైలు వద్దకే తీసుకు వచ్చి తాతకు స్వాగతం పలికించారు. మరి దీనిని ఏమనాలి. ఇలా ఒకటికాదు.. నిత్యం అసత్యాలతో ప్రజలలో సానుభూతి సంపాదించాలని వీరు చేస్తున్న ప్రయత్నాలు వెగటు పుట్టిస్తున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చాక దగ్గరదారి వదలి, దూర మార్గం గుండా, గంటల తరబడి వాహనాలలో రోడ్డు మార్గంలో ప్రయాణించడాన్ని ఏమనాలి? న్యాయ వ్యవస్థను ఎలాగైనా మాయ చేయగలిగామన్న ధైర్యంతోనే ఇలా చేస్తున్నారా! సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఆసక్తికర కామెంట్ గురించి చెప్పాలి. చంద్రబాబు కుటుంబంలోని ఆ నలుగురు అయినా నిజాలు మాట్లాడుకుంటారా? లేదా? అన్నది ఆ కామెంట్! దీనికి ఎవరు జవాబిస్తారు! టీడీపీ నేతలు కొందరు సత్యమేవ జయతే అంటూ ప్రకటనలు చేశారు. అది సత్యమేవ జయతేనా?అసత్యమేవ జయతేనా అన్నది వారికి తెలియదా! -
కరకట్ట ఇంట్లో చంద్రబాబుకి ఓదార్పులు (ఫొటోలు)
-
కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించిన చంద్రబాబు!
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తొలిరోజే కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తూనే మీడియాతో మాట్లాడారాయన. అంతేకాదు.. జనం మధ్య తిరగకూడదని, ఆస్పత్రికి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కోర్టు విధించిన షరతులనూ ఆయన ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబుకి ఉన్న అరోగ్య కారణాల రీత్యా మానవతాధృక్పథంతో నాలుగు వారాలపాటు పలు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ర్యాలీలో పాల్గొనకూడదని.. మీడియాతో మాట్లాడకూడదు.. కేసు దర్యాప్తును ఏకంగానూ ప్రభావితం చేయకూడదని తీర్పు ఉత్తర్వుల్లో జస్టిస్ మల్లికార్జునరావు స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ హైకోర్టు షరతుల్ని చంద్రబాబు లెక్కచేయలేదు. బయటకు రాగానే వెంటనే మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో.. మధ్యంతర బెయిల్ షరతుల ఉల్లంఘనను సీఐడీ న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. కేవలం కంటి సర్జరీ కోసమే ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28వ తేదీన సాయంత్రం తిరిగి రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే మధ్యంతర బెయిల్ వెంటనే రద్దు అవుతుందని కోర్టు చంద్రబాబును హెచ్చరించింది కూడా. కోర్టును బాబు తప్పుదోవ పట్టించారు కోర్టు తీర్పును ఉల్లంఘించిన చంద్ర బాబు బెయిల్ రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి మంగ రాజు కోరుతున్నారు. ఆరోగ్య కారణాలు చూపి, బెయిల్ మీద వచ్చిన చంద్రబాబు.. మీడియా సమావేశంలో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారాయన. ‘‘చంద్రబాబు తనకు రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుపట్టించారు. ఆరోగ్యం బాగోలేదని నాటకాలు ఆడారు. కాబట్టి, వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలి. జైలుకు పంపించాలి’’ అని చీకటిమిల్లి మంగరాజు ఒక ప్రకటనలో కోరారు. -
ఇదెక్కడి ‘రోగం’?
సాక్షి, అమరావతి: రోగానికి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తానంటూ కాళ్లావేళ్లా పడి ఎలాగోలా బయటపడ్డ ఓ వృద్ధ నేత విజయోత్సవాలు నిర్వహించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో న్యాయస్థానం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ ఇస్తే నిజం గెలిచిందంటూ టీడీపీ నేతలు నిస్సిగ్గుగా బుకాయించడం విస్తుగొలుపుతోంది! 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధ నేత, రిమాండ్ ఖైదీకి కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు మానవతా దృక్పథంతో హైకోర్టు షరతులతో తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. సహజంగా జైల్లో ఉండే ఏ ఖైదీకైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే, అత్యవసరంగా సర్జరీ లాంటివి నిర్వహించాల్సి వస్తే న్యాయస్థానం కొన్ని షరతులతో బెయిల్ ఇస్తుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది. అంతేకానీ ఆయనేమీ శుద్ధపూసగా భావించి క్లీన్చిట్ ఇవ్వలేదు. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఇంకా అలాగే ఉంది. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, ఫైబర్నెట్ స్కామ్, అక్రమంగా మద్యం డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చిన కేసులు న్యాయస్థానాల్లో అలాగే ఉన్నాయి. ఏ కేసులోనూ చంద్రబాబు నేరం చేయలేదని కోర్టు తీర్పు చెప్పలేదు. అయినా సరే చంద్రబాబు, ఆయన బృందం నిజం గెలిచిందంటూ ఊరేగింపులు నిర్వహిస్తూ స్వాతంత్య్ర పోరాటం చేసి జైలు నుంచి విడుదలైనట్లుగా రాద్ధాంతం చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నాక నవంబర్ 28వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు మళ్లీ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని కోర్టు స్పష్టంగా చంద్రబాబును ఆదేశించింది. అలాంటప్పుడు ఇందులో నిజం ఎక్కడ గెలిచిందో, ఎలా గెలిచిందో అర్థంకాక సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కార్యకర్తలను తరలించి హడావుడి అనారోగ్య సమస్యలున్న ఖైదీలకు అత్యంత సాధారణంగా న్యాయస్థానాలు ఇచ్చే బెయిల్ను తమ విజయంగా టీడీపీ నేతలు అభివర్ణిస్తుండడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. షరతులతో తాత్కాలిక బెయిల్ వస్తుందని ముందే తెలియడంతో రాజమహేంద్రవరానికి టీడీపీ కార్యకర్తలను పెద్దఎత్తున తరలించారు. సెంట్రల్ జైలు పరిసరాలకు చేరుకుని నానా హడావుడి సృష్టించారు. పోలీసులను, బారీకేడ్లను తోసుకుంటూ జైలు వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ చేరుకునే వరకు హడావుడి చేసేలా టీడీపీ ముందే ప్రణాళిక రూపొందించింది. జాతీయ రహదారి మీదుగా చంద్రబాబు ఏ ప్రాంతానికి ఏ సమయంలో వస్తారో రూట్మ్యాప్, షెడ్యూల్ కూడా ఆ పార్టీ విడుదల చేసింది. ప్రతిచోటకూ కార్యకర్తలు, నాయకులు రావాలంటూ పార్టీ కార్యాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిలకు సమాచారం ఇచ్చింది. ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలను తీసుకువచ్చారు. కాన్వాయ్ను నెమ్మదిగా పోనిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆయన్ను చూసేందుకు ఎగబడుతున్నారని ప్రచారం హోరెత్తించారు. వాస్తవానికి చంద్రబాబును చూడడానికి సాధారణ ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆది నుంచి డ్రామాలే చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి ఆయనతోపాటు టీడీపీ నేతలంతా నిజాలను దాచి కేవలం అబద్ధాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కిల్ స్కామ్లో అవినీతి జరిగిందా? లేదా? అనే ప్రశ్నకు సూటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఐటీకి ఆద్యుడని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, నిప్పని, ఆయన లేకపోతే రాష్ట్రమే లేదనే తరహాలో ప్రచారాలకు దిగారు. కోర్టుల్లో మాత్రం చంద్రబాబు 70 ఏళ్ల వయసు పైబడిన వారని, అనారోగ్య సమస్యలున్నాయనే కారణాలతో బెయిల్ అడుగుతూ వచ్చారు. ఇందుకోసం చంద్రబాబు కుటుంబం రోజుకో కొత్త డ్రామాను తెరపైకి తెచ్చింది. ఆయన జైలుకు వెళ్లిన మొదట్లో స్నానానికి వేడి నీళ్లు ఇవ్వడంలేదని, దోమలు కుడుతున్నాయనే అర్థం లేని ఆరోపణలు చేసి అబాసుపాలయ్యారు. చంద్రబాబు ఉన్న బ్యారక్లోకి సీఎం జగన్ కావాలని దోమలను పంపి ఆయన అనారోగ్యం పాలయ్యేలా చేస్తున్నారంటూ వాదనలు కూడా చేసి ప్రజల్లో చులకనయ్యారు. వీటిని చూసి జనం నవ్వుకోవడంతో బాబుకు చర్మ సమస్యలున్నాయని, దద్దుర్లు వస్తున్నాయని, జైల్లో సరైన వైద్యం అందించడం లేదంటూ మరో ఎత్తుగడ వేశారు. వైద్యులు ఆయనకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ టీడీపీ చెబుతున్న వాటిల్లో నిజం లేదని స్పష్టం చేయడంతో మరో నాటకానికి తెర తీశారు. జైల్లో గంజాయి స్మగ్లర్లు, నక్సలైట్లు ఉన్నారని, వారి నుంచి బాబుకు ప్రాణహాని ఉందంటూ కొన్నిరోజులు హంగామా నడిపారు. చంద్రబాబును చంపేస్తామంటూ నక్సలైట్లు పోలీసులకు లేఖ రాశారని, జైల్లో డ్రోన్లు ఎగరేస్తున్నారని పసలేని ప్రచారాలు చేశారు. తొలిరోజే కోర్టు ఆదేశాలు బేఖాతర్ తమ అధినేతను అన్యాయంగా జైల్లో పెట్టారు, ఆధారాలు లేవంటూ రోజూ డ్రామాలతో కాలం గడపడమే కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జరిగిన అవినీతిపై ఒక్క ప్రశ్నకు కూడా చంద్రబాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. కోర్టుల్లోనూ తమ అధినేత గొప్పతనం, అనారోగ్యం, గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారనే వాదనలు వినిపించారు. అంతేకానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా ఒక్కసారి కూడా ఆయన న్యాయవాదులు చెప్పలేదు. చివరికి ఆయన కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించాలని వైద్యులిచ్చిన ఓ నివేదికను చూపించి కనికరించి బెయిల్ ఇవ్వాలని వేడుకున్నారు. ఇన్ని డ్రామాల తర్వాత ఎట్టకేలకు కోర్టు ఆయన వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీన్ని గొప్ప విజయంగా, నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని చెప్పుకుంటూ చంద్రబాబును ఊరేగింపుగా తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాత్కాలిక బెయిల్పై విడుదలైన చంద్రబాబు తొలిరోజే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించినా ఖాతరు చేయలేదు. జైలు నుంచి బయటకు రాగానే మైకు అందుకున్నారు. -
కంటి చికిత్స కోసం కండీషన్లతో బెయిల్
సాక్షి, అమరావతి: దసరా సెలవుల్లో న్యాయమూర్తులపై నాట్ బిఫోర్ అస్త్రాలను ప్రయోగించి విఫలమైన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తాత్కాలిక బెయిల్ పొందడంలో సఫలమయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు మంగళవారం అనుమతించింది. కుడి కంటికి శుక్లాల (కాటరాక్ట్) శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఆయనకు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఎడమ కంటికి ఏ ఆసుపత్రిలో (డాక్టర్ ఎల్వీ ప్రసాద్) అయితే శస్త్రచికిత్స చేయించుకున్నారో అదే ఆసుపత్రిలో ఇప్పుడు శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అనుమతిచ్చింది. మానవతా దృక్పథంతో పాటు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఏసీబీ కోర్టు సంతృప్తి మేరకు రూ.లక్షతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సొంత ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు చంద్రబాబుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. తిరిగి లొంగిపోయే సమయంలో తనకు వైద్యులు అందించిన చికిత్స, ఏ ఆసుపత్రిలో చికిత్స పొందారు.. తదితర వివరాలను సీల్డ్ కవర్లో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కు అందచేయాలని చెప్పింది. ఈ సీల్డ్ కవర్ను అలాగే ఏసీబీ కోర్టు ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ను, నవంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని చంద్రబాబును ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసిన ఏ వ్యక్తిని కూడా ఆ వివరాలు కోర్టుకు, సంబంధిత అథారిటీకి తెలియచేయకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించడం గానీ, భయపెట్టడం గానీ, ప్రలోభాలకు గురి చేయడం గానీ చేయరాదని హైకోర్టు తన 16 పేజీల ఉత్తర్వుల్లో చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జున రావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక బెయిల్ కోసం అనుబంధ పిటిషన్పై సోమవారం జరిగిన విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారానికి తన నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఆయన ఉత్తర్వులు వెలువరించారు. స్కిల్ కుంభకోణం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. తాత్కాలిక బెయిల్ ఉత్తర్వుల సారాంశం ఇదీ.. ఈ వయస్సులో వృద్ధాప్య సమస్యలు మామూలే ► అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి 2023 జూన్ 21 నుంచి ఆరు నెలల్లో కుడి కంటికి కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని చంద్రబాబుకు వైద్యులు సిఫారసు చేశారు. దూరదృష్టి కలిగిన ఓ వ్యక్తి కేవలం కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేయించుకునేందుకు మాత్రమే బెయిల్ కోరతారని అనుకోవడం అహేతుకమని ఈ కోర్టు భావిస్తోంది. ► ఒకవేళ అదే నిజం అయితే మధ్యంతర బెయిల్ దాఖలు చేసేందుకు 2023 అక్టోబర్ 25 వరకు చంద్రబాబు వేచి చూడాల్సిన అవసరం ఉండేది కాదు. చంద్రబాబు వయసును ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ వయసులో వృద్ధాప్య సమస్యలు రావడం మామూలే. చంద్రబాబు తన అనారోగ్యానికి సంబంధించి సమర్పించిన సర్టిఫికెట్ల యథార్థతను సందేహించే విషయంలో ఈ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు లేవు. ► డాక్టర్ శ్రీనివాసరావు తన రెండో నివేదికలో ఎక్కడా కూడా చంద్రబాబుకు కంటి శస్త్ర చికిత్స అవసరం లేదని చెప్పలేదు. అందువల్ల అదనపు అడ్వొకేట్ జనరల్ సూచించినట్లు చంద్రబాబును మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాలని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఈ కోర్టుకు కనిపించడం లేదు. చంద్రబాబు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కింది కోర్టు నుంచి గానీ, హైకోర్టు నుంచి గానీ బెయిల్ కోరేందుకు ఎంత మాత్రం అడ్డంకి కాదు. ► అనారోగ్య సమస్యల కారణంతో మధ్యంతర బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుందన్నది ఎవరి వాదనా కాదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేంత వరకు ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ జరపరాదన్న అదనపు ఏజీ సుధాకర్రెడ్డి వాదనను ఆమోదించలేకున్నాం. కంటికి శస్త్ర చికిత్స అవసరమే ► ఓ వ్యక్తిపై వచ్చిన నేరారోపణల తీవ్రత కంటే అతని అరోగ్యం, క్షేమాన్నే ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. దర్యాప్తులో భాగంగా కస్టడీ విధించడం శిక్షాత్మకం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం ముఖ్యం. ప్రతి వ్యక్తికి కూడా సంపూర్ణ, సమగ్ర వైద్య సాయం పొందే స్వతఃసిద్ధ హక్కు ఉంటుంది. కస్టడీలో ఉన్న వ్యక్తులు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. వారికి తగిన, సమర్థవంతమైన వైద్య చికిత్స అందించేందుకు అనుమతివ్వడం తప్పనిసరి అని ఈ కోర్టు విశ్వసిస్తోంది. ► ఓ వ్యక్తి జీవితం ప్రమాదంలో ఉన్నప్పుడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని కొన్ని పరిస్థితులకు లోబడి పరిమితం చేయడం సాధ్యం కాదు. చంద్రబాబుకు శస్త్రచికిత్స అవసరం లేదని ఏ వైద్య నివేదికలు కూడా చెప్పడం లేదు. చంద్రబాబు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వారికి వైద్య సాయం అందించడం తప్పనిసరి. ముఖ్యంగా కుడి కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరమని ఈ కోర్టు భావిస్తోంది. న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకోలేరు ► ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం, న్యాయ ప్రక్రియ నుంచి చంద్రబాబు తప్పించుకుంటారనేందుకు చిన్నపాటి అవకాశం కూడా కనిపించడం లేదు. విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేదు. వైద్య సాయం అవసరమైన వ్యక్తికి తక్షణమే సమర్థవంతమైన సమగ్ర చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు ధృడంగా నమ్ముతోంది. ► బాధాకరమైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా, కేవలం శస్త్ర చికిత్స చేయించుకునేందుకు వీలుగా మాత్రమే ఈ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తోంది. అందుకే గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న ఆసుపత్రిలో ఇప్పుడు కూడా శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వడం సహేతుకమని ఈ కోర్టు భావిస్తోంది. -
52 రోజుల బాబు జైలు జీవితం ఇలా..
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరైంది. చంద్రబాబు 52 రోజులపాటు జైలులో ఉన్నప్పటికీ ఆయన కోరిక మేరకు ఏసీతో సహా అన్ని సదుపాయాలు కల్పించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 24 గంటలపాటు ప్రత్యేక వైద్య బృందాన్ని కేటాయించారు. రోజూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు కూడా ఇచ్చారు. ఇలా 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం సాగింది. 53వ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నుంచి విడుదల వరకు ముఖ్య పరిణామాలు ఇలా.. ♦ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ♦రిమాండ్ ఖైదీగా సెప్టెంబర్ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ♦ జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు. ♦ కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు. ♦మొదట సెపె్టంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. ♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు. ♦ సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్. దీన్ని అక్టోబర్ 5 వరకు కొనసాగించారు. ♦ జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది. ♦ చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బందం ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ వసతి కచ్చిచారు. ♦ నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు. ♦ చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిíÙయల్ రిమాండ్ పొడిగించింది. ♦ వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి. ♦ బాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా 5 కిలోలు బరువు తగ్గారంటూ విష ప్రచారం. ♦ చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉండేవారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విడుదల సమయానికి అర కిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నారు. ♦ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 1 వరకు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించిన ఏసీబీ కోర్టు. ♦ తన కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు. ♦ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. -
సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు: మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి జిల్లా: చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదని నాలుగు వారాలు కండిషన్ బెయిల్ ఇస్తే.. సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇల్లు అలకగానే పండగ చేసుకోవడం కాదని విమర్శించారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన చంద్రబాబు బెయిల్ అంశంపై ఈ మేరకు స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
చంద్రబాబు బెయిల్ కండీషన్లు పెంచిన ఏపీ హైకోర్టు
-
జైలు నుంచి విడుదలైన చంద్రబాబు..కానీ..!
-
చంద్రబాబుకు కండిషనల్ బెయిల్ ఇచ్చారు
-
నిజం ఇంకా గెలవలేదు: మంత్రి అంబటి
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవెలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి వచ్చిన బెయిల్ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని, దీనిపై టీడీపీ చాలా హంగామా చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారని తెలిపారు. బాబుకు కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్ ఇచ్చారన్న అంబటి.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. నిజం ఇంకా గెలవలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం లేదని అన్నారు అంబటి రాంబాబు. కాసాని జ్ఞానేశ్వర్కు జ్ఞానోదయం అయిందన్నారు. ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని తెలిపారు. వచ్చే ఎన్నికల ముందో, తర్వాతో ఏపీలో కూడా జెండా పీకేస్తారని విమర్శించారు. చదవండి: AP: రైలు ప్రమాద బాధితులకు చెక్కుల అందజేత -
నవంబర్ 28 సాయంత్రం 5 లోపు లొంగిపోవాలి.. లేదంటే..
-
సీఐడీ అధికారుల కేసుపై లంచ్ మోషన్ పిటిషన్
-
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుంది: న్యాయవాదులు
-
కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్: న్యాయవాది
-
టీడీపీ డ్రామాలు ప్రజలు పట్టించుకోవడం లేదు: సజ్జల
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ చేస్తున్న డ్రామాలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ‘‘చంద్రబాబు అరెస్ట్ భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదు. ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్కు పంపింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. సీఎం జగన్పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు న్యాయపరంగానే పోరాడాం. ప్రజాకోర్టులో సీఎం జగన్ తిరుగులేని విజయం సాధించారు. 2019లో 151 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు జైలులో ఉండటం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది. వేర్వేరు కారణాలతో చనిపోయినా చంద్రబాబు కోసమే మృతిచెందినట్టు ప్రచారం చేస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు. ‘‘టీడీపీ స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి నిన్న హైదరాబాద్లో ఈవెంట్ చేశారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదు. ఏదో మ్యూజికల్ ఈవెంట్కు రిహార్సల్ చేసినట్లు ప్రదర్శన చేశారు. స్కిల్ స్కామ్ కేసు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలీ ఈవెంట్తో అందరికీ తెలిసింది. ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో మేం ఇది చేశామని చెప్పుకుని ఎన్నికలకు వెళ్లాలి. మేం సంక్షేమ పాలన అందించామని చెప్పి ప్రజల ముందుకెళుతున్నాం. మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేసిన వ్యక్తి చంద్రబాబు. మేనిఫెస్టోను చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?.. సీఎం జగన్ ట్వీట్ -
స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్
-
మరీ ఇంత పిచ్చిగానా?.. ప్రజలు గమనిస్తున్నారు బాబూ..
అవినీతి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికే కేవలం కమ్మ కుల నాయకుడిగా మార్చి మరీ పిచ్చిగా, ఆ కులానికి చెందిన కొందరు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రపంచం అంతా చంద్రబాబు అరెస్టుపైనే ఆందోళనతో ఉన్నట్లు చిత్రించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని టీడీపీ మీడియా సంస్థలు చేస్తున్న యత్నాలు కూడా ఇదంతా కమ్మ కులం అతి అన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నాయి. చంద్రబాబు జైలులో ఉంటే కృతజ్ఞతా సభల పేరుతో అవి అభినందన సభలో, సానుభూతి సభలో, సంతాప సభలో అర్థం కాని రీతిలో సంగీత విభావవరిలు నిర్వహిస్తున్నారు. అది కూడా పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్లో.. ✍️మరో వైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో కొందరు దాడి చేసి నోటికి వచ్చినట్లు దూషించడం దారుణం. ఇంత కాలం ఆ కులం వారికి కాస్త సభ్యత, సంస్కారం ఉంటాయిలే అనుకున్నవారందరికి, ఇదేమిటి! ఈ కమ్మోళ్లు ఇంత నీచంగా మారారు అన్న అభిప్రాయం తెప్పిస్తున్నారు. ఒకవేళ రాంబాబుకు ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేది. అది మళ్లీ రెండు కులాల మధ్య రగడగా మారేది కాదా!. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతం అంతా ఎలా అట్టుడికిందో తెలిసి కూడా కొంతమంది ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం దురదృష్టం. ✍️అంబటి రాంబాబు తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఇప్పటికే ఆరోపించారు. ఆయననే కాదు. కొడాలి నాని వంటి నేతలను చంపితే ఏభై లక్షలు ఇస్తామని కమ్మ సంఘం సమావేశంలో ఒక వ్యక్తి అంటే అది ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. దాని వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే ప్రమాదం ఏమీ లేదు. కాని కమ్మ కులంలో పుట్టినవారందరిని ఇతరులు అసహ్యించుకునే పరిస్థితి తెస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం! ఏ కులాన్ని ఉద్దరించడం కోసం! ఎవరో కొందరు తెలివి తక్కువవాళ్లు చేసే చెత్త పనులకు ఆ కులంలో ఉన్నవాళ్లంతా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మిగతా సమాజానికి దూరం అయ్యేలా చేస్తున్నారు. ✍️నిజానికి ఎవరూ చెప్పి ఫలానా కులంలో పుట్టరు. కాని మన సమాజంలో కుల వ్యవస్థ అన్నది ఒక వాస్తవంగా తయారైంది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు ఈ కుల వ్యవస్థపై పోరాటాలు జరిపారు. మురళీమోహన్ వంటి సినీ ప్రముఖులకు చంద్రబాబు అంటే అభిమానం ఉండవచ్చు. ఆయన వల్ల రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ది పొంది ఉండవచ్చు. అంత మాత్రాన చంద్రబాబు అరెస్టుతో ప్రపంచం అంతా మునిగిపోయినట్లు, కమ్మ వారందరికి ఏదో అయిపోయినట్లు, అసలు చంద్రబాబు అవినీతికే పాల్పడనట్లు మాట్లాడుతున్న తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. బహుశా మరే కులంలో ఇంత పిచ్చి ఉండదని జనం అనుకునేలా చేస్తున్నారు. ✍️నిజంగానే అవినీతి లేకపోతే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ 118 కోట్లకు నోటీసు ఎందుకు ఇచ్చింది. రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని సీబీటీడీ గతంలో ఎందుకు ప్రకటన చేసింది? చంద్రబాబు మాజీ పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయాడు? వీటికి వీరెవ్వరూ జవాబు ఇవ్వడం లేదు. చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ లేదనేంత స్థాయికి ఈ వర్గం ప్రచారం చేయడం హాస్యాస్పదం. ఆ మాటకు వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బారేజీ, పోచంపాడు, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన గొప్పవాళ్లందరిని ఏమి అనుకోవాలి. హైదరాబాద్ లో కొందరు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు, పాటల కార్యక్రమాలు అన్ని అదేదో ఐటి నిపుణులనో, వేరే ఫ్రొఫెషనల్స్ చేస్తున్నారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు. వాటిలో పాల్గొంటున్నవారిలో తొంభై శాతం మంది కమ్మవారే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ✍️ఆ మధ్య వీరి పైత్యం ఎక్కడివరకు వెళ్లిందంటే మెట్రో రైలులో ఎక్కి నిరసనలు తెలిపేవరకు. అక్కడ ఒకాయన ఇదేమి పని అడగవలసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో అలాంటి ఆందోళనలు చేయదలిస్తే ఆ పార్టీ పేరుతోనే చేయాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కుహానా మీడియాలను అడ్డం పెట్టుకుని వేరుపేర్లతో ఎందుకు చేయడం. లేదంటే ధైర్యం ఉంటే కమ్మ సంఘం పేరుతో నిరసనలు చేపట్టగలగాలి. ఈ మధ్య కొన్ని చోట్ల కమ్మ సంఘం సమావేశాలు జరిపి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఇంతవరకు క్లారిటీ ఉన్నట్లు లెక్క. అలాకాకుండా తెలుగుదేశం పార్టీవారే నిరసనలు చెబుతూ, ఏవేవో పేర్లు తగిలించడం వల్ల ఈనాడు వంటి మీడియాలలో ప్రచారానికి ఉపయోగపడుతుందే తప్ప ఇంకో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. ✍️సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చేస్తుంటాయి. ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు కులాలకు అతీతంగా ఉండాలని, అవినీతి ఎక్కడ జరిగినా ఉపేక్షించరాదని నీతులు చెబుతుండేవారు. చివరికి ఆయనే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా మారారన్న అభియోగాలకు గురికావడం, అవినీతిని పూర్థిస్థాయిలో సమర్ధించడం చూస్తుంటే ఇంతకాలం ఈయన జనాన్నిమోసం చేశారా అన్న భావన ఏర్పడదా! చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే కమ్మవారు ఇంతగా కలత చెందవలసిన అవసరం ఏమి ఉంటుంది? ఆయనతోటే కమ్మకులం లేదు. లేదా ఆయన కమ్మవారిపైనే ఆధారపడి ఉండరు. ✍️నిజానికి చంద్రబాబు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కుమ్మక్కై ఏపీకి పరిశ్రమలే రాకుండా ఎంత నష్టం చేశారో వీరికి తెలియదా! కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత దానిని వదిలివేయడం,ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం అర్రులు చాచడం, మరో వైపు కాంగ్రెస్ కు తెలంగాణలో మేలు చేయడం కోసం కమ్మవారిలో ఎక్కువ మంది ఓట్లు కాంగ్రెస్ కు వేసేలా ప్లాన్ చేయడం.. ఇవన్ని సమాజానికి మంచిదా! తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీచేయడం లేదో ప్రజలు ఊహించలేరా? ఇతర రాజకీయ పార్టీలు గమనించలేవా?ఇలాంటి అనైతిక రాజకీయాలు చేస్తూ దానికి కులం రంగు పులిమి ఆ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయం ఎవరికి ఉపయోగం?. చంద్రబాబుకు హైదరాబాద్లో అంత ప్రజాభిమానం ఉందనుకుంటే టీడీపీ ఇప్పుడు ఎందుకు అక్కడ పోటీచేయడం లేదు. ✍️అసలు 2004లోనే ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంగా ఉన్న చోట టీడీపీ ఘోరంగా ఓడిపోయిందే. కులం పునాదితో ఏ పార్టీ మనలేదన్న సంగతి వీరు గుర్తించాలి. ఏపీ ప్రజలను హైదరాబాద్ నుంచి ప్రభావితం చేయడానికో, న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచడానికో సభలు పెడితే వాటిని నమ్మడానికి అమాయకపు కాలం కాదు. గ్రాఫిక్స్ కాలం అంతకన్నా కాదు. చంద్రబాబు కేసులో నిరసనలు చెప్పడమే తప్పు. నిజంగా అక్రమ కేసులు అయితే సీఐడీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కోర్టులలో తమ వాదనలు వినిపించాలి. అవన్ని వదలివేసి ప్రజలలో అలజడి సృష్టించాలని చూడడం, అదేదో ఒక కులానికి వ్యతిరేకం అన్న కలరింగ్ ఇవ్వడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. పార్టీ పరంగా ఏమైనా చేసుకోండి. కులానికి మాత్రం ఈ బురద పులమకుండా ఉంటే మంచిదని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బెయిల్ ప్లీజ్..హైకోర్టులో వాదనలు
-
న్యాయ వ్యవస్థను కించపరుస్తున్న లోకేశ్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ పేరుతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, ఆధారాలతో సహా దొరికిన దొంగ చంద్రబాబు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా విమర్శించారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆధారాలు ఉన్నాయనే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. విజయవాడ న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టుల మెట్లు ఎక్కినా, ఆయనకు ఊరట లభించకపోవడంతో 50 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశారని లోకేశ్ విమర్శించడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్కు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకంగా 13 ఫైళ్లలో సంతకాలు చేశారని గుర్తు చేశారు. తద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీసిందన్నారు. ఆయన ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో అసెంబ్లీలో స్క్రీన్పై ప్రదర్శించి ప్రజలకు స్పష్టంగా వివరించామని చెప్పారు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలని లోకేశ్ను ప్రశ్నించారు. మంత్రి అమర్నాథ్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘సీమెన్స్’ తిరుగులేని సాక్ష్యం ♦ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్తో తమకు ఎలాంటి సంబంధం లేదని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ స్పష్టం చేసింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు ఇది తిరుగులేని సాక్ష్యం. అసలు కేబినెట్ అనుమతి లేకుండానే ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు అవినీతికి నాంది పలికారు. ♦ స్కిల్ ప్రాజెక్ట్ పేరిట జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ఒప్పందం చేసుకోవడం.. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం చేసుకుంటున్నట్టు మోసం చేయడం.. అనంతరం డిజైన్టెక్ అనే కంపెనీ ద్వారా త్రైపాక్షిక ఒప్పందంగా మార్చడం అంతా కూడా ప్రజాధనాన్ని దోచేందుకు వేసిన పన్నాగమే. ఇదంతా పూర్తి ఆధారాలతో బయటపడిన విషయాన్ని లోకేశ్ గుర్తించాలి. ♦నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు చెల్లించాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం వాస్తవం కాదా? ఆ విధంగా చెల్లించిన నిధులు షెల్ కంపెనీల ద్వారా హైదారాబాద్ జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసానికి చేరడం సీఐడీ దర్యాప్తులో వెల్లడి కావడం నిజం కాదా? ♦ అసలు చంద్రబాబుకు ఐటీ శాఖ ఎందుకు నోటీసులు జారీ చేసిందో సమాధానం చెప్పగలరా? ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా? ♦ స్కిల్ స్కామ్ కేసులో విచారణకు సీఐడీ నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి వాసుదేవ్ పార్థసానిలను ఎందుకు విదేశాలకు పంపించారో సమాధానం చెప్పగలవా లోకేశ్? ♦ అమరావతిలో తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణం, టిడ్కో ప్రాజెక్ట్ల టెండర్ల కేటాయింపులో కాంట్రాక్ట్ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు ఐటీ శాఖే వెల్లడించింది. తమకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బ్రాంచి అధికారులు నోటీసులు ఇవ్వాలి తప్ప.. ఢిల్లీ ఆఫీసు వారు కాదని చంద్రబాబు చేసిన వాదనను ఐటీ శాఖ కొట్టి పారేసింది. లెక్కల్లో చూపని రూ.118 కోట్ల ఆదాయానికి ఆధారాలు చూపాలని ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా లోకేశ్? మేనేజ్ చేయటంలో దిట్ట మీ బాబే ♦ 40 ఏళ్లుగా చంద్రబాబు కంటే బాగా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే మీ బాబు చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, అడ్డదారిలో సీఎం పదవి దక్కించుకున్నారు. టీడీపీని, ఆ పార్టీ గుర్తును, ట్రస్ట్ను కూడా కొట్టేశారు. ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీతో కలసి అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబే అన్నది ప్రజలకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసిన విషయం తెలియదా లోకేశ్? వైఎస్ జగన్పై కాంగ్రెస్ పెట్టిన అక్రమ కేసుల్లో టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారనే విషయం తెలియదా? బాబులా మేనేజ్ చేయాల్సిన అవసరం సీఎంకు, వైఎస్సార్సీపీకి లేదు. ♦ లోకేశ్ 35 రోజులు ఢిల్లీలో ఎందుకు ఉన్నారు. పైగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షానే తనను పిలిపించుకున్నారని అబద్దాలు చెప్పారు. కానీ ఆయన పదే పదే అడిగితేనే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పడంతో అసలు బండారం బయటపడింది. అబద్ధాలు చెప్పడం, గోబెల్స్ ప్రచారంలో లోకేశ్ తన తండ్రి చంద్రబాబును మించిపోయారు. చంద్రబాబుకు లోకేశ్తోనే ముప్పు ♦ చంద్రబాబుకు ఏదైనా ముప్పు ఉంటే అది లోకేశ్తోనే ఉండొచ్చు. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయినట్టే.. ప్రస్తుతం చంద్రబాబుకు లోకేశ్ వెన్నుపోటు పొడిచే అవకాశాలున్నాయి. ♦చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా ఎందుకోసం? పోలీసుల కాల్ డేటాతో చంద్రబాబుకు ఏం సంబంధం? దర్యాప్తు అధికారులు విచారణ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులతో మాట్లాడతారు. ఆ కాల్ డేటాను టీడీపీకి ఎందుకు ఇవ్వాలి. జైలు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్యులు 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లోకేశ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా పేదలకు ప్రభుత్వం చేస్తున్న మేలును ఈ యాత్రలో వివరిస్తుంటే సర్వత్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి ఓర్వ లేకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప చంద్రబాబుకు ప్రజలకు మేలు చేయడం అన్నది తెలియదు. ఆయన ఒక్క ఎన్నికల్లో అయినా పొత్తు లేకుండా గెలిచారా? గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. చివరికి లోకేశ్ను కూడా గెలిపించుకోలేకపోయారు. -
‘లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది’
సాక్షి, విశాఖపట్నం: నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ‘లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది. దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధం?, వ్యవస్థలను మేనేజ్ చేసుకునే అలవాటు మాకు లేదు. గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించలేకపోయాడు. పొత్తు లేకుండా ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. లోకేష్ తండ్రితో ములాఖత్ అయిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్లున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుల్లో టీడీపీ వాదనలు ఫలితాలు అందరూ చూశారు. రుజువులు మీకు ఎందుకు చూపిస్తారు.. కోర్టులకు ఇస్తారు. మీ తండ్రి 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించాం. సీమెన్స్ సంస్థ మాకు, ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. 130 నుంచి 140 మంది వాంగ్మూలం కూడా ఇచ్చారు. రూ. 370 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారు. దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారు. 17-ఏ గురించి మాట్లాడతారు గానీ తప్పు చేయలేదని అనడం లేదు. -
స్కిల్ స్కాంలో అడుగడుగునా అబద్ధాలతో నెట్టుకొచ్చిన చంద్రబాబు