Skill Development Scam
-
బాబుతో సీఐడీ దోస్తీ
-
చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సీఐడీ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.జోక్యం అవసరం లేదన్న సీఐడీతాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఐడీ పిటిషన్ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
వాంగ్మూలాలు మార్చేసి.. ‘సుప్రీం’ను ఏమార్చాలి
సాక్షి, అమరావతి : సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది.సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
మూడు నెలల్లో బాబు అవినీతి కేసులు ముగించేలా కుట్రలు
-
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
బాబు అవినీతి బాగోతాన్ని మడతెట్టేద్దాం..
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు కుట్రదారు, లబ్ధిదారుగా సాగించిన కుంభకోణాల కేసులను పూర్తిగా నీరుగార్చే కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది! అందుకోసం ఇప్పటికే డీజీపీ, సీఐడీ కార్యాలయాలను పూర్తిగా ఆ పనిలో నిమగ్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఢిల్లీ నుంచి ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాదిని రప్పించి కేసుల కొట్టివేత కుట్రలను వేగవంతం చేయడం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం ఆధారాలతో సహా బట్టబయలయ్యాయి. వాటిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందులో స్కిల్ స్కామ్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్ట్ చేయగా... ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ నాలుగు కేసులూ సీఐడీ విచారణలోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ కేసుల దర్యాప్తును నీరుగార్చి ఏకంగా కేసులను కొట్టి వేసేందుకు కార్యాచరణ చేపట్టారు. అన్ని కేసుల నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో కూడా దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించినట్లు తెలిసింది.నేను చెప్పినట్టు చేయండి.. ఆ కేసులను మూసేద్దాంస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున వాదించిన ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఏకంగా రోజుకు రూ.కోటికి పైగా ఫీజు చెల్లించి మరీ ఆయన్ను ప్రత్యేకంగా రప్పించారు. కానీ ఆయన వాదనను ఏసీబీ న్యాయస్థానం సమ్మతించలేదు. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయినా సరే అదే న్యాయవాది చంద్రబాబు కేసుల విచారణను ఇటు విజయవాడలో అటు ఢిల్లీలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ సీనియర్ న్యాయవాది సోమవారం హఠాత్తుగా విజయవాడలో వాలారు. జీ హుజూర్ అంటూ రాష్ట్ర పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసలు ఓ ప్రైవేట్ న్యాయవాదితో పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు సమావేశం కావడం ఏమిటని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఆ సమావేశం సాగింది.స్కిల్స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడం... అనంతరం ఆ కేసులను మూసివేయడం... అందుకు ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి.... ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి...? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది అంశాలవారీగా వివరించారని తెలుస్తోంది. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలు పూర్తిగా సహకరించాలని ఆయన తేల్చిచెప్పారు. అందుకు పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు తలూపినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ న్యాయవాది పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో మంగళవారం కూడా సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన ప్రభుత్వంచంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటకెక్కించేసింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల చార్జిషీట్లను సీఐడీ గతంలో న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సీఐడీకి పంపింది.అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సీఐడీ అధికారులకు అందచేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను నీరుగార్చేలా కూటమి పెద్దలు సీఐడీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఐడీ ఆ చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించలేదు. కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయడం లేదు.‘సుప్రీం’లో విచారణకు సహాయ నిరాకరణస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. 2023లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నిర్భీతిగా ఉల్లంఘించారు. కేసుల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడవద్దని న్యాయస్థానాలు స్పష్టమైన షరతులు విధించాయి. అయితే చంద్రబాబు దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ.. రెడ్బుక్ పేరిట హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.షరతులు ఉల్లంఘించినందున చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ 2023 డిసెంబర్లోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ హఠాత్తుగా రూటు మార్చేసింది. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై విచారణకు సహకరించడం లేదు. సుప్రీం కోర్టులో సీఐడీ వాదనను వినిపించాల్సిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు.అది సరైన పద్ధతి కాదని సుప్రీం కోర్టు చెప్పినా తీరు మారడం లేదు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణకు ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా పాల్గొన్నారు. వాదనలు వినిపించకుండా.. తాను ఢిల్లీలో లేనందున వాయిదా వేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిసారీ వాయిదాలు కోరడం సరైన చర్య కాదని వ్యాఖ్యానిస్తూ కేసు విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.సీబీఐకి అప్పగించాలి.. న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలిన్యాయ నిపుణుల సూచనస్కిల్ స్కామ్, ఇతర కేసుల దర్యాప్తు, తాజా పరిణామాలను గమనిస్తున్న న్యాయ నిపుణులు చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని సూచిస్తున్నారు. సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గడువు కోరిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుపై కేసుల దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించాలని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో మద్యం సిండికేట్ కేసు దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.షరతులు ఉల్లంఘిస్తున్న బాబు⇒ స్కిల్ స్కామ్ కేసులో న్యాయస్థానం విధించిన బెయిల్ షరతులను ఎన్నికల ముందు, ఆ తర్వాత చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా బేఖాతర్ చేస్తున్నారు. తన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ఓటీటీ చానల్ కోసం నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్న చంద్రబాబు న్యాయస్థానాల షరతులంటే ఏమాత్రం లెక్కలేదనే రీతిలో షరతులను ఉల్లంఘిస్తూ మాట్లాడారు. ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టబోనని బెదిరింపులకు దిగడం గమనార్హం.⇒ హిందుస్థాన్ టైమ్స్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సదస్సులోనూ చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించి స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడారు. అధికారులను బెదిరించే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నించారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.విచారణ సందర్భంగా అప్పటి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వర్చువల్గా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుతం తాను ఢిల్లీలో లేనని, విచారణకు నేరుగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ముకుల్ రోహత్గి కోరారు. దీంతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. -
చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు
-
చంద్రబాబు సహా వాళ్లంతా కుంభకోణాల్లో నిందితులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సీఐడీ అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేశ్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తిమంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీల్లోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు.2014–19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తిలక్ పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థలన్నీ చంద్రబాబు తదితరులకు క్లీన్చీట్ ఇచ్చి వారిపై నమోదైన కేసులన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నాయని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. రూ.కోట్ల కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోందని, అందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసిందని తెలిపారు. అధికారుల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు ‘ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఐజీ, సీఐడీ అదనపు డీజీ, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్ను కోరగలరు. అయితే వీరంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పనితీరు మదింపు నివేదికలు (ఏపీఏఆర్) ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దే ఉంది. అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాలపై దర్యాప్తు చేసిన అధికారుల వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఇది నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీనిపై మధుసూదన్రెడ్డి న్యాయపోరాటం చేసి తిరిగి ఉద్యోగం పొందారు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారనేందుకు ఇదో ఉదాహరణ. అంతేకాక ఆ కుంభకోణాలపై నిష్పాక్షికంగా, వృత్తిపరంగా దర్యాప్తు చేసిన, దర్యాప్తులో పాలుపంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కనపెట్టారు’ అని తిలక్ వివరించారు.ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో ఐదుగురు ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారు. సీఐడీ దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులుగా ఉన్న వీరిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ను కోరే ఆస్కారమే లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చైర్మన్గా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఆర్డీఏ పురపాలక శాఖ పరిధిలో పనిచేస్తుంది. దానికి నారాయణ మంత్రిగా ఉన్నారు. సీఆర్డీఏకు నారాయణ వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు.వీరిద్దరూ ఆ కుంభకోణాల్లో నిందితులు. సీఆర్డీఏ, పురపాలక శాఖ అధికారులందరూ వీరి నియంత్రణలో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొందరి సాక్ష్యాలను కింది కోర్టు నమోదు చేసింది. మరికొందరి సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్నీ రికార్డులను చంద్రబాబు, నారాయణ పరిశీలించే అవకాశం ఉంది అని తిలక్ తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ బెదిరించేలా మాట్లాడుతున్నారు‘బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేశ్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా, అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచి్చన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు.క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా? చేస్తున్నారా? అన్న విషయాలు కేసు డైరీల్లో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరులు అధికారులను, దర్యాప్తును శాసించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వారిపై నమోదయిన కేసులకు సంబంధించిన కేసు డైరీలను, చార్జిషిట్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి’ అని తిలక్ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వెలుగులోకి సరికొత్త విషయాలు
-
ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిధుల మళ్లింపు నిజమే... నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
-
నిధుల మళ్లింపు నిజమే
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎలా మొదలైంది.. నిధులు ఎలా మళ్లించారు.. ఎంత మొత్తంలో మళ్లించారు.. అందులో ఎవరెవరు ఉన్నారు.. ఎన్ని సూట్కేస్ కంపెనీలు ఏర్పాటు చేశారు.. ఏ ఏ దేశాల్లో ఆ కంపెనీలున్నాయి.. ఆ కంపెనీల ప్రతినిధులు ఎవరు.. వారికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును నడిపిన వ్యక్తులకు మధ్య సంబంధం ఏమిటి.. మళ్లించిన నిధులను తిరిగి ఎలా నగదు రూపంలో తీసుకున్నారు.. ఇలా పలు కీలక విషయాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ద్వారా పూసగుచ్చినట్లు బట్టబయలు అయ్యాయి. ఇకపై సాగనున్న దర్యాప్తులో ఈ స్కామ్లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర నిగ్గు తేలనుంది.సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లో సాగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈడీ సాగించిన దర్యాప్తులో మొత్తం రూ.151 కోట్ల మేర నిధులను పలు కంపెనీలకు మళ్లించినట్లు తేలింది. ఇందులో విదేశీ కంపెనీల ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలను సేకరించింంది. ఈ వివరాలన్నింటినీ ఇటీవల ఓ కేసులో హైకోర్టు ముందు ఉంచింది. ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించి, ఆ నిధులను తిరిగి డబ్బు రూపంలో ఎలా పొందారో ఈడీ తన కౌంటర్లోసు స్పష్టంగా వివరించింది. ఇప్పటి వరకు ఈడీ తన దర్యాప్తును ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు పరిమితం చేసింది. దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో ఇకపై స్కిల్ కుంభకోణంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై దృష్టి సారించనుంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా మొదలైంది.. ఏకపక్ష నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు.. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర, ఆయన జోక్యం, ఇతర అధికారుల పాత్రపై ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టనుంది. మళ్లించిన ప్రజాధనం చివరకు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ ఇప్పటికే ప్రాథమికంగా తేల్చిన నేపథ్యంలో ఈడీ ఈ అంశంపై కూడా లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.ఇదీ కుంభకోణం..నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు 2015లో చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినయ్ ఖన్వీల్కర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందం ప్రకారం శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్ను డిజైన్ టెక్ అందించాలి. ⇒ ఈ ప్రాజెక్టులో మొత్తం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో క్లస్టర్ను రూ.546.84 కోట్లతో ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం మొత్తం వ్యయం రూ.3,281.40 కోట్లు. ఇందులో 90 శాతం నిధులు.. అంటే రూ.2,951 కోట్లను సీమెన్స్, డిజైన్ టెక్ భరిస్తాయి. మిగిలిన 10 శాతం అంటే రూ.330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ⇒ అయితే సీమెన్స్, డిజైన్ టెక్లు తమ వాటా నిధులను ఇవ్వక ముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.330 కోట్లను ఆ కంపెనీలకు ఇచ్చేసింది. ఇదంతా కూడా అప్పటి మంత్రి మండలి ఆమోదం లేకుండానే జరిగిపోయింది. చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కిక్కురు మనకుండా ఆయన చెప్పినట్లు చేసేశారు.⇒ ఇదిలా ఉండగా 2018లో షెల్ కంపెనీ అయిన ఏసీఐ.. (అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసియా) లిమిటెడ్) నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు తయారు చేసి పలువురికి లబ్ధి చేకూరుస్తున్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. సుమన్ బోస్ తదితరులు తమ అక్రమ కార్యకలాపాలకు ఈ ఏసీఐ కంపెనీని వాడుకున్నారు. 2019లో ఈ మొత్తం కుంభకోణం గురించి పుణేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.⇒ ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో జరిగినట్లు తేలింది. దీంతో ఆయన్ను ఏ1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు మొదలు పెట్టింది. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్కిల్ కుంభకోణంలో సీఐడీ తన దర్యాప్తును పక్కన పెట్టేసింది. అయితే ఈడీ తన దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది.స్కిల్ కుంభకోణానికి సంబంధించి హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ , సింగపూర్ కంపెనీలకు, యూకే బేస్డ్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఇలా డిజైన్ టెక్ నుంచే నిధుల మళ్లింపు మొదలు.. ⇒ దర్యాప్తులో భాగంగా ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను ఈడీ విశ్లేషించింది. డిజైన్ టెక్ నుంచి పొందిన నిధుల్లో దాదాపు రూ.58 కోట్లను స్కిల్లర్ ఎంటర్ప్రైజస్, ఆ తర్వాత ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ పద్ధతిలో వచ్చిన డబ్బును పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు స్కిల్లర్ కంపెనీ వ్యవహారాలు చూసే వ్యక్తి శిరీష్ షా ఈడీ విచారణంలో అంగీకరించారు.⇒ స్కిల్లర్ నుంచి వచ్చిన సొమ్ముతో స్కిల్ డెవలప్మెంట్ సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి వస్తువులను గానీ, సేవలను గానీ అందించలేదు. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ నిధులను డిజైన్ టెక్ కంపెనీ స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్కు, స్కిల్లర్ తిరిగి ఆ నిధులను ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ తేల్చి చెప్పింది. నిధుల మళ్లింపుకు సహాయ పడిన వారి వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, వస్తువులు, సేవలు.. ఏవీ అందించలేదని వారు అంగీకరించారు. నకిలీ, కల్పిత పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్లు, తప్పుడు బిల్లులు సృష్టించినట్లు కూడా వారు ఈడీ ఎదుట ఒప్పుకున్నారు.⇒ ఏసీఐ నుంచి వచ్చిన నిధులను నగదు రూపంలో మార్చినట్లు కూడా వారు అంగీకరించారు. ఈ విషయాలన్నింటినీ ఎంట్రీ ప్రొవైడర్లయిన యోగేశ్ గుప్తా, మనోష్ కుమార్ జైన్ ఈడీ వద్ద నిర్ధారించారు. ఈ షెల్ కంపెనీలేవీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్తో సంబంధం ఉన్న కంపెనీలు కాదని కూడా ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది.⇒ ఈ గొలుసు లావాదేవీల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని యోగేశ్ గుప్తా, ముకుల్ అగర్వాల్కు అందచేసినట్లు సావన్ జాజూ ఈడీకి తెలిపారు. నగదు విషయంలో ముకుల్ చంద్ర అగర్వాల్.. యోగేశ్ గుప్తా వద్దకు వెళ్లినట్లు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాల ద్వారా వచ్చిన నిధులను నగదు రూపంలో వీరు అందుకున్నట్లు కూడా స్పష్టమైంది. ⇒ ఏసీఐ మాత్రమే కాకుండా ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రో వెస్ట్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్లను నిధుల మళ్లింపు కోసం వాడుకున్నారు. ఇందుకు బోగస్ బిల్లులను చూపారు. తద్వారా స్కిల్లర్ నుంచి నేరుగా ని«ధులు పొందారు. ఇలా ఇప్పటి వరకు రూ.151 కోట్ల మేర నిధులను మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.ప్రజా ధనాన్ని మళ్లించేందుకే స్కిల్లర్ ఏర్పాటు స్కిల్లర్ తనకొచ్చిన నిధుల్లో నుంచి కొంత భాగం ముకుల్ అగర్వాల్కి చెందిన నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు బదలాయించింది. అక్కడి నుంచి ఆ నిధులు ముకుల్ చంద్ర, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి, అతని నియంత్రణలో పని చేసే కంపెనీల ఖాతాల్లోకి చేరాయి. ముకుల్ చంద్ర అగర్వాల్ పలు కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటన్నింటిపై తనకు నియంత్రణ ఉండేలా చూసుకున్నారు.ప్రభుత్వానికి చెందిన అత్యధిక భాగం నిధులు ఈ కంపెనీల మధ్యే సర్కులేట్ అయ్యాయి. సుమన్ బోస్ అవసరాల కోసమే ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ముకుల్ చంద్ర అగర్వాల్ ఈడీ ముందు అంగీకరించి, ఆ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే సుమన్ బోస్ తన విదేశీ బ్యాంకు ఖాతాలను మూసేశారు. దీనిపై కూడా ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. పలు విదేశీ కంపెనీలతో బోస్కు సంబంధాలున్నాయన్న విషయం కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. నేరపూరిత చర్యల ద్వారా బదలాయించిన మొత్తాలను ఆ షెల్ కంపెనీల ద్వారా తిరిగి నగదు రూపంలో పొందిన విషయాన్ని కూడా ఈడీ గుర్తించింది. ప్రజాధనం దోచేసేందుకే సుమన్ బోస్ మిలాఖత్⇒ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్, టాలెంట్ ఎడ్జ్, ఏసీఐ, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్, డిజైన్ టెక్ కంపెనీలు, వారి యజమానులతో కలిసి సుమన్బోస్ పని చేశారని సీమన్స్ నివేదిక స్పష్టం చేసింది. సీమెన్స్ ప్రస్తుత ఎండీ కూడా ఇందుకు సంబంధించిన సంభాషణలు, వాట్సాప్ చాట్లు, ఇతరత్రా పలు వివరాలను ఈడీకి అందజేశారు. డిజైన్ టెక్ వికాస్ ఖాన్వీల్కర్, సుమన్ బోస్ల మధ్య డబ్బు తరలింపును కూడా ఈడీ గుర్తించింది.⇒ ముకుల్ అగర్వాల్, సురేష్ గోయల్ తనకు సన్నిహిత మిత్రులన్న విషయాన్ని సుమన్ బోస్ ఈడీ ముందు అంగీకరించారు. డీసాల్ట్ ప్రస్తుత చిరునామా, ఎస్ఎస్ఆర్ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చిరునామా ఒకే విధంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో సురేశ్ గోయల్ సతీమణి ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నారు. పలు ఇతర కంపెనీలు కూడా ఇదే చిరునామాపై రిజిస్టర్ అయి ఉన్నాయి. నిధుల మళ్లింపు వ్యవహారంలో సుమన్ బోసే మాస్టర్ మైండ్, ఇందుకు ఖాన్వీల్కర్, సురేశ్ అగర్వాల్ల సాయం తీసుకున్నారు.⇒ సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తులసీదాస్ శివ కుమార్కు చెందింది. ఇతను సీమెన్స్ సుమన్ బోస్కు అత్యంత సన్నిహితుడు. గతంలో సీమెన్స్లో పని చేశాడు. ఈ కంపెనీకి రూ.3,48,95,191 మళ్లించారు. మరో సింగపూర్ కంపెనీ అయిన ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్కు రూ.74.51 లక్షలు, యూకేకు చెందిన ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్కు రూ.73.67 లక్షలు జమ చేశారు. ఈ మొత్తాలన్నీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీ) నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొందిన నిధులు. నిధుల మళ్లింపులో కీలక వ్యక్తులు - సుమన్ బోస్ (స్కిల్ ప్రాజెక్ట్ రూపకర్త)- వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ (డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ)- ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ ఎంటర్ప్రైజస్ సిగ్నేటరీ, సుమన్ బోస్ సన్నిహితుడు, నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కీలక వ్యక్తి )- సురేష్ గోయల్ (సుమన్ బోస్ స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్, ముకుల్ అగర్వాల్ కోసం డబ్బు నిర్వహించిన వ్యక్తి)- శిరీష్ షా (ఏసీఐ వ్యవహారాలు చూసే వ్యక్తి, ఎంట్రీ ఆపరేటర్)- సావన్ కుమార్ జాజు (ఎంట్రీ ఆపరేటర్)- యోగేష్ గుప్తా (ఎంట్రీ ఆపరేటర్)- మనోజ్ కుమార్ జైన్ (ఎంట్రీ ఆపరేటర్)- తులసీదాస్ శివకుమార్ అలియాస్ టి.శివకుమార్ (సింగపూర్ – బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్, సుమన్ బోస్ సన్నిహితుడు)ఈడీ బయటపెట్టిన షెల్ కంపెనీలు...⇒ మెసర్స్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఐఎస్డబ్ల్యూ)⇒ మెసర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డీటీఎస్పీఎల్)⇒ స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్)⇒ అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏసియా లిమిటెడ్ (ఏసీఐ) (షెల్ కంపెనీ)⇒ కాడెన్స్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ (షెల్ కంపెనీ)⇒ ఈటీఏ గ్రీన్ బిల్డ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఎస్పీఎల్) (షెల్ కంపెనీ)⇒ ఎస్ఎం ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ప్రో వెస్ట్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ మెసర్స్ టాలెంట్ ఎడ్జ్ (షెల్ కంపెనీ)⇒ డిఅసాల్ట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డీఎస్ఐపీఎల్) (గతంలో బోస్, ముకుల్ అగర్వాల్, నరేష్ గోయల్ పని చేసిన కంపెనీ)⇒ ఎస్ఎస్ఆర్ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ కంపెనీలో సురేష్ గోయల్ భార్య డైరెక్టర్. డిఅసాల్ట్ సిస్టమ్స్ కంపెనీదీ ఇదే చిరునామా)⇒ బెన్ రీసర్చ్ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ)⇒ ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు)⇒ ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్ (యూకే కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు) -
మూడేళ్లయినా చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్పోర్ట్ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్పోర్ట్ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడిసుమన్ బోస్ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. -
బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. ‘‘కేసులను నీరుగార్చే కుట్ర’’ శీర్షికతో వచ్చిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది కానీ.. ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తనకు తానే సాటి అని బాబు ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసుకున్నారు మరి! ఈ తాజా కథనంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే...గతంలో సీఐడీ అధికారులు ఎవరినైతే అవినీతి కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారో.. వారికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నదట! ఇది అత్యంత అరుదైన ఘటనే. అప్పట్లో స్కామ్లకు పాల్పడిన వారు ఇప్పుడు అధికారంలో ఉండటం దీనికి కారణమవుతోంది. అయితే నైతిక విలువలు పాటించేవారైతే.. తప్పు చేయలేదని నమ్మేవారైతే తామే నిందితులుగా ఉన్న కేసుల జోలికి అధికారంలోకి వచ్చినా అస్సలు పోరు. నిజం కోర్టులు నిగ్గుతేలుస్తాయని వదిలేస్తారు. ఈ కాలంలో ఇంతటి ఉదాత్త స్వభావాన్ని ఆశించలేము కానీ నిందితులే కేసు సమీక్షకు దిగడం దేశ చరిత్రలో సరికొత సంప్రదాయానికి తెరతీస్తుందన్నది మాత్రం సత్యం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు, స్కామ్ లపై, 2019-24 వరకు ప్రభుత్వాన్ని నడిపించిన వైసీపీ విచారించింది. సీఐడీ, సిట్ వంటి సంస్థలు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిర్దిష్ట అభియోగాలతో చంద్రబాబు, తదితరులపై కేసులు పెట్టింది. ఆ కేసులలో ఛార్జ్షీట్లు వేసేందుకు సమయం బాగా అవసరమైంది. అయితే ఈలోగా ప్రభుత్వం మారి టీడీసీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కేసులను నీరుకార్చడానికి, వీలైతే వాటి నుంచి తప్పించుకోవడానికి సన్నద్దం అవుతున్నారని వార్తలు సూచిస్తున్నాయి బాబు ఇలా చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే తనపై కేసులు పెట్టిన సీఐడీ, సిట్లే ఇప్పుడు బాబుకు ప్రెజెంటేషన్ ఇస్తూండటం మాత్రం హైలైట్. ఇంకో విషయం ఈ కేసుల్లో విచారణ చేసిన అధికారులతో కాకుండా.. చంద్రబాబు నియమించుకున్న అధికారులు ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అంటే అవన్నీ తప్పుడు కేసులని, వాస్తవాలు లేవని, గత ప్రభుత్వంలోని అధికారులు కక్షకట్టి కేసులు పెట్టారని ఇప్పటి అధికారులతో చెప్పించుకునే ప్రయత్నం అన్నమాట! ఒక కేసు నిందితుడే అధికారం అడ్డుపెట్టుకుని తీర్పునిచ్చే విధంగా తన అభిప్రాయాలను ఈ ప్రెజెంటేషన్ సాకుతో వెల్లడించబోతున్నారన్నమాట. చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసు విషయంలో కొన్ని చర్యలు తీసుకుంది. సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు చంద్రబాబు లేదా, ఇతర ముఖ్యులవి కావు. నిధులను మళ్లించిన డిజిటెక్ సంస్థవి. ఈడీ ఈ సంస్థ అధికారులతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులను కూడా గతంలోనే అరెస్ట్ చేసిన విషయం ఇక్కడ ఒకసారి చెప్పుకోవాలి. ప్రధాన నిందితుల్లో ఒకరైన చంద్రబాబును అప్పట్లో ఏపీ సీఐడి అరెస్ట్ చేసినా ఆయనపై ఈడీ ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం ఊహించదగినదే. ప్రస్తుతం ఆయన పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉంది. తదుపరి చర్య తీసుకోవడానికి కేంద్రంలోని సంబంధిత మంత్రులు ఆమోదం ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. పైడి ఎప్పుడు అవకాశం ఉన్నా దేశ ప్రధాని మోడీతో భేటీ అయిన ఫోటోలు కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తిపై ఈడి చర్య తీసుకోవడం కష్టమే.గతంలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన వెంటనే వారిలో ఇద్దరిపై ఉన్న కేసుల విచారణ వేగం మందగించింది. ఆ నలుగురు ప్రధానితో కలిసి కూర్చున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వారికే అంతటి సదుపాయం కలిగినప్పుడు ఇప్పడు చంద్రబాబు మరింత పవర్ ఫుల్ గా ఉన్నందున కేసు నీరుకారిపోకుండా ఉంటుందా అన్నది చర్చనీయాంశం. స్కిల్ స్కామ్లో సుమారు రూ.300 కోట్ల అవ్యవహారాలు జరిగాయన్నది అభియోగం. డొల్ల కంపెనీలకు భారీ ఎత్తున డబ్బు చేరితే అందులో కొంత మనీ లాండరింగ్ మార్గాల్లో నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాల్లోకి వచ్చిందని సీఐడీ అభియోగాలు మోపింది. కానీ అప్పట్లో కేసు విచారించిన అధికారులు ఇప్పుడు టీడీపీ కారణంగా శంకరగిరి మాన్యాలు పట్టారు. పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని వేధిస్తోంది. ఏదో కేసులో ఇరికించి సస్పెన్షన్ వేటు వేసేందుకూ వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. వలపు వల విసిరి మోసగించే నటి ఒకరిని రంగంలోకి దింపి ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బాబు ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురు ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై తదుపరి చర్యల కోసం అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనుమతి రావడం కల్లే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో ఆడియో వాయిస్ తో సహా దొరికిపోయారు. దానిని ఆయన ఎంత సమర్థంగా మేనేజ్ చేసుకున్నారో తెలిసిందే. ఛార్జ్షీట్లో సుమారు 30 సార్లు చంద్రబాబు పేరు ఉన్నా, ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన పేరు చేర్చకుండా అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై కొందరు ప్రముఖుల ద్వారా ప్రభావితం చేయగలిగారని అంటారు. అంతేకాదు. 2019 ఎన్నికల తర్వాత ఆయన కార్యదర్శి ఇంటిపై సీబీటీడీ అధికారులు దాడి చేసి, సుమారు రూ. రెండు వేల కోట్ల విలెవూర అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఆ కేసునే ఆయన ముందుకు సాగకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలను సమర్థంగా మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు వారితో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక ఎవరు ఆ కేసు జోలికి వెళతారు?.ఈడీ అధికారులు నిజంగానే ఈ కేసు లోతుపాతులను విచారించాలని అనుకుంటే ముందుగా షెల్ కంపెనీలకు వచ్చిన డబ్బు, టీడీపీ ఆఫీస్ ఖాతాకు చేరిన డబ్బు గురించి ఆరా తీయాలి. ఆ విషయాన్ని వెల్లడి చేయాలి. కేసు అక్కడదాకా వెళితే అది గొప్ప విషయమే అవుతుంది. కేంద్రంలోని బీజేపీతో ఏదైనా గొడవ వస్తే జరుగుతుందేమో కానీ, అంతవరకు కదలకపోవచ్చు. స్కిల్ స్కామ్ను నీరుగార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి డిజిపికి లేఖ రాశారు. కాని ఆయన మాత్రం ఏమి చేస్తారు? ఆయన కూడా టీడీపీ ప్రభుత్వం నియమించిన వారే కదా! చంద్రబాబు ఏమి చెబితే అది చేయవలసిందే కదా? చంద్రబాబు, తదితర టీడీపీ నేతలపై వచ్చిన స్కామ్ కేసులను సీబీఐకి అప్పగించాలని ఒక పాత్రికేయుడు, సామాజిక వేత్త కెబిజి తిలక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేం. గతంలో చంద్రబాబు తనపై కేసు పెట్టడానికి ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోలేదంటూ సుప్రీం కోర్టులో వాదించారు. సెక్షన్ 17 వర్తిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కానీ సుప్రీం కోర్టు ఆ కేసులో ఇప్పటికీ తీర్పు ఇవ్వకుండా ఉండిపోయింది. అంతేకాదు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కాని గౌరవ హైకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన ఆరోగ్య నివేదిక ఆధారంగా బెయిల్ ఇవ్వడం ఏమిటా అని పలువురు విస్తుపోయారు. తనకు రకరకాల వ్యాధులు ఉన్నాయని చెప్పిన ఆయన, విడుదల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా టూర్లు చేశారు.కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది. అయినా తన బావమరిది బాలకృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొని కేసు గురించి ప్రస్తావించి, తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారట. ఈ పరిస్థితిలో ఏ అధికారి ఈ కేసులను ముందుకు తీసుకువెళతారు? ఏ విధంగా చంద్రబాబు, ఇతర ముఖ్య నిందితులు కోర్టుకు వరకు వెళ్లకుండా చూడవచ్చో అన్నదానిపైనే అధికారులు గురిపెడతారు. ఈ కేసుల రికార్డులను తారుమారు చేయవచ్చని పొన్నవోలు అన్నారు. ఆయన ఎంత వాపోయినా అది వృథా ప్రయాసగానే మిగిలిపోవచ్చు. దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసుల విషయంలో ఒక నిర్దిష్ట విధానం రూపొందించుకోకపోతే , అసలు స్కాములు జరిగినట్లా? కాదా? అన్నదానిపై ప్రజలకు స్పష్టత రాకుండా పోతుంది. అధికారంలో ఉంటే ఎలాంటి కేసు నుంచైనా తప్పించుకోవచ్చన్న భావన మరింతగా ప్రబలుతుంది.ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్ను కోరే ప్రతిపాదన పెండింగ్లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించగా సస్పెన్షన్పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్టెక్కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
ఈడీ నీకెక్కడ క్లీన్చిట్ ఇచ్చింది?
ఈ నెల 15వ తేదీన ఈడీ విడుదల చేసిన ప్రెస్నోట్లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఈ కేసులో నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా పేర్కొంది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది.’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిషి (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో స్పెషలిస్టు. అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీకు క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చిందో చూపాలి..’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. టీడీపీ పాలనలో జరిగిన స్కిల్ స్కామ్పై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు చేసి.. అన్ని ఆధారాలతోనే ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేసిందని, స్కామ్ జరిగినట్లు నిర్ధారించిందని, దానికి తార్కాణమే ఆ కుంభకోణంలో పాత్రధారులైన డిజైన్ టెక్ ఎండీ, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సహా నలుగురిని అరెస్ట్ చేసి రెండు విడతల్లో రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని వివరించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనుసాగుతోందని ఈడీ తేల్చిచెబుతూ మీడియాకు ప్రకటన విడుదల చేస్తే.. దాన్ని పట్టుకుని తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... ఆస్తులు అటాచ్ చేస్తే.. క్లీన్చిట్ ఇచ్చినట్టా? సిల్క్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన ప్రెస్నోట్లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈడీ గుర్తించింది. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లు కలిసి ఏపీ ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారని, డొల్ల కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రజాధనాన్ని స్వాహా చేశారని నిర్ధారించింది. ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారినట్టు కూడా తేల్చింది. అందుకే ఇంతకు ముందే డిజైన్ టెక్ సిస్టమ్స్ సంస్థకు సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా నిందితులు అయిన వికాస్ వినాయక్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లను అరెస్టు చేసినట్టు వెల్లడించింది. తాజాగా మరో రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా ప్రెస్నోట్లో తెలియజేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా ప్రకటించింది. ఆ ప్రెస్నోట్ చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు సుమన్ బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ నిందితులు. ఎందుకంటే చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో 13 సార్లు.. 13 చోట్ల ఫైళ్లపై సంతకాలు పెట్టారు. వాళ్లకు రూ.371 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం మళ్లీ డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. కాబట్టే నలుగురిని అరెస్టు చేసింది. ఆస్తులను అటాచ్ చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో అక్రమ కేసు పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టులా చంద్రబాబుకు ఎటువంటిసంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ..’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిíÙ (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. దీనికి చంద్రబాబు తనకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు మార్చేసుకున్నారు. అసలు ఇంకెవ్వరికీ చదువు రాదనుకుంటాడా... ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాడా చంద్రబాబు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి మీడియా సామ్రాజ్యాన్ని పెట్టుకుని ఎంతకైనా గోబెల్స్ ప్రచారం చేయగలననే అతి విశ్వాసం ఉన్నా కూడా... ఈ మాదిరిగా వక్రీకరించడం ఎవరి వల్లా కాదు!. ఈడీ అటాచ్లపై బాబు మాట్లాడరేం! ఈ స్కామ్లో ఈడీ అరెస్టు చేసిన మనుషులకు, ఆస్తులు అటాచ్ చేసిన సంస్థలకు డబ్బులు ఎవరు ఇచ్చారు..? చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? జర్మనీకి చెందిన ఒరిజినల్ సీమెన్స్ కంపెనీ ఆ డబ్బులు తమకు ముట్టలేదని, ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని చెప్పడం వాస్తవం కాదా? సదరు కంపెనీ ప్రతినిధి నోయిడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలంగా ఇవ్వడం వాస్తవం కాదా? సీమెన్స్ సంస్థ ఈ డబ్బు పక్కదారి పట్టిందనే విషయాన్ని తమ అంతర్గత పరిశోధనలో కనుగొన్నామని.. అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండీ సుమన్ బోస్ కంప్యూటర్లు, ఫోన్లను పరిశీలిస్తే బయటకు వచ్చిందని.. డబ్బు పుణే నుంచి హైదరాబాద్కు వెళ్లిందని.. సాక్షాత్తు సీమెన్స్ తమ అంతర్గత పరిశోధనలో వెల్లడైందని రిపోర్టు ఇచ్చిందా..? లేదా?. ఈ కేసులో నిందితుల ఆస్తుల ఆటాచ్మెంట్పై మాత్రం చంద్రబాబు మాట్లాడరు. కానీ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటాడు. చంద్రబాబును ఈడీ అరెస్టు చేయదా?సిల్క్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబును, ఆయన పీఏ శ్రీనివాస్ను భవిష్యత్తులో ఈడీ అరెస్టు చేయదా? ప్రజాధనాన్ని డొల్ల కంపెనీలు సృష్టించి బయటకు పంపడం.. అలా వెళ్లిన డబ్బులు మళ్లీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకోవడం అంటే ఇది కాదా? ఇద్దరు ఐఏఎస్ అధికారులు మేజిస్ట్రేట్ ముందు సెక్షన్–164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాము చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశామని చెప్పారు. ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ల ఎదుట కనిపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ‘న్యాయం గెలిచింది.. నిజం నిలిచింది..’ అని ఎలా అంటారు? కంటికి కనిపించే ఆధారాలు ఉన్నాయి. స్కామ్ నిజమే అని ఈడీ కూడా ధ్రువీకరించుకుని అరెస్టులు చేసింది... ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. అయినా చంద్రబాబు లడ్డూలు విషయం మాదిరిగా.. ఇసుక, మద్యం స్కామ్ల తరహా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజంగా మనుషులేనా.. అందరూ ఆలోచన చేయాలి. -
చంద్రబాబు స్కిల్ స్కామ్ పై ED లెటర్.. వైఎస్ జగన్ రియాక్షన్
-
స్కిల్ స్కాం నిర్ధారించిన ఈడీ.. వణికిపోతున్న చంద్రబాబు..!
-
బాబుకు మళ్లీ జైలు తప్పదా?
-
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
దీని అర్థమేంటి చంద్రబాబూ..ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్కు పాల్పడిన నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్, భారత్లో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్చంద్ అగర్వాల్, సురేశ్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తు లను జప్తు చేశాం. గతంలోనే డిజైన్టెక్కు చెందిన రూ.31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేశ్లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. – ఈడీసాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్ ప్రచారం చీప్ ట్రిక్ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్ చేస్తూ మరీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడిగుతూ తిమ్మినిబమ్మి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ఈడీ స్పష్టం చేయడంతోపాటు, చంద్రబాబుతోపాటు తాము ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ తేల్చి చెప్పడంతో టీడీపీ ఎత్తుగడ బెడిసికొట్టింది. బోగస్ ఇన్వాయిస్లతో ప్రజాధనం కొల్లగొట్టారు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. అంతేకాదు అసలు ఆ ప్రాజెక్ట్నే చేపట్టలేదని, పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేసినట్టు గుర్తించామని తెలిపింది. ఆ నిధులను సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్.. తమ సన్నిహితులు ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా అక్రమంగా దారి మళ్లించినట్టు వెల్లడించింది. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించి.. అక్కడి నుంచి తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించామని తెలిపింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్షీట్ను దాఖలు చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టైంది.టీడీపీ ఫేక్ ట్రిక్ ఇదీ..⇒ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతోనే చంద్రబాబును గతేడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ⇒ ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసి స్కిల్ స్కామ్లో నిధులు కొల్లగొట్టిన తీరును నిరూపిస్తోంది. తాను నిధులు కొల్లగొట్టడంలో పాత్రధారులుగా చేసుకున్న షెల్ కంపెనీల ప్రతినిధులు వికాస్ ఖన్విల్కర్, సుమన్బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక రెండో విడతలో వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ ఆస్తులను అటాచ్ చేసింది. అదీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బేంబేలెత్తిస్తోంది. ⇒ ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో మంగళవారం రాత్రి నుంచి వైరల్ చేసింది. ఏకంగా ఈడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలకు ముందు వెనుకా రెండు వాక్యాలు జోడించడం ద్వారా ట్యాంపర్ చేసి ఈ ప్రచారం చేయడం గమనార్హం. ⇒ ఈడీ పేరుతో రూపొందించిన ఆ ఫేక్ ప్రకటనను టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఆ తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేట్టు చేయడం చంద్రబాబు మార్కు మీడియా మేనేజ్మెంట్కు నిదర్శనం.ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఈడీ చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ చేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. తాము చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ హైదరాబాద్ విభాగం అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. షెల్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని కూడా ఈడీ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఫేక్ ట్రిక్తో తాము చేసిన తప్పుడు ప్రచార ఎత్తుగడ బెడిసి కొట్టడంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ మౌన ముద్ర దాల్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో సీఐడీ సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకునే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ–1గా సీఐడీ పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపించింది. అంటే చంద్రబాబు.. ఏ–1గా ఉన్న ఎఫ్ఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరో వైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అటువంటిది ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని, టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం. స్కిల్ కేసులో ఇప్పటికే పాత్రధారులైన షెల్ కంపెనీల ప్రతినిధుల బండారాన్ని బయటపెట్టిన ఈడీ.. ఇక అసలు సూత్రధారి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చేందుకు ఉద్యుక్తమవుతున్నట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
అది ‘క్లీన్ చిట్’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈడీ దర్యాప్తుతో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి చెప్పారు. అయినా క్లీన్చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో ఇదే కచ్చితంగా తేలుతుందని స్పష్టం చేశారు.సతీష్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు. కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని, అందుకే అటాచ్మెంట్ రాగానే వణికిపోతున్నారని, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని అన్నారు. ఈడీ ప్రెస్నోట్లో క్లీన్చిట్ విషయం లేకపోయినా, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని చెప్పారు. క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులని, విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చిట్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారని ప్రశి్నంచారు. నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని, వాటికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబే 13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా అని నిలదీశారు. బాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకెళ్లిందన్నారు. ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉంటే, ఈడీ క్లీన్చిట్ ఇచి్చందని ఎలా చెప్పుకుంటారని అన్నారు. -
చంద్రబాబు మళ్ళీ జైలుకే...? రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, ఇసుక, మద్యంలో దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్న ఇసుక డంప్ను టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఖాళీ చేసిందని ఆరోపించారు. మద్యంలో టీడీపీ సిండికేట్ల వల్ల తెలంగాణా కంటే తక్కువ ఆదాయం వచ్చిందని, 90 శాతం టీడీపీఐ వారికే వచ్చాయని, మిగిలిన 10శాతం షాపులు వారిని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అక్రమాలను, అబద్ధపు హామీలను ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విజయవాడ వరదల్లో వచ్చిన విరాళాలు కూడా జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో, ఏమైపోతుందోననే ఆందోళన కలుగుతోందన్నారు. ప్రభుత్వ దురాగతాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు. వీళ్ళ అకృత్యాలు ప్రజలకు తెలియకుండా మీడియా గొంతు నొక్కుతున్నారని, టీవీ9, సాక్షి, ఎన్టీవీలతో పాటు మరి కొన్ని ఛానళ్లను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.‘స్కిల్ కేసులో చంద్రబాబును ఆనాడు అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బార్యా, పిల్లలు, దత్త పుత్రుడు అంతా గోల చేశారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు జరిగింది. ఇప్పుడు ఈడీ వారి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇప్పుడు స్కిల్ అక్రమాలు చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసేందుకు చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశాడు. షెల్ కంపెనీలతో 370 కోట్లు కొట్టేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారు. సీమెన్స్ సంస్థ పేరు చెప్పుకుని.. డిజైన్ టెక్ అనే షెల్ కంపెనీ ద్వారా నిధులు కొట్టేశారు. ఆ ఫైల్ డ్రాఫ్ట్ పై అన్నీ చోట్ల చంద్రబాబు సంతకం ఉంది. జరిగిన అక్రమాలన్నీ నిజమే కాబట్టే ఈడి ఆస్తులు అటాచ్ చేసింది.’ అని పేర్కొన్నారు. -
దోచుకోవడంలో చంద్రబాబు ‘స్కిల్’ నిజమే (ఫొటోలు)
-
స్కిల్ స్కామ్ అంటే ఏంటి? అందులో చంద్రబాబు అవినీతి ఎంత
-
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
ఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో సిమెన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ,పూణేలలోని రూ.23 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.నకిలీ ఇన్ వాయిస్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. డీటీసీఎల్ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. స్కిల్ కుంభకోణం కేసు..ప్రభుత్వంలో వణుకుస్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో పేరుతో చంద్రబాబు తన హయాంలో రూ. 240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు గతంలోనే 13 చోట్ల ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టినట్టు నిర్ధారించింది.రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లకు పెంచేసి గోల్మాల్ చేసిన చంద్రబాబు ఇదే కేసులో 52 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ కేసు ఆధారంగా సిమెన్స్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాట్ చేసింది. దీంతో స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈడీ తాజా అటాచ్మెంట్తో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు. -
సచివాలయంలో పెండ్యాల ప్రత్యక్షం
సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో విదేశాలకు పరారైన పెండ్యాల శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చారు. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శ్రీనివాస్ అమెరికాలో అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు. నల్లమూటలు బాబు బంగ్లాకు చేర్చించి పెండ్యాలే2014 – 19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పెండ్యాల శ్రీనివాస్కు ఉన్న రెండు ఈ మెయిల్ ఐడీలకు మెయిల్చేయడంతోపాటు హైదరాబాద్లోని ఆయన చిరునామాకు స్పీడ్పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె సీఐడీ అధికారులకు తెలిపారు. నోటీసులు జారీ కాగానే పెండ్యాల శ్రీనివాస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు ఓ మెయిల్ ద్వారా తెలిపి వెళ్లిపోయారు.మెమో జారీ చేసినా బేఖాతరు.. సస్పెన్షన్పెండ్యాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి, మెమో జారీచేసింది. అధికారులు హైదరాబాద్లోని పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో ఆఫీసుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని పెండ్యాల శ్రీనివాసరావును ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఆ మెమోను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అనుసరించి పెండ్యాల శ్రీనివాస్ను ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 30న సస్పెండ్ చేసింది.బాబు రాగానే మళ్లీ ప్రత్యక్షంకాగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందన్నది సుస్పష్టమవుతోంది. ఎందుకంటే స్కిల్ కుంభకోణం కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయి 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్ను సీఐడీ సాక్షిగా పేర్కొంది. దాంతో ఆ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండ్యాల శ్రీనివాస్ను కూడా ఒక సాధనంగా వాడుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. స్కిల్ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండ్యాల శ్రీనివాస్ తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే. -
చంద్రబాబు Ex-Ps సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని దరఖాస్తు
-
ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్!స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్పై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం. -
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. -
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
-
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్ను సృష్టించి స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్బాల్ మ్యాచ్లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్తోపాటు ఈశ్వరన్ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పేర్కొంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానం పిటిషన్లో తెలిపింది. -
స్కిల్ స్కామ్ లోనే చిప్పకూడు పార్ట్ -2 కి సిద్ధమౌతోన్న లూటీరత్న
-
దొరికాడు దొంగ
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షెల్ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహాలో షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్స్కామ్కు పాల్పడి షెల్కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ♦ టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ♦ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ♦ పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్ టెక్ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ ప్రాజెక్ట్లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీకి డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు. ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్ స్కామ్లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి 2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. స్కిల్ స్కామ్ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 జమ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్స్కామ్లో చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ చార్జ్షీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీఎండీ–సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్కర్ తదితర కంపెనీల అధికారులు -
బాబుకు ‘ఈడీ’ వేడి
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది! హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్లు ఆధారాలున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరైనదేనని పేర్కొంది. ఈ కేసులో హవాలా మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల మధ్య చాలా సారూప్యతలు న్నాయి. ఇప్పటికే స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి. ‘ఆప్’ చేతికి రూ.50 కోట్లు ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మళ్లించినట్లు ఈడీ నిర్థారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో రూ.50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. ఈ మేరకు గోవాలో ఆప్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అభ్యర్థి వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం. కేజ్రీవాలే బాధ్యత వహించాలి మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం రాజకీయ పార్టీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సంఘం. కంపెనీల చట్టం ప్రకారం ఓ కంపెనీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సముదాయం. రెండు వేర్వేరు చట్టాల ద్వారా నమోదైన రాజకీయ పార్టీ, కంపెనీల నిర్వచనం మాత్రం ఒకటే. కాబట్టి అక్రమ నిధులు పొందిన ఓ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగానే అక్రమంగా నిధులు పొందిన రాజకీయ పార్టీపై కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు’ అని న్యాయమూర్తి ప్రకటించారు. ‘మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ పార్టీకి జాతీయ సమన్వయకర్త (అధ్యక్షుడు)గా ఉన్న కేజ్రీవాలే అందుకు బాధ్యత వహించాలి. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఆయన అరెస్ట్ సరైనదే’ అని తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్లో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు – బాధ్యత వహించాల్సింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్లో కొల్లగొట్టిన నిధులు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ నిధులు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్వర్క్ గుట్టును సిట్ బయట పెట్టింది. అందులో రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీహిల్స్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలున్నాయి. వాటిల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 చొప్పున జమ చేశారు. జూబ్లీ హిల్స్లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయి నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్ సమయంలో ‘పే–స్లిప్’లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి. ఇక బాబుపై ఈడీ కొరడా! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి సిట్ పూర్తి ఆధారాలను ఈడీకి అందచేసింది. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్తోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది. తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతోపాటు సిట్ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది. -
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్టెక్ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్ను అరెస్ట్ చేసింది. డిజైన్టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు -
బాబు బెయిల్ రద్దు పిటిషన్: ఏప్రిల్ 16న పూర్తి విచారణ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్ 16న ఈ పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దుపై ఏప్రిల్ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. -
స్కిల్ స్కాం నుంచి చంద్రబాబును కాపాడేందుకు..
-
‘స్కిల్’ కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందేనని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ షరతుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చింది. వచ్చే ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తామని.. ఆ తర్వాత చంద్రబాబు కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని నివేదించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకొని రికార్డుల్లో లేని అంశాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. దీంతో చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రకటనలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లు అందజేయడానికి ఏపీ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ ఏం కోరుకుంటోందని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని రోహత్గి విన్నవించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని, ఈ సమయంలో బెదిరింపు ప్రకటనలను తేలిగ్గా తీసుకోరాదని తెలిపారు. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అప్పీల్ కోర్టు ముందుందన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుడి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని.. అధికారుల పేర్లన్నీ ఒక పుస్తకంలో రాస్తున్నట్లు చెబుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీరి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బెదిరింపు ప్రకటనలు చేసేవారికి బెయిల్ ప్రయోజనం, స్వేచ్ఛ లభించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ సీఐడీ అనుబంధ పిటిషన్పై స్పందించడానికి తమకు సమయం కావాలని కోరారు. దీంతో రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవసరమనుకుంటే పిటిషనర్ కూడా స్పందించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టు: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు రెండు వారాలు సమయం ఇచ్చింది. కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వ పిటిషన్పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. చంద్రబాబు బెయిల్ రద్దుపై జవాబు చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డివలప్మెంట్ కుంభకోణంలో దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అధికారుల పనిపడతామని హెచ్చరిస్తున్నారు. ఇలా మాట్లాడుతూ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారు. కనుక, వెంటనే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరారు. దీంతో, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు.. చంద్రబాబు తరఫు లాయర్లను ఆదేశించింది. ఈ సందర్భంగా తమకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా కోరారు. దీంతో, కౌంటర్ దాఖలు చేసేందుకు ధర్మాసనం రెండు వారాలు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
స్కిల్ స్కాం కేసులో నేడు మాజీ IAS లక్ష్మినారాయణ పిటిషన్ పై విచారణ
-
చంద్రబాబు స్కిల్ స్కాంలో అప్రూవర్ గా చంద్రకాంత్ షా
-
ప్రతివాదులుగా ఎల్లో మీడియా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించడంతోపాటు కేసు కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పునిచ్చినందుకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ఏసీబీ కోర్టు జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లు, కామెంట్లు పెట్టడంపై దాఖలైన క్రిమినల్ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఎల్లో మీడియా చానల్స్ టీవీ 5, మహాన్యూస్, మైరా మీడియా సంస్థలను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై యూట్యూబ్లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్ ఎల్ఎల్సీని ఆదేశించింది. కాగా.. తమ మాధ్యమాల్లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ఇప్పటికే తొలగించామని ప్రముఖ ఆన్లైన్ సామాజిక మాధ్యమ సంస్థలైన ఎక్స్, ఫేస్బుక్ హైకోర్టుకు నివేదించాయి. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో పలువురికి ఇంకా నోటీసులు అందచేయాల్సి ఉందని, అందువల్ల నోటీసులు అందజేసేందుకు మరికొంత గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పచ్చ సైన్యం అసభ్య, అభ్యంతరకర పోస్టులు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డిని లక్ష్యం చేసుకుంటూ సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. కులం పేరుతో కూడా వారిని దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది వసంత్కుమార్ లిఖితపూర్వకంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే హైకోర్టు న్యాయవాది ఎం.సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సైతం ఆ లేఖలకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు, విమర్శలు చేసిన వారిపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఆ పోస్టులను తొలగించలేదు తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను యూట్యూబ్ ఇప్పటికీ తొలగించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించిన వెంటనే సామాజిక మాధ్యమ సంస్థలు తమ ఆన్లైన్ వేదికలపై ఉన్న పోస్టులన్నింటినీ తొలగించాల్సి ఉంటుందని, ఆ సంస్థ ఆ పని చేయలేదని తెలిపారు. యూట్యూబ్ తరఫున సీనియర్ న్యాయవాది సజన్ పువయ్య వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు లేదా కేంద్రం నియమించిన అ«దీకృత అధికారి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే తాము ఆ పోస్టులను తొలగిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అసభ్య, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్ను ఆదేశించింది. ఎల్లో మీడియా చానళ్లను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ నేతలకు గతంలోనే నోటీసులు ఈ లేఖలను వాటితో పాటు జత చేసిన సోషల్ మీడియా తాలూకు కామెంట్లు, పోస్టింగ్లు, విమర్శలు, దూషణలను పరిశీలించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సస్పెన్షన్లో ఉన్న న్యాయాధికారి ఎస్.రామకృష్ణ, మువ్వా తారక్కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లారావు, కళ్యాణి, ఎన్.చిరంజీవి, చైతన్య కుమార్రెడ్డి, ఆనంద్, కిషోర్కుమార్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు టీడీపీ నేతలతో సహా గూగుల్ ఇండియా, ట్విట్టర్ కమ్యూనికేషన్స్, ఫేస్బుక్ ఇండియాలతో కలిపి మొత్తం 27 మందికి నోటీసులు ఇచ్చింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని వీరందరినీ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
చంద్రకాంత్ షా స్టేట్మెంట్ను అడ్డుకునేందుకు బాబు విశ్వ ప్రయత్నాలు
-
స్కిల్ కేసు: ఈ నెల 29కి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో అప్రూవర్గా మారతానని ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షా వేసిన పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదులు కౌంటర్ వేయడానికి సమయం కోరారు. కేసులో సీఐడి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డును ఏసిబి కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు విచారణను 29కి వాయిదా వేసింది. స్కిల్ కేసులో అప్రూవర్గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని కోర్టుకి చంద్రకాంత్ షా ఆధారాలు సమర్పించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఎ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషించారని చంద్రకాంత్ షా పేర్కొన్నారు. స్కిల్ కేసులో ఎ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016లో తనని కలిశారని తెలిపారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లని ఇవ్వాలని వారు కోరినట్లు పిటిషన్లో చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానని తెలిపారు. బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చెప్పారు. ఆ రూ.65కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలు పన్నుతున్నారు. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు
సాక్షి, నెల్లూరు: స్కిల్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని అన్నారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు పట్ల కక్ష సాధింపు లేదు కాబట్టే జైలులో ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు. తాజాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. ప్రభుత్వం తరపున కోర్టులో నేను వాదనలు వినిపించాను. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొందరు అంటున్నారు. జీవో నెంబర్-4లో స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదు. జీవో ప్రకారం జరగడం లేదని అప్పటి అధికారులు చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినలేదు. అప్పట్లో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు ముందుకు సాగారు. ఎల్లో మీడియా విశ్వప్రయత్నం.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం చట్ట పరంగానే విచారణ చేసింది. ప్రజాధనం కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగింది. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. స్కిల్ స్కామ్ పేరుతో రూ.371కోట్లను చంద్రబాబు కాజేశారు. రాజకీయ కక్ష అనే మంత్రజాలంతో పాపాన్ని కడిగేసుకోవాలని టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా విశ్వ ప్రయత్నం చేసింది. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదనలు.. చంద్రబాబు వయసుకు గౌరవం ఇచ్చి జైలులో సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. చంద్రబాబు పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాము. జైలు మన్యువల్లో లేనివి కూడా చంద్రబాబుకు అందించాము. చంద్రబాబుకు అన్ని సదుపాయాలు కల్పించినా కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కూడా కల్పించాము. ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించినా కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది. చంద్రబాబు అరెస్టు సక్రమమే అని న్యాయస్థానం తెలిపింది. కోర్టుల్లో వ్యతిరేక తీర్పు వస్తే వ్యవస్థల్ని మేనేజ్ చేశారని కొందరు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదించాను. కొందరు ఢిల్లీ నుంచి వచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్: అంబటి
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు ఆర్థిక బలంతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుకి మద్దతుగా.. ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. దొరకని దొంగలా ఇన్నాళ్లు చెలామణి అయిన చంద్రబాబు.. స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. రూ. 371 కోట్లు లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. హైకోర్టులో కూడా 17 ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని వాదించారని ప్రస్తావించారు. ఈ కేసును కొట్టివేయాలని కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని అన్నారు. వంద కారణాలు చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. చదవండి: రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు ‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాగా దిట్ట. దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. జైల్లో ఉంటేనే చంద్రబాబు ఆరోగ్యం బాలేదా? ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ వందల కోట్లు కాజేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్. వైఎస్సార్సీపీని ఓడించే సత్తాలేక.. ప్రతి ఒక్కరితో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు అర్ధమైంది. చట్టం నుంచి ఆయన తప్పించుకోలేరు. పవన్ క్యలాణ్ కుడా అవినీతి పరుడే. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అనుకూలంగా పవన్ మద్దతు ఇస్తుంటాడు’ అని అంబటి మండిపడ్డారు. చదవండి: -
డిఫెన్స్లో చంద్రబాబు.. పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి?
పబ్లిక్ సర్వెంట్స్పై వచ్చే అవినీతి అభియోగాల మీద విచారణ జరపడానికి ముందుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలా?. ఈ రూల్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందా? వర్తించదా?. దీనిని తేల్చడానికి సుమారు నాలుగు నెలల వ్యవధి తీసుకున్న గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 2018లో వచ్చిన చట్ట సవరణ ఆయనకు వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, వర్తించదని మరో న్యాయమూర్తి చెప్పడంతో ఈ వ్యవహారం చీఫ్ జస్టిస్ కోర్టులోకి వెళ్లింది. ఆయన దీనికి ఏం పరిష్కారం చూపుతారో ఇప్పుడే చెప్పలేం. అదే సమయంలో చంద్రబాబుపై వచ్చిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయకపోవడం, ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించకపోవడంతో ఈ ఉత్తర్వులు శరాఘాతంగా మారాయి. చంద్రబాబుకు ఒక జడ్జీ ఎక్కడా అసలు ఊరట కల్పించలేదు. 17ఏ పేరుతో అవినీతి కేసుల్లో రక్షణ కల్పించలేమని జస్టిస్ బేలా అభిప్రాయపడ్డారు. మరో జడ్జీ అనిరుధ్ బోస్ మాత్రం 2018కి ముందు కేసులకు కూడా గవర్నర్ అనుమతి అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడైనా అనుమతి తీసుకోవచ్చని చెప్పారు. ఈ అంశంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు లేకపోవడం గమనార్హం. చంద్రబాబు ఎలాగోలా ఈ కేసు నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు వృథా అయినట్లే అనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక చంద్రబాబు అరెస్టు చెల్లదని, రిమాండ్ సరికాదని చెప్పి ఉంటే ఈపాటికి చంద్రబాబు పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి ఏపీ ప్రభుత్వంపైన, సీఐడీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడేవారు. సుప్రీంకోర్టు అలా చేయకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ నేతలు, వారికి సంబంధించిన మీడియా ఛానళ్లు, టీడీపీ మద్దుతారులైన కొంతమంది లాయర్లు మాత్రం స్వరం తగ్గించి ఈ తీర్పు ఆధారంగా సీఐడీ చంద్రబాబుపై ఉన్న వివిధ కేసులలో ముందుకు వెళ్లకూడదన్నట్లు మాట్లాడటం ప్రారంభించారు. అనిరుధ్ బోస్ ఇచ్చిన తీర్పులోని ఒక భాగమైన 17ఏ సెక్షన్ వర్తిస్తుందన్న పాయింట్ను మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీకి భజన చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు ఎవరూ అధైర్యపడవవద్దని, అంతిమ విజయం మనదేనని అనడం ద్వారా పరిస్థితిని తెలియచెప్పారు. ఇంతకాలం స్కిల్ డెవలప్మ్మెంట్ కార్పొరేషన్ కేసులో అసలు అవినీతే జరగలేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా ఈ కేసు ముందుకు వెళ్లజాలదని ప్రచారం చేశారు. అంతే తప్ప తాము స్కామ్కు పాల్పడలేదని వాదించడానికి అంతగా సుముఖత చూపలేదు. తమ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతిస్తుందని వారు అనుకున్నారు. కానీ, సుప్రీంకోర్టు అందులోను ఒక న్యాయమూర్తి మాత్రమే 17ఏ లోని ఒక భాగం వరకే కొంత అనుకూల తీర్పు ఇచ్చినా, ఆయన కూడా ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని చెప్పడంతో చంద్రబాబుకు ఆ ఉపశమనం కూడా లేకుండా చేసినట్లయింది. అంటే దీని అర్ధం ఈ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ కేసులో అవినీతి ఉందన్న నమ్మకానికి వచ్చినట్లే అనుకోవాలి. ఒకవేళ ఇద్దరు జడ్జీలు 17ఏ విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, కేసు ఏమీ పోదు. కేవలం గవర్నర్కు ఫైల్ పంపించి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. గవర్నర్ స్థాయిలో మేనేజ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. కానీ, సుప్రీంకోర్టు 17ఏపై తీర్పు ఇవ్వకుండా, ఇద్దరు జడ్జీలు పరస్పర విరుద్దమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే టైమ్లో చంద్రబాబు కోరిన విధంగా కేసును క్వాష్ చేయకపోవడంతో సీఐడీకి దీనిపై తదుపరి విచారణ కొనసాగించడానికి స్వేచ్ఛ వచ్చినట్లయిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 17ఏపై తదుపరి తీర్పు ఇవ్వడానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది. అదంతా అయ్యే సరికి ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. అంతదాకా ఎందుకు చంద్రబాబు కేసులో ఈ తీర్పు రావడానికి సుప్రీంకోర్టు నాలుగు నెలల వ్యవధి తీసుకోవడం కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ కేసును ప్రముఖ లాయర్ ప్రశాంత భూషణ్ వేసిన కేసుకు జత చేస్తారేమోనని అనుకున్నారు. ఎందువల్లనో అలా చేయకుండా కొంత టైమ్ తీసుకుని తీర్పు వెలువరించారు. కాగా చివరి క్షణంలో కూడా టీడీపీ లాయర్ సిద్దార్ద్ లూథ్రా ఈ కేసులో చంద్రబాబుపై ఉన్న రిమాండ్పై ప్రత్యేకంగా తీర్పు వచ్చేందుకు యత్నించినా ఫలించలేదట. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎక్కడా తప్పు చేయలేదన్నట్లుగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ అవినీతి కేసులో పలు ఆధారాలు ఉన్నప్పట్టికీ టీడీపీవారి కన్నా ఎక్కువగా రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు భుజాన వేసుకుని అసలు అవినీతే లేదన్నట్లుగా ప్రొజెక్టు చేయడానికి నానా తంటాలు పడ్డారు. టీడీపీ ఖాతాకు అక్రమంగా కోట్ల రూపాయల నిధులు వెళ్లాయని సీఐడీ కొన్ని పత్రాలను చూపించినా వీరు దబాయిస్తుంటారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఈ విచారణకు రాకుండా అమెరికాకు పారిపోయినా అసలేమీ జరగనట్లు నటిస్తుంటారు. ఈడీ అధికారులు ఇదే కేసులో నలుగురిని అరెస్టు చేసినా అదేదో చంద్రబాబుకు సంబంధంలేని వ్యవహారంగా కలరింగ్ ఇవ్వడానికి యత్నించారు. విశేషం ఏమిటంటే ఒక పక్క మొత్తం కేసును కొట్టివేయాలని హైకోర్టులోనూ, ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు లాయర్లు చాలాకాలం ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు వేయలేదు. కానీ క్వాష్ పిటిషన్పై అనుకూలంగా తీర్పు రాదని భావించారేమో తెలియదు కానీ, వారు ఆలస్యంగా బెయిల్ పిటిషన్ వేశారు. తదుపరి హైకోర్టులో తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు చూపి బెయిల్ పొందారన్న అభిప్రాయం ఉంది. అది వేరే సంగతి. ఇక్కడ కొన్ని విషయాలను పోల్చి చూడాలి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు నెలల తరబడి జైలులో ఉన్నారు. వారిపై అంతా కలిపి వంద కోట్ల అవినీతి ఆరోపణ కూడా లేదు. అదే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల్లో అనేక వందల కోట్ల అభియోగాలు ఉన్నాయి. అయినా ఆయన సత్వరమే బయటకు రాగలిగారు. ఇక సుప్రీంకోర్టు వరకు వెళ్లి అసలు కేసే లేకుండా చేసుకోవాలని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్లు ఖర్చు చేసి వాదనలు వినిపించారు. కానీ, ఆశించిన ఫలితం రాలేదు. వచ్చే ఎన్నికలలో దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది సహజంగానే చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబుకు కొన్నికేసులలో బెయిల్ వచ్చింది. మరి కొన్ని కొత్త కేసులు ఉన్నాయి. వాటిలో కూడా బెయిల్ తెచ్చుకుంటారా? లేక అరెస్టు అవుతారా? అన్నది చూడాలి. చంద్రబాబుపై అవినీతి కేసు లేకుండా బయటకు వస్తారని ఆశించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దీనిని సమర్ధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతించి ఉంటే దానిని తమకు రాజకీయంగా మైలేజీ వచ్చేలా ఎన్నికల ప్రచారం సాగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ తీర్పును వక్రీకరించడానికి వారు ప్రయత్నించవచ్చు. ఈ కేసులో టీడీపీ ఖాతాకు చేరిన నిధులు, తదితర అంశాలలో సీఐడీ కనుక వేగంగా ముందుకు వెళితే చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో నష్టం కలగవచ్చు. మరే కేసులో అయినా అరెస్టు అయినా, లేక సీఐడీ వద్దకు తరచుగా విచారణకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చినా తెలుగుదేశం, జనసేన క్యాడర్ నైతికంగా దెబ్బతింటుంది. ప్రజలలో దీనిని ఎలా సమర్ధించుకోవాలో తెలియని ఆందోళన ఎదరువుతుంది. టీడీపీతో పొత్తులో చేరడం వల్ల తాము కూడా అనవసరంగా అవినీతికి మద్దతు ఇచ్చినట్లయిందని జనసేన కార్యకర్తలు అనుకునే అవకాశం ఉంటుంది. దీంతో జనసేన వారు తమ సపోర్టు కావాలనుకుంటే మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేయవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడుకు ఈ తీర్పు పెద్ద షాక్ వంటిదని చెప్పాలి. ఎన్నికలలో దీని ప్రభావం పడకుండా ఉండటానికి ఆయన ఎంత కష్టపడ్డా అంత పలితం ఉండకపోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
డజన్ల కొద్దీ పిటిషన్లు..కోట్లు ఛార్జ్ చేసే లాయర్లు..చివరికి న్యాయమే గెలిచింది
-
కెఎస్ఆర్ లైవ్ షో: చారిత్రాత్మక తీర్పు బాబుకు బిగుస్తున్న ఉచ్చు
-
అడ్డంగా దొరికిన బాబు..పక్కా ప్లాన్ తోనే స్కాం
-
స్కిల్ స్కాంలో చంద్రబాబుకు భారీ షాకిచ్చిన న్యాయమూర్తులు
-
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్.. కేసును కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరణ..ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకరణ
-
చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
ప్రజా కోర్టులో కూడా చంద్రబాబు శిక్ష తప్పదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: పలు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పులపై అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదన్నారు. మంత్రి అమర్నాథ్ కామెంట్స్.. – చంద్రబాబు బోనులో దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందే. – సుప్రీం కోర్టు తీర్పును తప్పుదోవ పట్టించేలా ఎల్లో మీడియా ప్రచారం. – కోర్టులో చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ దొరకలేదు. – ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు సెక్షన్ 8 అన్నాడు. – నేడు 17ఏ అంటున్నాడు..కానీ తప్పు చేశాడా లేదా అన్నది మాత్రం చెప్పడం లేదు. – చంద్రబాబు చేసిన తప్పులను ప్రజలు కూడా గమనిస్తున్నారు. – ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడే రోజు త్వరలోనే ఉంది. – లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? – రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్. – అలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇచ్చిన తీర్పేంటి..? మీరు చేసే ప్రచారం ఏంటి..? – కొన్ని చానళ్లు గొప్ప విజయం సాధించాం.. చంద్రబాబుకు ఏదో ఊరట కలిగింది. – ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. – దీన్ని చూస్తే 2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో నేడు అదే విధంగా కనిపిస్తోంది. – అసలు జరిగిన కేసేంటి.. వాదనలేంటి? ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ కలగలేదు. – వాస్తవానికి ముందుగా గమనించాల్సింది ఏంటంటే 17ఏ వర్తిస్తుందా లేదా అనేది అది ఒక ప్రొసీజరల్ సెక్షన్ మాత్రమే. – 2018లో అమల్లోకి వచ్చిన ఈ సెక్షన్ ఈ కేసుకు వర్తించదు.. స్కిల్ స్కాం అనేది 2015 ప్రాంతంలోనే జరిగింది. – ఈ క్రమంలో చంద్రబాబు, వారీ పార్టీ వారు, వారి లాయర్లు ఎక్కడా బాబు తప్పుచేయలేదు అనడం లేదు. – రూ. 370 కోట్ల ప్రజా ధనాన్ని నేను దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో లేదు. – గవర్నర్ అనుమతి లేదనో, స్పీకర్ చెప్పలేదనో 17ఏ ని చూపించి క్వాష్ చేయండని కోరారు. ఇద్దరు జడ్జిలు రిమాండ్ ప్రక్రియలో లోపం లేదనే ఏకాభిప్రాయాన్ని చెప్పారు.. – ఈ రోజు ఇచ్చిన తీర్పులో జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. – అయితే ఇద్దరూ కామన్గా రిమాండ్ తీసుకోవడంలో అంతా పద్దతి ప్రకారమే జరిగిందని చెప్పారు. – గతంలో కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారు. – సెక్షన్ 8 అమల్లో ఉంది.. మీకూ పోలీసులున్నారు.. మాకూ ఉన్నారు.. మీకూ ఏసీబీ ఉంది మాకూ ఉంది అంటూ మాట్లాడారు. – ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. – గతంలో సెక్షన్ 17ఏ అనేది వర్తించదని దాదాపు 6 కోర్టులు చెప్పాయి. – అంత క్లియర్గా ఉంటే.. దానికి అనుగుణంగా విచారణ సంస్థలు ఫైట్ చేస్తున్నాయి. – ఈ రోజు వచ్చిన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు బోనులో నిలబడి న్యాయస్థానం, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సి ఉంది. – 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదు. – ఈ రోజు వచ్చిన తీర్పును వారికి నచ్చినట్లు అన్వయించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. – ఎంత సేపూ తప్పు చేయలేదని చెప్పరు.. చేసిన విధానం బాగాలేదంటూ మాట్లాడుతున్నారు. – మీరు చేసిన దొంగపని విచారణ సంస్థలు, కేంద్ర సంస్థలు అంగీకరించాయి కాబట్టి ఆయన రిమాండ్కు వెళ్లాడు. – ఈ రోజు కేసు కొట్టేసినట్లు ఎల్లో మీడియా బాకాలు కొట్టుకుంటోంది. – ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చేతికి పడిన సంకెళ్లు, ఆయనపై పడ్డ మచ్చను నిరూపించుకోవాలి. – వీటన్నిటికన్నా మించి రేపు ప్రజా క్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు చేసిన తప్పును ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడే రోజు త్వరలోనే ఉంది. ప్రశ్నలు–సమాధానాలు: – క్యాబినెట్లో పెట్టినదానికి, స్కిల్ స్కాంలో చేసిన దానికి అసలు సంబంధమే లేదు. – అసలు ఫైల్ ముఖ్యమంత్రి వద్దకే రాదంటూ మంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. అసలు గెలవకుండానే మంత్రి అయిన వ్యక్తికి అంతకంటే ఏం తెలుస్తుంది..? – 17ఏ అనేది నీకు, జరిగిన అవినీతికి సంబంధం లేదు అనేది కాదు కదా? – దాన్ని కేసుకు ముడిపెట్టి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. – నా సీటు గురించి మీరెందుకు గాబరా పడుతున్నారు..? మూడు లిస్టులు కాకపోతే.. నాలుగు.. లేదంటే పార్టీకి పనిచేస్తా. లేని పార్టీకి ఎవరైతే మాకెందుకు..?: – ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? – గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 0.4 శాతం నోటా కంటే తక్కువ వచ్చింది. – అటువంటి లేని పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరం. – రాజకీయాల్లో ఉన్న వాళ్లకు అన్నదమ్ములు చాలా మందికి ఉంటారు. ఉన్నోరంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా? – ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాదు కదా ఓట్లేసే వారు లేరు. – దానికి ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయం కారణం.. మనం కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టింది వారు. – రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితే నరికిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని ప్రజలు అనుకున్నారు. అలానే లేకుండా చేశారు. – నాకు తెలిసి ఆ పార్టీ ప్రభావం జీరో అనేదే నా అభిప్రాయం. -
ACB కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న జస్టిస్ బోస్
-
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
-
సెక్షన్ 17A వర్తిస్తుందన్న చంద్రబాబు తరపులాయర్లు
-
బాబు, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారానికి తెరపడింది: పొన్నవోలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో సుప్రీం తీర్పులపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తీర్పు అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడేందుకు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయింది. సుప్రీంకోర్టులో ఈరోజు పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. కేసు విషయంలో నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ ఊగిపోయారు. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు తీరు తేటతెల్లమయింది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడింది. బాబు గోబెల్స్ ప్రచారానికి, ఎల్లో మీడియా అసత్యాలకు తెరపడింది అంటూ కామెంట్స్ చేశారు. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. ఇది కూడా చదవండి: బాబు రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం -
3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు
సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్దకు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఐఆర్ఆర్ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు. -
‘స్కిల్డ్’ క్రిమినల్ చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం చంద్రబాబు అంతులేని అక్రమాలకు ఓ మచ్చు తునక మాత్రమే. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట చంద్రబాబు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. జర్మనీకి చెందిన సీమెన్స్కి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో కాగితాలపై ప్రాజెక్టు సృష్టించారు. రూ.370 కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. సీమెన్స్ పేరుతో జీవో జారీ చేసి తన బినామీ కంపెనీ డిజైన్టెక్తో ఒప్పందం చేసుకున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రూ.271 కోట్లు విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా అక్రమార్జనను తన నివాసానికే చేరవేశారు. ఈ అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడంతో చంద్రబాబు అక్రమాలు బట్టబయలయ్యాయి. స్కిల్ స్కామ్ సృష్టికర్త చంద్రబాబేనని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆధారాలతో సహా వెల్లడైంది. దీంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్షిట్ నమోదు చేసింది. టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గతేడాది సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తరువాత అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సాగించిన స్కిల్ స్కామ్ ఇలా సాగింది.. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. అంతా బాబు ముఠానే.. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా 4 పోస్టులు కట్టబెట్టారు. నేరుగా నిధులు మంజూరు జరిగేలా కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు.. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు సీమెన్స్కి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90% కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. టెండర్లు లేకుండా తన బినామీ కంపెనీకి ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకే ఈ ఎత్తుగడ వేశారు. నో రూల్స్... సీమెన్స్– డిజైన్ టెక్ ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ నోట్ ఫైల్లో పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల నిబంధనలకు విరుద్ధమని వారించినా చంద్రబాబు లెక్క చేయలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లు నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, తరువాత ఆ ఫైల్ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు పీవీ రమేశ్ తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్ ఫైళ్లలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమరి్పంచి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబు బంగ్లాకు రూ.241 కోట్లు చేరవేశారు. కేసులో కీలక నిందితులు ఏ–1 చంద్రబాబు, నాటి ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, నాటి కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, నాటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్, నాటి ఫైనాన్షియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, డిజైన్టెక్ ఎండీ ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్లోని తమ ఎండీ సుమన్ బోస్ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్వర్క్ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. మదింపు బూటకం.. నివేదిక నాటకం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు సరైందేనంటూ ‘సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) థర్డ్ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ చంద్రబాబు అడ్డగోలుగా వాదించి అడ్డంగా దొరికిపోయారు. తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని, కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేసింది. వాస్తవానికి అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. కొరడా ఝుళిపించిన ఈడీ ఈ స్కామ్పై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి అవి ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు వెళ్లాయి? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు ఇప్పటికే నిర్ధారించింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా నాడు ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. బాబు అవినీతి నెట్వర్క్ ఇదిగో.. టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. ♦ అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్కి మనోజ్ అక్రమ నిధులను తరలించిన పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్కు ఉడాయించారు. -
స్కిల్ కేసు.. ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, గుంటూరు: చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై దాఖలైన పిటిషన్ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. స్కిల్ స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. ఇతర కారణాలతో నోటీసులు వెనక్కి విషయాన్ని ప్రస్తావించారాయన. పైగా ఈ కేసులో కొందరు ప్రతివాదులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా ప్రతివాదులకు పేపర్ ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో.. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు. -
Dec 15th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 7:00 PM, Dec 15, 2023 ఏమైనా చేయండి.. యువగళం ముగింపు సక్సెస్ చేయండి టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు విజయోత్సవ సభకు లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్న చంద్రబాబు సభ సక్సెస్ కాకపోతే లోకేష్ ఊరుకోడని చెబుతోన్న చంద్రబాబు ఎంత ఖర్చయినా సరే.. నాది బాధ్యత, జనాలను తీసుకురావాలని పిలుపు ఇప్పటికే రంగంలోకి దిగిన లోకేష్ కోటరీ ప్రతీ నియోజకవర్గ ఇన్ఛార్జ్కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టార్గెట్లు జనం తగ్గితే ఎమ్మెల్యే టికెట్లు కష్టమని హెచ్చరిస్తోన్న లోకేష్ కోటరీ లోకేష్ సభ సక్సెసయితేనే పార్టీకి మనుగడ ఉంటుందని హెచ్చరికలు 6:55 PM, Dec 15, 2023 మరి.. మీరెందుకు కుప్పం వచ్చారు బాబు.? : పేర్ని నాని రాజకీయాల్లో ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారు చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ ఫర్ అయ్యారు మేం వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారు వైనాట్ 175కి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగులు పట్టవు జగన్ ను ఓడించాలి, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజుకు ఇచ్చారు : పేర్ని నాని 5:05 PM, Dec 15, 2023 జనసేనకు రాంరాం.. ఒంటరిగానే తెలంగాణలో పోటీ : బీజేపీ పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు మా టార్గెట్ లోకసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్ కు కిషన్ రెడ్డి పిలుపు డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు : స్పష్టం చేసిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమాన పోరాటాలుంటాయి లోకసభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్దం కావాలి సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయి కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది 5:02 PM, Dec 15, 2023 చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కోవర్ట్ : RGV జనసేన స్థాపనకు కారణమే చంద్రబాబు : రాంగోపాల్ వర్మ మరోమాటలో జనసేనలో పవన్, చంద్రబాబుకు కోవర్టు వారిద్దరి మధ్య పొత్తు అనే దానికి అర్థమే లేదు ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగోలేదు తెలంగాణాలో కేసీఆర్ కు ఉన్నంత బలమైన అపొజిషన్ ఏపీలో లేదు రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ అపొజిషన్ గా వచ్చి సీఎం అయ్యారు : ఆర్జీవీ 4:23 PM, Dec 15, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా ACB కోర్టులో IRR అలైన్మెంట్ కేసు విచారణ వాయిదా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పైనా విచారణ వాయిదా తదుపరి విచారణలు జనవరి 30కి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏం జరిగిందంటే? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ఏం జరిగిందంటే? ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 3:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు : సజ్జల ఆస్తుల కోసమే చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్నాడు మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు చంద్రబాబుకు ఎందుకు..? చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు ఎందుకు వెళ్లాడు..? మంగళగిరికి లోకేష్కు సంబంధం ఏంటీ..? ఏపీకి చంద్రబాబు గెస్ట్లా మాత్రమే వస్తాడు 1:31 PM, Dec 15, 2023 ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు సచివాలయంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారులు,సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎన్నికలకు ఎలా వెళ్తారో చెబుతారని అనుకున్నాం..! మా ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు? తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా? తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా? ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? తుఫాన్ పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశాం అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి? హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడు.! చంద్రబాబు కి ప్రజామోదం లేదు .2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టో చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారు హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, లోకేష్,ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదు చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదు అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారు చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక భోగస్ ఫోరమ్ ను పెట్టారు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తెలియదా? నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా? సిటిజన్ ఫోరమ్ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్ ను దించుతుంది మేం చాలా ఆత్మ నిబ్బరంగా ఉన్నాం...బలంగా ఉన్నాం ఏబీఎన్ డిబేట్లలో అనలిస్ట్ లు తగ్గినట్లున్నారు చంద్రబాబు ఏబీఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నాం చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి 11:31 AM, Dec 15, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 8:13 AM, Dec 15, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 7:23 AM, Dec 15, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 7:10 AM, Dec 15, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:56 AM, Dec 15, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ -
Dec 14th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:54 PM, డిసెంబర్ 14, 2023 ఇన్నర్రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా 6:24 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు భ్రమలు ఇంకా తొలగలేదు : మంత్రి కాకాని చంద్రబాబుకీ పూర్తిగా పిచ్చి పట్టిందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.. పోలవరాన్ని తానే డిజైన్ చేసానని చెప్పుకోవడం సిగ్గుచేటు.. పోలవరం ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది వైస్సార్ ఐతే.. దాన్ని పూర్తి చేసేది సీఎం YS జగన్ మిగ్చామ్ తుఫాన్ లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. చంద్రబాబు హయాంలోనే రైతులు నష్టపోయారనే విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి.. వ్యవసాయమే దండగ అని మాట్లాడిన చంద్రబాబు.. రైతులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం.. టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే.. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. రుణమాఫీ చేస్తానని చెప్పి.. రైతులను బాబు మోసం చెయ్యలేదా..? తుఫాన్ సమయంలో కష్టపడి పని చేసిన అధికారులను తక్కువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆత్మ స్తుతి.. పర నిందతో చంద్రబాబు బతుకుతున్నారు.. 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఐతే.. అప్పటి నుంచి ఒక్క సాగునిటీ ప్రాజెక్ట్ ను అయినా చేపట్టారా..?? చంద్రబాబు సిగ్గు లేకుండా.. తుఫాన్, వరదలు విషయంలో మాట్లాడుతున్నారు.. మోసాలు చెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. అయన జైలుకు వెళ్తే జనాలు ఆత్మహత్య లు చేసుకున్నారని చెప్పడం సిగ్గుచేటు.. అలిపిరిలో చంద్రబాబు మీద బాంబ్ దాడి జరిగితే రాష్టంలో ఒక్కరూ కూడా పట్టించుకోలేదు.. రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీని నీ హయాంలో ఎప్పుడైనా ఇచ్చావా..?? 2015 లో జాతీయ రహదారి తెగిపోతే ఐదేళ్లు పట్టించుకోలేదు.. వైసీపీ హయాంలో ఆ హైవే పనులు పూర్తి చేసాం.. NDA లో భాగస్వామిగా ఉన్నప్పుడు.. నిధులు తీసుకురాగలిగావా..? రైతులను, ప్రజలను ఆదుకున్న చరిత్ర చంద్రబాబు కీ లేదు.. పని చేసే వ్యక్తి జగన్.. ఫోటోలకు పోజులు ఇచ్చేది చంద్రబాబు.. ఆస్తి, ప్రాణ నష్టాలు జరక్కుండా జిల్లా యంత్రాంగం తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే.. ఒక్క రైతు కూడా కనిపించలేదు.. వైసీపీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉన్నట్టుంది 5:42 PM, డిసెంబర్ 14, 2023 మా తలుపులు తెరిచే ఉన్నాయి.. రండి బాబు రండి అభ్యర్థుల కోసం ఆశగా ఎదురుచూస్తోన్న చంద్రబాబు వైసీపీలో మంచివాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచిస్తాం : చంద్రబాబు జనసేనతో పొత్తులో ఉన్నాం.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాం అయినా YSRCP నుంచి అసంతృప్తితో ఎవరైనా మంచి అభ్యర్థి వస్తే పార్టీలోకి తీసుకుంటాం ఈసారి త్వరగానే అభ్యర్ధులను ప్రకటిస్తాం : చంద్రబాబు YSRCP నుంచి ఎవరైనా అసమ్మతిదారులు బయటకు వస్తారేమో.. 5:12 PM, డిసెంబర్ 14, 2023 నీతులు భలే చెబుతావు బాబు..! టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు? అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు? ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు? దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు? రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు? ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు? లోకేష్ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు? 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు? అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.? నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా? అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా? 4:10 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్ పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్కు మాత్రమే ఉంది పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది? ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్ 4:05 PM, డిసెంబర్ 14, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కాంకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ బాబు ముందస్తు బెయిల్పై వాదనలు సీఐడీ తరపున పూర్తయిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు 4:02 PM, డిసెంబర్ 14, 2023 దొంగ ఓట్లు కేరాఫ్ తెలుగుదేశం ఢిల్లీలో మీడియాతో ఎంపీ విజయసాయిరెడ్డి దొంగ ఓట్లు చేర్పిస్తున్న టీడీపీ నేతలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు టీడీపీ నేతల నిర్వాకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం టీడీపీ నేతల దొంగ ఓట్ల వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని కోరాం టీడీపీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం అమెరికా సర్వర్ లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు తండ్రి పేరు, ఇంటి పేరు మార్చి ఒకే ఓటర్ ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం వీలైనంత త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాం మా విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించింది : ఎంపీ విజయసాయిరెడ్డి 3:52 PM, డిసెంబర్ 14, 2023 ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్ విడుదల చేసే లోకేష్ ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.! హెరిటేజ్ లో రూ.20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... మార్కెట్లో దాని విలువ రూ.70 వేల కోట్లు .! మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్లో ఉన్న ఆస్తుల విలువెంత.? మదీనాగూడలో 14 ఎకరాల ఫాంహౌజ్ విలువెంత? జూబ్లీహిల్స్లో కట్టిన ఇంద్రభవనం విలువెంత? లోకేష్.. ప్లీజ్ తొందరగా ప్రెస్ మీట్ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.? 2:52 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు అంటే నమ్మక ద్రోహం చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైర్ కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీని నాశనం చేశాడు ఎస్సీ బీసీ ఎస్టీలను మోసం చేసి దగాచేశాడు ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడు పోలవరంను నాశనం చేసింది చంద్రబాబే అధికారం కోసం జగనన్న సంక్షేమ పాలనపై యెల్లో మీడియాతో విషపు రాతలు సీఎం జగన్ చేతల మనిషి.. ఆయనపై బాబు కుట్రలు పని చేయవు ఏపీ ప్రజలు చంద్రబాబును గమనిస్తున్నారు చంద్రబాబు పాలనలో సామజిక న్యాయం అందని ద్రాక్ష జగన్ పాలనలో సామాజిక న్యాయం విప్లవాత్మకంగా అమలైంది యువగళంకు ప్రజాబలం లేదు...లోకేష్ కి మెదడు లేదు లోకేష్. మాతో చర్చలకు సిద్దామా? మీ ఆఫీస్కే వస్తాం 2:00 PM, డిసెంబర్ 14, 2023 బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు? మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు? నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు? ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు? కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు? నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు? అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్మీట్ ఎందుకు పెట్టించాడు? తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు? ఇంతకీ మా బావ మనసులో ఏముంది? ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను? అదొక అన్-స్టాపబుల్ అసైన్మెంట్..! 1:30 PM, డిసెంబర్ 14, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య.. 17ఏ కాపాడలేదు : న్యాయనిపుణులు రేపో, మాపో 17aపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు తప్పు చేయలేదని ఇప్పటివరకు ఏ కోర్టుముందు కూడా చెప్పని చంద్రబాబు అరెస్ట్కు ముందస్తు అనుమతి లేదని మాత్రం సాంకేతికంగా డొంక తిరుగుడు వాదనలు వినిపిస్తోన్న చంద్రబాబు లాయర్లు చంద్రబాబు పిటిషన్కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి(అక్టోబర్, నవంబర్లలో జరిగిన విచారణ సందర్భంగా) స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే 17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది 17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్కమ్ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్కు గురవుతారు రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది 2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు 2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్ను బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:44 PM, Dec 14, 2023 తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే ►పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నారంటే.. ► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి ► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది ► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి ► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు 1,56,88,569 అంటే 49.95% ► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే ► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1 ► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.! ఒకసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా? ► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరి పొలిటికల్ కెరియర్లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్, పవన్ మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్కు షాక్ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి గాజువాకలో పవన్ కళ్యాణ్ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి 12:15 PM, Dec 14, 2023 చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 11:15 AM, Dec 14, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 10:12 AM, Dec 14, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 8:19 AM, Dec 14, 2023 ఐఆర్ఆర్ కేసులో నేడు ఏపీ హైకోర్టు విచారణ చంద్రబాబు ముందస్తుబెయిల్ పై విచారించనున్న హైకోర్టు రుషికొండలో నిర్మాణాలపై నేడు ఏపీ హైకోర్టు విచారణ జనసేన నేత మూర్తి పిటిషన్ పై విచారించనున్న హైకోర్టు 7:33 AM, Dec 14, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకి సలహాలు, సూచనలు చెప్పే స్వేచ్ఛ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు లేదు. జనసేన పార్టీలో ఎవ్వరైనా టీడీపీ పార్టీని విమర్శిస్తే వైయస్ఆర్సీపీ పార్టీ కోవర్టులుగా చిత్రీకరిస్తాడు. జనసైనికులు కోవర్టులు కాదు.. చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్టు - ఆకుల… pic.twitter.com/BO1LwpuGIe — YSR Congress Party (@YSRCParty) December 13, 2023 7:28 AM, Dec 14, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:53 AM, Dec 14, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 6:51 AM, Dec 14, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నేటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ నేటికి వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు -
సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేదా ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో పలు చిక్కులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. మనీలాండరింగ్ కూడా జరిగిందని వివరించింది. సీఆర్డీఏ పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణాలపై 2020లోనే సీఐడీ దర్యాప్తు చేపట్టిందని, వీటిపై దర్యాప్తు చేయాలని సీబీఐని కూడా కోరినట్లు తెలిపింది. సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపామంది. ఇందుకు జీవోలు కూడా జారీ చేశామని తెలిపింది. ఉండవల్లి వ్యాజ్యంలో కోర్టు ఏ ఆదేశాలు జారీ చేసినా కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ తెలిపారు. ఇతర మార్గాల్లోనోటీసులు పంపేందుకు అనుమతివ్వండి నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కొందరికి అందాయని, కొందరు తిరస్కరించారని, డోర్ లాక్, ఇంట్లో లేరు వంటి కారణాలతో కొన్ని వెనక్కి వచ్చాయని ఉండవల్లి తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వివరించారు. నోటీసులు అందని వారికి పత్రికలు, వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపేందుకు అనుమతివ్వాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇప్పటి వరకు సీఐడీ చేసిన దర్యాప్తు వివరాలతో ఓ నివేదికను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్లాక నివేదికపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. నోటీసులు అందని వారికి వాటిని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
Dec 13th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 6:24 PM, Dec 13, 2023 చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అంటే ఇష్టం లేదు : మంత్రి అమర్నాథ్ విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదు టీడీపీ, జనసేనలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు పవన్ అజ్ఞాతవాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి 6:04 PM, Dec 13, 2023 దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబే : ధర్మాన శ్రీకాకుళం : చంద్రబాబు ఏ రోజైనా దళితులను పట్టించుకున్నారా? : మంత్రి ధర్మాన అవినీతికి తావులేకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కట్టడం కాదు ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడం రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబుకు కనిపించదు : మంత్రి ధర్మాన 5:33 PM, Dec 13, 2023 బాబు పాలసీ.. ఆక్ పాక్ కరివేపాక్.! : YSRCP పెత్తందార్లకే పెత్తనం, వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమిధలు చంద్రబాబు నేతృత్వంలో ఈనాడు చిమ్మిన విషం వాస్తవాలు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.! వైసీపీ నుంచి 23 మంది MLA లను కొని , 2017 లోఅందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు బాబు వీరిలో ఆదినారాయణరెడ్డి ,అమరనాధ్ రెడ్డి ,భూమా అఖిల ప్రియా రెడ్డి సుజయ్ కృష్ణరావులకు మంత్రి పదవులు ఇచ్చాడు కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇచ్చాడా బాబు.? గడప గడపకు మే 11 2022 న ప్రోగ్రాం మొదలయినప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయి అని పార్టీ అధిష్టానం స్పష్టంగా చేసింది దళితుల స్థానాల్లో మార్పు చేసి వారికే వేరే చోట్ల టికెట్లు ఇచ్చింది బీసీ అయినా విడదల రజనీకి గుంటూరు వెస్ట్ కేటాయించారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి , తిప్పల నాగిరెడ్డి ల స్థానాల్లో బీసీలకు గంజి చిరంజీవి (చేనేత) , వరికూరి రామచంద్రరావు (యాదవ) కు ఇచ్చారు. అయినా ఏడుపేనా? ఇక SC నియోజక వర్గాల్లో రెడ్లదే పెత్తనం అంటూ మరో విషం టీడీపీ హయాంలో SC, BC నియోజక వర్గాల్లో కమ్మ పెత్తనం ఉండేది కాబట్టి ఇప్పుడు అలాగే ఉండాలి అని కాకమ్మ కథలు చెబుతున్నారా? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పింది చంద్రబాబు కాదా? రాజకీయాలు అంటే మేమే చేయాలి, దళితులూ మీకెందుకు రాజకీయాలు అంటూ దుర్భషలాడింది మీ MLA చింతమనేని చౌదరి కాదా? బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు - రూ.35,250.46 కోట్లు ఎస్సీల కోసం సీఎం జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే రెట్టింపు దళితులకు ఇచ్చిన మంత్రి పదవులు : బాబు హయాములో -2, సీఎం జగన్ పాలనలో -5 బాబు 4 కార్పొరేషన్ పదవులు, సీఎం జగన్ 15 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు శాసన మండలి చైర్మన్గా మోషెన్ రాజును చేశారు రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుంది అని అడ్డుకున్నది చంద్రబాబు కాదా? 4:22 PM, Dec 13, 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇద్దరినీ ఎవరూ నమ్మరు : సజ్జల మీడియాతో YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదు పవన్ ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారు 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు కరోనాలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఎకానమీ దెబ్బతినలేదు ఎల్లోమీడియాలో వార్తలు రాయించుకుని చంద్రబాబు ఒక భ్రమలో బతుకుతన్నారు పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారు చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ సర్దుకుంటాయి టీడీపీ అనే శిధిలపార్టీని చంద్రబాబు ఏలుకుంటున్నారు ఎల్లోమీడియానే టీడీపీని, చంద్రబాబును నడిపిస్తోంది వారు పగటికలలు కంటున్నారు అదే కలలు కంటూ అలాగే వారు భ్రమల్లో ఉండాలని కోరుకుంటున్నాం వై నాట్ 175 అనే లక్ష్యంతోనే మేము పని చేస్తున్నాం జగన్ ఏం తప్పు చేస్తారా? ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు అసలు టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో లేదో కూడా తెలియని దుస్థితి 3:45 PM, Dec 13, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ కేసు రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 3:03 PM, Dec 13, 2023 మాకొద్దీ జనసేన, పవన్ కళ్యాణ్.. మీకో దండం జనసేనలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కిన ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన తండ్రి, కూతురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల వెంకట స్వామి పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా నా కూతురు కళ్యాణి సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని ఆరేళ్లు జనసేన పార్టీ కోసం కష్టపడింది పవన్ కళ్యాణ్ అప్పజెప్పిన అన్ని విధుల్లో చక్కగా పనిచేసింది కార్యాలయంలోని అంతర్గత కుమ్ములాటల్లో నా కూతురును తొలగించారు పార్టీకి సేవ చేస్తే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు పవన్ కళ్యాణ్ మాటలకు, సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో జాయిన్ అయ్యాను పార్టీ గుర్తించి పదవులు కేటాయించింది పవన్ కళ్యాణ్ మొదట్లో చెప్పిన మాటలకు ఇప్పుడు మాటలకు పొంతన లేకుండా పోయింది.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకే కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు టిడిపిపై గతంలో అవినీతి చేశారని విమర్శలు చేశాడు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ నిర్ణయం నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను పొత్తు పెట్టుకున్న తర్వాత కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీలో ఉండి టిడిపిని విమర్శిస్తే వైసిపి కోవర్ట్ అని పవన్ అంటున్నాడు జనసైనికులు ఎవరికీ కోవర్టులు కాదు... చంద్రబాబుకి పవన్ కళ్యాణే పెద్ద కోవర్ట్ ఇప్పటివరకు జనసేన పార్టీ జెండాలు మోశాం టిడిపి జెండాలు మోయమంటే మావల్ల కాదు కాపు యువతను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు టిడిపికి ఓట్లు వేసే పరిస్థితిలో కాపులు లేరు టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు ఒక సీటు గెలిచినా గొప్పే జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల జయకళ్యాణి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ జనసేన పార్టీలో చేరాను పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేశాను ఒక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చేలా మాట్లాడి పార్టీలో పని చేయించుకున్నారు నాకు కేటాయిస్తానని చెప్పిన పదవులు మాత్రం వేరే వారికి కట్టబెట్టారు పార్టీ ట్రెజరర్ రత్నం కాల్ చేసి మీ సేవలు చాలు అన్నారు నాతోపాటు 43 మంది ఉద్యోగులను కారణం చెప్పకుండానే బయటికి పంపించేశారు 2:44 PM, Dec 13, 2023 ఐఆర్ఆర్ పిటిషన్ రేపటికి వాయిదా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఇవాళ కూడా జరిగిన విచారణ తదుపరి విచారణ రేపటికి వాయిదా 1:14 PM, Dec 13, 2023 ఓటర్లతో క్షుద్ర రాజకీయానికి తెర లేపుతారా? భారీ సంఖ్యలో టీడీపీ బోగస్ ఓట్లు చేర్పించినట్టు బయటపడుతోన్న ఆధారాలు కుప్పం సహా 175 నియోజకవర్గాల్లో 41 లక్షల బోగస్ ఓట్లు కుప్పలు తెప్పలుగా ఫారం 7 దరఖాస్తులు.. విచారణ జరిపి ఆ దరఖాస్తులన్నీ నకిలీవని తేలుస్తున్న BLO లు (బూత్ లెవెల్ ఆఫీసర్స్) 2014 ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు వాటిని అడ్డం పెట్టుకుని నాడు 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి టీడీపీ 2014-19 మధ్య సేవామిత్ర యాప్తో YSRCP అనుకూలర ఓట్లను టార్గెట్ చేసిన టిడిపి ఏకంగా 50,23,565 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చిన బాబు మనుష్యులు వైసీపీ ఫిర్యాదును పరిశీలించి 31,97,473 ఓట్లను తిరిగి చేర్పించిన ఎన్నికల కమిషన్ హైదరాబాద్లో నివసిస్తూ తెలంగాణలో ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికి ఏపీలోనూ ఓటు గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ పలు చోట్ల ఓటు కేంద్రాలు పెట్టిన తెలుగుదేశం తెలంగాణలో ఓటేసిన వారికి గాలం వేస్తున్న టిడిపి నేతలు మేమే తీసుకెళ్తాం, ఏపీకి ఓటు మార్పించుకోవాలని వినతులు 12:44 PM, Dec 13, 2023 నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు IRR కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలేంటంటే.? CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో ఉంటోన్న చంద్రబాబు 12:25 PM, Dec 13, 2023 స్కిల్ స్కాం కేసు CBI అప్పగించాల్సిందే ఏపీ హైకోర్టులో స్కిల్ కేసు వ్యవహారం స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ కొందరు ప్రతివాదులకు నోటీసులు అందలేదని, మరికొందరు నోటీసులు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారన్న పిటిషనర్ పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం ఉండవల్లి పిటిషన్ విచారణ 2 వారాలు వాయిదా 12:05 PM, Dec 13, 2023 బాబు కేరాఫ్ తమిళనాడు తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో చంద్రబాబు పర్యటన శ్రీరామానుజార్ దేవాలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు సమానత్వం కోసం శ్రీ రామానుజులు పాటు పడ్డారు : చంద్రబాబు 11:55 AM, Dec 13, 2023 పార్టీ ఆఫీసుకు దారేది.? మూడు నెలల విరామం తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్న చంద్రబాబు మ.2 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు సమక్షంలో కుప్పం కార్యకర్తలతో భేటీ సాయంత్రం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభపై చంద్రబాబు మంతనాలు ఇప్పటికే యువగళం గురించి పార్టీ సీనియర్ల ఫిర్యాదు కీలకమైన ఉత్తరాంధ్రను విస్మరించామంటోన్న సీనియర్లు 200 కిలోమీటర్ల (భోగాపురం-ఇచ్ఛాపురం) విస్మరించడంపై తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందంటున్న సీనియర్లు లోకేష్ను ఒప్పించలేం.. ఇక్కడితో ముగించాలన్న యోచనలో చంద్రబాబు 11:15 AM, Dec 13, 2023 చంద్రబాబు మిత్రుడికి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో తనపై అవమానకరమైన వార్తలు ప్రచురించినందుకు కేసు కోర్టులో కేసు వేసిన నమస్తే దినపత్రిక ఎడిటర్ ముత్యాల సైదేశ్వరరావు కోర్టుకు హాజరు కాకపోవటంతో ఎండి రాధాకృష్ణ ,మరో నలుగురికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన జగ్గయ్యపేట అడిషనల్ మున్సిఫ్ కోర్ట్ 10:45 AM, Dec 13, 2023 రాష్ట్రానికి చంద్రబాబు చేసింది సున్నా : ధర్మాన చోడవరంలో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు మంత్రి టిడిపి హయాంలో వ్యవసాయం మైనస్ గ్రోత్ లోకి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం గ్రోత్ పెరిగింది.. టిడిపి హయాంలో GDP 16 వ స్థానంలో ఉంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 4 స్థానంలో ఉంది.. రైతులకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు.. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అయిపోతారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎప్పుడూ కట్టుబడి ఉండరు.. 2 లక్షల 40 వేల కోట్ల రూపాయల పేదల ఖాతాల్లో సీఎం జగన్ వేశారు.. రూపాయి అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నారు.. డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు.. నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు.. ప్రైవేట్ స్కూల్స్ కంటే అద్భుతంగా ప్రభుత్వం స్కూల్స్ ను తయారు చేశారు.. ఓట్లు కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తేలేదు.. పిల్లల భవిష్యత్ కోసం విద్య వ్యవస్థ లో మార్పులు తెచ్చారు.. రానున్న రోజుల్లో విద్య వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది.. పసుపు కుంకుమ పేరుతో మహిళను చంద్రబాబు మోసం చేశారు.. రైతు రుణ మాఫీ చేస్తామని మోసం చేశారు.. అర్హత ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. చంద్రబాబు అధికారంలోకి వస్త్తే జన్మ భూమి బ్రోకర్లను తెస్తారు.. 10:05 AM, Dec 13, 2023 జనసేను టిడిపికి అద్దెకిచ్చారు : నందిగం సురేష్ చోడవరం : నందిగామ సురేష్ కామెంట్స్ చంద్రబాబు బడుగు,బలహీన వర్గాలను అవమానించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది. ఆకలి తీర్చే నాయకుడు కావాలో.. మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి. చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది? రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువలనే టిడీపిని ప్రజలు పక్కన పెట్టారు. టిడిపికి- జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అవసరం అయినపప్పుడు పార్టీని అప్పుడప్పుడు తాకట్టు పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో డిపాజిట్లు రాలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు. జగన్ మోహన్ రెడ్డిపై సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను కాల్చి చంపినది చంద్రబాబు కాదా! 7:50 AM, Dec 13, 2023 మేనిఫెస్టో పేరుతో టీడీపీ-జనసేన కొత్త నాటకాలు.. టీడీపీ-జనసేన వేరు వేరు కాదు. రెండూ ఒక్కటే.. టీడీపీ తోక పార్టీ జనసేన. టీడీపీకి కాపులు నేరుగా ఓట్లు వేయరు కాబట్టి.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు సృష్టించిన.. మాయాజాల పార్టీనే జనసేన. 2014-19లో చంద్రబాబు 650 హామీలిచ్చి.. నెరవేర్చకుండా మేనిఫెస్టోను.. దాచిపెడితే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ.. ఎందుకు ప్రశ్నించలేదు..? తెలుగు దేశం హామీలు నెరవేర్చకపోతే.. తనది బాధ్యత అన్నాడు.. చంద్రబాబు ప్రశ్నించకపోవడమే.. పవన్ కల్యాణ్ తన బాధ్యత అనుకుంటున్నాడా..? 2014లో ఇచ్చిన 650 హామీలు నెరవేర్చకపోగా.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోపై కసరత్తు అట..!!! చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు ఏదో అన్న సామెత గుర్తుకు వస్తుంది..!!! అసలు.. టీడీపీ-జనసేనలకు మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హతే లేదు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా.. పట్టుమని 10 మంది మంది ఎమ్మెల్యేలను.. గెలిపించుకోలేని పవన్ కల్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్ల.. ఓడిపోయిన పవన్ కల్యాణ్కు.. మేనిఫెస్టో పేరు ఎత్తే అర్హత ఉంటుందా..? మొన్న ఐదు అంశాలపై చర్చ.. నేడు 10 అంశాలపై చర్చ అంటూ.. లీకులు ఎల్లో కుట్రలో భాగమే.. ప్రజలను మోసం చేయడంలో భాగమే. అసలు.. చంద్రబాబునే ప్రజలు నమ్మడం లేదు. పవన్ రాజకీయాలకు వేస్ట్ అని.. ప్రజలు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో తయారు చేస్తారట..!! మేం అధికారంలోకి వస్తే.. ప్రజలకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామని.. స్లిప్లు పంచుతున్నారు. ఏ ప్రాతిపదిన స్లిప్లు పంచుతున్నారు.. ఏ హామీ ప్రకారం స్లిప్లు ఇస్తున్నారు.. ప్రజల నుంచి ఓటీపీలు ఎందుకు అడుగుతున్నారు..? టీడీపీ - జనసేన కూటమి.. 2024లో ఘోరంగా ఓడిపోతుందని .. ప్రజలు చెబుతున్న మాట. ఓడేపోయేదానికి.. ఫేక్ మేనిఫెస్టో అవసరమా..? చంద్రబాబు-పవన్ కల్యాణ్లు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోపై ఇప్పటికే.. హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. ప్రజల ఆశయాలకు మేనిఫెస్టో దూరంగా ఉందంటూ.. హరిరామ జోగయ్య తన అభిప్రాయం కుండబద్దలు కొట్టారు. సంక్షేమ పథకాలతో.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన.. బాబు బ్యాచ్ ఇప్పుడు.. మేం అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారు..? నేతి బీరకాయలో నేయి ఉండదు.. చంద్రబాబు హామీల్లో నిజం ఉండదని.. గ్రామీణ ప్రజలు చెప్పుకునే మాట. ఒకపక్క వైఎస్ఆర్సీపీ నాయకత్వం.. టార్గెట్ 175 దిశగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంటే.. ఎల్లో బ్యాచ్ మాత్రం.. బిత్తర ముఖాలు వేసుకుని దిక్కులు చూస్తున్నారు. 6:50 AM, Dec 13, 2023 చంద్రబాబు కేసులు - స్టేటస్ చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (నిన్న), డిసెంబర్ 13(నేడు) విచారణ. చంద్రబాబు కేసులు @ హైకోర్టు హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ కేసు విచారణ ఈరోజుకి వాయిదా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 6:30 AM, Dec 13, 2023 తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా? చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా? ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు? .@Naralokesh, don’t spill your yellow media venom on our state. You’ve proven yet again that you can only vomit lies when you open your mouth. The Central Government's data on the floor of parliament speaks louder than your disgusting lies. Andhra Pradesh's unemployment rate is… https://t.co/zQMnXeDEeB pic.twitter.com/RB1x6T4Txy — YSR Congress Party (@YSRCParty) December 12, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అభియోగాలేంటీ? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జూలై 22,2015 & ఏప్రిల్ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు. -
Dec 12th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases, Political Updates.. 5:25 PM, Dec 12, 2023 మ్యానిఫెస్టోపై ముందుకు పడని అడుగు ఇంకా తుదిదశకు రాని తెలుగుదేశం-జనసేన మ్యానిఫెస్టో మినీ మేనిఫెస్టో పేరిట కుస్తీలు పడుతోన్న టిడిపి నేతలు తెలుగుదేశం ఎజెండాలో ఆరు అంశాలు జనసేన ఎజెండాలో అయిదు అంశాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్తో విడతలవారీగా చర్చలు జరిపిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల తర్వాత మారిన చంద్రబాబు ప్లాన్ ఏం చేస్తే ఆకట్టుకోవాలనుకునే దానిపై మంతనాలు మేనిఫెస్టోలో చేర్చిన ఎనిమిది అంశాలు 1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ 2. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు. 3. అమరావతే రాజధానిగా కొనసాగింపు. 4. పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం. 5.అసమానతలు తొలిగిపోయి.. ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికల రూపకల్పన. 6. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం. 7. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం. 8. రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన. ఇంత చేసినా.. మేనిఫెస్టో ప్రజల్లో నెగ్గుతుందన్న దానిపై టిడిపి-జనసేనలో అనుమానాలు ఇలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తే సీన్ రివర్సేనని రెండు పార్టీ నేతల ఆందోళన టిడిపి-జనసేన మేనిఫెస్టో ప్రజల ఆశలకు దూరంగా ఉందంటూ హరిరామజోగయ్య విమర్శలు ఏముందని ఇది ప్రజలను ఆకట్టుకుంటుందని హరిరామజోగయ్య ప్రశ్నలు కొత్తగా 47 సంక్షేమ పథకాలు పెట్టాలంటున్న హరిరామజోగయ్య మరి ఇన్నాళ్లు శ్రీలంకలా మారుతుందని భయపెట్టాం కదా అంటోన్న తెలుగుదేశం నేతలు గెలవాలంటే ఏమైనా చెప్పాల్సిందేనంటూ ఇరుపక్షాల్లో చర్చ 2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను మాయం చేసిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు 4:45 PM, Dec 12, 2023 చంద్రబాబు కేసులు @ హైకోర్టు హైకోర్టులో చంద్రబాబు కేసుల విచారణ వాయిదా IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలన్న ఏజీ కేసు విచారణ రేపటికి వాయిదా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా 4:31 PM, Dec 12, 2023 విశాఖకు కార్యాలయాల తరలింపును వ్యతిరేకిస్తూ పిటిషన్ విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలిస్తున్నారంటూ పిటిషన్ కార్యాలయాల తరలింపు నిలిపివేయాలని కోరిన రాజధాని పరిరక్షణ సమితి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు 4:22 PM, Dec 12, 2023 చెన్నైకి చంద్రబాబు కాసేపట్లో చెన్నై చేరుకోనున్న చంద్రబాబు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరంబుదూర్కు బాబు రామానుజర్ ఆలయంలో పూజలు నిర్వహించనున్న బాబు అనంతరం మైలాపుర్ లోని చంద్రబాగ్ అవెన్యూ కు అక్కడ నాగాలాండ్ గవర్నర్ ఐలా గణేశన్ ఇంట్లో భేటీ 3:45 PM, Dec 12, 2023 తప్పుడు వార్తలు ఆపండి : ఎల్లో మీడియాకు YSRCP వార్నింగ్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే మీ లక్ష్యమా? చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడమే మీకు ఆనందమా? ఇంకెన్ని అబద్దాలు చెబుతారు? ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తారు? .@Naralokesh, don’t spill your yellow media venom on our state. You’ve proven yet again that you can only vomit lies when you open your mouth. The Central Government's data on the floor of parliament speaks louder than your disgusting lies. Andhra Pradesh's unemployment rate is… https://t.co/zQMnXeDEeB pic.twitter.com/RB1x6T4Txy — YSR Congress Party (@YSRCParty) December 12, 2023 2:55 PM, Dec 12, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు ఏపీ హైకోర్టు:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్పై హైకోర్టులో విచారణ సిఐడి తరఫున వాదన వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ శ్రీరాం కేసులో అభియోగాలేంటీ? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జూలై 22,2015 & ఏప్రిల్ 4, 2017 మరియు అక్టోబరు 31, 2018న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు 2:50 PM, Dec 12, 2023 చంద్రబాబు కేసులు - స్టేటస్ చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ? కేసు : స్కిల్ కుంభకోణం స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ను సాధారణ బెయిల్గా మార్చిన హైకోర్టు కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు కేసు : స్కిల్ స్కాం అంశం : క్వాష్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం కేసు : ఇసుక కుంభకోణం అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (ఈ రోజు) విచారణ కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్ వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ వివరణ : డిసెంబర్ 12 (ఈరోజు) విచారణ కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్ స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్ 2:30 PM, Dec 12, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా చంద్రబాబు 17A - క్వాష్ పిటిషన్ పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు వాయిదా కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలను ఇరుపక్షాలు చేయవద్దని సూచన చంద్రబాబు అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని CID లాయర్కు సుప్రీంకోర్టు ఆదేశం CID వేర్వేరు ప్రాంతాల్లో ప్రెస్మీట్ నిర్వహించిందన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ఇరుపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీంకోర్టు ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 1:30 PM, Dec 12, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు @ సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు పిటిషన్ ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్.. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కోర్టు నంబర్ -6లో.. ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన.. చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు ‘ఫైబర్గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టు రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కు అప్పగింత కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్కు రూ.76 లక్షలు బదిలీ టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్ ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు 12:05 PM, Dec 12, 2023 YSRCP మార్పులపై TDP పిచ్చి వ్యాఖ్యలు.. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి బాబు.. వైసీపీ అంతర్గత పరిణామాలపై స్పందించిన టీడీపీ బడుగు బలహీన వర్గాలకు సీట్లు మార్చడం ఏంటి? సీట్లు మార్చినా.. YSRCPకి కష్టం : తెలుగుదేశం 2019 ఎన్నికల్లో కుప్పకూలిన టీడీపీ కంచుకోటలు అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్ గల్లంతు 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్కు మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టీడీపీ, జనసేన సమన్వయం 2019లో పవన్కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్ ఎజెండా అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి అసలు జనసేన 2019లో కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం 11:15 AM, Dec 12, 2023 ఇసుక కేసు @ హైకోర్టు ఇసుక కుంభకోణం కేసులో చంద్రబాబు పిటిషన్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు హైకోర్టులో ఇవ్వాళ మధ్యాహ్నం విచారణ సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్ ఇసుక కేసు పూర్వపరాలేంటీ? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్చగా భూగర్భ వనరుల దోపిడి చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే.. బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం 2014లో మహిళా సంఘాల ముసుగులో ఇసుక దోపిడీ పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం స్మగ్లర్ల ముఠా చేతికి భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందన్న లాయర్ శ్రావణ్కుమార్ పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కిన నటి బాబు ప్రభుత్వం పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర తీవ్రంగా ఆక్షేపించిన NGT అయినా ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించిన రైతులు ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ కమిటీ చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో 2019 జనవరి 17–18న కమిటీ పరిశీలన స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక సమర్పణ ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్కు NGT అల్టిమేటం ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానా మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 4, 2019లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావన 10:05 AM, Dec 12, 2023 17a పిటిషన్లో ఊరట కోసం బాబు ఆరాటం త్వరలో స్కిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం తాను తప్పు చేయలేదని చెప్పకుండా ముందస్తు అనుమతి చుట్టు బాబు వాదనలు అసలు స్కిల్ స్కాంలో ఏం జరిగింది? టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్టెక్ సంస్థలు ఒప్పందం ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు కీలక ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన సీఐడీ 8:30 AM, Dec 12, 2023 ఫైబర్ నెట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ నేడు సుప్రీంకోర్టులో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్పై విచారణ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బైయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరణ దీంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు విచారణ జరుపనున్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కోర్ట్ నంబర్-6లో ఐటమ్ నంబర్ 301గా లిస్ట్ అయిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు 7:30 AM, Dec 12, 2023 నేడు ఐఆర్ఆర్, ఇసుక కేసులో విచారణ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్పై నేడు హైకోర్టులో మధ్యాహ్నం విచారణ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు పిటిషన్పై హైకోర్టులో మధ్యాహ్నం విచారణ ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు పిటిషన్ 6:45 AM, Dec 12, 2023 అమరావతి.. అసలు నిజాలు.. తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..? అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో సభ అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి అమరావతి గురించి జడ శ్రవణ్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా?. 6:35 AM, Dec 12, 2023 చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్ నందమూరి వంశస్తులను రాజకీయాల్లో చంద్రబాబు ఎదగనివ్వడు. లోకేష్ కోసమే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు దేవుడి దయ వల్లే జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దేవుడు దయ వల్లే అప్పటి ఘోర కారు ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ బయటపడ్డాడు. నందమూరి వంశస్తులు తన కొడుక్కి పోటీ రాకుండా చంద్రబాబు చూస్తున్నాడు. కాబట్టి నందమూరి వంశస్తులను రాజకీయాల్లో ఎదగనివ్వడు. - ఎమ్మెల్యే కొడాలి నాని#PappuLokesh#EndOfTDP#CorruptBabuNaidu pic.twitter.com/NyLJKoI1F9 — YSR Congress Party (@YSRCParty) December 11, 2023 భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా? హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు అక్టోబర్ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ ఒక్కో కుటుంబానికి పాత డేట్తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా? నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? ఈ నెల 20న యువగళానికి మంగళం ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్ సంకేతాలు ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ విశాఖలో ఏం జరుగుతోంది? విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా.. ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ? పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ? అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి నాగుల్ మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం.. -
Dec 11th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates.. 06:15 PM, Dec 11, 2023 తెలంగాణ ఎన్నికలను చూసి తెలుగుదేశం పగటి కలలు : పోసాని విజయవాడలో మాట్లాడిన APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చంద్రబాబు చేసేది తప్పుడు రాజకీయం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు సర్వనాశనం చేస్తారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి టీడీపీ ఓట్లేయలేదు పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు కమ్మ వాళ్లు ఓట్లు వేయలేదు చంద్రబాబే కమ్మ వాళ్లను ఓటెయ్యొద్దని చెప్పాడు పవన్ కి ఎక్కువ ఓట్లొస్తే ఏపీలో ఎక్కువ సీట్లు అడుగుతాడు అందుకే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు దెబ్బకొట్టాడు కాపుల ఓట్లు చంద్రబాబుకి వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటు కాపులను దెబ్బతీసిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా..? మోడీ మూడు రాష్ట్రాల్లో గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడు కాంగ్రెస్ కి తెలంగాణలో మద్దతిచ్చి BRSని ఓడించాలనుకున్నాడు హైదరాబాద్ లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ కి ఒక్క సీటు రాలేదు చంద్రబాబుని హైదరాబాద్ లోని సెటిలర్లంతా చీ కొట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ మోసం చేయడానికి ప్రజలు అమాయకులు కాదు 05:55 PM, Dec 11, 2023 ఈ నెల 20న యువగళానికి మంగళం ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్ సంకేతాలు ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ 05:05 PM, Dec 11, 2023 యశోద ఆస్పత్రికి చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించా: చంద్రబాబు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా మళ్లీ కేసీఆర్ ప్రజా సేవ చేయాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ త్వరగా కోలుకుంటారు కేసీఆర్ తో మాట్లాడాలి అనిపించి వచ్చా కేసీఆర్ కు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయి: చంద్రబాబు 04:00 PM, Dec 11, 2023 బండారు అరెస్ట్ పిటిషన్ @ హైకోర్టు బండారు సత్యనారాయణ అరెస్టుపై హైకోర్టులో విచారణ మంత్రి రోజాపై నీచమైన వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి మరిచి దిగజారి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడంతో అన్ని వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కేసు పెట్టి బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు తన అరెస్ట్ అక్రమని బండారు పిటిషన్ CC ఫుటేజ్ సమర్పించిన బండారు తరపు న్యాయవాదులు ఫోటోలను కోర్టుకు అందజేసిన పోలీసులు 4 వారాల తర్వాత తుది విచారణ చేపడతామన్న హైకోర్టు 03:05 PM, Dec 11, 2023 విశాఖలో ఏం జరుగుతోంది? విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా.. ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ? పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ? 02:55 PM, Dec 11, 2023 అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి నాగుల్ మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం.. 02:40 PM, Dec 11, 2023 కెసిఆర్కు చంద్రబాబు పరామర్శ హైదరాబాద్: కేసీఆర్ను పరామర్శించనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3.20 గం.కు కేసీఆర్ ను పరామర్శించనున్న చంద్రబాబు ఇటీవల KCRకు తుంటిమార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ 02:20 PM, Dec 11, 2023 ఉరవకొండ టీచర్కు CPSకు భలే లింకు పెట్టారే.! అనంతపురం జిల్లా ఉరవ కొండలో ఓ టీచర్ ఆత్మహత్యయత్నం వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటనకు వెంటనే సీపీఎస్ అంశాన్ని ముడిపెట్టేసిన తెలుగుదేశం, ఎల్లో మీడియా బురదజల్లడమే మా లక్ష్యం అంటూ ఆత్మహత్యాయత్నం ఘటనకు విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో హోరెత్తించిన చంద్రబాబు, తెలుగుదేశం టీం అసలు సీపీఎస్ పాలసీని ఎవరు తీసుకువచ్చారు? 2003లో దీన్ని అడాప్ట్ చేసుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? మరి ఆ విధానాన్ని నాడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదు? 1996 నుంచి 2004 వరకూ సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పటి ఎన్డీయేలోతానే చక్రం తిప్పానని చంద్రబాబు పదేపదే గొప్పలు చెప్పుకుంటారు. మరి CPS ప్రాసస్ను ఎందుకు వ్యతిరేకించలేదు? అదిరాకుండా ఎందుకు అడ్డుకోలేదు.? ఉద్యోగులకు మేలు చేసేలా మంచి ప్రత్యామ్నాయాన్ని ఎందుకు తీసుకురాలేదు? వైఎస్సార్సిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేసింది GPS రూపంలో మంచి ప్రయత్నామ్యాన్ని తీసుకు వచ్చింది కదా ఎంతో అధ్యయనం చేశాక, ఉద్యోగుల ప్రయోజాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకుంది. GPSను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి కూడా. ఇంతకంటే గొప్ప ప్రత్యామ్నాయం లేదని ఉద్యోగులంతా హర్షం వ్యక్తంచేశారు కూడా చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GPSను పరిగణనలోకి తీసుకుంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బాటలోనే నడిచేందుకు సిద్ధం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లోమీడియా, ప్రతిపక్షాలు ఇప్పుడు విషం చిమ్ముతున్నాయి అసలు కుటుంబ సభ్యులు ఏమన్నారో మీరే చూడండి. అనంతపురం: టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆయన భార్య శివలక్ష్మి, బావ ఆదినారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదు ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది డిప్రెషన్ తో బాధపడుతూ నా భర్త మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశారు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దు టీచర్ మల్లేష్ భార్య శివలక్ష్మి , బావ ఆదినారాయణ 02:10 PM, Dec 11, 2023 అసైన్డ్ భూముల కేసు వాయిదా అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టు విచారణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన నారాయణ సీఐడీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా 01:22 PM, Dec 11, 2023 అమరావతి.. అసలు నిజాలు.. తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..? అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్లో సభ అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి అమరావతి గురించి జడ శ్రవణ్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్ అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే ఏ మేధావి వచ్చినా నేను చర్చకు సిద్ధం : జడ శ్రవణ్ అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్ రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే లోకేష్.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్ఛార్జీని బకరా చేస్తారా? ఇదా తెలుగుదేశం నైజం.? సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా? రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా? తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్ బుక్ ఎక్కుతారు..! వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి మీకు అసలు మీ పార్టీ క్యాడర్ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా? (ఫైల్ఫోటో : లోకేష్తో జడ శ్రవణ్) 12:42 PM, Dec 11, 2023 చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు రేపు తమిళనాడు వెళ్లనున్న చంద్రబాబు శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు మళ్లీ రేపు రాత్రికి తిరిగి విజయవాడకు చంద్రబాబు 12:02 PM, Dec 11, 2023 బెజవాడ తమ్ముళ్ల టికెట్ పంచాయతీ విజయవాడ వెస్ట్లో టీడీపీ నేతల సీటు పంచాయితీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా హాట్ కామెంట్స్ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న పరోక్ష విమర్శలు పశ్చిమ స్థానంలో నేను పోటీ చేస్తా.. లేదా నాగుల్ మీరా పోటీ చేస్తారు ఎవరు పడితే వాళ్లు మాకే టికెట్ అంటే కుదరదు : బుద్ధా వెంకన్న నిబద్ధత గల మమ్మల్ని కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోం : నాగుల్ మీరా (ఫైల్ ఫోటో : సమన్వయ కమిటీ సమావేశంలో బుద్ధా వెంకన్న) 11:15 AM, Dec 11, 2023 భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా? హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు అక్టోబర్ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ ఒక్కో కుటుంబానికి పాత డేట్తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరు ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా? నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? (ఫైల్ ఫోటో : నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరీ పరామర్శ) 10:22 AM, Dec 11, 2023 జనసేన అభ్యర్థులు కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారా? ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టిడిపి వర్గాలు తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా? చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.! ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు 10:09 AM, Dec 11, 2023 పాదయాత్రకు విశేష స్పందన : నారా లోకేష్ అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP మీ పాదయాత్రకు అద్భుత స్పందన వస్తే ముందే ఎందుకు ముగిస్తున్నారు? 200 కిలోమీటర్ల నడకను ఎందుకు తగ్గించుకున్నారు? విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఎందుకు చిన్నచూపు చూస్తారు? మీ టాలెంట్పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది? కొడుకు లోకేష్కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్కళ్యాణ్ను పట్టుకున్నారు పవన్కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు? నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్గా పవన్ కళ్యాణ్ను పట్టుకున్నారా? పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా? పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా? ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు 9:29 AM, Dec 11, 2023 ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా? ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది? చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా? 9:17 AM, Dec 11, 2023 అసైన్డ్ భూముల స్కాం.. ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో విచారణ అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామీలపై సీఐడీ కేసు నమోదు ముందస్తు బెయిల్ మంజూరు, కేసులను క్వాష్ చేయాలంటూ నారాయణ, ఆయన బినామీల పిటిషన్లు 8:21 AM, Dec 11, 2023 కిషన్.. పవన్.. ఓ ప్రచారం నేను పవన్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి నాపై సోషల్మీడియాలో వస్తు్న్న ప్రచారం అవాస్తవం కొందరు కావాలని నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు వారిపై పోలీసులకు ఫిర్యాుదు చేస్తా ఎన్డీయేలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలో దిగాం: అసలేం జరిగిందంటే..? సోషల్ మీడియాలో నిన్న జరిగిన ప్రచారం ఏంటంటే... పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నీ నమ్ముకొని గ్రేటర్ లో నష్టపోయాం పవన్ తో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా విలువ తగ్గించారు ఆ సంగతి గ్రహించే పొత్తుని ఉప సంహరించుకోవాలని అధిష్టానం సూచించింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పొయింది. సొంతంగా పోటీ చేసి ఉంటే కనీసం గ్రేటర్ పరిధిలో 4-5 సీట్లు గెలిచే అవకాశం ఉండేది కనీసం మా కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేదని అనిపించింది. హైదరాబాద్ వెలుపల సీట్లు, ఓట్లు సాధించినా, సిటీలో పోటీ ఇవ్వలేకపోయాం గట్టి పోటీ ఇచ్చి గెలుస్తామని భావించిన లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, కుత్భూలాపూర్, యాకుత్పురా, ఉప్పల్, రాజేంద్రనగర్ సీట్లు కేవలం పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగానే ఘోరంగా ఓడిపోయం సెటిలర్స్ లో ఉన్న కాపు, కమ్మ సామాజిక వర్గం నాతోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మించాడు. ఈ ప్రచారం వెనక ఎవరి హస్తం ? తెలంగాణలో ముగిసిన ఎన్నికలు ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తుతో పోటీకి నిర్ణయం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల చర్చలు తనకు కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు అలాగే ఐదు ఎంపీ టికెట్లు కావాలని అడుగుతున్న పవన్ కళ్యాణ్ అయితే 20 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని అలాగే 3 ఎంపీ టికెట్లు ఇస్తామని చెబుతున్న టీడీపీ తెలంగాణలో బీజేపీతో 8 సీట్లకే ఒప్పుకున్నందుకు ఏపీలో 20 సీట్లు సరిపోతాయన్నది చంద్రబాబు లెక్క. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విలువను తగ్గించేందుకు సోషల్ మీడియాను టీడీపీ అస్త్రంగా చేసుకుంటుందన్న ఆరోపణలు గతంలోనూ సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పలుకుట్రలు అమలు చేసిందన్నది జనసేన సైనికుల ఆరోపణ పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలుమార్లు చంద్రబాబు లోకేష్లను నేరుగా విమర్శించాడు. 2018-2019 మధ్య కాలంలో తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని దెబ్బతీసేలా టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శ తాజాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టీడిపి నేతల హస్తం ఉందని అనుమానిస్తున్నారు తద్వారా పవన్, జనసేన విలువను తగ్గించి ఆ పార్టీకి వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా ఒప్పించవచ్చన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 6:39 AM, Dec 11, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 6:33 AM, Dec 11, 2023 ముందు నుయ్యి వెనక గొయ్యి తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్ ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్ 6:31 AM, Dec 11, 2023 పవన్కు వెన్నుపోటుకు బాబు రెడీ సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు -
Dec 10th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates.. 4:18PM, Dec 10, 2023 లోకేష్ పేరు ఎత్తితేనే బెంబేలెత్తుతోన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి యువగళం పాదయాత్ర తమ నియోజకవర్గాల్లో వద్దే వద్దుంటున్న నేతలు నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాదయాత్ర రద్దు పార్టీ వైఖరిపై అయ్యన్న కినుక చేతులెత్తేసిన చోడవరం, మాడుగుల నేతలు చేసేదిలేక రూట్ మ్యాప్ మార్పు....!! షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావు పేట నుంచి కోటవురట్ల మీదుగా నర్సీపట్నం, చోడవరం, మాడుగుల అనకాపల్లి, పరవాడ, గాజువాక చేరుకుని నగరంలోకి ప్రవేశించి పెందుర్తి మీదుగా భీమిలి చేరుకోవాలి కానీ.. టీడీపీ నేతల అసంతృప్తితో షెడ్యూల్ మార్చారు తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 11న పాయకరావు పేటలో ప్రవేశించి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా నగరంలోకి ప్రవేశించి ఈ నెల 20 లేదా 21న భీమిలిలో ముగించాలని నిర్ణయించారు ఇందులో నర్సీపట్నం, చోడవరం మాడుగులలను తీసేశారు చంద్రబాబుపై అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఓకే చేయకపోవడం.. గంటాకు ప్రాధాన్య ఇవ్వడం.. గంటా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం..ఓ NRIను వెతుకుతుండటం అయ్యన్నకు ఏమాత్రం నచ్చడంలేదని టీడీపీ క్యాడర్ చెప్పుకుంటున్నారు డబ్బులు దండగా జనాలు రాకపోవడంతో పాదయాత్ర వద్దు బాబోయే అని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు 3:20PM, Dec 10, 2023 టికెట్ల పేరుతో కార్యకర్తలతో ఆటాడుకుంటున్న చంద్రబాబు తేల్చుడు కాదు అంతా నాన్చుడు మంత్రమే పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో సీటు పంచాయితీ విజయవాడ : వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న బుద్ధా వెంకన్న బీసీ అభ్యర్థిగా చంద్రబాబు తనకే సీటు ఇస్తారన్న బుద్ధా టీడీపీ సీటు ఎంఎస్ బేగ్కు ఇప్పిస్తానన్న కేశినేని నాని కేశినేని చిన్ని వర్గంలో బుద్ధా వెంకన్న, కేశినేని నాని వర్గంలో ఉన్న ఎంఎస్ బేగ్ కేశినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్యంతో సీటు పై ఎటూ తేల్చకుండా పెండింగ్లో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఖరారు చేసిన జనసేనకి ఇవ్వాల్సి వస్తే మళ్లీ వెన్నుపోటు తప్పదు అంటున్న తమ్ముళ్లు 3:18PM, Dec 10, 2023 ఏపీ ఎన్నికలకు 4 నెలల ముందే.. సీఎం రేస్ నుంచి పవన్ కల్యాణ్ అవుట్..!! నమ్ముకున్న వాళ్లను.. తడిగుడ్డతో గొంతు ఎలా కోయాలో.. పవన్ కల్యాణ్కు తెలిసినంతగామరెవ్వరికీ తెలియదు. జనసేన పుట్టినప్పటి నుంచి.. ఇప్పటి వరకూ జనసేన జెండా మోసిన వాళ్లను తన స్వార్ధ రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ మోసం చేస్తూనే ఉన్నాడు. పవన్ కల్యాణ్ను దగ్గరుండి చూసిన.. ఆయన మనస్తత్వాన్ని బాగా తెలిసిన వాళ్లు.. ఆయనను వదిలేసి వారి దారి వారు చూసుకున్నారు. పవన్ కల్యాణ్ను నడిపించేది.. చంద్రబాబేనని.. జనసేన పుట్టిందే చంద్రబాబు కోసమని.. తెలిసిన వాళ్లు జనసేన ఆఫీస్ దరిదాపుల్లోకి .. కూడా వెళ్లడం లేదు. జనసేన ఆఫీస్లో దశాబ్దం పాటు .. పని చేసిన సందీప్, మెగా ఫ్యామిలీ కోసం ఎంతో కృషి చేసిన.. ఆయన తల్లి పద్మావతి కూడా.. జనసేనను వదిలేసి వచ్చారంటేనే.. పవన్ కల్యాణ్ విపరీతమైన మనస్తత్వాన్ని.. అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేస్తే.. జనసేనకు ఒక్క చోట కూడా.. డిపాజిట్ రాలేదు. కొల్లాపూర్లో బర్రెలక్కకు 5,700 వస్తే...జనసేన అభ్యర్ధులకు.. ఒక్క కూకట్పల్లిలో మినహా.. మిగిలిన 7 చోట్ల 3 వేల ఓట్లు కూడా దాటలేదు. తెలంగాణ ఎన్నికల తరువాత.. చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. భేటీ తరువాత పవన్ మాటలు చూస్తుంటే.. ఆయనే తాను సీఎం రేస్లో లేనట్లేనని.. ప్రకటించినట్లుంది. టీడీపీ తనకు సీఎం పదవి.. కేటాయించే పరిస్థితి లేనట్లు జనసేన శ్రేణులకు పవన్ సంకేతాలు. టీడీపీ అభ్యర్ధులను.. జనసేన క్యాడర్ గెలిపించాలట.!! అప్పుడే ఈయనకు సీఎం ఛాన్స్ అట..!! బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడుతాడా..? ఈ మాటలు జనసేన క్యాడర్ నమ్మితే.. అంతకంటే తిక్కలి వాళ్లు.. పిచ్చి వాళ్లులేనట్లే..!! టీడీపీ అత్యధిక సీట్లు తీసుకుని.. అత్యధిక సీట్లు గెలిస్తే.. పవన్ను అసలు పట్టించుకుంటారా..? ఇంట్లో చెత్త బుట్టను చూసినట్లు చూస్తారు..!! తొలి నుంచి పవన్ మాటలు.. చిత్రవిచిత్రమైన మాటలే..! ఒకసారి సీఎం రేసులో ఉన్నాను అంటాడు.. ఒకసారి సీఎం రేసులో లేనంటాడు.. మరోసారి రెండు చోట్ల ఓడించారు.. సీఎం పదవికి అర్హుడునేనా అంటాడు..! పవన్ను నమ్ముకుంటే.. జనసేన శ్రేణులు, కాపులు నట్టేట మునిగినట్లే.. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలి. 2:21 PM, Dec 10, 2023 ముందు నుయ్యి వెనక గొయ్యి తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్ ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్ 2:18 PM, Dec 10, 2023 పవన్కు వెన్నుపోటుకు బాబు రెడీ సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు 12:30 PM, Dec 10, 2023 విపత్తుపై చంద్రబాబు నీచ రాజకీయాలు: మంత్రి కాకాణి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు విపత్తు సమయంలో ఏ నేత అయినా ప్రజలకు అండగా నిలవాలి కానీ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు విపత్తు సమయంలో టీడీపీ నేతలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు టీడీపీ నేతలు కేవలం ప్రెస్మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటి? రైతులను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు రైతులను అవమానకరంగా మాట్లాడింది చంద్రబాబే వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడింది చంద్రబాబే చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు విపత్తుసమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటి? విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం విపత్తుల సమయంలో ప్రజలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. 11:30 AM, Dec 10, 2023 బుద్ద వెంకన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవా? తెలంగాణలో అసలు మీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా రాదని మీకు ముందే అర్థమైందా? లేక కాంగ్రెస్ పార్టీకి బాగా ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేస్తామని బాలకృష్ణతో ప్రకటనలు ఎందుకు ఇప్పించారు? చివరికి మీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు కూడా మీరు వెన్నుపోటు పొడిచారా? ఎంత ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్కు తాకట్టు పెట్టారు? ఇన్నాళ్లు పోటీ చేసిన మీకు కూడా వెన్నుపోటు తప్పదని మీరు అనుమానిస్తున్నారా? మీకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉందా? చంద్రబాబు, లోకేష్లను బెదిరిస్తున్నారా? లేక మీ బాధ చెప్పుకుంటున్నారా? తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకోలేదు తెలంగాణ ఎన్నికలతో చంద్రబాబుకు ఏం సంబంధం? నాకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉంది విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తా.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న 7:20 AM, Dec 10, 2023 పచ్చ బ్యాచ్ అప్పుడలా.. ఇప్పుడిలా.. పచ్చ పిచ్చికి మందులు కూడా పనిచేయడం లేదుగా.. కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? అప్పుడిలా... ఇప్పుడిలా... ఈ పిచ్చికి మందులు కూడా పనిచేయటం లేదు.. pic.twitter.com/WxS7JUfQa1 — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 9, 2023 నారా లోకేష్కు స్ట్రాంగ్ కౌంటర్.. ఇవన్నీ మర్చిపోతే ఎలారా గజ్జి.. 🐕#EndOfTDP pic.twitter.com/T7QvxFGBzu — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 9, 2023 7:15 AM, Dec 10, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 7:00 AM, Dec 10, 2023 ప్రశ్నిస్తా అనే పవన్కు వైఎస్సార్సీపీ ప్రశ్న టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్ కళ్యాణ్ సూత్రీకరించాడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను ఆదేశిస్తున్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!! టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?! పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది అదే మాట జనసైనికులను పవన్ అనవచ్చన్న మాట..! ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..? అసలు అబ్రహం లింకన్తో పవన్ పోల్చుకోవడం ఏంటీ..? అబ్రహం లింకన్ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మరీ.. పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. -
నేను దొరికే దొంగను కాదు ?..నోరు జారిన చంద్రబాబు..
-
Dec 9th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates 09:01PM, Dec 09, 2023 ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా? ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా? అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది? చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా? 03:24PM, Dec 09, 2023 ప్రశ్నిస్తా అనే పవన్కు వైఎస్సార్సీపీ ప్రశ్న టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్ కళ్యాణ్ సూత్రీకరించాడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను ఆదేశిస్తున్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!! టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?! పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది అదే మాట జనసైనికులను పవన్ అనవచ్చన్న మాట..! ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..? అసలు అబ్రహం లింకన్తో పవన్ పోల్చుకోవడం ఏంటీ..? అబ్రహం లింకన్ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది మరీ.. పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు 12:22 PM, Dec 09, 2023 స్కిల్ కేసు ఎక్కడికి దారి తీస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది? నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు? అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు సెక్షన్ 17 ఏ విషయమేంటీ? అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని ఉన్నదే సెక్షన్ 17ఏ 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ? చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్ కుంభకోణం 2015-16లో స్కిల్ కుంభకోణం జరిగింది జూన్ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి? అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదు ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదు సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా? తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా? తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు 12:05 PM, Dec 09, 2023 గుంటూరులో చంద్రబాబు పర్యటన 2వ రోజు ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన బాపట్ల, పర్చూరు, ప్రత్తిపాడులో చంద్రబాబు పర్యటన పర్చూరు లో డ్రెయిన్ను పరిశీలిన ప్రత్తిపాడు, పెదనంది పాడులో రైతులతో చంద్రబాబు ముఖాముఖి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం దొరుకుతుందన్న ఆశతో చంద్రబాబు పర్యటనలు అంతటా సానుకూలంగా కనిపిస్తుండడంతో మరింత శోధన తుపాను ప్రభావాన్ని ప్రభుత్వ లోపంగా చూపించడానికి సర్వ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్కు తుపానులేమి కొత్తకాదు : YSRCP చంద్రబాబు హయాంలో రైతును పట్టించుకున్నదే లేదు, పంటనష్టాన్ని భరించింది లేదు అసలు వ్యవసాయమే దండగ అన్నది, ఒంటబట్టించుకున్నది చంద్రబాబే ఇప్పుడు ఎన్నికల సమయంలో సానుభూతి కోసం తిరిగితే ఎవరు నమ్ముతారు? 11:45 AM, Dec 09, 2023 చంద్రబాబు ట్రైనింగ్ అంటే ఏమనుకున్నారు.? చంద్రబాబు బాటలోనే తెలుగుదేశం నాయకులు మహిళా ఉద్యోగినిపై నోరు పారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ITDA PO ఉద్యోగిని మందా రాణిపై నోరుపారేసుకున్న సోమిరెడ్డి ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బెదిరింపుల వ్యవహారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఐటిడిఏ పీవో 11:00 AM, Dec 09, 2023 పచ్చ బ్యాచ్కు వైఎస్సార్సీపీ కౌంటర్.. చంద్రబాబుకు 2019లోనే ప్రజలు బుద్ది చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉనికి కూడా ఉండదు. బాబు.. రాష్ట్రానికి, రాజకీయాలకు చేసిన హామీ అంతా ఇంతా కాదు. చంద్రబాబు అనే రాజకీయ విష వృక్షాన్ని 2019 ఎన్నికల్లోనే ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారు. రానున్న ఎన్నికల్లో ఇక ఆ విషపు వృక్షం ఉనికి కూడా తీసి సముద్రంలో వేస్తారు. రాష్ట్రానికి, రాజకీయాలకు మీరు చేసిన హాని అంతా ఇంతా కాదు.. అన్నిటికీ ప్రజలు మరొక్కసారి సమాధానం చెబుతారు. https://t.co/2PNjSlOon1 — YSR Congress Party (@YSRCParty) December 9, 2023 7:15 AM, Dec 09, 2023 కోర్టు షరతులు ఉల్లంఘించిన చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించి మరీ చంద్రబాబు ఉపన్యాసం తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తన కేసు గురించి ప్రస్తావన స్కిల్ స్కాం గురించి మాట్లాడకూడదని చెప్పిన హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రసంగం తప్పు చేయకుండా తనను జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యలు బెయిల్ షరతులు చంద్రబాబు ఉల్లంఘించినందున బెయిల్ రద్దును కోరవచ్చంటున్న న్యాయ నిపుణులు. 7:05 AM, Dec 09, 2023 50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు పవన్ కళ్యాణ్కు తెగేసి చెబుతోన్న కాపులు ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి? అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి? 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.! 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.! అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.? తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.! ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.? అసలు కాపులెందుకు రాజీ పడాలి? అసలు కాపులు సీఎం జగన్ను ఎందుకు వ్యతిరేకించాలి? సీఎం జగన్ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు నాన్ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్నాథ్ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.? నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్ వాటిని ఎత్తేయించాడు చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్లో ఫంక్షన్ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.? చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు? లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు సంకర జాతి, బ్రీడ్.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా? పవన్ చెప్పాడని గుడ్డిగా జగన్ మీద కక్ష పెంచుకోగలమా? దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు (ఫైల్ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 7:00 AM, Dec 09, 2023 ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం ఫామ్ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి తప్పుడు డిక్లరేషన్తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష 6:50 AM, Dec 09, 2023 ఓటర్లతో చంద్రబాబు రాజకీయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు. మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు? గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది? తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది? మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది? ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది? ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు? అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు? పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు? కేసు ఎందుకు వాయిదా పడిందంటే.? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం -
బాబు కోర్టు ధిక్కారం
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లి అక్కడ తన అరెస్టు, జైలు గురించి ప్రసంగించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తన అరెస్టు గురించి మాట్లాడి కోర్టులంటే తనకు లెక్కలేదన్నట్లుగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అక్టోబర్ 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి ఎక్కడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడకూడదని హైకోర్టు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా పేర్కొంది. కేసులోని విషయాల గురించి బయట ఎక్కడా చర్చించవద్దని స్పష్టంచేసింది. అలాగే, హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తప్పకుండా పాటించాలని, స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అయితే, చంద్రబాబు మాత్రం వీటిని బహిరంగంగా ఉల్లంఘించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోటలో శుక్రవారం తుపాను బాధితులను పరామర్శించి అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. తుపాను దెబ్బకు అన్ని విధాలుగా నష్టపోయి రైతులు ఆందోళనలో ఉంటే చంద్రబాబు మాత్రం అక్కడకు వెళ్లి తనను అన్యాయంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు గురించి మాట్లాడారు. ఇలా బెయిల్ షరతులను చంద్రబాబు బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ను రద్దుచేయాలని కోరవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లుగా టెక్నికల్గా, లీగల్గా తప్పుచేయలేదు.. తనలాంటి వాళ్లను కూడా జైల్లో పెట్టేయగలుగుతున్నారని, బాధ కలగదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా తానెక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదని, టెక్నికల్గా, లీగల్గా ఒక్క తప్పూ చేయకుండా ఉన్నానని, అలాంటి తనను జైల్లో పెట్టారని చెప్పారు. ఎలాంటి తప్పు కూడా చేయకుండా ఉన్న పళంగా కేసు బుక్చేసి లోపలేశాడని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూడా మనిషినేనని, తనకూ బాధలు ఉంటాయని, తనకూ మనసు ఉంటుందని, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందంటూ ప్రజల సానుభూతి కోసం ఆయన ప్రయత్నించారు. తన కోసం 52 రోజులుగా అందరూ వీరోచితంగా పోరాడారని, తనను అరెస్టుచేస్తే అందరినీ బెదిరించవచ్చనే ఉద్దేశంతో సీఎం ఇలా చేసినట్లు చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. న్యాయకోవిదుల విస్మయం.. బెయిల్ షరతులను ఉల్లంఘించి తాను అరెస్టయిన కేసు గురించి చంద్రబాబు మాట్లాడడంపై న్యాయకోవిదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బెయిల్ పొందినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పి బయటకు వచ్చాక ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అందుకు సంబంధించిన విషయాల గురించి కాకుండా తాను జైలుపాలవడం, కేసుల గురించి మాట్లాడడం ఏమిటనే ప్రశ్నలు సాధారణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. ఇక అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చినప్పుడు కూడా రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు గంటల తరబడి ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఆయన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. తనకు అరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని భారీఎత్తున ర్యాలీలు చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులోనే ఆయనకు రిమాండ్ విధించినప్పుడు సైతం న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తిని అసభ్యపదజాలంతో ధూషిస్తూ పోస్టులు పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయన కుమారుడు లోకేశ్, ఇతర నాయకులు కోర్టులను మేనేజ్ చేశారంటూ న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు. చివరికి అదే న్యాయ వ్యవస్థ నుంచి చంద్రబాబు బెయిల్ పొంది బయటకొచ్చారు. ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ స్కిల్ కుంభకోణం గురించి రాజకీయ ఉపన్యాసం చేయడం గమనార్హం. -
Dec 8th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases, Political Updates 5.33 PM, 8th Dec 2023 ఓటర్లతో రాజకీయాలొద్దు : ఈసీ విజయవాడ: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధం ఫామ్ - 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి తప్పుడు డిక్లరేషన్తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష 5.15 PM, 8th Dec 2023 ఓటర్లతో చంద్రబాబు రాజకీయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయి ఆన్ లైన్ లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారు మా అభ్యంతరాల పై ఎప్పటికీ దృష్టి పెట్టలేదు మరి తెలుగుదేశం చేస్తున్న పనులకు సమాధానం చెబుతావా చంద్రబాబు? గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ కేంద్రాలను తెలుగుదేశం ఎందుకు ప్రారంభించింది? తెలంగాణలో ఓటేసినా సరే.. ఏపీలో కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు చెబుతోంది? మేమే కార్లు పెడతాం, వచ్చి ఓటేస్తే చాలని ఎందుకు చెబుతోంది? ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో జత పరిచి నకిలీ ఓట్లను తొలగిస్తే టిడిపి ఎందుకు గగ్గోలు పెడుతోంది? ఓ వైపు ఎల్లో మీడియాలో నకిలీ ఓటర్లను మీరే వార్తలు రాయిస్తున్నారు.. మరోవైపు తొలగిస్తున్నారని చెబుతున్నారు? అసలు ఎన్నికల సంఘం పని వారినే చేసుకోనివ్వకుండా.. మీరెందుకు తల దూర్చుతున్నారు? పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని ముందే ఓ నిర్ణయానికి వచ్చారా బాబు? (నిజాంపేట - ప్రగతి నగర్ ప్రాంతంలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రం) 4.55 PM, 8th Dec 2023 బెయిల్ కండీషన్లను ఉల్లంఘించిన చంద్రబాబు స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు నిబంధనలు నిబంధనలు ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై మాట్లాడిన బాబు కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ‘లీగల్ గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారు’ : చంద్రబాబు అరెస్ట్ చేసినందుకు CID పోలీసులను, రిమాండ్కు పంపినందుకు కోర్టును తప్పుబట్టిన చంద్రబాబు 3.35 PM, 8th Dec 2023 కేసు ఎందుకు వాయిదా పడిందంటే.? స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను జనవరి 19కి వాయిదా 17ఏ వ్యవహారం పై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన హారీష్ సాల్వే నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం 3.15 PM, 8th Dec 2023 50 ఎమ్మెల్యేలు.. 5 ఎంపీలు పవన్ కళ్యాణ్కు తెగేసి చెబుతోన్న కాపులు ఇంతకంటే తక్కువయితే జనసేనను ఎందుకు నమ్మాలి? అసలు చంద్రబాబుకు ఎందుకు జై కొట్టాలి? 50 చోట్ల కాపులు లేదా జనసేన నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే.! 5 చోట్ల ఎంపీలుగా జనసేన నాయకులు పోటీ చేయాల్సిందే.! అసలు పొత్తు పెట్టుకునేపుడు ఏం చెప్పావు.? తెలుగుదేశం వెనక కాదు.. కలిసి నడుస్తానన్నావు.! ఇప్పుడేమో రాజీ పడాలంటున్నావు.? అసలు కాపులెందుకు రాజీ పడాలి? అసలు కాపులు సీఎం జగన్ను ఎందుకు వ్యతిరేకించాలి? సీఎం జగన్ 52 నెల పాలనలో కాపు, శెట్టి బలిజలకు నేరుగా లబ్ది పొందింది రూ. 22333 కోట్లు నాన్ డిబిటి ద్వారా కాపు సామాజిక వర్గానికి వచ్చింది రూ. 16914 కోట్లు, మొత్తం 32247 కోట్లు లబ్ది రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం లేకున్నా కాపు నేస్తం ఉంది కదా.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలెవరికి మేలు జరగలేదు హోం శాఖ మంత్రిగా చినరాజప్పను పెట్టాడు. ఏం జరిగింది?.? కనీసం కానిస్టేబుల్ను కూడా బదిలీ చేయలేని దుస్థితి అని వాపోయాడు కొందరు కాపులకు పదవులిచ్చాడు.. ఎవరెవరికి ఇచ్చాడు..? జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య కమ్మ అయితే వారికి ఇచ్చాడు మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాంబాబు, కన్నబాబు, ముత్తంశెట్టి, అమర్నాథ్ ఇంకా ఎందరికో.. ఎన్నెన్నో పదవులు వచ్చాయి అయినా కాపులను చంద్రబాబు ఒక రేంజ్లో ఆడుకున్నాడని మన సీనియర్లే కదా చెప్పుకున్నది హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో ఏముంది? వంగవీటి రంగా హత్య ఎప్పటికీ మరిచిపోరు కన్నా లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు.. తృటిలో నేను తప్పించుకున్నాను, లేదంటే నన్ను ఏమైనా చేసేవారు ముద్రగడ ఏం అన్నాడు.. నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి, నా భార్యా, కొడుకులను దుర్భాషలాడారు అంతెందుకు..! ఒక సారి తాజా చరిత్ర క్షుణ్ణంగా చదవండి ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు ఏం చెప్పాడు.? నా పత్రికలో తెలుగుదేశానికి మద్ధతివ్వకపోతే.. ఏం చేస్తానో తెలుసు కదా అని చంద్రబాబు బెదిరించారన్నాడు. పత్రికను మూసేయించేవరకు ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు అయినా.. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లకు సంబంధించి దొరికిన కాపును దొరికినట్టుగా అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెట్టించింది ఎవరు.? చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలో తుని రైలు దహనం కేసులు పెడితూ.. కాపుల కోరిక మేరకు సీఎం జగన్ వాటిని ఎత్తేయించాడు చంద్రబాబు హయాంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వలేదు, పైగా హాయిలాండ్లో ఫంక్షన్ పెట్టుకుంటే రాత్రి 9గంటలకల్లా ముగియాలంటూ ఒత్తిడి తెచ్చారు కాపులను చంద్రబాబు, ఆయన కుటుంబం ఎన్ని రకాలుగా చిన్న చూపు చూడలేదు.? చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఏమన్నాడు? లేపాక్షి ఉత్సవాలకు పిలవాలంటే.. నా పక్కన నిలబడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఎవరిని పడితే వారిని ఎలా పిలవాలన్నాడు సంకర జాతి, బ్రీడ్.. అంటూ నానా పదాలు కాపులనుద్దేశించి మాట్లాడాడు మా నాన్న లాగా పార్టీ పెట్టి 6 నెలల్లో ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశాడు, చరిత్ర సృష్టించాలన్నా.. అది తిరగరాయాలన్నా అది మాకే నంటూ కాపులను ఎద్దేవా చేశాడు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి బాధ కాపులకు తెలియదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి కక్షపట్టి.. పార్టీ మూసేయించేంతవరకు పట్టుబట్టారని చిరంజీవి చెప్పలేదా? పవన్ చెప్పాడని గుడ్డిగా జగన్ మీద కక్ష పెంచుకోగలమా? దమ్ముంటే 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు తీసుకుని రా అధికారంలో సగం వాటా ఇవ్వమని అడుగు లేదంటే కాపుల ప్రస్తావనను తీసుకురాకు నీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను బలిపెట్టకు (ఫైల్ ఫోటో : చంద్రబాబు కోసం రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న పవన్ కళ్యాణ్) 3.04 PM, 8th Dec 2023 అంటే అన్నామంటారు కానీ.. బర్రెలక్క కంటే అన్యాయం కాదా? జనసేన అనేది ఒక పొలిటికల్ కాంట్రాక్ట్ పార్టీ : మంత్రి గుడివాడ అమర్ చంద్రబాబు కోసమే పనిచేసే వ్యాపార సంస్థ అది.. తెలంగాణ రిజల్ట్తో పవన్కళ్యాణ్కు మతి చెడింది పవన్ కల్యాణ్ కంటే.. బర్రెలక్క(శిరీష)నయమనిపిస్తుంది అబ్రహం లింకన్ కాదు..నారా లింకనే పవన్ కు స్ఫూర్తి ప్రజల్లో ఎటువంటి స్థాయి, బలం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ జగన్ గారిని విమర్శించి తన స్థాయి పెంచుకోవాలని పవన్ చూస్తున్నాడు. విశాఖ ఉక్కుపై అబద్ధాల కబుర్లు చాలించు పవన్..! ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం ఏంటి పవన్ కల్యాణ్..? పార్టీ పెట్టి పదేళ్లయినా సొంత నియోజకవర్గం ఏంటో చెప్పలేదు.? 2.45 PM, 8th Dec 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు జనవరి 19కి వాయిదా ఢిల్లీ: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా విచారణ చేసిన జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్ పై గత విచారణలో నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ కామెంట్స్ చేయవద్దని బాబుకు షరతులు విధించిన కోర్టు 1.30 PM, 8th Dec 2023 విశాఖ కార్యాలయాల కేసుపై విచారణ విశాఖకు క్యాంప్ కార్యాలయాలు తరలిస్తున్నారని పిటిషన్ జీవో 2283ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన ఏజీ శ్రీరామ్ పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేయడాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ గతంలో పిల్ అంశాన్ని ఇప్పుడు రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ రాజధాని తరలింపుపై స్టే ఇవ్వాలంటూ రైతుల పిటిషన్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ అడ్వకేట్ జనరల్ వాదనలు రైతుల తరఫున లాయర్ ఉన్నం మురళీధర్ రావు వాదనలు రైతు సమాఖ్య పిటిషన్లకు విచారణ అర్హత ఉందని వాదన రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి : మురళీధర్ ఇరుపక్షాల లాయర్ల మధ్య హోరాహోరీ వాదనలు రెండు సంఘాల్లోని రైతులు కోర్టు ఫీజు చెల్లించాలని ఆదేశం విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు 12.13 PM, 8th Dec 2023 అయ్యా.. పవనాలు.. కాస్తా వెనక్కి తిరిగి చూసుకో: YSRCP చురకలు తెలంగాణలో బీజేపీ, ఏపీలో టీడీపీ : అడపాశేషు పవన్ ఎవరితోనైనా ఎప్పుడైనా పొత్తు పెట్టుకోగలడు పవన్ ను నమ్ముకుంటే తెలంగాణలో బీజేపీకి పట్టినగతే ఇక్కడ కూడా పవన్ తీరు అక్కడ అమ్మాయి...ఇక్కడ అబ్బాయి సినిమాలాగే ఉంది అక్కడ పోతే బీజేపీ పోయిందని వదిలేశాడు ఇక్కడ చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు ఒక సినిమా పోతే....మరో సినిమా అన్నట్లుంది పవన్ విధానం ఏపీకి ఏం చేశాడని పవన్ ను ప్రజలు నమ్మాలి? పవన్ ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తున్నారు జనసేనకు కచ్చితంగా ప్రజలే సమాధానం చెబుతారు : అడపా శేషు చంద్రబాబును సీఎం చేస్తామన్నది జనసేన పగటికల పార్టీ పెట్టి పదేళ్లయ్యింది....ఏం సాధించావ్ పవన్? : వెల్లంపల్లి చంద్రబాబుకి ఊడిగం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్ రాజకీయ విలువల్లేని వ్యక్తి పవన్ ధైర్యం ఉంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలి టీడీపీ నుంచి 29 సీట్లు అడుక్కోవడానికి సిగ్గులేదా? : వెల్లంపల్లి పవన్కు డిపాజిట్లు రాలేదు, కమిట్మెంట్ లేదు తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు : అమర్నాథ్ తెలంగాణలో స్థిర నివాసమున్న మీ బలం ఏమిటో తేలిపోయింది అబ్రహం లింకన్ గురించి కాదు.... చంద్రబాబుతో ఉన్న లింకుల గురించి పవన్ మాట్లాడితే మంచిది రాజకీయాలపై పవన్ కు ఏమాత్రం కమిట్మెంట్ లేదు ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కాదు.... శాటిలైట్ సెంటర్ అని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా అత్తారింటికి దారేది అంటే పవన్ 3 దారులు వెతుక్కోవాలి : అమర్నాథ్ 11.30 AM, 8th Dec 2023 తుపాను రూపంలో చంద్రబాబుకు అవకాశం జైలు జీవితం తర్వాత ప్రజా జీవితంలోకి చంద్రబాబు ఎప్పుడెప్పుడా అని ఇన్నాళ్లు ఎదురుచూస్తోన్న బాబు తుపాను రూపంలో చంద్రబాబుకు దొరికిన అవకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు దెంబతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న చంద్రబాబు రైతులకు చంద్రబాబు పరామర్శ పొన్నూరు, వేమూరు,తెనాలి, బాపట్లలో పర్యటన రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటన 11.00 AM, 8th Dec 2023 బర్రెలక్క స్థాయిలో కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు: మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్కు తెలంగాణలో వచ్చిన ఫలితమే ఏపీలో కూడా వస్తుంది. అందుకు నిన్న సభ మరోసారి రుజువు చేసింది. విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే మీరు రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు నిన్న విశాఖ వేదికగా పవన్ విమర్శలు చేశారు వ్యక్తి గతంగా సీఎం జగన్పై అవాస్తవ విమర్శలు చేశారు తెలంగాణ ఫలితాలు చూశాక పవన్కు మతి భ్రమించినట్టు కనిపిస్తుంది సోషల్ మీడియాలో చూస్తే బర్రెలక్క స్థాయిలో పవన్ సేన పోటీ పడింది బర్రెలక్కను తక్కువ చేయడం లేదు.. ఆమె స్థాయి కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ మీకు ఏపీకి సంబంధం ఏంటి?. మీరు ఏపీలో ఎంతకాలం వున్నారు?. పవన్ మీ నియోజకవర్గం ఏంటో చెప్పగలరా? ఎక్కడకు వెళ్తే అక్కడ మా నియోజక వర్గం అంటారు అబ్రహం లింకన్కు మీకు సంబంధమేంటి?.. మీది చంద్రబాబు లింకన్ సంబంధం పవన్ కళ్యాణ్ది ది పొలిటికల్ కాంట్రాక్ట్. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం 10:00 AM, Dec 8, 2023 నేడు చంద్రబాబు పిటిషన్పై విచారణ నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్గా కామెంట్స్ చేయవద్దని చంద్రబాబుకు కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపిన కోర్టు.. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన కోర్టు. ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు బెయిల్ కండిషన్లు అన్నీ యథాతధం స్కిల్ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో మాట్లాడొద్దన్న షరతును గతంలో తొలగించిన హై కోర్ట్ హైకోర్టు తొలగించిన షరతును తిరిగి చంద్రబాబుకు విధించిన సుప్రీంకోర్టు ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ. 6:40 AM, Dec 8, 2023 సీఐడీ పిటిషన్పై నేడు విచారణ నేడు ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ 16వ నంబర్ కోర్టులో 51 ఐటమ్గా లిస్టైన చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పవన్కు షాకిచ్చిన ప్రజలు.. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత తొలిసారి విశాఖకు పవన్. పవన్కు షాకిచ్చిన విశాఖ ప్రజలు. ఏఎస్ రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా హోటల్లోనే ఉండిపోయారు. చివరకు కుర్చీలు తీసేసి గ్రౌండ్లో సగం వరకే వేసినా అవి కూడా నిండలేదు. ప్రజలను సభకు తీసుకురావడంలో విఫలమయ్యారంటూ జన సైనికులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన @PawanKalyan కు ప్రజలు షాకిచ్చారు. ఏఎస్ రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా హోటల్లోనే ఉండిపోయారు. చివరకు… pic.twitter.com/Fk5UOCtWUw — YSR Congress Party (@YSRCParty) December 7, 2023 6:30 AM, Dec 8, 2023 లారీ కింద దూరిన కుక్కలకు.. టీడీపీ కుక్కలకూ తేడాలేదు: కొడాలి నాని ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క ఆ లారీ అదే మోస్తందనుకుంటుంది రేవంత్ రెడ్డిని టీడీపీ వాళ్లే సీఎం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు సిగ్గులేకుండా గాంధీభవన్లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారు చంద్రబాబు అధికారంలోకి రావటం పగటి కల అంతరిక్షం నుంచి వచ్చినా గుడివాడలో వైఎస్సార్సీపీని ఓడించలేరు ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీ చేస్తే తెలంగాణలో మాదిరే అవుతుంది సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు మేం టీడీపీ వెనుక నడవడం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నాం జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు సీఎం ఎవరనేది చంద్రబాబు, నేను కూర్చొని నిర్ణయం తీసుకుంటాం అన్నీ ప్రజలకు చెప్పే చేస్తాం.. మీ ఆత్మగౌరవం ఎప్పుడు తగ్గించను ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు మేం ఎవరికి బీ పార్టీ కాదు డొంక తిరుగుడు పనులు నేను చేయను ఎవరు నాతో వచ్చినా రాకున్నా నేను నడుస్తూనే ఉంటా. 6:30 AM, Dec 8, 2023 ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో మరో కీలక పరిణామం టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కొరడా ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు రూ.34 కోట్ల పెనాల్టీ విధింపు కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న అమ్మకం దారు GST నిబంధనలను తుంగలో తొక్కిన ఫాస్ట్లైన్ టెక్నాలజీస్ ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీ ఏపీ ఫైబర్నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే విచారణలో పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్న ఫాస్ట్లేన్ మాజీ ఎండీ విప్లవ్కుమార్ నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ గుర్తింపు (చంద్రబాబు సన్నిహితుడు) టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్లేన్ను ఏర్పాటు చేసినట్టు తెలిపిన విప్లవ్ కుమార్ ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఇంగ్రామ్ ఫాస్ట్లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు తెలిపిన ఇంగ్రామ్ సెప్టెంబర్ 2020 నుంచి కార్యకలపాలు నిలిపివేసిన ఫాస్ట్లేన్ ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్లేన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్ ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను తిరిస్కరించిన హైకోర్టు సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న విచారణకు రానున్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్కిల్ కుంభకోణంలో కీలక పరిణామం A13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సీఐడీ అధికారులు అప్రూవర్గా మారుతున్నట్లు కోర్టు ఎదుట తెలిపిన చంద్రకాంత్ షా తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసు వాయిదా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు రూ.కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు కేసు నుంచి తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ విచారణ వాయిదా వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం,పిటిషనర్ తరఫు న్యాయవాదులు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం -
Dec 6th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 5:02 PM, Dec 6, 2023 ముసుగు తీసేద్దామా? తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తర్జనభర్జన అర్జంటుగా కాంగ్రెస్తో చేతులు కలపాలని ఆరాటపడుతోన్న చంద్రబాబు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కలిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తోన్న చంద్రబాబు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్కు చెప్పిన చంద్రబాబు అసలు తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించిందే తెలుగుదేశమని చెబుతోన్న చంద్రబాబు ఇటీవల గాంధీభవన్లో జరిగిన విజయోత్సవాల్లో కాంగ్రెస్ జెండాతో పాటు రెపరెపలాడిన తెలుగుదేశం పచ్చజెండాలు బీజేపీని ఇక్కడితో విడిచిపెట్టేయాలని పవన్ కళ్యాణ్పై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం తెలంగాణ తరహాలో ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ కలుపుకోవచ్చంటున్న చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్కు సహకరించాం కాబట్టి, ఏపీలో కాంగ్రెస్ సహకారం తీసుకుందామంటోన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు వచ్చిన ఓట్ల గురించి కూడా సమావేశంలో ప్రస్తావన కాంగ్రెస్ కలిసిరాకపోతే.. ఏపీలో జనసేనకు తెలంగాణ సీనే రిపీట్ అవుతోందని భావిస్తోన్న చంద్రబాబు 4:59 PM, Dec 6, 2023 తెలంగాణలో ఏం జరిగింది? నెంబర్లు ఏం చెబుతున్నాయి? అసలు నిజాలు బయటపెడుతోన్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడింది గ్రేటర్ హైదరాబాద్లోనే గ్రేటర్లోని 29 సీట్లలో బీఆర్ఎస్ 18 స్థానాల్లో విజయం 3 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్పై ఇంకా ఆగ్రహంగానే ఉన్న సీమాంధ్రులు చంద్రబాబు, చంద్రబాబు సామాజిక వర్గం ఎంత రెచ్చగొట్టినా..దక్కని ఫలితం అయినా తమ వల్లే కాంగ్రెస్ గెలిచిందని ప్రచారం చేసుకుంటోన్న తెలుగుదేశం 4:52 PM, Dec 6, 2023 కిం కర్తవ్యం.? హైదరాబాద్ : చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్కల్యాణ్ చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అధినేత పవన్ తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ నవంబర్ 4న ఉమ్మడి మ్యానిఫెస్టోపై చర్చించిన ఇరువురు నేతలు ఇప్పటివరకు అడుగు ముందుకు పడని మ్యానిఫెస్టో తెలుగుదేశం ప్రతిపాదనలకు అదనంగా తనవంతుగా కొన్ని హామీలను చేర్చిన జనసేన ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతిపాదనలపై నోరు మెదపని చంద్రబాబు తరుచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం 4:33 PM, Dec 6, 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ ఇసుక ఉచిత పాలసీ, ఐఆర్ఆర్ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సీఐడీ సమయం కోరడంతో వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఈనెల 12 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 4:02 PM, Dec 6, 2023 ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఉంటుందేమో? : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇండియా కూటమిలో చంద్రబాబు చేరొచ్చు తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం టీడీపీ పని చేసింది కాంగ్రెస్ గెలిచాక గాంధీభవన్ లో టీడీపీ సంబరాలు చేసుకుంది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ మా పొత్తు జనసేనతో మాత్రమే : విష్ణువర్ధన్ రెడ్డి 3:52 PM, Dec 6, 2023 ఎన్నికలు పారదర్శకంగా జరగాలి : వైఎస్సార్సిపి ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు తాను చేసిన తప్పులను ఇతరుల పైకి నెడతారు ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్దాలు చెప్పాలని బాబు ప్రయత్నిస్తున్నారు : మంత్రి చెల్లుబోయిన 3:33 PM, Dec 6, 2023 ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి : YSRCP రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిసిన మంత్రులు, వైఎసార్సీపీ నేతలు కలిసిన వారిలో మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలంగాణ లో ఓటువేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన మంత్రులు 4 లక్షల 30 వేల 264 మందికి తెలంగాణ , ఏపీలో ఓట్లు ఉన్నాయి ఆధారాలతో సహా ఈసీకి అందించాం డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైఎసార్సీపీ విధానం ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం డూప్లికేట్ ఓట్లు చేర్పించిందే చంద్రబాబు తాజాగా HMDA పరిధిలో పలు చోట్ల ఓట్ల బూత్లు తెరిచిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు మళ్లీ ఎన్నికల సంఘానికి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారు? : మంత్రి జోగి రమేష్ 3:02 PM, Dec 6, 2023 మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగిన NRI ఆస్పత్రి ఇప్పుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటోన్న వాటాదారులు మంగళగిరి NRI ఆస్పత్రి వ్యవస్థాపకుడిపై కేసు నమోదు ఆస్పత్రి నిధులు మళ్లించారంటూ విజయవాడలో కేసు రూ. 400 కోట్లు మళ్లించినట్టు సురేష్ పై ఆరోపణలు కోర్టు ఆదేశాలతో సురేష్ తో పాటు 39 మందిపై కేసు చాలా మంది NRIల నుంచి బ్లాక్ మనీ సేకరించినట్టు ఆరోపణలు 2:20 PM, Dec 6, 2023 హైకోర్టులో విశాఖ కేసు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ పిటిషన్ విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు కార్యాలయాలు తరలింపునుకు సంబంధించిన జీవో 2283ను సవాల్ చేస్తూ పిటిషన్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ఏజీ శ్రీరామ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేశారన్న ఏజీ శ్రీరాం ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ఏజీ శ్రీరామ్ పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో దాఖలు చేయాల్సి ఉంది రాజధాని తో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదా ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది కానీ పిటిషనర్లు తెలివిగా కావాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్న ఏజీ ఫోరమ్ షాపింగ్ పై పలు జడ్జిమెంట్లు ఉదహరించిన ఏజీ శ్రీరామ్ తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు 11:00 AM, Dec 6, 2023 ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్: ఓ సామాన్యుడు జనసేన అధినేత పవన్కు బిగ్ షాక్ ఏపీతో సంబంధంలేని వ్యక్తి పవన్ పవన్కు ఏపీలో ఇల్లు లేదు. ఓటు హక్కు కూడా లేదు. అలాంటి వ్యక్తి సీఎం జగన్కు పోటీనే కాదు. ఈసారి కూడా గెలిచేది సీఎం జగనే. ఈ రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ ఆయనకు ఇల్లు లేదు. ఓటు హక్కు కూడా లేదు. అలాంటి వ్యక్తి నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం @ysjaganకు పోటీనే కాదు. ఈసారి కూడా గెలిచేది జగన్ గారే. మళ్ళీ ఆయనే సీఎం. - జగనన్న పాలనపై సామాన్యుడి మనోగతం… pic.twitter.com/QSPwuY0fHy — YSR Congress Party (@YSRCParty) December 6, 2023 7:05 AM, Dec 6, 2023 జనసేన, టీడీపీ నేతలెక్కడ? నాడు కరోనా సమయంలో, నేడు వరదల సమయంలో కనిపించని జనసేన, టీడీపీ నేతలు కానీ, అంతా సద్దుమణిగిన తర్వాత సుద్దులు చెప్పడానికి గుంపులుగా వస్తారు. నాడు కరోనా సమయంలో , నేడు వరదల సమయంలో టిడిపి , జనసేన నేతలు ఎక్కడా కనిపించలేదు ! కానీ .... అంతా సద్దుమణిగిన తర్వాత సుద్దులు చెప్పడానికి గుంపుగా బయటకు వస్తారు !#BanYellowMedia#BanTDP — YSRCP IT WING Official (@ysrcpitwingoff) December 5, 2023 7:00 AM, Dec 6, 2023 సిగ్గుండాలి చంద్రబాబు, పవన్.. కళ్లు కనపడుతున్నాయా పవన్? చెవులు వినబడుతున్నాయా చంద్రబాబు? వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వాలంటీర్లు.. కళ్లు కనపడుతున్నాయా @Pawankalyan? చెవులు వినబడుతున్నాయా చంద్రబాబూ @ncbn? వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన వాలంటీర్లు… Volunteer system is the biggest strength of Andhra Pradesh. ☝🏻#CycloneReliefMeasuresInAP#YSJaganCares#AndhraPradesh#VolunteerSystem#APVolunteers pic.twitter.com/tl8OgBtmXg — YSR Congress Party (@YSRCParty) December 5, 2023 6:50 AM, Dec 6, 2023 జనసేన పొత్తులకు అర్థాలు వేరులే ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను దీని వెనుక వ్యూహాలు ఉంటాయి టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.! నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.! 6:50 AM, Dec 6, 2023 ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టిన తెలుగుదేశం ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? నిజాంపేట విజ్ఞాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ ప్రారంభించిన తెలుగుదేశం దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్ కౌంటర్లు జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర. 6:45 AM, Dec 6, 2023 నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా ►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా? ►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు? ►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే ►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ... ►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్గా ఉండికూడా చూపలేదు. ►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు? ►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా? కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్మీట్ పెట్టారు ►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.? ►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్లు చేశారు? ►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?. -
Dec 5th: చంద్రబాబు కేసు అప్డేట్స్
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో మరో కీలక పరిణామం టెరాసాఫ్ట్ కేసులో డీఆర్ఐ కొరడా ఫైబర్ నెట్ కుంభకోణంలో పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ కొరడా ఫైబర్ నెట్ స్కాంలో పన్ను ఎగ్గొట్టినందుకు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్కు రూ.34 కోట్ల పెనాల్టీ విధింపు కొన్నవారి నుంచి GSTని సేకరించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న అమ్మకం దారు GST నిబంధనలను తుంగలో తొక్కిన ఫాస్ట్లైన్ టెక్నాలజీస్ ఆధారాలను పరిశీలిస్తే రూ.10.81 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు ఈ డబ్బును హవాలా మార్గంలో తరలించినట్టు ఆధారాలు ఫాస్ట్లేన్ టెక్నాలజీస్ వెనక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీ ఏపీ ఫైబర్నెట్ నిధులను పక్కదారి పట్టించింది కూడా ఈ కంపెనీలే విచారణలో పన్ను ఎగ్గొట్టినట్టు ఒప్పుకున్న ఫాస్ట్లేన్ మాజీ ఎండీ విప్లవ్కుమార్ నిధులన్నీ డొల్ల కంపెనీల ద్వారా రూటు మార్చినట్టు అంగీకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వేమూరి హరిప్రసాద్ గుర్తింపు (చంద్రబాబు సన్నిహితుడు) టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే పాస్ట్లేన్ను ఏర్పాటు చేసినట్టు తెలిపిన విప్లవ్ కుమార్ ఇప్పటికే ఈ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఇంగ్రామ్ ఫాస్ట్లేన్ దివాళా తీసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు తెలిపిన ఇంగ్రామ్ సెప్టెంబర్ 2020 నుంచి కార్యకలపాలు నిలిపివేసిన ఫాస్ట్లేన్ ఎలాంటి కార్యకలపాలు చూపించకపోవడంతో ఫాస్ట్లేన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రభుత్వం ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచంద్ ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ను తిరిస్కరించిన హైకోర్టు సుప్రీంకోర్టులో డిసెంబర్ 12న విచారణకు రానున్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ స్కిల్ కుంభకోణంలో కీలక పరిణామం A13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన సీఐడీ అధికారులు అప్రూవర్గా మారుతున్నట్లు కోర్టు ఎదుట తెలిపిన చంద్రకాంత్ షా తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు ఓటుకు కోట్లు కేసు వాయిదా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు రూ.కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు కేసు నుంచి తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ విచారణ వాయిదా వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం,పిటిషనర్ తరఫు న్యాయవాదులు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం దిగజారుడు రాజకీయాలకు బాబు, పవన్ నిదర్శనం తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు : ఎంపీ నందిగం సురేష్ తెలంగాణ లో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా రాలేదు ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది వైఎస్సార్ సీపీ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి నువ్వు లీడర్ ఎలా అవుతావు.. లోకేష్? కాకినాడ : లోకేష్ పై ద్వారంపూడి ఫైర్ లోకేష్ పాదయాత్ర కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నట్టుంది ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నీస్ధాయి సరిపోదు, నువ్వు ఎమ్మెల్యే కూడా కావు నీ ఎర్ర బుక్కు మడత పెట్టుకో కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదా పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్ను అడుగు కాకినాడలో టాప్ ముగ్గురు బియ్యం ఎగుమతిదారుల్లో ఆయన ఒకరు, పైగా మీ సామాజిక వర్గమే లేని ఆరోపణలు చేయడం లోకేష్కు తగదు దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యావు నేను ప్రజా క్షేతంలో రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యే అయ్యాను. లోకేష్ పొలిటికల్ ఎంట్రీ తరువాతే చంద్రబాబు పతనం ప్రారంభమైంది ఏపీ బాగుపడాలంటే టిడిపి పోవాలి తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ ప్రభావం లేదు టిడిపిని సపోర్ట్ చేసిన సాప్ట్ వేర్ ఇంజనీర్ ల వల్ల కాంగ్రెస్ గెలవలేదు తెలంగాణ ఎన్నికల్లో పరాజయానికి పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్ చంద్రబాబు సామాజిక వర్గం ఉడుత ఊపులు ఏమయ్యాయి? చించేస్తాం , 'పొడి' చేస్తాం ... అంటూ ఘీంకారాలు మా బాబును అరెస్ట్ చేస్తే కెసిఆర్ కేటీఆర్ ఖండించలేదంటూ శాపనార్థాలు తెలంగాణ ఎన్నికల్లో మా తడఖా చూపుతామని బెదిరింపులు తమిళనాడు శశికళ తరహాలో శపథాలు కట్ చేస్తే ... గ్రేటర్లో హైదరాబాద్ (15 ), ఉమ్మడి రంగారెడ్డి (14 ) లో మొత్తం 29 స్థానాలు TRS 17 స్థానాల్లో, MIM 7 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో గెలుపు చంద్రబాబు శిష్యులుండే నియోజక వర్గాల్లో TRSకు 2018 కంటే ఎక్కువ మెజారిటీ