State Bank of India
-
ఈసీ చేతికి ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారం
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. న్యూమరికల్ నంబర్లతో కూడిన ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను ఎస్బీఐ గురవారం ఈసీకి అందించింది. మార్చి 18న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి న్యూమరికల్ నంబర్లతో పూర్తి వివరాలను వెల్లడించాలని ఎల్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే రెండు సార్లు బాండ్ల వివరాలను ఈసీకి పంపిన ఎస్బీఐ.. న్యూమరికల్ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఎస్బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించిన బాండ్ల పూర్తి వివరాల్లో.. ఎలక్టోరల్ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతా నంబర్లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక..‘బ్యాంక్ అకౌంట్ల భద్రత (సైబర్ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో ఎస్బీఐ పేర్కొంది. అదేవిధంగా ఎస్బీఐ పూర్తి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అందించిన అనంతరం ఈసీ తన అధికారిక వెబ్సైట్ ఈ వివరాలను పొందుపర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. చదవండి: ‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్పై సుప్రీం స్టే -
ఎన్నికల బాండ్ల డేటాను వెల్లడించిన ఈసీ
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వివిధ రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను తమ అధికారిక వెబ్సైట్ https://www.eci.gov.in/లో పొందుపరిచింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. రూ.891 విలువైన ఎలక్టోరల్ బాండ్లను మేఘా సంస్థ కొనుగోలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎస్బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15 సాయంత్రంలోగా వెబ్సైట్లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్లుగా వెబ్సైబ్లో అందుబాటులో ఉంచింది. న్యాయస్థానం ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందే డేటాను ప్రచురించింది. పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు; పార్ట్-2లో బాండ్లను ఎన్క్యాష్ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను ఉంచింది. కాగా దేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది. చదవండి: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ తలకు తీవ్రగాయం -
ఎస్బీఐలోకి ఎద్దు ఎంట్రీ! ఆపై..
ఓ ఎద్దు.. తాపీగా బ్యాంకులోకి నడుచుకుంటూ వచ్చింది. ఆ దృశ్యం చూసి బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు జడుసుకుని ఓ మూలకు వెళ్లారు. అయినా అది బెదరకుండా ముందుకు వెళ్లపోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు లాఠీతో దానిని వెనక నుంచి బయటకు తోలేసే యత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్లో వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లా షాగంజ్ ఎస్బీఐ బ్యాంకులో బుధవారం ఈ చిత్రం జరిగింది. అంతకు ముందు బ్యాంక్ బయట అది మరో ఎద్దుతో పోట్లాడిందట. ఈ క్రమంలోనే ఆ ఎద్దు బ్యాంక్ ఎంట్రెన్స్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి వచ్చేసిందని సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. ఆ సమయంలో కస్టమర్లు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని మేనేజర్ అంటున్నారు. Bull Steals the Spotlight: Unlikely Visitor Creates Stir at SBI Bank in Unnao, Uttar Pradesh. 😂 🐂 Watch the viral video 📽️#SBI #Unnao #UttarPradesh #ViralVideo pic.twitter.com/lzonqeuXw9 — Lokmat Times (@lokmattimeseng) January 11, 2024 VIDEO CREDITS: Lokmat Times కిందటి ఏడాది ఏమో అనుకుంటాం.. అసోం దుభ్రిలో ఓ ఎద్దు షాపింగ్మాల్ మొత్తం కలియదిరిగి తెగ వైరల్ అయిపోయింది. -
సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్.. రూ. 4 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ జరిగింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్పై కేసు నమోదైంది. అయితే ఓ సాఫ్ట్వేర్ యువతి అకౌంట్లోనే సుమారు రూ. 48 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. చదవండి: TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్పై కీలక ఆదేశాలు -
SBI YONO: నిలిచిపోయిన ఎస్బీఐ యోనో సేవలు
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI)కు చెందిన యోనో (YONO) యాప్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది. ఈ మేరకు ఎస్బీఐ ‘ఎక్స్’ (ట్విటర్)లో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ పోస్టు చేసింది. "సాంకేతిక సమస్యల కారణంగా, యోనో సేవలు 2024 జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి మా ఇతర డిజిటల్ ఛానెల్లు అందుబాటులో ఉంటాయి" అని ఎస్బీఐ పేర్కొంది. కాగా బుధవారం ఉదయం 10.30 గంటల తర్వాత ఎస్బీఐ యోనో యాప్ సేవలు తిరిగి పునరుద్ధరించినట్లుగా తెలిసింది. pic.twitter.com/zKuerGTPo6 — State Bank of India (@TheOfficialSBI) January 10, 2024 -
ఎస్బీఐ కస్టమర్లకు మరింత దగ్గర కానున్న ఎంఎస్ ధోనీ!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో చేతులు కలిపింది. మిస్టర్ కూల్ను తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్గా ధోని వివిధ మార్కెటింగ్, ప్రమోషనల్ క్యాంపెయిన్లలో కీలక పాత్ర పోషిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒత్తిడితో కూడిన పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉంటూ స్పష్టమైన ఆలోచన, వేగంగా నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్ ధోనీ ప్రసిద్ధి చెందారు. ఆయనతో భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు, వాటాదారులతో మరింత కనెక్ట్ అవ్వడానికి ఉపకరిస్తుందని ఎస్బీఐ పేర్కొంది. "సంతృప్త కస్టమర్గా ఎస్బీఐతో ధోని అనుబంధం ఆయన్ను మా బ్రాండ్ నైతికతకు పరిపూర్ణ స్వరూపంగా చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో, విశ్వాసం, సమగ్రత, అచంచలమైన అంకితభావంతో దేశానికి, కస్టమర్లకు సేవ చేయాలనే మా నిబద్ధతను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. -
ఎస్బీఐ ఛైర్మన్గా మళ్ళీ ఆయనే.. మరో పది నెలలు..
భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) చైర్మన్ 'దినేష్ ఖరా' (Dinesh Khara) పదవీ కాలాన్ని మరో 10 నెలలు పొడిగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ACC) నిర్ణయం తీసుకుంది. నిజానికి దినేష్ ఖరా అక్టోబర్ 2020లో మూడు సంవత్సరాల కాలానికి ఛైర్మన్గా ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు 2024 ఆగష్టు నెల 28 వరకు అతడే చైర్మన్ పదవిలో కొనసాగుతారు. ఆయన వయసు 63 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలోనే ఉండనున్నారు. ఇదీ చదవండి: ఏఐ వల్ల ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే? 1984లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్గా కెరీర్ ప్రారంభించిన దినేష్ ఖరా.. ఆ తరువాత రిటైల్ క్రెడిట్, ఎస్ఎమ్ఈ అండ్ కార్పొరేట్ క్రెడిట్, డిపాజిట్ మొబిలైజేషన్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆపరేషన్, బ్రాంచ్ మేనేజర్ వంటి పదవుల్లో కొనసాగారు. ఆ తరువాత ఛైర్మన్గా ఎంపికయ్యారు. కాగా ప్రస్తుతం వచ్చే ఏడాది ఆగష్టు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. -
పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు.. ఈ రుణాలపై రెండున్నర శాతం మేర వడ్డీ తగ్గింపుతో పాటు ఆయా రుణాలపై ఎలాంటి అదనపు (ఇన్స్పెక్షన్, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యూవల్ పేర్లతో వసూలు) చార్జీలను పూర్తిగా మినహాయించేలా నిర్ణయం తీసుకుంది. సాధారణంగా.. బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘పొదుపు’ రుణాలపై రూ.మూడు లక్షల వరకు కేవలం ఏడు శాతం వడ్డీకే రుణాలు ఇస్తుంటాయి. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య రుణాలపై ఆయా బ్యాంకులు నిర్దేశించుకునే నిర్ణీత ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు – రుణాలు ఇచ్చేందుకు ఆయా బ్యాంకులు నిర్దేశించుకున్న కనీస వడ్డీ రేటు) ప్రకారం మాత్రమే రుణాలు అందజేయాల్సి ఉంటుంది. ఈ ఎంసీఎల్ఆర్ అన్నది ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా.. ఒకే బ్యాంకులో ఒక్కో సమయంలో ఒక్కొక్క వడ్డీరేటు కూడా ఉంటుంది. అయితే, రూ.5 లక్షల పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై ఆయా బ్యాంకులు తమ విచక్షణ మేరకు వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చుకోవచ్చు. ఇలా.. ఐదు లక్షలకు పైబడి పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలపై కొన్ని బ్యాంకులు గరిష్టంగా 13 శాతం వడ్డీ రేటుకు కూడా రుణాలిస్తున్నాయి. ఇప్పుడు.. ఎస్బీఐ పొదుపు రుణాలపై రూ.5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తాలపై 12.15 శాతం వడ్డీ రేటును 2.25 శాతం తగ్గించుకుని 9.90 శాతానికే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపింది. అదే రూ.10 లక్షలకు పైబడి రూ.20 లక్షలలోపు రుణాలపై కూడా 12.15 శాతం ఉన్న వడ్డీ రేటును 2.45 శాతం తగ్గించుకుని 9.70 శాతానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. పొదుపు రుణాలను సకాలంలో చెల్లించే విషయంలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉండడంతో ఎస్బీఐ వడ్డీ రేటు తగ్గింపునకు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. 2024 మార్చి నెలాఖరు వరకు.. ఇక మహిళలు తీసుకునే ‘పొదుపు’ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఈ ఏడాది మార్చి 10న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లను కోరారు. పొదుపు రుణాలపై ప్రొసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ తదితర పేర్లతో అదనపు ఫీజులు కూడా వసూలు చెయ్యొద్దని ఆ సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కూడా ఇదే అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఎండీ ఇంతియాజ్ పలు దఫాలుగా వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ అప్పట్లోనే తాత్కాలికంగా నాలుగు నెలల కాలానికి, అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జులై 31 వరకు తీసుకునే రూ.5 లక్షల పైబడిన పొదుపు రుణాలపై దాదాపు రెండు శాతం తగ్గించడానికి అనుమతి తెలిపింది. ఆ గడువు ముగియడంతో సెర్ప్ అధికారులు మళ్లీ రెండేళ్లపాటు వడ్డీ తగ్గించాలంటూ ఎస్బీఐకి లేఖ రాశారు. దీంతో ఆ బ్యాంకు ప్రాంతీయ డిప్యూటీ జనరల్ మేనేజర్ స్పందిస్తూ.. 2024 మార్చి నెలాఖరు వరకు రూ.ఐదు లక్షలకు పైబడిన పొదుపు రుణాలపై 2.15 శాతం నుంచి 2.45 శాతం తక్కువ వడ్డీరేటుకే రుణాలిచ్చేందుకు అంగీకారం తెలిపారు. అలాగే, రూ.20 లక్షల వరకు ఎలాంటి ప్రొసెసింగ్ చార్జీలు, ఇన్స్పెక్షన్ చార్జీలు, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యూవల్ ఛార్జీలు వంటివి అదనంగా వసూలు చేయబోమని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. నాలుగో వంతు రుణాలు ఎస్బీఐ నుంచే.. రాష్ట్రంలోని పొదుపు రుణాల్లో దాదాపు నాలుగో వంతు ఎస్బీఐ నుంచే తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు ఒక్క ఎస్బీఐ నుంచే రూ.9,378.24 కోట్ల రుణాలు తీసుకోగా.. పట్టణ ప్రాంతాల్లో రూ.2,565 కోట్ల రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, గ్రామీణ మహిళలు తీసుకున్న రూ.9,378.24 కోట్లలో ఐదు లక్షలకు పైబడి కేటగిరిలో రూ.2,765 కోట్ల దాకా ఉన్నాయని.. వీటిపై ఇప్పుడు ఆ బ్యాంకు తీసుకున్న వడ్డీరేటు తగ్గింపు నిర్ణయంతో ఏటా రూ.వంద కోట్ల వరకు వడ్డీ భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా.. పట్టణ ప్రాంతంలో తీసుకున్న రుణం రూ.2,565 కోట్లలో రూ.5 లక్షల పైబడిన రుణాల్లో దాదాపు రూ.600 కోట్ల మొత్తంపై వడ్డీ రేటు తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ఇతర బ్యాంకులు సైతం భవిష్యత్లో వడ్డీ రేటు తగ్గించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన బ్యాంకులతోనూ సంప్రదింపులు.. ఇక పొదుపు రుణాలకు సంబంధించి అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతోనూ వడ్డీ రేటు తగ్గింపు గురించి ప్రభుత్వంతోపాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. త్వరలోనే ఆయా బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం. – ఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఏటీఎం కార్డు వాడట్లేదా? అయితే...
ప్రస్తుతం యూపీఐ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ డబ్బు చెల్లించాలన్న ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారానే అన్ని చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎం వాడకం బాగా తగ్గిపోయింది. ఇక రెండు మూడు కార్డులున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. అయితే ఎప్పుడోకానీ ఏటీఎం కార్డులు వాడని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా డెబిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత బ్యాంకులు ఆటోమేటిక్గా కొత్త ఏటీఎం కార్డును పోస్ట్ ద్వారా కస్టమర్ల చిరునామాకు పంపుతాయి. కానీ ఓ ఎస్బీఐ కస్టమర్కు విభిన్న అనుభవం ఎదురైంది. దీనిపై ఆ కస్టమర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్! ఇకపై మరింత..) ఆ కస్టమర్కు ఎస్బీఐలో 10 సంవత్సరాలుగా అకౌంట్ ఉంది. అతని డెబిట్ కార్డ్ గడువు ఇటీవలే ముగిసింది. కొత్త ఏటీఎం కార్డు ఆటో మేటిక్గా పోస్టులో ఇంటికి రావాల్సిఉండగా అతనికి బ్యాంక్ కొత్త ఏటీఎం కార్డును పంపలేదు. దీంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లిన అతనికి కొత్త కార్డు కావాలంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకులు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. దీంతో ఎక్స్ (ట్విటర్)లో ఎస్బీఐ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్బీఐ స్పందించింది. కొత్త ఏటీఎం కార్డు ఎందుకు రాలేదో కారణాలను వివరించింది. కార్డు గడువు ముగిసేందుకు మూడు నెలల ముందే అప్రమత్తం కావాలని సూచించింది. కొత్త కార్డు ఆటోమేటిక్గా రావాలంటే.. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అకౌంట్ అయి ఉండకూడదు. డెబిట్ కార్డును ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి. అకౌంట్కు కస్టమర్ పాన్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. -
డెబిట్ కార్డు పోయిందా? సింపుల్గా ఇలా బ్లాక్ చేయండి!
State Bank of India: కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఏటీఎమ్ కార్డు లేదా డెబిట్ కార్డు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చాలా మంది కంగారు పడతారు. కానీ డెబిట్ కార్డు పోగొట్టుకుంటే ఏ మాత్రం గాబరా పడకుండా.. సింపుల్గా బ్లాక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) మీరు పోగొట్టుకున్నది స్టేట్ బ్యాంక్ ఏటీఎమ్ కార్డు అయితే.. ముందుగా స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ బ్లాక్ ది కార్డ్పై క్లిక్ చేయాలి. డెబిట్ కార్డును ఆన్లైన్ నుంచి బ్లాక్ చేయాలనుకుంటే తప్పకుండా మీ అకౌంట్ నెంబర్కి.. మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. క్యాప్చా ఫిల్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి తరువాత మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో ఏ కార్డునైతే బ్లాక్ చేయాలనుకుంటారో.. అక్కడ కనిపించే నుంబర్లలో సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఒక సారి కార్డుని బ్లాక్ చేసిన తరువాత దానిని తిరిగి ఆన్లైన్లో అన్బ్లాక్ చేయడం సాధ్యం కాదు. -
‘పొదుపు’ మహిళలకు వ్యక్తిగత రుణాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పొదుపు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులైన మహిళలకు వైఎస్ జగన్ అందించిన చేయూత అక్కచెల్లెమ్మలు మరింతగా పురోభివృద్ధి సాధించేందుకు బాటలు వేసింది. రాష్ట్రంలో పొదుపు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలకు సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగానూ వ్యాపారానికి బ్యాంకు రుణాలు లభించనున్నాయి. ఈ రుణాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక అవగాహన ఒప్పందం చేసుకొంది. సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి. హేమ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ, సెర్ప్ బ్యాంకు లింకేజీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ కేశవ్కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు బ్యాంకులు సంఘాల ప్రాతిపదికన మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. మహిళలు పొదుపు సంఘంగా ఏర్పడి, నెలనెలా కొంత మొత్తం పొదుపు చేసుకుంటుంటే.. సంఘాల పని తీరు ఆధారంగా బ్యాంకులు వాటిలోని మహిళలందరికీ ఉమ్మడిగా మాత్రమే, సంఘం పేరుతోనే రుణాలిస్తున్నాయి. ఈ రుణాలతో వారి అత్యవసర కుటుంబ అవసరాలను తీర్చుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. దీంతో అప్పట్లో పొదుపు సంఘాలపై వడ్డీలు, చక్రవడ్డీల భారం పడి పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయాయి. సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించలేకపోయాయి. నాలుగో వంతుకు పైగా సంఘాలు నిరర్ధక ఆస్తులు(ఏన్పీఏ)గా ముద్రపడ్డాయి. ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలంతా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. తిరిగి రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మారింది. అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ పూర్తి తోడ్పాటునందించారు. దీంతో పొదుపు సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. ఇప్పుడు మహిళలు పొదుపు సంఘాల పేరిట తీసుకున్న రుణాలను నూటికి 99.55 శాతం మేర తిరిగి చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. సీఎం జగన్ అందించిన ‘ఆసరా’ చంద్రబాబు చేసిన మోసంతో దారుణంగా దెబ్బ తిన్న మహిళల పొదుపు సంఘాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ. 25,571 కోట్ల మేర అప్పులు ఉండేవి. ఆ రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మహిళల చేతికి అందిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి రాగానే, ఇచ్చిన హామీని అక్షరాలా అమలుచేస్తున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ మొత్తం రూ.19,178 కోట్లు అందజేశారు. దీనికి తోడు గత చంద్రబాబు ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిన పొదుపు సంఘాలపై సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ అమలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ భారాన్ని కూడా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా రూ. 3,615. 29 కోట్లు వడ్డీని అక్కచెల్లెమ్మలకు అందజేసింది. పెరిగిన మహిళా సంఘాల పరపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. వ్యాపారాలనూ వృద్ధి చేసుకుంటున్నారు. దీంతో మహిళా సంఘాల పరపతి పెరిగింది. పెద్ద ఎత్తున రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు బ్యాంకులు పొదుపు సంఘాలకు మొత్తం రూ. 1,09,956.87 కోట్ల రుణాలు అందజేశాయి. ఒకప్పుడు ఒక్కొక్క సంఘం రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల మధ్య మాత్రమే రుణాలు పొందగలిగేవి. ఇప్పుడు 3,00,468 సంఘాలు (మూడో వంతుకు పైగా) రూ. 10 లక్షలకు పైబడి రుణాలు పొందుతున్నాయి. వీటిలో 41,139 సంఘాలు ఏకంగా రూ. 20 లక్షల మేర రుణాలు పొందడం గమనార్హం. ఈ రుణాలతో వ్యాపారాభివృద్ధి చేసుకున్న పొదుపు సంఘాల మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారు ఇప్పుడు సొంతంగా వ్యాపారాలు చేసుకోగల స్థాయికి వచ్చారు. అయితే, వారికి బ్యాంకులు వ్యక్తిగతంగా రుణం ఇవ్వకపోవడం అవరోధంగా మారింది. ఇప్పుడు వీరికి రుణాలివ్వడానికి ఎస్బీఐ ముందుకు వచ్చింది. వారు ఏర్పాటు చేసుకొనే వ్యాపార సంస్థనుబట్టి సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రుణాలు లభిస్తాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి
ఆధునిక ప్రపంచంలో ఆన్లైన్ పోర్టల్ వినియోగంలోకి వచ్చిన తరువాత మనం చేయాల్సిన పనులు దాదాపు ఇంటి నుంచి చేసేయడానికి వీలుపడుతోంది. ఇందులో భాగంగానే 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాదారులు ఇప్పుడు బ్యాంకుకి వెళ్లకుండానే ఏటీఎమ్ పిన్ మార్చుకోవచ్చు. దీని కోసం ఈ కింది దశలను పాటిస్తే సరిపోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఓపెన్ చేయండి పర్సనల్ బ్యాంకింగ్ డీటైల్స్లో లాగిన్ అవ్వండి ఇ-సర్వీసుకి వెళ్లి ఏటీఎమ్ కార్డ్ సర్వీసు కోసం క్రిందికి స్క్రోల్ చేయండి. డ్రాప్-డౌన్ లిస్ట్ నుంచి కొత్త ఏటీఎమ్ పిన్ జనరేట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. కొనసాగడానికి 'Get Authorization PIN' ఆప్షన్ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ పొందుతారు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. రీసెట్ చేయాలనుకుంటున్న ఏటీఎమ్ పిన్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి. పిన్ రీసెట్ చేయడానికి కార్డు వివరాలు ఎంచుకోండి. కార్డు వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీకు నచ్చిన, బాగా గుర్తుంచుకోగలిన రెండు అంకెలను ఎంటర్ చేయండి. తరువాత మిగిలిన రెండు అంకెలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వస్తాయి. పిన్ నాలుగు అంకెలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం ముగిసే సమాయానికి ఎస్బిఐ మీకు ఒక కన్ఫర్మ్ మెసేజ్ పంపిస్తుంది. ఎస్బిఐ ఏటీఎమ్ పిన్ నెంబర్ మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్ కూడా ఇంటినుంచి అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ ఖాతాదారులు బ్యాంక్ కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 45 కోట్ల మంది ఖాతాదారులు, 22వేల బ్రాంచీలు, 71,617 ఆటోమెటిక్ డిపాజిట్ మెషిన్లు, విత్డ్రా మెషిన్లు, 62617 ఏటీఎం సెంటర్ల నుంచి సేవల్ని అందిస్తుంది. ఇప్పుడా ఖాతాదారుల సంఖ్యను పెంచేలా బ్యాంక్ సేవల్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అకౌంట్ హోల్డర్లు పలు రకాల సేవల్ని ఆన్లైన్లో ఇంటి వద్ద నుంచి చేసుకునే వెసలుబాటు కల్పించింది. వాటిలో అతి ముఖ్యమైంది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని వ్యయప్రయాసలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ సమస్యల్ని తగ్గించేలా ఆన్లైన్లో అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించ్చింది. అయితే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని అకౌంట్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇందుకు కోసం బ్యాంక్ విధించిన నిబంధనలకు లోబడి కేవైసీ, ఇతర వ్యక్తిగత వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వివరాలు అందుబాటులో లేక పోతే అకౌంట్ను మార్చుకోలేం. చదవండి👉 ఈ ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే వేరే జాబ్ చూసుకోవడం మంచిదంట? ఎస్బీఐ అకౌంట్ను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండిలా ♦ ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ ఎస్బీఐ. కామ్లో లాగిన్ అవ్వాలి ♦అందులో పర్సనల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై మనం ట్యాప్ చేయాలి. ♦ట్యాప్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ♦అనంతరం ఈ- సర్వీస్ ట్యాబ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ♦క్లిక్ చేస్తే స్క్రిన్పైన ట్రాన్స్ఫర్ సేవింగ్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై ట్యాప్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్పై క్లిక్ చేయాలి. ♦అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్ను ఎంటర్ చేయాలి ♦ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత కన్ఫామ్ బటన్పై ట్యాప్ చేయాలి. ♦అనంతరం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మరోసారి కన్ఫామ్ చేయాలి ♦ ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన కొన్ని రోజులకు మీరు ఎక్కడికైతే బ్యాంక్ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేశారో అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్ సేవలు ప్రారంభమవుతాయి. ఎస్బీఐ యోనో యాప్ నుంచి సైతం ఒకవేళ మీరు ఇలా కాకుండా ఎస్బీఐ యోనో యాప్ నుంచి బ్యాంక్ ఖాతాను మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవాలంటే మీరు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది. If you need help in transferring your account from one branch to another, then SBI has got your back. Use YONO SBI, YONO Lite and OnlineSBI from the comfort of your homes and bank safe.#SBIAapkeSaath #StayStrongIndia #YONOSBI #YONOLite #OnlineSBI #BankSafe pic.twitter.com/WlW8bb8aBG — State Bank of India (@TheOfficialSBI) May 7, 2021 చదవండి👉 వేలకోట్ల బ్యాంక్ను ముంచేసి..భార్యతో పారిపోయిన సీఈవో! -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఖాతాల నుంచి రూ.295 కట్! ఎందుకో తెలుసుకోండి..
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది బ్రాంచ్లు ఉన్న ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులు ఉన్నారు. రకరకాల సేవల నిమిత్తం బ్యాంక్ పలు చార్జీల కింద కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయో తెలియక చాలా మంది మథనపడుతుంటారు. స్టేట్ బ్యాంకు ఇటీవల తమ ఖాతాల నుంచి రూ.295 కట్ చేసిందని, అది తిరిగి జమ కాలేదని చాలా మంది కస్టమర్లు చెబుతున్నారు. ఆ మొత్తం ఎందుకు కట్ చేశారో తెలియక తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బు కట్ అవడానికి గల కారణం ఇక్కడ తెలుసుకోండి... నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) సేవల కోసం కస్టమర్ల అకౌంట్ల నుంచి ఆ డబ్బు కట్ చేస్తున్నట్లు తెలిసింది. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఈఎంఐల ఆటోమేటిక్ చెల్లింపు కోసం ఎన్ఏసీహెచ్ ను ఉపయోగిస్తున్నారు. మీరు ఈఎంఐపై ఏదైనా కొనుగోలు చేసినా లేదా రుణం తీసుకున్నా నిర్ణీత తేదీలో మీ సేవింగ్ ఖాతా నుంచి ఈఎంఐ మొత్తం ఆటోమేటిక్గా కట్అవుతుంది. కాబట్టి గడువు తేదీకి ఒక రోజు ముందుగానే మీరు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఉదాహరణకు ప్రతి నెల 5వ తేదీన కట్ అవుతుందనుకుంటే 4వ తేదీ నుంచి ఆ మొత్తం మీ ఖాతాలో ఉండాలి. ఇదీ చదవండి: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా? ఒక వేళ ఈఎంఐ ఆటోమేటిక్గా కట్ కాకపోయినా, ఈఎంఐకి తగినంత మొత్తం మీ ఖాతాలో లేకపోయినా రూ.295 పెనాల్టీ కింద కట్ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఒకే సారి కాకుండా కొన్ని నెలల పాటు పెనాల్టీని కూడబెట్టి ఆపై పూర్తిగా కట్ కావచ్చు. మీరు ఈఎంఐ మొత్తానికి తగినంత బ్యాలెన్స్ అకౌంట్లో ఉంచడంలో విఫలమైతే బ్యాంక్ రూ. 250 పెనాల్టీ విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అంటే రూ.45 అదనం. మొత్తంగా రూ.295 మీ ఖాతా నుంచి కట్ అవుతుందన్నమాట. ఇలా కట్ కాకూడదంటే మీరు ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని గడవు తేదీకి ఒక రోజు ముందుగానే మీ అకౌంట్లో ఉంచాలని గుర్తుంచుకోండి. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
పాన్ లింక్ చేయకపోతే ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అవుతుందా?
పాన్ నంబర్ అప్డేట్ చేయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యోనో అకౌంట్లు బ్లాక్ అవుతాయని, వెంటనే అప్డేట్ చేసుకోవాలంటూ లింక్తో కూడిన మెసేజ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఎస్బీఐ ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఇవి పూర్తిగా ఫేక్ అని తేల్చింది. ఒక వేళ అకౌంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నా ఎస్బీఐ అలాంటి లింక్లను పంపదని పేర్కొంది. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడానికి ఎస్బీఐ అనేక సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగా యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. దీని ద్వారా కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను చేసుకోవచ్చు. అయితే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పాన్ కార్డ్ నంబర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్ చేయకూడదని కస్టమర్లను బ్యాంక్ హెచ్చరించింది. సైబర్ నేరాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత సమాచార భద్రత గురించి ఎస్బీఐ కస్టమర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజ్లు లేదా ఈ-మెయిల్ల ద్వారా పంపిన లింక్లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, తెలియని కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించి ఎలాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయకూడదని సూచించింది. తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ను నమ్మొద్దని, ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. (ఇదీ చదవండి: అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?) -
ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి ఊరటనిచ్చింది. రూ.2 కోట్లలోపు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 5 నుంచి 25 బీపీఎస్ వరకు పెంచింది. అలాగే 400 రోజుల నిర్దిష్ట కాలవ్యవధితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది 2023 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్డీలపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. 2-3 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ చేసిన సీనియర్ సిటిజన్లుకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. పెంచిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధికి చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేటును అత్యధికంగా 25 బీపీఎస్ పెంచింది. వీటిపై గతంలో 6.75 శాతం వడ్డీ వస్తుండగా ఇప్పుడు 7 శాతానికి పెరిగింది. అలాగే 3 నుంచి 10 ఏళ్ల వ్యవధి ఎఫ్డీలపైనా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. వీటికి గతంలో 6.25 శాతం వడ్డీ ఇస్తుండగా తాజాగా 6.5 శాతం అందిస్తోంది. ఇక 1 నుంచి 2 సంవత్సరాల కాలానికి చేసే ఎఫ్డీలపై అత్యల్పంగా కేవలం 5 బేసిస్ పాయింట్లు మాత్రమే వడ్డీ రేటు పెంచింది. వీటిపై 6.75 శాతం ఉన్న వడ్డీ రేటు ప్రస్తుతం 6.8 శాతానికి పెరిగింది. అయితే సంవత్సరం కన్నా తక్కువ కాల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎటువంటి పెంపూ లేదు. 211 రోజుల నుంచి సంవత్సరం లోపు చేసే ఎఫ్డీలపై 5.75 శాతం, 180 నుంచి 210 రోజుల లోపు వాటిపై 5.25 శాతం, 46 నుంచి 179 రోజుల వరకు చేసే ఎఫ్డీలపై 4.5 శాతం, 7 నుంచి 45 రోజులలోపు వాటిపై 3 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అలాగే కొనసాగిస్తోంది. (ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..) -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. బీఅలర్ట్!
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రెడిట్ కార్డ్ యూజర్లపై మరింత భారాన్ని మోపింది. క్రెడిట్ కార్డ్లకు సంబంధించిన ఫీజును సవరిస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తాజాగా ప్రకటించింది. కొత్త ఫీజులు మార్చి 17 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు వినియోగదారులకు మెసేజ్లు, మెయిల్స్ పంపించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్ చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజును రూ.199లకు పెంచింది. ఇది ఇంతకు ముందు రూ.99 ఉండేది. రెంట్ చెల్లింపులపై గతేడాది నవంబర్లోనే రూ.99లు చేసిన ఎస్బీఐ తాజా మళ్లీ పెంచింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. సింప్లీ క్లిక్ కార్డ్లకు సంబంధించిన అనేక నిబంధనలను ఈ ఏడాది జనవరిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సవరించింది. పలు పరిమితులు విధించింది. వోచర్లు, రివార్డ్ రిడెమ్షన్లకు సంబంధించి మార్పులు చేసింది. జనవరి 6 తర్వాత వచ్చిన మార్పుల ప్రకారం సింప్లీ క్లిక్ కార్డ్ హోల్డర్లు గరిష్ట ఆన్లైన్ స్పెండింగ్కు చేరుకున్నాక ఇచ్చే క్లియర్ ట్రిప్ వోచర్లను ఒకే ట్రాన్సాక్షన్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇతర ఆఫర్లతో కలిపి వినియోగించుకునేందుకు ఆస్కారం లేదు. ఇక అమెజాన్లో ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల వినియోగంలో కూడా నిబంధనలు జనవరి 1 నుంచి మారాయి. (ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: వడ్డీ బాదుడు షురూ!) -
రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు.. షాకిచ్చిన కోర్టు.. ఏకంగా రూ. 65 వేలు
సాక్షి, చెన్నై: వినియోగదారుడికి రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు నష్టపరిహారంగా రూ. 65 వేలు అందజేయాలని వినియోగదారుల ఫోరంను కోర్టు ఆదేశించింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్ చెన్నై సౌకార్పేట గోవిందప్పనాయకన్ వీధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2018 జూలై 24న స్నేహితుడు అకౌంట్లో నగదు డిపాజిట్ చేశాడు. ఆ సమయంలో రూ. 900కు గాను రెండు 500 రూపాయల నోటును బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. చలానాలో రెండు 500 నోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. బ్యాంక్ క్యాషియర్ రూ.900 లకు బదులుగా నిర్మల్ కుమార్ స్నేహితుడి ఎకౌంట్కు వెయ్యి రూపాయలు పంపించేశాడు. దీంతో నిర్మల్ కుమారు బ్యాంకు క్యాషియర్ వద్ద మిగిలిన రూ. 100 ఇవ్వమని కోరాడు. ఈ వ్యవహారాన్ని నిర్మల్ కుమార్ బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని తరువాత ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు కూడా చర్యలు తీసుకోలేదు. చివరిగా చెంగల్పట్టు వినియోగదారుల ఫోరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల ఫోరం కోర్టు న్యాయమూర్తి బాధితుడికి నష్టపరిహారంగా రూ. 50 వేలు, కేసు దాఖలు చేయడానికి అయిన ఖర్చు రూ. 15 వేలు కలిపి మొత్తం రూ. 65 వేలు అందజేయాలని సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేశారు. -
ఇన్ స్టెంట్ లోన్స్ తీసుకుంటున్నారా ..?
-
SBI ఖాతాదారులకు మరో బిగ్ షాక్..
-
డిగ్రీ అర్హతతో 5,008 పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్యాంకు కొలువుల అభ్యర్థులకు..శుభవార్త! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఐదువేలకుపైగా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు దశల రాత పరీక్ష ద్వారా నియామకాలు ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతో పాటు విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లరికల్, పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్), స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతోంది. కాబట్టి ఐబీపీఎస్, ఎస్ఎస్సీ వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అదే ప్రిపరేషన్తో.. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు కూడా పోటీ పడొచ్చు. ఐదు వేలకుపైగా పోస్టులు ఎస్బీఐ మొత్తం 5,008 జూనియర్ అసోసియేట్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హైదరాబాద్ సర్కిల్లో 225 పోస్ట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హతలు ►నవంబర్ 30,2022 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ►వయసు: ఆగస్ట్ 1, 2022 నాటికి 18–28 ఏళ్లుగా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. తొలిసారి ప్రాంతీయ భాషల్లో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ తాజా నోటిఫికేషన్లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. తొలిసారిగా పరీక్షలను ్ర΄ాంతీయ భాషల్లో నిర్వహించనుండడం. తెలుగు సహా మొత్తం ఇరవై భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషలో పరీక్షకు హాజరు కావచ్చు. హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను ఎంచుకునే అవకాశముంది. రెండు దశల రాత పరీక్ష ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు రెండు దశల రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అందులో సాధించిన ఉత్తీర్ణత, కటాఫ్ లిస్ట్ ఆధారంగా..తదుపరి దశలో జరిపే మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతిమంగా మెయిన్లో చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు. స్థానిక భాష పరీక్ష అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్ మాధ్యమం ఉంటుంది. మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసిన అభ్యర్థులకు.. మెయిన్ ఎగ్జామ్ తర్వాత స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ 100 మార్కులు ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష.. ప్రిలిమినరీ. మూడు విభాగాలుగా ఆన్లైన్లో మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా మిగతా విభాగాలకు సంబంధించి.. అభ్యర్థులు తమ రాష్ట్రానికి చెందిన లేదా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో పరీక్ష రాయొచ్చు. 200 మార్కులకు మెయిన్ తొలిదశ రాత పరీక్ష ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో (ఒక్కో పోస్ట్కు పది మందిని చొప్పున) తదుపరి దశ మెయిన్ ఎగ్జామ్కు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు జరుగుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటల 40 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్లోనూ అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలను తమకు ఆసక్తి, అర్హత ఉన్న ప్రాంతీయ భాషలో హాజరయ్యే అవకాశం ఉంది. నవంబర్లో పరీక్ష.. సన్నద్ధత ఇలా ఎస్బీఐ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష నవంబర్లో జరుగనుంది. మెయిన్ మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే..ప్రిలిమ్స్కు గరిష్టంగా రెండు నెలలు, మెయిన్స్కు మూడు లేదా నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్లకు ప్రిపరేషన్ సాగించాలి. ఆ తర్వాత పూర్తిగా మెయిన్స్పై దృష్టి పెట్టాలి. మెయిన్ పరీక్షలో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ను పరిశీలించే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్పై అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్పై పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. న్యూమరికల్ ఎబిలిటీ పరీక్షలో మరో కీలక విభాగం ఇది. మెయిన్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలు (పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్మాస్ నియమాలు)పై పట్టు సాధించేలా ్ర΄ాక్టీస్ చేయాలి. వీటితో΄ాటు డేటాఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్లనూ సాధన చేయాలి. రీజనింగ్ ఈ విభాగం ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్లోనే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్నెస్లో.. కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఎకానమీ, ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ను పరీక్షించే ఉద్దేశంతో మెయిన్లో మాత్రమే ఉండే విభాగం ఇది. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ఏ టాపిక్కు ఎంత వెయిటేజీ ఉందో తెలుస్తుంది. అంతేకాకుండా సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా తాము ఇంకా అవగాహన ΄÷ందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్లకు హాజరవడం వల్ల టైమ్ మేనేజ్మెంట్ కూడా అలవడుతుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ ఎగ్జామినేషన్ దృక్పథంతో చదివితే.. ప్రిలిమ్స్లో సులువుగా నెగ్గడానికి, ఆ తర్వాత మెయిన్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ►ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 27, 2022 ►ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబర్, 2022లో ►మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022 లేదా జనవరి 2023లో ►పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers -
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్ ఇచ్చింది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఎస్బీఐ వీకేర్ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ స్కీమ్ పథకంలో చేసిన డిపాజిట్లకు అదనపు వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ఎఫ్డి స్కీమ్ ఎస్బీఐ వీకేర్ ఎఫ్డిలో పెట్టుబడి పెట్టే గడువును మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం..సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక “ఎస్బీఐ వీకేర్” డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్లో అర్హత పొందిన సీనియర్ సిటిజన్లు 30 బేసిస్ పాయింట్లు అదనంగా పొందవచ్చు. అంటే సాధారణ ప్రజలకంటే 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. సిటిజన్లకు సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ప్రజలకు 5ఏళ్ల ఎఫ్డీకి 5.65శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుండగా...సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ పథకంలో చేసిన డిపాజిట్లకు 6.45శాతం వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ వ్యవధి : కనిష్టంగా - 5 సంవత్సరాలు. గరిష్టంగా - 10 సంవత్సరాలు వడ్డీ చెల్లింపు : టర్మ్ డిపాజిట్ - నెలవారీ/ త్రైమాసిక వ్యవధిలో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ : మెచ్యూరిటీ వడ్డీపై టీడీఎస్ డిడక్ట్ చేసి కస్టమర్ ఖాతాకు జమ చేయబడుతుంది రుణ సౌకర్యం సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డి పథకాల్ని ఇతర బ్యాంకులు సైతం అందిస్తున్నాయి. వీటిలో ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులున్నాయి. -
ఆల్టైమ్ గరిష్టానికి.. జోరు మీదున్న ఎస్బీఐ షేరు!
ముంబై: స్టాక్ సూచీలు రెండోరోజూ డీలాపడ్డాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు నష్టపోయి 60 వేల దిగువున 59,866 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 18 వేల స్థాయిని కోల్పోయింది. చివరికి 126 పాయింట్లు పతనమై 17,877 వద్ద నిలిచింది. డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్(3%), రిలయన్స్(ఒకశాతం) పతనమై సూచీలను ఏదశలోనూ కోలుకోనివ్వలేదు. అయితే ఆటో, మెటల్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి రూ.79.71 వద్ద స్థిరపడింది. ఆయిల్ కంపెనీల నుంచి డాలర్కు డిమాండ్ పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పడిందని నిపుణులు తెలిపారు. లాభాల్లోంచి నష్టాల్లోకి... సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 60,454 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 18,046 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 329 పాయింట్లు, నిఫ్టీ 92 పాయింట్లను ఆర్జించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. మెప్పించని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిస్టింగ్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ షేరు లిస్టింగ్ తొలిరోజే నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.510తో పోలిస్తే ఫ్లాటుగా రూ.510 వద్దే లిస్టయ్యింది. రూ.484.5 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 0.5శాతం స్వల్ప నష్టంతో రూ.508 వద్ద ముగిసింది. పీవీఆర్ షేర్ల అమ్మకం మూడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఫండ్లు మల్టీప్లెక్స్ వ్యాపార సంస్థ పీవీఆర్కు చెందిన 40.45 లక్షల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించాయి. ఈ లావాదేవీ విలువ రూ.759.14 కోట్లుగా ఉంది. ఫలితంగా బీఎస్ఈలో పీవీఆర్ షేరు 4.40 శాతం నష్టపోయి రూ.1,844 వద్ద స్థిరపడింది. కొనసాగిన ఎస్బీఐ రికార్డు రెండోరోజూ ఎస్బీఐ షేరు జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్లోనూ ఒకశాతానికి పైగా లాభపడి రూ.579 వద్ద ఆల్టైం హై స్థాయిని తాకింది. చివరికి క్రితం ముగింపు(రూ.572)తో పోలిస్తే ఎలాంటి లాభ, నష్టానికి లోనవకుండా రూ.572 వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల తర్వాత మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరిన మూడో బ్యాంకు, తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించింది. ► ఆటో షేర్లలో భాగంగా మారుతీ సుజుకీ షేరు ట్రేడింగ్లో నాలుగు శాతం లాభపడి రూ.9,351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 3% పెరిగి రూ.9,245 వద్ద నిలిచింది. -
రష్యాతో ’రూపాయి’ట్రేడింగ్, ఇక పెత్తనం అంతా ఎస్బీఐదే!
న్యూఢిల్లీ: రష్యాతో రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐని అధీకృత బ్యాంకుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. త్వరలో రష్యా కూడా తమ దేశం తరఫున అధీకృత బ్యాంకును ఎంపిక చేసి, 15 రోజుల్లోగా ప్రకటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాలు చెప్పినట్లు శక్తివేల్ వివరించారు. ఎగుమతి, దిగుమతి లావాదేవీలను దేశీ కరెన్సీ మారకంలో నిర్వహించేందుకు అదనంగా ఏర్పాట్లు చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యా–భారత్ మధ్య సింహభాగం వాణిజ్యం డాలర్ మారకంలో కాకుండా రూపాయి మారకంలోనే జరుగుతోంది. ఉక్రెయిన్ మీద దాడులకు తెగబడినందుకు గాను రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. -
ఖాతాదారులకు భారీ షాక్, రుణాలపై స్పందించిన ఎస్బీఐ చైర్మన్ ఖారా!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల (అర శాతం) వరకూ పెంచింది. దీంతో రుణగ్రహీతలు నెలవారీగా చెల్లించే వాయిదాల (ఈఎంఐ) భారం మరింత పెరగనుంది. కొత్త రేట్లు ఆగస్టు 15 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది. ఈ సందర్భంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రిటైల్, కార్పొరేట్ లోన్లకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం మేర రుణ వృద్ధిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రుణాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రూ.25,23,793 కోట్ల నుంచి 14.93 శాతం పెరిగి రూ.29,00,636 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రిటైల్ రుణాలు సుమారు 19 శాతం, కార్పొరేట్ రుణాలు 11 శాతం మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రుణాలు రూ.2.5–3 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని, చిన్న.. మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) నుంచి కూడా రుణాలకు డిమాండ్ నెలకొందని ఖరా వివరించారు. త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లతో యోనో 2.0 యాప్ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్లేషకులతో సమావేశంలో ఆయన తెలిపారు. యోనోలో ఇప్పటివరకూ నమోదు చేసుకున్న వారి సంఖ్య 5.25 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. కొత్త సేవింగ్స్ ఖాతాల్లో 65 శాతం అకౌంట్లను యోనో ద్వారానే తెరుస్తున్నట్లు ఖారా వివరించారు. ప్రభుత్వాలు భారీగా టీకాల కార్యక్రమం నిర్వహించడంతో కరోనా మహమ్మారి చాలా మటుకు అదుపులోకి వచ్చిందని..ఆంక్షల తొలగింపుతో ఎకానమీ మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. చదవండి👉 ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
ఎస్బీఐ డిపాజిట్, రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపుబాట నేపథ్యంలో... భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన డిపాజిట్, రుణ రేట్లను పెంచింది. మే తొలి వారం తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా (0.40 శాతం, 0.50 శాతం చొప్పున) 4.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో ఆర్బీఐ 0.50 శాతం రెపో పెంపు నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన సమాచారం ప్రకారం... ►ఎంపిక చేసిన కాలపరిమితులకు సంబంధించి రూ. 2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.20 శాతం వరకూ పెరిగాయి. ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చింది. ►211 రోజుల నుంచి ఏడాది మధ్య డిపాజిట్ రేటు ప్రస్తుతం 4.40% ఉంటే ఇది 4.60%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లు ప్రస్తుతం 4.90% వడ్డీరేటు తీసుకుంటుండగా, ఇది 5.10%కి పెరగనుంది. ►ఇక ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్ రేటు 0.20 శాతం పెరిగి 5.30%కి చేరింది. ఈ విభాగంలో సీనియర్ సిటిజన్లు 5.80% వడ్డీ అందుకుంటారు. ►రెండు నుంచి మూడేళ్ల మధ్య వడ్డీరేటు 5.20 శాతం నుంచి 5.35 శాతానికి ఎగసింది. సీనియర్ సిటిజన్లు పొందే రేటు 5.70 శాతం నుంచి 5.85 శాతానికి పెరుగుతుంది. రూ. రెండు కోట్లపైన డిపాజిట్లు దాటితే... రూ.2 కోట్లు ఆపైబడిన డిపాజిట్లకు సంబంధించి వివిధ కాలపరిమితులపై వడ్డీరేటు 0.75%వరకూ పెరిగింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య రేటు 4% నుంచి 4.75%కి పెరిగింది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 4.50% నుంచి 5.25 శాతానికి పెరుగుతుంది. రుణ రేట్ల పెరుగుదల ఇలా.. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. జూన్ 15 నుంచి తాజా పెంపు అమల్లోకి వస్తుంది. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలకు దాదాపు ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.20% నుంచి 7.40% కి పెరగనుంది. వెబ్సైట్ ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంచింది. ఐడీబీఐ బ్యాంక్ కూడా... మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ రూ.2 కోట్ల దిగువన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లపై 15వ తేదీ నుంచి తాజా పెంపు నిర్ణయం అమలవుతుంది. తాజా నిర్ణయం ప్రకారం, 91 రోజుల నుంచి 6 నెలల మధ్య డిపాజిట్లపై రేటు 3.75% నుంచి 4%కి పెరుగుతుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.60%కి చేరింది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య రేటు 5.60% నుంచి 5.75%కి ఎగసింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
SBI Hikes Interest Rates On Fixed Deposits: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానుండగా...రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయని అధికారులు తెలిపారు. 7 నుంచి 45 రోజుల వ్యవధి మినహాయించి మిగిలిన టెన్యూర్ వడ్డీరేట్లను పెంచింది. దీంతో 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్లో 3శాతం ఉన్న వడ్డీ రేటు 3.50శాతం, 180 నుంచి 210 టెన్యూర్లో 3.10 నుంచి 3.50శాతం వరకు పెరిగాయి. సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్లో 3.30 శాతం నుంచి 3.75శాతం వరకు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల టెన్యూర్లో 3.60 నుంచి 4శాతం, 2 సంవత్సరాల నుంచి 3సంవత్సరాల లోపు టెన్యూర్లో 3.6శాతం నుంచి 4.25శాతం, మూడు నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.50 శాతం వరకు, 5ఏళ్ల నుంచి 10 టెన్యూర్ వరకు 4.50శాతం వరకు పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ల పిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 7 నుంచి 45 రోజుల టెన్యూర్ను మినహాయించింది. 46 నుంచి 179 రోజుల టెన్యూర్లో 3.5శాతం నుంచి 4శాతానికి, 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్లో 3.6శాతం నుంచి 4శాతానికి పెంచింది. ఒక సంవత్సరం కంటే తక్కువ అంటే 211 రోజుల టెన్యూర్లో 3.80శాతం నుంచి 4.25 శాతానికి, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.1 శాతం నుంచి 4.5శాతం వరకు, 2 సంత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.1 నుంచి 4.75శాతం వరకు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు టెన్యూర్లో 4.1 నుంచి 5శాతం , 5 సంవత్సరాల నుంచి 10ఏళ్ల టెన్యూర్లో 4.1 శాతం నుంచి 5శాతానికి వడ్డీ రేట్లు పెంచుతూ తాజాగా ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి👉వందల కోట్లే..ఎస్బీఐ కార్డ్స్కు పెరిగిన లాభం! -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!
ఎస్బీఐ తన ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంక్ సిస్టమ్ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే వారికి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మార్చి 20న రాత్రి 11:30 గంటల నుంచి మార్చి 21 2:00 గంటల మధ్య కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సిస్టమ్ను అప్డేట్ చేస్తోంది. ఈ కారణంగా రేపు రెండున్నర గంటలపాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్ సేవలు ఈ రెండున్నర గంటల పాటు అందుబాటులో ఉండవని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని ట్వీట్ చేశారు. మరి ఈ సమయాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు ముందుగానే జాగ్రత్త పడండి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/t1GGRRxWjx — State Bank of India (@TheOfficialSBI) March 20, 2022 (చదవండి: రూ.53 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా కంటే ఎక్కువ రేంజ్!) -
ఎస్బీఐకి మీనా జ్యువెలర్స్ కుచ్చుటోపీ
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.364 కోట్లు మోసగించిన వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన మీనా జ్యువెలర్స్ సంస్థతో పాటు డైరెక్టర్లపై బెంగళూరు సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. మీనా జ్యువెలర్స్ ప్రమోటర్లు ఉమేష్ జెత్వాని, అతడి భార్య హేమ, కుమారుడు కరణ్పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఎస్బీఐ డీజీఎం ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్యలు చేపట్టినట్లు తెలియగా, 2015–19 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్ ప్రమోటర్లు నకిలీ పత్రాలతో బ్యాంకు నుంచి క్రెడిట్ పొంది, ఆ రుణాలను ఇతర సంస్థలు, ఉపయోగాలకు మళ్లించినష్టాలుగా చూపించినట్టు ఎస్బీఐ డీజీఎం ఫిర్యాదులో వెల్లడించారు. మీనా జ్యువెలర్స్ హైదరాబాద్ కేంద్రంగా మూడు ఔట్లెట్లు నిర్వహిస్తోంది. బంగారం, వజ్రాలు, వెండి, ప్రీమియం గడియారాలు, అత్యాధునిక మొబైల్ ఫోన్ల వ్యాపారం చేస్తోంది. 2001లో ఫర్మ్ సంస్థగా మొదలై, 2007లో లిమిటెడ్ కంపెనీగా మారింది. ఫోరెన్సిక్ ఆడిట్తో వెలుగులోకి... బ్యాంకులను మోసం చేసేందుకు ఖాతా బుక్కులను తారుమారు చేసినట్లు ఎస్బీఐ థర్డ్ పార్టీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటపడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఔట్లెట్లలో క్లోజింగ్ స్టాక్ ఎక్కువగా చూపించి, బ్యాంకుకు అందించిన స్టాక్లో వ్యత్యాసాలు వచ్చాయని, వ్యాట్ లెక్కల్లో కూడా అవకతవకలకు పాల్పడ్డారని తేలిందని పేర్కొన్నారు. ఇద్దరు గ్యారెంటీర్లు మనోజ్ గన్వానీ, భావనా గన్వానీ సంతకాలను ప్రమోటర్లు ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులో స్పష్టంచేశారు. ఈ విచారణలో మీనా జ్యువెలర్స్కు చెందిన మరో రెండు కంపెనీలు మీనా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యువెలర్స్–డైమండ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమేయం కూడా ఉన్నట్లు బయటపడినట్లు వెల్లడించారు. ఈ రెండు కంపెనీలపైనా ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో వాటిపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2016 నుంచి 2020 మధ్య కాలంలో మీనా జ్యువెలర్స్ రూ.906 కోట్లు వ్యాపారం చేసిందని, అయితే క్యాష్ క్రెడిట్ ఖాతాలో రూ.110 కోట్ల రసీదులనే చూపించినట్లు వెల్లడైంది. మొత్తంగా మూడు కంపెనీల పేరిట రూ.364 కోట్లు రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉందని, అనేకసార్లు నోటీసులిచ్చినా కంపెనీ ప్రమోటర్లు స్పందించలేదని ఎస్బీఐ పేర్కొంది. ఈ మేరకు ఫిర్యాదు రావడంతో సీబీఐ కేసులు నమోదుచేసింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. పెరిగిన వడ్డీ రేట్లు
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఎస్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు మార్చి 10, 2022 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.2 కోట్లకు కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఎఫ్డీ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లను పెంచింది. వడ్డీ రేట్లను పెంచడం వల్ల మార్చి 10 నుంచి ఎఫ్డీలపై 3.30 శాతం వడ్డీ లభించనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.60 శాతం నుంచి 3.80 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన బల్క్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరనుంది. అలాగే, ఈ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. సమీక్షించిన ఈ వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యూవల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తున్నాయి. (చదవండి: పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ) -
పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా ఎస్బీఐ యోనో యాప్..!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ అప్లికేషన్ "యోనో"ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ యాప్ను ‘ఓన్లీ యోనో’గా మారుస్తున్నట్లు తెలిపింది. వచ్చే 12 నుంచి 18 నెలలో ఈ మెరుగుపరిచి యాప్ను పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా అమల్లోకి తేవాలని ఎస్బీఐ యోచిస్తుంది. అంతేకాక ప్రస్తుత ఎస్బీఐ యోనో కస్టమర్లను ఓన్లీ యోనోలోకి మార్చనుంది. ఎస్బీఐ యోనో 2021లో యాక్టివ్ యూజర్ల పరంగా 35 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ‘ఓన్లీ యోనో’ అనేది తదుపరి తరానికి చెందిన యాప్. ఇది పూర్తి డిజిటల్ బ్యాంకుగా రూపాంతరం చెందనుంది. ఇది పూర్తిగా పర్సనలైజ్డ్ కస్టమర్ సెంట్రిక్ డిజైన్లో వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్కు తమ సేవలను అందిస్తున్నాయి. అంతకుముందు కంటే ఎక్కువ లక్ష్యంతో కస్టమర్లను చేరుకోనున్నాయి. ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంకులకు సంబంధించి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రత్యేక లైసెన్సింగ్ విధానాలు లేవు. కానీ అవసరమైతే అలాంటి ప్రతిపాదనలకు చేసే అవకాశం ఉంది, అందుకని బ్యాంకులు దానికి సిద్ధమై ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2017లో యోనోను ఎస్బీఐ లాంచ్ చేసింది. (చదవండి: ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!) -
హైటెక్స్లో 26, 27 తేదీల్లో ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో..!
ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ పరిధిలో కోవిడ్ కష్టకాలంలోనూ రూ.10 వేల కోట్ల మేర గృహరుణాలు మంజూరు చేసినట్లు సంస్థ తెలంగాణ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జిన్గ్రాన్ మంగళవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో రూ.44,580 కోట్ల మేర హోమ్ లోన్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19 వేల గృహరుణాలు జారీ చేశామన్నారు. ఈ మొత్తం రూ.8,500 కోట్లుగా ఉందన్నారు. మరో 9,100 టాప్అప్ లోన్లను జారీచేశామని.. ఈ మొత్తం రూ.1700 కోట్లని తెలిపారు. గృహరుణాల జారీలో ఎస్బీఐ మార్కెట్ లీడర్గా నిలిచిందని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే అన్ని రకాల రుణాలపై తక్కవ వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. యోనో,ఓసీఏఎస్ ద్వారానూ ఆన్లైన్లో రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకానికి తమ బ్యాంకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు. మెగా ప్రాపర్టీ షో.. హైటెక్స్ ప్రాంగణంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో ఈ నెల 28,27 తేదీల్లో మెగా ప్రాపర్డీ షో నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో ప్రముఖ బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఇందులో పాలుపంచుకోనున్నాయన్నారు. ఈ ప్రదర్శన వద్ద రుణ మంజూరీపై తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను వర్తింపజేయనున్నామని తెలిపారు. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!
How To Link Aadhaar Pan Card With SBI Account Online: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్చి 31 నాటికి తమ పాన్ నంబర్ను ఆధార్ నంబర్తో లింక్ చేయాలని తన ఖాతాదారులను కోరింది. ఒకవేళ మార్చి 31 నాటికి లింకు చేయడంలో విఫలమైతే వారు ఎస్బీఐ బ్యాంకింగ్ పూర్తి సేవలను వినియోగించుకోలేరు అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్కు పాన్ నంబర్ను లింక్ చేయాలని సూచించింది. ఆధార్తో పాన్ నెంబర్ లింక్ చేయండి ఇలా.. www.incometax.gov.inని ఓపెన్ చేయండి ‘క్విక్ లింక్స్’ హెడ్ కింద ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి. కొత్త పేజీలో పాన్కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు లింక్ ఆధార్పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ నమోదు చేసి లింకింగ్ ప్రాసెస్ను ధృవీకరిస్తే సరిపోతుంది. (చదవండి: ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం) -
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!
ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది. "గోల్డెన్ ఇయర్స్" అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో వృద్దులు పెట్టుబడి పెట్టేందుకు గడువును పొడిగించింది. ఈ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ గడువు తేదీని 8 ఏప్రిల్ 2022 వరకు పొడిగించింది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ పథకం కింద బ్యాంకు వృద్ధులకు సంవత్సరానికి వడ్డీని 0.50 శాతం అదనంగా అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకాలలో నిర్ణీత కాలానికి ముందు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, వారు మరింత వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 20, 2022 నాటి నుంచి అమల్లోకి వచ్చాయి.డిపాజిట్ మొత్తం రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అన్ని ఇతర టర్మ్ డిపాజిట్ ప్రయోజనాలు, నియమ నిబంధనలు కూడా ఈ పథకానికి వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలలో డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మరోవైపు, అదే కాలానికి గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ కింద సీనియర్ సిటిజన్లు 6.35 శాతం వడ్డీ రేటును లభిస్తుంది. సాధారణ ప్రజలకు వార్షికంగా లభిస్తున్న వడ్డీ రేటు కంటే 0.75 శాతం అదనం. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డి స్కీమ్లో ఉన్న డిపాజిట్ను ముందుగానే విత్డ్రా చేస్తే లేదా 5 సంవత్సరాల 1 రోజు లేదా తర్వాత మూసివేసినట్లయితే పెనాల్టీ రేటు 1.25 శాతం ఉంటుందని సీనియర్ సిటిజన్లు తెలుసుకోవాలి. ఈ పథకం కింద తెరిచిన ఖాతా 5 సంవత్సరాల 1 రోజులోపు విత్డ్రా చేయబడినా లేదా మూసివేయబడినా బ్యాంకు ఉపసంహరణ నియమాలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఎస్బీఐ వీకేర్ గడువును పొడిగించింది. బ్యాంక్ ఎస్బీఐ వీకేర్ స్కీమ్ గడువును 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!) -
కుదిరిన ఒప్పందం.. సింగరేణి ఉద్యోగులకు 40 లక్షల బీమా
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేశారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఎస్బీఐలో ఖాతాలున్న 35వేల మంది ఉద్యోగులకు ప్రయో జనం చేకూరనుంది. ఈ ఒప్పందం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సింగ రేణి డైరెక్టర్లు బలరామ్, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సమక్షంలో ఇరు సంస్థల ఉన్నతా ధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సూచనల మేరకు బలరామ్ ఈ చారిత్రక ఒప్పందంలో కీలక పాత్ర పోషించారన్నారు. (చదవండి: ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ) -
ఎస్బీఐ సైనేజీ కేసు,7 సంస్థలకు సీసీఐ జరిమానా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలు, ఆఫీసులు, ఏటీఎంలకు సైనేజీలను సరఫరా చేసేందుకు సంబంధించిన బిడ్ను రిగ్గింగ్ చేసిన కేసులో 7 సంస్థలు, వాటి అధికారులకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించింది. మొత్తం రూ. 1.29 కోట్లు కట్టాలని ఆదేశించింది. అలాగే ఇకపై పోటీని దెబ్బతీసే విధానాలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఆయా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది అధికారులు రూ. 54,000 పైచిలుకు జరిమానా కట్టాల్సి రానుంది. వివరాల్లోకి వెడితే.. పలు ప్రదేశాల్లో ఎస్బీఐ బ్రాంచీలు, కార్యాలయాలు, ఏటీఎంలకు ఉన్న సైనేజీ స్థానంలో కొత్త సైనేజీ సరఫరా, ఇన్స్టాలేషన్ కోసం 2018 మార్చిలో ఎస్బీఐ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ సంస్థ బిడ్లు ఆహ్వానించింది. అయితే, ఈ టెండర్ విషయంలో బిడ్డర్లు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు రావడంతో సుమోటో ప్రాతిపదికన సీసీఐ విచారణ చేసింది. బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా జరగకుండా .. ధరల అంశంలో కంపెనీలన్నీ కూడబలుక్కుని మార్కెట్ను తమలో తాము పంచుకున్నట్లు ఇందులో తేలింది. దీంతో సీసీఐ తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం డైమండ్ డిస్ప్లే సొల్యూషన్స్ ఏజీఎక్స్ రిటైల్ సొల్యూషన్స్, ఒపల్ సైన్స్, ఎవెరీ డెనిసన్ తదితర సంస్థలకు జరిమానా విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు చిన్న, మధ్యతరహా కోవకి చెందినవే కావడం, విచారణలో సహకరించడంతో పాటు తమ తప్పులను అంగీకరించిన నేపథ్యంలో శిక్ష విషయంలో సీసీఐ కొంత ఉదారత చూపింది. పెనాల్టీని ఆయా సంస్థల టర్నోవరులో 1 శాతానికి పరిమితం చేసింది. -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
SBI: దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు
ఉమెన్ కమిషన్ నోటీసుల దెబ్బకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాండిడేట్స్ల విషయంలో.. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడం, ఆపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్లో పేర్కొంది. అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్ సర్క్యులర్ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్ చైర్మన్ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
ఎస్బీఐ కొత్త రూల్స్.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. (చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం) -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్..!
భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను అలర్ట్ చేసింది. టెక్నాలజీ అప్గ్రేడ్లో భాగంగా ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలను జనవరి 22న నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేవలు రేపు ఉదయం 02:00 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఎటువంటి సేవలు పనిచేయవు అని తన ట్విటర్ ఖాతా వేదికగా పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాము అని, ఈ ఒక్క రోజు పాటు తమకు సహకరించగలరని" ఎస్బీఐ అభ్యర్థించింది. ఎస్బీఐ తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను బంద్ చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా చాలా సార్లు మెయింటనెన్స్ చేపట్టింది. యూజర్లకు మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు ఎస్బీఐ గత కొంత కాలంగా మెయింటనెన్స్ వర్క్ చేపడుతూ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన ఎస్బీఐకి 22 వేలకు పైగా బ్రాంచులున్నాయి. దేశవ్యాప్తంగా 57,889కి పైగా ఏటీఎంలున్నాయి. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/3Y1ph0EUUS — State Bank of India (@TheOfficialSBI) January 21, 2022 (చదవండి: కరోనా కాలంలో అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు..!) -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త..!
ఎస్బీఐ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్ వంటి 3 రకాల లోన్స్ అంధించనున్నట్లు తెలిపింది. గోల్డ్ లోన్పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వడ్డీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ గోల్డ్ లోన్ మీద వడ్డీ రేటు 7.3 శాతం నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా రుణ మొత్తాన్ని చెల్లించడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. బుల్లెట్, ఓవర్డ్రాఫ్ట్, ఈఎంఐ వంటి ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న బంగారం నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది. అలాగే, ఎస్బీఐ కారు లోన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. దీని మీద వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం కానుంది. కారు ధరలో 90 శాతం వరకు రుణం పొందొచ్చు. ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉండవు. అలాగే టూవీలర్ లోన్ పొందాలని భావించే వారికి కూడా ఈజీ రైడ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలు లభిస్తున్నాయి. రూ.10 వేలకు ఈఎంఐ రూ.251 నుంచి ప్రారంభం అవుతోంది. Upgrade to a good life with fantastic deals for your brand new four-wheels on Car Loan by SBI. Apply now on YONO app or Know more: https://t.co/aYhi3C6dC8#SBI #StateBankOfIndia #SBICarLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zOmgzHH4rS — State Bank of India (@TheOfficialSBI) January 17, 2022 Give your gold the opportunity to enhance your life with Gold Loan by SBI! Apply now on YONO app or Know more: https://t.co/u3h7OdQHtZ#SBI #StateBankOfIndia #SBIGoldLoan #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/XgJ8Z9ooAC — State Bank of India (@TheOfficialSBI) January 16, 2022 ఇక మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే వాటికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కేవలం 4 క్లిక్స్తోనే లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ తరహా రుణాలపై కూడా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇకపోతే ఈ రుణాలు అన్నీ కూడా యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. Grab the opportunity to fulfil all your dreams with great offers on Personal Loan by SBI. Avail SBI Personal Loan on YONO app or Know more: https://t.co/biL9usmNSz#SBI #StateBankOfIndia #SBIPersonalLoan #Offers #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/zLx823coPd — State Bank of India (@TheOfficialSBI) January 18, 2022 (చదవండి: ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు.. కారు స్పెషల్ ఇదే!) -
ఎస్బీఐ ఖాతాదారులకు సంక్రాంతి శుభవార్త..!
కొత్త ఏడాదిలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్(ఎఫ్డి)పై అందించే వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% వరకు పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. 1 సంవత్సరం కాలపరిమితి నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి గల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.0% నుంచి 5.1%కి పెంచింది. అలాగే, అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటును 5.50% నుంచి 5.60%కి పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. డిసెంబర్ 2021లో ఎస్బీఐ తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బిపిఎస్ పెంచినట్లు వెబ్సైట్లో తెలిపింది. కొత్త బేస్ రేటు (సంవత్సరానికి 7.55%) డిసెంబర్ 15, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక తక్కువ వడ్డీ రేట్లకు సమయం ముగిసింది అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తోంది. రుణగ్రహీతలకు లోన్స్ ఇచ్చేందుకు బేస్ రేటును కీలకంగా తీసుకుంటారు. బేస్ రేట్ పెరగడంతో అన్నీ రకాల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు పడిపోయాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడం అనేది బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన వారికి ఒక మంచి శుభవార్త. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇటీవల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సర కాలానికి వడ్డీ రేటు 5.6 శాతంగా ఉండనుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా.. రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి బ్యాంక్ తెలిపింది. ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి సీఈఓ భవిష్ అగర్వాల్ శుభవార్త..!) -
ఎస్బీఐ ప్రాపర్టీ షో వాయిదా
సాక్షి, సిటీబ్యూరో: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్బీఐ) మెగా ప్రాపర్టీ షో వాయిదా పడింది. కరోనా మహ మ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రదర్శనను వాయి దా వేసినట్టు నిర్వాహకులు తెలి పారు. తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
ఎంఎస్ఎంఈ ఈసీఎల్జీఎస్ స్కీంతో ఎకానమీకి భారీ భరోసా!
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) ప్రయోజనాలకు సంబంధించి ఆవిష్కరించిన అత్యవసర రుణహామీ పథకం(ఈసీఎల్జీఎస్) వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. కోవిడ్-19 ప్రేరిత లాక్డౌన్ కారణంగా వివిధ రంగాలకు, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలకు రుణాన్ని అందించడం ద్వారా వాటిని కష్టాల్లో నుంచి గట్టెక్కించడానికి మే 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించారు. దీనిలో అత్యవసర రుణహామీ పథకం ప్రధాన భాగంగా ఉంది. ఆయా అంశాలపై ఎస్బీఐ రిసెర్చ్ తాజా సమీక్షాంశాలను పరిశీలిస్తే.. ఈసీఎల్జీఎస్ (పునర్వ్యవస్థీకరణ సహా) కారణంగా దాదాపు 13.5 లక్షల సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఖాతాలు ప్రయోజనం పొందాయి. ఇలాంటి ఖాతాల్లో దాదాపు 93.7 శాతం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ కేటగిరీలో ఉన్నాయి. మహమ్మారి కాలంలో రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ రుణ ఖాతాలు మొండిబకాయిల్లోకి (ఎన్పీఏ) జారిపోకుండా రక్షణ పొందాయి. ఈ సంస్థలు మొండిబకాయిలుగా మారితే 1.5 కోట్ల కార్మికులు నిరుద్యోగులుగా మారేవారు. ఒక్కొక్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించింది. ఈ పథకం వల్ల లబ్ది పొందిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్ ఉంది. తరువాతి స్థానంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. (చదవండి: Bitcoin: భారీగా పడిపోయిన బిట్కాయిన్ ధర..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ అలర్ట్..!
హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను హెచ్చరించింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. అయితే, ఇలాంటి నకిలీ లింక్స్ పట్ల జాగ్రత్త ఉండాలని సూచిస్తుంది. మోసగాళ్లు ఈ నకిలీ లింక్స్ సహాయంతో వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్బీఐ పేర్కొంది. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక యువకుడు క్రింద పేర్కొన్న విధంగా వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి రూ.10 వేల నగదు పొగట్టుకున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందుకే, ఇలాంటి నకిలీ లింక్స్, నకిలీ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మోసాల బారిన పడకుండా ఎస్బీఐ సూచనలు: * ఏదైనా లింక్ను క్లిక్ చేసేముందు ఆలోచించండి. * కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులనూ పంపించదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. * మీ మొబైల్ నంబర్, ఇతర వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. * నకిలీ లింక్స్ ఎప్పుడు క్రింద పేర్కొన్న విధంగా ఉంటాయి. వాటి యుఆర్ఎల్ లో బ్యాంక్ పేరు లేకుండా వస్తాయి. రిపోర్ట్ చేయడం ఎలా? ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాలో అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు నివేదించాలి. ఇలాంటి లావాదేవీలను గుర్తించిన వెంటనే 1800 425 3800, 1800 112 211 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. వారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తారు. (చదవండి: లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!) -
ఎస్బీఐ ఏటీఎం పిన్ మర్చిపోయారా? 2 నిమిషాల్లో PIN జనరేట్ చేయండిలా..!
ప్రస్తుతం ఏటీఎం కార్డులు వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఏదో ఒక సమయంలో వాటి అవసరం పడుతుంది. మనం ఒక నెల, రెండు నెల రోజులు ఏటీఎం కార్డు వాడకపోతే పిన్ మర్చిపోవడం సాదారణ విషయమే. రెగ్యులర్గా ఏటీఎం కార్డు వాడేవారికి ఈ సమస్య ఉండదు. పిన్ గుర్తుంటుంది. కానీ ఎప్పుడో ఓసారి ఏటీఎం కార్డు వాడేవారు పిన్ మర్చిపోవడం సాధారణమే. అలాగే, రెండు లేదా మూడు ఏటీఎం కార్డులు వాడేవారు కూడా పిన్ నెంబర్లు గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. ఒకవేల ఏటీఎం పిన మర్చిపోతే కొత్త పిన్ జనరేట్ చేయడం గతంలో కొద్దిగా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పిన్ జనరేట్ చేయడం చాలా సులువు. మీ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్, ఎస్ఎంఎస్ ద్వారా సులువుగా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు సులువుగా పిన్ జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఈజీ స్టెప్స్తో ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎం పిన్ జనరేట్ చేయండిలా..? మీ ఖాతా క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఎస్బీఐ ఆన్లైన్లోనికి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మెనులో ఉన్న 'ఈ-సర్వీసెస్> ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్' ఆప్షన్ ఎంచుకోండి. ఎటిఎమ్ కార్డ్ సర్వీసెస్ పేజీ క్లిక్ చేయగానే మరొక పేజీ క్రియేట్ చేయండి. ఇప్పుడు "వన్ టైమ్ వర్డ్' లేదా 'ప్రొఫైల్ పాస్ వర్డ్' అనే రెండు ఆప్షన్స్ కన్పిస్తాయి. ఇప్పుడు 'ప్రొఫైల్ పాస్ వర్డ్' ఆప్షన్ ఎంచుకొని 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే, మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతాలు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు పిన జనరేట్ చేయాలి అనుకున్న ఖాతా రేడియో బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ బ్యాంకు ఖాతాకు లింకు అయిన ఏటీఎం కార్డు ఎంచుకోండి. ఆ తర్వాత మీకు కనిపించే Enter First Two Digits of Your Desired Pin బాక్స్లో మీకు గుర్తుండే ఒక రెండు నంబర్స్ నమోదు చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో వచ్చిన రెండు నంబర్స్, మీరు ఎంటర్ చేసిన రెండు నంబర్స్ కలిపి ఇప్పుడు మీకు కనిపించే బాక్స్లో నమోదు చేయండి. ఈ నాలుగు నంబర్స్ మీ ఏటీఎం పిన్ గా మారుతుంది. (చదవండి: పాలసీల ప్రీమియం ధరలు పెరగనున్నాయా?) -
కొత్త ఏడాదిలో ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!
కొత్త ఏడాదిలో ఎస్బీఐ తన ఖాతాదారులకు మంచి శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బ్యాంకు శాఖల వద్ద చేసే డబ్బు బదిలీలకు సంబంధించిన తక్షణ చెల్లింపు సేవ(ఐఎమ్పీఎస్) పరిమితిని పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐఎమ్పీఎస్ లావాదేవీల కొత్త స్లాబ్ అనేది ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. ఐఎమ్పీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య డబ్బును పంపినందుకు రూ.20లతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఐఎమ్పీఎస్ అంటే ఏమిటి? ఐఎమ్పీఎస్ అంటే తక్షణ నగదు బదిలీల చెల్లింపు వ్యవస్థ. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, బ్యాంక్ బ్రాంచీలు, ఎటిఏమ్స్, ఎస్ఎమ్ఎస్, ఐవిఆర్ఎస్ వంటి వివిధ ఛానల్స్ ద్వారా ఐఎమ్పీఎస్ వ్యవస్థను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ వల్ల ఖాతాదారులు ఏడాదిలో ఎప్పుడైనా వేగంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా బ్యాంకులు, ఆర్బిఐ అధీకృత ప్రీపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్(పిపిఐ) వ్యక్తులు తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. ఐఎమ్పీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎమ్పీఎస్) విధానంలో డబ్బులు వెంటనే ఇతరుల బ్యాంక్ అకౌంట్కు వెళ్లిపోతాయి. కనీసం రూ.1 నుంచి డబ్బులు పంపొచ్చు. గరిష్టంగా ఇప్పుడు రూ.5 లక్షల వరకు పంపించుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.2 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచింది. ఈ సేవలు రోజులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. రూ.2 లక్షల వరకు ఐఎమ్పీఎస్ ద్వారా ఉచితంగా పంపించవచ్చు. ఆ తర్వాత పంపించే మొత్తాలకు ఛార్జీలు వర్తిస్తాయి. (చదవండి: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే బడ్జెట్లో) -
రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు తీపికబురు అందించింది. రైతులకు తక్కువ వడ్డీకే అగ్రి గోల్డ్ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఈ వియాన్ని ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాల పేరుతో రైతులకు రుణాలను అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసే రుణాలు వేగంగా మంజూరవుతాయి. రీపేమెంట్ ఆప్షన్ కూడా రైతులు తమకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణం మాత్రం కేవలం బంగారు నగలపై మాత్రమే లభిస్తుంది. 24 క్యారట్, 22 క్యారట్, 20 క్యారట్, 18 క్యారట్ స్వచ్ఛత గల నగలు, ఆభరణాలపై రుణాలు తీసుకోవచ్చు. 50 గ్రాముల వరకు బ్యాంక్ గోల్డ్ కాయిన్స్ పైనా రుణాలు లభిస్తాయి. గోల్డ్ బార్స్ పై ఈ రుణాలు వర్తించవు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా ఎస్బీఐ అగ్రి గోల్డ్ రుణాలు తీసుకోవచ్చు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, పిగ్గరీ, గొర్రెల పెంపకం లాంటి వాటికీ ఈ రుణాలు వర్తిస్తాయి. యంత్రాల కొనుగోలు, వ్యవసాయం, హార్టీకల్చర్, ట్రాన్స్పోర్టేషన్ లాంటి అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. Avail SBI's Agri gold loan at lowest interest rate through YONO. #SBIAgriGoldLoan #SBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/jawDwSzWsH — State Bank of India (@TheOfficialSBI) December 21, 2021 (చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్న్యూస్.. రూ.1.44 లక్షల కోట్లు రీఫండ్..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులకు 3-ఇన్-1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఎస్బీఐ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానించే 3-ఇన్-1 ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారి ప్రయోజనం చేకూరుతుంది. వినియోగదారులు ఒకే ఖాతాతో మూడు రకాల సదుపాయాలను పొందుతారు. ఈ విషయన్ని ఎస్బీఐ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేసింది. మీరు ఎస్బీఐ 3-ఇన్-1 తెరవాలనుకుంటే ఈ క్రింది పేర్కొన్న పత్రాలు అవసరం. ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కోసం: పాన్ కార్డు లేదా ఫారం 60 ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, ఎమ్ఎన్ఆర్ఈజీఏ జారీ చేసే జాబ్ కార్డ్, మీ పేరు & చిరునామా వివరాలతో జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసే ఏదైనా ఒక లేఖ. ఇందులో ఏదైనా ఒక పత్రం అవసరం. ఎస్బీఐ డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ కోసం: పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ పాన్ కార్డ్ కాపీ ఆధార్ కార్డు కాపీ ఒక క్యాన్సిల్ చేయబడ్డ చెక్ లీఫ్/తాజా బ్యాంక్ స్టేట్ మెంట్ Experience the power of 3-in-1! An account that combines Savings Account, Demat Account, and Trading Account to provide you with a simple and paperless trading experience. To know more, visit -https://t.co/Mvt7i2K3Le#Go3in1WithSBI #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/3RDWUZEgIF — State Bank of India (@TheOfficialSBI) December 15, 2021 -
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్బీఐ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి శుభవార్త.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) పెంచినట్లు తన వెబ్సైట్లో తెలిపింది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసే బల్క్ టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఉండే రీటేల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది. కొత్తగా పెంచిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వస్తాయని తాజా ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు: డిసెంబర్ 8న సెంట్రల్ బ్యాంక్ తన ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాన్ని నిర్వహించిన వారం తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు ప్రస్తుతం వరుసగా 4 శాతం, 3.35 శాతంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును ప్రస్తుతానికి మార్చకుండా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు, ఇది గత 20 సంవత్సరాలలో కనిష్టం. -
సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ఖాతాదారుల నుంచి సుమారు ₹346కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసింది. ఉచిత సేవలకు మించి వినియోగదారులు అదనపు సేవలను వినియోగించినందుకు 2017-18 నుంచి అక్టోబర్ 2021 వరకు ₹345.84 కోట్లను ఎస్బీఐ వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి భగవత్ కరద్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆగస్టు 30, 2020 నాటి సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం.. రూపే డెబిట్ కార్డు, యుపీఐ, యుపీఐ క్యూఆర్ కోడ్ ఎలక్ట్రానిక్ మోడ్ లను ఉపయోగించి నిర్వహించే లావాదేవీలపై జనవరి 1, 2020న లేదా ఆ తర్వాత సేకరించిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని, భవిష్యత్తు లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని బ్యాంకులకు సలహా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎమ్జెడివై) కింద తెరిచిన ఖాతాలతో సహా ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్బిడిఎ) తెరిచిన వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తుంది. అలాగే, వీరు బ్యాంకు ఖాతాలలో ఎలాంటి కనీస మొత్తం నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం… ఖాతాదారులు ఖాతాల నుంచి నెలకు నాలుగు సార్లు ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి తోడు బ్యాంకు ఏవైనా వాల్యూ యాడెడ్ సేవలు అందిస్తుంటే, వాటిపై ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదు. 2014 సెప్టెంబర్లో ఆర్బీఐ దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది ఆయా బ్యాంకుల విచక్షణకు లోబడి ఉంటుందని చిన్న మెలిక పెట్టింది. దీనిని అడ్డుపెట్టుకుని బ్యాంకులు సామాన్య ప్రజానీకం ఉపయోగించే బీఎస్బీడీఏ, ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ఖాతాలపై సర్వీసు చార్జీల పేరుతో ప్రత్యేక వడ్డింపులు మోపుతున్నాయి. (చదవండి: టయోటా వాహన కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!) -
తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..!
వ్యక్తిగత రుణం అనేది బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అందించే అసురక్షిత రుణం. అందుకే, వ్యక్తిగత రుణాల మీద వడ్డీ రేట్లు అనేవి సాదారణంగా అధికంగా ఉంటాయి. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎక్కువ శాతం అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. ఈ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారతాయి. ఉదాహరణకు, ఐడీబీఐ బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 8.15% నుంచి ప్రారంభమై 14% వరకు ఉంటాయి. ఇవి 12-60 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వ్యక్తిగత రుణాల రేట్లు 9.6% నుంచి ప్రారంభమై 15.65% వరకు ఉంటాయి. ఇవి 6-72 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.20 లక్షల మధ్య అప్పు ఇవ్వవచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలను ఇస్తున్నాయో చూద్దాం. తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..! వ్యక్తిగత రుణంపై గరిష్ట మరియు కనీస పరిమితి ఎంత? అప్పు తీసుకోగల కనీస, గరిష్ట పరిమితి మొత్తం అనేది ప్రతి బ్యాంకుకు మారుతుంది. ఉదాహరణకు, వేతన జీవులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చని ఎస్బీఐ తన వెబ్ సైట్లో పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.12 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందుబాటులో ఉన్నాయని తన వెబ్ సైట్లో తెలిపింది. టాటా క్యాపిటల్ వెబ్ సైట్ ప్రకారం.. మీ క్రెడిట్ విలువను బట్టి మీరు రూ.75,000 మరియు రూ.25 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. (చదవండి: జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..) వ్యక్తిగత రుణానికి ఎవరు అర్హులు? వ్యక్తిగత రుణ అర్హత ఆవశ్యకతలు ఒక బ్యాంకుతో పోలిస్తే మరో బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం.. వ్యక్తిగత రుణానికి అర్హత పొందడానికి కనీసం నెలవారీ ఆదాయం రూ.15,000 ఉండాలి. వ్యక్తిగత రుణం కొరకు మీ అర్హతను నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోరు కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. వ్యక్తులు కనీసం 2 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తూ.. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంది. నెలవారీ నికర ఆదాయం కనీసం రూ.25,000 ఉంటే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణాల కాలపరిమితి ఎంత? వ్యక్తిగత రుణాల కాలపరిమితి అనేది ప్రతి బ్యాంకును మారుతుంటాయి. బ్యాంకులు వంటి రుణ సంస్థలు తరచుగా గరిష్టంగా ఐదు సంవత్సరాలకు వ్యక్తిగత రుణాలను ఇస్తాయి. వ్యక్తిగత రుణంలో ఇమిడి ఉన్న ఛార్జీలు ఏమిటి? ఒక బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి సంస్థలు వ్యక్తిగత రుణంపై ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర రెగ్యులేటరీ ఫీజులను వసూలు చేస్తాయి. అదేవిధంగా, రుణదాతపై ఆధారపడి ప్రీ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ ఫీజు కూడా విధిస్తారు. (చదవండి: టెస్లాలో కీచక పర్వం! అసభ్యంగా తాకుతూ వేధింపులు) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ సేవలకు అంతరాయం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటలు పాటు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 11 డిసెంబర్ 2021న 23:30 గంటల నుంచి 12 డిసెంబర్ 04:30 గంటల(120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్ కారణంగా ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. గత నెల నవంబర్ 27న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/LZsuqO2B0D — State Bank of India (@TheOfficialSBI) December 10, 2021 (చదవండి: రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్వేర్ ఆదాయం!) -
ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు ఎస్బీఐ కృషి
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు కృషి చేస్తుందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (ఆర్ అండ్ డీబీ) చల్లా శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన కోఠి లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఏటీఎంతో పాటు క్యాష్ డిపాజిట్ మిషన్ (సీడీఎం), స్టేట్మెంట్ ప్రింటింగ్ మిషన్లతో కూడిన ఈ–కార్నర్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్–19 నేపథ్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద ఎస్బీఐ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులను అందించాలని భావిస్తోందని, ఇందులో భాగంగా ఎంపికచేసిన ఆస్పత్రులకు అంబులెన్సులను అందిస్తున్నామన్నారు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి ఒక అంబులెన్స్ను అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.2కోట్లు సీఎస్ఆర్ కింద ఖర్చు చేసినట్లు ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 కోట్లు అదనంగా ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. -
రూల్స్ ఉల్లంఘన.. ఎస్బీఐకు భారీ పెనాల్టీ
RBI Impose Penalty To SBI: భారతీయ బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు భారీ పెనాల్టీ విధించింది. నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకు రూ.కోటి జరిమానా విధించినట్లు ప్రకటించింది. రుణగ్రహీత కంపెనీల్లో ఆ కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో షేర్లను కలిగి ఉందన్న కారణంతో ఎస్బీఐకు ఈ జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 19 సబ్ సెక్షన్ 2 ప్రకారం.. నవంబర్ 26న ఈ పెనాల్టీ విధించింది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏ బ్యాంక్ కూడా 30 శాతం కంటే ఎక్కువ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ను కలిగి ఉండడానికి వీల్లేదు. చదవండి: ఆర్బీఐ మార్గదర్శకాలు.. కేరళ సర్కార్ అసంతృప్తి ఈ మేరకు 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్బీఐ సూపర్వైజరీ ఎవాల్యుయేషన్ (ఐఎస్ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో ఈ విషయం బయటపడింది. దీంతో ఎస్బీఐకు షోకాజ్ నోటీసు జారీ చేసింది ఆర్బీఐ. అయితే బ్యాంక్ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాతే ఆర్బీఐ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే షేర్ మార్కెట్లో ఎస్బీఐ నష్టాల బాటలో పయనిస్తోంది. -
State Bank of India: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ
State Bank of India Clarifies on Reports of Unpaid Refund: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) డిజిటల్ చెల్లింపుల అదనపు ఛార్జీల విషయంపై క్లారిటీ ఇచ్చింది. 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపుల సమయంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎంజెడివై) ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రుసుములో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత ఇంకా తిరిగి ఇవ్వాల్సి ఉందని మీడియాలో వస్తున్న వార్తలపై ఎస్బిఐ వివరణ ఇచ్చింది. డిజిటల్ లావాదేవీల కోసం తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్బీడీ) ఖాతాదారుల నుంచి ఎటువంటి లావాదేవీ రుసుమును వసూలు చేయమని ఎస్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. "ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఎస్బిఐ బీఎస్బీడీ ఖాతాదారుల నుంచి రుసుముల రూపంలో వసూలు చేసిన రూ.254 కోట్లలో కేవలం 90 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చింది. ఇంకా రూ.164 కోట్లను ఎస్బీఐ చెల్లించాల్సి ఉంది" అని ఐఐటీ-ముంబై తయారు చేసిన నివేదిక గత వారం తెలిపింది. ఈ కాలంలో ఒక్కో ఖాతా నుంచి బ్యాంకు రూ.17.70 వసూలు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై ఎస్బిఐ స్పందిస్తూ.. “యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ), రూపే డెబిట్ కార్డ్లను ఉపయోగించే లావాదేవీలతో సహా ఇతర డిజిటల్ లావాదేవీలకు బీఎస్బీడీ ఖాతాదారులు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎస్బీడీ ఖాతాదారుల మొదటి నాలుగు విత్ డ్రాలకు ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎస్బిఐ స్పష్టం చేసింది. (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ!) -
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్!
SBI Credit Card Users to Pay Rs 99 Plus Tax on All EMI Transactions: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అన్ని ఈఎంఐ లావాదేవీలు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నుకు లోబడి ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రకటించింది. ఎస్బీఐ కార్డులు & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీఐసీపీఎస్ఎల్) ఇటీవల రూ.99 ప్రాసెసింగ్ ఫీజువసూలు చేసి దానిపై పన్నులు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. రిటైల్ లొకేషన్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ సైట్స్ నిర్వహించే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) కొనుగోళ్లకు ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ విషయం గురించి తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపింది. "01 డిసెంబర్ 2021 నుంచి మర్చంట్ అవుట్ లెట్/వెబ్ సైట్/యాప్ వద్ద చేసిన అన్ని మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ.99 (+ పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు విధించనున్నట్లు మేము మీకు తెలియజేస్తున్నాము" అని ఎస్బీఐసీపీఎస్ఎల్ తెలిపింది. ఈ నోటీసును ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులందరికీ పంపారు. అంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో వస్తువులను కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది. అలాగే, ఈఎమ్ఐ లావాదేవీ విఫలమైనా లేదా క్యాన్సిల్ చేసిన ప్రాసెసింగ్ ఖర్చు తిరిగి చెల్లిస్తారు. (చదవండి: 'సింగిల్స్ డే' అమ్మకాల్లో రికార్డ్.. రూ.10 లక్షల కోట్ల వ్యాపారం) -
ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్బీఐ తీపికబురు
SBI Easy Ride: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్విచక్ర వాహనాలు కొనేవారికి తీపికబురు అందించింది. ఎస్బీఐ యోనో ఫ్లాట్ ఫారం ద్వారా సులభంగా ద్విచక్ర వాహనా రుణాలను పొందవచ్చు అని తెలిపింది. ద్విచక్ర వాహనా రుణాల కోసం ఎస్బీఐ "ఈజీ రైడ్" పేరుతో మరో ఆప్షన్ తీసుకొనివచ్చింది. అర్హత కలిగిన ఎస్బీఐ కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సందర్శించకుండానే యోనో యాప్ ద్వారా క్షణాలలో ద్విచక్ర వాహన రుణాలను పొందవచ్చు అని తెలిపింది. "కస్టమర్లు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి 10.5% వడ్డీరేటుతో రూ.3 లక్షల వరకు ఈజీ రైడ్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస రుణ మొత్తాన్ని రూ.20,000గా నిర్ణయించారు' అని బ్యాంకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ పొందిన రుణం నేరుగా డీలర్ ఖాతాలోకి జమ కానుంది. ఈ పథకం కింద వాహనం ఆన్-రోడ్ ధరలో 85% వరకు రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీ ఛైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ.. 'ఎస్బీఐ ఈజీ రైడ్' రుణ పథకం మా కస్టమర్లకు అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుందని మేం ఆశిస్తున్నాం అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ కారు రేసులోకి టొయోటా.. రేంజ్ కూడా అదుర్స్!) -
రైతులకు శుభవార్త.. గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల రుణం!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు శుభవార్త తెలిపింది. రైతులకు గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షలు వరకు రుణం అందించనున్నట్లు పేర్కొంది. ఈ రుణం కోసం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు సహాయం చేయడం కోసం ఎస్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తుంది. రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం ఈ కార్డు సహాయంతో రుణం సులభంగా తీసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా వారి అవసరాన్ని బట్టి రుణం అందిస్తుంది. ఈ కార్డు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ తరహాలోనే ఇది ఉంటుంది. ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటును అందిస్తుంది. ఈ కార్డు వ్యవది 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్షకు లోబడి మీ కార్డు పరిమితి 10% పెరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాలకు రూ.3 లక్షల వరకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి పంట కాలం(స్వల్ప/దీర్ఘం), పంట మార్కెటింగ్ పీరియడ్ పై ఆధారపడి ఉంటుంది. 45 రోజులకు ఒకసారి కార్డు యాక్టివేట్ చేసినట్లయితే, బ్యాంకు రూపే కార్డుల మాదిరిగా మీకు రూ. 1 లక్ష బీమా లభిస్తుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? రైతులు/వ్యక్తులు/ఉమ్మడి రుణగ్రహీతలు, యజమాని సాగుదారులు, కౌలు రైతులు, నోటి లెస్సీలు, షేర్ క్రాపర్లు అందరూ కూడా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులు, షేర్ క్రాపర్లు మొదలైన వాటితో సహా రైతుల స్వయం సహాయక గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా వర్తిస్తాయి. రూ.3 లక్షల వరకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 7 శాతం వరకు ఉంటుంది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం(పీఎఐఎస్) కింద కవర్ చేయబడతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పిఎమ్ఎఫ్ బివై) కింద కవర్ అవుతాయి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో కోటీశ్వరులైపోయారు!) కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎస్బీఐ పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోండి రైతులు నేరుగా ఎస్బీఐ శాఖను సందర్శించి కేసీసీ దరఖాస్తు ఫారమ్ కోసం అడగవచ్చు. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను నింపి, బ్యాంకులో సమర్పించాలి బ్యాంకు దరఖాస్తును పరిశీలించి, దరఖాస్తుదారుడి వివరాలను ధృవీకరించి, కార్డును కేటాయిస్తుంది. యోనో ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? యోనో ఎస్బీఐ లాగిన్ అవ్వండి యోనో కృషి ఆప్షన్ పై క్లిక్ చేసి ఖాతాపై క్లిక్ చేయండి. మళ్లీ కిసాన్ క్రెడిట్ కార్డుపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, పంట వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి. మీరు గనుక అర్హులు అయితే, కిసాన్ క్రెడిట్ కార్డు మీ ఇంటికి వస్తుంది. కావాల్సిన పత్రాలు ఇంటి చిరునామా, గుర్తింపు రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి. వ్యవసాయ భూమి పత్రాలు దరఖాస్తుదారుడి ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ను అందించాలి. కార్డ్ జారీ చేసే బ్యాంక్ సెక్యూరిటీ పోస్ట్ డేటెడ్ చెక్ను సమర్పించమని కూడా అడగవచ్చు. (చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..!) -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!
2020లో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి తర్వాత బీమా గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి బీమా సదుపాయాలను అందిస్తోంది. ఎస్బీఐ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఏడాదికి రూ.342తో డబ్బులు కడితే ఏకంగా రూ.4 లక్షల విలువ గల భీమా ప్రయోజనం మీరు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పిఎంఎస్బివై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పిఎంజెజెబివై) మీకు రూ.4 లక్షల వరకు ప్రమాద బీమా + జీవిత బీమా అందిస్తున్నాయి. అయితే, దీని కోసం మీరు కేవలం రూ.342 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ రెండు పథకాల గురించి సమాచారాన్ని షేర్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు ఆటో డెబిట్ సదుపాయం ద్వారా ఖాతాదారుడి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం కట్ అవుతుంది అని బ్యాంకు తెలియజేసింది. Get the insurance that suits your need and live life worry-free.#PMSBY #PMJJBY #SBI #Insurance pic.twitter.com/n7DC4eTlOV — State Bank of India (@TheOfficialSBI) October 2, 2021 (చదవండి: జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..!) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద బీమా తీసుకున్న ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా వికలాంగులైనా రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా వైకల్యం పొందినట్లయితే అతడు/ఆమెకు లక్ష రూపాయల పరిహారం లభిస్తుంది. దీనిలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా చేరవచ్చు. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం కూడా రూ.12 మాత్రమే. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు వరకు పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఏ వ్యక్తి అయినా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కోసం కూడా మీరు కేవలం రూ.330 వార్షిక ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ బీమా కవర్ జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుందని తెలుసుకోవాలి. భీమా పొందాలంటే మీరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ప్రీమియం మినహాయింపు సమయంలో బ్యాంకు ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా బీమాను రద్దు చేసుకోవచ్చు. (చదవండి: ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్) -
ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!
దసరా పండుగ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అన్నీ భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎస్బీఐ కార్డ్స్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సమయంలో మొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ల్యాప్ టాప్స్, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ డెకార్, ఫర్నిషింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి మొదలైన ఏ కేటగిరీల్లోనైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి 10 శాతం క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5, 2021 వరకు మాత్రమే ఉంటుంది.(చదవండి: జీన్స్, టీషర్ట్స్ లవర్స్కు షాకింగ్ న్యూస్...!) ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఈఎమ్ఐ కింద కొనుగోళ్లు చేసిన ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కొనే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా, మీకు ఇష్టమైన ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, ఆ మూడు రోజుల సమయంలో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని తెలిపింది. వాటి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం ఎస్బీఐ కార్డ్. కామ్ సందర్శించండి అని తెలిపింది. (చదవండి: ఎస్బీఐ హోమ్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!) Start the celebrations with the most exciting sale of the festive season. Stay Tuned for more info on #DumdaarDus Cashback*! *T&Cs Apply#SBICard #Cashback #FestiveOffers #FestiveShopping #Sale #FestiveSale pic.twitter.com/Kc1bpzRIbt — SBI Card (@SBICard_Connect) September 28, 2021 -
హోమ్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్ట పడుతారు. అయితే, వారి దగ్గర ఉన్న సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కట్టుకుంటారు. అయితే, అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశంలోని అతిపెద్ద రుణదాత 6.70 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ఎస్బీఐ ఇటీవలి ప్రకటనలో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు గృహ రుణం పొందడానికి అవసరమైన పత్రాల జాబితాను విడుదల చేసింది. ఎస్బీఐ గృహ రుణాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!) ఉద్యోగి గుర్తింపు కార్డు లోన్-అప్లికేషన్: పూర్తిగా నింపిన రుణ దరఖాస్తు ఫారం మీద మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అతికించాలి. గుర్తింపు రుజువు (ఏదైనా ఒకటి): పాన్ /డ్రైవర్ లైసెన్స్/ పాస్ పోర్ట్/ఓటర్ ఐడి కార్డు నివాస రుజువు లేదా చిరునామా(ఏదైనా ఒకటి): ఇటీవల విద్యుత్ బిల్లు/టెలిఫోన్ బిల్లు/ వాటర్ బిల్లు/ పైప్డ్ గ్యాస్ బిల్లు లేదా పాస్ పోర్ట్/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ప్రాపర్టీ పేపర్లు: నిర్మాణానికి అనుమతి (వర్తించే చోట) అమ్మకానికి నమోదు చేసుకున్న ఒప్పందం (మహారాష్ట్రకు మాత్రమే)/అమ్మకానికి స్టాంప్డ్ ఒప్పందం/కేటాయింపు లేఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఆస్తిని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంటే) మెయింటెనెన్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఆమోదించబడ్డ ప్లాన్ కాపీ(జిరాక్స్ బ్లూప్రింట్), బిల్డర్ రిజిస్టర్డ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్, కన్వేయన్స్ డీడ్(కొత్త ఆస్తి కోసం) చెల్లింపు రసీదులు లేదా బిల్డర్ లేదా విక్రేతకు చేసిన అన్ని చెల్లింపులను చూపించే బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ బ్యాంక్ ఖాతా వివరాలు దరఖాస్తుదారుడు కలిగి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్లు ఒకవేళ ఇతర బ్యాంకులు నుంచి రుణం తీసుకుంటే, గత సంవత్సరం రుణ ఖాతా స్టేట్ మెంట్ వేతన దరఖాస్తుదారుడు శాలరీ స్లిప్ లేదా గత మూడు నెలల వేతన సర్టిఫికేట్ గత రెండు సంవత్సరాలుగా ఫారం 16 కాపీ లేదా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐటి రిటర్న్ల కాపీ వేతనేతర దరఖాస్తుదారుడు బిజినెస్ చిరునామా రుజువు గత మూడు సంవత్సరాల ఐటి రిటర్న్స్ గత మూడు సంవత్సరాలుగా బ్యాలెన్స్ షీట్, లాభం మరియు నష్టం ఖాతా బిజినెస్ లైసెన్స్ వివరాలు(లేదా సమానమైనవి) టీడీఎస్ సర్టిఫికేట్ (ఫారం 16ఏ - ఒకవేళ వర్తిస్తే) అర్హత సర్టిఫికేట్(సి.ఏ/డాక్టర్ లేదా ఇతర ప్రొఫెషనల్స్ కోసం) -
రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు
పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ ఇటు బ్యాంకులు, అటు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటే, బ్యాంకులు గృహ, వ్యక్తిగత, కారు, బంగారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు పండుగ ఆఫర్ల వర్షం కురిపించింది. గృహ రుణం, కారు రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణంపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల ఎస్బీఐ చేసిన ఒక ట్వీట్లో కారు, బంగారం, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఆఫర్ల గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్లో "కారు రుణం, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ పై ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లతో పండుగ వేడుకలను ప్రారంభించండి. ఈ రోజు ప్రారంభించండి!" అని పేర్కొంది. కారు రుణాన్ని లక్షకు రూ.1539, బంగారు రుణాన్ని 7.5 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాన్ని లక్షకు రూ.1832 ఈఎంఐకే అందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. (చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!) Start the festive celebrations with special offers on Car Loan, Gold Loan and Personal Loan from SBI. Get started today! Apply Now: https://t.co/BwaxSb3HYQ#SBI #StateBankOfIndia #HarTyohaarShubhShuruaat #CarLoan #PersonalLoan #GoldLoan pic.twitter.com/Ebx69ujTYf — State Bank of India (@TheOfficialSBI) September 22, 2021 అలాగే, త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని గృహ రుణాలపై ఆఫర్లను ప్రకటించింది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. -
రిటైల్ డిపాజిట్లపై నెగటివ్ రిటర్న్స్!
ముంబై: ధరల పెరుగుదల స్పీడ్ (ద్రవ్యోల్బణాన్ని) పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ డిపాజిటర్లకు తమ డిపాజిట్లపై ప్రస్తుతం నెగటివ్ రిటర్న్స్ అందుతున్నాయని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థికవేత్తల నివేదిక ఒకటి పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీ ఆర్జనలపై పన్ను అంశాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తన తాజా నివేదికలో సూచించింది. ఈ మేరకు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సమర్పించిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►డిపాజిటర్ల అందరి గురించీ ఆలోచించక పోయినా, కనీసం సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై పన్ను భారాన్ని తగ్గించే అంశాన్ని అయినా సమీక్షించాలి. వారి రోజూవారీ అవసరాలు, వ్యయాలు ఈ వడ్డీపైనే ఆధారపడే సంగతి తెలిసిందే. మొత్తం డిపాజిట్లు దాదాపు రూ. 156 లక్షల కోట్లు. ఇందులో రిటైల్ డిపాజిట్ల వాటా దాదాపు రూ.102 లక్షల కోట్లు. ►ప్రస్తుతం,డిపాజిటర్లందరికీ సంవత్సరానికి రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని జమ చేసే సమయంలో బ్యాంకులు మూలం వద్ద పన్నును మినహాయించుకుంటాయి, అయితే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి ఆదాయం రూ .50,000 దాటితే పన్ను భారం పడుతుంది. ►వృద్ధే ప్రధాన లక్ష్యంగా దేశం ప్రస్తుతం సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభిస్తోంది. దీనితో డిపాజిట్ రేట్ల కనీస స్థాయికి పడిపోయి, కేవలం దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. రెపో వరుసగా ఏడు త్రైమాసికాల నుంచి 4 శాతంగా కొనసాగుతోంది. ►వడ్డీరేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడంలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) భారీగా కొనసాగుతుండడం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ►ప్రస్తుతం ఫైనాన్షియల్ మార్కెట్లో బుల్రన్ నడుస్తోంది. ఇది డిపాజిటర్ల ఆలోచనా ధోరణిని మార్చే అవకాశం ఉంది. తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్ సంపాదించడానికి వారు మార్కెట్వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. ►వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత, వడ్డీరేట్ల విషయంలో పోటీతత్వం, నిధుల సమీకరణ వ్యయాల సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంకులు ప్రస్తుతం మార్జిన్ల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి. -
పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం
ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ పండుగ రాకముందే ఖాతాదారులకు ఆఫర్ల వర్షం కురిపించింది. త్వరలో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారంగా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో కేవలం 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలను అందిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇంతకు ముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాన్ని పొందాలంటే రుణగ్రహీత 7.15% వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టడంతో రుణగ్రహీత ఇప్పుడు 6.70% కంటే తక్కువ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. రూ.8 లక్షలు ఆదా.. ఈ ఆఫర్ వల్ల 45 బీపీఎస్ పాయింట్లు ఆదా అవుతుంది. దీని వల్ల పరోక్షంగా రుణగ్రహీతకు రూ.8 లక్షలకు పైగా భారీ వడ్డీ ఆదా కానున్నట్లు సంస్థ పేర్కొంది. 30 సంవత్సరాల కాలానికి రూ.75 లక్షల రుణం అందించే అవకాశం ఉంటుంది. అలాగే, గతంలో వేతనేతర రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు వేతన రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు మధ్య 15 బీపీఎస్ వ్యత్యాసం ఉండేది. వేతన, వేతనేతర రుణగ్రహీతల మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎస్బీఐ తాజాగా తొలగించింది. ఇక వేతనేతర రుణగ్రహీతలకు 15 బీపీఎస్ వడ్డీ ఆదా అవుతుంది. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) ఈ కొత్త ఆఫర్ల వల్ల పండుగ సీజన్లో ఖాతాదారులు, రుణగ్రహితలు మరింత సంతోషంగా పండుగలు జరుపుకుంటారు అని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ సెట్టీ మాట్లాడుతూ.. "ఈసారి, మేము ఆఫర్లను మరింత సమ్మిళితంగా చేసాము. రుణ మొత్తం అనేది రుణగ్రహీత వృత్తితో సంబంధం లేకుండా అందిరికి ఒకేవిధంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 6.70% వడ్డీరేటు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీ వడ్డీ రేట్లు గృహ రుణాలను మరింత చౌకగా చేస్తాయని మేము నమ్ముతున్నాము. ఈ మహమ్మారి సమయంలో మన దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. ప్రతి భారతీయుడికీ బ్యాంకర్ గా అందరికీ గృహవసతి కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో మా వంతు కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఆయన అన్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ఎస్బీఐ తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేస్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించాలని ఎస్బీఐ 14 సెప్టెంబర్ 2021న నిర్ణయించింది. దీని తర్వాత కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా ఉంటాయి. అదే సమయంలో ప్రైమ్ రుణ రేటు(పీఎల్ఆర్)ను కూడా 12.20 శాతానికి(5 బేసిస్ పాయింట్లు తగ్గించి) తగ్గిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త రేట్లు 15 సెప్టెంబర్ 2021 నుంచి అమలులోకి రానున్నాయి. గతంలో ఏప్రిల్ 2021లో ఎస్బీఐ గృహ రుణాల రేట్లను 6.70 శాతానికి, మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేక రాయితీ కింద 5 బీపీఎస్ తగ్గించింది. బేస్ రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత ప్రభావితం చెందుతాయి. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన బేస్ రేటు కంటే తక్కువ రేటుతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అనుమతి లేదు. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన ప్రస్తుత బేస్ రేటు 7.30-8.80 శాతంగా ఉంది. ఎస్బీఐ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ కొత్త వడ్డీరేట్ల వల్ల ఎస్బీఐ కస్టమర్లు ప్రతి నెల చెల్లించే గృహ రుణం, ఆటో రుణం, వ్యక్తిగత రుణంతో సహా వివిధ రకాల రుణాల వాయిదాలు తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.(చదవండి: ఎంఐ ప్రియులకి షియోమీ షాకింగ్ న్యూస్) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెప్టెంబర్ 15న రెండు గంటలు పాటు తన ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. "మేము 15 సెప్టెంబర్ 2021న 00:00 గంటల నుంచి 02:00 గంటల (120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్ కారణంగా ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అంధించడం కోసం కృషి చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: పెన్షనర్లకు ఎస్బీఐ శుభవార్త!) ఇంతకు ముందు కూడా సెప్టెంబర్ 4, 5 తేదీల మధ్య మూడు గంటలపాటు అన్ని డిజిటల్ సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 4వ తేదీ(ఇవాళ రాత్రి) రాత్రి 10.35 నుంచి అర్ధరాత్రి దాటాక 1గం.30ని. వరకు డిజిటల్ సర్వీసులు పని చేయవని తెలిపింది. ఈ మూడు గంటలపాటు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ సర్వీసులేవీ పని చేయవని పేర్కొంది. ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోపు తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేయాలని పేర్కొంది. ఒకవేళ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని తెలిపింది. We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit — State Bank of India (@TheOfficialSBI) September 14, 2021 -
బ్యాంక్కు నిద్రలేని రాత్రి: అర్ధరాత్రి పాము హల్చల్
ఆత్మకూరు: బ్యాంక్లో పాము దూరి హల్చల్ చేసింది. అనంతపురము జిల్లా ఆత్మకూరులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో శుక్రవారం అర్ధరాత్రి ఓ పాము కలకలం రేపింది. శనివారం తెల్లవారుజాము 4.30 గంటల వరకూ బ్యాంక్ అధికారులు, పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. బ్యాంక్ మేనేజర్ పరుశురాం, ఏఎస్ఐ వరుణాచారి తెలిపిన మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బ్యాంక్ అలారం ఒక్కసారిగా మోగింది. అప్పటికే అనంతపురంలోని తన గృహంలో నిద్రిస్తున్న బ్యాంక్ మేనేజర్ మొబైల్ ఫోన్లో సైతం అలారం (బ్యాంక్ సైరన్తో అనుసంధానం) మోగడంతో వెంటనే ఆయన అప్రమత్తమై పోలీసులకు, స్థానికంగా ఉన్న బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆగమేఘాలపై బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అలారం మోతకు చుట్టుపక్కల వారు నిద్రలేచి బ్యాంక్ చుట్టూ గుమిగూడారు. దొంగలు పడ్డారేమోననే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతుండగా బ్యాంక్ ఉద్యోగులు తలుపులు తీశారు. లోపల అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. క్షుణ్ణంగా గాలించారు. అలారం స్విచ్ వద్ద ఓ పాము కనిపించడంతో దానిని చంపేశారు. అప్పటికే తెల్లవారుజాము 4.30 గంటలైంది. పాము కదలికలతో అలారం స్విచ్ ఆన్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
అదిరిపోయే ఎస్బీఐ ఆఫర్ వారం రోజులు మాత్రమే
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారుల కోసం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్’ కింద కస్టమర్లు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల వరకు డిపాజిట్ చేసే మొత్తంపై 15 బేసిస్ పాయింట్లు వరకు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ 2021 సెప్టెంబరు 14 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య సాధారణ ఖాతాదారులు పొదుపు చేసే ఎఫ్డీలపై 3.9% నుంచి 5.4% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లు జమ చేసే డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అదనంగా లభిస్తాయి. ఈ వడ్డీ రేట్లు 8 జనవరి 2021 నుండి అమల్లోకి రానున్నాయి. (చదవండి: Tesla: భారత్లో ఆన్లైన్ ద్వారా కార్ల అమ్మకం!) అర్హత: ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్లతో సహా దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు(₹2 కోట్ల కంటే తక్కువ) కొత్త, రెన్యువల్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్లు మాత్రమే. ఎన్ఆర్ఈ డిపాజిట్లు(525 రోజులు, 2250 రోజులు మాత్రమే) సాధారణ ప్రజలకు ఎస్బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు Tenor Existing Interest Rate Proposed Interest Rate 75 రోజులు 3.90% 3.95% 525 రోజులు 5.00% 5.10% 2250 రోజులు 5.40% 5.55% సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ప్లాటినం వడ్డీ రేట్లు Tenor: Existing Interest Rate Proposed Interest Rate 75 రోజులు 4.40% 4.45% 525 రోజులు 5.50% 5.60% 2250 రోజులు 6.20% 6.20% -
ఎస్బీఐ భారీగా నిధుల సమీకరణ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకుంది. బాసెల్ నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్-1 బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ఏటీ-1 బాండ్లకు 7.72 శాతం కూపన్ రేటును ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ.1,000 కోట్ల బేస్తో జారీ చేసిన బాండ్లకు భారీ స్థాయిలో డిమాండ్ కనిపించినట్లు ఎస్బీఐ తెలియజేసింది. రూ.10,000 కోట్లకుపైగా విలువైన బిడ్స్ లభించినట్లు వెల్లడించింది. దీంతో 7.72 శాతం కూపన్ రేటుతో రూ.4,000 కోట్ల విలువైన బిడ్స్ను అంగీకరించినట్లు వివరించింది. కాగా.. 2013లో బాసెల్-3 నిబంధనలు అమల్లోకి వచ్చాక ఏటీ-1 బాండ్లకు ఒక దేశీ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న అత్యంత కనిష్ట ధర ఇదని ఎస్బీఐ తెలియజేసింది. వీటికి రేటింగ్ సంస్థలు అత్యుత్తమ రేటింగ్ ఏఏప్లస్ను ప్రకటించినట్లు వెల్లడించింది. నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ.429 వద్ద ముగిసింది.(చదవండి: దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్) -
పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇకపై కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభం. రూ.10 లక్షల వరకు వాహనానికి (ఆన్ రోడ్) అయ్యే వ్యయంలో 85 శాతం దాకా రుణం ఇస్తారు. కాల పరిమితి ఆరేళ్లు. థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. తొలిసారి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఐటీఆర్ అక్కరలేదు. చదవండి : అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో -
SBI: కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ముఖ్య ఆఫర్లను పరిశీలిస్తే... కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు; 90 శాతం వరకూ ఆన్–రోడ్ ఫైనాన్సింగ్ కారు రుణం డిజిటల్గా యోనో ద్వారా దరఖాస్తు చేస్తే 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు)మేర ప్రత్యేక వడ్డీ రాయితీ. వార్షిక వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటు నుంచి లభ్యత బంగారంపై రుణాల విషయంలో 75 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వడ్డీరేట్ల తగ్గింపు. 7.5 శాతానికే రుణ లభ్యత. యోనో ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రద్దు చదవండి : ఇకపై వాట్సాప్లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యక్తిగత, పెన్షన్ రుణ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్స్ వంటివారికి) వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ. కారు, బంగారం రుణాలకు సంబంధించి దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది. రిటైల్ డిపాజిటర్లకు ‘‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభ్యత. ఆగస్టు 31 వరకూ వర్తించేట్లు గృహ రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు. 6.7 శాతం నుంచి గృహ రుణం లభిస్తోంది. -
ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పండుగ రాక ముందే తన రిటైల్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. బ్యాంకు వివిధ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసినట్లు ప్రకటించింది. గతంలో గృహ రుణాలపై ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కారు రుణాలపై, బంగారం రుణాలపై, వ్యకిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను 100 శాతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ జనవరి 1, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారులు కారు ఆన్ రోడ్ ధరలపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపు యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న కస్టమర్లకు బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తుంది. యోనో(యు ఓన్లీ నీడ్ వన్ యాప్) అనేది ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్. యోనో వినియోగదారులు సంవత్సరానికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు రుణాలను పొందవచ్చని తెలిపింది. యోనో ద్వారా బంగారు రుణాలను పొందే ఖాతాదారులకు వడ్డీ రేట్లలో 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపును బ్యాంకు అందిస్తోంది. వారు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు నుంచి బంగారు రుణాలను పొందవచ్చు అని పేర్కొంది. అంతేగాక, యోనో ద్వారా బంగారు రుణాల కోసం దరఖాస్తు చేసే వినియోగదారులందరికీ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. Get drenched in happiness, as it's raining offers with SBI. Avail a 100% Processing Fee waiver on Car Loan, Gold Loan and Personal Loan. Know more at https://t.co/8gV2D7FEFG#SBI #CarLoan #GoldLoan #PersonalLoan #ItsRainingOffersWithSBI pic.twitter.com/fTcMvYShyq — State Bank of India (@TheOfficialSBI) August 16, 2021 కోవిడ్ యోధులకు వడ్డీ రాయితీ వ్యక్తిగత, పెన్షన్ రుణ ఖాతాదారుల కొరకు ప్రాసెసింగ్ ఫీజుల్లో బ్యాంకు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ల కొరకు 50 బీపీఎస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ప్రకటించింది. కారు, బంగారు రుణాలకు కూడా ఈ ఆఫర్ త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్లను’ ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇది 2021 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబరు 14 వరకు అమల్లో ఉండనుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 6.70 శాతం వద్ద నుంచి ప్రారంభమవుతుంది. -
ప్రజల కోసం ఎస్బీఐ సరికొత్త డిపాజిట్ పథకం
దేశంలోని అతిపెద్ద పబ్లిక్ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రజల కోసం కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త డిపాజిట్ పథకం కింద ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని లభిస్తుంది. ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లు అని పిలువబడే ఈ కొత్త డిపాజిట్ పథకం కాలవ్యవధి పరిమిత కాలం మాత్రమే. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14 వరకు కొనసాగుతుందని ఎస్బీఐ తన పోర్టల్ లో తెలిపింది. "ప్లాటినం డిపాజిట్లతో భారతదేశం 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని జరుపుకునే సమయం ఇది. టర్మ్ డిపాజిట్లు, స్పెషల్ టర్మ్ డిపాజిట్ల కింద ఎస్బీఐ అనేక ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తుంది. ఈ ఆఫర్ 14 సెప్టెంబర్ 2021 వరకు చెల్లుబాటు అవుతుంది" అని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో తెలిపింది. ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్లు ప్రత్యేక డిపాజిట్ పథకంలో భాగంగా డిపాజిట్ దారులకు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలవ్యవధుల్లో ప్రస్తుతం లభిస్తున్న టర్మ్ డిపాజిట్లపై 0.15 శాతం వరకు అదనపు వడ్డీని పొందవచ్చు. ఈ ప్రత్యేక డిపాజిట్ పథకం కింద డిపాజిట్ దారులు 75 రోజులు, 525 రోజులు, 2,250 రోజుల కాలవ్యవధులను ఎంచుకోవచ్చు. దీని కింద పెట్టిన పెట్టుబడులపై అదనపు వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లను ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టవచ్చు. ఎన్ఆర్ఈ డిపాజిట్ల కాలపరిమితి 525 రోజులు, 2,250 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ పథకం టర్మ్ డిపాజిట్, స్పెషల్ టర్మ్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. It's time to celebrate India's 75th year of Independence with Platinum Deposits. Exclusive benefits for Term Deposits and Special Term Deposits with SBI. Offer valid up to: 14th Sept 2021 Know More: https://t.co/1RhV1I8fam #SBIPlatinumDeposits #IndependenceDay #SpecialOffers pic.twitter.com/qnbZ4aRVEs — State Bank of India (@TheOfficialSBI) August 15, 2021 వడ్డీ రేటు ఎస్బీఐ ప్లాటినం కింద పెట్టుబడి పెట్టిన ఖాతాదారులకు 75 రోజుల కాలానికి ప్రత్యేక ఆఫర్ కింద వారికి 3.95 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 525 రోజుల కాలంలో వారికి ప్రస్తుతం ఉన్న 5 శాతానికి బదులుగా 5.10 శాతం వడ్డీరేటు లభిస్తుంది. 2,250 రోజుల కాలంలో వారికి 5.40 శాతానికి బదులుగా 5.55 శాతం వడ్డీరేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్ల కింద పెట్టుబడి పెడితే ప్రత్యేక 4.45 శాతం వడ్డీ రేటు 75 రోజుల కాలానికి, 5.60 శాతం వడ్డీ రేటు 525 రోజుల కాలానికి అందించనున్నారు. అయితే, 2,250 రోజుల పదవీకాలంలో అదనపు వడ్డీ ప్రయోజనం లభించదు. టర్మ్ డిపాజిట్ల విషయంలో వడ్డీ చెల్లింపు నెలవారీగా, త్రైమాసిక కాలానికి చెల్లించబడుతుంది. ఎస్బీఐ పరిమిత ఆఫర్ డిపాజిట్ స్కీం గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. -
సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారతదేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఎఫ్డీ పథకం కింద ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి పెట్టుబడి పెట్టె నగదుపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల కన్న అధిక వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ గా పిలువబడే ఈ కొత్త స్కీమ్ వల్ల వారి ఎఫ్డీ డిపాజిట్లపై అదనంగా 30 బేసిస్ వడ్డీ పాయింట్లు లభిస్తాయి. ప్రస్తుతం, ఎస్బీఐ అన్ని కాలవ్యవధుల టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల ను అందిస్తుంది. వీకేర్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో వారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టె టర్మ్ డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ వీకేర్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ఇప్పుడు సెప్టెంబర్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఎఫ్డీ స్కీమ్ వివరాలు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు అర్హులు. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఇందులో ఎఫ్డీ చేయాలి. బ్యాంకు గరిష్ట డిపాజిట్ రూ.2 కోట్లు ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఈ డిపాజిట్లపై బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ కింద డబ్బును ఎఫ్డీ చేస్తే వర్తించే వడ్డీ రేటు 6.2 శాతం గడువు కన్న ముందు నగదు విత్ డ్రా చేస్తే అదనపు 30 బిపీఎస్ ప్రీమియం వర్తించదు. బ్యాంకు 0.5 శాతం జరిమానా విధించవచ్చు. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
ఎస్బీఐ తన బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో తప్పనిసరిగా సెప్టెంబర్ 30, 2021లోపు లింక్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది. "ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధార్ నంబర్ ను, శాశ్వత ఖాతా నంబర్(పాన్)తో 30 సెప్టెంబర్ 2021 నాటికి లింక్ చేయడం తప్పనిసరి" అని ఎస్బీఐ తెలిపింది. అయితే, ఖాతాదారులకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికి బ్యాంకు కొన్ని రోజులుగా ట్వీట్ చేస్తూనే ఉంది. ఒకవేల ఖాతాదారులు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో లింకు చేయడంలో విఫలమైతే వారి బ్యాంక్ సేవల విషయంలో అంతరాయం ఇబ్బందులు ఎదుర్కొంటారని రుణదాత తెలిపారు. " ఎటువంటి అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి పాన్ నెంబర్ ను, ఆధార్ తో లింక్ చేయమని మా కస్టమర్లకు మేము సలహా ఇస్తునాము" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసే గడువును గత నెలలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడగించిన విషయం తెలిసిందే. గతంలో ఈ గడువును మార్చి 30 నుంచి జూన్ 30 వరకు పొడగించారు. మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం కొరకు మీరు www.incometax.gov.in ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి లింకు చేయాల్సి ఉంటుంది. We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/p4FQJaqOf7 — State Bank of India (@TheOfficialSBI) July 16, 2021 ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ తో పాన్ ను లింక్ చేయవచ్చు. దీని కొరకు మీరు UIDPAN ఫార్మెట్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 567678 లేదా 56161కు ఎస్ఎమ్ఎస్ పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి పాన్-ఆధార్ ని గడువు తేదీ నాటికి లింక్ చేయడంలో విఫలమైనట్లయితే, అప్పుడు అతడు/ఆమె గరిష్టంగా రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. ఆన్ లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. "మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము, గౌరవనీయ ఖాతాదారులు మాకు సహకరించగలరని అభ్యర్థిస్తున్నాము" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ, యోనో మరియు యోనో లైట్ సర్వీసులను యాక్సెస్ చేసుకోలేరని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక "ముఖ్యమైన నోటీసు"లో తెలిపింది. ఈ సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకపోవడం మంచిది. -
State Bank Day: పీఎం కేర్స్ ఫండ్కు భారీ విరాళం
కోవిడ్-19 మహమ్మారి ఇంకా కొనసాగుతున్న తరుణంలో దానిని అరికట్టడం కోసం దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన సుమారు 2.50 లక్షల మంది ఉద్యోగులు ఎస్బీఐ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్ కు సహకారం అందించడం ఇది రెండవసారి. "మా ఉద్యోగులు కరోనా మహమ్మారి కాలంలో కూడా మా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను అందించడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గర్వకారణం. వారు సేవలు అందించడంలో ఎల్లప్పుడు ముందు ఉంటారు. అదనంగా, మహమ్మారిని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న సమయంలో వారు స్వచ్ఛందంగా ప్రధాని కేర్స్ ఫండ్ కు విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు" అని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. Today, on #StateBankDay, we celebrate the incredible journey undertaken so far. Proud to move together with our nation in its march towards progress. We are happy to serve you with the latest digital banking products and services. #TheBankerToEveryIndian pic.twitter.com/qgve8jKQJ6 — State Bank of India (@TheOfficialSBI) June 30, 2021 ఒక బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరుడిగా, ఈ మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఎస్బీఐ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. గత సంవత్సరంలో ఎస్బీఐ తన వార్షిక లాభంలో 0.25% కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా అవసరమైన వారికి మాస్క్ లు, శానిటీసర్ల సరఫరా రూపంలో గణనీయమైన విరాళాలు కూడా ఇచ్చింది. అలాగే అదనంగా, ఎస్బీఐ ఉద్యోగులు ప్రధాని-కేర్స్ ఫండ్ కు రూ.107 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే! -
ఎస్బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది?
మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు రికరింగ్ డిపాజిట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉండదు. 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు మీరు రికరింగ్ డిపాజిట్ సేవలను పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు వస్తుందో.. అదే వడ్డీ రేటు ఆర్డీ ఖాతాలపై కూడా వస్తుంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పోస్టాఫీస్లలో కూడా ఆర్డీ ఖాతాలను తెరవచ్చు. ఆర్డీ కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్ మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకుంటాడు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీతో సహ కలిపి వినియోగదారులకు తిరిగి చెల్లిస్తారు. పోస్టాఫీస్: జనవరి 1, 2021 నుంచి పోస్టాఫీస్ లో ప్రతి ఆర్ధిక సంవత్సరానికి 5.8 శాతం వడ్డీరేటును పొదుపు చేసిన సొమ్ముపై అందిస్తుంది. దీనికి 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అకౌంట్ తెరవడానికి కనీసం నెలకు రూ.10 కట్టినా సరిపోతుంది. మీ డబ్బుకు రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది. ఎస్బీఐ: ఎస్బీఐ ఆర్డీ వడ్డీ రేటు సాధారణ ఖాతాదారులకు 5 నుంచి 5.4శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు కలుపుతారు. ఈ వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుంచి వర్తిస్తాయి. ఎస్బీఐ ఆర్డీ మెచ్యూరిటీ పీరియడ్ 1 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. నెలకు కనీసం రూ.100 నుంచి పొదుపు చేయవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఆర్డీలకు 5.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. మొదటి రెండు సంవత్సరాలకు - 4.9 శాతం వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు - 5.1%, 3 - 5 సంవత్సరాల వరకు - 5.3%, 5 - 10 సంవత్సరాల వరకు - 5.4 శాతం వడ్డీ రేటు ఉంటుంది. చదవండి: ల్యాప్టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి! -
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కెవైసీ(నో యువర్ కస్టమర్) పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరించింది. మీకు కెవైసీ ఏమైనా కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వాటి గురుంచి సైబర్ క్రైమ్ కు తెలియయజేయలని కోరింది. ట్విట్టర్ లో ఒక పోస్టులో "ఎస్బీఐ కెవైసీ పేరుతో జరుగుతున్న మోసం దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుందని. అటువంటి మోసగాళ్లు ఎస్బీఐ ప్రతినిధి పేరుతో పంపిన ఎటువంటి లింక్ పై క్లిక్ చేయవద్దు అని కోరింది". స్కామర్లు టెక్స్ట్ సందేశంలో లింక్ పంపడం, కెవైసీని అప్ డేట్ చేయమని టార్గెట్ వ్యక్తిని అడగడం ద్వారా మోసం చేస్తారని బ్యాంక్ వివరించింది. ఈ విపరీతమైన నేర కార్యకలాపాల గురించి http://cybercrime.gov.in కి నివేదించండి అని అంది. ఈ కరోనా మహమ్మరి కాలంలో ఇటువంటి మోసాలు భారీగా పేరుగుతున్నట్లు సైబర్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితో షేర్ చేయవద్దు అని బ్యాంక్ తెలియయజేస్తుంది. అలాగే ఎస్బీఐ పేరుతో ఇతర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను కోరింది. The reality of KYC fraud has proliferated across the country. The target is sent a text message asking to update their #KYC by clicking on a link by someone acting as a bank/company representative. Report such scams at https://t.co/3Dh42iwLvh#CyberCrime #StaySafeStayVigilant pic.twitter.com/Z2UGRFYrol — State Bank of India (@TheOfficialSBI) June 26, 2021 చదవండి: ఆధార్ కు కూడా మాస్క్.. ఇక మీ ఆధార్ నెంబర్ మరింత సురక్షితం!