transgender
-
Transgender Dipu: ఎనిమిదేళ్ల క్రితం వివాహం
అనకాపల్లి టౌన్/కశింకోట/మునగపాక: బయ్యవరం వద్ద లభించిన శరీర భాగాలతో వెలుగు చూసిన వ్యక్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బుధవారం మరో రెండు చోట్ల మిగతా శరీర భాగాలు లభ్యం కావడంతో హత్యకు గురైన వ్యక్తిని ట్రాన్స్జెండర్గా గుర్తించారు. బయ్యవరం వద్ద జాతీయ రహదారి వంతెన కింద మంగళవారం ఒక చేయితోపాటు నడుం కింద శరీర భాగాలతో ఉన్న మూట దొరకడంతో గుర్తు తెలియని మహిళ హత్యగా భావించిన పోలీసులు వాటిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి భద్రపరిచిన సంగతి తెలిసిందే. ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాలు మృతదేహం మిగిలిన భాగాల కోసం గాలింపు చేపట్టాయి. అనకాపల్లిలో డైట్ కళాశాల వద్ద జాతీయ రహదారి పక్కన జలగల మదుం వద్ద కాలువలో హతురాలి తల భాగం, ఎడమ చేయి లభ్యమయ్యాయి. మండలంలోని తాళ్లపాలెం జాతీయ రహదారి వంతెన దిగువన మొండెం భాగం సంచిలో లభ్యమైంది. వీటిని పరిశీలించి హత్యకు గురైన వ్యక్తిని అనకాపల్లి గవరపాలెం ముత్రాసు కాలనీకి చెందిన మైపల దిలీప్ శివశంకర్ అలియాస్ దీపు (40)గా గుర్తించారు. ప్రత్యేక బృందాలు విచారిస్తున్నట్లు స్థానిక సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. హత్యకు కారకునిగా భావిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన నిందితుడ్ని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నట్లు సమాచారం.ఎనిమిదేళ్ల క్రితం వివాహంపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తితో 8 సంవత్సరాల క్రితం దీపు వివాహం చేసుకొని మునగపాక మండలం నాగులాపల్లి వద్ద నివాసముంటున్నారు. ఆనవాళ్లను బట్టి పోలీసులు మృతదేహాన్ని గుర్తించి నాగులాపల్లిలోని దీపు ఇంటికి క్లూస్ టీమ్ను తీసుకొని వెళ్లారు. గదిలో ఎటువంటి ఆనవాళ్లు లేకుండా నిందితుడు జాగ్రత్త పడినట్టు తెలిసింది. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బుధవారం అనకాపల్లికి చెందిన హిజ్రాలందరూ తమ వర్గానికి చెందిన వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. నిందితులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, లేనిపక్షంలో తమ సంఘానికి అప్పగించాలని ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి ర్యాలీగా నెహ్రుచౌక్కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు కొండబాబు, భారతమ్మలు మాట్లాడుతూ నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి, దీపు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారన్నారు. హత్య జరిగిన ముందు రోజు కూడా కలిసే ఉన్నారని తెలిపారు. గతంలో హిజ్రాలపై హత్యలు జరిగినప్పటికీ నేటి వరకూ పోలీసులు పట్టించుకోలేదని రోజురోజుకు హిజ్రాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అనంతరం నెహ్రుచౌక్ నుంచి ర్యాలీగా వచ్చి డీఎస్పీ శ్రావణితో హిజ్రాలు మాట్లాడారు. -
ట్రాన్స్జెండర్ పల్లవితో ప్రేమ..
గద్వాల క్రైం: ట్రాన్స్జెండర్తో ప్రేమ వ్యవహారం చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రాన్స్జెండర్ను ప్రేమించి చివరకు పురుగుమందు తాగి బలవనర్మణానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. మృతుడి తల్లి శంకుతుల, పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు... గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్(25) అనే యువకుడు, ట్రాన్స్జెండర్(రవి అలియాస్ పల్లవి) ఇద్దరు స్నేహితులు. కాగా వారిద్దరు ఇటీవలే ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు గుర్తుగా నవీన్ తన చెస్ట్ (ఎడమ వైపు) ట్రాన్స్జెండర్ పల్లవి(రవి) టాటును సైతం వేయించుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు సిఫార్సు చేశారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా అందించినా పరిస్థితి మెరుగు పడకపోలేదు. చేసేదేమీ లేక గురువారం రాత్రి తిరిగి గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా.. ఇక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈ విషయం ప్రస్తుతం గద్వాల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే మృతుడి రెండు కాళ్లు, తోడలు, సున్నితమైన ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. గాయాలను పరిశీలిస్తే వేడి చేసిన వస్తువుతో వాతలు పెట్టినట్లు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. దీంతో మృతుడి తల్లి తన కుమారుడు పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోలేదని, చిత్రహింసలు పెట్టారని అనుమా నం వ్యక్తం చేసింది. ఈమేరకు ట్రాన్స్జెండర్ పల్లవి అలియాస్ రవి, నరేష్ పై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. పక్కా వ్యూహ రచనతోనే? ట్రాన్స్జెండర్ (పల్లవి) రవి, నవీన్లు ఇద్దరూ గతంలో చింతలపేటకాలనీలోనే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం రవి కాలనీ వదిలి వెళ్లిపోయి ట్రాన్స్జెండర్గా మారి పట్టణ శివారులో హమాలీ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకున్నాడు. నవీన్ జిల్లాకేంద్రంలోని ఓ ఫైనాన్సియర్ వద్ద కలెక్షన్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఈ క్రమంలో పల్లవితో నవీన్ ప్రేమలో పడ్డాడు. ఈ నేపథ్యంలో పల్లవిని డబ్బులు యాచించేందుకు బయటికి వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 4న అర్ధరాత్రి వేళ నవీన్ను పల్లవి (రవి) తమ్ముడు నరేష్ ఇంటి వద్దకు వచ్చి స్కూటీపై ఎక్కించుకు వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోలు సైతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో పక్కా వ్యూహరచనతోనే నవీన్ను చిత్రహింసలకు గురి చేసి హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువురి మధ్య సంబంధాలపై ఆరా.. నవీన్ మృతిపై అతడి తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశాం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తాం. ట్రాన్స్జెండర్ పల్లవిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తాం. ఈ నెల 4న జరిగిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుటాం. – కళ్యాణ్కుమార్, పట్టణ ఎస్ఐ, గద్వాల Mettuguda Incident: అంతా కట్టుకథేనా! -
నేను నటినే!
కార్లా సోఫియా గాస్కాన్... ఆస్కార్ నామినేషన్స్లో మొట్టమొదటి ట్రాన్స్గా స్థానం దక్కించుకొని, చరిత్ర సృష్టించింది. మ్యూజికల్ క్రైమ్ ఫిల్మ్ ‘ఎమీలీయా పెరెజ్’ చిత్రంలో టైటిల్ క్యారెక్టర్ పోషించి, ఉత్తమ నటిగా కార్లా ఆస్కార్కు ఎన్నికైంది. మొత్తం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమనే తనవైపు తిప్పుకున్న, కార్లా పుట్టింది స్పెయిన్లోని ఆల్కోబెండాస్లో. పదహారేళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, లండన్లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని నటిగా మారింది. హాస్య చిత్రం ‘ది నోబుల్ ఫ్యామిలీ’ విజయంతో ఇక వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలు, సిరీస్లు చేస్తూ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూనే ఉంది. 2024లో విడుదలైన ‘ఎమిలియా పెరెజ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు, ఉత్తమ నటిగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు’, ‘యూరోపియన్ ఫిల్మ్ అవార్డు’లను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు ఆస్కార్ బరిలోనూ నిలిచింది. అయితే, కాలం మారినా, సమాజం మారలేదు అన్నట్లు సోషల్ మీడియాలో ‘ఆమె ‘ఉత్తమ నటి’ లేదా ‘ఉత్తమ నటుడు’గా నామినేట్ చేశారో తెలియటం లేదు’ అని ప్రశ్నించిన ఒక అభిమానికి కార్లా ‘‘మేడమ్, నేను నటిని! సినిమాల్లో రాక్షసుడిగా, కుక్కగా ఇలా ఏ పాత్రలో నటించినా, నేను ‘నటి’గానే నామినేట్ అవుతాను’’ అని స్పందించింది. -
జనారణ్యం గెలిచి అరణ్యానికి రక్షణగా... ట్రాన్స్ విమెన్ సక్సెస్ జర్నీ
‘ఆత్మహత్య తప్ప నాకు మరోదారి లేదు’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు సాహసాల దారిలో ప్రయాణం చేస్తోంది. ‘ఇతరులతో పోల్చితే నేను జీరో. ఏమీ సాధించలేను’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు హీరోగా ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది. ప్రభుత్వం ద్వారా ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ అందుకున్న తొలివ్యక్తిగా గుర్తింపు పొందిన విజయ వాసవే ఇప్పుడు మహారాష్ట్ర అటవీశాఖ ఫారెస్ట్ గార్డుగా నియమితురాలైన తొలి ట్రాన్స్జెండర్ మహిళగా చరిత్ర సృష్టించింది...గత సంవత్సరం ఉద్యోగాల నోటిఫికేషన్ను చూసి దరఖాస్తు చేసింది విజయ. ఇలా దరఖాస్తు చేసిన ఏకైక ట్రాన్స్ ఉమన్ ఆమె. దరఖాస్తు మాట ఎలా ఉన్నా... ఆమె ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి.‘ఈ ఉద్యోగం నీలాంటి వాళ్ల కోసం కాదు’ అన్నట్లుగా ఉండేవి కొందరి మాటలు. అలాంటి మాటలు తనని పట్టుదలగా మరింత ముందుకు నడిపించాయి. సాంకేతిక అడ్డంకులను అధిగమించడానికి హైకోర్టు వరకు వెళ్లింది. ఉద్యోగాలు చేయడం విజయకు కొత్తేమీ కాదు... అయితే తాను దరఖాస్తు చేసిన ఉద్యోగానికి రాత, శారీరక పరీక్షలలో విజయం సాధించాలి. ఈ సవాలును అధిగమించడానికి జల్గావ్లోని దీప్స్తంభ్ ఫౌండేషన్ విజయకు సహాయపడింది. ఇద్దరు సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఆమెకు తగిన సూచనలు ఇచ్చారు.ఎన్నో సవాళ్లను అధిగమించి విజయం సొంతం చేసుకున్న విజయ ఇప్పుడు నందుర్బార్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది. గిరిజన కుటుంబంలో పుట్టిన విజయ ఆశ్రమ పాఠశాలలో చదువుకునే రోజులలో ఎంతోమంది నుంచి తీవ్రమైన వెక్కిరింపులు, వేధింపులు ఎదుర్కొనేది. తోటి విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎగతాళిగా మాట్లాడేవారు. మానసిక, శారీరక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుండేవి. నాసిక్లో కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక సభకు హాజరైంది. ఆ సభలో బిందుమాధవ్ ఖిరే అనే ఉద్యమ కార్యకర్త ఉపన్యాసం తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.‘ఈ సభకు హాజరు కావడానికి ముందు నాలో ఎంతో ఆత్మన్యూనత ఉండేది. నేను ఏదీ సాధించలేను అనే అకారణ భయం ఉండేది’ అంటుంది విజయ గతాన్ని గుర్తుతెచ్చుకుంటూ.‘బతుకంటే నిత్య పోరాటం’ అనే సత్యాన్ని తెలుసుకున్న విజయ ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత పుణెలోని కార్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ‘మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్’లో అడ్మిషన్ పొందింది. నందుర్బార్ ప్రాంతంలో ‘ఈ అమ్మాయి మొదట అబ్బాయట’ అంటూ ఆశ్చర్యంగా ప్రజలు మాట్లాడుకోవడం మాట ఎలా ఉన్నా... విజయ స్ట్రగుల్ గురించి తెలుసుకున్న తరువాత ‘బేష్’ అంటున్నారు.తన జీవితంలో ఎక్కువ భాగం పుణెలాంటి కాస్మోపాలిటన్ సిటీలో గడిపిన విజయకు అపరిచిత ప్రాంతంలో ఫారెస్ట్ గార్డ్గా విధులు నిర్వహించడం సవాలు కావచ్చు. అయితే ఆమెకు సవాలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కూడా కొత్తకాదు. ఒకప్పుడు తనలాగా ఆత్మన్యూనతతో బాధపడుతున్న వారిలో, ఆశ కొడిగడుతున్న వారిలో సోషల్ మీడియా వేదికగా ధైర్యాన్ని ఇస్తోంది, ఉత్సాహాన్ని నింపుతుంది విజయ వాసవే.బాల్యం అంటే బంగారు కాలం. అయితే నా బాల్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. చీకట్లో ఉంటే చీకటే కనిపిస్తుంది. వెలుగును చూడాలనే పట్టుదల ఉంటే చీకటి దూరం అవుతుంది. నేను సాధించింది చిన్న విజయమా, పెద్ద విజయమా అనేదాని కంటే ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కూడా ముందుకువెళ్లవచ్చు అని నిరూపించిన విజయం. ఒకప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ బాటిల్ ఎప్పుడూ నాకు అందుబాటులో ఉండేలా చూసుకునేదాన్ని. అవమానాలు తట్టుకోలేనంత బాధ నాలో ఉన్నప్పుడు బాటిల్ మూత తీసి తాగాలని అనుకున్నాను. మూత తీసే సందర్భాలు ఎన్నో వచ్చినా నాకు నేను ధైర్యం చెప్పుకునేదాన్ని. చివరికి నాకు బాటిల్తో పనిలేకుండాపోయింది. ఇప్పుడు బ్యాటిల్పై మాత్రమే నా దృష్టి. – విజయ వాసవే ట్రాన్స్జెండర్ -
ట్రాన్స్జెండర్తో మార్కెటింగ్... గూగుల్ క్రిస్మస్ ప్రకటనపై వివాదం
మహిళల సంబంధ వస్తువులకు సంబంధించిన ప్రకటనను ట్రాన్స్జెండర్తో రూపొందించాలన్న టెక్ దిగ్గజం గూగుల్ ‘వినూత్న’ ఐడియా బెడిసికొట్టింది. దానిపై మహిళాలోకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. క్రిస్మస్ వేళ ఇలాంటి యాడ్ ఎందుకు తెచ్చారంటూ దుమ్మెత్తిపోశారు. అందమైన మహిళలే లేనట్టు ట్రాన్స్జెండర్తో యాడ్ చేస్తారా అంటూ నెటిజన్లు కూడా గూగుల్పై మండిపడుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా గూగుల్ తన సొంత షాపింగ్ వేదిక ‘గూగుల్ షాపింగ్’లో మహిళల ఉత్పత్తులను ప్రమోషన్కు ఒక యాడ్ సిద్ధం చేసింది. టిక్టాక్లో పేరొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ 30 ఏళ్ల సైరస్ వెస్సీని ప్రచారకర్తగా ఎంచుకుంది. చంపేసే చలిలో అత్యంత నాణ్యమైన మేకప్, చర్మ సంబంధ ఉపకరణాలు, దుస్తులను తక్కువ ధరకే కొనుక్కోండంటూ వెస్సీతో ఒక యాడ్ డిజైన్ చేసి ఆన్లైన్ ప్రసారాలు మొదలెట్టారు. కానీ అందులో ట్రాన్స్జెండర్ నటించడంతో ఆదరణ దేవుడెరుగు, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది దారుణమైన అజెండాతో రూపొందించిన యాడ్. అమ్మాయిలను అవమానించాలని చేసినట్టుగా ఉంది’’ అంటూ పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత ఓలీ లండన్ అన్నారు. దాంతో, మహిళలను కించపరచాలనే దురుద్దేశమేదీ లేదంటూ గూగుల్ వివరణ ఇచి్చంది. సోషల్ మీడియాలో పేరొందిన ‘విభిన్న’ వ్యక్తులతో యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా రూపొందించినట్టు చెప్పుకొచ్చింది. – వాషింగ్టన్ -
ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్లు.. నియామక పత్రాలు అందించనున్న సీఎం
సాక్షి,హైదరాబాద్ : సమాజంలో గుర్తింపు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ట్రాన్స్జెండర్ల జీవితాల్లో వెలుగు నింపనుంది. గోషమహల్ స్టేడియంలో శిక్షణ పూర్తి చేసిన 44 మంది ట్రాన్స్ జెండర్లు సీఎం రేవంత్రెడ్డి చేతులు మీదిగా నియామక పత్రాలను అందుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేసింది. సోషల్ వెల్ఫేర్ శాఖ ఇచ్చిన అభ్యర్థుల జాబితా ప్రకారం మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్లకు బుధవారం ఫిజికల్ ఈవెంట్ నిర్వహించింది. అందులో 44 మంది ఎంపికైనట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ 44 మంది ట్రాన్స్జెండర్లకు సీఎం రేవంత్రెడ్డి మరికొద్ది సేపట్లో నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం, వారు ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించనున్నారు. -
హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్.. హాసిని హత్య వెనుక...
కొడవలూరు: మండలంలోని టపాతోపు అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి హత్యకు గురైన మానికల హాసిని (33) చిన్నప్రాయంలోనే తక్కువ సమయంలోనే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, చెన్నై, కర్ణాటక ప్రాంతాల్లోని సుమారు పది వేల మందికి హాసిని నాయకురాలుగా ఎదిగింది. ఆమె ఎదుగుదలను జీరి్ణంచుకోలేని హిజ్రాల్లోనే మరోవర్గం ఈ కిరాతకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గిరిజన కాలనీకి చెందిన మానికల శ్రీనివాసులు, విజయమ్మ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లవాడు. మధ్య సంతానంగా మగ పిల్లవాడిగా జన్మించిన సుదీప్ మొదటి నుంచి తేడాగా ఉండేవాడు. తండ్రి టైలర్ కాగా, తల్లి విజయమ్మ వ్యవసాయ పనులకు వెళుతూ ముగ్గురు పిల్లలను చదివించారు. ఏడో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలోనే చదివిన సుదీప్ ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు. అప్పటికే హిజ్రా లక్షణాలు కలిగి ఉన్న సుదీప్ హిజ్రాలతో పరిచయం పెంచుకుని పూర్తిగా హిజ్రాగా మారి హాసినిగా పేరు మార్చుకున్నారు. ఆకర్షణీయంగా కనిపించే హాసిని హిజ్రాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ నాయకత్వ బాధ్యతలు తీసుకుంది. ఆర్థికంగా స్థిరపడ్డాక కుటుంబాన్ని తిరుపతికి మార్చుకుంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో హిజ్రాల సమస్యలపై తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్థికంగానూ బలపడడంతో నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఒక ఇల్లు, రాజీవ్గాంధీనగర్లో రెండు ఇళ్లు, తిరుపతిలో ఒక ఇల్లు నిర్మించుకున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు చిన్నచెరుకూరులో ఇల్లు నిర్మించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేదని సమాచారం. హాసిని తల్లి స్వగ్రామం విడవలూరు మండలం పార్లపల్లిలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించింది. నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో మంగళవారం జరిగిన అభిషేకాలు, పూజలకు హాసిని తన సహచర హిజ్రాలు 20 మందిని తీసుకెళ్లారు. అక్కడ రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు, పూజల అనంతరం అక్కడి నుంచి నెల్లూరుకు బయలు దేరారు. హాసిని కారులో వస్తుండగా సహచరులు ఆటోల్లో వెనుక అనుసరించారు. టపాతోపు అండర్ పాస్ వద్ద రెండు కార్లలో కాపుకాచిన ఆరుగురు వ్యక్తులు అటకాయించి కారులో ఉన్న హాసిని మెడపై విచక్షణా రహితంగా నరికి పారిపోయారు. వెనుక ఆటోల్లో వచ్చిన సహచరులు గమనించి చూడగా హాసిని రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే హాసిని మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల అదుపులో నిందితులు?సాక్షి, టాస్క్ఫోర్స్: సంచలనం రేకెత్తించిన హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొడవలూరు ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరురూరల్ మండలానికి చెందిన ఓ యువకుడు ఓ హిజ్రా గ్యాంగ్లో ఉన్న హిజ్రా తో సహజీవనం చేస్తున్నారు. ఆ యువకుడిని హాసిని, ఆమె అనుచరులు పలుమార్లు అందరి ముందు తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకున్న సదరు యువకుడు తన సహచరులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సాంకేతికత ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. హాసిని ఆదిపత్యాన్ని కొందరు హిజ్రాలూ వ్యతిరేకిస్తున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా హాసినిని దూషిస్తూ పోస్టులు పెట్టడం, బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.కలకలం రేపిన హిజ్రా హాసిని హత్యహంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలిమార్చురీ ఎదుట సహచరుల ధర్నాపోస్టుమార్టం అనంతరం అశ్రునయనాల మధ్య మృతదేహం తిరుపతికి తరలింపునెల్లూరు(క్రైమ్): జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన హిజ్రా హాసిని హత్యోదంతం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కలకలం రేకెత్తించింది. ఆమె సహచరులు కడప, చిత్తూరు, తిరుపతి, తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బుధవారం తెల్లవారు జామునే నెల్లూరుకు చేరుకున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హాసిని మృతదేహం జీజీహెచ్ మార్చురీలో ఉండడంతో కొందరు అక్కడికి వచ్చి అక్కడే బైఠాయించగా మరికొందరు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఆయన ఇంటి వద్ద కలిశారు. తమ నాయకురాలు హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. చట్ట ప్రకారం విచారణ జరిపి నిందితులను శిక్షిస్తామని డీఎస్పీ వెల్లడించడంతో జీజీహెచ్లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధితులకు అప్పగించారు. అశ్రునయనాల మధ్య హాసిని మృతదేహాన్ని అంబులెన్స్లో తిరుపతికి తరలించారు. మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దర్గామిట్ట ఇన్స్పెక్టర్ రోశయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ బాబు తమ సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ట్రాన్స్జెండర్లూ మహిళలేనా?
మహిళ అంటే ఎవరు? ఒక వ్యక్తి స్త్రీ అని నిర్ధారించేందుకు ప్రాతిపదిక ఏమిటి? జన్మతః సంక్రమించిన లైంగికత మాత్రమేనా? లింగ మార్పిడితో మహిళగా మారిన వాళ్లు కూడా ‘స్త్రీ’అనే నిర్వచనం కిందకు వస్తారా? తద్వారా మహిళలకు వర్తించే హక్కులన్నీ వారికీ వర్తిస్తాయా? అత్యంత సంక్లిష్టమైన ఈ అంశాలను తేల్చాల్సిన బాధ్యత బ్రిటన్ సుప్రీంకోర్టుపై పడింది. అతి వివాదాస్పదమైన ఈ అంశంపై జోరుగా కోర్టులో వాద వివాదాలు జరుగుతున్నాయి. ఒకరకంగా ‘మహిళ వర్సెస్ మహిళ’అని చెప్పదగ్గ న్యాయపోరాటం జరుగుతోంది. స్త్రీగా గుర్తింపు సర్టిఫికెట్ ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తిని సమానత్వ చట్టాల ప్రకారం మహిళగా పరిగణించవచ్చా, లేదా అన్నది ఈ కేసు. బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు దీనిపై మంగళవారం లోతైన వాదనలు సాగాయి. అవి బుధవారమూ కొనసాగాయి. ఇక న్యాయమూర్తులు తీర్పు వెలువరించడమే మిగిలింది. అందుకు రెండు వారాలు పట్టవచ్చు. రాబోయే తీర్పు బ్రిటన్తో పాటు ప్రపంచమంతటా లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారిన వారి గుర్తింపును, హక్కులు తదితరాలపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఏమిటీ కేసు? నిజానికి మహిళా హక్కుల ఉద్యమకారులకు, స్కాట్రండ్ ప్రభుత్వానికి దీర్ఘకాలంగా సాగుతున్న వివాదమిది. స్కాట్లాండ్ ప్రభుత్వ రంగ సంస్థళ బోర్డుల్లో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా 2018లో అక్కడి ట్లాండ్ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. లింగమారి్పడి ద్వారా మహిళలుగా మారిన వారిని కూడా ఈ చట్టం ప్రకారం ‘స్త్రీ’నిర్వచన పరిధిలో చేర్చారు. దీన్ని స్కాటిష్ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ‘మహిళ’ను పునరి్నర్వచించే అధికారం పార్లమెంటుకు లేదన్నది వారి వాదన. ‘‘ఈ చట్టం అమలైతే బోర్డుల్లో 50 శాతం మంది పురుషులతో పాటు మిగతా 50 శాతం కూడా మహిళలుగా మారిన పురుషులే ఉంటారు. అది మహిళా ప్రాతినిధ్య లక్ష్యాలకే గొడ్డలిపెట్టు’’అని ‘ఫర్ విమెన్ స్కాట్లాండ్’(ఎఫ్డబ్ల్యూఎస్) అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అంటోంది. అంతిమంగా ఇది మహిళల రక్షణకూ విఘాతమమేనన్ని వాదిస్తోంది. ఈ చట్టాన్ని స్కాట్లాండ్ కోర్టులో సవాలు చేయగా చుక్కెదురైంది. ఈ కేసును కోర్టు తిరస్కరించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడానికి గతేడాది అనుమతించింది. అలా బంతి బ్రిటన్ సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం: ఆమ్నెస్టీ సమానత్వ చట్టం ప్రకారం లైంగికత తల్లి గర్భంలోనే నిర్ణయమవుతుందని ఎఫ్డబ్ల్యూఎస్ తరపు న్యాయవాది అంటున్నారు. పుట్టిన అనంతరం దాన్ని మార్చడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. దీనితో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో సహా పలు మానవహక్కుల సంఘాలు విభేదిస్తున్నాయి. ‘‘జెండర్ అనేది శారీరక వ్యక్తీకరణ. లింగ గుర్తింపు సరి్టఫికెటున్న ట్రాన్స్జెండర్లకు మహిళల హక్కులను నిషేధించడం మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధం’’అని అవి అంటున్నారు. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని బ్రిటన్ సుప్రీంకోర్టును ఆమ్నెస్టీ లిఖితపూర్వకంగా కోరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గేలి చేసినచోటే గెలిచి చూపిద్దాం!
ఆనందం ఎక్కడ ఉంటుందో ఆత్మస్థైర్యం అక్కడ ఉంటుంది. ఆత్మస్థైర్యం కొలువైన చోట అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. విజయానికి సింహద్వారాన్ని చూపిస్తాయి.శారీరక మార్పుల వల్ల లింగమార్పిడికి ముందు, లింగ మార్పిడి తరువాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది శ్వేతాసుధాకర్. అవమానాలు, కష్టాలలో ఆమె జపించిన మంత్రం... ‘జీవితం ఒక్కటే. బార్న్ 2 విన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్త, రచయిత, మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమంది ట్రాన్స్జెండర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది చెన్నైకి చెందిన శ్వేతా సుధాకర్.వెయ్యి ఏనుగుల బలంతో రోజు మొదలు కావాలి అంటారు. ఆ మాట విషయం ఎలా ఉన్నా శ్వేతకు రోజు మొదలైందంటే దిగులుగా ఉండేది. ‘ఈరోజు ఎన్ని అవమానాలు పడాలో!’ అనుకునేది. చెన్నైలో పుట్టిన శ్వేత సుధాకర్లోని శారీరక మార్పులు చూసి ‘నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందేమిటి... అలా మాట్లాడుతున్నావేమిటీ’... ఇలా రకరకాలుగా వెక్కిరించేవారు. శారీరకంగా వచ్చిన మార్పులతో కుటుంబాన్ని వదిలి లింగమార్పిడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది శ్వేత. ‘చదువును నమ్ముకున్నవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరు’ తాను విన్న మాట ఆ రోజు పదే పదే గుర్తు వచ్చింది. ఇక అప్పటినుంచి చదువు తన నేస్తం అయింది. ఆత్మీయత పంచే కుటుంబం అయింది. ధైర్యం ఇచ్చే గురువు అయింది. మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. సోషియాలజీ చేసిన శ్వేతాసుధాకర్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకోలేదు. ఒక ఉద్యమంలా తనలాంటి వారి కోసం విస్తరించాలనుకుంది. ‘బార్న్ 2 విన్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. అయితే చెన్నైలో సంస్థ కార్యాలయం కోసం గదిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మానవతావాది సహాయంతో చెన్నైలోని సైదాపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది శ్వేత. (క్రేజీ.. డీజే..)గురుకులం...ఇప్పుడు ఈ కార్యాలయం వందలాది మంది ట్రాన్స్జెండర్లకు రణక్షేత్రం. ‘ఇదిగో... జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఇలా యుద్ధం చేయాలి’ అని నేర్పుతుంది. ‘చింతవద్దు. నువ్వు బతికేమార్గాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఉపాధి విద్యలను నేర్పే గురుకులం అవుతోంది. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించడంతో పాటు విద్య, ఉపాధి, లైఫ్స్కిల్స్... మొదలైన వాటిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైలరింగ్, కాస్మోటాలజీ, ఫ్యాషన్ డిజైన్కోర్సులతో ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్దుతుంది శ్వేతా సుధాకర్.ట్రాన్స్ అచీవర్స్ అవార్డ్తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది బార్న్ 2 విన్. శ్రీలంక నుంచి మొదలు యూరప్లోని ఎన్నో దేశాల వరకు వివిధ రంగాలలో రాణిస్తున్న ట్రాన్స్జెండర్లను గత పదకొండు సంవత్సరాలుగా ‘ట్రాన్స్ అచీవర్స్’ అవార్డులతో సత్కరిస్తోంది శ్వేత. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం లాంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతూ ‘శ్వేతా టాక్ షో’ పేరుతో ట్రాన్స్ మీడియా యూ ట్యూబ్ను నిర్వహిస్తోంది. ‘మిస్ తమిళనాడు ట్రాన్స్ క్వీన్ ప్రొగ్రామ్ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘బార్న్ 2 విన్ అనేది సంస్థ కాదు. మా కుటుంబం. అది నాకు ఇచ్చిన ధైర్యం ఇంతా అంతా కాదు’ అంటుంది సుప్రియ. నిజానికి ఇది ఆమె మాటే కాదు ‘బార్న్ 2 విన్’ ద్వారా గెలుపు పాఠాలు నేర్చుకున్న ఎందరో విజేతల మాట.మన కోసం మనంకుటుంబాన్ని వదిలి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ ఒంటరి రోజులలో పుస్తకాలు నా కుటుంబసభ్యులు అయ్యాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే చదువు ద్వారా ఎంతోమందికి ధైర్యం వచ్చేలా చేస్తున్నాను. ‘నా కోసం ఏదీ లేదు. నా కోసం ఎవరూ లేరు’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ విశాల ప్రపంచంలో మన కోసం ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని వెదుక్కోగలగాలి. వాటిని వెదకాలంటే బలం కావాలి. ఆ బలం జీవనోత్సాహం నుంచి వస్తుంది. అందుకే నిరాశానిస్పృహలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు ‘బార్న్ 2 విన్’ రూపంలో నాకంటూ ఒక కుటుంబం ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో గుర్తింపు దొరికింది.– శ్వేతా సుధాకర్, బార్న్ 2 విన్–ఫౌండర్అక్షర బలంశ్వేతా సుధాకర్ మంచి వక్త మాత్రమే కాదు రచయిత్రి కూడా. నిండైన భావుకత, చక్కని శైలి ఆమె అక్షరబలం. ‘నన్గై స్వేతాసీ’ పేరుతో హిజ్రాల జీవితాలపై ‘ఇయర్కై ఎలిదియ ఎలుత్తు పిలయ్(ప్రకృతి రాసిన అక్షర దోషం)’, కూందలుం... మీసయుం (శిరోజాలు..మీసాలు), వానం పాత్త తారగయే (ఆకాశం చూసిన తార), తర్కొలై దాహంగల్ (ఆత్మహత్యా దాహం), కల్యాణ కనువుగల్ (పెళ్లి కలలు)... మొదలైన పుస్తకాలను తన ‘నన్గై పబ్లికేషన్స్’ ద్వారా ప్రచురించింది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
ట్రాన్స్ విమెన్కి రికార్డు స్థాయిలో రూ. 6 లక్షల నష్టపరిహారం..!
ట్రాన్స్జెండర్లు హక్కులను గౌరవించమని, తాము మనుషులమే అని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు, పోరాటాలు చేశారు. సుప్రీంకోర్టు సైతం వాళ్లకు కూడా కొన్ని హక్కులను ప్రసాదించింది. వారికి సమాజంలో సుమచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలని స్పష్టం చేసింది కూడా. కానీ ఎక్కడో ఒక చోట వారిపై దాడులు, లింగ వివక్షత వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. చెప్పాలంటే వారి విషయంలో సమాజం తీరు చాలావరకు మారాల్సి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి వివిధ దేశాల్లో కూడా ఉండటం బాధకరం. కొన్ని దేశాలు వారిపట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తాయి. కనీసం వారి హక్కులకు కూడా ప్రాధాన్యత ఇవ్వదు. అలాంటి ఓ దేశం ఓ ట్రాన్స్ విమెన్ కేసుకి ప్రాధాన్యత ఇవ్వడమే సత్వరమే ఆమెకు న్యాయం జరిగేలా చేసింది. ఈ ఘటనను చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ సంఘటన ఏ దేశంలో చోటు చేసుకుందంటే..చైనాకు చెందిన ట్రాన్స్ విమెన్ మగవాడిగా జన్మించి.. స్త్రీగా మారింది. ఇలా ట్రాన్సవిమెన్గా మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు ఆమెను కిన్హువాంగ్డావో సిటీ ఫిఫ్త్ అనే మెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఏదో మానసిక సమస్య వల్ల ఇలా చేసిందంటూ ఇదివరకటి వ్యక్తిలీ మార్చేలా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పారు. అక్కడ నుంచి ఆమెకు మొదలైన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ సిబ్బందితో సహా వైద్యులంతా తన ధోరణిని తప్పుపడుతూ బలవంతంగా మార్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఎవ్వరూ ఆమెను విభిన్న లింగానికి చెందినదిగా అంగీకరించపోగా, హేళనలు, చిత్కారాలతో ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. ఆ నిమిత్తమైన సుమారు 97 రోజుల పాటు ఏడు సెషన్ల ఎలక్ట్రోషాక్ థెరపీ అందించారు. దీని కారణంగా మూర్చ(ఫిట్స్) వంటి సమస్యలు వచ్చాయి. ఆ ఆస్పత్రి బయట సమాజం అంగీకరించే విధంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తనను శారీరకంగా మానసికంగా ఇబ్బందికి గురిచేసేలా వైద్యం చేశారు. దీని కారణంగా అనారోగ్యం పాలయ్యానంటూ కోర్టుని ఆశ్రయించింది. ట్రాన్స్ జెండర్లకి ప్రాధాన్యత ఇవ్వని చైనా దేశం ఆమె కేసుని టేకప్ చేయడమే కాకుండా సత్వరమే న్యాయం జరిగేలా చూసింది. చైనా మెంటల్ హెల్త్ చట్టాల ప్రకారం..వ్యక్తి ఇష్టానికి లోబడే చికిత్స చేయాలి. అలా కాకుండా వారి ఇష్టంతో సంబంధం లేకుండా ప్రమాదం కలిగించేలా చికిత్స చేస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది చైనా కోర్టు. ఈ మేరకు చాంగ్లీ కౌంటీ పీపుల్స్ కోర్ట్ స్వలింగ సంపర్కులు లేదా ట్రాన్స్ వ్యక్తులను "మార్చడానికి" హానికరమైన మందులు లేదా ఎలక్ట్రోషాక్ పద్ధతులను ఉపయోగించడం నేరం అని స్పష్టం చేసింది. ఆమెను అనారోగ్యం పాలు చేసినందుకు గానూ సదరు హాస్పిటల్ దాదాపు రూ. 6 లక్షలు పైనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పేర్కొంది. (చదవండి: ఫ్యాషన్కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..) -
అమెరికా పార్లమెంట్లో బాత్రూమ్ గొడవ
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్ నేత, ట్రాన్స్జెండర్ సారా మెక్బ్రైడ్పై అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్జెండర్లు ఏ బాత్రూమ్ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్జెండర్ చట్టసభ మెంబర్పై రిపబ్లికన్ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్లోని ఎట్ లార్జ్ హౌస్ డి్రస్టిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్జెండర్గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్రూమ్లోకి అనుమతించబోమని రిపబ్లికన్ నాయకురాలు, సౌత్ కరోలినా ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు. అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్ రూమ్, చేంజింగ్ రూమ్లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్ ప్రోటోకాల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్ డిమాండ్చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు. -
అమెరికా నుంచి వెళ్లిపోతా.. ఎలన్ మస్క్ కుమార్తె
వాషింగ్టన్: అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని, దేశాన్ని వీడి వెళ్తానని ఎలన్ మస్క్ ట్రాన్స్జెండర్ కుమార్తె వివియన్ విల్సన్ ప్రకటించారు. 2022 నుంచి తండ్రికి దూరంగా ఉంటున్న వివియన్.. ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత మెటా థ్రెడ్స్లో తన ఆలోచనలను పంచుకున్నారు. ‘‘నేను కొంతకాలంగా ఈ విషయం మీద ఆలోచిస్తున్నా. నిన్నటిరోజును చూశాక నిర్ణయం తీసుకున్నాను. నేను అమెరికాలో ఉండేలా భవిష్యత్ కనిపించడం లేదు’’అని రాసుకొచ్చారు. దీనిపై మస్క్ స్పందించారు. ‘‘మైండ్ వైరస్ నా కొడుకును చంపేసింది’’అని మరోసారి ట్వీట్ చేశారు. నేను అలసిపోయాను.. మళ్లీ.. తన తండ్రి పోస్ట్ స్క్రీన్ షాట్ను థ్రెడ్స్లో షేర్ చేస్తూ.. ‘‘మీరు ఇప్పటికీ నా బిడ్డ ఏదో ఒక వ్యాధి బారిన పడ్డారంటున్నారు. మీరు నన్ను ద్వేషించడానికి పూర్తిగా కారణం అదే. దయచేసి దాని జోలికి పోవద్దు. ప్రతి సన్నివేశంలో నేను బాధితురాలిని తప్ప మరేమి కాదు. నేను అలసిపోయాను. నాకు విసుగ్గా ఉంది’’అని ఆమె జత చేశారు. ఆ తరువాత మరోపోస్ట్లో... ఒకరిపై అధికారం కోల్పోయాననే తన తండ్రి అలా పిచి్చగా మాట్లాడుతున్నారని వివియన్ పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగా పరిణితి చెందని మీరు భ్రమలో ఉన్నారు, ఒకరి మీద నియంత్రణ కోల్పోయాననే కలతతో ఉన్నారు. మీరెలాంటివారో మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికీ తెలుసు. అది నా సమస్య కాదు’’అని ఆమె తెలిపారు. -
రికార్డు: తొలిసారి అమెరికా సెనేట్కు ట్రాన్స్జెండర్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్స్ కూడా బుధవారం(నవంబర్ 6) వెలువడుతున్నాయి. డెలవేర్లోని ఎట్ లార్జ్హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సెనేట్కు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రాన్స్జెండర్ సారా మెక్బ్రైడ్ విజయం సాధించారు.దీంతో సారా అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా రికార్డులకెక్కారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ 3తో,సారా మెక్బ్రైడ్ పోటీపడ్డారు.ఈ ఎన్నికలో సారాకు 95శాతం ఓట్లు పోలవగా వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.తాను ట్రాన్స్జెండర్గా చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.కాగా,సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్ల డాలర్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2010 నుంచి డెలవేర్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్లో టాపర్గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
నేను నిన్ను మోసం చేసాను..
జవహర్నగర్: ఉరి వేసుకొని ట్రాన్స్జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జవహర్నగర్ కార్పొరేషన్ సంతోష్నగర్ కాలనీలో దొంతి సంతోష్ (31), భార్య బాలమణి, కుమారుడితో కలిసి నివసించేవారు. 2012 సంవత్సరంలో వీరికి వివాహం అయింది. కాగా గత నాలుగు సంవత్సరాల క్రితం సంతోష్ ట్రాన్స్జెండర్గా మారి సరితగా పేరు పెట్టుకున్నాడు. అప్పటి నుండి కుటుంబానికి దూరంగా ఉంటూ వికలాంగుల కాలనీ రేణుకానగర్లో అద్దె ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా ఇటీవల భార్య కుషాయిగూడలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లితో ఉంటోంది. శుక్రవారం ఉదయం ట్రాన్స్జెండర్ సరిత భార్య బాలమణితో వీడియోకాల్లో మాట్లాడారు. ‘నేను నిన్ను మోసం చేశానని, నువు లేకుండా ఉండలేకపోతున్నానని, నువ్వు వెంటనే రావాలని, లేకుంటే చనిపోతానని’ చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేసిన భార్య బాలమణి చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి చెప్పింది. అయితే ఇంటి పక్కనవారు వెళ్లి చూసేసరికి సరిత చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. బాలమణి సంఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే సరిత మృతిచెందింది. తన భర్త ట్రాన్స్జెండర్గా మారి కుటుంబానికి ద్రోహం చేశాడని మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుననారు. -
ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకున్న యువకుడు
గొల్లపల్లి: ట్రాన్స్జెండర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. ఈ ఘటన గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్లో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మ్యాట్నీ మల్లేశం, లత దంపతుల కొడుకు శ్రీనివాస్.. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బాసవేని శంకరయ్య, సుశీల దంపతుల కుమారుడు (ట్రాన్స్జెండర్) అంజలి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం కొన్నాళ్లు గల్ఫ్ వెళ్లాడు. స్వగ్రామానికి రాగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులను ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజే చప్పుళ్ల మధ్య ట్రాన్స్జెండర్లు డ్యాన్స్లతో అదరగొట్టారు. -
దేశంలోనే తొలి ట్రాన్స్ఉమెన్ డైరెక్టర్ సంయుక్త విజయన్ సక్సెస్ స్టోరీ
పొల్లాచ్చిలో పుట్టి శాన్ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన ఈ ట్రాన్స్ ఉమన్ మన దేశ తొలి ట్రాన్స్ ఉమన్ డైరెక్టర్గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీల నిర సూర్యన్’ పేరుతో సినిమా తీయడమే కాదు ముఖ్యపాత్ర పోషించింది. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త పరిచయం. 2016.తమిళనాడు–తిరుచ్చిలోని సొంత ఇంటికి దీపావళి పండక్కు వచ్చిన సంతోష్ అమెరికాకు తిరిగి వెళుతూ ‘అమ్మా... వచ్చే దీపావళికి నేను అమ్మాయిగా వస్తాను’ అని చెప్పాడు. తల్లి ఉలిక్కి పడలేదు. కన్నీరు కార్చలేదు. ‘నీ ఇష్టంరా. నీకెలా సంతోషంగా ఉంటే అలా చెయ్’ అంది. అమెరికాకు వెళ్లాక సంతోష్ ట్రాన్స్ ఉమన్గా మారడానికి అవసరమైన వైద్యం, చికిత్సలు చేయించుకున్నాడు. శనివారం వరకూ అబ్బాయి రూపంలోనే వెళ్లిన సంతోష్ సోమవారం నుంచి ‘సంయుక్త’ గా ఆఫీస్లో అడుగు‘పెట్టింది’. అయితే స్నేహితులు ఎటువంటి తేడా చూపించలేదు. అబ్బాయి సంతోష్తో ఎంత స్నేహంగా ఉన్నారో అమ్మాయి సంయుక్తతో అంత స్నేహంగా ఉన్నారు. ‘అందరి కథ ఇంత సులువుగా ఉండదు. అందుకే సినిమా తీశాను’ అంటుంది సంయుక్త.బీటెక్ గ్రాడ్యుయేట్సంయుక్త తండ్రి టైలర్. తల్లి గృహిణి. ముగ్గురు కుమారుల్లో ఒకడుగా పుట్టాడు సంతోష్. ‘అయితే నా భౌతిక రూపానికి నా మానసిక స్వభావానికి పొంతన కుదరలేదు. నాలోని స్త్రీనే నేను స్వీకరించాను. నా తల్లిదండ్రులు ఇందుకు నన్ను ఇబ్బంది పెట్టకపోయినా బయట నేను సంప్రదాయవాదుల గేలిని, అల్లరిని, అవమానాన్ని భరించాను. ట్రాన్స్పర్సన్ల జీవితం వెండి తెర మీద రావడం తక్కువ. మగవాళ్లు కొందరు ఆ పాత్రలు ధరించారు. ఇటీవల ‘తాలి’ సినిమాలో సుస్మితా సేన్ బాగా చేసింది. కాని నేను ట్రాన్స్ఉమన్గా ఉంటూ సినిమా తీయడం వల్ల మేమూ ఇండస్ట్రీలో మా కథలు చెప్పగలం అని నిరూపించదలుచు కున్నాను’ అంటుంది సంయుక్త.సినిమా అంటే తెలియకపోయినా...‘మా పొల్లాచ్చిలో రోజూ షూటింగ్లే. కాని ఏవీ నేను చూడలేదు. షార్ట్ఫిల్మ్లు తీయలేదు. అసిస్టెంట్గా పని చేయలేదు. 2020లో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలన్న సంగతిని యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకున్నాను. వందల వీడియోలు చూసి రెండేళ్ల పాటు స్క్రిప్ట్ రాశాను. నా జీవితాన్ని, నావంటి వారి జీవితంలోని ఘటనలను కలిపి ‘నీల నిర సూర్యన్’ సినిమా తీశాను. అంటే నీలి రంగు సూర్యుడు అని అర్థం. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది బ్లూ సన్షైన్’ పేరుతో ప్రదర్శితమవుతుంది. తమిళ విడుదల కోసం తమిళ పేరు పెట్టాను’ అని తెలిపింది సంయుక్త.సొంత డబ్బు పెట్టి...సంయుక్త అమెరికాలో అమేజాన్లో ఉన్నత ఉద్యోగంలో ఉంది. తన సంపాదనలోని కొంత భాగాన్ని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. ‘సినిమాల్లో థర్డ్ జెండర్ని హాస్యానికే వాడి అపచారం చేశారు. ఇక మీదైనా ట్రాన్స్పర్సన్లను మర్యాదకరమైన రీతిలో ఇన్క్లూజివ్గా చూపి చేసిన పాపాన్ని కడుక్కోవాలి సినిమావారు. పరిస్థితి ఇంకా చిన్న ఊళ్లలో మారలేదు. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్ని పిల్లలు గౌరవిస్తారు. కాని ఆ టీచర్ ట్రాన్స్ ఉమన్ అయితే తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ΄ోవాలి. నేను తీసిన సినిమా కథ మాలాంటి వాళ్ల అస్తిత్వాన్ని గౌరవించవలసిందిగా అర్థం చేసుకోమని కోరుతుంది’ అందామె.స్త్రీగా మాత్రమేసంయుక్త తనను తాను స్త్రీగా తప్ప ట్రాన్స్జెండర్గా చెప్పడానికి అంగీకరించదు. ‘నేను స్త్రీగా మారదల్చుకున్నాను. మారాను. కనుక నా ఆధార్ కార్డులో స్త్రీ అనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ట్రాన్స్జెండర్ అనే అస్తిత్వం అవసరమైతే దానిని కొందరు స్వీకరించవచ్చు. కాని నేను పూర్తిగా స్త్రీ అస్తిత్వంతో ఉండాలని కోరుకుంటాను’ అంటుంది సంయుక్త. ఆమె మంచి భరతనాట్య కళాకారిణి. చెన్నయ్లో ఆరంగేట్రం చేస్తే చాలామంది మెచ్చుకున్నారు. విస్మరణకు గురైన జీవితాలకు సంబంధించి ఇవాళ అనేక సినిమాలు వస్తున్నాయి. సంయుక్త విజయన్ తీసిన ‘నీల నిర సూర్యన్’ మరో ముఖ్యమైన కథను చెబుతోంది. మరిన్ని కథలు సంయుక్త నుంచి మనం చూడొచ్చు.‘మా కథలు మేము చెప్పుకోవడం ఈ దేశంలో అంత సులువు కాదు’ అంటుంది సంయుక్త విజయన్. -
ఆ ఫోబియాకు పుస్తకాల శక్తితో చెక్ పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్విమెన్!
ట్రాన్స్జెండర్లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్. ఎవరీ నియోగ్? ఏం చేస్తోందంటే..అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్ ఫోబియా అంటారు. తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది. అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్ జెండర్గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ. తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు. View this post on Instagram A post shared by Rituparna (@the_story_mama) (చదవండి: అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!) -
మోదీ ప్రమాణస్వీకారం.. అతిథుల్లో కూలీలు, హిజ్రాలు
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ఎందరో అతిథులు విచ్చేయనున్నారు. ఆదివారం(జూన్9) జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని ప్రత్యేకతలుండటంతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరుకానున్నారు.కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేసిన అధికారులతో పాటు పలువురు హిజ్రాలు, శానిటేషన్ సిబ్బంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాకి ఆహ్వానాలు అందాయి. కాగా, మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా రానున్నారు. -
ప్రత్యేక ఏర్పాట్ల కోసం టాన్స్ జెండర్ అభ్యర్థి ధర్నా
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలు చోట్ల ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణ ఢిల్లీకి చెందిన ఏకైక ట్రాన్స్జెండర్ అభ్యర్థి రాజన్ సింగ్ పోలింగ్ బూత్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.రాజన్ సింగ్ ఓటు వేసేందుకు సంగం విహార్లోని జె బ్లాక్లో గల ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 125కి వచ్చారు. అయితే అక్కడ ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఏర్పాట్లు లేవన్న కారణంతో రాజన్ ఓటు వేయడానికి నిరాకరించారు. పోలింగ్ కేంద్రం బయట ధర్నాకు దిగారు.కొద్దిసేపటి తరువాత ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ట్రాన్స్జెండర్ రాజన్ సింగ్కు పోలీసు రక్షణ మధ్య ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. తాను ట్రాన్స్జెండర్ ఓటరునని, దక్షిణ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థినని పోలింగ్ బూత్లోని ప్రభుత్వ అధికారికి తాను చెప్పినప్పటికీ, తనను నెట్టివేశారని రాజన్సింగ్ ఆరోపించారు.అన్ని పోలింగ్ బూత్ల వద్ద రెండు లైన్లు మాత్రమే ఉన్నాయని, అవి మగవారికి, ఆడవారికి మాత్రమే ఉన్నాయని, ట్రాన్స్జెండర్ల కోసం ఎలాంటి క్యూ ఏర్పాటు చేయలేదని రాజన్ సింగ్ ఆరోపించారు. అలాగే ట్రాన్స్ జండర్లుకు పోలింగ్ బూత్ల దగ్గర ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయలేదని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, తాము ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నామని రాజన్ వాపోయారు. -
ఢిల్లీలో తొలి ట్రాన్స్జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
పవన్ కల్యాణ్పై చర్మకారుడి పోటీ
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఒక ట్రాన్స్జెండర్ ప్రకటించగా.. తాజాగా ఓ చర్మకారుడు కూడా ఆయనపై పోటీకి సిద్ధమంటున్నాడు. డిగ్రీ చదువుకున్నా కానీ కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పట్టభద్రుడిని కాబట్టే చట్ట సభలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అందుకే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని అంటున్నారు పిఠాపురానికి చెందిన చర్మకారుడు ఏడిద భాస్కరరావు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ వద్ద చెట్టు కింద 20 ఏళ్లుగా చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినీ యాక్టర్ పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి అందరూ పోటీ చేస్తూంటే స్థానికుడిగా బీఏ పొలిటికల్ సైన్స చదువుకున్న తానెందుకు పోటీ చేయకూడదని అనిపించిందన్నారు. అందుకే నాలుగు నెలలుగా నియోజకవర్గ సమస్యలను పత్రికల ద్వారా సేకరించానన్నారు. పిఠాపురంలో ఇప్పుడు పవన్ పరిష్కరిస్తానంటున్న సమస్యలను తాను 4 నెలల క్రితమే గుర్తించానన్నారు. పేద కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి, ప్రజల సమస్యలు తీర్చాలంటే చట్ట సభలే వేదిక అని తలచి పోటీలో ఉండాలనుకుంటున్నానన్నారు. తనకు తెలిసిన వారందరి మద్దతూ కోరుతున్నానని, చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. ఎలాగైనా పవన్ కల్యాణ్పై గెలుస్తాననే నమ్మకం తనకుందన్నారు. త్వరలో తాను కూడా ఓ మేనిఫెస్టో తయారు చేసుకుని, ప్రకటిస్తానని భాస్కరరావు తెలిపారు. -
ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్జెండర్ గురించి తెలుసా?
లక్నో: ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ (ABHM) ఉత్తరప్రదేశ్ విభాగం తరఫున మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్లోని 20 లోక్సభ స్థానాల్లో ఈ హిందూ మితవాద సంస్థ పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో చివరి దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి కాంగ్రెస్ తమ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్ను పోటీకి దింపింది. 2019లో వారణాసిలో ప్రధాని మోదీ 63 శాతం ఓట్లతో విజయం సాధించారు . సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ తర్వాత రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గీతా బోధకురాలు హేమాంగి సఖి గుజరాత్లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి మారింది. సఖి కొంతకాలం కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు. ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. తరువాత, ఆమె హేమాంగి సఖి మాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ భగవద్గీత బోధకురాలు. తన ఫేస్బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవద్ కథ , రామ కథ, దేవి భగవత్ కథలను బోధించారు. 2019లో పట్టాభిషేకం 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. -
లైలా.. ఓ అంబాసిడర్
సాక్షి, హైదరబాద్: లైలా ఓరుగంటి. ఒక ట్రాన్స్జెండర్. దశాబ్దాలుగా ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్త. లోక్సభ ఎన్నికల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆమెను అంబాసిడర్గా నియమియారు. వివిధ సామాజిక వర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అన్ని వర్గాలకు చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్ వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన క్యాంపెయిన్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి లైలా ఎన్నికల అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.‘తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.కానీ ఓటర్లుగా నమోదైన వాళ్లు కనీసం 3 వేల మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.’అని లైలా అభిప్రాయపడ్డారు. వివక్ష తొలగలేదు... చాలామంది ట్రాన్స్జెండర్లుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ ఓటింగ్లో మాత్రం ‘పురుషులు’ లేదా ‘మహిళలు’గా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.‘ట్రాన్స్జెండర్లు’గా నమోదు కావడం లేదు. దీంతో సామాజికంగా లక్షన్నర మంది ట్రాన్స్జెండర్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం 2,737 మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా నమోదయ్యారు. ఈ వర్గంపైన ఉండే సామాజిక వివక్ష కారణంగా తమ ఉనికిని చాటుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గోప్యంగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంఖ్యరీత్యా మెజారిటీగా ఉండే ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే రాజకీయ పారీ్టలు ట్రాన్స్జెండర్లను గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సామాజిక రుగ్మతను తొలగించుకొనేందుకు ప్రతి ట్రాన్స్జెండర్ ఓటరుగా నమోదు కావలసి ఉందని లైలా పేర్కొన్నారు. గత పదేళ్లలో ట్రాన్స్జెండర్ల సంఖ్య రెట్టింపయింది.‘అనేక రకాలుగా ‘ట్రాన్స్’గా జీవనం కొనసాగిస్తున్నవాళ్లు ఉన్నారు.కానీ కుటుంబం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచి్చన వాళ్లు నిర్భయంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కమ్యూనిటీకి చెందిన పుష్ప ఎన్నికల్లో పోటీ చేయగా, 2018లో జరిగిన ఎన్నికల్లో చంద్రముఖి ఎన్నికల బరిలో నిలిచారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పోటీ ఎంతో దోహదం చేసిందని ఆ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ లైలాను అంబాసిడర్గా నియమించడాన్ని కూడా ట్రాన్స్జెండర్లు, సామాజిక సంస్థలు ఆహ్వానిస్తున్నాయి.కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ చదివిన లైలా ... స్వచ్చంద సంస్థల ద్వారా ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పథకాలు అందడం లేదు... వివిధ కారణాల వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకుండా బతుకుతున్న తమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, చదువుకున్న వాళ్లకు కూడా ఉద్యోగా లు లభించడం లేదని లైలా ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగులు, పేద మహిళలు, తదితర వర్గాలకు లభించే రాయితీ సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, అణగారిన వర్గాలకు ఇళ్లు, ఇంటిస్థలాలు అందజేస్తున్నట్లుగానే తమకు కూడా సొంత ఇళ్లకు ఆర్ధికసహాయం అందజేయలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల సంఖ్య 1.50 లక్షలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లుగా నమోదైన ఓటర్లు : 2000 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు : 2,885 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు : 2,557 ప్రస్తుతం జరుగనున్న 2024 లోక్సభ ఎన్నికల కోసం నమోదైన ట్రాన్స్జెండర్ ఓటర్లు : 2,737. -
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక టాటా కంపెనీలో ఉద్యోగాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఉద్యోగాల కోసం ట్రాన్స్జెండర్ అభ్యర్థుల నుంచి టాటా స్టీల్ దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్లో మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో, ఏదైనా విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే.. 2022 ఫిబ్రవరిలో కూడా టాటా స్టీల్ 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్జెండర్లను ఒడిశాలోని కళింగనగర్ ప్లాంటు కోసం నియమించుకుంది. దీనికి ముందు గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) కార్యకలాపాల కోసం, ఝార్ఖండ్లోని వెస్ట్ బొకారో కోసం 14 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసింది. 2025 నాటికి 25శాతం లింగవైవిధ్యం కలిగిన ఉద్యోగులు ఉండేలా చూడాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ట్రాన్స్ జెండర్పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
ట్రాన్స్జెండర్గా మారి వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేయించిన భార్య
సిద్దిపేట కమాన్: ట్రాన్స్జెండర్గా మారి వేధిస్తున్నాడంటూ సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ భార్య. సుపారీ కింద రూ.18 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని.. రూ.4.60 లక్షలు అడ్వాన్స్గా చెల్లించింది. సిద్దిపేట వన్టౌన్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ రంజిత్కుమార్ కథనం ప్రకారం.. సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్పూరకు చెందిన దరిపల్లి వెంకటేశ్(33)కు 2014లో వివాహమైంది. 2015లో వీరికి ఒక పాప జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వెంకటేశ్కు మానసిక ఆలోచనల్లో మార్పు వచ్చింది. అమ్మాయిలాగా ప్రవర్తించడం చెవులకు కమ్మలు, ముక్కుకు పుడక పెట్టుకుని రాత్రి సమయంలో ఆడవారి దుస్తులు ధరించడం చేస్తుండేవాడు. అదనపు కట్నం కోసం కూడా వేధింపులకు గురి చేసేవాడు. 2019లో ఏకంగా వెంకటేశ్ ట్రాన్స్జెండర్గా మారి భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులకు ఉద్యోగం పోవడంతో పగబట్టి.. రోజాగా పేరుమార్చుకున్న వెంకటేశ్ పలుమార్లు చీరకట్టుకుని వేదశ్రీ పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి వేధిస్తుండటంతో తన ఉద్యోగాన్ని కోల్పోయింది. మరో స్కూల్లో చేరినా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తనకు పరిచయమైన సిద్దిపేట నాసర్పూర వాస్తవ్యుడు బోయిని రమేశ్తో తన బాధను చెప్పుకొని వాపోయింది. తనను, పాపను వేధిస్తున్న వెంకటేశ్ (రోజా)ను ఎలాగైనా అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో వేదశ్రీ, రమేశ్ కలిసి పట్టణంలోని కాకతీయ ఫుట్వేర్ యజమాని రమేశ్తో వెంకటేశ్(రోజా) హత్య కోసం 2023 సెప్టెంబర్లో రూ. 18లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అడ్వాన్స్గా వేదశ్రీ మొదటగా రూ.2లక్షలు చెల్లించింది. ఈ క్రమంలో ఫుట్వేర్ రమేశ్కు మిత్రుడైన నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్కు హత్య విషయం తెలిపారు. దీంతో ఇప్పల శేఖర్ ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా వెంకటేశ్ (రోజా)తో పరిచయం చేసుకుని తరచూ అతడిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇప్పల శేఖర్ వెంకటేశ్(రోజా)కు ఫోన్ చేసి వరంగల్ నుంచి సిద్దిపేటకు పిలిపించాడు. -
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్జెండర్
నల్గొండ : కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. -
ట్రాన్స్జెండర్గా సీజన్-7 బిగ్బాస్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఏడాది బిగ్బాస్ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ విన్నర్గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్లో టాప్-3లో ప్రశాంత్, అమర్దీప్, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్బాస్ కంటే ముందే ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్-6లో నిలిచారు. అయితే అర్జున్ హౌస్లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్గా కనిపించే అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్గా పని చేశాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ అర్జున్కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!) ఆ తర్వాత మోడల్గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్బాస్ షోను ఎంచుకున్నారు. అర్ధనారిలో ట్రాన్స్జెండర్గా.. అర్ధనారి సినిమాలో అర్జున్ ట్రాన్స్జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్బాస్ సీజన్లో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి టాప్-6లో నిలిచారు. అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఇన్స్టా రీల్కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య
భోపాల్: ఇన్స్టా రీల్కు ద్వేషపూరిత కామెంట్లు రావడంతో ఓ ట్రాన్స్జెండర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జెయినిలో జరిగింది. దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోకు అసభ్యకరమైన కామెంట్లు వచ్చాయని, ఆ కారణంగానే ఆర్టిస్టు మరణించాడని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అన్నారు. ప్రన్షు(16) ఉజ్జెయినికి చెందిన ట్రాన్స్ జెండర్ సొంతంగా మేకప్ కళను నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్స్టా అకౌంట్ను కూడా నడుపుతున్నాడు. మేకప్ కళ, బ్యూటీ కంటెంట్కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే.. ఈ వీడియోకు 4,000 ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. ట్రాన్స్జెండర్ వర్గానికి రక్షణ కల్పించడంలో ఇన్స్టా యాజమాన్యం విఫలమౌతోందని అన్నాడు. View this post on Instagram A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin) ప్రన్షు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వీడియోకు వచ్చిన కామెంట్ల కారణంగానే ప్రన్షు మరణించాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు -
భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు
భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ట్రాన్స్జెండర్ల సంఘం సభ్యులు ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్స్కు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయినా, తరువాత జరిగిన అన్ని మ్యాచ్లను గెలుచుకుంది. ప్రపంచకప్లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చూపాయి. అటువంటి స్థితిలో ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం! -
ట్రాన్స్జెండర్తో యువకుడి పెళ్లి
నందిగామ: నందిగామకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్ జెండర్)ను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన లావూరి గణేష్ ప్రేమించాడు. హైదరాబాద్లో వీరికి పరిచయమైంది. ఏడాది నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. వీరు అక్టోబర్ 29న నందిగామ సమీపంలోని పల్లగిరిగుట్టపై ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం నందిగామ పీఎస్లో ఫిర్యాదు చేశారు. డీవీఆర్ కాలనీలోని గణేష్, దీపును పోలీసులు పిలిపించారు. తనకు దీపు అంటే ఇష్టమని, తనతోనే ఉండిపోతానని గణేష్ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పడంతో వెళ్లిపోయారు. గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ మనిషిని ట్రాన్స్జెండర్ ఇష్టపడితే జీవితాంతం ప్రేమను అందిస్తుందన్నాడు. దీపు మాట్లాడుతూ.. ఒకరి కోసం ఒకరం జీవిస్తామని తెలిపింది. -
హిజ్రాలకూ సభ్యత్వం కల్పిస్తా: ఆర్కే సెల్వమణి
మారుతీ ఫిలిమ్స్, టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు ఎస్.రాధాకృష్ణన్, ఎస్.హరి కలిసి నిర్మిస్తున్న చిత్రం డెవిల్. సవరకత్తి చిత్రం ఫేమ్ ఆదిత్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు మిష్కిన్ సంగీత దర్శకుడుగా పరిచయం కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన ఒక పాట పాడి కీలక పాత్రను పోషించారు. కాగా నటుడు విదార్థ్, పూర్ణ, ఆదిత్ అరుణ్, శుభశ్రీ రాయ్ గురు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో శుక్రవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా మిష్కిన్ నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు, పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బాల, వెట్రిమారన్, నిర్మాత థాను పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మిష్కిన్ మాట్లాడుతూ కథలన్నీ ఒక కథ నుంచే పుడుతాయన్నారు. అదే విధంగా ఈ డెవిల్ చిత్ర కథ అలాంటిదేనని పేర్కొన్నారు. ఒక ప్రశాంతమైన ఇంటిలోకి చీకటి చొరబడుతుందన్నారు. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. ఆ తరువాత దాన్నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు. తనకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాన్ని నేర్పించిన రామమూర్తి తనకు ఒక గురువు కాగా మరొక గురువు ఉన్నారని ఆయనే ఇళయరాజా అని వారి పాదాలకు నమస్కారం చేస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు తాను చిన్న వయసు నుంచి చూస్తూ ఆశ్చర్యపడిన దర్శకుడు ఆర్కే సెల్వమణి అని, ఆయన ఆరి–2 కెమెరాతో చిత్రాలను చిత్రీకరించినా, పారా విజన్లో తీసినట్లు వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తాను ఆయనను ఒక కోరిక కోరుకుంటున్నానని, హిజ్రాలకు కూడా నటులుగా సభ్యత్వం కల్పించాలన్నదే ఆ కోరిక అన్నారు. దీనిపై స్పందించిన ఆర్కే సెల్వమణి సినీ పరిశ్రమకు చెందిన ఏ శాఖలో నైనా ఆసక్తి కలిగిన హిజ్రాలు చేరవచ్చునని చెప్పారు. బైలాస్లో కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. -
ట్రాన్స్జెండర్కు బీఎస్పీ టికెట్
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ ప్రకటించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కలి్పంచారు. వరంగల్ తూర్పు నుంచి చిత్రపు పుష్ప తలయ అనే ట్రాన్స్జెండర్ను బరిలోకి దింపడం గమనార్హం. ఈ నెల 3న 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా 43 మందితో కూడిన రెండో విడత జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 63కు చేరింది. ఆ పార్టీలవి మాయమాటలు: ఆర్ఎస్ ప్రవీణ్.. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇతర రాజకీయ పారీ్టలు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మాయమాటలతో వంచించే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని ప్రజలను కోరారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. బీసీ కులాలకు చెందిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేని ఆ పార్టీ... బీసీని సీఎం చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశంలో బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీఎస్పీ జనబలం ముందు కేసీఆర్ ధనబలం పనికిరాదన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. -
ట్రాన్స్జెండర్కు గంటలోనే గుర్తింపు కార్డు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించడమే దీనికి కారణం. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందనలో జరిగిన ఈ ఘటనే దీనికి నిదర్శనం. గోకవరం మండలం వీరలంకపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ పైడికొండల రమేష్ ఉరఫ్ (పైడికొండల వసుంధర) తనను ట్రాన్స్జెండర్గా గుర్తించి, గుర్తింపు కార్డు జారీ చేయాల్సిన స్పందనలో కలెక్టర్ మాధవీలతకు అర్జీ అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్కు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంట వ్యవధిలోనే సంబంధిత ధ్రువపత్రాలు జారీ చేయడంతో కలెక్టర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేశారు. ఈ సందర్భంలో పైడికొండల రమేష్ ఉరఫ్ వసుంధర కలెక్టర్కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వేగంగా పౌరసేవలు కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ అర్హత ఉండి, తక్షణం పరిష్కారం చేసే అర్జీల విషయంలో కాలయాపన చేయకుండా, సాధ్యమైనంత వేగంగా పౌర సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి తప్పని సరిగా జిల్లా స్థాయి అధికారులు హాజరవ్వాలన్నారు. జేకేసీలో అందిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమానికి ప్రజలు 173 అర్జీలు అందజేశారని, వాటిని గడువులోపు పరిష్కరించాలన్నారు. జేకేసీలో హౌసింగ్, మెడికల్, డీఆర్డీఏ వంటి శాఖలకు సంబంధించి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, వాటికి వెనువెంటనే పరిష్కార మార్గం చూపాలన్నారు. 27న జగనన్నకు చెబుదాం రాజమహేంద్రవరం రూరల్ మండలానికి సంబంధించి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఈనెల 27వ ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లో నిర్వహిస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. మర్యాద పూర్వకంగా... కలెక్టరేట్ స్పందన హాల్లో కలెక్టర్ మాధవీలతను సోమవారం శిక్షణ డిప్యూటీ కలెక్టర్ మిమ్మితి భాను ప్రకాష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన ఆయన ఇటీవల ప్రకటించిన గ్రూప్1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. -
తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్జెండర్.. హీరోగా ఎవరంటే?
ఏ సినీ పరిశ్రమ అయినా సరే ఎప్పుడు కొత్తదనం ఉండాల్సిందే. అది కంటెంట్ అయినా.. నటీనటులైనా సరే. కాన్సెప్ట్ కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా కొత్తవారితో ప్రయోగాలు కొత్త ప్రయత్నాలతో కొత్త కాన్సెప్ట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఏ ఇండస్ట్రీలో సినిమా హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ వస్తున్నారు. ఇటీవల హీరో, హీరోయిన్ల విషయంలో కొత్తవారితోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈసారి కన్నడ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త, ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. తొలిసారిగా ఓ సినిమాలో ట్రాన్స్జెండర్ హీరోయిన్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: అక్కడేమో క్రేజ్ లేదు.. ఇక్కడ చూస్తే ఫ్లాప్.. మిగిలింది ఆ సినిమా ఒక్కటే!) హీరోయిన్గా అవకాశం అయితే ప్రస్తుతం శాండల్వుడ్లో తెరకెక్కుతోన్న చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ. ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు హీరోయిన్లకు ఎంపిక చేశారు. వారిలో ట్రాన్స్జెండర్ వైశాలి కూడా ఒకరు. దీంతో తొలిసారిగా ఓ హీరోయిన్గా నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది వైశాలి. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన వైశాలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వైశాలి మాట్లాడుతూ..'మేం ఎందుకు అడుక్కోవాలి. మాకు కూడా ఒక జీవితం ఉంది. అందుకే నటించాలని కలలు కన్నా. అందుకు తగ్గట్టుగానే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఫేస్బుక్ ద్వారా తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది' అని వెల్లడించింది. అంతే కాకుండా ట్రాన్స్జెండర్లను ప్రజలు చూసే తీరుపై అసహనం వ్యక్తం చేసింది వైశాలి. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చోవడానికి జనం సంకోచిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమా అవకాశం కోసం నేరుగా గోవాలోని ఓ క్లబ్లో డాన్సర్గా చేరానని వైశాలి పేర్కొంది. గోవాలో ఉద్యోగం మానేసి ఈ సినిమాలో నటించినట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సుబ్రమణి హీరోగా నటించారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అసలు ఎవరీ వైశాలి? వైశాలికి మొదట్నుంచీ నటనపై ఆసక్తి ఎక్కువ. అందువల్లనే వైశాలికి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం హీరోయిన్గా కనిపించనున్న వైశాలి గతంలో గోవాలోని నైట్ క్లబ్లలో డ్యాన్సర్గా పనిచేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో బెంగళూరుకు వచ్చేసింది. కామెడీ ఖిలాడీ సీజన్- 2 కోసం జరిగిన ఆడిషన్స్లో కూడా వైశాలి పాల్గొంది. -
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్ జెండర్ లైలా
సాక్షి, వరంగల్: ‘చట్టసభల్లో రిజర్వేషన్తో అవకాశం కల్పిస్తే మేము రాజకీయంగా నిరూపించుకుంటూ.. సమాజానికి సేవ చేస్తాం’ అంటున్నారు.. రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్త, ట్రాన్స్జెండర్ లైలా. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ట్రాన్స్జెండర్ లైలా ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రాన్స్ జెండర్ సంక్షేమ బోర్డు సభ్యురాలిగా కూడా ఉన్న లైలాతో ‘సాక్షి’ బుధవారం ముచ్చటించింది. వివరాలు ఆమె మాటల్లోనే.. సంఖ్య పెరిగితే ప్రత్యేక పథకాలు.. రాష్ట్రంలో ఉన్న మా కమ్యూనిటీ సమస్యలపై అవగాహన ఉంది. లక్ష వరకు మా సంఖ్య ఉన్నా.. ఓటరు జాబితాలో మాత్రం 2,033 మందే కనిపిస్తున్నారు. చాలామంది మేల్, ఫిమేల్గా నమోదు చేసుకున్నారు. అందుకే మా సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. మా మీద ఉన్న వివక్షతో కొంత మంది ట్రాన్స్జెండర్గా ఓటర్గా నమోదు చేసుకోవడం లేదు. గుర్తింపు, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి అదర్స్.. థర్డ్ జెండర్.. అనే కాలమ్లో ఓటరుగా నమోదు చేసుకున్నారు. మేమంతా 18 ఏళ్లు నిండిన వాళ్లమే. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా నా వంతు పాత్ర నిర్వర్తిస్తా. అప్పుడే ప్రభుత్వాలు మాకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బాధ్యతగా భావిస్తున్నా.. గొప్ప గొప్ప సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లను ఎన్నికల ప్రచార కర్తలుగా తీసుకుంటున్న తరుణంలో ఓ ట్రాన్స్జెండర్ అయిన నన్ను ఓ ఐకాన్గా తీసుకోవడం అరుదైన అవకాశంగా.. గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఇంత గుర్తింపునిచ్చిన ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోరాటాలు చేసి చాలావరకు సాధించుకున్నాం.. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త గుర్తింపు పెరిగింది. అధికారులు.. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల్లో ట్రాన్స్జెండర్స్పై అవగాహన పెరిగింది. కానీ, మార్పు రావాలంటే ప్రభుత్వాలు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. అవకాశాలు ఇవ్వాలి. ప్రత్యేక గుర్తింపును ఇచ్చినప్పుడు మాత్రమే మరింత ముందుకెళ్లే.. అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల వల్లనే ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయ రంగాల్లో కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహించాలి.. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా.. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా నిరూపించుకుంటాం.. అవకాశం ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా.. చట్టసభల్లో ఉండాలని కోరుకుంటాం. మాకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే చట్టసభల్లో మాత్రమే మన పాలసీలు, జీఓలు వస్తుంటాయి. ఎక్కడైతే పాలసీలు తయారవుతున్నాయో అక్కడ మా వాయిస్ ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చినా.. మా కమ్యూనిటీ ఉపయోగించుకుంటుంది. మాకు అది అవసరం కూడా.. అదే సమయంలో ఎన్నికల ప్రచార కర్తగా ప్రతి ఒక్క అర్హులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తా.. ఓటును వినియోగించడం ద్వారా సరైన సేవ చేసే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని విడమరిచి చెబుతా. ఓటు గొప్ప ఆయుధం కాబట్టి ఓట్లు వేసే రోజు పోలింగ్ బూత్కు వెళ్లాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యాన్ని, నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సరైన నాయకుడు వస్తేనే మన జీవితాల్లో మార్పు వస్తుంది. -
తెలంగాణ ట్రాన్స్జెండర్కు అరుదైన అవకాశం
-
హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా?
హిజ్రాల జీవితాల్లో ఎన్నో రహస్యాలు దాగివుంటాయి. అందుకే వారి జీవితం ఎలా సాగుతుంది? వారికి వివాహాలు జరుగుతాయా? వారు జంటగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష పాత్రలను పోషిస్తారా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. నిజానికి ప్రతీ హిజ్రా తన జీవితంలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అయితేవారు ఒక రాత్రికి మాత్రమే వధువుగా మారుతారు. ఇదేమీ విచిత్రం కాదు. వారి సమాజంలో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. పురాతన గ్రంథాలలో హిజ్రాలను యక్షులు, గంధర్వులతో సమానంగా పరిగణించారు. మహాభారతం నుండి యక్ష పురాణం వరకు శిఖండి, మోహిని లాంటి పాత్రలు కనిపిస్తాయి. అయితే మన సమాజంలో హిజ్రాలను ప్రత్యేకంగా చూస్తుంటారు. అందుకే హిజ్రాలు తమకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుంటారు. వారి అంత్యక్రియలు, వివాహాలు వారి సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా కొనసాగుతాయి. దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే హిజ్రాల ఉత్సవాన్ని కూవగం జాతర అని అంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 18న ప్రారంభమై మే 03 వరకు జరిగింది. ఇందులో మే 02, 03 తేదీల్లో హిజ్రాల వివాహాలు జరిగాయి. ఈ జాతర తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో జరుగుతుంది ఈ జాతర 18 రోజుల పాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుండి హిజ్రాలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశం తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్రాల దేవుడిగా భావించే అరవాన్ దేవతకు వారు ఆరోజుల్లో పూజలు చేస్తారు. జాతరలో హిజ్రాల కళ్యాణం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. మహాభారతంలో అరవన్ అనే దేవుని పేరు ప్రస్తావనకు వస్తుంది. అతను.. అర్జునుడు- యువరాణి ఉలూపి కుమారుడు. మహాభారత కథ ప్రకారం యుద్ధ సమయంలో కాళీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు అరవన్ తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమవుతాడు. అయితే పెళ్లి కాకుండా చనిపోవడం ఇందుకు అనువైనది కాదనేది షరతు. అటువంటి పరిస్థితిలో శ్రీ కృష్ణుడు మోహిని రూపాన్ని ధరించి అరవన్ను వివాహం చేసుకుంటాడు. అరవన్ మరణించిన మరుసటి రోజు ఉదయం మోహిని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు వితంతువులా రోదించాడని చెబుతారు. ఈ కథను ఆధారంగా చేసుకుని హిజ్రాలు అరవన్ను ఒక రోజు వివాహం చేసుకుంటారు. మరుసటి రోజు వారు వితంతువులుగా మారి పెద్దపెట్టున విలపిస్తారు. పెళ్లి రోజన హిజ్రాలు అరవన్ను తమ భర్తగా భావించి, తమను తాము నవ వధువులా అలంకరించుకుంటారు. ఆలయ పూజారులు వారికి మంగళసూత్రం ధరించేలా ఏర్పాట్లు చేస్తారు. మరుసటి రోజు వారు అరవన్ చనిపోయినట్లు భావించి, వితంతువులు అవుతారు. అప్పుడు హిజ్రాలు తమ అలంకరణను తొలగించుకుని పెద్ద పెట్టున రోదిస్తారు. హిజ్రాల పరిస్థితి భారత్లోనే కాదు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలలో కూడా దారుణంగా ఉంది. స్త్రీల వేషధారణలో ఉంటూ, వారు సమాజానికి దూరంగా ఉంటున్నారు. పలు పాశ్చాత్య దేశాలలో హిజ్రాలు సామాన్య ప్రజల మధ్యనే ఉంటారు. వారు కూడా వివాహం చేసుకుని బిడ్డను దత్తత తీసుకుంటుంటారు. ఛాందసవాద సమాజం వారిని ప్రధాన స్రవంతి నుండి వేరు చేస్తున్నదనే వాదనలు వినిపిస్తుంటాయ. ఇది కూడా చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు! -
మస్క్ కూతురు అలా మెసేజ్ చేసిందా! తండ్రికి తెలియకూడదని..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తన భార్యా జస్టిస్కి 2008లో విడాకులిచ్చిన విషయం అందరికి తెలుసు. అప్పటికే వారికి 'జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్' అనే ఇద్దరు కుమారులుండేవారు. విడిపోయిన తరువాత అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి 'వివియన్ జెన్నా విల్సన్'గా మారింది. నిజానికి అమ్మాయిగా మారిన తరువాత ఆ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ అలెగ్జాండర్ తన అత్తకు గతంలోనే మెసేజ్ చేసింది. అయితే అది ఆ తరువాత చాలా రోజులకు ఈ విషయం బయటపడినట్లు సమాచారం. దీనిని ఎలాన్ మస్క్ జీవిత చరిత్రలో వాల్టర్ ఐజాక్సన్ వెల్లడించాడు. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! అలెగ్జాండర్ తన తండ్రి మీద కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మస్క్ ప్రవర్తన ట్రాన్స్జెండర్లకు వ్యతిరేకంగా ఉంటుందని ఇలా చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ధనవంతులంతా చెడ్డవాళ్ళని ఆ అమ్మాయి బలంగా విశ్వసిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటికి కూడా తన తండ్రిని (మస్క్) కలుసుకోవడానికి అంగీకరించలేదు. ఇది ఎలాన్ మస్క్ని ఎంతగానో బాధించిందని చెబుతాడు. -
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్జెండర్
అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్జెండర్ రంగప్రవేశానికి ఐసీసీ ఓకే చెప్పింది. ఆస్ట్రేలియాలో జన్మించిన డేనియల్ మెక్గాహె అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్జెండర్గా చరిత్ర సృష్టించనుంది. మెక్గాహె అంతర్జాతీయ మహిళల టీ20 మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ నిర్ధేశించిన అన్ని అర్హత ప్రమాణాలను క్లియర్ చేసింది. మెక్గాహె 2024 మహిళల టీ20 వరల్డ్కప్ క్వాలిఫయింగ్ పోటీల కోసం ఎంపిక చేసిన కెనడా జట్టులో చోటు దక్కించుకుంది. 2020లో ఆస్ట్రేలియా నుంచి కెనడాకు వలస వెళ్లిన మెక్గాహె.. అదే ఏడాది లింగమార్పిడి చేయించుకని మహిళగా మారి, త్వరలో అదే దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది. ఐసీసీ నుంచి క్లియెరెన్స్ లభించాక మెక్గాహె స్పందిస్తూ.. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించనున్న మొట్టమొదటి వ్యక్తిని అయినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని అంది. కాగా, పురుషుడి నుంచి మహిళగా మారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే, సదరు వ్యక్తి పలు మెడికల్ టెస్ట్లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారు పలు రాతపూర్వక హామీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. -
'ఆవిడ వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు..'
మహబూబాబాద్: అప్పట్లో ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కిన మహబూబాబాద్ జిల్లా వాసి ధరావత్ శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాన్స్జెండర్ తపస్వీ వేధింపులు భరించలేకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుని తల్లి పోలీసులను ఆశ్రయించింది. తపస్వీతో విడిపోయిన తన కొడుకు మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా.. అడ్డుకుని వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన ధారావత్ శివరాం, జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ కొర్ర ప్రవీణ్ అలియాస్ తపస్విని వివాహం చేసుకున్నారు. ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు శివరాం ప్రయత్నిస్తుండగా ట్రాన్స్జెండర్ తపస్వి అడ్డుకున్నారు. అయితే.. ఈ క్రమంలో శివరాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తపస్వి వేధింపులు భరించలేక పురుగులు మందు తాగి శివరాం ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లి పోలీసులును ఆశ్రయించింది. గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: కామపిశాచికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు?: శేజల్ సంచలన ఆరోపణలు -
రాజేష్ దగ్గర 100 మంది నకిలీ ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు వెస్ట్జోన్ డీసీపీ చందన దీప్తి. వీళ్లంతా బీహార్కు చెందిన వాళ్లని, ఇలాంటి వాళ్లు వంద మందిదాకా ఉన్నారని ఆమె తెలిపారు. రాజేష్, అనితలు ఈ ముఠా నాయకులు. రాజేష్ దగ్గర 100 దాకా సభ్యులు ఉన్నారు. వీళ్లంతా పగలంతా ట్రాన్స్జెండర్ల వేషంలో ఉంటూ జనం దగ్గరి నుంచి డబ్బులు గుంజుతుంటారు. సాయంత్రం కాలనీలు, కమర్షియల్ ఏరియాల్లో దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈజీ మనీ కోసమే వాళ్లు ఈ గ్యాంగ్ను నడిపిస్తున్నారు అని డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాలో మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారామె. పగలంతా ప్రజలను బెదిరిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ ట్రాన్స్జెండర్ల గురించి టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీహిల్స్ స్టేషన్ ప్రాంతంలో వీళ్లు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. -
రైలు నుంచి పడి ట్రాన్స్జెండర్ దుర్మరణం
జనగాం : రైలు నుంచి జారి పడి ఓ ట్రాన్స్జెండర్ దు ర్మరణం చెందిన సంఘటన రఘునాథపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగెం మండలం ఎల్గూరుస్టేషన్ తూర్పుతండాకు చెందిన ట్రాన్స్జెండర్ బాదావత్ అనిల్ అలియాస్ దివ్య (25) సికింద్రాబాద్ నుంచి శాతవాహన రైలులో కాజీపేటకు వస్తుంది. దివ్య రఘునాథపల్లి రైల్వేస్టేషన్ రెండోప్లాట్ఫాంపై చేరుకోగానే నెమ్మదిగా రైలు వెళ్తున్న క్రమంలో కిందికి దిగబో తూ ప్రమాదవశాత్తు కాలుజారి రై లు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే రైలులో ప్ర యాణిస్తున్న మృతుడి స్వగ్రామానికి చెందిన బాలు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వలంటీరుగా రాణిస్తున్న ట్రాన్స్జెండర్ శ్రేయదాస్
ట్రాన్స్జెండర్ అంటే సమాజంలో ఓ రకమైన చిన్నచూపు. ‘మూడో’రకం మనుషులంటూ హేళనభావం. అనుచితంగా ప్రవర్తిస్తారని, బెదిరించి డబ్బు వసూలు చేస్తారనే అపవాదు. కానీ అందరు ట్రాన్స్జెండర్లూ అలా ఉండరు. మానవత్వం మూర్తీభవించి ఆపన్నులకు అండగా నిలిచేవారు, సమాజానికి సేవ చేయాలని తపనపడే వారూ ఉన్నారు. యాచనకు దూరంగా స్వశక్తితో హుందాగా, గౌరవంగా బతుకుతున్న వారూ ఉన్నారు. అలాంటి వారిలో శ్రేయదాస్ ఒకరు. సాక్షి, అనంతపురం డెస్క్: ఉరవకొండ పట్టణానికి చెందిన శ్రేయదాస్ గ్రామ వలంటీరుగా పనిచేస్తున్నారు. తన క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రశంసలు చూరగొంటున్నారు. తన పనితీరుతో అధికారుల మన్ననలూ పొందుతున్నారు. ఈమె బహుశా రాష్ట్రంలోనే వలంటీరుగా పనిచేస్తున్న ఏకై క ట్రాన్స్జెండర్! గౌరవంగా బతకాలన్న దృఢసంకల్పం, సమాజానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. కన్నీటి పయనం.. శ్రేయదాస్ సొంతూరు ఉరవకొండ పట్టణమే. చిన్నప్పుడు అబ్బాయి లాగా ఉండేవారు. తల్లిదండ్రులూ అలాగే అనుకున్నారు. మిగిలిన అబ్బాయిలతో కలసి స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. పదో తరగతి వరకు అక్కడే చదివారు. కానీ తాను అబ్బాయిని కాదన్న విషయం శ్రేయదాస్కు తెలుసు. ఆ విషయం ఇంట్లో చెప్పాలంటే భయం. చివరికి ఎలాగోలా విషయం బయటపడింది. కొంతకాలానికి తల్లి కూడా చనిపోయింది. కుటుంబ సభ్యుల నుంచి ఛీదరింపులు ఎక్కువయ్యాయి. చివరకు తండ్రి కూడా అండగా నిలవలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. తలదాచుకోవడానికి అద్దె ఇల్లు కూడా దొరకని పరిస్థితి. చాలాకాలం పాటు స్థానిక కందారమ్మ ఆలయమే ఆశ్రయమైంది. ‘ఉన్నత’ లక్ష్యం ఇంటి నుంచి బయటకొచ్చేసిన తర్వాత శ్రేయదాస్ పొట్ట నింపుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మిగిలిన ట్రాన్స్జెండర్ల లాగా యాచించడం తనకు ఇష్టం లేదు. కానీ ఆకలి తీరాలంటే ముందున్న మార్గం అదొక్కటే. అయిష్టంగానే సుమారు మూడేళ్ల పాటు యాచనతో బతుకు నెట్టుకొచ్చారు. ఓ దుకాణం వద్దకు యాచించడానికి వెళ్లిన ఆమె ఇంగ్లిష్ నేమ్బోర్డును స్పష్టంగా చదవడాన్ని అక్కడే నిల్చొన్న ఓ వ్యక్తి గమనించారు. ఏమి చదివారంటూ ఆరా తీశారు. టెన్త్ చదివానని, పైచదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు. దీంతో గుంతకల్లులోని సత్యసాయి జూనియర్ కళాశాలలో అడ్మిషన్ చేయించారు. ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో పీజీ (ఎంఏ) అడ్మిషన్ పొంది ఫస్టియర్ ఉత్తీర్ణులయ్యారు. ఇతరత్రా కారణాల వల్ల సెకండియర్లో డిస్కంటిన్యూ అయ్యారు. తన చదువుకూ ‘జెండర్’ సమస్య అడ్డొచ్చినప్పటికీ పట్టుదలతో అధిగమించి ముందుకు సాగారు. స్వశక్తితో జీవనయానం హేళన చేసిన చోటే ప్రశంసలు శ్రేయదాసుకు వలంటీరుగా గౌరవ వేతనంతో పాటు ట్రాన్స్జెండర్గా పింఛన్ కూడా వస్తోంది. ఇంట్లోనే టైలరింగ్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా మెలకువలు నేర్చుకుని బ్యూటీషియన్గానూ మారారు. ఇళ్ల వద్దకే వెళ్లి బ్యూటీషియన్గా సేవలందిస్తున్నారు. డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నారు. ఈమెకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించింది. సొంతింటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇలాంటి’ వలంటీరునా గ్రామ/వార్డు వలంటీర్ల నియామక నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో శ్రేయదాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె సంకల్పాన్ని గుర్తించిన అధికారులు గ్రామ వలంటీరుగా అవకాశం కల్పించారు. 2019 ఆగస్టు 15న గ్రామ వలంటీరుగా సేవలు ప్రారంభించారు. మొదట్లో తనను చాలామంది హేళన చేశారు. ‘ఇలాంటి’ వలంటీరునా తమకు కేటాయించిందంటూ ప్రజలు కూడా చిన్నచూపు చూశారు. కానీ అందరి అపోహలను ఆమె పటాపంచలు చేశారు. ఉత్తమ సేవలతో హేళన చేసిన చోటే ప్రశంసలు చూరగొంటున్నారు. ఈ క్రమంలో ‘సేవామిత్ర’ అవార్డు కూడా పొందారు. ‘ఆపదమిత్ర’గా జిల్లాస్థాయి శిక్షణ తీసుకున్నారు. అందులోనూ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. గౌరవంగా బతుకుతున్నా.. వలంటీరుగా చేరినప్పుడు చాలామంది హేళన చేశారు. సొంత కమ్యూనిటీ నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా కొందరి ప్రోత్సాహం, అధికారుల సహకారంతో ధైర్యంగా ముందుకు సాగాను. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ భారతి మేడం, వీఆర్వో అరుణ మేడం సహకారం మరువలేనిది. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు క్లస్టర్ పరిధిలోని ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆత్మీయురాలిగా చూస్తుండడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో గౌరవంగా బతుకుతున్నా. ట్రాన్స్జెండర్లు అందరూ చెడ్డవారు కాదు. మాలోనూ మంచోళ్లు ఉన్నారు. కాబట్టి కొందరి ప్రవర్తనను బట్టి అందరినీ చెడ్డవాళ్లుగా ముద్ర వేయొద్దు. సమాజంలో గౌరవం, సమాన అవకాశాలు లభిస్తే నాలాగా స్వశక్తితో బతకడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. – శ్రేయదాస్, గ్రామ వలంటీరు, సచివాలయం–3, ఉరవకొండ -
ఈ ట్రాన్స్ జెండర్ ఎం చేసిందో చూడండి...!
-
సరికొత్త చరిత్ర.. మిస్ నెదర్లాండ్స్గా ట్రాన్స్జెండర్ మహిళ
అమ్స్టర్డ్యామ్: మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకుంది. అందగత్తెల పోటీలో ట్రాన్స్జెండర్ మహిళ ఈ ఘనత సాధించడం నెదర్లాండ్స్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విధంగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల రిక్కీ వలేరి కొల్లే ప్రముఖ మోడల్స్ నుంచి ఎదురైన పోటీని అవలీలగా అధిగమించింది. విజేతగా నిలిచింది. మిస్ నెదర్లాండ్స్ టైటిల్ సాధించడం గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. మహిళలకు ఆదర్శం కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. ఎల్సాల్వేడార్లో జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో రిక్కీ నెదర్లాండ్స్కు ప్రాతినిధ్యం వహించనుంది. -
అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్జెండర్ కిరీటం దక్కించుకుంది!
అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్జెండర్ కిరీటం దక్కించుకుంది. శనివారం ఆమ్స్టర్డామ్లో జరిగిన ఓ వేడుకలో 22 ఏళ్ల డచ్ మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె అనే ట్రాన్స్ జెండర్ ఈ ఘనతను సృష్టించింది. ఆమె ఈ వేడుకలో హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్లు, నథాలీ మోగ్బెల్జాదాలను వెనక్కి నెట్టి మరీ మిస్ నెదర్లాండ్స్ టైటిల్ను గెలుచుకుంది. అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్జెండర్కి కిరీటం దక్కడం తొలిసారి. ఈ చారిత్రత్మక విజయం 72వ మిస్ యూనివర్స్ టైటిల్కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతిక్షణం తపనపడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తాను తనలాంటి వాళ్లందరికీ ఒక రోల్మోడల్గా ఉండాలని కోరుకున్నా. సమాజంలో తమ పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడేలా శక్తిమంతం చేసేందుకు దీన్ని ఒక ఫ్లాట్ఫాంగా చేయాలనుకుంటున్నా. నిబద్ధత, బలం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొంది రిక్కీ. మిస్ నెదర్లాండ్స్ సంస్థ నా వెనుక ఉండటం వల్లే ఈ విజయం సాధించగలిగానని సంతోషంగా చెబుతోంది రిక్కీ. (చదవండి: కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది) -
వేములవాడ రాజన్న సన్నిధిలో హిజ్రాను మనువాడిన యువకుడు
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. అయితే వాళ్లిద్దరూ అమ్మాయి, అబ్బాయి కాదు.. అమ్మాయి, అమ్మాయి కాదు.. అబ్బాయి, అబ్బాయి అంతకన్నా కాదు.. కానీ, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెమొక్కులు చెల్లించుకుని ఆ నందీశ్వరుడి సాక్షిగా.. మనసున మనసై అని పాడుకుంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. వారిలో ఒకరు హిజ్రా అయితే.. ఇంకొకరు ఓ యువకుడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే 22 ఏళ్ల హిజ్రాను.. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది. డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా పింకీ, శీనుల వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఇటీవల ఇలాంటి వివాహమే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) కి రైలులో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
ట్రాన్స్జెండర్తో సహజీవనం.. డబ్బుల విషయంలో గొడవ.. చివరకు
సాక్షి, ముంబై: మహారాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. థానే జిల్లాలోని భీవండీ పట్టణంలోని ట్రాన్స్జెండర్ తలపై బండతో కొట్టి హత్య చేసిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీబస్తీ ప్రాంతానికి చెందిన హిజ్రా (ట్రాన్స్జెండర్) తౌహిక్తో లాహోటి ప్రాంతానికి చెందిన స్నేహితుడు కామిల్ జమీల్ అన్సారీ గత కొన్ని నెలలుగా అసహజ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య పరస్పర తగాదాలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు రోడ్డుపై ఇదే విషయమై మరోసారి ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. కోపంతో ట్రాన్స్జెండర్ బెబ్బొ తలపై జమీల్ బలమైన రాయితో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనంతరం అనేక మంది హిజ్రాలు భీవండి పట్టణ పోలీస్ స్టేషన్ చుటుముట్టి వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఇన్స్పెక్టర్ చేతన్ కాకడే ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: ఎంత విషాదం.. పెళ్లి రిసెప్షన్ నుంచి వెళ్తుండగా ఊహించని ప్రమాదం -
AP: హిజ్రాల కోసం ట్రాన్స్జెండర్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హిజ్రాల మేలు కోసం ట్రాన్స్జెండర్ పాలసీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే హిజ్రాలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా వారికోసం మరిన్ని చర్యలు చేపట్టనుంది. ట్రాన్స్జెండర్లకు సరైన విద్య, వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు నివసించే ప్రాంతాల్లో అందిరి మాదిరిగానే మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆర్థిక సహాయాలు అందిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి సాధికారత సాధించేలా తోడ్పాటు అందించనుంది. మొత్తంగా వారికి సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వం పాలసీ అమలు చేస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు జారీచేయనుంది. ట్రాన్స్జెండర్స్ హక్కులను కాపాడటంతోపాటు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వ ప్రస్తుత (2022–23) బడ్జెట్లో రూ.2 కోట్లు కేటాయించడం విశేషం. చదవండి: Heart Attack: టీకాల వల్లే యువత గుండెకు ముప్పు! -
బంధాలన్నీ దూరమాయే.. ఆఖరి మజిలీలో అనాథలా..
కాకినాడ క్రైం: నవమాసాలూ మోసి, కని పెంచిన కొడుకులున్నారు.. అయినవారందరూ ఉన్నారు.. అయినా ఆఖరి మజిలీలో ఆ తల్లిని పట్టించుకోలేదు. కడసారి చూపు కూడా వద్దనుకున్నారు.. దీంతో అన్నీ తానే అయి ఓ ట్రాన్స్జెండర్ ఆ పిచ్చితల్లికి అంతిమ సంస్కారం చేసింది. వివరాలివీ.. కాకినాడ పర్లోవపేటలోని రాజీవ్ గృహకల్ప ఫ్లాట్ నంబర్–8లో యల్ల ప్రభావతి (50) నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ దంపతులకు ఏడేళ్ల కుమారుడు లక్కీ ఉన్నాడు. భర్త బాధ్యతా రాహిత్యాన్ని భరించలేక దుర్గాప్రసాద్ భార్య లక్ష్మి మరొకరితో వెళ్లిపోయింది. అప్పటి నుంచీ మనవడు లక్కీ, కొడుకు దుర్గాప్రసాద్తో కలిసి ప్రభావతి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం దుర్గాప్రసాద్ కూడా వారిని వదిలిపెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మనవడు లక్కీ అంటే ప్రభావతికి ప్రాణం. మనవడికి ఏ లోటూ రానిచ్చేది కాదు. తాను తిన్నా తినకపోయినా తనకు వచ్చే వైఎస్సార్ వితంతు పెన్షన్తో ఉన్నంతలోనే ఆ పసివాడిని కంటికి రెప్పలా చూసుకునేది. ఇది చూసి చుట్టుపక్కల వారు అబ్బురపడేవారు. ఇదిలా ఉండగా, గత నెల 30వ తేదీన కోడలు లక్ష్మి ఉన్నట్టుండి వచ్చింది. ఇంట్లోని పలు సామగ్రిని తనవంటూ తీసుకువెళ్లిపోబోయింది. అయితే తమ వద్ద చేసిన అప్పు తీర్చి సామాన్లు తీసుకెళ్లమంటూ ఆమెను చుట్టుపక్కల వారు నిలువరించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో అత్త ప్రభావతితో లక్ష్మి గొడవ పడింది. కావాలనే అప్పుల వాళ్లను పిలిచావంటూ మండిపడింది. తగిన శాస్తి చేస్తానని బెదిరింది. తను కన్న కొడుకు లక్కీని తనకు ఇచ్చేయమంటూ పట్టుబట్టింది. బలవంతంగా తీసుకెళ్లిపోతుంటే ప్రభావతి ఏడుస్తూ కాళ్లావేళ్లా పడింది. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా, తన కొడుకునే తీసుకువెళ్తున్నానంటూ లక్కీని తీసుకుని లక్ష్మి వెళ్లిపోయింది. మనవడిపై బెంగతో ఏడుస్తున్న ప్రభావతిని ఇరుగు పొరుగు వారు రాత్రి ఓదార్చి పడుకోమని చెప్పి వెళ్లారు. ఉదయం చూసేసరికి ప్రభావతి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. పక్కనే ఉన్న గ్లాసులో మామిడి కాయలు మగ్గించే కాల్షియం కార్బయిడ్ ద్రావణాన్ని గుర్తించారు. ఆమె మృతి విషయం ఆ ప్రాంతంలో అందరికీ తెలిసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. సమాచారం ఇచ్చినా సమీపంలోని బంధువులూ రాలేదు. అదే ఫ్లాట్ సమీపంలో ట్రాన్స్జెండర్ కావ్య నివాసం ఉంటోంది. ప్రభావతి దుస్థితి గమనించి చలించిపోయింది. జరిగిందంతా హైదరాబాద్లో ఉంటున్న సర్వీస్ హార్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ఆనంద్కు ఫోన్లో వివరించి, సహాయం కోసం అర్థించింది. ఆయన సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్కు అంబులెన్సులో తీసుకెళ్లింది. ప్రభావతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీజీహెచ్కు తరలించాలని సూచించారు. వారి సూచనల మేరకు ప్రభావతి మృతదేహాన్ని కావ్య జీజీహెచ్ మార్చురీకి తరలించింది. తల్లి మరణంపై కుమారుడికి పోలీసులు సమాచారం ఇచ్చినా రాలేనని చెప్పాడు. సమీప బంధువులు, రక్త సంబంధీకుల రాక కోసం ఎదురు చూశారు. ఏ ఒక్కరూ రాకపోవడంతో ఫోరెన్సిక్ వైద్యులు ప్రభావతి మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ సాయంతో కాకినాడ బస్టాండు వద్ద ఉన్న శ్మశాన వాటికకు కావ్య తరలించింది. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అంబేద్కర్ సాయంతో ప్రభావతి మృతదేహాన్ని ఖననం చేసింది. -
మీరు కూడా అడుక్కుంటున్నారా?.. హీరోయిన్పై నెటిజన్ సెటైర్లు
ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని ఎగతాళి చేసిన ఓ నెటిజన్పై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మండిపడ్డారు. ఇటీవల ఆమె ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి మద్దతుగా ఓ వీడియోనూ రిలీజ్ చేసింది. ట్రాన్స్జెండర్స్తో కలిసి దిగిన ఫోటోలను ఆమె ట్వీట్లో జత చేశారు. ఇది చూసిన ఓ నెటిజన్ స్పందించారు. 'ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి వారే అడుక్కుంటారు' సెలీనా ట్వీట్కు రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన సెలీనా జైట్లీ నెటిజన్పై ఘూటుగా స్పందించింది. 'అసలు అందులో తమాషా ఏముంది సార్ ???? ఎవరైనా లింగమార్పిడి చేసుకుని మరీ అడుక్కునే స్థాయికి దిగజారడం చూస్తే గుండె పగిలేలా లేదు ??? మీలాంటి వారే ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్ కావడానికి కారణం. " అంటూ ట్వీట్ చేసింది. మరో ట్వీట్లో నెటిజన్ రాస్తూ..'వారు ఎలా అడుక్కుంటారో మీరు చూశారా? వారు అడుక్కోరు. పబ్లిక్లో తప్పుగా ప్రవర్తిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ ప్రత్యేకమైన జెండర్ గల వ్యక్తులు చేసే పనిని మరొకరు చేస్తే మీకు ఓకేనా? ఆర్ యూ బెగ్గింగ్? బహుశా ఇది నీ పెంపకం వల్ల కావచ్చు.' అంటూ రిప్లై ఇచ్చాడు. మార్చి 31న అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా,సెలీనా వారికి మద్దతును తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. "ప్రపంచంలోని ధైర్యవంతులైన కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు. వారిపై జరిగే అన్ని వివక్ష, హింసకు వ్యతిరేకంగా నేను పోరాడతా. మన ప్రపంచానికి వారి సహకారాన్ని అభినందిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. Have you seen how they beg? They don't beg. They misbehave in public. And would you be ok if man did what these "special" gender people do at Traffic signals 🚦 under the pretext of begging? Maybe you would because of your poor upbringing 😎 I pity your parents 😊 https://t.co/rOfrg7PFHY — Naam Kya Hay (@NaamKyaHay) April 1, 2023 దీనికి సెలీనా జైట్లీ స్పందిస్తూ.. 'నా పెంపకం గురించి నువ్వు అస్సలు చింతించకు. నేను 4 తరాల భారత సాయుధ బలగాల కుటుంబంలో పెరిగాను.ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పటికీ మన దేశంలో చాలా వెనుకబడి ఉంది. వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వ్యక్తులే వారి బహిష్కరణకు, దుస్థితికి బాధ్యులు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. సెలీనా జైట్లీ మిస్ యూనివర్స్-2003లో రన్నరప్గా నిలిచింది. జనాషీన్ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమె గత రెండు దశాబ్దాలుగా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీతో కార్యకర్తగా పని చేస్తున్నారు. I'm reminded of this gender only at Traffic signals 🚦🤣 — Naam Kya Hay (@NaamKyaHay) March 31, 2023 -
తొలి ట్రాన్స్జెండర్ న్యాయవాదిగా పద్మ లక్ష్మీ
కేరళకు చెందిన పద్మాలక్ష్మీ తొలి ట్రాన్స్జెండర్ న్యాయవాదిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జడ్జీగా నిలిచిన జోయిత్ మోండల్ తర్వాత పద్మ లక్ష్మీ అనే ట్రాన్స్జెండర్ ఆ విజయాన్ని సాధించారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో ఈ విషయాన్ని చెబుతూ..ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆమె గురించి మాట్లాడుతూ..ఆదివారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 1500 మందికి పైగా లా గ్రాడ్యుయేట్లలో పద్మాలక్ష్మీ కూడా ఒకరు. ఆమె ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టుభద్రురాలైందని చెప్పారు. తన కోసం ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా విజయాన్ని అందుకోవడం కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొందని, ముఖ్యంగా సమాజం నుంచి ఎదురై చీత్కారాలను అధిగమించి అనుకున్న గమ్యానికి చేరుకుని విజయం సాధించిందని ప్రశంసించారు. ఎట్టకేలకు ఆమె అనుకున్న లక్ష్యం సాధించి న్యాయచరిత్రలో తన పేరును నమోదు చేసుకుందన్నారు. ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే గాక తనలాంటి వాళ్లు ఈ రంగంలో వచ్చేందుకు ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు మంత్రి రాజీవ్. దీంతో నెటిజన్లు అడ్వకేట్ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. కాగా తొలి ట్రాన్స్జెండర్ జడ్జి జోయితా మోండల్ తదనంతరం 2018లో ట్రాన్స్జెండర్ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలో నాగ్పూర్లోని లోక్ అదాలత్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాదే మూడో ట్రాన్స్జెండర్ జడ్జిగా గౌహతి నుంచి స్వాతి బిధాన్ నియమితులయ్యారు. View this post on Instagram A post shared by P Rajeev (@prajeevofficial) (చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి) -
ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపీ కన్నుమూత..
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపీగా అరుదైన గుర్తింపు పొందిన న్యూజిలాండ్ మాజీ చట్టసభ ప్రతినిధి జార్జినా బెయెర్(65) కన్నుమూశారు. చాలాకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బెయెర్ ఫ్రెండ్ ఒకరు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్లో మారుమూల గ్రామంలో జన్మించిన బెయెర్ తొలినాళ్లలో సెక్స్వర్కర్గానూ పనిచేశారు. ఆ తర్వాత నటిగా, డ్రాగ్ క్వీన్గా అలరించారు. కార్టర్టన్కు మేయర్గానూ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్ కూడా ఈమే కావడం గమనార్హం. 1999లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు బెయెర్. 2007 వరకు ఎంపీగా కొనసాగారు. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన న్యాయవాదిగానూ బెయెర్ గుర్తింపుపొందారు. సెక్స్వర్కర్లపై వివక్షపైనా గళమెత్తి వాళ్లకు అండగా నిలబడ్డారు. వ్యభిచారం నేరంకాదనే చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే స్వలింగసంపర్కుల వివాహ చట్టం రూపకల్పనలోనూ ఈమెదే కీలకపాత్ర. అయితే 2014లో ఎంపీగా పోటీచేసిన బెయెర్ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడాయి. 2017లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిగింది. గతవారం రోజులుగా బెయెర్ తన స్నేహితులు, సన్నిహితులతోనే గడపినట్లు తెలుస్తోంది. చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ -
పెళ్లిపీటలెక్కిన ట్రాన్స్ జెండర్ హీరోయిన్.. :ఫోటోలు వైరల్
సోసైటీలో అన్ని రంగాల్లో లేడీస్....జెంట్స్ తో సమానంగా ట్రాన్స్ జెండర్స్ కూడా రాణిస్తున్నారు. ఇన్ సెక్యూరిటీతో నలుగురిలోకి రాకుండా ఆగిపోవటం లేదు. తమకి నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారు. అలా ధాయ్ లాండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రాన్స్ జెండర్ పోయిడ్ ట్రిచాడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది. 36 ఏళ్ల ట్రిచాడ హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూనే మోడలింగ్ రంగంలో కూడా మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఈ బ్యూటీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పుకెట్ ప్రావిన్స్ కు చెందిన బడా బిజినెస్ మ్యాన్ ఓక్ భవఘా హాంగ్యోక్ తో మార్చి 1 పోయిడ్ ట్రిచాడ పెళ్లి జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పోయిడ్ తన మ్యారేజ్ పోటోస్ షేర్ చేసింది. అంతేకాదు ఇప్పుడు మేమిద్దరం అఫిషియల్ గా భార్య భర్తలం అంటూ పోయిడ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. నెట్టింట ఈ పోస్ట్ తో పాటు.. ఈజంట పోటోలు వైరల్ గా మారాయి. ట్రిచాడ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె ఇన్ స్టాలో దాదాపు 26లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిజానికి ట్రిచాడ పుట్టుకతోనే అబ్బాయిగా జన్మించింది...థాయ్ లాండ్ లోని ఫెంగ్ నాలో 1986 అక్టోబర్ 5న జన్మించిన పోయిడ్ ట్రిచాడ పెరిగే కొద్ది తనలో అమ్మాయిల లక్షణాలు ఉన్నాయని గుర్తించాడు. పదిహేడేళ్ల వయస్సు వచ్చే వరకు అబ్బాయిగా జీవించినా... ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ తో అమ్మాయిగా మారిపోయింది. ఆ తర్వాత పోయిడ్ తనకి నచ్చిన మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసింది. అలాగే 2004లో ట్రాన్స్ జెండర్స్ కోసం నిర్వహించే మిస్ టిఫ్ఫనీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.. అదే సంవత్సరం మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ కీరిటం కూడా దక్కించుకుంది. మోడలింగ్ ఫీల్డ్ లో మంచి పాపులారిటీ తోపాటు క్రేజ్ తెచ్చుకున్న ఈ ట్రాన్స్ జెండర్ బ్యూటీకి థాయ్ లాండ్ లోని సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 2010 లో విత్ లవ్ మూవీతో పోయిడ్ తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా తర్వాత స్పైసీ బ్యూటీ క్వీన్ ఆఫ్ బ్యాంకాక్ 2 లో నటించి ప్రశంసలు అందుకుంది. పోయిడ్ హాంకాంగ్ మూవీస్ ది వైట్ స్టామ్..ఫ్రమ్ వెగాస్ టు మకాన్...విచ్ డాక్టర్ లో నటించింది. View this post on Instagram A post shared by poydtreechada (@poydtreechada) -
ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన ట్రాన్స్జెండర్ హీరోయిన్ ట్రిచాడ పెట్టరాట్ ఫొటోలు చూశారా?
-
రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్కు రుణం
కరీంనగర్: ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం రాష్ట్రంలోనే ప్రథమంగా కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్జెండర్కు సబ్సిడీ రుణం మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన డీసీసీ డీఎల్ఆర్సీ సమావేశంలో ట్రాన్స్జెండర్కు రుణ మంజూరు పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలోని ట్రాన్స్జెండర్ ఆషాడం ఆశ (ఎస్సీ)కు ఫొటోగ్రఫీ యూనిట్ స్థాపన కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మరో ట్రాన్స్జెండర్ నక్క సింధుకు.. ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ను ఆయన అందజేశారు. -
Transgender Woman: ట్రాన్స్జెండర్లపై మనసుపడి.. మనువాడి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారిలో ట్రాన్స్జెండర్ల వర్గమొకటి. ఈ వర్గంవారు ఎక్కువగా భిక్షాటన, ఇతర వృత్తుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారిపై ఆదరణ చూపేవారికన్నా చీదరించుకునే వారే అధికంగా ఉంటారు. ఇలాంటివారికి పెళ్లి భాగ్యం తక్కువే. సాధారణంగా ఇలాంటి వారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ ఇటీవల ట్రాన్స్జెండర్లను సైతం కొందరు యువకులు ప్రేమించిపెళ్లి చేసుకుంటున్నారు. కన్నవారిని, సమాజ కట్టుబాట్లను సైతం ఎదురిస్తూ ఇష్టపడిన వారిని మనువాడుతున్నారు. ప్రేమ అంటే పైకి కనిపించే శరీరం కాదని.. అది మనసుకు సంబంధించిన విషయమని అంటున్నాయి ఈ రకపుప్రేమ జంటలు. మూడేళ్లపాటు ప్రేమించి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతతోగుకు చెందిన ట్రాన్స్జెండర్ అఖిల, భూపాలపల్లికి చెందిన రూపేశ్ మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదురించి గత మార్చిలో ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ కలసి ఉంటున్నారు. తమకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. ఒకరినొకరు ఇష్టపడి.. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన ట్రాన్స్జెండర్ దివ్యను జగిత్యాలకు చెందిన అర్షద్ పెళ్లిచేసుకున్నారు. మొదట కొంతకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. ప్రేమలో ఉండి సహజీవనం చేశారు. చివరకు అర్షద్ తన ఇంట్లో వాళ్లను ఎదిరించి గతేడాది డిసెంబర్లో హిందూ సంప్రదాయం ప్రకారం దివ్యను వివాహం చేసుకున్నారు. తమకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. జాతరలో పరిచయమై.. 2019లో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ను ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. మేడారం జాతరలో చిగురించిన వీరి ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. గతంలో కుటుంబాల్లో కట్టుబాట్లకారణంగా ఎక్కువగా బయటకురాని ఈ తరహా జంటలు.. ఇప్పుడు స్వేచ్ఛా సమాజం కారణంగా తమ విషయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. చట్టబద్ధత కోసం పోరాటం దేశంలో తొలిసారిగా కేరళలో ఓ ఎల్జీబీటీ పెళ్లి జరిగింది. ఆ దంపతులు తమ పెళ్లిని రిజిస్టర్ చేసి చట్టబద్ధత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ట్రాన్స్జెండర్ల పెళ్లిళ్లపై చర్చ మొదలైంది. ఎల్జీబీటీ హక్కుల చట్టంలో పెళ్లితో సహా, మరికొన్ని అంశాలు చేర్చాలనే పిటిషన్లు సుప్రీంలో విచారణలో ఉన్నాయి. తమకు అన్ని హక్కులు కల్పించాలని ట్రాన్స్జెండర్ల డిమాండ్. -
బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్మన్పై ఎమ్మెల్యే షాకింగ్ వ్యాఖ్యలు
దేశంలోనే తొలిసారిగా బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్మన్గా కేరళ ట్రాన్స్జెండర్ జంట నిలిచిన సంగతి తెలిసిందే. ఇది అరుదైన ఘటన అంటూ ఈ విషయం సర్వత్ర చర్చనీయాంశంగా నిలిచింది. ఐతే ఈ ఘటనపై కొడువల్లి ఎమ్మెల్యే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ సీనియర్ నాయకుడు(ఐయూఎంఎల్) ఎంకే మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అద్భుత ఘటనగా పేర్కొన్నవారంతా మూర్ఖులుగా అభివర్ణించారు. అసలు ఆ జంటకు పాప పుట్టిన విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అసలు విషయం మనకే అవగతముతుందన్నారు. దీని వెనుక ఉన్న లాజిక్ని కూడా ఆయన విడమరిచి మరీ చెప్పారు. బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్మన్ నిజానికి ఒక స్త్రీ ఆమె పురుషునిలా మారుదామని వక్షోజాలను కూడా తొలగించుకుంది. అయితే ఆమె గర్భం దాల్చడంతో ఆమెను పురుషుడిగా మార్చడం విరమించుకున్నారు. అంటే గర్భం దాల్చిన వ్యక్తి స్త్రీ అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అందరూ దీన్ని ఒక అద్భుతంగా ఆహో ఓహో అంటూ ఏవేవో కబుర్లు చెబుతూ.. మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారని కొడువల్లి ఎమ్మేల్యే ఎంకే మునీర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విజ్డమ్ ఇస్లామిక కాన్ఫరెన్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఫిబ్రవరి 8న ప్రసవించిన ట్రాన్స్మ్యాన్ జిహ్హద్ ఆ నవజాత శిశువు బర్త్ సర్టిఫికేట్లో తనను ఆ బిడ్డకు తండ్రిగా నమోదు చేయాలనిఆస్పత్రి వర్గాలను కోరిన నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఆమెను చూసి ‘అయ్యో’ అనేసిన ప్రధాని మోదీ) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్..
తిరువనంతపురం: కేరళ కోజికోడ్కు చెందిన ట్రాన్స్జెండర్ జంట జియా పావల్, జహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల క్రితమే వీరికి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా.. కోజికోడ్ మెడికల్ హాస్పిటల్లో బుధవారం ఉదయం జహద్ సిజేరియన్ ద్వారా ప్రసవించింది. పుట్టింది ఆడ బిడ్డా లేక.. మగబిడ్డా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తమ బిడ్డ ఫొటోను జియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు కావాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు సంతోషంగా ఉందని, ఆనంద బాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. తమకోసం ప్రార్థించిన వారికి, మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుట్టుకతో మగ అయిన జియా శస్త్రచికిత్స చేయించుకొని స్త్రీగా మారుతోంది. పుట్టుకతో స్త్రీ అయిన జహద్ శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారాలనుకున్నాడు. అయితే ఇంతలోనే జహద్ గర్భం దాల్చడంతో ఇద్దరూ ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్మన్.. దేశంలోనే తొలిసారి..
తిరువనంతపురం: కేరళకు చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్జెండర్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జియా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వీరిద్దరూ మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. పుట్టుకతో మగ అయినా జియా.. లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారుతోంది. మరోవైపు అమ్మాయిగా పుట్టిన జహద్ కూడా లింగ మార్పిడి చేయించుకుని అబ్బాయిగా మారుతున్నాడు. అయితే ఈ క్రమంలో గర్భం దాల్చడంతో బిడ్డ కోసం లింగ మార్పిడి ప్రక్రియను నిలిపివేశారు. ఫలితంగా దేశంలోనే గర్బం దాల్చిన తొలి ట్రాన్స్మన్గా జహద్ నిలిచారు. అయితే అబ్బాయిలా మారాలనుకున్నందున శస్త్రచికిత్సలో భాగంగా జహద్ వక్షోజాలను ఇప్పటికే తొలగించారు. గర్భాశయాన్ని కూడా తొలగించే లోపే జహద్ గర్భందాల్చడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పుట్టబోటే బిడ్డకు దాతల ద్వారా పాలు సమాకూర్చుకుంటామని ఈ జంట చెబుతోంది. తాను పుట్టుకతో అమ్మాయి కాకపోయినప్పటికీ బిడ్డతో అమ్మ అని పిలుపించుకోవాలని కలలు కనేదాన్నని జియా చెప్పింది. జహద్ కూడా నాన్న కావాలనుకున్నాడని పేర్కొంది. ఎట్టకేలకు తమ కల నేరవేరిందని, మరో నెలలో బిడ్డకు జన్మనిస్తామని ఆనందం వ్యక్తం చేసింది. బిడ్డ దత్తత కోసం ప్రయత్నాలు.. ఈ జంట కొద్దికాలంగా ఓ బిడ్డను దత్తత తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీరు ట్రాన్స్జెండర్ అయినందున దత్తత ప్రక్రియ సవాల్గా మారింది. బయోలాజికల్గా జహద్ ఇంకా అమ్మాయే కావడంతో సాధారణ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముందని భావించారు. అబ్బాయిగా మారాలనుకున్న జహద్ ఆలోచనను జియా తాత్కాలికంగా వాయిదా వేయించారు. ఇద్దరి ట్రాన్స్జెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కానందున పుట్టబోయో బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. అంతా సాధారణంగానే జరుగుతుందని చెప్పారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! -
నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్జెండర్తో ప్రేమ, పెళ్లి
బుల్లితెర నటులు దివ్య, అర్నవ్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తనని మోసం చేశాడంటూ అర్నవ్పై దివ్య ఇటీవల ఆరోపణలు చేయగా.. తన భార్యకు మతిస్థిమితం సరిగా లేదంటూ అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా దివ్య కంటే ముందు అర్నవ్ తనని పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియదర్శిని అనే ట్రాన్స్జెండర్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: భర్త జయంతి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నటి మేఘన ఈ మేరకు ఆమె ఓ ఆడియో రికార్డ్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మలయాళంలో ఉన్న ఈ ఆడియోలో ప్రియాంక ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘నాకు, అర్నవ్తో టీ నగర్లో పరిచయం ఏర్పడింది. మా పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల పాటు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మా వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఉన్నట్టుండి అర్నవ్లో సడెన్గా మార్పు వచ్చింది. తరచూ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడికి మరో మహిళతో పరిచయం వల్లే నన్ను వేధించడం స్టార్ట్ చేశాడు. నన్ను తీవ్రంగా హింసించాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. అర్నవ్ ఓ సైకో’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు ఇక అతడి వేధింపులు తట్టుకోలేక తాను అర్నవ్ నుంచి విడిపోయానంటూ ప్రియదర్శిని తెలిపింది. ఇదిలా ఉంటే కేలాడి కన్మణి అనే సీరియల్ షూటింగ్లో సమయంలో నటి దివ్య, అర్నవ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2022 జూన్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భంగా దాల్చింది. ఇప్పుడు అర్నవ్ తనని వదిలేసి మరో నటితో క్లోజ్గా ఉంటున్నాడంటూ దివ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ట్రాన్స్జెండర్గా ప్రముఖ బాలీవుడ్ నటి.. లుక్ చూశారా?
బాలీవుడ్ పాపులర్ నటి సుష్మితా సేన్ ట్రాన్స్జెండర్గా నటిస్తుంది. 'తాలి' అనే వెబ్సిరీస్ కోసం ఆమె ప్రముఖ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ గౌరీ సావంత్ పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ వెబ్సిరీస్ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో సుష్మితా ఆకుపచ్చని చీరలో నుదిటిపై ఎర్రటి తిలకంతో బోల్డ్లుక్లో కనిపిస్తుంది. 'అందమైన వ్యక్తి కథను అంతే అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావడం కన్నా సంతోషం ఏముంటుంది' అంటూ సుష్మితా తాలి ఫస్ట్లుక్ పోస్టర్ని తన సోషల్ మీడియా పంచుకుంది. కాగా గౌరీ సావంత్ ముంబైకి చెందిన ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్. గణేష్గా పుట్టి ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకున్న గౌరీ సావంత్ 2013లో ట్రాన్స్జెండర్స్ని కూడా పురుషులు, మహిళలు లాగే ఓ ప్రత్యేక క్యాటగిరి కల్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్స్ని థర్డ్జెండర్గా గుర్తిస్తూ 2014లో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
భర్తకు ట్రాన్స్వుమన్తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య..
భువనేశ్వర్: ఒడిశా కలాహాండీ జిల్లాలో ట్రాన్స్వుమన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 32 ఏళ్ల వ్యక్తి. అయితే అతనికి అప్పటికే మరో మహిళతో వివాహమైంది. రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ భార్య అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మొదటి భార్య ఒప్పుకోవడమే గాక.. ట్రాన్స్వుమన్ కూడా తమతో పాటు ఒకే ఇంట్లో ఉండేందుకు అనుమతించడం గమనార్హం. అలామొదలైంది.. ట్రాన్స్వుమన్ను గతేడాది రాయగడ జిల్లా అంబడోలాలో చూశాడు ఈ వ్యక్తి. రోడ్డుపై భిక్షాటన చేసే ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలోపడిపోయాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత రోజూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అయితే నెల రోజుల క్రితం ఈ వ్యక్తి భార్య అతని ఫోన్ను చెక్ చేయగా అసలు విషయం తెలిసింది. రోజూ ట్రాన్స్వుమెన్తో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అతడ్ని భార్య నిలదీసింది. ఇక చేసేదేంలేక అతను నిజం ఒప్పుకున్నాడు. ట్రాన్స్వుమన్తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించాడు. ఆమె తనుకు చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. దీంతో భార్య వారి రిలేషన్కు అంగీకరించింది. పెళ్లి చేసుకుంటామంటే ఓకే చెప్పింది. భార్య అంగీకారంతో ట్రాన్స్వుమన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు భర్త. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. రెండో పెళ్లి చెల్లదు.. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా అది చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. భర్త మాత్రం తమ కుటుంబమంతా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నాడు. చట్టాల గురించి తాము పట్టించుకోమని పేర్కొన్నాడు. చదవండి: అంబులెన్సులా మారిన బుల్డోజర్.. వీడియో వైరల్ -
మొన్న స్విమ్మింగ్.. ఇవాళ రగ్బీ; ట్రాన్స్జెండర్లకు వరుస అవమానాలు
ప్రస్తుతం ప్రపంచంలో ట్రాన్స్జెండర్లకు దాదాపు అన్ని దేశాలు తమ పౌరులతో సమానంగా హక్కులు కల్పిస్తున్నాయి. అన్ని రంగాల్లో ట్రాన్స్జెండర్లు ముందుకు వెళ్తుంటే క్రీడల్లో మాత్రం వెనక్కి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ట్రాన్స్జెండర్లను ఆడించడం వల్ల ఆట సమతుల్యం దెబ్బతింటుందని అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇటీవలే పేర్కొంది. లింగమార్పిడి చేసుకున్న స్విమ్మర్లు పురుషుల యుక్త వయస్సు దాటితే మహిళల ఎలైట్ రేసుల్లో పాల్గొనరాదని.. అందుకే స్విమ్మింగ్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తునట్లు నిర్ణయం తీసుకుంది. తాజాగా అంతర్జాతీయ రగ్బీ లీగ్(ఐఆర్ఎల్) కూడా అదే బాటలో నడిచింది. ఇక నుంచి జరగబోయే అంతర్జాతీయ మహిళల రగ్బీ మ్యాచ్ల్లో ట్రాన్స్జెండర్ ప్లేయర్లను ఆడించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్జెండర్లను రగ్బీ ఆడించేందుకు సరికొత్త పాలసీలు తీసుకు రావాల్సి ఉంది. ప్రపంచ క్రీడలో సంబంధిత పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రగ్బీ లీగ్లో ట్రాన్స్జెండర్లను ఆడించే విషయంలో ఇంకా పూర్తిస్తాయిలో పరిశోధన జరగాల్సి ఉందని ఐఆర్ఎల్ అభిప్రాయపడింది. ఐఆర్ఎల్ తాజా నిర్ణయంతో అక్టోబర్ లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న రగ్బీ లీగ్ మహిళల ప్రపంచకప్లో ట్రాన్స్జెండర్ కీడ్రాకారులు పాల్గొనే అవకాశం లేనట్లే. ఈ ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, పపువా న్యూగినియా లాంటి జట్లు పోటీ పడుతున్నాయి. కాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఈ ఏడాది ప్రారంభంలో ట్రాన్స్జెండర్లకు ఆటల్లో పాల్గొనే హక్కులకు సంబంధించిన విధానాలను రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని క్రీడా సమాఖ్యలన్నీ ట్రాన్స్జెండర్లు క్రీడల్లో పాల్గొనేందుకు కొత్త నిబంధనలు రాసుకునే పనిలో ఉన్నాయి. ఇక ట్రాన్స్జెండర్లను రగ్బీ లీగ్ నుంచి నిషేధించడంపై క్రీడాలోకం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. కొందరేమో.. 'వారు ఆడకపోతే మంచిదని' పేర్కొనగా.. 'ట్రాన్స్జెండర్లకు ఇది అవమానమే' అని మరికొందరు తెలిపారు. ఈ విషయంలో ట్రాన్స్జెండర్లు స్పందిస్తూ.. ఇది క్రీడల ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని .. సమానత్వం కోసం పాటుపడే క్రీడల్లో ఇలా వివక్ష చూపడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే వింబుల్డన్ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్ క్రీడాకారిణి -
లైంగికంగా వేధించారు.. అందుకే 'గే' అయ్యావా అన్నారు..
Lock Upp: Saisha Shinde Reveal Secret Says This Is Why You Are Gay: బాలీవుడ్ వివాస్పద బ్యూటీ కంగనా రనౌత్ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్గా సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్ స్పెషల్ ఎపిసోడ్లో మునావర్ ఫరూఖీ తన లైఫ్ సీక్రెట్ను చెప్పాడు. తన ఆరేళ్ల వయసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత కంగనాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పి షాక్కు గురి చేసింది. అయితే వీరి తర్వాత ఎవిక్షన్ నుంచి సేవ్ అయిన సైషా షిండే తను ఎలాంటి వేధింపులను ఎదుర్కుందో లాకప్ వేదికగా తెలియజేసింది. 'ఇది నా మొదటి సీక్రెట్. మీకు (మునావర్ ఫరూఖీ, కంగనా రనౌత్) జరిగిన లైంగిక వేధింపులను మీరు పంచుకోవడం చూశాక, అది విని ప్రజలు ఎలా రియాక్టయ్యారో చూశాక నాకు జరిగింది గుర్తుకు వచ్చింది. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది వ్యక్తులు 'ఇందుకేనా నువ్ స్వలింగ సంపర్కురాలివి అయ్యావా (గే)' అని అన్నారు. అలా అన్నాక ఇక ఎవ్వరికీ ఈ విషయం గురించి చెప్పే సాహసం చేయలేదు.' చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ View this post on Instagram A post shared by S A I S H A S H I N D E (@officialsaishashinde) సైషా తాను స్వప్నిల్ షిండేగా ఉన్న సమయం గురించి పలుసార్లు తెలిపింది. ఆ సమయంలో తనను తాను స్వలింగ సంపర్కాలు (గే) అని నమ్మిందట. సైషాగా మారాలని నిర్ణయించుకునేంత వరకు మానసికంగా ఎలా పోరాడిందో తరచుగా చెప్పేది. దీపికా పదుకొణె, కరీనా కపూర్ ఖాన్, కత్రీనా కైఫ్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, సన్నీ లియోన్, తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్, హీనా ఖాన్లతో సహా టాప్ ఎ-లిస్ట్ బాలీవుడ్ నటులతో ప్రముఖ డిజైనర్ స్వప్నిల్ షిండేగా పనిచేసింది. చదవండి: పెళ్లయ్యాక పరాయి వ్యక్తిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_921254769.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..
సాక్షి, బెంగళూరు: పోలీసు శాఖలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వు పోలీసు ఎస్సై పోస్టులకు స్త్రీ, పురుష అభ్యర్థులతోపాటు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. సుమారు డెబ్భై పోస్టుల భర్తీకి కర్ణాటక స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పట్టభద్రులై ఉండి, జిల్లా మెజిస్ట్రేట్ నుంచి తమ జెండర్ స్టేటస్ను నిర్థారించే సర్టిఫికెట్ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. చదవండి: Mamata Banerjee: కోల్కతా దీదీదే.. తృణమూల్ ‘హ్యాట్రిక్’ -
నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో!
A young man tragically murdered by his mother In Chennai తమిళనాడు: ట్రాన్స్జండర్ మహిళగా జీవిస్తానన్నందుకు తల్లే అతని పాటిట మృత్యువైంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని సేలం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో 19 యేళ్ల నవీన్ అనే వ్యక్తిని తల్లి ధారుణంగా హతమార్చింది. ఈ కేసులో అందిన సమాచారం మేరకు మృతుడు నవీన్కు ట్రాన్స్జండర్గా మారాలని ఉందని తరచూ తల్లి ఉమాదేవికి వద్దకొచ్చి చెబుతూ ఉండేవాడు. ఈక్రమంలో నవీన్ తన పేరును అక్షితగా మార్చుకున్నాడు కూడా. ఐతే ఉమాదేవి కొడుకును ట్రాన్స్జండర్గా మారవద్దని పలుమార్లు సూచించింది. నవీన్ నిరాకచించడంతో తల్లి మరో ఐదుగురి సహాయంతో అతనిపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన నవీన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గత వారం చోటుచేసుకున్న ఈ ఉదంతంలో నవీన్ను అతని తల్లి ఉమాదేవి హత్య చేసినట్లు సేలం పోలీసుల దర్యాప్తులో తేలింది. మగవాడిగా ఉండేందుకు నవీన్ హార్మోన్లు తీసుకోవాలని ఉమాదేవి ఒత్తిడి చేసిందని, అందుకు నవీన్ నిరాకరించడంతో నిందితురాలు ఉమాదేవి, ఆమె సహచరులు నవీన్పై దాడి చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉమాదేవితో పాటు వెంకటేష్, కామరాజ్, కార్తికేయ, సంతోష్, శివకుమార్లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
ట్రాన్జెండర్ల కోసం ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ!
LIC Dhan Rekha Plan Details: ఎల్ఐసీ కొత్తగా ‘ధన రేఖ’ పేరుతో సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఆవిష్కరించింది. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లను అమలు చేస్తున్నామని, మూడో లింగానికి కూడా (మహిళలు, పురుషులు కాని వారు) ఈ ప్లాన్ను ఆఫర్ చేస్తున్నామని ఎల్ఐసీ ప్రకటించింది. ప్రీమియం చెల్లింపుల వ్యవధి ముగిసిన తర్వాత సమ్ అష్యూరెన్స్లో నిర్ణీత శాతాన్ని సర్వైవల్ బెనిఫిట్ కింద నిర్దేశిత విరామంతో చెల్లిస్తామని.. గడువు తీరిన తర్వాత సమ్ అష్యూరెన్స్ మొత్తాన్ని ఎటువంటి తగ్గింపులు లేకుండా పాలసీదారు అందుకుంటారని తెలిపింది. ఈ ప్లాన్ కింద కనీసం రూ.2లక్షల బీమా రక్షణను ఎంపిక చేసుకోవాలి. పాలసీ తీసుకునేందుకు కనిష్ట, గరిష్ట వయో పరిమితి 90 రోజులు– 55 సంవత్సరాలు. - న్యూఢిల్లీ చదవండి: మానవత్వం చాటుకున్న ట్రాన్స్జెండర్ ఎస్ఐ -
ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్గా శ్రుతి సితార..
Keralas Sruthy Sithara Crowned Miss Trans Global Universe 2021: సమాజం చూసే చిన్నచూపును అధిగమిస్తూ ఇప్పుడిప్పుడే అన్నింటా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు ట్రాన్స్జెండర్లు. ఇప్పుడు కేరళలో ఉంటున్న శ్రుతి సితార ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ 2021 టైటిల్ను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ‘సమాజంలో ట్రాన్స్జెండర్స్ పట్ల ఉన్న సంకుచిత మనస్తత్వాలను మార్చేందుకు, ఏళ్లుగా చేసిన పోరాటం వల్ల ఈ కిరీటాన్ని దక్కించుకున్నాను’ అని ఆనందంగా చెబుతుంది శ్రుతి సితార. ప్రపంచంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో స్ఫూర్తిని, విశ్వాసాన్ని నింపడానికి లండన్ వేదికగా ప్రతి యేటా మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివవర్స్ పోటీలు జరుపుతారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఆన్లైన్ వేదికగా ఈ నెల మొదట్లో పోటీలు జరిపారు. ప్రపంచం నలుమూలల నుండి పాల్గొన్న ట్రాన్స్ ఉమెన్లలో శ్రుతి సితార మొదటి ప్లేస్లో నిలిచి, కిరీటాన్ని దక్కించుకుంది. మొదటి ఇద్దరు రన్నరప్లుగా నిలిచినవారిలో వరుసగా ఫిలిప్పీన్స్, కెనడాకు చెందివారున్నారు. సమాజంలో సమాన హక్కులు ‘ఈ రోజు నేను పుట్టి పెరిగిన మా ఊరు వైకోమ్ లో ఉన్నాను. మొదట్లో నన్ను వింతగా చూసిన నా చుట్టుపక్కల వాళ్లే ఇప్పుడు నా విజయానికి అభినందనలు తెలుపుతున్నారు’ అని తన విజయగాథను వివరించే సితార సామాజిక న్యాయ విభాగంలో ట్రాన్స్జెండర్ సెల్లో పని చేస్తున్నారు. మోడల్గానూ, ఆర్టిస్ట్గానూ ఉన్న శ్రుతి ఎల్జీబీటీ, క్వీర్ రైట్స్పై ప్రచారం చేయడానికి కృషి చేస్తోంది. సామాజిక న్యాయవిభాగం నుంచి రూపొందించినకార్యక్రమాలలో వివిధ పాఠశాలలు, కళాశాలలలో ప్రసంగించింది. కమ్యూనిటీ హక్కులను సాధించడానికి ప్రజల ఆమోదాన్ని పొందేందుకు ఈ ట్రాన్స్ మహిళ తన స్నేహితులతో కలిసి ‘ది కెలిడోస్కోప్’ అనే పేరుతో ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది. సమాజంలో సమాన భాగాన్ని సాధించాలని కోరుకుంటున్నాం. బయటకు రావడానికి భయపడే చాలా మంది ట్రాన్స్జెండర్లు ఇప్పుడిప్పుడే నన్ను సంప్రదిస్తున్నారు. వారి జీవితాల్లో ఆశ, ధైర్యాన్ని అందించడమే నా ముందున్న లక్ష్యం. నేను నడిచే దారిలో ఇప్పుడు ఈ కిరీటం నాకు ఎంతగానో సహాయపడుతుంది’ అని ఉద్వేగంగా చెబుతూనే తన ఆనందాన్ని వ్యక్తం చేసింది శ్రుతి. కిరీటాన్ని అందుకున్న శ్రుతి దానిని తన దివంగత తల్లితో పాటు తన స్నేహితురాలు, ఫస్ట్ ట్రాన్స్జెండర్ రేడియో జాకి అయిన అనన్యకుమారి అలెక్స్కు అంకితం చేసింది. అనన్య నాలుగునెలల క్రితం కొచ్చిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, శారీరక బాధకు లోనై ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర, ఎండు ద్రాక్ష, ఖర్జూర తింటున్నారా! -
పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది
సాక్షి, వెబ్డెస్క్: ట్రాన్స్జెండర్లు.. ఈ పేరు వినగానే చాలా మందికి రోడ్డు మీద భిక్షాటన చేసుకునేవారే గుర్తుకు వస్తారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటు. వారిలో కూడా చాలామంది మంచి ఉద్యోగాలు చేసేవారు.. సమాజసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నావారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మంజమ్మ జోగతి. ట్రాన్స్జెండర్ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. ఫోక్ డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక అవార్డు తీసుకునే వేళ మంజమ్మ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజనులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ) కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్విమెన్గాను మంజమ్మ జోగతి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను తనదైన స్టైల్లో ఆశీర్వదించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. మంజమ్మ తన చీర కొంగుతో రామ్నాథ్కు దిష్టి తీసినట్లు చేశారు. ఇది వారి స్టైల్లో ఆశీర్వదించడం అన్నమాట. రామ్నాథ్ కోవింద్ కూడా మంజమ్మ ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఇది చూసిన సభికులు చప్పట్లతో వారివురిని ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్గా నిలిచారు మంజమ్మ. (చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!) మంజమ్మ జీవితం.. మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని.. నిలబడి.. నేడు సన్మానాలు అందుకున్నారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు. ఇక ఆమె కుటుంబం మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లింది. ట్రాన్స్జెండర్ల సంఘం తమను తాము రేణుకా ఎల్లమ్మ దేవత సేవలో అంకితం చేసుకునే ప్రక్రియే జోగప్ప. ఇలా మారిన వారు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు. పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్యనే మంజమ్మ జోగతి పలు కళారూపాలు, జోగతి నృత్యం, స్త్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. (చదవండి: బిగ్బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..) మంజమ్మ సేవలకు గాను 2006లో, ఆమెకు కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత అనగా 2019లో, ఆమె సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. చదవండి: భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను -
ట్రాన్స్జెండర్ చిరకాల కల నెరవేర్చిన సీఎం స్టాలిన్
చెన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం ఎంకే స్టాలిన్ ఆదర్శ నిర్ణయాలు తీసుకుంటూ అందరితో శభాశ్ అనిపించుకుంటున్నారు. పాలనలోనూ.. ఇటు వ్యక్తిగతంగాను స్టాలిన్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తాజాగా స్టాలిన్ తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్ ఉమన్ చిరకాల కల నెరవేర్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి. తిరువాణ్నమలై పట్టణంలోని పవుపట్టుకు చెందిన ఎస్.శివన్య లింగ మార్పిడి చేసుకున్న మహిళ. ఆమె కామర్స్లో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు ఎప్పటికైనా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కావాలని చిరకాల కల. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం వేసిన పోలీస్ ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకుంది. నీకెందుకు పోలీస్ ఉద్యోగం అని పలువురు అవమానించగా వాటిని సహించింది. ఎంతో దీక్షతో ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఈవెంట్స్, పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యింది. లాక్డౌన్ వలన వైద్య, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆలస్యంగా జరిగాయి. చివరకు అవి కూడా పూర్తి కావడంతో ఇటీవల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శివన్యకు ఎస్సై నియామక పత్రాన్ని అందించారు. ఈ పత్రం అందుకున్న తర్వాత శివన్య ఆనందానికి అవధుల్లేవు. ‘నా సోదరులు, కుటుంబసభ్యులు ఎప్పుడూ నాకు అండగా ఉన్నారు. వారు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా లక్ష్యం ఎస్సై కాదు. గ్రూప్ 1 సాధించి ఎలాగైనా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కావాలని ధ్యేయం. అది కూడా సాధిస్తా. తమిళనాడు మొదటి లింగమార్పిడి ఎస్సైగా ప్రీతిక యాసిని నాకు ఆదర్శం’ అని శివన్య తెలిపింది. గతంలో శివన్య తిరువణ్నామలై కోర్టులో పారా లీగల్ వలంటీర్గా సేవలందించింది. శివన్య అన్నయ్య పేరు స్టాలిన్ కావడం గమనార్హం. ఆమె తమ్ముడు తమిళనిధి కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
ట్రాన్స్జెండర్ అనన్య మృతిని తట్టుకోలేక..
తిరువనంతపురం: ఈ వారం ప్రారంభంలో కేరళకు చెందిన తొలి ట్రాన్స్జెండర్ రేడియో జాకీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తొలి ట్రాన్స్జెండర్ అనన్య కుమారి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అనన్య మృతిని తట్టుకోలేక ఆమె భాగస్వామి జిజు రాజ్ (36) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు.. తిరువనంతపురం తైకవు గ్రామం జగథి ప్రాంతానికి చెందిన జిజు రాజ్కు కొన్నేళ్ల క్రితం అనన్య కుమారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రిత అనన్య కుమారి తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అనన్య మృతి వార్త తెలిసిన నాటి నుంచి జిజూ రాజ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అనన్య కుమారి భాగస్వామి జిజు(ఫైల్ఫోటో, ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) ఒంటరితనం వేధించసాగింది. ఈ బాధ నుంచి బయటపడటం కోసం జిజూ కొచ్చిలోని తన స్నేహితుడి రూమ్కి వెళ్లాడు. కానీ ముభావంగా ఉండసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం స్నేహితుడు బయటకు వెళ్లిన తర్వాత జిజు అతడి గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనన్య కుమారి లింగమార్పిడి కోసం ఆరు సర్జరీలు చేయించుకుంది. కానీ వాటి వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన అనారోగ్య సమస్యలకు ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపించింది. వీటన్నింటితో డిప్రెషన్నకు గురైన అనన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. -
6 లింగమార్పిడి సర్జరీలు.. ట్రాన్స్జెండర్ ఆత్మహత్య
తిరువనంతపురం: కేరళ తొలి ట్రాన్స్జెండర్ రేడియో జాకీ, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మొదటి ట్రాన్స్జెండర్ అనన్య కుమారి అలెక్స్ మంగళవారం ఆత్మహత్య చేసుకుని మరణించారు. కొచ్చిలోని ఆమె నివాసంలో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అనన్య కుమారి ఏడాది నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. గతేడాది జూన్లో ఆమె ఆరు లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వీటి వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. తనకు సర్జరీ చేసిన ఆస్పత్రి, వైద్యులపై పలు ఆరోపణలు చేశారు అనన్య కుమారి. లింగ మార్పిడి చికిత్సల అనంతరం తాను పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. సర్జరీ చేసి ఏడాది పూర్తి కావొస్తున్న తన ఆరోగ్యం కుదుటపడలేదని.. దారుణమైన బాధ కలుగుతుందని ఆరోపించారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని గతంలో అనన్య కుమారి డిమాండ్ చేశారు. అనన్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అన్యన్య కుమారిది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అనారోగ్య కారణాల వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడంతో అనన్య కుమారి పేరు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో అనన్య డెమొక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ(డీఎస్జేపీ) అభ్యర్థిగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి పీకే కుంజలికుట్టికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశౠరు. అయితే పోలింగ్కు ఒక రోజు ముందు ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. తనను బెదిరిస్తున్నారని.. ముఖ్యంగా సొంత పార్టీ నాయకులే తనను వేధింపులుకు గురి చేస్తున్నారని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆమె డీఎస్జేపీకి ఓటు వేయవద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. -
పెళ్లైన 2 నెలలకు భార్య మహిళ కాదని తెలిసింది..
లక్నో: ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ వ్యక్తికి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి మహిళ కాదు.. ఓ ట్రాన్స్జెండర్ అని తెలిసి కుప్పకూలాడు. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఏప్రిల్ 28న వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్య అతడికి దూరంగా ఉండసాగింది. ఎన్ని సార్లు దగ్గరవుదామని ప్రయత్నించినా.. ఏదో ఓ కారణం చెప్పి అతడిని దూరం పెట్టసాగింది. గట్టిగా అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని తెలిపేది. పెళ్లై రెండు నెలలు గడుస్తున్నా.. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సదరు వ్యక్తిలో అనుమానం మొదలయ్యింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా షాకింగ్ విషయం తెలిసింది. సదరు వ్యక్తి భార్య అసలు మహిళే కాదని.. ట్రాన్స్జెండర్ అని తెలిపారు వైద్యులు. మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. చదవండి: మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’ -
ఆడా-మగా జననాంగాలు.. 25 ఏళ్ల తర్వాత వివాదాస్పదం
వైద్య శాస్త్రంలో ఓ అరుదైన కేసు.. సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్సెక్స్ జెండర్) కలగలిసి పుట్టిన ఓ బిడ్డను.. సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు వైద్యులు. అయితే ఆ నిర్ణయంపై అతడుగా ఉన్న ఆమె ఇన్నేళ్ల తర్వాత పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా క్రూరంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తనును మళ్లీ యథాస్థితికి మార్చేయాలని కోరుతోంది. హవాయి స్టేట్ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్పర్ట్ లూనా అనిమిషా.. తనను మహిళగా మార్చేయాలని పోరాడుతోంది. పుట్టినప్పుడు డాక్టర్లు ఆమె జననాంగాన్ని కుట్టేయడంతో పాటు, సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించారు. దీంతో లూనా.. ఇన్నేళ్లూ మగవాడిలానే పెరుగుతూ వస్తోంది. అయితే తనలో ‘ఆమె’ను ఎంతో కాలం అణుచుకోలేకపోయింది లూనా. అయితే తనని ఓ జంతువులా భావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తిరిగి సర్జరీలకు ఆమె సిద్ధమైంది. ‘‘తప్పు నా తల్లిదండ్రులదా? ఆ డాక్టర్లదా? అనే ప్రసక్తి కాదు. అంతిమంగా ఇబ్బంది పడుతోంది నేను. నాకు మగాడిగా కంటే ఆడదానిగా బతకడమే ఇష్టంగా అనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో తొలిసారి నా శరీరానికి కలిగిన గాయమేంటో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్నేళ్లలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అవమానాల్ని భరించాను. అసలు నా గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. ఎవరితోనూ కలవలేకపోయాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి రెండూ నాకు వచ్చాయి’’ అని నవ్వుతూ చెప్తోందామె. మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. సర్జరీలకు అవసరమయ్యే డబ్బు కోసం ‘గో ఫండ్ మీ’ వెళ్లింది. లక్షా యాభై వేల డాలర్లు సేకరించి.. తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటోంది. 2019లో క్లీవ్లాండ్కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ గర్భసంచిని మార్పిడి ద్వారా ఎక్కించారు. అలా ఆ మహిళ తల్లి కాగలిగింది కూడా. ఆ కేసును రిఫరెన్స్గా తీసుకుని లూనా.. తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. అంతేకాదు సొసైటీలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్సెక్స్, ట్రాన్స్జెండర్ బాధితుల కోసం లూనా పోరాడుతోంది కూడా. చదవండి: ‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’ -
మొబైల్ టాయిలెట్లు.. మొదటిసారిగా ట్రాన్స్జెండర్లకూ సౌకర్యం
సాక్షి, బంజారాహిల్స్: నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అందుబాటులో టాయిలెట్లు లేకపోవడంతో పాటు పిల్లలకు పాలు ఇచ్చే సందర్శకులు, రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లే వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన జీహెచ్ఎంసీ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్లో మొబైల్ టాయిలెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల నెక్లెస్ రోడ్కు వచ్చే వేలాది మంది పర్యాటకులతో పాటు ఇక్కడ వ్యాపారాలు కొనసాగించే మహిళలకు ఎంతగానో ఉపయోగం చేకూరనుంది. ఇప్పటి వరకు టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో తెరపడినట్లైంది. ►నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చారు. ►నగరంలోని ఏడు ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ►వీటిలో ప్రత్యేకంగా స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ►మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా ఈ మొబైల్ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు. ►ఇప్పటికే 30 మొబైల్ టాయిలెట్లు నగర వ్యాప్తంగా అందుబాటులో ఉండగా... ఖైరతాబాద్ జోన్కు కొత్తగా మరో ఐదు మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. ►రద్దీ ప్రాంతాలు, సభలు, సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల్లో, సందర్శనా స్థలాల్లో, పర్యాటక ప్రాంతాల్లో, పార్కుల వద్ద ఈ మొబైల్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ►వీటిలో మహిళలకు రెండు, పురుషులకు ఒకటి, ట్రాన్స్జెండర్స్కు ఒకటి చొప్పున నాలుగు యూరినల్స్ను ఏర్పాటు చేశారు. ►ఇక పాలిచ్చే మహిళలకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ►ఈ మొబైల్ టాయిలెట్ వెనుకాల స్నాక్స్, కూల్డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయానికి గాను ఒక షాపును ఏర్పాటు చేశారు. ►సోలార్ పవర్ విధానం కల్పించిన ఈ మొబైల్ టాయిలెట్ నిర్వహణను ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. ►ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా ఈ మొబైల్ టాయిలెట్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ►నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా రూపొందించిన నేపథ్యంలో ఇక్కడ విజయవంతమైతే మరిన్ని బస్సులను మొబైల్ టాయిలెట్లుగా తయారు చేయనున్నారు. ►బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజ గుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, లక్డీకాపూల్, రవీంద్రభారతి తదితర ప్రాంత్లాలో కూడా నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చే దిశలో కసరత్తు జరుగుతుంది. ఇందు కోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ►ఈ మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు హర్షణీయమని మహిళలు అంటున్నారు. ►మరిన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చదవండి: God Of Mischief: లోకి గురించి మీకు ఈ విషయాలు తెలుసా! -
సహజీవనం: ట్రాన్స్జెండర్ అనుమానాస్పద మృతి
చైతన్యపురి: అనుమానాస్పదంగా ట్రాన్స్జెండర్ మృతి చెందిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ బుద్దతండాకు చెందిన వంకునావత్ మహేష్(23) మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. అనంతరం లింగమార్పిడి చికిత్స చేయించుకుని మహేష్ తన పేరును అమృతగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా చైతన్యపురి మోహన్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఎన్టీఆర్నగర్కు చెందిన షేక్ జావేద్తో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల తనను జావేద్ హింసిస్తున్నాడని, చేయిచేసుకుంటున్నాడని బడంగ్పేటలో నివసించే సోదరుడు శ్రీనుకు ఫోన్లో చెప్పింది అమృత. మంగళవారం సాయంత్రం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన కిషన్ అనే వ్యక్తి శ్రీనుకు ఫోన్ చేసి అమృత చనిపోయిందని చెప్పారు. వెంటనే అమృత ఉండే గదికి వచ్చి చూడగా మంచంపై చనిపోయి కనిపించింది. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు -
యువతిగా మారాలని యువకుడి కోరిక.. చివరికి
సాక్షి, హైదరాబాద్: యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబికులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్నగర్కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్జెండర్స్ హెల్ప్డెస్క్ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబికులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. గత నెల 6 నుంచి పని చేయడం ప్రారంభించిన ఈ డెస్క్కు మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు గురువారం వెల్లడించారు. అయిదుగురికి కౌన్సెలింగ్ చేయగా.. రెండు అంశాల్లో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. షాద్నగర్కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ట్రాన్స్జెండర్స్ గ్రూప్లో చేరాడు. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న షాద్నగర్ పోలీసులు అతడిని గుర్తించి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా గడిచిన కొన్నేళ్ల కాలంలో మూడు నాలుగుసార్లు జరిగింది. ఇటీవల మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయిన అతగాడు సిద్దిపేటకు చేరాడు. అతడి తల్లిదండ్రులు షాద్నగర్ పోలీసుల వద్దకు వెళ్లగా.. అక్కడి అధికారులు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్స్ హెల్ప్ డెస్క్కు పంపారు. సబ్– ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సాగుతున్న ఈ డెస్క్ వీరి నుంచి ఫిర్యాదు స్వీకరించింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించింది. అతడు సిద్దిపేటలో ఉన్నట్లు గుర్తించి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్లో మరిన్ని తీవ్ర పరిణామాలకు ఆస్కారం ఉందంటూ తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసింది. ఫలితంగా పరిస్థితులు అర్థం చేసుకున్న వాళ్లు తమ కుమారుడి కోరికను మన్నించారు. హెల్ప్ డెస్కే చొరవ తీసుకుని అతడికి ఓ ఉద్యోగం ఇప్పించింది. ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడనంటూ ‘ఆమె’గా మారిన అతడి నుంచి హామీ తీసుకుని పంపింది. ట్రాన్స్జెండర్స్ అంశాలకు సంబంధించి సహాయ సహకారాలు కావాల్సిన వారు 94906 17121లో వాట్సాప్ ద్వారా (transgender.cybsuprt121@gmail.com) ఇన్స్టాగ్రామ్ (transgender cybsupport), ఫేస్బుక్ ‘Transgender Cyberabad Support) ఖాతాల్లో సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. చదవండి: ట్రాన్స్జెండర్ వైద్యురాలికి కీలక పదవి -
అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం
-
శిల్పారామంలో ట్రాన్స్జెండర్స్ ఫ్యాషన్ ర్యాంప్ వాక్ ఫోటోలు
-
మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’
గాంధీనగర్: గుజరాత్, అహ్మదాబాద్కు చెందిన డాక్టర్ జిస్నూర్ దయారా రాష్ట్రం నుంచి వైద్య విద్యనభ్యసించిన తొలి ట్రాన్స్ వుమెన్గా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుని మరో సారి వార్తల్లో నిలిచారు. త్వరలోనే శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా మహిళగా మారనున్న దయారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ జన్మకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చే మాతృత్వాన్ని అనుభూతి చెందడం కోసం తన వీర్యాన్ని భద్రపరుచుకున్నారు. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి ఆమె బిడ్డను కనాలని భావిస్తున్నారు. ఇలా జన్మించే బిడ్డకు దయారానే తల్లి, తండ్రి అవుతారు. ఒకే జన్మలో ఆమె మగాడిగా, స్త్రీగా జీవించనున్నారు. అదే విధంగా తొలిసారి ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా దయారా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారిగా జీవించాలని ఉండేది. మా అమ్మ, అక్కలాగా చీర కట్టుకోవాలని.. లిప్స్టిక్ వేసుకోవాలని మనసు తహతహలాడేది. కానీ చుట్టూ ఉన్న సమాజానికి భయపడి.. నాలోని స్త్రీని బయటకు రానివ్వలేదు. ఇదిలా కొనసాగుతుండగానే.. ఎంబీబీఎస్ చదవడానికి నేను రష్యా వెళ్లాను. అక్కడ నాలాంటి వారు ఎంతో ధైర్యంగా.. తమకు నచ్చినట్లు బతకడం చూశాను. నాలో ధైర్యం వచ్చింది. భయాల్ని తొలగించుకున్నాను. నాకు నచ్చినట్లు బతకడం మొదలు పెట్టాను. చీర కట్టుకోవడం, లిప్స్టిక్ వేసుకోవడం నేర్చుకున్నాను. నన్ను చూసి మొదట నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం వారు నన్ను అర్థం చేసుకున్నారు. నా చుట్టు ఉన్న సమాజం కూడా నన్ను అంగీకరించడం ప్రారంభించింది’’ అంటూ చెప్పుకొచ్చారు దయారా. తల్లి అవ్వడం నా కల ‘‘ప్రస్తుతం ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్ష రాయబోతున్నాను. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా నేను పూర్తిగా స్త్రీగా మారతాను. ఆడవారికి లభించిన అద్భుతమైన వరం ఓ జీవికి జన్మనివ్వడం. నేను కూడా ఆ వరాన్ని అందుకోవాలని భావిస్తున్నాను. మాతృత్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. అందుకే లింగ మార్పిడి శస్త్రచికిత్సకు ముందే నా వీర్యాన్ని భద్రపరుచుకోవాలని భావించాను. ఇందుకు గాను అహ్మదాబాద్, ఆనంద్లోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రిని సంప్రదించి.. నా కోరికను వారికి చెప్పాను. నా నిర్ణయాన్ని గౌరవించిన వారు నా వీర్యాన్ని భద్రపరిచేందుకు అంగీకరించారు. వారికి ఎంతో రుణపడి ఉంటాను’’ అన్నారు దయారా. సరోగసి ద్వారా బిడ్డను కంటాను ‘‘కాళీ మాతా దయ వల్ల నేను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. అలా జన్మించే బిడ్డకు బయాలజీకల్గా నేనే తల్లి, తండ్రి. ఈ విషయం తలుచుకుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. బిడ్డను కనడం కోసం నేను సరోగసి విధానాన్ని ఎంచుకోబోతున్నాను. ఇందుకు నేనేం సిగ్గుపడటం లేదు. ట్రాన్స్ వుమెన్గా మారిన వ్యక్తి.. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో ధైర్యం కావాలి. చుట్టూ ఉన్న సమాజం కూడా ట్రాన్స్జెండర్స్ పట్ల దయతో వ్యవహరించాలి’’ అని కోరారు. ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం: నయనా పటేల్ ఇక దయారా వీర్యాన్ని భద్రపరిచిన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నయానా పటేల్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా క్యాన్సర్తో పోరాడుతున్న మగాళ్లు, ఇంటికి దూరంగా ఉంటున్న సైనికులు, చాలా కాలం వరకు బిడ్డలు వద్దనుకునే దంపతుల్లోని మగవారు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఐవీఎఫ్, సరోగసి ద్వారా పిల్లల్ని కంటారు. కానీ మొదటిసారి ఓ ట్రాన్స్ఉమెన్ భవిష్యత్తులో తల్లి అవ్వడం కోసం తన వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకోవడం మా ఆస్పత్రిలో ఇదే మొదటిసారి’’ అన్నారు. చదవండి: చిన్ని తండ్రీ నిన్ను చూడక... ట్రాన్స్... అప్డేట్ వెర్షన్ -
బలవంతంగా డబ్బులు లాక్కున్న ట్రాన్స్జెండర్లు అరెస్ట్
కుత్బుల్లాపూర్: నూతన గృహప్రవేశం సందర్భంగా ఇంటి యజమానితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు బలవంతంగా డబ్బులు లాక్కున్న నలుగురు ట్రాన్స్జెండర్ల ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ సోమవారం నూతన గృహప్రవేశం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్జెండర్లు స్వామి, శ్రావణి, శివాని, భూమిలు అక్కడకు వచ్చి డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఇదేమని ప్రశ్నించడంతో ఇంటిపై రాళ్లు మట్టిపోసి శాపనార్ధాలు పెట్టారు. అంతటితో ఆగకుండా తమ శరీర భాగాలను చూపిండమే కాకుండా మల్లేశ్ జేబుల్లోంచి రూ.4వేలు బలవంతంగా గుంజుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చదవండి: భోపాల్లో రెస్టారెంట్లు, లాంజ్లు, బార్లపై దాడులు చదవండి: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం -
ట్రాన్స్జెండర్గా మారిన మాజీ రెజ్లర్
వాషింగ్టన్: మాజీ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూయీ సూపర్స్టార్ గబ్బి టఫ్ట్ సంచలన ప్రకటన చేశారు. తాను ట్రాన్స్జెండర్గా మారినట్లు ప్రకటించారు. మహిళగా మారిన తర్వాత తీసిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘‘ఇది నేనే.. దీని గురించి ప్రకటించడానికి నేను సిగ్గుపడటం లేదు.. భయపటడం లేదు’’ అన్నారు. మహిళగా మారిన ఫోటోతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు గబ్బి. ‘‘నేను చెప్పిన ఈ న్యూస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. ఇది నేనే. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు.. ఇబ్బంది పడటం లేదు. ప్రపంచం ఏమి అనుకుంటుందో అని భయపడి ఇన్నాళ్లు నేను దాచిన నా నీడ ఇది. నా కుటుంబం, స్నేహితులు, అనుచరులు దీని గురించి ఎంతో భయపడ్డారు. నేను ఇక దేనికి భయపడను. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్పగలను.. ఎలా ఉన్నా నన్ను నేను అమితంగా ప్రేమించుకోగలను’’ అన్నారు. కుటుంబం మద్దతుకి కృతజ్ఞతలు ‘‘గత ఎనిమిది నెలలు నా మొత్తం జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ట్రాన్స్ జెండర్గా మారిన తర్వాత ప్రపంచాన్ని ఎదుర్కొవాలంటే ఉన్న భయం ఇప్పుడు పూర్తిగా తొలిగిపోయింది. ఈ రోజు ఇతరులు నా గురించి ఏం అనుకుంటున్నారో పట్టించుకోకుండా.. నన్ను నేను ప్రపంచానికి పరిచయం చేసుకున్న రోజు. నా అస్తిత్వాన్ని అపరిమితంగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎంతో ప్రేమించే నా భార్య, కుటుంబం, సన్నిహితులు నన్ను అంగీకరించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. వారి మద్దతు నాకు ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు’’ అని భావోద్వేగానికి గురయ్యారు. బాహ్య రూపం మాత్రమే మారింది ‘‘ఇక ప్రస్తుతం నన్ను అందరూ అంగీకరిస్తారా లేదా అనే విషయం గురించి నేను పట్టించుకోవడం లేదు. నా బాహ్య రూపం మాత్రమే మారింది.. అంతరాత్మ అలానే ఉంది. ఇక నాలోని ఈ మార్పు గురించి మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు.. నేను వాగ్దానం చేసినట్లుగానే వాటన్నింటికి తర్వలోనే సమాధానం చెప్తాను. రేపు ఎక్స్ట్రాలో, బిల్లీ బుష్తో నా ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుంది. దీనిలో అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. నా ప్రయాణంలో పారదర్శకంగా.. నిజాయతీగా ఉంటానని ప్రమాణం చేశాను. అలానే కొనసాగుతాను. ఇది నేనే.. ఎప్పటికి మిమ్మల్ని ఎంతో ప్రేమించే గబ్బి అలోన్ టఫ్ట్’’ అంటూ ముగించారు. 2007 నుంచి రెజ్లింగ్ ప్రారంభించిన టఫ్ట్ 2014 లో రింగ్కు వీడ్కోలు పలికారు. ఇక కెరీర్లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రా, స్మాక్డౌన్, రెసిల్ మేనియాలతో తలపడ్డారు. రెజ్లింగ్ నుంచి రిటైర్ అయిన తరువాత.. తన భార్య ప్రిస్సిల్లా, కుమార్తెతో ఎక్కువ సమయం గడిపారు. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్, మోటివేషనల్ స్పీకర్గా కెరీర్ని రీస్టార్ట్ చేశారు. చదవండి: బాల బాహుబలి ఇక లేడు View this post on Instagram A post shared by Gabbi Alon Tuft (@gabetuft) -
ట్రాన్స్... అప్డేట్ వెర్షన్
చలం స్త్రీవాద రచయిత. ఇప్పుడు లేరు. ఆయన రచనలు, కోట్స్ ఉన్నాయి. ‘‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి..’’ అనేది చలంగారి పాపులర్ కోట్. శరీరం, మెదడు, హృదయం ఈ మూడూ ట్రాన్స్జెండర్లకు కూడా ఉన్నాయని ప్రియా బాబు అంటున్నారు! తమిళనాడు మదురైలో ఉండే ఆయన.. చలం రచనల్ని చదివి ఉండకపోవచ్చు. అయితే తనూ ఒక ట్రాన్స్జెండర్ కావడంతో తనలాంటి వారి మనసును చదవగలిగారు. ట్రాన్స్ జెండర్లకు అవసరమైన వ్యాయామం, జ్ఞానం, అనుభవం ఇచ్చే ఒక పత్రికను నడుపుతున్నారు. ఆ పత్రిక పేరు.. ‘టాన్స్ న్యూస్’. ‘ట్రాన్స్ న్యూస్’ పక్షపత్రిక. ప్రింట్లో రాదు. డిజిటల్లో వస్తుంది. గత ఏడాది నవంబర్లో పత్రిక ప్రారంభమైంది. ఇప్పుడా పత్రికకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ పత్రికను పెట్టిన ప్రియ కన్నా ఎక్కువగా! అందులో అప్డేట్ న్యూస్ ఉంటాయి. బ్యూటీ టిప్స్ ఉంటాయి. స్కిన్ కేర్ గురించి ఉంటుంది. ఇంకా ఆరోగ్యం, గృహాలంకరణ.. ఇలాంటివన్నీ. స్త్రీల కోసం పత్రికలు ఏవైతే ఇస్తుంటాయో ట్రాన్స్ మహిళల కోసం ‘ట్రాన్స్ న్యూస్’ అవన్నీ ఇస్తుంటుంది. ఇంకా.. ట్రాన్స్ ఉమెన్ తయారు చేసిన ఉత్పత్తులకు ఈ పత్రిక మార్కెటింగ్ కల్పిస్తుంది. ఉద్యోగావకాశాల సమాచారాన్ని కూడా అందజేస్తుంది. ‘టాన్స్ న్యూస్’ పత్రికను ఒక మనిషి అనుకుంటే ఆ మనిషి ఆత్మ ప్రియా బాబు. ఆమెకు 50 ఏళ్లుంటాయి. ఎవరైనా తనని ‘ఆమె’ అని పిలవడానికే అతడు ఇష్టపడతారు. కనుక మనమూ ప్రియ అనే చెప్పుకుందాం. ∙∙ ప్రియ ‘ట్రాన్స్ ఉమన్’. యాక్టివిస్ట్, కౌన్సెలర్.. ఇప్పుడిక మ్యాగజీన్ ఎడిటర్. ఆరేళ్ల క్రితం ప్రియ, ముగ్గురు స్నేహితులు కలిసి ముదురైలో ‘ట్రాన్స్ జెండర్ రిసోర్స్ సెంటర్’ స్థాపించారు! 2017లో లాభార్జన ధ్యేయం లేని సంస్థగా ఆ సెంటర్ రిజిస్టర్ అయింది. అందులో ట్రాన్స్ జెండర్ల న్యూస్ పేపర్ క్లిప్పింగులు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్ములు, ప్రభుత్వ విధానాలు, జీవోలు ఉంటాయి. ట్రాన్స్ జెండర్లు ఈ రిసోర్స్నంతటికీ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. రిసోర్స్ సెంటర్కు చక్కటి ఆదరణ లభించడంతో గత నవంబర్ 1న ‘ట్రాన్స్ న్యూస్’ అన్లైన్ పత్రిక కూడా మొదలైంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జనం తమనెంత చిన్నచూపు చూస్తుంటారో ఎవరైనా అడిగినప్పుడు చెప్పడం తప్పితే అదే పనిగా చెప్పరు ప్రియ.ఆమె బిజీలో ఆమె ఉంటారు. ప్రియ చదువు ఇంటర్ మధ్యలోనే ఆగిపోయింది. తోటి విద్యార్థుల మాటలు, చూపులు పడలేక ఆమె కాలేజ్కి వెళ్లడం మానేశారు. ఆ సమయంలోనే తమిళ రచయిత సూ.సమిథిరం ఓ ట్రాన్స్ఉమన్ యాక్టివిస్టుపై రాసిన ‘వాడమల్లి’ అనే పుస్తకం చదివారు. అది చదివాక, తనూ ట్రాన్స్ ఉమెన్ కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకున్నారు. ఫలితమే రిసోర్స్ సెంటర్, పత్రిక. మనసులో మాట చెప్పుకోడానికి కూడా ట్రాన్స్ ఉమెన్కు రిసోర్స్ సెంటర్ తోడ్పడింది. పాఠశాలలో సెమినార్లు నిర్వహించింది. మంచి మంచి వక్తల చేత మాట్లాడించింది. అవన్నీ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక పత్రికలోనైతే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ మోడలింగ్ ఫొటోలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సంచికల్లో 13 మంది ట్రాన్స్ ఉమెన్, ఇద్దరు ట్రాన్స్మెన్ ఫొటోలు వేశారు. తాజాసంచికలో మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన భుజారియా ట్రాన్స్జెండర్ ఉత్సవాలను గురించి ప్రముఖంగా వేశారు. ఇండియాలో తొలి ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ పద్మినీప్రకాశ్ గురించి రాశారు. ట్రాన్స్ ఆంట్రప్రెన్యూర్ జీవా రెంగరాజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే జుట్టు రాలకుండా కొన్ని టిప్స్ కూడా. ప్రియ తమిళ్ నుంచి ఇంగ్లిష్లోకి అనువదించగలరు. ఆ విద్య ఆమెకు చాలావరకు పత్రికను అప్డేట్ చెయ్యడంతో తోడ్పడుతోంది. తమిళ్, ఇంగ్లీషు.. రెండో భాషల్లో వస్తున్న ఈ డిజిటల్ మ్యాగజీన్కు వీక్షకుల సంఖ్య కూడా బాగానే ఉంది. ∙∙ ప్రియ ఎడిటర్ అయితే ఆమె కింద ఐదుగురు రిపోర్టర్లు, ఐదుగురు ఇంటెర్న్లు ఉన్నారు. వాళ్లంతా ట్రాన్స్ ఉమనే. పత్రిక నడపడానికి అవసరమైన ఫండింగ్ను ఇచ్చేందుకు ‘హై–టెక్ అరై’ అనే ఆయిల్ సీల్ను ఉత్పత్తి చేసే సంస్థ ముందుకు వచ్చింది. అది దీర్ఘకాల హామీ. ఎన్నాళ్లు ‘ట్రాన్స్ న్యూస్’ వస్తే అన్నాళ్లూ ఫండ్స్ వస్తుంటాయి. ఫండ్స్ అంటే పెద్దగా ఏం అవసరం లేదు. జీతాలు, ఆఫీస్ అద్దె. వ్యాపార ప్రకటనలైతే ఇంకా రావడం మొదలు పెట్టలేదు. అవొస్తే తమకు ఆర్థికంగా బాగుంటుందని ప్రియ ఆశిస్తున్నారు. పత్రిక చందా ఉచితం. త్వరలోనే హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా ‘ట్రాన్స్ న్యూస్’ తీసుకురానున్నామని చెబుతున్న ప్రియ బాబు తన గురించి చెప్పుకోడానికి మాత్రం ఆసక్తి చూపరు. ‘మా జీవితాలన్నీ ఒకేలా ప్రారంభం అవుతాయి. వాటి గురించి చెప్పవలసింది ఏముంటుంది?’ అని నవ్వేస్తారు. -
‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని’
తిరువనంతపురం : తల్లిదండ్రులు అతన్ని సైకియాట్రిస్ట్ల దగ్గరకు తీసుకువెళ్లారు. ‘ఈ అబ్బాయికి పిచ్చి లేదు’ అని డాక్టర్లు చెప్పారు. మరేంటి ఇతని సమస్య? ‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని. నా నాడీ అదే చెబుతోంది’ అన్నాడా అబ్బాయి. ఆయుర్వేద మెడిసిన్లో ఎం.డి చేశాడా అబ్బాయి. డాక్టర్గా పని చేస్తున్నాడు. ‘అయినా సరే నన్ను నేను అబ్బాయిగా అనుకోలేకపోతున్నాను’ అన్నాడు. ఇప్పుడు డాక్టర్ ప్రియగా మారి వైద్యవృత్తి కొనసాగిస్తున్నాడు. కేరళ తొలి ట్రాన్స్ఉమన్ డాక్టర్ కథ ఇది. జిను శశిధరన్ను వొదులుకోవడమే పెద్ద సమస్య ప్రియకు. ప్రియ ఇప్పుడు ప్రియగాని... పుట్టినప్పుడు పేరు జిను శశిధరన్. కేరళలోని త్రిసూర్ అతనిది. తల్లిదండ్రులిద్దరూ నర్సులుగా పని చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు వారికి. శశిధరన్ పెద్దకొడుకు. ‘ఇద్దరినీ డాక్టర్లు చేయాలని మా తల్లిదండ్రులు భావించారు’ అంటుంది ప్రియ. అయితే ప్రియకు తాను ప్రియను అని తనకు మాత్రమే తెలుసు. అబ్బాయి దేహంలో చిక్కుకుపోయిన అమ్మాయిని తాను అని ప్రియ అనుకునేది. కాని చెప్పడం ఎలా? చెప్తే ఏమవుతుందో. ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తోందో. తల్లిదండ్రులు ఏమవుతారో... అన్నీ సందేహాలే. టీచర్ కావాలని ఉన్నా తల్లిదండ్రుల కోరిక మేరకు త్రిసూర్లోనే ఆయుర్వేదంలో 2013లో బేచిలర్ ఆఫ్ ఆయుర్వేద చేసింది ప్రియ. ‘పెళ్లి చేయాలని నా తల్లిదండ్రులు భావించారు. అది తప్పించుకోవడానికి మంగళూరు వెళ్లి ఆయుర్వేదంలో ఎం.డి చేశాను’ అంది ప్రియ. ఎం.డి. చేస్తున్న సమయంలో తాను మానసికంగా పూర్తిగా స్త్రీగా మారినా అందరి కోసం మగవాడిలా కనిపించడానికి మగవాడిలా నడవడానికి మాట్లాడటానికి చాలా శ్రమ పడింది ప్రియ. ‘అదంతా పెద్ద సమస్య’ అయ్యింది నాకు అందామె. 2018లో ఎం.డి పూర్తి చేసుకొని త్రిసూర్ వచ్చి అక్కడి హాస్పిటల్లో పని చేయసాగింది ప్రియ. (చదవండి: పంచాయతీ ప్రెసిడెంట్ అయిన స్వీపర్!) ‘ఆ సమయంలోనే నేను జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ గురించి తెలుసుకున్నాను. ఖర్చుతో కూడిన పని. రిస్క్ కూడా ఉంటుంది. అయినా నేను అమ్మాయిగా మారదలుచుకున్నాను. మా తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాను. వారు చాలా బెంగపడ్డారు. అయితే మా అమ్మ ఆ తర్వాత నన్ను సపోర్ట్ చేసింది. నా పక్కనే ఉండి నాకు అవసరమైన ఆరు సర్జరీలలో సాయం చేసింది’ అంది ప్రియ. కాని ఆమెకు తను పని చేస్తున్న హాస్పిటల్లో ఏమంటారో, తాను ట్రీట్ చేస్తున్న పేషెంట్లు ఏమంటారో అనే భయం కూడా ఉండేది. ‘వారికి చెప్పాను. హాస్పిటల్లో నా నిర్ణయాన్ని ఆహ్వానించారు. పేషెంట్లు కుతూహలంగా ప్రశ్నలు అడిగారు. నేను అబ్బాయిగా వెళ్లి అమ్మాయిగా తిరిగి వస్తాను అని హాస్పిటల్లో చెప్పి తిరిగి వచ్చాక నాకు స్వాగతం చెప్పారు. ఇప్పుడు నేను నా మనసు శరీరం నాకు ఇష్టమైనట్టుగా మార్చుకుని కొత్త జీవితం ప్రారంభించాను’ అంది ప్రియ. ప్రియకు ఇంకా గొంతుకు సంబంధించి, కాస్మొటిక్స్కు సంబంధించి రెండు సర్జరీలు ఉన్నాయి. వాటి కోసం ఎదురు చూస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
ఫస్ట్ ట్రాన్స్జెండర్ లాయర్
ఒక వయసు వచ్చాక శరీరంలో వచ్చిన మార్పులు అర్థం కాలేదు..ఇంటి నుంచి, సమాజం నుంచి వచ్చే ఛీత్కారాలు ఎందుకో అర్థం కాలేదు..తనలా ఉండేవారితో కలిసిపోవడానికి వచ్చినవారి ప్రవర్తన అర్థం కాలేదు..అర్థమైంది ఒక్కటే... చదువు మాత్రమే తనకు మనుగడ ఇస్తుందని. తను నమ్ముకున్న చదువే యాచన నుంచి న్యాయవాదిగా మార్చింది. పాకిస్థాన్ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ లాయర్గా స్థానం పొందింది. మన దేశంలో మూడేళ్ల క్రితం జోయితా మొండల్ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యాయవాదిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ ‘మొదటి’ స్థానాన్ని పాకిస్థాన్లో నిషారావు సొంతం చేసుకుంది. సమాజంలో థర్డ్ జెండర్ తన సత్తా చాటుతోంది అని నిరూపిస్తోంది.రెండు రొట్టెల కోసం పాట్లుతన కృషికి ఫలితం లభించినందుకు ఈ రోజు నిషా సంతోషంగా ఉంది. కానీ, ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. 28 ఏళ్ల నిషా మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తనలో వచ్చిన మార్పులకు ఇంటి నుంచి నిరాదరణ, సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంది. భరించలేక మరో ఇద్దరు ట్రాన్స్జెండర్లతో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. తనలా ఉండే ట్రాన్స్జెండర్లతో కలిసి కరాచీకి వెళ్లింది. కానీ, తినడానికి తిండి లేక చాలా కష్టాలు పడింది. ‘రోజుకు రెండుసార్లు రొట్టెలు కావాలంటే సెక్స్ వర్కర్ కావాలని సలహా ఇచ్చారు తోటి వాళ్లు. కానీ, ఆ పని నాకు నచ్చలేదు. అదే విషయాన్ని చెప్పి యాచనవైపు వెళ్లాను’ అని చెప్పింది నిషా. ట్రాఫిక్ లైట్ల నుంచి లా కాలేజీ వరకుజీవనోపాధి కోసం ట్రాఫిక్ లైట్ల వద్ద యాచించడం ప్రారంభించింది. ఛీత్కారాలూ భరించింది. ‘కానీ కొన్ని రోజులకు ఈ పని కూడా నచ్చలేదు. అప్పుడే చదువుకోవాలనుకున్నాను. గౌరవమైన జీవనం కావాలనుకున్నాను. ఈ ఆలోచన రాగానే స్కూల్ చదువుతో ఆపేసిన చదువును తిరిగి కొనసాగించాను’ అని తెలిపింది నిషా. పగటిపూట యాచించడం, రాత్రిళ్లు చదువుకోవడం.. ఇదే ఆమె దినచర్యగా మారింది. 2018లో నిషా సింధ్ ముస్లిం లా కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. రావు ఇప్పటివరకు 50 కేసులను వాదించింది. ఆమె క్లయింట్లలో చాలామంది ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. లింగమార్పిడి ప్రజలకు వారి హక్కులను పొందడానికి ప్రయత్నిస్తున్న ఒక ఎన్జీఓ కోసం కూడా ఆమె పనిచేస్తోంది.ట్రాన్స్జెండర్స్ ఓల్డేజీ హోమ్యాచన చేసే ట్రాన్స్జెండర్ నయాబ్ మాట్లాడుతూ.. ‘నిషా మాతో యాచించడం ద్వారా జీవించేది. కానీ ఈ రోజు తన వల్ల మేమూ ఉత్తమ స్థితిలో ఉన్నాం. ఆమె మాకు అన్ని సమయాలలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అర్ధరాత్రి కూడా ఆమె నుండి సహాయం కోరినా ఎప్పుడూ నిరాకరించదు. ట్రాన్స్జండర్లు ముసలివాళ్లు అయ్యాక వారిని పట్టించుకునేవారే ఉండరు. ఆ వయసు వారు ఎంతో దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. అందుకే వారి కోసం ఓ ఓల్డేజీ హోమ్ను నిర్మించాలనుకుంటుంది’ అని వివరించింది. చదువు జీవనగతిని మార్చుతుంది. చదువు ఉన్నతస్థితికి చేర్చుతుంది. చదువు జాతి, మత, కులాలకు అతీతంగా ఎదిగేందుకు ఊతం ఇస్తుంది. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు నిషారావు వంటివారు. -
ట్రాన్స్జెండర్గా మారిన హాలీవుడ్ స్టార్
ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన హాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎలేన్ పేజ్ సంచలన ప్రకటన చేశాడు. తాను ట్రాన్స్జెండర్నని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'జూనో' చిత్రంలోని నటనకు గాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఎలెన్..తాను ట్రాన్స్నని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని తెలిపాడు. ఈ వార్తను పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ట్రాన్స్ కమ్యునిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పటినుంచి తనకు నచ్చిన విధంగా ఉండేందుకు ఇఫ్టపడుతున్నానని, ఇది చాలా గొప్పగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ట్రాన్స్ కమ్యూనిటీ ఆరోగ్యంపై పట్టించుకోని రాజకీయ నాయకులపై విమర్శలు గుప్పించారు. ట్రాన్స్ల పట్ల తమ అసహ్యతను ప్రదర్శించే నాయకుల వల్లే ట్రాన్స్జెండర్స్ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. (రూమర్లను ఖండించిన పాక్ నటి.. నెటిజన్లపై అసహనం) మానవాతీత శక్తులుండే కొందరు చేసే సాహసాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘ఎక్స్మెన్’ సినిమాలో కిట్టీ ప్రైడ్ పాత్రలో నటిగా ఆకట్టుకున్న ఎలెన్ పేజ్ ఆ తర్వాత నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. ‘హార్డ్క్యాండీ’ సినిమాతో వెండితెరపై గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ‘జూనో’ అనే చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2007లో విడుదలైన ఈ చిత్రంలో టైటిల్ రోల్ను పోషించారు. ఎలాంటి ప్లాన్స్ చేయకుండా ఓ టీనేజర్ అనుకోకుండా గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న పాత్రలో ఎలేన్ నటన ఆకట్టుకుంటుంది. కామెడీ-డ్రామా బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో ఎలేన్ నటనకు గానూ ఆస్కార్ అవార్డుకు నామినెట్ అయ్యాడు. (ఆ బిగ్బాస్ కంటెస్టెంటు నా భార్య, మోసం చేసింది) తాన్ను ఒక ట్రాన్స్నన్న ఎలెన్ తాజా స్టేట్మెంట్తో ది అమ్బ్రిల్లా అకాడమీ సిరీస్లో ఆయన నటించే పాత్రలో ఎలాంటి మార్పులు ఉండవని యూనిట్ స్పష్టం చేసింది. వన్య హార్గ్రీవ్స్ అనే మహిళ పాత్రలో ఇంతకుముందులానే ఎలేన్ నటించనున్నారని ఎలేన్ ట్రాన్స్ స్టేట్మెంట్కు తాము గౌరవిస్తున్నామని పేర్కొంది. ఎలేన్ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రటీలు తమ మద్దతు తెలుపుతున్నారు. ఎల్జీబీటిక్యూ కమ్యూనిటి ప్రతినిధులు సైతం ఎలెన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఎలేన్ భార్య , ఎమ్మ పోర్ట్నర్ కూడా తన మద్దతును ప్రకటించింది. ఎలెన్ను చూసి గర్వపడుతున్నానని.. ట్రాన్స్జెండర్లు, నాన్ బైనరీ పీపుల్ ప్రపంచానికి బహమతులు అని తెలిపింది. ఈ సందర్భంగా ఎలెన్ వ్యక్తిగత నిర్ణయంపై సంయమనం పాటించాలని కోరుతూ ట్వీట్ చేసింది. గతంలో తానోక లెస్బెనియన్ అని గర్వంగా ప్రకటించుకున్న ఈ ఎక్స్ మెన్ యాక్టర్ ఎలేన్ పేజ్ సహ నటి, డాన్సర్ అయిన ఎమ్మా పోర్ట్నర్ని వివాహం చేసుకున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. గతంలోనూ నటి సమంత థామస్తో కూడా ఎలెన్ రెండేళ్లపాటు సహజీవనం చేశారు. (సహ నటితో హీరోయిన్ సీక్రెట్ వివాహం) pic.twitter.com/kwti60bZLw — Elliot Page (@TheElliotPage) December 1, 2020 -
అతడు కాస్తా.. 'ఆమె'గా
మధురై (తమిళనాడు): సమాజంలో హిజ్రాల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ కొన్ని సార్లు మానవత్వం ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. ఎంత గౌరవమైన వృత్తిలో పనిచేస్తున్నా ట్రాన్స్జెండర్స్ బతుకులు బాగుపడటంలేదు. సరిగ్గా ఇక్కడ కూడా అలానే జరిగింది. పురఘడిగా ఉన్నంత వరకు సాఫీగా ఉన్న జీవితం లింగమార్పిడి చేసుకున్న తరువాత ఆమె జీవితం తలకిందులైంది. ఓ వ్యక్తి మధురైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ ఆసుపత్రిలో ఒక సంవత్సరం పాటు వైద్యుడిగా సేవలందించాడు. కొన్ని రోజుల తరువాత మహిళగా మారాలని అనుకున్నాడు. కానీ అటు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇటు సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయినా.. లింగమార్పిడి చేసుకున్నాడు. లింగమార్పిడి తరువాత అతడు కాస్త... ఆమెగా మారింది. అసలు కష్టం ఇక్కడే మొదలైంది. పనిచేస్తున్న ఆసుపత్రిలో ఆమె ఉద్యోగం పోయింది. కుటుంబ సభ్యుల దగ్గరకు వెలితే సరైన ఆదరణ దక్కలేదు. ఉద్యోగంలేక ఆదుకునేవారులేక ఇతర ట్రాన్స్జెండర్స్తో కలిసి యాచక యాచకవృత్తిని ఎంచుకుంది. అదే ప్రాంతంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కవిత అనే పోలీసు అధికారి ఆమె కష్టాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన యంత్రాంగం ఆమె వివరాలు తెలుసుకున్నారు. నిజంగానే ఆమె డాక్టర్ అని తెలియడంతో క్లినిక్ ఏర్పాటు చేయడానికి ఆమెకు సాయం చేశారు. ఇన్స్పెక్టర్ కవితకు అటు అధికారులు, ఇటు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (చదవండి : మొదటి ట్రాన్స్ ఉమన్ డాక్టర్గా త్రినేత్ర) -
జోయా ఖాన్కు కేంద్రమంత్రి ప్రశంసలు
న్యూఢిల్లీ : దేశంలోనే టెలీ మెడిసిన్ ఆపరేటర్గా పనిచేస్తున్న ట్రాన్స్జెండర్ జోయా ఖాన్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. ప్రస్తుతం వడోదరలో పనిచేస్తున్న ఈమె ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సాంకేతిక రంగంలోనూ ట్రాన్జెండర్లు మరింత అభివృద్ది చెందాలన్నాదే ఆమె లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు జోయా ఖాన్ను ప్రశంసిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. (భారతీయ టెక్కీలకు మోదీ సరికొత్త చాలెంజ్ ) Zoya Khan is India's first transgender operator of Common Service Centre from Vadodara district of Gujarat. She has started CSC work with Tele medicine consultation. Her vision is to support transgender community in making them digitally literate & give them better opportunities. pic.twitter.com/L0P9fnF2JT — Ravi Shankar Prasad (@rsprasad) July 4, 2020 దేశంలో ట్రాన్స్జెండర్లకు కూడా మిగతావారితో సమానంగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు కామన్ సర్వీస్ సెంటర్లను (సీఎస్సీ) ఏర్పాటుచేసింది. దీనిలో భాగంగా గ్రామీణ, మారుమూల ప్రాంతవాసులకు సంక్షేమ పథకాలు, వైద్యం, ఆరోగ్యం, తదితర సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారి టెలీ మెడిసిన్ ఆపరేటర్గా జోయా ఖాన్ నియమితురాలైంది. గుజరాత్లో వడోదరలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లో విధులు నిర్వర్తిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నందున ప్రతీ ఒక్కరూ హాస్పిటల్కి వెళ్లకుండా రోగులు తమ సమీప కేంద్రం నుంచి వీడియో కాలింగ్ ద్వారా కన్సల్టేషన్ సౌకర్యాన్ని పొందవచ్చు. (కోవిడ్-19 టీకా: ఐసీఎంఆర్ కీలక ప్రకటన ) -
హిజ్రా అని అందరూ నవ్వుతున్నారు..
బరేలీ: అమ్మాయి లక్షణాలున్న తనను అందరూ హిజ్రా అని పిలుస్తున్నారంటూ ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. చావుకు గల కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ అతడి గదిలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీలోని సుభాష్ నగర్కు చెందిన పదహారేళ్ల బాలుడు పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం అతని తండ్రి మార్కెట్ వెళ్లగా, సోదరుడు మరో గదిలో చదువుకుంటున్నాడు. ఈ సమయంలో అతను గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభించింది. అందులో.. "నాన్న.. నేను మంచి కొడుకును కానందుకు నన్ను క్షమించు. నీలాగా నేను సంపాదించలేను. నా ముఖం అమ్మాయిలా కనిపించడమే కాక, అమ్మాయి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. (దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!) నేను హిజ్రానా అని నాకూ అనుమానమేస్తోంది. నా వల్ల నీ జీవితం చీకటిమయం కాకూడదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా. మరో జన్మంటూ ఉంటే నేను అమ్మాయిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు. మన కుటుంబంలో ఆడపిల్ల పుడితే నేనే మళ్లీ జన్మించానని భావించండి" అని రాసుకొచ్చాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. "తన కొడుకు మామూలుగానే ఉండేవాడు. కానీ కొంతమంది వాడిని తప్పుగా అర్తం చేసుకుని కించపరుస్తూ మాట్లాడేవారు. అతడు తన తమ్ముడిని బాగా చూసుకునేవాడు. నేను లేనప్పుడు వంట కూడా చేసేవాడు. కొన్నిసార్లు మాత్రం స్త్రీలలాగా మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేవాడు" అని పేర్కొన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్లాగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని మృతుడి సోదరుడు పేర్కొన్నాడు. (వలస కార్మికులపై బ్లీచ్ స్ప్రే) -
హిజ్రాలు కూడా మహిళలే: నటి
హ్యారీపోటర్ సిరీస్లో కనిపించిన నటి బోనీ రైట్ ట్రాన్స్జెండర్లకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసింది. "హ్యారీపోటర్ ప్రేమకు మూలమైతే.. ఆ అనంతమైన ప్రేమ నీతోపాటు అందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందాల్సిందే. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు కూడా మహిళలే.. వారిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. కాగా 'హ్యారీపోటర్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జేకే రౌలింగ్ ట్రాన్స్జెండర్లపై వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అది హిజ్రాలకు వ్యతిరేకంగా ఉండటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఆమె వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. (డేంజర్లో హలీవుడ్) వీరితోపాటు "హ్యారీపోటర్" సిరీస్లో నటించిన పలువురు నటీనటులు కూడా ఆమె వాదనను ఖండిస్తూ ట్రాన్స్జెండర్లకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా జేకే రౌలింగ్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇప్పటికే హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా వాట్సన్ ట్రాన్స్జెండర్లకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. హిజ్రాలకు సాధారణంగా జీవించే హక్కు ఉందని తెలుపుతూ వారికోసం పాటుపడే సంస్థలకు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించింది. (అదే తేదీకి అవతార్!) -
తణుకులో కరోనా కలకలం
పశ్చిమగోదావరి, తణుకు/తణుకు అర్బన్: లాక్డౌన్ ప్రకటించి రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణతో పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల కదలికలపై నిఘా పెట్టారు. అత్యవసర పనులకే అనుమతిచ్చారు. ఉల్లంఘనలకు తావులేకుండా ఎక్కడిక్కడ వాహనాలను తనిఖీ చేశారు. అయినప్పటికీ కరోనా కేసు నమోదైంది. ఇరగవరం కాలనీలో ఒక ట్రాన్స్జెండర్కు కరోనా నిర్థారణ కావడంతో తణుకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముంబయి నుంచి హైదరాబాదు మీదుగా ఈనెల 18న తణుకు వచ్చిన ఆమెను హోం క్వారంటైన్లోనే ఉంచి రక్తపరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. మొదటి సారిగా తణుకులో కరోనా కేసు నమోదు కావడం కలకలం రేగింది. గురువారం రాత్రి ఆమెను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్న 9 మందికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్కు పంపించినట్లుగా నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.దుర్గామహేశ్వరరావు తెలిపారు. ప్రత్యేక నిఘా.. ప్రశాంతంగా ఉన్న తణుకు ప్రాంతంలో కరోనా కేసు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. తణుకు ఇన్చార్జి సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన ట్రాన్స్జెండర్ నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించి ఆయా ప్రాంతాల్లో దారులన్నీ మూయించారు. ముళ్లకంచెలు వేసి రాకపోకలను నిలిపివేశారు. 500 మీటర్లు మేర రెడ్జోన్, బఫర్ జోన్లుగా నిర్ధేశించారు. ఈ ప్రాంతాన్ని కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి, కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, పట్టణ ఎస్సై కె.రామారావులు శుక్రవారం సందర్శించారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తి ఎక్కడ ఎక్కడ తిరిగారు? ఎవరెవరితో కాంటాక్టు అయ్యిరు? ఎవరెవరితో మాట్లాడారనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మునిసిపల్ కమిషనర్ జి.సాంబశివరావు, తహసిల్దారు పీఎన్డీ ప్రసాద్ పర్యవేక్షించారు. -
దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నకొందరు ఆకతాయిల ఉదంతం మరువకముందే.. హైదరాబాద్లో మరో పిచ్చి ప్రచారం మొదలైంది. హిజ్రాలతో మాట్లాడినా.. సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్ సోకుందనే పోస్టర్లు కొన్ని చోట్ల వెలిశాయి. ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి’అని అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పోస్టర్లు బయటపడటంతో కలకలం రేగింది. ట్రాన్స్జెండర్లపై వివక్ష, ఫేక్ న్యూస్, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: కరోనా : ఈశాన్య విద్యార్థులపై జాతి వివక్ష) అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద వెలిసిన ఆయా పోస్టర్లను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పటికే సమాజానికి దూరంగా బతుకుతున్నామని, తామూ మనుషులమేనని గుర్తించాలని క్రుంగిపోతున్న హిజ్రాలకు ఇదో ఇబ్బందికర పరిస్థితి తెచ్చినట్టయింది. ఇదిలాఉండగా.. కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులపై ప్రాంతీయ వివక్ష వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దేశా రాజధాని ఢిల్లీలో సైతం.. మణిపురికి చెందిన ఓ అమ్మాయిని ఒకడు ‘కరోనా’అని పిలిచి అవమానించాడు. #Transphobic Posters at Ameerpet Metro Station reads: “Warning: Do not allow Kojja, Hijras near the shops. If you talk to them or have sex with them, you will be infected with #CoronaVirus. Beat & drive them away or call 100 immediately. Save people from Corona Virus Hijras". pic.twitter.com/21HP5YBDSp — Meera Sanghamitra (@meeracomposes) March 29, 2020 (చదవండి: పెళ్లి పేరుతో మోసం చేశాడు..) (చదవండి: లాక్డౌన్ను పొడిగించం: కేంద్రం) -
పెళ్లి పేరుతో మోసం చేశాడు..
పంజగుట్ట: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు తనను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ ట్రాన్స్జెండర్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల, షాపూర్నగర్కు చెందిన లక్కిరాయ్ అలియాస్ శ్రీను ట్రాన్స్జెండర్. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని జీవీకె మాల్ సమీపంలో వ్యాపారం చేసేది. అమెకు కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన మహ్మద్ ఫెరోజిద్దీన్తో పరిచయం ఏర్పడింది. ఫెరోజ్ తనను ప్రేమిస్తున్నానని చెప్పడంతో 2018 జులై 8న ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలిపింది. అనంతరం ఇద్దరూ కలిసి గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫెరోజ్ ఫేస్బుక్ ఖాతాలో మరో యువతితో ఎంగేజ్మెంట్ అయిన ఫొటోలను గుర్తించిన లక్కిరాయ్ అతడిని నిలదీయగా, సరదాగా ఫొటోలు పెట్టినట్లు బుకాయించాడు. అయితే ఫెరోజ్కు నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిందని అతడి స్నేహితులు చెప్పడంతో గత జనవరి 8న అతడిని నిలదీసింది. ఫిబ్రవరి 14న అతడికి మరో యువతితో వివాహం జరిగిందని తెలియడంతో గురువారం బాధితురాలు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘కార్పొరేషన్’ బరిలో ట్రాన్స్జెండర్
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటి సారిగా ట్రాన్స్జెండర్ బరిలోకి దిగారు. నగరంలోని 16వ డివిజన్ అభ్యర్థిగా తెలంగాణ ట్రాన్స్జెండర్ సమితి నాయకులు జరీనా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ, తనను గెలిపిస్తే నిస్వార్ధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాన్స్జెండర్స్ సమితి కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లత తదితరులు పాల్గొన్నారు. -
‘తల్లిదండ్రులు అవమానంగా భావించారు’
ముంబై: పట్టణానికి చెందిన శ్రీదేవి మూడేళ్ల క్రితం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై యూనివర్సిటీలో చేరిన శ్రీదేవి తనను తాను ట్రాన్స్జెండర్గా ప్రకటించుకున్న తొలి విద్యార్థిగా నిలిచారు. 2017లో యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరినప్పుడు శ్రీదేవి తనను ట్రాన్స్జెండర్గా ప్రకటించుకున్నారు. కష్టపడి చదివి యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఒపెన్ లర్నింగ్(ఐడీఓఎల్) నుంచి సోషియాలజీ, సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రాడ్యూయేషన్ పూర్తి చేయడమే ఓ యుద్ధం అనుకుంటే.. దాని తర్వాత ఉద్యోగం సంపాదించడం మరి కష్టమైంది అన్నారు. ‘చదువు పూర్తవ్వడంతో ఓ యుద్ధాన్ని జయించినట్లు భావించాను. ఇలాంటి యుద్ధాలు ముందు ముందు మరెన్నో చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైంది ఉద్యోగం. చదవు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం మరింత కష్టమయ్యింది. ట్రాన్స్ఉమెన్కు జాబ్ ఇవ్వడానికి ఎవ్వరు ఆసక్తి చూపలేదు. ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్న తర్వాత ఓ ఉద్యోగం లభించింది. ప్రసుత్తం నేను ఓ ఎలాక్ట్రానిక్ కంపెనీలో సీఏడీ డిజైనర్గా పని చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా నేను ఎదర్కొన్న అనుభవాల మేరకు భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందనిపించింది. అయితే వ్యాపారం గురించి నాకు ఏం తెలియదు. కాకపోతే ఉద్యోగం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే వ్యాపారం చేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఓ ఎన్జీవో అధ్వర్యంలో పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. ఇంటిరీయర్ డిజైనింగ్కు సంబంధించి షార్ట్టర్మ్ కోర్సు కూడా చేస్తున్నాను’ అని తెలిపారు శ్రీదేవి. ఇక తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ‘నన్ను తమతో పాటు ఉంచుకోవడం అవమానంగా భావించేవారు నా తల్లిదండ్రులు. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే.. వారికి కనిపించకుండా నన్ను గదిలో బంధించేవారు. తల్లిదండ్రుల ప్రవర్తన నన్ను ఎంతో బాధపెట్టిది. నేను మనిషిని.. నాకు ఓ మనసుంది.. నాకు జీవించే హక్కుంది. నేనేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనేందుకు దాక్కొవాలి అని నా మనసు తిరగబడేది. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో ఎన్నో సార్లు గొడవ పడ్డాను. కానీ వారిలో మార్పు లేదు. దాంతో రెండేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆనాటి నుంచి మరిక వెనుతిరిగి చూడలేదు’ అంటున్నారు శ్రీదేవి. ఐటీఓఎల్ ప్రతినిధి వినోద్ మలాలే మాట్లాడుతూ.. మా యూనివర్సిటీలో ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. కానీ వారు ఎవరు తమను తాము ట్రాన్స్జెండర్స్గా ప్రకటించుకోలేదు. అలా చేసిన మొదటి విద్యార్థి శ్రీదేవి అని తెలిపారు. -
ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది
ఆగస్టు 5 అంటే సోమవారం రోజు కోల్కతాలో జరిగిన ఈ పెళ్లి భిన్నమైనది. కుతూహలం రేపగలిగినది. అందుకే వార్తలకు కూడా ఎక్కింది. ఎందుకంటే ఇందులో వధువు గతంలో పురుషుడు. వరుడు గతంలో స్త్రీ. ఉత్తర కోలకతా శివార్లలో ఉండే మహజాతి నగర్లో ‘తిస్తా దాస్’ ఇంటి అడ్రస్ ఎవరికైనా కొట్టినపిండి. ఆ ప్రాంతంలో ఉండేవాళ్లందరికీ తిస్తా దాస్ మంచికో చెడుకో తెలుసు. సగటు మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన తిస్తా గతంలో ‘సుశాంతో’గా ఆ చుట్టుపక్కలవారికి తెలుసు. తల్లిదండ్రులు కూడా సుశాంతో అబ్బాయి అనే అనుకున్నారు. కాని సుశాంతో మానసిక ప్రపంచం తానొక అమ్మాయినని చెప్తూ ఉండేది. అమ్మాయిలతో తిరగమని, అమ్మాయిలా వ్యవహరించమని చెప్తూ ఉండేది. హైస్కూల్ వయసులో ఆ మార్పును వ్యక్తపరచడం మొదలుపెడితే తోటి విద్యార్థుల నుంచి గేలి పొందాడు సుశాంతో. కాని కాలేజీ వయసు వచ్చేసరికి ఆడపిల్లలాగా బట్టలు కట్టుకోవడం ప్రారంభించాడు. దాంతో కాలేజీ సీనియర్లు, లోకల్ గూండాలు అతణ్ణి ఏడిపించడం మొదలెట్టారు. లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ఇంట్లో ఇదంతా అశాంతి రేపింది. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక సుశాంతో ఇంటినుంచి బయటికొచ్చేసి తోటి ట్రాన్స్జండర్ల సహాయంతో సొంత కాళ్లపై బతకడం నేర్చుకున్నాడు. అయితే ఇదంతా పత్రికలలో రావడం వల్ల సుశాంతో అందరికీ తెలిశాడు. బెంగాల్లో మొదటి ట్రాన్స్జెండర్ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ మనాబి బంధోపాధ్యాయ్ ప్రోత్సాహంతో ‘సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీ’ (ఎస్.ఆర్.ఎస్) జరిపించుకుని తన పేరు తిస్తా దాస్గా మార్చుకున్నాడు(కుంది). తిస్తాగా మారి స్త్రీగా గుర్తింపు కోసం పోరాడుతున్న సుశాంతోను తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ ఆపరేషన్ కోసం చేసిన అప్పు తీర్చలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న అపవాదు తిస్తా మీద పడింది. తిస్తా చెప్పడం అది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని. ఏమైనా తిస్తాను కొల్కతా స్వీకరించింది. సినిమా పరిశ్రమలో తిస్తా ఒక నటిగా ప్రవేశం పొందింది. సినిమాలలో డాక్యుమెంటరీలలో నటించింది. ‘సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీ’ చేయించుకున్నాక ట్రాన్స్జెండర్ల మానసిక స్థితి ఎలా ఉంటుందనే అంశంపై బెంగాల్లో ఒక సినిమా తీస్తే అందులో నటించింది. ఈ సమయంలోనే అస్సాంకు చెందిన చక్రవర్తితో ఆమెకు పరిచయమైంది. అతడు కూడా ఎస్.ఆర్.ఎస్ తర్వాత పూర్తిగా పురుషుడిగా మారిన ‘ట్రాన్స్మాన్’. వీళ్లిద్దరూ జాతీయ ట్రాన్స్జెండర్ దినోత్సవమైన ఏప్రిల్ 15న తమ వివాహ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేశారు. వరుడు చక్రవర్తి, వధువు తిస్తా దాస్ అయితే దీనిపై ఎల్.జి.బి.టి సమూహాల నుంచి సాధారణ సమాజం నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. ఎల్.జి.బి.టి సమూహంలోని కొందరు ‘ఎందుకు ట్రాన్స్మ్యాన్ని చేసుకుంటున్నావు. మామూలు మగవాణ్ణి చేసుకోవచ్చుగా’ అని ఆమెను అడిగారు. సాధారణ సమాజం ఇలాంటి పెళ్లిళ్ల సంప్రదాయంపై కొంత ఆందోళన వ్యక్తం చేసింది. అయితే తిస్తా ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఇష్టసఖుడిని పెళ్లాడింది.దేవతలు పూల వర్షం కురిపించకపోయినా ఆకాశం నాలుగు చినుకులనైతే చిలకరించింది.ప్రస్తుతానికి వాళ్లిద్దరికీ ఆ దీవెన చాలు. -
విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయండి..
సాక్షి, చెన్నై: ప్రముఖ హీరో విజయ్ సేతుపతి అరెస్ట్ చేయలంటూ హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహత్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’సూపర్ డీలక్స్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విశ్లేషకులు, నెటిజన్లు ఈ చిత్రాన్ని విమర్శనలతో బంతాడుకుంటున్నారు. తాజాగా హిజ్రాలు... చిత్ర హీరో విజయ్ పేతుపతి, దర్శకుడు త్యాగరాజు కుమారరాజాలపై మండిపడుతున్నారు. హిజ్రాల సంఘం నిర్వాహకులు రేవతి, ప్రేమ, కల్కి సూపర్ డీలక్స్ చిత్రాన్ని తీవ్రంగా ఖండిస్తూ, విజయ్సేతుపతిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో విజయ్ సేతుపతి అంటే తమకు గౌరవం ఉందని, అయితే సూపర్ డీలక్స్ చిత్రంలో హిజ్రాగా నటించిన తరువాత ఆయనపై ఉన్న గౌరవం తగ్గిపోయిందన్నారు. హిజ్రాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు చిత్రంలో చూపించారని ఆరోపించారు. చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన శిల్పా పాత్రను ముంబైలో పిల్లలను కిడ్నాప్ చేసి బిక్షం ఎత్తించేవారికి విక్రయించినట్లు చూపించారన్నారు. నిజానికి హిజ్రాలు పిల్లలపై ప్రేమ చూపుతారని, వారు ఎన్నటికీ పిల్లలను కిడ్నాప్ చేయరని అన్నారు. ఇక బెదిరింపులకు భయపడి హిజ్రాలు ఎలాంటి అత్యాచారాలకు పాల్పడడం లేదని తెలిపారు. అయితే అలాంటి సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఇకపోతే హిజ్రాలకు పిల్లలు పుట్టే భాగ్యం లేదన్నది విజ్ఞానపరమైన నిజం అన్నారు. అలాంటిది ఒక పిల్లాడికి తండ్రి అయిన విజయ్ సేతపతి హిజ్రాగా మారినట్లు చూపించారన్నారు. ఇలాంటి పలు అంశాలు చిత్రంలో తమను అవమానానికి గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం అయిన చిత్ర దర్శకుడు, అందులో నటించిన నటుడు విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
మహిళ కాదని హత్య..!
సాక్షి, మహబూబ్నగర్ క్రైం: మహిళ వేషధారణలో ఉన్న ఓ ట్రాన్స్జెండర్ను శృంగారం కోసం తీసుకువెళ్లిన వ్యక్తి..మహిళ కాదని గుర్తించి బండరాయితో తలపై బాది హత్య చేశాడు. ఈ కేసును జడ్చర్ల పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం వెల్లడించారు. ఫిబ్రవరి 11న బూరెడ్డిపల్లి జాతీయ రహదారి సమీపంలో ట్రాన్స్జెండర్ మండ అర్జున్ అలియాస్ చంద్రిక(35) హత్య చేసిన ఘటనలో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. వీపనగండ్ల మండలం తుముకుంటకి చెందిన మండ అర్జున్ రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. అయితే మండ అర్జున్ మహిళ వేశాధారణలో ఉంటూ శంషాబాద్, షాద్నగర్ జాతీయ రహదారిపై వ్యభిచారం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాకు చెందిన భరత్ లాల్రాయ్ మచారంలో నివాసం ఉంటూ పోలేపల్లి సెజ్లోని ఓ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 10న భూత్పూర్ సమీపంలో మృతుడు మండ అర్జున్ అలియాస్ చంద్రిక టాప్ లెగిన్ ఫ్యాంట్, ముఖానికి స్కార్ప్ కట్టుకొని రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అయితే నిందితుడు భరత్లాల్ రాయ్ వ్యభిచారం కోసం మండ అర్జున్ రూ.400లు ఇస్తానని మాట్లాడుకొని భూరెడ్డిపల్లి సమీపంలోకి తీసుకువెళ్లాడు. అక్కడి వెళ్లిన తర్వాత మహిళ కాదని గుర్తించి బండరాయితో మండ అర్జున్ తలపై మోది హత్య చేశాడు. ఆతర్వాత మృతుడి దగ్గర ఉన్న రూ.25 వేల సెల్ఫోన్, రూ.400నగదు తీసుకొని అక్కడి నుంచి పరారయినట్లు తెలిపారు. ఈ కేసులో 60మంది ట్రాన్స్జెండర్లను ప్రశ్నించి అత్యంత సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఎస్పీ రివార్డులతో సత్కరించారు. -
ట్రాన్స్జెండర్లను మనుషులుగా గుర్తించాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక చట్టం లేకపోవడం బాధాకరమని బీఎల్ఎఫ్ గోషామహాల్ ఎమ్మెల్యే అభ్యర్థి, ట్రాన్స్జెండర్స్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రముఖి అన్నారు. నాల్సా తీర్పును అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్యూజె) సంయుక్త ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రముఖి మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్లను కనీసం మనుషులుగా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోకుండా భిక్షాటన చేయాల్సి వస్తోందని వాపోయారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాల్లో ట్రాన్స్జెండర్స్కు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో ట్రాన్స్జెండర్స్ అందరం కలిసి ఒక పార్టీ పెడతామని చెప్పారు. మానవ హక్కులే ట్రాన్స్జెండర్స్ హక్కులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖ మా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మా ఉనికిని చాటుకోవడం కోసం పోటీ చేస్తున్నామని వివరించారు. గోషామహాల్ నియోజకవర్గంలో హిజ్రాలకు ఎంతో చరిత్ర ఉందని, అందుకే ఇక్కడినుంచి పోటీచేస్తున్నానన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగి ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, హెచ్యూజే అధ్యక్షులు బిఎల్ఎఫ్తో కలిసి పోరాటాలు చేశామని, వారి సంపూర్ణమద్దతు తమకు ఉందన్నారు. ట్రాన్స్జెండర్లు ఓటింగ్కు వెళితే ఓటింగ్కు హేళన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, అందుకే చాలామంది పోలింగ్కేంద్రాల వద్దకే వెళ్లడం లేదన్నారు. -
గోషామహాల్ BLP ఆభ్యర్థిగా ట్రాన్స్జెండర్ చంద్రముఖి
-
చరిత్రాత్మకమైన తీర్పు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377లో స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పేర్కొనే నిబంధన ఎట్టకేలకు బుట్టదాఖలా అయింది. అది చెల్లుబాటు కాదంటూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఏకగ్రీవ తీర్పు సమానత్వ సాధనలో, మానవ హక్కుల ప్రస్థానంలో మేలి మలుపుగా నిలుస్తుంది. సృష్టి ఒక గీత గీసిందని... అందరూ ఆ గీతకు అటో ఇటో ఉంటారని, ఉండాలని శతా బ్దాల తరబడి పాతుకుపోయిన భావనను ఈ తీర్పు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం యుక్త వయసున్న ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో తమ లైంగిక భావనలకు అనుగుణంగా శృంగా రంలో పాల్గొనవచ్చునని, దాన్ని నేరంగా పరిగణించటం సరికాదని తేల్చిచెప్పింది. ఆడ మగ మధ్య లైంగిక సంబంధాలే సహజమైనవనీ, మిగిలినవన్నీ అసహజమని అనడం కాలం చెల్లిన భావనగా తెలిపింది. ‘ప్రకృతి ఇచ్చింది ఏదైనా సహజమైనదే’ అని స్పష్టం చేసింది. అసహజ లైంగిక నేరాలను ఏకరువుపెట్టే సెక్షన్ 377లో స్వలింగ సంపర్కం చేర్చటం సరికాదంటూ మన దేశంలో సాగుతున్న పోరాటం సుదీర్ఘమైనది. పదిహేడేళ్లుగా న్యాయస్థానాలే వేదికగా ఆ పోరాటం సాగుతోంది. బ్రిటిష్ వలసపాలకుల ఏలుబడిలో దాదాపు 160 ఏళ్లక్రితం భారతీయ శిక్షాస్మృతిలో స్వలింగ సంపర్కం నేరంగా మారింది. అప్పటినుంచి అనేకమంది పౌరులు వేధింపులకు గురవుతున్నారు. భయంతో బతుకీడుస్తున్నారు. 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ స్వలింగ సంపర్కం నేరంగా భావించలేమని, దీన్ని శిక్షాస్మృతి నుంచి తొలగించి ఇతర అసహజ నేరాలను కొత్తగా 376–ఎఫ్ కిందకు తీసుకురావాలని సిఫార్సు చేసింది. అయినా ఏ ప్రభుత్వమూ కదల్లేదు. 2009లో అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్లతో కూడిన ధర్మాసనం మొదటిసారి ఈ సెక్షన్ రాజ్యాంగంలోని 21, 14, 15 అధికరణలను ఉల్లంఘిస్తున్నదని నిర్ధారించింది. ఆ సెక్షన్లోని అస హజ నేరాల జాబితా నుంచి దీన్ని తొలగించాలని తీర్పునిచ్చింది. అయితే మరో నాలుగేళ్లకు సుప్రీం కోర్టులో జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం అది రాజ్యాం గబద్ధమైనదేనని చెప్పి స్వలింగసంపర్కుల ఉత్సాహంపై నీళ్లు జల్లింది. దాన్ని కొట్టేసే అధికారం న్యాయస్థానాలకు లేదని, పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఏదైనా కీలక సమస్య వచ్చిపడినప్పుడు దానికొక ప్రజాస్వామిక పరిష్కారాన్ని చూపడం రాజ్యం బాధ్యత. పాలకులుగా ఉంటున్నవారు ఈ బాధ్యతను స్వీకరించటం సబబు. వారు దాన్ని సక్రమంగా నెరవేర్చనప్పుడు న్యాయవ్యవస్థ అయినా జోక్యం చేసుకొని సరిదిద్దాలి. కానీ సెక్షన్ 377 విషయంలో రెండుచోట్లా ఇన్నాళ్లూ నిరాదరణే ఎదురైంది. సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘స్వలింగ సంపర్కాన్ని సహజమైన ప్రక్రియగా పరిగణించలేనందుకూ, పర్యవసానంగా శతాబ్దాలుగా వీరు పడుతున్న అవమానాలకూ చరిత్ర క్షమాపణ చెప్పాల్సి ఉన్నద’ని వ్యాఖ్యానించారు. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యాకుల మనోభావాలకు అనుగుణంగానే అన్ని రకాల విలువలూ ఏర్పడతాయి. వాటి ఆధారంగానే చట్టాలు రూపొందుతాయి. సమాజంలో ఆడ మగ కలిసి ఉండటమే సహజమని, ఇతరమైనవన్నీ అసహ జమని అత్యధికులు భావించబట్టి ఇతరత్రా లైంగిక భావనలున్నవారందరూ అపరాధ భావనతో కుమిలిపోతుంటారు. తమ లైంగిక వాంఛలు వెల్లడైతే వెలివేస్తారని భీతిల్లుతారు. జస్టిస్ దీపక్ మిశ్రా అన్నట్టు స్వీయ వ్యక్తీకరణకు అవకాశం లేకపోవటం చావుతో సమానం. ఈ స్వలింగసంపర్కులంతా ఇన్నేళ్లుగా జీవచ్ఛవాలుగా మనుగడ సాగిస్తున్నారు. దేశంలోని ఇతర పౌరులు అనుభవిస్తున్న హక్కులు వీరికి లేకుండా పోయాయి. బడిలో తోటి పిల్లల హేళనలతో మొదలై కుటుంబంలోనూ, బంధువుల్లోనూ వెలివేసినట్టు చూడటం, సమాజంలో నిరాదరణ ఎదురుకావటం ఈ స్వలింగç Üంపర్కులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్య. ఎవరైనా ఫిర్యాదు చేయటం వల్ల పట్టుబడితే 377 సెక్షన్ ప్రకారం దోషులకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధిస్తారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తత్తరపడింది. స్వలింగ సంపర్కం సామాజిక కట్టుబాట్లకు విరుద్ధమని, దానివల్ల ఎయిడ్స్లాంటి జబ్బులు వ్యాపిస్తాయని సర్వోన్నత న్యాయస్థానంలో అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ పి.పి. మల్హోత్రా వాదించారు. అదంతా చానెళ్లలో ప్రసారమయ్యేసరికల్లా ఆదరా బాదరాగా మరో అదనపు సొలిసిటర్ జనరల్ మోహ న్జైన్ను పంపి దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని అనిపించారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమైతే తన వైఖరేమిటో నిర్ధారించుకోలేకపోయింది. దీన్ని న్యాయస్థానం ‘విజ్ఞత’కే వదిలేస్తున్నామని చెప్పింది. ప్రజామోదంతో గద్దెనెక్కి, వారిని ఒప్పించగలిగిన స్థితిలో ఉండే పాలకులు ఇలాంటి సంక్లిష్ట అంశాల విషయంలో దాటవేత ధోరణి అవలంబించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. లెనిన్ ఆధ్వర్యంలో ఏర్పడిన సోవియెట్ ప్రభుత్వం 1920లో ప్రపంచంలోనే తొలిసారి స్వలింగ సంపర్కాన్ని సామాజిక, సాంస్కృతిక అంశంగా పరిగణించింది. స్వలింగసంపర్కులను కూడా పౌరులుగా గుర్తించి వారికి హక్కులు కల్పించింది. ఆ తర్వాతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఆధిపత్య భావజాలం ఏ రూపంలో ఉన్నా అది సమాజాన్ని ఎదగ నీయదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినంత మాత్రాన స్వలింగ సంపర్కులకు స్వేచ్ఛ లభిం చిందని భావించలేం. వారికి చట్టపరమైన అవరోధాలు తొలగినా సమాజంలో అలుముకున్న సంకు చిత భావాలు వెనువెంటనే మాయం కావు. కనీసం ఆ విషయంలోనైనా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలిస్తే మేలు. -
ఓ స్వలింగ సంపర్కుడి ఆత్మనివేదన!
భారతీయ స్వలింగ సంపర్కుడిగా నన్ను నేను తొలుచుకుని ప్రపంచం ముందుకొస్తున్నాను! నా యవ్వనమంతా అనుమానం, అనిశ్చితితో కూడుకున్న సందేహాలతో నిండిఉంది. అందరిలా కాకుండా నేను ‘వేరే’ అని నాకు తెలుసు కానీ తెలియందల్లా ఎందుకిలా? అన్నదే. నా చుట్టూ ఉన్న వాళ్ళు ‘ఒరేయ్ హిజ్రా’ అంటూ గేలిచేసినప్పుడు నా సందేహం బద్దలైంది. నా సహ విద్యార్థుల నుంచి, నా ఆటల నుంచి, పాటల నుంచి మొత్తంగా నన్నది వేరు చేసింది. క్రమంగా నాకిష్టమైన అన్నింటినుంచీ నన్ను దూరం చేసి, నన్నొంటరిని మిగిల్చింది. నేనెందుకిలా ఒంటరినయ్యాను. నేనందరిలా ఎందుకు లేను? నాకెందుకీ శిక్ష? ఆ మానసిక స్థితిలోంచి బయటపడేందుకు కఠోరతపస్సు చేయాలి. నాలాంటి వారే నా చుట్టూ ఉన్నవారు నాలాగే వేరుగా ఉన్నవారు వారెందుకిలా ఉన్నారో అర్థం కాక, చెప్పేవారు లేక కనీస లైంగికపరిజ్ఞానం కరువై తమలో తామే నలిగిపోయి మృత్యువును కోరితెచ్చుకుంటుంటే నిశ్చేష్టుడిలా మిగిలిపోయాను. నా సందేహాలకు ఇంటర్నెట్ని శరణుకోరాను. అప్పుడర్థం అయ్యింది వేనవేల గేల బేల చూపులతో ఈ ప్రపంచం నిశ్శబ్దంగా నిండిఉన్నదని. అలాంటి విశాల ప్రపంచంలో మన దేశం ఆచూకీ నాకేదీ దొరకలేదు. బహుశా అది ‘మన’ సంస్కృతి కాదేమోనని నాకు నేను చెప్పుకున్నాను. ఆ రోజు నుంచి నేనుగా ఉండడం మానేసాను. సహజంగా నాకిష్టమైనవన్నీ చేయడం ఆపేసాను. గత చాలా కాలంగా నా పని ఒక్కటే. అదే అవమానాలనుంచి, అసహ్యపు చూపులనుంచి, వెలివేతల నుంచి నన్ను నేను కాపాడుకుంటూ ఉండడం. మేమంతా ఓ ఆత్మన్యూనతా భావంలో, అభద్రతా భావంలో కూరుకుపోయాం. ఆత్మగౌరవం కోసం స్వలింగ సంపర్కుల పోరాటం మాకు కొత్తసవాళ్ళను ఎదుర్కొనే శక్తినిచ్చిందే తప్ప పరిస్థితుల్లో పెద్దగా మార్పుతీసుకురాలేదు. తీర్పులూ మమ్మల్ని సేదతీర్చలేదు. అదే వేధింపులు, అవే భయాలూ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టిన రోజు. మా దేహాల గాయాల నుంచి తొలుచుకుని మేం మేముగా నిలిచిన రోజు. సుప్రీంకోర్టు తీర్పుతో గొంగళిపురుగు దశనుంచి రెక్కలువిప్పుకున్న సీతాకోక చిలుకల్లా మేం మా రంగుల ప్రపంచంలోకి సగర్వంగా రెక్కలల్లార్చుకుని ఎగిరిపోయే రోజు. అయినా మాముందు ఇంకా అవమానాల మూకలు నిలిచే ఉన్నాయి. ఎన్నెన్నో సవాళ్ళు మిగిలేవున్నాయి. రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు ‘‘నేను ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’. ‘‘నన్ను నమ్మండి. మీరిక ఒంటరి కాదు’’. దేశంలోని స్వలింగ సంపర్కులందరికీ ఈ సందేశం అందాలి. ఇంకా మమ్మల్ని అంగీకరించలేని వారికి ఓ చిన్న మాట.... ‘‘అవును మేం స్వలింగ సంపర్కులం. మేమిక్కడే ఉన్నాం. మేం అదృశ్యం కాము.’’ ఇట్లు సంజయ్ దేశ్పాండే, వయస్సు 26 న్యూఢిల్లీ వాస్తవ్యుడు -
ఆ ఆరుగురు..
పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్మ్రక తీర్పు వెనుక ఆరుగురి కృషి ఉంది. సెక్షన్ 377ని నాజ్ ఫౌండేషన్ ప్రధానంగా సవాల్ చేసినప్పటికీ ఒక డ్యాన్సర్, ఒక జర్నలిస్టు, ఒక చెఫ్, ఒక హోటల్ యజమాని, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోరాటంతో దేశంలో గే చట్టాల్లో సమూల మార్పులు వచ్చాయి. గే హక్కుల కోసం పోరాడుతూ ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీకి చెందిన ఆ ఆరుగురు ఎవరంటే... నవతేజ్ సింగ్ జౌహర్ నవతేజ్ జౌహర్ భరతనాట్యం డ్యాన్సర్. కొరియోగ్రాఫర్ కూడా. ఢిల్లీ, చెన్నైలలో ఆయన నృత్యపాఠశాలల్ని నడుపుతున్నారు. నాటక అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు. చాలా ఏళ్లుగా ఆయన స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. తన సహచరుడు, జర్నలిస్టు సునీల్ మెహ్రా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సునీల్ మెహ్రా ప్రముఖ జర్నలిస్టు, మాగ్జిమ్ మ్యాగజైన్ మాజీ సంపాదకులు. టెలివిజన్ ప్రొడక్షన్స్లలో కూడా పని చేశారు. 20 ఏళ్లకు పైగా నవతేజ్ జౌహర్తో ఆయనకు అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి స్టూడియో అభ్యాస్ని నడిపారు. మొదట్లో న్యాయపోరాటం చేయాలని సునీల్ గట్టిగా అనుకోలేదు. కానీ ఆయన స్నేహితురాలు, లాయర్ అయిన మేనక గురుస్వామి గే హక్కుల కోసం న్యాయస్థానంలోనే పోరాటం చేయాలని చెప్పడంతో పిటిషన్ దాఖలు చేయడానికి ముందుకొచ్చారు. రీతూ దాల్మాయి ప్రముఖ చెఫ్. ఢిల్లీలో ఒక ఇటలియన్ రెస్టారెంట్ దివాని ఆమె నడుపుతున్నారు. ఇండియన్ టీవీలో కుకరీ షోని హోస్ట్ చేస్తున్నారు. కోల్కతాలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన రీతూ పదహారేళ్ల వయసులోనే మార్బుల్ బిజినెస్ చేశారు. ఆతర్వాత ఒక చెఫ్గా పేరు తెచ్చుకున్నారు. అమన్ నాథ్ 67 ఏళ్ల వయసున్న అమన్ నాథ్ ప్రముఖ రచయిత, ఆర్కిటెక్టర్. హెరిటేజ్ హోటల్స్ నీమ్రానా గ్రూపు వ్యవస్థాపకుడు తన భాగస్వామి ఫ్రాన్సిస్తో కలిసి అత్యంత పురాతనమైన భవనాలను హోటల్స్గా మార్చారు. వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే ఆయన ఆశయంగా ఉండేది. ఆ తర్వాత గే హక్కుల కోసం పోరాటం చేశారు. కేశవ్ సూరి 33 ఏళ్ల వయసున్న కేశవ్సూరి లలిత్ సూరి హాస్పటాలిటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . భరత్ హోటల్స్ వ్యవస్థాపకుడు లలిత్ సూరి కుమారుడు. కేశవ్సూరి బహిరంగంగానే తాను గే అని చెప్పుకున్నారు. ఇటీవల తన జీవిత భాగస్వామి అయిన మరో పురుషుడిని పెళ్లి కూడా చేసుకున్నారు. అయేషా కపూర్ అయేషా ఇప్పడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న వ్యాపారవేత్త. ఇకామర్స్ మార్కెట్లో తన సత్తా చాటుతున్నారు. -
అప్పుడు తప్పన్న సుప్రీం కోర్టే..
పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2013లో స్వలింగ సంపర్కం నేరమని ఉద్ఘాటించిన సుప్రీం కోర్టు ఇప్పుడది నేరం కాదని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో సుదీర్ఘ కాలం పాటు ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు, చర్చోపచర్చలు సాగడం, అంతర్జాతీయ సమాజం సానుకూలత వ్యక్తం చేస్తుండటం, మన ప్రభుత్వాల వైఖరిలో కూడా మార్పు రావడం వంటివి సుప్రీంపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు. చట్టంలో ఏముంది? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 377వ సెక్షన్ అసహజ నేరాలను నిర్వచించింది.1862 నుంచి అమల్లో ఉన్న ఈ సెక్షన్ ప్రకారం ప్రకృతికి విరుద్ధంగా స్త్రీ, పురుషులు లేదా జంతువులతో లైంగిక చర్య జరపడం శిక్షార్హమైన నేరం. అలాంటి వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విధింవచ్చని సెక్షన్ 377 స్పష్టం చేస్తోంది. చట్టబద్ధం చేసిన ఢిల్లీ హైకోర్టు పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009 జులైలో తీర్పు ఇచ్చింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కుల ‘పరిపూర్ణ వ్యక్తిత్వ హక్కు’ను నిరారిస్తోందని,అందువల్ల ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఆ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2013, డిసెంబర్లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ జీఎస్ సంఘ్వి నాయకత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.వివాదాస్పదమైన ఈ అంశంపై చర్చించాల్సింది పార్లమెంటేనని పేర్కొంది. భారతీయ సమాజంలో స్వలింగ సంపర్కం నిషేధమన్న భావన చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని ఎల్జీబీటీ లే కాకుండా పలువురు స్వేచ్ఛాకాముకులు కూడా వాదిస్తున్నారు.అయితే, దీనిని ‘విపరీత ప్రవర్తన’గా చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. రాజకీయ ఏకాభిప్రాయం మొదట్లో ప్రభుత్వాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ, 377 వ సెక్షన్ను సమర్థిస్తూ వచ్చాయి.అయితే ఈ అంశంపై సీరియస్గా జరిగిన చర్చలు, మీడియా కథనాల ఫలితంగా రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవలసి వచ్చింది.గతంలో సెక్షన్ 377ను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతునిచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు కనిపిస్తోంది.గత నవంబర్లో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ అంశంపై మాట్లాడుతూ‘ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది స్వలింగ సంపర్కాన్ని ప్రత్యామ్నాయ లైంగిక ప్రాధాన్యంగా పరిగణిస్తోంటే మనం ఇప్పటికీ వారిని జైల్లో పెట్టాలన్న అభిప్రాయంతో ఉండటం సరికాదు.ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యమనిపిస్తోంది’అన్నారు.కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎంలు కూడా సెక్షన్ 377 రాజ్యాంగవిరుద్ధమన్న భావననే వ్యక్తం చేశాయి. ట్రాన్స్జండర్లపై తీర్పు ట్రాన్స్ జండర్లను(లింగ మార్పిడి చేసుకున్న వారు) థర్డ్ జండర్గా ప్రకటించాలని, ఓబీసీ కోటాలో వారిని కూడా చేర్చాలని సుప్రీం కోర్టు 2014 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వారికి కూడా ఇతరులలాగే వివాహం, దత్తత, విడాకులు, వారసత్వం తదితర హక్కుల్ని కల్పించాల్సి ఉందని స్పష్టం చేసింది. భారతీయ సమాజంలో ట్రాన్స్జండర్ల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి విషయంలో ప్రభుత్వాల ధృక్కోణం మారాల్సి ఉందని 2015, నవంబర్లో జాతీయ న్యాయ సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవ సభలో ఆయన ఉద్ఘాటించారు.ట్రాన్స్ జండర్ల కోసం చట్టాలను సవరించాలని, కొత్త చట్టాలు తేవాలని ఆయన అన్నారు.ట్రాన్స్ జండర్ల హక్కులను గుర్తిస్తూ ఎన్డీఏ సర్కారు ముసాయిదా చట్టాన్ని కూడా తయారు చేసింది. ఈ పరిణామాలన్నీ సెక్షన్377 విషయంలో సుప్రీం కోర్టు అభిప్రాయం మారడానికి దారి తీశాయి. నైతికత సమస్య స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును బాలల హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తప్పుపట్టాయి. బాలలపై అకృత్యాల నివారణకు ఈ సెక్షను అవసరం ఎంతైనా ఉందని వాదిస్తున్నాయి. అంతే కాకుండా స్వలింగ సంపర్కమన్నది సమాజపు నైతిక విలువలకు విరుద్ధమని పలువురు వాదిస్తున్నారు.అయితే,2012లో తెచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోస్కో) చట్టం సెక్షన్ 377 కంటే సమర్థంగా, పటిష్టంగా ఉందని ఈ చట్టంతో బాలల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని మరో వర్గం వాదిస్తోంది. నైతికత పేరుతో ప్రాథమిక హక్కుల్ని హరించడం సరికాదని అంటోంది. చట్టపరంగా తప్పయినది నైతికంగానూ తప్పే అవుతుందని,అయితే నైతికంగా తప్పయినదంతా చట్టపరంగానూ తప్పేననడం సరికాదని వారంటున్నారు. ఏ నైతిక నేరమైనా సమాజంపై దుష్ప్రభావం చూపినప్పుడే అది చట్టపరంగా నేరమవుతుందేకాని వ్యక్తిగతంగా నష్టం జరిగితే చట్టపరంగా తప్పు కాదని తాజా తీర్పును సమర్థించేవారు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయంగా సానుకూలత స్వలింగ సంపర్కం నేరం కాదన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడుతోంది. వివిధ దేశాలు స్వలింగసంపర్కాన్ని ఆమోదిస్తూ చట్టాలు కూడా చేశాయి.ప్రస్తుతం 120 దేశాలు హోమోసెక్సువాలిటీని చట్టబద్ధంగా పరిగణిస్తున్నాయి. 2000లో నెదర్లాండ్స్ హోమో సెక్సువాలిటీని చట్టబద్ధం చేసింది. ఈ పరంపరను బెల్జియం, కెనడా,స్పెయిన్, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడెన్, ఐస్లాండ్, పోర్చుగల్, అర్జెంటీనా, డెన్మార్క్, ఉరుగ్వే. న్యూజిలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్,ఇంగ్లండ్ అండ్ వేల్స్, ఫిన్లాండ్, మాల్టా కొనసాగించాయి. అమెరికా వ్యాప్తంగా గే వివాహాలు చట్టబద్ధమంటూ 2015 జూన్ 27న యూఎస్ సుప్రీంకోర్టు ప్రకటించింది. 25 దేశాల్లో వీరి మధ్య పెళ్లిళ్లకు కూడా అనుమతి ఉంది. 2003లో తొలిసారిగా నెథర్లాండ్స్ ఈ వివాహాలకు ఆమోదం తెలపగా, జర్మనీ, తాజాగా ఆస్ట్రేలియా ఆ జాబితాలో చేరాయి. ఈ దంపతులు పిల్లలను దత్తత తీసుకునే అవకాశాన్ని 26 దేశాలు కల్పించాయి. 72 దేశాల్లో నేరమే..! భారత్ సహా 72 దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. షరియా చట్టంలో భాగంగా ఇరాన్, సుడాన్, సౌదీ అరేబియా, యెమన్, సోమాలియా, ఉత్తర నైజీరియా స్వలింగ సంబంధాలను తీవ్రమైన నేరాలుగా శిక్షిస్తున్నాయి. ఖతర్లో ముస్లింలను మాత్రమే శిక్షిస్తుండగా, సౌదీ అరేబియాలో ముస్లింతో ఇలాంటి సంబంధం కలిగిన ముస్లిమేతరుడికి కూడా మరణశిక్ష విధించవచ్చు. ఇస్లామిక్స్టేట్ (ఐఎస్) అయితే ఏకంగా బహిరంగ హత్యలకు పాల్పడుతోంది.పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ. ఖతర్, మౌరిటానియా చట్టాల ప్రకారం మరణశిక్షను విధించవచ్చు. -
సీసీటీవిలో రికార్డయిన హిజ్రాలపై దాడి దృశ్యాలు
-
చంద్రయాన్గుట్టలో హిజ్రాలపై రాళ్ల దాడి;ఒకరు మృతి
-
అవకాశాలు ఇస్తే నిరూపించుకుంటాం...
సిద్దిపేటటౌన్: కనిపించగానే చనువుగా మాట్లాడుతారు. చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ డబ్బులివ్వమని అడుగుతారు. కొన్ని సార్లు బెదిరిస్తారు. వారిని చూసి జాలిపడే వారి కన్నా . ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామనుకునే వారే ఎక్కువ. ఎంత కోపంతో ఇచ్చినా ఆశీర్వదించి వెళ్తారు. వాళ్లే ‘హిజ్రా’లు. కుటుంబ సభయులు వెలేసినా, సమాజం దూరం పెడుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకున్నా బతుకు పోరాటం చేస్తున్న హిజ్రాల దీన గాథపై కథనం.. గూడు కోసం గోస.. వీరికి ఉండడానికి సొంత ఇల్లులు ఉండవు. కిరాయికి ఇవ్వడానికి సైతం ఎవరూ ముందుకు రారు. ఆడ, మగ కాకపోయినా సమాజంలో తాము భాగమేనని, తాము కూడా మనుషులమేనని అంటున్నారు హిజ్రాలు. ఉపాధిలేక, ఉండడానికి ఇళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేటలో మంత్రి హరీష్రావుకు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి తమ సంఘం తరపున వినతిపత్రం అందించారు. చదువుకూ, ఉద్యోగానికి దూరం.. వీరు చదువుకుంటామన్నా స్కూళ్లు కుదరదంటున్నాయి. సామర్థ్యం ఉన్నా ఉద్యోగం రానంటోంది. ప్రతిభను ప్రదర్శిం చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు సైతం హిజ్రాల్లో ఉన్నారు. కలిసి బతుకుతారు.. ఒక ప్రాంతంలో ఉండే హిజ్రాలకు ఇళ్లూ, వాకిలి ఒకటే. అందరూ కలిసి సంపాదించుకుంటారు. కలిసి బతుకుతారు. కష్టం, సుఖం పంచుకుంటారు. గుర్తింపు కోసం పోరాటం... హిజ్రాలు ఇప్పుడు గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ఉత్తర భారతదేశంలో సముచిత గౌరవమే లభిస్తోంది వీరికి. తమిళనాడులో ప్రభుత్వ గుర్తింపు పొందిన వీరికి ప్రత్యేకంగా టీ అనే కాలమ్ ఏర్పాటు చేసింది. స్త్రీ పురుషులతో సమానంగా ట్రాన్స్జెండర్స్ను గుర్తిస్తోంది. ఇక్కడ కూడా తమనూ మనుషులుగా గుర్తించాలని కోరుకుంటున్నారు. ఓటు హక్కు కల్పించాలి... నేటికీ మాకు ఓటు హక్కు లేదు. ఇప్పటికైనా మాకు ఓటు హక్కు కల్పించాలి. ఓటు హాక్కు లేకపోవడంతో ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు. మాకు సరైన సౌకర్యాలు కల్పించాలి. మాకు జీవనోపాధి కల్పించేలా, పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.–సోని, ట్రాన్స్జెండర్. అవకాశాలు ఇస్తే నిరూపించుకుంటాం... మేం కావాలని ఈ జీవితాన్ని అనుభవించడం లేదు. మాలోను చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు. అవకాశాలు ఇస్తే మేం ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటాం. మాకు ఉపాధి కల్పించి సమాజంలో మమ్మల్ని ఒక వర్గంగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలి. –సునీత, హిజ్రా మమ్మల్ని తక్కువగా చూడొద్దు.. సమాజంలో మేము భాగమే. హిజ్రాలు అంటే ఏదో కొత్తగా వచ్చిన వ్యక్తులుగా చూడడం మంచిది కాదు. పురాణాల్లో సైతం మాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటివి చూసైనా సమాజంలో మార్పు రావాలి. మేం కావాలని ఇలా మారడంలేదు. మాకు దేవుడిచ్చిన శాపంగా భావించి జీవితాన్ని గడుపుతున్నాం. మగ వాళ్లు చేసే పనులు, ఆడ వాళ్లు చేసే పనులూ రెండు మేం చేయగలం. మేం ఎందులో తక్కువ కాదు. మమ్మల్ని తక్కువగా చూడొద్దు. –ఆకుల మమత. హిజ్రా సంఘం అధ్యక్షురాలు, సిద్దిపేట -
హిజ్రాల పెళ్లిసందడి
అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టు కూవాగంలోహిజ్రాలుముస్తాబయ్యారు. సంప్రదాయవస్త్రాలతో నవ వధువులుగా మారారు. కూత్తాండవర్ఆలయంలో తాళి కట్టించుకుని ఆనందపారవశ్యంలో మునిగారు సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్ ఆలయంలో ఏటా చిత్తిరై ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి ఉత్సవాలు హిజ్రాలకు ఓ పండుగే. దేశ విదేశాల్లోని హిజ్రాలకు ఓ వసంతోత్సవమే. మహాభారత యుద్ధగాథతో ఇక్కడి ఉత్సవాలు ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు. మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని హిజ్రాలు తమ ఆరాధ్యుడిగా కొలుస్తూ ఈ ఉత్సవాల సంబరాల్లో మునిగి తేలుతారు. ఆ దిశగా కూవాగంలో కొలువై ఉన్న కూత్తాండవర్ తమ ఆరాధ్య ఐరావంతుడిగా భావించి తరిస్తారు. ఇక్కడి ఉత్సవాలు గత నెల ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తు్తన్నారు. మహాభారత గాథను ప్రజలకువివరిస్తూ ఇక్కడ నాటక ప్రదర్శన సాగింది. పెళ్లి సందడి: ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి మంగళవారం సాయంత్రం జరిగింది. అత్యంత వేడుకగా జరిగే ఈ మహోత్సవానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు సోమవారమే ఇక్కడికి తరలి వచ్చారు. ఎటుచూసినా, ఎక్కడ చూసినా హిజ్రాలతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. అందగత్తెలకు తామేమి తక్కువ తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని కూవాగంకు ప్రత్యేక వన్నెను హిజ్రాలు తీసుకొచ్చారని చెప్పవచ్చు. వీరిని చూడడానికి ఆ పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున వెలిసిన దుకాణాల్లో పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళిబొట్లను ఉదయం నుంచి కొనుగోలు చేశారు. ఆంధ్రా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి, విదేశాలకు చెందిన హిజ్రాలు సైతం తరలి రావడం విశేషం. సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాబైన హిజ్రాలు కూత్తాండవర్ ఆలయం వద్దకు చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి చేతుల మీదుగా తాళిబొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. ఈ వేడుకతో కూవాగంలో పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. ఇక, రాత్రంతా ఆలయ పరిసరాల్లో జాగారంతో íßహిజ్రాలు సందడి చేశారు. ఆట, పాటలతో ఆనందం తాండవంతో ఐరావంతుడ్ని తమ భర్తగా స్వీకరించి స్వామి సేవలో తరించారు. మిస్ కూవాగంగా మోబీనా: పెళ్లి సందడికి ముందుగా, వయ్యారాల ఒలక బోస్తు హిజ్రాలు తమసత్తాను చాటుకునే ప్రయత్నం చేశారు. అందగత్తెలకు, మోడల్స్కు తామేమి తీసిపోమన్నట్టుగా ర్యాంప్పై అలరించారు. వయ్యారాలే కాదు, తమలోని ప్రతిభను చాటుకున్నారు. దక్షిణ భారత హిజ్రాల సంఘం, తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, విల్లుపురం హిజ్రాల సంఘం తదితర సంఘాల సంయుక్తంగా మిస్ కూవాగం పోటీలను నిర్వహించాయి. 72 మంది హిజ్రాలు పోటీ పడగా, వివిధ కేటగిరిల వారీగా ఎంపిక చేసి చివరకు విజేతలను ప్రకటించారు. ఇందులో చెన్నై అరుంబాక్కంకు చెందిన మోబీనా మిస్ కూవాగం కిరిటాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానాన్ని చెన్నై పోరూర్కు చెందిన ప్రీతి, మూడో స్థానాన్ని ఈరోడ్కు చెందిన శుభశ్రీ దక్కించుకున్నారు. కార్యక్రమానికి సినీ నటి కస్తూరి, నటుడు విమల్, రచయిత స్నేహన్, విల్లుపురం జిల్లా ఎస్పీ జయకుమార్, ఏఎస్పీ శంకర్ హాజరయ్యారు. -
సాహోరే.. క్యాబీ!
మేఘనా సాహును ‘నువ్వసలు ఆడదానివేనా?’ అన్నట్లు చూశారు. ఆ చూపును పట్టించుకోలేదు మేఘన. సమాధానం తనకు తెలియకపోతేనే కదా! చూపుల్ని వదిలి, మలుపుల్ని చూసుకుంది. స్టీరింగ్ అందుకుంది. ‘హాయ్ మేఘనా! నువ్వు అమ్మాయివా? అబ్బాయివా?’ సంశయంగా, సంకోచంగా అడిగింది లావణ్య. ‘అమ్మాయినే. ఒకప్పుడు మాత్రం అబ్బాయిని’.. ఇబ్బందిగా బదులిచ్చింది మేఘన. ‘ఏమో! అమ్మాయిలాగ డ్రస్ వేసుకుంటున్నావ్ కానీ నిన్ను చూస్తే అస్సలు అమ్మాయివి అనే అనిపించవు’.. అదోలా ముఖం పెట్టింది మరో కొలీగ్ ప్రవీణ. ‘నేను అమ్మాయిలా కనిపించినా, అబ్బాయిలా కనిపించినా మనం కలిసి పని చేయడానికి, కలిసి చేస్తున్న పనికీ అదేమీ ఇబ్బంది కాదు కదా’ అంది మేఘన. ఆ మాటను ఆమె స్థిరంగా అన్నప్పటికీ, ఆమె స్వరంలో సన్నటి బాధ చిగురుటాకులా వణికింది. చుట్టూ చూపుల ప్రశ్నలు లావణ్య, ప్రవీణ మౌనంగా ఉండిపోయారు. వెంటనే కంప్యూటర్లో ముఖం పెట్టేసి, తమ పనిలో మునిగిపోయారు. కొలీగ్స్ ఆ సంగతే మర్చిపోయి ఉండొచ్చు. మేఘన మనసును మాత్రం చెప్పలేనంత నిస్పృహ ఆవరించింది. అది ఫార్మా కంపెనీ. అందరూ చదువుకున్న వాళ్లే. అయినా తన పట్ల కొందరి ప్రవర్తనలో ఉండాల్సిన సభ్యత లోపించింది. అది ఏ ఫ్యాషన్ మాల్లో జారి పడిపోయిందో, కెరీర్ పరుగుల్లో అవసరం లేదని వాళ్లే వదిలేసుకున్నారో ఏమో తెలియదు. ఏది వదిలేసుకున్నప్పటికీ మంచికో చెడుకో పక్క మనిషి గురించిన ఆరా తీసే తత్వం మాత్రం వదిలిపోలేదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టినప్పటి నుంచి మళ్లీ ఇల్లు చేరే వరకు మేఘనపై రకరకాల చూపులు. వాటిని తట్టుకోవడానికి ఆమె సిద్ధమైంది, ఆ చూపులకు అలవాటు పడిపోయింది కూడా. అయితే పరిచయం లేని వాళ్ల చూపులను పట్టించుకోవడం మానేసినంత తేలిక కాదు.. రోజూ సహోద్యోగుల నుంచి ఎదురయ్యే చూపుల వివక్షను ఎదుర్కోవడం. అవే ఇప్పుడు ప్రశంసలు అది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నగరం. స్విఫ్ట్ డిజైర్ కారులో డ్రైవింగ్ సీట్లో ఉంది మేఘనా సాహు! ఓలా కంపెనీతో టై అప్ అయిందా క్యాబ్. మేఘనను ఇప్పుడు ‘నువ్వు అమ్మాయివేనా’ అని అడిగేవాళ్లు లేరు. ఒంటరిగా క్యాబ్లో ప్రయాణిస్తున్న ఆడవాళ్లు ‘హమ్మయ్య ఫర్వాలేదు’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. మగవాళ్లు డ్రైవింగ్ సీట్ వైపు చూసి ‘మన నగరం కూడా జెండర్ ఫ్రీ అవుతోంది.. గుడ్’ అనుకుంటున్నారు. ఆ క్యాబ్ ఎక్కింది మీడియా పీపుల్ అయితే వెంటనే ‘క్యాబ్ నడుపుతున్న తొలి ట్రాన్స్జెండర్’ అని ఓ స్టోరీ రాసేస్తున్నారు. అలా మేఘన గురించి ఒడిశా పత్రికలు రాస్తున్నాయి. జాతీయ చానళ్లు ప్రసారం చేస్తున్నాయి. స్ఫూర్తి పొందడానికి చిన్న సంఘటన చాలు. అది సంతోషాన్నిచ్చేదయినా, మనసును గిచ్చి మెలిపెట్టేదయినా.. అని అనుకుంటూ ఉంటుంది మేఘన.. తన పాత ఉద్యోగంలో ఎదురైన ప్రశ్నల్ని తలచుకుని. మరొకరికి స్ఫూర్తినివ్వడానికి చిన్న పనైనా చాలు అనుకుంటోంది ఇప్పుడు. కొడుకు సాయిశుభమ్, భర్త వాసుదేవ్తో మేఘన.. తడబడితే నిలబడలేం మేఘనా సాహు ఎంబీఎ చదివింది. ఆ కోర్సు ఒక పనిని సమర్థంగా నిర్వహించడం ఎలాగో నేర్పిందామెకి. సమాజం నుంచి అంతకంటే పెద్ద పాఠం నేర్చుకుందామె.. ‘తడబడితే నిలబడలేం’ అని. జీవించడానికి తన గౌరవాన్ని పణంగా పెట్టాల్సిన పని లేదని కూడా తెలుసుకుంది. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్గా నెలకు ముప్పై వేలకు తక్కువ కాకుండా సంపాదిస్తోంది. ట్రాన్స్జెండర్ల పట్ల సానుభూతి, గౌరవం ఉన్న, ట్రాన్స్జెండర్ పీపుల్ హక్కుల కోసం పోరాడుతున్న వాసుదేవ్ యాక్టివిస్టును పెళ్లి చేసుకుంది. ఆరేళ్ల పిల్లాడికి తల్లిగా మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది మేఘనా సాహు. భర్తకు మొదటి భార్య వల్ల పుట్టిన కొడుకునే ఆమె తన కొడుకుగా పెంచుతోంది. భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వాసుదేవ్కి మేఘనతో పరిచయం అయింది. ఆ పరిచయం పెళ్లిగా మారింది. - మంజీర నా కోసం.. సడలించారు! నాకు డ్రైవింగ్ లైసెన్స్ పెద్ద సమస్య అయింది. ట్రాన్స్జెండర్లకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించలేదు. ఆర్టిఓ అధికారులు నా డ్రైవింగ్ స్కిల్స్ని ఒకటికి రెండు సార్లు పరీక్షించారు. డ్రైవర్గా మారాలనుకున్న నా నిర్ణయాన్ని పెద్ద మనసుతో గౌరవించి వారి విచక్షణాధికారంతో నిబంధనలను సడలించారు. – మేఘనా సాహు, క్యాబీ -
రైల్వే టికెట్ బుకింగ్లో కొత్త ఆప్షన్?
సాక్షి, న్యూఢిల్లీ: థర్డ్ జెండర్ కోసం భారతీయ రైల్వే కొత్త ఆప్షన్ ను పరిచయం చేస్తోంది. రైల్వే టికెట్ రిజర్వేషన్లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్జెండర్ (మేల్ / ఫిమేల్) ఆప్షన్కు బదులుగా కేవలం ‘టి’ అనే ఆప్షన్ను పొందు పర్చనుంది. రిజర్వేషన్ ఫాంలో ట్రాన్స్ జెండర్ల కోసం టీ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్ ఫాంలో సవరణలు చేయాలని అక్టోబరు 17న జోనల్ అధికారులకు ఒక లేఖలో రైల్వే బోర్డు తెలిపింది. మేల్, ఫీమేల్.. ఆప్షన్లతో పాటుగా ట్రాన్స్ జెండర్ (టి) ఆప్షన్ చేర్చాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీనికి సాఫ్ట్వేర్ లో కూడా మార్పులు తేవాలని సూచించింది. అలాగే టికెట్ బుకింగ్ తో పాటు.. కాన్సిల్ చేసుకునే ఫాంలో కూడా ట్రాన్స్ జెండర్ ఆప్షన్ చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్జెండర్ హక్కుల చట్టం 2016పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులపై విమర్శలు వెల్లువెత్తడంతో 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మార్పులు చేస్తోంది. -
అమెజాన్పై ట్రాన్స్జెండర్ కేసు
కెంటకి: ప్రముఖ ఈ-కామర్స్ సంస్ధ అమెజాన్ పై ఓ ట్రాన్స్జెండర్ మహిళ కేసు వేసింది. తనను, తన భర్తను మానసికంగా వేధించటంతోపాటు, తమపై హత్యాయత్నం చేశారంటూ ఆమె ఆరోపణలు చేసింది. కెంటకిలోని వేర్హౌజ్ రిటైలర్లో అలెగ్రా ష్కావే లేన్, ఆమె భర్త డేన్ లేన్లు పని చేసేవారు. ఆ సమయంలో సహోద్యోగులు తమపై లింగ వివక్షత చూపేవారని ఆ జంట తెలిపింది. వారి లైంగిక జీవితంపై తరచూ కామెంట్లు చేస్తూ వేధించేవారన్నారు. ఈ విషయాన్ని స్టోర్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లగా అతను కూడా ఉద్యోగులతో జత కలిసి తమను మానసికంగా క్షోభకు గురి చేశారని వాపోయారు. వారిద్దరిపై ఓ కన్నేసి ఉంచండంటూ తమ ముందే తోటివారితో చెబుతుండేవారని, ఒకసారి కారు బ్రేక్లు తీసేసి తమను చంపే యత్నం కూడా చేశారని పేర్కొన్నారు. అమెజాన్పై ఇలాంటి ఆరోపణలు రావటంపై పలువురు మండిపడుతున్నారు. గతంలో ఫెడరల్ కోర్టులు ఇలాంటి కేసులను తీవ్రంగా పరిగణించాయని, లింగ వివక్షతకు పాల్పడిన సూపర్వైజర్తోపాటు కంపెనీపైనా చర్యలు తప్పవని అలెగ్రా తరఫు న్యాయవాది జిల్లియన్ వెయిస్స్ చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారంపై స్పందించేందుకు అమెజాన్ విముఖత వ్యక్తం చేసింది. -
కన్నీరుమున్నీరవుతున్న హిజ్రాలు
న్యూయార్క్: అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు వ్యతిరేక నినాదాలతో అమెరికా వినువీధులు గర్జించాయి. దేశ మిలటరీ రంగంలో పని చేయడానికి హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందంటూ వారిపై బుధవారం ట్రంప్ నిషేధం విధించారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ట్రంప్ నిర్ణయంపై ప్రతిఘటన మొదలైంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హిజ్రాలు కన్నీరు కారుస్తూ 'ఈ ప్రెసిడెంట్ మాకొద్దూ అంటూ నినదించారు'. ఏం తప్పు చేస్తే మాపై నిషేధం విధించారంటూ ప్రశ్నించారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని పేర్కొన్నారు. మరికొందరు వైట్ హౌస్ వీధిలో మార్చ్ నిర్వహించారు. మార్చ్ సందర్భంగా.. ' మేం ఇక్కడికి వచ్చాం. మేమంతా ఒక్కటే. మా అందరికీ ప్రెసిడెంట్ ట్రంప్ అంటే అసహ్యం' అంటూ నినాదాలు చేశారు. 'మా శరీరాల్లో భాగాల గురించి మీ అందరికీ ఎందుకు.. మేం పోరాడటానికి సిద్ధం' అనే ప్లకార్డు సగటు అమెరికన్ హిజ్రా భావోద్వేగాన్ని, మిలటరీలో పని చేయాలనే వారి తాపత్రయాన్ని తెలుపుతోంది. ట్రంప్ ఏమన్నారు మిలటరీలోని జనరల్స్, నిపుణులను సంప్రదించిన అనంతరమే తాను హిజ్రాలపై నిషేధాన్ని విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. మిలటరీ విజయాలపై దృష్టి సారించాలంటే హిజ్రా సైనికుల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోక తప్పదని పేర్కొన్నారు. -
గార్డియన్గా కలెక్టర్ ఉండాలి: హిజ్రా వినతి
కేకేనగర్: కలెక్టర్ తనకు గార్డియన్గా ఉండాలని కోరుతూ ఓ హిజ్రా సోమవారం వినతిపత్రం అందజేశారు. తమిళనాడులోని మదురైలో ‘భారతి కన్నమ్మ’ పేరిట ట్రస్ట్ను నిర్వహిస్తున్న హిజ్రా భారతి కన్నమ్మ (57) సోమవారం మదురై కలెక్టర్ కార్యాలయంలో ఒక వినతి పత్రం అందజేశారు. అందులో.. తనకు కలెక్టర్ గార్డియన్గా ఉండాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా భారతి కన్నమ్మ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు పలు సంవత్సరాల క్రితమే మృతి చెందారనీ, తోబుట్టువులు ఎవరూ ఆదరణ చూపకపోవడంతో తాను ఒంటరిగా ఉంటూ సామాజిక సేవ చేస్తున్నానని తెలిపారు. తాను ఇప్పటికే బీఏ పూర్తిచేశానని, ప్రస్తుతం ఎల్ఎల్బీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ దరఖాస్తులోని 14, 15 పట్టికల్లో తల్లిదండ్రులు లేదా గార్డియన్ వృత్తి, ఆదాయం తదితర వివరాలు చూపాలని ఇచ్చారన్నారు. అయితే తల్లిదండ్రులు కానీ, గార్డియన్ కానీ లేరా? అని ఏ పట్టికలోనూ పేర్కొనలేదనీ, కనుక తనకు గార్డియన్గా కలెక్టర్ కావాలని కోరుతున్నట్టు భారతి కన్నమ్మ వివరించారు. -
నపుంసకుడితో వివాహం జరిపించారు!
భర్తపై భార్య ఫిర్యాదు బెంగళూరు(బనశంకరి) : తన భర్త నపుంసకుడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బాణసవాడి పోలీస్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... బాణసవాడికి చెందిన జూలీ (పేరుమార్చాము)కి 2014లో రాబర్ట్ (పేరు మార్చాము) అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన మొదటి రాత్రే తన భర్త నపుంసకుడిగా తేలిందని, సంసారానికి పనికిరాని వ్యక్తితో తనకు వివాహం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోసం చేసి తన జీవితం నాశనం చేసిన భర్త, అత్త, మామపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎయిర్పోర్ట్లో బ్యూటీ క్వీన్ అరెస్టు
మయన్మార్: పాపులర్ నటిగా దూసుకుపోతున్న మయన్మార్ బ్యూటీ (ట్రాన్స్జెండర్) మ్యోకోకోసాన్ అరెస్టయింది. థాయిలాండ్ ట్రిప్ నుంచి తిరిగొస్తున్న ఆమెను విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టడంతోపాటు కొంత అసభ్యకరమైన పదజాలం ఉపయోగించందనే ఆరోపణల కిందట అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఆమెను యాంగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నపోలీసులు ప్రస్తుతం మహిళల జైలులో ఒంటరిగా ఉంచి విచారణ చేస్తున్నారు. ఈ నెలాఖరుకి అది పూర్తయ్యే అవకాశం ఉంది. టెలీకమ్యునికేషన్ చట్టం ప్రకారం సెక్షన్ 66(డీ)కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. వుట్ మోన్ యీ అనే వ్యక్తిని అవమానించేలా ఆమె ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియాలో అసభ్యకరంగా సందేశాలు పెట్టిందట. లింగమార్పిడి చేసుకున్న తర్వాత థాయిలాండ్ లో జరిగిన ట్రాన్స్జెండర్ మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొని తొలిస్థానాన్ని దక్కించుకుని ఈమె 2015లో ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి తొలుత సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. -
లాక్మేలో న్యూ లుక్
ఇండియన్ ర్యాంప్పై తొలి ట్రాన్స్జెండర్ రిపోర్టర్స్ డైరీ అంజలి లామా (32). నేపాల్ ‘అమ్మాయి’. వచ్చే నెల ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ చేయబోతోంది. ఒక ట్రాన్స్ జెండర్ మోడల్ తొలిసారి ఇండియన్ ర్యాంప్పైకి వెళ్లబోవడమే ఇందులోని సంచలనం. అంజలి అమ్మాయి కాదు. అబ్బాయి. నవీన్ వైబా అనే అబ్బాయి! అతడు అంజలిగా మారడమే ఒక విశేషమైతే, ఏకంగా గ్లామర్ వరల్డ్లో పాదం మోపడం మరీ విశేషం. ఈ న్యూస్ తెలియగానే ‘సాక్షి’ ఆమెను అభినందించింది. ఆమెతో ముచ్చటించింది. అంజలి మనోభావాలివి. ఇంట్లోంచి.. వెళ్లగొట్టారు నేపాల్లోని నువాకట్ నా బర్త్ ప్లేస్. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచే సమాజంలో లైంగికపరంగా ఉన్న వైరుధ్యాలను చూస్తూ పెరిగాను. అబ్బాయిలు, అమ్మాయిలు తమదైన సహజ స్వభావంతో ఎలా ప్రవర్తిస్తారో గమనిస్తున్నప్పుడు అందుకు భిన్నంగా.. నా ప్రవర్తన, ఆలోచనలు ఉండడం గ్రహించాను. అమ్మతో నాకు ఎక్కువ దగ్గరితనం. నా ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలే. ఎప్పుడూ వాళ్లతో ఉండేవాడిని. వాళ్లతో కంఫర్ట్గా అనిపించేది. నేనూ దాదాపుగా ఒక అమ్మాయిలా మారిపోయాను. అందరూ నన్ను వింతగా చూడడం మొదలైంది. చివరకు నా ప్రవర్తనతో తలెత్తుకోలేకపోతున్నామంటూ నా కుటుంబం కూడా నన్ను తరిమేసింది. గ్లామర్ ఫీల్డ్ ‘ఛీ’ కొట్టింది చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఖాట్మాండులో మోడలింగ్ ట్రైనింగ్ పూర్తి చేశాను. ఒక మ్యాగజీన్ కవర్ పేజీ కోసం ఏర్పాటు చేసిన ఫోటో షూట్తో.. నా జీవితం ప్రారంభం అయినప్పఅయింది. అయితే అడుగడుగునా నా ప్రయాణం కష్టంగా మారింది. అనేక రకాలుగా ఎదురు దెబ్బలు తగిలాయి. ట్రాన్స్ జెండర్ అనే ఏకైక కారణంతో గ్లామర్ ప్రపంచం నన్ను తిరస్కరించింది. చాలా ఏడ్చాను. స్నేహితులు, బంధువులు అంతా ఈ వృత్తిని వదిలేయమని సలహా ఇచ్చారు. కాని నేను వదిలిపెట్టలేదు. నా పై నాకున్న నమ్మకంతో, ట్రాన్స్జెండర్లు గ్లామర్ ఫీల్డ్కు పనికిరారనే అపోహ తొలగించాలనే దృఢ సంకల్పంతో ముందుకు నడిచాను. ప్రతిష్టాత్మకమైన లాక్మే ఫ్యాషన్ వీక్ దాకా రాగలిగాను. నాకు ఇష్టమైన మోడల్ ఆండ్రియానా లిమా. బ్రెజిల్. నేనింకా పైపైకి ఎదగాలి పూర్తిగా నా ప్రొఫెషన్పైనే దృష్టి పెట్టాను. మోడల్గా ఉంటూనే ఇంకా పెద్ద పోటీల్లో పాల్గొని గెలవాలనేది నా కోరిక. మోడలింగ్ రంగంపైనే పూర్తిగా నా దృష్టి ఉంటుంది. ఇక్కడే నా స్థానాన్ని ఏర్పరచుకుంటా. కానీ ఇందుకు నేను చాలా కష్టపడాలి. దేశంలో ట్రాన్స్జెండర్ కమ్యునిటీ అయిన ఎల్జీబీటీ (లెస్బియన్ గే బై సెక్సువల్ ట్రాన్స్ జెండర్ పీపుల్) హక్కుల పట్ల ఎవరికి పట్టింపు లేదు. మమ్మల్ని ఈ సమాజం అంగీకరించడం చాలా కష్టం. అయినప్పటికీ, నేను మాత్రం అతి కష్టమ్మీద అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ స్థాయికి వచ్చాను. నా విజయాలతో నాతోటి వారికి స్ఫూర్తిని కలిగించడం నా బాధ్యతగా భావించి పని చేస్తాను. ఫిట్నెస్ గురించి అంజలి ఆహారం మితంగా తీసుకుని.. తగిన మోతాదులో నీళ్లు తాగుతాను. శరీరాన్ని నిరంతరం హైడ్రేట్గా ఉంచుకుంటాను. లాక్మే ఫ్యాషన్ వీక్లో ఎంపికయిన తర్వాత, ఇప్పుడిప్పుడే జిమ్కు వెళ్లడం మొదలు పెట్టాను. నా సలహా ఒక్కటే.. మన శరీర తత్త్వాన్ని తెలుసుకుని, దానికి తగ్గ పని చెప్పాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేచురల్గా, సింపుల్గా ఉండాలి. అదే మన అందాన్ని కాపాడుతుంది. – ఎస్.సత్యబాబు -
పురుషుడు..ప్రసవించబోతున్నాడు!
లండన్: సృష్టి ధర్మం తిరగబడనుంది! ఒక బ్రిటిష్ పురుషుడు కొన్ని నెలల్లో ప్రసవించబోతున్నాడు!! లింగమార్పిడితో పురుషుడిగా మారుతున్న 20 ఏళ్ల హేడెన్ క్రాస్ ప్రస్తుతం 16 వారాల గర్భంతో ఉన్నాడు. ప్రసవంతో బ్రిటన్లో బిడ్డకు జన్మనివ్వనున్న తొలి మగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్ మూడేళ్ల కిందటి నుంచి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ చికిత్స చేయించుకుంటున్నాడు. భవిష్యత్తులో బిడ్డల్ని కనేందుకు తన అండాలను భద్రపరచాలని కోరగా అందుకు 4 వేల పౌండ్లు ఖర్చవుతుందని, దాన్ని భరించలేమంటూ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ తిరస్కరించింది. దీంతో అతడు ఫేస్బుక్ ద్వారా ఒక వీర్యదాతను కనుగొని గర్భం దాల్చాడు. లింగమార్పిడి పూర్తయ్యాక గర్భం సాధ్యం కాదు కనుక అంతకుముందే బిడ్డను కనాలనుకున్నానని, తాను మంచి నాన్నను అవుతానని హేడెన్ చెప్పాడు. -
మహిళగా మారాక.. నాపై అత్యాచారం
అబ్బాయిగా ఉన్నన్నాళ్లు తనకు బాగానే ఉండేదని, కానీ అమ్మాయిగా మారిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని లండన్కు చెందిన లారెన్ హారీస్ చెప్పారు. తొలుత అబ్బాయిగా ఉన్నప్పుడు 12 ఏళ్ల వయసులోనే పురాతన వస్తువుల నిపుణుడిగా లారెన్ ఉండేవాడు. మంచి సూటు వేసుకుని, టై కట్టుకుని హుందాగా కనిపించేవాడు. అయితే, ఒంట్లో ఆడ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో స్కూల్లో తరచు అవమానాలకు గురయ్యేవాడు. ఫలితంగా డిప్రెషన్, అగోరాఫోబియా.. ఇవన్నీ రావడంతో పాటు మూడుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. చిట్టచివరకు 2002లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. అయితే.. అప్పటివరకు ఒక రకం కష్టాలైతే ఆ తర్వాత మరో రకం కస్టాలు మొదలయ్యాయి. లండన్లోని ఓ హోటల్లో ఉండగా దారుణంగా అత్యాచారం జరగడంతో, ఆస్పత్రిలో చికిత్స కూడా పొందాల్సి వచ్చింది. ఇప్పుడు తాను పరిపూర్ణ మహిళగా ఉన్నానని, ట్రాన్స్జెండర్ టీవీ పర్సనాలిటీగా ఉండటంతో పాటు గాయనిగా కూడా పేరు సంపాదించానని చెప్పింది. చాలా కాలం పాటు అసాధారణ జీవితం గడిపానని, ఇప్పుడు మహిళగా మారిన తర్వాత భద్రత లేకుండా పోయిందని లారెన్ హారీస్ అంటోంది. ఎనిమిదేళ్ల వయసులో తాను తన సోదరులతో పాటు ఎదగాల్సినంతగా ఎదగకపోవడంతో తన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లిందని, తీరా చూస్తే అప్పుడు అసలు విషయం తెలిసిందని హారీస్ వివరించింది. తన సోదరులు ట్రక్కులు, ట్రాన్స్ఫార్మర్ లాంటి బొమ్మలతో ఆడుకుంటుంటే తాను మాత్రం చిన్న గుర్రప్పిల్ల బొమ్మ, చైనా బొమ్మలతో ఆడుకునేదాన్నని తెలిపింది. వయసు పెరిగే కొద్దీ సమస్య తీవ్రమైందని, 16 ఏళ్ల వయసు వచ్చాక కూడా తానేంటో, ఏం కావాలనుకుంటున్నానో అర్థమయ్యేది కాదని చెప్పింది. ఎట్టకేలకు మహిళగా మారిన తర్వాత ఆ సమస్యలన్నీ పోయినా.. ఇప్పుడు భద్రత పెద్ద సమస్యగా మారిందని వాపోయింది. -
వారి కోసం రైల్వే రిజర్వేషన్లో ప్రత్యేక కాలమ్
న్యూఢిల్లీ: లింగమార్పిడి వ్యక్తుల్ని భారతీయ రైల్వే థర్డ్ జెండర్గా గుర్తిస్తూ వారి కోసం రైల్వే రిజర్వేషన్, క్యాన్సిలేషన్ దరఖాస్తుల్లో స్త్రీ, పురుషులతో పాటు మూడో కాలమ్ కేటాయించింది. టికెట్ కౌంటర్లతో పాటు ఆన్లైన్ విధానంలోనూ త్వరలో ఇది అమలుకానుంది. హిజ్రాలు, లింగమార్పిడి వ్యక్తుల హక్కుల్ని కాపాడేందుకు వారిని థర్డ్ జెండర్గా గుర్తించాలంటూ 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో వారికోసం కాలమ్ కేటాయిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. -
అతని కోసం.. అమ్మాయిగా మారితే
పెళ్లికి నిరాకరణ పరిహారంగా రూ.10 లక్షలకు ప్రామిసరీ నోట్లు అతని తండ్రిని నిలదీసిన బాధితురాలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు పెనమలూరు: గతంలో అతని పేరు దుర్గారావు. అప్పట్లో ఓ వ్యక్తిపైన ప్రేమతో లింగమార్పిడి చేసుకుని ‘దుర్గ’ అయింది. తర్వా త ఆ వ్యక్తి దుర్గను కాదని మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. దుర్గ నిలదీయగా పరిహారంగా రూ. 10 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. అనంతరం తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రామిసరీ నోట్లకు గడువు ముగుస్తుడటంతో దుర్గ కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డోను దుర్గారావు 2007లో ఇంటర్ చదువుతుండగా రాకేష్రెడ్డితో పరిచయం ఏర్పడింది. వారు చాలాకాలం కలసి జీవించారు. దుర్గారావు 2010లో ముంబాయ్ వెళ్లి లింగమార్పిడి చేసుకుని దుర్గగా మారింది. రాకేష్రెడ్డిని దుర్గ వివాహం చేసుకోవాలనుకుంది. అయితే రాకేష్రెడ్డి 2014లో మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆ సమయంలో రాకేష్రెడ్డిని దుర్గ నిలదీయగా అతను పెళ్లి చేసుకోలేనని చెప్పి.. పరిహారం కింద రూ. 10 లక్షలకు ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు. తర్వాత దుర్గకు కనిపించకుండా తిరుగుతున్నాడు. ఆ నోట్లకు కాలం చెల్లిపోతుండటంతో దుర్గ పెనమలూరు మండలం కానూరులో నివసిస్తున్న రాకేష్రెడ్డి తండ్రి చిరంజీవిరెడ్డి ఇంటికి.. ఆయన పనిచేసే బ్యాంకుకు శుక్రవారం వెళ్లి రాకేష్రెడ్డి చిరునామా చెప్పాలని గొడవపడింది. దీంతో చిరంజీవిరెడ్డి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని దుర్గ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఈ పరస్పర ఫిర్యాదులతో ఏమి చేయాలో పాలుపోక పోలీసులు తలపట్టుకున్నారు. ఒంగోలులో జరిగిన వ్యవహారం కాబట్టిSతాము ఏమీ చేయలేమని పెనమలూరు పోలీసులు దుర్గకు తెలిపారు. అయితే దుర్గ పట్టువీడలేదు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని బ్యాంకు వద్ద గొడవ చేసినందుకు దుర్గపై, ఆమెను మోసం చేసినందుకు రాకేష్రెడ్డిపై కేసులు నమోదు చేశారు. రాకేష్రెడ్డి కేసును ఒంగోలు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. -
పెళ్లికోసం లింగమార్పిడి చేయించుకున్నా..
► ఇద్దరు పురుషుల మధ్య స్నేహం ► మహిళగా ఒకరు లింగమార్పిడి ► ఆమెతో పెళ్లికి నిరాకరించిన స్నేహితుడు ► పోలీస్స్టేషన్లో ట్రాన్స్జెండర్ ఫిర్యాదు పెనమలూరు : అతని పేరు దుర్గారావు. లింగమార్పిడి ఆపరేషన్ చేసుకుని దుర్గగా మారింది. దుర్గారావుగా ఉన్నప్పుడు ఓ వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది. అతడిని వివాహం చేసుకునేందుకే దుర్గగా మారింది. అయితే ఆ వ్యక్తి దుర్గను కాదని మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. దుర్గ నిలదీయగా ఆమెతో కలిసి ఉండలేనని, పరిహారంగా రూ.10 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. అనంతరం తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రామిసరీ నోట్లకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో దుర్గ పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు చెందిన దుర్గారావుకు 2007లో ఇంటర్ చదువుతున్న సమయంలో రాకేష్రెడ్డితో పరిచయం ఏర్పడింది. వారు చాలాకాలం కలసి జీవించారు. దుర్గారావు 2010లో ముంబాయ్ వెళ్లి లింగమార్పిడి చేసుకుని దుర్గగా మారింది. రాకేష్రెడ్డిని దుర్గ వివాహం చేసుకోవాలనుకుంది. అయితే రాకేష్రెడ్డి 2014లో మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆ సమయంలో రాకేష్రెడ్డిని దుర్గ నిలదీయగా అతను పెళ్లి చేసుకోలేనని చెప్పి పరిహారం కింద రూ.10 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. అయితే రాకేష్రెడ్డి ఆ తరువాత దుర్గకు కనిపంచకుండా తిరుగుతున్నాడు. ప్రామిసరీ నోట్లకు కాలం చెల్లిపోతుండటంతో దుర్గ పెనమలూరు మండలం కానూరు టీచర్స్ కాలనీలో నివసిస్తున్న రాకేష్రెడ్డి తండ్రి చిరంజీవిరెడ్డి ఇంటికి వచ్చింది. చిరంజీవిరెడ్డి పని చేస్తున్న బ్యాంకు వద్దకు శుక్రవారం వెళ్లి రాకేష్రెడ్డి చిరునామా చెప్పాలని గొడవపడింది. దీంతో అతను పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని దుర్గ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఈ పరస్పర ఫిర్యాదులతో ఏమి చేయాలో పాలుపోక పోలీసులు తలపట్టుకున్నారు. ఒంగోలులో జరిగిన వ్యవహారానికి తాము ఏమీ చేయలేమని పెనమలూరు పోలీసులు దుర్గకు తెలిపారు. అయితే తనకు న్యాయం చేయాల్సిందేనని దుర్గ పట్టుపట్టింది. చివరకు పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని బ్యాంకు వద్ద గొడవ చేసినందుకు దుర్గపై, ఆమెను మోసం చేసినందుకు రాకేష్రెడ్డిపై కేసులు పెట్టారు. రాకేష్రెడ్డి కేసును ఒంగోలుకు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. -
‘ట్రాన్స్ జెండర్’ బిల్లుపై సూచనలు ఇవ్వండి
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణకు సంబంధించిన చట్ట రూపకల్పనపై పార్లమెంటరీ కమిటి ప్రజల నుంచి సూచనలు కోరింది. ట్రాన్స్జెండర్లపై వివక్ష, హక్కుల పరిరక్షణపై బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటి ఈ మేరకు చట్టంపై ప్రజలు, ఎన్జీవోల నుంచి సూచనలు కోరినట్లు లోక్సభ కార్యాలయం తెలిపింది. ట్రాన్స్జెండర్లు సాంఘిక బహిష్కరణ, వివక్షకు గురవుతుండటం, విద్య, వైద్య, నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటుండటంతో వారి హక్కుల పరిరక్షణకు కేంద్రం బిల్లు రూపకల్పన చేసింది. వీరిపై వివక్ష చూపినా, హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారికి రెండేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించే దిశగా కేంద్రం చట్టం తయారు చేసింది. -
హిజ్రాను వేధించి.. ఆపై కాల్పులు
తాను అప్పుగా ఇచ్చిన నగదు తిరిగివ్వమని అడిగినందుకు ఓ హిజ్రాపై నిందితుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్ లోని పెషావర్ నగరంలో శనివారం చోటుచేసుకుంది. దీదర్ అనే ట్రాన్స్ జెండర్ షాహిద్ అనే వ్యక్తికి కొంత మొత్తం అప్పుగా ఇచ్చింది. ఎన్ని రోజులైనా తన డబ్బులు తిరిగివ్వడం లేదని అతడి ఇంటికి వెళ్లింది. డబ్బులు ఇవ్వమని అడిగిన క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన నిందితుడు షాహిద్, తనకు మనీ ఇచ్చిన హిజ్రాపై తుపాకీతో కాల్పులుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ బుల్లెట్ దీదర్ చేతిలోకి దూసుకెళ్లింది. దీదర్ కు ప్రాథమిక చికిత్స నిర్వహించి సర్జరీ వార్డులోకి షిఫ్ట్ చేశామని కైబర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మరికొంత మంది హిజ్రాలు ఆస్పత్రికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డబ్బులు తిరిగివ్వక పోగా తనను వేదింపులకు గురిచేశాడని దీదర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఏడాది కైబర్ ఏరియాలో హిజ్రాలపై జరిగిన ఆరో దాడి కావడం గమనార్హం. అలీషా అనే ట్రాన్స్ జెండర్ పై ఈ ఏడాది మొదట్లో ఓ వ్యక్తి ఎన్నిమిది రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
నిరుపేదలకు అండగా 'కల్కి కళ'
-
హిజ్రాలకూ పోలీసు ఉద్యోగాలు
చెన్నై: హిజ్రాలకు పోలీస్శాఖలో ఉద్యోగాలు కల్పించడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలవనుంది. పోలీస్శాఖలో 13,137 ఖాళీలను భర్తీ చేయాలని జయలలిత ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలో పోలీసు ఉద్యోగాలకు హిజ్రాలకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల్లో హిజ్రా అని స్పష్టం చేసిన వారిని మహిళా విభాగ దరఖాస్తుల జాబితాలో చేర్చి అందుకు అనుగుణమైన పరీక్షలు, పరిశీలనలు నిర్వహించనున్నారు. ఈ తరహా నిర్ణయం దేశంలోనే తొలిసారి కావటం విశేషం. 2013లో పోలీసు ఉద్యోగానికి శాంతి అనే హిజ్రా దరఖాస్తు చేసుకుంది. అనంతరం రాత, శరీర దారుఢ్య పరీక్షతోపాటు ఇంటర్వ్యూలోనూ ఉత్తీర్ణురాలై పోలీసు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుంది. అయితే కొన్ని నెలలు ఉద్యోగం చేసిన తరువాత సహజంగా నిర్వహించిన వైద్య పరీక్షలో శాంతి హిజ్రా అని తేలడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో సదరు శాంతి మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. పాఠశాలల్లో తనను మహిళగా గుర్తించారని... అలాగే మహిళా క్రీడాకారిణిగా తమిళనాడు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోనూ పాల్గొన్నట్లు శాంతి హైకోర్టుకు తెలిపింది. దీంతో శాంతిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు పోలీసుశాఖను ఆదేశించింది. కాగా శాంతి మళ్లీ పోలీసుశాఖలో చేరలేదు. శాంతి విషయంలో హైకోర్టు తీర్పును ఆదర్శంగా తీసుకున్న హిజ్రాలు పోలీసుశాఖలో ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపడంతో ప్రభుత్వం కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు ఆ శాఖలోని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మరో నెలరోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. డిసెంబర్లోగా హిజ్రాల నియామకం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
అక్కడ హిజ్రాలను దేవతలుగా పూజిస్తారు
దేవనిపట్టినమ్: తమిళనాడులోని దేవనిపట్టినమ్ చేపల వేటపై బతికే ఓ చిన్న గ్రామం. అక్కడ దుర్భర జీవితాన్ని అనుభవించే హిజ్రాలను కోఠీలని, కిన్నార్లని, అరవాణిలని ప్రాంతాలనుబట్టి పిలుస్తారు. వారు ఏడాదిలో పది రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లో అడుక్కుతింటూ లేదా కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారి పట్ల తోటి సమాజం పెద్ద గౌరవం కూడా చూపదు. ఏడాదిలో పది రోజులు మాత్రం వారు దేవతా మూర్తులుగా ప్రజలచేత మన్ననలు అందుకుంటారు. పూజలు, పుణ్య కార్యక్రమాలకు అర్హులవుతారు. ఈ పది రోజులు వారికి పండుగే. ఈ పండుగనే ఇక్కడి ప్రజలు ‘కొల్లాయి పండగ’ అని పిలుస్తారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మర్చి నెలలో జరిగే ఈ పండుగ అనాదిగా వస్తున్న సనాచారం. ఈ పది రోజులుపాటు హిజ్రాలు దేవతా మూర్తులుగా ముఖానికి రంగులు వేసుకుంటారు. సగం మనిషి, సగం దేవతామూర్తిగా ముఖానికి మేకప్ వేసుకుంటారు. దేవాలయానికి వచ్చి ప్రజలచేత పూజలు అందుకుంటారు. ప్రజలను సుఖశాంతులతో వర్థిల్లాల్సిందిగా దీవెనలిస్తారు. దేవాలయంలో నృత్యాలు చేస్తారు. వారిలో కొందరు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ భవిష్యవాణిని వినిపిస్తారు. మూర్చలు పోతారు. అనంతరం వీధుల్లో గుంపులుగా సంచరిస్తారు. ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం వారిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి కొత్త బట్టలతో సత్కరిస్తారు. వారి నుంచి దీవెనలు స్వీకరిస్తారు. ఈ పది రోజులు మాత్రం హిజ్రాల జీవితం పుష్టిగా మూడు పూటల భోజనం, ఆరు పూటల తీర్థ ప్రసాదులుగా ఏ లోటు లేకుండా సాగిపోతుంది. పది రోజులు ముగిశాక వారు మళ్లీ సాదారణ జీవితంలోకి అడుగుపెడతారు. మళ్లీ కష్టాలు, కనీళ్లు షరా మామూలే. కాయకష్టం చేయకుండా పూట గడవడం కూడా కష్టమే. వారిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని కుటుంబాలను కూడా పోషిస్తుండగా, ఎక్కువ మంది జీవితాంతం బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. సమాజంలో మూడవ జెండర్గా గుర్తింపు పొందిన హిజ్రాలు అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తుండగా, ఇంకా ఆ మార్పు ఛాయలు మాత్రం తమిళనాడులోని దేవనిపట్టినమ్లో కనిపించడం లేదు. -
లెస్బియన్లు, గేలు ట్రాన్స్జెండర్లు కారు
సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ: లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులు సమాజంలో మూడోవర్గం (థర్డ్ జెండర్) కిందకు రారని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని 2014 ఏప్రిల్ 15న ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా చెప్పిన ట్లు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాటి తీర్పు వచ్చిన అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలంటూ 2014 సెప్టెంబరులో కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన విచారణకు అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కేంద్రం తరఫున హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 2014 నాటి తీర్పుననుసరించి లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులను మూడోవర్గంగా పరిగణించాలా వద్దా అనే విషయంలో త మకు అయోమయం నెలకొందని అన్నారు. ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని కోరారు. ట్రాన్స్జెండర్ కార్యకర్తల తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తన వాదన వినిపిస్తూ గత రెండేళ్లుగా కేంద్రం 2014 నాటి కోర్టు తీర్పును అమలు చేయడం లేదని, ట్రాన్స్జెండర్ల విషయంలో తమకు కూడా స్పష్టత కావాలని అడిగారు. ఈ అభ్యర్థనలపై కోర్టు స్పందిస్తూ ‘హిజ్రాలను మూడోవర్గంగా గుర్తించాలని మేం 2014 నాటి తీర్పులోనే చెప్పాం. వారికి చట్టబద్ధ గుర్తింపు కల్పించి, విద్యలోనూ సామజికంగాను వెనుకబడిన వారిగా పరిగణించాలని కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించాం. వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పాం. వీరి జాబితాలోకి లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులు రారు’ అని గురువారం నాటి తీర్పులో వివరించింది. -
పాక్ లో ఆ పెళ్లిళ్లకు ఓకే!
ఇస్లామాబాద్: ట్రాన్స్ జండర్ల వివాహాలకు అనుమతినిస్తూ పాకిస్తాన్ లో 50 మంది మత పెద్దలు(క్లరిక్ లు) ఫత్వా జారీ చేశారు. దీంతో ట్రాన్స్ జండర్ ను వివాహాం చేసుకోవడం ఇక పాక్ లో చట్టబద్దం కానుంది. తన్ జీమ్-ఇత్తేహాద్-ఐ-ఉమ్తత్ కు చెందిన మత పెద్దలు మగ లేదా ఆడా ఏదో ఒక లక్షణం కలిగిన ట్రాన్స్ జండర్ ను వివాహం చేసుకోవచ్చని, ఆడ, మగ లక్షణాలను కలిగిన ట్రాన్స్ జండర్స్ వివాహం చేసుకోవడానికి కుదరని చెప్పారు. ట్రాన్స్ జండర్స్ ను దోచుకోవడం చట్ట విరుద్ధమని చెప్పారు. తల్లిదండ్రుల వదిలేసిన ట్రాన్స్ జండర్స్ ను దేవుని వద్దకు రావాలంటూ ఆహ్వానించారు. అలాంటి తల్లిదండ్రులను శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. ట్రాన్స్ జండర్స్ ను అవమానించే సాధారణ పౌరులను శిక్షించాలని, సాధారణ ముస్లిం పౌరులలానే వారికి అంత్యక్రియలు జరిగేలా ఆదేశించారు. -
ఆ.. మహిళపైనా మృగాళ్ళ దాడి!
మహిళ కనిపిస్తే చాలు మగాళ్ళు.. మృగాళ్ళై పోతున్నారు. రాను రాను మానవత్వం నశించి, రాక్షసులుగా మారుతున్నారు. శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం తన,పర, లింగ, వయో బేధాలను సైతం మర్చిపోతున్నారు. కనిపించిన వారిని కాటేసేందుకు సిద్ధమైపోతున్నారు. అటువంటి మానవ మృగాల దారుణాలకు అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన దారుణం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళపై దుండగులు ఒడిగట్టిన కిరాతక చర్య.. మానవ సమాజం తలదించుకునేలా చేసింది. తొడపై తీవ్ర గాయంతో బాధపడుతున్న ఆమె.. పాకిస్తాన్ కు చెందిన ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళ. మాన్ సెహరా పట్టణం వాయువ్యప్రాంతంలోని ఆమె నివాసానికి చేరిన ముగ్గురు సాయుధ దుండగులు తలుపు బద్దలుకొట్టిమరీ ఆమెపై దాడికి దిగారు. తుపాకీతో కాల్చి, ఆమెపై ఆఘాయిత్యానికి ప్రయత్నించారు. లైంగిక చర్యలకు తమకు సహకరించలేదన్న కోపంతో ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. బాధితురాలు తీవ్రంగా ఎదుర్కోవడంతో కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసు అధికారి అమ్మర్ నియాజ్ తెలిపారు. దుండగులను నిర్బంధించేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. బాధితురాలు గాయం నుంచి కోలుకొంటోందని, ఆస్పత్రినుంచి ఆమెను డిశ్చాడ్చి చేసినట్లు పోలీసులు తెలపడంతో విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనతో పాకిస్తాన్ మాన్ సెహరా ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ లక్ష్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయంటూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు, హిజ్రా కమ్యూనిటీ మద్దతుదారులు వీధుల్లో ఆందోళన చేపట్టారు. అధికారులు నేరస్థులను పట్టుకొని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లకు రక్షణ కల్పించాలని, భద్రత పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిజానికి ప్రపంచంలోని ఇతర దేశాల్లోకంటే ట్రాన్స్ జెండర్లు పాకిస్తాన్ లో తమ హక్కులను వినియోగించుకుంటుండగా, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, విషయంలో మాత్రం పక్షపాత ధోరణి కనిపిస్తుంది. వాటిలో అట్టడుగున ఉండటంతోపాటు అనేక వేధింపులను, హింసను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటికీ పాకిస్తాన్ తోపాటు, భారత్, బాంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో పలువురు హిజ్రాలు దాడులు, మానభంగాలకు గురవ్వడమేకాక, వేశ్యలుగా కూడ పనిచేస్తున్నారు. కొందరు పొట్టపోసుకొనేందుకు ట్రాఫిక్ లైట్లవద్ద, వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో ఒక్క ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలోనే తమ కమ్యూనిటీ సభ్యులపై కనీసం ఐదు దాడులు జరిగినట్లు ట్రాన్స్ జెండర్ సంఘాలు చెప్తున్నాయి. మే నెలలో పెషావర్ ప్రాంతంలో ఓ ట్రాన్స్ జెండర్ మహిళపై ఆమె స్నేహితుడు పలుమార్లు దాడి చేయడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పైగా ఆమెను మేల్, ఫిమేల్ వార్డుల్లో ఏ వార్డులో చేర్చాలో తెలియక ఆలస్యం చేయడంతోనే ఆమె చనిపోయినట్లు స్నేహితులు చెప్పడం ఆందోళన రేకెత్తించింది. తమకు ఐడీ కార్డులు జారీచేయాలంటే లింగ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి అంటున్నారని, అందుకు తాము అంగీకరించకపోతే కార్డులు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారని పాకిస్తాన్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్మాస్ బాబీ తెలిపారు. ఇప్పటికైనా వివక్షను విడనాడి, తమనుసైతం మనుషులుగా గుర్తించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ట్రాన్స్ జెండర్స్తో ఫ్యాషన్ డిజైనింగ్
న్యూఢిల్లీ: వస్త్రాల ఫ్యాషన్ డిజైనింగ్ ప్రెజెంట్ చేయాలంటే ఎవరైనా అందమైన ముద్దుగుమ్మలనే ఎంచుకుంటారు. సిల్క్ అయినా కాటన్ అయినా.. తాము డిజైన్ చేసిన వాటిని వారితోనే కట్టించి ప్రెజెంట్ చేస్తుంటారు. అలాంటిది ట్రాన్స్ జెండర్స్ (లింగమార్పిడి చేసుకున్నవారు)తో ఆ పనిచేయించే సాహసం ఎవరైనా చేస్తారా.. కేరళకు చెందిన షర్మిల నాయర్ ఆ ధైర్యం చేశారు. 24 ఏళ్ల యువ డిజైనర్ ట్రాన్స్ జెండర్ విషయంలో సమాజం పాటిస్తున్న వివక్ష తగ్గించేందుకుగాను తన వృత్తి సహాయాన్ని తీసుకుంది. పాశ్చాత్య దేశాల్లో ట్రాన్స్ జెండర్స్ అనేది ఒక హాట్ టాపిక్. ఇక ఎక్కువ మొత్తంలో సంస్కృతి సంప్రదాయాలు పాటించే భారత్లో అయితే అతి సున్నితమైన విషయమే. ఇటీవల ఇండియాలో కూడా వీరి విషయంలో కాస్తంత సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. కేరళలో ట్రాన్స్ జెండర్స్కు న్యాయం చేసేలా ఒక కొత్త పాలసీని కూడా తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో ఒక యువ ఫ్యాషన్ డిజైనర్ ట్రాన్స్ జెండర్స్ను కూడా ఇతర మహిళల్లేగా గుర్తించి వారితో ఫ్యాషన్ చీరలు ప్రదర్శింపజేయడం గమనార్హం. మీకు ఎందుకు ఇలా చేయాలన్న ఆలోచన వచ్చిందన ఆమెను ప్రశ్నించగా.. గత ఏడాది సహజమైన కాటన్, సిల్క్ చీరలను ప్రమోట్ చేసేందుకు దక్షిణాధి రాష్ట్రాల్లోని పలువురు ప్రత్యేక ప్రమోట్ గర్ల్స్ కోసం తిరిగాను. ఆ సమయంలో కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ నన్ను ఆలోచించేలా చేసింది. లింగమార్పిడి చేసుకున్న వారు కూడా మహిళలే .. వారు కూడా చీరలు దరించవచ్చు. అందుకే ఎందుకు ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ ని తన డిజైనింగ్ ప్రమోట్ చేసేందుకు ఉపయోగించుకోకూడదని ఆలోచించాను. ఆ విధంగా చేశాను' అని ఆమె చెప్పారు. -
హిజ్రా వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
బెంగళూరు: హిజ్రా వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులోని బయప్పనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. బయప్పనహళ్లికి చెందిన విలియం(21) అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఆ ఏరియాలో ఉండే హిజ్రాలతో రెండేళ్లుగా పరిచయం ఉంది. వారం కిందట ఓ హిజ్రా విలియం ఇంటికి వచ్చి తన చెల్లెలిని వివాహం చేసుకోవాలని తీవ్రంగా వేధించింది. ఈ విషయంపై మనో వేదనకు గురైన విలియం మంగళవారం సాయంత్రం బయప్పనహళ్లి వద్ద రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బయప్పనహళ్లి రైల్వేపోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కుష్బుపై హిజ్రాల ఆగ్రహం...
చెన్నై : ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కుష్బుపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై హిజ్రాలు పున:పరిశీలన చేసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలను హిజ్రాలు ఖండిస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ జాతీయ సమాచార ప్రతినిధి అయిన కుష్బు ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె రాబోయే ఎన్నికల్లో హిజ్రాలు పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై వారు ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టుముట్టి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ ఉత్తర భారతదేశానికి చెందిన కుష్బు గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన మహిళల శీలాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇప్పుడు హిజ్రాల విషయంలోనూ అదేవిధంగా మాట్లాడటం ఆవేదన కలిగించిందన్నారు. కుష్బు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని హిజ్రాలు స్పష్టం చేశారు. -
సిక్స్ ప్యాక్... హృతిక్!
కండలు తిరిగిన హృతిక్ రోషన్ దేహానికి మళ్లీ ‘సిక్ ప్యాక్’ ఏంటా అనుకుంటున్నారా? అయితే ఇది ఓ ఆల్బమ్ టైటిల్. దీంట్లో విశేషం ఏముందనుకుంటున్నారా? ఇది ఓ ట్రాన్స్జెండర్లకు సంబంధించిన వీడియో.‘ సిక్స్ ప్యాక్’ అనే పేరుతో కొంతమంది ట్రాన్స్జెండర్లు మూడేళ్లుగా మ్యూజిక్ ఆల్బమ్స్ను రూపొందిస్తున్నారు. వీరి గురించి తెలుసుకున్న హృతిక్ తనకు తానుగా ఈ బ్యాండ్ వాళ్లను సంప్రతించి, అందులో భాగం కావడానికి సిద్ధమయ్యారు. వీరి మీద సమాజ దృక్పథాన్ని మార్చాలన్న ఉద్దేశంతో దీంట్లో ట్రాన్స్జెండర్స్తో నర్తించడానికి సై అన్నారట. హృతిక్ తనకు తానుగా దీంట్లో భాగం కావడంతో ‘సిక్స్ ప్యాక్’ బృందం ఆనందానికి అవధులు లేవు. -
ప్లీజ్.. మాకూ ఓ బాత్రూం ఇవ్వండి!
'నేను ఓ ట్రాన్స్జెండర్ని. నాకు కొన్ని విషయాల్లో స్నేహితులు అండగా ఉన్నారు. మరికొందరు చిన్న చిన్న విషయాల్లోనూ నాకు అడ్డు తగులుతున్నారు. నాలా ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికోసం సౌత్ డకోటా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది'.. ఇవి ఓ ట్రాన్స్ జెండర్ మనోభావాలు, కష్టాలు. అవ్వడాని అమ్మాయిగా పుట్టినా.. ఐదేళ్ల వయసులో తాను అబ్బాయి అని గుర్తించిందట థామస్ లెవిస్. గతేడాది వరకు ఏ సమస్యలు రాలేదు. తన స్నేహితులు, టీచర్ల సహకారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదట. అయితే, అప్పుడప్పుడు 'నువ్వు అబ్బాయి అని ఎలా తెలుసుకున్నావు', 'లేక నువ్వు దశలవారీగా అబ్బాయిగా మారిపోయావా' అని స్నేహితులు అడిగేవారట. నెమ్మదిగా వారు తనను అర్థం చేసుకున్నారని చెప్తున్నాడు థామస్. 18 ఏళ్ల వయసున్న థామస్ సియక్స్ ఫాల్స్ లోని లింకన్ హైస్కూల్లో చదువుతున్నాడు. గతేడాది నుంచే అతడు ట్రాన్స్జెండర్ అన్న విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. స్కూలు, కాలేజీలలో ఇంటర్వెల్ అనగానే మిగతా విద్యార్థులు చక్కగా బయటకు పరుగెత్తుకుంటూ వెళ్తారు. కానీ, థామస్ చాలా నెర్వస్గా ఉంటాడు. అతడి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కారణం.. అతడు లేడీస్ టాయిలెట్స్ కు వెళ్లాళ్సి వస్తోందట. ఆ ఇనిస్టిస్ట్యూట్ వాళ్లు థామస్ను జెంట్స్ బాత్రూమ్కు వెళ్లడానికి నిరాకరించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. త్వరలో ప్రభుత్వం ఇందుకోసం ఓ నిర్ణయం తీసుకోనుందంటూ తన వివరాల్ని వెల్లడించాడు థామస్. ప్రస్తుతం తాను ఉన్న విధానాన్ని తన తల్లి ఏ మాత్రం తప్పుబట్టలేదని, అందుకు చాలా సంతోషంగా ఉందంటున్నాడు. తనలాగే చాలా మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్కూళ్లలో చదివే రోజుల్లోనే 40 శాతానికి పైగా విద్యార్థులు ఈ బాధలను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారని స్థానిక మీడియాలో ఈ వివరాలు పేర్కొన్నాడు. -
జనన, మరణ నమోదులోనూ ‘ట్రాన్స్జెండర్’
మూడో కాలం ఏర్పాటుకు ఉత్తర్వులు హైదరాబాద్: జనన, మరణ నమోదు పత్రాల్లో పురుషులు, స్త్రీలతోపాటు కొత్తగా ఇతరులు అనే మూడో విభాగం (కాలం) చేరనుంది. ఓటర్ల జాబితాలో పురుషులు, స్త్రీలు అనే విభాగాలు మాత్రమే ఉండగా కొంత కాలం కిందటే ఇతరులు (ట్రాన్స్జెండర్) అనే కొత్త విభాగం నమోదు కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆరంభించిన విషయం విదితమే. ఇదే తరహాలో ఇక నుంచి జనన, మరణాల రికార్డుల్లో పురుషులు/ స్త్రీలు/ ఇతరులు అనే కాలాలను ముద్రించి నమోదు చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జనన, మరణాల నమోదు, సర్టిఫికెట్ల జారీకి ఉన్న దరఖాస్తు నమూనాలను మార్చాలంటూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జనన మరణ నమోదు పత్రాల్లో లింగం అనే కాలానికి ఎదురుగా రెండు గడులు మాత్రమే ఉన్నాయి. పురుషులైతే ఒకటో కాలంలో స్త్రీలైతే రెండో కాలంలో అధికారులు టిక్ పెట్టే విధానం ప్రస్తుతం ఉంది. ఇతరులు అయితే ఏ విభాగం కింద చేర్చాలో తెలియని పరిస్థితి ఉంది. అందువల్ల లింగానికి ఎదురుగా మూడో కాలం కూడా ముద్రించి ట్రాన్స్జెండర్స్ను ఇతరులు కింద నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు భారత ప్రభుత్వ రిజిసాట్రరు జనరల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జనన, మరణాల నమోదు పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రాలు (ఫారం 5), మరణ ధ్రువీకరణ పత్రాలు (ఫారం -6)లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు జనన మరణాల ప్రధాన ముఖ్య రిజిస్ట్రార్ను ఆదేశించినట్లు పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. -
మమ్మల్ని ప్రజలు అంగీకరిస్తున్నారు!
భారతదేశంలో లింగ వివక్ష మెండుగానే కనిపిస్తుంది. ఇక ట్రాన్స్ జెండర్ల విషయంలో చెప్పనే అక్కర్లేదు. ఈ నేపథ్యంలో సమ సమాజ నిర్మాణానికి, స్వేచ్ఛా సమానత్వాలకు... ఊపిరిలూదుతూ యష్ రాజ్ సారధ్యంలో రూపొందిన సిక్స్ ప్యాక్ బ్యాండ్ ఆల్బమ్ ఎంతో ఆదరణ పొందింది. అయితే నిజంగానే జనంలో అంతటి మార్పు వచ్చిందా? హిజ్రాలను సాటి మనుషులుగా గుర్తించి, గౌరవిస్తున్నారా అంటే మాత్రం మిశ్రమ స్పందనే లభిస్తోంది. ఒకప్పటి కంటే ఇప్పుడు కొంత మేలని, భవిష్యత్తులో మరింత మార్పు వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావమే వ్యక్తమౌతోంది. భారతదేశంలో లింగ సమానత్వానికి మద్దతుగా ఇటీవల బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్తో కలసి, యష్ రాజ్ ఫిల్మ్స్ థర్డ్ జెండర్తో ఓ పాటను రూపొందించి విడుదల చేసిన విషయం తెలిసిందే. తదనంతరం జనంలో కొంత మార్పు వచ్చిందంటున్నారు సిక్స్ ప్యాక్ బ్యాండ్ గ్రూప్. సాటి మనుషులుగా తమను ప్రజలు అంగీకరించడం మొదలు పెట్టారంటున్నారు. ఫర్రెల్ విలియమ్స్ హిట్ సాంగ్ హమ్ హై హ్యాపీ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇంగ్లీష్, హిందీ సాహిత్యాల మేలు కలయికతో రూపొందిన ఆ గీతం కేవలం 20 రోజుల్లోనే సుమారు 15 లక్షల హిట్స్ కొట్టింది. అంతటి ప్రజాభిమానాన్నిపొందిన ఆ పాటను... మొట్టమొదటిసారి 'సిక్స్ ప్యాక్ బ్యాండ్' (ట్రాన్స్ జెండర్ బ్యాండ్) ఆల్బమ్ గా యష్ రాజ్ ఫ్మిల్మ్స్ యువ విభాగం రూపొందించి సక్సెస్ అయ్యింది. అనుష్కాశర్మ బ్యాగ్రౌండ్, సోనూ నిగమ్ సహకారంతో రూపొందిన సిక్స్ ప్యాక్ బ్యాండ్ సోషల్ మీడియాలోనూ సక్సెస్ సాధించి యూజర్లను ఆకట్టుకుంది. దీంతో లైకులు, కామెంట్లతో ట్రాన్స్ జెండర్లకు ఎంతో సపోర్ట్ లభించింది. ఇదే నేపథ్యంలో ఇటీవల సోనూనిగమ్ కలసి నటించిన (సిక్స్ ప్యాక్ బ్యాండ్ తో) 'సబ్ రబ్ దే బందే' మరో ఆల్బమ్ కూడా విడుదలైంది. అయితే ఈ ప్రయత్నం ట్రాన్స్జెండర్ల మనోభావాలను ప్రదర్శించగలిగిందా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్ బ్యాండ్ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలోనే మొదటిసారి లింగమార్పిడి సమాజాన్ని జనం ఆదరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. తమ సమాజం జనాన్ని ఆనందంగా ఉంచేందుకు, వారి ఆనందంలో భాగం పంచుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఇప్పుడు ఈ ఆల్బమ్ ద్వారా తమలోని ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నారు... సిక్స్ ప్యాక్ బ్యాండ్ సభ్యురాలు భవికా. ట్రాన్స్ జెండర్ తో వీడియో రూపొందించాలన్న ఆలోచన రావడం తమకు ప్రత్యేక గుర్తింపునివ్వడమేనని, సమాజంలో వచ్చిన మార్పునకు అది తార్కాణమని చెబుతున్నారు. సిక్స్ ప్యాక్ బ్యాండ్ వీడియో తమకు కల్పించిన అవకాశంతో సమాజంలో వచ్చిన మార్పును ప్రత్యక్షంగా చూడగల్గుతున్నామంటున్న సభ్యులు.. ప్రదర్శన ఇవ్వడం తమకెంతో భయం వేసిందని, కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ తమకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. ట్రాన్స్ జెండర్ ను మూడో జెండర్ గా సుప్రీం కోర్టు గుర్తించిన తర్వాత... దేశంలోని సగం మంది జనం తమను మనుషులుగా గుర్తిస్తున్నారనీ, కానీ మిగిలిన వారు ఇంకా అనుమానించడం, భయపడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో బహిష్కరణకు గురౌతున్న తమకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రోత్సాహం ముందు ముందు కూడా లభించాలని కోరుకుంటున్నారు. -
హిజ్రాగా నటిస్తున్న టాప్స్టార్
సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రయోగం చేయడానికైనా రెడీగా ఉండే టాప్ స్టార్ విక్రమ్. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలతో ప్రయోగాత్మక చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఐ సినిమా ఫెయిల్యూర్తో.., ఇక విక్రమ్ ప్రయోగాల జోలికి వెల్లడని భావించారు. అయితే అందరిని ఆశ్యర్యపరుస్తూ మరోసారి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు చియాన్. ఇటీవల టెన్ ఎన్రదుకుల్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్లో మరోసారి తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీలో హిజ్రాగా నటించడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో విక్రమ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక పాత్రలో హీరోగా కనిపిస్తుండగా విలన్ పాత్రలో హిజ్రాగా నటిస్తున్నాడు. ఎక్కువగా భాగం మలేషియాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో నయనతార, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా అలరించనున్నారు. -
కొవ్వొత్తులతో హిజ్రాలకు ఘననివాళి
-
ట్రాన్స్జెండర్లకూ ఓ మోడల్ ఏజెన్సీ
న్యూయార్క్: ట్రాన్స్జెండర్లకు శుభవార్త. ప్రపంచంలోనే మొట్టమొదటి లింగ మార్పిడి మోడల్ ఏజెన్సీ లాస్ ఏంజెలిస్లో రాబోతోంది. బ్యాంకాక్కు చెందిన ఓ సంస్థ ఈ ఏజెన్సీని ప్రారంభిస్తోంది. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్లో ఆపిల్ మోడల్ మేనేజ్మెంట్ ఆరు లింగమార్పిడి మోడల్స్కు ఇప్పటికే అవకాశం కల్పించింది. తమ సంస్థలో చేరేందుకు కొత్త వారి కోసం తాము అన్వేషిస్తున్నట్టు సీఈవో సెసిలో అసున్సియన్ తెలిపారు. తమ ఏజెన్సీలో ఆడ, మగ అనే ప్రశ్నకు తావు లేదన్నారు. లింగమార్పిడి చేయించుకున్నవరిలో ఎవరైనా తమ అభిరుచికి తగినట్లు బెస్ట్ మోడల్స్గా రాణించవచ్చని అభిప్రాయపడ్డారు. పుట్టుకతో మగవాళ్లయినా తర్వాత ఆడవారుగా మారడం, ఆడవారిగా పుట్టి మగవారిగా ఆపరేషన్ చేయించుకుని మారడం ఎప్పటినుంచో ఉన్నదే. ఇలా మారిన వారికి కూడా మోడళ్లుగా అవకాశం ఇవ్వడం కోసం ఈ తరహా సంస్థలు వెలుస్తున్నాయి. -
హక్కులు జిందాబాద్
-
ఆ కాలమ్ ఎందుకు చేర్చలేదు?
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో థర్డ జెండర్ కాలమ్ను చేర్చకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం జస్టిస్ ముక్త గుప్తా, పీఎస్ తేజీలతో కూడిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్ఈలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సుప్రీం స్పష్టమైన తీర్పు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు మండి పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష తగదని కోర్టు పేర్కొంది. జెండర్ కారణంగా ట్రాన్స్ జెండర్స్ను ఎలా అడ్డుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కాగా ఆగస్టు 23 న జరిగే ఈ పరీక్షకోసం ఇచ్చిన ప్రకటనలో్ థర్డ్ జెండర్ కాలమ్ లేకపోవడంపై దాఖలైన పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై జూన్ 17 లోపు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని యూపీఎస్సీని ఆదేశించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూన్ 19తో ముగియనుంది కనుక ఈ లోపుగానే వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. కాగా ట్రాన్స్ జెండర్ లను మనుషులుగా గుర్తించాలని, విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని దాఖలైన పిటిషన్ పై ఏప్రిల్ 15, 2014 సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వారిని వెనుబడిన తరగతులవారికి వర్తించే అన్ని రిజర్వేషన్స్ వర్తింప చేయాలని, వారికోసం ప్రత్యేకంగా థర్డ్ జెండర్ కాలమ్ ను చేర్చాలని కేంద్రం ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని సంస్థలు స్పందించిన ఈ ఆదేశాలను అమలు చేస్తున్నాయి కూడా. -
ట్రాన్స్ 'జెండర్' తొలి పాస్పోర్టు
తొలిసారి దరఖాస్తులో ట్రాన్స్జెండర్ అని పేర్కొనబడి పాస్ పోర్టు పొందిన మొదటి వ్యక్తిగా సత్యశ్రీ షర్మిల నిలిచారు. లా గ్రాడ్యుయేట్ అయిన సత్యశ్రీ పాస్ పోర్టు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించగా అందులో జెండర్ తెలిపే కాలమ్స్ రెండే ఉన్నాయి. సాధారణంగా రెండే ఉంటాయి కూడా. అయితే, సత్య శ్రీ ఒక ట్రాన్స్జెండర్. దాంతో తాను ఏ జెండర్ కాలమ్లో టిక్ చేయాలో అర్థంకాక పాస్ పోర్టు కార్యాలయాన్ని సంప్రదించింది. దానికి వారు ఇష్టం వచ్చినదాన్ని టిక్ చేయండని అనంతరం తాము సరిచేస్తామని చెప్పారు. కానీ అలా మార్పు జరగలేదు. కొన్ని నెలల కిందట ట్రాన్స్ జెండర్స్ కూడా ఒక ప్రత్యేక లింగమేనని సుప్రీంకోర్టు గత ఏప్రిల్ 2014లో పేర్కొంది. వారికి కూడా కోటా ఇప్పించాలని, ఓటరు కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్లలలో ప్రత్యేక లింగంగా పేర్కొనాలని కూడా సూచించింది. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ సత్యశ్రీ పాస్ పోర్టు అధికారుల చుట్టూ తిరిగి తన దరఖాస్తులో ట్రాన్స్ జెండర్ అనే కాలమ్ను చేర్చేలా చేసి చివరికి పాస్ పోర్టు సాధించటం విశేషం. ఈ విధంగా మహారాష్ట్రలోనే కాకుండా దేశం మొత్తంలో కూడా మొట్ట మొదటిసారి ట్రాన్స్జెండర్ పేరుతో పాస్ పోర్టు పొందిన వ్యక్తి సత్య శ్రీనే. -
పౌరులుగా గుర్తించండి
* నినదించిన హిజ్రాలు,ట్రాన్స్జెండర్లు * గోశాల నుంచి ఇందిరా పార్కు వరకూ ర్యాలీ * ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు కవాడిగూడ: ‘సమాజంలోని పౌరులలో మేమూ భాగమే. ఈ దేశంలోని పౌరులకు రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కుల్లో మాకూ వాటా కావాలి. మాపై పక్షపాతం, హింసా ధోరణి విడనాడాలి’అంటూ ట్రాన్స్జెండర్లు, హిజ్రాలు నినదించారు. తమ హక్కుల కోసం గళమెత్తారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానత్వం, చట్టపరమైన రక్షణ, స్వేచ్ఛ, వివక్షనుంచి రక్షణ, లింగ వ్యక్తీకరణకు స్వాతంత్య్రాన్ని కల్పించాలని కోరారు. విద్య, ఉద్యోగాలలో ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్బండ్ గోశాల నుంచి గాంధీనగర్, అశోక్నగర్ మీదుగా ఇందిరా పార్కు ధర్నా చౌక్ వరకూ ‘హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన్ కవాతు’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైనసామాజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఇందిరా పార్కు ధర్నా చౌక్లో వారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, హిజ్రాలను తోటి పురుషులు, స్త్రీలతో సమానంగా చూడాలన్నారు. హిజ్రాలకు సమాన హక్కులు లేవంటే అంబేద్కర్ను అవమానపర్చినట్లేనని అభిప్రాయపడ్డారు. వారి హక్కులను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైజయంతి, చంద్రముఖి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ పౌరులకు సమానత్వం, చట్టపరమైన రక్షణ వంటి హక్కులు ఉంటాయని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా ఆ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ట్రాన్స్జెండర్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. భౌతిక, లైంగిక దాడుల నుంచి రక్షణ ఉండేలా సమగ్ర అత్యాచారాల వ్యతిరేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హిజ్రాల జనాభాను ప్రభుత్వమే అధికారికంగా లెక్కించాలని కోరారు. ఓయూ విద్యార్థి సంఘ నేత శరత్ వారికి సంఘీభావం తెలిపారు. నవదీప్, రచన, గ్రీష్మ, మిస్కాన్, అఖిల, బిట్టు, తమన్నా, అరునాంగే తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజులు, బోనాలు, బతుకమ్మ తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
నో మోర్ సైలెన్స్
ఆటపాటలు, స్టేజ్ షోలు..వీటితో పాటు తొలిసారి ‘ఎల్జీబీటీ’ కళాకారులు చిత్రించిన బొమ్మలూ కొలువుదీరాయి. ప్రతి పాట..ఆట.. ప్రతి చిత్రం.. వాళ్ల జీవనశైలిని గౌరవించమని చెబుతున్నవే!. ఈ వేడుక కేవలం జెండర్ మైనారిటీల కోసమే నిర్వహించింది కాదు. వాళ్ల ఉనికిని హేళన చేస్తున్న సమాజం కోసం కూడా! వాళ్లను అర్థం చేసుకునే వేదికైంది!. అందుకే ఆ ఆవరణలో ఓ తల్లి కనిపించింది కొడుకు (గే)కి అండగా, ఓ అక్క వచ్చింది చెల్లి (ట్రాన్స్జెండర్)కి తోడుగా, ఓ స్నేహితురాలు హాజరైంది తోటి స్నేహితురాలి (బై సెక్సువల్)కి మద్దతుగా, తండ్రీ ఉన్నాడు కూతురు కోసం (లెస్బియన్).. ఆశ్చర్యంగా నిశ్శబ్దం బద్దలైంది.. చర్చ మొదలైంది ఓ తల్లి నుంచే!. మేమున్నాం.. ‘నేనో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. వాడు డాక్టర్. తను ‘గే’ అనేది తను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు తెలిసింది. వినగానే నేనేమీ కుంగిపోలేదు. ‘ఓకే నాన్నా.. డోంట్వర్రీ..’ అన్నాను. కౌన్సెలింగ్కి ఒప్పించాను. తర్వాత ఇంటర్నెట్లో, ఇంగ్లిష్ మ్యాగజైన్స్లో ఎల్జీబీటీ గురించి సమాచారం తెలుసుకున్నాక తనను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే నా ప్రవర్తనకు మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘అమ్మేంటి? నేను చెప్పింది విని అరుస్తుంది, ఏడుస్తుంది అనుకుంటే ఇంతలా నాకు సపోర్ట్ చేస్తుంది’ అని. కొన్నాళ్లకి మావారికీ నెమ్మదిగా విషయం చెప్పాను. అతనూ అర్థం చేసుకున్నాడు. తప్పు మా పిల్లాడిది కాదు కదా!. వాడి బర్త్ అలా ఉన్నప్పుడు మా అబ్బాయినెందుకు శిక్షించాలి? పైగా వీళ్లు సమాజంలో ఎవరినీ ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ల బతుకేదో వాళ్లు బతుకున్నారు. ఇది పూర్తిగా కుటుంబ విషయం. రేపొద్దున్న నా కొడుకు ఇంకో అబ్బాయితో సహజీవనం చేసినా మాకు సమ్మతమే. ఇలాంటి పిల్లల్ని ముందు తల్లిదండ్రులే అర్థం చేసుకోవాలి. అప్పుడే సమాజమూ వాళ్లను గౌరవిస్తుంది’ అంటూ తన గళమిప్పింది ఆ అమ్మ. ముందు మాట్లాడలేదు.. జర్నలిజం అండ్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమృతా లారెన్స్ అయితే- ‘నేను బై సెక్సువల్ని. ఇంటర్లో ఉన్నప్పుడు నా సెక్సువాలిటీ ఏంటో తెలియక చాలా స్ట్రగుల్ అయ్యాను. అబ్బాయిలను చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ కలిగేవో, అమ్మాయిలను చూసినా అలాంటి ఫీలింగ్సే కలిగేవి. చదువుని నెగ్లెక్ట్ చేశాను. ఆ టైమ్లోనే లండన్లో ఉన్న నా ఫ్రెండ్ జెన్నిఫర్తో నా పరిస్థితి గురించి డిస్కస్ చేశాను. అప్పుడు నా మెదడు చేసే అలజడిని ఏమంటారో తెలిసింది. నా ఉనికేంటో అర్థమైంది. ఏదైనా బతకాలని ధైర్యం తెచ్చుకున్నాను. చదువు మీద శ్రద్ధ పెట్టాను. డిగ్రీ ఫస్టియర్ ఎండింగ్లో నాన్నకు చెప్పాను. అప్పటికే అమ్మ చనిపోయింది. నేను చెప్పింది విన్న నాన్న రెండు రోజులు నాతో మాట్లాడలేదు. తర్వాత- ‘నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి.. ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నావ్ కాబట్టి తండ్రిగా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఏం చేయాలనుకున్నా చెప్పి చెయ్. ఏదీ దాచొద్దు’ అని చెప్పాడు. ఆ రెండు రోజులు నాన్న నాలాంటి వాళ్ల గురించిన సమాచారం తెలుసుకున్నాడు. మాకు ఎలాంటి సపోర్ట్ కావాలో అర్థం చేసుకున్నాడు. బయట కూడా నా గురించి దాచను. నచ్చిన వాళ్లు నాతో ఉంటారు. నచ్చని వాళ్లు తప్పుకుంటారు. కొంతమంది మాటలతో పించ్ చేస్తుంటారు. ఇవేమీ పట్టించుకోను. నేనో మంచి రైటర్ని కావాలి, అంతకన్నా గొప్ప ఫొటో జర్నలిస్ట్ని కావాలి, నాకు నచ్చినట్టు బతకాలి.. ఇవే నా లక్ష్యాలు’ అని చెబుతుంది ఎంతో నిర్భయంగా. వాళ్లూ మనలాంటి మనుషులే.. సమాజంలో రకరకాల మనుషులున్నారు. జెండర్ మైనారిటీస్ను గౌరవంగా చూడడమనేది యూత్ నుంచే మొదలవ్వాలి. యూతే భావి నిర్ణేతలు కాబట్టి.. వాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. వాళ్ల వల్ల ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు సొసైటీ నుంచి వాళ్లనెందుకు ఐసోలేట్ చేయాలి? వాళ్ల ఆత్మగౌరవాన్నెందుకు కించపర్చాలి? వాళ్లకూ మనసుంది, మనం గౌరవించాలి. - ప్రాప్తి, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ శ్రేయస్సు కాంక్షిస్తున్నారు.. జెండర్ మైనారిటీస్కున్న స్కిల్స్, వ్యక్తిత్వాలు ఎంత అద్భుతమైనవో చాటేందుకు నిర్వహిస్తున్నదే ఈ కార్నివాల్. ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్లకున్న ప్రావీణ్యం, వాళ్లు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారో ఈ ఉత్సవంలో పాల్గొంటే తెలుస్తుంది. వాళ్లు అనాథ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు, వైద్య సేవలందిస్తున్నారు. జెండర్ మైనారిటీస్కి, సమాజానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేయడానికే ఈ వేడుకను నిర్వహిస్తున్నాం. కిందటేడు ఎల్జీబీటీస్ కన్నా మిగిలినవాళ్లే ఎక్కువొచ్చారు. ఇప్పుడూ అదే రెస్పాన్స్. - నవదీప్, కార్నివాల్ నిర్వహణలో భాగస్వామి క్వీర్ క్యాంపస్ నేపథ్యమిదీ.. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్.. వాళ్లూ మనుషులే. వారికీ ఆత్మ గౌరవం ఉంటుంది. అది వారి ప్రాథమిక హక్కు. వారికి మిగిలిన సమాజానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు పుట్టిందే క్వీర్ క్యాంపస్. చాన్నాళ్ల కిందట ఇది జర్మనీలో మొదలైంది. ఆపై దిల్లీ, కోల్కతా, ముంబై నగరాలను దాటి కిందటేడాది హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడిది ఊపిరిపోసుకోవడానికి ఆద్యులు అభి, సత్య అనే యువకులు. ‘మా గళం వినిపించడానికి ఓ వేదిక కావాలి. మనసులో మాటను ఆటపాటగా అందిస్తే అందరికీ చేరుతుంది. ఆలోచనలు రేకెత్తిస్తుంది. అలా మా ఉనికి పోరాటాన్ని గౌరవప్రదంగా మలచడానికి, దాని గురించి అందరికీ అవగాహన కల్పించడానికి అప్పటికే మనుగడలో ఉన్న ఈ క్వీర్ క్యాంపస్ను డయాస్గా మలచుకోవాలనుకుని నిరుడు క్వీర్ క్యాంపస్ హైదరాబాద్ను స్టార్ట్ చేశాం. త్వరలో ఇతర పట్టణాలకు, ఊళ్లకూ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం’ అని చెబుతాడు అభి. - సరస్వతి రమ -
ఒక హిజ్రా ఆత్మకథ
"no matter gay, straight or bi.., lesbian, transgenderd life.. I'm on the right track. I was born to survive.... అంటూ తన జీవించే హక్కును చాటుకుంది రేవతి ‘నిజం చెప్తున్నా ఒక హిజ్రా ఆత్మకథ’ అనే పుస్తకాన్ని రచించి. ఇదివరకే తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్ల్లిష్ భాషల్లో విడుదలైంది. ఆలోచనలనూ రేకెత్తించింది. ఈ రోజు తెలుగులో విడుదల కానుంది. తెలుగు అనువాదం పి.సత్యవతి.. ప్రచురణ.. హైదరాబాద్ బుక్ ట్రస్ట్! ఈ సందర్భంగా నగరానికి వచ్చిన రేవతి మనసులోని మాటలు... ‘ఇది ఒక్క రేవతి కథే కాదు ట్రాన్స్జెండర్స్ అందరి కథ. ఇదో పుస్తకం కాదు... మా హక్కుల పోరాటానికి కావల్సిన ఆయుధం. సమాజంలో మాకూ గుర్తింపు, గౌరవం కావాలి. ఇంట్లోంచే మొదలవుతుంది మా పోరాటం. మగ శరీరంలో స్త్రీ మెదడుతో పుట్టడం మా తప్పు కాదుకదా! నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలా ఉండాలనిపించేది. యుక్తవయసు వచ్చినప్పుడు అబ్బాయిలను చూస్తే సిగ్గేసింది. నా ప్రవర్తనతో ఇంట్లోవాళ్లు ఇబ్బందిపడేవాళ్లు. నాలో జరుగుతున్న సంఘర్షణ వాళ్లకు అర్థంకాక.. నేను బయటకు చెప్పుకునే అవకాశంలేక ఎన్ని దెబ్బలు తిన్నానో. బయటవాళ్ల వెక్కిరింతలు, వేళాకోళాలు, గేలిచేయడాలు సరేసరి. అందుకే పదిహేను- పదహారేళ్ల వయసులో ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ఢిల్లీ, ముంబైలు తిరిగి ఆపరేషన్ చేయించుకుని పూర్తి స్త్రీగా మారిపోయాను. నా మెదడులో కలిగే భావాలకు అనువైన రూపంలో ఒదిగానన్న సంతృప్తి ఉన్నా.. హిజ్రాగా సమాజంలో మాకున్న స్థానం కలిగించిన వేదనా తక్కువేం కాదు. హిజ్రాలను ఈ వ్యవస్థ రెండేరెండు పనులకు పరిమితం చేస్తోంది.. అడుక్కోవడం.. సెక్స్వర్కర్గా పనిచేయడం. ఈ పనులు ఎవరూ ఇష్టంగా చేయరు గత్యంతరంలేకే చేస్తారు. మాకూ ఉంటుంది మంచి ఉద్యోగాలు చేయాలని. అందుకు సిద్ధంగా కూడా ఉన్నాం. కానీ చదువేది? మాకు స్కూళ్లల్లో, కాలేజీల్లోనూ అవమానాలే. పోనీ వాటన్నిటినీ ఎదుర్కొని ఉద్యోగం దాకా వచ్చినా అక్కడా వివక్షే. అయినా కన్న తల్లిదండ్రులే మమ్మల్ని ఒప్పుకునే పరిస్థితిలేనప్పుడు బయటవాళ్లు ఎట్లా ఒప్పుకుంటారు? అందుకే ముందు ఇంట్లోంచే మార్పు మొదలవ్వాలి. వాళ్లే గనక మమ్మల్ని ఉన్నదున్నట్టుగా స్వీకరిస్తే మేము ఇంట్లోంచి పారిపోవాల్సిన అవసరం ఎందుకుంటుంది?. ఈ పుస్తకం రాయడానికి వెనక.. నేను పడ్డ బాధలు..చేసిన పోరాటమే. హిజ్రాగా మారిన తర్వాత షాపులకు వెళ్లి అడుక్కున్నాను, సెక్స్వర్కర్గా పనిచేశాను. చివరకు బెంగళూరులోని ‘సంగమ’అనే స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తగా పనిచేశాను. అక్కడున్నప్పుడే నాలాంటి వాళ్లను ఓ యాభైమందిని కలిసి ఇంటర్వ్యూచేశాను. ఒక్కొక్కరిది ఒక్కోగాధ. అప్పుడే అనిపించింది మా ఆత్మను వినిపించే ఓ కథ రాయాలని. అట్లా ఈ పుస్తకం రాశాను. ఇది 2009 నాటి సంగతి. ఇప్పుడనిపిస్తోంది నా ఆత్మకథ రెండో భాగాన్నీ రాయాలని. ఏం కావాలి? సమాజంలో అందరికుండే గుర్తింపు మాకూకావాలి. మమ్మల్ని కొన్ని చోట్ల ఆశీర్వాదాలిచ్చే వాళ్లలా చూస్తారు. మేమేం భగవంతులం కాము. అందరిలాంటి సామాన్యమైన మనుష్యులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. వాటిని గౌరవించండి చాలు. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్కి దరఖాస్తు చేసుకునే పత్రాల్లో థర్డ్జెండర్ కాలమ్ ఉండాలని నాల్సాజడ్జిమెంట్ రావడం సంతోషమే. కానీ పర్సనల్గా థర్డ్జెండర్ అనేదే అక్కర్లేదంటాన్నేను. అప్లికేషన్స్లో కులం అనేకాలాన్ని ఎలా తొలగించాలనే డిమాండ్ ఉందో అలాగే ఈ జెండర్ అనే కాలం కూడా అనవసరం అంటాన్నేను. పేరు ఉంటే చాలుకదా. ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కావాలి. ఎవరికిష్టమైన జెండర్లో వాళ్లుండే హక్కును కలిగించాలి. నిజానికి ఇది మన రాజ్యాంగంలో ఉంది కూడా. ఎస్ఆర్ఎస్ అంటారు దాన్ని. హిజ్రాల మీద కనీసం ఈ మాత్రం చర్చ అయినా జరుగుతోంది కానీ ఫిమేల్ నుంచి మేల్గా మారిన ట్రాన్స్జెండర్స్ పరిస్థితి మరీ దారుణం. నిశ్శబ్దాన్ని ఛేదించాలి. చర్చ జరగాలి. సమాజంలో ఉన్న ఇలాంటి సెన్సిటివిటీస్ని అందరూ అర్థంచేసుకోవాలి. హైదరాబాద్లో.. ఇక్కడ రెండు రకాల హిజ్రాలున్నారు. ఒకరు రోడ్లమీద అడుక్కుంటుంటే.. ఇంకొకరు హవేలీల్లో ఉండే బదాయి గ్రూప్వాళ్లు. ఈ రెండో రకం వాళ్లకు పెద్ద సమస్యలేవీ ఉండవు. చక్కటి మర్యాదా ఉంటుంది. సమస్యంతా రోడ్లమీద అడుక్కునేవాళ్లకే. సామాన్యుల నుంచి పోలీసుల దాకా అందరితో వేధింపులు, ఛీత్కారాలూ! - సరస్వతి రమ -
అంతర్జాతీయ సదస్సులో ‘మూడవ’ గళం
‘జపాన్ మీట్’లో ప్రసంగించనున్న కర్ణాటక వాసి ‘థర్డ్ జెండర్’పై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనే ప్రధాన అంశం బెంగళూరుకు చెందిన ట్రాన్స్జెండర్కు అరుదైన అవకాశం సాక్షి, బెంగళూరు : ‘ట్రాన్స్ జెండర్’, నిన్న మొన్నటి వరకు ఈ పదాన్ని వింటేనే చాలా మంది ముఖం తిప్పుకుని వెళ్లిపోయేవారు. ఈ జెండర్లోని వారంతా ఏదో పాపం చేసినట్లు మాట్లాడుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇతర పౌరుల్లాగే ‘ట్రాన్స్ జెండర్’లోని వ్యక్తులను కూడా ‘థర్డ్ జెండర్’గా పరిగణిస్తూ వారికి సమాన హక్కులతో పాటు అవకాశాలు, సదుపాయాలు కల్పించాల్సి ఉందంటూ సుప్రీం కోర్టు గత ఏప్రిల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘థర్డ్ జెండర్’కి కల్పించాల్సిన హక్కులపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు ఇదే అంశంపై అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రసంగించే అవకాశం నగరానికి చెందిన ట్రాన్స్ జెండర్ అకాయ్ పద్మశాలికి లభించింది. ఆదివారం నుంచి జపాన్లోని టోక్యో నగరంలో ప్రారంభమైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో అకాయ్ ప్రసంగించనున్నారు. అసలేమిటీ సదస్సు.... ఇంటర్నేషనల్ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఈ ఏడాది జపాన్లోని టోక్యో నగరంలో ఏర్పాటైంది. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైన ఈ సదస్సు ఈనెల 24 వరకు కొనసాగనుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయనిపుణులంతా ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఇక ఈ ఏడాది ఈ సదస్సులో ‘సెక్సువల్ మైనారిటీస్’కి చెందిన హక్కుల ఉల్లంఘన, న్యాయపరమైన విషయాలను సైతం ఈ సదస్సులో చర్చించేందుకు నిర్ణయించారు. అందుకే భారతదేశంలో ట్రాన్స్ జెండర్స్ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం ముందుంచేందుకు గాను నగరానికి చెందిన ట్రాన్స్జెండర్ అకాయ్ పద్మశాలికి ఇంటర్నేషనల్ బార్ అసోషియేషన్ ఆహ్వానాన్ని పంపింది. ఎవరీ అకాయ్.... అకాయ్ పద్మశాలి, బెంగళూరు నగరంలో పుట్టి పెరిగింది. ఇక్కడే పదో తరగతి వరకు చదివింది. పై చదువులు చదవాలనే కోరిక ఆమెలో ఉన్నా అప్పటికే సమాజం నుంచి ఎదురవుతున్న ఛీత్కారాలు ఆమెను కళాశాలకు దూరం చేశాయి. అయినా ఆమె తన పోరాట పటిమను ఎక్కడా వదులుకోలేదు. తనతో పాటు తనలాంటి వారెందరికో సమాజం నుంచి ఎదురవుతున్న అవమానాలను ధీటుగా ఎదుర్కొనేందుకు గాను ‘సంగమ’ సంస్థలో చేరడంతో పాటు ఆ సంస్థ ద్వారా ‘ట్రాన్స్జెండర్స్’కు అందాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని సాగిస్తున్నారు. అంతేకాదు ఇటీవల రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా అందరిృదష్టిని ఆకర్షించారు. ఇంకా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో ట్రాన్స్జెండర్స్ సమస్యల పై ప్రసంగించి వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనపైనే ప్రధానృదష్టి .... న్యాయరంగంలోని ప్రముఖులంతా ఒక చోట చేరే ప్రతి ష్టాత్మక సదస్సులో ప్రసంగించేందుకు అవకాశం లభిం చడం గర్వంగా ఉంది. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 180 మంది ప్రముఖ న్యాయనిపుణులతో పాటు ఈ రంగంలోని వేలాది మంది విద్యార్థులు, లెక్చరర్లు పాల్గొననున్నారు. ఇక ఈ సదస్సులో భారతదేశంలో ట్రాన్స్జెండర్స్పై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సదుపాయాలు ముఖ్యంగా వైద్య, ఆరోగ్యానికి సంబంధిం చిన విషయాలతో పాటు ఇందుకు న్యాయపరంగా అవసరమన అంశాలపై నా ప్రసంగం సాగనుంది. ఇక ట్రాన్స్జెండర్స్ను ‘థర్డ్ జెండర్’గా గుర్తిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలప కూడా ప్రసంగించనున్నాను. - అకాయ్, సంగమ సంస్థ ప్రతినిధి