-
లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్!
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత తొలిసారి స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను స్పీకర్గా ఆమోదించడంలో రాజకీయ కుట్ర ఏముందని తమ్మినేని ప్రశ్నించారు. గడువు తర్వాతే నిర్ణయం.. గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను నాకు ఎప్పుడో ఇచ్చారు. పైగా స్పీకర్ ఫార్మాట్లోనే ఆయనే ఇచ్చారు. ఎమ్మెల్యేగా తప్పుకుంటానని తెలిపారు. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదని వేచిచూశాం. మనసు మార్చుకుంటాడన్న మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు స్పీకర్గా నా పదవీకాలం ముగుస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా నిర్ణయాన్ని మార్చుకోలేని ఇప్పుడెలా మార్చుకుంటాడని భావించాను. పదవీ కాలం సమీపిస్తుండడంతో రాజీనామాను ఆమోదించాను. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి.. ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఏదైనా భిన్నంగా ఆలోచిస్తే.. కోర్టుల ద్వారా ముందుకు వెళ్లొచ్చు. రాజీనామా ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం అనేది సరికాదు. చట్టసభల విషయంలో నియమ నిబంధనలను పాటించాలి. ఒక వేళ గంటా శ్రీనివాసరావు ఓటుతోనే అధికార పార్టీ రాజ్యసభ సీట్లు ఆధారపడిలేవు కదా. వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న విషయమే కరెక్టయితే అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చాను. వారంలోపు అన్ని పిటిషన్లు క్లియర్ చేస్తాం. స్పీకర్ లేఖలు.. ఒక పార్టీ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పటికే అనర్హతా వేటు ఎదుర్కొంటున్నారు. వీరిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వీరికి నోటీసులిచ్చారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. వారంలో ఏం జరగనుంది? స్పీకర్గా తన పదవీ కాలం సమీపిస్తుండడంతో పెండింగ్లో ఉన్న అన్ని పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని ప్రకటించడం తెలుగుదేశంలో గుబులు రేపుతోంది. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నలుగురిని వెంటనే లాగేసుకున్న చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. పక్కపార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బోలెడు డబ్బు గుమ్మరించి లాగేసుకున్న చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టారు ఓటర్లు. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. అనర్హతా పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే.. ఈ నలుగురు కూడా పోటీ చేసేందుకు అర్హతా కోల్పేయే అవకాశం ఉంది. అది స్పీకర్ విశిష్టాధికారం అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వ్యవస్థ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. గంటా రాజీనామాను ఆమోదించాలన్నది స్పీకర్ నిర్ణయం. ఎప్పుడు ఆమోదించాలో అన్నది కూడా ఆయన నిర్ణయమే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు YSRCP గెలుస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటారు? అసలు టీడీపీకి తగినంత సంఖ్యాబలమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. -
టీడీపీలో అయోమయంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి
-
వెన్నుపోటు నేతలకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:నమ్మిన వారిని మోసం చేయడం, వారిని నట్టేట ముంచేయడం చంద్రబాబు నాయుడి నైజం. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నిజస్వరూపం తెలిసి కూడా మరోసారి నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు బొక్కబోర్లా పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చెప్పిన తియ్యటి మాటలు ఇప్పుడు విన్పించడం లేదు. దీంతో ఆ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాటమార్చి మోసం చేసి.. వెంకటగిరి, నెల్లూరురూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు చంద్రబాబు చేసిన మోసంపై మథన పడుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సీనియర్ పొలిటీషియన్గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ క్రీడలో ఓ పావుగా మారారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను 2016లో ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరారు. పచ్చ కండువా కప్పుకోగానే మాట మార్చిన చంద్రబాబు కనీసం ఆత్మకూరు పార్టీ ఇన్ఛార్జ్గా కూడా ఇవ్వకుండా అవమానించారు. టీడీపీలో జరిగిన అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న తరుణంలో వైఎస్సార్సీపీ అక్కున చేర్చుకుని వెంకటగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. అయితే అక్కున చేర్చుకున్న పార్టీనే కాదనుకున్న ఆనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. దీంతో ఆనం టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లి పార్టీ కండువా కప్పుకోకుండానే లోకేశ్ యువగళం పాదయాత్రలో హల్చల్ చేశారు. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలతో పాటు నెల్లూరు సిటీ, ఆత్మకూరు సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత నమ్మబలకడంతో ఆనం యువగళంలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అ«ధినేత మాట మారింది. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కాకుండా.. ఒక్క ఆత్మకూరుకే పరిమితం కావాలని ఆదేశాలొచ్చాయి. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఈ విషయం తేలడంతో ఆత్మకూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకున్న ఆనం తనకు నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనంకు దిక్కతోచని పరిస్థితి నెలకొంది. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయానంటూ ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉదయగిరికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆనం వద్దకు వెళ్లి ఉదయగిరి రావాలని ఆహ్వానించగా పార్టీలో తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని వాపోయారని తెలుస్తోంది. కోటంరెడ్డి సీటు వెనుక కుట్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పరిస్థితి కూడా టీడీపీలో అయోమయంగా మారింది. రూరల్ టీడీపీ టికెట్ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటైనా జనసేన అడిగే అవకాశం ఉంది. ముందుగా నెల్లూరు సిటీ మీద జనసేన కన్నుపడింది. అయితే మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన సామాజికవర్గంలో ఉన్న పరపతిని ఉపయోగించి జనసేన అధినేత వద్ద పంచాయితీ పెట్టారని, నెల్లూరు సీటు ఆశించకుండా ఉంటే ప్యాకేజీతోపాటు మరోచోట పోటీ చేస్తే అక్కడ అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి రూరల్ టికెట్ రాకుండా తెరవెనుక కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. చంద్రశేఖర్రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉదయగిరి టికెట్ నీదేనంటూ చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ కండువా కప్పుకున్న చంద్రశేఖర్రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ కాదు కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేది లేదని, ముందు పార్టీకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారంట. చంద్రశేఖర్రెడ్డి సతీమణికి పార్టీ పదవి ఇచ్చి ‘ఈ పదవే నీకు ఎక్కువ ఇక చాలు’ అని చెప్పడంతో చంద్రశేఖర్రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇటుఉదయగిరిలో కూడా టీడీపీ నేతలు చంద్రశేఖర్రెడ్డికి కనీస గౌరవంకూడా ఇవ్వటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించక పోవడంతో ఆయన పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా తయారై ఇంటికే పరిమితం అయ్యారనే ప్రచారం సాగుతోంది. -
నకిలీ ఓట్ల వ్యవహారంపై నెల్లూరు YSRCP నేతలు మండిపడ్డారు
-
ఆనం.. ఏమిటీ ఆగం..?
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంగంలో బుధవారం చీప్ పాలిటిక్స్ చేసి నవ్వుల పాలయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంగంలో స్థానిక వలంటీర్లతో సమావేశాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సూచనల మేరకు ఏర్పాటు చేశారు. సచివాలయాల పరిధిలో సమస్యల గుర్తింపు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, తదితర అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇలా రెండు రోజులుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంగంలోని సొసైటీ కార్యాలయంలో వలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక మండలాధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వలంటీర్లతో సొసైటీ కార్యాలయంలో సమావేశాన్ని పెట్టడమే తప్పనే రీతిలో అక్కడికి వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డి నానా హంగామా చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. వాస్తవానికి కలెక్టర్ హరినారాయణన్ సంగం మండలంలో ఇటీవల పర్యటించి ఓట్ల తొలగింపు, చేర్పుల విషయాన్ని పరిశీలించారు. ఎక్కడా అవకతవకలు జరగలేదని ఆయన ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇవేవీ తెలుసుకోకుండా ఆనం రామనారాయణరెడ్డి హడావుడి చేయడంపై పలువురు మండిపడుతున్నారు. -
అప్పుడేమో హడావుడి.. ఇప్పుడేమో గప్చుప్.. ఆగమైన ఆనం
టీడీపీ కండువా కప్పుకోకుండానే యువగళం యాత్రలో హడావుడి చేసిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం మౌనం దాల్చడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పునర్జన్మనిచ్చిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన ఆనంకు టీడీపీ రాచబాట వేసినా కాలం కలిసి రావడం లేదు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఒకప్పుడు ఆనం రామనారాయణరెడ్డి ఓ వెలుగు వెలిగినా మారిన రాజకీయ పరిస్థితులతో ఆయనకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఆనం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు. అప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ ఆనంను టేకెటీజీగా తీసుకుంది. పార్టీలో చేరే ముందు ఇచ్చిన ఒక్కహామీని నెరవేర్చలేదు. సీనియర్ నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఆత్మకూరులో పార్టీ ఇన్చార్జిగా కూడా నియమించలేదు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆనంను అక్కున చేర్చుకుని వెంకటగిరి ఎమ్మెల్యేగా హోదా ఇచ్చింది. అక్కున చేర్చుకున్న పార్టీకే వెన్నుపోటు పొడిచి ఆనం మళ్లీ టీడీపీలోకి వెళ్లడంతో ఆయనకున్న ఇమేజ్ సొంత క్యాడర్లోనే దెబ్బతింది. అయోమయంలో ఆనం ఆత్మకూరుపై మోజు పెట్టుకున్న ఆనంకు అన్నింటా అపశకునాలే ఎదురవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఆత్మకూరులోకి ఆయన రీఎంట్రీ ఇచ్చినా యాత్రను విజయవంతం చేయడంలో విఫలమయ్యారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన సీనియర్ నేత గూటూరు కన్నబాబును పాదయాత్రలోకి ఎంట్రీ ఇవ్వకుండా చేయించారు. అదే రీతిలో మరో సీనియర్నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడును ఘోరంగా అవమానించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఆనం ప్రవేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్నప్పటికీ ఆనం కోసం పనిచేసేది లేదని తెగేసి చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కి వచ్చి క్యాడర్ను ముప్పుతిప్పలు పెట్టి వెళ్లిపోయిన వ్యక్తికి మరోసారి ప్రవేశానికి ఎలా గ్రీన్సిగ్నల్ ఇస్తారంటూ కన్నబాబు తన అనుచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం ఉంది. సొంత సర్వేల్లోనూ నిరాశే ఆనం టీడీపీ పక్షం వహించాక రెండు టీములతో సొంత సర్వే చేయిస్తున్నారని సమాచారం. తనతో పాటు తన కుమార్తె కై వల్యారెడ్డి ఏదోక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు ఎలా ఉంటుందన్న అంశంపై సర్వే చేయిస్తుండగా, అధికారం కోసం పార్టీలు మారుతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె కై వల్యారెడ్డి అభ్యర్థిత్వంపై నిర్వహించిన సర్వేలోనూ ఎలాంటి సానుకూల పరిస్థితులు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో ఆనం చూపు వెంకటగిరి వైపు ఉన్నట్లు కూడా రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో వైపు కుటుంబం కూడా ఆనంతో కలిసిరావడం లేదు. దీంతో పాటు ఆనంను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఆత్మకూరులో పార్టీని నడిపించేందుకు, ఎన్నికల ఖర్చును పార్టీయే పెట్టుకుంటుందని చెప్పిన వారే ప్రస్తుతం ముఖం చాటేస్తుండడంతో ఆయన అయోమయంలో పడ్డారు. టీడీపీ కార్యక్రమాలపై నిరాసక్తి టీడీపీ నిర్ణయం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో మహిళలతో మహాశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఆత్మకూరు నియోజకవర్గంలో మాత్రం చేపట్టడం లేదు. ఇటీవల మహాశక్తి కార్యక్రమ నిర్వహణపై నిర్వాహకులు ఆనంను కలిసినా తాను ఇప్పట్లో సహకరించలేనని నిరాకరించారనే ప్రచారం ఉంది. -
ప్చ్.. నెల్లూరు టీడీపీ సీనియర్ల దుస్థితి ఇది
జిల్లాలో నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర టీడీపీలో చిచ్చురేపింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి దిగజారుతున్న క్రమంలో పాదయాత్ర జోష్ నింపుతుందని ఆశించిన ఆ పార్టీ శ్రేణులకు నిరుత్సాహమే మిగిలింది. పాదయాత్రలో వలస నేతలకు రెడ్కార్పెట్ వేసిన చినబాబు కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి జెండా మోసిన సీనియర్ నేతలు అవమానపడేలా చేయడంతో వారు అంటీముట్టనట్లు వ్యవహరించారు. పాదయాత్రకు ప్రజల్లో కూడా సృందన కరువై ఫ్లాప్షోగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గత నెల 13వ తేదీన జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నెల రోజులకు పైగా చినబాబు పాదయాత్ర చేపట్టారు. నిత్యం పసలేని ఆరోపణలు, తడబడిన ఉచ్ఛారణ వెరసి ప్రజల్లో మరింత చులకన అయ్యాడు. ప్రజల్లో కూడా స్పందన లేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాప్షోగా మారింది. ఓ వైపు టీడీపీ నేతలు సభలను విజయవంతం చేసేందుకు జన సమీకరణ కోసం కోట్లాది రూపాయలు వెదజల్లినా ఆశించిన ఫలితాలు కన్పించలేదు. ఒకే ఫార్ములా.. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు నిర్వహించే సభల్లో ఒకే ఫార్ములా పాటిస్తున్నారు. టీడీపీ సభలకు జనస్పందన లేకపోవడంతో జనం ఎక్కువగా కన్పించేందుకు వారు ఇరుకు రోడ్లపై సభలు నిర్వహిస్తున్నారు. సహజంగా సభ జరిగే ప్రాంతం వై జంక్షన్లో రెండువైపులా కన్పించేలా వాహనం ఉంచి ప్రసంగాలు చేస్తారు. కానీ టీడీపీ సభలు జరిగే ప్రదేశం జంక్షన్ ఉన్న ప్రాంతాన్ని కాదని ఇరుకురోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 40 అడుగుల రోడ్డులో రహదారికి ఇరువైపులా పది అడుగులు కుదించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండువైపులా ఇరవై అడుగులు కుదించడంతో ఇరవై అడుగులు మాత్రమే ఉండేలా చేస్తున్నారు. అక్కడ వెయ్యి మంది జనం పోగైతే చాలు వేలాది మంది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో షూట్ చేసి వేలాది మంది ఉన్నట్లు భ్రమలు కల్పించే ఫార్ములాను అమలు చేస్తున్నారు. గతంలో కందుకూరులో చంద్రబాబు సభ ఇదే రీతిలో చేపట్టడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే ఫార్ములా యువగళంలో కూడా అమలు చేసి సభలు నిర్వహించారు. సీనియర్ నేతలకు అవమానాలు లోకేశ్ పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేతలకు ఘోర అవమానాలు ఎదురయ్యాయి. ఆత్మకూరులో నాలుగేళ్లపాటు పార్టీ ఇన్చార్జిని కూడా నియమించని దుస్థితి ఉంది. ఈ క్రమంలో ఆత్మకూరుకు వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి) కోసం పాకులాడాల్సి వచ్చింది. పార్టీ సీనియర్ నేతలంతా ఆత్మకూరులో యువగళం వ్యవహారాలు చూడాలని ఆనంను కోరడంతో ఆయన కొన్ని డిమాండ్లు విధించారు. పాదయాత్ర జరిగే సమయంలో టీడీపీ సీనియర్నేత గూటూరు కన్నబాబు కన్పించకూడదని తెగేసి చెప్పడంతో ఆనం కోసం కన్నబాబును దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఆత్మకూరులో కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉన్న కన్నబాబును ఆనం మూలాన బలిచేయాల్సి వచ్చింది. పాదయాత్ర జరిగే సమయంలో ఆయన్ను విదేశీ పర్యటన పేరుతో పంపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు లోకేశ్ను కలిసే అవకాశం లేకుండా చేశారు. కాగా నెల్లూరురూరల్ నియోజకవర్గంలో అదే సీన్ జరిగింది. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోసం ఆ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను పక్కనపెట్టారు. గత నాలుగేళ్లలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన కోటంరెడ్డి కోసం అబ్దుల్ అజీజ్ను బలి చేశారు. ద్వితీయశ్రేణి నేతలు సైతం కోటంరెడ్డి రాకతో లోలోన కుమిలిపోతున్నారు. పసలేని ఆరోపణలు జిల్లాలో లోకేశ్ పాదయాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చేసిన పసలేని అడ్డుగోలు ఆరోపణలు ఆయన్ని నవ్వులపాలు చేశాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడి వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని అవినీతి జరిగిందని చెప్పడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. లోకేశ్ పసలేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరినా టీడీపీ నేతలు మారుమాట్లాడక పోవడం గమనార్హం. ఒక్కొక్కరికీ ఒక్కో చేదు అనుభవం ► నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి నారాయణ కోసం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఉద్వాసన పలికారు. గత నాలుగేళ్లుగా టీడీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కోటంరెడ్డిని కాదని మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఈ దఫా నేను ఎమ్మెల్యే అభ్యర్థినని కోటంరెడ్డి బహిరంగంగా ప్రకటించుకోగా ఆ కలను చినబాబు కలగానే మిగిల్చాడు. ► కోవూరు నియోజకవర్గంలో సీనియర్ నేతలను సైతం టీడీపీ పెద్దలు కరివేపాకులా వాడుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా ఆ పార్టీని నమ్ముకున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ప్రతి దఫా సీటు ఇస్తామంటూ ఆశపెడుతూ అన్యాయం చేస్తున్నారు. యువగళంలో కూడా పెళ్లకూరుకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన గర్రుగా ఉన్నారు. ► కావలి నియోజకవర్గంలో సీనియర్ నేతలకు చుక్కలు చూపించారు. బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడుని తెరపైకి తెచ్చి చేతిచమురు వదిలింపజేయగా, ప్రస్తుతం దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని తెరపైకి తెచ్చారు. అనంతరం అందరికీ మస్కాకొట్టి బీద రవిచంద్ర యువగళంలో తన సతీమణిని రంగంలోకి దింపడంతో టికెట్ ఆశించే నేతలకు దిమ్మదిరిగి మైండ్బ్లాక్ అయిందని అందరూ చర్చించుకున్నారు. ► ఉదయగిరిలో టికెట్ నీదేనంటూ పార్టీకి ఫండ్ తీసుకుని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ను చినబాబు ఎంకరేజ్ చేశారు. దీంతో టికెట్ ఆశించిన కాకర్ల సేవా కార్యక్రమాల పేరుతో ఉదయగిరిలో మకాం వేశారు. తీరా యువగళంలో కాకర్లను దూరం పెట్టారు. పాదయాత్రలో ఆయన నీడ కూడా పడకుండా పంపించేశారు. అలాగే పార్టీలో సీనియర్నేతగా ఉన్న కంభం విజయరామిరెడ్డికి అవమానం జరిగింది. కొండాపురంలో జరిగిన సభలో కంభంకు మైకు ఇవ్వకుండా దింపేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలకు మైకు ఇచ్చి మాట్లాడించిన చినబాబు కంభం విజయరామిరెడ్డికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
ఆనంకి దెబ్బ మీద దెబ్బ..
-
ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం..
జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తిరుగులేదు. అన్ని చోట్లా నా అనుచరులు ఉన్నారంటూ బిల్డప్ ఇచ్చిన ఆ నేతకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగుపెట్టిన ప్రతి చోటా.. స్థానిక నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు ఆయన్ని ఆందోళనలోకి నెట్టేసింది. నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కల్గిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని జిల్లాలో ఆయన గురించి తెలిసిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ మీదే విమర్శలు చేసిన అనం.. తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి.. తనకు కావాల్సినవి జరగలేదన్న అక్కసుతో ప్రతిపక్షం చెంత చేరిన ఆనం.. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలం.. బలగాన్ని చూపాలని ప్రయత్నించి బోర్లా పడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలన్న ఆలోచన బెడిసి కొట్టిందట. ఆత్మకూరులో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు లోకేష్, అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని గ్రహించిన కొమ్మి.. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును చంద్రబాబు కరివేపాకులా తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్కు ద్రోహం చేసి వచ్చిన ఆనంకి ఆత్మకూరు బాధ్యత అప్పగించారు. దీంతో కన్నబాబుకి మండి ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికా ప్రయాణం కట్టేశాడట. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ఆత్మకూరు టీడీపీలో ఎదురైన ఈ పరిణామం ఒకెత్తయితే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రకటించిన ఆత్మకూరు అభివృద్ధి అజెండాకు నియోజక వర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విక్రం వివరిస్తున్న తీరుకు..చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయ్యారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భారీగా జనాలు రావడం.. క్యాడర్ లో జోష్ గమనించిన ఆనం రామనారాయణ ఆత్మకూరు నుంచి తన దృష్టిని నెల్లూరు సిటీ వైపు మళ్ళించారట. ఆనం వేసిన ఈ ఎత్తును గమనించిన మాజీ మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ సిటీ ఇంఛార్జి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. మా సీటు కోసం ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోం అంటున్నారట. మరో వైపు ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఆనంకి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి భుజాలపై రాజకీయంగా ఎదిగి.. ఆయన మరణానతరం అందరినీ వదిలి తాను.. తన కుమార్తె అన్నట్టుగా రామ నారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని ఉమ్మడి కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్నారట. చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ ఒకవైపు టీడీపీలో పెత్తనం చేద్దామని వస్తే.. ఆదిలోనే ఎదురుగాలి మొదలైంది. ఇంకోవైపు తమది పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ అదే కుటుంబం నుంచి సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఆనం పరిస్థితి అయోమయంలో పడిందట. అక్కున చేర్చుకున్న అధికార పార్టీకి దూరమై అసమ్మతితో బయటకు వచ్చిన ఆనం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని టాక్ నడుస్తోంది. -
ఆనం రాజకీయ చరిత్రను నెల్లూరులోనే ముగిస్తా
నెల్లూరు(బారకాసు): ఆనం రామనారాయణరెడ్డి రాజకీయం ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఆయన చరిత్రను ముగించేస్తానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకునే దమ్ము ఆనం రామనారాయణరెడ్డికి ఉందా అని అన్నారు. ఒకవేళ ఆనం టికెట్ తెచ్చుకుంటే.. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఇద్దరం పోటీ చేద్దామని, తాను ఓడిపోతే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఎమ్మెల్యే అనిల్ తెలిపారు. ఆనం రాజకీయ చరిత్ర ముగిసిపోతున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారని, లేకుంటే ఆయనకు రాజకీయ చరిత్ర ఎక్కడుందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో గెలుపొందిన ఆనం.. పార్టీకి రాజీనామా చేయకుండా.. ప్రతిపక్ష పార్టీతో కలిసి నడవడంసరికాదన్నారు. తాను ఆనం కుటుంబానికి వ్యతిరేకం కాదని, ఏసీ సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, సంజీవరెడ్డి.. వీరంతా జిల్లాకు ఎంతోకొంత మంచి చేసిన వారు కాబట్టే వారికి మంచిపేరుందని తాను రాజకీయాల్లోకి రాకముందు పెద్దలు చెబుతుంటే విన్నానన్నారు. అదే కుటుంబానికి చెందిన ఆనం విజయకుమార్రెడ్డి వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత అవకాశాలిచ్చినందుకు జగనన్నతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఆనం కుటుంబంలో రామనారాయణరెడ్డి తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని విమర్శించారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉంటే తన మీద పోటీ చేసి గెలవాలన్నారు. బీద రవిచంద్రకు కౌంటర్ ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని బీద రవిచంద్ర తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ అన్నారు. బీద రవిచంద్ర టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీని నాశనం చేశారన్నారు. దగదర్తి మండలంలో మాయమైన భూరికార్డులకు సంబంధించి సమగ్ర చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, బీద రవిచంద్ర చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ హయాంలో ఎంత ఖర్చు చేశారో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చి తాము ఖర్చు చేశామో ప్రజలకు తెలుసునని, దీనిపై చర్చకు సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సవాల్ విసిరారు. -
ఆనంకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్
-
ఆనంకు మాజీ మంత్రి అనిల్ కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము ఆనం రాం నారాయణ రెడ్డికి ఉందా? అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. తాను ఆనం మీద పోటీ చేసి ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. ఆనం రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో.. అక్కడే క్లోజ్ చేస్తానన్నారు అనిల్. అలా చేయని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలుగుతానని అనిల్ పేర్కొన్నారు. నెల్లూరు సిటీని తాను ఎంత అభివృద్ధి చేశానో.. టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు అనిల్. -
పార్టీలో కలుపు మొక్కలను పీకి పడేశాం: మాజీ మంత్రి అనిల్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పులకేశి చేసేది పాదయాత్ర కాదు. లోకేశ్.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్కు సరిగ్గా మాట్లాడటం కూడా రావడం లేదు. సాగునీటి ప్రాజెక్ట్లపై చర్చకు నేను సిద్ధం. లోకేశ్కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్ట్లను పట్టించుకోలేదు. సోమశిల హైలెవల్ కెనాల్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్ చేశాం. టీడీపీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లోకేశ్.. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. నువ్వు గతంలో పోటీ చేసిన మందలగిరిలో మందు గెలువు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరే చరిత్ర ఆనం రామనారాయణది. అవినీతి చేసిన ఆనంను పక్కన పెట్టుకుని లోకేశ్ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదు. పార్టీలో ఉన్న కలుపు మొక్కలను మేమే పీకి పక్కడ పడేశాం. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకే నష్టం. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్. జనాలు లేక లోకేశ్ పాదయాత్ర వెలవెలబోతోంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్తోనే ఉంటాను’ -
ఆత్మకూరు టీడీపీలో అయోమయం.. ఆనం రాక.. నాయకుల అలక
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలైంది. పాత, కొత్త నాయకులందరూ దీనిని విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే అలా జరగకపోవడంతో ఆదిలోనే పార్టీ వర్గాలు డీలా పడిపోయాయి. ముందు నుంచి ఉన్న వారిని కాదని వలస వచ్చిన నాయకుడికి బాధ్యతలు అప్పగించారంటూ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘నియోజకవర్గంలో టీడీపీ నేల విడిచి సాము చేస్తోంది. పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా మోసిన వారిని కాదని, వలస నేతలకు రెడ్ కార్పెట్ వేసింది. నిన్నటి వరకు అధికారం అనుభవించి ఎన్నికలు సమీపిస్తుండగా కండువా మార్చిన వారికి నేడు ప్రాధాన్యమిస్తూ నమ్మిన వారిని నట్టేట ముంచడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని మరోసారి నిరూపితమైంది’. ఇదీ ఆత్మకూరు టీడీపీలో ప్రస్తుతం నడుస్తున్న అంతర్గత చర్చ. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా పార్టీకి దిక్కే లేదన్నట్లుగా వలస నేత ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా పార్టీ నాయకత్వం ఆహ్వానించి బాధ్యతలు అప్పగించడంపై అనేకమంది రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జెండా మోసిన నేతలు పాదయాత్రకు ముఖం చాటేశారు. మరికొందరు గత్యంతరం లేక అలా కనిపించి తప్పుకున్నారు. ఎన్నికల వేళ తప్ప.. 2014 ఎన్నికల సమయంలో పార్టీకి అభ్యర్థి కూడా దొరక్కపోవడంతో స్థానికంగా ఉన్న కన్నబాబే దిక్కయ్యాడు. ఓటమి తప్పదని భావించినా రంగంలోకి దిగి నష్టపోయాడు. 2019లో మరోసారి టికెట్ వస్తుందని భావించిన కన్నబాబుకు చుక్కెదురైంది. గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లినేని కృష్ణయ్యను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన పారిశ్రామికవేత్త. ఎన్నికల వేళ తప్ప ఎప్పుడూ నియోజకవర్గంలో కనిపించడు. ఏనాడు పార్టీ కార్యకర్తలకు చేరువ కాలేదు. కన్నబాబును కాదని అధిష్టానం కృష్ణయ్యకు టికెట్ ఇచ్చింది. అందరూ అనుకున్నట్లుగానే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కనిపించలేదు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆనంకు ఆత్మకూరు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు. పర్యటన పేరుతో డుమ్మా ఆనంను తెచ్చి కన్నబాబుకు ఈసారి కూడా మొండిచేయి చూపారు. కష్టపడిన వారిని పట్టించుకోవడంలేదనే భావనలో ఉన్న ఆయన లోకేశ్ పాదయాత్రకు ముఖం చాటేశాడు. విదేశీ పర్యటన పేరుతో డుమ్మా కొట్టాడు. అలాగే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు పరిస్థితి మరోలా ఉంది. గత నాలుగేళ్లుగా పార్టీ ఇన్చార్జిగా నియమించే సాహసం కూడా అధిష్టానం చేయలేకపోయింది. కన్నబాబు, కొమ్మి, బొల్లినేని, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి ఇన్చార్జి మీరేంటే మీరంటూ ఊరించారు. ఇప్పుడు ఆనంకు బాధ్యతలు అప్పగించడంతో ఆ నేతలకు చుక్కెదురైంది. టీడీపీలో నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారని ముందుగానే పసిగట్టిన బొమ్మిరెడ్డి వైఎస్సార్సీపీలో చేశారు. మిగిలిన ఆ ముగ్గురికి తమ పరిస్థితి ఏమిటో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఆత్మకూరులో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. మళ్లీ పచ్చజెండా రెపరెపలాడిన సందర్భం లేదు. బలమైన నాయకత్వం కరువైంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వలస నేతలు లేదా పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపడం.. వారిని ఓటమి వరించడం.. ఆపై మళ్లీ ఎన్నికలొచ్చే వరకు వారు ముఖం చాటేస్తున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుండడంతో స్థానికంగా పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతూనే ఉందని కార్యకర్తల భావన. ఇక్కడ బలమైన నేతలున్నా వారిని ఎన్నికల సమయంలో కరివేపాకుల్లా వాడుకుంటుండడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. -
కక్కిన కూడే పరమాన్నమాయే.. లోకేశ్ కోసమేనా ఇంత హైప్!
మనంతట మనం బెల్లం.. యాలకులు.. చిక్కనిపాలు .. జీడిపప్పు వేసి వండుకుని చేసేదాన్ని పరమాన్నం అంటాం. మరి ఎవరో ఆరగించి కక్కిన కూడు పరమాన్నం అని ఎలా అంటాం?. అంత దిక్కుమాలిన గాచ్చారం ఎవరికీ ఉంటుంది. ఎవరికీ అంటే.. అంతకు మించి మరో మార్గం లేనివాళ్లకు అది తప్ప మరో గతిలేని వాళ్లకు ఆ కక్కిన కూడే మహాభాగ్యం అవుతుంది. టీడీపీ పరిస్థితి సైతం అచ్చం అలాగే ఉంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసి అనైతికానికి పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వెలివేతకు గురైన ఆనం రామనారాయణ రెడ్డి (వేంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) వరుసగా టీడీపీ లీడర్లతో సమావేశమవుతూ వస్తున్నారు. వాళ్లకు మరి వేరే మార్గం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెంటేశాక వేరే మార్గం లేదు కాబట్టి టీడీపీ గుమ్మానికి వేలాడక తప్పదు. నెల్లూరులో గత ఎన్నికల్లో ఒక సీట్ కూడా గెలవలేక మొత్తం పది సీట్లూ వైఎస్సార్సీపీకి అప్పగించి బిక్కముఖం వేసిన టీడీపీకి ఇప్పుడు సస్పెండ్ అయిన ఈ ముగ్గురే దిక్కయ్యారు. వీళ్ళను వంద తలలు నరికివచ్చిన కాలభైరవుల్లా కీర్తిస్తూ ఎల్లో మీడియా సైతం విస్తృత కవరేజి ఇవ్వడం చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఎంత కరువులో ఉన్నారో అర్థం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత లీడర్లు పార్టీ నుంచి అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ లేక మొహం వాచిపోయిన టీడీపీ, ఎల్లోమీడియాకు కరువులో ఉన్న కుక్కకు వల్లకాట్లో ఎముక దొరికినట్లయింది. దీంతో వారినే రకరకాలుగా చూపిస్తూ ఆషాఢంలో పండగ చేసుకుంటున్నారు. లోకేశ్ కోసమే హైప్.. త్వరలో నెల్లూరులోకి ప్రవేశించనున్న నారా లోకేష్ పాదయాత్రకు హైప్ తేవడానికి తప్ప ఈ ముగ్గురి చేరిక టీడీపీకి ఎందుకూ పనికిరాదన్న విషయం కార్యకర్తలకు అర్థం అవుతూనే ఉంది. వాస్తవానికి చంద్రబాబుకు, టీడీపీకి ప్రజల్లో ఆమోదం ఉంది. గ్రాఫ్ పెరిగితే కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఒక్కరైనా చేరాలి కదా. మరి అలాంటి చేరిక ఒక్కటీ లేదు అంటే గత ఎన్నికల్లోనే సీఎం జగన్ చేతిలో చచ్చి మమ్మీగా మారిన శవానికి ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనే పట్టు చీర కట్టి ఉత్తుత్తి ముస్తాబు చేయడం తప్ప శవం లేచేది లేదని గ్రామస్థాయిలో కార్యకర్తలు చెవులుకొరుక్కుంటున్నారు టీడీపీలో గొడవల మాటేమిటి.. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు ఉంది టీడీపీ తీరు. ఆల్రెడీ టీడీపీలో కొన్నాళ్లుగా ఉంటూ వస్తున్న నాయకుల మధ్య తలెత్తుతున్న గొడవలు సర్దుబాటు చేయడం వదిలేసి వైఎస్సార్సీపీ నుంచి వెలివేతకు గురైన వాళ్ళను చూసి పండగ చేసుకుంటున్నట్లు ఉంది. ఇప్పటికే విజయవాడలో పార్టీకి నిప్పెట్టేసి దూరం నుంచి చలి కాస్తున్న కేశినేని నానిని ఏమీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు అటు సత్తెనపల్లిలో కోడెల శివరామ్ చేస్తున్న గాయి గత్తరను సైతం వినే ధైర్యం చేయడం లేదు. ఇక గన్నవరంలో తంగిరాల సౌమ్య ఆర్తనాదాలు అరణ్యరోదనే అవుతున్నాయి. ఇక ఫారిన్ నుంచి నేరుగా సూట్ కేసులతో దిగిపోయి డబ్బుతో చంద్రబాబును కొట్టి చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన భాష్యం ప్రవీణ్ వ్యవహారం సైతం ఒక తలనొప్పి. రాత్రికి రాత్రి ఫారిన్ నుంచి దిగిపోయి అక్కడక్కడా సేవలు పేరిట ఈవెంట్స్ చేస్తే సరిపోతుందా? మరి మేము ఏమవ్వాలి అని వెక్కివెక్కి ఏడుస్తున్న పుల్లరావు ఆవేదన ఎవరికి వినబడడం లేదు. ప్రస్తుతానికి కొన్నాళ్ళు ఈ వైస్సార్సీపీ ఎమ్మెల్యేలతో ఈవెంట్ నడపడం తప్ప వేరే మార్గం లేదని చంద్రబాబుకు అర్థం అయింది. ఇది కూడా చదవండి: జేపీ నడ్డా వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్ -
ఆనం రాంనారాయణరెడ్డికి నేదురుమల్లి ఛాలెంజ్
-
మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: సీఎం జగన్ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఫొటోతో గెలిచినవారే.. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ‘‘మేకపాటి చంద్రశేఖర్రెడ్డికి ఏ పార్టీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చంద్రశేఖర్రెడ్డి ఓటు వేశాడో లేదో అతని అంతరాత్మకు తెలుసు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటా. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురిలో ఒక్కరు శాసనసభకు వచ్చినా జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను. ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. రాజకీయాల్లో లేకుండా పోవడమే కాదు. నెల్లూరు జిల్లాకు శాశ్వతంగా దూరమైపోతా. దమ్ముంటే నా సవాల్ను స్వీకరించండి’’ అంటూ అనిల్ వ్యాఖ్యానించారు. చదవండి: లోకేష్కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా? -
టీడీపీ పతనమైందని లోకేష్ ఒప్పుకున్నట్టేనా?
తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ నెల్లూరు నుంచే వైస్సార్సీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇది వినడానికి టీడీపీ వారికి బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా.. అదే సూత్రం ఆ పార్టీకి వర్తింపచేస్తే టీడీపీ ఇప్పటికే పతనమైపోయిందని వారే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయితే పతనం అయిపోతే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మూడేళ్ల క్రితమే బయటకు వచ్చేశారు కదా!. మరి ఇప్పటికే పార్టీ పతనం అయిందని అంగీకరిస్తారా?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ, పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్కుచెదరలేదు. అదరలేదు.. బెదరలేదు. అలాంటిది ఇలాంటి ఉడత ఊపులకు ఉలిక్కిపడతారా!. నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు అసమ్మతిగళం విప్పడం పార్టీకి కొద్దిగా చికాకే కావచ్చు. కానీ, పార్టీ అదినాయకత్వం వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకుంది. శ్రీధర్ రెడ్డి బదులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిని, రామనారాయణరెడ్డి స్థానంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియోజకవర్గాల బాధ్యుయులుగా ప్రకటించింది. ఆదాల ప్రభాకర రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉండేవారు. మంత్రి కూడా అయ్యారు. కానీ, అప్పట్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సరిపడక కాంగ్రెస్లోకి వచ్చారు. తదుపరి సోమిరెడ్డిని శాసనసభ ఎన్నికలలో ఓడించారు. విభజన సమయంలో కొంతకాలం టీడీపీలో ఉన్నా 2019లో వైఎస్సార్సీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఆయన మందీ మార్బలం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నెల్లూరు రూరల్లో ఆయన రంగంలోకి దిగడం వల్ల వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత విధేయుడనని తనకు తానే ప్రకటించుకునేవారు. తాను చనిపోతే సీఎం జగన్ వచ్చి పార్టీ జెండా కప్పాలన్నదే తన కోరిక అన్నంతవరకు కూడా వెళ్లేవారు. ఇలాంటి మాటలను బహిరంగసభలలో పెద్ద స్వరంతో చెప్పేవారు. తాను మధ్య తరగతి కుటుంబీకుడిని అయినా సీఎం జగన్ చేరదీసి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని ఎన్నటికీ మరువబోనని చెప్పేవారు. అలాంటి కోటంరెడ్డి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిపై ఆశ పుట్టింది. అందులో తప్పు లేదు. కానీ, వివిధ కారణాల రీత్యా ఆయనకు పదవి లభించలేదు. అంతమాత్రాన ఆయన ఇలా అవిధేయుడుగా మారతారని ఎవరూ ఊహించలేదు. నిజానికి శ్రీధర్ రెడ్డి అప్పడప్పుడు సంకేతాలు ఇవ్వకపోలేదు. అమరావతి రైతుల పేరుతో కొందరు చేసిన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం, పార్టీ కార్యక్రమాలుగా కాకుండా సొంతంగా తన పేరుతోనే నియోజకవర్గంలో ప్రోగ్రాంలు పెట్టుకోవడం వంటివి చేశారు. అప్పుడప్పుడు అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ నేతలు గతంలో కోటంరెడ్డిపై దౌర్జ్యన్యకారుడని, బెట్టింగ్ రాయుడని పలు ఆరోపణలు చేయడం, వాటిన ఆయన ఖండించడం జరిగేవి. ఒక మహిళా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించిన అభియోగంపై కేసు నమోదు అయింది. ఇవన్ని ఎలా ఉన్నా ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయకుండా ఉండటం కూడా గమనించాల్సిన అంశమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆనం రామనారాయణరెడ్డిని మెచ్చుకోవడం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని తమ ట్రాప్లోకి తెచ్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత, అమరావతి భూ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణతో ఆపరేషన్ నిర్వహించారన్న సమాచారం బయటకు వస్తోంది. ఆయన వీరిద్దరిని తమ ట్రాప్లోకి తెచ్చుకోగలిగారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్తో పాటు ఆర్థికవనరులు సమకూర్చే బాధ్యత ఆయన తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వైఎస్సార్సీపీ నాయకులు కోటంరెడ్డి విషయంలో పెద్దగా అనుమానించలేదని అనుకోవాలి. అలా భావించి ఉంటే ఇటీవలే ముఖ్యమంత్రి జగన్.. ఆయనను పిలిచి మందలించేవారు కారు. అప్పుడే కొత్త ఇన్ఛార్జీని నియమించేవారు. కోటంరెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడం సహజంగానే ప్రతిపక్షానికి ఒక అస్త్రం దొరికినట్లయింది. విశేషం ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడటం. ఆయన వద్ద ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన అధికారి అప్పట్లో ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి విపక్షంపై నిఘా పెట్టాలని ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులోనే ఆయన సస్పెండ్ కూడా అయి కేసును ఎదుర్కొంటున్నారు. కోటంరెడ్డి విషయంలో ప్రభుత్వ నిఘా విభాగం అధినేత అనవసరంగా తనకు వచ్చిన ఒక సమాచార రికార్డును శ్రీధర్ రెడ్డికి పంపినట్లు అనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఆ అధికారి చెప్పబోతే, పరిస్థితిని అర్ధం చేసుకున్న కోటంరెడ్డి అప్రమత్తమై అన్ని విషయాలు బహిర్గతం అయిపోతున్నాయని భావించి ఈ ఆరోపణ చేసినట్లుగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈయన నారా లోకేష్తో ఎప్పటి నుంచో టచ్లో ఉన్నట్లు టీడీపీ నేతలే వెల్లడించారని చెప్పారు. అలాగే, చంద్రబాబుతో కూడా అన్నీ మాట్లాడుకునే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. లేకుంటే టీడీపీ టిక్కెట్ వచ్చేస్తుందని ఎలా చెప్పగలుగుతారు?. ఇంతవరకు వైఎస్సార్సీపీని వీడలేదు.. టీడీపీలో చేరలేదు. అయినా, నియోజకవర్గంలో టీడీపీ పెత్తనం తనదే అయినట్లుగా అంటున్నారంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. పోనీ, ఆయన అనుకున్నట్లు వస్తే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో, లేక ఏ ఇతర సీనియర్ నేతనో కాదని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా?. దీనిని ఆయన నమ్మగలరా?. అసలు సమస్య ఏమిటంటే ఈయన ప్రవర్తన తీరుతెన్నులు, ఇతర అంశాలపై పార్టీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తుంటాయి. వాటి ఆధారంగా 2024 ఎన్నికలలో టిక్కెట్ రాదన్న భావన ఈయనకు వచ్చి ఉండవచ్చు. గెలిచినా, ఓడినా రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో పార్టీ నుంచి పోటీచేయాలని నేతలు అనుకుంటారు. అందువల్లే కోటంరెడ్డి తన విధేయతను అవిధేయతగా మార్చుకుని ఉండవచ్చనిపిస్తుంది. అతిగా పొగిడే వారిని అంతగా నమ్మరాదనే లోకోక్తి కూడా ఉంది. అతి వినయం ధూర్త లక్షణం అంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో సీఎం జగన్ను అంతగా పొగిడింది తన పదవిపైన ఆశతోనే అన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇలాంటి ఫిరాయింపుదారులు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. వారిలో అత్యధికులు రాజకీయంగా కనుమరుగైపోయిన ఘట్టాలే ఎక్కువ. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కోటంరెడ్డికి దమ్ముంటే 51 సెకన్ల ఆడియో బయట పెట్టాలని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్తేందుకే కోటంరెడ్డి విమర్శలు అంటూ దుయ్యబట్టారు. ‘‘కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే.. నువ్వు రాజీనామా చేస్తావా?. 24 గంటల సమయం ఇస్తున్నా.. ఎప్పుడైనా రండి.. నేను రెడీ. ఆనం రామనారాయణ చచ్చిన పాము.. ఆయనకేంటి ప్రాణహాని’’ అని అంటూ అనిల్ నిప్పులు చెరిగారు. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? -
టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ అంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు.. కాని ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదంటూ మంత్రి హితవు పలికారు. సీఎం జగన్ పార్టీ పెట్టకపోతే ఎమ్మెల్యేలు అయ్యేవారా?. ఇలాంటి వారికి సీఎం జగన్ భయపడేవారు కాదు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. ఇలాంటి వాళ్లు వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చదవండి: కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ -
ఆనం రామనారాయణపై నేదురుమల్లి సీరియస్ కామెంట్స్
సాక్షి, నెల్లూరు: ఆనం రామనారాయణ రెడ్డిపై నేదురుమల్లి రాంకుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారు. గెలిచిన మొదటి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తప్పుడు ఆరోపణలు ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్కు గురవుతోందని ఇప్పుడు చెబుతున్నారు. నీ తప్పులనీ బయటకు వస్తున్నాయి. కాంట్రాక్ట్ల విషయాలు కూడా బహిర్గతమవుతున్నాయి. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి. వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించింది. వెంకటగిరి నక్సల్ ప్రాంతమని ఆనం మాట్లాడుతున్నారు. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారు. ముందునుంచే శ్రీధర్ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్లో ఉన్నారు. ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
సోమశిల ప్రాజెక్టు కోసం గౌతమ్ పరితపించేవారు
-
సీఎం జగన్ పై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించాడు
-
బాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలి
సాక్షి, నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలన్నారు. ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్కు పంపేందుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఎమ్మెల్యే అందజేశారు. (చదవండి: టీడీపీ హయాంలోనే గంజాయి మూలాలు.. టీడీపీ మాజీ మంత్రి వీడియో వైరల్) అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సభ్య సమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోందన్నారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జనాగ్రహ దీక్షలో టీడీపీకి తీరుకి నిరసనగా గవర్నర్ లేఖ కోసం సంతకాలు సేకరించామని ఆయన తెలిపారు. చదవండి: కాకినాడ మేయర్గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవ ఎన్నిక
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
నాతో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఒప్పుకోలేదు: హీరో
మాట నిలబెట్టుకున్న గుల్మోహర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
‘ఆధార్’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్’
ఎస్ఆర్హెచ్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు: భారత మాజీ ఓపెనర్
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!
మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా మాట్లాడారు.. నిర్మాత ఆవేదన
నగల దుకాణంలో కట్టల కొద్దీ.. కోట్లాది నగదు!
దూసుకొస్తున్న రెమాల్ తుపాను
71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్ల..!
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- IPL 2024: రైజర్స్ VS రైడర్స్
Advertisement