Anand Devarakonda
-
'90s' పాత్రల్లో ‘బేబీ’ జోడీ.. మిడిల్ క్లాస్ బాయ్ లవ్స్టోరీ
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్టైన్మెంట్. ఒకపక్క పెద్ద సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క చిన్న చిత్రాలతో అదరగొడుతోంది. సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తూ.. విజయాలను అందుకుంటుంది.తాజాగా మరో కొత్త కాంబినేషన్తో సినిమాని ప్రకటించింది. అదే ‘90s’, ‘బేబీ’ కాంబినేషన్.'బేబీ' చిత్రంతో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే '90s' వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments), తమ ప్రొడక్షన్ నెం. 32ని ప్రకటించింది.ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. '90s' సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. "మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ." అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుంది.తన మధురమైన మెలోడీలతో ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రకటన వీడియోతోనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు ఆదిత్య హాసన్, 'బేబీ' ద్వయంతో కలిసి మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
కొంచెం కొత్తగా ఉందాం
క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు. మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్.రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.⇒ మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.⇒ వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.⇒ మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?⇒ కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.⇒ చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడగతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.⇒ ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..! – చంద్రబోస్హెల్త్... హార్డ్వర్క్మనం ప్రతి ఒక్కరం కెరీర్ కోసం చాలా కష్టపడతాం. హార్డ్వర్క్ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్ వర్క్... హెల్త్... హ్యాపీనెస్... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్ని ప్లాన్ చేసుకుని పాజిటివ్గా ముందుకెళ్లడమే. కెరీర్ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం, నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్లో ఎంత సక్సెస్పుల్గా .. ఎంత టీమ్ స్పిరిట్తో.. ఎంత ఎఫర్ట్ఫుల్గా పనిచేశామన్నది ముఖ్యం.రేటింగ్ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్ ట్రిప్కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.2025 మీద నా అంచనాలు: షూటింగ్లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్ స్టోరీస్, అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్ అయినా 2025లో రిలీజ్ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం, నా గోల్స్. – ఆనంద్ దేవరకొండస్ట్రాంగ్గా... పాజిటివ్గా...మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్ లవ్’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్ ఫీలింగ్తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్స్ట్రెంగ్త్పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.ప్రొఫెషన్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్లప్రశాంతతకు ప్రాధాన్యంరోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.ప్రొఫెషన్గా, కెరీర్పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్ అంతా ఎంతో హార్డ్వర్క్ చేసిన నా సినిమా బ్లాక్బస్టర్గా నిలవడం నా కెరీర్లో మెమరబుల్ మూమెంట్గా చెప్పుకుంటాను.1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. ఇంక న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారా.. బీ గుడ్ టు అదర్స్. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్. ఇంకా.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్షిప్ మెయిన్టెయిన్ చేయాలనుకుంటున్నాం. – కిరణ్ అబ్బవరంప్రతి టైమ్ మంచిదేజీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను. నా వరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఇచ్చాను. ప్రతి టైమ్ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్కు డబుల్ షిఫ్ట్స్లో వర్క్ చేశాను. హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్ -
అనంత శ్రీరామ్కు ఐఫా అవార్డు
పాటల రచయిత అనంత శ్రీరామ్ ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డు అందుకున్నారు. ‘బేబి’ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికిగానూ ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు బెస్ట్ లిరిక్ రైటర్గా అనంత శ్రీరామ్ తాజాగా ఐఫా అవార్డు అందుకోవడంతో ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి అనంత శ్రీరామ్ను అభినందించారు. ‘‘బేబి’ మూవీకి ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. తాజాగా ఐఫా దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయంటే ఆ ఘనత సాయి రాజేశ్కే దక్కుతుంది. ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించారాయన’’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఎస్కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్లో ‘బేబి’ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. -
'స్ట్రోమ్' వచ్చాక సంతోషం వచ్చింది.. : విజయ్ దేవరకొండ
స్ట్రోమ్ (విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు) వచ్చాక మా ఇంట్లో ఎంతో ఆనందం వచ్చిందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. జూబ్లీహిల్స్లో నూతనంగా నెలకొల్పిన సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ను విజయ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించారు. మా ఇంట్లో మొదట్లో పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా అమ్మా నాన్నకు నచ్చజెప్పి స్ట్రోమ్ గాడిని తెచ్చుకున్నామని, ఇప్పుడు మాకంటే మా పేరెంట్స్ స్ట్రోమ్ గాడితోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ అన్నారు.షూటింగులలో ఎంతో బిజీగా ఉండి, ఒత్తిడిలో ఇంటికి రాగానే స్ట్రోమ్ గాడి అల్లరితో అంతా మర్చిపోతామన్నారు. పెట్స్ను పెంచడమంటే మామూలు విషయం కాదని, ఇంట్లో ఒక చిన్న బేబీని చూసినంత పని ఉంటుందని, అంత కేర్ తీసుకునే ఓపిక ఉన్న వాళ్లు మాత్రమే పెట్స్ను పెంచుకోవాలని సూచించారు. సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ నిర్వాహకులు సంధ్య, శ్రీరెడ్డి పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ : సెవన్ ఓక్ పెట్ హాస్పిటల్లో సందడి చేసిన విజయ్ ,ఆనంద్ దేవరకొండ (ఫొటోలు)
-
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా
మరో తెలుగు సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అదే రోజు రిలీజైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'భజే వాయు వేగం' చిత్రాల వల్ల సరైన వసూళ్లు సాధించలేకపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)'బేబి' మూవీతో గతేడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. దీంతో ఇతడు నటించిన 'గం గం గణేశా' మూవీపై కాస్త బజ్ ఏర్పడింది. యాక్షన్ క్రైమ్ కామెడీ స్టోరీతో తీసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గం గం గణేశా' విషయానికొస్తే.. గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న సైజ్ దొంగ. అతడికో ఫ్రెండ్ (ఇమ్మాన్యుయేల్). ఓ షాపులో పనిచేసే శ్రుతి (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. ఆమె గణేశ్ని కాకుండా షాప్ ఓనర్తో పెళ్లికి రెడీ అవుతుంది. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే డబ్బు ముఖ్యమని ఓ డైమండ్ దొంగతనానికి గణేశ్ సిద్ధపడతాడు. మరోవైపు ఓ రాజకీయ నాయకుడు రూ.100 కోట్ల బ్లాక్ మనీని ముంబై నుంచి కర్నూలు తీసుకొచ్చే పనిలో ఉంటాడు. ఈ రెండింటికి లింక్ ఏంటి? డైమండ్ ఎవరికి దక్కింది అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?) -
అమెరికాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ టూర్ (ఫొటోలు)
-
సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
అనారోగ్యంపాలవుతున్న బాడీ బిల్డర్స్సిక్స్ ప్యాక్ శరీరానికి మంచిది కాదు..ఆరోగ్యకరమైన కొవ్వులూ అవసరమే : వైద్యులు ఏదైనా అతిగా చేస్తే అనర్థమే..! ఔను నిజమనే అంటున్నారు వైద్యులు.. ఇంతకీ ఏంటది? దేని గురించి? ఈ చర్చంతా దేనికి అనుకుంటున్నారా? అదే నండి బాబు సిక్స్ ప్యాక్ గురించి.. సిక్స్ ప్యాక్ అనగానే.. ప్రస్తుత తరానికి ఎంతో క్రేజ్. ఆ పేరు చెప్పగానే శరీరంలోని నరాలన్నీ జివ్వుమన్నట్లు అవుతుంది.. కానీ అతిగా చేస్తే ఆరోగ్యానికి అనర్థమే అంటున్నారు వైద్యులు.. ఇటీవల పలువురు హీరోలు అతిగా వ్యాయామం చేసి అనారోగ్యం పాలవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. అసలు సిక్స్ ప్యాక్ కథేంటి? వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుందాం.. బాలీవుడ్ టు టాలీవుడ్.. సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై రెండు దశాబ్దాలు పైమాటే. అయినా అంతకంతకూ తన క్రేజ్ను పెంచుకుంటోంది. దాదాపు బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో ‘దేశ ముదురు’తో అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎనీ్టయార్, రామ్చరణ్, సుధీర్బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్లో తళుక్కుమంటున్నారు. అనుకరణ మరింత ప్రమాదమట.. సిక్స్ప్యాక్ కొనసాగింపు కోసం నాగశౌర్య నెలల తరబడి తీవ్ర కసరత్తులు చేశారని, అదే విధంగా కఠినమైన డైట్ ను పాటించారని సమాచారం. ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే శౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చని పలువురి వాదన.. అయితే వైద్యులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీకి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉందని, అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్ప్యాక్ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు సిక్స్–ప్యాక్ మ్యానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాలని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారు.. 👉సిక్స్ ప్యాక్ కొనసాగింపు శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. 👉కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్ను ప్రభావితం చేస్తుంది. 👉తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరం. ఆహారం నుంచి ఉప్పు తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. 👉అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్కు గురిచేసే అవకాశం ఉంది. 👉అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, అవి కనపడని రోజున తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగవచ్చని, అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. 👉బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎక్కువ శ్రమించడం ప్రమాదకరం అంటున్నారు. 👉ఇక ఫాస్ట్గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకుంటున్నారు కొందరు. ఇది కూడా శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుందని, ఫలితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అదే అసలు కారణమా? ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని పలు వార్తలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగÔౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక కన్నడ సూపర్స్టార్ పునీత్రాజ్ జిమ్ చేస్తూ స్ట్రోక్ వచ్చి మరణించిన విషయమూ తెలిసిందే...జాగ్రత్తలు పాటించాలి... అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు సైతం సిక్స్ ప్యాక్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శారీరకంగా అమ్మాయిలకు, అబ్బాయిలతో పోలిస్తే చాలా పరిమితులు ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. మగవాళ్లకన్నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఫిట్నెస్ రంగాన్ని ప్రొఫెషన్గా తీసుకున్నా, బాడీ బిల్డింగ్ రంగంలో రాణించాలనుకున్నా.. ఓకే గానీ... సరదాకో, గుర్తింపు కోసమో సిక్స్ప్యాక్ చేయాలనుకోవడం ఏ మాత్రం సరికాదు. –కిరణ్ డెంబ్లా, డి.జె, ఫిట్నెస్ శిక్షకురాలుఏడాది పాటు శ్రమించా..కఠినమైన వర్కవుట్స్తో పాటు డైట్ కూడా ఫాలో అయ్యా. షూటింగ్ ఉన్నప్పుడు వర్కవుట్ చేయడంతో పాటు నీళ్లు కూడా తీసుకోలేదు. ఇలాంటి సందర్భంలో సైకలాజికల్ ప్రెషర్ను ఎదుర్కోవడం అంత సులభం కాదు. సిక్స్ ప్యాక్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. –ఆనంద్ దేవర్కొండ, సినీ హీరోరాంగ్ రూట్లో అనర్థాలే.. చాలా మంది యువత ఎఫర్ట్ పెట్టి సిక్స్ప్యాక్ సాధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం త్వరగా షేప్ వచ్చేయాలని రాంగ్ రూట్లో ప్రయత్నాలు చేయడం, మజిల్స్ను పరిమితికి మించి శ్రమకు గురిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. –ఎం.వెంకట్, ట్రైనర్, సిక్స్ ప్యాక్ స్పెషలిస్ట్ -
మూవీ రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే షాక్
-
బాక్సాఫీస్ దగ్గర 'గం గం గణేశా'.. రెండు రోజుల వసూళ్లు ఎంతంటే?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. చాన్నాళ్ల పాటు సరైన సినిమాలు లేకపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. అలాంటి టైంలో అంటే రీసెంట్ శుక్రవారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజయ్యాయి. వీటిలో ఒకటే ఇది. రోజు రోజుకి మెరుగైన వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లో ఎన్ని కోట్లు దక్కించుకుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?(ఇదీ చదవండి: హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్లో హీరోయిన్ మకాం)'బేబి' మూవీతో గతేడాది హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు జానర్ మార్చి మరో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. క్రైమ్ కామెడీతో తీసిన 'గం గం గణేశా' తొలిరోజు రూ.1.20 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. వీకెండ్ కావడంతో రెండో రోజు థియేటర్లకి జనాలు బాగానే వచ్చారు. తద్వారా రెండో రోజు రూ.1.50 కోట్లకి పైగా గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ లెక్కన ఓవరాల్గా చూసుకుంటే 'గం గం గణేశా' సినిమాకు రెండు రోజుల్లో రూ.2.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కినట్లు సమాచారం. మరి ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంది. మరి సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?) -
‘గం..గం..గణేశా’తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారీ అంచనాల మధ్య నిన్న (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకెళ్తోంది. (చదవండి: ‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ)ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్డే ఈ మూవీ 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. -
‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ
టైటిల్: గం..గం..గణేశా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిరచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి సంగీతం: చేతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడిఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్విడుదల తేది: మే 31, 2024‘బేబీ’లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్ని క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్కు గణేష్(ఆనంద్ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్ అయిన గణేష్..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్ కోసం అరుణ్ (ప్రిన్స్ యావర్) గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్ ఓ గణేశ్ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్ డేవిడ్(వెన్నెల కిశోర్) కారణంగా రుద్రా గ్యాంగ్తో పాటు గణేష్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్ చివరకు ఎవరికి దక్కింది? గణేష్ లైఫ్లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్తో హిలేరిస్గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్గానే ఉన్నా ఎంటర్టైన్ చేస్తాయి.హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్ రెడ్డి ట్రాక్.. మరోవైపు గణేష్ ట్రాక్ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్, డైమండ్ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్టైన్ చేయవు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డైమండ్గా వెన్నెల కిశోర్ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్ గ్యాంగ్కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్ నడిపే లవ్ట్రాక్ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్లో స్వామిజీ(రంజగన్)ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్ క్లైమాక్స్ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. డ్యాన్స్తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు. ఇక జబర్థస్త్ ఫేం ఇమ్మాన్యుయేల్కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్గా వెన్నెల కిశోర్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్ రెడ్డిగా రాజ్ అర్జున్, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Gam Gam Ganesha X Review: ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే..
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూగా గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు నేడు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గం..గం..గణేశా ఎలా ఉంది? ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేద్దాం. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్లో గం..గం..గణేశాకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ బాగా వర్కౌట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజీ అని అంటున్నారు. #GamGamGanesha 🏆🏆🏆🏆 A Proper Commercial Thriller Package from Anand deverkonda 👌Entertaining First Half and Thrilling Second Half with good Climax works big time 💥 Emmanuel , Krishna Chaitanya was best in their roles 🔥#GGG pic.twitter.com/HgfRVL9RTm— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 31, 2024 ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన ప్రాపర్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ గం..గం..గణేశా. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ ఉంది. సెకండాఫ్ థ్రిల్లింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ బాగుంది. ఇమ్మాన్యుయేల్, కృష్ణ చైతన్య వారి వారి పాత్రల్లో చక్కగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GamGamGanesha A Complete Fun Entertainer 🏆@ananddeverkonda Steals The Show With His Brilliant Performance 👏Director @udaybommisetty Congratulations! You Have Impressed Everyone With Ur Narrative Style & CharacterisationsMusic & Cinematography Are Of Top Notch Quality 👌 pic.twitter.com/rGmF8sM5uw— Official Srinu (@OfficialSreeNu) May 30, 2024 గం..గం..గణేశా ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. ఆనంద్ దేవరకొండ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ ఉదయ్ నెరేటివ్ స్టైల్తో పాటు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#GamGamGanesha is a 'Sit-back and Relax' fun Crime Comedy. Situational comedy works superbly & Vennala Kishore Track was 🤣. BGM 🔥Despite its known story, Kudos to @udaybommisetty for his brilliant execution! @ananddeverkonda HIT Streak continues! ✌️ pic.twitter.com/GqiSbcLxf0— The Creative Shelf (@tcsblogs) May 31, 2024 గం గం గణేశా మూవీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఫన్ క్రైమ్ కామెడీ. వెన్నెల కిషోర్ సిట్యుయేషనల్ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి కథనాన్ని నడించిన తీరు బాగుంది. ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. #GamGamGanesha Day 🔥UK reviews bagunavi 😍Another BB loading............#AnandDeverakonda #VijayDeverakonda pic.twitter.com/LaCH0TDSj9— Mahesh (@starmahesh10) May 31, 2024#GamGamGaneshaReview:Simple story but missing content.Comedy is ok in some scenes.#AnandDeverakonda trying his best in plots but this time it's not up to the mark, #Immanuel #VennalaKishore are big plus.He always trying new appreciate for that.#GamGamGanesha#GangsOfGodavari pic.twitter.com/ko7QQYNZmg— MJ Cartels (@Mjcartels) May 31, 2024#GamGamGanesha Premiere Review from UK 🇬🇧 pic.twitter.com/f6W0Hn9LFu— Anonymous (@__GirDhar) May 31, 2024Positive reviews every where another hit loading ❤️🔥Congrats @ananddeverkonda anna #GamGamGanesha pic.twitter.com/hSHsbL4fcN— sashanth (@sashant39979304) May 31, 2024#GamGamGaneshaReviewPositives: • Situational Comedy 😂• Vennala Kishore Track 🤩• Characters & Characterisations 💥• Engaging Screenplay 💯• Decent Twists 🤗• Superb BGM 🥵Negatives: • Artificial First 15mins • Weak Villain Characterization• Few Acting &… pic.twitter.com/ozh13EbQ8z— Movies4u Official (@Movies4u_Officl) May 31, 2024 -
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం చూసి స్టోరీ రాసుకున్నా: ఉదయ్ శెట్టి
‘భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది "గం..గం..గణేశా"లో ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఆనంద్ దేవరకొండ హీరో. సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. రేపు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఉదయ్ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → నేను విజయేంద్రప్రసాద్ గారి టీమ్ లో రైటర్ గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్ లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్ కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా "గం..గం..గణేశా" జర్నీ బిగిన్ అయ్యింది.→ వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని మాత్రం మంచి క్యారెక్టర్ లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది.→ ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్ గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ ఫార్మ్ చేశారు.→ "గం..గం..గణేశా" సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది.→ "గం..గం..గణేశా" మేకింగ్ టైమ్ లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్ లో కనిపిస్తాయి.→ నేను పూరి జగన్నాథ గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. -
వైరల్ కావాలనే రష్మికతో అలా చిట్ చాట్ చేశాం: ఆనంద్ దేవరకొండ
రష్మిక మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాతో పాటు మా ఫ్యామిలీతో క్లోజ్గా ఉంటుంది. అందుకే గం.. గం.. గణేశా ప్రిరిలీజ్ ఈవెంట్లో ఫన్నీగా చిట్ చాట్ చేశాం(చిట్ చాట్లో భాగంగా మీ ఫేవరెట్ హీరో ఎవరని అడగ్గా..ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్ (విజయ్ దేవరకొండ) పేరును రష్మిక చెప్పడంతో అది వైరల్ అయింది). అది వైరల్ అవుతుందని తెలిసే..కావాలనే అలా చేశాం. రష్మికకు అన్నకు(విజయ్ దేవరకొండ) మధ్య ఏదైన రిలేషన్ ఉంటే ఎప్పటికైనా బయటపడుతుంది కదా(నవ్వుతూ..). ఇప్పటికైతే రష్మిక మాకు మంచి స్నేహితురాలు మాత్రమే’ అని అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 31న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.⇢ లాక్డౌన్ సమయంలోనే బేబి కథతో పాటు "గం..గం..గణేశా" స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎగ్జైట్ చేసింది. యూనిక్ గా అనిపించింది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను.⇢ ఈ మూవీ షూటింగ్ డిలే అయ్యింది. నేను బేబి మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైమ్ పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగడం..ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండాఫ్ లో వినాయకుడి మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటికోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్లీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైమ్ పట్టింది.⇢ ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరు అని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదు అని నాకూ అనిపించింది. "గం..గం..గణేశా" కథతో ఆ ప్రయత్నం చేయొచ్చనే నమ్మకం కలిగింది.⇢ నేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా...హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు.నేను పెట్టుకున్న నమ్మకానికి తగినట్లు మా డైరెక్టర్ ఉదయ్ కథను అందరికీ నచ్చేలా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు.⇢ ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం "గం..గం..గణేశా" స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల రెస్పాన్స్ చూసి మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.⇢ వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.⇢ నేను పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంట్లో ఖాలీగా ఉంటే అన్న విజయ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి అంటాడు. మా నాన్న కూడా నీలో గ్రేస్ ఉందిరా డ్యాన్స్ నేర్చుకో అనేవారు. బేబిలో ఓ ఆరు నిమిషాల పాట చేశాం. కానీ సినిమా నిడివికి ఎక్కువవుతుందని కట్ చేశాం. ఈ సినిమాలో డ్యాన్స్ లు చేసే అవకాశం దక్కింది.⇢ "గం..గం..గణేశా"కు చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. కేదార్, వంశీ నా ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ డిలేస్, సెట్ పాడయినప్పుడు మళ్లీ ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు.⇢ నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ మూవీస్ లా సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్ అనంతోజు సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మేట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ సాయి రాజేశ్, ఎస్ కేఎన్, వైష్ణవి, నేను కలిసి బేబి కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూయెట్ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమా 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. -
‘గం..గం..గణేశా’ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది : వంశీ కారుమంచి
‘‘క్రైమ్, కామెడీ, యాక్షన్గా ‘గం..గం..గణేశా’ సినిమా రూపొందింది. మరీ ముఖ్యంగా ఇందులోని వినోదం ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని సమస్యల్లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వచ్చే వినోదం ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది’’ అని నిర్మాత వంశీ కారుమంచి అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకుడు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్పై వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వంశీ కారుమంచి మాట్లాడుతూ–‘‘నాది గుంటూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేశా. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇండియాలోనే స్థిరపడాలనుకున్నప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉండేది. ఉదయ్ కథ చెప్పగానే ఆనంద్కి సరి΄ోతుందనిపించింది. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర తనది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా ‘గం గం గణేశా’. ఇద్దరి హీరోయిన్ల పాత్రకి మంచి ప్రాధాన్యం ఉంది. సినిమా ఇండస్ట్రీ చూసేందుకు చిన్నదిగా కనిపించినా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రష్మిక పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. విజయ్తో బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేశా'.. మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. రీసెంట్గా రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ ఫొటోలు చూపించి, వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది.నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మికని ఆనంద్ అడగ్గా.. మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్ని సరదాగా తిట్టింది. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్లో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)#AnandDeverakonda: who's your fav co-star#Rashmika: Neeyabba.. Nuvvu Naa family anand #GamGamGanesha Pre Release pic.twitter.com/ZhiSfUU6pF— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 27, 2024 -
‘గం. గం.. గణేశా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తన సోదరుడు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం గురించి ఆయన కామెంట్ చేశాడు.కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫ్యామిలీస్టార్'కు కావాలనే నెగెటివ్ టాక్తో ప్రచారం చేశారు. ఆ సినిమా విడదల కావడానికి 48 గంటల ముందు నుంచే పబ్లిక్ మాట్లాడిని పాత వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన మాటలను తీసుకొచ్చి ఫ్యామిలీస్టార్ రిజల్ట్, రివ్యూలు అంటూ తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టారు. అలాంటి సమయంలో ప్రేక్షకుల్లో కూడా కాస్త నిరుత్సాహం కనిపించింది. కనీసం సినిమా చూసిన తర్వాత అయినా అలా రివ్యూస్ ఇచ్చి ఉంటే.. నిజంగానే ప్రేక్షకులకు మూవీ నచ్చలేదేమోనని అనుకునే వాళ్లం. అలాంటిది ఫ్యామిలీస్టార్ విడుదలకు ముందే కావాలని టార్గెట్ చేసి కొందురు ఎందుకు ఎటాక్ చేశారో తెలియడం లేదు. ఇలాంటి పద్ధతి చిత్ర పరిశ్రమకు చాలా ప్రమాదకరం. ఇలాంటి పని ఎందుకు, ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు సైబర్క్రైమ్కు వారికి ఫిర్యాదు కూడా చేశాం. భవిష్యత్లో విజయ్ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. అని ఆయన అన్నారు. -
గం గం గణేశా మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
వినాయక చవితి చుట్టూ...
‘‘గం గం గణేశా’ దర్శకుడు ఉదయ్ నా వద్ద పని చేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇవ్వాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సాయి రాజేశ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘గం గం గణేశా’ని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి. ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు ఉదయ్ శెట్టి. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘గం గం గణేశా’లో తొలిసారి ఎనర్జిటిక్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు. -
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
గతేడాది 'బేబి' సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు రూట్ మార్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'గం గం గణేశా'తో ఎంటర్టైన్ చేసేయడానికి వచ్చేస్తున్నాడు. మే 31న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)హీరో ఓ దొంగ. ఫ్రెండ్తో కలిసి జాలీగా బతికేస్తుంటాడు. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ వినాయకుడి విగ్రహాం దొంగతనం జరుగుతుంది. హీరో కూడా ఊహించని విధంగా ఆ దొంగతనంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే కథలా అనిపిస్తుంది. ఇప్పటివరకు కూల్గా ఉంటే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆనంద్.. ఈ చిత్రం కామెడీ కూడా చేశాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?) -
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
'బేబి'తో హిట్ కొట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇతడు హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆనంద్ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. దీంతో సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!)ఈ నెల 31న 'గం గం గణేశా' సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో ఆనంద్ ని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతలా మారిపోయాడేంటని కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.అయితే ఈ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం లవ్ మీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఆశిష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై ఉండగానే ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసింది వైష్ణవి. ఫోన్లోనే తనకు 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' చెప్పాలని వైష్ణవి కోరింది. అయితే దీనికి షాక్ అయిన ఆనంద్ నేనే చెప్పాలా? అని అడిగారు. బేబీ సినిమా మొత్తం చూసినా కదా.. అవన్నీ చెబితే బాగోదేమో అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. ఆ పదాన్ని రిపీట్ చేయాలని మళ్లీ కోరింది వైష్ణవి చైతన్య. దీంతో చివరికీ 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' అంటూ చెప్పేశారు. దీంతో అక్కడున్న వారంతా కేకలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. లవ్ మీ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది.#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆 📱Actress @iamvaishnavi04 takes up a dare and calls @ananddeverkonda during #LoveMeTrailer launch live event!😃Watch Live here - https://t.co/CKcEqqOreD#VaishnaviChaitanya #AnandDeverakonda #TeluguFilmNagar pic.twitter.com/0cHFxZjroQ— Telugu FilmNagar (@telugufilmnagar) May 16, 2024 -
పిచ్చిగా నచ్చేశావే...
‘‘పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా.. కళ్లలో చల్లేశావే రంగులన్నీ భలేగా..’ అంటూ సాగుతుంది ‘గం..గం..గణేశా..’ సినిమాలోని ‘పిచ్చిగా నచ్చేశావే’ పాట. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. శనివారం ఈ చిత్రంలోని ‘పిచ్చిగా నచ్చేశావే..’ పాట లిరికల్ వీడియోను హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల సమక్షంలో రిలీజ్ చేసింది యూనిట్. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. -
యూత్ఫుల్ డ్యూయెట్
‘డ్యూయెట్’ పాడుతున్నారు మదన్. ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటగా నటిస్తున్న యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘డ్యూయెట్’. మిథున్ వరదరాజ కృష్ణన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ డిఫరెంట్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. శుక్రవారం ఆనంద్ దేవరకొండ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్యూయెట్లో మదన్ క్యారెక్టర్లో ఆనంద్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సహనిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి. మరోవైపు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్ కూడా విడుదలైంది. -
తమ్ముడికి విషెస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో.. ట్వీట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్' చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గతేడాది బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో అన్న విజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. తమ్మునితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. నాతో ఫైట్ చేసే మొదటి అబ్బాయికి హ్యాపీ బర్త్ డే అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Happiest Birthday to the first boy I’ll take with me on a fight 😄❤️ Brother boy @ananddeverkonda I love you most 😘 pic.twitter.com/Yg2ZisFuE2 — Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2024 -
అదే నా ఫస్ట్ బ్రేకప్.. కోలుకోవడానికి నాలుగైదేళ్లు పట్టింది!
బేబి సినిమాలో హీరోయిన్ను గాఢంగా ప్రేమిస్తాడు హీరో ఆనంద్ దేవరకొండ. బ్రేకప్ తర్వాత ఆమెను మర్చిపోలేక నరకం అనుభవిస్తాడు. నిజ జీవితంలోనూ అలాంటి నరకం చూశానంటున్నాడీ యంగ్ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ బాధను బయటపెట్టాడు. చికాగో వెళ్లాక తనతో జాలీగా ఉండొచ్చనుకున్నా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. నేను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. నేను కూడా అమెరికా వెళ్దామని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాను. కాబట్టి చికాగో చుట్టుపక్కలే ఏదైనా ఒక యూనివర్సిటీలో ఉందామనుకున్నాను. అమెరికాలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై చేస్తే సీటు దొరికింది. షాకయ్యాను. ఇంక చికాగోకు వెళ్లిపోయాక ఇద్దరికీ స్వేచ్ఛ దొరుకుతుంది. కలిసి ఉండొచ్చు, మా ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకున్నాను. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! అక్కడికి వెళ్లాక వ్యవహారం బెడిసికొట్టింది. బ్రేకప్ బాధ.. నా గుండె పగిలినంత పనైంది. ఆ బ్రేకప్ బాధలో నుంచి బయటపడటానికి నాలుగైదేళ్లు పట్టింది. ఎంతో నిజాయితీగా ప్రేమించాను. కానీ వర్కవుట్ కాలేదు. చాలా బాధపడ్డాను' అని చెప్పుకొచ్చాడు. అమెరికాలో చదువుకుని అక్కడ కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు ఆనంద్. ఆ సమయంలో ఏడాదికి రూ.40 లక్షల జీతం తీసుకున్నాడు. కానీ సినిమాల మీద ఆసక్తితో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చాడు. దొరసాని సినిమాతో హీరోగా మారాడు. మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, హైవే ఇలా భిన్న ప్రాజెక్టులు చేసుకుంటూ పోయాడు. గతేడాది బేబి చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు! -
Duet Movie: ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
లవ్ డ్యూయెట్
ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటగా నటించనున్న సినిమాకు ‘డ్యూయెట్’ టైటిల్ను ఖరారు చేశారు. ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్గా చేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్టూడియో గ్రీన్ పతాకంపై కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం గురువారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఆనంద్ తల్లిదండ్రులు గోవర్ధన్ దేవరకొండ, మాధవి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ ఇచ్చారు. తొలి సీన్కి దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఈ చిత్ర సహ–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ స్క్రిప్ట్ను దర్శకుడు మిథున్కు అందజేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘డ్యూయెట్’ నాకు స్పెషల్ ఫిల్మ్. మిథున్ మంచి కథ రాశాడు’’ అన్నారు. ‘‘ఇదొక మంచి లవ్స్టోరీ’’ అన్నారు మిథున్. ‘‘ఈ కథ విన్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. జీవీ ప్రకాశ్కుమార్ ఆల్రెడీ రెండు పాటలు ఇచ్చేశారు. వారం రోజుల్లో తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు. ఈ వేడుకకు హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
కోకాపేట్ లో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైత్యన (ఫొటోలు)
-
భయం.. అత్యాశ.. కుట్ర
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం టీజర్ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భయం, అత్యాశ, కుట్ర అంశాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. ‘బేబీ’ తో ఆడియన్స్ ఎంత ఎమోషనల్ అయ్యారో, ‘గం..గం..గణేశా’ చిత్రంతో అంత ఎంటర్టైన్ అవుతారు. ఉదయ్ కథ, విజన్ను నమ్మి ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ కారుమంచి. ‘ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది’’ అన్నారు ఈ చిత్ర సహనిర్మాత అనురాగ్ పర్వతనేని. -
వినాయకచవితికి 'గంగం గణేశా' క్రేజీ అప్డేట్.. మీరు చూసేయండి!
బేబీ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం గంగం గణేశా. ఈ మూవీ ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కేదర్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ టీజర్ను రీలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ 'బేబీ' ముూవీ.. ఫస్ట్ సింగిల్ రిలీజ్) టీజర్ చూస్తే.. 'అమ్మాయిలను టీజ్ చూస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ.. కళ్లలో నుంచి నీళ్లు రాకూడదురా' అనే డైలాగ్లో ప్రారంభమైంది. బేబీ మూవీ తర్వాత ఆనంద్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వినాయకచవితి సందర్భంగా టీజర్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో నయన్ సారిక, ఇమ్మానుయేల్, వెన్నెల కిశోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. Little boy is doing trippy stuff 😂🔥 This looks like so much fun! You are killing it @ananddeverkonda https://t.co/0Lf3cRhBZp#GamGamGanesha teaser is looking 👍👌🥰 I've already heard the songs and i am Jealous of this album by @chaitanmusic - next level album coming… pic.twitter.com/njXfBp3cPb — Vijay Deverakonda (@TheDeverakonda) September 15, 2023 -
గం గం గణేశ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ స్పీచ్
-
ఖుషి సక్సెస్.. యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిట్టు కోసం అల్లాడిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో ఒక్కడేనా? అటు హీరోయిన్ సమంత, ఇటు డైరెక్టర్ శివ నిర్వాణ.. అందరూ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు వీరి ముగ్గురికీ ఖుషి రూపంలో సక్సెస్ దొరికింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషి సినిమాకు సానుకూల స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో విజయ్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒక అమ్మాయి అయితే ఏకంగా విజయ్ను హత్తుకునేందుకు ప్రయత్నించింది. బాడీగార్డులు ఆమెను అడ్డుకోవడంతో చివరకు ఫోటో దిగి సంతృప్తి చెందింది. దర్శనానంతరం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా బ్రదర్ బేబీ మూవీ, నేను నటించిన ఖుషి రెండూ సక్సెస్ అయ్యాయి. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాను. కొన్నేండ్ల కిందట నేను యాదాద్రికి వచ్చినప్పుడు గుడి ఇంత బాగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఖుషి హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా' అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ సమంత ఎక్కడ?.. విజయ్ దేవరకొండను ప్రశ్నించిన నాగ్.. రూ.35 లక్షలు ఆఫర్.. -
ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్
బేబీ సినిమా సక్సెస్తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్ మార్కెట్ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్ సంతకం చేశాడు. ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ టీమ్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు హీరోయిన్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ కూడా అడుగుపెట్టబోతుంది. (ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి) బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్తో కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్లలో ఆనంద్కు ఒకేసారి ఛాన్స్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. -
Baby Movie In OTT: ఓటీటీలోకి బేబి సినిమా.. ప్రకటించిన మేకర్స్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం 'బేబీ'. జులై 14న విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు సుమారు రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమచారం. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్బాస్లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే ఆగష్టు 25 నుంచి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీలో ప్రసారం కానుంది. ఓటీటీ కోసం ఇందులో ఒక సాంగ్తో పాటు కొన్ని సీన్లను కూడా చేర్చనున్నారని తెలుస్తోంది. 10 కోట్ల కలెక్షన్ల టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రెండురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ను రీచ్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్స్ కూడా భారీగా లాభాల్లోకి వచ్చారు. ఇక 25 నుంచి ఓటీటీలోకి వస్తున్న బేబీని చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. -
బేబి సినిమా నిర్మాతతో గొడవ.. ఆపై క్షమాపణ చెప్పడంతో..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా 'బేబీ'. సాయి రాజేశ్ దర్శకుడు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలిరోజే రూ.7 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టింది. విడుదలై 20 రోజులు దాటిని ఇప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. సుమారు రూ.85 కోట్ల మేరకు ఇప్పటి వరకు రాబట్టి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొనసాగుతుంది. (ఇదీ చదవండి: ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్) తాజాగా ఈ సినిమా యూనిట్ విజయ యాత్రలో భాగంగా ఏపీలోని భీమవరం పర్యటించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారితో పాటు కొంతమంది స్థానిక మీడియా ప్రతినిధులు కూడా ఒక్కసారిగా గుంపుగా రావడంతో.. వారు మీడియా ప్రతినిధులు అని గమనించక బౌన్సర్లు తోసేశారు. అంతేకాకుండా వారి పట్ల కాస్త దురుసుగా కూడా ప్రవర్తించారు. దీంతో వారందరూ ఆందోళనకు దిగారు. అనంతరం చిత్ర నిర్మాత ఎస్కేఎన్ కారును వారందరూ అడ్డుకున్నారు. దీంతో కారు నుంచి దిగిన ఎస్కేఎన్తో వారందరూ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆయన కూడా కొంతమేరకు సీరియస్ అయ్యారు. అనంతరం వారికి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అక్కడున్న వారిలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. అతన్ని స్థానిక ఆస్పత్రికి ఎస్కేన్ సిబ్బంది తరలించారట. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ #BabyTheMovie #Baby pic.twitter.com/rflAImEYMU — Telugu Scribe (@TeluguScribe) August 4, 2023 -
ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్
చిన్న సినిమాగా విడుదలైన 'బేబి' బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్లు నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. అలాగే SKN ఈ మూవీకి నిర్మాత. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనాలు సృష్టించే దిశగా పయనం అయింది. ఎంతలా అంటే ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ సినిమా 'అర్జున్ రెడ్డి' ని కూడా బేబి బ్రేక్ చేసింది. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) ఈ సినిమా ఇప్పటికి విడుదలై 20 రోజులు దాటింది. త్వరలో ఓటీటీలో విడుదలకు రెడీగా ఉంది. ఇదే విషయంపై తాజాగా టాలీవుడ్ వర్గాల్లో బేబి సినిమా గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సుమారు 3గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మాత్రం సుమారు నాలుగు గంటల నిడివితో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. (ఇదీ చదవండి: కార్తీ 'జపాన్' సినిమాకు భారీ బిజినెస్.. ఎన్ని కోట్లో తెలిస్తే!) దీనిని నెట్ ఫ్లిక్స్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఇందులో ఒక సాంగ్తో పాటు కొన్ని సీన్లను చేర్చనున్నారు. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని అవి కూడా బోల్డుగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాటితో పాటు ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం కలుపుతున్నారని తెలుస్తోంది. 4 గంటల నిడివితో సరికొత్తగా ఓటీటీలో వచ్చే బేబిని మళ్లీ చూసేయండి. -
బేబి ఫేమ్ 'వైష్ణవి చైతన్య' తమ్ముడు చేసినపనికి భారీ ట్రోలింగ్
ఇండస్ట్రీలో చాలామంది నటుల్లానే విజయ్ దేవరకొండ కూడా సొంత టాలెంట్తోనే ఎదిగాడు. సినిమా అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఎలాంటి పాత్ర వచ్చినా నటించాడు. అలా ఒక్కోమెట్టు ఎదుగుతూ నేటి యువతకు బ్రాండ్గా మారాడు. అలాంటి 'లైగర్' పక్కన బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య తమ్ముడు దిగిన ఫోటో ఒకటి ట్రోలింగ్ ట్రెండింగ్లో టాప్లో ఉంది. (ఇదీ చదవండి: అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్) బేబి సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్లోకి వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక విజయ్ దేవరకొండతో వారిద్దరు కలిసి ఫోటోలు దిగారు. అందులో వైష్ణవి తమ్ముడు కూడా ఉన్నాడు. ఆపై వాటిని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలో వైష్ణవి తమ్ముడే హైలెట్ అవుతూ స్టిల్ ఇవ్వడంతో వారికి నచ్చలేదు. అంతేకాకుండా విజయ్పైన చెయి వేయడంతో ఈ ట్రోలింగ్కు మరింత దారి తీసింది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) వైష్ణవి తమ్ముడి పైనా విజయ్ ఫ్యాన్స్ ఇలా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఏమైనా సాధారణ వ్యక్తిలా ఫీలయ్యావా ఏంటి అంటూ వారు విరుచుకుపడుతున్నారు. 'నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా..? అలా విజయ్ పైనా చెయి వేసి ఫోజు కొడుతున్నావ్.. నీతో ఫోటో దిగేందుకు విజయ్, ఆనంద్లు మీ ఇంటికి వచ్చారా..? కొంచెం ఇలాంటి ఆటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది.' అని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరైతే వీడేంటి అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడులా లుక్ ఇచ్చాడు అంటుంటే మరికొందరేమో వీడు చైల్డ్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటో వార్ ఇంతటితో ఆపేయండని పలువురు అంటుంటే.. పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో వైష్ణవి అయినా తమ్ముడికి చెప్పాలి కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. -
వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి
‘‘సినిమా అభిమానులంటే ఒక రకమైన దురభిప్రాయం ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమను చూస్తున్నాను. ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవడం... ఈ క్రమంలో చదువులపై అశ్రద్ధ వహించి, జీవితంలో పైకి రావాలనే తపన లేకుండా ఉంటారని.. ఇలా సమాజంలో అభిమానుల గురించి దురభిప్రాయం ఉండేది. అలాంటివి నా చెవిన పడ్డాయి. అలాంటి సమయంలో నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాకంటూ అభిమానులు ఏర్పడితే.. నా అభిమానులను చూసి, సమాజం గర్వపడేలా వారిని తీర్చిదిద్దాలని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి మంచి సామాజిక కార్యక్రమాలు చేశాను. నా పిలుపు మేరకు వచ్చిన నా అభిమానుల గురించి వారి తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా మాట్లాడటం చూస్తుంటే.. నా అభిమానులను చూసి నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది’’ అన్నారు చిరంజీవి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. మాస్మూవీ మేకర్స్ పతాకంపై సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘బేబీ’విజయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పాత తరంతోనే ఇండస్ట్రీ ఉంటే అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే మన పరిశ్రమ నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటుంది. రాజమౌళివంటి దిగ్గజ దర్శకులు ఉన్నారు కాబట్టే మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి వెళ్తున్నాయి. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్లను యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకుని కొత్త కంటెంట్తో రాగలిగితే అంతకుమించిన ప్రత్యుపకారం ఇండస్ట్రీకి మరొకటి ఉండదు. ఎస్కేఎన్ , సాయి రాజేష్, మారుతి.. ఇలా నా అభిమానులను చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలుగుతుంది. నా అభిమానులు చేసిన ‘బేబి’ ప్రయత్నం ప్రజాశీస్సులు పొంది, ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ ఆనందంలో భాగం కావాలనే నేను ఇక్కడికి వచ్చాను. ‘బేబి’ ఎడ్యుకేషనల్ ఫిల్మ్లా అనిపించింది. చాలామంది యువత సోషల్ మీడియా ఆకర్షణలో పడిపోయి, సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతున్నారు. యువతే కాదు..వారి తల్లిదండ్రులు కూడా ఈ మూవీని చూసి, ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాకు, ఆయన మా సినిమా సక్సెస్మీట్కు రావడం సంతోషంగా ఉంది’’ అని ‘బేబి’ చిత్రయూనిట్ పేర్కొంది. -
‘బేబి ప్రభావతమ్మా’ అంటుంటే ఆనందంగా ఉంది
ఇరవై రెండేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. ఎన్నో పాత్రలు పోషించాను. కానీ ‘బేబీ’సినిమాకు వచ్చినన్ని కాల్స్, ప్రశంసలు ఇంతవరకు రాలేదని అంటున్నారు నటి ప్రభావతి. ఆనందర్ దేవరకొండ, వైష్షవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. చిన్న సినిమాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరో ఆనంద్ దేవరకొండ తల్లిగా ప్రభావతి నటించారు. ఈ చిత్రంలో ఆమెది మూగ పాత్ర. హావభావాలతోనే అద్భుత నటన కనబరిచింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం అభినందించడం చూసినవాళ్ళల్లో ఆమెను ఎరుగనివారు "ఎవరీ ప్రభావతి?" అని ఆరాలు తీస్తున్నారు. "జైసింహా, మహానటి, మిడిల్ క్లాస్ మెలోడీస్, గోరింటాకు, సాహసం, అమరావతి, అనసూయ, ఏక్ మినీ ప్రేమ్ కథ, గరుడ వేగ, సీటీమార్, లవ్ యు రామ్" వంటి చిత్రాలతోనూ తన నటనకు మంచి మార్కులు సంపాదించుకున్న ప్రభావతి... ఇప్పుడు అందరూ తనను "బేబి ప్రభావతమ్మా" అని పిలుస్తుంటే కలుగుతున్న ఆనందం అంతా ఇంతా కాదు అంటున్నారు. "బేబి" సినిమా చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజులు చేస్తూ.. 'అమ్మ'గా వాళ్ళ గుండెల్లో చోటు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. -
రికార్డులు కొల్లగొడుతోన్న 'బేబీ'.. స్టార్ హీరో మూవీ రికార్డ్ బ్రేక్!
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం బేబీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించి ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా.. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం మౌత్టాక్తో రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.70 కోట్ల మార్కును దాటేసిన బేబీ మూవీ మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్) ఈసారి ఏకంగా కన్నడ స్టార్ యశ్ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్-2 రికార్డ్ను బద్దలుకొట్టింది. గతంలో కేజీఎఫ్-2 వరుసగా 12 రోజుల పాటు రోజుకు రూ.కోటి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం వరుసగా 13 రోజుల పాటు కోటికి పైగా వసూళ్లను రాబట్టి కేజీఎఫ్ను వెనక్కి నెట్టింది. ఈ చిత్రం రిలీజై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లపరంగా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ చిత్రం అర్జున్ రెడ్డి కలెక్షన్లను దాటేసిన బేబీ మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్) -
ఆ సీన్ వైష్ణవి నాన్నకు చెప్పాకే తీశా.. బేబీ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం 'బేబీ'. కేవలం మౌత్ టాక్తో విడుదలైన పది రోజుల్లోనే రూ.66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి హిట్స్ అందించిన డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ప్రధానంగా వైష్ణవి చైతన్య పాత్రకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. ఆమె సంబంధించిన డైలాగ్స్, సీన్స్ ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చాయి. (ఇది చదవండి: కలెక్షన్స్లో 'బేబీ' ఆల్టైమ్ రికార్డ్!) అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యుకు హాజరైన డైరెక్టర్ సాయి రాజేశ్ హీరోయిన్పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కథ చెప్పగానే తాను మొదట అంగీకరించలేదని.. తాను మరింత క్లారిటీ ఇచ్చాకే ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చే బెడ్ రూమ్ సీన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ షాట్ గురించి వైష్ణవి వాళ్ల నాన్నకు పూర్తిగా వివరించానని పేర్కొన్నారు. వాళ్లకు చెప్పిన తర్వాత ఆ షాట్ తీశానని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడే ఆపేస్తానని చెప్పానన్నారు. అంతే కాకుండా నీ కెరీర్కు ఏదైనా ఇబ్బంది వస్తే మూడు సినిమాల్లో నేను అవకాశమిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాతో మరో సాయి పల్లవి దొరికిందంటూ ప్రశంసలు వస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని సాయి రాజేశ్ అన్నారు. వైష్ణవి గురించి మాట్లాడుతూ..'వైష్ణవిలో ఓ విధమైన హంగర్ ఉంటుంది. ఏదైనా షాట్ రాకపోతే మళ్లీ తనే ఫోన్ చేసి ఈ ఆ షాట్ చేద్దామని చెప్పేదని సాయి రాజేశ్ అన్నారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే? ) -
విజయవాడలో సందడి చేసిన ‘బేబీ’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బేబీ మూవీ టీం
-
'బేబీ' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్
పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'బేబీ' సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 9 రోజుల్లో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే మూడు-నాలుగు రెట్ల లాభాలతో దూసుకెళ్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ 'బేబీ' ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. అనుకున్న సమయం కంటే ఓటీటీలోకి ఆలస్యంగా రానుందట. (ఇదీ చదవండి: ఉపాసనపై రామ్చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమాను ట్రయాంగిల్ లవ్స్టోరీగా తీశారు. ముగ్గురికి ముగ్గురు కూడా అద్భుతమైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అయితే మూవీని మరో లెవల్ కి తీసుకెళ్లింది. దర్శకుడు ప్రతిభని కూడా కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇలా అన్ని అంశాలు 'బేబీ'కి కలిసొచ్చాయి. రిలీజ్కి ముందే 'బేబీ' డిజిటల్ హక్కుల్ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. 4-5 వారాల విరామం తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే థియేటర్లలో వస్తున్న స్పందన చూసి, ఆ నిర్ణయంలో మార్పు జరిగిందని టాక్. కాస్త ఆలస్యంగా అంటే ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరులో తొలివారంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!) -
బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!
చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.60 కోట్ల మార్కును దాటేసింది. కంటెంట్ ఉంటే చాలు.. సినిమాలకు ఆదరణ తగ్గదని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. సినీ ప్రముఖులు కూడా బేబి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రతి పాత్ర అందరిని కదిలించిందని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!) ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. హృదయ కాలేయం సినిమాతో హిట్ కొట్టిన సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి రాజేశ్.. ఈ చిత్రంలో హీరోయిన్గా వైష్ణవి తీసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎందుకంటే వైష్ణవి పాత్ర డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్గా నిలిచాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాకు వైష్ణవి తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. నేను ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదట తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలనుకున్నా. అంతే కాదు తెలంగాణ భాష, యాసపై పట్టున్న అమ్మాయి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని భావించా. అలా అనుకున్న సమయంలో మా మేనేజర్ వైష్ణవి ఫోటోను నాకు చూపించారు. దీంతో నేను ఆలస్యం చేయకుండా వైష్ణవి సంప్రదించా. ఫస్ట్ తను ఈ కథ చెప్పగానే అంగీకరించలేదు. ఆ తర్వాత నేను ప్రతి సీన్ గురించి తనకు వివరించి చెప్పా. ఆ తర్వాతే తను అంగీకరించింది. నేను చెప్పిన ప్రతి సీన్ చాలా అద్భుతంగా చేసింది.' అని అన్నారు. (ఇది చదవండి: కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?) -
కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. 'కలర్ఫోటో'తో అలరించిన సాయి రాజేష్నే ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్కేఎన్ ఈ మూవీకి నిర్మాత. జులై 14న చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రాన్ని కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మొదటి ఐదురోజులు చాలా థియేటర్స్లలో హౌస్ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి. దాంతో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన బేబి సినిమా కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి. 'మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అనే కొటేషన్తో వచ్చిన ఈ సినిమాను చూసిన వారందరూ ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో వైష్ణవి పాత్రని కూడా తిట్టుకుంటున్నారు. అంతలా కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే రూ. 60.3 కోట్ల గ్రాస్ను కొల్లగొట్టింది. ఒక రకంగా చిన్న సినిమాల పరంగా చూస్తే తక్కువ రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన మూవీగా బేబీ రికార్డు క్రియేట్ చేసింది. (ఇదీ చదవండి: డైరెక్టర్ అసభ్య ప్రశ్న.. కౌంటర్ ఇచ్చిన టాప్ హీరోయిన్) ఈ సినిమా నిర్మించేందుకు సుమారు రూ. 10 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాక్. సినిమాకు హిట్ టాక్ రావడంతో మొదటి మూడు రోజుల్లోనే పెట్టుబడి మొత్తం వచ్చేసినట్లే. తర్వాత ఈ మూవీ మంచి లాభాల్లో కొనసాగుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా అన్ని చోట్ల కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ సాధించేసింది. తాజాగా రెండో వారంలో అడుగు పెట్టింది. వీకెండ్ కాబట్టి సినిమా కలెక్షన్స్ మళ్లీ పెరిగాయి. కాబట్టి మరికొన్ని రోజులపాటు బేబీ ఫాలోయింగ్ కొనసాగడం గ్యారెంటీ. Alaa aravai kotla mark ki….9 rojullo#BabyTheMovie pic.twitter.com/uR5FT1JH3m — Sai Rajesh (@sairazesh) July 23, 2023 -
నమ్మాను... ఆఫర్లు వచ్చాయి
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ద్వారా సాయిరాజేష్ పరిచయం అయ్యారు. అలా ‘బేబీ’కి సంగీతం ఇచ్చాను. ‘బేబీ’ విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్మాను. అందుకే రెండున్నరేళ్లుగా ఏ ్రపాజెక్ట్ ఒప్పుకోలేదు. ఈ సినిమా పాటలు రిలీజ్ కాగానే చాలా ఆఫర్స్ వచ్చాయి’’ అన్నారు. -
ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్రబృందం ఇటీవలే వేడుకలు కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!) కాగా.. ఈ చిత్రంలో డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రధానంగా యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పాత్రకు సంబంధించిన డైలాగ్స్పై డైరెక్టర్ సాయి రాజేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ డైలాగ్ విషయంలో మాత్రం తప్పు చేశానన్నారు. అంతే కాకుండా సినిమా రివ్యూలపై సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయిని వాడు ఎంత హార్ట్ చేస్తే కానీ.. అమ్మాయి డివియేట్ అవ్వదు. అంత ప్రేమ ఉన్న వాళ్లద్దరి మధ్య బ్రేక్ రావాలంటే ఆ పదం వాడాల్సిన అవసరమొచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు' అనే డైలాగ్ విషయంలో నాది తప్పు. కానీ ఆ డైలాగ్ వాడాకుండా ఉండాల్సింది. ఆ డైలాగ్కు నేను సారీ చెబుతున్నా. కానీ మిగతా డైలాగ్స్ మాత్రం ఈ సినిమాకు ఉండాల్సిందే.' అని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంపై మాట్లాడుతూ.. 'ఇప్పటికీ థియేటర్లకు అరవైశాతం ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. ఇది సినిమాలో పాత్రలా కాకుండా వారి లైఫ్లో జరిగిన సంఘటన భావిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మాయిని ఆనంద్ తిడుతుంటే.. దానికి విజిల్స్ పడుతున్నాయి. కానీ ఆనంద్ను తిడుతుంటే.. విజిల్స్ పడాల్సిన చోట పిన్డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇలాంటివీ కొన్ని నాకు షాక్ కలిగించాయి. ఒక అమ్మాయి తప్పు చేసిన విషయం లవర్కి తెలిస్తే వయోలెన్స్లోకి వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్ సోసైటీలోకి వెళ్లకూడదనే పరిస్థితిని తగినట్లు మార్చా. ఆల్కహాల్, సిట్యువేషన్స్తో అమ్మాయిని కార్నర్ చేసి.. తప్పులు చేయడానికి కారణమైందనే పాయింట్ను హైలెట్ చేశా. వైష్ణవి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశా. ' అని అన్నారు. (ఇది చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) -
బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్యను ప్రధానంగా చూపిస్తూ దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) ఆమె నటనకు యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమా చూసిన వారు సినిమాలోని ఆమె పాత్రను అంత దారుణంగా తిడుతుంటే. ఆనంద్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా విరాజ్ అశ్విన్ కూడా మెప్పించాడు. ఇంతలా ఆకట్టుకున్న వీరందరికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..? అంటూ నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్తో బేబీ సినిమాను తెరకెక్కించారని టాక్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే రూ. 50కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ఇందులో లీడ్ రోల్ చేసిన ఆనంద్ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. యూత్ గుండెలపై బలంగా తన మార్క్ను వేసిన హీరోయిన వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యునరేషన్గా ఇచ్చారని టాక్. విరాజ్ అశ్విన్కు రూ.20 లక్షలు ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ) ముఖ్యంగా ఇందులో వైష్ణవి ఫైనాన్సియల్గా కూడా చాలా ఇబ్బందులు పడిందని డైరెక్టర్ సాయి రాజేష్ సినిమా ప్రమోషన్స్ టైమ్లో చెప్పాడు. దీంతో సినిమా బజ్ తగ్గాక మరికొంత రెమ్యునరేషన్గా వైష్ణవికి ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కాస్త పక్కనపెడితే తను ఇదే సంస్థతో మరో రెండు సినిమాలు చేయనున్నది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు కూడా. మరోవైపు గీతా ఆర్ట్స్లో కూడా ఓ సినిమా ఛాన్స్ రానున్నదని టాక్. -
తెలుగు అమ్మాయిలకు.. ఇదేనా రిక్వెస్ట్..!
-
స్టేజ్ పై పుష్ప 2 డైలాగ్తో దుమ్ము దులిపిన బన్నీ..
-
‘బేబీ’ థ్యాంక్స్ మీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
సినిమా బాగుంటే ఎందుకు చూడరు
‘‘7/జి బృందావన కాలనీ, అర్జున్ రెడ్డి’ సినిమాలు ప్రేమలోని బాధను చూపిస్తాయి. అలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం. అదే కోవలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘బేబి’ సినిమాని అద్భుతంగా తీశారు సాయిరాజేష్’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. ఎస్కేఎన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘బేబి అప్రిషియేషన్ మీట్’కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను చూడరు అంటుంటారు. కానీ అది అబద్ధం.. సినిమా బాగుంటే ఎందుకు చూడరు? సాయి రాజేష్గారు చాలా బాగా తీశారు. ఆయన రాసిన కథ విధానం ఇంకా బాగా నచ్చింది’’ అన్నారు. -
ఆ డైరెక్టరా? అంటూ ఓ హీరో 'బేబీ' కథే వినలేదు: సాయి రాజేష్
‘‘బేబి’కి నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే నమ్మకం ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో? అనే భయం కూడా ఉండేది. ఫ్లాప్ అయినా సంగీతం, కెమెరా, నటీనటులు.. ఇలా అందరికీ పేరు వస్తుంది.. కానీ నా కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా రిస్క్ చేసి ‘బేబి’ చేశాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్లో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. బేబీ’కి ఆనంద్ కంటే ముందు ముగ్గురు హీరోలను అనుకున్నామని ఆయన చెప్పారు. అందులో ఓ హీరోని కలిశాక హ్యాండిల్ చేయలేనేమో అని భయపడి వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. దీంతో మరో హీరోకి కథ చెప్పడం కోసం నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేస్తే ‘సాయిరాజేశ్ దర్శకత్వం అయితే చేయనని ఓపెన్గానే అన్నట్లు పేర్కొన్నాడు. ‘హృదయం కాలేయం’ సినిమాతో తనపై పడిన ముద్ర అలాంటిదని చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే ‘బేబి’ జాతకం మారిపోయింది. ఆ రోజంతా చాలా బాధపడ్డానని, ఆరోజు నిద్రకూడా పట్టలేదని తెలిపాడు. నిజానికి ‘బేబి’తో పోలిస్తే 'హృదయ కాలేయం'లాంటి సినిమా చేయడమే కష్టమని సాయిరాజేశ్ చెప్పాడు. -
ప్రతి సీన్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపించింది: సుకుమార్ ప్రశంసలు
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన ట్రాయాంగిల్ లవ్స్టోరీ బేబీ. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గేట్లేదు. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వ వహించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంర్ల పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం అభినందించారు. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!) సుకుమార్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'చాలా కాలం తర్వాత ఓ అసాధారణమైన రచనను చూశా. కచ్చితంగా ఈ సినిమా కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపించింది. సినిమాలోని పాత్రల తరహాలో సిట్యుయేషన్స్ ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. మంచి కథను అందించిన సాయి రాజేశ్కు నా వందనాలు. ఇలాంటి సంప్రదాయేతర సినిమాని సాధికారత కల్పించినందుకు ఎస్కెఎన్, మారుతీలను అభినందిస్తున్నా. వైష్ణవి ఇప్పటివరకు చేసిన ఐకానిక్ పాత్రలలో ఇది ఒకటి. వైష్ణవి చైతన్య తన పాత్రకు ఊపిరి పోసింది. ఆనంద్ చాలా తెలివైనవాడు. అతను తన పాత్రలో లీనమైపోయాడు. విరాజ్ తన మార్కు చూపించాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్. బేబీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనల.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బన్నీ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!) View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో 'బేబీ' సినిమా మానియా ఏ మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా సినిమా బాగుంటేనే వీకెండ్లో థియేటర్లు ఫుల్ అవడం అంతంతమాత్రమే.. అలాంటిది ఈ కల్ట్ లవ్ స్టోరీ సినిమా దెబ్బ యూత్ గుండెలపైన డైరెక్ట్గా కొట్టడంతో సోమవారం కూడా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా విజయంతో చాలా మంది లైమ్లైట్లోకి వచ్చారు. (ఇదీ చదవండి: బిగ్బాస్లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్,మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్లకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలతో ఇండస్ట్రీలో ఉన్న హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్లకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఇలా వీరందరికీ బేబీ సినిమా ఊహించలనేంత పేరును తీసుకొచ్చింది. కానీ అందరూ ఆ బేబీ (వైష్ణవి) గురించే కాకుండా హీరోయిన్ పక్కన నటించిన మరో అమ్మాయి గురించి కూడా ఇంటర్నెట్లో నెటిజన్లు వెతుకుతున్నారు. ఇంతకు ఆమె పేరే 'కుసుమ డేగలమర్రి'. తనకు ఇదే మొదటి సినిమా కానీ.. ఇప్పటికే యూట్యూబ్ కోసం పలు షార్ట్ ఫిలిమ్స్లో కుసుమ నటించింది. అందులో ఆర్య-3 ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తనకు ఇన్స్టాగ్రామ్లో భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. మొదట సోషల్ మీడియా ద్వారానే వారి టాలెంట్ చూపించుకుని తర్వాత సినిమాల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు కుసుమ కూడా అదే బాటలో పయనిస్తుంది. తనకు అందంతో పాటు టాలెంట్లో కూడా ఏ మాత్రం తీసిపోని కుసుమ సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. బేబీ సినిమాలో పల్లెటూరి పిల్లాల నటించిన కుసుమ ట్రెండీ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బేబీ సినిమా తెచ్చిన ఫేమ్తో తనకు మరిన్ని సినిమా అవకాశాలు రానున్నాయని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kusuma Degalamari (@kusuma_degalamari) (ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..) -
వైష్ణవి చైతన్య ఇకనుంచి నీ టైం స్టార్ట్ అయ్యింది.. జాగ్రత్త..
-
వైష్ణవిని గట్టిగ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను..
-
అమ్మ నాన్న మీకు కచ్చితంగా చెడ్డ పేరు తీసుకురాను..
-
వైష్ణవి వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది
-
డైరక్టర్ మాటలకు ఏడ్చేసిన వైష్ణవి చైతన్య
-
బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
SKN స్పీచ్ తో దద్దరిల్లిన స్టేజ్
-
సెల్ఫీ కోసం విజయ్ ఫ్యాన్ ఎం చేసాడో చూడండి
-
'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?
Baby Movie Director Details: ప్రస్తుతం ఎవరిని కదిపినా డిస్కషన్ అంతా 'బేబీ' గురించే. ఎందుకంటే రియలస్టిక్ లవ్స్టోరీతో తీసిన ఓ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా కాలమైపోయింది. సరిగ్గా ఈ పాయింట్నే క్యాష్ చేసుకున్న 'బేబీ'.. యూత్కి పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ఇది దర్శకుడి రియల్ లైఫ్ ప్రేమకథేనా అని సందేహపడ్డారు. ఇప్పుడు ఆ ప్రశలన్నింటిపై స్వయంగా ఆ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు. తెలిసిన కథే 'బేబీ' సినిమాలోని కథ కొత్తదేం కాదు. బస్తీలో పెరిగిన ఓ అమ్మాయి, తన ఇంటికి ఎదురుగా ఉన్న అబ్బాయిని స్కూల్లో ఉన్నప్పుడు లవ్ చేస్తుంది. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత మరో అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్తుంది. ఏకంగా ఆ విషయంలో అడ్వాన్స్ అవుతుంది. ఇది మొదటి బాయ్ ఫ్రెండ్కి తెలిసిపోతుంది. దీంతో గొడవ జరుగుతుంది. చివరకు ఏమైందనేది అసలు స్టోరీ. రోజూ పేపర్, న్యూస్లో చదివే వార్తలానే ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు చాలామందికి అనిపించింది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) అదే కారణం 'బేబీ' సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించగా అందులో దర్శకుడు సాయి రాజేశ్కు.. అసలు ఈ సినిమాకు ప్రేరణ ఏంటనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. '20 ఏళ్ల క్రితం నేను లవ్ చేశాను. ఓ 8 నెలలపాటు చాలా బాధ, కఠినమైన పరిస్థితులు అనుభవించాను. ఇది జరిగి చాలా కాలమైపోయినప్పటికీ ఆ బాధ అలానే ఉండిపోయింది. దాన్ని స్క్రీన్పై చూపిద్దామనే ఆలోచనతోనే ఈ స్టోరీ రాసుకున్నాను' అని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ నాది కాదు 'బేబీ'లో ఆనంద్ దేవరకొండ పాత్ర మీదేనా అనే ప్రశ్నకు డైరెక్టర్ సాయి రాజేశ్ సమాధానమిచ్చారు. 'ఆనంద్ పాత్ర నేను కాదు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. నా ఫస్ట్ లవ్ నా భార్యనే. కాకపోతే లవ్లో ఉన్నప్పుడు 8 నెలలు బాధ అనుభవించాను. ఆమెని ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడుందో తెలియకపోయేసరికి తెగ ఇబ్బంది పడ్డాను. ప్రేమలో నేను సక్సెస్ అయినా.. నా పిల్లలు ఎక్కడ లవ్ చేస్తారో అనే భయముంది. వాళ్లు నాలా బాధపడకూడదనే ఫీలింగ్ లోలోపల ఉంటుంది. ఇదంతా నేను స్క్రీన్పై చూపించాను' అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: లిప్లాక్,బోల్డ్ సీన్స్పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) -
ఈ అన్నదమ్ములను గుర్తుపట్టారా? ఇద్దరూ హీరోలే!
ఈ ఫోటోలో ఉన్న ఇద్దర్ని గుర్తుపట్టారా? వీరిద్దరూ టాలీవుడ్ హీరోలే! ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని కులాసాగా నవ్వులు చిందిస్తూ ఫోటో దిగిన వీళ్లు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉన్నారు. పెద్దోడు సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ నేడు టాప్ హీరో స్థాయికి వస్తే చిన్నోడు డైరెక్ట్ హీరోగా సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. ఇటీవలి కాలంలో బాలీవుడ్లో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలన్న అన్న కల అడియాసలు కాగా తమ్ముడు మాత్రం ఓ మంచి ప్రేమకథతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఈ అన్నదమ్ములెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. పొడుగ్గా ఉన్న పిల్లోడు విజయ్ దేవరకొండ కాగా తన పక్కన ఉన్న చిన్నోడు ఆనంద్ దేవరకొండ. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన విజయ్ దేవరకొండకు ఎవడే సుబ్రమణ్యం సినిమాలో మంచి రోల్ పడింది. ఈ పాత్ర బాగా క్లిక్ అవ్వడంతో విజయ్కు గుర్తింపు లభించింది. తర్వాత పెళ్లి చూపులుతో సినిమాతో హీరోగా క్రేజ్ రాగా, అర్జున్ రెడ్డితో తన లెవలే మారిపోయింది. ఈ సినిమాతో రౌడీ హీరోగా మారిన విజయ్.. గీత గోవిందంతో మరో హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత వరుస అపజయాలు అతడిని వెంటాడాయి. లైగర్తో బాలీవుడ్లో అడుగుపెట్టాలన్న ఆశ కూడా నెరవేరలేదు. ప్రస్తుతం ఇతడు సమంతతో ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విషయానికి వస్తే.. దొరసాని చిత్రంతో వెండితెరపై హీరోగా రంగప్రవేశం చేశాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే.. ఇలా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఇతడు తాజాగా బేబీ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. మొదట్లో అన్న పేరును నిలబెట్టాలంటూ ఆనంద్పై ఒత్తిడి తెచ్చిన జనాలు.. ఇప్పుడు తమ్ముడిని చూసి కథలు సెలక్ట్ చేసుకో, సక్సెస్ సాధించుకో అని విజయ్కు హితబోధ చేస్తున్నారు. ఏదేమైనా ఈ అన్నదమ్ములిద్దరికీ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. చదవండి: బిగ్బాస్లోకి కి ఈ జంట ఎంట్రీ ఖాయం.. ఎవరంటే? హిట్ కోసం నిరీక్షణ.. ఈసారైనా హీరోయిన్కు సక్సెస్ సొంతమవుతుందా? -
లిప్లాక్,బోల్డ్ సీన్స్పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్
ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా జులై 14న విడుదలై సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. మొదట్లో టిక్టాక్, యూట్యూబ్ వీడియోలతో జర్ని ప్రారంభంచి వెండితెరపైన మెరిసింది. ఈ సినిమా వల్ల హీరోయిన్ వైష్ణవికి మంచి గుర్తింపు దక్కింది. తను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్ల గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) ఎక్కడో ఓ బస్తీ నుంచి టిక్టాక్ వీడియోలు చేసుకొంటూ ఇంత దూరం వచ్చానని వైష్ణవి చెప్పింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నిలబడగలననే ధైర్యం నాగతం నాకు ఇచ్చేసింది. ఎందుకంటే ఈ ప్రయాణానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీంతో ఎన్నో ఇబ్బందులు కూడా చూశానని చెప్పింది. నిజానికి హీరోయిన్ అవ్వాలనో, ఏదేదో చేసేయాలనో తనకు లేదని, సినిమాల్లోకి రావాలి, స్థిరపడాలి.. అంతే తన ఆశ అంటూ పేర్కొంది. కానీ బేబీ అంతకు మించి గుర్తింపు ఇచ్చిందని తెలిపింది. బోల్డ్ సీన్స్ గురించి 'ఒక సినిమాలో రొమాన్స్, లిప్లాక్ సీన్లలో నటించడం చాలా కష్టం. కానీ నా అదృష్టం ఏమిటంటే బేబీ టీమ్ నన్ను కంఫర్ట్గా చూసుకున్నారు. ఆ సీన్ చేసే రోజు సెట్లో చాలా తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ రోజు విరాజ్ అశ్విన్ కూడా ఇలా అన్నాడు 'సినిమా కోసం ఇంత వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో అన్నాడు. అంతేకాకుండా ఇదీ జస్ట్.. మనం నటిస్తున్నామంతే' అంటూ ధైర్యాన్ని నింపాడు. ఆ సమయంలో నేనూ కూడా సన్నివేశంలో భాగంగానే చూశాను. సినిమా చూశాక ఇంట్లో వాళ్లూ కూడా అలాగే ఆలోచించారు. కానీ సినిమాను పూర్తిగా చూసిన తర్వాత ఆ లిప్లాక్, బోల్డ్ సీన్స్ గుర్తుండవు. ఇందులో అంతకు మించిన భావోద్వేగాలు చాలా ఉన్నాయి. 'అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం') -
Baby Movie Memes: 'బేబీ'కి ఫిదా అయిన యూత్.. ఈ మీమ్స్ చూస్తే ఏం క్రియేటివిటీరా అంటారు
'మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అని 'బేబీ' సినిమా దర్శకుడు సాయి రాజేష్ ముందే చెప్పాడు. అలాగే ఈ కథను కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు జులై 14న విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే బేబీ కథ యూత్ గుండెల్ని బలంగా తాకింది. ఇందులో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకుపోయారని చెప్పవచ్చు. 'బేబీ' కథలో మాధుర్యంతో పాటు విషాదం కూడా ఉంది. హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్లో ఫీల్ గుడ్, ఎమోషనల్ టచ్ ఉందని నిరూపించిన సినిమా ఇది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) సినిమా చూస్తూ కథకు కనెక్ట్ అయిన యూత్ వైష్ణవి పాత్రను దారుణంగా తిట్టుకుంటున్నారు. అంతలా ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించింది. చివరకు బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ కూడా వైష్ణవిని తిట్టకండి అని, ఇదీ కథలో భాగమే అంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ సినిమాపై పలు ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఉపేంద్ర హీరోగా నటించిన ఓ సినిమాలోని సీన్ అందరినీ నవిస్తోంది. ఈ మీమ్స్ మీరు కూడా చూసేయండి. Just Imagine Upendra As Hero In #BabyTheMovie 😆😂 pic.twitter.com/Ovf9lIiajP — PawanKalyan Devote (@SidduOfficial) July 15, 2023 My committed friend after watching Baby Movie 🚶🏻♂️ #BabyTheMovie pic.twitter.com/iizZdj6vpz — crusher 🙂💦 (@crusherrrrrrrr) July 15, 2023 Baby Review in one line :#BabyTheMovie pic.twitter.com/9wPFOKQ5v2 — SalaarMania™ (@Salaarmania28) July 15, 2023 #BabyTheMovie Singles while watching movie :🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣🤣 pic.twitter.com/Y4li8x1kcU — VenkyCHARAN (@RC_diehard_fan) July 16, 2023 #BabyTheMovie Thank uuu anna @sairazesh pic.twitter.com/jcCHJU9lTc — PESSIMIST 🥀🏃 (@ArjunPalwai_) July 14, 2023 Baby Review in one line :#BabyTheMovie pic.twitter.com/5tvt5qam4K — 🔸సిద్ధార్థ _రాయ్ 💫 #OG (@Siddu4PSPK) July 14, 2023 #BabyTheMovie Girls while watching baby movie 🌚🌝 pic.twitter.com/og2BlK11SB — Rajinikanth (@NameisNaniiiii) July 15, 2023 #BabyTheMovie in 30 seconds: pic.twitter.com/LzlDpxi5cW — చాండ్లర్😳 (@chandler999999) July 15, 2023 After watching #BabyTheMovie Singles be like : 👇#BabyMovie pic.twitter.com/R1YNzn0VU5 — ʇɹǝʌoɹʇuI (@the_introwert) July 15, 2023 Babyyyyyyyyy 🏃🏃♀️#BabyTheMovie #BabyMovie #AnandDeverakonda #VaishnaviChaitanya pic.twitter.com/Db3HpRjvhQ — Addicted To Memes (@Addictedtomemez) July 15, 2023 #BabyTheMovie Plot pic.twitter.com/IrPFHY8t18 — .......🕊️ (@SK_Tarock) July 14, 2023 -
అందరూ వైష్ణవినే తిడుతున్నారు: నిర్మాత
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్టాక్తో దూసుకుపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి తన యాక్టింగ్తో కుర్రాళ్ల గుండెలపై బలంగానే కొట్టింది. ఓ రకంగా యూత్ మదిలో వైష్ణవిగా ఎప్పటికీ చెరగిన ముద్ర వేసిందని చెప్పవచ్చు. తాజాగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ను ఏర్పాటు చేసింది. అక్కడ బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవం డి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ) బేబీ సినిమా చూసిన ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వస్తే.. ఈ సినిమా తీసుకున్న బయ్యర్లంతా నవ్వుతూ వచ్చారని ఆయన అన్నారు. సినిమా నిడివి ఎక్కువుగా ఉందని మొదట్లో భావించినా ఆడియన్స్ మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి కథలో బలాన్ని చూశారని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. కథలోని పాత్రల భావోద్వేగాలు అర్థం అయ్యేలా చెప్పాలనే నిడివి విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్ ఆ నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. బేబి యూనిట్ను నమ్మి ఆనంద్, వైష్ణవి, విరాజ్లు ఈ సినిమాకు కమిట్ అయ్యారు. వారు ఈ సినిమా పూర్తి అయ్యే వరకు మరో చిత్రాన్ని చేయకుండా ఉండిపోయారని ఆయన తెలిపారు. సినిమా చూసిన వారు వైష్ణవిని తిడుతున్నారు. నిజానికి వైష్ణవి చాలా మంచి అమ్మాయి. ఈ సినిమాలో అది క్యారెక్టర్ మాత్రమేనని గ్రహించాలని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం తను రెండేళ్లు కష్టపడింది. తనకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే అయినా సినిమాపై ప్యాషన్తో పనిచేసిందని నిర్మాత ఎస్కేఎన్ పేర్కొన్నారు. కథ ఆడియన్స్కు కనెక్ట్ అయింది కాబట్టే వైష్ణవి అనే పాత్రను మాత్రమే తిడుతున్నారని అలాంటివి పట్టించుకోకూడదని ఆయన వైష్ణవితో చెప్పారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) -
దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ట్రైయాంగిల్ లవ్స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి యువత బాగా కలెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజు భాకీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం రూ.7.1 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బేబీ మూవీ రివ్యూ) ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం -రూ. 2.3 కోట్లు ►సీడెడ్- రూ.54.7 లక్షలు ►ఈస్ట్: రూ.40.5 లక్షలు ►వెస్ట్: 21.6 లక్షలు ►వైజాగ్: రూ.80.08లక్షలు ►కృష్ణా: రూ.34.6లక్షలు ►గుంటూరు: రూ.29.3లక్షలు ►నెల్లూరు: రూ.17.83లక్షలు ►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు ►ఓవర్సీస్: 1.74 కోట్లు ►మొత్తం : 7.1 కోట్లు Audience Love for CULT BLOCKBUSTER #BabyTheMovie has grossed a whopping 7.1CR Worldwide on DAY 1 💥 Book your tickets today 👇 🎟️ https://t.co/IUpZAiAOvH#CultBlockbusterBaby pic.twitter.com/YCU7ygrT32 — GSK Media (@GskMedia_PR) July 15, 2023 -
Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ
టైటిల్: బేబీ నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, వైవా హర్ష, ప్రభావతి లిరీష తదితరులు నిర్మాణ సంస్థ: మాస్ మూవీ మేకర్స్ నిర్మాత: ఎస్కేఎన్ దర్శకత్వం: సాయి రాజేశ్ సంగీతం: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్ రెడ్డి విడుదల తేది: జులై 14, 2023 బేబీ కథేంటంటే.. ఆనంద్(ఆనంద్ దేవరకొండ) ఓ బస్తీ యువకుడు. అతని ఎదురింటిలో ఉండే అమ్మాయి వైష్ణవి(వైష్ణవి చైతన్య) అతన్ని ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైష్ణవిని ఇష్టపడుతుంది. వీరి ప్రేమ స్కూల్ డేస్లో మొదలవుతుంది. అయితే పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి బీటెక్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ వైష్ణవికి ఓ ధనవంతుడి కొడుకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. మొదట్లో ఫ్రెండ్స్గా దగ్గరవుతారు. ఆ తర్వాత పబ్బులో రొమాన్స్ చేస్తారు. ఓ కారణంగా 31 రోజుల పాటు డేటింగ్ కూడా చేస్తారు. ఈ విషయం ఆనంద్కు తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇద్దరిలో వైష్ణవి ప్రేమించిదెవరిని? బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవికి పబ్ కల్చర్ ఎలా అలవాటు పడింది? వైష్ణవి చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది? వైష్ణవి, ఆనంద్, విరాజ్ల ట్రైయాంగిల్ లవ్స్టోరికి ఎలాంటి ముగింపు పడింది? అనేది తెలియాలంటే బేబీ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ తరం యువతీయువకుల్లో చాలా మంది ఈజీగా ప్రేమలో పడుతున్నారు. అయితే ఆ ప్రేమ ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్లో ఉంటూ చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా బేబీ. ప్రస్తుతం జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సాయి రాజేష్. పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ? తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు ఎక్కడికి దారితీస్తున్నాయి? మన చుట్టూ ఉండే స్నేహితులు, పరిస్థితుల ప్రభావం తెలియకుండానే మనపై ఎలా పడతాయి? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో పాటు ప్రతి వ్యక్తి తొలి ప్రేమను మర్చిపోలేరనే విషయాన్ని అంతర్లీనంగా చూపించారు. బేబీ కథ కొత్తది అని చెప్పలేం. నిత్యం మనం వార్తల్లో చూస్తున్న, వింటున్న సంఘటనలే సినిమాలో కనిపిస్తాయి. ఈ తరహా ట్రైయాంగిల్ లవ్స్టోరీలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు కానీ కాస్త భిన్నంగా కథనం సాగుతుంది. ఆనంద్ విషాదకరమైన జీవితానికి సంబంధించిన సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత స్కూల్డేస్ లవ్స్టోరీ చాలా సహజంగా హృదయాలను హత్తుకునేలా సాగుతుంది. ఆనంద్ పదో తరగతి ఫెయిల్ అవ్వడం.. వైష్ణవి పై చదువుల కోసం ఓ పెద్ద కాలేజీలో చేరడంతో కథ మలుపు తీసుకుంటుంది. బస్తీ నుంచి వచ్చిన వైష్ణవి సిటీ కల్చర్కి అలవాటు పడడం, తోటి స్నేహితులను చూసి తన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం.. అది ఆనంద్కు నచ్చకపోవడం..ఇద్దరి మధ్య గొడవ.. ప్రతి సీన్ చాలా సహజంగా సాగుతుంది. విరాజ్ పరిచయంతో ఈ ప్రేమకథ ట్రయాంగిల్ లవ్స్టోరీగా మారుతుంది. ఇంటర్వెల్ ముందు మద్యం మత్తులో ఆనంద్కి వైష్ణవి కాల్ చేసి అమ్మాయిల గురించి చెప్పే సంభాషణలు అదిరిపోతాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ భావోధ్వేగభరితంగా ఉంటుంది. ఓ బూతు పదాన్ని హీరోయిన్ చేత పదే పదే అనిపించడం, విరాజ్తో బెడ్రూమ్ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ ఈ తరం యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ చాలా కొత్తగా కనిపించాడు. భగ్న ప్రేమికుడు, ఆటో డ్రైవర్ ఆనంద్ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్తో ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక సంపన్న కుటుంబానికి చెందిన విరాజ్ పాత్రకి విరాజ్ అశ్విన్ న్యాయం చేశాడు. వైష్ణవి చైతన్యకు బెస్ట్ మూవీ ఇది. తొలి సినిమాతోనే నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించింది. బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గాళ్గా లుక్స్లోనే కాదు నటనలోనే వేరియేషన్ చూపించి ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఈమె పాత్ర చుట్టే నడుస్తుంది. ఇకవైపు అందాలను ఒలకబోస్తూనే, కావాల్సిన చోట, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కటి నటనను కనబరిచింది. హీరోయిన్ తండ్రిగా నాగబాబు, హీరో స్నేహితులుగా హర్ష, సాత్విక్ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ బుల్గానిన్ సంగీతం. మంచి పాటలతో పాటు అదిరిపోయే బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. సాయి రాజేశ్ సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Baby Movie Actors Photos: ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను చిత్రబృందం నిర్వహించింది. అయితే ఈ వేడుకకు హాజరైన బేబీ హీరోయిన్ వైష్ణవి ఎమోషనల్ అయ్యారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ నటిగా తనకు పునర్జన్మనిచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. ఆమె హీరోయిన్గా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. (ఇది చదవండి: అందుకే సింగిల్గా ఉంటున్నా..పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్) వైష్ణవి మాట్లాడుతూ..'యూట్యూబ్ వీడియోలు చేసుకునే నాకు ‘బేబీ’ సినిమాలో అవకాశమిచ్చారు. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేశ్. మెయిన్ లీడ్గా చేయాలనేదే నా లక్ష్యం. కానీ మధ్యలో సహాయ నటిగా చేశా. సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారా. ఈ అమ్మాయి యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి సినిమాలో మెయిన్ లీడ్ చేయలేదని చాలామంది అన్నారు. కానీ బేబీలో ఛాన్స్ రాగానే లీడ్ రోల్ చేయగలనా అని భయపడ్డా. కానీ డైరెక్టర్ రాజేశ్ నాకు ధైర్యాన్నిచ్చారు. ఈ విషయంలో నాకు మరో జన్మనిచ్చారు. అందువల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా. నిర్మాత ఎస్కేఎన్ కూడా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు.'కంటతడి పెట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (ఇది చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
అమ్మాయిలతో మాట్లాడ్డానికి రెండేళ్లు పట్టింది
‘ప్రేమలో సంతోషం, బాధ ఉంటాయి. ఆ భావోద్వేగాలను ‘బేబీ’ సినిమాలో బాగా చూపించాం. ట్రైలర్లో చూపించిన ఎమోషన్ కంటే సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అని హీరో ఆనంద్ దేవరకొండ అన్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటించిన చిత్రం ‘బేబీ’. ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ఇప్పటివరకు నేను పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ, మొదటిసారి వైడ్ రేంజ్ ఆడియన్స్ని పలకరించే ‘బేబీ’తో వస్తున్నాను. ఈ సినిమాకి యూత్, మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ ΄ాత్రను చేయగలననే నమ్మకాన్ని సాయి రాజేష్ అన్న నాలో నిం΄ాడు. నా కెరీర్లో బేబీ ఎప్పటికీ నిలిచి΄ోతుంది. ► ‘బేబీ’కి విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు. మా అన్నకి (విజయ్ దేవరకొండ) ‘టాక్సీవాలా’ లాంటి మంచి హిట్ ఇచ్చారు ఎస్కేఎన్గారు.. ఇప్పుడు నాకు ‘బేబీ’తో హిట్ ఇవ్వనున్నారు. ► ఎవరి జీవితంలో అయినా తొలి ప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఎప్పటికీ గుర్తుంటుంది. నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్లో చదివాను. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది. ► ‘ప్రేమ దేశం’ సినిమాకు ‘బేబీ’కి అస్సలు ΄ోలికలుండవు. ఫీల్ వైజ్ చూస్తే ‘ప్రేమిస్తే, 7/జీ బృందావన కాలనీ’ స్టైల్లో ఉంటుంది. ‘బేబీ’లోకి ముందుగా నేను వచ్చాను. ఆ తర్వాత వైష్ణవి, విరాజ్లు వచ్చారు. ముగ్గురి ΄ాత్రలకు సమ ్ర΄ాధాన్యం ఉంటుంది. నా సినిమాల కథ గురించి మా అన్నతో చర్చించను.. కానీ ఫలానా డైరెక్టర్, ఫలానా జానర్లో సినిమా అని చెబుతాను. అయితే తుది నిర్ణయాన్ని మా నాన్న, అన్న నాకే వదిలేస్తారు. ప్రస్తుతం ‘గం గం గణేశా’ సినిమా చేస్తున్నాను. -
అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది: ఆనంద్ దేవరకొండ
పదో తరగతి వరకు నా చదువంతా బాయ్స్ బోర్డింగ్ స్కూల్లోనే జరిగింది. అమ్మాయిలతో పరిచయం ఉండేది కాదు. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడాలంటే భయమేసేది. వారితో మాట్లాడేందుకు నాకు రెండేళ్లు పట్టింది. అందరిలాగే నాకు కూడా తొలి ప్రేమ మర్చిపోలేని తీపి జ్ఞాపకం. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. తొలి ప్రేమ అనేది పైపైన అందాన్ని చూసి పుడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ప్రేమ అర్థాన్ని తెలుసుకుంటారు. దాన్నే బేబీ సినిమాలో చక్కగా చూపించాం. ► ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ మొదటి సారి ఓ వైడ్ రేంజ్ ఆడియెన్స్ను పలకరించే సినిమాతో వస్తున్నాం.. ప్రీమియర్ షోలు కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి. నా కెరీర్లో బేబీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ► ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్ను బాగా చూపించాం. వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ట్రైలర్లో చూపించిన ఎమోషన్ కంటే.. సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ► ప్రేమ అనంతమైంది. ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ప్రేమను సాయి రాజేష్ అన్న తన కోణంలోంచి చూపించారు. ఆయన రైటింగ్ కొత్తగా ఉంటుంది. ఆయన కోణంలోంచి ప్రేమను చూపించిన, చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు ప్రేమలో ఉన్నా, విడిపోతోన్నారని అన్నా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ ముఖ్యం. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు. ► ప్రేమ దేశం సినిమాకు బేబీ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. ఫీల్ వైజ్ చూస్తే మాత్రం ప్రేమిస్తే, 7/జీ బృంధావన కాలనీ స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలోకి ముందుగా నేను వచ్చాను. ఆ తరువాత వైష్ణవి, విరాజ్లు వచ్చారు. ► అర్జున్ రెడ్డి అనేది అందరూ రిఫర్ చేసే పాప్ కల్చర్లా మారింది. బేబీ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. మేం దాన్ని చూసి బేబీ అని పెట్టలేదు. బేబీ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఓ సీన్లో వివరిస్తాం. అందరికీ ఈజీగా, క్యాచీగా ఉంటుందని బేబీ అని పెట్టాం. ► కథ చెప్పినప్పుడే కొన్ని సవాళ్లుంటాయని సాయి రాజేష్ అన్న చెప్పారు. నెరేషన్ ఇచ్చి, ట్రాక్స్ పంపించి.. కథ గురించి బాగా ఫీడింగ్ చేశారు. ప్రతీ సీన్, ప్రతీ ఎక్స్ప్రెషన్స్ గురించి వివరించి చెబుతుంటారు. బాల్ రెడ్డి, విజయ్ బుల్గానిన్ నుంచి కూడా అందుకే బెస్ట్ వర్క్ వచ్చింది. ► స్కూల్ పిల్లాడిలా కనిపించేందుకు కష్టపడలేదు. కానీ డబ్బింగ్ చెప్పే టైంలోనే కష్టపడాల్సి వచ్చింది. పిల్లాడిలా అనిపించేందుకు వాయిస్ తగ్గించి మాట్లాడాల్సి వచ్చింది. గొంతులో ఆ అమాయకత్వాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ► వైష్ణవీ చైతన్య అద్భుతంగా నటించింది. తెలుగులో మంచి నటిగా ఎదుగుతుంది. సీన్లు ఎలా చేయాలో మేం ఇద్దరం చర్చించుకునేవాళ్లం. ఆమెతో నటించడాన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆమెతో నటించడం ఎంతో ఎంజాయ్ చేశాను. ఇంత చిన్న వయసులో, ఇంత మంచి పాత్రను, ఇంత బాగా నటించడం అంటే మామూలు విషయం కాదు. ► ఈ జానర్లో సినిమా చేస్తున్నా.. ఆ దర్శకుడితో చేస్తున్నాను.. అని అన్నకి చెబుతాను. కొన్ని సార్లు సినాప్సిస్ పంపిస్తాను. కానీ ఫైనల్ కాల్ మాత్రం నాదే. అది చేయమని, ఇది వద్దు అని అన్న, నాన్న ఎప్పుడూ చెప్పరు. విజయ్ దారి వేరు. నా దారి వేరు. మా ఇద్దరినీ పోల్చి చూడకూడదు. ► నాకు ఇంత వరకు థియేట్రికల్ హిట్ లేదు. మా సినిమా బజ్ చూసి, ట్రైలర్ రియాక్షన్ చూసి, పాటలకు వచ్చి చూసిన రెస్పాన్స్తో ప్రీమియర్స్ పెట్టాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ కంటే ముందే ఈ కథను విన్నాను. ► బేబీ సినిమాకు యూత్ అంతా కూడా కనెక్ట్ అవుతారు. మాస్ జనాలకు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మాస్కు కనెక్ట్ అవుతుంది. ఈ పాత్ర కోసం ఆటో నడపడం నేర్చుకున్నాను. ► కొత్త సినిమా విషయాలకొస్తే.. గం గం గణేశా అనే సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. క్రైమ్ జానర్లో ఉంటుంది. అందులో ఫైట్లు చేశాను. స్టెప్పులు కూడా వేశాను. ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. -
ఆడిషన్స్ కోసం చాలా కష్టపడ్డా.. 8 ఏళ్ల తర్వాత ‘బేబీ’ చాన్స్: వైష్ణవి చైతన్య
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు చాన్స్లు ఇవ్వరనే ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం అలా ఏం ఉండదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. ఆడిషన్స్ ఇవ్వడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. దాదాపు ఏనిమిదేళ్లు తర్వాత నాకు సినిమా చాన్స్ వచ్చింది. ‘బేబీ’మూవీ తర్వాత వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను’అని హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ , వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ పాత్ర వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కథ విని షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందని అనుకున్నాను. ఈ పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నా జీవితానికి ఇది చాలా గొప్ప అవకాశం. ► ప్రతీ యాక్టర్ అంతిమ లక్ష్యం సినిమానే. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నా చుట్టూ వాళ్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నా మీద చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు. ► బేబీ సినిమాలో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు. ► సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇది మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. ఇది ఎంతో సున్నితమైన పాత్ర. ► బస్తీ నుంచి కాలేజ్కి వచ్చిన అమ్మాయి ఎలా మారిపోయిందని చెప్పేందుకు ఈ కలర్ను ఓ మీటర్లా తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ అనే మీటర్లో చూపించలేదు. ఆ అమ్మాయి మీద ఏ విషయాలు ప్రభావితం చూపించాయి.ఎలా మారిపోయింది? అనే కోణంలోనే చూపించాం. ► షూటింగ్ కోసం సెట్లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ టేక్ చెప్పేసరికి మేం ముగ్గురం చర్చించుకుని రెడీగా ఉండేవాళ్లం. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్లో ఉన్న సీన్లే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. ► ఇప్పటి వరకు నేను ఏ కొత్త ప్రాజెక్ట్కు సైన్ చేయలేదు. నా ఫోకస్ మొత్తం బేబీ మీదే ఉంది. ఈ సినిమా వచ్చాక రెస్పాన్స్ చూడాలి. నేను ఏం చేయగలనో కూడా అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను. -
అన్నతో గొడవ? తమ్ముడి సినిమాకి మాత్రం విషెస్!
తెలుగు యాంకర్స్లో అనసూయ సమ్థింగ్ డిఫరెంట్. ఎందుకంటే టీవీ స్క్రీన్ పై సక్సెస్ అయినోళ్లు సినిమా స్క్రీన్ పై సక్సెస్ అయింది చాలా తక్కువ. కానీ ఈ కామెంట్ ని బ్రేక్ చేసిన వాళ్లలో అనసూయ ఉంటుంది. కామెడీ షో యాంకర్గా పేరు తెచ్చుకుని.. ఇప్పుడు సినిమాల్లో లీడ్, విలన్ తరహా రోల్స్ చేస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటుంది. సినిమాలతో బిజీ న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ.. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది. పెద్దగా పేరు రాలేదు. దీంతో మళ్లీ టీవీల్లోకి వచ్చేసింది. 'జబర్దస్త్' కామెడీ షోలో గ్లామర్ చూపించి, చాలా క్రేజ్ సంపాదించింది. అలా 'రంగస్థలం', 'పుష్ప', 'క్షణం' సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి, అద్భుతంగా నటించింది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బిజీగా ఉంది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) విజయ్తో గొడవ? యాక్టింగ్, గ్లామర్ పరంగా అనసూయని వంక పెట్టడానికి ఏముండదు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అప్పుడప్పుడు న్యూస్ అవుతూ ఉంటుంది. గతంలో 'అర్జున్ రెడ్డి' విడుదల సమయంలో ఈమె పలు కామెంట్స్ చేసింది. అప్పటినుంచి హీరో విజయ్ దేవరకొండపై ఏదో ఓ సందర్భంలో టీజ్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే అది పరోక్షంగానే ఉంటుంది. ఆనంద్కి విషెస్ విజయ్ దేవరకొండ గతంలో డబ్బులిచ్చి మరీ తనని ట్రోల్ చేయించాడని అనసూయ.. కొన్నాళ్ల ముందు చెప్పుకొచ్చింది. ఇలా రౌడీహీరోతో ఈమె వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'బేబి' సినిమాకి మాత్రం అనసూయ ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇది తనకు తెలిసిన వాళ్ల కథలా ఉందని ట్వీట్ చేసింది. దీంతో అనసూయ పోస్ట్ కాస్త వైరల్గా మారిపోయింది. (ఇదీ చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!) So late to the party.. but its better late than never.. love love luuuuurrrrvv the hard hitting lines and the originality to this trailer.. naaku telisina vaalla katha laage anipistundi.. can’t wait for it.. always proud of you @sairazesh garu!! ❤️🧿 https://t.co/sYIlezCN4v — Anasuya Bharadwaj (@anusuyakhasba) July 9, 2023 -
'బేబీ' సినిమా.. హీరో విరాజ్ ఫుల్ కాన్ఫిడెన్స్!
'అనగనగా ఓ ప్రేమ కథ'తో యంగ్ హీరో విరాజ్ అశ్విన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలి సినిమాలోనే నటనతో మెప్పించిన ఇతడు.. 'థ్యాంక్యూ బ్రదర్'తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఆదరణ దక్కించుకుంది. విరాజ్ తన షార్ట్ ఫిల్మ్ 'మనసనమహ'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్(513 అవార్డులు)గా ఇది గిన్నీస్ రికార్డ్ సాధించింది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడే విరాజ్ అశ్విన్. తాజాగా 'బేబీ' మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ'.. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్కి అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా తన కెరీర్కు టర్నింగ్ పాయింట్ అవుతుందని విరాజ్ అశ్విన్ భావిస్తున్నాడు. ట్రైలర్లో లవర్ బాయ్ తరహా పాత్రలో మెప్పించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. పాటల్లోనూ అద్భుతంగా నటించాడు. ట్రైలర్ లాంచ్లో "చాక్లెట్ బాయ్ లుక్స్" అని విరాజ్ అశ్విన్ను చిత్ర నిర్మాత ఎస్కేఎన్ ప్రశంసించారు. బేబీ ట్రైలర్ను చూస్తుంటే.. విరాజ్ అశ్విన్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే మరిన్నీ క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యే 'మాయపేటిక' సినిమాతో వచ్చాడు. త్వరలో 'బేబీ'తో రాబోతున్నాడు. మరో మూడు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విరాజ్ అశ్విన్ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. (ఇదీ చదవండి: క్లైమాక్స్కు చేరిన లవ్.. దర్శకుడిని పెళ్లాడిన సీరియల్ నటి) -
Baby Movie Promotions Photos: 'బేబీ' కోసం ఆటోలతో రెడీ అయిన యూనిట్ (ఫోటోలు)
-
చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్పై బేబమ్మ రియాక్షన్
విజయ్ దేవరకొండ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమా జులై 14న విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకుడు కాగ ఎస్కేఎన్ నిర్మాతగా ఉన్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైంది. ఇందులో హీరోయిన్ పాత్ర డీగ్లామర్ రోల్లో ఉంటుంది. దీంట్లో ఆమెను బేబమ్మ అని పిలుస్తారట. (ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్బాస్ 7 నుంచి పిలుపొచ్చిందన్న నచ్చావులే హీరోయిన్) ట్రైలర్ను చూసిన వారు నలుపు, తెలుపు శరీర రంగును ఉద్దేశించేలా తెరకెక్కిన ‘బేబీ’ లాంటి సినిమాలను ఇంకా చూడాలా అంటూ పలు విమర్శలు కూడా వచ్చాయి. చివరకు ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తన పేరును గ్లో అండ్ లవ్లీగా మార్చుకుంది. అలాంటిది ఈ సినిమా కథ ఏమిటంటూ పలు కామెంట్లు వచ్చాయి. దీనికి హీరో ఆనంద్ కూడా రియాక్ట్ అయి సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందామన్నాడు. అంతలా సినిమా విడుదలకు ముందే కొంతమేరకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఈ సినిమా తాజాగా చిత్ర యూనిట్తో ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగా 'బేబీ' సినిమా హీరోయిన్తో.. 'వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా' అని కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. దీంతో వైష్ణవికి ఫీజులు ఎగిరిపోయినంత పని అయింది. చివరకు ఏమనాలో తెలియకుండా కొద్దిసేపు అలాగే ఉండిపోతుంది. వెంటనే ఆ రిపోర్టర్ కలుగచేసుకుని ఈ సినిమాలో హీరో అడిగిన ప్రశ్న ఇదే కదా.. 'సినిమాలో హీరో ముద్దు పెట్టుకుంటా అన్నాడు కదా..' దానికి మీ రియాక్షన్ ఏంటి..? ' అంటూ తనదైన స్టైల్లో మార్చేస్తాడు. అప్పుడు వైష్ణవి కూడా ఓహ్... టీజర్లో ఉన్న సీన్ గురించా అంటూ.. గుర్తుతెచ్చుకుని 'చెప్పు తెగుద్ది అంటాను' అని అంటుంది. 'ఓహో చెప్పు తెగుద్దా' అంటూ వేరే టాపిక్లోకి వెళ్తాడు ఆ రిపోర్టర్. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) బహాశా ఇది సినిమా ప్రమోషన్ కోసం చేసి ఉంటారో... అనుకోకుండా నిజంగానే జరిగిందో మాత్రం తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఆ రిపోర్టర్ను మాత్రం విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియో కింద కామెంట్లు చేయడమే కాకుండా ఆయనకు ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో 2018 మూవీ ప్రెస్ మీట్లో కూడా ఇలాంటి వైరల్ కామెంట్లే చేశాడు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆదే రిపోర్టర్పై మండిపడ్డారు. ఇలా ఎన్నో సంఘటనలు ఆయన ఖాతాలో ఉన్నాయి. -
'7/జీ బృందావన కాలనీ' సినిమా లాంటి అనుభూతిని ఇస్తుంది'
‘‘బేబీ’ ట్రైలర్ బాగుంది. జూలై 14న టీమ్ అంతా పండగ చేసుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ను హైదరాబాద్లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ‘‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో.. ‘బేబీ’ అదే ఫీల్ ఇస్తుంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘‘ఈ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు’’ అన్నారు మారుతి. ‘‘ఈ చిత్రం నిర్మాతకు గౌరవాన్ని తీసుకొస్తుంది’’ అన్నారు సాయి రాజేష్. ‘‘బేబీ’ ప్రేక్షకులను నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది’’ అన్నారు ఆనంద్, విరాజ్. ఎస్కేఎన్ కూడా పాల్గొన్నారు. -
ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అర్జున్రెడ్డి' సినిమాకు ముందే విజయ్ను నమ్మాను: నిర్మాత
'ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా మొదలై, పీఆర్వో అయ్యాను. ఆ తర్వాత నిర్మాతగా మారాను. కెరీర్ చాలా సంతృప్తిగా ఉంది' అన్నారు ఎస్కేఎన్. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎన్కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. నేడు (శుక్రవారం) ఎస్కేఎన్ బర్త్ డే. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ– 'ఆనంద్, విరాజ్, వైష్ణవిల మధ్య సాగే ఎమోషనల్ లవ్స్టోరీ ‘బేబీ’. కథ, కథనం, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. ఇంట్రవెల్కు ముందు పెద్ద షాక్ ఉంటుంది. మ్యూజిక్ పరంగా ఈ మధ్య వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ‘బేబీ’ ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతం అందించాడు. ఇక సోలో నిర్మాతగా నేను తొలిసారి విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ నిర్మించాను. అప్పుడు సాయి రాజేష్ నాకు ‘బేబీ’ కథ చెప్పాడు. కథ విన్నాక నిర్మాతగా నా తర్వాతి చిత్రం ఇదే చేయాలనుకున్నాను. ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పోస్టర్ వివాదాస్పదమైంది. ఆ పోస్టర్ను అలాగే ఉంచితే మూవీకి ప్రమోషన్ వస్తుందని కొందరు అన్నారు. కానీ కంటెంట్ బాగుంటే పబ్లిసిటీ అదే వస్తుంది.. కాంట్రవర్సీల నుంచి కాదని నమ్మే వ్యక్తిని. ఇక మార్కెట్ అంటే.. ‘అర్జున్రెడ్డి’ రిలీజ్ కాకముందే విజయ్ స్టార్ అవుతాడని నమ్మి ‘టాక్సీవాలా’ తీశా. అలా ‘బేబీ’ ఆనంద్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఏడాదికి రెండు సినిమాలు, వెబ్ ఫిల్మ్ నిర్మించాలనుకుంటున్నాను. సందీప్ రాజ్, సాయి రాజేష్, రాహుల్ సంకృత్యాన్, వీఐ ఆనంద్లతో సినిమాలు ఉన్నాయి' అన్నారు. -
హద్దులు దాటె చూడు!
‘ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వూ.. ఎదసడే హద్దులు దాటె చూడు చూడు చూడు...’ అంటూ మొదలవుతుంది ‘బేబీ’ చిత్రంలోని ‘రిబపప్పా రిబపప్పాప..’ సాంగ్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్గుడ్ లవ్స్టోరీ ‘బేబీ’. సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రిబపప్పా రిబపప్పాప..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను సాయి కృష్ణ పాడారు. ఈ సినిమాకు సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
పడతారండి ప్రేమలో మళ్లీ..!
నిన్నమొన్నటివరకూ పాన్ ఇండియా ట్రెండ్లో యాక్షన్ సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ లవ్ట్రెండ్ మొదలైంది. యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరోలు మళ్లీ వెండితెరపై ప్రేమలో పడటానికి ప్రేమకథలు వింటున్నారు. కొందరి ప్రేమకథలు ఆల్రెడీ ఆన్ సెట్స్లో ఉన్నాయి. ఈ వెండితెర ప్రేమికుల ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ అనగానే సినిమా లవర్స్ ఎక్కువగా ‘బాహుబలి’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘సాహో’ వంటి యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. కాగా ప్రభాస్ కెరీర్లో మంచి హిట్స్ సాధించిన ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన పదేళ్లల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ (2022) తప్ప అన్నీ యాక్షన్ చిత్రాలే చేశారు. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలతో యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. మళ్లీ ఓ ప్రేమక£ý చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి రెడీ చేసిన ఓ ప్రేమ కథను ప్రభాస్ విన్నారని, ఇది పీరియాడికల్ లవ్స్టోరీ అనీ సమాచారం. ► ‘100 పర్సెంట్ లవ్’, ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ , ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘లవ్స్టోరీ’.... ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య కెరీర్లోని మేజర్ పార్ట్ అంతా ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. కాగా తన గత చిత్రం ‘కస్టడీ’లో నాగ చైతన్య ఎక్కువగా యాక్షన్ చేశారు. అయితే చైతూ తన ప్రేమతో మరోసారి ఆడియన్స్ను ప్రేమలో పడేయనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సూరత్ బ్యాక్డ్రాప్తో సాగే ఓ లవ్స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇందులో నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్ర చేయనునున్నారనీ టాక్. ► హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ప్రేమ, మాస్ కథలు సమానంగా కనిపిస్తాయి. కానీ విజయ్కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం మాస్ లవ్స్టోరీ ‘అర్జున్రెడ్డి’, క్లాస్ లవ్స్టోరీస్ ‘పెళ్ళి చూపులు’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలే. దీంతో విజయ్ మరోసారి లవ్స్టోరీస్పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ ప్రస్తుతం ‘ఖుషి’ అనే లవ్స్టోరీ చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. అలాగే ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్తో మరో సినిమా చేస్తున్నారు విజయ్. ఇది కూడా ప్రేమకథా చిత్రమేనన్నది ఫిల్మ్నగర్ టాక్. ► ‘డీజే టిల్లు’తో మరింత పాపులారిటీని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకురాలు నందినీ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఓ డిఫరెంట్ లవ్స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ► ‘దొరసాని’ వంటి ప్రేమకథతో పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘హైవే’ వంటి క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఆనంద్ నటించిన మరో లవ్స్టోరీ ‘బేబీ’. ప్రేమకథా చిత్రంగా సాయిరాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. మరికొందరు హీరోలు కూడా ఆడియన్స్ను ప్రేమలో పడేసేందుకు ప్రేమకథలు వింటున్నట్లు తెలుస్తోంది. ► ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’... ఇలా కొన్ని ప్రేమకథల్లో నటించారు అఖిల్. అయితే అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. దీంతో తన తర్వాతి చిత్రాన్ని లవ్ జానర్లోనే చేయాలనుకుంటున్నారట అఖిల్. ఈ క్రమంలోనే అనిల్కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఫ్యాంటసీ లవ్స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని, ‘ధీర’ టైటిల్ను పరిశీలిస్తున్నారనీ టాక్. -
బేబీ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్. Most Anticipated Film of the Season #BabyTheMovie Post-Production works on full swing as the film is gearing for release in July 2nd Week 🥁 Visuals from the Re-recording 🎹🎶@ananddeverkonda @viraj_ashwin @iamvaishnavi04 @sairazesh @SKNonline @VijaiBulganin @MassMovieMakers pic.twitter.com/CF9MROzr5B — GSK Media (@GskMedia_PR) June 13, 2023 చదవండి: ఆ స్థానంలో ప్రభాస్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతీ సనన్ -
ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక సపోర్ట్
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'బేబి'. హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఆమె ఈ సినిమాతో హీరోయిన్గా డెబ్యూ ఇవ్వనుంది. ఇందులో వైష్ణవి డీ గ్లామర్ రోల్ పోషించింది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలు సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేమిస్తున్నా అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తున్నా, నీ ప్రేమలో జీవిస్తున్నా అంటూ సాగే ఈ పాటకు బానిశెట్టి సాహిత్యాన్ని అందించగా, రోహిత్ ఆలపించాడు. ఈ సాంగ్ను నేషనల్ క్రష్ రష్మిక తన చేతుల మీదుగా రిలీజ్ చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
బేబీ మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదల
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం బేబి. ఈ సినిమాకి సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవీ చైతన్య ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఓ రెండు మేఘాలిలా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాపై మరింత బజ్ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ని విడుదల చేశారు మేకర్స్. దేవరాజా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఇందులో వైష్ణవి డీగ్లామర్గా కనిపించనుంది. అమాయకంగా కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చే సీన్లతో మొదలైన పాట ఆ తర్వాత మోడ్రన్ స్టైల్లోకి కనిపించేవరకు సాగుతుంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఆనంద్ దేవరకొండ 'బేబీ' ముూవీ.. ఫస్ట్ సింగిల్ రిలీజ్
హీరో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న తాజా సినిమా 'బేబీ. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సాయి రాజేష్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. రీసెంట్గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా ' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. విజయ్ బుల్గానిన్ స్వరపరిచారు. ఈ పాటను శ్రీరామ్ ఆలపించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారు. -
వైష్ణవిని హీరోయిన్గా తీసుకోవద్దంటూ నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి: డైరెక్టర్
సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది నటి వైష్ణవి చైతన్య. తొలుత షార్ట్ ఫిలింస్తో గుర్తింపు పొందిన ఆమె ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్గా అవకాశాలు అందుకుంది. అల వైకుంఠపురములో, వలిమై వంటి సినమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన వైష్ణవి ఇప్పుడు ఏకంగా బేబీ సినిమాతో హీరోయిన్గా మారింది. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేశ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో రీసెంట్గా టీజర్ను విడుదల చేసింది మూవీ యూనిట్. చదవండి: అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్ దంపతులు ఈ మూవీ టీజర్ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ వైష్ణవి చైతన్యపై ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైష్ణవిని హీరోయిన్గా పెట్టినప్పటి నుంచి బయటి నుంచి తనకు విపరీతమైన ప్రెజర్ వచ్చిందని, ఫుల్ నెగిటివిటి వచ్చిందన్నాడు. సినిమాకు వైష్ణవిని హీరోయిన్గా తీసుకోవద్దంటూ తనకు చాలా ఫోన్ కాల్స్, మెసేజ్ వచ్చాయంటూ షాకింగ్ విషయం చెప్పాడు. ‘వైష్ణవిని నా సినిమాలో హీరోయిన్గా తీసుకున్నప్పటి నుంచి ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టావ్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే ఆమెను చాలా మంది చూశారు. చదవండి: బిజినెస్ విమెన్తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? తనని ఎందుకు పెడుతున్నావ్? ఇంకెవరూ దొరకలేదా?” అని అనేవారని రాజేశ్ చెప్పుకొచ్చాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్కి చెల్లెలిగా చేయడం చూసేశాం, షార్ట్ ఫిలింస్, ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చూశాం. కానీ లోపల ఏదో ఉంటుంది కదా. కథ అనుకున్నప్పుడే తను హీరోయిన్గా సెట్ అవుతుందని నాకు అనిపించింది. రేపు సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు” అంటూ సాయి రాజేష్ వైష్ణవిపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
వాస్తవ సంఘటనల ఆధారంగా వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రం
‘‘ప్రేక్షకులందరికి నచ్చే కథ ‘బేబీ’. మన ప్రేక్షకులకు ఎలా చూపిస్తే బాగుంటుందో అలా తెరకెక్కించారు సాయి రాజే‹Ù. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఎస్కేఎన్, దర్శకుడు మారుతి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటన స్ఫూర్తితో తీసిన చిత్రమిది. ఇప్పటిదాకా నన్ను సాయి రాజేష్ అన్నారు. ఈ సినిమా రిలీజయ్యాక ‘బేబీ’ దర్శకుడు అని పిలుస్తారు’’ అన్నారు. ‘‘మారుతి, నేను కలిసి ఈ మాస్ మూవీ మేకర్స్ సంస్థను స్థాపించాం. మా దృష్టిలో సినిమా అంటే అమ్మకం కాదు.. నమ్మకం. అలాంటి నమ్మకంతోనే ‘బేబీ’ నిర్మించాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘నా కెరీర్లో సవాలు విసిరిన, సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘బేబీ’ విజయం సాధించాలని దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, వెంకటేష్ మహా, వశిష్ట అన్నారు. -
సినిమా విడుదలకు ముందే దర్శకుడికి ఖరీదైన బహుమతి
మాములుగా సినిమా రిలీజై విజయవంతం అయిన తర్వాత హీరోలు, దర్శకులతో పాటు టెక్నీషియన్స్కి బహుమతులు ఇస్తుంటారు నిర్మాతలు. ఎక్కువ లాభాలు తెచ్చిపెడితే ఖరీదైన గిఫ్టులు ఇస్తుంటారు. కాని సినిమా విడుదలకు ముందే, అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడు గిఫ్టులు ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా దర్శకుడు, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సాయి రాజేష్ విషయంలో అదే జరిగింది. (చదవండి: కేసీఆర్ బయోపిక్ తీస్తా.. ఆర్జీవీ) ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. తాజాగా ‘బేబీ’ చిత్రం రష్ చూసిన నిర్మాతలు ఎస్ కే.ఎన్, మారుతి దర్శకుడు సాయి రాజేష్ కు ఎం.జి.హెక్టార్ కారును బహుమతిగా అందించారు. చెప్పిన కథను అలానే అద్భుతంగా తెరకెక్కించినందుకుగాను ఆనందంతో ఈ బహుమతిని అందించారు. ఏదేమైనా ఈ సినిమా పై నిర్మాత ఎస్ కె ఎన్ మంచి నమ్మకంతో ఉన్నారు. కాగా, తనకు బహుమతి అందించిన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతూ.. కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు దర్శకుడు సాయి రాజేష్. ‘బాగా తీశాననే ఇష్టమో లేదా హిట్ కొట్టాల్సిందేనని బ్లాక్ మెయిలో తెలియదు కానీ మా నిర్మాతలు కారుని బహుమతిగా అందించారు. గురువుగారు మారుతికి, స్నేహితుడు ఎస్.కె.ఎన్లకు థ్యాంక్స్. బేబీ టీజర్ త్వరలోనే విడుదల చేస్తాం. మీ అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగాలి’అని సాయి రాజేష్ ట్వీట్ చేశాడు. Baagaa theesaa ane ishtamo.....Hit kottalsindhe ani blackmail o ...My producers gifted me #MGHectorPlus car ... love you guruji @DirectorMaruthi and My Friend @SKNonline 🤗🤗🤗#Baby teaser soon ❤️ Iam confident this time too...Need all your support pic.twitter.com/g5TPyxAHPo — Sai Rajesh (@sairazesh) October 13, 2022 -
ఇండియా-ఆసీస్ మ్యాచ్లో లైగర్.. సందడి చేసిన బాలీవుడ్ హీరో
భారత్లో క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ఫ్యాన్స్తో పాటు సినీనటులు కూడా మ్యాచ్లను చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. ఇటీవల హైదరాబాద్లో ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో బాలీవుడ్, టాలీవుడ్ నటులు సందడి చేశారు. సోనూ సూద్తో కలిసి విజయ్ దేవరకొండ మ్యాచ్ను తిలకించారు. విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉప్పల్ మ్యాచ్ను వీక్షించారు. వీరంతా టీమిండియాను సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన విజయ్ దేవరకొండ మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూాడ నటుడే. టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. టీమిండియా మ్యాచ్ చూస్తున్న వీడియో క్లిప్ను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆగస్టులో దుబాయ్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన 2022 ఆసియా కప్ మ్యాచ్లోనూ విజయ్ దేవరకొండ సందడి చేశారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. THE #VijayDeverakonda Cheering & Clapping Along With @ananddeverkonda & @SonuSood Team INDIA 🇮🇳 ❤️🔥🤙@TheDeverakonda #INDvAUS pic.twitter.com/twUN8iI3Ug — Vijay Deverakonda Online Fans (@VDRowdiesOnline) September 25, 2022 -
టైటిల్ పాజిటివ్గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు. -
'హైవే'మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫోటోలు)
-
అమ్మాయి లైఫ్ సేవ్ చేయాలంటున్న ఆనంద్ దేవరకొండ
Anand Deverakonda HighWay Trailer Released By Naga Shaurya: 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇందులో ఆనంద్ దేవరకొండకు జోడీగా మానస అలరించనుండగా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. కె.వి గుహన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించింది. ఈ సినిమా ఆగస్టు 19న నేరుగా ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం (ఆగస్టు 16) మూవీ ట్రైలర్ను హీరో నాగశౌర్య విడుదల చేశాడు. 'నగరంలో వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్' అనే న్యూస్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యతం ఉత్కంఠంగా సాగింది. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ Get ready for this spine chilling thriller. #HighwayOnAHA Premieres August 19. ▶️https://t.co/aDUgzFE7Mf@ananddeverkonda @SaiyamiKher @nowitsabhi @kvguhan @simonkking #VenkatTalari pic.twitter.com/rWPm0EKRJE — ahavideoin (@ahavideoIN) August 16, 2022 'ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేసేందుకే నీ హెల్ప్ కావాల్సి వచ్చింది', 'మనతో గడుపుతుంది ఈ కొన్ని గంటలైన, తను నన్ను జీవితాంతం మర్చిపోకుడదురా' వంటి డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆనంద్ దేవరకొండ లుక్ కొత్తగా ఉంది. ఫొటోగ్రాఫర్ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని ప్రేమ కథలోకి ఓ సీరియల్ సైకో కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
ఆనంద్ దేవరకొండ 'బేబీ' డబ్బింగ్ షురూ
ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం ‘బేబీ’. చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాం. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి, సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్. -
'హైవే'లో దూసుకు వస్తున్న ఆనంద్ దేవరకొండ.. 'ఆహా' అనిపిస్తాడా?
Anand Deverakonda Highway Will Direct Release In AHA: రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తనదైన ముద్ర వేసుకున్నాడు. అన్న బాటలోనే తను కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ. 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వచ్చిన 'పుష్పక విమానం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే ఈసారి థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీ ద్వారా రానున్నాడు ఆనంద్ దేవరకొండ. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మించిన చిత్రం 'హైవే'. సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం పోస్టర్ను శనివారం (ఆగస్టు 6) విడుదల చేసింది ఆహా. ఇందులో అభిషేక్ బెనర్జీ, మానస కీలక పాత్రలు పోషించారు. ఫొటోగ్రాఫర్ అయిన హీరో ప్రేమలో పడుతాడు. సాఫీగా సాగుతున్న అతని జీవితం.. ఓ సీరియల్ కిల్లర్ ఎంట్రీతో ఎలాంటి మలుపు తిరిగింది అనే కథతో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. తర్వలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు. మరి ఈ సినిమా ఆనంద్ దేవరకొండకు ఎలాంటి మలుపునిస్తుందో చూడాలి. చదవండి: మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా సహానటి.. బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే! ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్గా 'లైగర్' సాంగ్ HIGH! HIGH!! HIGHWAY!!! A nail biting original movie coming soon😱#HighwayOnAHA@ananddeverkonda @SaiyamiKher @nowitsabhi @kvguhan @simonkking #VenkatTalari pic.twitter.com/YRCgXaDLUB — ahavideoin (@ahavideoIN) August 6, 2022 -
కొత్త సినిమా ప్రకటించిన ఆనంద్ దేవరకొండ
దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత సెలక్టివ్గా కథలు ఎంచుకుంటున్న ఆనంద్.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. గంగం గణేశా టైటిల్ పోస్టర్ను సైతం రిలీజ్ చేశాడు. ఈ మూవీకి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తామని, అప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. Coming at you with all guns blazing 🔥 Make way for a king sized entertainment with #GamGamGanesha directed by @theudayshetty ACTION FESTIVAL BEGINS💥 A @chaitanmusic musical#KedarSelagamsetty @thisisvamsik @HylifeE @GskMedia_PR @ticketfactory pic.twitter.com/YwBrSGL8wx — Anand Deverakonda (@ananddeverkonda) February 7, 2022 -
రౌడీ హీరో విజయ్తో రష్మిక డేటింగ్? లీకైన ఫోటోలు
Are Rashmika Vijay Devarakonda Dating? Photo Leaks: గీత గోవిందం జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ అప్పడప్పుడు వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం, ముంబైలో పలుమార్లు డిన్నర్ డేట్స్కు వెళుతూ కెమెరాలకు చిక్కారు. అంతేకాకుండా న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇద్దరు కలిసి గోవా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లీకైన ఓ ఫోటో ఆ వార్తలకు నిజమేనని రుజువు చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ 2022 మై లవ్స్ అంటూ రష్మిక తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అయితే కాసేపటికే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో విజయ్ కూడా పక్కనే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రష్మిక, ఆనంద్ షేర్ చేసిన ఫోటోల్లో ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంది. దీంతో లొకేషన్ ఎక్కడో చూసినట్లుందే అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంది.. ఇద్దరూ రిలేషన్లో ఉన్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్లు ఈఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. -
ఆనంద్ దేవరకొండ`హైవే` కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది!
Anand Deverakonda Highway Concept Poster: 'పుష్పక విమానం' సినిమాతో మంచి విజయం సాధించాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా సరికొత్త లుక్లో కనిపించనున్నాడు ఆనంద్. మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్, పాతాళ్లోక్ వంటి సిరీస్లతో తెలుగులోనూ ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. తాజాగా నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘‘118 వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. మా బ్యానర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్గా తెరకెక్కించాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి`` అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ – ‘‘ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే `హైవే’. పూర్తిగా హైవే నేపథ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్లో ఉంటుంది`` అన్నారు. #KVGuhan Stuns Yet Again Amazing Concept Posters From Sensational #AnandDevarakonda's Nerve-Wracking Crime Thriller #Highwaymovie💥 ⭐Ing @ananddeverkonda #manasaradhakrishnan @SaiyamiKher @nowitsabhi A @kvguhan 's Directorial📽️ Produced by #VenkatTalari 💸 🎹 @simonkking pic.twitter.com/ZDdGPE4J6x — BA Raju's Team (@baraju_SuperHit) December 2, 2021 -
'ఆహా'లో పుష్పక విమానం, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!
Pushpaka Vimanam In AHA: దొరసాని, మిడిల్క్లాస్ మెలోడీస్ వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. ఇటీవలే పుష్పక విమానంతో ప్రేక్షకులను పలకరించాడీ యంగ్ హీరో. పెళ్లైన కొద్ది రోజులకే భార్య కనిపించకుండా పోయిందన్న కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకుంది. నవంబర్ 12న రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీ ట్రాక్ ఎక్కింది. డిసెంబర్ 10 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను థియేటర్లో చూడటం మిస్సయినవారు ఎంచక్కా ఇంట్లోనే ఆహా యాప్లో చూసేయొచ్చు. ఇక ఈ చిత్రంలో గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్థవర్దన్ తదితరులు నటించారు. దామోదర దర్శకత్వం వహించాడు. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం అందించగా హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రాఫర్గా పని చేశాడు. Newly weds: Missing my wife! Sundar as a newly wed: MISSING WIFE. Where is she? Find out with #PushpakVimanamOnAHA, Dec 10 nundi.@ananddeverkonda @SaanveMegghana @TheDeverakonda @ItsActorNaresh @harshachemudu @Mee_Sunil @GeethSaini @itsdamodara pic.twitter.com/w1G80eVkjP — ahavideoIN (@ahavideoIN) December 1, 2021 -
‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ
టైటిల్ : పుష్పక విమానం నటీనటులు : ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్థవర్దన్ తదితరులు నిర్మాణ సంస్థ : కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ నిర్మాతలు : గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ని దర్శకత్వం : దామోదర సంగీతం : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్ విడుదల తేది : నవంబర్ 12, 2021 దొరసాని, మిడిల్ క్లాస్మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంనో అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్పక విమానం’మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పుష్పక విమానం కథేటంటే..? చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయకపు చక్రవర్తి. అతనికి మీనాక్షి(గీత్ సైని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లైయిన కొద్ది రోజులకే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు? అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది? భార్య పారిపోయిందనే విషయాన్ని సమాజానికి తెలియనీకుండా సుందర్ ఎలాంటి పనులకు ఒడిగట్టాడు? వాటి వల్ల సుందర్కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వెబ్ సీరీస్, షార్ట్ఫిలిం హీరోయిన్ రేఖకు సుందర్కు మధ్య సంబంధం ఏంటి? ఈ కథలోకి పోలీసాఫీసర్ రంగా(సునీల్) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చివరకు మీనాక్షి దొరికిందా లేదా? అనేదే ‘పుష్పక విమానం’ కథ ఎలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండకు మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్ నటన కాస్త మెరుగుపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. అమాయకపు చేష్టలతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. భార్య పారిపోయిందనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, దానికి కప్పిపుచ్చడానికి సుందర్ చేసే పనులు అందరిని నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో కూడా ఆనంద్ అద్భుత నటనను కనబరిచాడు. ఇక మీనాక్షిగా గీత్ సైని మెప్పించింది. కథ మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ తెరపై ఆమె చాలా తక్కువ సమయమే కనిపిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సుందర్ నకిలీ భార్య రేఖ పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయింది. వెబ్సీరీస్, షార్ట్ ఫిల్మ్లు తీసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేఖ పాత్ర తనది. తెరపై మాస్ లుక్లో కనిపిస్తుంది.ఇక పోలీసాఫీసర్ రంగగా సునీల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీరియస్ లుక్లో కనిపిస్తూనే తనదైన పంచ్లతో నవ్వించాడు. స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పుష్పక విమానం ఎలా ఉందంటే.. ? పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం అంత ఆస్తక్తికరంగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయిందనే పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని.. తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడతాయి. కానీ ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుకుంది. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకు చెప్పకుండా, సెకండాఫ్లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్. దానికి తోడు కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’అనే సాంగ్ మినహా మిగతా పాటలన్ని అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం చక్కగా అందించారు. కథలో భాగంగానే పాటలు వస్తాయి తప్ప తెచ్చిపెట్టినట్లు ఎక్కడా అనిపించదు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
పుష్పక విమానం ట్విటర్ రివ్యూ
Pushpaka Vimanam Movie Twitter Review In Telugu: దొరసాని, మిడిల్ క్లాస్మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దామోదర అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు.పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబర్ 12)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా కామెడీకి పెద్ద పీట వేశారట. ఫస్టాప్ అంత సోసోగా సాగుతుదంట. భార్య మిస్సయ్యిందనే పాయింట్ చూస్తూనే కథ తిరుగుతుందట. కీలకమైన ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందట. ఇక సెకండాఫ్లో పోలీస్ ఆఫీసర్గా సునీల్ ఎంట్రీ ఇచ్చి విచారణ కొనసాగించడం లాంటి సీన్స్, అక్కడక్కడా కొన్ని ట్విస్ట్స్ ఇలా కథను ముందుకు తీసుకెళ్లారట. Bagundhi movie..very unpredictable screenplay..chinna konda did well..a must watch for thriller lovers👍#PushpakaVimanam https://t.co/R978xpPTlV — Steve Stifler (@steve_reddy_) November 12, 2021 1st half - Avg 👎 2nd half - Below avg 👎 Overall OTT bomma theatre lo skip cheseyachu👍#PushpakaVimanam — Nathan (@Benett_Nathan) November 11, 2021 @ananddeverkonda 🔥♥️ Maanchi family thriller 👌✨ Must match bomma 🎉@GeethSaini & @SaanveMegghana ♥️ Every cast of the film performed so well, cinematography & screenplay 👌 Go and watch with your friends & family@itsdamodara @tanga_official#PushpakaVimanam pic.twitter.com/mwL4XlOPU5 — 𝑹 𝒐 𝒘 𝒅 𝒚 (@TheNarendar) November 11, 2021 Both #RajaVikramarka and #PushpakaVimanam are not impressive.. Another dull week at the Telugu BO 😑 — vickRRRy (@VlCKY__264) November 12, 2021 Review : #PushpakaVimanam Average Thrilling Drama !! Positives 1st half Comedy works in parts Lead Pair Rating : (2.5/5) 👎 — InsidetalkZ (@InsideTallkz) November 12, 2021 Second half lo those two scenes are lit 🔥🔥 #PushpakaVimanam https://t.co/KjjPsgNKhU — Mokshith reddy (@OutsideRelax) November 12, 2021 comedy route aina vellundalsindi 2nd half routine aina atleast safe project ayyedhi emo atu itu kakunda aa chettha investigation sodhi. Oka thrill ledu em ledu. Random char ni introduce chesi red herrings pettesi climax ki aa char tho big twistt 🥱 #PushpakaVimanam — Silent GuaRRRdian (@Kamal_Tweetz) November 12, 2021 Chass feel bad. Had good potential & good setup but got screwed by over ambition. Lost interest as soon as it shifted to a crime investigation drama. Shock value ending failed miserably. Sunil tried too hard. AD acted well. Didn't care much for rest of the cast. #PushpakaVimanam — Silent GuaRRRdian (@Kamal_Tweetz) November 12, 2021 For the first time, you look soo promising chotu @ananddeverkonda...😎 No more needed your tag to your lad my dear @TheDeverakonda...😉#PushpakaVimanam #Liger pic.twitter.com/9GtudFaO3n — Kranthi Saketh (@livlikeK) November 11, 2021 Kottesam annaa 🔥🔥 #pushpakavimanam — Mokshith reddy (@OutsideRelax) November 12, 2021 Show full . 👌#PushpakaVimanam https://t.co/SrsU7pYZzD — Venkat (@urs_ms) November 12, 2021 Hittting hardd 🤘🤘🤘 #PushpakaVimanam — Rowdy (@Rowdyfan_Nani) November 12, 2021 First half 🤣👌🏼👍🏼 2nd half mid lo some lag.. rest 👍🏼 2nd heroine 🤣🤣👌🏼 Overall decent watch 3/5 #PushpakaVimanam — Manoj Rahul (@DHFM_endlessly) November 12, 2021 A comedy thriller with a twist and some emotional scenes @ananddeverkonda ‘s performance 👏 Songs and bgm are good Excluding a bit lag in both the halves its a good watch for this weekend Go for it! Rating : 3/5#PushpakaVimanam Review pic.twitter.com/wTEnZfvTKK — aRRRun (@ArunJai999) November 12, 2021 -
నా ఫ్రస్ట్రేషన్ చూసి నవ్వుకుంటారు: ఆనంద్ దేవరకొండ
‘‘నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. పెళ్లి వల్ల మన జీవితంలో కొత్త బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. ‘పుష్పక విమానం’లో పెళ్లి గురించి ఓ మంచి విషయాన్ని చూపించాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశిస్తున్నాం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ముందు ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ ‘పుష్పకవిమానం’ అనగానే ఓ పాజిటివ్ వైబ్ ఉందనిపించింది. సింగీతం శ్రీనివాసరావుగారికి ఫోన్ చేసి, ‘మీ టైటిల్ వాడుకోవచ్చా?’ అని దామోదర అడిగితే, ‘అది నా టైటిల్ కాదు... ఎప్పట్నుంచో ఉంది. మీ సినిమాకి సెట్ అవుతుందంటే వాడుకోండి’ అని పాజిటివ్గా స్పందించారు. ► ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అప్పటి నుంచి మా అన్నయ్య విజయ్కు దామోదరతో పరిచయం ఉంది. వాళ్లిద్దరూ సినిమా చేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత అన్న చేసిన ‘పెళ్ళి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ హిట్స్ కావడం వంటివి జరిగిపోయాయి. ఈ సమయంలో మా నాన్నగారు గోవర్థన్కు దామోదర దగ్గరయ్యారు. ‘పుష్పక విమానం’ కథను దామోదర నాన్నకు చెప్పారు. నేనూ కథ విన్నాను. మొదట్లో ఈ సినిమాలో నేను హీరోగా చేయాలనుకోలేదు. కొందర్ని సంప్రదించగా... హీరో భార్య లేచిపోవడం ఏంటీ అని ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి సుందర్ పాత్రకు నేను సరిపోతానని అనుకోవడంతో ఓకే చేశారు. ►ఈ సినిమాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్ర చేశాను. కానీ పెళ్లయిన పదిరోజుల లోపే సుందర్ భార్య వెళ్లిపోతుంది. బయటకు తెలిస్తే పరువు పోతుందని తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ ప్రాసెస్లో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సి వస్తుంది. పోలీసాఫీసర్గా సునీల్ అన్న, స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్గారు చేశారు. సినిమా చూసే ప్రేక్షకులకు సుందర్పై జాలి కలుగుతుంది... కానీ నా ఫ్రస్ట్రేషన్ చూసి నవ్వుకుంటారు. ►‘పుష్పక విమానం’ను మా అన్నయ్య చూశారు. నచ్చడంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్కు టైమ్ కేటాయించారు. నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నా స్క్రిప్ట్స్ నేనే వింటాను. ఓ సందర్భంలో దర్శకుడు వంశీ పైడిపల్లికి ‘మా తమ్ముడు ఆనంద్ ఆఫ్బీట్ సినిమాలు చేస్తుంటాడు’ అని అన్నయ్య నన్ను పరిచయం చేశారు. ఇప్పడు కొత్త తరహా కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ అందరూ కొత్తగా ఆలోచిస్తున్నారు. భిన్నమైన సినిమాలు చేయడానికి ఓ యాక్టర్గా నేను సిద్ధంగానే ఉన్నాను. అలాంటి సినిమాల్లో నటించినప్పుడే యాక్టింగ్కు మరింత స్కోప్ దొరుకుతుంది. ప్రస్తుతం దర్శకులు కేవీ గుహన్గారు, సాయి రాజేశ్లతో పాటు ఓ కొత్త దర్శకుడితో సినిమా కమిటయ్యాను. -
రెండు ఎపిసోడ్స్ షూట్ చేశాక జయసుధ భర్త చనిపోయారు: నటి
‘‘పుష్పక విమానం’లో ఆనంద్ దేవరకొండ పాత్రతో నా బంధం ఏంటి? అనేది తెరపైనే చూడాలి. నా పాత్ర సందర్భానుసారంగా వస్తుంది’’ అన్నారు శాన్వీ మేఘన. ఆనంద్ దేవరకొండ హీరోగా, శాన్వీ మేఘన, గీత్ సైనీ హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. శాన్వీ మేఘన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘నాది హైదరాబాద్. మా కాలేజ్ క్యాంపస్లో షూటింగ్ జరిగినప్పుడు నన్ను చూసి ఓ సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు. నాకు నటనంటే ఆసక్తి ఉండేది కాదు.. మా ఇంట్లో నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. జయసుధగారు నిర్మిస్తున్న టీవీ ప్రోగ్రామ్ కోసం స్వయంగా అడగడంతో మా అమ్మా నాన్న అభ్యంతరం చెప్పలేదు. రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత జయసుధగారి భర్త నితిన్ కపూర్గారు చనిపోవడంతో ఆ టీవీ కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో హీరోయిన్గా చేశాను. ‘సైరా నరసింహా రెడ్డి’లో చిన్న పాత్ర చేశాను. తరుణ్ భాస్కర్గారి ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్ చేశాను. ఆయనే ‘పుష్పక విమానం’ చిత్రానికి నన్ను సిఫారసు చేశారు. దామోదరగారు ఆడిషన్ చేసి సెకండ్ లీడ్గా సెలక్ట్ చేశారు. నాకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవిగారు. హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టం. విజయ్ దేవరకొండగారితో నటించే అవకాశం వస్తే వదులుకుంటానా?’’ అన్నారు. -
ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ, అదేంటో చూశారా!
విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పరిశ్రమలో ఎక్కువగా యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తనదైన మ్యానరీజంతో విజయ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ను పెంచుకున్నాడు. మొదట సహా నటుడిగా పరిశ్రమలో అడుగు పెట్టిన విజయ్ ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగాడు. హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా మారాడు. సొంతంగా బ్యానర్ పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీతో నిర్మాత మారాడు విజయ్. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ తాజాగా తన సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ మూవీని తెరకెక్కించాడు. నవంబర్ 12 విడుదలకు సిద్దమైన ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీ అయిపోయాడు విజయ్. ఈ క్రమంలో తాజాగా విజయ్ తనదైన స్టైల్లో ‘పుష్పక విమానం’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ తన తమ్ముడు ఆనంద్ను ఆటపట్టించిన ఆసక్తికర వీడియోను వదిలాడు. ఈ నేపథ్యంలో ఉదయం బెడ్ మీద నుంచి లేస్తూనే నాతో ఈ రోజు బెడ్ షేర్ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్న వ్యక్తి వైపు తిపుతూ దుప్పటి లాగాడు విజయ్. చదవండి: ఆ బాధ్యత మోయడం చాలా కష్టంగా ఉంది: విజయ్ విజయ్ పక్కన ఉన్నది ఎవరాని చూడగా.. ఆనంద్ దేవరకొండ కనిపించాడు. ఇక కెమెరా ఆనంద్ వైపు చూపిస్తూ ‘నీ పెళ్లాం ఎక్కడా?’ అంటూ అని అడుగుతూ ఆనంద్ను ఆటపట్టించాడు విజయ్. నిద్ర మోహంతో ఉన్న ఆనంద్ కాస్తా విసుక్కుంటూ మరోవైపు తిరుగ్గా అలాగే దుప్పటి లాగిన విజయ్కి.. ఆనంద్ సిగ్గు పడుతూ ‘నా పెళ్లాం లేచిపోయింది’ అంటూ సమాధానం ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఇలా వినూత్నంగా విజయ్ ‘పుష్పక విమానం’ మూవీని ప్రమోట్ చేయడం చూసి ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఈ మూవీ నవంబర్ 12న విడుదల థియేటర్లో విడుదల కానుంది. ఇక విజయ్, పూరీ జగన్నాథ్తో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. -
ఆ బాధ్యత మోయడం చాలా కష్టంగా ఉంది: విజయ్
ఒక వైపున హీరోగా తనని తాను నిరూపించుకుంటూ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా కూడా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నిర్మాణంలో తన సోదరుడు ఆకాశ్ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలిట్ ‘హీరోగా నేను ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నిర్మాతలు దొరక్క చాలా కష్టాలు పడ్డాను. నా తరువాత వచ్చేవాళ్లు ఆ కష్టాలు పడకూడదనే ఒక బలమైన ఉద్దేశంతో నేను సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టాను. ఈ బాధ్యతను మోయడం చాలా కష్టంగా ఉంది .. అయినా అవకాశం పొందినవాళ్లు స్టేజ్పై మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కష్టమైనా కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే అనుకుంటున్నాను. మా పేరెంట్స్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతూనే నాకు పెట్రోల్ డబ్బులు ఇచ్చి ఆడిషన్స్కి పంపించారు. చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు సినిమాల్లోకి రాకముందు నేను ఎవరనేది మా గల్లీలో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి నేను ఇప్పుడు ఒక నటుడిగా.. నిర్మాతగా వైజాగ్లో స్టేజ్పై నిలబడి ఉన్నా. నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ .. మీ మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వలో లైగర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘పుష్పకవిమానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
నన్ను నడిపిస్తున్నది ఆ రెండే!
‘‘పుష్పకవిమానం’ సినిమాకు నిర్మాతను నేను. ఈ సినిమాపై కొందరి కెరీర్స్ ఆధారపడి ఉన్నాయి. ఒక్కోసారి నిర్మాణం అవసరమా? అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరూ తమకు దక్కిన అవకాశాల గురించి మాట్లాడుతుంటే.. ఇలాంటి ఎమోషన్తోనే కదా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందని గుర్తొచ్చి, కష్టమైనా చేయాలనిపిస్తుంది. నన్ను రెండే నడిపిస్తున్నాయి. అనుకున్నది సాధించగలనన్న నా ఆత్మవిశ్వాసం. రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్. అది మీ (అభిమానులు, ప్రేక్షకులు) మీద ఉన్న కాన్ఫిడెన్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధనరావు, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సృజన్ (చిత్రదర్శకుడు దామోదర) మంచి రైటర్, డైరెక్టర్. ఈ సినిమాకు మరో పిల్లర్ ఆనంద్. నటన చింపేశాడు.’’ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్ర చేశాను. వైవాహిక జీవితం గురించి ఎన్నో ఊహించుకున్న చిట్టిలంక సుందర్ భార్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నదే కథ’’ అన్నారు. ‘‘చాలామందిని సపోర్ట్ చేయడానికి విజయ్ ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు విజయ్ మిట్టపల్లి. ‘‘ఆనంద్ నటనతో పాటు ఈ సినిమాలోని కామెడీ, థ్రిల్లింగ్ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు దామోదర. నటుడు హర్షవర్థన్, మ్యూజిక్ డైరెక్టర్స్ మార్క్ కె రాబిన్, సిద్దార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ను మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను . సమస్యలుంటే ఈ యాప్ ద్వారా పోలీసులను కాంటాక్ట్ కావొచ్చు. పోలీసులు రెస్పాండ్ అవుతారు. కానీ ఎవరికీ ఈ యాప్ అవసరం రాకూడదనే కోరుకుంటున్నాను . -
రీసెంట్గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Reveals About His Break Up: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన బ్రేకప్ను బయటపెట్టేశాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమాకు విజయ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్లో బిజీ అయిపోయారు. తాజాగా తమ గురించి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన పలు ప్రశ్నలకు దేవరకొండ బ్రదర్స్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ డేటింగ్లో ఉన్నారా? సింగిలా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. 'ఈ మధ్యే నా హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే కొంచెం బాధలో ఉన్నా' అని తెలిపాడు. అంతేకాకుండా ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదని కూడా చెప్పుకొచ్చాడు.దీంతో దేవరకొండతో బ్రేకప్ అయిన ఆ అమ్మాయి ఎవరా అని ఫ్యాన్స్ మళ్లీ ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఆనంద్ దేవరకొండ..తాను ఇంకా సింగిల్ అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్పై క్లారిటీ ఇచ్చాడు. -
కామెడీ విమానంతో వస్తున్నఆనంద్ దేవరకొండ
-
పుష్పక విమానం: పెళ్లైన 10 రోజులకే భార్య లేచిపోయిందా?
దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. తాజాగా పుష్పక విమానం సినిమాతో ప్రయోగం చేయబోతున్నాడీ హీరో. శనివారం ఈ సినిమా ట్రైలర్ను అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్లో ఆనంద్ను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చూపించారు. అతడికి ఓ అందమైన అమ్మాయితో పెళ్లి జరిపించారు. పెళ్లైన 8 రోజులకే సిటీలో కొత్త జీవితం ప్రారంభించిందీ జంట. అయితే అతడు తన భార్యను ఎవరికీ చూపించకపోగా ఆమె ఇంట్లోనే ఉన్నట్లు నమ్మిస్తాడు. తనే ఇంటి ముందు ముగ్గులేస్తూ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తన భార్యే చేసిందని స్కూల్లో స్టాఫ్కు వడ్డిస్తాడు. ఆనంద్ తన భార్యను ఎవరికీ చూపించకపోవడానికి కారణం ఆమె పెళ్లైన పది రోజులకే లేచిపోతుంది. ఈ విషయంలో పోలీసులు అతడినే అనుమానిస్తారు. నీ భార్య లేచిపోయిందని చెప్పడానికి ఒక్క సాక్ష్యం చూపించు అని పోలీస్ పాత్రలో ఉన్న సునీల్ ఆనంద్ను అడుగుతాడు. దీనికి హీరో ఆమె రాసిన లెటర్ ఉందంటూనే దాన్ని మింగేసానని చెప్తాడు. అలా వినూత్న కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నవంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవబోతోంది. ఇదిలా వుంటే అతడు ‘మధురా’ శ్రీధర్ రెడ్డి, బలరామ్ వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా రూపొందనున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే కేదారం సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్లో ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. -
విజయ్పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరుకు యూత్లో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. సహా నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ‘రౌడీ’.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డితో హీరో మారి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ మూవీని విజయ్ నిర్మించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా విజయ్, ఆనంద్లు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి సంబంధించిన ఆసక్తికర విషయాలను, చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒకరి గురించి ఒకరు ఈ దేవరకొండ బ్రదర్స్ ఏం చెప్పారో వారి మాటల్లో చూద్దాం. ఈ మేరకు ఆనంద్, విజయ్లలో ఎవరిని ఇంట్లో ఎక్కువగా గారాబం చేస్తారనే ప్రశ్న ఎదురవగానే వెంటనే విజయ్, ఆనంద్ను చూపించాడు. ‘చిన్నప్పటి నుంచి ఆనంద్ను చాలా గారాబం చేశారు. ఎంతంటే వాడు ఆటలో జౌట్ అయినా అవ్వలేదు అనేవారు. క్రికెట్ ఆడేటప్పడు వాడు వికెట్ పడేది. కానీ మా నాన్న మాత్రం పడలేదని చెప్పేవారు. నాకు అర్థం కాకపోయేది. అక్కడ క్లియర్గా కనిపించేది. కానీ నాటౌట్ అని అనేవారు. చిరాకు వచ్చి బంతి విసిరేవాడిని. అలా ఒకసారి ఆనంద్ను బంతితో కొట్టాను. ఆ తర్వాత ఇంట్లో నాకు చీవాట్లు’ అంటూ నవ్వూతు చెప్పాడు. చిన్నప్పడు గొడవ పడేవారా? విజయ్: ‘ఇద్దరం కలిసి ఆడుకునే సమయంలో గొడవపడే వాళ్లం. ఆనంద్ తను ఆడుకునే బొమ్మలు విరగొట్టుకుని నా బొమ్మలు తీసుకునేవాడు. ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగేది. ఇక హాస్టల్లో ఉన్నప్పుడు నాతో ఎంతో సరదాగా ఉండేవాడు. నా ఫ్రెండ్స్ కూడా వాడి ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్లు. ఎప్పడు నా క్లాస్రూంకి రావడం అలా చేస్తుండేవాడు. కానీ సెలవులకు ఇంటికొచ్చినప్పుడు మాత్రం చుక్కలు చూపించేవాడు. టీవీలో వాడికి నచ్చిందే చూడాలి. రీమోట్ తనకు కావాలంటూ అల్లరి చేసేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. మీ ఇద్దరికి అమ్మకి ఎవరు ఎక్కువగా ఇష్టం.. అని అడగ్గానే ఇద్దరు చేతులు ఎత్తారు. కానీ ఇద్దరిలో కొంచం విజయ్ అంటేనే అమ్మకు ఇష్టమని ఆనంద్ చెప్పుకొచ్చాడు. ‘విజయ్ ఎప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి షూటింగ్ విషయాలు చెప్పేవాడు. ఈ రోజు షూటింగ్ ఇలా జరిగింది. అలా జరిగింది. ఆనంద్ ఏం చేస్తున్నాడని ఇలా ప్రతి విషయం షేర్ చేసుకోవడంతో విజయ్ అంటే అమ్మకు కాస్తా ఎక్కువ ఇష్టం’’ అని ఆనంద్ తెలిపాడు. వెంటనే విజయ్ అమ్మకు నేను, నాన్నకు వీడు అని చెప్పాడు. ఇంట్లో అవసరాలకు ముందుగా ఎవరు సంపాందించారు.. ఆనంద్ను చూపిస్తూ విజయ్ ఇలా చెప్పాడు. ‘ఫస్ట్ ఆనంద్ సంపాదించాడు. వాడికి అమెరికాలో జాబ్ వచ్చింది. ఈ విషయం ఫోన్ చేసి చెప్పగానే ఇంట్లో ఒక్కసారిగా ఏడుపులు. అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక వాడు యుఎస్ నుంచి రాగానే ఎయిర్పోర్టులో వాడి యుఎస్ కార్డు వాడేవాడు. ఆ ఫోటోలను నా ఫేస్బుక్లో కూడా షేర్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అకౌంట్ లేదు. అయితే అప్పుడు ఆనంద్ను చూసి గర్వంగా ఫీల్ అయ్యాను’ అని విజయ్ పేర్కొన్నాడు. ఎక్కువ రిలేషిప్స్ ఎవరికి ఉన్నాయి? వెంటనే ఆనంద్ విజయ్ను చూపిస్తూ.. దగ్గర దగ్గర 30, 40, 50 వరకు ఉండోచ్చు, సినిమాల్లోకి రావడానికే ముందు నుంచే చాలా రిలేషన్స్ ఉండేవి. ఇక దీనికి విజయ్ వివరణ ఇస్తూ.. ‘నేను కెరీర్ కోసం ఎక్కువగా ఆలోచించేవాడిని. ఈ క్రమంలో ఎక్కువగా టైం ఇచ్చేవాడిని కాదు. దీంతో అలా రిలేషిప్స్ బ్రేక్ అయ్యేవి. కానీ ఆనంద్ మాత్రం రిలేషన్ల్లో చాలా సీరియస్గా ఉంటాడు. ప్రేమిస్తే ఇంకా పెళ్లి చేసుకోవడమే. నేను అలా కాదు. నా ఆలోచనలు ఎప్పుడు నిలకడగా ఉండవు. సో నేను ఇలాంటి రిలేషన్ షిప్కు కట్టుబడి ఉండలేను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చివరగా విజయ్ ‘పుష్పక విమానం’ చిత్రం గురించి చెబుతూ.. ట్రైలర్ అక్టోబరు 30న విడుదల చేస్తున్నామని, చూసి ఆనందించండన్నాడు. అలాగే తాను ఈ ట్రైలర్ చూశానని, బాగా నచ్చిందని తెలిపాడు. -
నాకు చుక్కలు చూపించేవాడు.. ఆనంద్కే ముందు పెళ్లి: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వస్తున్న ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించగా.. విజయ్ దేవరకొండ నిర్మించాడు. ఇందులో ఆనంద్ అమాయమైన యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వూలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఓ ప్రోమోని విజయ్ దేవరకొండ యూట్యూబ్ చానెల్ విడుదల చేశారు. ‘అమ్మ ఫెవరెట్ ఎవరు?’ అనే ప్రశ్నకు నేనంటే నేనంటూ ఇద్దరూ చేతులు లేపారు. అందులో తనకంటే ముందు తమ్ముడికే మ్యారేజ్ అవుతుందని విజయ్ తెలిపాడు. దానికి కాదు.. తనకే అంటూ ఆనంద్ సైగ చేశాడు. అంతేకాకుండా చదువుకునే రోజుల్లో సమ్మర్ హాలీడేస్ ఇంటికి వచ్చేవాళ్లమని, ఆ సమయంలో తన చిన్ని సోదరుడు చుక్కలు చూపించేవాడని ఈ రౌడీ హీరో చెప్పుకొచ్చాడు. ఇలా ఈ అన్నదమ్ముల స్పెషల్ చిట్చాట్ ఎంతో ఫన్నీగా సాగింది. ఈ సరదా ఇంటర్వ్యూని పూర్తిగా చూడాలంటే అక్టోబర్ 25 వరకూ వేచి చూడాల్సిందే. ఆ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.. చదవండి: ‘ఫోర్బ్స్’ ప్రభావంతమైన నటుల జాబితా విడుదల.. అగ్రస్థానం పొందిన రష్మిక -
శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండలు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి దర్శనంలో విజయ్ తన తల్లి, తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నాడు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపల విజయ్ను చూసేందుకు, అతడితో ఫొటోలు దిగెందుకు అక్కడికి వచ్చిన భక్తులు ఉత్సహం చూపారు. కాగా ప్రస్తుతం విజయ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ చివరికి దశకు చేరుకుంది. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. సినీయర్ నటి రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కెన ఈ చిత్రంలో మైక్ టైసన్ క్లైమాక్స్ యాక్షన్ సీన్లో రింగ్లోకి దిగుతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ పూర్తి
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. తొలి చిత్రం ‘చుట్టాలబ్బాయి’ ఘనవిజయం సాధించి ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘హైవే’ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ను విడుదల చేస్తూ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్పై ఒక డిఫరెంట్ క్రై మ్ థ్రిల్లర్ గా ‘హైవే’ మూవీ రూపొందుతోంది. 118 వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నేడు హైవే మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో షూటింగ్ జరిపాం. ఈ సినిమాలో కొంత మంది ప్రముఖ నటీనటులు కూడా నటించారు. వారి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ.. ‘‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు, టర్నులతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం హైవే షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో కొన్ని క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం’’ అని పేర్కొన్నారు. -
రిలీజ్కు రెడీ అయిన 'పుష్పక విమానం'
Pushpaka Vimanam Release Date: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం' రిలీజ్కు రెడీ అవుతుంది. నవంబర్12న ఈ సినిమాను థియేటర్స్లో విడుదల చేయనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. దామోదర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘కల్యాణం’పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ గాయకుడు సిద్శ్రీరామ్, మంగ్లీ పాడారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించారు. ఆనంద్కు జోడీగా గీతా షైనీ నటించింది. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. Fasten your seatbelts because it is going to be a rollercoaster bride! 😉🎺🥁#PushpakaVimanamOnNov12 in a theatre near you#PushpakaVimanam @TheDeverakonda @ananddeverkonda@itsdamodara @Mee_Sunil @SaanveMegghana @GeethSaini pic.twitter.com/yyGMv4XmM5 — Anand Deverakonda (@ananddeverkonda) September 28, 2021 -
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
-
విజయ్ దేవరకొండ తమ్ముడికి ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డు
Sakshi Excellence Awards: సాక్షి మీడియా ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్కు బెస్ట్ డెబ్యూ యాక్టర్, నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. వీరిద్దరూ ‘దొరసాని’ మూవీతోనే టాలీవుడ్కి పరిచయం కావడం విశేషం. అవార్డుల గురించి వారి మాటల్లోనే.. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్: ఆనంద్ దేవరకొండ ‘సాక్షి’ మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. ‘దొరసాని’ సినిమా వచ్చి రెండేళ్లయింది. ఈ ప్యాండమిక్లో వచ్చిన సినిమాకి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రెండేళ్లలో నాది ఒక సినిమా థియేటర్లో (దొరసాని), ఇంకోటి (మిడిల్ క్లాస్ మెలోడీస్) ఓటీటీలో విడుదలయ్యాయి. ‘దొరసాని’ టీమ్ మధుర శ్రీధర్ సార్, సురేష్ బాబుగారు, కో స్టార్ శివాత్మిక అందరికీ థ్యాంక్స్. అలాగే నాకు అవకాశం ఇచ్చినందకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ టీమ్’ అన్నే రవి సార్, డైరెక్టర్ వినోద్, ఆనంద్ ప్రసాద్గారు, ఆదిత్యలకు స్పెషల్ థ్యాంక్స్. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ చేస్తున్నాను. మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది: శివాత్మిక నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన ‘సాక్షి’కి నా కృతజ్ఞతలు. ‘దొరసాని’ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మధుర శ్రీధర్ గారికి, ఎస్. రంగినేనిగారికి, సురేష్బాబుగారికి, కేవీఆర్ మహేందర్గారికి, ధీరజ్గారికి, నా కో యాక్టర్ ఆనంద్కి కూడా ధన్యవాదాలు. నా మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘అమ్మా నాన్నా.. అక్కా’ (జీవిత–రాజశేఖర్–శివాని) మీ దగ్గర్నుంచే యాక్టింగ్ నేర్చుకున్నాను. -
‘హైవే’పై దూసుకెళ్తున్న ఆనంద్ దేవరకొండ
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన 'పుష్పక విమానం' విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లలోనే ఈ సినిమాను వదలాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘హైవే’. ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి’ అనేది ట్యాగ్లైన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని..‘చుట్టాలబ్బాయి’ఘనవిజయంతో ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్నారు. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘హైవే’ చిత్రం నుండి కొత్త పోస్టర్ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘గుహన్గారి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్పై సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీగా ‘హైవే’ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరికొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘హైవే’ తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ థ్రిల్లింగ్ మూవీ అవుతుందని నమ్మకంఉంది’అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ..‘నేను దర్శకత్వం వహిస్తోన్న మూడో చిత్రమిది ‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ. టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉండబోతుంది. సైమన్ కె. కింగ్ సంగీతం ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్’అని అన్నారు. -
అదిరిపోయిన పుష్పక విమానంలో సిద్ శ్రీరాం పాట
హైదరాబాద్: యూత్లో విజయ్ దేవరకొండకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు, మరీ అతని యాటిట్యూడ్కు ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. అంత క్రేజ్ ఉన్న నటుడికి తమ్ముడిగా టాలీవుడ్లో హీరోగా సినీ ఆరంగ్రేటం చేసిన ఆనంద్ దేవరకొండ తన మొదటి సినిమా ‘దొరసాని’ నటనపరంగా మంచి మార్కులే పడినా, కలెక్షన్ల విషయంలో యావరేజ్గా నిలిచింది. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’తో హిట్ కొట్టడంతో ట్రాక్లో పడినట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ యువ నటుడు ‘పుష్పక విమానం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా గీతా షైనీ నటిస్తోంది. ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్గా ‘కల్యాణం’ పాట విడుదల అయ్యింది. అగ్రకథానాయిక సమంత సోషల్మీడియా వేదికగా ఈ పాటను విడుదల చేయగా విజయ్ దేవరకొండ సమంతకు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ గాయకుడు సిద్శ్రీరామ్, మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల స్వరాలు అందించారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ‘పుష్పకవిమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. Thank you Sammmm 🤗🤍 Big hugs and love!#Kalyanam#PushpakaVimanam https://t.co/t35wuEnmjg — Vijay Deverakonda (@TheDeverakonda) June 18, 2021 చదవండి: ఇట్స్ అఫిషియల్: ధనుష్తో శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం -
ఆనంద్ దేవరకొండతో హైవే ప్రయాణం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ‘118’ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆనంద్ దేవరకొండ హీరోగా ‘హైవే’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆనంద్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎం. వీరభద్రం కెమెరా స్విచ్చాన్ చేయగా, తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిశోర్కుమార్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా వెంకట్ తలారి మాట్లాడుతూ – ‘‘చుట్టాలబ్బాయి’ వంటి సూపర్హిట్ తర్వాత మా బేనర్లో చేస్తోన్న రెండో చిత్రమిది. హైవే నేపథ్యంలో ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దాదాపు పూర్తయ్యింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది’’ అన్నారు కేవీ గుహన్. ‘‘గుహన్గారి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం చాలా సంతోషం. ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
మూడు సినిమాలు ప్రకటించిన ఆనంద్ దేవరకొండ
‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అతని పుట్టినరోజు సందర్భంగా సోమవారం మూడు సినిమాలను ప్రకటించారు. ‘మధురా’ శ్రీధర్ రెడ్డి, బలరామ్ వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా రూపొందనున్న సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తారు. అలాగే కేదారం సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్లో ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. మరోవైపు ప్రస్తుతం ఆనంద్ నటిస్తున్న ‘పుష్పకవిమానం’ చిత్రంలోని ‘సిలకా’ అనే పాట కూడా పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. చదవండి: వివాదాస్పద 'బాంబే బేగమ్స్' అసలు కథేంటి..? -
ఓటీటీలో హిట్...టీవీలో ఎంట్రీ...
కరోనా అనంతర పరిస్థితులు ఇంటింటి వినోదాన్ని అమాంతం మార్చేసిన వైనం తెలిసిందే. థియేటర్లు మూత పడడంతో సినీ అభిమానులకు చిన్నితెరే ఏకైక వినోద సాధనంగా మారింది. ఈ పరిస్థితుల్లో పలు చిన్న చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్పై విడుదలై ప్రేక్షకుల సినిమా ఆకాంక్షల్ని కొంత మేరకు తీర్చాయి. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, జీ ఫైవ్ వంటి పలు ఓటీటీ వేదికలు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. ఈ నేపధ్యంలో ఓటీటీ వేదికలపై విజయం సాధించిన వాటిలో కొన్నింటిని మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తుండగా... మరికొన్ని చిన్నితెరలోనే మరో వినోద సాధనమైన టీవీ తెరపై ప్రత్యక్షమవుతుండడం విశేషం. ఈ విశేషానికి శ్రీకారం చుడుతోంది మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా జీ ఫైవ్ వేదికగా ఈ సినిమా ఇప్పటికే మంచి హిట్టయింది. ఇప్పుడీ సినిమాని జీ తెలుగు చానెల్లో ప్రసారం చేస్తున్నారు. ప్రేమికుల రోజైన వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఈ సినిమాని మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో అందిస్తున్నట్టు చానెల్ ప్రతినిధులు తెలిపారు. చదవండి : (మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి) (హీరో సుమంత్ అశ్విన్ హల్దీ ఫంక్షన్.. ఫొటోలు వైరల్) -
కష్టపడు, ఏదైనా అవసరం వస్తే కాల్ చెయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం "మిడిల్ క్లాస్ మెలోడీస్". గుంటూరు నేపథ్యంలోనే సాగే ఈ సినిమా మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. అమెజాన్ ప్రైమ్లో ఈ నెల 20న విడుదలైన ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలో తమ్ముడి చిత్రాన్ని విజయ్ దేవరకొండ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. చిత్రయూనిట్ను ప్రశంసిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. దర్శకుడు వినోద్ అనంతోజుతో పాటు సినిమాలో పాత్రలకు ప్రాణం పోసిన కొండల్ రావు, గోపాల్ చైతన్య, దివ్య, తరుణ్ భాస్కర్.. ఇలా అందరి గురించి చెప్తూ వారి ప్రతిభను మెచ్చుకున్నారు. (చదవండి: మిడిల్ క్లాస్ మెలోడీస్: ఎంటర్టైనింగ్ రియలిజమ్) వర్ష బొల్లమ్మ పెద్ద కళ్లేసుకుని క్యూట్గా కనిపిస్తూనే బాగా నటించిందన్నారు. చివరగా తన తమ్ముడి గురించి చెప్తూ.. సినిమాల ఎంపిక చేసుకుంటున్న విధానానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉందన్నారు. ఇలాగే మరిన్ని కొత్త కథలతో, దర్శకులతో, నటీనటులతో నీ ప్రయాణం సాగిపోవాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమంటూ.. సినిమాలో ఆనంద్ తండ్రి చెప్పే "కష్టపడు.. ఏదైనా అవసరం వస్తే కాల్ చెయ్" అనే డైలాగ్తో తన సపోర్ట్ తెలిపారు. (చదవండి: నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు) #MiddleClassMelodies ❤️ pic.twitter.com/PbnYLanq9h — Vijay Deverakonda (@TheDeverakonda) November 22, 2020 -
ఎంటర్టైనింగ్ రియలిజమ్
చిత్రం: ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’; తారాగణం: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ; నిర్మాత: వి. ఆనందప్రసాద్; ద ర్శకత్వం: వినోద్ అనంతోజు; రిలీజ్: నవంబర్ 20; ఓ.టి.టి: అమెజాన్. కథకైనా, కళకైనా మధ్యతరగతి జీవితం ఎప్పుడూ మంచి ముడిసరుకు. ఆ జీవితాలను వాస్తవికంగా చూపిస్తూనే, వినోదం పంచే నిజా యతీ నిండిన ప్రయత్నం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. కథేమిటంటే..: ఇది కొన్ని మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. గుంటూరుకు కాస్తంత దూరంలో ఉండే కొలకలూరు గ్రామంలో ఓ చిన్న హోటల్ నడుపుతుంటారు కొండలరావు, అతని భార్య (గోపరాజు రమణ, సురభి ప్రభావతి). వాళ్ళ ఒకే ఒక్క కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ). తల్లి దగ్గర నేర్చిన బొంబాయి చట్నీ స్పెషల్తో పక్కనున్న గుంటూరు పట్నంలో హోటల్ పెట్టి, పైకి రావాలని హీరో తపన. ఇంటర్ చదివే రోజుల్లోనే సంధ్య (వర్ష బొల్లమ్మ)తో ప్రేమ. హీరో గుంటూరు వెళతాడు. తల్లీతండ్రి పొలం అమ్మి ఇచ్చిన సొమ్ముతో హోటల్ పెడతాడు. తరువాత ఏమైంది, ప్రేమ ఎలా గెలిచిందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కన్నడిగురాలు వర్ష బొల్లమ్మ ఇద్దరూ పాత్రలే కనిపించేలా చేశారు. ఈ సినిమాకు హీరో కాని హీరో మాత్రం కథానాయకుడి తండ్రి పాత్రధారి గోపరాజు రమణ. రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడై, టీవీ సీరియల్స్, కొన్ని సినిమాలతో తెర పరిచితుడైన రమణ ఈ తండ్రి పాత్రధారణతో సినిమాకు ప్రాణం పోశారు. ఈ పాత్ర ఆయన కెరీర్కు కచ్చితంగా ఓ మలుపు. సురభి జమునా రాయలు లాంటి రంగస్థల కళా కారులే అత్యధికులు నటించారీ సినిమాలో! అందుకే, హీరో, హీరోయిన్ల మాటెలా ఉన్నా... చుట్టుపక్కల కనిపించే తల్లితండ్రులు, స్నేహితుల మొదలు తాగుబోతు తండ్రితో వేగలేక మొబైల్ ఫోన్ల షాపులో పనిచేసే అమ్మాయి (దివ్య శ్రీపాద), మనవరాలి చదువు కోసం తపిస్తూ పాలు అమ్మే అంజయ్య (కట్టా ఆంటోనీ) దాకా చాలామందితో ఐడెంటిఫై అవుతాం. ప్రతి ఒక్కరితో ప్రేమలో పడతాం. అలాంటి పాత్రల రూపకల్పన దర్శక, రచయితల జీవితానుభవ ప్రతిభ. అతిథి పాత్రలో ‘పెళ్ళిచూపులు’ తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. ఎలా తీశారంటే..: మధ్యతరగతి జీవితం, సాహితీ వాసనలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి, షార్ట్ ఫిల్మ్ల మీదుగా సినిమాల్లోకి వచ్చిన కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తొలి ప్రయత్నం ఈ చిత్రం. ఈ గుంటూరు కుర్రాడు మొట్టమొదటి గృహప్రవేశం సీన్ నుంచే సినిమాకు ఓ టోన్ సెట్ చేశాడు. జనార్దన్ పసుమర్తి రాసిన కథ, మాటలు చూస్తే అచ్చంగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడి సంబోధనలు, సామెతల మొదలు తిట్ల దాకా అన్నీ వినోదం పంచుతాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి బాణీల్లో ‘సంధ్యా’, ‘గుంటూరు’ పాటల లాంటివి బాగు న్నాయి. గుంటూరు వాతావరణం, అక్కడి ఫేమస్ ఫుడ్ జాయింట్ల పాట (రచన – కిట్టు విస్సాప్రగడ, గానం – అనురాగ్ కులకర్ణి) కొన్నేళ్ళు ఆ ప్రాంతవాసుల థీమ్ సాంగ్గా నిలబడిపోతుంది. ఇక, విక్రమ్ ఇచ్చిన నేపథ్య సంగీతం మరో ఆయువుపట్టు. దేవుణ్ణి నమ్మని హీరో – జాతకాల పిచ్చి ఉన్న అతని స్నేహితుడు, డబ్బున్న పెద్ద సంబంధంతో కూతురి జీవితాన్ని కట్టేయాలనుకొనే ఓ నాన్న – ఆటోవాడికైనా కూతురినిచ్చి పెళ్ళి కానిచ్చేసి తన తాగుడుకు ఢోకా లేకుండా చూసుకోవాలనుకొనే మరో తండ్రి, తండ్రీ కొడుకుల మధ్య సయోధ్యకు ప్రయత్నించే ఓ తల్లి – దురాశతో అయిన సంబంధాన్ని వద్దనుకున్న భర్తకు నచ్చజెప్పే ఓ భార్య... ఇలా చాలా పాత్రలు జీవితంలో నుంచి తెర మీదకు వచ్చాయి. జీవితంలోనూ, మనుషుల్లోనూ సింప్లిసిటీ ఎంత ఆనందాన్నిస్తుందో ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అయితే, రెండుంబావు గంటల కథాకథనంలో హీరో– హీరోయిన్ల ఇంటర్ ప్రేమకథ పర్యవసానాలను తెరపై పూర్తిగా చూపించలేదు. చెట్టు మీద నుంచి మామిడికాయ పడే దాకా బొంబాయి చట్నీలో నిపుణుడైన హీరోకు ఆ వంటలో మామిడి వాడాలనేది తెలీదంటే నమ్మలేం. రెసిపీ మార్చాడందామంటే, ఆ స్పష్టతా లేదు. పాలు పోసే అంజయ్య, చిట్ ఫండ్ డబ్బులతో ఊరికి రోడ్డు వేయించి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న అతి మంచితనపు పెదనాన్న పాత్ర లాంటి సెంటిమెంట్, ఎమోషన్లను మరింతగా తెరపై చూపించి ఉంటే, సినిమా వేరే స్థాయికి వెళ్ళేది. అలాగే, సాగదీత తగ్గించి, క్లైమాక్స్ ముందర కథనం పేస్ పెంచి, మరింత పట్టుగా రాసుకోవాల్సింది. హఠాత్తుగా సినిమా అయిపోయిందన్న ఫీలింగ్ రాకుండా చూడాల్సింది. అయితే, సినిమా మొత్తం మీద అందించిన ఫీలింగ్తో పోలిస్తే, కొత్త కుర్రాళ్ళ తొలి యత్నంగా అవన్నీ క్షమించేయవచ్చు. వెరసి, ఇదో రియలిస్టిక్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇరవై ఏళ్ళ క్రితం దర్శకులు నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ మొదలు ఇటీవలి ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘పలాస’ లాంటి ప్రయత్నాలకు కొనసాగింపు ఇప్పుడీ లేటెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు. ట్రైలర్లోనే అంతా చెప్పేసి, సినిమాలో సర్ ప్రైజులు లేకుండా చేసిన దర్శక, రచయితల తొలి ప్రయత్నంలో ఎత్తుపల్లాలున్నా... ఈ చిత్రాన్ని ఇంటిల్లపాదీ కలసి ఇంట్లోనే ఓటీటీలో చూడవచ్చు. కొసమెరుపు: చివరలో టేస్టు తగ్గినా... (అభి)రుచికరమైన బొంబాయి చట్నీ! బలాలు: కథలో నేటివిటీ మనల్ని మనకు గుర్తుచేసే పాత్రలు స్టేజ్ ఆర్టిస్టుల సినీ నటన గుంటూరు యాస, పాటలు నేపథ్య సంగీతం. బలహీనతలు: ముగింపు తెలిసే సింపుల్ స్టోరీలైన్ చివరలో సడలిన కథ, కథనం ర్ధంతర ముగింపు వినోదానికి దీటైన సెంటిమెంట్ లేమి – రెంటాల జయదేవ -
మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ రివ్యూ
టైటిల్ : మిడిల్ క్లాస్ మెలొడీస్ నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్ష బొలమ్మ, చైతన్య గరికపాటి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, తరుణ్ భాస్కర్ తదితరులు నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్ నిర్మాత: వెనిగళ్ళ ఆనందప్రసాద్ దర్శకత్వం: వినోద్ అనంతోజు సంగీతం: స్వీకార్ అగస్తీ, ఆర్హెచ్ విక్రమ్ సినిమాటోగ్రఫీ: సన్నీ కురపాటి ఎడిటర్ : రవితేజ గిరజాల విడుదల తేది : నవంబరు 20, 2020 ( అమెజాన్ ప్రైమ్) కరోనా మహమ్మారి కారణంగా సినిమా థీయేటర్లన్నీ మూతబడటంతో ఓటీటీ ప్లాట్ఫాం ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా అదేబాటలో నడిచాడు. ఆయన హీరోగా నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.. కథ పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టాలనుకునే మధ్యతరగతి కుర్రాడి కథ ఇది. గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో చిన్న హోటల్ యజమాని కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ(ఆనంద్ దేవరకొండ). రాఘవ బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. తనకు వచ్చిన పనితోనే ఫేమస్ అయిపోవాలని కలలు కంటాడు. గుంటూరులో ఓ హోటల్ పెట్టి తన బొంబాయి చట్నీ రుచి అందరికి చూపించి పేరు, ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశపడతాడు. కానీ హోటల్ పెట్టడం అతని తండ్రి కొండలరావుకు మాత్రం అస్సలు నచ్చదు. అయినప్పటికీ కొడుకు బాధ చూడలేక హోటల్ ఏర్పాటుకు అంగీకరించి డబ్బులు ఇస్తాడు. మరోవైపు వరసకు మామయ్య అయ్యే నాగేశ్వరరావు (ప్రేమ్ సాగర్) కూతురు సంధ్య (వర్ష బొల్లమ్మ)ను రాఘవ ప్రేమిస్తాడు. కానీ నాగేశ్వరావు మాత్రం కూతురు సంధ్యను వేరే వాళ్లకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాఘవ హోటల్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు? సంధ్యను పెళ్లి చేసుకోవడానికి రాఘవ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? హోటల్ ఏర్పాటుకి సంధ్య ప్రేమకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు తరుణ్ భాస్కర్ ఏ పాత్రలో కనిపించాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. ఇలాంటి సినిమాల్లోని ఎమోషన్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ కథ కొత్తదేమి కాదు. అందరికి తెలిసిన కథే. అయినప్పటికీ దర్శకుడు వినోద్ తెరకెక్కించిన విధానం బాగుంది. తొలి సినిమానే ఇలాంటి నేపథ్యం ఉన్న కథను ఎంచుకొని సాహసమే చేశాడని చెప్పొచ్చు. తొలి సీన్తోనే పాత్రలను పరిచయం చేసి, అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఏ సన్నివేశం కూడా తెచ్చిపెట్టినట్టు కాకుండా సాఫీగా కథలో భాగంగా కొనసాగుతుంది. పల్లె ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో అచ్చం అలాగే సినిమాలో చూపించారు. గుంటూరు నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆ యాసను, అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించారు. మధ్య తరగతి కష్టాలెలా వుంటాయనేది డ్రామా లేకుండా సహజంగా చూపించారు. పాటలు కూడా తెచ్చిపెట్టినట్టు కాకుండా కథలో భాగంగా వచ్చిపోతాయి. ఫస్టాఫ్ మొత్తం చాలా సాఫీగా, బోర్కొట్టకుండా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్ను మాత్రం కాస్త నెమ్మదిగా కొనసాగించాడు. హోటల్ పెట్టాక హీరోకి వచ్చిన ఇబ్బందులను తెరపై సరిగా చూపించలేకపోయాడు. చట్నీ రుచిగా లేకపోవడం, ఎన్నిసార్లు ప్రయోగం చేసినా ఫలించకపోవడం, చివరకు మామిడి కాయను చూడగానే ఏదో ఐడియా వచ్చినట్లు హీరో ఫీలై.. సక్సెస్ కావడం కన్వినెన్స్గా అనిపించదు. హీరో ఫ్రెండ్ లవ్ స్టోరిని చూపించినంత ఆసక్తిగా హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరోయిన్ పెళ్లి చూపుల సీన్ కూడా సాగతీతగా అనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా చూసిన ప్రతి మధ్యతరగతి యువకుడు తనను తాను హీరో పాత్రతో పోల్చుకుంటాడు. నటన ఆనంద్ దేవరకొండకు రెండో సినిమా ఇది. మొదటి సినిమా దొరసానితో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్ నటన కాస్త మెరుగుపడింది. మధ్యతరగతి కుర్రాడిగా ఆనంద్ చక్కగా ఒదిగిపోయాడు. మిడిల్ క్లాస్ కుర్రాడికి ఉండే కోపం, బాధ, ఫన్ను చక్కగా చూపించాడు. అయితే గుంటూరు నేపథ్యంలో సాగే కథ అయినప్పటికీ ఆనంద్ గుంటూరు యాసను పలికించడంలో కాస్త తడబడ్డాడు. ఎంత ట్రై చేసినప్పటికీ అతనిలో హైదరాబాద్ యాసే కనిపిస్తోంది. సంభాషణల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక హీరో తండ్రి కొండలరావు పాత్రలో గోపరాజు రమణ జీవించేశాడు. మధ్యతరగతి తండ్రి ఎలా ఉంటాడో అచ్చం అలాగే నటించాడు. ఆయన కోపంలోనే హాస్యాన్ని పండించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు కొండలరావు పాత్ర కచ్చితంగా గుర్తుండిపోతుంది. వర్ష బొలమ్మ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. పల్లెటూరు జనాలు మాట్లాడే మాటలనే సినిమాలో వాడారు. అయితే కాస్త బూతులు తగ్గిస్తే బాగుండేది. స్వీకార్ అగస్తి పాటలు.. ఆర్హెచ్ విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ సినిమాకు ప్లస్ అయ్యాయి. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గుంటూరు అందాల్ని చక్కగా తెరపై చూపించాడు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ఆనంద్ దేవరకొండ నటన పాత్రల చిత్రీకరణ కామెడీ మైనస్ పాయింట్స్ కొత్తదనం లేకపోవడం క్లైమాక్స్ సింపుల్గా ఉండటం తెలిసిన కథ -
బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ
సాక్షి, హిమాయత్నగర్: అందరం కలిసి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేద్దాం.. ఓటుతో నచ్చిన వాళ్లను వేగంగా ఎంచుకుందాం.. హైదరాబాద్ను బెస్ట్ సిటీగా మార్చుకుందాం. ట్రాఫిక్ రూల్స్ లాంటివి పక్కాగా ఫాలో అవ్వాలి. అంటే కొద్దిగా చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో చేస్తున్న అభివృద్ధి మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ఓటును వినియోగించుకోండి. ఓటుకు నచ్చిన వారిని ఓటు అనే ఆయుధంతో ఎన్నుకుందాం. డెవలప్మెంట్ సో బెటర్ ఓటు అనేది మన హక్కు. ఈ నగరానికి చెందిన ఒక పౌరుడిగా ఓటు హక్కుని వినియోగించుకోవడం నాతో పాటు మనందరి బాధ్యత. ఈ బాధ్యత మన నగరం, రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం. హైదరాబాద్లో చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్(మౌలిక రంగం) కూడా బాగా డెవలప్ అయింది. మన రోడ్లు, మన ఫ్లై ఓవర్లు, మన హైవేలు ఓ పదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాయి. వ్యక్తిగతంగా, పౌరులుగా మనందరం కలిసి కట్టుగా ఉండి నీటి వనరులను కాపాడుకోవాలి. మన చెరువులు, మూసీనది.. ఇవన్నీ నగర భవిష్యత్కి ఎంతో ముఖ్యమైనవి. వాటిని కాపాడుకోవాలి. చెరువుల్ని ఆక్రమించడం, వాటిని చెత్తతో నింపేయడం లాంటి విషయాలను గట్టిగా వ్యతిరేకించాలన్నది నా అభిప్రాయం. – ఆనంద్ దేవరకొండ, సినీనటుడు -
మెలొడీ మేళా
-
నేను తెలుగమ్మాయిని కాదు: హీరోయిన్
‘‘ఎంత వాణిజ్య అంశాలున్న సినిమా అయినా కథే ముఖ్యం. ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ చిత్రంలో కథే హీరో. కథకి ప్రాధాన్యత ఇస్తే సినిమా బాగుంటుంది. ఇందులో కథకి అనుగుణంగా కామెడీ ఉంటుంది’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె తన గురించిన ఎన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘నా స్వస్థలం కర్నాటకలోని కొడుగు. అయితే నా పేరు వర్ష బొలమ్మ కావడంతో తెలుగు అమ్మాయేనేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేను తెలుగమ్మాయిని కాదు. కానీ తెలుగు మాట్లాడగలను. నాకు వంట రాదు. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మా అన్న కోసం ఏదో వండి పెట్టాను.. అది తిన్న తర్వాత తనకి రెండు రోజులు ఆరోగ్యం బాగాలేదు. దీంతో అప్పటి నుంచి కిచెన్లోకి వెళ్లడమే మానేశా’’ అంటూ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.(చదవండి: నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు) ఇది రెండో సినిమా తెలుగులో ‘చూసీ చూడంగానే’ నా మొదటి సినిమా. ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ నా రెండో చిత్రం. ఇందులో నా పాత్ర పేరు సంధ్య.. నేనే డబ్బింగ్ చెప్పాను. సంధ్య సింపుల్ గర్ల్. గుంటూరులో పుట్టి పెరిగి చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూసే పాత్ర. నాన్నకు ఎదురు చెప్పదు. సంధ్య పాత్రలో నటనకు బాగా అవకాశం ఉంది. వినోద్గారు కథ చెప్పినప్పుడు నిజాయతీ ఉన్న వ్యక్తి అని తెలిసింది.. అందుకే ఆయన్ని నమ్మాను. తెలుగులో రాజ్ తరుణ్తో ‘స్టాండప్ రాహుల్’ అనే ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా’’అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చారు. కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజు తెరకెక్కించిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. వర్ష బొలమ్మ కథానాయికగా నటించిన సినిమా ఈ నెల 20 నుంచి అమేజాన్ ప్రైమ్లో ప్రసారం కానుంది.(చదవండి: ఆ సినిమా హక్కులన్నీ ‘జీ’కే సొంతం!) Building his dream castle!#KeeluGurram, song out now. ▶️ https://t.co/Kc34cWZNGK Watch #MiddleClassMelodiesOnPrime premieres on Nov 20@ananddeverkonda @vinodanantoju #DivyaSripada @SweekarAgasthi @TharunBhasckerD @rhvikram @BhavyaCreations #AnandaPrasad pic.twitter.com/D0UrQyimKE — Varsha Bollamma (@VarshaBollamma) November 16, 2020 -
నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు
‘‘నేను ఏ సినిమా ఒప్పుకున్నా ప్రేక్షకుడిలా అలాంటి సినిమాని ఎంజాయ్ చేస్తానా? లేదా? అని ఆలోచిస్తాను. అలాగే దర్శకుడు ఆ కథలో నన్ను ఎందుకు అనుకుంటున్నాడు అని కూడా అడుగుతాను’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా వినోద్ అనంతోజు తెరకెక్కించిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. వర్ష బొలమ్మ కథానాయిక. వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20 నుంచి అమేజాన్ ప్రైమ్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆనంద్ చెప్పిన విశేషాలు. ►పల్లెటూరు నుంచి గుంటూరు సిటీలో హోటల్ పెట్టాలనుకునే కుర్రాడి కథ ఇది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ జీవితాల గురించి చెప్పాం. ఆ జీవితాల తాలూకు ఎత్తుపల్లాలను చూపించాం. అవన్నీ కలిపితే ఓ మెలోడీలా ఉంటుంది. అందుకే ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అని టైటిల్ పెట్టాం. ►దర్శకుడు వినోద్ కథ చెప్పినప్పుడు ‘నన్నెందుకు హీరోగా అనుకుంటున్నావు?’ అని అడిగాను. ‘ఈ కథలో హీరో మనలో ఒకడిలా ఉండాలి. మనకు తెలిసిన అబ్బాయిలా అనిపించాలి. నువ్వలా అనిపిస్తున్నావు’ అన్నాడు. ఈ సినిమాలో ప్రతీ పాత్రకు ఓ మ్యానరిజం, ఓ స్టయిల్ ఉంటాయి. అన్ని పాత్రలను దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారు. అందుకే ఇది దర్శకుడి సినిమా.. హీరో సినిమా కాదు. ►ఈ సినిమా కోసం గుంటూరు యాస నేర్చుకున్నాను. అలాగే దోసె వేయడం, బొంబాయ్ చట్నీ చేయడం బాగా నేర్చుకున్నాను. మూమూలుగా అయితే నాకు వంట అంతగా రాదు. నేను జాబ్ చేస్తున్నప్పుడు వండుకునేవాణ్ణి. వండుకోవాలి కాబట్టి అన్నట్టు ఉండేది నా వంట. అమ్మ ఏదైనా రెసిపీ పంపితే, అది చూసి చేసుకునేవాణ్ణి. ►ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ కరెక్టే అనిపించింది. అలాగే థియేటర్స్లో రిలీజ్ అంటే ఎక్కువ థియేటర్స్ ఉంటాయా? లేదా? రెండు వారాల్లో అందరికీ చేరుతుందా? లేదా అని చిన్న టెన్షన్. కానీ అమెజాన్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. తెలుగు ప్రేక్షకులు కాకుండా అన్ని ఇండస్ట్రీల వాళ్లు చూస్తే, మన తెలుగు సినిమా పేరు కూడా పెరుగుతుంది. ►నా తర్వాతి సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఆ సినిమాను కింగ్ ఆఫ్ ది హిల్ (విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ), టాంగా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. ►ఒక ప్రేక్షకుడిగా నేను ఎలాంటి సినిమాలు ఇష్టపడతానో అలాంటి సినిమాలే చేయాలనుకుంటాను. అంతేకానీ విజయ్ తమ్ముడు కాబట్టి ఇలాంటి సినిమాలు చేయాలి, అతని స్టార్డమ్కి తగ్గ సినిమాలు చేయాలనే ఆలోచన అస్సలు లేదు. నా కథలు కూడా నేనే ఎంపిక చేసుకుంటాను. నా సినిమాల్లో విజయ్ ప్రమేయం ఇప్పటివరకూ అయితే ఏం లేదు. ఒకవేళ పెద్ద బడ్జట్ సినిమా ఏదైనా కమిట్ అయితే తన అభిప్రాయం అడుగుతాను. -
గుంటూరు ప్రేమకథ
‘దొరసాని’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ (విజయ్ దేవరకొండ తమ్ముడు) హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు దర్శకునిగా పరిచయమవుతున్నారు. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వెనిగళ్ళ ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘గుంటూరు నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. గుంటూరు జిల్లా కొలకలూరు ప్రాంతంలో, గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. ఇందులోని పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడతాయి. లాక్డౌన్ పరిస్థితుల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేశాం’’ అన్నారు. ‘‘మామూలు మనుషుల జీవితాల్లో ఉండే సున్నితమైన హాస్యాన్ని ఈ సినిమాలో చూపించాం. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది’’ అన్నారు వినోద్ అనంతోజు. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: స్వీకర్ అగస్తి, ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఆర్.హెచ్. విక్రమ్, లైన్ ప్రొడ్యూసర్: నరేష్ రెడ్డి పోలసాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
నేనేం చేస్తున్నానంటే...!
విజయ్ దేవరకొండ ఏది చేసినా విభిన్నంగా ఉండేలా చేస్తారు. ప్రస్తుతం అందరూ ‘‘బి ది రియల్ మేన్ ఛాలెంజ్’’ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లకు పనుల్లో సహాయం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్. విజయ్ను దర్శకుడు కొరటాల శివ ఈ ఛాలెంజ్కి ఎంపిక చేశారు. ‘‘రియల్ మేన్ ఛాలెంజ్ చేద్దాం అంటే మా అమ్మ నన్ను ఏ పనీ చేయనీయడం లేదు. అందుకే ఈ లాక్ డౌన్లో ఏం చేస్తున్నానో చూపిస్తాను’’ అన్నారు విజయ్. ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేవడం, బాటిల్స్లో నీళ్లు నింపడం, మామిడి పండుతో ఐస్ క్రీమ్ చేయడం, వీడియో గేమ్స్ ఆడటం వంటి పనులు చేస్తున్న వీడియోను పంచుకున్నారు విజయ్. ఈ వీడియోను విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ షూట్ చేశారు. ఈ వీడియోలో తన తండ్రిని చూపిస్తూ ‘ది రియల్ మేన్’ అని విజయ్ పేర్కొనడం విశేషం. ఈ ఛాలెంజ్కు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ని నామినేట్ చేశారు విజయ్ దేవరకొండ. -
చెక్ మేట్
పని లేని మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలకు కొలువు అంటారు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మెదడుకి మేత పెట్టారు దేవరకొండ బ్రదర్స్. చెస్ బోర్డ్ తీసి ఒకరికొకరు చెక్ పెట్టుకున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ లేకపోవడంతో స్టార్స్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. తమ హాబీలతో కాలక్షేపం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో సరదాగా చెస్ ఆడుతున్న ఫొటోను షేర్ చేశారు. -
టాక్ బాగున్నా.. కలెక్షన్లు వీక్!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ హీరోగా.. సీనియర్ నటులు రాజశేఖర్, జీవితల కూతురు శివాత్మికను హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా దొరసాని. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ బాగానే వినిపించింది. అయితే టాక్ బాగున్నా కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవన్న టాక్ వినిపిస్తోంది. దొరసానితో పాటు రిలీజ్ అయిన నిను వీడని నీడను నేనే ఇప్పటికే దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్కు చేరువ కాగా దొరసాని కలెక్షన్ల వేటలో బాగా వెనుక పడిందన్న టాక్ వినిపిస్తోంది. వీకెండ్స్లోనే పెద్దగా ప్రభావం చూపించకపోవటంతో వీక్ డేస్లో పరిస్థితి మరి మరింత దారుణంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. -
‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!
ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తన అభిమానులను ప్రేమగా రౌడీస్ అని పిలిచే విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలోనూ తన తమ్ముడి కెరీర్ను గాడి పెట్టే పనిలో ఉన్నాడు. విజయ్ దేవరకొండ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆనంద్ తొలి సినిమాతో మంచి మార్కలు సాధించాడు. సినిమా డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లనే సాధిస్తోంది. అయితే తొలి సినిమాతో ప్రయోగం చేసిన ఆనంద్ రెండో సినిమాగా మాత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆనంద్ దేవరకొండ రెండో సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. భవ్యక్రియేషన్స్ బ్యానర్ కొత్త దర్శకుడితో ఆనంద్ రెండో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు విజయ్ కోసం దర్శకుడు తయారు చేసుకున్న కథనే ఆనంద్ కోసం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ నిజమైతే ఈ నెలలోనే ఈప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు
‘‘మనకు థియేటర్స్ ఎక్కువైపోయాయి.. ఫీడింగ్ తక్కువైంది. చిన్న సినిమాలకు మంచి రోజులొచ్చాయి. ఎగ్జిబిటర్స్ అందరూ చిన్న సినిమాలవైపే చూస్తున్నారు. పెద్ద నిర్మాతలు కూడా చిన్న సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు’’ అని నిర్మాత ‘మధుర’ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దొరసాని’. సురేశ్బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొయెటిక్, మ్యూజికల్ లవ్స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాం. 1980లో తెలంగాణ ఎలా ఉంది? గడి సంస్కృతి ఏంటి? అనే విషయాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో అచ్చం తెలంగాణ వాతావరణం కనిపించిందంటున్నారు. పాత కాలాన్ని సృష్టించడానికి చాలా కష్టపడ్డాం. పౌడర్ డబ్బా కోసమే 4–5 నెలలు తిరిగాం. 14లక్షలు పెట్టి గడిని బాగుచేయించి షూట్ చేశాం. మరో 5 లక్షలు ఆ ఊరి అభివృద్ధి కోసం అందించాం. ఈ చిత్రంతో 60మంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. ఓపెనింగ్ తక్కువగా ఉన్నప్పటికీ మ్యాట్నీ నుంచి కలెక్షన్లు పెరిగాయి. ఇంతకుముందు వచ్చిన తెలుగు గొప్ప ప్రేమకథలు తీసుకుంటే తెలుగు దర్శకులు తీసినవి తక్కువ. ఆనంద్, శివాత్మిక కావాలనుకుంటే మంచి గ్లామర్ ఉన్న సబ్జెక్ట్ను ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ఇలాంటి సబ్జెక్ట్ను ఎంచుకోవడంలోనే ఆర్టిస్ట్గా వాళ్ల నిబద్ధత, నిజాయతీ తెలుస్తోంది. కమర్షియల్ అంశాలు జోడించి ఈ స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు. ప్రేక్షకుల్లో టాక్ బాగుంది. పాజిటివ్ టాక్ని మించిన ప్రమోషన్ ఏంటి? సోషల్ మీడియాలో కవిత్వాలు రాస్తున్నారు. నాలుగు వారాలుగా మంచి సినిమాలు రావడం శుభ పరిణామం. కొత్త సినిమా ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఆనంద్ దేవరకొండతో మరో సినిమా, మహేంద్రతో ఓ సినిమా చేస్తాం’’ అన్నారు. -
‘దొరసాని’ మూవీ రివ్యూ
-
‘దొరసాని’ మూవీ రివ్యూ
టైటిల్ : దొరసాని జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, వినయ్ వర్మ, కిషోర్ తదితరులు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి నిర్మాత : మధుర శ్రీధర్, యష్ రంగినేని దర్శకత్వం : కె.వీ.ఆర్ మహేంద్ర విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా దొరసాని చిత్రంతో పరిచయం అవుతున్నారు. గడీలు, దొరల కాలం నేపధ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్తో అంచనాలను పెంచేసి.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ దొరసాని చిత్రం.. ఆనంద్, శివాత్మికలకు మంచి బ్రేక్ ను ఇచ్చిందా? తొలి ప్రయత్నం లొనే విజయం సాధించి.. వీరిద్దరు మంచి నటులుగా గుర్తింపును తెచ్చుకున్నారా? అన్నది చూద్దాం. కథ అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో గడీల రాజ్యం నడిచేది. ఓ ఊరి దొర రాజారెడ్డి (వినయ్ వర్మ) కూతురు దొరసాని దేవకి(శివాత్మిక రాజశేఖర్)ని రాజు (ఆనంద్ దేవరకొండ) ప్రేమిస్తాడు. గడీ వైపు చూడాలంటే కూడా భయపడే ఊళ్లో.. రాజు మాత్రం ఏకంగా దొరసానిని ప్రేమిస్తాడు. దొరసాని కూడా రాజును ప్రేమిస్తూ ఉంటుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన దొర ఏం చేశాడు? ఈ కథలో కామ్రేడ్ శంకరన్న(కిషోర్)కు ఉన్న సంబంధం ఏంటి? శంకరన్న వీరి ప్రేమకు ఎలాంటి సహాయం చేస్తాడు? రాజు-దొరసానిల ప్రేమ ఫలించి చివరకు ఒక్కటయ్యారా? లేదా అన్నదే మిగతా కథ. నటీనటులు రాజు పాత్రలో ఆనంద్ దేవరకొండ చక్కని నటనను కనబర్చాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ ఉంటే.. ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ గుర్తుకు వస్తుంటాడు. అతని గొంతులోనే కాకుండా లుక్స్ పరంగానూ అక్కడక్కడా విజయ్లా కనిపిస్తాడు. మొత్తానికి మొదటి ప్రయత్నంగా చేసిన ఈ రాజు పాత్ర ఆనంద్కు కలిసి వచ్చేలా ఉంది. ఇక దొరసానిగా నటించిన శివాత్మికకు ఉన్నవి ఐదారు డైలాగ్లే అయినా.. లుక్స్తో ఆకట్టుకుంది. దొరసానిగా హావభావాలతోనే నటించి మెప్పించింది. ఈ చిత్రంలో ఇద్దరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. ‘దొరసాని’ని వీరిద్దరే నడిపించారు. దొర పాత్రలో వినయ్ వర్మ, నక్సలైట్గా కిషోర్, రాజు స్నేహితులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు. విశ్లేషణ పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి మధ్య ప్రేమ.. ఇలాంటి కథలు మన టాలీవుడ్లో ఎన్నోం చూశాం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో ప్రేమ అనేది లేకుండా మనవాళ్లు తెరకెక్కించిన దాఖాలాలు లేవు. ప్రేమే ఇతివృత్తంగా లేదంటే.. ప్రేమను ఓ భాగంగా గానీ చేసి కథ రాసి మనవాళ్లు సినిమాలను తీస్తుంటారు. అయితే ఎన్నోసార్లు చూసిన ప్రేమ కథే అయినా.. తెరకెక్కించడంలో కొత్తదనం చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. హీరోహీరోయిన్లు తమ నటనతో తెరపై ఫ్రెష్నెస్ను తీసుకొస్తే అందరూ ఆ కథలో లీనమౌతారు. దొరసాని కూడా అలాంటి కథే. ఈ కథకు తెలంగాణ గడీల నేపథ్యాన్ని, యాసను జోడించడమే దర్శకుడి మొదటి విజయం. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి.. స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లను తీసుకుంటే ఆ పాత్రకు సరైన న్యాయం జరిగేది కాదేమో అని అనిపించేలా ఆ పాత్రలను మలిచాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని కమర్షియల్ బాట పట్టించకుండా తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి.. ‘దొరసాని’ని ఓ కళాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే నిదానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందా అన్నది తెలియాలి. ఎక్కడా బోర్ కొట్టించకపోయినా.. తరువాతి సీన్ ఏంటో అన్నది ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతుంది. నిదానంగా సాగుతూ ఉండటంతో.. ప్రేక్షకులు కొంత అసహనానికి ఫీలయ్యే అవకాశం ఉంది. చివరగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఊహించిందే అయినా.. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్. విహారి తన పాటలతో ఆకట్టుకోగా, బ్యాగ్రౌండ్ స్కోర్తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సన్నీ కూరపాటి తన కెమెరాతో అప్పటి తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ఎడిటర్ నవీన్ నూలి ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. చక్కటి ఫీల్ ఉన్నా.. నెమ్మదిగా సాగే ఈ ‘దొరసాని’ని ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్లస్ పాయింట్స్ నటీనటులు సంగీతం మైనస్ పాయింట్స్ స్లోనెరేషన్ ఊహకందేలా సాగే కథనం బండ కళ్యాణ్, సాక్షి వెబ్డెస్క్. -
నాపై నాకు నమ్మకం పెరిగింది
‘‘నిశీధి’ అనే షార్ట్ ఫిల్మ్ తర్వాత మూడేళ్లు ఏ పనీ చేయకుండా ‘దొరసాని’ కథ రాశాను. దాదాపు 42 వెర్షన్స్ రాశాను. ఈ స్టోరీ వరల్డ్ను అర్థం చేసుకోవడానికి, బుక్స్ చదవడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. కథకు ఉన్న బలం వల్లే నేడు ‘దొరసాని’ సినిమా విడుదలవుతోంది’’ అని దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర అన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ‘దొరసాని’ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.వి.ఆర్. మహేంద్ర మాట్లాడుతూ– ‘‘మాది వరంగల్ జిల్లాలోని జయగిరి. అందరిలాగే ఎన్నో సినిమా కష్టాలు పడ్డాను. నేను చేసిన ‘నిశీధి’ షార్ట్ ఫిల్మ్ చూసి, నా దర్శకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్గారు నాకు మెయిల్ చేశారు. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఇలా ‘దొరసాని’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. రెండు గంటల పదిహేను నిమిషాలు మా సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాం. ఆ రోజుల్లో దొర వ్యవస్థ, పరిస్థితులకు ఓ అందమైన ప్రేమకథని జోడించాం. కథ, కథలోని స్వచ్ఛత, నిజాయతీ అందరికీ నచ్చుతుంది. రాజు పాత్రకి ఆనంద్, దొరసాని పాత్రకి శివాత్మిక చక్కగా సరిపోయారు. శివాత్మికలో నిజంగానే దొరసాని ఉంది. ‘నీ తర్వాతి సినిమా నాతోనే చెయ్యాలి’ అని రాజశేఖర్గారు ఇప్పటికే చాలాసార్లు నవ్వుతూ అడిగారు. ‘ఓ కథ ఉంటే చెప్పు’ అని విజయ్ దేవరకొండగారు కూడా అడిగారు. ‘దొరసాని’ రిలీజ్ అయ్యాక నా తర్వాతి సినిమా డిసైడ్ అవుతుంది’’ అన్నారు. -
అన్న దొరకడంలేదు.. తమ్ముడు కావాలన్నారు
‘‘మా అన్న (విజయ్ దేవరకొండ) చాలా ఇబ్బందులు చూశాడు. కానీ, తనకు వచ్చిన సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. ప్రతిభ ఉంటే విజయం సాధించొచ్చనే నమ్మకం కలిగింది’’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. డి.సురేశ్బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► అన్న చేసిన ‘అర్జున్ రెడ్డి’ తర్వాత కొంతమంది మా నాన్నకి ఫోన్ చేసి, మీ పెదబాబు డేట్స్ దొరకడం లేదు.. చినబాబు దొరుకుతాడా? అని అడిగారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. వారి మాటలను అప్పుడు సీరియస్గా తీసుకోలేదు. అన్నయ్య వ్యాపారాలను సపోర్ట్ చేద్దామని ఉద్యోగం వదిలి ఇండియాకి వచ్చాను. ► నేను అమెరికాకు వెళ్లక ముందు థియేటర్స్ చేశాను. నటనలో అనుభవం ఉంది కానీ కెమెరా ముందు లేదు. ఆ టైమ్లో మహేంద్రను కలిశాక నటనపై ఉన్న భయాలు పోయాయి. ఆయన 5 గంటలు కథ చెప్పాడు. ‘దొరసాని’ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ► 1980లో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. రాజు, దొరసాని మధ్య జరిగిన ప్రేమకథ. కథలోని స్వచ్ఛత, నిజాయతీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. అన్నీ రియల్ లొకేషన్స్లో షూట్ చేశాం. ► విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఉన్నాడని సినిమా సర్కిల్లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దామనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్ చేశాం. ఆ పాత్రలకు సరిపోతాం అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మమ్మల్ని తీసుకున్నారు. ► ఇందులో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ధనవంతురాలైన దొరసానిని ప్రేమించిన పేదవాడైన రాజు చాలా సహజంగా అనిపిస్తాడు. ఈ సినిమాలో యాక్షన్, యాంగర్, లిప్లాక్లు లాంటివి ఏమీ ఉండవు. ► అన్నకు, నాకు సినిమాలంటే చాలా పిచ్చి. నాన్న టీవీ షోలు, సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు. స్కూల్ డేస్ నుంచే అన్న స్టోరీలు రాసేవాడు. తను యాక్టర్ కాకపోతే డైరెక్టర్ అయ్యే వాడేమో బహుశా! ► ‘దొరసాని’ కథను ఓకే చేశాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి మా బాధ్యతను మరింత పెంచారు. ► నా తర్వాతి సినిమా కోసం రెండు కథలు విన్నాను. వాటిల్లో వినోద్ ఆనంద్ దర్శకత్వంలో ఒకటి. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభించాలనుకుంటున్నాం. నాకు ఏదైనా పాత్ర కరెక్టుగా సరిపోతుందని అన్నయ్యకి అనిపించి, నన్ను చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేస్తా. -
‘మా ప్రేమను మీరూ ఫీల్ అవుతారు’
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధురా ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొరసాని. మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికేట్ని పొందింది. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న దొరసాని చిత్రం ఈ నెల 12న రిలీజ్కి రెడీ అవుతున్న సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. దొరసాని గురించి ఇది ఒక పిరియాడిక్ లవ్ స్టోరీ, రాజు, దొరసాని మద్య జరిగిన ప్రేమకథ. నిజజీవితానికి దగ్గరగా ఉండే ప్రేమకథ. కథలోని స్వచ్ఛత, నిజాయితీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. అన్నీ రియల్ లోకేషన్స్లో షూటింగ్ చేసాము. ఆ కథలోని ఆత్మను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసాం. దర్శకుడు మహేంద్ర ఎక్కడా ఫేక్ ఎమోషన్స్ని రానీయలేదు. కథను దర్శకుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ ఆఫర్స్ ని సీరియస్ గా తీసుకోలేదు అన్నయ్య (విజయ్ దేవరకొండ) అర్జున్ రెడ్డి తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు సీరియస్గా తీసుకొలేదు. ఇండియాకి అన్నయ్య బిజినెస్ని సపోర్ట్ చేద్దామని వచ్చాను. యూఎస్కి వెళ్ళకు ముందు థియేటర్స్ చేసాను. యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందికానీ సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. ఆ టైంలో దర్శకుడు మహేంద్రను కలిశాక సినిమా మీద ఉన్న భయాలు పోయాయి. ఆయన 5 గంటలు కథ చెప్పాడు. ఆ కథను చెప్పిన తీరులోనే నాకు అర్దం అయ్యింది. ప్రతీ పాత్ర రియల్గా ఉంటుంది. కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట, కోదాడ దగ్గరలోని గడిలో ఎక్కువ రోజులు షూట్ చేసాము. అన్న టెన్షన్ పడ్డాడు సినిమా చూసే ముందు అన్న టెన్షన్ పడ్డాడు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా ఆనంద పడ్డాడు. సినిమా చూసిన తర్వాత నాకు అన్న ఇచ్చిన ఎనర్జీ కాన్ఫిడెన్స్ని పెంచింది. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యాము విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఒకడు ఉన్నాడు అని సినిమా సర్కిల్లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్ చేసాము. ఆ క్యారెక్టర్స్కి ఫిట్ అవుతాము అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మేము ప్రాజెక్ట్లోకి వచ్చాము. శివాత్మికను అందుకే కలవలేదు ఈ కథలో రాజు, దేవకి పాత్రల మద్య ఎక్కువ చనువు ఉండదు. అందుకే మాకు వర్క్ షాప్లు విడివిడిగా నిర్వహించారు. షూటింగ్ లోకేషన్లో కూడా పాత్రల మద్య గ్యాప్ను మెయిన్ టైన్ చేసాము. మేము ప్రెండ్స్ అయితే ఆ ఫీల్ స్క్రీన్ మీదకు వస్తుందని ఆ జాగ్రత్త తీసుకున్నాము. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అన్న నాకు ధైర్యం ఇచ్చాడు అన్న చాలా స్ట్రగుల్స్ చూసాడు. కానీ అన్నకు వచ్చిన సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. టాలెంట్ ఉంటే సక్సెస్ అవ్వొచ్చు అనే నమ్మకం కలిగింది. కానీ నా ప్రతిభే నన్ను నిలబెడుతుందని నాకు తెలుసు. ఒక బ్రదర్గా తన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ స్టార్గా కాదు. అన్నతో పోలికలన్నీ సినిమా తర్వాత పోతాయి అని నమ్ముతున్నాను. నా పాత్ర హీరోలాగా ఉండదు ఇందులో నాపాత్ర చాలా రియలిస్టిక్గా ఉంటుంది. రాజు చాలా సహాజంగా అనిపిస్తాడు. దొరసానిని ప్రేమించిన రాజు లాగా కనపడతాను. చేసిన పాత్రలు రియల్ లైఫ్ పాత్రలను ప్రతిబింబిస్తే చాలు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని నమ్ముతాను. అన్న మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చాయి ఇంట్లో అందరం ప్రాక్టికల్గా ఉంటాము. ఎమోషనల్ టాక్స్ తక్కువ. కానీ అన్న నాగురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే తమ్ముడ్ని చూసుకోవాలని అన్నకు ఉంటుంది. కానీ నా కష్టం నేను పడాలి, నా కథ నేను వెతుక్కొవాలి అని అన్న అనుకున్నాడు. స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్నలాగే ఫీల్ అయ్యాను. అన్నది పదేళ్ళ ప్రయాణం. అందులో చాలా చూసాడు. అన్నతో పాటు ఒక సారి ఆడిషన్స్కి వెళ్ళాను. సెలెక్ట్ అవలేదు ఆ రోజు అన్న ఎంత బాధ పడ్డాడో నేను దగ్గర నుండి చూసాను. నాన్న సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్కషన్స్ ఉండేవి. సినిమా ముందు వచ్చే కామెంట్స్ ని పట్టించుకోను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ని సీరియస్గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా నటన మీద వచ్చే విమర్శలను తీసుకుంటాను. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది. ఇది స్వచ్చమైన ప్రేమకథ ఇందులో మా ప్రేమకథ స్వచ్చంగా ఉంటుంది. యాక్షన్, యాంగర్ అలాంటివి ఏమీ ఉండవు. లిప్ లాక్లు అంత ఇపార్టెంట్ కావు. మా ప్రేమకథలో చాలా టర్న్స్ ఉంటాయి. మా ప్రేమను మీరు ఫీల్ అవుతారు. దర్శకుడు మహేంద్ర గ్రేట్ స్టోరీ టెల్లర్. మా కథలోని అన్ని క్యారెక్టర్స్ మీద అతనికి పూర్తి క్లారిటీ ఉంది. అతను మంచి దర్శకుడిగా నిలబడతాడు. నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు కథను ఓకే చేసాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. అంతా కొత్త వాళ్లమే అయినా మాపై పూర్తి నమ్మకం ఉంచారు. మా బాద్యతను మరింత పెంచారు. ఫైనల్ ప్రొడక్ట్ చూసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. -
కన్నీరు పెట్టుకున్న విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: ‘చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం తిరుగుతుంటే నా తమ్ముడు ఆనంద్ నన్నూ, కుటుంబాన్ని పోషించాడు’ అంటూ విజయ్ దేవరకొండ గతాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ‘ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆనంద్ కారణం’ అంటూ విజయ్ ఉద్వేగానికి లోనయ్యారు. విజయ్ ఏడ్వటమే కాదు తన ప్రసంగంతో అక్కడున్న వారంవదరినీ ఏడిపించేశారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన దొరసాని చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘చిన్నప్పుడు వాడి తరగతి గదిలో కంటే నా క్లాస్లోనే ఎక్కువ కూర్చునేవాడు’ అంటూ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ‘ఎంతో కష్టపడి అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్నావు. ఎందుకురా వస్తా అంటున్నావు? వచ్చి ఏం చేస్తావ్? అని అడిగితే నా రౌడీ(విజయ్ బట్టల వ్యాపారం)ని చూసుకుంటానన్నాడు. సరేలే అని ఒప్పుకున్నా.. కానీ తర్వాత నటన అంటే ఇష్టం ఉందంటూ సినిమాల్లోకి వస్తానన్నాడు. తను సినిమాల్లోకి రావటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. అందుకే వద్దని వారించాను. అయినా వినకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అప్పటి నుంచి తనతో మాట్లాడటమే మానేశా. ఒక నటుడిగా స్క్రిప్ట్ దగ్గరి నుంచీ, సినిమా విడుదలయేంతవరకు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో వాడికి తెలియాలి. అందుకే దొరసాని చిత్రాన్ని ప్రమోట్ చేయనని చెప్పాను. తనంతట తాను అన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో నాకిష్టం లేకపోయినా వాడికి దూరంగా ఉన్నా... ఇప్పుడు ఆనంద్ తన సినిమా వ్యవహారాలను చూసుకోగలడనే నమ్మకం కుదిరింది’ అంటూ విజయ్ కన్నీరు పెట్టుకున్నారు. ‘దొరసాని షూటింగ్ సమయంలో నేను డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నా. ఇంతవరకు దొరసాని సినిమా గురించి మేము మాట్లాడుకుంది లేదు. దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్కు నన్ను అతిథిగా పిలిచారు. అయితే సినిమా చూశాకే వస్తానన్నాను. కానీ సినిమా చూసిన తర్వాత తమ్ముడిని చూసి గర్వంగా ఫీలవుతున్నానంటూ ఆనంద్పై ప్రశంసలు కురింపించారు. తాను కూడా మొదటి చిత్రంలో ఇంతబాగా చేయలేనేమోనంటూ చిత్ర యూనిట్కు విజయ్ అభినందనలు తెలిపారు. దొరసాని టీంను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా పోస్టర్, ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సమయంలో ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా వస్తాయి. రెండింటిని సమానంగా స్వీకరించగలగాలన్నారు. చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘ఇది ఒక వింత ప్రపంచం. ప్రేక్షకులు మిమ్మల్ని ఆరాధిస్తారు, కొన్ని సార్లు ద్వేషిస్తారు. వాళ్లు ఏమైనా చేయగలరు. మీ పని మీరు సరిగా చేయండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా కథానాయిక రాజశేఖర్ కూతురు శివాత్మికను, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డిని అభినందించారు. ఇప్పటికే అంచనాలు పెంచేసిన దొరసాని చిత్రం జులై 12న విడుదల కానుంది. -
‘దొరసాని’ ప్రీ రిలీజ్ వేడుక
-
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న దొరసాని సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్, ట్రైలర్కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ మాత్రం తమ్ముడు నటిస్తున్న సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీజర్, ట్రైలర్లపై కూడా స్పందించలేదు. అయితే ఆదివారం జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకలో ఒకేసారి తన అనుభూతులన్నింటిని పంచుకునేందుకే ఇప్పటి వరకు విజయ్ స్పందించలేదని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న విజయ్, ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న దొరసాని సినిమాతో రాజశేఖర్ జీవితల చిన్నకూతురు శివాత్మిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.