Andhra Pradesh capital
-
నీటిలో తేలియాడే రాజధానా?
వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు. అలా కాకుంటే ప్రాంతాల మధ్య అసమా నతలు పెరిగిపోతాయి. అంటే పేదరికం, నిరుద్యోగం ప్రబలడం, పెత్తందారులు, బలవంతులు పేట్రేగిపోవడంజరుగు తుంది. దాని ఫలితంగా తీవ్రవాదం వైపు పీడితులు ఆకర్షితులు అవుతారు. అత్యంత వెనుకబడిన 1.59 కోట్ల జనాభా కలిగిన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చి సమా నాభివృద్ధి సాధించామని శాసనసభలో చెప్పడం సరికాదు. విభజన చట్టంలో పొందుపరచిన ఎయిమ్స్, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ,బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, హార్టికల్చర్ హబ్, హైకోర్టు, లా యూనివర్సిటీ, లా అకాడమీ, కియా లాంటి పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం వల్లనే రాయ లసీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం తదితర చర్యల ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికీ కృషి చేయాలి.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఉమ్మడి సంప దను అన్ని ప్రాంతాలవారికీ సమానంగా పంచడం. అది భిక్ష కాదు. అభివృద్ధి ఫలాలు పొందడం ప్రతి పౌరుని హక్కు. ఇప్పటికే ఏడాదికి మూడు పంటలు పండుతూ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అమరావతి నిర్మాణానికి ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు పెట్ట పూను కోవడం ఏ పాటి వికేంద్రీకరణో, ఎటువంటి న్యాయమో పాలకులే చెప్పాలి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని మేధావులు చెప్పినా వినకుండా ఒక వర్గం, కేవలం 29 గ్రామాల ప్రాంత ప్రయో జనాల కోసమే లక్ష కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ ప్రభుత్వం అనడం సమంజసమేనా? 2014 నుండి 2019 వరకు 5,000 కోట్లు తాత్కాలిక నిర్మా ణాల కోసం చేసిన ఖర్చు నీటిపాలు అయ్యింది. నేడు మరలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి 12 వేల కోట్లు, ఇతర సంస్థల నుండి రుణాలు, బాండ్ల ద్వారా 23 వేల కోట్లు... మొత్తం 50 వేల కోట్లు అప్పులు చేసి, ఐదేళ్లలో ఖర్చు పెట్టాలని ప్రభుత్వం పూనుకుంది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు అనగా ఐదు నెలల కాలంలోనే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్లో నిధులు కేటా యించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీతో ఏడీబీ ద్వారా తీసుకుంటున్న 15 వేల కోట్ల రూపాయలలో కేవలం అమరావతి రక్షణ చర్య లకే... అంటే కొండవీటి వాగు, బుడమేరు వంక నీటి మళ్లింపు కాలువలు; కృష్ణా నది కరకట్ట, వివిధ రిజర్వాయర్ల నిర్మాణం, డైవర్షన్, డ్రైనేజీ కెనాల్స్, లిఫ్ట్ స్కీములకే రూ. 8000 కోట్లు ఖర్చు చేయాలని... అప్పు ఇచ్చే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్మాణ ప్రాంతాన్ని పడవలలో ప్రయాణం చేసి తనిఖీ చేసిన తర్వాత నిర్ణయించడాన్ని బట్టి అది ‘నేల మీద నిర్మించే రాజధాని కాదు, నీటి మీద నిర్మించే తేలియాడే (ఫ్లోటింగ్) రాజధాని’ అని అర్థమయిపోతుంది. రాష్ట్రంలో సువిశా లమైన భూములు ఉండి కూడా తేలి యాడే రాజధాని నగరాన్ని నిర్మించడం వెర్రితనం.కాబట్టి టెక్నాలజీకి మేమే ఆదిగురువులమని చెప్పుకునే కూటమి నాయకులు శాస్త్రీయ పద్ధతులలో ఆలో చన చేసి అమరావతిలో శాసనసభ,సచి వాలయం నిర్మాణాలకు పరిమిత మైతే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ఉండే విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, అనంతపురం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్ది, ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. అప్పుడే సంపద సృష్టికి వీలుంటుంది. లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చెబుతున్న 2047 విజన్ సాకారం కాక పోగా, రాష్ట్రం అప్పులపాలై తాకట్టు పెట్టే పరిస్థి తులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త!– కె.వి. రమణ ‘ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
విశాఖ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలన రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ పరిపాలన రాజధాని కాబోతుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. లీగల్ ఇష్యూస్ వల్ల కాస్త ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి రెండు, మూడు నెలల్లో విశాఖ రాబోతున్నారు. త్వరలోనే విశాఖ ఏపీ పరిపాలన రాజధాని కాబోతుంది. అన్ని ప్రాంతాల ప్రజలకు అనువైన ప్రాంతం విశాఖ. దక్షిణ భారతదేశానికి ముంబై నగరం వంటిది విశాఖ అని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడిపై కూడా సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై మాట్లాడుతూ.. చంద్రబాబు మీద దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు బలమేంటో 2019 ఎన్నికల్లోనే చూశాం. చంద్రబాబు ఏమైనా పెద్ద బలవంతుడా దాడులు చేయడానికి.. ఓడిపోయిన తర్వాత మూడేళ్ల పాటు చంద్రబాబు ఇంట్లోనే ఉన్నారు. ఏడాది నుంచి బయటకు వచ్చి టీడీపీపై దాడి అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు తరహాలోనే ప్రజలను రెచ్చగొడుతున్నారు. పవన్కు ఒక విధానం అంటూ లేదు. ఒకసారి సీఎం పదవి వద్దంటాడు.. మరోసారి పదవి కావాలంటాడు అంటూ విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: ఈనాడు బ్యానర్.. పచ్చ బ్యాచ్ కోసం పాకులాట.. రామోజీ అడ్డంగా దొరికాడు -
AP:రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?
సాక్షి, అమరావతి: ‘‘రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా?’’ అని హైకోర్టు ధర్మాసనం రాజధాని పిటిషనర్లను ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమని వ్యాఖ్యానించింది. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పజాలరని స్పష్టం చేసింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేనని, అంతేకానీ భూములిచ్చిన వారివి కాదని పేర్కొంది. రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అందుకు సంబంధించిన వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా రాజధాని ప్రాంతంలో 1,134 ఎకరాలను ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించాలని సీఆర్డీఏ కమిషనర్ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రస్తుత దశలో స్టే విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని, అందువల్ల కేటాయింపులను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజధాని విషయంలో కొన్ని అంశాలను హైకోర్టులో, కొన్నింటిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారని ప్రస్తావిస్తూ జీవో 45పై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని, అవి ప్రభుత్వ విధుల్లో భాగమని తేల్చి చెబుతూ జీవో 45పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ, సీఆర్డీఏలను న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్ను పరిశీలించిన తరువాతే మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలపై పిటిషన్లు.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రినాయుడు, ఉన్నం మురళీధరరావు, దేవ్దత్ కామత్, వీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు వాదించారు. ఇళ్ల స్థలాల నిమిత్తం గతంలో జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసిందని మురళీధరరావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తరువాత సీఆర్డీఏ చట్టానికి సవరణలు చేసి ఆర్ 5 జోన్ తెచ్చారన్నారు. తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలిస్తాం.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొనగా దీన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. రాజధాని భూములను అన్యాక్రాంతం చేయడం, బదలాయించడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయరాదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 అంశాలపైనే స్టే విధించిందన్నారు. మిగిలిన అంశాల విషయంలో హైకోర్టు తీర్పు అమల్లోనే ఉందని నివేదించారు. పరిస్థితిని జఠిలం చేయలేం.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రజలందరిదని, అది ఏ వ్యక్తిదో, వర్గానిదో కాదని స్పష్టం చేసింది. రాజధానిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో జీవో 45 విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను జఠిలం చేస్తోందంటూ పిటిషనర్ల న్యాయవాది దేవ్దత్ కామత్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించడంతో... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తమను భాష్యం చెప్పమని కోరుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కావాలంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొనగా దానిపై ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందని ధర్మాసనం తెలిపింది. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలేమిటి? ఈ వ్యాజ్యాలను ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరం ఏముందో చెప్పాలని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిదీ అత్యవసరమంటూ పిటిషన్లు దాఖలు చేయడాన్ని తాము ఎంతమాత్రం హర్షించబోమని, తమను ఒత్తిడి చేయవద్దని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపులు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని, ఈ దశగా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి ఓ సమావేశం నిర్వహించి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారని, అందువల్లే జీవోపై స్టే కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు నివేదించారు. ‘ప్రభుత్వం పని చేయాల్సిందే కదా. నిర్ణయాలు తీసుకోకుండా ఎలా నిరోధించగలం? అసలు ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రభుత్వం భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే చెప్పింది. కేటాయింపులు ఇంకా జరగలేదు. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలు దాఖలు చేయడం ఏమిటి? ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయనివ్వండి. ఆ తరువాత ఏం చేయాలో చూద్దాం...’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరు.. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ థర్డ్ పార్టీలకు భూములు కేటాయిస్తే విషయం జఠిలం అవుతుందన్నారు. తదుపరి దాఖలు చేసే వ్యాజ్యాల్లో వారందరినీ ప్రతివాదులుగా చేయాల్సి ఉంటుందని, ఆది అచరణ సాధ్యం కాదన్నారు. పిటిషనర్లు రైతులని, ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల వారి హక్కులు ప్రభావితం అవుతాయన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని, అందరి తరఫున వ్యాజ్యాలు వేసి జీవో మొత్తాన్ని నిలుపుదల చేయాలని కోరలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇతరులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తు చేసింది. ప్రస్తుత దశలో జీవో 45 విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. అపరిపక్వమైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరని వ్యాఖ్యానించింది. రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇతరులకు ఇళ్ల స్థలాలివ్వడం చట్ట విరుద్ధమని మరో సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు వాదించారు. ఇన్సైడర్స్.. అవుట్ సైడర్స్ ఏమిటి? సీనియర్ న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపిస్తూ మే మొదటి వారంలో ఇళ్ల స్థలాలివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. అవుట్సైడర్స్కు (రాజధానేతరులు) ఇళ్ల స్థలాలిస్తూ వివాదాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రాజధాని ప్రజలందరిదీ, కేవలం పూలింగ్ కింద భూములిచ్చిన వారిది మాత్రమే కాదని పేర్కొంది. అవుట్ సైడర్స్, ఇన్సైడర్స్ అంటూ మాట్లాడొద్దని సూచించింది. రాజధాని భూములను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా అదే జరుగుతోందని తెలిపింది. -
ఏపీ రాజధాని కేసు విచారణ తేదీ ఇచ్చిన సుప్రీం కోర్టు
-
రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కేంద్రం స్పష్టం చేసిందని ఏపీ పరిపాలన వికేంద్రీకరణ సాధన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం ప్రకటనను వక్రీకరిస్తూ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 5, 6, 94లలో పేర్కొన్న అంశాలను వక్రీకరిస్తూ అమరావతే ఏకైక రాజధాని అని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన గురువారం ఖండించారు. కొత్త రాజధానిలో హైకోర్టు, రాజ్భవన్, ఇతర కార్యనిర్వాహక హెచ్వోడీలు ఏర్పాటు చేయాలని.. ఆ చట్టంలోని సెక్షన్ 94(3)లో పేర్కొన్నారన్నారు. ఈ అంశాలను సెక్షన్ 6లో పేర్కొన్న అంశాలతో సమన్వయపరిచి చూడాలన్నారు. రాజదాని ఏర్పాటు కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను పరిశీలించి.. నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని.. సెక్షన్ 6లో స్పష్టం చేశారన్నారు. ఆ ప్రకారం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో అధికార వ్యవస్థలను వికేంద్రీకరణ విధానంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారన్నారు. ఆ ప్రకారమే వెనుకబడిన ఉత్తరాంధ్రలో పరిపాలన రాజదాని ఏర్పాటుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించాలన్నారు. -
చినబాబు ఫ్లాప్ షో..అందుకే చంద్రబాబు టాక్ షో..
యడ్లపాడు: రాజధాని గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆమె గురువారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత మనుషులకు దోచిపెట్టేందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నిజంగా ఆయనకు రాజధాని నిర్మించాలనే ఉద్దేశమే ఉంటే తాత్కాలిక భవనాలతోనే ఎందుకు సరిపెట్టారని ప్రశ్నించారు. శాశ్వత నిర్మాణాల్లేకుండా, మౌలిక వసతులు కూడా కల్పించకుండా రాజధాని నిర్మించానంటూ కల్లబొల్లి కబుర్లు ఎన్నో అప్పట్లో చంద్రబాబు చెప్పారన్నారు. దీనివల్ల బాబు, ఆయన మనుషులు అక్కడ వ్యాపారం చేసుకుని లాభం పొందారని దుయ్యబట్టారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. నారా లోకేశ్ పాదయాత్రకు కనీస స్పందన కూడా లేదని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఆడియో వింటేనే వారి ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధితో ముందుకు వెళ్లాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని, మూడు రాజధానులు తమ విధానమని స్పష్టం చేశారు. -
మాకు సంబంధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని పరిణామాల నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలపై స్పందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఆంశాలు తమకు సంబంధించినవి కావని, వాటిపై స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం కేంద్రం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డాయి. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ రాజధాని. ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని వస్తుంది. అనంతరం చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం ఏపీ రాజధాని నిమిత్తం ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ విశ్రాంత అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వంలో 2014 మార్చి 28న నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2014 ఆగస్టు 30న నివేదిక ఇచ్చింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆ నివేదిక పంపింది. అనంతరం 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని నూతన రాజధానిగా ఆదేశాలు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం ఏపీలోని రాజ్భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ, మండలి ఇతర సదుపాయాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని ఉంది. దీనిమేరకు కేంద్ర ప్రభుత్వం గృహ, పట్టణ వ్యవహారాలశాఖ నుంచి రూ.వెయ్యి కోట్ల సహా రూ.2,500 కోట్లు విడుదల చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం–2020, ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్ యాక్ట్–2020లను చేసింది. దీన్ని రాష్ట్ర గెజిట్లో ప్రచురిస్తూ.. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా పేర్కొంది. ఈ రెండు చట్టాలు రూపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించలేదు..’ అని కౌంటరులో పేర్కొంది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు కేంద్రానికి సంబంధించినవి కాదని స్పష్టం చేసింది. అందువల్ల ఈ దశలో స్పందించడం లేదని, తదుపరి అవసరమైతే స్పందిస్తామని పేర్కొంది. -
టూరిజం 2.0’.. అరకు, గండికోట
సాక్షి, అమరావతి: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు–లంబసింగి సర్క్యూట్, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.150 కోట్లకు పైగా అంచనాలతో మౌలిక వసతులను మెరుగుపర్చుకోనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్–2.0’ పథకం కింద దేశంలోని 36 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందులో అరకు–లంబసింగి సర్క్యూట్, గండికోట పర్యాటక ప్రదేశాలకు చోటు కల్పించింది. త్వరలోనే పనులు ప్రారంభించేలా కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల కోసం ఆర్ఎఫ్పీలను సైతం ఆహ్వానించింది. రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రాజెక్టు అమలు బాధ్యతలను అప్పగించి సమయానుకూలంగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్కృతికి, పౌర సమాజ స్థితిగతులను మెరుగుపర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. 2.0తో అందుబాటులోకి అధునాతన వసతులు 2.0 ప్రణాళికల ద్వారా పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా ఈ రెండు ప్రాంతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటక, వారసత్వ సంపద పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. పర్యాటకుల కోసం వాచ్ టవర్లు, రిసార్టులు, వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ క్రీడలు, గోల్ఫ్ కోర్సులు, యాంపీ థియేటర్లు, సాంస్కృతిక భవనాలు, సౌండ్ లైట్ షోలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. స్థానిక కళాకారులు, చేతివృత్తి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా వారి కోసం ప్రత్యేక దుకాణ సముదాయాలను నిర్మించనున్నాయి. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టు, రహదారి సౌకర్యం, ల్యాండ్ స్కేప్, డిజిటల్ టెక్నాలజీ, స్థానిక కాలనీల్లో మౌలిక వసతులు కల్పించనున్నాయి. పర్యాటకుల ‘క్యూ’ అరకు లోయలో ఏపీ పర్యాటక సంస్థ 4 రిసార్టులను నిర్వహిస్తోంది. మయూరిలో 80, అరకు వేలీలో 58, అనంతగిరిలో 30, టైడా రిసార్టులో 23 గదులను అందుబాటులో ఉంచింది. ఇటీవల లంబసింగిలో సైతం 11 కొత్త కాటేజీలను నిర్మిచింది. మరోవైపు విశాఖపట్నం నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్లను నడుపుతోంది. అరకుతో పాటు బొర్రా గుహలు, వంజంగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు పరిసర ప్రాంతాలను పర్యాటకులు వీక్షించేలా చర్యలు చేపట్టింది. కాగా, కడప జిల్లాలోని గండికోటకు విశిష్ట చారిత్రక నేపథ్యంతో పాటు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ తరహాలో కొండలను చీల్చుకుంటూ ప్రవహించే పెన్నా నది ఒంపులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడికి వారాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇందులో వాయు, జల, భూమిపై చేసే సాహస క్రీడల అకాడమీని నెలకొల్పారు. మరోవైపు 4వేల ఎకరాల్లో గండికోట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్ను సైతం తీసుకొస్తోంది. (చదవండి: AP: జీవో నెం.1పై హైకోర్టులో విచారణ.. చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు) -
ఆ వ్యాజ్యాలనూ మేమే విచారిస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న ఆ వ్యాజ్యాలను సైతం తామే విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.ఆ వ్యాజ్యాలను తమ ముందుంచాలని సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలావుంటే రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు, మరికొందరు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలపై విచారణను కూడా ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తాము ఇప్పుడు విచారణ జరపడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజధాని అభివృద్ధి విషయంలో హైకోర్టు నిర్ధేశించిన కాల పరిమితులపై స్టే విధించిందన్నారు. ఈ నెల 31న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపనున్న దృష్ట్యా విచారణను ఫిబ్రవరికి వాయిదా వేయడం మేలన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ప్రాంతంలో ఇతరులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, ఆ మేరకు మెమో కూడా దాఖలు చేశామన్నారు. ఈ మెమోకు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించిందని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయకపోవడమే కాక, ప్రధాన అభ్యర్థనను సవరిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారన్నారు. అంతేకాక చట్ట సవరణను సవాల్ చేస్తూ పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ వ్యాజ్యాలను జీవో 107ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలతో జత చేయాలని వారు త్రిసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను తమ ముందుంచాలంటూ త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయం మాకెందుకు చెప్పలేదు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సాయిసంజయ్ సూరనేని వాదనలు వినిపిస్తూ.. చట్ట సవరణపై తాము దాఖలు చేసిన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందన్నారు. విచారణ ముగిసేంత వరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయబోమంటూ ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని గతంలో దాఖలైన వ్యాజ్యాలకు సైతం వర్తింప చేయాలని కోరారు. దీనిపై త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇదే అంశంపై ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పిటిషనర్లపై ఉందని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయాన్ని ద్విసభ్య ధర్మాసనానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలను కూడా తామే విచారిస్తామని స్పష్టం చేసింది. -
హైకోర్టు ‘గడువుల’పై సుప్రీం స్టే
రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదు. అది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇలాంటి వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటుంటే, ఇక ప్రజా ప్రతినిధులెందుకు? మంత్రి వర్గం ఎందుకున్నట్లు? – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపేసింది. అలాగే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలన్న ఆదేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిలిపేసింది. అంతేకాక అన్ని మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన భూ యజమానులకు అప్పగించాలన్న ఆదేశాన్ని సైతం సుప్రీంకోర్టు స్టే చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అమరావతి రైతులకు, రైతు సంఘాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని చెప్పిన హైకోర్టు తీర్పుపై జనవరి 31న లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త చట్టాన్ని తెస్తే, ప్రస్తుత వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి కదా! అందుకనే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేలుస్తాం’’ అని న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివీ.నాగరత్నంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు సందర్భాల్లో విస్మయం వ్యక్తం చేసింది. పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పునిచ్చింది. అలాగే హైకోర్టుతో సహా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏపీ సీఆర్డీఏ చట్టం, ల్యాండ్ పూలింగ్ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటుకి మార్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వీటితో పాటు రాజధాని నగర, రాజధాని ప్రాంత అభివృద్ధి, నిర్మాణం విషయంలో పలు కాల పరిమితులను నిర్ధేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలా చేయకపోవటం కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ కొందరు రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. మనుగడలోని లేని చట్టం ఆధారంగా హైకోర్టు తీర్పునిచ్చింది... ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, పాలన వికేంద్రీకరణ కోసం ఉద్దేశించిన చట్టం రద్దయిందని, అలా రద్దయిన తరవాత కూడా అది ఉన్నట్లుగా భావించి హైకోర్టు తీర్పునిచ్చిందని, అలా ఎలా చేస్తుందని ప్రశ్నించారు. న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రైతులకు, రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందం కొంత మేరకు మనుగడలో ఉంటుంది కదా అని అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట పరిధిలో చట్టాన్ని ఆమోదించాలంటూ శాసనసభను హైకోర్టు ఆదేశించజాలదని, ఇదంతా అధికార విభజన పరిధిలోని వ్యవహారమని వేణుగోపాల్ తెలిపారు. ఒక చట్టం మనుగడలో లేనప్పుడు దాని శాసన యోగ్యతపై కోర్టు జోక్యం తగదన్నారు. ‘‘చట్టం రద్దు చేసినప్పుడు శాసనసభ తదుపరి ఏం చేస్తుందో న్యాయ వ్యవస్థ ఓపికతో చూడాలి. ఆపై శాసనసభ మరో చట్టాన్ని ఆమోదిస్తే దాని చెల్లుబాటును పరిగణించొచ్చు. కానీ చట్టమే లేనప్పుడు అది ఉన్నట్టే పరిగణనలోకి తీసుకున్నారు. ఇది చాలా చిత్రమైన అంశం. న్యాయస్థానాలు పూర్తిగా అకడమిక్ సమస్యల్లోకి వెళ్లజాలవవు’’ అని వేణుగోపాల్ తెలిపారు. రాజధాని నగరం అనే భావన రాజ్యాంగంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో రాజధాని ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట ప్రదేశం లేదని, రాజధాని అంటే ప్రభుత్వం తన మూడు శాఖల్లో దేనిలోనైనా పని చేసే స్థానం మాత్రమేనన్నారు. కార్యనిర్వాహక వ్యవహారాలు పూర్తిగా అధికార యంత్రాంగానికి సంబంధించిన సమస్య అని విన్నవించారు. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది... నెల లోపు ఇది చేయండి అని ఆదేశించడం సులభమని, కాని దానిని ఆచరణలో పెట్టడం అసాధ్యమైన పనిగా వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకుంటూ, ‘అమరావతిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఉన్నారుగా..! హైకోర్టు భవనం కూడా కట్టారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు అంటున్నారు. దీని సంగతి ఏమిటి? అని ప్రశ్నించారు. అదంతా అయిపోయిన అంశం అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతుందని సహేతుకమైన భయాందోళనలున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. కానీ హైకోర్టు ఆదేశాలు అనుమానమే బేస్గా ఇచ్చినట్లున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ,. ‘‘ఆంధ్రప్రదేశ్లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక అధికారాలను నిర్విర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిది కదా..? దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రమే కదా? హైకోర్టు కాదు కదా!. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాక ఇరువురు న్యాయమూర్తులు కూడా, వేర్వేరు రాష్ట్రాల్లో అధికార వికేంద్రీకరణ గురించి న్యాయవాదులతో చర్చించారు. రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంది... ఈ సమయంలో భూములిచ్చిన రైతుల గురించి జస్టిస్ జోసెఫ్ ఆరా తీశారు. రైతుల హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి కోర్టుకు వివరించారు. చట్టంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఏర్పాట్లున్నాయన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని, అయితే కాలపరిమితి అనేది ప్రధానమైన అడ్డంకి అని ఆయన వివరించారు. అమరావతిని రాజధానిగా తొలగించలేదని, మూడు అధికార కేంద్రాల్లో అమరావతి కూడా ఒకటి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హైకోర్టు నిర్వహణ గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. హైకోర్టు గురించి చెప్పాలని జస్టిస్ జోసెఫ్ కోరగా.. అమరావతిలోనే నిర్వహణ సాగుతోందని నిరంజన్రెడ్డి తెలిపారు. హైకోర్టుపై ఎంత ఖర్చుచేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సుమారు రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు నిరంజన్రెడ్డి తెలిపారు. హైకోర్టులో క్యాంటీన్ లేదట కదా..! న్యాయమూర్తులు, న్యాయవాదులు మధ్యాహ్నా సమయంలో భోజనం నిమిత్తం బయటకి వెళ్తున్నారట కదా! అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే పూర్తి స్థాయి సౌకర్యాలు ఉండాలి కదా? అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్యాంటీన్ పూర్తిస్థాయిలో ఉందని నిరంజన్రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయి వాదనల తరువాత దీనిపై నిర్ణయం... వేణుగోపాల్ వాదనలు కొనసాగిస్తూ.. సమాఖ్య నిర్మాణంలో రాజధానిని మార్చుకొనే అధికారం రాష్ట్రానికి ఉండదా? ఆ అధికారాన్ని హైకోర్టు తన ఆదేశాలతో నియంత్రించొచ్చా? అని ప్రశ్నించారు. జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రెండు సమస్యలు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. శాసనసభ అధికారాలు, రైతుల సమస్య రెండింటినీ చూడాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికే రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ఉందన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని వేణుగోపాల్ కోరారు. ఈ విషయంలో న్యాయాన్యాయాల జోలికి వెళ్లని సుప్రీంకోర్టు... పూర్తి స్థాయి వాదనల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు తప్పుగా పేర్కొంది... చట్టంలో ‘ఎ క్యాపిటల్’ అని ఉందని, అంటే ఒకే రాజధాని అని ఎలా భావిస్తారని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నిర్ణయించలేదని, కేంద్రం కేవలం నిపుణుల కమిటీని మాత్రమే వేసిందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం రాష్ట్ర రాజధానిని కేంద్రమే నిర్ణయిస్తుందని హైకోర్టు తప్పుగా పేర్కొందని వేణుగోపాల్ తెలిపారు. ఆర్టికల్ 4 ద్వారా సంక్రమించిన అధికారం కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఒకసారి మాత్రమే వినియోగించగలిగేదని వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికికి తీసుకొచ్చారు. శాసన అధికారాలకు మూలం ఏంటని జస్టిస్ జోసెఫ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.. కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో సహా విస్తృతమైనదని, ముందుగా శాసన అధికారం కలిగి ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్యాపిటల్ అనే భావన అసలు రాజ్యాంగంలో లేదని, సమాఖ్య రాష్ట్రంలో పాలనలో కొంత భాగాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిర్ణయించడానికి అనుమతి ఉంటుందని, కార్యనిర్వాహక అధికారాల నిర్వహణలో శాసన వ్యవస్థ ఎప్పుడైనా అడుగు పెట్టొచ్చని వేణుగోపాల్ తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో రాజ్యాంగపరమైన విషయాలపై నిర్ణయం తీసుకోవాలి. కానీ రోజువారీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాంటూ రాష్ట్రం చేతులు కట్టుకుని న్యాయవ్యవస్థను అడగాలా? ఇది పూర్తిగా ఎగ్జిక్యూటివ్ అధికారాలకు విరుద్ధం కాదా?’’ అని వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆర్టికల్ 162 రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిని పరిశీలిస్తుంది కదా అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా... కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో కలిసి ఉంటుందని మాత్రమే ఆర్టికల్ 162 చెప్పిందని వేణుగోపాల్ తెలిపారు. అయితే, రాష్ట్రానికున్న శాసన అధికారాలతో విభజన చట్టాన్ని సవరించగలరా? అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. అలా చేయలేమని, విభజన చట్టం అనేది ఓ ప్రవేశిక అని వేణుగోపాల్ తెలిపారు. విభజన చట్టాన్ని సవరించడానికి పార్లమెంటుకు నిర్దిష్టమైన నిబంధనలున్నందున దాన్ని సవరించలేమని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు... రైతుల తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఓసారి చూడాలన్న ఆయన... ఒకసారి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశాక దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. జస్టిస్ జోసెఫ్ జోక్యంచేసుకొని... చట్టంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పలేదుగా? అని ప్రశ్నించారు. తొలుత హైదరాబాద్ రాజధానిగా పేర్కొన్నారని, తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రత్యామ్నాయ రాజధానిని నిర్ణయించాలని సూచించిందని నారిమన్ పేర్కొన్నారు. అంటే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పలేదుగా? అని జస్టిస్ జోసెఫ్ పేర్కొంటూ... రాజధాని ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కూడా చెప్పలేమన్నారు. పార్లమెంటు ఒక రాజధాని అని మాత్రమే చెప్పిందని, కానీ ఇక్కడ మూడు రాజధానులు అంటున్నారని నారీమన్ తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్రం నిర్ణయించగలదని జస్టిస్ జోసెఫ్ స్పష్టంచేశారు. దీనిపై పార్లమెంటు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంటందని నారీమన్ తెలిపారు. లబ్ది చేకూరుతుందనే భూములిచ్చారు... రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు నిరంజన్రెడ్డి, శ్రీరామ్ జోక్యం చేసుకొంటూ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 35, ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ 20 ప్రకారం రాష్ట్రంలో పట్టణ, స్థానిక ప్రణాళికలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి శాసనసభ సమర్థనీయమైందని తెలిపారు. రైతుల తరఫు మరో సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూరుతుందనే ల్యాండ్ పూల్కి అంగీకరించారన్నారు. 2020 నాటికి భూములు అభివృద్ధిలోకి తెస్తామని హామీ ఇచ్చారని, కానీ 2019 నుంచే మౌలికసదుపాయాల కల్పన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిందని శ్యాం దివాన్ తెలిపారు. మూడేళ్లుగా భూమిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కొన్ని ఫొటోలు చూపుతూ హైకోర్టు ఆవరణలో సౌకర్యాలు లేవని, సరైన రహదారులు లేవని, పాఠశాలలు లేవని, కానీ మిషన్ 2020 అని రైతులకు చెప్పారన్నారు. పరిపాలనలో భాగంగా పాలనపరమైన బ్లాకులను వేరే ప్రాంతాలకు మార్చే సామర్థ్యం రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. పాలనపరమైన బ్లాకులను మార్చడం ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారన్నారు. హైకోర్టు విధించిన కాలపరిమితి అసాధ్యమని భావిస్తే తిరిగి హైకోర్టుకు వెళ్తే తగిన సమయం ఇస్తుందన్నారు. 2019 మే నుంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎందుకు చేయలేదో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. అసలు చట్టంలో రాజధాని నగరం అంటే ఏంటని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా.. పరిపాలన ప్రాథమిక స్థానమని దివాన్ తెలిపారు. అలా అయితే మనకు ప్రజా ప్రతినిధులెందుకు..? ఇవన్నీ ఫలానా ప్రాంతంలో ఉండాలా? ఇవి చట్టానికి సంబంధించిన విషయాలా? అని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించారు.. జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. అలా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం న్యాయస్థానానికి సంబంధించిన అంశం కాదు. అలాంటప్పుడు మనకు ప్రజా ప్రతినిధులు ఎందుకున్నారు? మంత్రి వర్గం ఎందుకు? అని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని కాకుండా వేరే ప్రదేశంలో సెక్రటేరియట్ లేదా దానిలో కొంత భాగం ఉండాలని ప్రభుత్వం భావిస్తుండొచ్చుగా? జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. అమరావతి నుంచి విశాఖపట్నం, కర్నూలు ఎంత దూరమని న్యాయవాదిని ప్రశ్నించారు. విశాఖపట్నం సుమారు 500 కిలోమీటర్లు, కర్నూలు సుమారు 800 కిలోమీటర్లు అని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇది వికేంద్రీకరణలాగే ఉంది కదా! అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందరి వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశం పూర్తిగా అసంబద్ధం. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడమేంటి? అసలు మీ ఉద్దేశంలో రాజధాని నగరమంటే ఏంటి? అన్నీ మౌలిక వసతులతో రాజధాన్ని ప్రాంతం మొత్తాన్ని నెల రోజుల్లో అభివృద్ధి చేయాలా? హైకోర్టు ఇలా ఎలా ఆదేశాలిస్తుంది. నగర నిర్మాణంలో హైకోర్టుకున్న నైపుణ్యమేంటి? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? లేక చీఫ్ ఇంజనీరా? ఇలాంటి వ్యవహారంలో కోర్టులకు ఎలాంటి నైపుణ్యం ఉండదు. అందువల్ల నగర నిర్మాణం విషయంలో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోబోం. ఆంధ్రప్రదేశ్లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిదే కదా!!. ఈ విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప, హైకోర్టుది కాదు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. హైకోర్టు కార్య నిర్వాహక వ్యవస్థ ఎంత మాత్రం కాజాలదు. – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం -
అమరావతిని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు
రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించామన్నారు. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని, అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచామని తెలిపారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించాం. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని చెప్పాం. అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచాం. వెనుకబడ్డ ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లక్ష ఎకరాలకు పైగా ఉన్నాయి. నిర్మాణ వ్యయం కూడా తక్కువ. రాజధాని ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించేది. పైగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య కూడా ఉండదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా చంద్రబాబు మాత్రం నిర్మాణాలకు ఏ విధంగానూ అనువుగా లేని అమరావతినే ఎంచుకున్నారు. ఎలాంటి ఆలోచనా లేకుండా అప్పటికప్పుడు అమరావతి పేరు ప్రకటించారు. నిత్యం పంటలతో నందనవనంలా కళకళలాడే కృష్ణా డెల్టాలో కాంక్రీట్ పోసి నాశనం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి ప్రాంతం తప్ప మరెక్కడైనా రాజధాని నిర్మించాలని సూచించినా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు’ అని వివరించారు. వికేంద్రీకరణ చాలా అవసరం పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రాంతీయ అసమానతలు తొలగించవచ్చని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే విజయవాడ, విశాఖలో బెంచ్లు పెట్టాలని అన్నారు. పరిపాలన కోసం నాలుగు జోన్లలోనూ డివిజనల్ కార్యాలయాలు పెట్టి, సచివాలయ అధికారాలు వాటికి బదిలీ చేయాలని, అప్పుడు ప్రజలకు వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు బాగుందని, కోస్తా, కృష్ణా డెల్టా ప్రాంతాలు లాభపడుతున్నాయని అన్నారు. నెల్లూరు – తిరుపతి మధ్య కూడా పరిశ్రమలు వచ్చాయని, కర్నూలు ప్రాంతం మాత్రం వెనుకబడి పోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ సర్ప్లస్ ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచేవారన్నారు. విడిపోయాక రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, ఈ పరిస్థితి మరోసారి రాకూడదంటే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టిందని, ఇది కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడుతుందని ఆంజనేయరెడ్డి చెప్పారు. పోలవరంపైనా బాబు తప్పుడు నిర్ణయం కేంద్ర పరిధిలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడమే పెద్ద పొరపాటుగా ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆయన తప్పిదం వల్ల ఇప్పుడు ఎస్కలేషన్ ఖర్చే దాదాపు రూ.60 వేల కోట్లకు పెరిగిపోయిందన్నారు. లేదంటే కేంద్రమే ప్రాజెక్టును పూర్తిచేసి ఇచ్చేదని చెప్పారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలోనే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని తెలిపారు. ఆనాడు కర్నూలును రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విడిపోయాక కూడా సీమకే అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు కర్నూలును అభివృద్ధి చేసి ఉంటే సీమ బాగుపడేదని, అమరావతి వల్ల ఎక్కువగా నష్టపోయింది రాయలసీమేనని అన్నారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మైనింగ్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. కేవలం ఐటీ పరిశ్రమ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రాంతాన్ని బట్టి అనువైన పరిశ్రమలు రావాలని చెప్పారు. -
కర్నూలు ప్రజలు ఒకే రాజధాని కావాలంటున్నారు
సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణ గురించి కర్నూలులో అడిగితే అక్కడి ప్రజలు ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలని నినదించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. కర్నూలును మెగా సిటీగా, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పామన్నారు. జగన్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి అని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తన జీవితంలో పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని చూడలేదన్నారు. ఈ పోలీసులకు సిగ్గుందా అని ప్రశ్నించారు. నందిగామ, కర్నూలులో తన సభలకు జీవితంలో ఎప్పుడూ చూడనంత జనం వచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని చంద్రబాబు చెప్పారు. మళ్లీ సీఎంగానే తాను అసెంబ్లీకి వెళ్తానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. పోలీసులు పెడుతున్న కేసులపై నేతలు తొడకొట్టి బదులివ్వాలని చెప్పారు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా అడ్డులేకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. తన హయాంలో అమలుచేసిన పథకాలు నిలిపివేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ‘ఇదేం ఖర్మ’కు శ్రీకారం ఇక టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పాలని ఇందుకోసం ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అలాగే, 175 నియోజకవర్గాల్లో లీగల్ టీములు పనిచేస్తున్నాయని, పోలీసు కేసులు, ఇతర విషయాల్లో వారి సహకారం తీసుకోవాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో తనకిప్పుడు లాయర్లను వెతుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. పోలీసు నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డు చేయండి.. జడ్జిల ముందు అబద్ధాలు చెప్పండి ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలో రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు పోలీసులను దుర్భాషలాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. పోలీసు నా కొడుకులు ఫోన్చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు వాయిస్ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, బెదిరించాలని సలహా ఇచ్చారు. ‘పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు అబద్ధాలు చెప్పండి. పోలీసులు ఎగిసెగిసి తన్నారని చెప్పాలి. చెప్పరాని చోటులో ఈ పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారు. చాలా నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలి. అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి’ అంటూ కార్యకర్తలకు ఆయన సలహాలిచ్చారు. పోలీసులను ఎలా ఇబ్బంది పెట్టాలో, తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో ఆయన కార్యకర్తలకు శిక్షణ తరహాలో వివరించారు. -
విశాఖ రాజధానికోసం గర్జించిన విద్యార్థి లోకం
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం ‘మన విశాఖ.. మన రాజధాని’ నినాదం మార్మోగింది. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని విద్యార్థిలోకం గళమెత్తింది. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్, టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్, విద్యార్థి, నిరుద్యోగ పోరాటసమితి నాయకుడు టి.సూర్యం నేతృత్వంలో విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు ఊపిరిపోసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో పరిపాలన రాజధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మన భావితరాల బంగారు భవిష్యత్ కోసం విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో వెనుకడుగు లేదని స్పష్టం చేశారు. జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్ మాట్లాడుతూ మన భవిష్యత్ కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో పరిపాలన రాజధానితో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ది చెందుతుందని చెప్పారు. కాగా, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాత జాతీయ రహదారి మీదుగా వైఎస్సార్ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. -
రాజధానిని వదులుకుంటే చరిత్ర క్షమించదు..
టెక్కలి: విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని వక్తలు నొక్కి వక్కాణించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాల్సిందేనంటూ తీర్మానించారు. ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో రాజధానికి శ్రీకారం చుట్టారని, దీనికి మనమంతా మద్దతు తెలపాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో విశాఖను పరిపాలన రాజధానిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి చెప్పారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే భావితరాలు మనల్ని క్షమించవని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖలో రాజధాని కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుపడినా ఊరుకోం.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ పాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ రాజధానిని ఏర్పాటు చేసుకుంటాం. – ప్రొఫెసర్ గుంట తులసీరావు, శ్రీకాకుళం నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్. మద్దతిద్దాం.. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి. – పేడాడ పరమేశ్వరరావు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నేత ఉత్తరాంధ్ర నుంచి వలస నివారణ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును ఉద్యోగ సంఘాల తరఫున పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలను నివారించవచ్చు. విశాఖలో రాజధాని వలన కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో చర్చా వేదికలు నిర్వహించాలి. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత ఇప్పుడు వదిలేస్తే.. చరిత్ర క్షమించదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉత్తరాంధ్రపై అభిమానంతో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓ సువర్ణావకాశం. ఇలాంటి అవకాశాన్ని విడిచి పెడితే చరిత్ర మనల్ని క్షమించదు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు. భావి తరాల భవిత కోసం.. విశాఖలో రాజధాని వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని ఏర్పాటుతో భావి తరాల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. విశాఖలో రాజధాని సాధన కోసం టెక్కలి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలి. – దానేటి శ్రీధర్, వైద్యుడు, జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్. -
రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి స్థలాలివ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి వీల్లేదని రాజధాని రైతులు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని మురికివాడగా చేసి, తద్వారా రాజధానిని అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు చెప్పారు. ఇళ్లస్థలాలు ఇస్తే తమప్రాంత ప్రజలకే ఇవ్వాలన్నారు. ల్యాండ్పూలింగ్ కింద రైతులిచ్చిన భూముల్లో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారం రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ఆ ప్లాట్లను తిరిగి రైతులకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల భూములను రాజధాని అభివృద్ధి కోసమే ఉపయోగించాలి తప్ప ఇతర అవసరాలకు వినియోగించరాదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇవ్వడమంటే మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా వ్యవహరించడమేనని, ఇలా చేసే అధికారం సీఆర్డీఏకు, ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. రైతుల తరఫున ఆదినారాయణరావు వాదనలను పూర్తిచేయడంతో ప్రభుత్వ వాదనల నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని సవరించ డాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం విచారించింది. ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం.. రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లస్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో జారీచేసిన జీవో 107ను సవాలు చేస్తూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సవరణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో జీవో 107ను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయంటూ ప్రభుత్వం ఓ మెమో దాఖలు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు ఈ మెమోను వ్యతిరేకించారు. తమ వ్యాజ్యాలు నిరర్థకం కావని, అవి మనుగడలోనే ఉంటాయని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఆ వ్యాజ్యాలు ఏ విధంగా మనుగడలో ఉంటాయో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
‘పెండింగ్’పై 23న భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశమై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం.చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు. ఈ–సమీక్ష పోర్టల్లో పొందుపరిచిన ఏపీకి చెందిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, హోదా.. సమన్వయ కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద అపరిష్కృతంగా ఉన్న 15 అంశాలను సమీక్ష అజెండాలో చేర్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రెవెన్యూ లోటు భర్తీతో సహా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అజెండాలో పొందుపరిచారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి పెండింగ్ అంశాలను అజెండాలో చేర్చారు. అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ... ► విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు. ► కొత్త రాజధాని నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైలుతోపాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం. ► విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ► 2014–15 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి నిధులు అందించడం. ► 2016లో ప్రధాని ప్రకటన మేరకు విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు. ► కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించడం. ► పోలవరంలో ఆర్ అండ్ ఆర్తో సహా ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించడం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు ఒడిశా, చత్తీస్గడ్లో ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవడం. ► విశాఖలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏర్పాటు చేయడం. ► విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం. ► వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందించడం. ► ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడం. ► విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు ఇవ్వడం. హైదరాబాద్లో ఉన్న వివిధ శిక్షణ సంస్థలను ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం. ► కాకినాడ పోర్టు సమీపంలో ఎలక్ట్రానిక్ (హార్డ్వేర్) ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు. 16న పీపీఏ సర్వసభ్య సమావేశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న హైదరాబాద్లో జరగనుంది. సమావేశంలో ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులు, సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్..ఆ మేరకు నిధుల మంజూరుపై చర్చించనున్నారు. పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని 4 నెలల క్రితం పీపీఏ సీఈవోకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. పీపీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అదే అంశాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ 16న సమావేశాన్ని నిర్వహిస్తామని ఏపీకి సమాచారమిచ్చారు. కాగా, ఏడాది క్రితం పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. -
మూడు రాజధానుల కోసం గళమెత్తిన విద్యార్థి లోకం
ఒంగోలు సబర్బన్: మూడు రాజధానుల కోసం విద్యార్థి లోకం గళమెత్తింది. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఒంగోలు నగరం మార్మోగింది. శనివారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముంగమూరు రోడ్డు జంక్షన్ నుంచి లాయర్ పేట షిర్డీ సాయిబాబా గుడి వరకు సాగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ జరిగిన నాడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీతో పాటు దాని తోక పార్టీలు అమరావతే రాజధాని కావాలని పట్టుబట్టడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలే కారణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ యువనేత బాలినేని ప్రణీత్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవశ్యమని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో మోసపోయింది చాలదన్నట్లు అమరావతి ఒక్కదానినే రాజధానిని చేయాలని టీడీపీ పట్టుబట్టడం వెనుక ఆంతర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయం నిర్మిస్తే వర్షం వస్తే వర్షపు నీరు కారి బకెట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాల్సింది పోయి ఏ ప్రాంతం ఏమైపోతే మాకేమి.. అమరావతి ఒక్కటే బాగుపడితే చాలు అన్న చందంగా చంద్రబాబు ఉండటాన్ని మిగతా ప్రాంతాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రేల్లా అమర్నాథరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాదు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దాట్ల యశ్వంత్, విద్యార్థి విభాగం నాయకులు కొండూరు నవీన్, కృష్ణారెడ్డి, పురిణి శ్రీనివాసులురెడ్డి, నరశింహ, శ్రీకాంత్రెడ్డి, చంద్ర, హరీష్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
మూడు రాజధానులకే మా మద్దతు
తిరుపతి తుడా: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మునిసిపల్ కార్యాలయంలో మేయర్ శిరీష అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించారు. తీర్మానాన్ని నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష బలపరచగా.. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సభ్యుల్లో ఒక్కరు కూడా రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించకపోవడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మేయర్ శిరీష ప్రకటించారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధాని చేస్తామని చెప్పి నమ్మించారన్నారు. ఆపై తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ ఉమ్మడి ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్కు తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ విడిపోతే కర్నూలుకు రావాల్సిన రాజధానిని కుట్రపూరితంగా, దురుద్దేశంతో అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టులను సైతం అడ్డుకున్న నీచుడు చంద్రబాబని దుయ్యబట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా చంద్రబాబు 29 గ్రామాలకే న్యాయం జరగాలని పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మూడు రాజధానులతోనే సాధ్యమవుతాయని చెప్పారు. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకూడదన్న ముందు చూపుతోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అయితే చంద్రబాబు అండ్ కో వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు సీమవాసులంతా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇటీవల రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన విజయవంతం చేసిన భూమన కరుణాకరరెడ్డికి మునిసిపల్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది. -
విశాఖ రాజధాని కోసం విద్యార్థుల గర్జన
చోడవరం: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ రాజధాని ఎంత అవసరమో విద్యార్థి భేరి ఎలుగెత్తి చాటిందని, మూడు రాజధానులు ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం ఆగదని ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.లజపతిరాయ్ స్పష్టంచేశారు. వలస బతుకుల కష్టాల నుంచి విముక్తి కలగాలన్నా, విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభించాలన్నా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం జరిగిన ‘విద్యార్థి భేరి’ రాజధాని నినాదాలతో హోరెత్తింది. వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో పట్టణంలో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్థానిక శివాలయం జంక్షన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు సుమారు కిలోమీటరున్నర మేర భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, డాక్టర్లు ర్యాలీని ముందుండి నడిపించారు. ర్యాలీ అనంతరం కాలేజీ గ్రౌండ్ వద్ద జరిగిన సభకు చోడవరం జేఏసీ కన్వీనర్ కాండ్రేగుల డేవిడ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు రాజధానుల కోసం ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతమయ్యాయన్నారు. అడ్డుకునే వారి ఆటలు సాగవు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. విద్యార్థులు మూడు రాజధానులకు తమ మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఊరే లేనిచోట పూర్తిస్థాయి రాజధాని నిర్మించడం ఎంత కష్టమో అందరికీ తెలుసునని, మూడుచోట్ల రాజధానులు ఏర్పాటుచేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి గానీ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం కొన్ని పార్టీలకు అవసరంలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో సాధించుకోలేకపోతే విశాఖ రాజ ధాని ఎప్పటికీ కాదన్నారు. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ అండ్ పెట్రోలియం కారిడార్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వైఎస్సార్సీపీ నేత చొక్కాకుల వెంకట్రావు, ఉత్తరాంధ్ర జేఏసీ వైస్ కన్వీనర్ దేముడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. -
మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న మహోన్నత ఆశయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనారాజు పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో సోమవారం మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్లోని ధర్నా చౌక్లో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా ముగిసింది. యోనారాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు దీక్షలు తలపెట్టామని, ఏలూరు జిల్లాలో పూర్తిచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. -
అమరావతిలో అందరికీ ఆవాసం
సాక్షి, అమరావతి: సామాన్యులకూ ఇకపై అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం కల్పించింది. అక్కడ బయటి వారు నివసించకుండా న్యాయ వివాదాలతో అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలను ఛేదిస్తూ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలను ఆర్–5 జోన్గా చట్ట ప్రకారం ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా గృహాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఇనవోలు గ్రామాలను కొత్త జోన్ పరిధిలోకి తెచ్చింది. 2020లోనే ఈ ప్రాంతంలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా విపక్షాలు న్యాయ వివాదాలు సృష్టించాయి. చట్ట ప్రకారమే 5 శాతం సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్–53 (డి) ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని ల్యాండ్ పూలింగ్ కింద పేదల నివాసాలకు కేటాయించవచ్చు. అందుకోసం స్థానిక సంస్థలు లేదా ప్రత్యేకాధికారుల అనుమతితో మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్కు తగినట్లుగా మార్పులు చేయవచ్చు. ఆ ప్రకారమే ఆర్–5 జోన్ ఏర్పాటు కానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలుష్య రహిత కార్యకలాపాలు లాంటి వాటిని పది అంతర్గత జోన్లుగా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పాటించే నిబంధనలను గెజిట్లో పొందుపరిచింది. పేదలకు మేలు జరిగితే సహించని ‘ఈనాడు’ నిరుపేదలు, ఆర్థికంగా వెనుబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందచేసింది. సొంతిల్లు లేనివారు ఉండరాదనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, పంచాయితీల్లో సైతం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైనా నిబంధనల మేరకు స్థలం కేటాయించేలా ఉత్తర్వులిచ్చింది. ఇదే విధానాన్ని అమరావతి ప్రాంతంలోనూ అనుసరించనుంది. శాసన రాజధానిలో సామాన్యులు సైతం కాలు మోపేలా అవకాశం కల్పిస్తుంటే సహించలేని ‘ఈనాడు’ విషం కక్కుతోంది. సీఎం జగన్ పేదల పక్షపాతి పేదలు నివసించలేని రాజధాని అందరి రాజధాని ఎలా అవుతుంది? రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం అభినందనీయం. అన్ని వర్గాలకు చోటు కల్పించినప్పుడే అది అందరి రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటానని మరోసారి నిరూపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటే అది మూర్ఖత్వమే. – రేటూరి కిషోర్, సీనియర్ న్యాయవాది (మంగళగిరి) సామాజిక న్యాయం అంటే ఇదీ.. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిలా ఉండాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అనడం ఒక్క వర్గం ప్రజలపై వివక్ష చూపడమే అవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ చట్ట సవరణ చేయడం గొప్ప పరిణామం. సామాజిక న్యాయం అంటే ఇదీ. – మునగాల మల్లేశ్వరరావు, రాజకీయ నేత, మంగళగిరి అన్ని వర్గాలుండాలి ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలుండాలి. కోటీశ్వరుడి నుంచి కూటి కోసం తిప్పలు పడే వారి వరకు అందరికీ చోటివ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అమరావతిలో మాత్రం పేదలు వద్దని టీడీపీ నేతలు అనడం అన్యాయమే. ఆర్–5 జోన్ ఏర్పాటు మంచి నిర్ణయం. – వై.జయరాజు, న్యాయవాది (కర్నూలు) గొప్ప విషయం.. అమరావతి ప్రాంతంలో బయటివారు నివాసాలు ఏర్పాటు చేసుకోరాదని టీడీపీ కోర్టుల్లో కేసులు పెట్టింది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థలం కొని ఇల్లు కట్టుకునేలా జగనన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీఎం జగన్ గొప్ప పని చేశారు. ప్రతిపక్షం కోర్టులకు వెళ్లడం సిగ్గుచేటు. – రామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్, బ్రహ్మసముద్రం సముచిత నిర్ణయం పేదల కోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రాంతం ఏదైనా అన్నిచోట్లా అందరికీ జీవించే హక్కు ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి ఫలానా వ్యక్తులు మాత్రమే ఉండాలనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంది. – ఏలూరి సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాకినాడ పేదల పక్షపాతి అర్హులైన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైన నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. పేదలకు న్యాయం చేకూర్చాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేశారు. పేదల పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారు. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్(రాయదుర్గం) హర్షిస్తున్నాం.. అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు సీఆర్డీఏ చట్టంలో పలు నిబంధనలు పెట్టి స్వార్ధపూరితంగా వ్యవహరించింది. సీఎం జగన్ 900.97 ఎకరాలను పేదల నివాసానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం. పేద ప్రజలకు మేలు చేసే అమరావతిలో మరిన్ని సంస్కరణలు తేవాలి. – చింతా కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది, ధర్మవరం తప్పిదాన్ని సరిదిద్దారు.. రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు కల్పించకుండా కులవాదులు అంతా ఏకమయ్యారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టుల్లో కేసులు వేశారు. చారిత్రక తప్పిదాన్ని సీఎం జగన్ సరిచేశారు. పేదలు, బడుగులకు 900 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఇది దారి తీస్తుంది. – మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు (విజయవాడ) (తుళ్లూరులో ముడు రాజధానుల శిబిరం నిర్వాహక నాయకులు) సామాజిక సమత్యులత సాకారం అమరావతిలో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సీఎం జగన్ పేదలకు 900 ఎకరాలకుపైగా కేటాయించటం సంతోషకరం. ఇకపై పేదలు, మధ్య తరగతి, సామాన్య వర్గాలు సైతం అమరావతి మా రాజధాని అనే చెప్పుకునేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక సమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. –– పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు అణగారిన వర్గాలకు పెద్దపీట.. అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం, దోపిడీ కోసమే వేలాది ఎకరాలను లాక్కున్నారు. కనీసం సాగు భూమిని వదిలివేయాలన్న ఆలోచన కూడా లేకుండా భూ దాహంతో వ్యవహరించారు. రాజధాని అంటే సంపన్న వర్గాలకే కాకుండా అణగారిన వర్గాలకు కూడా చోటు కల్పించాలి. ––– చెన్నంశెట్టి చక్రపాణి (విశ్రాంత ఎస్పీ, న్యాయవాది) -
వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణపై కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి అసలు పనికి రాదని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏయూ హిందీ విభాగంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మేధావులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగల్సిందేనని చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. రాజధాని, కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి పాలనకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమరావతి కాకుండా వేరే ప్రాంతంలో రాజధాని పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది పాలకుడి నిర్ణయమేనని అన్నారు. ఒక ప్రాంతం మీద అభిమానంతో కాకుండా రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. చంద్రబాబు రక్తం మరిగిన పులి పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి రక్తం రుచి మరిగిన పులి మాదిరిగానే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రవర్తన కూడా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడమే బాబు ధ్యేయమని అన్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి లాభం పొందాలని ఆశిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కాదని, అది ఒక కమ్మ సామాజికవర్గం వ్యాపార సామ్రాజ్యమని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటివరకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, అందుకు సచివాలయ వ్యవస్థ, జిల్లాల విభజన నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వందలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే రెండు రోజులు పట్టేదని, ఇప్పుడు జిల్లాల విభజనతో వారి చెంతకే కలెక్టరేట్ వచ్చిందన్నారు. అమరావతి రైతులంతా బడా బాబులే: ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఆంధ్రను విభజించినప్పుడు రాజధానికి మొదట విశాఖపట్నమే అనుకున్నా.. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కర్నూలుకు మార్చారన్నారు. ఆ తరువాత హైదరాబా«ద్కు మార్చి రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయడం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు విద్య, వైద్య, ఉద్యోగావకాశాలు సమానంగా అందుతాయని తెలిపారు. అమరావతి రైతులు అసలు రైతులే కాదని, అంతా బడాబాబులేనని విమర్శించారు. అసలు సిసలైన రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారన్నారు. వరదలొస్తే అమరావతి కొట్టుకుపోతుంది : ప్రొఫెసర్ ముత్తయ్య ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ అమరావతి రాజధానిగా అస్సులు పనికి రాదన్నారు. వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. లక్షల కోట్లు వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వాయు, జల, రోడ్డు మార్గాలు ఉన్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల పోరాటాలు విజయవంతం అవుతాయి : ప్రొఫెసర్ పుల్లారావు ప్రొఫెసర్ పుల్లారావు మాట్లాడుతూ అన్ని ప్రాంతీల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని, ప్రాంతీయ అభిమానంతో కాదని చెప్పారు. విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా విజయవంతం అవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ కోసం విద్యార్థులను భాగస్వామ్యం చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సూర్యనారాయణ, శోభ శ్రీ , నల్ల సత్యనారాయణ, ప్రేమానందం, కృష్ణ, రాజామాణిక్యం, బార్ కౌన్సిల్ సభ్యులు అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖపై విద్వేషాల కబ్జా.. రామోజీ టక్కు టమారం.. ‘ఈనాడు’ విషపు రాతలు
రామోజీరావుకు విశాఖపట్నమంటే ప్రేమో, ద్వేషమో, మరేదో తెలియని భావసంభోగం ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడే ఆయన 47 ఏళ్ల కిందట అక్షర ఫ్యాక్షనిజానికి అంకురార్పణ చేశారు. లీజు పేరిట స్థలాలు తీసుకుని న్యాయ పోరాటాలతో కాజేయటమనే టక్కు టమారానికీ ఇక్కడే శ్రీకారం చుట్టారు. ఇతరుల స్థలాలను కబ్జా చేయటానికి ఎన్ని 420 పనులైనా చేయొచ్చునని... ఎన్ని ఫోర్జరీలైనా చేయొచ్చునని ఇక్కడి నుంచే నిరూపించబోయారు. అందుకే ఆయనది విశాఖతో విడదీయలేని బంధం. కాకుంటే న్యాయం గెలుపు ఆలస్యం కావచ్చేమో గానీ... గెలవటం మాత్రం పక్కా అనేది రామోజీ సైతం నమ్మక తప్పలేదు. లీజు పోరాటం ఒక్కో న్యాయస్థానాన్నీ దాటుకుంటూ సుప్రీంకోర్టుకు కూడా చేరాక తల వంచారు. లీజు ముగిసిన ఏడేళ్ల తరవాత స్థలాన్ని అప్పగించాల్సి వచ్చింది కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... కొద్దిరోజులుగా ఆయన విశాఖపై ప్రేమ ముసుగులో విద్వేషం కక్కుతున్నారు. ప్రభుత్వంపై విషం చిమ్మటానికి ప్రతిరోజూ విశాఖలో భూ కబ్జాలంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారు. దానికి సాక్ష్యంగా ఊరూపేరూ లేని వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి... ఉత్తరాంధ్రకు, విశాఖకు, రాష్ట్రానికి పరిరక్షణ సమితుల పేర్లతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై, నాయకులపై పక్కా స్కెచ్ ప్రకారం నానా అభాండాలూ వేస్తున్నారు. ప్రతిరోజూ చెబితే అవి ఎంత పచ్చి అబద్ధాలైనా జనాన్ని నమ్మించవచ్చనేది ‘ఈనాడు’ పుట్టిన దగ్గర్నుంచీ రామోజీరావు అనుసరిస్తున్న వ్యూహం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో... ఇపుడదే వ్యూహాన్ని విశాఖ విషయంలో అమలు చేస్తున్నారు. అసలు విశాఖలో భూ కబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జా దారుల నుంచి కాపాడిందెవరు? భూములకు సంబంధించి రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం... గ‘లీజు’ పనులకు రామోజీ అంకురార్పణ రామోజీరావు తన కబ్జాలు, కుట్రలు మొదలుపెట్టింది ఇక్కడేనని చెప్పాలి. ఎందుకంటే ‘ఈనాడు’ అక్షర వ్యాపారాన్ని ఆరంభించింది విశాఖ సీతమ్మ ధారలోనే!. ఇక్కడి సర్వే నెంబరు 50/4లో 2.78 ఎకరాల భూమిని రామోజీ 1974 మార్చి 30న స్థల యజమాని మంతెన ఆదిత్య వర్మ నుంచి 33 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. మొదటి 14 ఏళ్లూ నెలకు చెల్లించే అద్దె రూ.2,500. తరవాత నెలకు రూ.3వేలు. లీజు గడువు ముగిశాక భూమిని తిరిగి అప్పగించి వెళ్లిపోవాలి. కానీ వెళ్లిపోతే రామోజీ గొప్పేముంది? లీజు స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధి 1989లోనే పుట్టింది రామోజీకి. అక్కడ రోడ్డు వెడల్పు చేయడానికి 618 గజాలను ప్రభుత్వం తీసుకుంది. ప్రతిఫలంగా సీతమ్మధారలోనే సర్వే నెంబర్ 52లో 872 గజాల స్థలాన్ని కేటాయించారు. మరి ఆ భూమి ఆదిత్య వర్మది కదా? దాన్ని రామోజీ తీసుకున్నది లీజుకు కదా? ప్రభుత్వానికిచ్చే అధికారం ఎవరిది? ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే భూమిని తీసుకోవాల్సింది ఎవరు? వీటన్నిటికీ మనం చెప్పే జవాబులు తప్పని నిరూపించారు రామోజీ. ఆదిత్య వర్మకు విషయం చెప్పకుండా... ప్రభుత్వానికి భూములిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అలా... విశాఖలో మోసాలు మొదలెట్టారు!!. రామోజీ మోసాన్ని ఆలస్యంగా గుర్తించారు ఆదిత్య వర్మ. 2007 సెపె్టంబరు 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రామోజీరావు ‘ఈనాడు’కు చీఫ్ ఎడిటర్ మరి. పోలీసులను అంత తేలిగ్గా విచారణ చేయనిస్తారా? తన మనుషుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. పోలీసులు ఊరుకున్నారు. దీంతో ఆదిత్య వర్మ న్యాయపోరాటం మొదలెట్టారు. చివరకు న్యాయమూర్తి స్పందించి... పోలీసులకు అక్షింతలు వేయటంతో విచారణ మొదలైంది. కోర్టులో మరో డ్రామా!! ఈ 420 కేసు కోర్టులో విచారణకు వచ్చాక రామోజీ మరో కుట్రకు తెరలేపారు. రోడ్డు కోసం తాను ప్రభుత్వానికి స్థలమివ్వటం, ప్రతిగా ప్రభుత్వం స్థలాన్ని తన కుమారుడి పేరిట ఇవ్వటం వంటివేవీ తనకు తెలియవంటూ... తాను స్థలం ఇవ్వకముందే అక్కడ రోడ్డు ఉందని వాదించారు. అలాంటపుడు తాను స్థలమెందుకు ఇస్తానని ఎదురు తిరిగారు. దీనికోసం ఏకంగా విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్నే ఫోర్జరీ చేసేశారన్నది అప్పట్లో పిటిషనర్ ఆరోపణ. ఫోర్జరీ మ్యాప్లను వారు కోర్టుకు కూడా సమర్పించారు. దీంతో రామోజీపై ఫోర్జరీ, కుట్ర కేసులు కూడా నమోదయ్యాయి. లీజు ముగిసినా ఖాళీ చేయకుండా.. నిజానికి లీజు గడువు 2007తో ముగిసింది. కానీ రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. అప్పటిదాకా నెలకు ఇస్తున్న రూ.3వేలును రూ.10వేలు చేస్తానని, మరో 33 ఏళ్లు లీజు పొడిగించాలని కోరారు. అప్పటికే అక్కడ స్థలం విలువ దాదాపు రూ.40 కోట్లు ఉండటంతో... కుదరదన్నారు యజమాని వర్మ. కానీ రామోజీ కోర్టుకెళ్లారు. మేజి్రస్టేటు కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా 2014 వరకూ లాగారు. అద్దె కూడా పెంచలేదు. లీజు గడువు ముగిసిన 2007 నుంచీ నెలకు రూ. 3వేల చొప్పున కూడా సక్రమంగా చెల్లించలేదు. దీనిపై స్థల యజమాని రెంట్ కంట్రోల్ కోర్టుకు వెళ్లటంతో... రామోజీ స్టే తెచ్చారు. ఈ స్టేతో చాన్నాళ్లు నెట్టుకొచ్చారు. దీన్ని హైకోర్టులో వర్మ సవాలు చేయగా... రామోజీకి ఎదురుదెబ్బ తగిలింది. దిగువ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగించాలంటే.. తుది తీర్పు వెలువడేదాకా అప్పటి విలువల ప్రకారం నెలకు రూ.17 లక్షల చొప్పున ఈనాడు కార్యాలయానికి అద్దె చెల్లించాలని , అది కూడా ప్రతి నెలా 10వ తేదీలోపు చెల్లించాలని, అప్పటిదాకా బకాయిలుగా ఉన్న అద్దె రూ.2.57 కోట్లను తక్షణం ఇచ్చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రామోజీ సుప్రీంకు వెళ్లారు. అక్కడా చుక్కెదురు కావటంతో అద్దె చెల్లించాల్సి వచ్చింది. తరవాత చెల్లించటం ఇష్టం లేక స్థలాన్ని ఖాళీ చేశారు. అన్ని వ్యూహాలూ విఫలమవటంతో.. నాలుగేళ్ల తరవాత స్థల యజమానితో రాజీపడి కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులనుంచి బయటపడ్డారు. ఇదీ... ఈ నీతుల కొండ బాగోతం. తెల్లారి లేస్తే పేపర్లో అందరికీ సుద్దులు చెప్పే ఈ అనకొండ బాగోతాల్లో ఇది కేవలం విశాఖ పార్ట్ మాత్రమే. హైదరాబాద్లో సాగించిన అరాచకాలు గానీ, విజయవాడలో బంధువుల్ని మోసం చేసిన తీరుగానీ, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో జరిపిన అక్రమాలు గానీ రాస్తే.. ఎన్ని పార్ట్లైనా సరిపోవేమో!! తెలుగుదేశం కబ్జాల అడ్డా... విశాఖ విచిత్రమేంటంటే కబ్జాలకు కేరాఫ్గా మారిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పనిగట్టుకుని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుండటం. వాటికి బాకా ఊదుతూ... అవన్నీ నిజమనేట్లుగా రామోజీరావు దరువేయటం. అందరూ కలిసి విశాఖ ప్రజలకు ఓ ఎల్లో చిత్రాన్ని చూపిస్తుండటం!!. నిజానికి అందినకాడికల్లా తెలుగుదేశం నేతలు కబ్జాలు చేస్తే... సిట్ల పేరిట కాలయాపన చేస్తూ... చర్యలకు మాత్రం దూరంగా ఉంటే... గడిచిన మూడేళ్లలో ఏకంగా 430 ఎకరాల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నది ఈ ప్రభుత్వమేనన్న విషయం ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఈ కబ్జాదారుల్లో తెలుగుదేశం మాజీ ఎంపీ, చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్ మూర్తి సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు, అయ్యన్న, బండారుల పుత్రరత్నాలు... ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్లని వెనకేసుకు రావటమే తమ బాధ్యతగా భావించే చంద్రబాబు మీడియా మిత్రులెవరూ వీటి విలువ దాదాపు రూ.5వేల కోట్లకుపైనే ఉంటుందని గానీ, ఇంతటి విలువైన భూముల్ని ప్రభుత్వం కాపాడిందని గానీ చెప్పరు. ఆఖరికి దసపల్లా భూముల్లో పాగా వేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టేసుకున్న చంద్రబాబునూ మహాత్ముడిగానే చెబుతుంటుంది ‘ఈనాడు’. అదీ కథ. లేటరైట్ మాఫియా కేరాఫ్ అయ్యన్న? నోటికొచ్చినట్లు తూలటం, తూగటంలో అయ్యన్నపాత్రుడిని మించిన తెలుగుదేశం నాయకుడు లేడనే చెప్పాలి. విశాఖలో లేటరైట్ తవ్వకాలకు సంబంధించి ఆయన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తరవాత అత్యంత విలువైనది లేటరైటే. నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో లేటరైట్ నిక్షేపాలున్నాయి. కాకపోతే వీటిని తవ్వే హక్కు గిరిజనులకే ఉండటంతో 2009 జులైలో సింగం భవాని అసనగిరిలో 5 హెక్టార్లకు, సుందరకోటలో 35.5 హెక్టార్లకు తవ్వకం అనుమతులు పొందారు. బమిడికలొద్దిలో 110 హెక్టార్లకు జర్తా లక్ష్మణ్రావు అనుమతి పొందారు. 5 హెక్టార్లు మించితే పర్యావరణ అనుమతులు తప్పనిసరి కావటం... వీటికి అనుమతులు రాకపోవటంతో వారు తవ్వకాలు చేపట్టలేకపోయారు. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అయ్యన్న కుటుంబీకుల కన్ను లేటరైట్ గనులపై పడింది. తొలుత అధికారాన్ని ఉపయోగించి సింగం భవానీకి చెందిన 5 హెక్టార్లను చెరబట్టారు. వేరొక ఎంపీ కుమారుడితో కలిపి తవ్వకాలు చేపట్టి ... 11 నెలల వ్యవధిలో రూ.20 కోట్లకుపైగా విలువైన ఖనిజాన్ని స్వాహా చేశారు. ఆ తరవాత 110 హెక్టార్లపై కన్నేశారు. లక్ష్మణ్రావును, అతని దగ్గర సబ్లీజుకు తీసుకున్న వారిని తొలుత 80 శాతం వాటా అడిగి... ఇవ్వననటంతో కేసులు పెట్టి వేధింపులకు దిగారు. సహకరించని సర్పంచ్ను సైతం చెక్పవర్ రద్దుచేసి మరీ వేధించారు. చివరకు అక్కడ తవ్వకాలు జరపకుండా కలెక్టర్ ద్వారా నిషేధం ఉత్తర్వులు కూడా జారీ చేయించారు. ఆ ప్రాంతం మొత్తానికి నిషేధం ఉత్తర్వులు వర్తించినా.. తన చేతుల్లో ఉన్న 5 హెక్టార్లను మాత్రం ఆయన గారి పుత్రరత్నం అడ్డూఅదుపూ లేకుండా తవ్వేశాడు. ‘గీత’o దాటి కబ్జాలు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో ఏకంగా 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. బీచ్ను ఆనుకుని ఉండే అత్యంత విలువైన ఈ స్థలం... గీతం యూనివర్సిటీకి సమీపంలోనే ఉంది. దీన్ని ఆక్రమించుకుని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ కట్టేశారు. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా... మనోడే కదా అని టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఈ కబ్జాలపై దృష్టిపెట్టింది. ప్రహరీని తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాదీనం చేసుకుంది. అప్పట్లో నానా యాగీ చేయబోయిన పచ్చ బ్యాచ్... ప్రభుత్వం స్థిరంగా నిలబడటంతో తోక ముడుచుకుంది. పల్లా సోదరుడి భూ ఫలహారం.. అధికారులు స్వాదీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నవే. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కాజేశారు. కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబరు 33–2లో గుడితో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన స్థానిక యువతపై దాడికి యత్నించాడు. ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గాడు. బినామీ పేర్లతో.. లెక్కేలేదు ఇవన్నీ ఒకెత్తయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో చేసిన కబ్జాలకు లెక్కేలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా విశాఖ, దాని చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుంటూ వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనతో భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాదీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులూ నమోదు చేస్తున్నారు. ‘బండార’o బయటపడి... పరాజయం ► పెందుర్తి మండలం గుర్రమ్మపాలెంలో గతంలో ఏపీఐఐసీ 110 ఎకరాలు సేకరించి... ఎకరాకు రూ. 23 లక్షల చొప్పున రైతులకు నష్ట పరిహారం చెల్లించింది. అక్కడే బండారు చక్రం తిప్పాడు. ప్రభుత్వానికి చెందిన 20 ఎకరాలకు బినామీలను సృష్టించి... ఆ పరిహారాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. అక్కడితో ఆగకుండా... భూమికి పరిహారం పొందిన ప్రతి రైతు నుంచీ ఎకరాకు రూ.5 లక్షల చొప్పున తనకు కట్టాల్సిన పరిహారంగా నిర్ణయించి మరీ లాక్కున్నాడని అప్పట్లో రైతులు బహిరంగంగానే వాపోయారు. కాకపోతే ఇలా ఎన్ని కోట్లు మింగేసినా... అధికారంలో ఉన్నది మిత్రపక్ష తెలుగుదేశం కాబట్టి రామోజీకి ఇలాంటివేవీ కనిపించలేదు. ► ఆ మధ్య దుమారం రేపిన పెందుర్తి మండలం లక్ష్మీపురం భూ వివాదంలోనూ బండారు తనయుడిదే కీలకపాత్ర. అసలు వారసులకు– నకిలీలకు తగవు పెట్టింది అస్మదీయులైతే, ఈ వివాదాన్ని సెటిల్ చేసేందుకు ఈయన భారీగా రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేశాడని, తాము ఇవ్వనందుకు కేసులతో వేధిస్తున్నారని వారసులు అప్పట్లో వాపోయారు కూడా. ► ఇక వేపగుంట, పెందుర్తి ప్రాంతంలో బీఆర్టీఎస్ రహదారిలో భవనాలు కోల్పోయిన వారికి టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించారు. ఇందులో దాదాపు 300 టీడీఆర్లు ఇప్పించినందుకు ఈ పుత్ర రత్నం దాదాపు 5 కోట్లు కొట్టేశారన్నది అప్పట్లో బహిరంగంగానే వినవచ్చింది ► ఇవన్నీ ఈ పుత్రరత్నం భూములకు సంబంధించిన దందాలు. ఇక ఉద్యోగాలిప్పిస్తామంటూ వసూళ్లు, వ్యక్తిగత సెటిల్మెంట్లు వంటివన్నీ లెక్కలోకి తీసుకుంటే ఎన్ని పేజీలైనా చాలవు మరి. -
రాజధాని వ్యాజ్యాలపై నవంబర్ 28న విచారిస్తాం
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ తామిచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసిన నేపథ్యంలో, రాజధానిపై తమ ముందున్న వ్యాజ్యాలపై నవంబర్ 28న తదుపరి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఈలోపు సుప్రీం కోర్టు తమ తీర్పుపై ఏం చెబుతుందో కూడా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టులో తాము దాఖలు చేసిన ఎస్ఎల్పీలో లోపాలను రిజిస్ట్రీ తెలిపిందని, వాటిని సరిచేస్తామని, పది రోజుల్లో అది విచారణకు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను నవంబర్ 28న చేపడతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ల త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు రాజధానికి సంబంధించి మరికొన్ని వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీని సాకుగా చూపుతూ హైకోర్టు తీర్పు అమలుకు గడువు పొడిగింపు కోరుతూ పోతోందని చెప్పారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ.. పిటిషన్లో లిఖితపూర్వకంగా లేవనెత్తిన అంశాలపై మాత్రమే తాము సమాధానం ఇస్తామన్నారు. ఏది పడితే అది మాట్లాడితే స్పందించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ఏజీ చెప్పిన వివరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని, తదుపరి విచారణను వాయిదా వేసింది. -
పాదయాత్ర అడ్డుకోవడానికి మీరెవరు?
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అమరావతి మద్దతుదారుల పాదయాత్రను అడ్డుకోవడానికి మంత్రులు, అధికార వైసీపీ నేతలు ఎవరంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదని.. మూడు రాజధానుల గురించి ఎవరూ నోరెత్తకూడదన్నది వైసీపీ ఆలోచన అని.. తమది పొలిటికల్ పార్టీ అని.. తమకూ ఓ వైఖరి ఉంటుందని చెప్పారు. ప్రత్యేక విమానంలో సోమవారం విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చి, అక్కడ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ మళ్లీ మూడు ముక్కలుగా విడిపోవాలా. అదా వైసీపీ కోరిక? తిప్పికొడితే 13 జిల్లాలు, వాటిని 26 ముక్కలు చేశారు. దానికి పాలనా సౌలభ్యం అన్నారు. దీనికీ అంతు ఉండాలిగా. ఎక్కడో ఒకచోట ఆగాలి. దీనిని ప్రజలు కూడా గ్రహించాలి. ఉత్తరాంధ్ర, కులం, మతం అంటూ కొట్టుకుంటూ ఉంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. విశాఖ ఘటనలకు సంబంధించి మా పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు. వాళ్ల కాన్వాయి మీద దాడి జరగాలని వాళ్లే ప్లాన్ చేసుకుని మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. మా కేడర్కు మనోధైర్యం ఇచ్చా. విశాఖ ఘటనలపై హైకోర్టులో పిటిషన్ వేశాం. తెలంగాణ రాష్ట్ర సాధన నిర్వీర్యం అవుతుంది న్యాయ వ్యవస్థకు కూడా అప్పీల్ చేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున జరుగుతున్న దానిని సునిశితంగా గమనించండి. రాష్ట్ర న్యాయ శాఖను కూడా అభ్యర్థిస్తున్నా. అలాగే, రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. అలా చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఇందుకు పత్రికాధిపతులు, చానల్స్ యజమానుల సహకారం కోరుతున్నా. ఇక రాష్ట్రంలో జరిగే విషయాలను బీజేపీకి చెప్పవచ్చుగా అని విశాఖలోని కొందరు జర్నలిస్టులు నన్ను ప్రశ్నించారు. కానీ, ఇక్కడ యుద్ధం మీరే చేయండి అని బీజేపీ అగ్రనాయకులు అంటారు. నేను ఢిల్లీకి వెళ్లను. ఇక్కడే తేల్చుకుంటా.. వైసీపీ అధికారంలోకి రాకుండా పోరాడుతా. కోర్టు అంశాలతో పాటు గవర్నర్ను కలిసే అంశాలపై చర్చిస్తా.’ అని చెప్పారు. బెజవాడకు పవన్ పయనం అంతకుముందు.. మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేసి హంగామా చేసిన పవన్ తాను ఆశించిన ఫలితం దక్కకపోవడంతో విజయవాడకు తిరిగొచ్చారు. ఈనెల 16న జనవాణి కోసం 15వ తేదీ సాయంత్రం ఆయన విశాఖ వెళ్లారు. అదే రోజు మంత్రుల కార్లపై విశాఖ విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ హోటల్కు వెళ్లిపోవడం.. ఆ మర్నాడు జనవాణి జరిగే పోర్టు స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో జనవాణిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత అరెస్టయిన జనసేన రౌడీమూకలను విడిచిపెట్టే వరకు విశాఖలోనే ఉంటానని పవన్ బీరాలు పలికారు. కానీ, సోమవారం మధ్యాహ్నం విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పవన్ సోము వీర్రాజు భేటీ విజయవాడ నోవాటెల్ హోటల్లో బసచేసిన పవన్కల్యాణ్తో సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న సంఘటనలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. తమకు లభిస్తున్న ఆదరణను చూడలేక అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. విశాఖలో జరిగిన దాడి పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించగా.. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని వారు చెప్పారు. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రాంగా అభివర్ణించారు. జన స్పందన లేకపోవడంతో కుట్రకు తెరలేపారని, ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతామని వారిద్దరూ స్పష్టంచేశారు. -
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు
రాజమహేంద్రవరం రూరల్ : అమరావతి రైతు పాదయాత్రకు తూర్పుగోదావరిజిల్లా కాతేరులో నిరసన సెగ తగిలింది. సోమవారం సాయంత్రం కాతేరు వెంకటాద్రిగార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు మల్లయ్యపేట గాంధీ బొమ్మ సమీపంలో స్థానికులు ప్లకార్డులు, నల్లబెలూన్లు చేబూని నిరసన వ్యక్తం చేశారు. వారికి వైఎస్సార్సీపీ శ్రేణులు తోడయ్యాయి. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. నిరసనకారులను పాదయాత్రికులు కవ్వించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమరావతి పాదయాత్రికులు తారాజువ్వలు వదులుతూ నిరసనకారులను రెచ్చగొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలనూ నియంత్రించారు. -
విశాఖ రాజధాని కోసం నినదించిన విద్యార్థి లోకం
ఆమదాలవలస: విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం విద్యార్థులు ఉద్యమించారు. రియల్ ఎస్టేట్ రాజధాని తమకు వద్దని.. మూడు రాజధానులే ముద్దంటూ నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా సోమవారం విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విదార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వీడి.. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే.. విశాఖ రాజధాని అయితేనే సాధ్యమంటూ గొంతెత్తారు. బైక్ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ ప్రాంగణానికి చేరుకుంది. రాజధానిని సాధించే వరకూ పోరాటం ఆగదు : స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసుకునే వరకూ పోరాటం ఆపొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాజధాని సాధన అన్నది ఉత్తరాంధ్ర ప్రజలందరి బాధ్యతని చెప్పారు. భావి తరాల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని.. దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకనుగుణంగా న్యాయమూర్తులు సహకరించి.. రాజధానుల నిర్మాణాలకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్రకు విస్తృతంగా పరిశ్రమలొస్తాయని, తద్వారా యువతకు మెండుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగి.. వలసలు ఆగిపోతాయని స్పీకర్ వివరించారు. తొలుత వైఎస్సార్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి స్పీకర్ నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. -
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల ఉద్యమం అంతం కాదని.. ఆరంభం మాత్రమే అని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అన్నారు. విశాఖ గర్జన విజయవంతం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యమకారులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై జేఏసీ కమిటీతో చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విశాఖ గర్జన’ విజయోత్సవ సభలో మాట్లాడారు. ‘అమరావతి ప్రజలంటే మాకు కోపం లేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బావుండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు.. ఏనాడూ మాకు రాజధాని కావాలని డిమాండ్ చేయలేదు. అన్నింటికీ తల ఊపుతూనే వచ్చాం. ఇకపై కూడా అన్యాయం జరుగుతుంటే అలానే తల ఊపుతూ కూర్చోలేం. మా మంచితనాన్ని అమాయకత్వమనుకుంటే పొరపాటే’ అని హెచ్చరించారు. వికేంద్రీకరణను అందరూ స్వాగతించాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని, విశాఖను పరిపాలన రాజధాని చేసి పేదరికంలో ఉన్న తమ బతుకులు మారుస్తామంటే అభినందించాల్సింది పోయి అడ్డుకోవడం దారుణం అని టీడీపీ, జనసేన వైఖరిపై అజపతిరాయ్ మండిపడ్డారు. అమరావతి–అరసవల్లి యాత్ర ద్వారా మా ప్రాంతంలో మా దేవుని దగ్గరకి వచ్చి మా ప్రాంతంలో రాజధాని వద్దని మా నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర జేఏసీ సభ్యులు ప్రొఫెసర్ విజయకుమార్, కొల్లూరి సూర్యనారాయణ, పాల్, బాల మోహన్దాస్, షరన్ రాజ్, ఎస్ఎస్ శివశంకర్, డాక్టర్ పి.రామారావు, పైలా కృష్ణమోహన్, దువ్వాడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మూడు పెళ్లిళ్లే జనసేన విధానం!
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులు మా పార్టీ విధానమైతే.. పవన్ కల్యాణ్ది మూడు పెళ్లిళ్ల (ఇప్పటికి) విధానమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పెళ్లి చేసుకున్న చోటల్లా రాజధాని పెట్టమంటారా? అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పవన్ కల్యాణ్కు సంస్కృతి, సంప్రదాయాలు తెలియవని, ఒకవిధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరినీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సలహా ఇస్తాడేమోనని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వంటి ఉగ్రవాదులకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్నాడని నాలుగు రోజుల క్రితమే చెప్పానని, ఆ విధంగానే ఆయన విశాఖలో దిగగానే ఆ పార్టీకి చెందిన సైకోలు తమ పార్టీ నేతలపై దాడులకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడు బాణి వినిపించడానికే.. జనవాణి పేరుతో పవన్ కల్యాణ్ విశాఖ వచ్చాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గడాఫీతో పోల్చడం దారుణం అని మండిపడ్డారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. బాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన ► ప్యాకేజీ స్టార్ అనే పదానికి అర్థం ఏమిటో విశాఖ ప్రజలకు పవన్ కల్యాణ్ బాగా అర్థం అయ్యేలా చెప్పాడు. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర జేఏసీ సభ ఉంటే.. సాయంత్రం దానిని నేను డైవర్ట్ చేస్తానని చంద్రబాబు తరఫున పవన్ కల్యాణ్ రెడీ అయ్యాడు. తన విశాఖ పర్యటనను మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పటం సిగ్గు చేటు. ► చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన. దీనికి బాబు సేన అని పేరు పెడితే బాగుంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని ఈనాడు పత్రిక టార్గెట్ చేయటం, ఉత్తరాంధ్రలో ప్రైవేటు వ్యక్తుల భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం మీద నెట్టటానికి టీడీపీ, ఎల్లో మీడియా, దానితోపాటు జనసేన, ఇతర పార్టీలు ప్రయత్నం చేయటం.. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరు? ► మంత్రులపై రాళ్లు వేసిన వారిని అరెస్టు చేస్తే తప్పా? పవన్ కల్యాణ్ మద్దతు మీడియా, ఎల్లో మీడియా, బాబు మీడియా.. ఏం చెప్పింది? జనసేన వారే దాడి చేశారని చెప్పలేదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలు అంటాడు.. ఎవరైనా పవన్ కల్యాణ్పై దాడి చేశారా? ► ఒకపక్క బీజేపీతో కాపురం చేస్తూ వారు అమ్మేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్, బాబు తన పార్ట్నర్గా ఉండి అమ్మేసిన ప్రత్యేక హోదా.. విశాఖ రైల్వే జోన్.. ఇవన్నీ ‘విశాఖ గర్జన’ ఉద్యమం రోజునే పవన్కు గుర్తుకు రావడం వెనుక డ్రామా ఏంటో అందరికీ తెలుసు. ► తుపాకీతో కాల్చాలన్న కోరిక ఉన్నవాడిని.. ప్రతి ప్రెస్మీట్లోనూ బెదిరించే వాడిని.. సోషల్ ఎలిమెంట్ అంటారా? యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా? జనసేన కార్యకర్తలు హత్యాయత్నం చేసిన విషయాన్ని ఎల్లో మీడియానే నిన్న వీరగాధ అన్నట్టు చూపింది. అది నిజం అయినప్పుడు.. 307 సెక్ష¯Œన్ కింద పోలీసులు కేసులు పెట్టక శాలువాలు కప్పి, సన్మానాలు చేస్తారా? 3 నెలల కిందటే టికెట్ బుక్ చేసుకున్నావా? ► పవన్ కల్యాణ్ విజ్ఞత కలిగిన నాయకుడే అయితే, శనివారం ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనకు, తమ కార్యకర్తలు, నాయకులే బాధ్యులు అని హుందాగా ఒప్పుకునే వారు. పవన్కు ఆ హుందాతనం లేక పోగా, ఆ దాడులు తమకు తామే చేయించుకున్నామని ఆరోపణలు చేయడం శోచనీయం. ► పవన్ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను ఖండించాల్సింది పోయి.. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టడాన్ని తప్పు పట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. తాను విశాఖ పర్యటన కార్యక్రమాన్ని మూడు నెలల కిందటే ఖరారు చేసుకున్నానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రెండు నెలల కిందటే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్.. మూడు నెలల క్రితమే టికెట్ ఎలా బుక్ చేసుకుంటారు? ► విశాఖ గర్జన కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచేందుకే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలపై తమ పార్టీ సైకోలను ఉసిగొలిపిన పవన్ ఒక రాజకీయ ఉగ్రవాది. తనవెంట వచ్చే వారంతా తనకు ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్నాడు. సెలబ్రిటీలను చూసేందుకు వచ్చిన వారంతా ఓట్లేస్తే ఈ పాటికి ఎంతో మంది సినిమా నటులు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వారు. -
ఉత్తరాంధ్ర కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
చోడవరం (అనకాపల్లి జిల్లా): విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో జరిగింది. ప్రమాదంలో యువకుడితో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఎంపీటీసీ సభ్యుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చోడవరం మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కొత్తూరు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మానవహారంలో పాల్గొన్న పీఎస్పేటకు చెందిన సీహెచ్ శ్రీనివాసరావు అనే యువకుడు అకస్మాత్తుగా పక్కనే ఉన్న తన మోటారు సైకిల్ను తీసుకొచ్చి మానవహారం మధ్యలో పడేశాడు. అప్పటికే బాటిల్తో తెచ్చుకుని ఉన్న పెట్రోల్ను మోటారు సైకిల్పై, తన ఒంటిపై పోసుకున్నాడు. మానవహారంలో ఉన్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో పాటు మిగతా ఉద్యమకారులు పరుగెత్తుకుని వచ్చి అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ను తీసుకున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న అగ్గిపెట్టె వెలిగించి బైక్పై వేయడంలో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఉన్నవారంతా వారించి అతనిని దూరం లాక్కెళ్లి.. అతనికి అంటుకున్న మంటలను ఆర్పారు. ఘటనలో ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న చోడవరం–8వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు పుట్రేటి శ్యామ్ప్రసాద్కు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు పుల్లేటి అప్పారావు, పతివాడ అప్పారావులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసరావుతో సహా వీరందరినీ చికిత్స కోసం చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణత్యాగానికి సిద్ధం ఆత్మహత్యాయత్నం అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో వెనుకబడి ఉందని, తనలాంటి నిరుద్యోగులెందరో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సిన దుస్థితి ఉందన్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే తన కోరికని.. ఇందుకోసమే ప్రాణత్యాగానికి సిద్ధమైనట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రజా ఉద్యమం ఉధృతం అవ్వకముందే అమరావతి పాదయాత్రను ఆపాలని డిమాండ్ చేశారు. -
ఉత్తరాంధ్రలో మిన్నంటిన వికేంద్రీకరణ నినాదం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మార్మోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ విధానానికి ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామం నుంచి మద్దతు లభిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు అన్ని వర్గాల వారు ఏకమై నినదిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు ఏకతాటిపై నిలిచి గర్జించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని తపన పడుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ పరిపాలన రాజధాని కావాలి ► విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా బీచ్ రోడ్డులో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సందర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలని ఆకాంక్షించారు. ► విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెం జంక్షన్లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ► గాజువాక నియోజకవర్గంలోని బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అంతకు ముందు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతిలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్బాబు పాల్గొన్నారు. 66వ వార్డులో కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ► భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పలు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలియజేశారు. ► విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గోపాలప ట్నం కుమారి కల్యాణమండపంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో బెహరా భాస్కరరావు విశాఖ గర్జన పోస్టర్ ఆవిష్కరించారు. గవర కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 52వ వార్డు శాంతినగర్లో డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు. శ్రీహరిపురం వైçష్ణవి ఫంక్షన్హాల్లో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారు. 59వ వార్డులో ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో అంబేడ్కర్ సేవా సంఘం సభ్యులు విశాఖ గర్జనకు సంఘీభావం తెలియజేశారు. ► పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట జంక్షన్లో నాన్ పొలిటికల్ పెందుర్తి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోనూ అదే జోరు ► పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి అడ్డురోడ్డు వరకు జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల నుంచి వందలాది మంది అన్ని వర్గాల వారు ఈ ర్యాలీకి తరలివచ్చారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు. ► వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో గంధవరం నుంచి చోడవరం వరకు 10 కి.మీ.. రావికమతం మండలంలో కొత్తకోట నుంచి రావికమతం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం కొత్తూర్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ► అనకాపల్లిలోని బెల్లం మార్కెట్లో వర్తకులు వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. -
రాజధాని కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)/ఆనందపురం (విశాఖపట్నం)/నక్కపల్లి/ఇరగవరం: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో మంగళవారం భారీ పాదయాత్ర జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు కదంతొక్కారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మత్స్యకార డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్వెస్లీ, మత్స్యకారుల వేషధారణలో పలువురు నాయకులు, ప్రజలు ఉత్సాహంగా కదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ విశాఖపట్నం రాజధాని కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు రాజధానులకే తమ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని, మూడు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనందపురం జంక్షన్లోని జాతీయ రహదారిపై బైఠాయించి విశాఖ రాజధాని మా హక్కు అంటూ నినదించారు. అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డులో వెంకటేశ్వర కల్యాణమండపంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు డాక్టర్లు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు పాల్గొన్నారు. 3 రాజధానుల కోసం తీర్మానం చేస్తాం: మేయర్ విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు. నవంబర్ 4న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానం ఆమోదిస్తామని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఆమె మాట్లాడారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ ప్రాంతంలో సమాధి అవుతాయని ఆమె చెప్పారు. -
రాజధానులు ఎవరూ నిర్మించరు
గుడివాడ టౌన్: ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోనూ రాజధాని నిర్మించిన చరిత్ర లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. రాజధాని నిర్మాణం అనే కాన్సెప్ట్ తెచ్చింది చంద్రబాబే అని అన్నారు. ఆయన సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో విలేకరులతో మాట్లాడారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో రాజధాని నిర్మించారో తెలుగుదేశం చవటలు చెప్పాలన్నారు. అన్ని సౌకర్యాలు, వెసులుబాటు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడ నుంచి పాలన కొనసాగిస్తే అదే రాజధాని అవుతుంది తప్ప రాజధాని నిర్మించి పాలనచేసిన చరిత్ర లేదని చెప్పారు. దానికి కొన్ని నిధులు వెచ్చించి ఇంకా అభివృద్ధి చేస్తే అది పెద్ద నగరంగా మారి అనంతరం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యూనిట్లు ఏర్పడి మహానగరాలుగా మారతాయని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎప్పుడో నిర్మాణమైన మహానగరమన్నారు. అక్కడ 25 లక్షల జనాభా, సహజసిద్ధమైన ఓడరేవు, లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ప్లాంట్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఆరురోడ్ల జాతీయ రహదారి వంటివి గతంలోనే ఉన్నాయి కనుక అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, ఆ ప్రాంతంలో ప్రజలు బాగుపడతారని చెప్పారు. అదేవిధంగా కర్నూలు గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందని గుర్తుచేశారు. అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయపరమైన అన్ని శాఖలు నెలకొల్పితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం సంకల్పం ఈ విధంగా రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని చెప్పారు. దీన్ని ఓర్వలేక 420 చంద్రబాబు అమరావతి రైతులకు అన్యాయం అంటూ ఆయన సామాజికవర్గానికి చెందిన కొన్ని కుటుంబాల అభివృద్ధిని కాంక్షిస్తూ దొంగయాత్రలు చేపట్టారని విమర్శించారు. చంద్రబాబు మాటల భ్రమలోపడి ఆయన సామాజికవర్గానికి చెందిన కొందరు పిచ్చిపిచ్చి యాత్రలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని నిరసన దీక్షలు చేసేవారు... ముందుగా ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన్ను అధికారంలో నుంచి దించేసిన దుర్మార్గుడు చంద్రబాబును బయటకు పంపేందుకు దీక్షలు చేయాలని సూచించారు. ఎన్టీఆర్ను మానసికంగా వేధించి మరణానికి కారకులైన వారిని, ఆయనకు ‘భారతరత్న’ వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోని వెధవల్ని పార్టీ నుంచి బయటకు సాగనంపేలా దీక్షలు చేయాలని కోరారు. ఎన్టీఆర్ పేరున ఒక జిల్లా ఏర్పాటు చేసి ఆయనకు గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని నిందించడం సరికాదని కొడాలి నాని పేర్కొన్నారు. -
పవన్ నోట పూటకో మాట!
మరో ఉద్యమం రాదా? ‘కేవలం రాజధాని (అమరావతి) చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర ఏం కావాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి? తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా ఇంకో ఉద్యమం రాదా?’ – 2018లో గుంటూరు జిల్లాలో పవన్కళ్యాణ్ వ్యాఖ్యలు ఎందుకీ గర్జన..? ‘విశాఖలో ఎందుకీ గర్జన? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? వలసలు ఆపలేకపోయినందుకా? రుషికొండను ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మిస్తున్నందుకా? వైఫల్యాలు దాచేసి కులాల మధ్య చిచ్చు రేపినందుకా? విద్యుత్ చార్జీలు భారీగా పెంచినందుకా?’ – తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్లు సాక్షి, అమరావతి: కేవలం అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏం కావాలని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశ్నలు కురిపించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ గర్జన సభపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో పవన్ జనసేన బహిరంగ సభలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు వైరల్ అవుతున్నాయి. పవన్ మాట ఎందుకు మారుస్తున్నారంటూ పలువురు రీ ట్వీట్ చేశారు. మీపై ఏమి ప్రభావం చూపాయో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. 15 నుంచి పవన్ విశాఖ పర్యటన పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది. 15, 16, 17వ తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. 16న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు కొడతారు: మంత్రి రోజా
-
‘రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు వెంటపడి కొడతారు’
సాక్షి, తిరుమల: రైతుల ముసుగులో టీడీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి రోజా తిరుమల పర్యటనలో ఉన్న క్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం అమరావతి రాజధాని కావాలంటున్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచిత్రమైన ట్వీట్ చేశారు. టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు గుర్తురాలేదా?. రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు కొడతారు. హైదరాబాద్ వదిలేశాక అనే ఇబ్బందులు పడ్డాము. 29 గ్రామాల కోసం 26 జిల్లాలు పణంగా పెట్టలేము. అమరావతిలోనే కాదు.. రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ రైతులున్నారు. ఇది అమరావతి ఉద్యమం కాదు.. అత్యాసపరుల ఉద్యమం అని అన్నారు. -
జనం చూపు వికేంద్రీకరణ వైపు
సాక్షి, పాడేరు/నిడదవోలు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అఖిలపక్ష నేతలు, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాడేరులోని ప్రభుత్వ కాఫీ అతిథి గృహం సమావేశ మందిరంలో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో, నిడదవోలులోని రోటరీ ఆడిటోరియంలో విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు వికేంద్రీకరణకే జై కొట్టారు. పాడేరులో గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, గ్రూప్–1 రిటైర్డ్ అధికారి ఓండ్రు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా అల్లూరి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు పోరాటానికి ముందుకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలో జిల్లాలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి, వికేంద్రీకరణకు మద్దతుగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యం. దేశంలో అనేక ప్రాంతాల ప్రజలు తమ రాష్ట్రాల్లో వికేంద్రీకరణను కోరుకుంటున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తున్నాను. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ జార్ఖండ్లో నాలుగు రాజధానులు.. ఏపీలో వికేంద్రీకరణకు సీఎం జగన్ కట్టుబడి ఉండడంతో అభినందిస్తూ జార్ఖండ్ సీఎం కూడా ఆ రాష్ట్రంలో వికేంద్రీకరణకు సిద్ధమవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పట్టణాలను గుర్తించి నాలుగు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మూడు రాజధానుల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలంతా మూడు రాజధానులను కోరుకుంటున్నారు. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే నిడదవోలులో వికేంద్రీకరణకు మద్దతు తెలియజేస్తున్న నాయకులు, మేధావులు విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. అమరావతిలో కొంత మంది రైతులు చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం వెనుక అనేక కుట్రలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ను ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వెనుకబడి పోయాయి. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. – చెట్టి పాల్గుణ, అరకులోయ ఎమ్మెల్యే వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడం తగదు రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఓర్వలేక చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ముంపు గ్రామాలను పట్టించుకోని చంద్రబాబు అమరావతిలోని రైతుల కోసం మాత్రమే మాట్లాడడం దారుణం. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును గిరిజనులంతా స్వాగతిస్తున్నారు. – నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే ఒక్క రాజధానితో బాబుకే లాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితమైతే మిగిలిన ప్రాంతాలు నష్టపోతాయి. అమరావతి వల్ల చంద్రబాబు, ఆయన అనుచర గణానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది. 5 వేల ఎకరాలు రాజధాని కోసం సరిపోతుంది. అయితే చంద్రబాబు 35–40 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. రైతులు నష్టపోకూడదని సీఎం జగన్ అక్కడి రైతులందరికీ కౌలు ఇస్తున్నారు. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే వికేంద్రీకరణతోనే సుపరిపాలన వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు తన బినామీల సౌలభ్యం కోసం అమరావతి పాదయాత్ర చేయిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే టీడీపీ నాయకులు, వారి వర్గీయులు భూములు కొన్నారు. ఇప్పుడు వారు నష్టపోకూడదనే దొంగ యాత్రలకు శ్రీకారం చుట్టారు. – భూపతి ఆదినారాయణ, మున్సిపల్ చైర్మన్, నిడదవోలు చంద్రబాబు నాటకాలు ప్రజలకు తెలుసు అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. నాడు అమరావతికి భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకత చూపారు. వారిని చంద్రబాబు మోసం చేశారు. ఒకే రాజధాని ఏర్పాటు చేయడం కన్నా మూడు రాజధానులు ఏర్పాటు చూస్తే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి. – బూరుగుపల్లి సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా రైతు సలహా మండలి చైర్మన్ టీడీపీ దొంగ నాటకాలు ఆపాలి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్టంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందడానికి ఇదే సరైన మార్గమని అందురూ మద్దతు తెలుపుతున్నారు. కొందరు టీడీపీ నాయకులు, నకిలీ రైతులు స్వార్థ కోసమే అమరావతి పోరాటం చేస్తున్నారు. ఇకనైనా టీడీపీ నాయకులు దొంగ నాటకాలను ఆపాలి. – ఎస్కే వజీరుద్దీన్, మైనారిటీ నాయకుడు, నిడదవోలు -
వికేంద్రీకరణే విశాఖ వాణి
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా, కేంద్రీకరణకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహించాలని నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. అన్ని వర్గాల వారు పాల్గొనే ఈ ర్యాలీని నగరంలోని డాబా గార్డెన్స్ అంబేడ్కర్ జంక్షన్ నుంచి చేపట్టనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డాక.. శనివారం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. వికేంద్రీకరణకు మద్దతుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావులు ఈ సమావేశంలో ప్రకటించారు. జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, పారిశ్రామిక, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక, న్యాయవాద సంఘాల నేతలు, జర్నలిస్టు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత లజపతిరాయ్ మాట్లాడుతూ.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. విశాఖ పాలనా రాజధాని అయ్యేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ దేవుడు మాట్లాడుతూ అసమానతలతో కూడిన కేంద్రీకరణ వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారని, అందుకే ఆర్థిక, సామాజిక వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఇందుకు హైదరాబాదే ఉదాహరణ అన్నారు. కేంద్రీకరణతో నష్టాలు, వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం అమలు కాకుండా ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయని, వాటిని సమైక్యంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, విశాఖ పాలనా రాజధాని కోసం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్ఎస్ శివశంకర్ సూచించారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే ఎస్కే రెహమాన్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి ఎస్.రవీంద్ర, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మత్స్యకార నేత శాంతారాం, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు సీహెచ్ వెంకట్రావు, విజయ్కుమార్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకులో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మంత్రి కారుమూరి, వంక రవీంద్రనాథ్, తదితరులు ఉప్పెనలా తరలిరావాలి ఈనెల 15 విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ప్రజలు ఉప్పెనలా తరలి వచ్చి, తమ ఆకాంక్షను తెలియజేయాలి. ఆదివారం నుంచి మండల, వార్డు, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి విశాఖ పాలనా రాజధాని ఆవశ్యకతను అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయాలి. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అవసరమైతే రాజీనామా చేస్తా విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి మద్దతుగా అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సంపద అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే భవిష్యత్తులో ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రైవేటు భూములు అవసరం లేదు. ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలోనే విశాఖను రాజధానిగా చేయాల్సింది. కానీ చంద్రబాబు స్వార్థంతో చేయలేదు. – అవంతి శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నా.. మూడు రాజధానులకు మద్దతుగా నేను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సిద్ధం చేశాను. దానిని జేఏసీ చైర్మన్ లజపతిరాయ్కు అందజేస్తున్నా. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తన పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు ఎన్నికలకు వెళదాం. ఆ ఎన్నికల్లో గెలిచిన వారి నిర్ణయాన్ని ప్రజల మనోభావాలుగా గుర్తించడానికి టీడీపీ సిద్ధమా? – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే హేలన, సవాళ్లతో యాత్రలా? అమరావతి రైతుల పేరిట చేస్తున్న పాదయాత్రలో ఉత్తరాంధ్ర వాసులను హేలన చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. పాదయాత్ర అంటే ఇలా చేస్తారా? టీడీపీ సహా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్రకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టిస్తున్న వారికి మన నిరసన తెలపాల్సిందే. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ అత్యధికులు వికేంద్రీకరణ వైపే మొగ్గు రాష్ట్రంలో 75 శాతం మంది వికేంద్రీకరణకే మొగ్గు చూపుతున్నారు. కేవలం 5 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. 20 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 80 శాతం మంది అనుకూలంగా, 15 శాతం మంది తటస్థంగా, 5 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాలి. విశాఖ రాజధాని అయితే రాష్ట్రమంతటికీ మేలు జరుగుతుంది. – బాలమోహన్దాస్, ఏఎన్యూ పూర్వ వైస్ ఛాన్సలర్ బాబు నేతృత్వంలోనే పాదయాత్ర చంద్రబాబు నేతృత్వంలోనే అమరావతి రైతుల పేరిట పాదయాత్ర జరుగుతోంది. అమరావతే అభివృద్ధి చెందాలని పనిగట్టుకుని ఎల్లో మీడియా అదేపనిగా వారికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తోంది. ఏపీకి ఆర్థిక పరిపుష్టి వికేంద్రీకరణతోనే సాధ్యం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల వారంతా చాలా నష్టపోతారనడంలో సందేహం లేదు. – కేకే రాజు, నెడ్క్యాప్ చైర్మన్ -
మూడు రాజధానుల కోసం.. ముందడుగు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధి సత్వర రీతిలో సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. గతంలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల ఏ రీతిన నష్టపోయామో కళ్లారా చూశామని, ఇకపై అలాంటి తప్పిదం చోటుచేసుకోకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తామని ఊరూ వాడా ఎలుగెత్తి చాటుతున్నారు. కేవలం 29 గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ పాదయాత్ర పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న టీడీపీ తీరును ఎండగడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీలు.. దీక్షలు.. పూజలు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ప్రజలు తమ వాణి వినిపిస్తున్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి ముందుకు కదలండని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు. నాతవరం/అనకాపల్లి రూరల్/తణుకు అర్బన్/ ఇరగవరం/ అత్తిలి/ప్రొద్దుటూరు: రాష్ట్రాన్ని విడదీసేందుకు చంద్రబాబు కుట్రలో భాగంగా సాగుతున్న అమరావతి పాదయాత్రను ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం ఆయన వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పి.జగ్గంపేట నుంచి 1500 బైక్లతో గన్నవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చేపట్టిన ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర వచ్చే సమయానికి నర్సీపట్నం ప్రాంతంలో రౌడీలతో అల్లర్లు సృష్టించేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుట్ర పన్నారని, దానిని అందరూ కలిసి తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గణేష్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడిలో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. గిరిజనులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, విద్యార్థులు, యువతీ యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కాగా, పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమనేది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శుక్రవారం జరిగిన అనకాపల్లి మండల పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, జెడ్పీటీసీ వరలక్ష్మి హాజరయ్యారు. తణుకులో కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న గుబ్బల తమ్మయ్య, పార్టీ శ్రేణులు వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. తణుకులో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, తణుకు మండల అధ్యక్షుడు పోలేపల్లి వెంకట ప్రసాద్, ఇరగవరంలో పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, అత్తిలిలో ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి భరణీ ప్రసాద్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేవుడా.. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పెన్నానది ఒడ్డునున్న అమృతేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. -
AP: వికేంద్రీకరణే ముద్దు
సాక్షి నెట్వర్క్: ఒకే ప్రాంతంలో అభివృద్ధిని కేంద్రీకరించడం తగదని, వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటయ్యేందుకు అడ్డుగా ఉన్న విఘ్నాలను తొలగించాలని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు బుధ, గురువారాల్లో ఆలయాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల మేరకు పాలనా వికేంద్రీకరణకు అమ్మవారి ఆశీస్సులు కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీకనకదుర్గమ్మ, తిరుపతిలోని గంగమ్మ, శ్రీశైలంలో భ్రమరాంబ, విజయనగరంలో పైడి తల్లి, విశాఖలో కనక మహాలక్ష్మీ ఆలయాలతో పాటు ఇతర ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గుంటూరులోని పోలేరమ్మ గుడి వద్ద 303 కొబ్బరికాయలు కొడుతున్న ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, స్థానికులు నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, అందుకు పాలనా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ఇందుకోసం దుర్గమాత ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉండాలని వారు ఆకాంక్షించారు. మూడు రాజధానులకు అడ్డు పడుతున్న వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పూజలు నిర్వహించారు. ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో కొబ్బరికాయ కొడుతున్న మంత్రి వేణుగోపాల్ విఘ్నాలు తొలగించమ్మా.. ► ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంత్రి జోగి రమేష్ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్దికి కలిగే విఘ్నాలు, ఆటంకాలు పోవాలని, దుష్టశక్తులు కలిగించే విఘ్నాలు తొలగిపోవాలని దుర్గమ్మను ప్రార్థించానన్నారు. మంత్రి రోజా రాజగోపురం ఎదుట 108 కొబ్బరి కాయలు కొట్టారు. వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానన్నారు. ► వేమూరు నియోజకవర్గంలోని చుండూరులో శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మేరుగ నాగార్జున, రేపల్లెలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పూజలు నిర్వహించారు. ► విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు వేగవంతంగా జరిగేలా దీవించాలంటూ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లిలో నూకాంబిక దేవాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు మండలం సజ్జాపురంలోని శ్రీఏవుళ్లమ్మ తల్లి ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్న మంత్రి కారుమూరి ► విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలంటూ వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు కేవీ బాబా, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.రెహమాన్, ఐ.హెచ్.ఫరూఖ్ అక్కయ్యపాలెం మెయిన్రోడ్లోని తాజ్బాగ్ దర్గాలో చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ► శ్రీకాకుళంలోని ఏడురోడ్లు కూడలి వద్ద దుర్గాదేవి ఆలయంలో, బలగలోని శ్రీ బాల త్రిపుర కాల భైరవ ఆలయంలో, గైనేటి వీధి నీలమ్మ తల్లి ఆలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి శ్రీ పాల పోలమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దుర్గమ్మ సన్నిధిలో టెంకాయలు కొడుతున్న మంత్రి రోజా ► విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు శ్యామలాంబ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ► ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆలయాల వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో పూజలు నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ ర్యాలీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొబ్బరి కాయలు కొట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 3 రాజధానులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ► తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ కొబ్బరికాయలు కొట్టారు. తునిలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో మంత్రి వేణు వేపాలకృష్ణ కొబ్బరికాయలు కొట్టారు. ► తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతలో మల్లాలమ్మ ఆలయం వద్ద టెంకాయ కొడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ► కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం గూళ్యం గ్రామంలోని గాదిలింగేశ్వరస్వామికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 101 కొబ్బరి కాయలు కొట్టారు. కర్నూలు వినాయక ఘాట్లో కర్నూలు, నంద్యాల ఎంపీలు సంజీవ్కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణకు మద్దతుగా నంద్యాల జిల్లా అయ్యలూరు మసీదులో ఎమ్మెల్సీ ఇసాక్బాషా ప్రార్థనలు చేశారు. -
3 రాజధానులకు మద్దతుగా ప్రత్యేక పూజలు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)/ఇచ్ఛాపురం రూరల్/చినగంజాం: మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ, వాటికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం ఆలయాల్లో కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖపట్నం పెదవాల్తేర్లోని శ్రీకరకచెట్టు పోలమాంబ ఆలయంలో అమ్మవారికి వీఎంఆర్డీఏ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని పూర్ణామార్కెట్ వెలంపేటలోని దుర్గాలమ్మ ఆలయంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు నేతృత్వంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ పూజలు చేసి వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జింక్ ఆంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నర్తు రామారావుయాదవ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న జిల్లా టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బాపట్ల జిల్లా వంకాయలపాడులోని సంతానవేణుగోపాలస్వామి ఆలయంలో జెడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భవనం శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. -
వికేంద్రీకరణకే జై
సాక్షి ప్రతినిధి, కాకినాడ/ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాట పట్టాలంటే మూడు రాజధానులతో కూడిన వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని పలువురు మేధావులు జైకొట్టారు. స్వాతంత్య్రానంతరం నాలుగుసార్లు రాజధాని మార్పుతో జరిగిన నష్టాన్ని గుర్తించి యువత పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అధికారం అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనకు సంఘటితంగా మద్దతు తెలపాలని వక్తలంతా అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఉద్యమ స్ఫూర్తితో యువత, విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణపై కాకినాడలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎంఏ, ప్రొఫెసర్లు, వైద్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థి, వ్యాపార, వాణిజ్య, జర్నలిస్టు, రవాణా, ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులతోపాటు 52 అసోసియేషన్ల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాజనీతి శాస్త్రజ్ఞుడు ప్రొ. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అభివృద్ధిని కాంక్షించే ప్రపంచమంతా వికేంద్రీకరణ వైపు అడుగులేస్తున్న వైపే మనం కూడా అడుగులు వేయాలన్నారు. చాలా దేశాల్లో పరిపాలన అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండటాన్ని మనం ఆకళింపుచేసుకోవాలన్నారు. ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధి బాదం సుందరరావు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో అధికారులు అటూఇటూ తిరగాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనేది ఒట్టి మాటన్నారు. తానే రాజు.. తానెక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చిరంజీవినీకుమారి అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. బాబు ఒక్కటైనా శాశ్వత కట్టడం కట్టారా? కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక్కటైనా శాశ్వత భవనం నిర్మించారా అని ప్రశ్నించారు. 23 గ్రామాల ప్రజలు అమరావతే రాజధాని అంటూ పాదయాత్ర చేసి.. మిగిలిన రాష్ట్రమంతా కలిసి వికేంద్రీకరణ కోసం పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు చిట్లా కిరణ్, వాడ్రేవు రవి, ఎస్సీహెచ్ఎస్ రామకృష్ణ, ఈషా ఫౌండేషన్ కృష్ణప్రియ మాట్లాడుతూ.. వ్యవస్థలు కేంద్రీకృతమైతే జరిగే నష్టాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రతిపాదిస్తున్న వికేంద్రీకరణకే ఓటేయాలన్నారు. ఇక వికేంద్రీకరణ కోసం మేధావులు మౌనం వీడి ప్రజల తరఫున గళం వినిపించాలని యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు బయ్యా రాజేంద్రకుమార్, మైనార్టీ ప్రతినిధి సయ్యద్ సాలార్ పిలుపునిచ్చారు. టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ది చెందకూడదని చంద్రబాబు, ఎల్లోమీడియా కుట్ర పన్నుతున్నాయన్నారు. మేధావులంతా కలిసి ఐక్య కార్యచరణకు సిద్ధంకావాలన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేసినా అమరావతి నిర్మాణం సాధ్యంకాదన్నారు. ఇక ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, వంగా గీత స్పందిస్తూ.. భవిష్యత్తులో రాష్ట్రం ఐక్యంగా ఉండాలంటే వికేంద్రీకరణ అనివార్యమన్నారు. సీఎం తలపెట్టిన మూడు రాజధానుల కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మాజీమంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు అన్నారు. మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్రామ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, షర్మిలారెడ్డి వివిధ రంగాల ప్రతినిధులూ పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర ప్రగతి మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చావేదికలో కూడా 26 జిల్లాలూ సమాన ప్రగతి సాధించాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరని ఉత్తరాంధ్ర మేధావుల ఫోరం అభిప్రాయపడింది. వికేంద్రీకరణ జరగకపోతే భవిష్యత్తులో కళింగాంధ్ర, సీమాంధ్ర ఉద్యమాలు తప్పదని వక్తలు హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం దూరదృష్టితో, మేధావుల సూచనలతో మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొ.బిడ్డిక అడ్డయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమాన అభివృద్ధి సాధించాలన్నారు. ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ కె. తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆలోచనలకు అందరి మద్దతు అవసరమన్నారు. ఇక ఉత్తరాంధ్ర వెనుకబాటుకు శాశ్వత పరిష్కారం విశాఖపట్నం పరిపాలనా రాజధానేనని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యుడు అట్టాడ అప్పలనాయుడు, న్యాయవాది బైరి దామోదరరావు అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానులకు మద్దతివ్వాలని ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ కెంబూరు చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని అరసవల్లికి రావటం నిజంగా హాస్యాస్పదమని.. ఉద్యమాలకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని.. వీర గుణ్ణమ్మ స్ఫూర్తితో జిల్లాలో ఉద్యమం సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరై మాట్లాడారు. -
మూడు రాజధానులు ఉండాల్సిందే
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ‘రాష్ట్రం సొమ్మంతా తీసుకెళ్లి హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. చివరకు కట్టుబట్టలతో పంపారు. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మూడు రాజధానులు ప్రకటిస్తే.. చంద్రబాబు మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం అమరావతే రాజధాని అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అవమానిస్తున్నారు..’ అని వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాకా సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఎ.డి.పాల్ మండిపడ్డారు. విశాఖలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదని పేదలను ఆదుకుని దేశంలోనే ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పేరిట గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్యకేంద్రాలు, గ్రామరక్షణ వలయం పేరిట అనేక సంక్షేమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇంకా చేరువగా పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారని, రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు ఉంటే ప్రజలకు పరిపాలన చేరువవుతుందన్న అభిప్రాయంతో ముందడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో 29 గ్రామాలకు చెందిన కొంతమంది మిడతల దండులా పాదయాత్ర పేరిట బయలుదేరారని ఎద్దేవా చేశారు. శాంతికి నిలయంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాడి చేయడానికి వస్తున్న ఈ దండును అడ్డుకోకపోతే సర్వం నాశనం చేస్తుందని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు, డిఫెన్స్, షిప్యార్డ్, నేవల్ డాక్యార్డ్, ఎన్ఎస్టీఎల్, స్టీల్ప్లాంట్, రైల్వేస్టేషన్.. ఇలా జల, రోడ్డు, వాయుమార్గాలున్న విశాఖలో పరిపాలన రాజధాని పెడితే చంద్రబాబు అండ్ కోకు బాధ ఎందుకని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి అధిక ఎమ్మెల్యే సీట్లు ఉత్తరాంధ్ర నుంచి పొంది, ఈ రోజున ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు దుర్మార్గమైన చర్యను క్షమించరాదన్నారు. 29 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతగా ఉన్న ఉత్తరాంధ్రలో అశాంతిని సృష్టించడానికి చంద్రబాబు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ప్రొఫెసర్లు కోరుకుంటే.. ఉత్తరాంధ్ర జిల్లాలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీ పాదయాత్రను స్వాగతించడం దారుణమని చెప్పారు. ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఉత్తరాంధ్ర అభివృద్ధిని వద్దనుకుంటున్నారా? అని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అమరావతికి వ్యతిరేకం కాదు : జోగి రమేష్
పెడన: రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకేచోట రూ.3 లక్షల కోట్లు ఖర్చుచేస్తే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన మార్కెట్ యార్డు ప్రాంగణంలో సోమవారం వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్ పాల్గొని పెడన మండలంలోని 2,121 మంది లబ్ధిదారులకు రూ.3,97,68,750 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన కుటుంబం, బంధువులు, సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అభివృద్ధి చెందాలనే విధంగా అమరావతిని ఏకైక రాజధాని చేయాలని కంకణం కట్టుకుని అమరావతి–అరసవల్లి పాదయాత్రకు వ్యూహరచన చేశారని దుయ్యబట్టారు. రైతుల పేరుతో చేస్తున్న ఈ పాదయాత్ర చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు. అమరావతి కావాలా.. లేక చేయూత కావాలా.., అమరావతి కావాలా... లేక ఆసరా కావాలా.. అని మంత్రి ప్రశ్నించడంతో తమకు ఆసరా కావాలి.. చేయూత కావాలంటూ మహిళలు నినదించారు. -
అవసరమైతే రక్తం చిందిస్తాం
కాశీబుగ్గ: విశాఖ పరిపాలన రాజధానిని సాధించుకోవడానికి, అమరావతి పాదయాత్రను ఆపడానికి ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే రక్తమైనా చిందిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ పలాస జేఏసీ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో శనివారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఆ ప్రాంతంలో భవనాలు, రోడ్లు, పార్కులు అన్నీ గ్రాఫిక్స్లో మాత్రమే చూపించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతేనని, వారి మనుషులకు భూములిచ్చి బహుజనులను దూరం పెట్టారని విమర్శించారు. -
వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి
సీతమ్మధార(విశాఖ ఉత్తర): వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను వెంటనే పరిపాలన రాజధాని చేయాలని విద్యార్థులు నినదించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే.. తగిన బుద్ధి చెబుతామని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నాశనమవ్వాలని అరసవల్లి దేవుణ్ని కోరతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు మద్దతుగా శనివారం నగరంలో స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ జేఏసీ నాయకులు బి.కాంతారావు, టి.సురేష్కుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నం పరిపాలన రాజధాని కావడం వల్ల ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రజలు వలసలు పోవాల్సిన దుస్థితి తప్పుతుందన్నారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలూ విశాఖకు ఉన్నాయని చెప్పారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్ర విభజనప్పుడు నష్టపోయామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. అమరావతి యాత్ర పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర సమానాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలోని అన్ని పార్టీలు పరిపాలన రాజధానికి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు మారాలని లేకపోతే.. అమరావతి యాత్రను పాయకరావుపేట వద్ద అడ్డుకుంటామని హెచ్చరించారు. ర్యాలీలో విద్యార్థి నాయకులు భరత్, హరీష్, బాలాజీ, జాని, వెంకటేష్, ఉదయ్, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. -
3 రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయండి
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ తన రాజధానిని నిర్ణయించుకునే స్వతఃసిద్ధ అధికారం ఉంటుందని తెలిపింది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించిన తరువాత రాజధాని వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, అయినప్పటికీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పు వెలువరించిందని ప్రభుత్వం తన పిటిషన్లో నివేదించింది. రాజ్యాంగంలోని అధికరణలు 3, 4లను అనుసరించి కేంద్రం తీసుకొచ్చిన చట్టం ద్వారా రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం లౌకిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 258 ద్వారా కేంద్రం బదలాయించిన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం తెచ్చిందని హైకోర్టు తన తీర్పులో చెప్పిందని, వాస్తవానికి రాజ్యాంగంలోని లిస్ట్ రెండు 5వ ఎంట్రీలోని అధికారాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చిందని ప్రభుత్వం వివరించింది. అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ కేంద్రం బదలాయించిన అధికారం ద్వారా సీఆర్డీఏ చట్టాన్ని చేసినట్లు ఎక్కడా చెప్పలేదని నివేదించింది. పైపెచ్చు రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదంటూ కేంద్రమే లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు నివేదించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో గుర్తు చేసింది. ► అధికరణ 258 కింద ఉన్న కార్యనిర్వాహక, పాలన అధికారాలను మాత్రమే బదలాయించడం జరుగుతుంది కానీ శాసనాధికారాన్ని కాదని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సీఆర్డీఏ చట్టాన్ని కేంద్రం బదలాయించిన అధికారం ద్వారానే చేశామని అనుకుంటే, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన కమిటీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని భావించాల్సి ఉంటుందని వివరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి ఇది ఓ ప్రధాన కారణమని నివేదించింది. కేంద్రం ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కేంద్ర చట్టానికి విరుద్ధమైనప్పుడు దాన్ని హైకోర్టు సమర్థించగలదా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న అని తెలిపింది. ► ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తించలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. ల్యాండ్ పూలింగ్ స్కీం అమలుకు నిర్దేశించిన కాల పరిమితిని 2024 వరకు సీఆర్డీఏ ఇప్పటికే పొడిగించిందని, అందువల్ల ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరపాల్సిన ఎంత మాత్రం లేదని నివేదించింది. ఒప్పందాలకు అనుగుణంగా సీఆర్డీఏ, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రశ్నించింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 58, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించటాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన యజమానులకు అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్లో సవాల్ చేసింది. సమగ్ర బిల్లుతో మళ్లీ ముందుకు వస్తాం ► శాసనసభకు చట్టం చేసే హక్కు లేదన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: మంత్రి గుడివాడ ► తన రియల్ఎస్టేట్ బినామీల కోసం విద్వేషాలు సృష్టిస్తున్న చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం: రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసమే రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధిని దీన్ని ద్వారా సుప్రీంకు తెలియజేశామన్నారు. శాసనసభకు చట్టంచేసే హక్కు లేదనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. మూడు రాజధానులపై మళ్లీ అసెంబ్లీలో సమగ్ర బిల్లుతో ముందుకు వెళతామని ప్రకటించారు. శనివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ► హైకోర్టు తీర్పుపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించామని, శాసనసభకు రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీసేవిధంగా ఉంది. ఆర్టికల్–3, 4 ప్రకారం రాజధాని ఎంపిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని గతంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ► శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులు వస్తే రాష్ట్ర ప్రగతికి విఘాతం కలుగుతుంది. ► రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తుంటే, 29 గ్రామాల కోసం, తన రియల్ ఎస్టేట్ బినామీల కోసం చంద్రబాబు చిచ్చు, విద్వేషాలను రేకెతిస్తున్నారు. ► అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది. -
బరిగీసిన పెత్తందార్లు
ఇప్పుడు బరిగీసింది పెత్తందార్లే. వారు యుద్ధ సన్నాహాల దశను దాటి దండయాత్రల దశకు చేరుకున్నారు. ‘అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర’ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. దండయాత్రలకెప్పుడూ ముద్దుపేర్లే ఉంటాయి. సారంలో మాత్రం అదొక ఆర్థిక – సాంస్కృతిక సామ్రాజ్యవాదం. ధనస్వాముల స్వార్థ ప్రాయోజితం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమివ్వడం కోసం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానితోపాటు రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం కావడం, కొద్దిగా ప్రోత్సహిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా మారగల అవకాశాలు విశాఖకు ఉండటం కూడా ప్రభుత్వం ఆలోచనకు కారణం. అమరావతి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ఆలోచన ఆటంబాంబులా తోస్తున్నది. ‘నీకు రాజధాని అర్హత లేదు సుమా! తోక ముడుచుకో విశాఖా! కాదంటే ఖబడ్దార్!!’ అని హెచ్చరించడానికే ఈ దండయాత్రను నడుపుతున్నారు. విశాఖపట్నం గుండెల మీదుగా దండు నడపాలని సంకల్పించారు. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని మెదడున్న మానవకోటి అనుమానించడం అత్యంత సహజం. ఎందుకీ కవ్వింపు?. మనుషుల్ని విడదీయడం కోసం, మెదళ్లలో విషబీజాలు నాటడం కోసం, కల్లోలిత వాతావరణాన్ని కల్పించడం కోసం, అంతిమంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం! ఆయన్నెందుకు గద్దె దించాలి? కారణాలు చరిత్ర నిండా కనిపిస్తాయి. పేద ప్రజలూ, కష్టజీవుల మోముల్లో చైతన్యపు ఛాయలు కదలాడిన ప్రతి సందర్భంలోనూ ధనవంతులు దండధారులౌతారు. దండ యాత్ర చేస్తారు. ఇది నియమం. సంకెళ్లు తెంచుకోవాలనే తలంపు బానిసలకు పదేపదే కలుగుతూనే ఉంటుంది. స్పార్టకస్ వంటి యోధుని స్ఫూర్తిమంతమైన నాయకత్వం లభించి నప్పుడు వారు చెలరేగిపోతారు. రోమ్ మహాసామ్రాజ్య సింహాసనాన్నే ధిక్కరిస్తారు. అప్పుడు ఆ మహాసామ్రాజ్యంలోనే అందరికంటే శ్రీమంతుడైన మార్కస్ క్రాసిస్ అనేవాడు లక్షమంది రోమ్ సైనికుల్ని వెంటేసుకొని వేటకు బయల్దేరు తాడు. బానిస నేతల్ని శిలువేస్తాడు. తన వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటాడు. శ్రమదోపిడీ నుంచి విముక్తి పొందాలని కార్మికుడూ, కర్షకుడూ కోరుకోవడం సహజం. తన కాయాన్ని పిండగా కారిన స్వేదానికి గిట్టుబాటు ధర కోసం ఆరాటపడతాడు. అవసరమైతే పోరాటానికి సిద్ధపడతాడు. ప్యారిస్ కమ్యూన్లను సృష్టించు కుంటాడు. అప్పుడు ఫ్రెంచ్ భూస్వాములు, ధనస్వాముల తరఫున ఒక ఫ్రెంచి ‘జాతీయ’ సైన్యం వేటకు బయల్దేరుతుంది. పొత్తిళ్లలో ఉన్న కమ్యూన్ శిశువును పీక నులిమి చంపేస్తుంది. ఇప్పుడు అమృతోత్సవ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్న తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఇదే కథను చెబుతుంది. దొరలు, దేశ్ముఖ్లు, జాగీర్దార్ల పాలనలో నైజాం గ్రామసీమలు శుష్కించిపోతాయి. కూలీనాలీ బక్కజనం వెట్టి చాకిరీ, దౌర్జన్యాల కింద నలిగిపోతారు. పేద రైతులు పండించిన పంటనంతా లెవీ కింద లెక్కచెప్పి పస్తుల్ని ఆశ్రయిస్తుంటారు. వారి గుండె మంటలకు కమ్యూనిస్టుల ఆజ్యం తోడవుతుంది. బడుగులే పిడుగులవుతారు. బందూకులందుకొని తిరగబడ తారు. దొరలు, పెత్తందార్లు పారిపోతారు. మూడువేల గ్రామాల్లో పేదల ‘స్వరాజ్యం’ ఏర్పడుతుంది. పది లక్షల ఎకరాల భూమిని పంచుకుంటారు. ఉమ్మడి వ్యవసాయానికి సన్నాహాలు చేసుకుంటారు. అదే సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి యూనియన్ సైన్యం బయల్దేరుతుంది. నవాబు సహకారంతో నాలుగు రోజుల్లోనే విలీన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత నాలుగేళ్లపాటు యూనియన్ సైన్యాలు తెలంగాణ పల్లెల్లోనే తిష్ఠవేస్తాయి. పారి పోయిన దొరల్ని పునఃప్రతిష్ఠాపన చేస్తాయి. ఆక్రమించుకున్న భూముల్ని దొరలకు అప్పగిస్తాయి. అన్యాయానికి గురవుతున్న వారు చైతన్యవంతులవుతున్న ప్రతి సందర్భంలో ఆధిపత్య పెత్తందార్లు దాడులకు దిగారు. యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగిన ప్రతిసారీ ఓడినా, గెలిచినా సరే బలహీనవర్గాలు బలం పుంజుకుంటూ వస్తున్నాయి. ఒక్కొక్కటిగా కనీస ప్రజాస్వామిక హక్కుల్ని సాధించుకుంటూ వచ్చాయి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ధనస్వామ్యం రూపు మార్చుకున్నదంతే! స్వభావాన్ని మార్చుకోలేదు. రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేదవర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యాయానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్బ్యాక్ నిరూపించింది. టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసి నప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్ ఎనాలసిస్ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలిపోతుందంటాడు ఆ ప్రొఫెసర్! చంద్రబాబు ప్రసంగాల్లో ఊకదంపుడు, శుష్కప్రియాలు తప్ప ఏమీ ఉండవనీ, ప్రసంగ పాఠాల్లో నిజాయితీతో కూడిన ప్రమాణాలను పాటించడం కానీ, చెప్పే విషయానికి సరైన ఆధారాలను జోడించడం కానీ చాలా అరుదనీ ఆయన అభిప్రాయం. వైఎస్ జగన్ ప్రసంగాలు ఇందుకు భిన్నంగా విశ్వసనీయత ప్రస్ఫుటమయ్యే విధంగా ఉంటాయని చెప్పు కొచ్చారు. తాను ఖర్చు పెట్టే ప్రతి పైసా సూటిగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పారదర్శకత, వికేంద్రీకరణలతో ఏర్పాటు చేసుకున్న పాలనా వ్యవస్థ ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతా’ లంటాడు తిలక్. తరతరాలుగా కష్టాలతో, నష్టాలతో, బరువు లతో, బాధ్యతలతో కునారిల్లిపోతున్న జనావళి కన్నీళ్లను దూరం చేయడానికి తన ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లా ఉపయోగ పడుతున్నాయో జగన్ వివరించారు. కన్నీటితో కడిగిన ప్రతి అక్షరం పునీతమవుతుంది. అందుకే జగన్ ప్రసంగాలకు జనంలో అంత విశ్వసనీయత, విలువ! తాను మూడు రాజధా నులు కావాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నాడో ఆయన చెప్పారు. అమరావతి ప్రాంతానికి తాను వ్యతిరేకం కానే కాదని, ఇక్కడి అభివృద్ధిని కూడా ప్రాణప్రదంగా కాంక్షిస్తున్నానని చెప్పారు. విజయవాడ – గుంటూరు నగరాల అభివృద్ధిని కూడా చంద్రబాబు ఎంత నిర్లక్ష్యం చేశారనేది ఎత్తిచూపారు. తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్టచతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5 శాతానికి పెరిగిందనీ ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్టచతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ. విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్ లేబర్ దొరకదనే భయం. మహిళలకూ, బలహీనవర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధి పత్యం దెబ్బతింటుందన్న భయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినట్టు ఈ ఎల్లో పెత్తందార్లు, వారి బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన భూముల దగ్గరే రాజధాని రావాలి. ఈ పెత్తందార్లు నడిపే పత్రికల్నే ప్రజలంతా చదవాలి. వాళ్లు నడిపే చిట్ఫండ్ కంపెనీల్లోనే జనం చిట్టీలు కట్టాలి. వాళ్ల పాల డెయిరీలే ఉండాలి. వాళ్లే సినిమాలు తీయాలి. వాళ్లే పరిశ్రమలు పెట్టాలి. మార్కెట్లో ఇంకొకడు పోటీ ఉండొద్దు. ఇంకొకడు బాగా బతకొద్దు. ఈ దురహంకార పోకడకూ, ఈ స్వార్థ చింతనకూ జగన్ పరిపాలనలో ముకుతాడు పడుతుందనే ఆందోళనతో పెత్తందార్లు అల్లాడుతున్నారు. మూడేళ్లుగా దుర్మార్గమైన విష ప్రచారాన్ని కురిపించినా జగన్ ప్రభుత్వం చెక్కుచెదరలేదు. పైపెచ్చు తల ఎత్తుకొని నిలబడింది. రాష్ట్ర పురోగతిని తల ఎత్తుకునేలా నిలబెట్టగలిగింది. ఆదాయంలో సింహభాగాన్ని సమకూర్చగల మహానగరం లేకపోయినా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెండు లక్షలు దాటిందని తాజా అంచనా. ప్రచారాలతో పని జరగడం లేదని ఇప్పుడు మారీచుడు మాయలేడి వేషం ధరించాడు. ఒక మాయా ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వీయ రియల్ ఎస్టేట్ ప్రయోజ నాన్ని రైతాంగ ప్రయోజనంగా చిత్రిస్తున్నారు. రకరకాల వ్యక్తుల నుంచి, శక్తుల నుంచి, వ్యవస్థల నుంచి, సంస్థల నుంచి మద్దతును చదివించుకొంటున్నారు. దివాళా తీసిన రెండు మూడు పార్టీలను పెద్ద ముత్తయిదువులుగా పేరంటానికి పిలిచి పోరాటం బొట్లు పెట్టారు. ఈ పోరాటం వెనకున్న ఆరాటంపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉన్నది. రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేద వర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యా యానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్బ్యాక్ నిరూపించింది. టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసినప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్ జగన్ ముఖ్య మంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్ ఎనాలసిస్ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలి పోతుందంటాడు ఆ ప్రొఫెసర్! ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్ట చతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగిందనీ ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్ట చతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ. విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్ లేబర్ దొరకదనే భయం. మహిళలకూ, బలహీన వర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధిపత్యం దెబ్బతింటుందన్న భయం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇది ఉత్తరాంధ్ర మనోభావాలపై దండయాత్ర!
అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలు. ఏ కారణంతో రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించినా సారంలో అది అప్రజాస్వామికం. గ్రామస్థాయి నుంచి కేంద్రం దాకా అధికార వికేంద్రీకరణ రాజ్యాంగ నిర్దేశనమే (అదెంత సజావుగా అమలవుతున్నదనేది వేరే చర్చనీయాంశం). ఒకానొక తొందరపాటు, తప్పుడు నిర్ణయం కారణంగా మన తెలుగునేల విభజన జరగాల్సినంత సజావుగా, సశాస్త్రీయంగా జరగలేదు. నదీజలాల పంపిణీ, ఆస్తుల పంపిణీ వంటి అనేకాంశాలను ఇరుపక్షాలతో విస్తృత చర్చలు జరిపి వారి అంగీకారంతో విభజన కార్యక్రమం పూర్తి చేయాల్సివుండగా అలా జరగలేదు. అలా జరిగితే ఇప్పటి స్థితి రెండు రాష్ట్రాలకూ వుండేది కాదు. అందులో ఆంధ్రప్రదేశ్గా మిగిలిన మన రాష్ట్రానికి తొలినాటి నుండీ అన్యాయం జరిగింది. అలా జరగటానికి నాటి కేంద్రపాలకు లెంత కారణమో... విభజనను వ్యతిరేకిస్తున్నామంటూ డ్రామాలాడిన రాజకీయ పార్టీలన్నీ అంతే కారణం! విభజన జరుగుతున్న సమయంలోనూ మన నేతలు... విభజన జరిగితే డిమాండ్ చేయాల్సిన అంశాలను గురించి ఆలోచించలేదు. ఆనాటికి రాజకీయంగా పలుకుబడి కలిగిన చంద్రబాబయితే విభజన రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావటం గురించే ఆలోచించారు తప్ప, రాష్ట్రానికి రావాల్సిన వాటిగురించి ఆలోచించలేదు. చివరికి ఆయనాశించినట్టే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిపోయారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో వుంటూ రాజధాని నిర్మించాల్సి నది పోయి, హఠాత్తుగా హైదరాబాద్ వదిలేసి తాత్కాలిక రాజధానిని నిర్మించి... శాశ్వత రాజధానిని ప్రపంచానికే ఆదర్శంగా నిర్మిస్తానన్నాడు. చంద్రబాబు రాజకీయనేత రూపంలో వున్న కార్పొరేట్ వ్యాపారి! ఆయనకు గల ఈ లక్షణ ఫలితాలే అమరావతి రాజధాని పేరిట భారీ భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలతో బేరసారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ! రాజధాని ఎంత పెట్టుబడితో ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పూర్తవుతుందో, పూర్తయితే ఎవరికి ప్రయోజనం అనేవి ప్రజలందరిలో కలిగిన ప్రశ్నలు! వాటికి జవాబు దొరక్కే వైసీపీ ప్రభుత్వాన్ని పజలు ఎన్నుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తనదైన పంథాలో గత ప్రభుత్వ విధానాలన్నీటినీ పునః పరిశీలన చేస్తూనే, కొత్తవాటిని ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గానీ, సచివాలయాలుగానీ, వలంటీర్ వ్యవస్ధగానీ, ఇచ్చిన ఉద్యోగాలుగానీ (లోపాలుంటే సరిదిద్దే ఉద్యమాలు చేయొచ్చు) ప్రజావ్యతిరేకం అనగలమా? గ్రామస్థాయికి పాలనా వ్యవస్థను తీసుకొచ్చిన నేపథ్యమే రాజధానిని వికేంద్రీకరించి.. పాలనా కేంద్రాలను వెనుకబడిన రాయలసీమకూ, ఉత్తరాంధ్రకూ దగ్గర చెయ్యాలనే ఆలోచనకు తెరలేపింది. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ విశాఖపట్టణం దగ్గరగా ఉంటుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి సులువుగా తమ అవసరాలను నివేదించుకోగలరు. అలాగే నిరసనగళాలు విన్పించగలరు. ఇందుకోసం సుదూర అమరావతికి పోనవసరం ఉండదు. పాలనా కేంద్రం ఒకటి వస్తోందంటే కేవలం పాలనా భవంతులే కావుగా, అనుబంధ శాఖలు కూడా వస్తాయిగా. అప్పటిదాకా లేనటువంటి అనేకానేక కార్యాలయాలు, వాటి అనుబంధ శాఖలు, వాటితో వాణిజ్య సంబంధ రంగాలు అనేకం కొత్తగా చేరుతాయి. వెనుకబాటుకు గురికాబడిన ఉత్తరాంధ్ర ముఖచిత్రానికి రూపుదిద్దుకోబోయే నూతన సౌభాగ్యరేఖను ఇవన్నీ నిర్దేశించేవే కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం పాలనాకేంద్రం కావటమనేది ఒక వరం లాంటిది. ఏ కారణంతో అయినా దీనిని వ్యతిరే కించడం ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే. రాబోయే పాలనాకేంద్రం పనితీరును లాభదాయకం చేసుకోడానికీ, ప్రజాప్రయోజనకారి చేసుకోడానికీ నివేదనల నుంచి నిరసనలదాకా అన్నింటినీ వినియోగించే వీలు ఎలాగూ ఉత్తరాంధ్రులకు వుంటుంది. ఇంటి ముంగిటకు పాలనా కేంద్రం వస్తోన్న సమయంలో.. దీనిని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు అంగీకరించరు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటు కాదది, వారి కమిట్మెంట్! ఈ సందర్భంలో అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర (అందులో నిజమైన రైతులెందరు? ఆసాములెందరు? వెనకున్న రాజకీయపార్టీ యేమిటి అన్న ప్రశ్నలు వేరే చర్చ) ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచే యాత్ర అవుతుందే తప్ప వేరు కాదు. అమరావతిలో భూములిచ్చిన రైతులు తమకు నష్టం లేకుండా (ఇచ్చిన భూములకు తగ్గ విలువ) గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేయొచ్చు తప్ప, మరే ప్రాంతానికీ రాజధానినీ, పాలనా కేంద్రాలనూ వికేంద్రీకరించకూడదని అనగూడదు. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ పాలనా కేంద్రాలకు చేరువగా వుండకూడదని అనకూడదు. ఇప్పటికే ప్రాంతాల మధ్య పాలకుల పుణ్యాన అసమానతలు ఏర్పడ్డాయి (ఇవే తెలంగాణ వేర్పాటుకూ కారణాలు). ఇంకా అదే నమూనా రాజకీయాలు నడపడం వెనుకబడిన ప్రాంతాల ఆందోళనలకు దారితీస్తాయి. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) అమరావతి రైతులు కోర్టులకు వెళ్లారు, మంచిదే. తాత్కాలిక రాజధాని దగ్గర నిరసనోద్యమాలు నడిపారు. తమ ఆందోళనలను లోకానికి వెల్లడించారు. అది వారి హక్కు. కానీ, ఇప్పుడు అరసవిల్లి యాత్ర ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల మీద దండయాత్ర! ఉత్తరాంధ్రులు కోరుకునే పాలనా కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర నేల మీద నినదిస్తూ యాత్ర నిర్వహించడం ఎవరి రాజకీయ క్రీడలో భాగమో కానీ... అది ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రేపడమే కాక ఎటువంటి విధ్వంసానికి దారి తీస్తుందోనని భయపడాల్సిన అవసరముంది. విఙ్ఞతతో నడవాల్సిన ఉద్యమాలు ఇతరేతర ప్రయోజనాలతో నడవడం విషాదకరం! (క్లిక్: అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!) - అట్టాడ అప్పల్నాయుడు ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు -
చట్ట సభలదే చట్టాలు చేసే అధికారం, బాధ్యత
హైకోర్టును, దాని అధికారాలను అగౌరవ పరచడానికి ఈ సభ నిర్వహించడం లేదు. మాకు హైకోర్టు మీద గొప్ప గౌరవం ఉంది. అదే సమయంలో అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యతా మాపై ఉంది. ఎవరో ఫేవర్ చేస్తే ఇక్కడకు రాలేదు. ప్రజలందరూ ఓటు ద్వారా ఎన్నుకుంటే ఇక్కడికి వచ్చాము. ఈ గౌరవాన్ని, ఈ అధికారాన్ని మనం కాపాడుకోలేకపోతే శాసన వ్యవస్థ అన్నదానికి అర్థమే లేకుండా పోతుంది. ఈ రోజు చర్చించకపోతే ఆ తర్వాత చట్టాలు ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్నగా చరిత్రలో మిగిలిపోతుంది. అందుకే ఏ వ్యవస్థ అయినా తన పరిధి దాటకుండా ఇతర వ్యవస్థలను గౌరవిస్తూ పని చేయాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని గుర్తు చేస్తున్నాను. – శాసనసభలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘వికేంద్రీకరణే మా విధానం. రాజధాని అంశంలో నిర్ణయాధికారం, బాధ్యత శాసన వ్యవస్థదే. ఈ విషయంలో సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ చట్టసభకు ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. ‘న్యాయ వ్యవస్థ పట్ల తిరుగులేని విశ్వాసం ఉంది. అయితే వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గం లేద’ని సవినయంగా తెలిపారు. వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళ్లడం ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆత్మగౌరవం ఉందని చెప్పారు. వికేంద్రీకరణ, రాజధాని అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, ఎవరెవరి పరిధి ఏమిటనే విషయాన్ని అందులో చాలా స్పష్టంగా చెప్పారన్నారు. రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని.. అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని పేర్కొన్నారు. శాసనసభ ఫలానా విధానాన్ని, ఫలానా చట్టాన్ని చేస్తుందని ముందస్తుగానే ఊహించుకుని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవన్నారు. రాబోయే రోజుల్లో ఒక చట్టం రాబోతుందని, దానివల్ల ఫలానా రాజధాని ఫలానా చోట పెడతారు.. అని వాళ్లంతట వాళ్లే ఊహించుకుంటే ఎలా? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజు అలాంటి చట్టం ఏదీ లేదని, దాన్ని మనం వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ‘ఈ పరిస్థితిలో ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చినట్టు? మూడు రాజధానులను చేస్తూ ఒక చట్టమే లేనప్పుడు ఈ తీర్పు ఎందుకు వచ్చినట్టు? భవిష్యత్తులో మళ్లీ మెరుగైన చట్టం తీసుకువస్తాం. మూడు రాజధానులకు సంబంధించి ఆలోచన ఇంకా మెరుగ్గా ముందుకు వస్తుంది. అలా రాకూడదని చెప్పి ముందుగానే దాన్ని ప్రివెంట్ చేస్తూ కోర్టులు నిర్దేశించలేవు. శాసన వ్యవస్థ నిర్ధిష్టమైన విధానం, చట్టం చేయకూడదని కోర్టులు ఆదేశించ లేవు’ అని వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. శాసన వ్యవస్థ పరిధిలోనే ఆ అధికారం ► చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థ పరిధిలో ఉంటుంది. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండదు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఐదేళ్లకోసారి ప్రతి ఒక్కరి పనితీరును మధిస్తారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రభుత్వ పాలన, చట్టాలు నచ్చకపోతే ఇంటికి పంపించేస్తారు. ► ఇంతకు ముందు ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు.. ప్రజలకు గత ప్రభుత్వ విధానాలు, చట్టాలు నచ్చలేదు కాబట్టే ఈ రోజు 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు అంటే 86 శాతం అసెంబ్లీ సీట్లు మనకిచ్చారు. గత ప్రభుత్వ చట్టాలు, విధానాలను వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం. ► ప్రతి ఐదేళ్లకు పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు పరీక్షకు నిలబడతారు. ప్రజల వద్దకు వెళ్లాల్సిందే. ప్రజలు మళ్లీ వాళ్లను తూచి, వాళ్లు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అని మార్కులు వేస్తారు. కోర్టులు ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ► కోర్టులు అసాధ్యమైన కాల పరిమితిలు విధించకూడదు. నెల రోజుల్లోపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, నగరాలను నిర్మించాలి. ఆరు నెలల్లో ఇంకో ఐదారు లక్షల కోట్లతో రాజధాని నిర్మించాలి. ఇలా అసాధ్యమైన పనులు చేయమని శాసన వ్యవస్థను కోర్టులు శాసించ లేవు. దీనిపై చాలా మంది వక్తలు చాలా బాగా మాట్లాడారు. వాళ్లందరినీ అభినందిస్తున్నా. నాడు అభివృద్ధి కేంద్రీకరణతోనే రాష్ట్ర విభజన ► మొదట్లో అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. రెండోసారి తెలంగాణా ఉద్యమం రాష్ట్ర విభజనకు దారితీసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లే రెండోసారి తెలంగాణ ఉద్యమం వచ్చిందని 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది. ► రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ.. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు గతంలో ఇదే సభలో అన్ని విషయాలు చెప్పి ప్రస్తావించిన మాటలకు మన ప్రభుత్వం నేటికీ కట్టుబడి ఉంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కూడా.. ► రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయంతో పాటు పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారం లేదని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆ నిర్ణయాధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి తప్ప.. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభకు ఏ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. ► రాష్ట్ర రాజధానితో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని కూడా చెప్పింది. (‘వుయ్ ఆల్సో హోల్డ్ దట్ ద లెజిస్లేచర్ హేజ్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు పాస్ ఎనీ రిజల్యూషన్/లా ఫర్ చేంజ్ ఆఫ్ కేపిటల్ ఆర్ బైఫర్కేటింగ్ ఆర్ ట్రైఫర్కేటింగ్ ద కేపిటల్ సిటీ’ అని హైకోర్టు పేర్కొన్న వాక్యాలను సీఎం చదివి వినిపించారు.) హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర శాసనసభ అధికారాలను పూర్తిగా హరించేలా ఉంది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది ► రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్ర రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదు. తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనంటూ.. ఆర్టికల్ 3ని కూడా కోట్ చేస్తూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే హైకోర్టుకు నివేదించింది. అఫిడవిట్ కూడా ఇచ్చింది. (అఫిడవిట్ను సీఎం చూపించారు) ► ఒక రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేందుకు నిర్ధిష్టమైన విధానం ఏమైనా ఉందా.. అని టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో అడిగితే.. కేంద్రం సమాధానమిస్తూ ‘ఒక రాష్ట్రం రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు’ అని స్పష్టతనిచ్చింది. ► కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ను కూడా దాఖలు చేసింది. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, మిగిలిన అంశాలకు సంబంధించి మాత్రమే నిర్దేశించింది. రాష్ట్రాల రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ఏ నిబంధన కూడా ఇందులో లేదు’ అని స్పష్టంగా పేర్కొంది. ► హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉంటుందన్న వాదనను కూడా కొట్టి పారేసింది. ► ఒకవైపు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని చెబుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారమే అని పార్లమెంట్లో చెప్పడంతో పాటు కోర్టులో అఫిడవిట్ వేసింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? న్యాయస్థానం పరిధి దాటడం అవాంఛనీయ సంఘర్షణే ► రాజధాని వికేంద్రీకరణ విషయంలో చట్ట సభకు తీర్మానం చేసే అధికారం కూడా లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి శాసన వ్యవస్థ వ్యవహారాల్లోకి ప్రవేశించటం అవాంఛనీయమైన సంఘర్షణే. ► రాజధానితో పాటు నిర్మాణాలు అన్నింటినీ అంటే రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు కనెక్షన్లు మొదలైనవి నెలలోనే పూర్తి చేయాలి.. ఆరు నెలల్లో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. ఇది సాధ్యమౌతుందా అన్నది గమనించాలి. ► ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు తీర్పు పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి తీర్పులు ఉండకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినా ఇలా జరిగింది. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని అందరికీ అనిపించింది ► రాష్ట్ర రాజధాని, సీఆర్డీయే చట్టానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు గమనించినట్లైతే.. అటు రాజ్యాంగ పరంగానే కాకుండా, ఇటు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. ► ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలనే మూల స్తంభాలు తమ పరిధిలోనే అధికారాలకు లోబడే పని చేయాలి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదని, మరో వ్యవస్థ మీద పెత్తనం చేయకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారు. కానీ ఇటీవల రాష్ట్ర హైకోర్టు తమ పరిధిని దాటినట్టుగా మనందరికీ అనిపించింది. అందుకే ఇవాళ ఈ చట్టసభల్లో చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. 29 గ్రామాలే కాదు.. మిగిలిన రాష్ట్రం బాధ్యతా మాదే ► రాజధాని నగరంతో పాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపై గ్రాఫిక్స్ రూపంలో ఉంది. మాస్టర్ ప్లాన్ను అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. సీఆర్డీయే చట్టం ప్రకారం ఆ మాస్టర్ ప్లాన్ కాల పరిమితి 40 ఏళ్లు. ప్రతి ఐదేళ్లకోసారి దాన్ని సమీక్షించాలని కూడా పేర్కొన్నారు. అంటే 40 ఏళ్లకు కూడా సాధ్యం కాదన్నది అందరికీ తెల్సిన విషయం. ► ఇప్పటికి ఆరేళ్లయింది. గ్రాఫిక్స్కే పరిమితమైన ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా పేపర్ పైన మాత్రమే ఉంది. ఏ 29 గ్రామాల గురించైతే మాట్లాడుతున్నారో.. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో వాటిని కల్పించడం కోసమే ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు చొప్పన 54 వేల ఎకరాలకు దాదాపు రూ.1.09 లక్షల కోట్లు అవుతుంది. ► అంటే రాబోయే 40 ఏళ్లలో కనీసం 15 లక్షల కోట్లో 20 లక్షల కోట్ల రూపాయలకో వ్యయం పెరుగుతుంది. 54 వేల ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం మీద 0.0001 శాతం ఉంటుంది. మిగిలిన రాష్ట్రం 99.9999 శాతం ఉంది. ఆ ప్రాంతమంతా కూడా అభివృద్ధి, సంక్షేమం కోసం ఎదురు చూస్తోంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది మరచిపోకూడదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా. ► అలా కాకుండా రాజధాని అని నామకరణం చేసి, ఇక్కడ మాత్రమే డబ్బులు పెట్టడం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చాలనే విషయాన్ని మరచిపోకూడదు. సాధ్యం కానివి సాధ్యం చేయాలని ఏ వ్యవస్థలు గానీ, న్యాయస్థానాలుగానీ నిర్దేశించలేవు. అందుకే వీటన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. ► రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకు రావడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడతాం. వారికి కూడా అండగా నిలుస్తాం. -
వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని, వికేంద్రీకరణ, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ పార్టీ విధానమన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు సచివాలయంలోని తన చాంబర్లో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో బొత్స సమావేశమై పురపాలక పాఠశాలల స్థితిగతులను సమీక్షించారు. ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులురెడ్డి, ఐ.వెంకటేశ్వరరావులతోపాటు పురపాలక శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్, పదోన్నతులు, బదిలీలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డ్రాయింగ్ అండ్ డిసర్బసింగ్ ఆఫీసర్లుగా బాధ్యతలు, ఖాళీ పోస్టుల భర్తీ, అప్గ్రెడేషన్ అయిన స్కూళ్లకు పోస్టుల మంజూరు వంటి అంశాలను బొత్స దృష్టికి తెచ్చారు. కొన్ని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలను ఇంటర్మీడియెట్ స్థాయికి పెంచినట్లే.. మున్సిపల్ స్కూళ్లను కూడా అప్గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు. దీనిపై బొత్స సానుకూలంగా స్పందించారు. ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేయాలి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాజధాని నిర్మాణంపై హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును యథావిధిగా అమలు చేయడం వల్ల రాయలసీమకు రాజధాని, హైకోర్టు, కీలక కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న న్యాయమైన ఆకాంక్ష తీరకుండా పోతుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి అన్నారు. ఎస్వీయూలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఎంపిక సమయంలో మాజీ సీఎం చంద్రబాబు ఏకపక్షంగా.. ఒక వర్గానికి మేలు జరిగేలా వ్యవహరించారన్నారు. 1872 కాంట్రాక్టు యాక్టు, విభజన చట్టం ప్రకారం రాజధాని ఎంపిక జరగలేదన్నారు. విభజన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని, రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను రాజధాని ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తాను ముందు అనుకున్న నిర్ణయం మేరకు రాజధానిని ఎంపిక చేశారన్నారు. ఇది విభజన చట్టానికి వ్యతిరేకం కాదా? చట్టం ప్రకారం కేంద్రం ఏ సలహా ఇచ్చింది? శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని ప్రశ్నించారు. ఒప్పంద ప్రయోజనాలు సహజ న్యాయసూత్రాలకు లోబడి ఉండాలన్నారు. మహానగర నిర్మాణం పేరుతో రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల రైతులతో ఎలా అవగాహన చేసుకుంటారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికలను దృష్టిలో పెట్టుకుని రాజధానిలో న్యాయమైన భాగస్వామ్యం రాయలసీమకు ఉండేలా తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, మస్తానమ్మ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఏ వ్యవస్థ అధికారాలేమిటో తేలుద్దాం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాజధాని వ్యవహారంపై హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పు నేపథ్యంలో ‘అధికారాల విభజన సిద్ధాంతం’పై చర్చించేందుకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల అధికారాలు, పరిమితులు ఏమిటో విపులంగా చర్చిద్దామన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు అధికారాల విభజనలో మన రాజ్యాంగం సమతుల్యతను పాటించిందని స్పష్టం చేశారు. అయితే రాజధాని వ్యవహారంలో హైకోర్టు వెలువరించిన తీర్పు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా, ప్రశ్నార్థకంగా మార్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుడు విధానాలను సమీక్షించకుండా, మౌన ప్రేక్షకుల్లా మిన్నుకుండిపోవడానికి ప్రజలు శాసనసభ్యులను ఎన్నుకోలేదన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, బాధ్యతలతో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా సుపరిపాలన అందిస్తాయని విశ్వసించే ఎవరినైనా హైకోర్టు తీర్పు ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ఆ తీర్పుతో కలత చెందాను ► సీనియర్ ఎమ్మెల్యే అయిన నేను ప్రజా జీవితంలో గ్రామ సర్పంచి నుంచి మంత్రి వరకు వివిధ స్థాయిల్లో పని చేశాను. చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు.. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదంటూ గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పు రాజ్యాంగ బద్ధమైన శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మనుగడ, ఔచిత్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన చెందాను. ► రాష్ట్ర, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసే సర్వాధికారం శాసన వ్యవస్థకు ఉందనే అంశం మీకు తెలుసు. చట్టాలు చేసే పూర్తి అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో చట్టాలు చేయడంలోనూ.. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ అత్యున్నత అధికారం శాసన వ్యవస్థకే రాజ్యాంగం కట్టబెట్టింది. ► రాజధాని నగరాన్ని మార్చే.. లేదా విభజించే.. లేదా మూడు రాజధానులు ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకు లేదని, ప్రభుత్వం మారినంత మాత్రాన గత ప్రభుత్వాల విధానాలను మార్చడానికి వీల్లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇది శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమే.. ప్రశ్నార్థకం చేయడమే. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ఎవరినైనా ఈ తీర్పు ఆందోళనకు గురిచేస్తుంది. ► ఈ నేపథ్యంలో రాజ్యాంగం.. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య విభజించిన అధికారాలపై చర్చించేందుకు తక్షణమే శాసనసభ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. -
30 ఏళ్ల బాబు సినిమా 6 నెలల్లో ఎలా సాధ్యం?
గత చంద్రబాబు ప్రభుత్వం ఒక్క జోన్ను కూడా మోడల్గా అభివృద్ధి చేయలేదు. కనీసం రోడ్లు కూడా వేయక పోవడంతో మెజారిటీ రైతులు విసిగిపోయి, తమకు తిరిగి ఇచ్చిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు రాలేదు. 63 వేల ప్లాట్లను 28 వేల మంది రైతులు రిజిçస్టర్ చేయించుకోవాల్సి ఉండగా, చంద్రబాబు దిగిపోయే నాటికి 28 వేల ప్లాట్లను మాత్రమే సంబంధిత రైతులు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పటికీ 20 వేలకుపైగా ప్లాట్లను రైతులు రిజిçస్టర్ చేయించుకోలేదు. సాక్షి, అమరావతి: ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజలకు ‘సినిమా గ్రాఫిక్స్’ చూపించడం మినహా ఏమీ చేయలేదు. రాజధాని భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక సార్లు హామీలు ఇవ్వడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. 2019లో తాను అధికారం కోల్పోయేనాటికి ఒక్క ప్లాటును కూడా అభివృద్ధి చేయలేదు. భూములు సేకరించిన తర్వాత మూడేళ్లు రాజధాని రైతులను గాలికి వదిలేశారు. వాటిని అభివృద్ధి చేయడానికి దశాబ్దాలు పడుతుందని, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయని పార్టీ సమావేశాల్లో చెప్పేవారు. ఇప్పుడు అవే ప్లాట్లను మూడు నెలల్లో అభివృద్ధి చేసి, రైతులకు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చంద్రబాబు ప్రభుత్వం చేయలేక చేతులెత్తేసిన పనిని ఇప్పుడు ఆగమేఘాల మీద చేయాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో వందల ఎకరాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన గత చంద్రబాబు ప్రభుత్వం.. ఒప్పందం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు. భూములిచ్చిన రైతులు త్యాగమూర్తులని కీర్తించడమే తప్ప వారి లేఅవుట్లను మాత్రం గాలికి వదిలేసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే భూములు తీసుకున్న మూడున్నరేళ్ల తర్వాత కూడా రైతులకు భౌతికంగా ప్లాట్లు అప్పగించలేదు. కేవలం కాగితాల్లోనే పంపిణీ చేశారు. రైతుల ప్లాట్లతో ‘రియల్’ వ్యాపారం రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. తమకిస్తామని చెప్పిన ప్లాట్లలో పిచ్చిమొక్కలు మొలిపించి, బీళ్లుగా మార్చిన ప్రభుత్వం.. వాటి పక్కనే అపార్టుమెంట్లు నిర్మించి వేరే వాళ్లకి అమ్మకం ఎంత వరకు సమంజసమని అప్పట్లో రైతులు నెత్తీనోరూ కొట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. 29 గ్రామాల్లో రైతుల వాటాగా 28 వేల మంది రైతులకు 63 వేల వరకు ప్లాట్లను ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం ఆ గ్రామాలను 13 ఎల్పీఎస్ (ల్యాండ్ పూలింగ్ స్కీమ్) జోన్లుగా విభజించి లేఅవుట్లు వేయాలని డిజైన్లు తయారు చేశారు. వాటిలో రోడ్లు, డ్రెయిన్లు, మురుగు నీటి పారుదల, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ, చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని సీఆర్డీఏ ప్రకటించింది. ఇందుకోసం రూ.18,800 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనాలు రూపొందించారు. కానీ మూడున్నరేళ్లలో ఒక్క జోన్లో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులు మొదలు పెట్టలేదు. పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో ఈ లేఅవుట్ల అభివృద్ధికి పలుమార్లు టెండర్లు పిలిచి వాటిని రద్దు చేశారు. కనీసం ఒక్క జోన్ను అయినా మోడల్గా అభివృద్ధి చేయాలని రైతులు కోరినా, నిధుల సమీకరణ జరుగుతోందంటూ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రణాళికల పేరుతో నాడు కాలయాపన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఆయా గ్రామాలకు దూరంగా లేఅవుట్లు వేసి, హద్దుల ప్రకారం రాళ్లు పాతారు. అవన్నీ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి దారీతెన్ను లేకుండా ఉన్నాయని రైతులు అప్పట్లో వాపోయారు. మ్యాపులు, కాగితాల్లో మాత్రం అద్భుతమైన చిత్రాల్లో ప్లాట్లను ఇస్తున్నట్లు చూపి వాటిని సంబంధిత రైతులకు కేటాయించారు. కానీ లేఅవుట్లలో మాత్రం రైతులిచ్చిన పొలాల్లోనే రాళ్లు పాతి ప్లాట్లుగా విడగొట్టి వదిలేశారు. లేఅవుట్లకు వెళ్లేందుకు కనీసం రోడ్లు కూడా వేయలేదు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలకు సైతం చంద్రబాబు చివరి వరకు ప్రణాళికలు రూపొందిస్తూనే గడిపారు. మరోవైపు కార్పొరేట్ సంస్థలు, తమకు నచ్చిన వారికి కట్టబెట్టిన భూములను మాత్రం సుందరంగా తీర్చిదిద్దారు. సీఆర్డీఏ సొంత ఖర్చులతో పలు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన భూముల వరకు గత ప్రభుత్వం రోడ్లు వేసింది. రైతుల వద్దకొచ్చేసరికి మొండి చేయి చూపారు. ఇప్పట్లో వేల కోట్లతో అభివృద్ధి సాధ్యమేనా? తన కలల రాజధానిగా చెప్పుకున్న చంద్రబాబే రైతులకివ్వాల్సిన ప్లాట్ల గురించి పట్టించుకోకుండా అధికారంలో ఉన్నన్ని రోజులు కాలయాపన చేశారు. అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ.. రైతుల లేఅవుట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబే రాజధాని నిర్మాణానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పేవారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు కావాలని చెప్పేవారు. ఎంతో హడావుడి చేసి రైతుల నుంచి తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఉపయోగించారు. అప్పట్లో రైతుల నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాజధాని కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేయాలనడం ఎలా సాధ్యమని రాజకీయ, సామాజిక రంగ మేధావులు, సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు. -
రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కేంద్రం పునరుద్ఘాటించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఎంపీలు విభజనకు సంబంధించిన అంశాలపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బకాయి బిల్లుల డబ్బులను ఇంతవరకు చెల్లించకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. వడ్డీతో కలిపి సుమారు రూ.6 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సి ఉందన్నారు. కేటాయింపుల్లో తెలంగాణకు ఆ మేరకు తగ్గించి ఏపీకి ఇవ్వాలని ఎంపీ టీజీ వెంకటేశ్ కేంద్రాన్ని కోరారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి, సాగునీరు నిమిత్తం తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుంటోందని, తదుపరి కేటాయింపుల్లో ఆ మేరకు వాటా తగ్గించాలన్నారు. తాజా పరిస్థితులను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నిత్యానందరాయ్ తెలిపారు. నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్గా కేంద్రం పలుచోట్ల ప్రస్తావిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ కేంద్రానికి తెలిపిందని నిత్యానందరాయ్ చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును విరమించుకున్నట్లు తెలిíసిందన్నారు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని చెప్పారు. అయితే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంపై విభజన దుష్ప్రభావం తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన వేగవంతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. విభజన చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల ఆస్తుల విలువ రూ.1.42 లక్షల కోట్లు అని తెలిపారు. చట్ట ప్రకారం ఆస్తుల విభజన ఇప్పటివరకు జరగకపోవడం వల్ల ఆ దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పడుతోందన్నారు. పరస్పర అంగీకారంతోనే పరిష్కారం.. ఆస్తుల విభజనకు కేంద్రం నియమించిన కమిటీ 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని సిఫార్సు చేసిందన్నారు. -
మూడు రాజధానులతోనే సమాన అభివృద్ధి
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పాలకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారి ఆదివారం జిల్లా పరిషత్ సమావేశం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. మూడు రాజధానులపై తీర్మానం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రతిపాదించగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. సభ్యులంతా ఆమోదించారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. అలాగే విశాఖ స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. తొలి సమావేశంలో ఏడు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక నిర్వహించారు. మొదటి స్థాయి సంఘంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏడో స్థాయి సంఘంలో మంత్రి ముత్తంశెట్టి సభ్యులుగా ఎన్నికైనట్టు చైర్పర్సన్ సుభద్ర ప్రకటించారు. మాజీ సీఎం రోశయ్య, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సభ సంతాపం తెలిపింది. -
వికేంద్రీకరణకు మద్దతుగా.. జనవరిలో మనోచైతన్య యాత్ర
తిరుపతి అర్బన్: ఐకమత్యంతో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతి ఒక్కరూ జైకొట్టాలని రాయలసీమ అభివృద్ధి అధ్యయన కమిటీ పిలుపునిచ్చింది. ఇందుకోసం వచ్చే జనవరిలో మనో చైతన్య యాత్ర పేరుతో శ్రీశైలం లేదా కర్నూలు నుంచి అమరావతి వరకు పెద్దఎత్తున ఉద్యమకారులు, మేధావులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తిరుపతితో శనివారం కమిటీ నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాయలసీమకు జైకొట్టే పార్టీలను పాదయాత్రలో స్వాగతిస్తామన్నారు. జైకొట్టకపోతే ఆ నేతలకు రానున్న రోజుల్లో రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు. సీమ నేతలైన చంద్రబాబునాయుడు, తులసిరెడ్డి, నారాయణ, రామకృష్ణ తదితరులు అమరావతికి జైకొట్టడం సిగ్గుచేటన్నారు. సీమ ప్రజలే ఈ నేతలను వీధుల్లో పడేశారని గుర్తుచేశారు. త్యాగాలకు రాయలసీమ పెట్టింది పేరని అభివర్ణించారు. 68 ఏళ్ల క్రితమే కర్నూలు రాజధానిని త్యాగం చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. అంతేకాదు.. ఆ సమయంలో బళ్లారి నగరంతోపాటు, తుంగభద్ర, కృష్ణ పెన్నా ప్రాజెక్టులను కోల్పోయామన్నారు. భూములకు పరిహారం తీసుకుని.. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని అమరావతి రైతులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని అంశం అమరావతి ప్రజలకే పరిమితం కాదని.. ఐదుకోట్ల ఆంధ్రులతో ముడిపడిన అంశమని కమిటీ నేతలు తేల్చిచెప్పారు. త్యాగం అంటే అమరావతి రైతులది కాదని.. రాయలసీమ ప్రజలదేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. శాంతికి నిలయమైన తిరుపతి నగరంలో వివాదాలు ఉండరాదనే మౌనం పాటించాల్సి వచ్చిందని కమిటీ నేతలు తెలిపారు. ఆ చానెల్స్తో మాట్లాడతాం ఇక తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఏబీఎన్, టీవీ 5, టీవీ 9 చానల్స్ యాజమాన్యంతోను చర్చిస్తామని.. తాము చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా ఉండాలని కోరుతామని వారు చెప్పారు. అలాగే, కర్నూలులో హైకోర్టు.. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఉండాలా వద్దా అన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టంచేయాలని వారు డిమాండ్ చేశారు. సీమలో పుట్టి సీమకు అన్యాయం చేస్తే సీమ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతివ్వకుండా అమరావతికి జైకొట్టే నేతలను సీమ ప్రజలు ప్రశ్నించాలని కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని.. అయితే అమరావతితోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వికేంద్రీకరణకు మద్దుతుగా నిలుస్తామని వారు స్పష్టంచేశారు. జలయజ్ఞం పేరుతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పరిపాలనలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని నేతలు గుర్తుచేశారు. మీడియా సమావేశంలో రాయలసీమ అభివృద్ధి అధ్యయన కమిటీ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షిక ప్రతినిధుల సంస్థ అధ్యక్షుడు.. సీమ ఉద్యమకారుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, రాయలసీమ ఉద్యమకారులు బండి నారాయణస్వామి (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత), జర్నలిస్టు వర్మ తదితరులు మాట్లాడారు. అలాగే, కార్యక్రమంలో రచయిత శాంతి నారాయణ, హైకోర్టు సీనియర్ న్యాయవాది సీహెచ్ శివారెడ్డి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ నాయకులు, వేణుగోపాల్రెడ్డి (హిందూ పోరాట సమితి నేత), డాక్టర్ మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
29 గ్రామాల కోసం రాష్ట్రం బలి కావాలా?
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): గతంలో జరిగిన తప్పుల వల్ల తీవ్రంగా నష్టపోయామని, భవిష్యత్లో అలాంటి వాటికి అవకాశం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేసింది. వేదిక ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మూడు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు పరిపాలన వికేంద్రీకరణ ఆవశ్యకతను చాటి చెప్పారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూ సమానంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. స్వీయ ప్రయోజనాలు, 29 గ్రామాల కోసం ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రాన్ని బలి కోరుతోందని మండిపడ్డారు. కేవలం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సరిపోదని 13 జిల్లాలు పురోగమించాలని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ కోసం తిరుపతి వేదికగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని, మహా పాదయాత్ర చేపట్టేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న పరిపాలన వికేంద్రీకరణ బిల్లులో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజధానిలో సింహభాగం ఇవ్వాలని, సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అవసరాలు, ఆకాంక్షలను తెలియజేసేందుకే సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎస్డీహెచ్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ తిప్పారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, ప్రముఖ రచయిత్రి మస్తానమ్మ, వేణుగోపాల్రెడ్డి, హరికృష్ణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సభలో అభివాదం చేస్తున్న రాయలసీమ అభివృద్ధి సంఘల సమన్వయ వేదిక నాయకులు రియల్ ఎస్టేట్ సమస్యగా అమరావతి మూడు రాజధానుల ప్రకటన వల్ల వివాదం ప్రారంభం కాలేదు. గత సర్కారు రాజధాని కోసం అమరావతి రైతుల భూములు లాక్కోవడంతోనే సమస్య మొదలైంది. రాజధాని అంశం ప్రస్తుతం రైతుల సమస్య కాకుండా రియల్ ఎస్టేట్ సమస్యగా మారింది. 29 గ్రామాల ప్రజలు అమరావతిని ఏకైక రాజధానిగా డిమాండ్ చేయడమంటే మిగిలిన నాలుగు కోట్ల మందిని అవమానించడమే. వికేంద్రీకరణ కొత్తది కాదు. 1953లో శ్రీభాగ్ ఒప్పందంలోనే ఆ విషయం ఉంది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వికేంద్రీకరణ బిల్లులో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో మరో రాజధానిని చేర్చడం మినహా కొత్త అంశం లేదు. పరిపాలన వికేంద్రీకరణ కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర కలసి పనిచేయాలి. అమరావతి రైతులు రాజధాని కోసం కాకుండా తమ భూముల పరిహారం కోసం అడగాలి. వారికి రాజధానిని అడిగే నైతిక హక్కు లేదు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి. అమరావతి ఏకైక రాజధాని డిమాండ్ను విడనాడకుంటే తిరుపతి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతాం. వికేంద్రీకరణ కోసం పాదయాత్రలు చేస్తాం. – భూమన్, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు కొత్త నగరం అనవసరం రాయలసీమ ప్రాంతం కృష్ణ, తుంగభద్ర నదులకు ముఖద్వారం అయినప్పటికీ నీటి ప్రయోజనాలను పొందలేకపోతున్నాం. ఏటా 600 నుంచి 700 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. దీన్ని వినియోగించుకుంటే సీమ సస్యశ్యామలవుతుంది. రాష్ట్రంలో అనేక నగరాలు ఉండగా అమరావతి పేరిట కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడం అనవసరం. ప్రపంచంలో కొత్త నగరాల ప్రాజెక్టులు విఫలమయ్యాయి. అమరావతి కోసం వెచ్చించే నిధులతో ఇతర నగరాలను అభివృద్ధి చేయాలి. సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలి. సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రా«ధాన్యం ఇవ్వాలి. కొందరు రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర, రాయలసీమ మధ్య విబేధాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. వికేంద్రీకరణ బిల్లులో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలి. – మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త చరిత్రను వక్రీకరించొద్దు రాయలసీమ ప్రజలు అనాదిగా చేసిన త్యాగాలను చరిత్ర మరువదు. చరిత్రను వక్రీకరించడం దుర్మార్గం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు రాయలసీమ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. విశాలాంధ్ర కోసం రాజధానిగా ఉన్న కర్నూలును వదులుకున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు కోసం రైతులు ఎన్నో త్యాగాలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి ప్రజల మద్దతు ఉంది. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సంఘ నాయకుడు వెంకన్ననూ వదలరు.. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధానే. దీని వెనుక వ్యక్తిగత అజెండా దాగి ఉంది. మూడు రాజధానుల్లో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. అమరావతి వాసుల కోరికలు తీరుస్తూపోతే తిరుమల వెంకన్నను కూడా తమ ప్రాంతానికి తరలించుకెళ్తారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన మాదిరిగా కొందరు నాయకులు రాయలసీమకు ద్రోహం తలపెట్టడం దుర్మార్గం. – శాంతి నారాయణ, రాయలసీమ మహాసభ అధ్యక్షుడు ఆస్తి అంతా ఒక్కరికే ఇవ్వమంటున్నారు.. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఆస్తిని సమానంగా పంచకుండా ఒకరికే ఇవ్వాలనే మాదిరిగా అమరావతి వాసుల కోర్కెలు ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. అమరావతిని సమర్థించే కొందరు సీమ నాయకులు తమ మనసు మార్చుకోవాలి. – బండి నారాయణస్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అన్నీ అమరావతికే తరలించారు.. హెచ్సీఎల్ సంస్థ తిరుపతిలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే మాజీ సీఎం చంద్రబాబు అమరావతికి తరలించారు. అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్ను కూడా అమరావతికే తరలించారు. జీవో 120 ద్వారా పద్మావతి మెడికల్ కళాశాల సీట్లను రాయలసీమ వాసులకు దక్కకుండా చేశారు. సీమ వెనుకబాటుతనం పోవాలంటే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలి. – శ్రీకంఠరెడ్డి, రాయలసీమ అధ్యయన వేదిక నాయకుడు పెద్దన్న పాత్ర పోషించండి.. రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రాధాన్యం ఇవ్వాలి. సీమ నాయకులు పెద్దన్న పాత్ర పోషించి ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి. – ఎంఆర్ఎన్ వర్మ, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్ అధ్యక్షుడు న్యాయవాదులకు తిప్పలు.. అమరావతి ప్రాంతంలో హైకోర్టు ఆవరణలో నీరు, ఆహారం, ఇళ్లు లేక న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు. – శివారెడ్డి, హైకోర్టు న్యాయవాది చరిత్రలో నిలుస్తుంది... ఎన్నో ఏళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోతున్నారు. సీఎం జగన్ తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది. – సురేష్, డ్రీమ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ మూడుకే మా మద్దతు మేం అమరావతి ప్రాంతంలో ఉన్నప్పటికీ మా మద్దతు మూడు రాజధానులకే. – రాబర్ట్ సునీల్, ఫాస్టర్స్ ఫెడరేషన్ చైర్మన్ -
తిరుపతి : మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ
-
రాయలసీమలోనే రాజధాని కావాలి..
తిరుపతి రూరల్: శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) అధ్యక్షుడు రఫీహిందూస్థానీ అధ్యక్షతన తిరుపతి యూత్ హాస్టల్లో ‘మూడు రాజధానులు – వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీమ ప్రాంతానికి చెందిన పలువురు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత ఈ సమావేశంలో పాల్గొని సీమ ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు అడగకున్నా స్వార్థం కోసమే గత పాలకులు అమరావతి పేరుతో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ముందుగానే లీకులివ్వడంతో వందలాది ఎకరాలను గత పాలకులు మింగేశారని ఆరోపించారు. స్థిరమైన నగరాల్లోనే రాజధానిని అభివృద్ధి చేయాలని ఎస్వీయూ ప్రొఫెసర్ కృష్ణమోహనరెడ్డి కోరారు. అమరావతి ప్రాంత రైతులను టీడీపీ మోసం చేసి.. వారిని రోడ్డుపాల్జేసిందంటూ మండిపడ్డారు. రాయలసీమ రాజధాని ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ కమిటీ కూడా అమరావతిలోనే రాజధానిని పెట్టాలని సూచించిన దాఖలాల్లేవని సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ తెలిపారు. రాయలసీమకు వచ్చి సీమ వాసులు ఏర్పాటు చేసుకున్న మూడు రాజధానుల ఫ్లెక్సీలను చించిన దౌర్జన్యకారులకు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలకడం దారుణమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆప్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ, గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షుడు శంకరనాయక్, సాహిత్య అకాడమీ కన్వీనర్ డాక్టర్ మస్తానమ్మ, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: 'త్రి'కేంద్రీకరణే కావాలి
మూడు రాజధానులకు మద్దతుగా గురువారం తిరుపతిలో ప్రజలు, విద్యార్థులు కదం తొక్కారు. ‘పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి’, ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమంటూ గొంతెత్తారు. గతంలో రాజధానిని వదులుకున్న కర్నూలు ప్రజలదే గొప్ప త్యాగమని నినాదాలు చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ మండిపడ్డారు. యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): పరిపాలన వికేంద్రీకరణ – మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ ఆర్.తిప్పారెడ్డిలతో పాటు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన ర్యాలీ.. నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ సాగింది. అమరావతి వద్దు.. 3 రాజధానులు ముద్దు.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాయలసీమను అభివృద్ధి చేయాలి.. అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 18న నిర్వహించే రాయలసీమ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారన్నారు. అమరావతి ఒక వర్గానికే చెందిన రాజధాని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు.. 13 జిల్లాలని చెప్పారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, అవసరాలను గుర్తించాలని కోరారు. సీమలో ఉన్న కొందరు నాయకులు అమరావతిని సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చామని చెపుతున్న అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని.. అది వ్యాపారమని, శ్రీశైలం ప్రాజెక్ట్, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ను ప్రోత్సహిస్తున్నారని పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్వీయూ ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి, ఎస్డీహెచ్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ డి.రామసునీల్రెడ్డి, సీకాం విద్యాసంస్థల చైర్మన్ సురేంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్.రాజశేఖర్రెడ్డి, రచయిత్రి మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే సమన్యాయం
అనంతపురం కల్చరల్: పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం దక్కుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో మేధావుల చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ‘అధికార వికేంద్రీకరణ’పై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణతోనే సాధ్యమన్నారు. ఏటా మూడు పంటలు పండే అమరావతి ప్రాంత భూములను నాశనంచేసి రాజధాని నిర్మించాలనుకోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. అభివృద్ధిని ఒక ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జేఎన్టీయూ (ఏ) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శశిధర్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి అమరావతి సరైన ప్రాంతం కాదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్కేయూ ప్రొఫెసర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడిక అమలు కానందునే రాయసీమ వెనుకబాటుతనం వచ్చిందని, దాన్ని సరిజేయాలనుకుంటున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అందరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ అడ్వకేట్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా ఉద్యమం సాగాలన్నారు. రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి మళ్లీ అమరావతి గురించి మాట్లాడితే బీజేపీకి ప్రజల విశ్వాసం ఉండదన్నారు. పలువురు విద్యార్థులు కూడా అధికార వికేంద్రీకరణవల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురంలో మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. -
పాదయాత్రలో పేట్రేగిన రౌడీమూకలు
సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/తిరుపతి రూరల్ : అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ సాగిన అమరావతి రైతుల పాదయాత్ర చివరి రోజైన మంగళవారం రైతుల ముసుగులో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ‘మీకు స్వాగతం అంటూ’ తిరుపతి ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశాయి. ఆందోళనకారులు పోలీసులపై ఇష్టారాజ్యంగా దూషణలకు దిగారు. స్థానికులను రెచ్చగొట్టారు. దమ్ముంటే రండిరా అంటూ.. టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు సవాళ్లు చేశారు. పాదయాత్ర దారి పొడవునా నానా యాగీ చేశారు. అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది యత్నించారు. కానీ, విషప్రచారం కోసం రైతుల ముసుగులో వీరు చేస్తున్న కవ్వింపు చర్యలపై రాయలసీమ మేధావుల ఫోరం, ఆప్స్, విద్యార్థులు, యువకులు, స్థానికులు సంయమనం పాటించారు. స్వాగతం పలికినా అలజడే అంతకుముందు.. ‘మీతో మాకు గొడవలు వద్దు.. మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి’.. అంటూ రాయలసీమ మేధావుల ఫోరం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్), విద్యార్థులు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సున్నితంగా ప్లెక్సీలతో ప్రదర్శించి పాదయాత్రికులకు స్వాగతం పలికారు. కానీ, మద్యం మత్తులో తూలుతున్న కొంతమంది టీడీపీ, జనసేన కార్యకర్తలు అలజడి సృష్టించారు. ప్లెక్సీలను కాళ్లతో తన్నుతూ చించివేయడంతో కలకలం రేగింది. కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు.. మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఫోరం, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నగరంలో ర్యాలీలు నిర్వహించారు. అయితే.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని గుర్తించిన పోలీసులు వాటిని అడ్డుకున్నారు. అలాగే, తమ ప్రాంత ప్రయోజనాలను అడ్డుకోవద్దంటూ అనంతపురం నుంచి వచ్చిన యువకులకు పోలీసులు నచ్చచెప్పారు. దీంతో వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తిరుపతిలో ముగిసిన పాదయాత్ర అమరావతి రైతులు తమ పాదయాత్రను తిరుపతి మండలంలోని రామానాయడు కల్యాణమండపం నుంచి మొదలుపెట్టి నగరంలో కొనసాగించారు. అల్లర్లకు పాల్పడాలనే తమ కవ్వింపు చర్యలకు స్థానికుల నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో కుట్రదారులు నిరాశగా వెనుతిరగడం కనిపించింది. 44రోజులపాటు సాగిన వీరి పాదయాత్ర మంగళవారం సాయంత్రం తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద ముగిసింది. అల్లరి మూకలపై కేసు నమోదు ఫ్లెక్సీలు చింపినందుకు, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించటం.. స్థానికులను రెచ్చగొట్టేలా వ్యవహరించటంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేశారు. ప్లెక్సీలు చింపిన వారిలో టీడీపీ నాయకుడు కంకణాల రజనీకాంత్, నాయకులు నరసింహ యాదవ్, బీఎల్ సంజయ్, కార్యకర్త వెంకటేశ్తో పాటు జనసేనకు చెందిన బోత్ హరిప్రసాద్, కిరణ్రాయల్, రాజారెడ్డి, సుభాషిణి, రాజేష్యాదవ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివప్రసాద్రెడ్డి తెలిపారు. యాత్ర వెనకున్నది చంద్రబాబే యూనివర్సిటీ క్యాంపస్: అమరావతి రైతుల పాదయాత్ర వెనకున్నది మాజీ సీఎం చంద్రబాబేనని.. ఈ విషయం అందరికీ తెలుసని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి విమర్శించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీ గురించి మాట్లాడటం దండగన్నారు. శాసనసభ ఎస్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. -
భావి తరాలకు వరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): మూడు రాజధానులకు మద్దతుగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన చర్చా వేదికలో మేధావుల ఫోరం తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం ప్రతిని పంపనున్నట్లు తెలిపింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు వరం లాంటిదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ‘పరిపాలనా వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఆవశ్యకత–ఆంధ్రప్రదేశ్ సమతౌల్య అభివృద్ధి’పై విశాఖ ఏయూలోని టీఎల్ఎన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు అన్ని ప్రాంతాల అభివృద్ధిని విస్మరించడం రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని, రూ.లక్ష కోట్లతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం అవివేకమన్నారు. నీటి వనరులు, వ్యవసాయ భూములు పుష్కలంగా ఉన్న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను నాశనం చేస్తూ గత సర్కారు తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టితో తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అభినందనీయమన్నారు. ఉద్యమించక ముందే మద్దతివ్వండి.. విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఆంధ్రప్రదేశ్కు మిగిలాయని ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి, భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్న సంకల్పంతో సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్మోహన్ తెలిపారు. పటిష్ట నాయకత్వం, పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతూ వస్తోందని న్యాయ కళాశాల ప్రొఫెసర్ సూర్యప్రకాష్ చెప్పారు. అమరావతి ప్రాంతం హైదరాబాద్లా అభివృద్ధి చెందాలంటే వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత ఉద్యమబాట పట్టకముందే ప్రతిపక్షాలు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని ప్రొఫెసర్ షరాన్ రాజ్ డిమాండ్ చేశారు. మరోసారి ప్రాంతీయ విద్వేషాలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏయూ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రవి పేర్కొన్నారు. ఎయిడెడ్ కళాశాలల తరఫున ప్రొఫెసర్ మధుసూదనరావు మాట్లాడుతూ తాము గుంటూరు నుంచి వచ్చినప్పటికీ పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నాన్ టీచింగ్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. -
మూడు రాజధానులే ముద్దు.. ఒక్కటి వద్దే వద్దు
హిందూపురం: మూడు రాజధానులతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమంటూ హిందూపురం విద్యార్థులు నినదించారు. ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు గురువారం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఏపీ ఆగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్ పిలుపు మేరకు దాదాపు 3వేల మందికి పైగా విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని స్థానిక మార్కెట్నుంచి మెయిన్బజారు, గాంధీ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, సద్భావన సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కదం తొక్కారు. తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు మనోజ్ మిట్టు, నాగభూషణం మాట్లాడుతూ.. రాయలసీమకు అన్యాయం చేయడానికి కొందరు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు నరసింహరెడ్డి, దాదు, గిరి, సల్మాన్, గౌతమ్, అజయ్, వసీం, వరుణ్ పాల్గొన్నారు. -
ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...
మూడు ప్రాంతాల్లో, మూడు రాజధానుల నిర్మాణ ప్రయత్నాలను అడుగడుగునా ఎదుర్కోవడానికి ఏపీలో ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం– ‘భారతదేశ పాలనావ్యవస్థ చరిత్రలోనే సాటిలేనిద’ని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ప్రశంసించారు. నూతన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రు గుర్తించారు. ఈ కోణంలోనే రాజధానుల బిల్లును తాత్కాలికంగా వెనక్కు తీసుకున్న సందర్భంలో కూడా, నూతన రాష్ట్రానికి వికేంద్రీకరణే సరైన విధానమని సీఎం జగన్ స్పష్టపరిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఎందుకు తలపెట్టవలసి వచ్చిందో వివరిస్తూ మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు విలువైన, సమగ్రమైన విశ్లేషణను వెలిబుచ్చారు. పేరు ప్రతిష్ఠలున్న మరొక వర్తమాన న్యాయమూర్తి ఎవరూ ఇలాంటి విశ్లేషణను అందించలేకపోయారు. ఇటీవల వ్యవసాయ రంగంలో ‘సంస్కరణల’ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాల్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలు చేసినప్పుడు, ఆ శాసనసభల అధికారాల్నీ కొందరు ప్రశ్నించారు. కానీ శాసనసభల అధికారాన్ని ఇలా ప్రశ్నించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా విమర్శించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంలో దేశ సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుందని జస్టిస్ చంద్రు వివరించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఒక్కటే రాజధాని అని హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరస్కరించడమే కాదు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా మూడు రాజధానుల నిర్మాణ అవసరాన్ని కూడా గుర్తించవలసి వచ్చిందని జస్టిస్ చంద్రు భావించారు. అర్ధంతరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి, విభజిత ప్రాంతాన్ని నట్టేట్లో వదిలిన ఫలితంగా 2020లో జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నూతన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం అధికార వికేంద్రీకరణ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రు గుర్తించారు. దురదృష్ట కరమైన విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో మూడు రాజధానులపై జస్టిస్ చంద్రు చేసిన విలువైన వ్యాఖ్య పెద్దగా ఎవరి దృష్టిలోనూ పడలేదు. జగన్ ప్రభుత్వాన్ని. దాని ప్రజాహిత నిర్ణయాలను మూడు ప్రాంతాల్లో, మూడు రాజధానుల నిర్మాణ ప్రయత్నాలను అడుగడు గునా ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కుయుక్తులు పన్నుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం– ‘భారతదేశ పాలనా వ్యవస్థ చరిత్రలోనే సాటిలేనిద’ని జస్టిస్ చంద్రు ప్రశంసించాల్సి వచ్చింది. చివరికి తన వరుస ప్రజావ్యతిరేక చర్యల కారణంగా, రాష్ట్ర శాసనపరిషత్లో టీడీపీ సభ్యుల సంఖ్య కూడా క్రమంగా కుదేలయిపోయింది. అధికారపార్టీ సభ్యులు 11 మంది ఏకముఖంగా ఇటీవలే మండలికి ఎన్నిక కావడంతో నామమాత్రపు ప్రతిపక్షం సంఖ్య కూడా కనుమరుగయ్యే దుఃస్థితి టీడీపీకి ఎదురైంది! ఈ మింగలేని, కక్కలేని దుర్గతితో చిక్కు బడిపోయిన చంద్రబాబు వర్గం న్యాయస్థానాల్ని ప్రభావితం చేసే దుష్ట పన్నాగంతో ఆఖరి తురుఫు ముక్క కూడా వాడేయడానికి సాహసించింది. రాష్ట్రంలో ‘రాజ్యాంగ సంక్షోభం’ ఏర్పడిందన్న మిషపైన ఎలాగోలా ఏపీలో రాష్ట్రపతి పాలనను రుద్దించడానికి కూడా ప్రయత్నించింది. కానీ గతంలో బొమ్మై కేసులో (కర్ణాటక), సుప్రీంకోర్టులోని మెజా రిటీ సభ్యులతో కూడిన ధర్మాసనం ‘రాజ్యాంగ సంక్షోభం’ అన్న మిషపై కోర్టుకెక్కి రాష్ట్రపతి పాలనను రుద్దించాలని చూసిన ప్రతిపక్షం పాత్రను తుత్తునియలు చేసింది. బొమ్మై ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చవలసింది శాసనసభే గానీ, కోర్టు కాదని సుప్రీం కోర్టు నాటి విచారణ సందర్భంగా ప్రతిపక్షానికి లెంపలు వాయించి మరీ పంపింది! అలాగే ఆంధ్రప్రదేశ్లో గత సర్కారు అనుసరించిన కేంద్రీకృత ధోరణులకు ప్రజలు విసిగిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నికరపరిచిన ప్రజాతీర్పు చంద్ర బాబుపై వ్యతిరేకతను కళ్ళకు కట్టి చూపింది. అందుకే జగన్ బాధ్యతగల ప్రజా ముఖ్యమంత్రిగా రాజధానిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ రాజధాని మోడల్ నూతన ఆంధ్రప్రదేశ్కు వద్దనీ, అలాంటి చారిత్రక తప్పిదానికి మరోసారి పాల్పడరాదనీ ప్రజలు ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాబట్టే నూతన రాష్ట్రానికి వికేంద్రీకరణే సరైన విధానమని వైఎస్ జగన్ ప్రభుత్వం తేల్చుకుంది. అయితే కొందరు రియల్ ఎస్టేట్ కుబేరులు, అధికార వికేంద్రీకరణ పథకం మూలంగా తమ వ్యాపార లావాదేవీలకు నష్టం వాటిల్లుతుందని అప్పుడే గగ్గోలు పెట్టడం ప్రారంభమైంది. నిజానికి తాము చేసే ప్రచారం ఫలిస్తే, ఆ పేరిట మరిన్ని లాభాలను రియల్ ఎస్టేట్ ద్వారా పొందడం సాధ్యమని వారికీ తెలుసు. భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ అంబేడ్కర్ మొత్తం రాజ్యాంగ నిర్ణయ సభా చర్చలన్నిటా ప్రజావసరాలను ఏకరువు పెడుతూ వచ్చారు. దేశంలో అట్టడుగున ఉన్న దళిత, గిరిజన, అణగారిన జాతుల, పేదసాదల, వ్యవసాయ కార్మికుల జీవితాలను ఉద్ధరించే వాదనలు, ప్రతిపాదనలే చేస్తూ వచ్చారు. చివరికి కేంద్రమంత్రివర్గంలో సభ్యుడై ఉండి కూడా పాలకవర్గ నిర్ణయాలు గాడితప్పి, రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా ముందుకు సాగుతుండడం గమనించి, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. వస్తూ వస్తూ అంబేడ్కర్ ఒక బలమైన హెచ్చ రిక చేసి మరీ బయటపడ్డారు. ప్రజలు ధన, మాన, ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న స్వాతంత్య్రాన్ని, ‘ప్రజలమైన మేము’గా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగ లక్ష్యాలకు పాలకులు ఆచరణలో విఘాతం తలపెట్టే పక్షంలో...‘పార్లమెంటు భవనాన్ని కూల్చడానికి సహితం ప్రజలు వెనుకాడరు సుమా’ అని అంబేడ్కర్ హెచ్చరించిన సంగతం మనం మరచిపోరాదు! ఇంతకూ ఇటీవల ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర హైకోర్టులో కూడా ఒకే రాష్ట్రంలో మూడు రాజధానులూ, మూడు న్యాయస్థానాలూ సాధ్యమా, అలా ఎక్కడైనా ఉన్నాయా, అన్న ప్రశ్న, అనుమానాలూ సహజంగా తలెత్తాయి. ఈ విషయం గతంలో కూడా ప్రస్తావనకు వచ్చినపుడు ఇదే పత్రిక (సాక్షి)లో ఈ వ్యాసకర్త వివిధ దేశాల్లో వివరాలను, మనదేశంలోని వాటి వివరాలను ప్రకటించారు. అమరావతి మొత్తం ఏకైక రాష్ట్ర రాజధాని కావడం వల్ల కర్నూలు, విశాఖపట్నం కేంద్రాలు ఒక్కొక్కటి అమరావతికి 700 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. అలా కాకుండా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుంటే ఆయా రాజధానుల చుట్టూ ఉన్న నగరాలు, గ్రామాలలో అభివృద్ధి లోటుపాటుల్ని సరిదిద్దడానికి వీలుగా ఉంటాయి. ఈ దృష్ట్యానే ఉత్తరప్రదేశ్కు ప్రయాగ న్యాయరాజధాని గానూ, లక్నో పరిపాలనా రాజధానిగానూ ఉన్నాయి. మహారాష్ట్రకు ముంబై, నాగపూర్ రాజధానులు, కర్ణాటకు బెలగావి(బెల్గాం), బెంగళూరు రాజధానులుగా ఉంటున్నాయి. అలాగే మలేషియా రాజధానులు కౌలాలంపూర్, పుత్రజయ; జెకోస్లావేకియా రాజధానులు ప్రాగ్, బ్రనో; బొలీవియా రాజధానులు లాపాజ్, సుక్రీ; చిలీ రాజధానులు శాంటియాగో, వల్పరాజో; శ్రీలంక (కొలంబో, శ్రీ జయవర్ధనీ పుత్రకోటి), టాంజానియా (దార్ ఇ సలామ్, డొడోమా) నిక్షేపంగా పాలనను అందిస్తున్నాయి. కాగా, అసమానతల బెడద వల్లనే తమిళ నాడులో దక్షిణ తమిళనాడు విడిపోవాలని కోరుతున్న వ్యక్తి పి. చిదంబరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు స్వార్థ ప్రయోజ నాలకు బలిచేసిన వ్యక్తి కూడా ఈ చిదంబరమే! ఇది చరిత్ర, చెరపరాని చరిత్ర, వినదగిన చరిత్ర. - ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల..చట్టబద్ధతను తేలుస్తాం
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరించిన నిర్ణాయక విధానాన్ని కూడా తేలుస్తామంది. రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతం అనువైనదన్న అంశం తమకు సంబంధించినది కాదని, అందువల్ల దానిజోలికి వెళ్లబోమని తేల్చిచెప్పింది. తమ ముందున్నది నగరాల మధ్య పోటీ వివాదం కాదంది. అందువల్ల న్యాయవాదులు చట్టాల చట్టబద్ధత గురించే వాదనలు వినిపించాలంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం నాలుగోరోజు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా తాము సరదాగా మాట్లాడుతున్న మాటలు కూడా ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వాదనల సమయంలో తాము పూర్తిస్థాయి చర్చలోకి వెళ్లలేకపోతున్నామని, ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొందని తెలిపింది. తమ సందేహాలను నివృత్తి చేసుకునే పరిస్థితి ఉండటం లేదంది. సరదాగా మాట్లాడుకునే మాటలు సైతం కోర్టు వెలుపల మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉందని, మీరూ అదేపని చేయాలంటూ అటు అడ్వొకేట్ జనరల్, ఇటు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పిటిషనర్లు దోనె సాంబశివరావు తదితరుల న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. అంతర్జాతీయస్థాయి రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీ నుంచి వెనక్కి వెళుతోందన్నారు. అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం అయితే మిగిలిన ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్న వాదనను ప్రస్తుత ప్రభుత్వం తెరపైకి తెస్తోందని చెప్పారు. అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య ఉపాధ్యక్షుడు కళ్లం పానకాలరెడ్డి, మరో ఇద్దరి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. అమరావతి తమదన్న భావన ప్రజల్లో లేదన్న ప్రభుత్వ వాదన అర్ధరహితమన్నారు. తుగ్లక్, అక్బర్లు రాజధానులను మరో చోటుకు మార్చి, ఆ తరువాత తిరిగి పాత నగరాలకే రాజధానులను తీసుకొచ్చారన్నారు. వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సరదాగా స్పందిస్తూ.. చారిత్రాత్మకంగా తుగ్లక్ సమర్థతను ప్రపంచం తక్కువగా అంచనా వేసిందని చెప్పగా, నిజమేనని సీజే నవ్వుతూ బదులిచ్చారు. సరదా మాటలు సైతం పతాక శీర్షికలవుతున్న నేపథ్యంలో ఈ మాటలన్నీ బయట మాట్లాడుకోవాలని సీజే నవ్వుతూ చెప్పారు. -
మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి
కడప కార్పొరేషన్: మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యపడుతుందని వివిధ ప్రజాసంఘాల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందాలంటే పాలన వికేంద్రీకరణ కావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మూడు రాజధానులకు మద్దతుగా కడపలోని సప్తగిరి కల్యాణ మండపంలో బుధవారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యానాదయ్య, ఎస్సీ సఫాయి కర్మచారీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గుండ్లపల్లి గరుడాద్రి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, రెడ్డి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల కొండారెడ్డి, బీసీ, బెస్త, బలిజ సంక్షేమ సంఘాల నాయకులు హాజరై ప్రసంగించారు. రాయలసీమ ఏపీలో భాగమే.. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఏపీలో రాయలసీమ ఒక భాగమనే విషయాన్ని ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్ర విభజన తర్వాత కూడా పాలకులు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒడంబడికను పక్కన పెట్టారన్నారు. టీడీపీ హయాంలో అసెంబ్లీ తీర్మానం ప్రకారమే అమరావతిని రాజధానిగా ప్రకటించారని, ఇప్పుడు కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం చేశారన్నారు. బిల్లు పాసైన తర్వాత కూడా దానిని అమల్లోకి తెచ్చుకోలేకపోతే భవిష్యత్ అంధకారమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో న్యాయవాదులు ఎన్ని ఉద్యమాలు చేసినా, సీజేలకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటుపై న్యాయమూర్తుల వ్యాఖ్యలు దురదృష్టకరమని, వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెనుకబడిన ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీజే వ్యాఖ్యలు చేశారన్నారు. కొందరు న్యాయమూర్తులకు రాజధానిలో భూములు ఉన్నాయని, ఆ కేసు వారి వద్దకు వచ్చినప్పుడు నాట్ బిఫోర్ అని చెప్పకుండా, ఇంకో బెంచ్కు బదిలీ చేయకుండా తామే విచారణ చేస్తామనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. రాయలసీమ ప్రజలు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించి పోరాడాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వారికి భూములిప్పించి తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆస్తులు దోచుకుని ఏర్పాటు చేసిన అమరావతి ఎట్టిపరిస్థితుల్లో ప్రజా రాజధాని అనిపించుకోదని స్పష్టం చేశారు. అక్కడ అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే వారు తమతో సమానమా అంటూ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న వారు, అదే ప్రాంతం రాజధానిగా ఉంటే ఇతరులను అక్కడ కాలు మోపనిస్తారా అని ప్రశ్నించారు. అమరావతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కోర్టుల ద్వారా అడ్డుకుని, పెయిడ్ ఆర్టిస్టులతో పోరాటం చేయిస్తున్నారని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాటమార్చి అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు పలకడం దారుణమన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు కోసం కార్యాచరణ సిద్ధం చేసి పోరాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. -
న్యాయ రాజధానితోనే అభివృద్ధి
కర్నూలు (అర్బన్): న్యాయ రాజధానిని సాధించుకుంటేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రక త్యాగాలు చేస్తూ వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ఇకపై త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక మెగాసిరి ఫంక్షన్ హాల్లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘అధికార వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఏర్పాటు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగలడం దారుణమని, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తక్కువ ధరకు సేకరించిన భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అక్కడి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ముసుగులో చేపట్టిన పాదయాత్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, ఎన్నో త్యాగాలు చేసిన కర్నూలు వాసుల చిరకాల స్వప్నమైన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కలిసి రాని రాజకీయ నేతలంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం చూపిస్తాం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ ..1953 నుంచి చారిత్రక త్యాగాలు చేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడి టీడీపీ నేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇక నుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఆ యాత్రలో రియల్ ఎస్టేట్వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. స్వార్థంతో పేద, మధ్య తరగతి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూములతో రూ.కోట్లు సంపాదించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ నిజమైన రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయ రాజధాని సాధనకు తొలి అడుగు కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇక పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 95 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవహిస్తున్నా తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటైతే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధన సమితి అధ్యక్షుడు బి.క్రిష్టఫర్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సీమ రైతులను ఆదుకోలేని టీడీపీ నేతలు అమరావతి రైతుల నకిలీ ఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. న్యాయ రాజధానికి సీపీఐ కట్టుబడి ఉంది సీపీఐ నేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టి బూటకమని, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులేనని అన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కర్నూలు నుంచి హైకోర్టు వరకు పాదయాత్రలు చేపడదామన్నారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులంతా వారం రోజులపాటు మాస్ క్యాజువల్ లీవ్ పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐ.విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేసే ప్రక్రియలో ఎంతటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. సదస్సులో డిప్యూటీ మేయర్ రేణుక, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, జాతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు వి.సిద్ధారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, కో–కన్వీనర్ ఆర్.చంద్రప్ప, సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, నాగలక్ష్మీదేవి, విశ్రాంత తహసీల్దార్ రోషన్ ఆలీ తదితరులు మాట్లాడారు. -
మూడు రాజధానులపై మొదలైన విచారణ
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరిగి రోజూవారీ విచారణ ప్రారంభించింది. విచారణ మొదటిరోజే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ధర్మాసనాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని పరిధిలో న్యాయమూర్తులకు అప్పటి ప్రభుత్వం చదరపు గజం రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి 600 గజాల స్థలం కేటాయించిందని ఆ పిటిషన్లో తెలిపారు. ప్రస్తుతం ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు కూడా ఆ స్థలాలు తీసుకున్నారని, అందువల్ల వారు ఈ మూడు రాజధానుల వ్యవహారంపై విచారణ జరపడం సబబుకాదని పేర్కొన్నారు. స్థలాల కొనుగోలు ద్వారా పెట్టుబడి సంబంధిత ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున వారు ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అభ్యర్థించారు. న్యాయం జరగడమే కాక, జరిగినట్లు కూడా కనిపించాలన్నారు. ఇది సదుద్దేశంతో చేస్తున్న అభ్యర్థన అని వివరించారు. త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ఇందుకు అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ నుంచి తప్పుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తాను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలా అయితే ఏదో ఒక సాకు చూపి ప్రతి ఒక్కరూ ప్రతి జడ్జిని కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరతారన్నారు. ఈ కేసులో తమ ధర్మాసనమే వాదనలు వింటుందని తేల్చి చెప్పారు. ఏదో ఒక నిర్ణయం చెప్పండి.. సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం.. విచారణ నుంచి తప్పుకోవాలన్న తమ పిటిషన్పై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సీజేను కోరారు. తమ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. దానిపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు. మీ అభ్యర్థనను తిరస్కరిస్తామని సీజే చెప్పగా.. లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని దవే అభ్యర్థించారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని, తుది తీర్పు ఇచ్చే సమయంలో విచారణ నుంచి తప్పుకోవాలన్న పిటిషన్పై ఉత్తర్వులు ఇస్తామని సీజే చెప్పారు. అప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని దవే తెలిపారు. అభివృద్ధి స్తంభించిపోయింది సీజే స్పందిస్తూ.. ఏడాది కాలంగా ఈ కేసు ముందుకెళ్లడం లేదన్నారు. ఇక ఈ కేసు ముందుకెళ్లాల్సిందే నని, ఎన్నిరోజులైనా సరే ముందుకెళుతుందని, రోజువారీ విచారణ చేపడతామని చెప్పారు. ఈ వ్యాజ్యాలు పెండింగ్లో ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందని, వీటిగురించి అందరూ ఎదురుచూస్తున్నారని తెలిపారు. దవే స్పందిస్తూ.. విచారిస్తున్న కేసు విషయంలో న్యాయమూర్తులకు ప్రయోజనాలుంటే, వారే స్వచ్ఛందంగా విచారణ నుంచి తప్పుకోవాలన్నారు. అలా ప్రయోజనాలున్న న్యాయమూర్తులు ఆ కేసును విచారించడానికి అనర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని వివరించారు. జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు విషయంలో తమ అభ్యంతరాలను రికార్డు చేయాలని ఆయన అభ్యర్థించగా ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఇదే అంశంపై ఎప్పుడో వేసిన పిటిషన్ విచారణకు రాలేదు అంతకుముందు న్యాయవాది సింహంభట్ల శరత్ కుమార్ ఇదే అభ్యర్థనను లేవనెత్తారు. ఈ అంశంపై గతంలోనే వేసిన పిటిషన్ విచారణకు నోచుకోలేదని చెప్పారు. ఈ రోజు విచారణ జాబితాలో కూడా తన కేసు లేదని తెలిపారు. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులకు ఈ కేసులో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నందునే వారిని విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతున్నామని, వారి విశ్వసనీయతపై తమకు సందేహం లేదని చెప్పారు. -
మూడు రాజధానులు.. రాష్ట్ర పరిధిలోని అంశం: కేంద్ర మంత్రి
సాక్షి,విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఏపీలో మూడు రాజధానుల అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధంలేదని, అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైందన్నారు. ఒకవేళ నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా మోదీ నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. తమ రిపబ్లికన్ పార్టీ కూడా వైఎస్సార్సీపీలాగే ప్రాంతీయ పార్టీ అని, ఎన్డీఏలో భాగస్వామి అయ్యాక అభివృద్ధి వేగవంతమైందన్నారు. అదే తరహాలో వైఎస్సార్సీపీ ఎన్డీఏలో భాగస్వామి అయితే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఏపీలో జాతీయ రహదారులు, టూరిజం తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రులకు పలుసార్లు వినతులిచ్చారని చెప్పారు. ఏపీలో బలమైన పార్టీ నేతగా ఎదిగిన వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్సార్తో తనకెంతో అనుబంధముందన్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ద్వారా కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. స్వర్ణకారుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళతానని ఏపీ స్వర్ణకార సంఘం మహాసభలో అథవాలే చెప్పారు. -
AP: మూడు రాజధానులకు జై కొట్టిన ప్రజలు
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల ప్రజలూ ఒకేమాటపై నిలబడ్డారు. ఒకే తీర్పు ఇచ్చారు. ప్రాంతాలు వేరైనా తమ అభిమతం ఒకటేనని మరోసారి చాటారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనను వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి సంపూర్ణంగా ఆమోదించారు. శ్రీకాకుళం జిల్లా మొదలుకొని అనంతపురం జిల్లా వరకూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రజలు మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటిస్తూ ఇచ్చిన తీర్పే ఇందుకు తార్కాణం. ప్రాంతీయ విద్వేషాల్ని రగిల్చి.. ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సాగిస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీని తిరస్కరించారు. శాసన రాజధాని ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ.. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం జిల్లాలోనూ.. న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనూ టీడీపీ ఘోర పరాజయం పాలవడమే ఇందుకు నిదర్శనం. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లోనూ ఓటర్లు ఇదే తరహాలో తీర్పు ఇవ్వడం గమనార్హం. సమగ్రాభివృద్ధికే ఓటు పరిపాలనను వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. ఆ మేరకు శాసనసభలో బిల్లును ఆమోదించారు. మూడు రాజధానుల వల్ల పరిపాలనతోపాటూ అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని మేధావులు ప్రశంసించారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీని రక్షించుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనదైన రీతిలో కుట్రలకు తెరలేపారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి.. రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని భావించారు. కానీ.. పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు ఆటలను ఓటర్లు సాగనివ్వలేదు. శాసన రాజధాని ఉన్న గుంటూరు–కృష్ణా జిల్లాల్లో రెండు జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 99 శాతానికి పైగా మండల పరిషత్లను దక్కించుకుంది. న్యాయ రాజధాని రాయలసీమలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా వైఎస్సార్సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం ఉన్న ఉత్తరాంధ్రలో టీడీపీని ప్రజలు ఛీకొట్టి.. వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ప్రాంతాలకు అతీతంగా ఇదే తీర్పు ఇచ్చారు. 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం.. 99.95 శాతం మండల పరిషత్లను దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లోనూ వికేంద్రీకరణకే మద్దతు పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు ప్రసంగాలు చేశారు. కానీ.. మూడు ప్రాంతాల ప్రజలు ఆ ఆటలను సాగనివ్వలేదు. పంచాయతీ ఎన్నికల్లో 3 ప్రాంతాల్లో 13,081 పంచాయతీలకుగానూ 10,536 (80.51%) పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించారు. టీడీపీ మద్దతుదారులను 16.06% (2,100) పంచాయతీలకే పరిమితం చేశారు. మిగిలిన పక్షాలను 445 పంచాయతీల్లో గెలిపించారు. పురపాలక ఎన్నికల్లో 75కు 74 మునిసిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ఎన్నికలు జరిగిన 12 నగరపాలక సంస్థల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. శాసన రాజధాని ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరపాలక సంస్థలతోపాటూ అన్ని మునిసిపాలిటీలను వైఎస్సార్సీపీకి కట్టబెట్టడం ద్వారా ప్రజలు వికేంద్రీకరణకు మద్దతు పలికారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం ఉన్న ఉత్తరాంధ్రతోపాటూ న్యాయ రాజధాని కర్నూలు ఉన్న రాయలసీమలోనూ మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వైఎస్సార్సీపీకి విజయాన్ని కట్టబెట్టడం ద్వారా మూడు రాజధానులకు మద్దతు పలికారు. -
రాజధానుల వ్యాజ్యాలపై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన వ్యాజ్యాలపై తదుపరి విచారణను హైకోర్టుమే 3వతేదీకి వాయిదా వేసింది. ఆ రోజు నుంచి విచారణ ప్రారంభిస్తామని ప్రకటించింది. విచారణ మొదలు పెట్టిన తరువాత పరిస్థితులను బట్టి రోజూవారీ పద్ధతిలో విచారణ జరపడంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ వ్యాజ్యాలను భౌతిక విచారణ / వీడియో కాన్ఫరెన్స్ / హైబ్రీడ్ విధానాల్లో ఏ రూపంలో విచారించాలో ఆ రోజు కోవిడ్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అత్యవసర విచారణ అవసరం... ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ షెడ్యూల్ను ఖరారు చేసి పరిమిత సంఖ్యలో న్యాయవాదులను అనుమతిస్తూ హైబ్రీడ్ విధానంలో విచారణ జరపాలని కోరారు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించిన వ్యాజ్యాలను ఈ వ్యాజ్యాల నుంచి వేరు చేసి విచారించాలని అభ్యర్థించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఏప్రిల్ రెండో వారంలో వరుస సెలవులు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. షెడ్యూల్ ఖరారు చేసిన తరువాత వరుసగా విచారణ కొనసాగిస్తామని తెలిపింది. అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి విజ్ఞప్తి మేరకు వేసవి సెలవులకు ఇబ్బంది లేకుండా ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను మే 3కి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. -
దేశంలోనే విశిష్ట ప్రాంతం కర్నూలు
సాక్షి, అమరావతి: కర్నూలును రాష్ట్ర న్యాయ రాజధానిగా కేంద్ర పౌరవిమానయాన శాఖ గుర్తించింది. ఉడాన్ పథకం కింద మార్చి 28 నుంచి కర్నూలు నుంచి విమాన సర్వీసులను ప్రారంభించడంతోపాటు రాష్ట్రంలో ఆరో ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడంపై కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి హరిదీప్సింగ్ పురి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కర్నూలును ఆంధ్రప్రదేశ్ న్యాయ రాజధానిగా పేర్కొనడంతోపాటు చారిత్రాత్మకంగా దేశంలో విశిష్టత కలిగిన ప్రాంతంగా అభివరి్ణంచారు. కర్నూలులో గురువారం జరిగిన ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి వర్చువల్ విధానంలో పాల్గొన్నట్లు తెలిపారు. అడవులు, గుహలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన కర్నూలు.. విమానయాన సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క తుంగభద్ర నది, మరోపక్క నల్లమల కొండలు సమాంతరంగా ఉండే ఇక్కడ నల్లమల అడవి, అహోబిలం, బెలూం గుహలు, మహానంది, మంత్రాలయం, ఓర్వకల్లు, సంగమేశ్వరం, కేతవరం, కాల్వబుగ్గ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఈ విమానాశ్రయం నుంచి ఉడాన్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద 80:20 నిష్పత్తిలో విశాఖ, బెంగళూరు, చెన్నై నగరాలకు విమాన సరీ్వసులను ఈ నెల 28 నుంచి నడపనున్నట్లు తెలిపారు. దేశంలో మొత్తం 325 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 56 చోట్ల కొత్తగా విమాన సర్వీసులను అందుబాటులోకి తెచి్చనట్లు ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబును అరెస్టు చేయాలి
తాడికొండ: అమరావతి రాజధాని పేరిట యథేచ్ఛగా దోచుకునేందుకే చంద్రబాబు సీఆర్డీఏను ఏర్పాటు చేసి, అనుకూలమైన ఉద్యోగులను నియమించుకుని కొత్త జీవోలు, చట్టాలతో భారీ మోసానికి పాల్పడ్డారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా ఆ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారం 173వ రోజు కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో ఆదివారం పలువురు నాయకులు మాట్లాడుతూ 480 ఎకరాల అసైన్డ్ భూములను బెదిరించి కొనుగోలు చేసిన వ్యవహారం అందిరికీ తెలిసిందేనని, దళితుల భూములు వారికి ఇవ్వడంతో పాటు దానికి కారకులైన చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదితరులను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసిన చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నాలుగు వారాల గడువిస్తే వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయన్ని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు రాకుండా కోర్టుల్లో వేసిన తప్పుడు కేసుల్ని చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు బహుజనుల ఉసురు తగలడం ఖాయం
తాడికొండ: బహుజనులను మోసం చేసిన చంద్రబాబుకు వారి ఉసురు తగిలి జైలుకెళ్లడం ఖాయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 171వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. దళితులు తమ సమస్యలపై ఎమ్మెల్యే ఆర్కేకు విన్నవిస్తే..ఎంపీ రఘురామకృష్ణరాజు దళితుల సమస్యలు దళితులతోనే మాట్లాడుకోవాలంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కుల ముసుగులో నటుడు శివాజీ, లగడపాటి, రాధాకృష్ణ, రామోజీ, ప్యాకేజీ నాయకులు పవన్, రామకృష్ణ చెప్పే మాటలు విని రైతులు ఇప్పటికే మోసపోయారని ధ్వజమెత్తారు. ఇంకా అదే పంథాలో వెళితే 29 గ్రామాల్లో ఉన్న రైతులు వారిని తరిమికొట్టడం ఖాయమన్నారు. కాగా, తమిళనాడుకు చెందిన పలు దళిత సంఘాల నాయకులు ఈ దీక్షల్లో పాల్గొని నిరసన తెలియజేశారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పెరికే వరప్రసాద్, మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, తమిళనాడు రాష్ట్ర దళిత నాయకులు రంభ వనకం మురుగన్, గంజడా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
బాబు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి
తాడికొండ: రాజధాని పేరిట రూ.3.50 లక్షల కోట్లు లూటీ చేసిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ వేసి రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 169వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే సీఆర్డీఏ చైర్మన్గా ఉండి దళితుల్ని మోసగించి రూ.2 వేల కోట్లను దోపిడీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు బయట తిరిగితే వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపుల ద్వారా కేసును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆయనను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దోచుకొని తండ్రీకొడుకులు దాచిన అవినీతి హెరిటేజ్ సంస్థ నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, మల్లవరపు సుధారాణి, బూదాల సలోమీ, కొలకలూరి లోకేష్, పులిదాసు పాల్గొన్నారు. -
మూడు రాజధానులకు ప్రజల మద్దతు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలుపుతూ పురపోరులో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఆమోదించి మెజార్టీ స్థానాల్లో గెలిపించారన్నారు. ఆదివారం విశాఖపట్నం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లి మీకు రోషం.. పౌరుషం లేదా? అంటూ చంద్రబాబు రెచ్చగొట్టాడని.. అక్కడి ప్రజలు తమ రోషం, పౌరుషాన్ని చక్కగా ఆయనపైన చూపించారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల రోజు చంద్రబాబునాయుడు ఏపీలో లేకుండా ముఖం చాటేశాడంటే.. ఆయన పరిస్థితేంటో అర్థం చేసుకోవాలన్నారు. ‘‘ఏపీ ప్రజలు పాచి పనులకోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారని బాబు అన్నారు. మరి ఆయన కొడుకు, ఆయన హైదరాబాద్లోని పాచి పనులకోసం వెళ్లారా? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే మాట కాదా?’’ అని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఏపీకి రావడానికి ముఖం కూడా చెల్లని చంద్రబాబు, ఆయన తనయుడు భవిష్యత్తులో రాష్ట్రానికి వచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. మరో 25 ఏళ్లపాటు సీఎంగా వైఎస్ జగన్... మరో 25 ఏళ్లు సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటారని, ప్రజల ఆకాంక్ష కూడా అదేనని విజయసాయిరెడ్డి చెప్పారు. 13 జిల్లాల్లోని ఐదుకోట్ల మంది ప్రజల మనసుల్లో జగన్ గూడు కట్టుకున్నారన్నారు. జగన్ చేసిన అభివృద్ధే స్థానిక ఎన్నికల్లో, పురపాలక ఎన్నికల్లో పార్టీని గెలిపించిందన్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను మించి పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధికంగా గెలుపొందిందన్నారు. విశాఖ ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడు ఏమీ చేయలేకపోయారని, ఆ పార్టీ జెండాను ప్రజలే పీకేశారని విమర్శించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎంపీ భీశెట్టి సత్యవతి, ప్రభుత్వ సలహాదారు సాగి దుర్గాప్రసాద్రాజు, ఎమ్మెల్యే అమర్నాథ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
3 రాజధానులకు మద్దతిస్తూ ఆంధ్రావని స్పష్టమైన తీర్పు
సాక్షి, అమరావతి: ముగ్గురిదీ ఒకే మాట...! ఒకే తీర్పు..! ప్రాంతాలు వేరైనా ఫలితాలు, అందరి అభిమతం ఒక్కటే. ప్రాంతీయ విభేదాలు రగిల్చి వైషమ్యాలను రెచ్చగొట్టే కుట్రలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కిన అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనం. రాష్ట్రమంతా మాదిరిగానే రాజధాని ప్రాంతాలు మూడింటా ఘన విజయాన్ని అందించి ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను, అభివృద్ధి నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. గుంటూరు – విజయవాడ కావచ్చు. విశాఖ కావచ్చు.. కర్నూలు కావచ్చు... మూడు రాజధానులుగా ప్రకటించిన పెద్ద కార్పొరేషన్లలో భారీ విజయాన్ని చేకూర్చారు. చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రెచ్చగొట్టేలా ప్రచారం నిర్వహించినా ఆయన మాటలను ప్రజలు నమ్మలేదు. పాలన వికేంద్రీకరణకు జై కొట్టారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఓటు.. పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని సమానంగా విస్తరించాలనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన విస్పష్టమైన తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ సాధించిన అద్భుత విజయం వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న స్వార్థ రాజకీయ పక్షాలకు చెంపపెట్టని రుజువైంది. పట్టణ ప్రాంత ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకమనే వాదన తప్పని ఈ ఫలితాలు తేల్చేశాయి. విద్యావంతులు అధికంగా ఉండే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు రాజధానుల నిర్ణయాన్ని అంగీకరించడం లేదనే ప్రచారం అంతా భ్రమేనని స్పష్టమైంది. విజయనగరం మొదలు శ్రీకాకుళం, విశాఖ.. అమరావతి, కర్నూలు, తిరుపతి.. ప్రతి చోటా వైఎస్సార్సీపీకి పట్టం కట్టిన ప్రజలు వికేంద్రీకరణకే తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి వికేంద్రీకరణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. రాజధాని నిర్మాణం ముసుగులో చేసిన అరాచకాలను కప్పిపుచ్చుతూ కొందరు స్వార్థపరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఉసిగొల్పి ప్రభుత్వంపై దు్రష్పచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 29 గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు, బయట ప్రాంతాల నుంచి తరలించిన వారితో దీక్షలు, ఉద్యమాలు చేయించి హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా దీన్ని భూతద్దంలో చూపించి కొందరి అభిప్రాయాన్నే రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. నాలుగు గ్రామాల్లో జరిగే కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా ప్రచారం చేస్తూ మూడు రాజధానులను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నమ్మించేందుకు సకల ప్రయత్నాలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించి రిఫరెండం కోరాలని చంద్రబాబు, ఆయన్ను వెన్నంటి ఉండే జనసేన, సీపీఐ పార్టీలు అధికార పక్షాన్ని సవాల్ చేయని రోజే లేదు. బాబు రెచ్చగొట్టినా విజ్ఞతతో ప్రజా తీర్పు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తన స్థాయిని మరచిపోయి అమరావతి పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. గుంటూరు వాసులకు రోషం లేదని, సిగ్గుంటే వైఎస్సార్సీపీకి ఓటేయరని తిట్టిపోశారు. గుంటూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గెలిస్తే అక్కడి ప్రజలు అమరావతి వద్దని చెప్పినట్లేనని వ్యాఖ్యలు చేశారు. పోలింగ్కు ముందురోజు అమరావతి ఉద్యమం పేరుతో కొందరు మహిళలను విజయవాడకు పంపి అలజడి సృష్టించాలని చూశారు. వారిని పోలీసులు అడ్డుకునేలా చేసి సానుభూతి పొందాలని ప్రయత్నించారు. ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల్లో వికటించాయి. ఎక్కడైతే చంద్రబాబు తిట్టారో అక్కడ ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ రెండు కార్పొరేషన్లలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలిపోతుందని టీడీపీ నాయకులు రెచ్చగొట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్సీపీకి పట్టంగట్టారు. కృష్ణా, గుంటూరులో మట్టికరిచిన టీడీపీ అమరావతి ప్రభావం ఉంటుందని టీడీపీ చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ మట్టికరిచింది. రెండు జిల్లాల్లో ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కడా ఆ పార్టీ గెలవకపోగా అవమానకరమైన రీతిలో సింగిల్ డిజిట్ వార్డులు, డివిజన్లకే పరిమితమైంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రజలు టీడీపీని తిరస్కరించారు. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ప్రాంతాలకు అతీతంగా అన్ని చోట్లా వైఎస్సార్సీపీని గెలిపించడం ద్వారా అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది ఫేక్ ప్రచారమని తేల్చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండ సహా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీని ఆదరించడం ద్వారా వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు పలికారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ వికేంద్రీకరణకు ప్రజలు జై కొట్టినట్లు స్పష్టమైంది. -
చంద్రబాబు జాతి నాయకుడే
తాడికొండ: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు జాతీయస్థాయి నేతనుంచి జాతి నాయకుడిగా దిగజారిపోయారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 162వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు ప్రసంగించారు. 14 సంవత్సరాల సీఎం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కుల నాయకుడిగా తయారై.. చరమాంకంలో అట్టర్ ఫ్లాప్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాజధాని పేరిట దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు ఎన్ఆర్ఐల చందాలతో ఉద్యమం పెట్టించి డ్రామా కంపెనీ మేనేజర్లాగా తయారయ్యాడని మండిపడ్డారు. రాజధాని రైతులకు ఒక ఎజెండా లేకుండా దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటే పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో సమాధానం చెప్పి..అమరావతి ఉద్యమం కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల రెఫరెండంగానే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారనే నిజం తెలుసుకుని చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఎల్లో మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు నానా తంటాలు పడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బహుజనుల రాజ్యాంగబద్ధ హక్కుల కోసం.. పోరాటంలో విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.