Aryan Khan
-
హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం
హాలీవుడ్లో అప్పుడప్పుడు కార్టూన్ సినిమాలు వస్తుంటాయి. ఇందులో పాత్రలకు ఏ భాషకు ఆ భాషలో ఫేమస్ నటీనటులు డబ్బింగ్ చెబుతుంటారు. గతంలో రానా, మహేశ్ కూతురు సితార.. ఇలా తమ గాత్రాన్ని అందించారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన కొడుకులతో కలిసి మాట సాయం చేశాడు.(ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!)అడవి బ్యాక్ డ్రాప్ కథతో తీసిన 'ద లయన్ కింగ్' సినిమా చాన్నాళ్ల క్రితమే వచ్చింది. ఇందులోనే ముఫాసా అనే పాత్ర కాస్త ఫేమస్. ఇప్పుడు దీన్ని మెయిన్ లీడ్గా తీసుకుని ముఫాసా చిన్నప్పుడు ఏం జరిగింది? ఎలా రాజుగా ఎదిగింది అనే స్టోరీతో ఓ మూవీ తీశారు. ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.రీసెంట్గా 'ముఫాసా' ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాగానే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో పెద్ద ముఫాసా పాత్రకు షారూఖ్, చిన్నప్పటి ముఫాసా పాత్రకు షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్, సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీని వల్ల హిందీ మార్కెట్లో వసూళ్లు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?) -
స్టార్ హీరో కుమారుడి సెంటిమెంట్.. పాత భవనానికి రూ. 37 కోట్లు!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ కిడ్గా గుర్తింపు ఉంది. తాజాగా ఢిల్లీలో భారీ మొత్తంలో ఆస్తులను ఆర్యన్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం సొంతంగా దుస్తుల బిజినెస్ ప్రారంభించిన ఆర్యన్ త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇలా సంపాదన వేటను ఆయన ఎప్పుడో ప్రారంభించాడు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో రెండు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది.బాలీవుడ్లో వస్తున్న వార్తల ప్రకారం దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్లో రెండు అంతస్తుల భవనాన్ని రూ. 37 కోట్లు చెల్లించి ఆర్యన్ కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన లావాదేవీలు మే 2024లో జరిగాయి. ఆ బంగ్లా ఆయన పేరుతో రిజిస్టర్ కూడా అయినట్లు నివేదించబడింది.ముంబైలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఢిల్లీలోని ఫ్లాట్ను ఎందుకు కొనుగోలు చేశాడో కూడా తెలిపారు. ఆయన అమ్మ గౌరీఖాన్ చిన్నతనంలో ఇక్కడే ఉండేవారని తెలుస్తోంది. షారుక్, గౌరీఖాన్ ముంబైకి షిఫ్ట్ కాక ముందు ఆ ఫ్లాట్లోనే జీవనం సాగించారని, అందుకే ఆ సెంటిమెంట్తో ఇప్పుడు ఆర్యన్ దానిని కొనుగోలు చేశాడు. అయితే, ఇప్పటికే ఈ బిల్డింగ్లో వారి కుటుంబానికి చెందిన ఆస్తులున్నాయి. చాలా ఏళ్ల క్రితమే ఆ భవనంలో బేస్మెంట్, మొదటి ఫ్లోర్ను ఆ కుటుంబం కొనుగోలు చేసింది. ఆ బిల్డింగ్ నుంచే తన తండ్రి జీవితం ప్రారంభం కావడంతో తాజాగా అక్కడ రెండు ఫ్లోర్లను ఆర్యన్ కొనుగోలు చేశాడు. అందుకోసం రూ. 37 కోట్లు ఆయన చెల్లించాడు. -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్లో నేను రిలాక్స్గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్తో పాటు ఆర్యన్ కూడా సోషల్మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్కు క్లీన్ చిట్ దక్కింది. -
ఆర్యన్ ఖాన్ కొత్త బ్రాండ్ జాకెట్ ధర వింటే షాకవ్వుతారు!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడి కొత్త బ్రాండ్ డ్యావోల్ఎక్స్(DyavolX) ప్రమోషన్లలో షారుక్, అతని కూతురు సుహానా ఖాన్ బిజీగా ఉన్నారు. ఆదివారం (మార్చి 17) ఈ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి రాగా..వీటి ధరలు చూసి కంగుతింటున్నారు అభిమానులు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్యావోల్ఎక్స్ (DyavolX) పేరుతో కొత్త బట్టల బ్రాండ్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను షారుక్ తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇందులో ఆర్యన్ ఖాన్ తోపాటు షారుక్, సుహానా ఈ కొత్త బ్రాండ్ డ్రెస్సుల్లో సందడి చేశారు. వీటిలో ట్రిపుల్ థ్రెట్ ఎక్స్ 2 పేరుతో హుడీస్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్, డెనిమ్ జాకెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు వచ్చేసి ఏకంగా రూ.16 వేల నుంచి రూ.99 వేల వరకూ ఉన్నాయి. ఈ బ్రాండ్ ఎక్స్ 2 అందుబాటులోకి వచ్చిందంటూ వెబ్సైట్ http://dyavolx.comలో బుక్ చేసుకోండి. ఇవి పరిమిత స్థాయిలోనే ఉంటాయి, గ్లోబల్ షిప్పింగ్ కూడా ఉంది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ పోస్ట్ చేశాడు. అయితే వీటి ధరలు చూసి సగటు అభిమానులు షాక్ తింటున్నారు. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్లో ఓ డెనిమ్ జాకెట్ ధర రూ.99 వేలు కావడం విశేషం. ఇక ఇందులోని హుడీస్ రూ.41 వేలు, రూ.40 వేలుగా ఉన్నాయి. గాళ్స్ కోసం క్రాప్ టాప్స్ రూ.16 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టర్ లో షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ వేసుకున్న టీషర్ట్స్ ధర రూ.21,500 కావడం విశేషం. ఇక కార్గో ప్యాంట్ల ధర రూ.35 వేలుగా ఉంది. ఇవన్నీ ఎక్కువ ధరలే అయినా.. గతంలో 2023లో ఆర్యన్ ఖాన్ తీసుకొచ్చిన కలెక్షన్ల ధరలైతే ఏకంగా రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. వాటితో పోలిస్తే ఇవి కాస్త బెటర్ అని చెప్పొచ్చు. అప్పట్లో షారుక్ సంతకంతో ఉన్న హుడీస్ ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించగా.. కొన్ని గంటల్లోనే అన్నీ అమ్ముడైపోయాయి. ఇక తన కొడుకు బ్రాండ్కు షారుక్ ఇస్తున్న ప్రమోషన్ కూడా బాగా కలిసి వస్తోంది. అందులో షారుక్ బాలీవుడ్లోకి అడుగుపెట్టి దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ అతని క్రేజ్ తగ్గలేదు. గతేడాది అతడు పఠాన్, జవాన్ లతో ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్లు సినిమాలు అందించాడంటే అతనికి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) (చదవండి: రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...) -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
ఆర్యన్ని జైల్లో పెట్టొద్దు! సమీర్ వాంఖడేని వేడుకున్నట్లు స్క్రీన్ షాట్లు
బాలీవుడ్ దిగ్గజ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టులో సీనియర్ ఆఫీసర్గా పేరొందిన నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే అక్రమంగా వ్యవహరించారంటూ సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సీబీఐ ఆయన తోపాటు మరికొందరూ షారూఖ్ ఖాన్ కుటుంబాన్ని డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తోంది. సీబీఐ పెట్టిన కేసుల విషయమై ముంబై హైకోర్టు ఆశ్రయించిన సమీర్ వాంఖడే శుక్రవారం తనకు షారుక్ ఖాన్కి మధ్య జరిగిన చాట్ల సంభాషణను కోర్టుకి సమర్పించారు. అంతేగాదు షారూఖ్ తన కొడుకుని విడిపించమని వేడుకుంటూ జరిగిన సుదీర్ఘ చాట్ సంభాషణ గురించి పిటిషన్లో పేర్కొన్నాడు వాంఖడే. ఆ స్క్రీన్ షాట్లో దయ చేసి అతన్ని జైల్లో పెట్టోద్దు. మిమ్మల్ని వేడుకుంటున్నా. మీరు నా కుటుంబంపై దయచూపాలి. నా కొడుకుని కరుడుగట్టిన నేరస్తుడిలా జైల్లో ఉండటానికి అర్హుడు కాదు. అది అతడి ఆత్మవిస్వాశాన్ని దెబ్బతీస్తుంది. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ కేసు ఉపసంహరించుకునేలా నా శక్తిమేర చేయల్సిదంతా చేస్తానని మీకు హామి ఇస్తున్నా. దయచేసి నా కొడుకుని ఇంటికి పంపించండి. అని షారూక్ తనకు వాట్సాప్ మెసేజ్లు చేశారని సమీర్ వాంఖడే ఆరోపించారు. అందుకు సమీర్ సమాధానంగా షారూక్ నువ్వొక మంచి మనిషిగా నాకు నీ గురించి తెలుసు. నేను జోనల్ డైరెక్టర్. సమాజాన్ని, పిల్లల జీవితాలన్ని కలుషితం చేస్తున్న వాటిని ప్రక్షాళ చేసే సర్వీస్ చేస్తున్నాను. కానీ కొందరూ నా ప్రయత్నాన్ని దుర్మార్గంగానూ, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నట్లుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాంఖడే స్రీన్షాట్ మెసేజ్లో పేర్కొన్నట్లు ఉంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో సమీర్ వాంఖడేకు ఊరట లభించింది. మే 22 దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం హైకోర్టు ఆదోశిచింది. కాగా, వాంఖడే తన కుటుంబంతో కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లాడని, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఎన్సీబీ నివేదిక పేర్కొనడం గమనార్హం. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 (చదవండి: సిన్సియర్ సమీర్ వాంఖడే.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, కోట్లు విలువ చేసే ప్లాట్లు?!) -
సిన్సియర్ సమీర్.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, ప్లాట్లు?!
సిన్సియర్ ఆఫీసర్గా పేరొందిన సమీర్ వాంఖడే సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంలో ఈ నార్కోటిక్స్ మాజీ అధికారి అక్రమంగా వ్యవహరించాడంటూ సీబీఐ చెబుతోంది. ఆర్యన్ను ఈ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఆయన, మరికొందరు కలిసి పాతిక కోట్ల రూపాయల లంచం షారూఖ్ ఖాన్ కుటుంబం నుంచి డిమాండ్ చేశారనే అభియోగాలతో ముందుకు వెళ్తోంది సీబీఐ. అయితే.. ఆదాయంతో సంబంధం లేకుండా అడ్డగొలుగా ఆయన ఆస్తుల్ని వెనకేసుకున్నారని, అలాగే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్పులకూ వెళ్లారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ.. తన దర్యాప్తు కొనసాగించడం గమనార్హం. సిబిఐ పెట్టిన కేసుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖడేకు సోమవారం వరకు ఊరట దక్కింది. Order Prima facie there is a legal bar under 17A of the PC Act and since a 41A notice is issued in the case..no coercive action against the petitioner till the next date Monday. #SameerWankhede#BombayHighCourt#CBI #AryanKhan — Live Law (@LiveLawIndia) May 19, 2023 2017 నుంచి 2021 మధ్య సమీర్ వాంఖడే ఆరుసార్లు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఆ జాబితాలో యూకే, ఐర్లాండ్, పోర్చ్గల్, సౌతాఫ్రికా, మాల్దీవ్స్ ఉన్నాయి. దాదాపు 55 రోజులు ఆ ట్రిపుల్లో గడిపాడు. ఆ పర్యటనల కోసం కేవలం రూ.8 లక్షల 75 వేలు మాత్రమే ఖర్చు చేశానని నివేదించాడాయన. కానీ, ఆ ఖర్చు విమాన ప్రయాణాలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు. ఇక సమీర్ వాంఖడే ఆస్తులకు సంబంధించి కూడా విస్తూపోయే విషయాల్ని వెల్లడించింది ఎన్సీబీ రిపోర్ట్. సమీర్, ఆయన భార్య ఇద్దరి ఆదాయం కలిపి ఏడాదికి 45 లక్షల రూపాయలుగా ఐటీ రిటర్న్స్లో చూపించారు. కానీ, చేతికి 17 లక్షల రూపాయలకు తక్కువకాని ఓ రోలెక్స్ వాచీతో పాటు ముంబైలో కోట్లు ఖరీదు చేసే నాలుగు ప్లాట్లు, అలాగే.. వాసిం ఏరియాలో 41 వేల ఎకరాల జాగా ఆయన పేరు మీద ఉన్నట్లు తెలిపింది. ఇక కొత్తగా 82 లక్షల రూపాయలకు మరో ప్లాట్ను కొన్నారాయన. అయితే.. గోరేగావ్లో ఉన్న ఆ ప్లాట్ విలువ రూ.2.45 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇవేకాదు.. పెళ్లికి ముందు కోటికి పైగా విలువ చేసే ఓ ప్లాట్ను సమీర్ ఖరీదు చేశాడు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సమీర్ లెక్కలు చూపించలేదని సీబీఐ అంటోంది. Acceptance, tolerance, bravery, compassion. These are the things my mom taught me. The words of my mother echo constantly that my son is equal to thousands. Such inspiration lifts my spirit to epitome for each end every challenge and struggle…#MothersDay #SameerWankhede pic.twitter.com/pteBReu5bf — Sameer Wankhede (@swankhede_IRS) May 14, 2023 సెలబ్రిటీ పేరు వింటే.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ముంబై విభాగం) మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై స్థానిక మోడల్ మున్మున్ దామెచా సంచలన ఆరోపణలు చేశారు. కార్డిలియా డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి.. బెయిల్ మీద బయట ఉన్నారామె. ‘‘సమీర్కు పబ్లిసిటీ పిచ్చి. సెలబ్రిటీ అని తెలిస్తే చాలూ.. వాళ్లను ఏదో ఒకరకంగా జైలుకు పంపించేవాళ్లు. అలా మీడియాలో నానడం ఆయనకు ఇష్టం. అందుకే మోడల్స్ను, సెలబ్రిటీలను ఆయన టార్గెట్గా చేసుకునేవాళ్లు. ఈ కేసులో అన్యాయంగా నన్ను ఇరికించారాయన. తొలుత నాకేం కాదని ధైర్యం చెప్పే యత్నం చేశారు. ఆపై తాను ఒక మోడల్ అని తెలియగానే.. అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కస్టడీలో ఉన్నప్పుడు కూడా తనను మానసికంగా వేధించారని తెలిపారామె. ఎన్సీబీ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలో కార్డిలియా క్రూయిజ్ మీద దాడి జరిగాక.. ఆర్యన్ ఖాన్తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి నిమిషంలో సమీర్ టీం యాడ్ చేసింది. 2021, అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసింది. అలాగే.. రోలింగ్ పేపర్తో పట్టుబడ్డ ఓ యువతిని మాత్రం వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ కస్టడీ విషయంలో సమీర్ వాంఖడే వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది.అలాగే.. ఆర్యన్ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన వ్యవహారానికి సంబంధించి తేడాలు కనిపిస్తున్నాయి అని ఎన్సీబీ విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 సమీర్కు ఊరట ఇదిలా ఉంటే సీబీఐ తనపై అరెస్ట్ సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసు తనపై ప్రతీకార చర్యగానే ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ క్రమంలో.. ఆయనకు ఊరట లభించింది. సోమవారం(22, మే) దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం ఆదేశించింది బాంబే హైకోర్టు. గురువారం ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మాత్రం గైర్హాజరు అయ్యారు. మరోవైపు.. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ సింగ్ తనను కులం పేరుతో దూషించారని, వేధింపులకు గురి చేశారని సమీర్ వాంఖడే ఆరోపిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ను డ్రగ్స్ కేసు నుంచి బయటపడేసేందుకే జ్ఞానేశ్వర్ తనపై సీబీఐను ప్రయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కూడా. -
సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్.. రూ.25 కోట్ల అవినీతి ఆరోపణలు
న్యూఢిల్లీ: మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్పై డ్రగ్స్న్కేసులో రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించింది. సమీర్ వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై కేసు కూడా నమోదు చేసింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్గా సమీర్ వాంఖేడే ఉన్నారు. షారూక్ తనయుడు ఆర్యన్పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై ఈయనే తొలుత దర్యాప్తు చేశారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్మేనేజ్మెంట్కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడికి .. సరైన ఆధారాలు లేకపోవడంతో 2022 మేలో క్లీన్చిట్ లభించింది. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
ఆర్యన్ఖాన్ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్ఖాన్ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు
ముంబై: సమీర్ వాంఖడే గుర్తున్నాడా?.. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్పై డ్రగ్స్ ఆరోపణలను దర్యాప్తు చేసిన ఉన్నతాధికారి. అదిగో ఆ ఆఫీసర్పై శుక్రవారం సీబీఐ అవినీతి కేసు ఫైల్ చేసింది. అదీ ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో ముడిపడిన ఆరోపణలపైనే కావడం గమనార్హం. సమీర్తో పాటు ఇతర అధికారులు.. ఆర్యన్ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు పాతిక కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్గా సమీర్ వాంఖేడే ఉన్నాడు. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసింది కూడా తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సమయంలో ఆయన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్మేనేజ్మెంట్కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేయించింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది కూడా. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడు .. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 2022లో క్లీన్ చిట్ దక్కించుకున్నాడు. సంబంధిత వార్త: సమీర్ అంటే ఒకప్పుడు వాళ్లకు ‘సింహస్వప్నం’ -
బ్రో నా కిడ్నీ తీసుకుంటావా?.. షారుక్ తనయుడిపై ట్రోలింగ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సొంతంగా దుస్తుల బిజినెస్ ప్రారంభించాడు. డి యావోల్ ఎక్స్ పేరిట బ్రాండెడ్ బట్టలను విక్రయిస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అయితే ఆ దుస్తుల రేట్లు చూసి గుడ్లు తేలేస్తున్నారు నెటిజన్లు. ఒక్కో టీ షర్ట్ ధర రూ.22,000-24,000 మధ్య ఉంది. లెదర్ జాకెట్ ధర ఏకంగా రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇతరత్రా హుడీలైతే రూ.45,000 పైనే ఉన్నాయి. అయినప్పటికీ అలా తను సేల్స్ ప్రారంభించాడో లేదో ఒక్క రోజులోనే అన్నీ అమ్ముడు పోవడం విశేషం. ఈ విషయాన్ని ఆర్యన్ ఇన్స్టాగ్రామ్లో తెలియజేశాడు. నెక్స్ట్ సేల్ కోసం రెడీగా ఉండండని పోస్ట్ చేశాడు. అయితే ఆ రేట్లు చూసి షాకైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాడు. 'దయచేసి నా కిడ్నీ తీసుకుంటారా?', 'ఓరి భగవంతుడా, నన్ను ఎందుకు ఇంత పేదవాడిగా పుట్టించావు. రూ.2 లక్షల జాకెట్ నాక్కూడా కావాలి', 'అయ్యో, రెండు ఎకరాలు అమ్మేసి డబ్బులు రెడీ చేసుకుంటే తీరా అన్నీ అమ్ముడుపోయాయని అంటున్నారే' అంటూ ట్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @dyavol.x View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) చదవండి: బాక్సాఫీస్ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలివే -
ఆర్యన్ ఖాన్.. బన్గయా బిజినెస్మేన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన సొంత ప్రీమియం స్ట్రీట్వేర్ బ్రాండ్ డియావోల్ (D'Yavol)ను ప్రారంభించాడు. ఈ బ్రాండ్ టీజర్ను ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ టీజర్ నెట్టింట వైరల్గా మారింది. టీజర్లో షారుక్ ఎంట్రీ సూపర్! ఇందులో ఆర్యన్ ఖాన్తో పాటు షారుక్ ఖాన్ కూడా కనిపించారు. బ్రాండ్ లోగో, థీమ్ రూపొందించే విషయంలో ఆర్యన్ తికమకపడుతుంటాడు. ఏదీ ఓ పట్టాన కుదరక పెయింట్ బ్రష్ను నేలకేసి కొట్టి వెళ్లిపోతాడు. తర్వాత తన తండ్రి షారుక్ ఖాన్ ఎంటర్ అవుతాడు. అదే బ్రష్తో సింపుల్గా ఓ గీత గీస్తాడు. అంతే అద్భుతమైన బ్రాండ్ లోగో, థీమ్ ఆవిష్కృతమౌతాయి. వైవిధ్యంతో రూపొందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్లా? జుకర్బర్గ్ను నిలదీసిన ఉద్యోగులు ఆర్యన్ గత సంవత్సరం తన ప్రీమియం వోడ్కా బ్రాండ్ను ప్రారంభించిన అదే భాగస్వాములైన లెటీ బ్లాగోవా, బంటీ సింగ్ల భాగస్వామ్యంతో డియావోల్ పేరుతో ఈ దుస్తుల కంపెనీని ప్రారంభించాడు. వ్యాపార రంగంలోకి ప్రవేశించినప్పటికీ, ఆర్యన్ సినిమా పరిశ్రమతో సంబంధాలు వదులుకోలేదు. తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్పై నిర్మించనున్న చిత్రం ద్వారా త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఐపీఎల్ వేలం, దానికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్ల పనుల్లో సోదరి సుహానా ఖాన్తో కలిసి ఆర్యన్ పాల్గొంటున్నాడు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. షారుఖ్ ఖాన్ రూ. 6,289 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ యజమాని. వీరికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలాగే VFX స్టూడియోను నడుపుతున్నాడు. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తోంది. ఆర్యన్ ఖాన్ వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించి ఖాన్ కుటుంబానికి ఇప్పటికే ఉన్న వ్యాపార పోర్ట్ఫోలియోను మరింత విస్తృతం చేశాడు. అయితే అత్యంత పోటీ ఉన్న ఫ్యాషన్ పరిశ్రమలో ఆర్యన్ కొత్త వెంచర్, డియావోల్ ఎలా ఉంటుందో.. ఏ మాత్రం విజయవంతం అవుతుందో చూడాలి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) -
ఆర్యన్ ఖాన్తో డేటింగ్! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్ నటి
గతంలో డ్రగ్ కేసుతో సంచలనమైన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మోడల్, నటి సాదియా ఖాన్తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు హాల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు కాస్తా క్లోజ్గా దిగిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్తలపై క్లారిటీ రాకముందే బాలీవుడ్ నటి, డాన్సర్ నోరా ఫతేహితో ఆర్యన్ ఖాన్ ప్రేమాయణం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఆర్యన్తో డేటింగ్ రూమర్స్పై పాకిస్తాన్ నటి సాదియా ఖాన్ స్పందించింది. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె ఆర్యన్తో డేటింగ్పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసలేం తెలియకుండానే ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. కలిసి ఫొటో దిగితే వారు రిలేషన్లో ఉన్నట్లేనా? అసలు ఏంటీ? ఏం జరిగిందో తెలియాకుండానే అలా ఎలా రాసేస్తారు. ఒక్క ఫొటో చూసి డేటింట్లో ఉన్నాని ఎలా అభిప్రాయపడతారు. ఇదంత వింతగా.. విచిత్రంగా అనిపిస్తోంది’ అని పేర్కొంది. అనంతరం ‘ఆర్యన్ను న్యూ ఇయర్ ఈవెంట్లో కలిశాను. అప్పుడు మేం మాట్లాడుకున్నాం, ఫొటో దిగాం. ఫొటో దిగినంత మాత్రాన మేమిద్దరం డేటింగ్లో ఉన్నట్లు కాదు. ఆ రోజు న్యూ ఇయర్ పార్టీ నేను మాత్రమే లేను. చాలా మంది ఉన్నారు. వారంత కూడా ఆర్యన్తో ఫొటో దిగారు. వారందరు కూడా సోషల్ మీడియాలో ఫొటోలు కూడా షేర్ చేశారు. కానీ ఈ రూమర్స్పై నాపైనే ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు’ అంటూ సాధియా మండిపడింది. కాగా దుబాయ్లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్లో సాధియా ఖాన్, ఆర్యన్ ఖాన్లు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత వెంటనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే సాధియా పాకిస్తాన్లో పలు టీవీ సీరియల్స్తో గుర్తింపు పొందింది. -
హీరోయిన్తో షారుక్ ఖాన్ కొడుకు డేటింగ్? ఫోటోలు లీక్
బాలీవుడ్లో సెలబ్రిటీల మధ్య లవ్ ఎఫైర్లు, రిలేషన్స్షిప్స్కు కొదువ లేదు, ఇప్పటికే చాలామంది స్టార్స్ డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. తాజాగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ బీటౌన్ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహితో ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా వీరిద్దరూ దుబాయ్కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో ఈ రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్ వయసు 25ఏళ్లు కాగా, నోరాకి 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఐదేళ్లు గ్యాప్ ఉంది. ఇక రీసెంట్గా నోరా ఆర్యన్ సోదరి సుహానా ఖాన్తో కూడా డిన్నర్ పార్టీలో కనిపించింది. దీంతో నోరా-ఆర్యన్ల రిలేషన్ నిజమేనన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై నోరా లేదా ఆర్యన్లు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
దీపావళి దగదగలు.. బాలీవుడ్ భామల మెరుపులు
దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్కుమార్రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్ ఖాన్ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు. అలాగే నిర్మాత ఏక్తా కపూర్ దీపావళిని సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై పాపులర్ సాంగ్స్కు డ్యాన్స్లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. -
ఆర్యన్ ఖాన్ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
లైగర్ బ్యూటీకి అవమానం, కనీసం పట్టించుకోని ఆర్యన్
సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. లైగర్ హీరోయిన్ అనన్య పాండేకు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అంటే క్రష్ అని ఇటీవలే ఓ షోలో తన మనసులోని మాట బయటపెట్టింది. ఇటీవలే అనన్య.. 'మజా మా' సినిమా స్క్రీనింగ్కు వెళ్లగా అక్కడ ఆర్యన్ తారసపడ్డాడు. కానీ అతడు ఈ బ్యూటీని అని అసలు లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'ఆర్యన్ కాదు కదా, అతడి డ్రైవర్ కూడా పట్టించుకోలేదు', 'చూశారా... ఆర్యన్ ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడో', 'పాపం, అనన్యను చూస్తే జాలేస్తోంది. ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైతే మాత్రం అంతలా యాటిట్యూడ్ చూపించాలా?', 'షారుక్ ఖాన్ దగ్గర నుంచి కొంచెమైనా నేర్చుకో' అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'బహుశా ఆర్యన్ ఏదో బాధలో ఉన్నాడేమోలే' అని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఓటీటీని షేక్ చేస్తున్న కార్తికేయ 2 ఆ హీరోతో కలిసి పని చేస్తే అంతే సంగతులు -
అంతకుమించిన నరకం ఉండదు.. ఆర్యన్ అరెస్ట్పై స్పందించిన గౌరీఖాన్
గతేడాది క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంపై గౌరీఖాన్ తొలిసారి స్పందించింది. ప్రముఖ పాపులర్ టీవీ షో కాఫీ విత్ కరణ్ షోకి మహిప్ కపూర్, భావనా పాండేతో కలిసి హాజరైన ఆమె తొలిసారి కొడుకు అరెస్ట్పై మాట్లాడింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు మీ కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డార. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డారు. ఆ కష్టసమయం గురించి ఏమని చెబుతారు అని కరణ్ ప్రశ్నించాడు. దీనికి గౌరీఖాన్ బదులిస్తూ.. అవును. 'మా కుటుంబం మొత్తం ఎంతో బాధపడ్డాం. తల్లిగా అంతకంటే భయంకరమైన అనుభవం ఇంకోటి ఉండదు. కానీ ఆ సమయంలో అందరూ మాకు కుటుంబంలా నిలబడ్డారు. ఏమాత్రం పరిచయం లేని వాళ్లు కూడా మెసేజ్లు, కాల్స్ ద్వారా నన్ను ఓదార్చారు. ఆ సమయంలో మాకు ఎంతో ప్రేమ లభించింది. మాకు అండగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని చెబుతూ గౌరీఖాన్ ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు
సాధారణంగా స్టార్ హీరోల వారసుడు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారు ఆర్యన్ ఖాన్ మాత్రం రచయితగా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్సిరీస్ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ కథ ఉంటుందట. కాగా గతంలో డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్సిరీస్లో ఆమె నటిస్తుంది. -
వ్యవస్థ తప్పులకు క్షమాపణలుండవా?
మాదక ద్రవ్యాల కేసులో హిందీ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు విముక్తి లభించింది. అంతవరకూ మంచిదే. కానీ ఆర్యన్ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వ్యవహరించిన తీరు ఆమోదనీయమైనదేనా? కేసులో సత్తా లేదని అర్థమైన తర్వాత, విచారణ జరిగితే డొల్లతనమంతా బయటపడుతుందని అనుకున్నారో ఏమో... ఆ యువకుడి పేరు ప్రఖ్యాతులకు మచ్చ తేవడానికి ఎన్సీబీ ప్రయత్నించింది. ప్రతి వ్యవస్థలోనూ పొరబాట్లు జరుగుతూంటాయి. అయితే మన వ్యవస్థల్లో మాత్రం ఘోరమైన తప్పిదాలు జరగడం సాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాల్లో నిందితులకు వాటిల్లిన నష్టం గురించి వాటికి ఏ బాధ్యతా ఉండదా? అలాంటప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆర్యన్కు జరిగిన నష్టాన్ని ఏదోలా భర్తీ చేయకపోవడం, క్షమాపణ కోరకపోవడం ఎంత వరకూ సబబు? చేసిన తప్పులకు కనీసం క్షమాపణ అడిగేంత ధైర్యం కూడా మన వ్యవస్థలకు లేకపోవడం తీవ్ర నిస్పృహకు గురి చేసే అంశమే! బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు మాదక ద్రవ్యాల కేసు నుంచి విముక్తి లభించింది. బాగానే ఉంది. కానీ... ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆర్యన్ ఖాన్తో వ్యవహరించిన తీరుపై మాత్రం అనేకానేక విమర్శలు వెల్లు వెత్తాయి. నాకైతే వారి వ్యవహార శైలి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు కానీ... ఈ దేశంలోని ప్రభుత్వ సంస్థ చేతుల్లో ఇలాంటి వైఖరిని ఎదుర్కొన్నవారు కొన్ని లక్షల మంది ఉన్నారనడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు. కాకపోతే అప్పుడప్పుడూ మనలాంటి ‘సామా న్యుల’కు అలాంటి ట్రీట్మెంట్ ఎదురైనప్పుడు మాత్రం షాక్కు గురవుతూంటాం. ఇదో కపటపూరితమైన వ్యవహారమని తెలుసు కానీ... వాస్తవం కూడా ఇదే. ఇదొక క్రూరమైన మేల్కొలుపు. ఈ కథనం రాయడానికి అది కూడా ఒక కారణమని ఒప్పుకుంటాను. కట్టు కథలే! అయితే ఈ కథనంలో చెప్పదలుచుకున్న విషయం మాత్రం అది కాదు. ఉదారబుద్ధి అనే చాలాపెద్ద మాటను కూడా నేను వాడటం లేదుగానీ... కనీసం క్షమాపణ అడిగేంత ధైర్యం కూడా మన వ్యవస్థలకు లేకపోవడం మాత్రం నన్ను కదిలించడమే కాదు... తీవ్ర నిస్పృహకు గురి చేస్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆర్యన్ ఖాన్కు జరిగిన నష్టాన్ని ఏదోలా భర్తీ చేయడం, క్షమాపణ కోరకపోవడం ఎంత వరకూ సబబు? ప్రతి వ్యవస్థలోనూ పొరబాట్లు జరుగుతూంటాయి. అయితే మన వ్యవస్థల్లో మాత్రం ఘోరమైన తప్పిదాలు జరగడం సాధారణ మైపోయింది. అయితే, ఆర్యన్ఖాన్ విషయంలో జరిగింది చిన్న తప్పేమీ కాదు. అయినాసరే... క్షమాపణ కోరాలనే నైతికమైన ఇంగితం కూడా ఆ సంస్థకు లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇరవై నాలుగేళ్ల యువకుడు ఆర్యన్ ఖాన్ విషయంలో వాస్తవంగా జరిగిందేమిటి? ఒక్క క్షణం ఆలోచించండి. అన్యాయమైన, సత్య దూరమైన ఆరోపణల నెపంతో అతడిని అరెస్ట్ చేసి ఏకంగా నాలుగు వారాల పాటు జైల్లో పెట్టారు. పెట్టిన కేసులన్నీ కట్టుకథలే. అంతర్జాతీయ మాదక ద్రవ్య కార్టెల్లో ఆర్యన్ ఖాన్ ఒక భాగమని ఆరోపించారు. మాదక ద్రవ్యాల సరఫరాకు కూడా కుట్రపన్నాడని అస్పష్టమైన ఆరోపణలు మోపారు. పరిస్థితి మరింత దిగజారిం దెప్పుడంటే... కేసు వివరాలను రోజూ కొంచెం కొంచెంగా తప్పుడు ఉద్దేశాలతో, వివరాలతో మీడియాకు లీకులివ్వడంతో! నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటిది ఇలాంటి వ్యవహారానికి ఎందుకు పాల్ప డింది? ఒకే ఒక్క వివరణ మాత్రమే ఆ సంస్థ ఉద్దేశాలను స్పష్టం చేస్తుంది. అదేమిటంటే... ఒక యువకుడి పరువు మర్యాదలను మంటలో కలపడానికి ప్రయత్నం చేసిందన్నమాట. కేసులో సత్తా లేదని వారికీ అర్థమై ఉంటుంది. విచారణ జరిగితే డొల్లతనమంతా బయటపడుతుందని అనుకున్నారో ఏమో! ఆ యువకుడి పేరు ప్రఖ్యాతులపై బురద చల్లారు. ప్రజల దృష్టిలో అతడిని ఓ విలన్గా చిత్రీకరించారు. తద్వారా న్యాయస్థానాన్ని కూడా ప్రభావితం చేయ వచ్చునని అనుకున్నారేమో మరి! తాము చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేని నేపథ్యంలో ఈ దుశ్చర్యలన్నింటి ఫలితంగా ఆర్యన్ ఖాన్కు శిక్ష పడుతుందని ఊహించివుంటారు వారు. ఇంకా దుర దృష్టకరమైన విషయం ఏమిటంటే... మీడియా కూడా ఎన్సీబీ ఆడమన్నట్టు ఆడటం. రోజూ ఆర్యన్ఖాన్పై చర్చోపచర్చలు జరిపి అతడిని హింసించింది మీడియా. ఉదయాన్నే వార్తాపత్రికల పతాక శీర్షికల్లోనూ అవే వివరాలు! తాము రాస్తున్న కథనాలకూ, చేస్తున్న ఆరోపణలకూ ఆధారాలెక్కడ అని ఒక్క ఛానల్, వార్తా పత్రిక కూడా ఆలోచించలేదు. ఊరూ పేరూ లేని అధికారులు చెప్పారన్న సాకుతో బోలెడంత తప్పుడు సమాచారం తెచ్చి కాగితాల్లోకి ఎక్కించారు. వీరిలో ఏ ఒక్క అధికారికీ తాము ప్రచారం చేస్తున్న తప్పుడు ఆరోప ణలను బయటికి సమర్థించే ధైర్యం లేకపోయింది. క్షమార్హం కూడా కానీ అభూత కల్పనలను వండివార్చారన్నమాట. ఎన్సీబీ తానా అంటే... మీడియా కూడా తందానా అని పనిగట్టుకుని మరీ ఆర్యన్ ఖాన్ను బద్నామ్ చేసింది. అర్హుడు అవునా, కాదా? ఇప్పుడు చెప్పండి... ఆర్యన్ ఖాన్కు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత, నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఎన్సీబీకి ఉందా, లేదా? ఎన్సీబీకి మాత్రమే కాదు... మీడియాకూ ఇది వర్తిస్తుంది. అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్. ప్రధాన్ ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి... ఆర్యన్ ఖాన్ కేసు ప్రాథమిక విచారణలో లోపాలూ, అక్రమాలూ బోలెడన్ని ఉన్నాయనీ, సంబంధిత సిబ్బందిపై చర్యలు చేపడతామనీ బహిరంగంగా ఒప్పుకున్నారాయన. అయితే, ఆర్యన్ ఖాన్ అరెస్ట్ సమర్థనీయమేనా? అన్న ఎన్డీటీవీ ప్రశ్నకు మాత్రం చిత్రమైన సమాధానమిచ్చారు – ‘‘విచారణలో... ఆ తరువాత అందే వాస్తవాలు విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. కాబట్టి ప్రాథమిక విచారణను నిందించడానికి నేను తొందర పడను’’ అనేశారు. బహిరంగంగా చేసిన తన ప్రకటనకు భిన్నంగా ఇలా మాట్లాడగలిగిన వ్యక్తిని ఇదే చూడటం! ఆర్యన్ ఖాన్ తరఫున కేసు వాదించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నాతో మాట్లాడుతూ ఈ ఉదంతం మొత్తమ్మీద రెండు పాఠాలు నేర్పుతోందని అన్నారు. మొదటిది... తప్పుడు అరెస్ట్లు జరిగినప్పుడు బాధితుడికి నష్టపరిహారం పొందే హక్కును చట్టబద్ధం చేయాల్సిన అవసరముంది! ఇక రెండోది... అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని పోలీసులు లేదా ఇతర విచారణ సంస్థలు ఆదరా బాదరాగా ఆ పని చేయకూడదు. కొంచెం స్థిమితంగా ఆలోచించి... కేసులో దమ్ము ఉందా, లేదా అన్నది విచారించుకున్న తరువాత మాత్రమే అరెస్ట్ గురించి యోచించాలి. బాధ్యులను నిలబెట్టాలి సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఇంకో అడుగు ముందుకెళ్లి మరో మాట చెబుతారు. ప్రాథమిక విచారణ జరిపినవారిని విచారించాలి అని! ఆర్యన్ ఖాన్ కేసు విషయంలో ప్రశాంత్ విస్పష్టంగా సమీర్ వాంఖడే పేరును ప్రస్తా వించారు. దుర్బుద్ధితో విచారణ జరపడం, అధికార దుర్వినియో గానికి పాల్పడటం ఇంకోసారి జరక్కుండా ఉండాలంటే విచారణ జరగాల్సిందేనని వాదించారు ఆయన. చేసిన తప్పునకు శిక్ష పడటం ఒక్కటే ఇంకోసారి ఇలాంటి తప్పులు జరక్కుండా నిలువరిస్తుందన్న నమ్మకం ప్రశాంత్తోపాటు చాలామందికి ఉంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా అడ్మిరల్ బైంగ్ను ఉరితీయడాన్ని తన కాండీడ్ పుస్తకంలో తత్వవేత్త వోల్టేర్ కూడా విస్పష్టంగా సమర్థించుకున్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో వోల్టేర్ వ్యాఖ్య ఒకటి ఎప్పటికీ గుర్తుండిపోయేదే... ‘‘పౌర్ ఎన్కరేజర్ లెస్ అటర్స్’’ (ఇతరులను ప్రోత్సహించేందుకు) అన్న ఆ వ్యాఖ్య ఆర్యన్ ఖాన్ కేసు విషయంలోనూ వర్తిస్తుంది మరి! వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
అప్పుడు డ్రగ్ తీసుకున్నట్లు ఆర్యన్ అంగీకరించాడు: ఎన్సీబీ
మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్ లభించిన సంగతి తెలిసిందే. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీట్ సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో ఆర్యన్కు ఖాన్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను ఎన్సీబీ పొందుపరిచింది. చదవండి: ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే! అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు ఆర్యన్ ఖాన్ తమ విచారణలో తెలిపాడని ఎన్సీబీ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టు చేసిన 20 మంది 14 మందిపై ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విధితమే. 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్ ఎన్సీబీకి ముందు అంగీకరించినట్లు అభియోగపత్రం వెల్లడిస్తోంది. చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో ఈ చార్జిషీట్లో ఏం చెబుతుంటే.. ‘ఆ సమయంలో తాను నిద్ర సమస్యలతో బాధపడ్డానని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని ఇంటర్నెట్లో పలు కథనాలు చదివినట్లు వాంగ్ములమిచ్చాడు. సరదా కోసం మారిజునానూ కూడా తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. తన ఫోన్లో దొరికిన గంజాయి వాట్సప్ డ్రగ్ చాట్ తానే చేశానని, దోఖా అనే కోడ్వర్డ్తో గంజాయి కొనుగోలు కోసం ఆచిత్తో(ఈ కేసులో మరో నిందితుడు) చాట్ చేశానని ఆర్యన్ ఒప్పుకున్నాడు. అయితే తన ఫోన్ను అధికారికంగా స్వాధినం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్ వివరాలేవి ప్రస్తుత కేసుతో అతనికి సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్సీబీ తమ అభియోగపత్రంలో వెల్లడించింది. -
Drug Case: షారూక్ కొడుక్కు క్లీన్చిట్
ముంబై/న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్ లభించింది. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీటు సమర్పించింది. ఆర్యన్, మరో ఐదుగురి పేర్లను అందులో ప్రస్తావించలేదు. సంజయ్కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపి 14 మందిపై ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. ‘‘ఆర్యన్కు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలేవీ దొరకలేదు. దాంతో అతన్ని, మరో ఐదుగురిని చార్జిషీటు నుంచి మినహాయించాం’’ అని ఎన్సీబీ చీఫ్ ఎస్.ఎన్.ప్రధాన్ చెప్పారు. ఆర్యన్, మొహక్ల దగ్గర డ్రగ్స్ లభించలేదన్నారు. సత్యమే గెలిచిందని ఆర్యన్ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. ఎన్సీబీ తన తప్పిదాన్ని అంగీకరించిందని చెప్పారు. ఆర్యన్కు క్లీన్చిట్పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) హర్షం వ్యక్తం చేసింది. ఆర్యన్ అనుభవించిన మనస్తాపానికి ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్గా కేసులో ప్రాథమిక విచారణ చేసిన సమీర్ వాంఖెడే బాధ్యత వహించాలంది. తప్పుల తడకగా విచారణ జరిపినందుకు వాంఖెడేపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఏం జరిగింది..? ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓడలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో 2021 అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు చేసిన దాడుల్లో ఆర్యన్ఖాన్ దొరికిపోయాడు. ఆర్యన్తో పాటు మొత్తం 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో లింకులున్నాయని ఎన్సీబీ వాదించడంతో ఆర్యన్, అర్బాజ్, దమేచాలను కోర్టు రిమాండ్కు అప్పగించింది. ఆర్యన్ను జైల్లో పెట్టారు. 22 రోజుల తర్వాత వారికి బెయిల్ దొరికింది. కేసు వీగింది ఇందుకే... ► ముంబై క్రూయిజ్లో ఆర్యన్ను అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి మాదకద్రవ్యాలూ దొరకలేదు. పడవలో అరెస్టు చేసిన ఇతర నిందితుల వద్ద లభించిన డ్రగ్స్నే అరెస్టు చేసిన వారందరి దగ్గర నుంచి గంపగుత్తగా లభించినట్టు చూపారు. ఇది ఎన్డీపీఎస్ నిబంధనలకు విరుద్ధం. ► ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించడానికి వైద్య పరీక్షలేవీ చేయలేదు. ► పడవలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడి చేశామంటున్న ఎన్సీబీ వీడియో ఫుటేజ్ సమర్పించలేదు. ► ఆర్యన్ ఫోన్ చాటింగ్స్ ఈ కేసుకు సంబంధించినవి కావు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో అతనికి లింకులున్నట్టు వాటిలో ఆధారాలేవీ లేవు. ► ఎన్సీబీ సాక్షులు విచారణలో ఎదురు తిరిగారు. అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఒకరు, ఆ సమయంలో తాము ఆ పరిసరాల్లోనే లేమని మరో ఇద్దరు చెప్పారు. -
ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్
అందరికీ ఎన్నడో అర్థమైన ఒకానొక సత్యం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్సీబీ)కి ఆలస్యంగా తలకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు మాదక ద్రవ్యాలతో ఏవిధమైన సంబంధమూ లేదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్తోపాటు అనేకుల్ని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ప్రకటించింది. ఇంకేం? సామాజిక మాధ్యమాలూ, టీవీ చానెళ్లూ హోరెత్తిపోయాయి. మాదకద్రవ్యాలు తీసుకుం టుండగా ఆర్యన్ను స్వయంగా చూసినంత హడావుడి చేశాయి. అందులోనూ పట్టుబడింది బీజేపీకి అయిష్టుడిగా ముద్రపడిన షారుఖ్ తనయుడు కావడంతో కొన్ని చానెళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అవి రోజంతా నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నవారు ఈ కేసులో తీర్పులిచ్చేశారు. సెలబ్రిటీల పిల్లల పెంపకంపై విరుచుకుపడ్డారు. దేశభక్తి లేనివారి సంతానం ఇలాగే ఉంటారని దెప్పిపొడిచారు. కొందరు ఆ అరెస్టు వెనకున్న పరమార్థమేమిటో అంచనా వేశారు. ఆ సమయంలో గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. నిజానికి ‘ఫలానా హీరో తనయుడు లేదా తనయ’ అనే విశేషణం అవసరం లేకుండానే స్టార్ హీరోల పిల్లలు వారికై వారు సెలబ్రిటీలుగా మారిపోతున్న కాలమిది. గతంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్న నటులైనా తమ వారసులను వెండితెరపై వెలిగించాలనుకున్నప్పుడు చేయితిరిగిన దర్శకులను ఆశ్రయించేవారు. దీటైన పబ్లిసిటీ కోసం వెంపర్లాడేవారు. ఇవాళ ఏ చిత్రంలోనూ నటించకపోయినా, కనీసం నలుగురి దృష్టినీ ఆకర్షించే పనులేమీ చేయకపోయినా ఆర్యన్ నుంచి ఆరాధ్య వరకూ ఎవరు ఎవరి వారసులో అందరికీ తెలుసు. ఎవరినైనా రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చే చిట్కాల్లో ఆరితేరిన పీఆర్ మేనేజర్ల పుణ్యమిది. ఇన్స్టాగ్రామ్లోనో, ట్విటర్లోనో లక్షల మంది అనుచరగణాన్ని సృష్టించి ఆ పిల్లల ఫొటోలు పెడితే చాలు... బహుభాషా మాధ్యమాల్లో అవి చిలవలు, పలవలుగా అల్లుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అటుపై వారి గురించి తెలియ దంటే అలా అన్నవారి అజ్ఞానమే బయటపడుతుంది. అయితే ఈ మాదిరి ప్రచారం కూడా వికటించే ప్రమాదం లేకపోలేదు. ఆర్యన్ఖాన్కు జరిగింది అదే. అతను షారుఖ్ కుమారుడు కాకపోయివుంటే కథ వేరేలా ఉండేది. బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ ఆత్మహత్య కేసులో అతడి స్నేహితురాలు నటి రియా చక్రవర్తికి చుక్కలు చూపించిన అప్పటి ముంబై జోన్ ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేనే ఆర్యన్ ను కూడా కటకటాల్లోకి నెట్టగలిగారు. ఏలికల ఆదేశాలను శిరసావహించి ఎవరినైనా కేసుల్లో ఇరికించగల నైపుణ్యంగల అధికారుల్లో ఒకరిగా ఆయనకున్న అపకీర్తి ఎవరికీ తెలియనిది కాదు. రోజంతా మోతమోగే చానెళ్ల కారణంగా హఠాత్తుగా వచ్చిపడిన గ్లామర్ ఆయనను మరింత వ్యామోహంలోకి నెట్టింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆర్యన్ఖాన్ కేసును సవాలుగా తీసుకొని రోజుకొక కొత్త కోణంతో వాంఖడే చరిత్రను ఏకరువు పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ కేసులో మధ్యవర్తులుగా ఉన్నవారికి వాంఖడేతో ఉన్న సంబంధాలు వెల్లడి కావడంతో ముందు ఎన్సీబీ విజిలెన్సు విభాగం దర్యాప్తు, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరిగాయి. ఈ రెండు విభాగాలూ వాంఖడేను గుచ్చి గుచ్చి ప్రశ్నించి నిజాలు నిగ్గు తేల్చాయి. ఆర్యన్తోపాటు ఆరుగురిపై ఆధారాల్లేవని నిర్ధారణ కావడంవల్ల కేసులు ఉపసంహరిస్తున్నామని సిట్ ప్రకటించింది. ఉగ్రవాదం తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ మాదకద్రవ్యాల వాడకమే కొరకరాని కొయ్యగా మారింది. అంతటి పెను రక్కసి ఆరా తీసి, దాన్ని దుంపనాశనం చేయాల్సిన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావాల్సిన ఎన్సీబీ వంటి సంస్థ స్వప్రయోజనాపరులైన నేతల చేతుల్లో కీలుబొమ్మయితే, దాని అధికారులు బానిస మనస్తత్వంతో అడుగులేస్తుంటే జరిగేదేమిటో తెలియంది కాదు. యువతను మత్తులో ముంచెత్తి మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేయగల సత్తా మాదకద్రవ్యాల కుంటుంది. వాటివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నమవుతాయి. ఏదో ఒక ముసుగులో ప్రపంచం నలుమూలల నుంచీ మాదకద్రవ్యాలు ఇక్కడికొస్తున్నాయి. మరెన్నో దేశాలకు చడీచప్పుడూ లేకుండా పోతున్నాయి. గట్టి నిఘా ఉంటే తప్ప వీటిని అరికట్టడం అసాధ్యం. మనం ఆ పని చేయలేకపోతే ప్రపంచంముందు చులకనవుతాం. దర్యాప్తు సంస్థలు దీన్ని గుర్తెరిగి వృధా కేసులతో పొద్దుపుచ్చడం మానుకోవాలి. ప్రచారయావను తగ్గించుకోవాలి. అవకాశం దొరికిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా తీర్పులీయటం అలవాటైన చానెళ్లకూ ఈ కేసు గుణపాఠం కావాలి. వాంఖడే ఆర్యన్ జోలికి పోయాడు గనుక ఈ కేసు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో దర్యాప్తు సక్రమంగా సాగి నిజానిజాలేమిటో వెల్లడయ్యాయి. మరి అమాయకుల మాటో?! ఎన్సీబీతోసహా అన్ని దర్యాప్తు సంస్థలనూ ప్రక్షాళన చేయడం ముఖ్యమనీ, అవి స్వతంత్రంగా మెలిగేందుకు తోడ్పాటునందించడం అవసరమనీ కేంద్రం గుర్తించాలి. -
ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్ఖాన్ కు క్లీన్ చిట్
-
Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు ఎన్సీబీ క్లీన్ చిట్..
Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. చదవండి:👇 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ 12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పక్కకు తప్పించింది. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. అయితే ఆ కార్యకలాపాలు ఏంటన్నవి ఎన్సీబీ వెల్లడించింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. దీంతో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్, 17 మందికి బెయిల్ దొరికింది. ఇద్దరు ఇంకా జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి మృతి -
హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు
Aryan Khan Bollywood Debut As Director To A Web Series: బాలీవుడ్ బాద్షా కుమారుడు ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆర్యన్ హీరోగా ఏదో ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇప్పటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. బాలీవుడ్కు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేయనున్నాడట. దానికి కథను కూడా ఆర్యన్ ఖాన్ అందించాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన టెస్ట్ షూట్ను ముంబైలోని ఓ స్టూడియోలో జరిపినట్లు తెలుస్తోంది. ఈ టెస్ట్ షూట్కు ఆర్యన్ ఖాన్ పూర్తి బాధ్యతను తీసుకున్నాడట. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్పై అవగాహన ఉండాలనేది ఆర్యన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ముందుగా ఏప్రిల్ 8, 9 తేదిల్లో టెస్ట్ షూట్ నిర్వహించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి ఆర్యన్ ఖాన్కు తనలా హీరో కావాలనే ఆలోచిన లేదని, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలు తనకు నచ్చేవని ఇదివరకూ పలుమార్లు షారుఖ్ ఖాన్ తెలిపాడు. ఇక షారుఖ్ ఖాన్ రెండో సంతానం, కుమార్తె సుహానా ఖాన్ ఓ వెబ్ సిరీస్తో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే ఈ వెబ్ సిరీస్కు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అర్చీస్ కామిక్ ఆధారంగా తెరకెక్కనుంది. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి
ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఓ ప్రధాన సాక్షి మృతిచెందాడు. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో కన్నుమూశాడు. శుక్రవారం మధ్యాహ్నం ముంబై పరిధిలోని చెంబూర్లోని మహుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో అతను చనిపోయినట్లు తెలుస్తోంది. 2021లో నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్ ఇండిపెండెంట్ విట్నెస్గా ఉన్నాడు. ప్రభాకర్ మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని అతని కుటుంబం ధృవీకరించిన విషయాన్ని ప్రభాకర్ తరపు న్యాయవాది తుషార్ ఖాండేర్ వెల్లడించారు. ప్రభాకర్కు తల్లి, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీ గోసావీ అనే వ్యక్తి దగ్గర ప్రభాకర్ సెయిల్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. ముంబై క్రూయిజ్ పార్టీలో గోసావీ కూడా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో సాక్షి సామ్ డీసౌజా, గోసావీ-ప్రభాకర్ల మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. వాళ్లు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించాడు. అయితే ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో పాటు ఎన్సీబీ పైనా అవినీతి ఆరోపణలు చేశాడు ప్రభాకర్. ఈ నేపథ్యంలో అన్ని ఆరోపణల మీద విచారణ జరుగుతోంది. ఈలోపే ప్రభాకర్ గుండె పోటుతో చనిపోవడం.. కేసును మలుపు తిప్పే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ముంబైలో చోటు చేసుకున్న ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ముంబై తీరంలో కార్డీలియా క్రూయిజ్ లైనర్ అనే నౌకపై ఎన్సీబీ అధికారులు దాడులుచేశారు. రేవ్ పార్టీ జరుగుతోందని, విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో సోదాలు చేశారు. క్రూయిజ్లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొలి అరెస్ట్ ఆర్యన్ ఖాన్దే కావడం విశేషం. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: అందుకు అదనంగా 90 రోజులు..
Aryan Khan Drugs Case: NCB Seeks 90 More Days For File Charge Sheet: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. గతేడాది అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆర్యన్ను అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైలుకు తరలించగా సుమారు 20 రోజులు గడిపాడు ఈ స్టార్ కిడ్. ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పలుమార్లు తిరస్కిరించింది. దీంతో ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. ఈ కేసులో ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు తమకు 90 రోజుల అదనపు సమయం కావాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ముంబై సెషన్స్ కోర్టులో మార్చి 28న పిటిషన్ వేసింది. అయితే ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 180 రోజుల్లోగా ఛార్జ్షీట్ను దాఖలు చేయాలి. దీని ప్రకారం చూస్తే ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది. ఈ లెక్కన మరో 90 రోజుల అదనపు సమయం అంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు జూలై 2 తేది చివరి తేది కానుంది. గతేడాది అక్టోబర్ 2న పార్టీ జరగగా.. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో సుమారు 20 మందిని ఎన్సీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 18 మంది బెయిల్పై బయట ఉన్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు -
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు
Hero Tovino Finally Open Up On Aryan Khan Drug Case: గతేడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ సంచలనం సృష్టించింది. 2021 అక్టోబర్ 3న క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టయిన ఆర్యన్ అక్టోబర్ 30న బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ కేసు బాలీవుడ్తో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ కేసులో ఎంతో బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు ఆర్యన్, షారుక్లకు మద్ధతుగా నిలిచారు. చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత కానీ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన ఏ ఒక్కరు ఈ కేసుపై నోరు విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్యన్ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగాక, ఈకేసు గురించి సెలబ్రెటీలతో పాటు ప్రజలు కూడా మరిచిపోయారు. ఈ తరుణంగా సౌత్ హీరో టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. దీంతో ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఏం జరిగిందంటే.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఇటీవల నటించిన మిన్నాళ్ మురళి చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. చదవండి: సుధీర్ ఎంగేజ్మెంట్!, ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేంటి.. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో టోవినో థామస్ ఆర్యన్ డ్రగ్ కేసుపై స్పందించాడు. ఈ సందర్భంగా టోవినో మాట్లాడుతూ.. ఈ కేసు సమంయలో షారుక్ ఖాన్ పేరును డ్యామేజ్ చేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని, దీనిని కొంతమంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ కేసులో ముంబై హైకోర్టు ఆర్యన్కు మూడు సార్లు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకంగా బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ కుమారుడికి బెయిల్ దొరక్కపోవడం ఏంటని అంతా షాక్కు గురయ్యారు. అంటే దీని వెనక ఎదైన కుట్ర జరుగుతుందా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. -
ప్రతిభతో నిలదొక్కుకునేందుకు వస్తున్న 'బీటౌన్' వారసులు
వారిస్ వస్తున్నారోచ్.. హిందీలో వారిస్ వస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ విజిటింగ్ కార్డ్తో వస్తున్నారు. ఒకట్రెండు సినిమాలకే బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడుతుంది. అందుకే టాలెంట్తో నిలబడాలనుకుని వస్తున్నారు. ఇప్పుడందరి కళ్లూ ఈ వారిస్ మీదే. ‘వారిస్ ఆ రహే హై’ (వారసులు వస్తున్నారు) అంటూ స్టార్ కిడ్స్కి వెల్కమ్ చెప్పడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. త్వరలో పరిచయం కానున్న ఆ వారసుల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో వారసుల ఎంట్రీ లిస్ట్ ప్రతి ఏడాది అప్డేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ పేర్లు చేరిపోయాయి. ఈ ముగ్గురూ జోయా అక్తర్ డైరెక్షన్లో ఓ వెబ్ ఫిలిం చేయనున్నారని టాక్. కామిక్ బుక్ ఆర్చీస్ ఆధారంగా ‘ది ఆర్చీస్’ అనే మ్యూజిక్ డ్రామాకు దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది నవంబరులో దర్శకురాలు జోయా అక్తర్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 1960 నేపథ్యంలో టీనేజర్స్ కథలా ఉంటుంది ఆర్చీస్ నవల. ఈ ప్రాజెక్ట్ కోసం తాజాగా అగస్త్య నంద, సుహానా ఖాన్, జోయాల మధ్య ఓ మీటింగ్ జరిగినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ షాప్స్లో భాగంగానే అగస్త్య, సుహాన, జోయ కలిశారన్నది బీ టౌన్ టాక్. ఇదే ప్రాజెక్ట్లో ఖుషీ కపూర్ కూడా భాగమయ్యారని తెలుస్తోంది. ఖుషీ కపూర్కు యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉందని, న్యూయార్క్లో శిక్షణ తీసుకుంటోందని గత ఏడాది ఓ సందర్భంలో ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ అన్నారు. తాజాగా ‘త్వరలోనే ఖుషీ కపూర్ కెమెరా ముందుకు వెళుతోంది. ఖుషీ యాక్ట్ చేయనున్న ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్లో స్టార్ట్ కావొచ్చు’’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. దీంతో ఖుషీ ‘ది ఆర్చీస్’ ప్రాజెక్ట్లో భాగమయిందనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదండోయ్.. నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీమ్ అలీఖాన్ (సైఫ్–అమృతా సింగ్ల కుమారుడు ఇబ్రహీమ్) పేరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం జోయా అక్తర్ పరిశీలించిన పేర్లలో వినిపిస్తోంది. ఆండ్రూస్, బెట్టి కూపర్, వెరోనికా లాడ్జ్, జగ్హెడ్ జోన్స్ అనే నలుగురు టీనేజ్ క్యారెక్టర్ల చుట్టూ ‘ది ఆర్చీస్’ తిరుగుతుంది. మరి.. ఇందులో ఎవరెవరు ఏయే క్యారెక్టర్ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ పైన చెప్పిన స్టార్ కిడ్స్ ఈ ప్రాజెక్ట్లో భాగమైతే మాత్రం ఒకే ప్రాజెక్ట్తో నలుగురు వారసుల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రముఖ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ యాక్టింగ్ జర్నీ ఆరంభమైంది. హీరోయిన్ అనుష్కా శర్మ నిర్మిస్తున్న ‘క్వాల’ అనే వెబ్ సిరీస్లో బాబిల్ నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ఐదు ఎపిసోడ్స్గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ చిన్న కొడుకు రజ్వీర్ (సన్నీ పెద్ద కొడుకు కరణ్ 2019లోనే నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు) ఎంట్రీ కూడా మొదలైపోయింది. ఈ చిత్రానికి ఎస్. అవ్నీష్ దర్శకుడు. మరోవైపు అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తనయుడు (ఆమిర్–రీనా దత్ల కుమారుడు) జునైద్ ఖాన్ ‘మహా రాజా’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా ‘మేదియా’ అనే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్కు డైరెక్టర్గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎంట్రీ కూడా ఖరారవుతున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్యన్ యాక్టర్గా కన్నా కూడా రైటర్గానే ముందుగా పరిచయం కానున్నాడని బీ టౌన్ వార్త. అమెజాన్ ప్రైమ్ వీడియోకు షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్’ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతోందట. ఈ ప్రాజెక్ట్ కోసమే ఆర్యన్ రైటర్గా మారాడని భోగట్టా. అలాగే ఇదే ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్మించనున్న ఓ వెబ్ సిరీస్లో ఆర్యన్ నటించనున్నారట. ఇక ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి ఎంట్రీ కూడా ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. మరికొందరు స్టార్ కిడ్స్ కూడా రావడానికి రెడీ అవుతున్నారు. మరి.. టాలెంట్తో నిలబడే వారసులు ఎందరో చూడాలి. -
IPL 2022 Auction: అప్పుడు ఆర్యన్తో కలిసి.. ఇప్పుడు ఇలా: జూహీ చావ్లా భావోద్వేగం
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమార్తె జాహ్నవి మెహతా తమ ఫ్రాంఛైజీ వ్యవహారాల్లో మమేకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఫ్రాంఛైజీలకు చెందిన కొత్త తరం నాయకులు పాల్గొన్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సీఈఓ కావ్య మారన్ సహా కేకేఆర్ యువ రక్తం జాహ్నవి, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వారసులు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా జాహ్నవి వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూహీ చావ్లా కూతురును ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన వీడియోను ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఐపీఎల్తో పాటు ఇతర క్రికెట్ ఈవెంట్లు చూడటం కూడా అలవాటుగా మార్చుకుంది. కామెంటేటర్ల వ్యాఖ్యలు శ్రద్ధగా వినేది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడు అనుకుంటా.. మేం సెలవుల కోసం బాలి వెళ్లినపుడు కాఫీ టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరి సైజులో ఓ పుస్తకం... అందులో క్రికెటర్ల జీవిత చరిత్రలు, రికార్డులు, వారు సాధించిన విజయాలు.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆ బుక్ చదవడం పూర్తి చేయాలనే పిచ్చి పట్టింది తనకు. స్విమ్మింగ్ విరామ సమయంలో పూల్ ఒడ్డున కూర్చుని ఒక్క పేజీ కూడా వదలకుండా ఆ బుఖ్ చదివింది. ఇది చాలా అసహజమైన విషయం కదా! 12 ఏళ్ల పిల్ల ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించడం! వయసు పెరిగే కొద్దీ తనలో క్రికెట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. క్రికెట్ గురించి మాట్లాడితే తన ముఖం మతాబులా వెలిగిపోతుంది. మూడేళ్ల క్రితం.. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా జాహ్నవి 17 ఏళ్ల వయసులో రికార్డు సాధించింది. ఆర్యన్తో కలిసి జాహ్నవి వేలంలో పాల్గొంది. ఈసారి సుహానా కూడా వాళ్లతో చేరింది. దీనంతటికీ కారణమైన మా సీఈఓ వెంకీ మైసూర్కు ధన్యవాదాలు. జాహ్నవి అభిప్రాయాలకు విలువనిస్తూ... తనను ప్రోత్సహించారు. ఆమె అతడిని ఆప్యాయంగా ‘కోచ్’ అని పిలుస్తుంది. తన మనసంతా ఆట మీదే. ఒక తల్లిగా నా చిట్టితల్లిని చూసి గర్వపడుతున్నా. దేవుడి ఆశీర్వాదాలతో తన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని అంటూ ఉద్వేగభరిత నోట్ రాశారు. చదవండి: IPL 2022- SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్...సైమన్ కటిచ్ రాజీనామా!? ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే.. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
Factcheck: అందరి ముందే పని కానిచ్చేసిన ఆర్యన్ ఖాన్?
విమానాశ్రయంలో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగా బహిరంగ మూత్రవిసర్జన చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అంటూ ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయి బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఇలాంటి గలీజ్ పని చేసి పోలీసుల చేత చీవాట్లు తిన్నాడంటూ పలువురు నెటిజన్లు సదరు వీడియోను షేర్లు చేస్తున్నారు. వాస్తవమేంటంటే ఆ వీడియో నిజమే కానీ అందులో ఉన్న వ్యక్తి మాత్రం ఆర్యన్ ఖాన్ కాదు. కెనడియన్ నటుడు బ్రోన్సన్ పెలెటియర్. 2012లో లాస్ ఎంజిల్స్ ఎయిర్పోర్ట్లో అందరిముందే పని కానిచ్చేయడంతో అధికారులు అతడిని అరెస్ట్ కూడా చేశారు. కాగా గతేడాది అక్టోబర్ 2న ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే! అక్టోబర్ 28న బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. -
గూగుల్ సెర్చ్లో ట్రెండ్ కరోనాదే.. టాప్ 10 జాబితా ఇదే!
Google Search 2021 Trends: ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయం మీద వార్తలో, వివరాలో కావాలన్నా ఆశ్రయించేది ‘గూగుల్’నే. జనం దేనిపై ఆసక్తిగా ఉన్నారో, ఎప్పుడెప్పుడు దేని గురించి సెర్చ్ చేస్తున్నారో గూగుల్ ట్రెండ్స్ చెప్పేస్తుంది. అలా 2021లో భారతీయులు ఎక్కువగా వెతికినది దేని గురించో తెలుసా.. కరోనాకు సంబంధించే. ఇదొక్కటే కాదు.. వివిధ అంశాల్లో జనం దేనిగురించి ఎక్కువగా వెతికారో గూగుల్ ట్రెండ్స్ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా? – సాక్షి సెంట్రల్డెస్క్ టాప్–10లో ఉన్నవి ఇవీ.. మొత్తంగా ఏడాదంతా కలిపి చూస్తే.. గూగుల్ సెర్చ్లో ఐపీఎల్ టాప్లో.. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన కోవిన్ పోర్టల్ రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్, కోవిడ్ వ్యాక్సిన్, ఫ్రీఫైర్ గేమ్ రిడీమ్ కోడ్, కోపా అమెరికా, నీరజ్ చోప్రా, ఆర్యన్ ఖాన్ (షారూక్ఖాన్ కుమారుడు) గురించి నెటిజన్లు వెతికారు. దగ్గరిలో ‘కోవిడ్’గురించే.. మనం ఉన్న ప్రాంతంలో మనకు కావాల్సిన అవసరాల కోసం చేసే ‘నియర్ మి’సెర్చ్లో.. కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ పరీక్షల కోసమే కోసమే జనం అత్యధికంగా వెతికారు. తర్వాతి స్థానాల్లో ఫుడ్ డెలివరీ, ఆక్సిజన్ సిలిండర్, కోవిడ్ హాస్పిటల్, టిఫిన్ సెంటర్, సీటీ స్కాన్, టేక్ఔట్ రెస్టారెంట్స్, ఫాస్టాగ్, డ్రైవింగ్ స్కూల్ నిలిచాయి. మొత్తంగా ‘నియర్ మి’సెర్చ్ టాప్–10లో ఐదు అంశాలు కరోనాకు సంబంధించినవే. ఎలా చేయాలనే లిస్టులోనూ.. ఏదైనా పని ఎలాచేయాలనే దానికి సంబంధించిన ‘హౌ టు’సెర్చ్లో నూ కరోనా అంశాలే ఎ క్కువగా నిలిచాయి. కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగనే దానిపైనే ఎ క్కు వ మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్, ఆక్సిజన్ స్థాయిలు పెంచుకోవడమెలా? పాన్–ఆధార్ లింకేజీ, ఇంట్లో ఆ క్సిజన్ తయారీ, డోగె కాయిన్ (వర్చువల్ కరె న్సీ) కొనేదెలా? బనానా బ్రెడ్ తయారీ, బిట్కా యిన్లో ఇన్వెస్ట్ చేసేదెలాగనే వాటిపై వెతికారు. మార్కుల శాతాన్ని లెక్కించడం ఎలాగనేదానిపై చాలామంది సెర్చ్ చేయడం గమనార్హం నీరజ్ చోప్రానే టాప్ భారతీయుల్లో ఎక్కువగా క్రీడాకారుడు నీరజ్ చోప్రా గురించి గూగుల్ సెర్చ్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, నటి షెహనాజ్ గిల్, నటి శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా, స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్, నటుడు విక్కీ కౌశల్, క్రీడాకారులు పీవీ సింధు, భజరంగ్ పునియా, సుశీల్కుమార్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బ్లాక్ ఫంగస్ ఏంటని వెతుకుతూ.. ఏదైనా అంశం గురించి తెలుసుకునేందుకు వాడే ‘వాట్ ఈజ్’సెర్చ్లో గత ఏడాది ‘బ్లాక్ ఫంగస్’టాప్లో నిలిచింది. కరోనా రెండో వేవ్ సమయంలో.. బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోవడంతో అదేమిటనే దానిపై జనం గూగుల్లో వెతికారు. ఇక గణితానికి సంబంధించి.. ‘వందకు కారకం (ఫ్యాక్టోరియల్ ఆఫ్ హండ్రెడ్)’ఏమిటి? తాలిబాన్ ఏంటి? అఫ్గానిస్తాన్లో ఏం జరుగుతోంది? రెమ్డెసివిర్ ఏమిటి, నాలుగుకు స్వే్కర్ రూట్ ఏమిటి? స్టెరాయిడ్లు, టూల్కిట్, స్క్విడ్గేమ్, డెల్టాప్లస్ వేరియంట్ ఏమిటన్న దానిపై నెటిజన్లు సెర్చ్ చేశారు. వార్తల్లో నిలిచినవేంటి? ఎప్పటికప్పుడు జరిగే వార్తాంశాల సెర్చింగ్లో గత ఏడాది టోక్యో ఒలింపిక్స్ టాప్లో నిలిచింది. బ్లాక్ ఫంగస్, అఫ్గానిస్తాన్ వార్తలు, బెంగాల్ ఎన్నికలు, టౌక్టీ తుఫాను, కరోనా రెండోవేవ్ లాక్డౌన్, సూయజ్ కెనాల్లో నౌక చిక్కకుపోయిన సంక్షోభం, ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు, బర్డ్ఫ్లూ వ్యాప్తి, యాస్ తుఫానుకు సం బంధించిన వార్తలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పాత, కొత్త రుచుల కోసం.. గత ఏడాది లాక్డౌన్ సమయంలో చాలా మంది గూగుల్లో వివిధ రకాల వంటలు ఎలా చేయాలనేదానిపై విపరీతంగా సెర్చ్ చేశారు. అందులో పాత, కొత్త రుచుల కలయిక ఉండటం గమనార్హం. ఇనోకి మష్రూమ్ (పుట్టగొడుగుల వంటకం) ఇందులో టాప్లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మోదక్, మేతీ మటర్ మలాయి, పాలక్, చికెన్ సూప్, పోర్న్స్టార్ మర్తిని (కాక్టెయిల్), లసగ్నా, కుకీస్, మటర్ పనీర్, కడా వంటకాలు నిలిచాయి. -
సినిమాల్లోకి ఆర్యన్ ఖాన్, హీరోగా కాదు!
Aryan Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో కటకటాలు లెక్కపెట్టిన ఆర్యన్ ఖాన్ను వెండితెరపై పరిచయం చేసేందుకు షారుక్-గౌహరీ ఖాన్ దంపతులు సమాయత్తం అవుతున్నారట. అందులో భాగంగా ఆర్యన్ ఖాన్ ప్రముఖ దర్శకుల దగ్గర ఫిల్మ్ మేకింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాడట! సెట్స్లో ఒక సన్నివేశాన్ని ఎలా చిత్రీకరిస్తారు? అందుకోసం ఎంత కష్టపడతారనేది దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మున్ముందు కూడా నిర్మాతలు ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ల ప్రొడక్షన్ హౌస్లో పని చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. పైగా ఈ మధ్యే ఆర్యన్.. ఆదిత్య చోప్రా వైఆర్ఎఫ్ స్టూడియోను సందర్శించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. తండ్రి పఠాన్ సినిమాకు పని చేస్తున్నాడేమోనని గాసిప్స్ బయటకు వచ్చాయి. అలాగే కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాలకు సైతం అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి! అంటే మొత్తానికి ఆర్యన్ ఖాన్ త్వరలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా వెండితెరకు పరిచయం అవనున్నట్లు తెలుస్తోంది. -
2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే..
Top 6 Bollywood Celebrities Who Landed In Trouble: 2021 సంవత్సరం ఇంకో 10 రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాలీవుడ్ తారలు తమ చిత్రాలతో కనులవిందు చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. కొందరైతే ఏకంగా అరెస్టయి కొన్ని రోజులు జైలులో గడపవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నుంచి నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వరకు ఉన్నారు. ఇలా ఈ ఏడు వివిధ రకాల సంఘటనలతో బీటౌన్ ఆసక్తికరంగా మారింది. 2021లో పలు వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం. 1. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఎన్సీబీ (NCB) డ్రగ్ రైడ్ తర్వాత ఈ స్టార్ కిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్ 2న జరిగిన ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. సుమారు 20 రోజులు జైలులో గడిపిన తర్వాత ఈ స్టార్ కిడ్కు బెయిల్ మంజూరైంది. 2. రాజ్ కుంద్రా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి మొబైల్ యాప్స్ ద్వారా ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 'అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్లు ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్కుంద్రా ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నందున జూలై 19, 2021న అరెస్టు చేశాము. దీనికి తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన సీపీ ప్రకటించారు. సుమారు రెండు నెలలపాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాకు సెప్టెంబర్లో బెయిల్ వచ్చింది. అలాగే ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. 3. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సమన్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్. సుకేష్ చంద్రశేఖర్ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 4. అనన్య పాండే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో బాగంగా లైగర్ బ్యూటీ అనన్య పాండేకు ఎన్సీబీ (NCB) సమన్లు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్లో తన పేరు బయటకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య. ఆర్యన్ ఖాన్కు, ఒక డెబ్యూ హీరోయిన్ మధ్య ఉన్న వాట్సాప్ చాట్ను కనిపెట్టినట్లు ఎన్సీబీ వారి ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సమయంలో ముందుగా ఆ పేరును ఎన్సీబీ వెల్లడించలేదు. 5. కంగనా రనౌత్ ఎప్పుడూ ఆసక్తికర, విదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన పర్హాన్ అక్తర్కు పరువుకు నష్టం కలిగించే రీతిలో మాట్లాడిందని పర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే కోర్టు ఫిబ్రవరిలో కంగనాను కోర్టుకు హాజరుకావలసిందిగా నోటీసు జారీ చేసింది. కంగనా చాలాసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్తో హెచ్చరించింది. 6. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ పనామా పేపర్స్ లీక్ కేసుకు సంబంధించి బిగ్బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్కు ఊరట
Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్పై విడుదలైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్కు సంబంధించిన బెయిల్ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
బాంబే హైకోర్టుకు నవాబ్ మాలిక్ క్షమాపణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టుకు శుక్రవారం క్షమాపణ చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖెడే, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తాను హామీ ఇచ్చినప్పటికీ బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను ఈ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అస్పీ చినోయ్ కోర్టులో అఫిడవిట్ వేశారు. నవంబర్ 29న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. కోర్టును అగౌరవపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. వాంఖెడేపై తన క్లయింట్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చినోయ్ వివరించారు. మాలిక్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. మాలిక్పై వాంఖెడే తండ్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణకు వచ్చేదాకా వాంఖెడే కుటుంబంపై విమర్శలు చేయనంటూ మాలిక్ హామీ ఇచ్చారు. కానీ, విమర్శలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెయిల్ నిబంధనలు మార్చండి: ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ విధించిన నిబంధనలు మార్చాలని షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బాంబే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాడు. ప్రతి శుక్రవారం దక్షిణ ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కార్యాలయంలో హాజరు కావాలంటూ విధించిన నిబంధనను మార్చాలని అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు వచ్చేవారం విచారణ చేపట్టనుంది. -
మరోసారి కోర్టును ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతులను సవరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముందు హాజరు కావాలన్న షరతును సవరించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి మీడియా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసినందున తన బెయిల్ షరతును సడలించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను డిసెంబర్ 13న జస్టిస్ నితిన్ సాంబ్రే విచారించే అవకాశం ఉంది. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్ను అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 8(సీ), 20(సీ), 27, 28, 29, 35 నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్స్స్(ఎన్డీపీఎస్) కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 28న బాంబే హైకోర్టుతో ఆర్యన్తో పాటు మరొ ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. 14 కఠినమైన బెయిల్ షరతులు విధించింది. (చదవండి: మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం) -
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఖాతాలో మరో రికార్డు..
Neeraj Chopra Leads Google 2021 Year in Search: 2021 సంవత్సరానికి గాను గూగుల్లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, పంజాబీ నటి షెహనాజ్ గిల్, బాలీవుడ్ నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, రెజ్లర్లు బజరంగ్ పునియా, సుశీల్ కుమార్, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్ ఉన్నారు. ఈ జాబితాకు సంబంధించిన వివరాలను గూగుల్ బుధవారం ప్రకటించింది. చదవండి: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్ స్పిన్నర్ ఔట్ -
ఆర్యన్ కుట్ర చేశారనడానికి ఆధారాల్లేవ్
ముంబై: ముంబైలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ నేరానికి సంబంధించి ముందస్తు కుట్ర పన్నాడనడానికి ప్రాథమిక ఆధారాలు లభించలేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్యన్ఖాన్, సహ నిందితులైన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని బాంబే హైకోర్టు శనివారం విడుదల చేసింది. డ్రగ్స్ కేసులో జడ్జి జస్టిస్ ఎన్.డబ్ల్యూ. సాంబ్రే అక్టోబర్ 28న నిందితులందరికీ బెయిల్ మంజూరు ఇచ్చారు. ఆర్యన్కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో లింకులున్నాయని అతని వాట్సాప్ చాట్ల ద్వారా తెలుస్తోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఆర్యన్ వాట్సాప్ సంభాషణల్లో అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని జడ్జి తీర్పులో స్పష్టం చేశారు. అధికారులు రికార్డు చేసిన ఆర్యన్ నేరాంగీకారాన్ని విచారణ కోసమే వినియోగించాలన్నారు. ఎన్డీపీసీ చట్టం కింద అతను నేరం చేశాడని చెప్పలేమని జడ్జి పేర్కొన్నారు. ఆర్యన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని చెప్పడానికి తగిన ఆధారాలులేవని వెల్లడించారు. ఆర్యన్, అర్బాజ్, మున్మున్ కుట్ర చేశారని చెప్పడానికి ఎన్సీబీకి ఆధారాలు లభించలేదని ఆ తీర్పులో వివరించారు. -
కొత్త బాడీగార్డ్ కావాలంటున్న బాలీవుడ్ బాద్షా.. కారణం ఇదే
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ డిసెంబరులో తన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అక్టోబర్ 3న అరెస్ట్ చేసింది. దీంతో షారుఖ్ తన మూవీ షూట్లకు బ్రేక్ ఇచ్చాడు. కుమారుడి అరెస్టుతో అతని కుటుంబంతో కలిసి ముంబై తిరిగి రాక తప్పలేదు. అనేక పరిణామల తర్వాత అక్టోబర్ 28న ఆర్యన్కు బెయిల్ రావడంతో షారుఖ్ ఊపిరిపీల్చుకున్నాడు. దీంతో మళ్లీ బాద్షా పనిలో నిమగ్నమయ్యేముందు కుటుంబంతో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆర్యన్ కోసం షారుఖ్ కొన్ని మార్పులు చేశారు. ఆర్యన్కు ఒక నమ్మదగిన బాడీగార్డ్ను నియమించాలను చూస్తున్నారని సమాచారం. చాలా కాలం పాటు తనతో ఉండి, తన కుటుంబంలో వ్యక్తిగా భావించే షారుఖ్ బాడీగార్డ్ రవి సింగ్ను ఆర్యన్తో ముంబైలో ఉండమని అడిగారట. ప్రస్తుతం తన కోసం కొత్త బాడీగార్డును నియమించుకోవాలని చూస్తున్నారట షారుఖ్. బెయిల్ షరతుల ప్రకారం ఆర్యన్ ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో హాజరవ్వాలి. కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త బృందంతో తరచుగా సమన్లు రావొచ్చు. ఇలాంటి సందర్భంలో ఆర్యన్ వెంట షారుఖ్కు తెలిసిన, నమ్మదగిన వ్యక్తి ఉండటం ఉత్తమమని భావించారు. ముందుగా షారుఖ్ పఠాన్ సినిమా షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్లో జాన్ అబ్రహం, దీపికా పదుకొనేతో కలిసి నటించనున్నారు. అలాగే అట్లీ తదుపరి చిత్రం కూడా చేయనున్నారు. -
ఆర్యన్ ఖాన్కు సోదరి బర్త్డే విష్షెస్.. చిన్ననాటి ఫొటో వైరల్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ 24వ బర్త్డే సందర్భంగా పలువురు ప్రముఖులు, కజిన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కజిన్ ఆలియా షేర్చేసిన చిన్ననాటి ఫోటోపై ఆర్యన్ చెల్లెలు సుహానా ఖాన్ స్పందించింది. అన్నయ్యకు ప్రేమగా లవ్ సింబల్తో బర్త్డే విషెస్ తెలిపింది. ఆ చిన్ననాటి ఫొటోలో చిట్టి సుహానా, అలియా మాట్లాడుతుండగా ఆర్యన్, అతని కజిన్ అర్జున్ ఫొటోకు ఫోజులివ్వడాన్ని మనం చూడొచ్చు. ఆర్యన్ కజిన్స్ అలియా చీబా, అర్జున్ చిబా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ బర్త్ డే బాయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యన్ ఖాన్ 24వ పుట్టిన రోజు సందర్భంగా అతని సోదరి సుహానా ఖాన్ షేర్ చేసిన చిన్ననాటి ఫొటో ఇప్పటికే వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ల పెద్ద కొడుకు ఆర్యన్ ఇటీవలె డ్రగ్స్ కేసులో అరెస్టయి ఇటీవలె బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆర్యన్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. -
వారి నిర్బంధంలో న్యాయముందా?
బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ముంబైలోని ఆర్థర్రోడ్ జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ అతడి విడుదలపై ఉత్తర్వు జారీ చేసినప్పటికీ ఆర్యన్ ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తే్తనే న్యాయస్థానం బాధపడిపోయింది. కానీ, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరాధారమైన అరెస్టుల కారణంగా, వారు ఏళ్ల తరబడి నిర్బంధంలో మగ్గుతున్నారు. వారి తక్షణ విడుదలకు, రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడటం లేదు. ఇవి న్యాయస్థాన చరిత్రలో చెరగని మచ్చలుగా మిగిలిపోతున్నాయి. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది! అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను, ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను, అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు. ‘దురదృష్టవశాత్తు దక్షిణాసియా రాజ కీయ నాయకత్వానికి పరిణామాలను ముందుగానే పసిగట్టగల దార్శనికత గానీ, సమయానికి మేల్కొని అన్నిరకాల మత దురభిమా నాలకు వ్యతిరేకంగా నిలబడేట్టు చేయగల సత్తాగానీ లేకుండా పోయింది. రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంత పాలకులు మత దురభి మానాలనూ ప్రజల్లో పరస్పర విద్వేషాలనూ, అసహనాన్నీ కడు వేగంగా వ్యాపింపజేస్తున్నారు. దీని ఫలితంగా ఆయా సమాజాల్లో జరిగే కాసింత మంచి విషయం కూడా నిలువునా దగ్ధమవుతోంది. ఈ దుష్పరిణామం దక్షిణాసియాలో భాగమైన భారత ప్రజలు కోరుకుం టున్న సామాజిక, ఆర్థికాభివృద్ధి అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. దేశ విభజన జరిగిన 75 సంవత్సరాల తర్వాత కూడా భారత ప్రజల మధ్య సఖ్యత కొరవడటమే కాదు, విభిన్న మతాల మధ్య సహజీవ నానికి, సహిష్ణుతలకు సైతం నేడు పెను ప్రమాదం దాపురించిందని గమనించాలి.’’ – ప్రొ‘‘ సయద్ మునీర్ ఖస్రూ, చైర్మన్, ‘ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ, అడ్వొకసీ అండ్ గవర్నెన్స్’ న్యూఢిల్లీ, పలు దేశాల్లో విద్యాధిక సలహాదారు ప్రొఫెసర్ మునీర్ ఖస్రూ హెచ్చరిస్తున్న ప్రమాదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా సుప్రసిద్ధ హేతువాది నరేంద్ర దాభోల్కర్ హత్య కని పిస్తుంది. ఈయన హత్య జరిగి ఎనిమిదేళ్లయింది, ప్రసిద్ధ సామాజిక సేవకురాలు, హేతువాద పత్రిక ‘లంకేశ్’ సంపాదకురాలైన గౌరీ లంకేశ్ హత్య జరిగి నాలుగేళ్లయింది. కానీ వీరిద్దరి హంతకుల ఆచూకీ గురించిన విచారణ తతంగం ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. ఇలాంటి అనేక అంశాల కారణంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తన పరువుకు సంబంధించిన అగ్నిపరీక్షను ప్రస్తుతం ఎదుర్కొన బోతోంది! దేశంలోని పలు జైళ్లలో దీర్ఘకాలంగా మగ్గుతున్న నిందితు లకు న్యాయస్థానాలు జారీచేస్తున్న బెయిల్ ఉత్తర్వులను కూడా సకా లంలో సంబంధిత అధికారులకు అందజేయడంలో జాప్యం జరుగు తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానిస్తూ, అండర్ ట్రయల్ ఖైదీల బెయిల్ విషయంలో జాప్యం అనేది మానవ స్వేచ్ఛను ఉల్లంఘించడంగా విమర్శించవలసి వచ్చింది. అంతేకాదు, నేటి సాంకేతికయుగంలో కూడా కోర్టుల ఆదేశాలను జారీ చేయడానికి అవలంబిస్తున్న విధా నాలను ఆయన తప్పు పట్టారు. పాతకాలంలో పాలకుల ఉత్తర్వులు జారీచేయడానికి ఎగిరి వచ్చే పావురాల కోసం అప్పట్లో ఎదురు చూసేవారు కదా! అయితే నేటికాలంలో కూడా మంజూరైన బెయిల్ కోసం ఇంకా నిందితులు ఆకాశంవైపు మోరలెత్తి ఎదురు చూడడం హాస్యాస్పదమని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించవలసి వచ్చింది! హేతువాద, ప్రజా ఉద్యమాల నాయకులైన దాభోల్కర్, గౌరీ లంకేశ్, ప్రొఫెసర్ కల్బుర్గి, గోవింద పన్సారేల దారుణ హత్యల ఉదంతం కానీ, ప్రజాఉద్యమాలకు అండగా నిలిచిన పలువురు పత్రికా విలేక రులపై జరిగిన హత్యా ఘటనలు కానీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ హత్యలకు కారకులను బహిర్గతం చేసి శిక్షించడంలో కూడా సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంతమంది ప్రజా కార్యకర్తలు, జర్నలిస్టులపై దారుణ హత్యలు నమోదై ఉండగా ఒక బాలీవుడ్ సూపర్స్టార్ కొడుకు ఆర్యన్, ఆర్థర్రోడ్ జైలునుంచి విడుదల కావడానికి కోర్టు ఉత్తర్వు జారీ ప్రక్రియలో ఆలస్యంతో ఒకే ఒక్కరోజు అదనంగా గడపవలసివస్తేనే న్యాయస్థానం బాధపడి పోయింది. అదే సమయంలో, ప్రజాకార్యకర్తలపై, జర్నలిస్టులపై నిరా ధారమైన అరెస్టులతో వారు సంవత్సరాల తరబడిగా నిర్బంధంలో మగ్గిపోతున్నారు, ఇలాంటివారి తక్షణ విడుదలకు రక్షణకు గౌరవ న్యాయస్థానం ఇప్పటిదాకా పూచీపడకపోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు న్యాయస్థాన చరిత్రలో చెరపరాని మచ్చగా మిగిలిపోతున్నాయి. ఇది ప్రజాతంత్రవాదులకు, న్యాయస్థానాల పట్ల ఇంకా గౌరవం మిగుల్చుకున్న ప్రజాస్వామ్యవాదులకు మనస్తాపం కల్గించే పరిణామం. ఈ అంశంపై దేశ ఉన్నత న్యాయస్థానం గుర్తించి తిరుగులేని నిర్ణయానికి రాగలదని ఆశిస్తున్నాం. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, పౌరుల సమాచారహక్కు చట్టాలు లేక కాదు... ఉన్న చట్టాలను చాపచుట్టి నేలమాళిగల్లో భద్ర పరిచే ఏర్పాట్లకు కేంద్ర పాలకులు సిద్ధమయ్యారు. అందుకనే ఇప్పటిదాకా (11–10–2021) ఈ చట్టం అమలులోకి రాకుండా చేసినందున దాదాపుగా 2 లక్షల ఆర్టీఐ కేసులు పరిష్కారం కాకుండా నిలిచిపోవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం గుర్తించి చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్టాన్ని అమలుపర్చవలసిన సమాచార కమిషన్లకు సిబ్బంది లేరన్న సాకు ఎంతవరకు నిజమో, అందుకు కారణాలేమిటో గౌరవ సుప్రీంకోర్టు మొహమాటం లేకుండా పరిశీలించాల్సి ఉంది! అంతేకాదు, దేశ పౌరుల సమాచార హక్కును నిరాకరిస్తే, అది పౌరుల ప్రాథమిక హక్కుల్ని నిరాకరించిన ట్లే. పైగా ‘జాతీయ భద్రత’ పేరు చాటున ‘పెగసస్’ లాంటి విదేశీ నిఘా సాఫ్ట్వేర్ కార్య కలాపాలను దేశంలో అనుమతించబోమని, ఇది దేశ భద్రతకు సంబం ధించిన సమస్య అనీ, అందువల్ల ప్రభుత్వ వాదనను విశ్వసించ బోమని సుప్రీంకోర్టుæ ధర్మాసనం స్పష్టం చేయవలసివచ్చింది! పైగా, ఈ విషయానికి సంబంధించినంతవరకూ, ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల సంతలో న్యాయస్థానం తలదూర్చబోదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. తన నిర్ణయానికి అనుగుణంగానే 1973 నాటి ‘కేశవానంద భారతి’ కేసులో జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా చెప్పిన తీర్పును చీఫ్ జస్టిస్ ఉటంకించాల్సి వచ్చింది. జస్టిస్ ఖన్నా ఆనాడు ‘న్యాయమూర్తుల ప్రాథమిక బాధ్యత భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్భయంగాను లేదా సానుకూలంగానూ గౌరవించడమే... అలా చేయడంలో వారు ఒక రాజకీయ సిద్ధాంతాన్నో లేదా ఏదో ఒక ఆర్థిక సిద్ధాంతాన్నో అనుసరించి తమ నిర్ణయాన్ని ప్రకటించరాద’ని అన్నారు. అయితే దేశ రాజకీయ, ఆర్థిక విధానాలపై ఒక అవగాహన, స్పష్టతలేని న్యాయమూర్తుల పట్ల, వారి తీర్పుల పట్ల జస్టిస్ కృష్ణయ్యర్ తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. అలాగే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కూడా ‘పెగసస్’ నిఘా సాఫ్ట్వేర్ని రూపొం దించిన ఎస్ఓఎస్ భారత పాలకుల అనుమతితో ఇండియాలో సాగి స్తున్న గూఢచర్యం విషయంలో, భారత పౌరుల రాజ్యాంగ హక్కుల రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం హర్షించదగ్గ పరి ణామం. పాలకుల విధాన నిర్ణయాల వల్ల దేశ పౌరుల రాజ్యాంగ హక్కులకు కలుగుతున్న ప్రమాదం పట్ల న్యాయస్థానం మూగనోము పట్టజాలదని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ స్పష్టతకు అనుగుణంగానే, అక్రమకేసులు, అక్రమ అరెస్టుల మూలంగా జైళ్ల లోపల, వెలుపల కూడా నిరవధికంగా మగ్గుతున్న ప్రజాకార్యకర్తలను ఉద్యమకారులను, కవులను, జర్నలిస్టులను, కళాకారులను అందరినీ విడుదల చేయించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించరాదు. ఈ బాధ్యతను తప్పకుండా చేపట్టాలని చీఫ్ జస్టిస్కు ప్రజాపక్షంగా ఇదే మా విజ్ఞాపన! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆర్యన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు
ముంబై: ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని పెంచుతోంది. షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ని కిడ్నాప్ చేసి కోట్లు దండుకోవాలని కుట్రపన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రకి బీజేపీ నేత మోహిత్ భారతీయ ప్రధాన సూత్రధారని ఆరోపించారు. మాలిక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే కూడా కుట్రలో భాగస్వామేనని అన్నారు. క్రూయిజ్ నౌకపై దాడి జరగడానికి ముందు ఒషివరలోని ఒక శ్మశాన వాటిక వద్ద మోహిత్ను వాంఖెడే కలిశారన్నారు. అయితే వాంఖెడేకి అదృష్టం కలిసి వచ్చి సీసీటీవీ ఫుటేజీ దొరకలేదన్నారు. అయితే తనను ఎక్కడ ఇరికిస్తారోనన్న భయంతో వాంఖెడే డ్రగ్స్ కేసును ఆర్యన్పై బనాయించారన్నారు. వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో మోహిత్ కూడా ఒక సభ్యుడని మాలిక్ ఆరోపించారు. జర్నలిస్టు ఆర్కె బజాజ్, అడ్వకేట్ ప్రదీప్ నంబియార్లు వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో ఉన్నారన్నారు. ‘‘ఆర్యన్ని విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు అడిగారు డీల్ రూ.18 కోట్లకు కుదిరింది. రూ.50 లక్షలు షారూక్ ఇచ్చారు. కానీ కిరణ్ గోసవితో ఆర్యన్ సెల్ఫీ బయటకొచ్చి వారి కుట్ర భగ్నమైంది’’ అని మాలిక్ చెప్పుకొచ్చారు. ‘సిట్’ విచారణకు ఆర్యన్ ఖాన్ గైర్హాజరు డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట ఆదివారం విచారణకు హాజరు కాలేదు. జ్వరంతో బాధ పడుతున్నానని, అందుకే హాజరు కాలేకపోతున్నారని ఆర్యన్ వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్యన్ సోమవారం ‘సిట్’ ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహనిందితుడైన అర్బాజ్ మర్చంట్ను ఆదివారం సిట్ దాదాపు 9 గంటలు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో మాస్టర్మైండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై బీజేపీ యువ నేత సునీల్ పాటిల్ ఆదివారం పోలీస్ ‘సిట్’ ముందు విచారణకు హాజరయ్యాడు. -
ఆర్యన్ డ్రగ్స్ కేసు సూత్రధారి సునీల్: బీజేపీ
న్యూఢిల్లీ: ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో బీజేపీ సరికొత్త ఆరోపణలకు తెర తీసింది. డ్రగ్స్ క్రూయిజ్ కేసు వెనుక సూత్రధారి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో సన్నిహిత సంబంధాలున్న, ధూలెకి చెందిన సునీల్ పాటిల్ అనే వ్యక్తి అని ఆరోపించింది. మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని మహారాష్ట్ర బీజేపీ నాయకుడు మోహిత్ భారతీయ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నిజం బయటపడకుండా ఉండడం కోసమే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మీద ఆరోపణ చేస్తున్నారని అన్నారు. ఆర్యన్ విడుదల కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ఖాన్ నుంచి డబ్బులు దండుకోవడానికి సునీల్ స్కెచ్ వేశారని ఆరోపించారు. ఈ కేసులో ఎన్సీబీ సాక్షి అయిన ప్రైవేటు డిటెక్టివ్ కిరణ్ గోసావితో సునీల్కి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. క్రూయిజ్ నౌకపై ఎన్సీబీ దాడి చేయడానికి ముందు నుంచే గోసావి, శామ్ డిసౌజాతో సునీల్ పాటిల్ టచ్లో ఉన్నారని ఆరోపించారు. కాగా, ఆర్యన్కేసు విచారించడానికి ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం న్యూఢిల్లీ నుంచి శనివారం ముంబైకి చేరుకుంది. ఐపీఎస్ అధికారి సంజయ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. -
ఆర్యన్ కేసు నుంచి వాంఖెడే అవుట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు. ఆర్యన్ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ డ్రగ్స్తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్ నుంచి ఢిల్లీలోని ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసుల్ని విచారించడానికి ఎన్సీబీ సీనియర్ అధికారి సంజయ్ సింగ్ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్, నటుడు అర్మాన్ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని అందులో వాంఖెడే వాటా రూ.8 కోట్లు అంటూ ఈ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై వాంఖెడేపై శాఖాపరమైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక మంత్రి నవాబ్ మాలిక్ అడుగడుగునా వాంఖెడేపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్సీబీ మాత్రం డ్రగ్స్ కేసులో జాతీయ, అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని, దీనిపై లోతుగా విచారించడం కోసమే సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. వాంఖెడే ముంబై జోనల్ డీజీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయించుకున్నాడు. బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ ఇస్తూ ప్రతీ శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. బెయిల్ వచ్చి న తర్వాత తొలిసారి శుక్రవారం మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి ఆర్యన్ వచ్చాడు. -
బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరో కొత్త విషయం వెలుగులోకి..
ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ డిసౌజా మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నౌకపై దాడి చేసిన తర్వాత ఆర్యన్ఖాన్ను విడిచిపెట్టడానికి ఆ కేసులో సాక్షి అయిన కిరణ్ గోసావి షారూక్ఖాన్ మేనేజర్ పూజ దాడ్లాని దగ్గర నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఎన్సీబీ ఆర్యన్ను అరెస్ట్ చేయడంతో తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశారని ఈ డీల్కి మధ్యవర్తిత్వం వహించినట్టుగా అనుమానాలున్న శామ్విల్లి డిసౌజా ఆరోపించారు. ఆర్యన్ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారుల తరఫున మధ్యవర్తులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గుతేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ విషయాలన్నీ తెలిసిన తనని సిట్ అరెస్ట్ చేస్తుందన్న భయంతో బాంబే హైకోర్టులో శామ్ డిసౌజా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. కిరణ్ గోసవి, ప్రభాకర్ సాయిల్ ఈ కేసులో సాక్షులు కారని, వారే అసలు సిసలైన కుట్రదారులని డిసౌజా ఆరోపించారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
షారుక్ ఖాన్ బర్త్డే.. వెలిగిపోతున్న 'మన్నత్'
Shah Rukh Khan Birthday Mannat Decorated With Lights: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇల్లు మన్నత్ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మన్నత్కు బహుమతులు పంపారు. ప్రతీ ఏటా దీపావళి సహా పండగలు, బర్త్డే వంటి స్పెషల్ అకేషన్స్ నాడు మన్నత్ను మరింత సుందరంగా ముస్తాబు చేస్తారు. అయితే కొడుకు ఆర్యన్ ఖాన్ జైళ్లో ఉండటంతోషారుక్ భార్య గౌరీ ఖాన్ పుట్టినరోజు సహా దసరా వేడుకలు కూడా జరుపుకోలేదు. అయితే ఇటీవల ఆర్యన్కు బెయిల్ రావడంతో బాద్షా కుటుంబంలో సంతోషం రెట్టింపయ్యింది. దీంతో షారుక్ 56వ బర్త్డేతో పాటు దీపావళి కూడా వస్తున్న నేపథ్యంలో మన్నత్ను అందంగా అలంకరించారు. అయితే ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్ ఖాన్ నిర్ణయించుకున్నారట. దీంతో సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని, ఆర్యన్ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని షారుక్ వారితో చెప్పినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఇంటికి చేరిన ఆర్యన్ఖాన్.. డోల్ భాజాలతో వెల్కమ్ చెప్పిన షారుక్ ఫ్యాన్స్
డ్రగ్స్ కేసులో అరెస్టైన దాదాపు నెల తర్వాత షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. శనివారం బాద్ షా, గౌరీ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకువచ్చారు. ఈ స్టార్ కిడ్ ఇంటికి వస్తున్న విషయం తెలిసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మన్నత్లోని ఇంటి ముందు బ్యానర్స్ పట్టుకుని వేచి ఉన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన ‘ప్రిన్స్’ ఆర్యన్ ఖాన్కు అంటూ ఈ స్టార్కిడ్కి స్వాగతం పలికారు ఫ్యాన్స్. డోల్ బాజాలు వాయించి ఉత్సాహంగా అతను కనిపిస్తాడేమో అరిచారు. అయితే, ఆర్యన్ కారు నేరుగా ఇంటి లోపలికి వెళ్లడంతో మన్నత్ వెలుపల గుమిగూడిన అభిమానులు ఆర్యన్ను చూడలేకపోయారు. అయిన కొంచెం కూడా నిరాశ చెందకుండా అరుస్తూ తమ ఆనందాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోని ఎవరో అభిమాని సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అంతేకాకుండా ఇంటి ముందు ఓ బాబా హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియో సైతం ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
ఆర్యన్కి బెయిల్.. లీగల్ టీంతో పార్టీ చేసుకున్న షారుక్
బాలీవుడ్ నటుడు షారుక్ తనయుడు ఆర్యన్ఖాన్ ముంబై డ్రగ్స్ కేసులో అక్టోబర్ మొదటి వారంలో అరెస్టైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు సార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య దాదాపు నాలుగు వారాల తర్వాత బెయిల్ అక్టోబర్ 28న బెయిల్ మంజూరైంది. ఆర్యన్ బెయిల్ గురించి లాయర్ సతీష్ మనేషిండే మట్లాడుతూ.. ‘అరెస్టు అయినప్పుడు ఆర్యన్ దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు. అతను మత్తు పదార్థాలు తీసుకోలేదు. దానికి ఎటువంటి సాక్ష్యం కూడా లేదని మేము వాదించడంతో సమ్మతించిన జస్టిస్ నితిన్ సాంబ్రే బెయిల్ మంజూరు చేశారు. సత్యమేవ జయతే’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్యన్కి బెయిల్ కోసం షారుక్ మేనేజర్ పూజా దద్లనీ, లీగల్ టీం సతీష్ మనేషిండే బృందం ఎంతో కృషి చేసింది. దీంతో ఎంతో సంతోషంలో ఉన్న షారుక్ వారికి పార్టీ ఇచ్చాడని తెలుస్తోంది. ఆర్యన్ అరెస్టు తర్వాత లీగల్ టీంతో కలిసి మీడియాకి నవ్వుతూ ఫోటోలకి ఫోజులిచ్చాడు బాద్ షా. అంతేకాకుండా మరో పక్క ఆయన అభిమానులు సైతం స్టార్ ఇంటి వద్ద బాణాసంచా తమ సంతోషాన్ని తెలియజేశారు. చదవండి: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. మన్నత్లో సంబరాలు -
జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల
-
ఆర్యన్ ఖాన్ విడుదల.. ఇప్పటివరకు ఏం జరిగిందంటే?
Aryan Khan Released from Arthur Road Jail: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే ఆర్థర్ రోడ్ జైలు వద్దకు చేరుకున్న షారుక్ ఖాన్ కొడుకును ఇంటికి తీసుకురానున్నారు. దీంతో మన్నత్లో సందడి వాతావరణం నెలకొంది. 28రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్ బయటకు వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు షారుక్ అభిమానులు భారీగా మన్నత్కు చేరుకున్నారు. 'వెల్కం ఆర్యన్' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్కు షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏం జరిగిందంటే.. ► అక్టోబర్ 2: ముంబై తీరంలోని గోవాకు చెందిన కొర్డెలియా క్రూయిజ్లో రేవ్పార్టీపై ఎన్సీబీ దాడులు చేసి షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్తో సహా 14 మందిని అదుపులోనికి తీసుకుంది. ► అక్టోబర్ 4: ఆ 14 మందిలో ఆర్యన్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ ప్రకటించింది. అక్టోబర్ 7 వరకు నిందితులు ఎన్సీబీ కస్టడీలోనే ఉన్నారు ► అక్టోబర్ 7: ఎన్సీబీ ఇక కస్టడీ అవసరం లేదని చెప్పడంతో కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ► అక్టోబర్ 8: ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకి ఆర్యన్ని తరలించారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ► అక్టోబర్ 11: ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఏర్పాటైన ముంబై ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ సమర్పించారు ► అక్టోబర్ 13–20: ఆ కోర్టులోనూ బెయిల్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి 20వ తేదీన ఆర్యన్కు బెయిల్ తిరస్కరించింది. ► అక్టోబర్ 21: ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ను షారూక్ఖాన్ కలుసుకున్నారు. ఆర్యన్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబరు 30 వరకు పొడిగించారు ►అక్టోబర్ 26–28: బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్పై వాదనలు ► అక్టోబర్ 28: ఆర్యన్ఖాన్, ఇద్దరు సహ నిందితులకు బెయిల్ మంజూరు చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి -
మరో రోజు జైల్లోనే
-
ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి
What Does It Mean for Juhi Chawla and Aryan Khan?: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కీలక పాత్ర పోషించారు. ఆర్యన్కు బెయిల్ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చారు. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్ బెయిల్కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్ పేపర్లపై సంతకం చేశారు. బాండ్పై సంతకం చేసిన అనంతరం బయటకు వచ్చిన జూహీ చావ్లా మీడియాతో మాట్లాడారు. చదవండి: బెయిల్ వచ్చినా జైలులోనే ఆర్యన్ ఖాన్.. ఈ మేరకు ఆమె మీడియాతో ‘ఇప్పడు ఆర్యన్ బయటకు రావడం ముఖ్యం. అదే పదివేలు’ అని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఆర్యన్ డబ్బు చెల్లించడంలో విఫలమైనా, అతడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దీనికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాగా షారుక్ ఖాన్, జూహ్లీ చావ్లా కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కలయికలో బి-టౌన్కు పలు బ్లాక్బస్టర్ చిత్రాలను అందించారు. అంతేగాక వీరిద్దరూ ఇప్పుడు ఐపీఎల్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్(కేకేఆర్) టీం ఫ్రాంఛైజీ పార్ట్నర్స్గా కూడా వ్యవహరిస్తున్నారు. చదవండి: పునీత్ రాజ్కుమార్ మృతి, షాక్లో భారత సినీ పరిశ్రమ ఈ కేసులో గురువారం ఆర్యన్ బెయిల్ పటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పత్రాలు ఆర్యన్ ఉన్న ఆర్థర్ రోడ్ జైలుకు పంపించాలంటే షూరిటీ సంతకాలు కీలకం. ఎందుకంటే ఆర్యన్ తరపున చట్టపరమైన బాధ్యత తీసుకుంటూ ప్రముఖులైన బయటి వ్యక్తులు ఇద్దరూ పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్యన్ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి. -
బెయిల్ వచ్చినా జైలులోనే ఆర్యన్ ఖాన్..
Aryan Khan Still In Jail Even After Get Bail: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. గురువారం ఆర్యన్ బెయిల్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడితో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజురూ చేసింది. దీంతో ఆర్యన్ ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతాడని అందరూ ఆశించారు. కానీ చూస్తుంటే ఆర్యన్ ఈరోజు, రేపు కూడా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఆర్యన్ విడుదల అవ్వాల్సి ఉంగా ఇప్పటీ వరకు అతడి బెయిల్ ఆర్డర్ జైలుకు చేరలేదు. చదవండి: ఆర్యన్ ఖాన్కు బాంబే హైకోర్టు షరతులు ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు బెయిల్ పత్రాల ప్రక్రియకు డెడ్లైన్ కానీ అతడి అది పూర్తి కాలేదు. దీంతో ఆర్యన్ విడుదల విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్ -
ఆర్యన్ ఖాన్కు బాంబే హైకోర్టు షరతులు
ముంబై: ఎట్టకేలకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు అయ్యింది. గురువారం ఆర్యన్ బెయిల్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజురూ చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. దేశం వదిలి వెళ్లకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్కు గురువారం బెయిల్ రావడంతో షారుక్ కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Aryan Khan Drugs Case : విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని అరెస్ట్.. -
ఆర్యన్ఖాన్కు బెయిల్
ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్లో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆర్యన్ఖాన్ అరెస్టయిన 25 రోజులు తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే గురువారం తీర్పు చెప్పారు. ఆర్యన్ సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ‘‘వారి ముగ్గురి బెయిల్ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను. శుక్రవారం సాయంత్రానికి వివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాను’’ జస్టిస్ సాంబ్రే చెప్పారు. ఇంకా పూర్తి ఉత్తర్వులు రాకపోవడంతో శుక్రవారం లేదంటే శనివారంనాడు ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. వాదనలు సాగిందిలా.. ఆర్యన్ బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు సాగాయి. ఇప్పటికే రెండుసార్లు ఆర్యన్కు కింది కోర్టుల్లో చుక్కెదురు కావడంతో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని లాయర్గా నియమించారు. క్రూయిజ్పై ఎన్సీబీ అధికారులు దాడి చేసినప్పుడు ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. ఈ విషయాన్నే ఆయన తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ పదే పదే ప్రస్తావించారు. వైద్య పరీక్షల్లో కూడా ఆర్యన్ డ్రగ్స్ సేవించాడనేది రుజువు కాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అలాంటప్పుడు ఆర్యన్ను అదుపులోనికి తీసుకోవడం అర్థరహితమని వాదించారు. రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణలను ఆధారం చేసుకొని ఆర్యన్ చుట్టూ ఉచ్చు బిగించాలని చూశారని, కానీ ఆ సంభాషణల్లో కూడా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అర్బాజ్ ధరించిన షూలో డ్రగ్స్ లభిస్తే ఆర్యన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని రోహత్గీ తన వాదనల్లో గట్టిగా ప్రశ్నించారు. మరోవైపు ఎన్సీబీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాలను తరచుగా సేవిస్తారని చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్యన్ అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారని తన వాదనల్లో పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతలతో ఆర్యన్కి సంబంధాలున్నాయని అనిల్ సింగ్ ఆరోపించారు. డ్రగ్స్తో వ్యాపారం చేసే స్థాయిలో పెద్ద మొత్తంలో ఆర్యన్ కొనుగోలు చేస్తున్నాడని అతని వాట్సాప్ సంభాషణల ద్వారా తేటతెల్లమవుతోందని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందని అందుకే అతనికి బెయిల్ ఇవ్వొద్దని అనిల్ సింగ్ వాదించారు. క్రూయిజ్పై దాడి జరిగిన సమయంలో ఎక్కువమంది దగ్గర వివిధ రకాల మాదకద్రవ్యాలు లభించాయని వీటన్నింటినీ చూస్తుంటే ఆర్యన్ డ్రగ్స్ విషయం గురించి పూర్తిగా తెలుసునని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అన్నీ తెలిసి కూడా అక్కడ ఉండడం నేరపూరితమైన చర్యేనని వాదించారు. దీనికి రోహత్గీ గట్టిగా కౌంటర్ ఇస్తూ క్రూయిజ్లో 1,300 మంది ఉన్నారని గుర్తు చేశారు. తాజ్ హోటల్లో 500 గదులుంటే, రెండు గదుల్లో ఉన్న వారు డ్రగ్స్ సేవిస్తే మొత్తం హోటల్లో ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్యన్ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడలేదని, ఒక నవ యువకుడ్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పకడ్బందీగా వాదనలు వినిపించారు. లాయర్ రోహత్గీ వాదనలు విన్న న్యాయమూర్తి ముగ్గురికీ బెయిల్ ఇస్తానని ప్రకటించి, తీర్పు పూర్తి పాఠాన్ని శుక్రవారం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్యన్కు బెయిల్పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ‘‘సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా’’..అంటూ స్పందించగా, ‘‘నాకిది చాలా సాధారణమైన కేసు. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. కానీ ఆర్యన్కు బెయిల్ రావడం సంతోషంగా ఉందని సీనియర్ లాయర్ ముకుల్ రొహత్గీ అన్నారు. న్యాయం జరగాల్సిన సమయం వస్తే, సాక్ష్యాలతో పని ఉండదు అని నటుడు సోనూసూద్ పేర్కొనగా ‘‘అంతా దేవుడి దయ. ఒక తండ్రిగా ఊపిరిపీల్చుకుంటున్నాను. ఇక వాళ్లకి అంతా మంచే జరగాలి’’అని మరో నటుడు ఆర్.మాధవన్ ఆకాంక్షించారు. 2018 నాటి చీటింగ్ కేసులో గోసవి అరెస్ట్ పుణె: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సాక్షిగా ప్రవేశపెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసవిని గురువారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతడిపై నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కొన్నాళ్లుగా పరారీలో ఉన్న గోసవి పోలీసులకు లొంగిపోకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తలదాచుకుంటూ వస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఆ తరవాత అతనిని పుణె కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన బాలీవుడ్ సూపర్స్టార్ షారూక్ఖాన్ కుమారుడే ఆర్యన్తో కలిసి గోసవి దిగిన సెల్ఫీలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. 2018లో గోసవిపై నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు పుణె పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు. కత్రజ్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సచిన్ పాటిల్ పేరుతో అతడు ఆ హోటల్లో ఉంటున్నాడు. నోటీసులివ్వకుండా వాంఖెడేని అరెస్ట్ చేయం ఆర్యన్ ఖాన్ విడుదలకు ముడుపులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి మూడు రోజుల ముందుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయమని ముంబై పోలీసులు హైకోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు తనని అరెస్ట్ చేస్తారన్న భయం వెంటాడుతోందంటూ వాంఖెడే కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వాంఖెడే దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ ఎస్వి కొత్వాల్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, ముంబై పోలీసులు ఈ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందని వాంఖెడే ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ ముందస్తు నోటీసు లేకుండా వాంఖెడేని అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. మరోవైపు తమ కుటుంబంపైనా, వ్యక్తిగత జీవితంపైనా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ వాంఖెడే భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తమకు న్యాయం చెయ్యాలంటూ ఆమె ఆ లేఖలో కోరారు. -
ఆర్యన్కు బెయిల్: ‘సినిమా అప్పుడే అయిపోలేదు’
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ ఖాన్కి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 20 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. మూడు సార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు.. నేడు ఆర్యన్కి ఊరట కలిగించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యన్కు బెయిల్ వచ్చిన సందర్భంగా నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. (చదవండి: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్) ఆర్యన్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. అది కూడా షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై మేరా దోస్త్’(సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా) అంటూ ట్వీట్ చేశారు. ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఇలా ట్వీట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. (చదవండి: ఆర్యన్ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు) पिक्चर अभी बाकी है मेरे दोस्त — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021 సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్వీ సంబ్రే.. ఆర్యన్తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సంబ్రే ‘‘మూడు అభ్యర్ధనలు అనుమతించాను. రేపు సాయంత్రంలోగా నేను వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తాను’’ అని తెలిపారు. చదవండి: ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ -
ఆర్యన్ ఖాన్కు బెయిల్: ‘ఇలాంటి కేసులు మాకు మామూలే’
ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తన కుమారుడు ఆర్యన్ను జైలు నుంచి విడిపించేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మాజీ అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సాయంతో ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. బాంబే హైకోర్టు గురువారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ తరపున ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు తీర్పుపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి కేసులు తమకు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. ‘కోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆర్యన్ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు జైలు నుండి విడుదలవుతారు. ఇలాంటి కేసులు నాకు సర్వసాధారణం. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. అతనికి (ఆర్యన్ ఖాన్) బెయిల్ లభించినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. కోర్టు తీర్పుకు సంబంధించిన ఆర్డర్ కాపీ శుక్రవారం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్యన్ఖాన్తో పాటు మిగతా ఇద్దరు రేపు విడుదల అవుతారని.. ఒకవేళ ఆలస్యం జరిగితే శనివారం జైలు నుంచి బయటకు వస్తారని తెలిపారు. కాగా, ఆర్యన్ ఖాన్కు బెయిల్ రావడంతో అతడి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. (చదవండి: ముంబై మాదక ద్రవ్యాల కేసులో రోజుకో కొత్త మలుపు) -
ఆర్యన్ ఖాన్కు బెయిల్, ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ లభించడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పలువురు ఖాన్ ఫ్యాన్స్కూడా సోషల్మీడియా ద్వారా స్పందిస్తున్నారు. (Aryan Khan Drugs Case: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్) ఆ దేవునికి ధన్యవాదాలు. ఒక తండ్రిగా చాలా రిలీఫ్ పొందుతున్నాను. అంతా మంచిగా, సానుకూలంగా జరగాలని ఆశిస్తున్నానంటూ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు. అలాగే కాలమే తీర్పు చెబితే సాక్షులతో అవసరం లేదంటూ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, తదితరులు ట్విటర్ ద్వారా సంతోషాన్ని ప్రకటించారు.(Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ) ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియమించు కోలేరు. అంటే దీనర్థం అండర్ ట్రయల్ గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా అని ప్రశ్నించారు. అంతేకాదు ఇన్నాళ్లు ఆర్యన్కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా, అందుకే అనవసరంగా ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా? అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. కాగా ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన ఆర్యన్ ఖాన్కు గురువారం బెయిల్ లభించింది. దాదాపు మూడు వారాల తరువాత ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. So if It just took Mukul Rahtogi’s argument, to get bail for Aryan , does it mean his earlier lawyers were so incompetent that he had to spend so many days in jail needlessly? — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021 Thank god . As a father I am So relieved .. … May all good and positive things happen. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 28, 2021 FINALLY ! 👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/2zW4ldEqpW — Swara Bhasker (@ReallySwara) October 28, 2021 -
ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్
-
ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్
ఎట్టకేలకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ రోజు ఆర్యన్ బెయిల్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజురూ చేసింది. ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఎన్సీబీ తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు ఆర్యన్తో పాటు మోడల్ మున్మున్ ధమేచ, ఆర్భాజ్ మర్చంట్కు కూడా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆర్యన్ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్కు బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు ‘బాద్షా’ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం ఈ నెల అక్టోబర్ 2వ తేదీ అర్థరాత్రి క్రూయిజ్ ఓడరేవు డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖిలో ఆర్యన్తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆర్యన్ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడి బెయిల్ పిటిషన్కు ముంబై కోర్టు మూడు స్లార్లు కొట్టివేసింది. దీంతో ఆర్యన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా చివరికి అతడికి ఊరట లభించింది. ఆర్యన్ బెయిల్ పటిషన్పై మూడు రోజుల విచారణ అనంతరం హైకోర్టు నేడు(గురువారం) ఆర్యన్తో పాటు మరో ఇద్దరికి బెయిల్ ఇచ్చింది. (Aryan Khan bail: ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు) చదవండి: ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ -
Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ
-
ఆయన ఉండి ఉంటే: సీఎంకు నటి క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో కుమారుడు డ్రగ్స్ కేసు ప్రకంపనలు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసి సంచలనం రేపిన ఎన్సీబీ ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖడేపై వేటు వేసుందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భార్య క్రాంతి రేడ్కర్ వాంఖడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ మధ్య ముదురుతున్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. మరాఠీ ప్రజల సమాన హక్కుల కోసం పోరాడుతున్న శివసేనను చూస్తూ పెరిగిన మరాఠీ అమ్మాయినైనా తాను ప్రతీరోజు అవమానాల పాలు కావాల్సి వస్తోందని, ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలాసాహెబ్ రాష్ట్రంలో ఒక మహిళకు తీరని అవమానం జరుగుతోందని క్రాంతి వాపోయారు. ఈ రోజు బాలాసాహెబ్ ఇక్కడ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. బాలాసాహెబ్ ఠాక్రేల సిద్ధాంతాలను గౌరవిస్తూ పెరిగాను. ఎవరికీ అన్యాయం చేయకూడదని, అన్యాయాన్ని అస్సలు సహించకూడదని ఆ నేతలంతా తనకు నేర్పించారని ఆమె అన్నారు. బాలాసాబ్లో మిమ్మల్ని చూసుకుంటున్నానంటూ సీఎం ఠాక్రే నుద్దేశించి లేఖ రాశారు. తన కుటుంబానికి అన్యాయం చేయరనే విశ్వాసాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన క్రాంతి ఎన్సీబీ అధికారి, తన భర్త సమీర్ వాంఖడేకు న్యాయం చేయాలని కోరారు. అలాగే సీఎం అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. సమీర్ పనిచేయడం, చాలా మందికి నచ్చడం లేదని, డ్రగ్స్ ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ను తొలిగించాలని భావిస్తున్నారని, తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని క్రాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాలిక్ ఆరోపణలను ఖండించిన సమీర్ వాంఖడే సోదరి, న్యాయవాది యాస్మీన్ గురువారం ముంబై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ మాలిక్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వక ఫిర్యాదును ఆమె సమర్పించారు. అయితే ఆమె ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కాగా ఆర్యన్ ఖాన్ కేసులో విచారణకు నాయకత్వం వహిస్తున్న ఎన్సిబి అధికారి సమీర్ వాంఖడే దోపిడీ, అక్రమ ట్యాపింగ్, పత్రాల ఫోర్జరీ ఆరోపణలు వెల్లు వెత్తాయి. క్రూయిజ్ షిప్ వివాదంలో ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని ఒక సాక్షి ఆరోపించి అఫిడవిట్ దాఖలు చేయడంతో సమీర్ వాంఖడేపై విచారణకు ఆదేశించింది. దీనికి తోడు మంత్రి నవాబ్మాలిక్ కూడా సమీర్పై ఆరోపణలకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం మోసపూరితంగా జనన , మరియు, కుల ధృవీకరణ పత్రాన్ని పొందాడని ఆరోపించారు. మరోవైపు సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేసి ఎన్సీబీ దాడులు చేస్తోందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. माननीय उद्धव ठाकरे साहेब @CMOMaharashtra पत्रास करण की … pic.twitter.com/0VJxURk5oi — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 28, 2021 -
ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో విట్నెస్ కిరణ్ గోసవి అరెస్ట్
-
ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
Kiran Gosavi, NCB Witness In Aryan Khan Case, Arrest: ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. ఆర్యన్ అరెస్ట్ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కారణ్ గోసవి ఇటీవలె ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన కిరణ్ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్ని సాక్షులుగా చేర్చి విచారించింది. చదవండి: ఆర్యన్కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. ఆర్యన్ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాతో తెగ వైరల్ అయ్యింది. అయితే తర్వాత గోసవి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా ఇటీవలె మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ఖాన్ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. చదవండి: Aryan Khan: ఆర్యన్ను వదిలేయడానికి రూ.25 కోట్లు? వాంఖెడే X నవాబ్ మాలిక్ -
వాంఖెడే X నవాబ్ మాలిక్
ముంబై: ముంబై తీరంలోని నౌకలో మాదకద్రవ్యాలు లభించిన కేసులో ఇప్పుడు అందరి దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపైనే ఉంది. వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణలకు సంబంధించి బుధవారం ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు మొదలైంది. ఈ కేసులో వాంఖెడేపై రోజుకొక కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి దందా, ఫోన్ ట్యాపింగ్, సాక్షుల్ని ముందే కూడగట్టారు, జన్మతః ముస్లిం వంటి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, సమీర్ వాంఖెడేపై మధ్య పోరాటంగా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. అయిదుగురు సభ్యులున్న విజిలెన్స్ దర్యాప్తు బృందం బుధవారం ఉదయం ముంబైకి చేరుకొని వాంఖెడేపై విచారణ మొదలు పెట్టింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) జ్ఞానేశ్వర్ సింగ్ అవినీతి అరోపణలపై సమీర్ వాంఖెడే స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టుగా మీడియాకి వెల్లడించారు. వాంఖెడే స్టేట్మెంట్ రికార్డు చేయడానికి నాలుగున్నర గంటలకు పైగా పట్టింది. ఎన్సీబీ కార్యాలయం నుంచి ఈ కేసుకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. అయితే వాంఖెడే తనపై వచ్చిన ఆరోపణలపై ఏమంటున్నారో ఆయన వెల్లడించలేదు. శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఇప్పుడే వివరాలను బయటపెట్టలేమన్నారు. అవసరమైతే వాంఖెడే నుంచి మళ్లీ సమాచారం సేకరిస్తామని జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఆర్యన్ఖాన్ని విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించిన సాక్షి ప్రభాకర్ సాయిల్ స్టేట్మెంట్ను ముంబై పోలీసులు రికార్డు చేశారు. సాయిల్ రికార్డు పూర్తి చేయడానికి వారికి ఎనిమిది గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం మొదలైన ప్రక్రియ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మరోవైపు సాయిల్కి ఎవరూ హాని తలపెట్టకుండా మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఆర్యన్ బెయిల్పై కొనసాగుతున్న వాదనలు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ బెయిల్ పిటిషన్పై వరసగా రెండోరోజు బుధవారం బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్యన్ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు కుట్ర చేశారని ఆరోపిస్తున్న ఎన్సీబీ ఈ అంశంలో అధికారికంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ ఎన్డబ్ల్యూ సాంబ్రే దృష్టికి లాయర్లు తీసుకువచ్చారు. అరెస్ట్ మెమోలో సరైన సాక్ష్యాధారాలేవీ లేవని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ చెప్పారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు తమ క్లయింట్లకు ఎందుకు ఇవ్వడం లేదని మరో న్యాయవాది అమిత్ దేశాయ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. షారుఖ్కు గతంలో జరిమానా! బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు సమీర్ వాంఖెడేతో పరిచయం కొత్తదేమీ కాదు. 2011లో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కాలంలోనే సమీర్... షారుఖ్కు చుక్కలు చూపించారు. అప్పట్లో హాలెండ్, లండన్లలో సెలవులు గడిపి ముంబైకి తిరిగివచ్చిన షారుఖ్ దగ్గర పరిమితికి మించిన అధిక బ్యాగేజీ ఉందని సమీర్ వాంఖెడే ఆయన్ను విచారించారు. రూ.1.5 లక్షల జరిమానా విధించి వదిలిపెట్టారు. -
ఆర్యన్ బెయిల్పై వీడని సస్పెన్స్.. విచారణ గురువారానికి వాయిదా
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై సస్పెన్స్ ఇంకా వీడలేదు. అతని తరుఫు న్యాయవాదులు వాదించిన తర్వాత ఎన్సీబీ తరపున లాయర్ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే వారి వాదనను రేపు వింటామని స్పష్టం చేసిన న్యాయమూర్తి విచారణను గురవారానికి వాయిదా వేశారు. దీంతో బాద్షా కుటుంబంతో పాటు అభిమానులు సైతం ఏ జరుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ కోర్టులో, ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో బెయిల్ రిజెక్ట్ కాగా.. ఈ సారి హైకోర్టులో బెయిల్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఆర్యన్ సెలబ్రిటీ కావడంతోనే ఈ కేసులో ఇరికించారు తప్ప అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవు. అధికారులు బెయిల్ను అడ్డుకునేందుకు ఆధారాలుగా చూపుతున్న వాట్సాప్ చాటింగ్స్ ఆరు నెలల క్రితానివి. అతను, అతని స్నేహితుడి వద్ద చాలా తక్కువ మెతాదులో డ్రగ్స్లో దొరికినందు వల్ల బెయిల్ ఇవ్వాలని’ తెలిపారు. అయితే గురువారమైన ఆర్యన్ బెయిలు విషయ ఓ కొలిక్కి వస్తుందో లేదో చూద్దాం. చదవండి: బాలీవుడ్ నటుల ఫోన్స్ని వాంఖడే ట్యాప్ చేశారు -
ఆర్యన్ఖాన్ నవ యవ్వనంలో ఉన్న బాధితుడు.. నిందితుడు కాదు
ముంబై: ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్ లభించిన కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ఖాన్ కుమారుడైన ఆర్యన్ఖాన్ బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఆర్యన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, అతని వద్ద మాదక ద్రవ్యాలున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దగ్గర ఆధారాలేవీ లేవని అతని తరఫు లాయర్లు ముకుల్ రోహత్గి, సతీష్ మానెషిండే వాదనలు వినిపించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.డబ్ల్యూ సాంబ్రె ఎదుట మంగళవారం రోజంతా ఆర్యన్ తరఫు లాయర్లు వాదించారు. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై వచ్చిన ముడుపుల ఆరోపణల అంశంలో కూడా ఆర్యన్కు ఎలాంటి ఫిర్యాదులు లేవని, అనవసర వివాదాల జోలికి అతను పోవడం లేదని లాయర్లు కోర్టుకు చెప్పారు. ఆ నౌకలో తక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైనా ఎన్సీబీ అరెస్ట్లు చేసిందని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం నవ యవ్వనంలో ఉన్న వారిని బాధితులుగా చూడాలే తప్ప, నిందితులుగా కాదని రోహత్గీ తన వాదనలు వినిపించారు. ఆర్యన్ గతంలో మాదకద్రవ్యాలు సేవించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని , అతనొక యువకుడని పేర్కొన్నారు. ఆర్యన్ దగ్గర డ్రగ్స్ లభించలేదని, అతను మాదక ద్రవ్యాలను సేవించాడని కూడా రుజువు కాలేదన్నారు. అర్బాజ్ వద్ద డ్రగ్స్ లభిస్తే అతని వెంట ఉన్న ఆర్యన్ని ఎలా అరెస్ట్ చేస్తారని రోహత్గి ప్రశ్నించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, అనవసర వివాదాలు తలెత్తి మీడియాలో ప్రాచుర్యం రావడం వల్ల ఈ కేసు పెద్దదిగా కనిపిస్తోందని, కానీ ఇది చాలా చిన్న కేసని రోహత్గి వాదించారు. (చదవండి: వివాహేతర సంబంధం: పిల్లలకు నిప్పంటించి..) ఆర్యన్తో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ పిటిషన్పైనా ఎన్సీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు బుధవారం కొనసాగనున్నాయి. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన మనీష్ రాజ్గరియా, అవిన్ సాహులకు మంగళవారం ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2న ముంబై తీరంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న సమయంలో ఎన్సీబీ 20 మందిని అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నౌకలో వీరిద్దరూ అతిథులుగా వచ్చారని ఎన్సీబీ చెప్పడంతో కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. మరోవైపు తన భర్త సమీర్ వాంఖెడే ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భార్య, నటీమణి క్రాంతి రేడ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైందని మంగళవారం ఆమె విలేకరులకు తెలిపారు. భయపడుతూ బతికే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త నీతి, నిజాయతీ పరుడైన ప్రభుత్వ అధికారి అని ఆమె తెలిపారు. ఫోన్ల అక్రమ ట్యాపింగ్: మాలిక్ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్, ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న సమీర్ వాంఖెడే కొంతమంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో డ్రగ్స్ కేసులో ఎన్సీబీ నవాబ్ మాలిక్ అల్లుడిని అరెస్ట్ చేసింది. అప్పట్నుంచి వాంఖెడేని లక్ష్యంగా చేసుకొని మాలిక్ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్నారు. ముంబై, పుణెలోని ఇద్దరి వ్యక్తుల సాయంతో కొందరి ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని, పోలీసుల నుంచి కాల్ రికార్డులు తెప్పించుకున్నారని ఆరోపించారు. వాంఖెడే అవినీతి, అక్రమాలపై తనకు ఎందరో లేఖలు రాశారని, వాటిని ఎన్సీబీ డీజీ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. మరోవైపు వాంఖెడే ఢిల్లీలోని ఎన్సీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి 2 గంటల సేపు అక్కడే ఉన్నారు. (చదవండి: బైక్పై చిన్నారులుంటే.. వేగం 40 కి.మీ. మించరాదు) -
ఆర్యన్ ఖాన్ కేసు: సీనియర్ లాయర్ రంగప్రవేశం.. ఎవరాయన?
ముంబై: తన కుమారుడిని ఎలాగైనా జైలు నుంచి విడిపించేందుకు బాలీవుడ్ అగ్ర నటుడు షారూఖ్ ఖాన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ను బెయిల్పై తీసుకువచ్చేందుకు మాజీ అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపారు. మంగళవారం బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున ఆయన వాదనలు వినిపించారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసుతో ఆర్యన్కు సంబంధం లేదనే కోణంలో ఆయన గట్టిగా వాదించారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ గురించి నెటిజనులు సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. (చదవండి: మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..) తలపండిన లాయర్ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అయిన ముకుల్ రోహత్గీ.. భారత్కు 14వ అటార్నీ జనరల్ (ఏజీ)గా 2014 నుంచి 2017 వరకు పనిచేశారు. అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్గానూ సేవలు అందించారు. 66 ఏళ్ల ఈ తలపండిన లాయర్.. పలు హైప్రొఫైల్, కీలక కేసులు వాదించారు. హైకోర్టు మాజీ జడ్జి కుమారుడు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అవధ్ బేహారీ రోహత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ.. 2002 గుజరాత్ అల్లర్లు, బెస్ట్ బేకరీ, జహీరా షేక్ ఎన్కౌంటర్ల కేసుల విచారణలో సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై సుప్రీంకోర్టులో పిటిషనర్ల తరపున ప్రాతినిథ్యం వహించారు. సభర్వాల్ శిష్యుడు ముకుల్ రోహత్గీ.. 1955, ఆగస్టు 17న ఢిల్లీలో జన్మించారు. ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన తర్వాత యోగేశ్ కుమార్ సభర్వాల్ వద్ద ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కొంత కాలం తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి లాయర్గా మంచి పేరు సంపాదించారు. 1993లో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 1999లో వాజపేయి ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ సతీమణి పేరు వసుధ, కుమారు పేరు సమీర్. (చదవండి: ఆర్యన్ను వదిలేయడానికి రూ.25 కోట్లు?) -
Aryan khan:బాలీవుడ్ నటుల ఫోన్స్ని వాంఖడే ట్యాప్ చేశారు: నవాబ్ మాలిక్
Aryan Khan Drug's Case: ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు. ఈ కేసులో ఆర్యన్ పెట్టిన బెయిల్ పిటిషన్ని ఇప్పటికే మూడు సార్లు రిజెక్ట్ చేయగా.. మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ఓ ముస్లీం అని, సర్టిఫికేట్లని ఫోర్జరీ చేసి తన మతం గురించి దాచాడని నవాబ్ ఆరోపించారు. ఆయన అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని తెలిపిన మంత్రి.. తాజాగా నవాబ్ మరోసారి వాంఖడేపై విరుచుకుపడ్డారు. వాంఖడే బాలీవుడ్ నటుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించాడు. అనంతరం డబ్బు డిమాండ్ చేసేవారన్నారు. దీనికి సంబంధించిన ఓ లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది పేరు లేని ఎన్సీబీ ఆఫీసర్ పేరుతో ఆయనకి పంపించారని అందులో తెలిపారు. దీన్ని వాంఖడేపై విచారణలో భాగం చేయాలని ఎన్సీబీ ఉన్నతాధికారులు రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: ‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు Here are the contents of the letter received by me from an unnamed NCB official. As a responsible citizen I will be forwarding this letter to DG Narcotics requesting him to include this letter in the investigation being conducted on Sameer Wankhede pic.twitter.com/SOClI3ntAn — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 26, 2021 -
ఆర్యన్కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే..
Aryan Khan Bail Petition: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ఖాన్ బెయిల్ పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్ బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం ఈసారైనా బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్పై ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. గతవారమే ఆర్యన్కు బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు షాకిచ్చింది. దీంతో ఈసారైనా బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఒకవేళ ఆర్యన్కు ఈ వారంలో బెయిల్ రాకపోతే మాత్రం అతను మరో 14 రోజుల పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే నెల1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కొడుకు అరెస్ట్తో షారుక్ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు సమాచారం. అటు షారుక్ఖాన్ భార్య గౌరీ ఖాన్ అయితే కొడుకు బెయిల్ కోసం నిత్యం ప్రార్థనలు చేస్తోందని, ఆర్యన్ విడుదల కావాలంటూ భగవతుండ్ని ప్రార్థించమని తన స్నేహితులకు కూడా విన్నవించుకుంటుందట. కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో స్వీట్స్ వండొద్దని ఇప్పటికే గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. పుట్టినరోజు, పండుగలను కూడా జరుపుకోవడం లేదు. కొడుకు ఇంటికి వచ్చాకే అన్ని పండుగలు అన్ని గౌరీ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. చదవండి: Aryan Khan: ఆర్యన్ ఖాన్కు బెయిల్ వస్తుందా? రాదా? ‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు -
ఆర్యన్ బెయిల్ విచారణ వాయిదా
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్కు బెయిల్ రద్దైంది. తాజాగా మంగళవారం మరోసారి ఆర్యన్ బెయిల్ పిటిషన్పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్ను అరెస్టు చేయడంలో అసలు అర్థం లేదని, ఆర్యన్ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఆర్యన్ వాట్సప్ చాట్ అంతా గతేడాదివేనని, తాజా కేసుతో ఆర్యన్కు సంబంధం లేదని తెలిపారు. అంతేగాక క్రూయిజ్ షిప్ దాడిలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని, ప్రదీప్ గబ్బా ఆహ్వానం మేరకే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఆర్యన్కు ఇప్పటి వరకు మెడికల్ టెస్ట్ చేయలేదని, ఇది ప్రీప్లాన్డ్గా జరిగిన అరెస్ట్ అని ముకుల్ రోహత్గీ వాదించారు. ఇదిలా ఉండే ఆర్యన్కు బెయిల్ను వ్యతిరేకిస్తూ ఎన్సీబీ అధికారులు ముంబై హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆర్యన్కు బెయిల్ ఇవ్వొద్దని, అతడికి డ్రగ్స్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ పిటిషన్లో పేర్కొంది. ఆర్యన్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ఎన్సీబీ తెలిపింది. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేపు ఆర్యన్కు బెయిల్ వస్తుందా? లేదా? తేలనుంది. డ్రగ్స్ కేసులో ఈ నెల 3న అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్షా తనయుడు.. అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. ఇప్పటికే రెండుసార్లు కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. -
‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు
న్యూఢిల్లీ: ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారంటూ ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సమర్పించిన అఫిడవిట్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వేగంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేతోపాటు మరికొందరు అధికారులపై ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ దర్యాప్తు కోసం ఎన్సీబీ ఉత్తర రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో త్రిసభ్య బృందం ఏర్పాటయ్యింది. జ్ఞానేశ్వర్ సింగ్ ఎన్సీబీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ)గానూ పనిచేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ను విడిచిపెట్ట్టడానికి రూ.25 కోట్లు ఇవ్వాలంటూ ఎన్సీబీ కీలక అధికారులతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారని ప్రభాకర్ సాయిల్ ఆదివారం బాంబు పేల్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులకు అఫిడవిట్ అందజేశాడు. డ్రగ్స్ కేసులో మరో సాక్షి అయిన కె.పి.గోసవికి ప్రభాకర్ సాయిల్ బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రభాకర్ సాయిల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని డ్రగ్స్ కేసులో మరో సాక్షి కిరణ్ గోసవి పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్పై ఎన్సీబీ దాడులు జరిగిన అక్టోబర్ 2 నుంచి పరారీలో ఉన్న అతడు సోమవారం గుర్తుతెలియని ప్రాంతం నుంచి టీవీ చానళ్లతో మాట్లాడాడు. తాను అతి త్వరలో లక్నో పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడు. పారదర్శకంగా దర్యాప్తు ప్రభాకర్ సాయిల్ సమర్పించిన అఫిడవిట్, కేసు రిపోర్టు ముంబైలోని తమ అధికారుల నుంచి అందిందని జ్ఞానేశ్వర్ సింగ్ సోమవారం ఢిల్లీలో చెప్పారు. ఈ రిపోర్టును ఎన్సీబీ డైరెక్టర్ జనరల్పరిగణనలోకి తీసుకున్నారని, విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు. సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పారదర్శకంగా, నిజాయతీగా దర్యాప్తు జరుపుతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖెడేను డ్రగ్స్కేసు విచారణ నుంచి తప్పించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాలను బట్టి చర్యలుంటాయన్నారు. విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా వాంఖెడేను, ఇతర అధికారులను, సాయిల్ను నిశితంగా ప్రశ్నించనున్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సమీర్ వాంఖెడే సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్సీబీ ఉన్నతాధికారులెవరూ తనను పిలిపించలేదని, వేరే పని కోసం ఇక్కడికి వచ్చానన్నారు. సాయిల్కు పోలీసు భద్రత ముంబై డ్రగ్స్ కేసులో సాక్షి అయిన ప్రభాకర్ సాయిల్కు పోలీసు భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్వాల్సే పాటిల్ ప్రకటించారు. సాయిల్ సోమవారం ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. జాయింట్ కమిషనర్(క్రైమ్) మిలింద్ను కలిసి మాట్లాడాడు. అనంతరం ముంబై శివారులోని సహర్ పోలీసులను కలిశాడు. తనకు భద్రత కల్పించాలని కోరాడు. విచారణకు అనన్య పాండే డుమ్మా డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే సోమవారం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఇంతకుముందే రెండు రోజులపాటు ఎన్సీబీ ఆమెను ప్రశ్నించింది. సోమవారం మళ్లీ రావాలని సూచించినప్పటికీ రాలేదు. వాంఖెడే ఫోర్జరీ సర్టిఫికెట్లు: నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డెరెక్టర్ సమీర్ వాంఖెడే పుట్టినతేదీ సహా సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి, ఉద్యోగంలో చేరారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరో పించారు. సోమవారం సదరు సర్టిఫికెట్లను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఆరోపణలను వాంఖెడే కొట్టిపారేశారు. ఈ కేసులో నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ను వాంఖెడే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాంఖెడేకు ఉపశమనం సాధ్యం కాదు: ప్రత్యేక కోర్టు ముంబై: డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ అఫిడవిట్ ఆధారంగా న్యాయస్థానాలు తనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖెడేకు నిరాశే ఎదురయ్యింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్సీబీ, సమీర్ వాంఖెడే సోమవారం ప్రత్యేక కోర్టులో రెండు వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభాకర్ సాయిల్ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్సీబీ, వాంఖెడే తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై పెద్ద కుట్ర జరుగుతోందని వాంఖెడే చెప్పారు. తమను నైతికంగా దెబ్బతీసే యత్నం జరుగుతోందన్నారు. అందుకే తమపై న్యాయస్థానాలు చట్టపరమైన చర్యలు ప్రారంభించకుండా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే, ఈ కేసులో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి వి.వి.పాటిల్ స్పష్టం చేశారు. -
ఆర్యన్ కేసులో బాలీవుడ్ నిశ్శబ్ధం అవమానకరం: డైరెక్టర్ అసహనం
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్పై అక్టోబర్ 2 రాత్రి పోలీసులు దాడి చేయగా ఈ పార్టీలో ఆర్యన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి షారుక్కు, ఆయన కుటుంబానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే షారుక్కు సల్మాన్, హృతిక్ రోషన్, పూజ బేడీతో పాటు పలువురు మద్దతు తెలిపారు. చదవండి: హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస ఇదిలా ఉంటే అరెస్ట్ అయినప్పటీ నుంచి ఆర్యన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆర్యన్ మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటిషన్ను పదే పదే తిరస్కరిస్తోంది. దీంతో బెయిల్ దొరక్క ఆర్యన్కు జైలు కూడు తప్పడం లేదు. ఈ క్రమంతో తాజాగా మరో సెలబ్రిటీ షారుక్కు మద్దతుగా నిలిచారు. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ట్విటర్ ద్వారా షారుక్కు మద్దతు తెలిపారు. చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్ రోడ్డు జైల్లో ఆర్యన్ను కలుసుకున్న షారుక్ ఈ మేరకు సంజయ్ గుప్తా ట్వీట్ చేస్తూ.. ఆర్యన్ అరెస్టు విషయంలో నిశబ్ధంగా ఉన్న పలువురు బాలీవుడ్ పెద్దలను ఆయన ప్రశ్నించారు. ‘షారుక్ఖాన్ సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతీ విషయంలో షారుక్ ముందుంటారు. అలాంటి ఆయన సంక్షోభ పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటమంటే దానికంటే అవమానకరమైన విషయం మరొకటి లేదు’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరో ట్వీట్లో ‘ఈ రోజు షారుక్ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్లు లేదా మీ వాళ్లు ఉండోచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: షారుఖ్ బీజేపీలో చేరితే డ్రగ్స్ కాస్తా షుగర్ అవుతుంది: ఛగన్ భుజ్భల్ Shahrukh Khan has and continues to give jobs and livelihoods to thousands in the film industry. He has always stood up for every cause for the film industry. And the astute silence of the same film industry in his moment of crisis is nothing short of SHAMEFUL. — Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021 Aaj uska beta hai, kal mera ya tumhaara hoga… Tab bhi issi buzdalli se chup rahoge??? — Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021 -
ఆర్యన్ ఖాన్ రిలీజ్ కు 25 కోట్లకు డీల్ ???
-
మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..
ముంబై: తన మతంపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే స్పందించారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేశారు. సమీర్.. ముస్లిం మతానికి చెందినవారని పేర్కొంటూ ఒక డాక్యుమెంట్ను ట్విటర్లో షేర్ చేశారు. ‘ఫోర్జరీ ఇక్కడ నుంచి ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ తగిలించారు. అంతేకాదు సమీర్, ఆయన మాజీ భార్య షబానా ఖురేషీ పెళ్లి నాటి ఫొటో కూడా ట్విటర్లో పెట్టారు. దీనిపై సమీర్ దీటుగా స్పందించారు. నవాబ్ మాలిక్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోలు అనవసర విషయాల్లో తనను ఇరికిస్తున్నారని, తనకు సంబంధించిన ఏ వివరాలైనా పరిశీలించుకోవచ్చని సమీర్ వాంఖెడే స్పష్టం చేశారు. ‘నా తండ్రి పేరు ద్యాన్ దేవ్ కచ్రుజీ వాంఖెడే. 2007 జూన్ 30న స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆయన పదవీ విరమణ చేశారు. నా తండ్రి హిందువు. నా తల్లి దివంగత శ్రీమతి జహీదా ముస్లిం. బహుళ మత, లౌకిక కుటుంబానికి చెందినవాడిగా.. నా వారసత్వం గురించి నేను గర్విస్తున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. 2017లో, నేను షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ను వివాహం చేసుకున్నాను’ అని సమీర్ వాంఖెడే ఒక ప్రకటనలో తెలిపారు. చాలా బాధపడ్డాను నవాబ్ మాలిక్ ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాయని సమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా వ్యక్తిగత పత్రాలను ప్రచురించడం పరువు నష్టం కలిగించేది మాత్రమే కాదు నా కుటుంబ గోప్యతపై అనవసరమైన దాడి కూడా. ఇది నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని, చనిపోయిన నా తల్లిని కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా చేసింది. గత కొన్ని రోజులుగా గౌరవ మంత్రి చర్యలు నన్ను, నా కుటుంబాన్ని విపరీతమైన మానసిక, మానసిక ఒత్తిడికి గురి చేశాయి. వ్యక్తిగత, పరువు నష్టం కలిగించే దాడులతో నేను బాధపడ్డాను’ అని సమీర్ వాంఖెడే ట్విటర్లో పేర్కొన్నారు. Me n my Husband Sameer r born Hindus.We hv never converted to any other religion.V respect all religions.Sameer’s father too is hindu married to my Muslim Mom in law who is no more.Sameer’s ex-marriage ws under special marriage act,divorced in 2016.Ours in hindu marriage act 2017 pic.twitter.com/BDQsyuvuI7 — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 25, 2021 మతం మారలేదు: సమీర్ భార్య తన భర్తపై మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలపై సమీర్ వాంఖెడే భార్య షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ ట్విటర్లో స్పందించారు. తాను, తన భర్త జన్మతః హిందువులమని, మరో మతంలోకి మారలేదని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొంటూ తమ పెళ్లినాటి ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా, తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టబద్ద రక్షణ కల్పించాలంటూ సమీర్ వాంఖెడే ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి ఆయన లేఖ రాశారు. అయితే డ్రగ్స్ కేసులతో మహారాష్ట్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని శివసేన, ఎన్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. (చదవండి: ముంబై డ్రగ్స్ కేసు.. ఆర్యన్ను వదిలేయడానికి రూ.25 కోట్లు?) -
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ ఓ ట్వీట్ చేశారు. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. మాధవన్, వేదాంత్లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ ‘గుడ్ జాబ్ వేదాంత్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ఈ పోటీలో వేదాంత్ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు ఇదిలా ఉంటే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. Good job Vedant. We are proud of you and your upbringing. 🙏 pic.twitter.com/6SNVJI51w1 — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2021 -
జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై NCB విచారణ