banjara hills
-
హీరో ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు
బంజారాహిల్స్(హైదరాబాద్): తనను చంపుతామని బెదిరించిన హీరో ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకుంటున్న వ్యక్తిపై యూట్యూబర్ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–44లో డయల్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో విజయ్సాధు అనే జర్నలిస్ట్ అసోసియేట్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు. తన డయల్ స్యూస్ ఛానల్లో ఈ నెల 4న హీరో ప్రభాస్కు మేజర్ సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను విజయసాధు పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మరుసటి రోజు సురేష్ కొండి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రభాస్ పీఆర్వోనని పరిచయం చేసుకున్నాడు. డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్తో ప్రభాస్కు మేజర్ సర్జరీ జరిగిందంటూ, అనారోగ్యం బారిన పడ్డాడంటూ డయల్ న్యూస్ యూట్యూబ్లో పెట్టిన పోస్ట్కు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని సురేష్ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఈ వీడియోను విజయ్సాధు డిలీట్ చేయలేదు. దీంతో సురేష్ ఈ పోస్ట్ను ప్రభాస్ ఫ్యాన్స్కు పంపించాడు. ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు ఫోన్కాల్, ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజ్లలో విజయసాధును తీవ్రంగా దూషిస్తూ నిన్ను చంపేస్తాం..నీ ఆఫీసును తగలబెడతాం..అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 మంది యువకులు యూట్యూబ్ కార్యాలయానికి వచ్చి తాము ప్రభాస్ అభిమానులం అంటూ న్యూసెన్స్ చేయగా భయాందోళనకు గురైన విజయసాధు డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అల్లరి మూకలను పంపించి వేశారు. న్యూసెన్స్కు కారణమైన సురేష్ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!
బంజారాహిల్స్: కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు మీ–సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–7లోని మీ–సేవా కేంద్రంతో పాటు ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని సెంటర్ల వద్ద ఉదయం నుంచే బారులుదీరారు. కొత్త కార్డుతో పాటు ప్రస్తుత కార్డులో కొత్తపేర్లు చేర్చాలని ఆధార్తో పాటు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లును జతచేసి దరఖాస్తు చేసుకున్నారు. సిబ్బంది సైతం అప్పటికప్పుడే ఆన్లైన్లో నమోదు చేశారు. బంజారాహిల్స్లోని మీ–సేవా కేంద్రానికి ఒక్కరోజే దాదాపు 1000 మంది వరకు, అలాగే బస్తీలు, కాలనీల్లోని మీ–సేవా కేంద్రాలకు కూడా దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మరికొద్ది రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిబ్బంది తెలిపారు. రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వేంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, ఖైరతాబాద్, రహమత్నగర్, యూసుఫ్గూడ, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్నగర్, అమీర్పేట డివిజన్ల పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవా కేంద్రాలకు వెళ్లి సదరు దరఖాస్తు ఫారానికి సంబంధిత డాక్యుమెంట్లు జతపరిచి ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. సర్కిల్–7 పరిధిలో 83,013 రేషన్కార్డులు.. ఖైరతాబాద్ సర్కిల్–7 పరిధిలో 81 రేషన్ షాపులు ఉండగా ప్రస్తుతం వీటి పరిధిలో ఆహార భద్రత కార్డులు 79,531, అంత్యోదయ అన్నయోజన కార్డులు 3481, ఒక అన్నపూర్ణ కార్డు కలిపి మొత్తం 83,013 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 2,92,882 మంది లబి్ధదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం ప్రతినెలా 18,19,011 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నారు. కొత్తవారికి ఈ నెల రేషన్ లేనట్లే..!ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో గత నెల 6,093 మందిని అర్హులుగా గుర్తించి సర్వే చేయగా ఇందులో 2,938 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో నూతన లబ్ధిదారులకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఈనెల కూడా వారికి రేషన్ లేనట్లేనని తెలుస్తోంది. -
Banjara Hills: అక్కా అంటూ పరిచయం చేసుకుని...
బంజారాహిల్స్(హైదరాబాద్): అక్కా అంటూ పిలుస్తూ ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మోతీనగర్లో నివసించే బత్తుల శివ (33) కారు డ్రైవర్గా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. అదే కంపెనీ బిల్డింగ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకుని అక్కా అంటూ తరచూ ఇంటికి వెళ్తూ ఆమె భర్తతో కలిసి మద్యం తాగేవాడు. శనివారం రాత్రి బాధిత యువతి తండ్రి తీర్థయాత్రలకు వెళ్లగా, తల్లి అదే బిల్డింగ్ మొదటి అంతస్తులో పని కోసం వెళ్లింది. బాధితురాలి సోదరుడు కూడా అదే బిల్డింగ్కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా మొదటి అంతస్తులో ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు. రాత్రి 11.30 గంటల వరకు ఇద్దరు మాట్లాడుకున్నాక..ఇక తాను వెళ్తానని శివ చెప్పగా యువతి బెడ్పై నిద్రకు ఉపక్రమించింది. అరగంట తర్వాత ఆమె మేల్కొనగా..శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా అరవాలని ప్రయత్నించింది. దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోదిస్తూ తల్లికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బీఎన్ఎస్ సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి.. వేగంగా ఢీకొట్టి..
బంజారాహిల్స్: ఫుట్పాత్పై నిద్రిస్తున్నవారి నుంచి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన ఆభరణాల వ్యాపారి తనయుడు సాధుల హర్షవర్ధన్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని సాయి మెన్షన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆయనే నిర్మాతగా, హీరోగా అర్జున్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హర్షవర్ధన్ తన స్నేహితులు సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, మాడే కార్తీక్, వంశీ, రాకేష్ నేతతో కలిసి ఉంటున్నాడు. హర్షవర్ధన్, వంశీలు గదిలో మద్యం తాగుతుండగా.. రాకేష్ అనే మరో స్నేహితుడు జూబ్లీహిల్స్లోని ఎయిర్లైవ్ పబ్లో ఉండగా తనను పికప్ చేసుకోవడానికి రావాలని హర్షవర్ధన్కు ఫోన్ చేశాడు. తాను మద్యం మత్తులో ఉన్నానని, మీరు వెళ్లి తీసుకురావాలంటూ కార్తీక్కు చెప్పి కారు తాళంచెవి ఇచ్చాడు. అర్ధరాత్రి 1.04 గంటల ప్రాంతంలో కార్తీక్.. థార్ కారు నడుపుతుండగా తేజ పక్కన కూర్చొని రాకే‹Ùను తీసుకురావడానికి జూబ్లీహిల్స్ పబ్కు బయలుదేరారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి అగ్రసేన్ చౌరస్తా మీదుగా అతి వేగంగా కేబీఆర్ పార్కు వైపు వెళ్తుండగా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సమీపంలో కారు అదుపుతప్పి ఫుట్పాత్ను ఢీకొట్టి అక్కడ నిద్రిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్రెడ్డి సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కారు డోర్ తీసి పరారైన యువకులు.. కారు బోల్తా పడిన తర్వాత డోర్ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి పరుగులు తీశారని అక్కడ ఉన్నవారు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్ సేకరించి సీసీ ఫుటేజీల ఆధారంగా కారు ఎక్కడి నుంచి వచి్చందో గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో కార్తీక్, తేజ పారిపోతూ గదిలో ఉన్న హర్షవర్దన్, వంశీ, నేతను కూడా పారిపోవాలని చెప్పడంతో అంతా ఉడాయించారు. అయితే తెల్లవారుజామున ఇంటికి వచ్చిన రాకే‹Ùకు గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న కార్తీక్, తేజ, హర్షవర్ధన్, వంశీ, నేత తదితరులను అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన కార్తీక్ పక్కనే కూర్చొన్న తేజలపై బీఎన్ఎస్ సెక్షన్ 105 (2), 337, ఎంవీ యాక్ట్ 184, 187, పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు ఇచి్చన హర్షవర్దన్పై కూడా కేసు నమోదైంది. కారు నడుపుతున్న కార్తీక్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. కార్తీక్, తేజకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా వారు మద్యం తాగలేదని తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ లో కారు బీభత్సం
-
బంజారాహిల్స్లో కారు చోరీ.. ఖైరతాబాద్లో చైన్ స్నాచింగ్..
బంజారాహిల్స్: చైన్ స్నాచింగ్ చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా కారు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ బస్తీకి చెందిన అఫ్రోజ్ తన మారుతీ వ్యాన్లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేవాడు. గురువారం రాత్రి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు చేయాలని రోడ్డునెంబర్–12లోని కమాన్లో మెకానిక్కు కారు అప్పగించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేసిన మెకానిక్ షెడ్కు తాళం వేసీ ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యాన్ తీసుకెళ్లేందుకు అక్కడికి వచి్చన ఆఫ్రోజ్కు షెడ్ ఎదుట కారు కనిపించలేదు. దీంతో మెకానిక్కు ఫోన్ చేయడంతో తాను కారు అక్కడే పార్కింగ్ చేసి వెళ్లిపోయానని చెప్పిన అతను ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. పరిసర ప్రాంతాల్లో గాలించినా కారు కనిపించకపోవడంతో బాధితుడు ఆఫ్రోజ్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు తాజ్కృష్ణా హోటల్ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. కాగా ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆనంద్నగర్ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీకి గురైనట్లు ఖైరతాబాద్ పోలీసులకు సమాచారం అందింది. అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా మారుతీ వ్యాన్లో వచ్చిన ఓ వ్యక్తి కారు దిగి కొంతదూరం నడిచి వెళ్లి రోడ్డుపై వెళుతున్న నర్సమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారైనట్లుగా గుర్తించారు. దీంతో కంట్రోల్ రూం నుంచి అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. బంజారాహిల్స్లో చోరీకి గురైన కారు అదేనని గుర్తించారు. దీంతో అటు ఖైరతాబాద్ పోలీసులు, ఇటు బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందీలను ఏర్పాటు చేసి దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు దొంగ కారును ఖైరతాబాద్లో వదిలేసి సందుల్లో పడి ఉడాయించినట్లుగా తేలింది. అర్ధరాత్రి బంజారాహిల్స్లో కారు దొంగిలించిన అతను ఉదయం వరకు అటూ ఇటూ తిరుగుతూ ఆనంద్నగర్ కాలనీలో ఒంటరిగా కనిపించిన మహిళను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. స్నాచర్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వెస్ట్–సెంట్రల్ జోన్ల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బంజారాహిల్స్, ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు.. పుట్పాత్పైన నిద్రిస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. దీంతో, వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంలో ఉన్న కారు.. దుపుతప్పి ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయిఏత, ప్రమాదం జరిగిన తర్వాత వాహనం వదిలి పారిపోయిన కారులోని వ్యక్తులు పారిపోయారు. -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్గా
ప్రస్తుతం స్పెయిన్లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్లు, బార్లు, కాఫీ హౌస్లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
బంజారాహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
బంజారాహిల్స్లో బెంజ్ కారు బీభత్సం
బంజారాహిల్స్: బంజారాహిల్స్లో ఆదివారం అర్ధరాత్రి ఒక బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని సిటీ సెంట్రల్ వైపు నుంచి రోడ్డునెంబర్–10 వైపు వెళ్తున్న బెంజ్ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో కారు నడుపుతున్న నజీర్ అనే వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించలేదని తేలింది. ప్రమాద సమయంలో కారు యజమానితో పాటు ఆయన భార్య కారులోనే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మద్యం మత్తులో ఒక మహిళ ఈ ప్రమాదానికి పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు ఎవరు నడుపుతున్నారనేది తేలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఉత్కర్ష్.. మెరీడియన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
కుక్క మీద ప్రేమ.. పీఎస్కు పంచాయతీ
బంజారాహిల్స్: పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పక్క ప్లాట్లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి సైతం ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. ఈ కుక్కతో ఆమె అనుబంధాన్ని మరింతగా పెంచుకుంది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ ఆహారం కూడా అందించేది. తరచూ ప్రయాణాలు చేసే ఈ పెంపుడు కుక్క యజమాని చాంద్ షేక్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి రుచిక అగర్వాల్ కు అప్పగించేవాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి షేక్ సుభానికి కూడా మహా ప్రాణం. తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని జీరి్ణంచుకోలేక షేక్ సుభాని రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీంతో రుచిక కోపం పట్టలేక కుక్క మీద ఉన్న ప్రేమతో సుభానితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్క కోసం రుచిక తో పాటు ఆమె సోదరుడు ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్, ఆమె వదిన గొడవ పడ్డారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా సుభాని అడ్డుకున్నాడు. ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికాపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు సెక్షన్ 329(4), 115(2), 351(2), రెడ్ విత్ 3(5) బీఎన్ ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో స్పీడ్ లిమిట్ 60 దాటితే ఫైన్.. ఏ రూట్లో తెలుసా?
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో బైక్ రైడర్లు రయ్..రయ్ అంటూ దూసుకెళ్తున్నారు.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీరి స్పీడ్కు అద్దూఅదుపు లేకుండాపోతోంది. దీంతో తరచూ వీరు ప్రమాదాల బారీనపడటమే కాకుండా ఇతరుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వీరికి ముకుతాడు వేసేందుకు ట్రాఫిక్ అధికారులు లేజర్గన్లను ఏర్పాటు చేసి 60కి మించి వేగంతో వెళ్లిన వారికి జరిమానాలు విధిస్తూ ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై రయ్.. రయ్మంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న స్పీడ్ రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు ‘లేజర్ గన్’తో ముకుతాడు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్లిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. లేజర్ గన్ ద్వారా స్పీడ్ లిమిట్ దాటిన వాహనాలను గుర్తించి వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రహదారులపై అతి స్పీడ్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వీటిని అదుపు చేసేందుకు రోడ్డు పక్క న సీక్రెట్గా స్పీడ్ను నమోదు చేస్తూ హద్దులు దాటిన వారిని గుర్తిస్తున్నారు.1324 మందిపై కేసులుదీనిలో భాగంగానే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు లేజర్ గన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్పీడ్ లిమిట్ దాటిన వారిని గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఈ రోడ్డులో స్పీడ్ లిమిట్ 60కి మించరాదని నిబంధనలు విధించారు. 18 రోజుల్లో ఇప్పటి వరకు లిమిట్ 60 దాటిన 1324 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.చదవండి: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..! ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు మితిమీరిన వేగంతో లిమిట్ 60 దాటి దూసుకుపోతున్నట్లుగా లేజర్ గన్ ద్వారా తేలింది. ఈ రోడ్లలో స్పీడ్ లిమిట్ 60 దాటితే జరిమానాలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రతిరోజూ ఇక్కడ ఉంటే ట్రాఫిక్ పోలీసు స్పీడ్గా వెళ్లే వాహనాలపై నిఘా పెడతారని పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు వెళ్లే వాహనాలు ఇక నుంచి నిర్దేశించిన స్పీడ్లోనే వెళ్లాలని పేర్కొంటున్నారు. -
Family Survey : ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి యజమాని
-
ఘనంగా సీఎం రేవంత్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ డీసీసీ ఉపాధ్యక్షుడు కొప్పిసెట్టి గోవింద్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణా సంచా కాల్చి, భారీ కేక్ను కట్ చేశారు.అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శులు ముంజగళ్ళ విజయ్కుమార్, మచ్చ విజయ్కుమార్లు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు, రైతులకు రుణమాఫీ దిగ్విజయంగా జరిగిందన్నారు. పుట్టిన రోజు నాడు కూడా సీఎం ప్రజాక్షేత్రంలోనే ఉండాలలనే సంకల్పంతో మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తుండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు భీమ్రావు, నజీర్, రమణ, అప్పారావు, పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..
బంజారాహిల్స్: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్ కమేడీయన్ ఉత్సవ్ దీక్షిత్ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్ దీక్షిత్ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్కు లాక్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు -
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం
-
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం...
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కుమార్తె అయిన మైనర్తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఖమ్మంకు చెందిన ఓ మహిళ భర్త, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచి్చంది. అస్లాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మహిళ, ఆమె భర్త మధ్య చిచ్చు పెట్టి మనస్పర్థలు వచ్చేలా చేసి దూరం ఉండేలా చేశాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోకపోగా మహిళ కష్టపడి తెచ్చే డబ్బును తన విలాసాలకు వాడేవాడు. అంతే కాకుండా ఆమె కుమార్తె మైనర్పై పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవలె ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి తీసుకొని తనఖా పెట్టి వచి్చన డబ్బుతో జల్సా చేస్తున్నాడు. ఇదేమని ప్రశి్నస్తే సమాధానం చెప్పకుండా ముఖం చాటేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: బంజారాహిల్స్లో ‘మోమో’ల కలకలం
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్లో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. నందినగర్లో వారాంతపు సంతలో రోడ్డుపై అమ్మే మోమోలు తిని పలువురికి ఫుడ్పాయిజన్ అయింది. మోమోలు తిన్న సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది.ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మోమోల బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మోమోలు పాయిజన్ అవడంపై బాధితులు సోమవారం(అక్టోబర్ 28) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత -
వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే
బంజారాహిల్స్: దేశం కాని దేశం.. ఊరు కాని ఊరు.. మన భాష అసలే తెలియదు.. మాట్లాడడానికి నోరు పెగలదు.. చెవులు వినబడవు.. అమెకున్న గ్రహణ శక్తి సంజ్ఞలు మాత్రమే. మూగ, చెవుడు అయినా కేవలం ఉపాధ్యాయులు చెప్పేది లిప్మూమెంట్ ద్వారా గ్రహిస్తూ చదువులో దూసుకుపోతోంది. క్లాస్లో ఎప్పుడూ మొదటి స్థానమే. నేపాల్కు చెందిన రియా (17) తల్లిదండ్రులు జయన్బహదూర్, తల్లి జోగుమాయలు పొట్ట చేతబట్టుకుని ఉపాధి నిమిత్తం 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చారు. జయన్ బహదూర్ కుక్గా పనిచేస్తుండగా, భార్య మాయ గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రియా పుట్టుకతో మూగ, చెవుడు. తన భావాలను పంచుకోవాలంటే మాటలు రావు, ఇతరులు చెప్పేది వినబడదు. అయితేనేం ఆమెకున్న గ్రహణ శక్తికి తనలోని లోపాలు కూడా చిన్నబోతాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10లోని గాయత్రీహిల్స్లోని లిటిల్స్టార్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది రియా.ఎప్పుడూ ఫస్టే.. తరగతి గదిలో టీచర్లు చెప్పేది వినబడకపోయినా.. వారి లిప్మూమెంట్ ద్వారా ఆ పాఠాలు గ్రహిస్తోంది. ఏమైనా అర్థం కాకపోతే నోట్బుక్లో రాసి టీచర్లను అడుగుతుంది. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఇక్కడే చదువుతున్న రియా ఎప్పుడూ క్లాస్ ఫస్టే వస్తుందని తెలుగు టీచర్ అనూష తెలిపారు. బ్లాక్బోర్డుపై తాము రాసే పాఠాల విషయాలు బాగా అబ్జర్వ్ చేస్తుందని హిందీ టీచర్ అర్షియా పరీ్వన్ తెలిపారు. ఈ బాలిక అంటే మొత్తం స్కూల్ విద్యార్థులకే కాకుండా టీచర్లకు కూడా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారని ఆమె వెల్లడించారు. నూరు శాతం హాజరు.. వినబడదు..మాట్లాడలేదు..అయినా సరే ఏ ఒక్కరూ ఆమెను హేళనగా చూడరని, క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటుందని స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అస్మతున్నీసా తెలిపారు. ఈ బాలిక అక్క, అన్న కూడా ఇదే పాఠశాలలో చదివారని తెలిపారు. రియాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమె వద్ద ఎలాంటి ఫీజూ తీసుకోకుండానే నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఉచితంగా చదువును అందిస్తున్నట్లు అస్మతున్నీసా పేర్కొన్నారు. కేవలం చదువులోనే కాకుండా పాఠశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని అబ్బురపరిచే నృత్యాలు కూడా చేసి ఆకట్టుకుంటుంది. క్రాఫ్ట్వర్క్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, చార్ట్ తయారీలో కూడా రియా పాల్గొంటూ బహుమతులు సాధిస్తోంది. ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా స్కూల్ అటెండెన్స్లో 100 శాతంతో అందరి కంటే ముందుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాదు తమ కంటే బాగా చదవడం, మార్కులు కూడా బాగా రావడం మమ్ముల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని సహచర విద్యారి్థని సౌమ్య చెబుతోంది. -
నగరమంతా తిప్పి.. సెల్ఫోన్తో ఉడాయించి..
బంజారాహిల్స్: కస్టమర్ బుక్ చేసిన మేరకు సదరు యువకుడిని గమ్యస్థానానికి చేర్చేందుకు యత్నంచగా.. రకరకాల కారణాలతో నగరమంతా తిప్పి చివరకు బాధితుడి సెల్ఫోన్తో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్లో నివసించే సావనం చంద్ర మహేష్ బాబు ర్యాపిడో నడుపుతూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ నెల 18న రాత్రి 8 గంటల ప్రాంతంలో డెలాయిట్ ఆఫీసు గచ్చిబౌలిలో పని చేసే నితిన్ అనే యువకుడి నుంచి బుకింగ్ ఆర్డర్ వచ్చింది. కొండాపూర్ ఏఎంబీ మాల్ వద్ద తనను డ్రాప్ చేయాల్సిందిగా నితిన్ బుకింగ్ ఆర్డర్ పెట్టాడు. దీంతో మహేష్ బాబు ఆ యువకుడిని ఎక్కించుకుని ఏఎంబీ మాల్ వద్ద దింపాడు. తన స్నేహితుడి వద్ద డబ్బు తీసుకువస్తానని మాల్లోకి వెళ్లిన కొద్ది సేపటికే నితిన్ బయటకు వచ్చి తన స్నేహితుడు ఇక్కడ లేడని, కూకట్పల్లికి తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన ర్యాపిడో డ్రైవర్ మహేష్ వెంటనే నితిన్ను కూకట్పల్లికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన స్నేహితుడు కృష్ణానగర్ వెళ్లాడని, అక్కడ దింపాలని కోరాడు. దీంతో బాధిత ర్యాపిడో డ్రైవర్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని అల్కజర్ మాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు దింపాడు. ఫోన్ పే చేయడానికి తన స్విచ్ఛాప్ చేసి ఉందని, ఒకసారి ఫోన్ ఇస్తే తన స్నేహితుడికి చెప్పి డబ్బులు తెప్పించుకుంటానని అడిగాడు. దీంతో నితిన్కు మహేష్ తన ఫోన్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఓ గల్లీలోకి వెళ్లిన నితిన్ ఎంతకీ తిరిగిరాలేదు. రెండు గంటలు గడిచినా రాకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించినా ఫలి తం లేకుండాపోయింది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 318, 303(2)ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
బంజారాహిల్స్ లోని పలు పబ్బులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
బయటకని చెప్పి పబ్కి వెళ్తావా.. ఇంటికిరా నీ సంగతి చెప్తా!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో ఓ పబ్ బాగోతం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్దంగా యువతులతో పబ్లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి దాడులు చేశారు. ఈ క్రమంలో 100 మంది పురుషులు, 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ఫోర్స్ పోలీసులు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లోని టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్పై శుక్రవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నిర్వాహకులు అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. పబ్కు కస్టమర్లకు ఆకర్షించేందుకు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారు పబ్ నిర్వాహకులు. పబ్కు వచ్చిన యువకులతో వారు సన్నిహితంగా ఉండేలా డ్యాన్స్లు చేపిస్తున్నారు. పబ్ వచ్చిన వారితో ఎక్కువ మద్యం తాగించి అధిక బిల్లు అయ్యేలా పబ్ నిర్వహకులు ప్లాన్ చేశారు.గత మూడు వారాలుగా పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసుల రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో పబ్లో 100 మంది కస్టమర్లు, 42 మంది యువతులు, ఏడుగురు పబ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.ఇదిలా ఉండగా.. పబ్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీక్ ఎండ్లో నాలుగు గంటలు పనిచేస్తే 2 వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇక, పబ్కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ.. ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని వారి పని అప్పగించారు. మద్యం సేవిస్తున్నట్లు నటించి తాము ఇచ్చే సాప్ట్ డ్రింక్ తాగాలని యువతులకు పబ్ యాజమాన్యం సూచించారు. కస్టమర్తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఎక్కువ ఇస్తున్నట్టు గుర్తించారు. అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.మరోవైపు.. పబ్లో పట్టుబడిన వారి కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పబ్లో పట్టుబడ్డ తన భర్త కోసం ఆధార్ కార్డు తీసుకుని భార్య పీఎస్కు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బయటకు వెళ్తున్న అని చెప్పి పబ్కి వచ్చి తందనాలు ఆడుతున్నాడు. ఇంటికి రానీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. -
Hyderabad: మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా సౌండ్ పొల్యుషన్కు పాల్పడిన ఘటనలో నగర మేయర్తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల çసమయంలో బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఊరేగింపుతో పాటు మండపాలను కానిస్టేబుళ్లు ఎస్కే నజీర్ అహ్మద్, హోంగార్డు సాయి ప్రసాద్లు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ముందు జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సౌండ్తో డీజే ఏర్పాటు చేశారని, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్ అహ్మద్, సాయిప్రసాద్లు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దని, మ్యూజిక్ను కొనసాగించాలని వారికి సూచించారు. భారీ శబ్ద కాలుష్యంతో ఈవెంట్ను అలాగే కొనసాగించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బతుకమ్మ వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్కుమార్, మ్యూజిక్ ప్లే చేస్తున్న మహ్మద్ గౌస్, జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 223, 280, 292, 49 రెడ్విత్ 3 (5), సెక్షన్ 21/76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పని చేసిన సంస్థకే కన్నం.. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన ఉద్యోగులు
సాక్షి,హైదారాబాద్ : పని చేసిన సంస్థకే కన్నం వేశారు ఉద్యోగులు. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించారు. నగల్ని మాయం చేసిన ప్రబుద్ధుడితో పాటు అతనికి సహకరించిన సిబ్బంది గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. అయితే అదే షోరూంలో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులకు దుర్బుద్ది పుట్టి అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ సూకేతు షా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మేనేజర్ సుకేతు షాతో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరిలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కేసులో ట్విస్ట్..మరోవైపు రూ..6 కోట్ల నగల మాయం కేసులో కీలక పాత్రపోషించిన మేనేజర్, తన భర్త సూకేతు షా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. లెటర్తో పాటు,ఓ వీడియోను సైతం పోలీసులకు అందించారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండ కారణంగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు కొంత ఉపశమనం కలిగింది. హైదరాబాద్లో పలుచోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ట్యాంక్ బండ్, మేడ్చల్, అల్వాల్, కూకట్పల్లి, నిజాంపేట్, ఎస్ఆర్నగర్, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Hyderabad rains right now Alhamdulillah #Hyderabadrains pic.twitter.com/yXotf9aWP8— kashif Qureshi (@kashiflion) October 3, 2024 Hyderabad Rain Movement.Isolated Places Get Heavy Rain.Thunderstorms....⛈️Cloud's moving Downward Direction.Be Alert....⚠️#HyderabadRains#HeavyRain pic.twitter.com/1n69AEE4lc— Jagtial District Weather Forecast....🛰⛈️ (@SkyForecastMaN4) October 3, 2024ఇది కూడా చదవండి: కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్. కూకట్పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, మూసాపేట్లో భారీ వర్షం కురుస్తోంది. కోఠి, వనస్థలిపురం, ఎల్బీనగర్లో కుండపోత వాన పడుతోంది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, దిల్సుఖ్నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్నగర్, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలో కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. @balaji25_t Rain in amberpet 🌧️🌨️⚡⚡ pic.twitter.com/Q7cKQJGsQm— ஷேக் அஃப்ரோஸ் ഷെയ്ഖ് അഫ്രോസ്✨✨ (@iamshaikmoun) September 23, 2024Heavy Rains ⛈️ #HyderabadRains ⛈️⛈️@HiHyderabad @swachhhyd @PeopleHyderabad #Hyderabad #WeatherUpdate #Rains #thunderstorm #video #musheerabad #Telangana pic.twitter.com/Of1CGjxl17— Younus Farhaan (@YounusFarhaan) September 23, 2024 -
జ్యువెల్స్ షోలో నటీమణులు సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం
-
బంజారాహిల్స్లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫుల్ స్పీడ్లో ఉన్న ఫార్చూనర్ కారు ఓ కాంప్లెక్స్లో ఉన్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లో ఓ మైనర్ ఫార్చూనర్ కారును నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఫుల్ స్పీడ్లో కారును నడిపి ఓ కాంప్లెక్స్లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్లో ఉన్న కారును, ఆటోను ఢీకొట్టి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమచారం తెలియాల్సి ఉంది. -
బంజారా హిల్స్ : హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకత గురించి తెలుసా? (చిత్రాలు)
-
Cardiovascular Disease: కోలుకున్న క్లిష్టమైన సమస్యల రోగి
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నశించి విషమ స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు. కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు. రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి ‘ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‘ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతత్వంలోని వైద్య బందం నిర్ధారించింది. క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించి రోగిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రా ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బందం ‘మెకానికల్ వాల్వ్‘ వైద్యవిధానం ద్వారా రోగి బహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బందం నిరూపించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. -
బంజారాహిల్స్ మెరీడియన్ స్కూల్లో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు (ఫోటోలు)
-
మొదటిసారి డ్రగ్స్ కోసం స్నిఫర్ డాగ్స్ తో పోలీసుల రైడ్స్
-
‘మై గ్లామ్’లో మోడళ్లు..
స్థానిక రోడ్ నెం.1లోని పాప్ అప్ స్పేస్లో మై గ్లామ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో వజ్రాభరణాలను మోడల్స్ ధరించి ర్యాంప్పై తళుక్కుమన్నారు.దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత, మనోజ్ తెలిపారు. – బంజారాహిల్స్ఇవి చదవండి: బస్కింగ్.. జోష్! -
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లోని లామకాన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్పై ‘భూమిని కాపాడే సూపర్హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!!
రోడ్డు పక్కనే కదా హోటల్ అనుకొని తీసిపారేయకండి. ఈమె వద్ద ఒక్కసారి బోటికూర, తలకాయ మాంసం రుచి చూశారంటే ఇక రోజూ ఇటువైపు రావాల్సిందే.. అవును మరి.. బోటికూర లక్ష్మమ్మ పెట్టే తలకాయ మాంసం, మటన్ లివర్, బోటి కూర, చికెన్ కర్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బడా వ్యాపారులు సైతం వచ్చి లొట్టలేసుకొని తింటుంటారు. సమపాళ్లలో మసాలా దినుసులు, ఇంట్లోనే తయారు చేసే కారంపొడి, కొబ్బరిపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో ప్రత్యేకంగా బోటీ వండుతుంటానని, రుచికి అదే కారణమని అంటుంటారు బోటికూర లక్ష్మమ్మ. – బంజారాహిల్స్బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షేక్పేట మండల కార్యాలయం వద్ద ఫుట్పాత్ను ఆనుకొని రోడ్డు పక్కనే రెండు దశాబ్ధాలుగా ఆమె నిర్వహిస్తున్న మొబైల్ మెస్లో టేస్ట్ చేస్తున్న ఎంతో మంది ప్రముఖులు శెభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజూ 12 కిలోల బోటీ వండి వంద మందికి పైగానే ఆహారప్రియులకు అందిస్తున్నారు. అందుకే వరంగల్ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రామానికి చెందిన గన్నారం లక్ష్మమ్మ(73) ఏకంగా బోటీకూర లక్ష్మమ్మగా పేరు తెచ్చుకుంది.ఈమె బోటీ కూర గురించి ఇప్పటికే సుమారు 100 మంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బోటీ కోసమే వారంలో ఒకటి, రెండుసార్లు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వస్తుంటారు. తలకాయ మాంసం, మటన్ లివర్, మటన్ కూర, చికెన్ లివర్, చికెన్ కూర, ఇవన్నీ ఈమె వద్ద ప్రత్యేక రుచుల్లో లభిస్తుంటాయి. మరో నలుగురికి ఉపాధి బోటీ కూరను తానే స్వయంగా వండుతానని, ఇందులో వాడే ప్రతి మసాలా దినుసు తానే తయారు చేస్తుంటానని తెలిపారు.రాహుల్ సిప్లిగంజ్కు వడ్డిస్తూ..తాను సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. లక్ష్మమ్మను చూసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్కాలనీ, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో ఎంతోమంది మహిళలు స్ఫూర్తి పొంది ఇలాంటి మొబైల్ మెస్లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఈమె టేస్ట్కు ఎవరూ సాటిరారంటూ చాలామంది యూట్యూబర్లు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాకుండా సోషల్ మీడియాలో లక్ష్మమ్మ బోటి కూర టేస్టే సెపరేట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. అంతేకాదు స్విగ్గి, జొమాటో ఆర్డర్లు కూడా వస్తుండగా ఇప్పుడున్న గిరాకీ తట్టుకోలేక ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎంతో ఆనందం..బోటీ వండటానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ భోజనాలు ప్రారంభిస్తాను. మొదటి గంటలోనే వందకుపైగా బోటి కూర భోజనాలు అమ్మడవుతుంటాయి. కూర అయిపోగానే చాలా మంది వస్తుంటారు. లేదని చెప్పగానే నిరాశతో వెళ్తుంటారు. డబ్బులు సంపాదించడానికి వండటం లేదు.ఉన్నంతలోనే మంచి రుచితో అందిస్తున్నాను. రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో సింగర్ బిట్టు, లేడీ సింగర్ లక్ష్మీతో పాటు చాలా మంది వస్తుంటారు. బాగుంది అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. నాతో పాటు నా కూతురు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఏడు చోట్ల మెస్లు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్లకు నేను వండిన బోటి కూర వెళ్తుంది. – లక్ష్మమ్మఇవి చదవండి: 'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు.. -
లేపాక్షిలో థీమాటిక్ ఎగ్జిబిషన్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–69లోని నందగిరిహిల్స్లోని లేపాక్షి హస్తకళా షోరూంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లెదర్ పప్పెట్స్, పెన్ కలంకారీ చీరలు, ఏలూరు కార్పెట్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఈ చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన కళాకారులు తమ చేతులకు పనిచెబుతూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. -
రయ్.. రయ్.. గూబ గుయ్!
బంజారాహిల్స్: రాత్రీ పగలూ తేడా లేకుండా మోడిఫైడ్ సైలెన్సర్తో భీకర శబ్దాలతో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ బైక్లు, కార్లపై అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టిపెట్టారు. గడిచిన నెల రోజుల కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు మితిమీరిన వేగంతో చెవులు దద్దరిల్లే శబ్దంతో దూసుకెళ్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇంత చేస్తున్నా ఇంకా కొంతమంది యువకులు స్పోర్ట్స్ బైక్లు, కార్లలో రయ్ రయ్మంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రాత్రి 10 గంటల తర్వాతనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నెక్లెస్రోడ్డు, మాసబ్ట్యాంక్, మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతాల వైపు యువకులు రేసింగ్లకు పాల్పడుతూ బైక్లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉదయం 11 నుంచి గంట పాటు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటలు మాత్రమే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తమ దృష్టికి వస్తే మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి 7 తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై బైక్లు, కార్లు మోత మోగిస్తూ దూసుకెళ్తుండగా వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. చెవులు దద్దరిల్లే సౌండ్లతో నివాసితులు సైతం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కనీసం వారానికి రెండు సార్లైనా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపడితే పెద్ద ఎత్తున మోడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలను పట్టుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా
బంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని ఉదయ్నగర్లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: మినిస్టర్ క్వార్టర్స్లో చోరీ
హైదరాబాద్, సాక్షి: అది నగరంలో వన్ ఆఫ్ ది వీవీఐపీ ఏరియా. ఏకంగా రాష్ట్ర మంత్రుల నివాస ప్రాంగణాలు ఉండే చోటు. కాబట్టి, భద్రత కూడా కట్టుదిట్టంగానే ఉంటుందని అంతా భావిస్తాం. అయితే.. అలాంటి చోట చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లో దొంగతనం జరిగింది. క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచిన నిర్మాణ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. అర్ అండ్ బీ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిర్మాణ సామాగ్రిలో తలుపుల్ని, స్టీల్ను దుండగులు మాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే.. అత్యంత పటిష్ట భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంగణంలో ఈ చోరీ జరగడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కిందిస్థాయి అధికారుల పనే అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
Banjara Hills: యువతులను ఎరగా వేసి..
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఆఫ్టర్ 9 పబ్లో సాగుతున్న చీకటి వ్యాపారం గుట్టును వెస్ట్జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. శనివారం రాత్రి ఆఫ్టర్ 9 పబ్కు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వచ్చారనే సమాచారంతో దాడులు చేశారు. పబ్ లోపలికి జంటలకు మాత్రమే అనుమతి ఉండగా.. ఇక్కడకు వస్తున్న యువకులకు, యువతులకు ఎలాంటి సంబంధాలు లేవని గుర్తించారు. ఇక్కడికి వచ్చే యువకులకు తాను అద్దెకు తీసుకువచ్చిన యువతులను పబ్ యజమాని ఎరగా వేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో పబ్ యజమాని బరిదక సతీష్, భవన యజమాని విద్యాధర మూర్తి, పబ్ మేనేజర్ కోరాడ శ్రీనివాసరావు, డీజే నిర్వాహకుడు అజ్మత్ఖాన్, క్యాషియర్ శ్రీనివాసరావు, అయిదుగురు బౌన్సర్లు సాయితేజ, మహేష్, కిషోర్, వినీల్, శేఖర్లతో పాటు 131 మంది యువకులు, 32 మంది యువతులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేసిన ఆఫ్టర్ 9 పబ్ లైసెన్స్ను రద్దు చేయాల్సిందిగా ఎక్సైజ్ సూపరింటెండెంట్కు లేఖ రాశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందున ఈ బిల్డింగ్ను సీజ్ చేయాలని సికింద్రాబాద్ ఆర్డీఓకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. -
బంజారాహిల్స్ పబ్లో అసభ్య డ్యాన్స్లు.. 35 యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 పబ్పై శనివారం రాత్రి వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకర డ్యాన్స్లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్ను క్లోజ్ చేయించి.. కేసు నమోదు చేశారు.కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. -
Banjarahills: బంజారాహిల్స్లో బెంజ్ కారు బీభత్సం...
హైదరాబాద్: అదుపు తప్పిన వేగంతో వచ్చిన బెంజ్ కారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. అమెరికాలో నివసించే అయిదుగురు యువతీ యువకులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లో నివసించే వెంకటష్, అవినాష్తో పాటు జర్మనీ, అమెరికాలో నివసించే మ్యాక్స్మిలన్ హెన్రీ, ప్రీతమ్, ఓ యువతి బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు.మంగళవారం రాత్రి వీరు బెంజ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లోని దస్పల్లా హోటల్ పైన ఉన్న కారా పబ్కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం అర్ధరాత్రి కారులో మాదాపూర్,గచ్చిబౌలి, దుర్గంచెరువు ప్రాంతాలను చుట్టేసి పార్క్ హయత్ హోటల్ వైపు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10/36 శ్రీజ్యువెలర్స్ వద్ద వీరు వెళ్తున్న కారు అదుపుతప్పి అంతే వేగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లింది. కాగా.. ఇందులోని అయిదుగురు యువతీ యువకులు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా కారు నడుపుతున్న వెంకటేష్ 44 ఎంజీ, అవినాష్ 173 ఎంజీతో పాటు మిగతావారు కూడా మద్యం తాగినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్కు చెందిన చలసాని మాధవీదేవి పేరుతో కారు రిజిస్టరై ఉందని పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లికి హాజరుకావడానికి వీరంతా నగరానికి వచ్చినట్లు తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కారును సీజ్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
Sowmya Janu Photos: రంజాన్ విందు ఇచ్చిన నటి సౌమ్యజాను (ఫొటోలు)
-
వారం రోజుల్లో పరీక్షలు.. అంతలోనే దుర్మరణం
బంజారాహిల్స్: వారంరోజుల్లో పదోతరగతి పరీక్షలు.. ఈలోగా స్నేహితులతో సరదాగా గడుపుదామనుకున్నాడు.. అంతలోనే ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన ఆటోడ్రైవర్ జగదీశ్ కుమారుడు భరణిసాయి లోకేష్(15) అదే ప్రాంతంలోని ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం నలుగురి స్నేహితులతో కలిసి బైక్లపై బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కుకు బయలుదేరారు. శ్రీనగర్కాలనీ టీవీ9 జంక్షన్లో సాయిలోకేశ్ బైక్ను టర్న్ చేసే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డు డివైడర్ను ఢీకొట్టి ఎగిరి స్ట్రీట్లైట్ స్తంభానికి తగలడంతో సాయిలోకేశ్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పక్కనే బైక్లు నడుపుతున్న స్నేహితులు ఒక్కసారిగా వచి్చన పెద్ద శబ్దం విని షాక్కు గురయ్యారు. రెప్పపాటులో రక్తపుమడుగులో ఉన్న స్నేహితుడిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో జగదీశ్తోపాటు కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రే కొడుకును తీసుకెళ్లి రహమత్నగర్లో పరీక్షాకేంద్రాన్ని చూసి వచ్చానని, ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుందని తండ్రి బోరున విలపించాడు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలంలో సీసీ ఫుటేజీలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ఆ బాలుడు బతికి ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. -
Banjara Hills: ట్రాఫిక్ బూత్లో మృతదేహం
హైదరాబాద్: రోడ్డు నంబర్–1లోని తాజ్కృష్ణా హోటల్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ బూత్ అంబ్రిల్లాలో అనుమానాస్పద మృతదేహాన్ని బంజారాహిల్స్ పోలీసులు స్వాదీనం చేసుకుని ఉస్మానియాకు తరలించారు. తాజ్కృష్ణా చౌరస్తాలోని ట్రాఫిక్ బూత్లో గుర్తుతెలియని మృతదేహం(32) ఉన్నట్టు మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ సీఐ రాఘవేందర్ తెలిపారు. ఆరా తీయగా ఫుట్పాత్లపై పడుకునే నిరాశ్రయుడిగా తేలిందని ఆయన చెప్పారు. తలకు వెనకాల గాయమైందని.. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా? అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఒక అమ్మాయిని బూతులు తిట్టే హక్కు ఉందా?: ఏడ్చేసిన నటి
ఇటీవల హైదరాబాద్లో నటి సౌమ్య జాను ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాంగ్ రూట్లో వెళ్తుండగా ట్రాఫిక్ హోంగార్డ్తో జరిగిన గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు.. జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను అడ్డగించారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజగా నటి సౌమ్య జాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయంలో తాను రాంగ్ రూట్లో వెళ్లినట్లు తెలిపింది. కానీ ట్రాఫిక్ పోలీస్ వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిజాలు చెప్పుకొచ్చింది. సౌమ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' అసలు నా గురించి వీడియో సోషల్ మీడియాలో వస్తున్న సంగతే తెలీదు. ఇక్కడ పెద్ద బ్లండర్ ఎంటంటే.. నాకు మందు అలావాటే లేదు. నేను రాంగ్లో రూట్లోనే వెళ్లా. దీనికి సారీ చెబుతున్నా. నేను మెడిసిన్స్ కోసం వెళ్తున్నా. ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా మదర్కు మందులు అర్జెంట్గా కావాలి. ఆ విషయం అతనికి కూడా చెప్పాను. కానీ వినకుండా కారు వెనక్కి తీయమన్నారు. తను చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. కానీ ఆ ఒక్క బూతు మాట నేను తీసుకోలేకపోయాను. రెండు రోజుల నుంచి మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నా. ఆ మాటలకే నాకు కోపం వచ్చింది. అసలు ఆ మాట అనడానికి అతనికి నోరెలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ప్రతి మగాడు.. ఒక ఆడదాన్ని అలా ఎందుకంటాడు.' అంటూ ఏడ్చేసింది. సౌమ్య మాట్లాడుతూ..'ఒక అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు. కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. అయిన వాళ్లను అనే హక్కు ఎవరికీ లేదు. మన సమాజంలో గేలు కూడా ఉంటారు. వాళ్లను ఉద్దేశించి ఎవరికీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఆ దేవుడు వారికి అలాంటి లైఫ్ ఇచ్చాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆ మాటలు నన్ను ఎలా అంటారు. అక్కడ నేనేం నానా హంగామా చేయలేదు. కావాలంటే సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీ. కానీ అతను అన్న మాటలకు నా కుటుంబం నరకం అనుభవిస్తున్నాం. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంటి ఇలా అయింది? అని అడుగుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఆ రోజు నాకు మా అమ్మ ఆరోగ్యమే ముఖ్యం. అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఎక్కడికీ పోలేదు. హైదరాబాద్లోనే ఉన్నా. అతను చేసింది మాత్రం చాలా తప్పు. దీనిపై ఎంతవరకైనా పోరాడతా' అని అన్నారు. -
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్పాస్లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్పాత్పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
పేకాటలో హైటెక్ చీటింగ్!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన పేకాటలో హైటెక్ చీటింగ్ దందాలు వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహబూబ్నగర్కు చెందిన శ్రీను నేతృత్వంలోని తొమ్మిది మందితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు పేకాట ఆడుతున్న నలుగురినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ అధికారులకు అప్పగించారు. నిందితులకు నోటీసులు జారీ చేశామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. మహబూబ్నగర్లోని సుభా‹Ùనగర్కు చెందిన సింగిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను తన స్నేహితులతో కలిసి తరచూ గోవాలోని క్యాసినోవాలకు వెళ్లి వస్తుండేవారు. అక్కడ పేకాటలో భారీగా నష్టపోయిన ఇతగాడు అదే ఆటలో మోసాలకు పథక రచన చేశాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సూర్య, మెరి్వన్, చంద్రశేఖర్, గుర్మీత్ సింగ్, సంతోష్ కుమార్, సయ్యద్ నయీం, వేణు, వినోద్లతో ముఠా ఏర్పాటు చేశాడు. ఎదుటి వారి పేక ముక్కలు కనిపించేలా.. ఆన్లైన్లో ఆర్డర్ ఇచి్చన శ్రీను రూ.25 వేలు వెచి్చంచి ఎక్స్రే విజన్ కాంటాక్ట్ లెన్స్ను ఖరీదు చేశాడు. పేకాట సమయంలో ఎవరైనా దీన్ని ధరిస్తే ఎదుటి వ్యక్తి చేతిలోని ముక్కలు ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా వినియోగించాలనేది మెరి్వన్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుని ధరిచడం మొదలెట్టాడు. గోవాలో పేకాట నేపథ్యంలో పరిచయమైన సరితకు తాము రాడిసన్ హోటల్ కేంద్రంగా భారీ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈమెతో పాటు బంధువులు, స్నేహితులు అయిన సాయి కృష్ణ, వినోద్కుమార్, కుమారీ అక్కడకు వచ్చి పేకాట ఆడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ముందే రూ.1.5 లక్షల తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న శ్రీను.. తన ముఠాకు చెందిన వాళ్లనూ పేకాట ఆడే వారి మాదిరిగానే రంగంలోకి దింపాడు. తన ఖాతాలో పడిన మొత్తం నుంచి రూ.24 వేలు వెచి్చంచిన శ్రీను.. రాడిసన్ హోటల్లో స్వీట్ రూమ్ బుక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడుకు చేరుకున్న అంతా పేకాట ఆడటం మొదలెట్టారు. వినోద్ తదితరులకు శ్రీను రూ.4,500 విలువైన కాయిన్లు కూడా ఇచ్చాడు. ఎక్స్రే విజన్ కాంటాక్ట్ లెన్స్ ధరించిన మెరి్వన్ వినోద్కుమార్, సరిత చేతుల్లోని పేక ముక్కలు తెలుసుకుని.. తన ముఠా సభ్యుల సాయంతో వాళ్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. ఇది పశ్చిమ మండల టాస్్కఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు 13 మందినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2400 నగదు, 4500 కాయిన్లు, లెన్స్ను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. శ్రీను తన గ్యాంగ్లోని వారికి ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నాడని, లెన్స్ ధరించి సాంకేతిక సహకారం అందించే మెరి్వన్కు మాత్రం రూ.5 వేలు చొప్పున ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. శ్రీను ఖాతాలో ఉన్న రూ.84 వేలు సైతం ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ గతంలోనూ కొందరిని ఇలా మోసం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న శ్రీను, అతడి గ్యాంగ్తో పాటు పేక ఆడటానికి వచి్చన నలుగురికీ నోటీసులు జారీ చేశారు. -
బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హోటల్లో మంటలు చెలరేగాయి. పార్కింగ్లోని మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో.. కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
బంజారాహిల్స్ లో ఎక్సక్లూజివ్ పాప్-అప్ ఎగ్జిబిషన్.. (ఫోటోలు)
-
బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్ చేసిన అర నిమిషంలోనే ఓ యువతి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... భద్రాద్రి జిల్లాకు చెందిన బానోతు చందన (25)రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తుండగా చందన భీమా జ్యువెలర్స్లో సేల్స్ ఉమెన్గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. రమణ డ్యూటీకి వెళ్లిగా మధ్యాహ్నం చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి డ్యూటీ నుంచి బయలుదేరాడు. యజమాని పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిచూడగా అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో సందడి చేసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ (ఫొటోలు)
-
బంజారాహిల్స్ : ర్యాక్ క్యాజిల్లో నూతన సంవత్సర వేడుకల్లో యువత ఉత్సాహం (ఫొటోలు)
-
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్పేట, రహమత్నగర్, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్ -
హైదరాబాద్ : హరే కృష్ణ గోల్డెన్ టింపుల్ లో ముగిసిన బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన సూత్ర ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఉమేష్ మధ్యాన్, మోడల్స్ (ఫోటోలు)
-
బంజారాహిల్స్లో కెఫేలో సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బంజారాహిల్స్ లో 3.35 కోట్ల హవాలా నగదు పట్టివేత
-
బంజారాహిల్స్లో భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. తాజాగా, బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టుకున్నారు. రూ.3.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, దీనిలో భాగంగా వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ స్పోర్ట్స్ పోలీసులతో పాటు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారని, రోడ్ నెంబర్-3 వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేయగా మూడు కోట్ల 35 లక్షల నగదు పట్టుబడిందని డీసీపీ వెల్లడించారు. ‘‘పట్టుబడిన నగదు హవాలా మనీగా గుర్తించాం.. హనుమంతరెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, ఉదయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. హనుమంత్ రెడ్డి సూచన మేరకు ప్రభాకర్, శ్రీ రాములు, ఉదయ్ కుమార్ హవాలా మనీ సేకరిస్తూ ఉంటారు. ఇందుకోసం అరోరా కాలనీలో సాయి కృప బిల్డింగ్ ప్లాట్ నెంబర్ 583 తమ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. సేకరించిన హవాలా డబ్బులు తమ కార్యాలయానికి తీసుకెళ్తుండగా సీజ్ చేశాం. కోటి హవాలా మనీకి 25,000 కమిషన్గా తీసుకుంటారు. ఇవాళ ఉదయం ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి.. బేగంబజార్, నాంపల్లి, గోషామహల్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మూడు కోట్ల 35 లక్షలను కలెక్ట్ చేశారు. పట్టుకున్న నగదును కోర్టులకు అప్పగిస్తాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాహన తనిఖీలు మరింత విస్తృతంగా చేస్తామని డీసీపీ పేర్కొన్నారు. రంగా రెడ్డి జిల్లాలో.. వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టుకున్నారు. పూర్తిస్థాయి విచారణ నిమిత్తం నగదను ఇబ్రహీంపట్నం ఆర్డీవోకి అప్పగించారు. కాగా, ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. రాజధాని పరిధిలో... ►సోమవారం.. బషీర్బాగ్ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్ వద్ద బేగంబజార్కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ►హైదరాబాద్లోని చైతన్యపురి పరిధిలో బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్నగర్కు చెందిన స్క్రాప్ వ్యాపారి సంతోష్ చంద్రశేఖర్ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ►రంగారెడ్డి జిల్లా లాల్పహాడ్ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. ఆగాపురా హమీద్ కేఫ్ చౌరస్తాలో షాహీన్ నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్కు చెందిన దినేష్ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం. ►షేక్పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్. ►వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం. ►గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు. ►పంచశీల క్రాస్ రోడ్స్ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాధీనం. -
12 గంటలపాటు ప్రశ్నల వర్షం!
హైదరాబాద్: పబ్ యజమానిని మామూళ్ళ కోసం పీడించి వేధించిన ఘటనలో ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నవీన్రెడ్డి, హోంగార్డు హరిని శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మంది సభ్యులతో కూడిన ఏసీబీ బృందం ప్రశి్నంచింది. పలు రికార్డులను, ఫోన్ కాల్, వాట్సాప్ రికార్డులు వారి ముందే పరిశీలించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు ఏకధాటిగా వీరిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. తనను వేధిస్తున్నట్లు ఆరోపించిన బంజారాహిల్స్లోని రాక్ క్లబ్ పబ్ యజమానిని అర్ధరాత్రి ఒంటిగంటకు స్టేషన్కు పిలిపించారు. గత శనివారం పబ్ నుంచి తనను ఎలా తీసుకొచ్చింది, ఎలా నిర్బం«ధించింది పబ్ యజమాని లక్ష్మణ్ రావు ఏసీబీ అధికారులకు పూసగుచ్చినట్లుగా వివరించారు. అకారణంగా తనను పబ్నుంచి తీసుకొచ్చారని, అంతకు కొద్ది రోజుల ముందు నుంచే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చాటింగ్ వివరాలను ఆధారాలతో సహా ఏసీబీకి అందజేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్రెడ్డి వాట్సాప్ మెసేజ్లతో పాటు వాట్సాప్ కాల్స్ వివరాలను కూడా అధికారులు తెప్పించి..వారి ముందే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఈ ముగ్గురినీ ఏసీబీ కార్యాలయానికి తరలించి 41ఏ నోటీసులు అందజేశారు. ఈ నెల 9వ తేదీన తదుపరి విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించారు. అక్కడి నుంచే సీఐతో పాటు ఎస్ఐ క్యాబ్లు బుక్ చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మొదలైన పైరవీలు.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్పై ఏసీబీ ఆరోపణలు రావడంతో దాదాపు ఆయనను పదవి నుంచి తొలగించడం ఖాయంగా కనిపిస్తున్నది. అప్పుడే ఈ పోస్టు కోసం కొందరు సీఐలు పైరవీలు మొదలు పెట్టారు. సమర్ధుడైన అధికారిని రాజకీయాలతో సంబంధం లేకుండా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రలోభాలతో స్టేషన్ పరువు ప్రతిష్టలు దిగజారుతున్నట్లుగా అధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతో పోస్టింగ్లు దక్కించుకుంటున్న సీఐలు తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో బంజారాహిల్స్ పోస్టింగ్ నేరుగా ఇవ్వాలని, రాజకీయ నాయకులకు తలొగ్గద్దని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వచ్చేందుకు పోలీసు అధికారులతోనే పైరవీ చేస్తున్నట్లు సమాచారం. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డుకు 41-ఏ నోటీసులు
-
వసూళ్ల బాగోతం.. బంజారాహిల్స్ సీఐకి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏసీబీ కార్యాలయానికి నరేందర్ను తరలించారు. సీఐతో పాటు ఎస్ఐ, హోంగార్డును ఏసీబీ తరలించింది. సీఐ నరేందర్ను 20 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. స్కెలాంజ్ పబ్ యజమానులను ప్రశ్నించిన ఏసీబీ.. స్టేట్మెంట్ రికార్డు చేసింది. పబ్ వ్యవహారంతో పాటు... మిగతా వసూళ్ల పైనా ఏసీబీ ఆరా తీస్తోంది. 9న విచారణకు హాజరుకావాలి.. ఏసీబీ నోటీసులు.. నరేందర్ వసూళ్ల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఐ, ఎస్ఐ హోం గార్డ్లకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను ఏసీబీ జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్పై దాడి చేశారు. నరేందర్, నవీన్రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్కు, నరేందర్ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్ దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. చదవండి: మెట్రో రైలులో యూట్యూబర్ హల్చల్.. ప్రయాణికులను షాక్ -
Bribe Case: బంజారాహిల్స్ పీఎస్ లో కొనసాగుతోన్న ఏసీబీ విచారణ
-
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్పై దాడి చేశారు. నరేందర్, నవీన్రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్కు, నరేందర్ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్కు అస్వస్థత
-
బంజారా హిల్స్ సీఐ కేసులో కీలక విషయాలు
-
ఏసీబీ వలలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్
-
సీఎం సారూ.. ఈ రోడ్డు జర చూడరూ!
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబన్–14లోని నందినగర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడు సంవత్సరాల నుంచి ఈ రోడ్డును నిర్మించాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కేన్సర్ హాస్పిటల్ వెనుక ఉన్న ఈ రోడ్డు మీదుగా సీఎం కేసీఆర్ తన స్వగృహానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓ వైపు హాస్పిటల్కు వచ్చే రోగులు వారి సహాయకులతోనూ షాపింగ్లకు వచ్చే వారితోనూ ఈ ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికి తోడు పక్కనే ఉన్న బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చే భక్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న రిపేర్లు చేసినా ఫలితం లేదు. ఈ రిపేర్ల వల్ల రోడ్డు మరింత శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రూపురేఖలు మారిపోయి చెరువులా తయారైంది. చిన్నపాటి వర్షం పడినా రోడ్డు నీటితో నిండిపోతోంది. అధికారులు ఇప్పటికై నా స్పందించి ఈ మార్గంలో కొత్త రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
-
హైదరాబాద్లో భారీ వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. సడెన్గా కురిసిన భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బాల్కంపేట్, బాలానగర్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బేగంపేట, గచ్చిబౌలి, మనికొండ, లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Heavy rain ☔🌧️ #Hyderabadrains pic.twitter.com/Qw3WJlLlDm — Mohan Kumar (@ursmohan_kumar) September 25, 2023 #25SEP 2:45PM⚠️ Short Duration (10-20mins) Moderate/Heavy Rain Spell Ahead for Many Parts of City during the next 1Hr🌧️#HyderabadRains pic.twitter.com/IX0cBMtOgx — Hyderabad Rains (@Hyderabadrains) September 25, 2023 -
బంజారాహిల్స్లో హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఉత్సవాలు
-
హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ ఫస్ట్ ప్లేస్లో ఈ రోడ్డు!
హైదరాబాద్: నగరంలో ఇది కీలకమైన రోడ్డు. అనునిత్యం ప్రముఖులు కూడా ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్ వాహనచోదకులకు నరకం చూపిస్తోంది. డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతోంది. సదరు రూట్లో ఉన్న బాటిల్ నెక్స్తో పాటు కొన్ని వ్యాపార సంస్థల కారణంగానూ ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏళ్లుగా ఇదే దుస్థితి ఉన్నా ట్రాఫిక్ విభాగం అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంజగుట్టలోని నాగార్జున సర్కిల్ నుంచి పెన్షన్ ఆఫీస్ మీదుగా మాసబ్ ట్యాంక్ చౌరస్తా వరకు 2.9 కిలోమీటర్ల పరిధిలో రోడ్ నెం.1 ఉంటుంది. నిరంకారి–పంజగుట్ట మధ్య ఉన్న మార్గానికి ఇది సమాంతరంగా ఉంటుంది. రోడ్ నెం.1 మీదుగా అనునిత్యం ప్రముఖులు, ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు, సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. ఈ కారణంగానే రోడ్డు రోజూ రద్దీగానే ఉంటుంది. వెస్ట్జోన్ పరిధిలో ఉన్న అనేక కీలక ఆస్పత్రులకు వెళ్లి వచ్చే అంబులెన్సులతో హడావుడి కూడా ఎక్కువే. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఈ రోడ్డులో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.1 మీదనే తాజ్ కృష్ణ, 1/10, 1/12 వంటి కీలక జంక్షన్లతో పాటు పోలీసు ఆఫీసర్స్ మెస్ ‘టి’ జంక్షన్ కూడా నిత్యం హడావుడిగానే ఉంటుంది. రద్దీ వేళల్లో 45 నిమిషాల వరకు... వెస్ట్జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులు సైతం రోడ్ నెం.1నే ఆశ్రయిస్తారు. మాసబ్ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వరకు వెళ్ళి అక్కడే పీవీ నర్సింహ్మారావు ఎక్స్ప్రెస్ వే ఎక్కుతారు. దీంతో విదేశీయుల కోణంలోనూ ఈ రూట్ కీలకమే. ఈ రహదారిలో ఉన్న జంక్షన్లలో కొన్ని ఇరుకుగా ఉంటాయి. దీనికి తోడు కేర్ ఆస్పత్రికి సమీపంలో, 1/12 జంక్షన్ దాటిన తర్వాత రోడ్డు బాటిల్ నెక్గా మారుతుంది. వీటితో పాటు ఈ రహదారిలో ఉన్న రెండు ప్రముఖ బేకరీ కమ్ రెస్టారెంట్లకు వచ్చిపోయే వాహనాలు, ఓ మద్యం దుకాణం వద్ద ఆగే కొనుగోలుదారుల వెహికిల్స్తో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఈ కారణాలతో రద్దీ వేళల్లో ఒక్కోసారి ఈ రూట్ దాటడానికి 45 నిమిషాల వరకు పడుతోంది. అంబులెన్సుల సైరన్ వినిపిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోంది. వర్షం కురిస్తే మరీ ఘోరం... సాధారణ రోజుల్లో పీక్ అవర్స్గా పిలిచే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఇక వర్షం కురిసిన రోజుల్లో సమయాలతో సంబంధం లేకుండా రోడ్డు మొత్తం జామ్ అయిపోతుంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికి అటు జీహెచ్ఎంసీ, ఇటు పోలీసు విభాగాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి అత్యంత ప్రముఖుల కదలికలు ఉంటే మాత్రమే ట్రాఫిక్ పోలీసుల హడావుడి కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఈ అధికారులు తీసుకునే చర్యలు నామమాత్రమే. ఆయా వ్యాపార సంస్థల వద్ద రోడ్డుపై వాహనాలు ఆగినా, క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. దీని ప్రభావం బంజారాహిల్స్ రోడ్.నెం.1 మొత్తమ్మీద ఉంటోంది. ఇకనైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వాహనచోదకులు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ రూట్లో గస్తీ వాహనాలు మోహరించాలని సూచిస్తున్నారు. -
Banjara Hills: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: మసాజ్ కేంద్రాలు, స్పాల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న రెండు కేంద్రాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్.కార్తీక్లపై కేసు నమోదు చేశారు. ది వెల్వెట్ స్పాపై... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న ది వెల్వెట్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేశారు. -
బంజారాహిల్స్: టెక్నోవిజన్ స్టోర్లో సందడి చేసిన జబర్దస్త్ ఫేం, నటి వర్ష (ఫొటోలు)
-
Hyderabad: మసాజ్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్లో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు సదరు సెలూన్పై దాడులు చేశారు. ప్రకాశ్ అనే వ్యక్తి.. ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పది మంది యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెలూన్ను సీజ్ చేశారు. -
Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో
సాక్షి, హైదరాబాద్: తాగుడుకు బానిసైన భర్తను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్ జిల్లా దరూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అంజలికి 2014లో పెళ్లి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని శ్రీరాంనగర్లో నివసిస్తూ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె భర్త నరేంద్ర రోడ్ నెం. 12లోని టీఎక్స్ ఆస్పత్రిలో వార్డు బాయ్గా పని చేస్తుండేవాడు. ఇటీవల ఉద్యోగం కూడా చేయకుండా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటూ భార్య సంపాదనతోనే మద్యం తాగుతున్నాడు. ఈ విషయంలో ఆమె ఎన్నిసార్లు మందలించినా వినిపించుకోకపోగా సెల్ఫోన్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతుండటమే కాకుండా అబద్దాలు కూడా చెప్తుండేవాడు. దీంతో విసిగిపోయిన అంజలి గురువారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నారులపై దూసుకెళ్లిన వాహనం -
ఐఏఎస్కు అత్తింటి వేధింపులు, 25 రోజులే కాపురం చేసిన భార్య!
హైదరాబాద్: తనపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీ సులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బీహార్కు చెందిన సందీప్ కుమార్ ఝా తెలంగాణ కేడర్లో ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు. అతడికి 2021 నవంబర్ 21న పల్లవి ఝాతో వివాహం జరిగింది. పెళ్ళి తర్వాత బంజారాహిల్స్లోని తన నివాసంలో 25 రోజులు మాత్రమే కాపురం చేసిన ఆమె తనతో పాటు కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేదన్నారు. అంతేగాక ఆమె సోదరుడు తన ఇంట్లో రూ. 65 వేలు తస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి పల్లవి ఝా ఆమె తండ్రి ప్రమోద్ ఝా, సోదరుడు ప్రంజాల్ ఝా తనను వేధింపులకు గురి చేయడంతో పాటు తప్పుడు ఆరోపణలతో బీహార్లో కేసులు నమోదు చేయించారన్నారు. అంతటితో ఆగకుండా సొంతూరులోని తన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరిచారని అంతుచూస్తామని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గూడు కట్టిన ‘కరుణ’
బంజారాహిల్స్: పేదింటికి పెన్నిధిలా మారారు ఆయన. తనకొచ్చిన కష్టాన్ని వివరించేందుకు వచ్చిన దీనురాలికి సాయం అందించి తోడుగా నిలిచారు ఎస్ఐ కరుణాకర్రెడ్డి. వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 10లో నివసించే 70 ఏళ్ల ఉన్నిసా బేగం భర్త మూడు దశాబ్దాల క్రితం మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి. తాను ఉంటున్న ఇంటిని ఉన్నిసా బేగం దాచుకున్న డబ్బుతో గత ఏడాది బాగు చేయించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇల్లు ఉరుస్తుండటంతో.. మేస్త్రి సరిగా రిపేరు చేయలేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లింది. వృద్ధురాలి బాధను విన్న ఎస్ఐ కరుణాకర్ రెడ్డి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంటికి అవసరమైన కొత్త సిమెంట్ రేకులను తన సొంత డబ్బుతో అందించారు. ఎస్ఐ ఔదార్యాన్ని స్థానికులు అభినందించారు. -
Hyderabad: భర్త అన్నం తినడం లేదని.. అలిగి భార్య ఆత్మహత్య
సాక్షి, బంజారాహిల్స్: మూడు రోజులుగా తాను చేసిన వంటలు తినకుండా బయట తినడమే కాకుండా ఇదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.11లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే కె.సంగీత (23) వివాహం 2019లో కె.సంజీవతో జరిగింది. డ్రైవర్గా పనిచేస్తున్న సంజీవ గత మూడు రోజుల నుంచి ఇంట్లో తినకపోవడంతో సంగీత ప్రశ్నించింది. ప్రతిరోజూ వంట చేస్తున్నానని, తినకపోవడంతో అవి పాడైపోతున్నాయని వెల్లడించింది. దీనికి తోడు ఆమెకు కొంత కాలంగా అనారోగ్యం కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి సంజయ్ రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అరుదైన పాము ‘కామన్కుక్రి’ పట్టివేత -
బంజారాహిల్స్లో కారు బీభత్సం.. రాంగ్రూట్లో వచ్చి బైక్ను ఢీకొట్టి.
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ ఏరియా మేనేజర్ పనిచేస్తున్న బాలచందర్ తీవ్రంగా గాయపడ్డారు. నికులు బాల చందర్ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నెంబర్ (TS09EJ5688) పోలీసులు నిర్థారించారు. ఈ సమయంలో కారులో డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె క్రెడిట్ కార్డు చోరీ
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నమ్మిన యజమానురాలిని మోసం చేసిన డ్రైవర్ ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డును చోరీ చేసి డబ్బులు డ్రా చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాలివీ.. మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూతురు డీకే శృతిరెడ్డి బంజారాహిల్స్ రోడ్ నంబర్.14లోని ప్రేమ్పర్వత్ విల్లాస్లో నివసిస్తుంది. గతేడాది డిసెంబర్ నుంచి చిన్నా అలియాస్ కె. బీసన్న ఆమె వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆమెకు చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించి శ్రీమహవీర్ జెమ్స్ అండ్ పెరల్స్లో స్వైప్ చేసి రూ. 11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శృతిరెడ్డి సదరు డ్రైవర్ను ప్రశ్నించింది. చదవండి: హయత్నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్ అబద్దాలు చెప్పడమే కాకుండా రకరకాల కథలతో ఆమెను నమ్మించాలని చూసినా చివరకు తన క్రెడిట్ కార్డును దొంగిలించి డబ్బు వాడుకున్న విషయం వెల్లడైంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు చిన్నా అలియాస్ బీసన్నపై ఐపీసీ 420, 408ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..
బంజారాహిల్స్: నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచే వరకట్న వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రోహిత్ డేవిడ్ పాల్కు గత ఏడాది మార్చి 1న కంట్రీక్లబ్లో యువతితో నిశి్చతార్థం జరిగింది. ఇందుకోసం అత్తింటివారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. గతేడాది జూలైలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. సదరు యువకుడు పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చాడు. ఆయన తల్లి కూడా ఈ పెళ్లి విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. రూ.2 కోట్ల వరకట్నం ఇస్తే చేసుకుంటానంటూ ఇటీవల మెలిక పెట్టాడు. చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలి మేనమామ ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది.నిశ్చితార్థం సమయంలో బంగారు ఉంగరం, దుస్తుల కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వాటిని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: చికిత్స కోసం వెళ్తే రూ.85 లక్షల డైమండ్ రింగ్ మాయం..
హైదరాబాద్: క్లినిక్లో చోరీ చేసిన డైమండ్ రింగ్ను నిందితురాలు బాత్రూంలోని వెస్ట్రన్ కమోడ్లో వేయడంతో.. పైపులైన్ను తవ్వి దానిని వెలికితీసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నివసించే ప్రముఖ వ్యాపారి నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు తనిష్క అగర్వాల్ గత నెల 23న మధ్యాహ్నం జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్ సమీపంలోని ఎఫ్ఎంఎస్ స్కిన్ అండ్ డెంటల్ క్లినిక్కు చికిత్స కోసం వచ్చారు. ఆ సమయంలో చేతికి ఉన్న ఉంగరంతో పాటు బ్రాస్లైట్ తొలగించాలని స్కిన్ థెరపిస్ట్ లాలస ఆమెకు సూచించింది. ఆ మేరకు తనిష్క తన వేలికి ఉన్న రూ.85 లక్షల విలువైన డైమండ్ రింగ్తో పాటు చేతికి ఉన్న బ్రాస్లైట్ను పక్కన పెట్టారు. చికిత్స పూర్తయిన తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి చూసుకోగా ఉంగరం, బ్రాస్లైట్ కనిపించకపోవడంతో మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి వెంటనే క్లినిక్కు పరుగులు తీశారు. అక్కడ ఉద్యోగులు తమకేమి తెలియదని బుకాయించారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి ఉద్యోగులను వేర్వేరు కోణాల్లో విచారించారు. తనిష్కకు చికిత్స నిర్వహించిన స్కిన్ థెరపిస్ట్ లాలసను తమదైన శైలిలో రెండు రోజుల పాటు విచారించారు. దీంతో పోలీసులకు చిక్కుతానేమోననే భయంతో లాలస ఈ నెల 1న తాను పర్సులో దాచిపెట్టిన డైమండ్ రింగ్ను బాత్రూం కమోడ్లో పడేసింది. పోలీసులు గట్టిగా విచారించగా రింగ్ను కమోడ్లో వేసిన విషయాన్ని వెల్లడించింది. దీంతో పోలీసులు కూలీల సహాయంతో డెంటల్ క్లినిక్లో ఉన్న రెండు బాత్రూంలను రోజంతా తవ్వారు. ఆదివారం తెల్లవారుజామున డ్రైనేజీ పైపులైన్లో ఓ మూలకు చిక్కుకున్న రింగ్ కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దురుద్దేశంతోనే లాలస ఈ డైమండ్ రింగ్ను చోరీ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. -
బంజారాహిల్స్లో దారుణం: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. నగ్న ఫొటోల్ని..
బంజారాహిల్స్: తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యూడ్ వీడియోలను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై బాధితురాలుఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్గూడ సమీపంలోని ఎల్.ఎన్.నగర్లో నివసించే యువతికి అదే ప్రాంతంలో నివసిస్తున్న దెబాస్ దేకా(27)తో గతేడాది అక్టోబర్లో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అప్పటి వరకు సహజీవనంతో కలిసి ఉందామని నమ్మించాడు. తరచూ ఆమెకు ఇష్టం లేకుండానే లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. గత మార్చి 26వ తేదీన యూసుఫ్గూడలోని తన గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ సమయంలో కూడా పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డట్లు ఆమె వెల్లడించింది. ఇష్టం లేకుండానే బలవంతంగా శారీరక వాంఛలు తీర్చుకునేవాడని ఎన్నోసార్లు వ్యతిరేకించడం జరిగిందని పేర్కొంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా తన న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దేబాస్ దేకాపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగి భార్యపై కన్నేసి.. భర్తలేని సమయంలో ఇంటికి వచ్చి...
హైదరాబాద్: తనవద్ద పనిచేస్తున్న ఉద్యోగి భార్యపై కన్నేసి ఆమెను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివసించే బొల్లి బాలమద్దిలేటి ప్రైవేటు సంస్థలో సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. అదే సంస్థలో హౌజ్ కీపింగ్ ఉద్యోగిని ఐదు రోజుల క్రితం బైక్పై అతడి ఇంటి వద్ద దింపేందుకు వచ్చిన బాలమద్దిలేటి సదరు ఉద్యోగి భార్యపై కన్నేశాడు. మర్నాడు ఆమె భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చిన మద్దిలేటి ఆమెతో మాటలు కలిపాడు. రెండ్రోజుల పాటు ఆమెను వెంబడిస్తూ వేధించడమేగాక తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేఐసి మంగళవారం నాంపల్లిలోని 10వ స్పెషల్ మెట్రో పాలిటన్ మెజి్రస్టేట్ ఎస్.లక్ష్మణ్రావు ఎదుట హాజరు పర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. -
బంజారాహిల్స్ ఆధ్యా స్టోర్లో సందడి చేసిన డిజైనర్లు (ఫొటోలు)
-
దూరమవుతుందనే దారుణం
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న బి.చంద్ర మోహన్ చేతిలో దారుణంగా హతమైన మాజీ హెడ్ నర్సు వై.అనురాధ కేసులో స్పష్టత వచ్చింది. కొన్నేళ్లుగా చంద్రమోహన్తో సన్నిహితంగా ఉంటున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించడంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మలక్పేట ఏసీపీ శ్యామ్సుందర్, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్, డీఐ ఎల్.భాస్కర్రెడ్డిలను కొత్వాల్ సీవీ ఆనంద్ మంగళవారం అభినందించారు. బంజారాహిల్స్లోని ఐసీసీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారికి సర్టిఫికెట్లు, నగదు పురస్కారం అందించారు. అనురాధ, చంద్ర మోహన్ 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇతడు అనురాధ నుంచి 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. చాన్నాళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ ఇటీవల రెండో వివాహం చేసుకోవాలని భావించి ఓ మాట్రిమోనియల్ సైట్లో పేరు రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో వచ్చే కాల్స్ను ఆమె రహస్యంగా మాట్లాడుతోంది. దీంతో చంద్రమోహన్కు అనుమానం వచ్చింది. ఈ నెల 12న అనురాధ గదికి అతను వచ్చిన సందర్భంలో ఆమె తన ఫోన్ వదిలి స్నానానికి వెళ్లింది. అప్పుడే ఆ ఫోన్ చూసిన చంద్రమోహన్కు ఆమె రెండో పెళ్లి ప్రయత్నాల విషయం తెలిసింది. అప్పటికే ఆమె వద్ద ఉన్న రూ.30 లక్షలు తనకే దక్కాలని భావించిన చంద్రమోహన్ పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తే ఆమె తనకు దూరమవుతుందని అనుకున్నాడు. దీంతో అనురాధతో ఘర్షణకు దిగి దారుణంగా హత్య చేశాడు. -
‘ఉప్పు’ రెస్టారెంట్లో మూడు ప్రాంతాల వంటకాలు
బంజారాహిల్స్: గోంగూర మటన్, రొయ్యల వేపుడు, కోడిపులుసు, నాటుకోడి ఫ్రై తదితర స్పైసీ రుచులతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓహిరీస్ హోటల్ ఉప్పు రెస్టారెంట్లో నగర ఆహార ప్రియుల జిహా్వచాపల్యాన్ని తీర్చే వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు ఐస్క్రీంతో బెల్లంపాకం, పాలజున్ను, బెల్లం ఐస్క్రీం, కులీ్ఫ, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ, కోనసీమ, రాయలసీమ సంప్రదాయ వంటకాలను ఇక్కడ ఆస్వాదించవచ్చునని ఓహిరీస్ గ్రూప్ ఎండీ అమర్ ఓహిరి, జనరల్ మేనేజర్ సపతాదిప్రాయ్ తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేకమైన రీతిలో విభిన్నమైన శాఖాహార, మాంసాహార రుచులను ఇక్కడ అందిస్తున్నామన్నారు. రాయల్ థీమ్తో మెనూను ప్రత్యేకంగా తీర్చిదిద్దామన్నారు. రాజమండ్రి నాన్వెజిటేరియన్ థాలి, ఉప్పు స్పెషల్ రాయల్ థాలి వంటివి ఆహార ప్రియులను ఆకట్టుకుంటాయన్నారు. -
బంజారా హిల్స్ లోటస్ పాండ్ చెరువులో చేపల మృత్యువాత
-
అయ్యయ్యో.. చేపలు! లోటస్పాండ్ చెరువులో 3 వేలకుపైగా మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని లోటస్పాండ్ అంటేనే అందమైన చెరువు, చుట్టూ పచ్చని మొక్కలు, చెరువులో పెద్ద ఎత్తున కనిపించే వివిధ రకాల చేపలు, తాబేళ్లు, పక్షులు కనిపిస్తుంటాయి. ఏమైందో ఏమో.. ఎవరేం చేశారో తెలియదు.. గడిచిన నాలుగు రోజులుగా చెరువులోని చేపలు వేలాదిగా మృతి చెందుతున్నాయి. చేపలు విలవిల్లాడుతూ గాల్లోకి ఎగురుతూ మృతి చెందుతున్న వైనాన్ని చూసి నిత్యం పార్కు వచ్చే వాకర్లు, సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి మురుగు నీరు పారడం వల్ల అని కొందరు అంటుంటే, చెరువులో నీళ్లలో ఎవరో విష ప్రయోగం చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. చేపలతో పాటు పెద్ద ఎత్తున ఈ నీళ్లలో వేలాదిగా తాబేళ్లు సైతం ఉన్నాయి. ఇవి కూడా చనిపోతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం నాలుగు రోజుల నుంచి విషయాన్ని గమనిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విష ప్రయోగమా? కలుషిత నీరా..? వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచి్చంది. వర్షాలు తగ్గిన తర్వాత కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొంత మంది నివాసితులు తమ సెల్లార్లలో నిండిన వరద నీటిని బయటికి పంపింగ్ చేశారు.ఈ నీరు సైతం చెరువులోకి వచ్చి చేరింది. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న కొంత మంది భవన నిర్మాణదారులు బ్లాస్టింగ్లో వినియోగించే కెమికల్ వ్యర్థాలను కూడా ఈ చెరువులోకి పంపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కెమికల్ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాటి వల్లే చేపలు చనిపోయి ఉంటాయని ఇంకొంత మంది భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు గడిచిన నాలుగు రోజులుగా చేపలు చనిపోతున్న విషయాన్ని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఎని్వరాన్మెంట్ అధికారులు, బయోడైవర్సిటీ, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఫిర్యాదు చే శారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇక్కడ నీటి శాంపిల్స్ను తీసుకొని వెళ్లారు. మంగళవారం జలమండలి అధికారుల సైతం పార్కులో పర్యటించి పార్కులోకి మురుగు నీరు రావడం లేదని తెలిపారు. చేపలకు ఆహారం... నిత్యం ఈ పార్కుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, సందర్శకులు వస్తుంటారు. వాకింగ్ చేయడంతో పాటు కొంత మంది చేపలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వేస్తుంటారు. చేపలకు ఏం ఆహారం వేయాలి, ఎవరు వేయాలి అనే నియంత్రణ ఇక్కడ ఏ మాత్రం లేదు. ఎవరు పడితే వారు వచ్చి వారికి తోచిన ఆహార పదార్థాలను వేసి వెళ్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు చేపలకు బిస్కెట్లు, బన్ను, బ్రెడ్, రొట్టెలు ఇలా ఇష్టమొచి్చన ఆహార పదార్థాలను వేస్తుంటారు. చదవండి: ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం -
ప్లే జోన్ మెషిన్ లో పడి తెగిపోయిన మూడేళ్ల చిన్నారి చేతివేళ్లు
-
HYD: బంజారాహిల్స్ సిటీ సెంటర్లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని సిటీ సెంటర్ మాల్లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ప్లే జోన్లో మెషిన్లో పడి మూడేళ్ల చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు యశోద ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. వివరాలు. ఇబ్రహీంనగర్కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం సెలవు కావడంతో తన ముగురు పిల్లలతో కలిసి బంజారాహిల్స్లోని సిటీ సెంటర్ మాల్కు వచ్చాడు. మాల్లో నాలుగో అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ తెరిచి ఉన్న ఓ మిషన్లో అనుకోకుండా మూడేళ్ల మెహ్వీష్ అనేక బాలిక చేయి చేపట్టడంతో ఆమె చేతి వేళ్లు నలిగిపోయాయి. చిన్నారిని వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక కుడిచేతి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయితే చిన్నారి మూడు వేళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం భద్రతా వైఫల్యం వల్లే జరిగిందని, సిటీ సెంటర్ యాజమాన్యంపై చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిటీ సెంటర్ మాల్ యాజమాన్యంపై బంజారాహిల్స్ పీఎస్లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సెంటర్ మాల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు. చదవండి: ప్రియాంక క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన కేటీఆర్ -
బంజారాహిల్స్లో మోడల్స్...ఫొటోలకు పోజులిస్తూ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ నగరాన్ని మరోసారి ముంచెత్తిన వానలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని వానలు వీడటం లేదు. ఎప్పడు వర్షం పడుతుందో.. ఎప్పుడో ఎండ కొడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో నగర వాసులు బెంబేలెత్తుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో, వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని వానలు మరోసారి ముంచెత్తాయి. నగరంలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మనస్థలిపురం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, కొత్తపేట్, చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్ నగర్, కంచన్బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, ఘట్కేసర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, ఆల్విన్ కాలనీ, బీహెచ్ఈఎల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. Nacharam IDA right now 😲 ⛈️#Hyderabadrains pic.twitter.com/5lSONcMg8p — Devanjan C. (@crazypoorindian) May 1, 2023 Another day, another downpour ⚠️#Hyderabadrains #freakweather pic.twitter.com/iOX285N4Uo — Anirudh J 🇮🇳 (@Anirudhj12) May 1, 2023 మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులను అప్రమత్తం చేస్తూ అర్భన్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు. నగర వాసులు త్వరగా ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు హై అలర్ట్లో ఉండాలని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Moin Bagh the constituency of chandrayangutt assembly #Hyderabad #Telangana #hyderabadRains pic.twitter.com/IhJEeL9vF3 — Syedafroz000 (@AfrozFit) May 1, 2023 Heavy rains alert in the evening now onwards in #Hyderabad Try and reach home early and stay indoors unless it's an emergency @Director_EVDM - Pl let your teams be on high alert @GadwalvijayaTRS @KTRBRS pic.twitter.com/stxVjSLRDw — Arvind Kumar (@arvindkumar_ias) May 1, 2023 And what it left in the process 😂 pic.twitter.com/c3oX0LNG18 — Srinivasan_Krishnamurthy (@SRINIVASAN_97) May 1, 2023 -
బంజారాహిల్స్ : నగల దుకాణంలో రకుల్ సందడి
బంజారాహిల్స్ : నగల దుకాణంలో రకుల్ సందడి -
బంజారాహిల్స్లో మోడల్స్...ఫొటోలకు పోజులిస్తూ సందడి (ఫొటోలు)
-
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటన.. డ్రైవర్కు 20 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ డ్రైవర్ అకృత్యాలపై కోర్టు తీర్పు వెల్లడించింది. గతేడాది డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్ను న్యాయస్థానం దోషిగా తేల్చుతూ.. శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన డ్రైవర్ రజినీకుమార్కు నాంపల్లి ఫాస్ట్ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇదే కేసులో స్కూల్ ప్రిన్సిపాల్ మాదవి రెడ్డిని నిర్ధోషిగా తేల్చింది. కాగా గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది. ఈ విషయమై విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించడంతో.. ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అనంతరం తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నవంబర్లో పాఠశాల తిరిగి తెరుచుకుంది. అక్టోబర్ 19న నిందితుడిని, నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జి హెచ్ఎం మాధవిల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, ఆరు నెలల దర్యాప్తు, విచారణ తర్వాత కోర్టు దోషికి శిక్ష ఖరారు చేసింది. చదవండి: దంచికొడుతున్న ఎండలు, ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు.. తస్మాత్ జాగ్రత్త! -
Hyderabad: ఇద్దరు బాలికల అదృశ్యం
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వి.శిరీష (12) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. అయితే తమ కూతురిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారంటూ తండ్రి వి.కృష్ణ ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని దుర్గా భవానీనగర్లో నివసించే వి.శిరీష స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 12న ఉదయం తల్లిదండ్రులు జీహెచ్ఎంసీలో పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న సోదరి కనిపించడం లేదంటూ కొడుకు నరేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ, సుజాత దంపతులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. తనకు వరుసకు మేనల్లుడు వి.మల్లేష్ (22) కూడా కనిపించడం లేదని, అతడిపైనే తమకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణ పేర్కొన్నాడు. డబ్బుల కోసం తన కూతురిని కిడ్నాప్ చేశారని, సీసీ కెమెరా ఫుటేజీలో మల్లేష్ తల్లి సరోజమ్మ తన కూతురిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించిందన్నారు. మల్లేష్ ఇటీవల తనను రూ. 50 వేలు అడిగాడని, తాను లేవని చెప్పడంతో కక్ష పెంచుకొని తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శిరీష ఆచూకీ తెలిసిన వారు 8712660458 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. బంజారాహిల్స్లో 9వ తరగతి విద్యార్థిని బంజారాహిల్స్: అనుమానాస్పదస్థితిలో 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 10లోని నూర్నగర్లో నివసించే అమ్రీన్ బేగం(14) సెయింట్ నిజామియా హైస్కూల్లో చదువుతోంది. ఈ నెల 21న జహిరానగర్లోని షాహిన్ కన్వెన్షన్ హాల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి హాజరైంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో సోదరుడు హనీఫ్ ఫోన్ చేయగా కార్యక్రమం ఇంకా జరుగుతున్నదని, కొద్దిసేపట్లో వస్తానని తెలిపింది. అయితే సోదరుడు కొంత సమయం తర్వాత హాల్ వద్దకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షాహిన్ కన్వెన్షన్ హాల్ నుంచి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన చెల్లెలు అదృశ్యమైందని పోలీసులకు హనీఫ్ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శభాష్ పోలీస్: 16 మంది ప్రాణాలను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ
బంజారాహిల్స్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకెళ్లే క్రమంలో వ్యాన్ డ్రైవర్ హోంగార్డుకు మూర్ఛ రావడంతో ఖైరతాబాద్ ఫ్లైఓవర్పై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన బంజారాహిల్స్ ఎస్ఐ కరుణాకర్రెడ్డి 16 మంది విద్యార్థులకు ముప్పు తప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం మధ్యాహ్నం ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్కు వచ్చారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వీరిని అరెస్ట్ చేసి డీసీఎంలోకి ఎక్కించి బందోబస్తులో బంజారాహిల్స్ ఎస్ఐ కరుణాకర్రెడ్డిని పంపించారు. డీసీఎం డ్రైవర్ రమేష్ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్పై నుంచి వెళ్తుండగా ఫిట్స్ రావడంతో స్టీరింగ్ వదిలేశాడు. దీంతో వ్యాన్ డివైడర్ను ఢీకొడుతూ వెళ్లింది. వీరందరిని తీసుకొని వెళ్తున్న కరుణాకర్రెడ్డి వెంటనే డ్రైవర్ సీటులోకి వెళ్లి రమేష్ను పక్కకు జరిపి వ్యాన్ను ఫుట్పాత్కు ఢీకొట్టేలా చేశాడు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. హోంగార్డు రమేష్ను ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ను పక్కకు జరిపే క్రమంలో ఎస్ఐ కరుణాకర్రెడ్డికి, మరో కానిస్టేబుల్ సాయికుమార్కు గాయాలయ్యాయి. వీరిద్దరిని కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్లో భారీ వర్ష బీభత్సం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన సైతం కురిసింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక, శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాలో వడగండ్లతో భారీ వర్షం కురిసింది. అటు, హైదరాబాద్లో కూడా శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములతో కూడిన వడగండ్ల వర్షం ప్రారంభమైంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, జగిత్యాల జిల్లా భీమారంలో వడగండ్ల వాన దంచికొట్టింది.కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ సందర్భంగా ఈదురు గాలుల తాకిడితో పలు రేకుల షేడ్లు ధ్వంసమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో వర్ష బీభత్సం నెలకొంది. గంగాధర మండల కేంద్రంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. ఇక, ఏపీలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. Hailstorm rain 🌧️ at #Hyderabad Total grass covered with ice. pic.twitter.com/niIjsoA3Gx — ma_saravanan (@masaravanan73) March 18, 2023 Ice rain Hyderabad lo pic.twitter.com/NKCZpWtBho — Prabhas (@Kranthi_1322) March 18, 2023 Good rain in Chanda nagar Hyderabad pic.twitter.com/DU1abxHsYk — CV Reddy (@cvreddy2) March 18, 2023 -
బంజారాహిల్స్లో కారు బీభత్సం!
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): మద్యంతో పాటు గంజాయి సేవించి అదుపుతప్పిన వేగంతో కారులో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన ముదిగొండ అనూష్ రావు (22), కొత్తపేటకు చెందిన పవన్ కళ్యాణ్రెడ్డి (22) స్నేహితులు. శనివారం రాత్రి శంషాబాద్లోని ఓ పబ్లో మద్యం తాగారు. గంజాయి కూడా తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ నుంచి వీరిద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. మత్తులో డ్రైవింగ్.. సిగరెట్లలో గంజాయి నింపుకొని తాగుతూ అదుపుతప్పిన వేగంతో బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి దూసుకెళ్తున్నారు. మాదాపూర్లోని సౌండ్స్ అండ్ స్పిరిట్స్ పబ్లో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్కు చెందిన అజ్మత్, విజయ్కుమార్ బౌన్సర్లుగా పని చేస్తున్నారు. విధులు ముగించుకొని తెల్లవారుజామున బైక్పై బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి వెళ్తుండగా క్రీమ్స్టోన్ వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన అనూష్ రావు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అజ్మత్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. విజయ్కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో అనూష్రావు స్కూటర్ను ఢీకొట్టి పక్కకు తిప్పే క్రమంలో అక్కడ మరో కారును ఢీకొట్టాడు. ఆ కారు రోడ్డుకు అడ్డం తిరగడంతో వెనకాల వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఇలా నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదానికి కారకులైన అనూష్రావు, పవన్ కళ్యాణ్రెడ్డిని అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఇద్దరూ మద్యం తాగినట్లు గుర్తించారు. మద్యం, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా తీసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో గంజాయి నింపిన సిగరెట్లతో పాటు 50 గ్రాముల గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. అనూష్ రావు, పవన్ కళ్యాణ్రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును సీజ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ కారు అనూష్ రావు తల్లి పేరు మీద ఉన్నట్లుగా తేలింది. చదవండి: నల్గొండ కాంగ్రెస్లో కలకలం.. కోమటిరెడ్డి ఆడియో లీక్! -
బంజారాహిల్స్లో మద్యం మత్తులో యువకుడి వీరంగం
-
బంజారాహిల్స్లో మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సైని కాలుతో తన్ని
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే యువకుడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎసైను కాలితో తన్నాడు. యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్గా గుర్తించారు. -
ల్యాబ్ టెక్నీషియన్ కీచక బుద్ది.. ఎల్కేజీ విద్యార్థికి చిక్లెట్ ఆశచూపి..
సాక్షి, బంజారాహిల్స్: ఐదేళ్ల చిన్నారిపై లైంగికి దాడికి యత్నించిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడం గ్రామానికి చెందిన బామిని మోహన్ (29) పంజగుట్టలో అద్దెకుంటూ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 22న మధ్యాహ్నం ఫిలింనగర్లోని మాగంటి కాలనీలో నివసించే స్నేహితుడు ప్రసాద్ ఇంటికి వచ్చి మోహన్ పీకలదాకా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న అతను సాయంత్రం అదే ఇంటి కింది భాగంలో ఉంటున్న ఎల్కేజీ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని గదిలోకి తీసుకెళ్లాడు. దుస్తులు విప్పేసిన మోహన్ ఆ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు.రోదిస్తూ బయటికి వచ్చిన చిన్నారిని ఏం జరిగిందని తల్లి ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది. స్థానికులు నిందితుడు మోహన్తో పాటు విందుకు పిలిచిన స్నేహితుడు ప్రసాద్ను చితకబాదారు. అక్కడి నుంచి మోహన్ పరారు కాగా చిన్నారి తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
నమ్రత కొత్త రెస్టారెంట్ ప్రారంభం (ఫొటోలు)
-
బిల్డర్కు బ్లాక్మెయిల్.. యువతిని లైంగికంగా వేధించాడంటూ లేఖ రాసి..
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): ప్రముఖ బిల్డర్కు ఆకాశరామన్న ఉత్తరాలు రాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న ప్రముఖ బిల్డర్కు జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లో ఉంటున్న పీసీహెచ్ ఈజోన్ సంస్థ అధినేత బల్విందర్ సింగ్ పదేళ్ల క్రితం ఓ స్థలాన్ని డెవలప్మెంట్ కోసం ఇచ్చాడు. ఆ స్థలంలో ఐదేళ్ల క్రితమే భవన నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కాగా తనకు రావాల్సిన మొత్తానికంటే సుమారు ఐదు కోట్లు అదనంగా ఇవ్వాలని బల్విందర్ సింగ్ పలుమార్లు బిల్డర్ను డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్రకారం... తాను మొత్తం డబ్బులు చెల్లించానని అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని బిల్డర్ చెబుతూ వస్తున్నాడు. దీనిని మనసులో పెట్టుకున్న బల్విందర్ సింగ్ బ్లాక్మెయిల్ చేసి కక్ష సాధించాలని కుట్రకు తెరలేపాడు. బిల్డర్ కార్యాలయంలో పని చేసే ఓ యువతి(30) పేరుతో ఆకాశ రామన్న ఉత్తరాన్ని తయారు చేశాడు. బిల్డర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆ లేఖలో కోరారు. లేఖ ప్రతులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలకు పంపాడు. ఈ లేఖలను పంపించే పనిని తన వ్యక్తిగత పనులు నిర్వహించే బాగ్లింగంపల్లికి చెందిన ప్రకాశ్ (39)కు, మైసూర్లో పని చేసే మరో ఉద్యోగి నరేందర్(40)కు అప్పగించాడు. ఈ మేరకు లేఖలు తయారు చేసిన ప్రకాశ్ వాటిని మైసూర్లో ఉండే నరేందర్కు కొరియర్ చేశాడు. అక్కడి నుంచి పలువురికి పోస్ట్ ద్వారా ఆ లేఖలను పంపించారు. వాటిని అందుకున్న కొంతమంది స్నేహితులు ఈ విషయం గురించి చెప్పడంతో సదరు బిల్డర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు బల్విందర్సింగ్, నరేందర్, ప్రకాశ్లపై ఐపీసీ 419, 469, 389 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బలి్వందర్ సింగ్ పరారీలో ఉండగా, నరేందర్, ప్రకాశ్లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తన పేరును దురి్వనియోగం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యువతి కూడా ఇటీవల ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. చదవండి 15 నిమిషాల సెల్ఫీ వీడియో.. అమ్మాయిని గదిలోకి పంపించి.. షాకింగ్ విషయాలు -
తారకరత్నకు కన్నీటి వీడ్కోలు
రాయదుర్గం, బంజారాహిల్స్: సినీనటుడు నందమూరి తారకరత్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో అంత్యక్రియలను సోమవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. అంతకుముందు ఫిలించాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు ప్రత్యేక వాహనంలో తారకరత్న భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో కుటుంబసభ్యులు, సినీప్రముఖులు, రాజకీయ నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మహాప్రస్థానానికి చేరుకున్న తర్వాత పాడెపైకి తారకరత్న పార్ధివదేహాన్ని చేర్చగానే సినీ హీరో బాలకృష్ణ ఆయన సోదరుడు రామకృష్ణతోపాటు బంధువులు, సన్నిహితులు పాడెమోస్తూ చితి వద్దకు తీసుకొచ్చారు. చితికి తండ్రి మోహనకృష్ణ నిప్పు అంటించారు. ఈ సమయంలో తారకరత్న అమర్రహే నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నారాలోకేశ్, మాగంటిబాబు, జవహర్, నారాయణ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితోపాటు నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు పాల్గొన్నారు. ఫిలిం చాంబర్లో నివాళులు తొలుత అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉదయం 9 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్కు తీసుకొచ్చి సాయంత్రం 3 గంటల వరకు ఇక్కడే ఉంచారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, తరుణ్, అశోక్ కుమార్, శివాజీ, కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి, కేఏ పాల్ తదితరులు తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ
సాక్షి, హైదరాబాద్: మూడు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకును బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ హరీశ్వర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెహిదీపట్నం సంతోష్నగర్లో నివసించే మహ్మద్ బిన్ ఇషాక్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్ యూట్యూబర్గా పని చేస్తున్నాడు. గతంలోనే ఆయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. గత అక్టోబర్లో బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని మిథిలానగర్లో ఉంటున్న వివాహిత(32)తో పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లి కాలేదని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆమెతో సహజీవనం చేశాడు. రెండు వారాల క్రితం ఆమెకు ఇషాక్ అసలు రూపం తెలియడంతో ఈ విషయంపై ఆమె నిలదీయగా అతను ముఖం చాటేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. చదవండి: Hyderabad: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒక్క వీడియో కాల్ ఎంత పనిచేసింది!! -
ట్రాఫిక్ దిగ్బంధంలో విరించి చౌరస్తా.. అదే సమస్యకు పరిష్కారం..
సాక్షి, బంజారాహిల్స్: అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించరు... పాదచారులు రోడ్డు దాటేందుకు వంతెనలు ఉండవు.. ఇష్టానుసారంగా కూడళ్లలో రాకపోకలు... ఫలితంగా వాహనదారులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. గంటల తరబడి కూడళ్లలో సిగ్నళ్ల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగించే బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తాలో గడిచిన నాలుగు దశాబ్ధాలుగా ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి స్థానికులకు విముక్తి లభించడం లేదు. అదే రోడ్డు.. అదే చౌరస్తా... ఏ మాత్రం విస్తరణకు నోచుకోని ఈ కూడలిలో వాహనదారులే కాదు రోడ్డు దాటేందుకు పాదచారులు అవస్థలు పడుతున్నారు. మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తా దాటి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు, కేర్ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఇరుకైన రోడ్డుతో పాటు అడుగడుగునా పాదచారులు రోడ్డుదాటుతుండటంతో వాహనాల రాకపోకలు ముందుకు సాగడం లేదు. కేర్ ఆస్పత్రి వైపు నుంచి మాసబ్ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెం. 12, రోడ్ నెం. 13 వైపు వెళ్లే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తుంది. వాహనాలు కేర్ ఆస్పత్రి నుంచి మొదలుకొని 1/12 చౌరస్తా వరకు స్తంభించిపోయి మాసబ్ట్యాంకు వైపు వెళ్ళడమే గగనంగా మారుతోంది. పరిష్కారమిదీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి చౌరస్తాలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే అందుకు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. ఈ చౌరస్తాలో తప్పనిసరిగా ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు పాదచారుల వంతెన కూడా అవసరం. పింఛన్ ఆఫీస్ వైపు నుంచి దారి మూసివేత... మాసబ్ట్యాంకు వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లే మలుపు వద్ద శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉండగా ఈ ఆలయం వెనుక నుంచి పింఛన్ ఆఫీస్ గేటు లోపల గతంలో ఓ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందనుకునేలోగా కొందరు అడ్డుపడటంతో ఈ దారిని బండరాళ్లు వేసి మూసివేశారు. గత పదేళ్లుగా ఈ సమస్యను పట్టించుకునే వారే లేరు. గుడి వెనుక దారి ఏర్పాటు చేస్తే మాసబ్ ట్యాంక్ వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లేవారు తేలికగా ఫ్రీ లెఫ్ట్లో ముందుకు సాగుతారు. దీని వల్ల చాలా వరకు ఈ కూడలిపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ప్రణాళికలేవీ..? మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 చౌరస్తాల మీదుగా కేర్ ఆస్పత్రి దాకా ఓ ఫ్లై ఓవర్ నిర్మించాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ రోడ్డు విస్తరణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుట్పాత్లు కూడా అందుబాటులో లేవు. గజిబిజి ట్రాఫిక్ మధ్య అక్రమ పార్కింగ్లు పెద్ద సమస్యగా మారాయి. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. -
Banjara Hills: బియ్యం కావాలని దుకాణానికి వచ్చి..
సాక్షి, బంజారాహిల్స్: బియ్యం కావాలని దుకాణానికి వచ్చిన ఓ అగంతకుడు షాపు యజమాని దృష్టి మరల్చి సెల్ఫోన్తో పాటు ద్విచక్రవాహనం అపహరించుకుపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో అబ్దుల్ రహీం బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి షాపునకు వచ్చి తనకు రెండు బ్యాగుల బియ్యం కావాలని శాంపిల్ చూపించాలని అడిగాడు. బియ్యం నమూనాలు తీసేందుకు రహీం బ్యాగుల వద్దకు వెళ్లగా.. అదే సమయంలో టేబుల్పై ఉన్న సెల్ఫోన్తో పాటు బయట ఉన్న స్కూటీని అపహరించుకొని క్షణాల్లో అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: స్పా ముసుగులో క్రాస్మసాజ్ చేస్తూ వ్యభిచార గృహాలుగా మార్చిన నాలుగు స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేయడమే కాకుండా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను పునరావాసకేంద్రాలకు తరలించారు. ఈ స్పాలన్నీ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని కృష్ణ టవర్లో కొనసాగుతున్న ఔరం సెలూన్ అండ్ స్పా, రోడ్ నెం.12లోని హదర్వా హమామ్ స్పా, కిమ్తి స్వేర్లోని ఎఫ్2 లగ్జరీ థాయ్ స్పా, బంజారాగార్డెన్ బిల్డింగ్లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలపై దాడులు చేశారు. మసాజ్ థెరపిస్ట్ల పేరుతో కొంత మంది యువతులను నియమించుకొని క్రాస్ మసాజ్కు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దాడుల్లో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ సెలూన్ అండ్ స్పాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఔరం సెలూన్ అండ్ స్పాలో థాయ్లాండ్ నుంచి ఐదుగురు యువతులను రప్పించి వీరికి మసాజ్ థెరపిస్ట్ అనే పేరు తగిలించి క్రాస్ మసాజ్కు పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. థాయ్లాండ్ యువతులను పునరావాస కేంద్రానికి తరలించి మేనేజర్ సమీర్పై కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు జంగం సుధాకర్ పరారీలో ఉన్నారు. అలాగే హదర్వ హమామ్ స్పా మేనేజర్ యామిన్ జిలానీ, యజమాని భీమ్సింగ్లను కూడా అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుండా కస్టమర్ ఎంట్రీ రిజిష్టర్ లేకుండా, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ లేకుండా వీటిని కొనసాగిస్తున్నట్లుగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్ వ్యాలీలో కరువైన నిఘా
బంజారాహిల్స్: తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి గురువారం అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్ కుమార్రెడ్డి చొరబడిన వ్యవ హారంలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు నెల క్రితమే యూసుఫ్గూడ పోలీస్ లైన్స్లో ఉన్న ప్లజెంట్ వ్యాలీలో స్మితా సబర్వాల్ ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆ రోజు ఇంట్లో ఆమె లేకపోవడంతో తిరిగి వెళ్ళినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో నిందితుడు బాబును జూబ్లీహిల్స్ వైపు వెళ్ళొద్దామంటూ తీసుకొచ్చిన నిందితుడు స్మితా సబ ర్వాల్ ఇంటిదాకా తీసుకొచ్చి ఆయనను కూడా ఈ కేసులో అడ్డంగా ఇరికించినట్లయింది. ఇదిలా ఉండగా బాబు బయట కారులో కూర్చోగా నిందితుడు ఆనంద్ కుమార్ రెడ్డి నేరుగా ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. కారులో కూర్చున్న బాబు బయటికి దిగి తన సెల్ఫోన్లో అక్కడి క్వార్టర్లు అ న్నింటిని దర్జాగా వీడియో తీస్తున్నా ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాలు ఉండవా..?: స్మితా సబర్వాల్ ఉంటున్న ప్లజెంట్ వ్యాలీలో మొత్తం 23 క్వార్టర్స్ ఉన్నాయి. ఆమెది బి–11వ నెంబర్క్వార్టర్. తెలంగాణకు చెందిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ క్వార్టర్లలో ఉంటున్నారు. అయితే ప్రధాన గేటు వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఒకటి మాత్రమే రోడ్డు వైపు పని చేస్తోంది. లోనికి వెళ్ళిన తర్వాత ఒక్క కెమెరా కూడా లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం నిందితుడికి సంబంధించిన రాకపోకలకు దృష్టిపెట్టిన పోలీసులు నిఘా నేత్రాల కోసం ఆరా తీయగా ఒక్క చోట కూడా వాటి జాడ లేకుండా పోయింది. కమ్యూనిటీ పోలీసింగ్, నేనుసైతం అంటూ బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసే అధికార యంత్రాంగానికి తాము ఉంటున్న ప్రాంతంలో మాత్రం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. ఈ క్వార్టర్లలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారన్నది కూడా నిఘా గాలికి వదిలేసినట్లుగా గత మూడు రోజుల నుంచి పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఎవరిని కదిపితే ఏం సమస్యలొస్తాయోనని ఇక్కడి నిఘా విషయంలో పోలీసులు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా ఈ క్వార్టర్స్ వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్రెడ్డిపై వేటు పడింది. జిల్లా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఆనంద్కు మార్రెడ్డిని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనుజా చంచల్గూడ జైలులో నిందితుడు ఆనంద్కుమార్రెడ్డికి సోమవారం సిబ్బంది ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు. -
Hyderabad: కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
సాక్షి, హైదరాబాద్: పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్పై పెంపుడు కుక్క దాడి చేయడంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్మెంట్లో నివసించే శోభనా నాగాని ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేశారు. ఈ నెల 11న ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్ రిజ్వాన్(23) స్విగ్గి డెలివరీ బాయ్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసి ఉండటంతో ఒక్కసారిగా ఇంట్లోనుంచి జర్మన్ షెపర్డ్ కుక్క బయటికి దూసుకొచ్చి అతడిని కరవబోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టాడు. అతడి వెంట కుక్క పడడంతో మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. కారిడార్ రెయిలింగ్ నుంచి జారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యజమానురాలు కుక్కను కట్టకుండా నిర్లక్ష్యం వదిలివేయడంతోనే తమ సోదరుడు తీవ్ర గాయాలపాలయ్యాడని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి సోదరుడు ఖాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శోభనపై ఐపీసీ సెక్షన్ 336, 289 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనదారుడి దాష్టికం! కారుతో కానిస్టేబుల్ కాలుని తొక్కించి...
సాక్షి, బంజారాహిల్స్: ఫ్రీ లెఫ్ట్లో కారును అడ్డు తొలగించాలని కోరిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై వాహనదారుడు కారుతో కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని తాజ్కృష్ణా జంక్షన్లో ఓ కారు డ్రైవర్ ఫ్రీ లెఫ్ట్లో కారు నిలపడంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎల్.నగేష్ అడ్డు తొలగాలని సైగలు చేశాడు. అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. వెంటనే కానిస్టేబుల్ ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆగ్రహంతో ఊగిపోతున్న డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతే కాకుండా కిందకు దిగి పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ బట్టలు కూడా చిరిగాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
New Year: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్లకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని 10 పబ్లకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ అనుమతి ఇచ్చేది లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో పబ్ల విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. న్యూఇయర్ సందర్భంగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. చదవండి: New Year Celebrations: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది జాగ్రత్త..! -
Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక..
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ఈ నెల 20న రాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని బంజారాహిల్స్ డివిజన్ క్రైం పోలీసులు సోమవారం గోవాలో అదుపులోకి తీసుకున్నారు. చింతలబస్తీకి చెందిన చాపల అంజలప్ప అలియాస్ మచ్చ అలియాస్ అంజి స్థానిక చేపల మార్కెట్లో పని చేసేవాడు. బంజారాహిల్స్లోని సింగాడికుంటకు చెందిన మైలారం పవన్కుమార్తో స్నేహం, జల్సాలకు దారి తీసింది. గంజాయితోపాటు మద్యం సేవించడం అలవాటుగా చేసుకున్నారు. ఇందులో భాగంగా దొంగతనానికి స్కెచ్ వేసిన వీరు.. ఈ నెల 20న రాత్రి నంబర్ ప్లేటు లేని స్కూటీపై వీధుల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తిరుగుతుండగా ఓ ఇంటి తాళాలు వేసి ఉండటం కనిపించింది. ఇద్దరు ఆ ఇంటి వెనుక కిటికీలో నుంచి లోపలికి దూరి నగదు, నగల కోసం యత్నిస్తుండగా ఓ లాకర్ కనిపించింది. లాకర్ తీసుకుని బంజారాహిల్స్ రోడ్నంబరు 13లోని ఓ స్మశాన వాటికలో పగులగొట్టి అందులో ఉన్న ఆభరణాలు, వజ్రాలను పంచుకున్నారు. దొంగతనం జరిగిన రెండు రోజుల తర్వాత పవన్కుమార్ పోలీసులకు చిక్కాడు. అదే రోజు అంజిని పట్టుకోవడానికి యత్నించగా పోలీసుల కదలికలను గుర్తించిన అతను తన వద్ద ఉన్న ఆభరణాలు మణప్పురంలో తాకట్టు పెట్టి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. లక్డీకాపూల్లో బస్సు ఎక్కి బెంగుళూరులో దిగి అక్కడి నుంచి గోవాకు చెక్కేశాడు. పవన్కుమార్ను విచారించగా పోలీసులకు ఎంతకూ సహరించలేదు. అయితే పవన్ చేతి మీద ఓ ఫోన్ నంబరు రాసి ఉండటాన్ని గుర్తించిన క్రైం పోలీసులు ఆ నంబరు ఎవరిదని ఆరా తీశారు. స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ నంబరుపై నిఘా పెట్టగా అది అంజలప్ప అనే పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఆ నంబరును ఆధారంగా చేసుకొని చోరీ జరిగిన రాత్రి టవర్ డంప్ పరిశీలించగా అక్కడే రెండు గంటల పాటు తిరిగినట్లు గుర్తించారు. చదవండి: హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్ దీంతో ప్రధాన నిందితుడు అంజికి సంబంధించిన నంబరును గుర్తించి లోకేషన్ పెట్టగా గోవాలో ఉన్నట్లు తేలింది. వెంటనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు గోవాకు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకున్న అంజిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తుండగానే గోవాలో చిక్కాడు. పోలీసులను తక్కువ అంచనా వేసి ఇక తాను దొరకనని గోవాలో మకాం వేసిన అంజిని సాంకేతికతతో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేశారు. నల్లమోతు పవన్ అనే ఆభరణాల వ్యాపారి ఫిలింనగర్లో శమంతక డైమండ్ షోరూంను నిర్వహిస్తుండగా అందులోనే ఈ దొంగతనం జరిగింది. ఈ షోరూంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ రోడ్లపైన సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల జాడ చిక్కలేదు. అయితే సింగాడికుంటలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల్లో ఒకరైన మైలారం పవన్ దొరకడం, అతన్ని విచారిస్తే ప్రధాన నిందితుడు పట్టుబడటం జరిగిపోయాయి. డైమండ్స్ విలువ తెలియక.. తాము దొంగతనం చేసిన డైమండ్స్ రూ.లక్షలు విలువ చేస్తాయనే విషయం తెలియక నిందితులు పవన్కుమార్, అంజి వాటిని తమ గదుల్లో డబ్బాలో వేసి ఓ మూలన పెట్టారు. వాటిని అమ్మితే రూ.లక్షలు వస్తాయనే విషయం తెలియకనే కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. -
Hyderabad: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం
బంజారాహిల్స్ రోడ్ నెం. 14 బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి రోడ్ నెం.12 వైపు వెళ్లే రోడ్డులో తెలంగాణ భవన్ ముందు పల్లంగా ఉండటంతో ఎత్తుపైకి ఎక్కలేక వాహనాలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తరచు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. అంతేకాకుండా వంపుగా ఉన్న తెలంగాణ భవన్ వద్ద రోడ్డు నుంచి రోడ్ నెం. 12 వైపు వాహనాలు ఎక్కే క్రమంలో రెడీమిక్స్ వాహనాల నుంచి సిమెంటు, కంకర కిందపడుతూ గుట్టలుగా పేరుకుపోతోంది. ఇదొక సమస్యగా మారిపోయింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఆర్టీసీ బస్సులు, లారీలు ఇక్కడి నుంచే ఎక్కే క్రమంలో మొరాయిస్తుండటంతో వెనుక ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఆగిపోతోంది. సీఎం తెలంగాణ భవన్కు వచ్చినప్పుడు వీవీఐపీలు మెయిన్ రోడ్డు మీదనే కారు ఆపి దిగే క్రమంలో కూడా వెనుక ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిపోతున్నాయి. ► తెలంగాణ భవన్ ముందు ఈ ట్రాఫిక్ సమస్య గత దశాబ్ధ కాలంగా విపరీతంగా పెరిగిపోతున్నది. దీనికి పరిష్కారంగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు మళ్లే ప్రాంతం నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు రోడ్డును సమాంతరం చేయడం ద్వారా సమస్య కొలిక్కి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ► కేబీఆర్ పార్కు నుంచి వరద నీరు తెలంగాణ భవన్ పక్కన నిర్మించిన కాల్వలోకి చేరే క్రమంలోనే ఈ రోడ్డు వంపుగా మారింది. ఇక్కడ వరద నీటి పైప్లైన్ వేసి రోడ్డంతా సమాంతరం చేస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని ట్రాఫిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇరుకుగా అగ్రసేన్ చౌరస్తా.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 నుంచి తెలంగాణ భవన్ మీదుగా వాహనాలు ముందుకు సాగడం గగనంగా మారింది. లేచిన దగ్గరి నుంచి అర్ధరాత్రి దాకా ఈ రోడ్డులో వాహనాలు మెళ్లగా ముందుకు కదులుతున్నాయి. ► ఒక వైపు తెలంగాణ భవన్ వైపు రోడ్డు లోతుగా ఉండటం, జగన్నాథ టెంపుల్ గేటు కూడా రోడ్డు వైపే ఉండటం ట్రాఫిక్ను మరింత జఠిలం చేస్తున్నది. దీనికి తోడు అగ్రసేన్ చౌరస్తాలో తెలంగాణ భవన్ నుంచి రోడ్ నెం. 12 వైపు మలుపు మరింత ప్రమాదకరంగా మారింది. ఇక్కడే ట్రాన్స్ఫార్మర్, కరెంటు స్తంభాలు, హైటెన్షన్ వైర్ల స్తంభాలు టర్నింగ్పై ఉన్నాయి. వీటిని తొలగిస్తే ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ వైపు తేలికగా ముందుకు కదులుతుంది. ► అగ్రసేన్ ఐల్యాండ్ను కూడా పెద్దగా ఉండటం, చౌరస్తా మొత్తం ఇరుకుగా ఉండటం వాహనాలు మళ్లే పరిస్థితులు జఠిలమవుతున్నాయి. ఈ చౌరస్తాను తగ్గించాల్సిన అవసరం ఉందని, సెంట్రల్ మీడియన్లను కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఉందని ట్రాఫిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కూడా అగ్రసేన్ ఐల్యాండ్ను, సెంట్రల్ మీడియన్ను తగ్గించాలని జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాశారు. జీహెచ్ఎంసీ మొద్దు నిద్ర.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నది. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకొని వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పలుమార్పులు, చేర్పులు చేస్తూ ఉన్నదాంట్లోనే సిబ్బందిని వినియోగించుకుంటూ ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతూ వాహనదారులను ముందుకు వెళ్లే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. ► ట్రాఫిక్ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. పలుచోట్ల సెంట్రల్ మీడియన్లు తగ్గించాలని ఐల్యాండ్లను కట్ చేయాలని, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని, ఫుట్పాత్లపై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్కు తోడ్పాటు నందించాలని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలను అనువైన చోటుకు మార్చాలని ట్రాఫిక్ పోలీసులు లేఖలు రాస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జీహెచ్ఎంసీతో ట్రాఫిక్ పోలీసులు సమన్వయం పూర్తిగా కొరవడింది. (క్లిక్ చేయండి: రసాభాసగా జీహెచ్ఎంసీ మీటింగ్.. చర్చ లేకుండానే బడ్జెట్కు ఆమోదం) -
మహిళపై లైంగిక దాడి.. అర్ధరాత్రి రోడ్డు మీద తరుముతూ పరుగులు
సాక్షి, హైదరాబాద్: భర్త లేని ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెపై అర్ధరాత్రి దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహిళ(45) బ్యూటీషియన్. భర్త మరణించడంతో కుమార్తెతో కలిసి ఉంటోంది. మెహిందీ, సౌందర్యపు పౌడర్లు అమ్ముతుంటుంది. బంజారాహిల్స్కు చెందిన మహ్మద్ ఖాలేద్ భార్యకు తరచూ మెహిందీ ఇచ్చేది. ఈ క్రమంలో ఖాలేద్ స్నేహితుడు తమీన్ జలానీతో మహిళకు పరిచయం ఏర్పడింది. అతను కొద్ది రోజుల క్రితం ఒంటరిగా ఉన్నమహిళపై లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత విషయం బయట చెప్పవద్దంటూ వేడుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ కొద్ది రోజుల తరువాత ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. ఇటీవల పెళ్లి గురించి ఆమె నిలదీయడంతో తమీన్ జలానీ, ఖాలేద్, ఎండీ షకీల్లో కలిసి అర్ధరాత్రి ఆమెను రోడ్డు మీద తరుముతూ పరుగులు తీయించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై సెక్షన్ 354, 341, 509, 506, 504, 120బి ఐపీసీ సెక్షన్ 156(3) సీఆర్పీసీ కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమెరికాలో ఉన్నా వదలట్లేదు.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి -
ఫాంహౌజ్ కేసు: బెయిల్పై విడుదల, వెంటనే మళ్లీ అదుపులోకి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ చంచల్ గూడ జైల్ నుండి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకి రాగానే ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్ లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది. -
హై వ్యాల్యూమ్తో డీజే.. బంజారాహిల్స్లో రెండు పబ్లపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్కు అడ్డంకులు కలిగించడమే కాకుండా హై వ్యాల్యూమ్తో డీజే ఏర్పాటు చేసి శబ్ధ కాలుష్యానికి పాల్పడిన రెండు పబ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో కేబీఆర్ పార్కు ముందు రియోట్ పబ్, చీర్స్ పబ్ ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి 1.10 గంటల సమయంలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ రెండు పబ్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ వినిపిస్తుండటంతో తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత కూడా డీజే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు పార్కింగ్ చేసి రోడ్డుపై కస్టమర్లు న్యూసెన్స్ చేస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రియోట్ పబ్ యజమాని కన్హయ్య కుమార్సింగ్, చీర్స్ పబ్ యజమాని తానిశెట్టి రాములపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదివరకే వివాహం, ఇద్దరు పిల్లలు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ బాలిక పై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్నగర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలికకు ఇంటి యజమాని కుమారుడు సయ్యద్ సమీర్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. సమీర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందుకు అంగీకరించింది. ఈ విషయం సదరు బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో సమీర్కు ఇదివరకే పెళ్లి జరిగిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని, అతనితో మాట్లాడవద్దని సూచించారు. దీంతో ఆమె కొన్ని రోజులుగా అతడికి దూరంగా ఉంటోంది. అయితే ఇటీవల సమీర్ తన భార్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గత ఏడాది ఆగస్టు 6 న ఆమెను తన ఇంటికి రప్పించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో గత 23న బాధితురాలి తల్లితండ్రులు సమీర్ ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై ప్రశ్నించారు. అందుకు అతను అంగీకరించకపోవడంతో ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సమీర్ పై పొక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛార్జింగ్లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి -
Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్ ఏంటంటే!
సాక్షి, బంజారాహిల్స్: ముసుగు ధరించి నంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి, అతడి చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ యజమాని అంకిత్ అగర్వాల్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో నివాసం ఉంటున్నాడు. ఇతడి వద్ద పని చేసే సేల్స్మెన్ ఆనంద్ మంగళవారం రాత్రి 9 గంటలకు ఆభరణాల దుకాణాన్ని మూసివేశాడు. రెండు షట్టర్లు, లాకర్ల తాళం చెవులు బ్యాగ్లో వేసుకొని యజమానికి ఇవ్వడానికి స్కూటీపై అతని నివాసానికి వచ్చాడు. హెల్మెట్ తీసి తన వాహనంపై పెడుతుండగా అప్పటికే పంజగుట్ట నుంచి అనుసరిస్తూ బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆనంద్ కళ్లల్లో కారం కొట్టి బ్యాగు లాక్కొని ఉడాయించారు. రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, అదే రోజు రాత్రి ఆగంతకులు ఆ బ్యాగును పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్ ముందు పడేసి పరారైనట్లుగా గుర్తించారు. ఈ బ్యాగులో డబ్బు లేదా నగలు ఉంటాయని వారు భావించి ఉంటారని, అందులో తాళం చెవులు మాత్రమే ఉండటంతో బ్యాగు ను షాపు వద్ద పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా తాళాలతో షాపు షట్టర్లు తెరుద్దామని వెళ్లి ఉంటారని,అయితే, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండటంతో బ్యాగ్ను షాపు ముందు పడేసి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అగంతకుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పాజిటివ్’గా ఉండండి
బంజారాహిల్స్: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు సంబంధించిన పాజిటివ్ వార్తలను మీడియా చూపాలని మున్సిపల్, ఐటీమంత్రి కె. తారక రామారావు సూచించారు. ప్రస్తుతం ఏ మీడియాలో అయినా పాజిటివ్ కంటే నెగెటివే ఎక్కువ వ్యాప్తి చెందుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ‘మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్–ప్రజంట్–ఫ్యూచర్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ హైదరాబాద్లో వర్షం వచ్చినప్పుడు రెండు కాలనీలు మునిగితే హైదరాబాద్ మునిగినంత హడావుడిగా వార్తలు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణించే హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్లో తయారవుతున్నా అది పతాక శీర్షికలకు ఎందుకు ఎక్కడం లేదని ప్రశ్నించారు. చైనాలో భారీ ప్రాజెక్టు కడితే అది వార్త అవుతోందని.. అదే తెలంగాణలో కడితే మాత్రం వార్తల్లోకి ఎందుకు ఎక్కడంలేదని... ఇదెక్కడి పక్షపాతమన్నారు. మిషన్ భగీరథ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడం లేదని... అయితే ఇది వార్త కానట్లుగా కట్ట తెగితేనే హెడ్లైన్స్లో వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. పాలు, చేపలు, ధాన్యం ఉత్పత్తిలో అందరికంటే తెలంగాణ ముందుందని ఇవి ఎందుకు వార్తలు కావడంలేదన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేరు.. ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డ్గా మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. సిరిసిల్లలో తొలిసారి పోటీ చేసిన తాను కేవలం 150 ఓట్ల తేడాతో గెలిచానని.. తన పనితీరుతో ప్రతి ఎన్నికల్లోనూ మెజారిటీ పెంచుకుంటూ వచ్చానని చెప్పారు. పరిశోధనాత్మక జర్నలిస్టులేరీ? దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నా అవి వార్తలుగా రావడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశోధనాత్మక జర్నలిస్టులు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను పాత్రికేయులను నిందించడం లేదన్నారు. దేశంలో మీడియా ప్రస్తుతం ‘మోడియా’గా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అంబేడ్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు, వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, ఎఫ్సీసీ చైర్ అడ్వయిజరీ కమిటీ ఇంటర్నేషనల్ జర్నలిస్టు ఎస్. వెంకట్ నారాయణ్, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, సాక్షి సీనియర్ జర్నలిస్టు విజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రికా పఠనం తండ్రి నేర్పిన అలవాటు.. తన తండ్రి కేసీఆర్ నేర్పిన కొన్ని అలవాట్లలో పేపర్ చదవడం కూడా ఒకటని కేటీఆర్ చెప్పారు. దీపావళి, దసరా సందర్భంగా రెండుసార్లు పత్రికలు రాకపోతే ఏదో కోల్పోయిన భావన తనకు ఏర్పడుతుందన్నారు. నిత్యం తాను 13 పత్రికలు చదువుతున్నానని వివరించారు. కొన్ని పత్రికలు చంద్రబాబును ఆహా.. ఓహో అన్నాయి తెలంగాణ ఉద్యమం సహా టీఆర్ఎస్ స్థాపన సమయంలో తమకు మీడియా మద్దతు లభించలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. కొన్ని పత్రికలు మాత్రం ఆయన గురించి ఆహా... ఓహో అంటూ, ఇంద్రుడు, చంద్రుడు అంటూ రాసేవని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వార్తలు కొన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో నిత్యం నిలిచేవని, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు, ఉద్యమ సమయంలోనూ ఆ స్థాయి వార్తలు రాలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ముందుకు సాగిందంటే అందుకు తెలంగాణ జర్నలిస్టులే కారణమన్నారు. వారే తమకు అండగా నిలబడ్డారని.. అందుకే ఉద్యమానికి అండగా నిలిచిన చాలా మంది జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకున్నామని కేటీఆర్ చెప్పారు. -
Hyderabad: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం కొనసాగుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వివిధ రాజకీయ పార్టీల ధర్నాలు, ఆందోళనలు కొనసాగే అవకాశాన్ని గుర్తించిన అధికారులు పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా, ఎవరూ లోనికి దూసుకురాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. శనివారం బీజేపీ కార్యకర్తలు, నేతలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి యత్నించగా వారిని సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పక్కా ప్రణాళికతో కమాండ్ కంట్రల్ సెంటర్ వద్దకు రాకుండానే వారిని నియంత్రించారు. ఇందుకోసం సరికొత్త బారికేడింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా పికెటింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఆధునిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆందోళనకారులు ముందుకు రాకుండా నిరోధించేందుకు ఈ కొత్త బారికేడింగ్ సిస్టమ్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష నేపథ్యంలో 144 సెక్షన్ అమలు హిమాయత్నగర్: సీబీఆర్టీ పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 500 అడుగుల మేర నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం 6 గంటల పాటు, మంగళవారం 6 గంటల పాటు ట్విన్ సిటీస్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్స్లో సీబీఆర్టీ ఎగ్జామ్ జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షకు ఏవిధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్) -
Hyderabad: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్గా ఐసీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్గా ఉన్న బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) పోలీసు కంప్యూటర్ సర్వీసెస్కు హెడ్–క్వార్టర్స్గా మారనుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ భవనంలోని ఏ–టవర్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంగా వినియోగంలో ఉన్న విషయం విదితమే. రాష్ట్రానికే తలమానికంగా, దేశానికే ఆదర్శంగా నిర్మితమైన ఈ ఐసీసీసీ ఆగస్టు మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అన్ని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకునే దీన్ని డిజైన్ చేశారు. డయల్–100, అంబులెన్స్, ఫైర్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంచనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాలను ఈ కమాండ్ సెంటర్ను అనుసంధానించనున్నారు. ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ఇతర టూల్స్ నేరాల నిరోధం తదితరాలకు ఐసీసీసీలోని బి–టవర్ను వాడనున్నారు. నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్న్స్ సెర్చ్కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్తో మెరుగైన సేవలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బి–టవర్ను పోలీసు కంప్యూటర్ సర్వీసెస్కు (పీసీఎస్) అప్పగించాలని నిర్ణయించారు. ఈ విభాగం ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో కొనసాగుతోంది. పీసీఎస్ అదనపు డీజీ నేతృత్వంలోనే బి–టవర్ పని చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మార్పు నేపథ్యంలో పీసీఎస్కు అదనంగా సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ప్రాథమిక అంచనా ప్రకారం అదనపు డీజీ నుంచి పరిపాలన సిబ్బంది వరకు కలిపి మొత్తం 350 మంది అవసరమని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పీసీఎస్లో ఉన్న వారికి అదనంగా మరో 200 మంది వరకు అవసరం. ఈ సిబ్బందిని ప్రస్తుతానికి ఇతర విభాగాల నుంచి సర్దుబాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. త్వరలో జరుగబోయే రిక్రూట్మెంట్ నుంచి శాశ్వత ప్రాతిపదికన వీరిని తీసుకోనున్నారు. సాంకేతిక విద్యనభ్యసించిన, ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. (క్లిక్ చేయండి: 153 సెక్షన్లు మూత! అధికారులకు 58 ఇంజనీరింగ్ కాలేజీల వినతి) -
Banjara Hills: ఉద్రిక్త వాతావరణం నడుమ తెరుచుకున్న డీఏవీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బాదం సరోజా దేవి డీఏవీ పబ్లిక్ స్కూల్ రెండు వారాల అనంతరం గురువారం ఉద్రిక్త వాతావరణం నడుమ తెరుచుకుంది. గత నెల 18వ తేదీన స్కూల్లో డ్రైవర్గా పని చేస్తున్న రజనీకుమార్ నాలుగున్నరేళ్ల ఎల్కేజీ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులతో ఆపటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి స్కూల్ను మూసివేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ అధికారులు స్కూల్ రీఓపెన్కు అనుమతులిచ్చారు. డీఏవీ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు అయితే తమకు న్యాయం జరగకుండానే స్కూల్ను ఎలా తెరుస్తారంటూ గురువారం ఉదయం బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుంచి తరలించారు. సుమారు గంటపాటు బాధిత చిన్నారి తల్లిదండ్రులు అక్కడే బైఠాయించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, న్యాయం చేయకుండా తెరవడం అన్యాయమంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ పిల్లల భవిష్యత్ను పాడుచేయవద్దంటూ వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బంజారాహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఏమవుతుందోనన్న బెంగతో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ వద్దే కాపుకాశారు. మొదటి రోజున 98 శాతం హాజరు నమోదైంది. పాఠశాలలో గుర్తించిన 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు డీఏవీ పబ్లిక్ స్కూల్లో గత నెల 18వ తేదీన నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్ రజనీకుమార్, నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జి హెచ్ఎం మాధవిలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఈ ఘటనపై సత్వర న్యాయం జరిగే విధంగా ఫాస్ట్ట్రాక్ ఏర్పాటు కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరో పది రోజుల్లో నిందితుల చార్జిషీట్ను దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. చార్జిషీట్ దాఖలు కాగానే ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిగే విధంగా పోలీసులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి పకడ్బందీ శాస్త్రీయ ఆధారాలను ప్రవేశ పెట్టడం ద్వారా నిందితులకు తగిన శిక్ష పడే విధంగా చార్జిషీట్ను కూడా రూపొందిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే బాధిత బాలిక వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఈ కేసులో బాధితురాలు వాంగ్మూలం కీలకం కానుంది. -
ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం. 12 మీదుగా బైక్పై వెళుతుండగా రోడ్డు పక్క నుంచి ఎన్బీటీ నగర్ బస్తీకి చెందిన అభిమాని కనిపించాడు. దీంతో వెనుకాల కాన్వాయ్తో పాటు తన బైక్ను కూడా రోడ్డు పక్కన ఆపి అతడిని పలకరించారు. బైక్పై దూసుకెళ్తున్న అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారిగా బుల్లెట్ బండి దిగి రోడ్డుపై వెళుతున్న ఎన్బీటీ నగర్కు చెందిన శివకుమార్ను గుర్తు పట్టిన అసద్ ఆగడమే కాకుండా కుశలప్రశ్నలు వేశారు. అతడి తండ్రి ఒవైసీ పోటీ చేసినప్పుడు తాను బూత్ ఏజెంట్గా ఉండేవాడినని ఈ సందర్భంగా శివకుమార్ గుర్తు చేసుకున్నారు. స్వయంగా అసద్ బుల్లెట్ దిగి తనను పలకరించడంపట్ల శివకుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారంతా తమ సెల్ఫోన్లలో బంధించారు. (క్లిక్ చేయండి: ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్) -
Banjarahills: డీఏవీ స్కూల్ రీ ఓపెన్.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని బాదం సరోజా దేవి డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు భారీ ఊరట లభించింది. పాఠశాలను తెరిచేందుకు అనుమతులు జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏమవతుందోనని గత పది రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారులు రిలీఫ్నిచ్చారు. గత నెల 18వ తేదీన స్కూల్ డ్రైవర్ రజనీకుమార్ ఇదే పాఠశాలలో చదువుతున్న నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిని, ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాఠశాలలో నిర్లక్ష్యం తాండవం చేస్తోందంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత నెల 22వ తేదీన స్కూల్ అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్కూల్ను బంజారాహిల్స్లోని పాత భవనంలోనే కొనసాగించాలంటూ గత నెల 23వ తేదీన 650 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద సమావేశమై భారీ ఆందోళన చేపట్టారు. ఆ రోజు నుంచే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు డీఈఓ రోహిణిని కలుస్తూ ఇక్కడే పాఠశాలను రీ ఓపెన్ చేయాల్సిందిగా డిమాండ్ చేయసాగారు. బ్యాలెట్తో అభిప్రాయ సేకరణ.. మొత్తం తల్లిదండ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి తమ పిల్లలను ఇదే స్కూల్లో చదివించేందుకు అనుమతించాలంటూ ఇక్కడే స్కూల్ ఓపెన్ చేయాలని అభిప్రాయ సేకరణకు బ్యాలెట్ పద్ధతిని నిర్వహించారు. ఇందుకు 95 శాతం మంది తల్లిదండ్రులు మద్దతిచ్చారు. తల్లిదండ్రులంతా వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే తల్లిదండ్రులతో కూడిన ఓ కోర్ కమిటీ కూడా ఏర్పడింది. వీరు ప్రతిరోజూ సంబంధిత అధికారులను కలుస్తూ స్కూల్ను తెరవాలంటూ డిమాండ్ చేయసాగారు. ఇటీవలే ఢిల్లీ నుంచి స్కూల్ డైరెక్టర్ నిషా కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డీఈఓ కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఎట్టకేలకు స్కూల్ రీఓపెన్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా గురువారం నుంచి బంజారాహిల్స్లోనే స్కూల్ తెరవనున్నారు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందని కోర్ కమిటీ ప్రతినిధి పెద్దల అంజిబాబు వెల్లడించారు. -
బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్దే
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్– 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్కు బంజారాహిల్స్ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న స్కూల్లో పని చేస్తున్న డ్రైవర్ రజనీకుమార్ నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత చిన్నారి వయసు ధ్రువీకరణ పత్రాలతోపాటు అడ్మిషన్ ఎప్పుడు పొందింది? తదితర వివరాలతో కూడిన పత్రాలను పోలీస్ స్టేషన్లో అందించాల్సిందిగా సూచిస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు. డీఏవీ స్కూల్లో పనిచేస్తున్న పరిపాలన సిబ్బంది, టీచర్లు ఈ నెల 25 నుంచి సఫిల్గూడలోని డీఏవీ స్కూల్లో హాజరవుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ స్కూల్ అనుమతులు రద్దు చేయడంతో ఈ స్కూల్కు చెందిన సిబ్బంది, టీచర్లు తమ హాజరును సఫిల్గూడ డీఏవీ స్కూల్లో వేయిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న బంజారాహిల్స్ స్కూల్ను బుధవారం డీఏవీ స్కూల్ డైరెక్టర్ నిషా తనిఖీలు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పాఠశాలలో 30 సీసీ కెమెరాలు ఉండగా అందులో వీరు చేసిన తనిఖీల్లో 12 కెమెరాలు పని చేస్తున్నట్లు తేలింది. చాలా కెమెరాలకు వైర్లు తెగి పడి ఉండటాన్ని గుర్తించారు. ఇదేమిటని ఆరా తీయగా వీటి నిర్వహణ మొత్తం అత్యాచార నిందితుడు రజనీకుమార్దేనని సిబ్బంది ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సీసీ కెమెరా నిర్వహణ మొత్తం తన చేతుల్లోనే ఉంచుకున్నాడని ఆరోపించారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరగాలన్నా పెత్తనమంతా రజనీకుమార్దేనని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పేరుకు మాత్రమే ప్రిన్సిపాల్ ఉండగా పెత్తనమంతా రజనీకుమార్దేనని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. బాత్రూంల వద్ద సీసీ కెమెరాలు సైతం పని చేయడం లేదని తనిఖీల్లో తెలుసుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో స్కూల్ ప్రారంభం కానుండగా ఇక్కడ మార్పులు చేయాల్సిన అవసరముందని గుర్తించారు. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు -
బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వడ్డెపు రమణ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలాలి–చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం ఉన్నట్టు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు గురువారం ఉదయం 7.55 గంటలకు సమాచారం అందింది. మౌలాలి రైల్వేస్టేషన్ సమీపంలోని సీ క్యాబిన్ వద్ద రెండు ముక్కలైన యువకుడి మృతదేహం ఉన్నట్టు రైల్వే ‘కీ’ మెన్ వెంకటేశ్వర్రావు ద్వారా సమాచారం అందింది. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన వడ్డెపు అప్పల స్వామి రెండోకుమారుడు రమణ 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. చిక్కడపల్లి అశోక్నగర్లో ముగ్గురు మిత్రులతో కలిసి ఉంటూ బంజారాహిల్స్లో ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల తరువాత బయటకు వెళ్లి వస్తానని రూమ్మేట్స్కు చెప్పి వెళ్లాడు. అదే రోజు అర్థరాత్రి దాటిన తరువాత మౌలాలి ప్రాంతానికి చేరుకుని రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా రమణ మానసిక ఆందోళనలకు గురవుతున్నట్టు, ఇందుకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. నగరంలోనే నివాసం ఉంటున్న అక్క,బావతోపాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు సికింద్రాబాద్ చేరుకుని రమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్క,బావతోపాటు పలువురు రమణ బ్యాచ్ ఎస్ఐలు గాంధీ ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్ఐ తల్లితండ్రులు శుక్రవారం ఉదయానికి నగరానికి చేరుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని, విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. -
చర్చలు సఫలం.. వారంలో డీఏవీ స్కూల్ రీఓపెన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వారం రోజుల్లో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరిచే విషయంపై.. విద్యాశాఖ కమిషనర్తో డీఏవీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. కమిషనర్తో భేటీ అనంతరం పలు వివరాలు వెల్లడించారు పేరెంట్స్. ‘కమిషనర్కు అన్ని విషయాలు తెలియజేశాం. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు అంగీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన సూచనలు కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ మేనేజర్ శేషాద్రి ఏం చెప్పారంటే.. ‘కమిషనర్ దేవసేనను మా డీఏవీ డైరెక్టర్ నిషాతో పాటు ముగ్గురు ప్రతినిధులు వచ్చి కలిశారు. కమిషనర్ దేవసేన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చాం. ఘటనపై విచారం వ్యక్తం చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాం. పేరెంట్స్ స్టేట్ మెంట్స్తో కలిపి మా వినతిని కూడా అందించాం. గుర్తింపు రద్దు తొలగించాలని కోరాం. ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్లను తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.’ అని కమిషనర్ భేటీ అనంతరం వెల్లడించారు డీఏవీ స్కూల్ మేనేజర్. ఇదీ సమస్య.. హైదరాబాద్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ క్రమంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Hyderabad: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
Banjara Hills: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాల నుంచి మద్దతు పెరిగింది. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా గుర్తింపు రద్దు అంశంపై విద్యాశాఖ అధికారులతో భేటీకి సిద్ధమైంది. జరిగిన ఘటన సహించరానిదైనప్పటికీ పాఠశాల గుర్తింపు రద్దు సమంజసం కాదని విద్యావేత్తలు సైతం పేర్కొంటున్నారు. దీంతో విద్యాశా«ఖ పాఠశాలకు ఎన్ఓసీ విత్డ్రాపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. పాఠశాలను తెరిపించాల్సిందే.. డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కు తీసుకొని స్కూల్ను తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరిగింది. అవసరమైతే ప్రభుత్వం స్కూల్ను స్వాధీనం చేసుకోవాలని, పాఠశాలలో సీసీ కెమెరాలు, కమిటీని ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పించి స్కూల్ కొనసాగించాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇచ్చి ఆప్షన్ల ప్రకారం మరో పాఠశాలలో చేరడం తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారంతో పాటు దూరాభారం కూడా అవుతుందని వారంటున్నారు. బ్యాలెట్ బాక్స్ ద్వారా అభిప్రాయాలు బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్ను కొనసాగించాలంటూ సఫీల్గూడలోని డీఏవీ స్కూల్లో ఓ బ్యాలెట్ బాక్సు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కొనసాగాలని అభిప్రాయాలతో ఈ బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. ఢిల్లీ నుంచి స్కూల్ యాజమాన్యం రెండు రోజుల్లో న్యూఢిల్లీ నుంచి డీఏవీ స్కూల్ ప్రధాన కార్యాలయం అధికారులు హైదరాబాద్కు రానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. విద్యాశాఖ అధికారులతో సైతం సమావేశమై వినతి పత్రం సమరి్పంచనుంది. విద్యాశాఖ మంత్రి, కమిషనర్లను బుధవారం తల్లిదండ్రులు కలిసి డీఏవీ స్కూల్ ఇక్కడే కొనసాగించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. మూసివేత వద్దు పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీల కార్యదర్శులు కె.అశోక్రెడ్డి, కె.నాగలక్ష్మి, జావిద్లు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. స్కూల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని యథావిధిగా నడపాలని కోరారు. మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు -
డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్ నిర్వహణలో మరో ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్గూడ బ్రాంచి పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సఫిల్గూడకు చెందిన విద్యార్థులకు బంజారాహిల్స్లోని పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపిందని అధికారులు పేర్కొంటున్నారు. సీబీఎస్ఈ సిలబస్ నిర్వహణలోనూ డొల్లతనం కనిపిస్తోంది. పాఠశాల మూసివేతతో విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన సాగిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా స్కూళ్లు నిబంధనలు పాటిస్తాయని విద్యాశాఖ చెబుతోంది. ఇదిలా ఉండగా డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పాఠశాల ప్రిన్సిపాల్కు డ్రైవర్గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: ‘మా పిల్లల్ని మరో స్కూల్కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్ చేయాలి’ -
‘మా పిల్లల్ని మరో స్కూల్కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్– 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ను ఇక్కడే రీ ఓపెన్ చేయాలని ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తూ తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద డీఏవీ స్కూల్కు చెందిన సుమారు 200 మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము మూడు ఆప్షన్లు ఇస్తున్నామన్నారు. చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక అధికారి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్ తెరవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లకు ఏ రకంగానూ తాము ఒప్పుకోవడం లేదన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులను స్టేట్ సిలబస్ పాఠశాలల్లోకి చేర్చడం కుదరని పని అన్నారు. మెరీడియన్ స్కూల్లో చేర్చడానికి కూడా అది తాహత్తుకు మించిన వ్యవహారమవుతుందని తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకొని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్ఈ స్కూళ్లలో సర్దుబాటు చేస్తాం ! బంజారాహిల్స్లోని డీఏవీ విద్యార్థులను సీబీఎస్ఈ స్కూళ్లలోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలకు తీసుకుంటామంటున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుతో పాటు పాఠశాలను మూసి వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రగులుకుంది. ఈ పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాల మూసివేత, ఇతర పాఠశాలల్లో సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పాఠశాలకు అయిదు కిలో మీటర్ల పరిధిలోని స్కూల్స్ మేనేజ్మెంట్లతో సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఆయా స్కూళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు. వారి అభీష్టం మేరకు ఆయా స్కూళలో చేరి్పంచే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ డీఈఓ రోహిణి స్పష్టం చేశారు. మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మా బాధలు వింటూ తగిన రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్ ఇక్కడే రీ ఓపెన్ చేయాలని కోరుతున్నాం. – అంజిబాబు, పేరెంట్ చాలా సమస్యలు వస్తాయి.. వేరే స్కూల్లో చేర్చడమంటే చాలా సమస్యలు వస్తాయి. అక్కడి వాతావరణం అలవాటు పడటం మరింత కష్టం. ఆన్లైన్ క్లాస్లకు మేం ఒప్పుకోం. – సుజాత, పేరెంట్ డ్రైవర్ను ఉరి తీయాలి పిల్లలు మరో పాఠశాలకు వెళ్లడం కుదరదు. అడ్మిషన్లు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అంత ఫీజులు చెల్లించుకోలేం. కొత్త మేనేజ్మెంట్తో డీఏవీ స్కూల్నే కొనసాగించాలి. – మాతంగి హంస, పేరెంట్ -
Hyderabad: లైంగిక వేధింపుల ఘటన.. బీఎస్డీ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని బీఎస్డీ డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ పాఠశాల ప్రిన్సిపాల్కు డ్రైవర్గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. డ్రైవర్ రజినీకుమార్ అరాచకాలను స్కూల్లో పనిచేసే టీచర్లు విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అతనిపై ప్రిన్సిపాల్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థినులపై అతడు లైగింక వేధింపులకు పాల్పడినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. విద్యార్థులు, టీచర్ల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. స్కూల్, బయట ఉన్న సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వేరే స్కూళ్లలో సర్దుబాటు పాఠశాల గుర్తింపు రద్ధు చేయడంతో విద్యార్థులు నష్టపోకుండా వాళ్లను వేరే స్కూళ్లలో సర్దుబాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని స్పష్టం చేశారు. కమిటీ ఏర్పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటించారు . ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కట్టలుతెంచుకున్న ఆగ్రహం.. ఎల్కేజీ చదువుతున్న బాలికను రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని నిలదీశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అతనికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది. చదవండి: విద్యార్థినిని వేధిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్.. చితకబాదిన తల్లిదండ్రులు -
హైదరాబాద్: విద్యార్థినిని వేధిస్తున్న ప్రిన్సిపాల్ కారు డ్రైవర్.. చితకబాదిన పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినికి వేధింపులు ఎదురయ్యాయి. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. చిన్నారిని వేధిస్తున్న వ్యక్తిని చితకొట్టారు. వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న బీఎస్డీ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న బాలికను ప్రిన్సిపాల్ కారు డ్రైవర్గా పనిచేస్తున్న రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. ఓపిక నశించిన ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని రజినీకుమార్ను నిలదీశారు. కోపంతో రగిలిపోయి దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించామని తెలిపారు. చిన్నారికి వేధింపుల విషయంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి ప్రమేయం ఉందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ను చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
చిన్నారిని వేధిస్తున్న కారు డ్రైవర్ ను చితకబాదిన పేరెంట్స్
-
బంజారాహిల్స్: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచారం గృహంపై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. రోడ్ నెం.11లో అల్ కరీమ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలు స్వాతితోపాటు ఇద్దరు యువతులు, ఓ కస్టమర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకురాలు సత్యవతి పరారీలో ఉంది. నిందితులను విచారణ నిమిత్తం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
ఆరడుగుల త్రాచు.. అలవోకగా పట్టేశారు..
బంజారాహిల్స్: ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చొరబడ్డ ఆరడుగుల పొడవైన త్రాచుపామును మరో విశ్రాంత ఐపీఎస్ అధికారి చాకచక్యంగా బంధించారు. దాన్ని సురక్షితంగా అటవీ శాఖాధికారులకు అప్పగించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్రోడ్ నెం.72లోని ప్రశాసన్నగర్లో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రశాసన్నగర్లోని ప్లాట్నెంబర్ 199లో విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నివాసం ఉంటున్నారు. ఇంట్లోని వాటర్ట్యాంక్ వద్ద సుమారు ఆరడగుల పొడవున్న త్రాచుపాము శుక్రవారం ఉదయం కనిపించింది. దీంతో కృష్ణయ్య కుటుంబం అదే కాలనీలో ఉంటున్న రిటైర్డ్ డీజీపీ రాజీవ్ త్రివేదికి సమాచారం అందించింది. రాజీవ్ త్రివేది... పామును నేర్పుతో ఓ బ్యాగులో బంధించారు. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. -
వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు
బంజారాహిల్స్(హైదరాబాద్): ఏడేళ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే పోలీసులు వాటి చక్రాలకు వీల్ క్లాంప్లు వేసి జరిమానాలు విధించేవారు. ఈ విధానంపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ విధానం నుంచి వైదొలిగారు. తాజాగా వారం రోజులుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల వాహనాలు పార్కింగ్ చేస్తే ఆ వాహనాలకు వీల్ క్లాంప్ వేయడంతో పాటు సదరు వాహనంపై జరిమానా స్టిక్కర్ను, ఆ ఏరియాలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారుల నంబర్ వేస్తారు. తగిన జరిమానా చెల్లించిన తర్వాత వాహనాన్ని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలతో.. రోడ్ల పక్కన, షాపుల వద్ద, సినిమా హాళ్ల వద్ద, ఆస్పత్రులు, పార్కులు, నివాసా లు అనే తేడా లేకుండా అక్రమ పార్కింగ్లతో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపూ ద్విచక్ర వాహనదారుల నుంచే పెండింగ్ జరిమానాలు వసూలు చేస్తూ కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక నుంచి వీల్క్లాంప్ వేసిన కార్ల నుంచి కూడా పెండింగ్ జరిమానాలు వసూలు చేసేందుకు పోలీసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల వద్ద ఆందోళన... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ ప్రాంతాలు ప్రధాన ఆస్పత్రులకు నెలవుగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఆస్పత్రులకు వస్తుంటారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో, సోమాజిగూడ యశోద, బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి పెద్ద ఎత్తున రోగులు వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకొని ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక రోడ్లపక్కన ఖాళీగా ఉన్న స్థలాల్లో పార్కింగ్ చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలుపుతున్న వారిని ఈ తరహా జరిమానాలు, క్లాంప్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగుల కోరుతున్నారు. ఎందుకంటే ఏ ఆస్పత్రికి కూడా సరిపడా పార్కింగ్ సదుపాయాలు లేవు. (క్లిక్: అక్రమ పార్కింగ్లపై స్పెషల్ డ్రైవ్లు) నిత్యం 15 వరకు కేసులు.. అక్రమంగా పార్కింగ్ చేసిన ప్రాంతాలకు ట్రాఫిక్ పోలీసులు వెళ్లి ఆ కార్లకు వీల్ క్లాంప్లు వేస్తూ ఓ స్టిక్కర్ అంటించి దాని మీద సంబంధిత అధికారి ఫోన్ నంబర్ రాస్తున్నారు. పార్కింగ్ చేసిన వాహనదారు ఆ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే ఎస్ఐ వెళ్లి వీల్ క్లాంప్ తొలగించి రూ. 600 జరిమానా విధించి పెండింగ్ జరిమానాలు కూడా క్లియర్ చేస్తారు. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు 15 వరకు కేసులు నమోదు చేస్తున్నాం. – జ్ఞానేందర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, పంజగుట్ట -
వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని నవోదయ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వ్యభిచారం చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ దేవరకొండ జయంత్కుమార్(27)తో పాటు బేగరి యాదయ్య(37) పట్టుబడ్డారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న జి. వినయ్ పరారీలో ఉండగా మరో నిర్వాహకుడు యానాల శ్రీనివాస్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దాడుల్లో నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. చదవండి: ఫుడ్ డెలివరీకి వెళ్లి ఇదేం పాడుపని.. యువతిని బలవంతంగా..! -
ఫోన్ మాట్లాడొద్దన్న తల్లి.. అదృశ్యమైన కూతురు
బంజారాహిల్స్(హైదరాబాద్): తరచూ ఫోన్ మాట్లాడుతున్నావని కోప్పడ్డందుకు తన కూతురు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సింగాడబస్తీలో నివసించే భీమ్బాయి గృహిణి. ఆమె 15 సంవత్సరాల కూతురు పూజ ఇంటర్ చదువుతోంది. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్గా పోలీసులకు పట్టించిన భార్య ఈ నెల 15వ తేదీన ఫోన్ తరచూ ఎందుకు మాట్లాడుతున్నావని అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గతంలో కూడా పలుమార్లు ఇంట్లో నుంచి వెళ్లి తన స్నేహితుల వద్ద ఉండేదని ఈ సారి కూడా వస్తుందని చూడగా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94914 87605లో సంప్రదించాలని ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
ఎన్నికల స్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం
బంజారాహిల్స్: నిజాం పాలనలో జరిగిన దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని కొందరు కుల, మతాల మధ్య జరిగినట్టు చిత్రీకరిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి.సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం ఎన్నికల స్వామ్యంగా మారడంతోనే అది బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్’ఆధ్వర్యంలో ‘వీర తెలంగాణ రైతాంగ సాయుధపోరాట 74వ వార్షికో త్సవాలను ఆయన ప్రారంభించారు. తొలుత రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జెండాను తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థాన ప్రజలు 1948 తర్వాత ప్రా ణవాయువులు పీలుస్తున్నారంటే నాటి కమ్యూని స్టులు చేసిన పోరాటం, త్యాగాల వల్లేనన్నారు. ఈ త్యాగాల పునాదులపై నిర్మితమైన చరిత్రను, కొందరు వ్యాపారం చేసుకుంటూ నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ విమోచన పేరిట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్లో సభ నిర్వహించినంతనే చరిత్ర మారబోదని, తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎర్రజెండా, తెలంగాణ ప్రజలే వారసులని సుర వరం అన్నారు. వల్లబ్భాయ్ పటేల్ హైదరాబాద్ రాజ్యాన్ని విముక్తి చేశారంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. రావి నారాయ ణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మోహి ముద్దీన్, బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మను ఎర్రజెండా నుంచి వేరు చేయవద్దన్నారు. సమా వేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారా యణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, అమర వీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని యజమాని హత్య
బంజారాహిల్స్: పెంపుడు పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని ఆగ్రహించిన ఓ యువకుడు దాని యజమానిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మిథిలానగర్లో డాక్టర్ మీనన్ ఇంట్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నల్లాపూర్కు చెందిన ఓ బాలుడు(17)తోపాటు హరీశ్వర్రెడ్డి అలియాస్ చింటూ(20) అద్దెకు ఉంటున్నారు. అసోంకు చెందిన ఎజాజ్ హుస్సేన్ (20), బ్రాన్ స్టిల్లింగ్(20) కూడా ఇదే ఇంట్లోని ఓ గదిలో అద్దెకుంటూ సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న రాత్రి ఎజాజ్, బ్రాన్ ఇద్దరూ విధులు ముగించుకొని గదికి వెళ్తుండగా దారిలో కనిపించిన ఓ పిల్లిని వెంట తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లి అరుస్తుండటంతో పక్కనే ఉన్న హరీశ్వర్రెడ్డితోపాటు సదరు బాలుడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తుండటంతో మద్యం మత్తులో ఉన్న బాలుడు కోపంగా ఎజాజ్ గదికి వెళ్లాడు. అక్కడే ఉన్న బాటిల్లోని పెట్రోల్ను ఆయనపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఎజాజ్ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారంరాత్రి మృతి చెందాడు. అయితే ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చనిపోయాడంటూ మొదట ఆ బాలుడితోపాటు హరీశ్వర్రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి స్నేహితుడు బ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును తిరగదోడిన పోలీసులు బాలుడితోపాటు హరీశ్వర్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: దంపతుల ఆత్మహత్య) -
డిజిటల్ మీడియాతో ఉన్నత విద్య పటిష్టం
బంజారాహిల్స్: ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిటల్ మీడియా ద్వారా తెలంగాణలో ఉన్నత విద్యను పటిష్ట పరుస్తున్నారని తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్(సికా), ఎక్సెల్ ఇండియా మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో బ్రిడ్జింగ్ ఎడ్యుకేషనల్ డివైడ్(ఒడీఎఫ్ఎల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్)్ఙ అనే అంశంపై ఒక రోజు సింపోసియం నిర్వహించారు. పలువురు విద్యారంగ నిపుణులు, నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ, రానున్న రోజుల్లో విద్యా రంగంలో మార్పులు, అటు ప్రభుత్వాలు ఇటు విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను విస్తృతంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతానికి బ్రాడ్ బ్యాండ్ సేవలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గ్రామీణ పాఠశాలలను కూడా ఆన్లైన్ విద్యా విధానానికి అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. సాంకేతిక కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. సాంకేతిక విప్లవం నేపథ్యంలో తరగతి గది వాతావరణం పూర్తిగా మారిపోయిందన్నారు. ఆన్లైన్ విద్యా బోధనలో వినూత్న మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొ.ఆర్.లింబాద్రి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య.కె.సీతారామారావు, టి–శాట్ సీఈవో శైలేష్రెడ్డి, ‘సికా’ డైరెక్టర్ ప్రొ. ప్రొ.పి.మధుసూదన్రెడ్డి, ఎక్సెల్ ఇండియా చీఫ్ ఎడిటర్ సంగెం రామకృష్ణ, విశ్వవిద్యాలయ, రిజిస్ట్రార్ డా ఏవీఎన్ రెడ్డి, డీన్ సోషల్ సైన్సెస్ ప్రొ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ బంజారా హిల్స్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత
-
సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు