cellphone
-
సెల్ఫోన్ మాయలో పల్లెలు
సిరిసిల్ల: ఊరు మారింది.. తీరు మారింది.. పల్లెల రూపురేఖలు వేగంగా మారిపోయాయి.. దశాబ్దాల కిందటి పల్లెల్లో కులాలు, మతాలకతీతంగా ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు కనిపించేవి. చాలా కాలం తర్వాత తమవారిని చూస్తే ఆనందభాష్పాలు, పట్టలేని సంతోషం. ఇప్పుడవి కనుమరుగయ్యాయి.పల్లెలు సెల్ఫోన్ మాయలో పడ్డాయి. ప్రపంచాన్ని అరచేతిలోనే చూస్తున్నరు. కానీ, పక్కింటోళ్లతో, ఆత్మీయులతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా నవ్వడం లేదు. మునుపటి ఆప్యాయతలు, అనురాగాలు లేవు. చలికి రైతులు నాగలి కడ్తలేరు. ఫోన్ చేసి, ట్రాక్టర్ మాట్లాడుకొని, పొలం దున్నిస్తున్నరు. పిండివంటలు చేయడం వద్దనుకునేవారు ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నరు. -
క్లాస్ రూమ్కు సెల్ తీసుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: తరగతి గదిలోసెల్ఫోన్ వాడొద్దని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఫోన్ వాడే టీచర్లను ఓ కంట కనిపెట్టాలని అధికారులకు సూచించింది. క్లాస్ రూ మ్లోకి అసలు ఫోన్ లేకుండానే వెళ్ళాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతేనే ఫోన్ తీసుకెళ్ళాలని, దానికీ ప్రధానోపాధ్యాయుడి అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. వాస్తవానికి ఈ నిబంధన పాతదేనని ఉన్నతాధికారులు అంటుండగా, ఇకపై దీన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు డీఈవోలు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు సెల్ఫోన్ వినియోగంపై నిఘా పెట్టాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ఇది టీచర్లకు ఇబ్బందికరంగా మారుతుందని, హెచ్ఎంలు వేధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాట్సాప్ చూస్తూ..ఫోన్ మాట్లాడుతూ..! ఇటీవల కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేకమంది టీచర్లు సెల్ఫోన్లో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఫాలో అవుతూ గడుపుతున్నారని గుర్తించారు. కొంతమంది ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దాదాపు 12 జిల్లాల నుంచి ఈ తరహా ఉదంతాలను జిల్లా అధికారులు గుర్తించారు. వీటిని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపారు. సెల్ఫోన్పై క్లాస్రూంలో నిషేధం విధించాలని సూచించారు. పైగా టీచర్లు బోధనకు ముందుగా సన్నద్ధమవ్వడం లేదని, క్లాస్ రూంలో సెల్ఫోన్ ద్వారా సెర్చ్ చేసి పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వేసినప్పుడు సెల్ఫోన్లో సెర్చ్చేసి సమాధానమిస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచి్చంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సెల్ఫోన్పై నిషేధం విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఫోన్ లేకుండా స్కూల్ నడుస్తుందా? టీచర్లు వ్యక్తిగత ప్రయోజనాలకు సెల్ వాడుతున్నారని చెప్పడం అర్థం లేని మాట. అసలు సెల్ఫోన్ లేకుండా స్కూళ్ళు నడిచే అవకాశం ఉందా? విద్యార్థుల ముఖ హాజరు తీసుకోవాలంటే ఫోన్ కావాలి. ఉన్నతాధికారులకు పంపే అన్ని రిపోర్టులను సెల్ లేదా ట్యాబ్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. సెల్ఫోన్తో పనులు చేయాలని చెప్పే అధికారులు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. – చావా రవి (టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) స్వీయ నియంత్రణ మంచిది తరగతి గదిలో సెల్ఫోన్ వాడకంపై నిషేధం కన్నా.. టీచర్లు స్వీయ నియంత్రణ పాటించేలా చర్య లు తీసుకోవాలి. బోధనకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నిషేధాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది హెచ్ఎంలు అనవసరంగా టీచర్లను వేధించకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్కూల్లో ఫోన్ వినియోగానికి టీచర్లు దూరంగా ఉండాలి. – సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) -
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. -
మీ ఫోనే.. మీ ఆయుధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఇటువైపున జగన్ ఒకే ఒక్కడు... అటువైపున చూస్తే ఇంత మంది! దానికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంట్.. అన్నీ జరుగుతున్నాయి. మరిఇంత మంది, ఇన్ని కుట్రలు, ఇన్ని ఇబ్బందులను తట్టుకుని మీ జగన్ నిలబడగలుగుతున్నాడంటే కారణం? వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్కు తోడుగా ఉన్నారు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్కు కోట్ల గుండెలు అండగా ఉన్నాయి’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 21వ రోజు ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్ర సందర్భంగా మంగళవారం విశాఖ జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. రాత్రి బస ప్రాంతం నుంచి సీఎం అక్కడకు చేరుకున్నారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సోషల్ మీడియా కార్యకర్తలతోపాటు వివిధ దేశాల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. మీకు ఎంత చేసినా తక్కువే ఆ దేవుడి దయమీద జగన్కు నమ్మకం ఉంది. జగన్ను ప్రేమించే గుండెల మీద నమ్మకం ఉంది. మరి జగన్ ఒంటరి ఎలా అవుతాడు? మీరు చూపిస్తున్న అభిమానానికి మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మరోసారి భరోసా ఇస్తున్నా. భార్గవ్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్ట్రీమ్ లైనింగ్ చేయడంలో ముందు నిలిచి అడుగులు వేస్తున్నాడు. మీ వెనుక ఒక్క జగనే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన మీద దుష్ట చతుష్టయం దాడులు పెరిగాయంటే దాని అర్థం మనం విజయానికి చాలా దగ్గరగా ఉన్నామనే! ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉన్నట్లే! దెబ్బ ఇక్కడ (నుదిటిపై) తగిలింది. ఇక్కడ (కంటిపై) తగల్లేదు. ఇక్కడా (కణతలపై) తగల్లేదంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో మనం ఎక్కడా తగ్గేదే లేదు. ఫోన్ అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. వందల మంది చంద్రబాబులు, రామోజీలు, దత్తపుత్రులు, ఎల్లో మీడియాలు వచ్చినా వైఎస్ జగన్ తొణకడు. కారణం.. పైన దేవుడున్నాడు, కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. ప్రత్యేకంగా యాప్.. సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారు చేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఆంధ్రా డెస్టినీ మన విశాఖ వచ్చిన మీరంతా ఈరోజు సిటీని చూస్తున్నారు కదా! ఈ సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తారో అప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఐటీని అత్యుత్తమ స్థానానికి చేర్చే పరిస్థితి కూడా వస్తుంది. చెల్లి గీతాంజలి చావుకు కారకులు.. ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మరో 18 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుంది. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీళ్లంతా చాలరన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ యుద్ధం చేస్తున్నాయి. ఈ మధ్య వాళ్ల ఉక్రోషం ఏ స్థాయికి వెళ్లిందంటే సోషల్ మీడియాలో జగన్కు సపోర్ట్ చేసిందని చెల్లెమ్మ గీతాంజలిని ఎంత దారుణంగా వేధించారో అందరూ చూశారు. జగనన్న చేసిన మంచితో తన కుటుంబం బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా వచ్చాయని తన సంతోషాన్ని అందరితో పంచుకోవటమే ఆమె చేసిన పాపం! చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్లిందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో చెప్పేందుకు నిదర్శనం. అన్నా.. జాగ్రత్త తెనాలిలో ఇంటి పట్టా తీసుకున్న గీతాంజలి ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కాయలున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. వైఎస్సార్సీపీ కాయలున్న చెట్టు అయితే టీడీపీ ముళ్ల చెట్టు లాంటిది. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎంతో అండగా నిలిచింది. అన్నా మీరు జాగ్రత్త.. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్లు భావించాం. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్గా రాడు. – పి.నాని, బాపట్ల జిల్లా విశాఖ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.. విశాఖ ఎయిర్పోర్టులోని ఫుడ్ కోర్టు టీడీపీ వాళ్లదని తెలియక గతంలో అక్కడ ఉద్యోగం చేశా. విశాఖ ఎయిర్పోర్టులో మీపై జరిగిన దాడి ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను జగన్ అభిమానిని అని తెలిసి నన్ను చాలా వేధించారు. టీడీపీ నాయకులు లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నేను పీసీఎస్ రూల్స్ ప్రకారం నడుచుకుంటే నాపై దొంగ కేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని ఎంతగానో హింసించారు. సీఎస్వో వేణుగోపాల్ నిన్ను ఎక్కడా బతకనివ్వనని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నాపై ఒత్తిడి తేవటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మా కుటుంబం అంతా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ ఉద్యోగం లేకుండా ఉన్నా. విజయవాడలో మీ మీద బొండా ఉమ ప్రోద్బలంతో జరిగిన దాడి చూశాక మౌనంగా ఉండలేక ఇవన్నీ బయట పెడుతున్నా. – సామ్రాజ్యం, మాజీ ప్రైవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్పోర్టు ముస్లింలంతా మీ వెనకే .. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ముస్లింలంతా భయపడుతూ బతికారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. మైనార్టీలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంగా, మండలి వైస్ చైర్పర్సన్గా చేశారు. ఏడుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ అభిమానిగా ఒక్క రోజైనా చాలు తమ్ముడు భరత్కుమార్రెడ్డి ఫిబ్రవరిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడికి మీరే దైవం అన్నా. మీరు బాగుంటేనే మేమూ బాగుంటాం. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేసేది. భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంత స్ట్రాంగ్ అయ్యింది. మిమ్మల్ని కలుసుకుంటే నా తమ్ముడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బతికినా చాలు. – ఎం.అనిల్కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా జగనన్నా మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనసుకు, దేహానికి ఎంత గాయమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలని మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు. ఎప్పటికీ మీ అండదండలు ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలి. – బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) కడుపు కాలేవాడికి మీ పథకాల విలువ తెలుసు సోషల్ మీడియా సైనికుడైన మా అన్నయ్య 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెలిసి సజ్జల భార్గవ్ మా ఇంటికి వచ్చారు. మీకు సాయం చేయాలని జగనన్న ఆదేశించారని చెప్పారు. మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. మా పిన్ని, బాబాయి టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలో మెంబర్లు. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. మా అన్న చనిపోయినప్పుడు కూలీ పనులు చేసుకునే వ్యక్తి ఒకరు ఫోన్ చేసి ఆ రోజు వచ్చిన రూ.600 సాయంగా పంపుతున్నట్లు చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా! – వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
ఏంటి? మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశారా.. మీక్కూడా ఇలా జరుగుతుందేమో.. జాగ్రత్త!
సాక్షి, అల్లూరి సీతారామరాజు: దసరా పండగ సందర్భంగా సెల్ఫోన్ కొనుక్కోవాలనుకున్న ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగికి చెందిన పండు అనే ఓ యువకుడు ఆఫర్లో రూ.6 వేలకు వస్తోందని ఇంటెల్– ఏ60ఎస్ సెల్ఫోన్ కోసం ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీకు ఆర్డర్ పెట్టాడు. సెల్ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి గురువారం కొరియర్ బాయ్ ఫోన్ వచ్చిందంటూ ఓ బాక్స్ అందజేశాడు. ఆ యువకుడు ముందు జాగ్రత్తతో ఆ బాక్సును కొరియర్ బాయ్ ఎదురుగానే తెరిచాడు. తీరా ఆ బాక్సులో ఫోన్కు బదులు రెండు రాళ్లు, వైరు లేని చార్జర్ కనిపించడంతో అతనితోపాటు, ఇది చూసిన ఇరుగు పొరుగువారు అవాక్కయ్యారు. కొరియర్ బాయ్ వెంటనే సంబంధిత కొరియర్ కంపెనీకి ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. ఆర్డర్ ప్రకారం సెల్ఫోన్ అందజేస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆ యువకుడు శాంతించాడు. -
వివాహేతర సంబంధం..! నిందితులను పట్టించిన సెల్ఫోన్..!!
ఆదిలాబాద్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మరో ముగ్గురితో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్ నదీమ్ తాహెర్(28) పటాన్చెరు మండలం లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అందులో మొఘల్పూర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇంకా ఆమె భర్త షహజాద్కు ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే తెలిసింది. అతడిని మందలించినా తీరులో మార్పు రాలేదు. ఇక హైదరాబాద్లోని టోలిచౌకిలో ఉన్న సోదరి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని హత్యకు పథక రచన చేశాడు. అందులో భాగంగా షహజాద్ తన బంధువు గౌస్ నుంచి కత్తులు, గొడ్డలి సేకరించాడు. స్నేహితులు షబ్బీర్ అహ్మద్, ఎజాజ్ అలీ సహాయం తీసుకున్నాడు. టోలీచౌకీకి నదీమ్ వచ్చాడని తెలుసుకున్న అతడు ఇదే విషయమై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అందరూ ఓ హోటల్లో కలిశారు. ఇక్కడ వద్దని సంగారెడ్డిలోని ఓ దాబాకు వెళ్దామని నమ్మించారు. నదీమ్, షహజాజ్ బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్డారం గేటు సమీపాన వచ్చేసరికి నదీమ్ మూత్రవిసర్జనకు ఆగాడు. అక్కడ సీసీ కెమెరాలు లేవని ధ్రువీకరించుకుని అతడితో వారు గొడవ పడ్డారు. పథకం ప్రకారం గొడ్డలి, కత్తితో మెడపై దాడి చేయగా అతను అక్కడికక్కడే మరణించాడు. తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. అయితే మరో నిందితుడు గౌస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?
ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది. రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న . పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది . మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ . "పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి . మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది. అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ . ఇంతకీ కరోనా వాక్సిన్లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ? తిలాపాపం తలా పిడికెడు.. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు . "సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు. ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు. జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి . వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
ఇన్స్టాల్ చేసే యాప్తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్ఫోన్ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్ఫోన్ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్ఫోన్కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ఈనాడు రామోజీ కంకణం కట్టుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న లేఖ, సెల్ఫోన్ను వెంటనే ఎందుకు పోలీసులకు స్వాధీనం చేయలేదనే అంశాన్ని ఏనాడైనా రాశారా రామోజీ? ఈ కేసులో తొలి నుంచీ ప్రతి విషయంలో మీ వక్రీకరణ కనిపిస్తూనే ఉంది. ఎప్పుడు ఏ చిన్న విషయం తెలిసినా.. దానిని ప్రభుత్వానికి, ఎంపీ అవినాశ్రెడ్డికీ ముడిపెట్టి లేనిపోని విషయాలు కలిపి చెలరేగిపోతూ వండివార్చడమే మీరు పనిగా పెట్టుకోవడం నిజం కాదా? అసలు వివేకా కేసులో ఇంత గందరగోళానికి కారణం ఏమిటని ఏనాడైనా తొంగి చూశారా? వైఎస్ వివేకానందరెడ్డిపై తీవ్రంగా దాడి చేసిన ఆగంతకులు ఆయనతో బలవంతంగా ఓ లేఖ రాయించారు. తనను డ్రైవర్ ప్రసాద్ తీవ్రంగా గాయ పరచినట్టుగా ఆ లేఖలో వివేకా రాసినట్టుగా ఉంది. ఆ లేఖ ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ రోజే అంటే 2019 మార్చి 15న ఉదయమే గుర్తించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని మొదటగా చూసింది ఆయనే. ఆ లేఖతోపాటు వివేకానందరెడ్డి సెల్ఫోన్ను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. వివేకానందరెడ్డి మరణించిన సమాచారాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్రెడ్డిలకు ఫోన్ చేసి చెప్పారు. వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను కూడా వాట్సాప్ చేశారు. ఆ ఫొటోలు చూస్తే ఎవరికైనా అది హత్య అని సులువుగా తెలుస్తుంది. ఆ లేఖను తాము వచ్చే వరకు ఎవరికీ ఇవ్వొద్దని.. ఆ విషయం బయటకు చెప్పొద్దని వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. దాంతో ఆ లేఖ విషయం ఆయన పోలీసులకుగానీ ఇతరులకుగానీ చెప్పనే లేదు. ఆ తర్వాత కాసేపటికే సమీప నివాసాల్లోని వారు, పార్టీ కార్యకర్తలువచ్చారు. అనంతరం వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పడంతో ఎంపీ అవినాశ్రెడ్డికి విషయం తెలిసింది. దాంతో ఎన్నికల ప్రచారానికని బయలు దేరిన ఆయన వెనుదిరిగి వివేకా నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా వివేకానందరెడ్డి రాసిన లేఖ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి ఎవరికీ చెప్పనే లేదు. ఆ లేఖ విషయం అప్పుడే చెప్పి ఉంటే వివేకానందరెడ్డిది హత్య అని వెంటనే తెలిసేది. ఈ విషయం కదా తొలుత తేలాల్సింది. అది తేలితే తర్వాత కథ వేరుగా ఉండేది. ఈ విషయాలపై దర్యాప్తు సాగాలని ఏనాడైనా ఈనాడు రాసిందా? అంటే మీ ఉద్దేశం అసలు దోషులను తప్పించి.. ఇంకెవరినో ఇరికించాలనేగా! ఆ దిశగా దర్యాప్తు సాగేలా.. దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలు వండివార్చుతున్నది అందుకేగదా.. ఇది మీకు కనిపించలేదా? సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి ఆ రోజు అంటే 2019 మార్చి 15న మధ్యాహ్నం 12 – ఒంటి గంట మధ్య పులివెందులకు చేరుకున్నారు. అప్పుడు పీఏ కృష్ణారెడ్డి ఆ లేఖను వారికి అందించారు. వారు దానిని సాయంత్రం 5 గంటల వరకు వారి వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వాటిని కృష్ణారెడ్డి ద్వారా పోలీసులకు అందించారు. ఆ సెల్ఫోన్లోని మెసేజ్లు, ఇతర డాటాను డిలీట్ చేసి మరీ పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. సహజంగా ఆ లేఖ విషయాన్ని వెంటనే చెప్పకుండా గోప్యంగా ఉంచిన పీఏ కృష్ణారెడ్డిని తొలుతే ఎందుకు ప్రశ్నించలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆ లేఖ విషయాన్ని రహస్యంగా ఉంచారో ఎందుకు తెలుసుకోలేదని.. అందువల్లే ఈ కేసులో కీలకమైన చిక్కుముడి విడిపోవడం లేదని ఎందుకు మీ రాతల్లో కనిపించదు రామోజీ? విషయం అందరికీ తెలిశాక.. ఘటనా స్థలానికి చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. వారిని దోషులుగా చూపుతూ దుష్ప్రచారం చేయడం మీకే చెల్లింది. వివేకా హత్య జరిగిన రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి అవినాశ్రెడ్డి ఇంటి వద్దకు వెళ్లానని ఉదయ్కుమార్రెడ్డి ఆ రోజూ చెప్పారు. ఈ రోజూ అదే చెబుతున్నారు. ఓ పని కోసం ఎంపీ ఇంటికి వెళ్లానని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ కూడా ఆరోజు, ఈ రోజు అదే చెబుతోంది. ఎంపీ ఇంటి వద్ద ఉన్నామని వాళ్లే స్వయంగా చెబుతున్నప్పుడు.. ఆ విషయం కొత్తగా కనిపెట్టినట్లు మీరు చెప్పడం ఏమిటో! ఉదయ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వండి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. శుక్రవారం ఆయన్ను కడపలో అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించిన విషయం తెలిసిందే. -
సెల్ఫోన్ రికవరీలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి
నిత్య జీవితంలో సెల్ఫోన్ అత్యంత అవసరంగా మారింది. వినోదమే కాదు డిజిటల్ లావాదేవీలు, ముఖ్యమైన సమాచారం మొత్తం ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు. అంతటి ముఖ్యమైన సెల్ఫోన్ పోగొట్టుకుంటే సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫోన్ రికవరీలపై ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా రికవరీని ప్రారంభించి ఇప్పటికే వేలాది ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ మల్లికాగార్గ్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట: సెల్ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. ఈ నేరాలు ప్రకాశం జిల్లాలో గణనీయంగా పెరిగాయి. సెల్ఫోన్ చోరీలతో పాటు వాటిని మరిచిపోయినప్పుడు అందులోని డేటా విషయంలో ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు. బంధువులు, సన్నిహితులు, మిత్రుల ఫోన్ నంబర్లతో పాటు కీలకమైన డాక్కుమెంట్లు సైతం సెల్ఫోన్లోనే దాచుకోవడం సమస్యగా మారింది. అనుకోని పరిస్థితుల్లో సెల్ఫోన్ పోగొట్టుకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో పోలీసులు సైతం సెల్ఫోన్ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు కాదు. సెల్ఫోన్ పోయిందంటూ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కితే చేదు అనుభవాలను మూటగట్టుకోవాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే తొలిసారిగా.. సెల్ఫోన్ రికవరీలపై ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేలకు వేలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన సెల్ఫోన్లు పొగొట్టుకున్న బాధితులకు సకాలంలో న్యాయం చేకూర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నూతన సాంకేతిక వ్యవస్థతో ఫోన్లను రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1600 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరో 1000 ఫోన్లను ఎవరు ఉపయోగిస్తున్నారో గుర్తించారు. 300 ఫోన్లు మన జిల్లాలో, 700 ఇతర రాష్ట్రాలు, జిల్లాలో ఉన్నట్లు గుర్తించి వాటిని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెల్ఫోన్ వినియోగంలో ఉంటేనే.. సెల్ఫోగొట్టుకున్న వారు పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్ను తెలియపరుస్తూ ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదును ఎస్పీ పర్యవేక్షణలోని ప్రత్యేక సాంకేతిక బృందం పరిశీలనకు స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి పంపిస్తారు. ఐఎంఈఐ ద్వారా ఆ సెల్ఫోన్ ఎక్కడ వినియోగిస్తున్నారో గుర్తించి రికవరీ చేస్తున్నారు. అయితే ఆ సెల్ఫోన్ వినియోగంలో ఉన్నప్పుడే రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం: మలికాగార్గ్, ఎస్పీ జిల్లాలో ఇప్పటి వరకు 3799 ఫిర్యాదు వచ్చాయి. పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదు జిల్లా ఐటీ కోర్ టీంకు అందుతాయి. జిల్లాలో మిస్సింగ్ మొబైల్స్ను ట్రేస్ చేసేందుకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు 1600 ఫోన్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేశాం. ఫోన్ పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో ఒక ఫార్మాట్లో డేటాను పూర్తి చేసి ఇవ్వాలి. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేయాలి. 10 రోజుల్లోనే తెచ్చి ఇచ్చారు నా మొబైల్ పోయినట్లు ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే ఎస్సై నాకు అప్పగించారు. తిరిగి రాదనుకున్న రూ. 40 వేల సెల్ఫోన్ అందడం ఎంతో సంతోషంగా ఉంది. – ఎన్ రమణారెడ్డి, సర్పంచ్, పిటికాయగుళ్ల -
ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
రాయదుర్గం రూరల్: సెల్ఫోన్ కొనివ్వకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం వేపరాలకు చెందిన హరిజన రమేష్ కుమారుడు యశ్వంత్ (18) ఇంటర్ వరకు చదువుకుని కూలి పనులతో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా తనకు సెల్ఫోన్ కొనివ్వాలంటూ తండ్రిని అడుగుతున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తండ్రి కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన యశ్వంత్ శనివారం ఉదయం శ్మశాన వాటిక సమీపంలో క్రిమి సంహారక మందు సేవించాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ భాస్కర్ తెలిపారు. యువకుడి దారుణ హత్య గార్లదిన్నె: విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన యువకుడు అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. ఎవరో హత్య చేసి.. గుర్తుపట్టకుండా శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ ఘటన రామదాస్పేట సమీపంలో శనివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కేశవాపురానికి చెందిన రాజేష్ (23) గార్లదిన్నె భారత్ గ్యాస్ కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అయితే రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. మొబైల్కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకుండా పోయాడని శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రామదాస్పేట అటవీ ప్రాంతంలో ఓ యువకుడికి నిప్పంటించి చంపేసినట్లు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల కిందటే శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆనవాళ్లను బట్టి చనిపోయింది రాజేష్ అని తల్లిదండ్రులు తెలిపారు. సీఐ అస్రార్బాషా అటవీప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. (చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..) -
ప్రాణం తీసిన సెల్ఫోన్.. చెల్లెలితో కలిసి ఆడుకుంటుండగా
పిఠాపురం: ఆ అమ్మాయి చేతిలో నుంచి సెల్ఫోన్ పొరపాటున జారి పడి పగిలిపోయింది. తండ్రి తిడతాడన్న భయంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చిన జగ్గంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సారిపల్లి నాగన్నది నిరుపేద కుటుంబం. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కష్టపడి పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు. రెండో కుమార్తె సత్యవేణి (16) ఆరో తరగతి వరకూ చదివి మానేసింది. ఆమె స్నేహితులందరూ ఎప్పటి నుంచో సెల్ఫోన్ వాడుతున్నారు. తనకూ కొనిపెట్టమని తండ్రిని తరచుగా అడిగేది. అయితే అంత స్థోమత లేదంటూ కుమార్తెకు నాగన్న నచ్చజెబుతూండేవాడు. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం) కుమార్తె కోరిక తీర్చేందుకు అప్పు చేసి, 11వ తేదీన కొత్త సెల్ఫోన్ కొని ఇచ్చాడు. అదే రోజు చెల్లెలితో కలిసి ఆ ఫోనుతో సత్యవేణి ఆడుకుంటూండగా, ఒక్కసారిగా అది కింద పడి పగిలిపోయింది. విషయం తెలిస్తే తండ్రి తిడతాడని సత్యవేణి భయపడింది. పొలానికి కొట్టడానికని నాగన్న గడ్డి మందు కొని తెచ్చి, బాత్రూములో పెట్టాడు. సత్యవేణి ఆ మందు తాగి ఎవరికీ చెప్పకుండా పడుకుని ఉండిపోయింది. కొంతసేపటికి వాంతులు కావడంతో ఏమైందని అడగ్గా గడ్డి మందు తాగినట్టు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచీ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?) ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సెల్ఫోన్ దొంగిలించాడని కొట్టి చంపేశారు
దుండిగల్: సెల్ఫోన్ దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు.. హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూపీ లాగడంతో అసలు హంతకులు పట్టుబడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్ (35) వృత్తిరీత్యా హోటళ్లల్లో చెఫ్గా పని చేసేవాడు. నగరానికి వలస వచ్చిన అతను సూరారం కాలనీలో ఉంటూ స్థానికంగా ఉంటున్న హోటళ్లల్లో పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్ సెంటర్లో చెఫ్గా చేరాడు. అయితే డిసెంబరు 26న హోటల్లో సెల్ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్పై అనుమానంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కొట్టారు. అయినా ఒప్పుకోకపోవడంతో వెదురు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో హత్యానేరం నుండి తప్పించుకునేందుకు రాకేష్ అతని స్నేహి తులు వెంకటసాయి, వినయ్, మున్నా, సతీశ్, సంపత్, అజారుద్దీన్లు మృతదేహాన్ని బహదూర్పల్లి సాయినాథ్ సొసైటీలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. పట్టుబడిందిలా.. సాయినాథ్ సొసైటీలోని రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. కాగా మృతుడి ప్యాంట్జేబులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రమేష్ పలు హోటళ్లలో చెఫ్గా పని చేసేవాడని తెలుసుకున్నారు. గండిమైసమ్మలోని జెఎంజే హోటల్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రమేష్ను కొడుతున్న దృశ్యాలు లభించాయి. దీంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని, మృతదేహాన్ని సాయినాథ్ సొసైటీ సమీపంలో పడేసినట్లు అంగీకరించాడు. దీంతో రాకేశ్తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాకేశ్ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
సెల్ ఫోన్లో గేమ్స్ ఆడొద్దని మందలించడంతో..
జామి: సెల్ ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి మందలించాడని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జామిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జామి మంగలవీధికి చెందిన లగుడు సింహాచలంనాయుడు(14) విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెల్ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి కృష్ణ మందలించి పొలం పనులకు వెళ్లాడు. దీంతో సింహాచలంనాయుడు ఇంటివద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. నోటిలో నుంచి నురగలు రావడంతో తల్లి కేకలు వేసి భర్తకు సమాచారం అందించింది. విద్యారి్థని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జామి ఏఎస్సై గోపి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లక్కంటూ... కిక్కిచ్చారు!
పిడుగురాళ్ల టౌన్(గుంటూరు జిల్లా): మీకు లక్కీడీప్లో జె–7 సెల్ఫోన్ వచ్చింది.. నాలుగు వేలు చెల్లిస్తే.. రూ.14వేల విలువైన సెల్ఫోన్ అందుకోవచ్చు’ అని ఓ కంపెనీ వారి మాయమాటలు నమ్మిన ఓ యువకుడు నిండా మోసపోయిన ఘటన మంగళవారం జరిగింది. సెల్ఫోన్ స్థానంలో చిన్న ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు హనుమాన్ చాలీసా విజిటింగ్ కార్డును పార్శిల్లో పంపిన వైనం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల వెంకటేశ్వర్లు మూడునెలల కిందట సామ్సంగ్ కంపెనీ ఫ్రిజ్ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల కిందట వెంకటేశ్వర్లుకు ఫోన్ వచ్చింది. “మీరు ఫ్రిజ్ కొన్నారు కదా.. ఆ లక్కీడీప్లో జె–7 సెల్ఫోన్ వచ్చింది. నాలుగువేలు చెల్లించి పోస్టాఫీస్లో తీసుకోవాలి అని ఫోన్లో చెప్పారు. ఆశతో వెంకటేశ్వర్లు రూ. నాలుగువేలు పోస్టాఫీస్లో చెల్లించి పార్శిల్ను అందుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి పార్శిల్ తెరవగా అందులో చిన్న ఆంజనేయస్వామి విగ్రహం, హనుమాన్ చాలీసా విజిటింగ్కార్డు ఉండడంతో అవాక్కయ్యాడు. -
సెల్ఫోన్ కొనివ్వలేదని..
సాక్షి, జనగాం: సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామానికి చెందిన పోతాని ప్రశాంత్ డిగ్రి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెల్ఫోన్ కొనివ్వాల్సిందిగా తండ్రిని కోరాడు. అందుకు తండ్రి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురైన ప్రశాంత్ శుక్రవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంత్ను గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం మిగిల్చిన ఫొటో సరదా
సాక్షి, జనగామ: సెల్ఫోన్లో ఫొటోలు దిగాలనే సరదా ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్లోకి దిగిన బావతోపాటు ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ మూడ్ లక్ష్మణ్నాయక్, కాంతాబాయి దంపతుల కుమారుడు మూడ్ అవినాష్ (29)కు రఘునాథపల్లి మండలం గిద్దెబండ తండా (జీబీతండా)కు చెందిన లకావత్ లక్ష్మణ్, లీల దంపతుల కుమార్తె దివ్య వివాహం ఏడాదిన్నర క్రితం జరిగింది. హైదరాబాద్లో ఉంటున్న అవినాష్ శుక్రవారం రాత్రి జనగామకు వచ్చాడు. శనివారం గిద్దెబండతండాలోని అత్తగారింటికి వెళ్లాడు. మధ్యాహ్నం తల్లిగారింటి వద్ద ఉన్న భార్య దివ్యతోపాటు చిన్న మామ లకావత్ అంజయ్య కుమార్తెలు సంగీత (17), సుమలత(15)తో కలసి నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఒడ్డున ఉన్న దివ్య ఫొటోలు తీస్తుండగా అవినాష్, సంగీత, సుమలత నీటిలోకి దిగి సరదాగా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. అకస్మాత్తుగా రిజర్వాయర్లోని ఊబిలోకి అవినాష్ మునిగిపోయాడు. సంగీత, సుమలత సైతం నీటిలో గల్లంతయ్యారు. దివ్య గమనించి కేకలు వేయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి నీటిలోకి దిగి గాలించి ముగ్గురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరిలించారు. సంగీత ఇటీవలే ఇంటర్ ఉత్తీర్ణత కాగా సుమలత పదో తరగతి పాసైంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బ్యాంకులో ఓ రోజు
ఉదయం ఏడు గంటలు అవుతోంది. కనురెప్పలు తెరుచుకోవడం లేదు, ఇంకా కాసేపు నిద్ర పోతే బావుంటుంది అనిపించినా లేవక తప్పని పరిస్థితి. ఇంతలో సెల్ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం గుయ్మని వినిపించసాగింది. బద్ధకంగా మెసేజ్ చూశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. ఏజీయం నుండి సందేహానికి తావు లేని సందేశం. బడ్జెట్ నెగటివ్ నుండి పాజిటివ్కి రాక పోతే ఈ నెల ఆఖరులోగా బదిలీకి సిద్ధంగా ఉండమని. ఈ పది రోజుల్లోగా ఏ మాయో, మంత్రమో జరిగితే తప్ప అది అసాధ్యం. గబగబా బ్రష్ చేసి వచ్చేసరికి కాఫీ పట్టుకుని శ్రీమతి నిలబడివుంది. కప్పు అందుకున్నాడు. ‘రాత్రంతా నడుము నొప్పితో నిద్ర లేదండీ...ఈ రోజు అయినా డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే ఇక భరించలేను’ అంది. ‘సాయంకాలం అపాయింట్ మెంట్ తీసుకుంటాను’ చెప్పాడు. ‘తీసుకున్నాను, కానీ మీరు ఎన్నింటికి వస్తారో?’ ‘నేను డైరెక్ట్ గా క్లినిక్ కి వస్తాను’ చెప్పాడు. ఈ లోగా ఇంకో ఫోన్ కాల్. గబగబా మాట్లాడి బాత్రూం లోకి వెళ్ళాడు. ఓ కస్టమర్ తన హౌసింగ్ లోన్ ఎప్పటికి అవుతుందని అడిగాడు. స్నానం ముగించి వచ్చేసరికి మరో మెసేజ్.మొండి బకాయిల గురించి మీ మొండి వైఖరి మారకపోతే దండన తీవ్రంగా ఉంటుందని ఓ తీర్మానం. ఏం టిఫిన్ తిన్నాడో ఎలా తిన్నాడో తెలియదు, బయలుదేరిపోయాడు. బ్యాంకుకి వెళ్లి సిస్టమ్స్ ఆన్ చేసాడు. చక్రం గిర్రున తిరుగుతోంది... కనెక్టివిటీ ప్రాబ్లెమ్. ఫోన్ చేస్తే గంట కనీసం పడుతుందని శుభవార్త. కౌంటర్లలో సిబ్బంది హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘సర్, అర్జంట్ గా కాష్ కావాలి’ కస్టమర్ అభ్యర్ధన. కనెక్టివిటీ వచ్ఛేవరకు వేచి వుండమంటే ‘నా చెక్ ఉంచుకుని కాష్ ఇచ్చేయండి’ అంటూ కస్టమర్ విన్నపం మరియు సలహా. క్యాషియర్ కి చెబితే, ‘అదెలా అవుతుంది..అతని అకౌంట్లో బాలన్స్ వుందో లేదో... అంతగా అయితే మీరే ఇచ్చేయండి’ కనీసపు మొహమాటం కరువు. ఇవన్నీ రొటీన్లో మామూలే. ఈలోగా ఏటీఎంలో కాష్ లేదని, కనెక్టివిటీ వస్తేగాని కాష్ రాదని ప్రశ్న ప్లస్ జవాబు?! ఇంతలో లోన్ సెల్ నుండి డీవియేషన్ అప్రూవ్ అయితే గాని హౌసింగ్ లోన్ క్లియర్ కాదని, అర్జంట్ గా రమ్మనమని పిలుపు. సింగల్ బ్రాంచ్ బీఎంకి ఇదెలా సాధ్యం అవుతుందో ఎవరికి చెప్పినా అర్ధం కాదు, ప్రయోజనం లేదు. జోనల్ ఆఫీస్ నుండి కాల్. సీజీమ్ ఎల్లుండి వస్తున్నారు. ఇన్సూరెన్స్ మీ వంతు పది లక్షలు చేయాలి. (నేనేమైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ నా?!) ‘నేను సింగల్ బ్రాంచ్ బీ ఎం నండీ... పది కష్టం’ అంటే ‘మీరెంత కష్ట పడుతున్నారో అందరికీ తెలుసు... చిన్న బ్రాంచ్లలో ఏం పని ఉంటుంది, కనీసం ఇది అయినా చెయ్యండి’సెల్ ఫోన్ పక్కన పెట్టి తలెత్తి చూస్తే ఎదురుగా ఓ పెద్దాయన.\ ‘నా పెన్షన్ రాలేదు’ ‘లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారా?’ ‘గుర్తు లేదు’ ‘ఉండండి... చూసి చెబుతా....సిస్టమ్స్ ఇంకా రాలేదు, కూర్చోండి’ ‘ఎంతసేపు ఉండాలి’ ‘గంట పడుతుందని అన్నారు...చెప్పలేము’ ఇంతలో ఫోన్ మ్రోగింది. అటునుండి సీఎం అడ్మిన్ ‘సిస్టమ్ సస్పెన్స్ లో నాలుగు ఎంట్రీలు అర్జెంట్గా రివర్స్ చెయ్యండి... అసలు ఉదయం రాగానే వాటిని చూసి ఈ పాటికి క్లియర్ చెయ్యాలి, మేము పనిగట్టుకుని చెబితే కానీ చేయరా..’ ‘ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లెమ్ సర్! ఇంకా రెస్టోర్ కాలేదు’ ‘రాగానే వెంటనే రివర్స్ చేసేయండి... నేను మళ్ళా రిమైండ్ చెయ్యను’ హుకుం జారీ అయ్యింది. ఇంతలో మెసెంజర్ వచ్చి ‘సర్ వచ్చింది’ చెప్పాడు. ‘ఎవరు?’ ‘అదే సర్...కంప్యూటర్లు... పని చేస్తున్నాయట’ హమ్మయ్య... సిస్టమ్స్ వచ్చేసాయి. హడావుడి ప్రారంభమయ్యింది. జనాల తోపులాట. గబగబా బీఓడీ చేసి, కాష్ తీయడానికి పరుగెత్తాడు. ‘సర్! మన సుబ్బరాజు అబ్బాయికి జలుబు చేసింది. ఈ రోజు సెలవు పెట్టాడు’ కాష్ ఇన్ఛార్జ్ చల్లగా కబురు చెప్పాడు. ‘సుబ్బరాజు కౌంటర్ కూడా చెయ్యాలి, గోల్డ్ లోన్కి ఇద్దరు రెడీగా వున్నారు. అది మీరు చూసుకోండి’ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేశాడు కాష్ ఇన్ఛార్జ్. చిరాకు, టెన్షన్ తో ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు. ‘టీ చల్లరిపోతోంది..తాగండి’ అంది రమణమ్మ. కప్పు అందుకున్నాడు. జనాలు సీరియస్గా చూస్తున్నారు. ‘మా పని చేయకుండా నువ్వు టీ తాగుతూ కూర్చుంటావా?’ అని అందరిలోనూ ఒకటే ఫీలింగ్ సూటిగా బాణంలా తగులుతోంది. అబ్బ...పంచదార పానకం... ఎన్ని సార్లు చెప్పినా మరిచిపోయాను ఈ రోజుకి తాగేయండి’ అంటుంది. ఈ దెబ్బతో షుగర్ లెవెల్ నాలుగొందలు దాటి కిడ్నీలు డాం గ్యారెంటీ.పాసింగ్ ప్రారంభించాడు చకచకా. ఓ గంట ఏకధాటిగా అదే పని మీద ఉంటే కొంత జనాలు కదిలారు \మంగళ సూత్రాలు పట్టుకుని కట్టడానికి రెడీ అన్నట్టు ఓ పెద్దాయన ఎదురుగా కూర్చున్నాడు గోల్డ్ లోన్కి.‘వీటికి లోన్ ఇవ్వడం కుదరదు...ఆ నల్లపూసలు తీసేయాలి. ఆ సూత్రాల వెనక ఆ లక్క ఉండకూడదు’ చెప్పాడు.‘అయ్యా...ఎంత ఎమర్జెన్సీ కాకపోతే ఇలా మా ఆవిడ పుస్తెలు తెస్తాను... మీరు అదితీసేయండి ఇది ఉండకూడదు అంటే ఎలాగ చెప్పండి’‘రూల్స్ ఒప్పు కోవండీ...’ అంటూ ఓ పావుగంట సేపు వివరంగా చెప్పి ఒప్పించేసరికి తలప్రాణం కాళ్ళలోకి వచ్చిందిఇంతలో లోకల్ హెడ్ ఆఫీస్ నుండి ...ట్రేడింగ్ అకౌంట్లో కొంత అమౌంట్ లీన్ లో ఉందనీ, అది లిఫ్ట్ చేయడం కుదరదని చెప్పినందుకు గాను కస్టమర్ అంబుడ్స్మెన్కు వెళ్తున్నాడని...దీనికి మీ సమాధానం ఏమిటని ఘాటుగా ఫోన్ వచ్చింది.ట్రేడింగ్ అకౌంట్ ఆపరేట్ చేసేది కస్టమర్, అతడు షేర్స్ కొనేటప్పుడు అవసరమైన అమౌంట్ లీన్లో పెట్టుకునేది అతడే...షేర్స్ అలాట్ కానప్పుడు ఆ లీన్ లిఫ్ట్ చేసేది కస్టమరే తప్ప బ్రాంచ్ మేనేజర్ కి ఎటువంటి ప్రమేయం ఉండదని వివరించేసరికి...‘అదంతా మాకు తెలియదు, కస్టమర్ని పిలిపించి అతనిచేత దగ్గరుండి లీన్ లిఫ్ట్ చేయించి ప్రాబ్లెమ్ లేకుండా చూసుకోండి’ అని ఫోన్ కట్ చేసేసారు.ఒక్కసారి నీరసంగా అనిపించి అలా సీట్లో వెనక్కి వాలి మంచి నీళ్ళు కోసం బాటిల్ అందుకుంటే అది ఖాళీ.బెల్ కొట్టాడు. రమణమ్మ వచ్చింది. బొటన వేలితో సైగ చేసాడు. బాటిల్ పట్టుకుని వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చింది.ఓ గుక్కెడు తాగుదామనే సరికి కేకలు వినిపించాయి.చెక్ క్లియరింగ్కి నాలుగు రోజులా? అరుస్తున్నాడు ఓ కస్టమర్ హాల్లో.మంచి నీళ్ళు తాగి కౌంటర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలుసుకుని ‘అయ్యా! మీరు చెక్ లక్ష్మి వారం సాయంకాలం డ్రాప్ బాక్స్ లో వేశారు. అది శుక్రవారం ఉదయం వెళ్ళింది. శనివారం నాన్ క్లియిరింగ్ డే, ఆదివారం సెలవు కనుక ఈ రోజు సోమవారం సాయంకాలానికి మీ అకౌంట్లో పడుతుంది’ అని వివరంగా చెప్పాడు.‘మరి,ఈ మాత్రం దానికి ఇరవై నాలుగు గంటల్లో క్లియిరింగ్ అని బోర్డ్ పెట్టడం దేనికి?’ఏం సమాధానం చెబుతాడు?అదే సమయానికి ‘దొంగ నోటు’ అని కౌంటర్లో కాష్ ఇన్చార్జ్ చెప్పడం,‘అది నిన్న మీరే ఇచ్చారు’ అని కస్టమర్ దబాయించడం....ఆ వాదనకి అంతం ఆఖరికి పోలీస్ కంప్లయింట్ ఇస్తాననే వరకు వచ్చి అప్పటికి కాస్తా సద్దు మణిగింది.లంచ్ టైం అవ్వడంతో ఇంట్రవెల్ దొరికింది.ఈరోజు నడుం నొప్పి కారణంగా శ్రీమతి కేరెజీ కట్టలేదనే విషయం గుర్తొచ్చింది. రమణమ్మకు టిఫిన్ తెమ్మనమని చెప్పాడు.బాంక్ ఎదురుగా ఓ పాక హోటల్ నుండి రాళ్ల లాంటి రెండు గారెలు తెచ్చింది. ఒకటి తింటే చాలు ఆకలి చచ్చి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్కి బైపాస్ తప్పదేమో? సీనియర్ కొలీగ్ ఒకాయన గుర్తుకు వచ్చాడు. నలభై ఏళ్లకే పాపం....ఆలోచనలకు భంగం కలిగిస్తూ మెసెంజర్ వచ్చి,‘సర్, ఆక్వా కంపెనీ మూర్తి గారికి పది లక్షలు కాష్ అర్జంట్ గా కావాలిట’ అని చెప్పాడు.‘మన దగ్గర ఎంత ఉందో కనుక్కో’‘అంతా కలిపి నాలుగు మించదట, చెప్పారు’‘సరే పద..వస్తున్నా’ సగం తినగా మిగిలిన గారె వదిలి పెట్టి లేచాడు.సింగల్ బ్రాంచ్ లిమిట్ పది లక్షలు. ఈ రోజు ఇండెంట్ పెడితేరేపటికి గాని రాదు.మెయిన్ బ్రాంచ్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే, చెక్ ఎటెస్టు చేసి కస్టమర్ని పంపిస్తే ఇస్తామన్నారు.అదే విషయం ఆ మూర్తిగారికి చెబితే, ‘మీరు తెప్పించలేరా?మేమే వెళ్ళాలా?’ అంటూ ఒకటే విసుగు ప్రకటించి ఆఖరికి వెళ్లారు.సాయంకాలం నాలుగు అవ్వడంతో పబ్లిక్ ట్రాన్జాక్షన్స్ క్లోజ్ చేసి తాను చేయాల్సిన తదితర పనులు చేయసాగాడు.కాష్ బాలన్స్ అవ్వగానే, ‘రండి సర్, సేఫ్ క్లోజ్ చేద్దామని పిలుపు.ఆ తరువాత గుడ్ నైట్.ఒక్కడే మిగిలిపోయాడు.సస్పెన్స్ ఎంట్రీలు రివర్స్ చెయ్యాలంటే స్టాఫ్ ఉండాలి. వాళ్లు ఫీడ్ చేసాక గాని తను ఆథరైస్ చెయ్యడం కుదరదు. ఏం సమాధానం ఎలా చెబుతాడు?సరిగ్గా అదే సమయానికి సీఎం అడ్మిన్ నుండి ఫోన్ వచ్చింది.‘ఇంకా రివర్స్ చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ సిస్టం సస్పెన్స్ జీరో చెయ్యకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు’ఐదు దాటింది...స్టాఫ్ వెళ్లిపోయారు...రేపు చేస్తాను...అని చెప్పటానికి కూడా గొంతు పెగలలేదు.తన మిత్రుడికి ఫోన్ చేశాడు.వాడు పక్క బ్రాంచి మేనేజర్. ‘ఒరేయ్...రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉంది. ఉదయం నాకు అరగంట సేపు ఆపకుండా వాయించారు. మెమో ఇస్తామన్నారు’దేనికి?’ అడిగాడు.‘బ్రాంచికి బిజినెస్ లేదని? చుట్టూ ఉన్నవి పట్టా లేని భూములు. హౌసింగ్ లోన్లు ఎలా వస్తాయి? జనాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు. బంగారం మీద లోన్లు ఇమ్మంటారు. ఏరియాలో ఉద్యోగస్తులే లేరు. పెర్సనల్ లోన్ లిమ్మంటారు.బ్రాంచ్ షిఫ్ట్ చేద్దామంటే నన్నే షిఫ్ట్ చేస్తామన్నారు. పైగా నా వాక్ స్వతంత్రానికి మెమో అంటున్నారు. నిద్ర మాత్రలు మింగేద్దామని అనుకుంటుండగా నువ్వు ఫోన్ చేశావ్’‘అటువంటి ఆలోచనలు చెయ్యకురా...ఎట్టి పరిస్థితులలోనూ అలా చెయ్యకూడదు...ఒత్తిడికి చిత్తు కాకూడదు. ఆ ఒత్తిడిని పుత్తడిగా మార్చుకోవాలి’‘పుత్తడిగా మారితే అప్పుడు గోల్డ్లోన్ ఇవ్వొచ్చూ అంటావ్...సరి సరి’ఇంతలో సెల్ఫోన్లు గుయ్ మని శబ్దం చేశాయి.‘ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది’ అంటూ ఇద్దరూ ఫోన్ పెట్టేసారు.ఆదివారం ఉదయం పది గంటలకు మీటింగ్.ఈ వారాంతపు సెలవు గోవిందా ?ఇంతలో మరో కాల్ ...‘హలో’ అన్నాడు.‘నేనురా...గోపీని’ తన మిత్రుడు.‘ఏరా... ఏంటి సంగతి!’‘చాలా హాపీ రా....ఈ రోజే నేను నా ఉద్యోగానికి రాజీనామా సమర్పించాను’ఒక్క క్షణం గుండె లయ తప్పి కొట్టుకుంది.‘అదేంటిరా..అంత సడన్ గా ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావ్? ఇంకా పదేళ్లు సర్వీస్ ఉంది’‘పదేళ్లు ఈ టెన్షన్స్తో వుంటామో లేదో....వున్నా రోగాలతో, మందులతో బ్రతకాలి, ఎందుకొచ్చిన బ్రతుకని’గోపీ మాటలు నిజమే అనిపించాయి.ఉదయం లేచిన దగ్గర నుండి కుటుంబం గురించి గాని, పిల్లల గురించి గాని ఆలోచించడం అటు ఉంచితే కనీసం ఓ ఐదు నిముషాలు మాట్లాడటం కూడా జరగదు. ఇరవై నాలుగు గంటలూ బ్యాంకుతోనేఅయిపోతోంది.మిత్రులూ, బంధువులు సరేసరి పూర్తిగా మరిచిపోయారు.సోషల్ లైఫ్ అనేది లేకుండా పోయింది.ఇంతలో మరో ఫోన్ కాల్, ఓ రెండు మెసేజ్ లు వచ్చాయి. వాటికి తగు సమాధానాలు ఇచ్చి భార్యకు కు ఫోన్ చేసాడు.‘క్లినిక్ కి వస్తున్నాను’ చెప్పాడు.ఆవిడ చాలా ఆశ్చర్యంగా ‘నిజంగా’ అంది.వెంటనే చకచకా బయలుదేరిపోయాడు.డాక్టర్ చెక్ అప్, ఎక్స రే తీయడం, మందులు కొనుక్కొని బైటకు వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది. ఇప్పుడిక ఇంటికి వెళ్లి ఏం తింటామని మంచి హోటల్ కెళ్ళి చక్కని పదహారణాల తెలుగు భోజనం తిని,చివరలో గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయతో రెండు ముద్దలు తిన్నాక తృప్తిగా అనిపించింది.భర్త నిదానం చూసి ‘రేపు బాంక్ లేదా?’ అంది.సరిగ్గా అప్పుడే సెల్ ఫోన్ గుయ్ మంది.మెసేజ్ చూశాడు...బ్రాంచ్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఉదయం ఏడు గంటలకు ఆడిటర్ వస్తున్నట్టుగా ఓ వార్త. ∙పక్కి శివప్రసాదరావు -
సింగపూర్ బాబు సెల్ఫోన్ ఇచ్చాడా అక్కా!
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు ఎండాకాలం.. మరోవైపు ఎన్నికలు.. రాష్ట్రమంతా వేడిగా, వాడిగా ఉంది. ఎవరు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఎండ గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఆ విధంగానే ఓచోట పిచ్చాపాటీ మాటాడుకుంటున్నారు ఈ ముగ్గురు మహిళలు. డ్వాక్రా సభ్యులైన వీళ్లు తమకు సీఎం ఇస్తామన్న పసుపు– కుంకుమ చెక్కుల గురించి చర్చించుకుంటున్నారు. బ్యాంకోళ్లు నా డబ్బులివ్వలేదంటే ..నా డబ్బులివ్వలేదంటూ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబేమో వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఈ ఖాళీ చెక్కులు తమ మొగాన పడేశాడని, ఆ డబ్బులు కూడా బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పనిలోపనిగా బాబు ఇస్తామన్న సెల్ ఫోన్ల గురించి కూడా ముచ్చట్లాడుకున్నారు. ఆ మాట అటెళ్లి, ఇటెళ్లి చివరికి ఎన్నికల వైపు నడిచింది. ఆ సంభాషణ ఇలా సాగింది. సత్తెక్క: ఏమే.. మంగక్కా.. డ్వాక్రాలో పదేల్లుగా ఉన్నానే.. పోయినసారి ఎలచ్చన్లలో డ్వాక్రా లోన్లు కట్టొద్దని సెంద్రబాబు అన్నాడని ఇరవై వేలు అప్పు కట్టడం మానీసేను. రెండేల్ల తర్వాత సూస్తే, అసలు రెండింతలయింది. బ్యాంకోల్లు కట్టీమని గట్టిగ సెప్పినారు. దీంతో ఇరవై వేలు వడ్డీకి తెచ్చి కట్టినాను. మంగక్క: అవునే సత్తెక్క .. నాపని కూడా అలాగే అయింది. బాబు మాటలు ఇని అసలుకంటే వొడ్డీ ఎక్కువగా బ్యాంకోళ్లకు కట్టినం. ఇప్పుడు ఎలచ్చన్లు వస్తున్నాయని మళ్లీ చంద్రబాబు పసుపు– కుంకుం సెక్కులు ఇచ్చినాడు. ఆ డబ్బులు కూడా బ్యాంకోల్లే పాత బాకీలకు జమ సేసుకుంటామన్నారు. లచ్చిమక్క: ఇదేటమ్మా.. మనం లోన్లు తీసుకుంటే సెంద్రబాబు ఒక్క రూపాయి కూడా వొడ్డీ కట్టకపాయె. మొన్నటి వరకూ కూడా అదిగోఇదిగో అని వొడ్డీ ఎగ్గొట్టీసినాడు. వొడ్డీ డబ్బులు సేతిలో పెట్టకుండా అందులో నుంచి కొంత తీసి మొకాన కొడుతున్నాడు. ఆ డబ్బులు సూసి కొందరు మురిసిపోతన్నారు. అసలు ఇసయం ఏటంటే.. ఐదేళ్ల కిందట మన అప్పెంత.. దానికి వొడ్డీ ఎంత.. మళ్లీ మన లోనెంత.. వొడ్డీ ఎంత, కట్టిందెంత? ఇవన్నీ సూసుకుంటే పసుపు కుంకం మోసం తెలిసిపోద్ది. సత్తెక్క: నిజమేనే లచ్చిమక్క..ఏమో అనుకున్నా.. సెంద్రబాబు మామోలోడు కాడు. మన డబ్బులోంచి కొంత తీసి మన ముకాన కొడతన్నాడు. మనకే సాలా బాకీ పడినాడు. మొన్ననే డ్వాక్రా వోల్లకు సెల్ ఫోన్లు ఇస్తామని సెప్పినాడు. సింగపూర్ బాబు సెల్పోన్లు ఎవురికీ ఇవ్వలేదు. ఇచ్చినా టెంపర్వొరీ పోన్లు ఇస్తాడేమో .. ఆ పోన్ల నుంచి మన ఇవరాలన్నీ లాగేస్తాడేమో. మరేటి.. మనం ఎవరికి వోటేత్తామే మంగక్కా.. మంగక్క: సత్తెక్కా.. ఆ మద్దిన రాజశేకర రెడ్డి కొడుకు జగన్ బాబు వొచ్చినాడు కదా. పేదోల్లకు ఏం సేసేదీ క్లీరుగా సెప్పాడు. సాలా పనులు, సాయం సేస్తానన్నాడు. పొదుపు సేస్తున్న ఆడోల్లకు మొత్తం లోను తీర్సేస్తానన్నాడు. ఆల్ల నాయన మాదిరి ఈయన కూడా మాటకు కట్టుబడే వోడు. నాకైతే ఆతడికి ఓసారి చాన్సు ఇయ్యాలని ఉందే. లచ్చిమక్క: అవునే ఈ సారికి ఆ బాబుకే ఏద్దామే. -
ప్రాణం తీసిన సెల్ఫోన్ వివాదం
పటాన్చెరు టౌన్: సెల్ఫోన్పై గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సెల్ఫోన్ విషయమై విద్యార్థుల మధ్య ఏర్పడ్డ వివాదం బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థి తండ్రి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరికి చెందిన పితాని నాగేశ్వర్రావు కుటుంబం 20 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ కాలనీకి వచ్చారు. ఇతని కుమారుడు గౌతమ్ (18) హైదరాబాద్లోని ఎంఎల్ఆర్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్ తనకు సెల్ఫోన్ అవసరం ఉందని స్నేహితుడైన పవన్కి చెప్పాడు. ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి సెల్ఫోన్ బుక్ చేయాల్సిందిగా పవన్ తన స్నేహితుడైన వినయ్కు రూ.8 వేలను గౌతమ్ నుంచి ఇప్పించాడు. నగదు ఇచ్చి నెలరోజులైనా సెల్ఫోన్ ఇవ్వకపోవడంతో గౌతమ్ ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో నాగేశ్వర్రావు వారిని అడగడంతో వినయ్, అతని స్నేహితులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సెల్ఫోన్ కోసం డబ్బులు ఇచ్చాను కదా అని పవన్ను గౌతమ్ నిలదీశాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ రింగ్ రోడ్డు వద్దకు రమ్మని గౌతమ్కు పవన్ చెప్పాడు. గౌతమ్ అక్కడికి వెళ్లగా పవన్, అతని స్నేహితుడు కాశీమ్ అక్కడ ఉన్నారు. ఈ విషయమై మరోసారి వారిమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పవన్, కాశీమ్ ఇద్దరూ కలిసి గౌతమ్ గొంతు నులిమి చంపేసి స్థానిక సుల్తాన్పూర్ చెరువులో పడేశారు. అనంతరం తమ మిత్రులైన మిశ్ర, వినయ్కి విషయం చెప్పారు. తమ కుమారుడు కనిపించడం లేదని గౌతమ్ తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి గౌతమ్ స్నేహితులను విచారించగా అసలు నిజం బయటపడింది. గౌతమ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పవన్, కాశీమ్ను రిమాండ్కు తరలించారు. -
అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు
-
పెళ్లయ్యాక ప్రేమ ఇలా ఉండొచ్చా?
ప్రేమ నుంచి పెళ్లి దాకా వెళ్లగలగడం అదృష్టమే. పెళ్లయ్యాక అదే ప్రేమను కోరుకుంటే మాత్రం ఆ అదృష్టం.. తిరగబడినట్లనిపిస్తుంది! ఈ స్టోరీలో భార్య.. భర్తనుంచి పెళ్లికి పూర్వపు ప్రేమను కోరుకుంది. అనుక్షణం ఆ ప్రేమ కోసం ఆరాటపడింది.. అలమటించింది.. చేజారిపోతాడేమోనని భయపడింది. చివరికి ఆ దాంపత్యం ఎలా సెట్రైట్ అయింది? బీప్ బీప్... సెల్ఫోన్లో మెసేజ్ బ్లింక్ అయ్యింది. ఆఫీసులో ఉన్నాడు అతను. తీసి చూశాడు. భార్య నుంచి.‘ఏం చేస్తున్నావు?’ మళ్లీ బీప్ బీప్ శబ్దం వచ్చింది. ‘తిన్నావా?’ మళ్లీ బీప్. ‘ఇవాళ ఆఫీసుకు వెళ్లేప్పుడు నా వైపు తిరిగి చూడలేదు నువ్వు’ మళ్లీ బీప్. ‘అసలు నేనంటే నీకు ప్రేముందా?’ మళ్లీ బీప్. ‘అలా అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు’ మళ్లీ బీప్. ‘ఇదంతా నా ఖర్మ’. అతడు నిస్పృహగా ఫోన్ పక్కన పెట్టేశాడు. ఆ రోజు ఆఫీసులో చేయాల్సిన పని అంతా గంగపాలు. సాయంత్రం భయం భయంగా ఇంటికి వెళ్లాడతను. తల్లిదండ్రులు అప్పటికే వృద్ధులు. ఇద్దరికీ 70 దాటాయి. ఆఫీసు నుంచి రాగానే వాళ్లను చూడాలి. లేదా వాళ్లు తనను చూడాలి. వాళ్ల దగ్గర పది నిమిషాలు కూచుంటే ఇరుపక్షాలకూ తృప్తి. కాని అదే జరిగితే? ‘హు.. అంతేలేండి ఇంటికొచ్చిన ఏ మగాడైనా భార్య ముఖం చూద్దామనుకుంటాడు. మీరు ఉన్నారు దండగముఖం వేసుకుని. ఏకంగా అమ్మా అయ్యల దగ్గరకు వెళ్లి వాళ్ల వీపు వెనుక దాక్కోవడమే’ ఆ తిట్లు ఎందుకు అని నేరుగా గదిలోకి వెళ్లాడు. వెళ్లి భార్యను చూసి దడుచుకున్నాడు. పొద్దున ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. తిన్నట్టు లేదు. స్నానం చేసినట్టు లేదు. అసలు గది నుంచి కదిలినట్టే లేదు. గుండెలు దడదడలాడాయి. అంటే బయటకు వచ్చి తల్లిదండ్రులకు భోజనం పెట్టిందా? అసలు వంట చేసిందా? కోపం నషాళానికి అంటింది. కాని వీలైనంత అనునయంగా ‘ఏమైంది?’ అని అడిగాడు. ‘నువ్వు నాతో ప్రేమగా లేవు’ ‘ఎందుకు అలా అంటావు. నీకు కావలసినవన్నీ చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు నీతోనే ఉంటాను’... ‘మరి ఆఫీసుకు వెళ్లాక ఒక్క మెసేజన్నా పెడుతున్నావా? ఒక్క కాల్ అన్నా చేస్తున్నావా?’ ‘అంటే పని చేయవద్దా?’ ‘చేయాలో వద్దో నీ ఇష్టం. కాని నాకు నీ ప్రేమ కావాలి. ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను ప్రేమిస్తూనే ఉండాలి’‘లేకుంటే?’ ‘నేను చచ్చిపోతాను. లేదా నిన్ను చంపేస్తాను’. ‘డాక్టర్... ఇదీ నా పరిస్థితి. ఇంటికి వెళ్లలేకపోతున్నాను. నా తల్లిదండ్రులు పూర్తిగా భయపడిపోయారు. ఈ స్థాయి ప్రేమ నరకంగా ఉంది. దీనిని తట్టుకోలేక, ఇంటికి వెళ్లలేక, బయట ఉండలేక తాగుడుకు బానిస అయ్యాను. నా భార్యను మీరే ట్రీట్ చేయాలి’ అన్నాడు అతను.సైకియాట్రిస్ట్ తల పంకించి అతని వైపు చూశాడు. 37 ఏళ్లు ఉంటాయి.‘మీ పెళ్లయి ఎన్నేళ్లు?’‘ఒకటిన్నర సంవత్సరం’‘సరే... మీరు వెళ్లి ఆమెను పంపండి’ఆమె వచ్చింది. చూశాడు. చామనఛాయలో సన్నగా పలుచగా కళ్ల కింద నలుపుతో ఉంది. అప్రసన్నంగా ఉంది. 33 లేదా 34 ఏళ్లు ఉంటాయి.‘మనం కాసేపు మాట్లాడుకుందామా?’ అడిగాడు. తల ఊపింది.ఆమె పేరు రాధ. బాల్యం అనగానే ఆమెకు గుర్తుకు వచ్చేది కృష్ణుడి కోవెల. అక్కడకు తీసుకెళ్లే తండ్రి జ్ఞాపకం. ఐదేళ్ల వయసులో తండ్రి భుజం దిగేది కాదు. తండ్రి చాక్లెట్లు తెచ్చి ఇచ్చేవాడు. సైకిల్ మీద కూచోబెట్టి తిప్పేవాడు. ఎనిమిదేళ్లు వచ్చాయి. తండ్రి రావడం మానేశాడు. రోజూ గేటు దగ్గర నిలబడి చూసేది. వచ్చేవాడు కాదు. రాత్రి పూట ఉలిక్కిపడి లేచి చూసేది. ఉండేవాడు కాదు. వీపు మీద కూచోబెట్టి తిప్పిన తండ్రి... బంగారూ అని పిలిచే తండ్రి... ఎగరేసి పట్టుకునే తండ్రి... ఎలా వదిలేశాడు?తర్వాత తెలిసింది.అమ్మ ఆయనకు రెండో భార్య అట.మొదటి భార్య గోల చేసి గగ్గోలు పెట్టేసరికి రావడం మానేశాడట. వేరే ఊరు వెళ్లిపోయాడట.‘ఇలా చేస్తారా ఏ నాన్నైనా?’ చిన్న వయసులో నిస్సహాయత నుంచి కోపం వచ్చింది. నాన్న మీద కోపం మగాళ్ల మీద కోపంగా మారింది. అసలు ప్రతి విషయం మీద కోపంగా మారింది. వయసు వచ్చింది. కాని ఆ వయసు ఎవరి కోసం? ఏ మగాణ్ణి నమ్మాలని. వద్దు.. ఏ మగాణ్ణీ నమ్మొద్దు. వయసు పెరుగుతూ పోయింది. తల్లికి ఇది బెంగ. బాగా చదివించుకుని జాగ్రత్తగా పెంచుకుందని అనుకుంది కాని కూతురి మనసులో ఇలాంటి విపరీతం ఉందని తెలుసుకోలేదు.అలాంటి టైములో వేణు కనిపించాడు. ఇద్దరివీ వేరు వేరు ఆఫీసులే అయినా ఒకే బస్లో ప్రయాణించేవారు. రెండు మూడు నెలల పరిచయం తర్వాత ఒకసారి మాటల్లో ‘బంగారూ’ అని పిలిచాడు. అంతే. ఎక్కడో శిథిలాలలో ఉన్న తండ్రి జ్ఞాపకం సజీవంగా మేల్కొంది. ఇతను తన తండ్రి లాంటివాడే. అప్పటి తండ్రిలా అంతే ప్రేమ పంచేవాడా? అవును అనుకుంది. వేణులోని మంచితనాన్ని ప్రేమించింది. స్నేహితుణ్ణి ప్రేమించింది. తండ్రి స్పర్శను ప్రేమించింది. ఇంట్లో ముగ్గురు అక్కయ్యల పెళ్లి అయ్యేంత వరకు ఆగి వయసు మీదకు తెచ్చుకుని ఉన్న అతణ్ణి మరో ఆలోచన లేకుండా పెళ్లాడింది. అతడి కోసం పూర్తి ఇల్లాలిగా ఉండాలని ముందే ఉద్యోగం మానేసింది.పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు. కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్ మొదలయ్యింది.అది ఎలాంటి ప్రాబ్లమ్ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో. లేదా తన మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో? దొరక్క దొరక్క దొరికాడు ఇష్టపడే మగవాడు. వాణ్ణి వదలకూడదు. అందుకే బంధించడం పెంచింది.ఎంత పెంచిందంటే అతడికి ఊపిరి సలపక చచ్చిపోయేంత.ఇద్దరినీ పిలిచి కూచోబెట్టాడు సైకియాట్రిస్ట్.ఆమె వైపు చూస్తూ అన్నాడు.‘ఏమ్మా... చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇన్లాండ్ కవర్ అంటించావా?’తల ఊపింది.‘ఇన్లాండ్ కవర్కు ఆల్రెడీ కొద్దిగా జిగురు పూత ఉంటుంది. మనం నాలుకతో కొంచెం తడి చేసి అంటిస్తే అంటుకుంటుంది. ఉత్తరం అందుకున్నవారు కొంచెం నైపుణ్యంతో విప్పితేచిరగకుండా విప్పుకుంటుంది. అవునా?’మళ్లీ తల ఊపింది.‘అలా కాదని కవర్ బాగా అంటుకోవాలని బంక రాసి చాలనట్టు జిగురు రాసి అదీ చాలనట్టు ఫెవికాల్ కూడా రాసి అంటిస్తే ఏమవుతుంది?’మౌనంగా చూసింది.‘కవర్ పాడవుతుంది. చిరుగుతుంది. పనికిరాకుండా పోతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. ప్రాక్టికల్ రిలేషన్ అంటారు. పెళ్లి ఒక ప్రాక్టికల్ రిలేషన్. మీ ఇద్దరి స్వేచ్ఛను మీరు గౌరవిస్తూ మీ అనుబంధాన్ని పెంచుకుంటూ సంసారం నడవడానికి అవసరమైన నియమాల్ని పాటిస్తూ ముందుకు సాగాలి. కాని నువ్వు అతని నుంచి అతి ప్రేమను ఆశించి జీవితం నాశనం చేసుకుంటున్నావు. నువ్వే కాదు.. ఈ పని కొందరు మగాళ్లు కూడా చేస్తారు. భార్య మీద ఓవర్ పొజెసివ్నెస్తో ఆమె జీవితం నరకం చేస్తారు. పరస్పరం నమ్మకం, గాఢమైన ప్రేమ ఉంటే సంవత్సరం దూరంగా ఉన్నా ఏమీ కాదు. ఆ నమ్మకం ఏర్పడకపోతే వీధి చివరకు వెళ్లి వచ్చేలోపల అనుమానం వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు. కోరుకుంటున్నాడు. ఇక మారాల్సింది నువ్వే’ఆమె పలుచటి కన్నీటి తెర వచ్చింది.‘చూడమ్మా... దొరక్క దొరక్క దొరికింది చేజారిపోవాలన్న నియమం లేదు. ఆలస్యంగా పూచిన పువ్వుకు కూడా అంతే పరిమళం ఉంటుంది. సందేహాలు పెట్టుకోకు.భర్త కోసం జీవించడం మంచిదేకానీ అదే నీ జీవితం కాదు. నువ్వు కూడా ఉద్యోగం చేయి. నీ స్పేస్ నువ్వు తీసుకో. అలాగే భర్తను అతను కోరుకునే విధంగా అతని తల్లిదండ్రులను నీవారిగా భావిస్తే నీ అభద్రతపోతుంది. జీవితం సంతోషంగా ఉంటుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్.అతని టేబుల్ మీద ఉన్న ఫ్లవర్వాజ్లో తాజా గులాబీలు ఉన్నాయి.వాటి తేలికపాటి సువాసన వారి జీవితంలో కూడా వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం ఆమెలో కనిపించింది. పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు. కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్ మొదలయ్యింది. అది ఎలాంటి ప్రాబ్లమ్ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో. – ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
పెట్రోల్ టు సెల్ఫోన్!
హిమాయత్నగర్: వాహనాల్లో పెట్రోల్ కొట్టేయడంతో చోరీలకు శ్రీకారం చుట్టిన ఓ యువకుడు సెల్ఫోన్లు చోరీ చేసేస్థాయికి ఎదిగాడు. ఇప్పటికే 10 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకోకుండా మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో సెల్ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఈ ముఠాను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్ సదన్కు చెందిన పోతుల అరవింద్ చిన్నతనం నుంచే దోపిడీ, దొంగతనాలను పాల్పడుతున్నాడు. సరోజనీకాలనీకి చెందిన గంజి వికాస్, కంచన్బాగ్లోని దామోదర్ సంజివయ్య నగర్కు చెందిన జవడి కార్తీక్లతో కలసి ముఠాగా ఏర్పడిన అతను పలు ప్రాంతాల్లో సెల్ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు. ఈ నెల 17న హిమాయత్నగర్ ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకుంటుండగా వెనక నుంచి వికాస్, కార్తీక్ అతడి సెల్ఫోన్ లాక్కుని బైక్పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 24న లిబర్టీ వద్ద ఓ యువకుడు ఫోన్లో మాట్లాడుతుండగా అరవింద్, కార్తీక్లు వెనక నుంచి వచ్చి అతడి ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా వికాస్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన ఆధారాలతో అరవింద్, కార్తీక్లను అరెస్ట్ చేసినట్లు క్రైం ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. గ్యాంగ్ పెద్దదే నాలుగేళల్లో అరవింద్కు పరిచయమైన ప్రతి వ్యక్తిని మచ్చిక చేసుకుని వారికి కొంత డబ్బులు ఇచ్చి చోరీలకు వినియోగించుకున్నట్లు విచారణలో వెల్లడైయ్యింది. స్కూల్ పిల్లలు మొదలు, కాలేజీ విద్యార్థుల వరకు పలువురిని తన దొంగతనాల్లో భాగస్వాములను చేసుకున్నట్లు గుర్తించారు. బంధిపోటు దొంగతనం, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన అరవింద్ పెద్ద నేరాలు చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పది కేసులు, రెండు సార్లు జైలుకు పోతుల అరవింద్పై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పది కేసులు ఉన్నాయి. 16ఏళ్ల వయసులో పెట్రోల్ దొంగతనాలతో చోరీలు ప్రారంభించిన అతను అనంతరం మూడు దోపిడీ కేసుల్లో అరెస్టయ్యాడు. సరూర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మరో రెండు దోపిడీ కేసులు, ఒక సెల్ఫోన్ స్నాచింగ్ కేసుల్లో పోలీసులకు చిక్కాడు. చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో ఒక రాబరీతో, బందిపోటు దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. హయత్నగర్ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో బంగారం, డబ్బు దొంగలించాడు. పది కేసులకు సంబంధించి రెండు పర్యాయాలు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. తాజాగా నారాయణగూడ, సుల్తాన్బజార్ పీఎస్ పరిధిలో సెల్ఫోన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. -
0.0 ఈ ప్రపంచం మనుషుల కోసమే కాదు...
ప్రదేశం: అమీర్పేట్, హైదరాబాద్దృశ్యం: ఒకాయన ఇరానీ చాయ్ తాగుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు...\ ‘‘హలో లింగమూర్తి, ఎలా ఉన్నావు? బాగానే ఉండి ఉంటావులే. అది సరేగానీ ఏమిటీ విశేషాలు? నా బొంద, విశేషాలేముంటాయి... రోజూ తినడం తొంగోవ్వడమే కదా నీ పని, అది సరే, హెల్త్ ఎలా ఉంది, నా బొంద, అది ఎక్కడ బాగుంటుంది, నీకు మందు సిగరెట్లు లేనిది గడవదాయే! పిల్లాడు బాగా చదువుతున్నాడా, నా బొంద, వాడెక్కడ చదువుతాడు...అన్నీ నీ పోలికలే వాడికి, పొట్ట చీల్చిన అక్షరం ముక్క కనిపించదు. అరే మరిచిపోయాను. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. నా బొంద, మీదో తొక్కలో ఫ్రెండ్షిప్, ఎవడైనా ఆపదలో ఉంటే ఒక్కడూ కనిపించడు. మీ మామగారు ఎలా ఉన్నారు? దిట్టంగా ఉండి ఉంటాడులే. పనా పాటా! పొద్దున్నంత పేకాడడం, రాత్రయితే మందుకొట్టడమే కదా ఆయన పని...’’ కొద్దిసేపటి తరువాత... ‘ఠాప్’ అని పెద్దగా సౌండ్ వినిపించింది. సెల్ఫోన్ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: ఏలూరు రోడ్, విజయవాడ దృశ్యం: ఒక సెలూన్లో గెడ్డం చేయించుకుంటున్న నాగభూషణం సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు... ‘‘మనకు కొన్ని అలవాట్లుంటాయి నాగేçశ్వర్రావు. అవి మంచివనుకో, చెడ్డ వనుకో. కానీ అలవాటు అలవాటే కదా. సెలూన్లో గెడ్డం గీసుకుంటున్నప్పుడు సైలెంట్గా కూర్చోవాలి. నీకు తెలుసుకదా నాగేశ్వర్రావు... నేను సైలెంట్గా కూర్చోలేను. గెడ్డం చేయించుకుంటున్నప్పుడు కూడా సెల్ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాను. నీకు తెలుసు కదా నాగేశ్వర్రావు... మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాను. బాడీని రకరకాలుగా కదిలిస్తుంటాను. అలా కదిలించినప్పుడల్లా ముఖం మీద కత్తిగాట్లు పడుతుంటాయి. సెలూన్ నుంచి నేను వెళ్లేది హాస్పిటల్కే. అయినా నేను ఈ పాడు అలవాటును మానుకోలేకపోతున్నాను నాగేశ్వర్రావు. చంద్రబింబంలాంటి ముఖం నీది అనే వాళ్లు గర్ల్ఫ్రెండ్స్. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా నాగేస్వర్రావు... చంద్రబింబం మాటేమిటోగానీ ఇప్పుడు నా ముఖం మీద కత్తి గాటు లేని ఏరియా లేదంటే నమ్ము...’’ కొద్ది సేపటి తరువాత... ‘ఠాప్’ అని సౌండ్ వినిపించింది. సెల్ఫోన్ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: నేషనల్ హైవే 18 (కర్నూల్–చిత్తూరు) దృశ్యం: ‘‘హలో ప్రసాదు. నేను డ్రైవింగ్లో ఉన్నాను. ఏమిటి విశేషాలు? ఆ... ఎప్పుడు? ఎలా? ఛాఛాఛా... డ్రైవ్ చేస్తూ సెల్ఫోన్లో మాట్లాడుతుంటే యాక్సిడెంట్ కాకుండా గాడిద గుడ్డవుతుందా! చేతులు కాలాక ఆయింట్మెంట్ రాసుకొని ఏంలాభం! అవును... అవును... నేనే డ్రైవింగ్ చేస్తున్నాను. హ్హా హ్హా హ్హా.... నాకేమవుతుంది. డ్రైవింగ్లో నేను చాలా స్ట్రాంగ్. సెల్ఫోన్ సెల్ఫోనే... డ్రైవింగ్ డ్రైవింగే! నాకేమీ కాదు ప్రసాదూ... నేను అనేది వేరే వాళ్ల గురించి. ఇంకేంటి విశేషాలు...’’ఠా....ప్ సెల్ఫోన్ మాయం! స్థలం: హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్.దృశ్యం: డాక్టర్ మాణిక్చంద్బాషా గుండె ఆపరేషన్ చేస్తూ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు...‘‘ఏరా పండు ఎలా ఉన్నావ్! ఇన్ని రోజుల తరువాత గుర్తొచ్చానా? అయినా మేమెందుకు గుర్తుంటాం లెండీ మీకు! ఒకప్పటి పండు కాదు కదా మీరు... ఆ గుండురావుగాడి చెల్లిని చేసుకున్న తరువాత మీలెవలే మారిపోయింది.మాలాంటి వాళ్లు మీ విలువైన కంటికి ఎలా కనబడతారు.సెలవా!!నాకు సెలవనేదే లేదు.పనే నాకు విశ్రాంతి. అంతెందుకు ఇప్పుడు కూడా నేను ఒకరికి గుండె ఆపరేషన్ చేస్తున్నాను. పనిలో పడి స్నేహాన్ని మరిచిపోయే క్యారెక్టర్ కాదు నాది. అందుకే గుండె ఆపరేషన్ చేస్తూ కూడా నీలాంటిమిత్రులతో సెల్ఫోన్లో మాట్లాడుతుంటాను.ఇలా చేయడం వల్ల పని తాలూకు అలసట మన మీద ఉండదు.అదెలా? అంటావా.సెల్ఫోన్లో మాట్లాడుతూ స్పీడ్గా డ్రైవింగ్ చేయగా లేనిది, సెల్ఫోన్లో మాట్లాడుతూ స్లోగా గుండె ఆపరేషన్ చేయలేమా! అలా ఎన్ని ఆపరేషన్లు చేశానో....’’కొద్దిసేపటి తరువాత...డాక్టర్ మాణిక్చంద్బాషా సెల్ఫోన్ ఎవరో లాగేసినట్టు మాయమైపోయింది.‘ఇచట’, ‘అచట’ అనే తేడా లేకుండా సెల్ఫోన్లు మాయమవుతున్నాయి. ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.పోలీసులు రంగంలోకి దిగారు. వారితో పాటు సైంటిస్టులు కూడా దిగారు. రాజ్యాంగ సంక్షోభంలాగా సెల్ఫోన్ సంక్షోభం తలెత్తింది. కొనే వాళ్లు లేక సెల్ఫోన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. టవర్లు బేల ముఖం వేశాయి. సెల్ఫోన్ సంక్షోభంపై ఒక కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ వాళ్లు రకరకాల కోణాల్లో సమస్యను విశ్లేషించారు. ఎన్నో పుస్తకాలు తిరగేశారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. సెల్ఫోన్ రహిత సమాజం ఏర్పడింది. ‘‘చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను విక్రమార్కా. సెల్ఫోన్ సంక్షోభం ఎందుకు తలెత్తింది?’’ విక్రమార్కుడి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు బేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు:‘‘బేతాళామనిషి తన సౌకర్యం, సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఈ భూగ్రహం తనది మాత్రమే అనుకుంటున్నాడు. సెల్ఫోన్ టవర్ల వల్ల పక్షుల జనాభా తగ్గిపోతుంది. ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పక్షుల పాలిట యమపాశంగా తయారైంది. అందుకే మిగిలిన జీవరాసులతో కలిసి పక్షులు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఎంతో శ్రమించి ‘ఎలిమినేట్–0.0’ అనే సరికొత్త పరికరాన్ని తయారుచేశాయి. ఇది పనిచేస్తున్నంత కాలం ఎక్కడి సెల్ఫోన్లు అక్కడ మాయమైపోతూనే ఉంటాయి.’’ – యాకుబ్ పాషా -
మొబైల్ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య
కర్ణాటక, మైసూరు : సెల్ఫోన్ పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని గాంధీనగర్కు చెందిన నిఖిత (16) గాయత్రిపురంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం సోదరుడు బబ్లూతో ఫోన్లో మాట్లాడిన అనంతరం నిఖిత సెల్ఫోన్ కనిపించలేదు. నాన్న ఎంతో ప్రేమగా ఇచ్చిన ఫోన్ కనిపించకపోవడంతో నిఖిత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్ఆర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కాలేజీ నుంచి సస్పెండ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి : కళాశాల నుంచి సస్పెండ్ చేశారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. ధీరజ్ అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్ స్వస్థలం కర్నాటకలోని రాయచూరు. ఈ నెల 26వ తేదీన ధీరజ్ కళాశాలలో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన యాజమాన్యం అతని మందలించి, కళాశాల నుంచి సస్సెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధీరజ్ ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27వ తేదీన ఇంటిలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అతని చావుకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ మిత్రుడి మరణవార్త విన్న తోటి విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘మీ అబ్బాయికి సెల్ఫోన్ ఇచ్చారా..?’
-
‘మీ అబ్బాయి ఫోన్ వాడుతున్నాడా...?’
గురుగ్రామ్, హర్యానా : స్వలింగ సంపర్కం గురించి ఈ మధ్యకాలంలో మనదేశంలో బహిరంగంగా చర్చిస్తున్నారు. భారతీయ న్యాయస్మృతిలోని ‘సెక్షన్ 377’తో పాటు మరికొన్ని సెక్షన్లు స్వలింగ సంపర్కం నేరమని చెబుతున్నాయి. దీంతో సంబంధిత సెక్షన్లలో మార్పులు చేయాలని ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు జరగుతున్నాయి. ‘హోమోసెక్సువల్’/‘గే’/‘లెస్బియన్’గా మారడానికి కారణం హర్మోన్ల ప్రభావమని డాక్టర్లు చెప్తున్న తరుణంలో ఒక ప్రముఖ వార్త పత్రికలో వచ్చిన ప్రకటన ఇప్పుడు అందర్నీఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ప్రకటనలో ‘పెళ్లికి ముందే మీ కుమారుడు లేదా కూతురు ‘గే’ లేదా ‘లెస్బియనా’ అనే విషయం తెలుసుకొండి’ అంటూ ఫోన్ నంబరు కూడా ఇచ్చాడు గుర్గావ్కు చెందిన ఓ నకిలీ వైద్యుడు. ఈ ప్రకటనను కాస్తా ఎవరో ఫేస్బుక్లో పోస్టు చేశారు. దాంతో ఈ డాక్టరు గారి కథేంటో తెలుసుకుందామని ఓ యువతి ప్రకటనలో ఇచ్చిన నంబర్కు ఫోన్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపు ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఆడియోలో సదరు యువతి తనకు 40 ఏళ్లని, తన కుమారుడికి 17 ఏళ్లని పరిచయం చేసుకుంది. అవతలి వ్యక్తి తనను తాను ‘వైద్యుడి’గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సదరు ‘డాక్టరు’ ఆ మహిళను ఎక్కువ ప్రశ్నలేమి వేయకుండానే ఆమె కొడుకును ‘గే’ అని తెల్చేశాడు. ‘గే అంటే అర్ధం తెలుసు కదా...!’అని సదరు మహిళను ప్రశ్నించాడు. అంతేకాక ‘నీ కుమారుడికి బాగా కోపం వస్తుందా’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘లేదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు’ అని సమాధానమిచ్చింది. అందుకు ఆ వైద్యుడు ‘అతడు లోపల బాధపడుతున్నాడు. మీ అబ్బాయి గే అనే విషయం అతనికే తెలియదు. అందుకే ఆ విషయం గురించి మీతో చెప్పడం లేదు అన్నాడు.’ అంతేగాక ‘అమెరికాలో దాదాపు 40 శాతం పురుషులు ‘గే’లే’ అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. ఒక వ్యక్తి ‘గే’గా మారాడానికి ఈ వైద్యుడు చెప్పిన కారణం వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఫోన్ సంభాషణలో భాగంగా సదరు వైద్యుడు ‘మీ అబ్బాయికి సెల్ఫోన్ ఇచ్చారా..?’ అని అడగ్గా దానికి ఆ మహిళ ‘అవున’ అన్నారు. ఇంకేముంది ఆ వైద్యుడు ‘నీ కొడుకు ‘గే’గా మారడానికి కారణం సెల్ఫోనే’ అని తెల్చేశాడు. అందుకు ఆ మహిళ ముందు ఆశ్చర్యపోయినా తరువాత అమాయకంగా ‘ఫోన్ వాడకుండా ఉంటే నా కొడుకు మాములుగా మారతాడా...?’ అని ప్రశ్నించింది. అందుకు ఆ డాక్టర్ మీరు హౌస్వైఫ్ అయ్యుంటారన్నాడు. తర్వాత ఫోన్ నుంచి విడుదలయ్యే ‘అతినీలలోహిత’ కిరణాల వల్ల పురుషులు ‘గే’ గా మారతారని చెప్పాడు. అందుకు ఆ మహిళ ‘నేనూ ఫోన్లో మాట్లాడుతున్నాను కదా...నేను ‘గే’గా మారతానా అని ప్రశ్నించగా అందుకు ఆ డాక్టర్ అలా ఏం ఉండదు ఎందుకంటే స్త్రీలలో ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. అంతేకాకుండా ఒక వేళ పురుషుల్లో కూడా ఈ ‘టెస్టోస్టిరాన్ లెవల్స్’ ఎక్కువగా ఉన్నట్లయితే వారు ‘గే’గా మారే అవకాశం చాలా తక్కువని వారికి పుట్టే పిల్లలు కూడా ‘గే’గా మారే అవకాశం తక్కువని తెల్చేశాడు. అంతేకాక తాను వైద్యం చేసి సదరు మహిళ కొడుకుకు నయం చేస్తానని అందుకు అతని ఫోటో కావాలని అడిగాడు. ‘గే’ నుంచి మాములు మనిషిగా మార్చడానికి కొన్ని ‘శక్తుల కషాయాల’ను ఆ మహిళ కొడుకు శరీరంలోకి పంపించాలని అందుకు ఖర్చవుతుందని తెలిపాడు.ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మొబైల్ ఫోన్ దొంగిలించాడని..
-
డబ్బుల కోసమే హత్య
తూప్రాన్ : శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గత నెల 28న ఓ గుర్తుతెలియని మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. సెల్పోన్ ఆధారంగా మహిళను హత్య చేసిన వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్ డీఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామానికి చెందిన చంద్రకళ(45) గత నెల 28న శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్యకు గురవగా మృతదేహం లభించిన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గురైన మహిళ వద్ద పడి ఉన్న సెల్ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు. హత్యకు గురైన చంద్రకళ ఆటోడ్రైవర్లు, తెలిసిన వ్యక్తుల వద్ద విచ్చలవిడిగా తిరిగే మహిళ అని అన్నారు. ఇదే క్రమంలో గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవితో పరిచయం ఉన్న చంద్రకళకు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన రూప్సింగ్(70) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెను మచ్చిక చేసుకొని గతంలో పలుమార్లు చంద్రకళతో సహవాసం చేసినట్లు తెలిపారు. గత నెల 27న చంద్రకళకు ఫోన్ చేసి నర్సాపూర్కు రప్పించారు. అక్కడి నుంచి రవి ఆటోలో చిన్నగొట్టిముక్ల సమీపంలోని అటవీ ప్రాంతంలోకి చంద్రకళను తీసుకువచ్చారు. అనంతరం రవి ఆటోలో వెళ్లిపోగా నిందితుడు రూప్సింగ్ చంద్రకళను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తనవెంట తెచ్చుకున్న కర్రతో తలపై బాది చంద్రకళను హత్య చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. హత్య చేసి మృతురాలి వద్ద డబ్బులు, నగల కోసం వెతికగా ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి రూప్సింగ్ వెళ్లిపోయినట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె సెల్ఫోన్ ఆధారంగా హంతకుడు రూప్సింగ్ను గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు పాత నేరస్తుడే చంద్రకళను హత్య చేసిన నిందితుడు పాత నేరస్తుడని డీఎస్పీ చెప్పారు. 1998 సంవత్సరంలో వర్గల్ మండలం నాచారంలో ఓ మహిళ హత్య కేసులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. అలాగే తన సొంత అత్తను 2010లో హత్య చేసిన కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ లింగేశ్వర్రావు, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్రావు, స్థానిక ఎస్సై శేఖర్రెడ్డి, శివ్వంపేట ఎస్సై లక్ష్మికాంతారెడ్డి, సిబ్బంది మంగ్యానాయక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
కార్లలో వైర్లెస్ సెల్ఫోన్ ఛార్జింగ్
కార్లు, బస్సుల్లో వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు భారతీయ కంపెనీ ఒక వినూత్నమైన ఆవిష్కరణ చేసింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పవర్స్క్వేర్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పరికరంలో ఫోన్ను ఉంచితే చాలు, వైర్లెస్ పద్ధతిలో దాని బ్యాటరీ ఛార్జ్ అవుతూంటుంది. కనెక్టర్లు, అడాప్టర్ల కోసం వెతుక్కోవాల్సిన పని లేదన్నమాట. వైర్లెస్ ఛార్జింగ్కు అనుకూలించే ఏ బ్రాండ్ ఫోన్నైనా దీంట్లో వినియోగించవచ్చు. డాష్ బోర్డుతోపాటు సెంట్రల్ కన్సోల్; ఆర్మ్రెస్ట్లలో ఎక్కడైనా బిగించుకునేందుకు ఇది అనువైందని అంటున్నారు కంపెనీ సీఈవో పూడిపెద్ది పవన్. ఛార్జింగ్ కోసం ఉంచిన స్మార్ట్ఫోన్కు ఏ స్థాయి విద్యుత్తు అవసరమన్నది కూడా ఈ పరికరమే గుర్తిస్తుందని చెప్పారు. సామ్సంగ్, ఆపిల్ ఐఫోన్లలోని కొన్ని మోడళ్లలో ఉండే ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ను కూడా పసిగట్టి తనంతట తానే 7.5 లేదంటే పదివాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుందని, భవిష్యత్తులో ఈ టెక్నాలజీని విద్యుత్తు వాహనాలతో పాటు మిక్సీ, గ్రైండర్, టోస్టర్ వంటి వంటింటి పరికరాలకూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాట్రగడ్డ ఆనంద్ తెలిపారు. -
ఫోన్ బ్యాటరీ పేలుడు: ఐదుగురికి గాయాలు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో గురువారం సెల్ఫోన్ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వేలూరు కోర్టుకు మురుగన్
వేలూరు: వేలూరు సెంట్రల్ జైలులో సెల్ఫోన్ ఉపయోగించాడని నమోదైన కేసులో మురుగన్ అనే నిందితుడిని మంగళవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది మార్చి 26వ తేదీన జైలు అధికారుల తనిఖీ సమయంలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గదిలో సెల్ఫోన్ ఉన్నట్లు గుర్తించిన విషయం విదితమే. వేలూరు జేఎం -1 కోర్టులో దీనికి సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నది. ఈనెల 2వ తేదీన నిందితుడిని నేరుగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అరక్కోణం డీఎస్పీ కుందలింగం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి అలిసియా ముందు హాజరుపరిచారు. జైలు వార్డర్లు నందకుమార్, పెరుమాల్, బాగాయం ఎస్ఐ ప్రభాకరన్లను న్యాయమూర్తి విచారించారు. అనంతరం కేసు విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేయగా పోలీసులు బందోబస్తు నడుమ మురుగన్ను జైలుకు తీసుకెళ్ళారు. కాగా, ఈ కేసులో జైలులోని ఏడుగురు సాక్షులను విచారణ జరపాలని కోరుతూ మురుగన్ తరపు న్యాయవాది అరుణ్కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
తరగతి గదిలో సెల్ఫోన్తో ఆటలేంటి?
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డి పల్లిలో ఉన్న గాండ్లపల్లి మున్సిపల్ హైస్కూల్ను డీఈఓ పాండురంగస్వామి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘ఉపాధ్యాయులే.. పాఠం చెప్పరు’ వార్తపై ఆయన స్పందించి, పాఠశాలను తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ ఖాదర్బాషా తరగతి గదిలో సెల్ఫోన్తో ఆటలు ఆడుతుండడం గుర్తించి, తరగతి గదిలో సెల్ఫోన్తో ఆటలు అవసరమా.. అంటూ మండిపడ్డారు. అతనిపై చర్యలకు నివేదికలు సిద్ధం చేయమని చిత్తూరు మండలం ఎంఈఓ సెల్వరాజ్ను ఆదేశించారు. అలాగే పక్కరూంలో సమ్మేటీవ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్న మరో టీచర్ను మందలించారు. సమ్మేటివ్ పరీక్షలను పర్యవేక్షించకుండా ఆఫీసు రూంలో ఉన్న టీచర్ పరంజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను పర్యవేక్షించడం ఇలాగేనా అంటూ డీఈఓ హెచ్ఎంను ప్రశ్నించారు. పాఠశాలలో అన్ని తరగతి గదుల్లో జరుగుతున్న సమ్మేటివ్ –1 పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న 8, 9 తరగతులను ఆబ్జెక్టివ్ పరీక్షా విధానంపై అడిగి తెలుసుకున్నారు. -
ఆ బావా బామ్మర్దులు.. మహా ముదుర్లు!
♦ బయటి ప్రాంతాల్లో ఉంటూ మట్కా రాస్తున్న డాన్లు ♦ కంటికి కనిపించరు..సెల్ఫోన్ల ద్వారానే నిర్వహణ ♦ మట్కా రాయాలని బంధువులకు బెదిరింపులు ప్రొద్దుటూరు క్రైం : వారికి కేసులు కొత్త కాదు.. ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు.. అప్పటి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తీసుకున్న చర్యలతో కొ న్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు కా కుండా నడుస్తున్న వారి మట్కా సామ్రాజ్యం కోటలు ఒక్కసారి గా బద్ధలయ్యాయి. ఆ రోజు నుంచి కొన్ని నెలల పాటు తా త్కాలిక విరామం ప్రకటించిన మట్కా డాన్లు ఇటీవల తిరిగి కార్యకలాపాలు ప్రారంభించారు. అయితే ఈ సారి నేరుగా రంగంలోకి దిగకుండా తమ అనుయాయుల ద్వారా దందా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వారికి నమ్మకమైన వ్యక్తులను నియమించుకొని మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారు. రూ. వెయ్యి కంటే ఎక్కువ మొత్తాన్ని డాన్లే సెల్ఫోన్ల ద్వారా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పసిడిపురి ప్రొద్దుటూరులో మట్కా జూదం కనుమరుగైందని ఇటీవల పోలీసులు ప్రకటించారు. ఇదే విషయాన్ని వారు జిల్లా పోలీసు అధికారులకు కూడా తెలిపారు. సాదా సీదా నిర్వాహకులు మట్కా రాయడం మానుకున్నారేమో గానీ రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా పేరొందిన డాన్లు మాత్రం దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీరంతా చీటీలు రాయకుండా, సెల్ఫోన్ల ద్వారా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్లను కూడా తయారు చేసుకున్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి మట్కా నిర్వహిస్తున్నా.. ప్రొద్దుటూరుకు చెందిన బావా బామ్మర్దులు ఏళ్ల తరబడి మట్కా కంపెనీ నిర్వహిస్తుండేవారు. ఇలాంటి సమయంలో కడప నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసులు వారి మట్కా బండారాన్ని బయటపెట్టారు. కొన్ని నెలల క్రితం పట్టణంలో ఉంటున్న ప్రధాన నిర్వాహకుడి బామ్మర్ది ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దొరికింది. అదే రోజు మరో ప్రాంతంలో ప్రధాన నిర్వాహకుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5–6 ఏళ్ల నుంచి మట్కా నిర్వహిస్తున్నా గతంలో ఎప్పుడూ వారిని పోలీసులు పట్టుకోలేదు. అప్పటి ఎస్పీ చొరవతో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకొని రిమాండుకు పంపించారు. 5–6 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న బావా బామ్మర్దులు ఇటీవల మళ్లీ బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న బీటర్లతో మట్కా రాయిస్తే తమ పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉన్నందున ఇటీవల కొత్త బీటర్లను తయారు చేసుకున్నట్లు సమాచారం. రామేశ్వరం, మోడంపల్లె, పెన్నానగర్, నెహ్రూనగర్లలో 9 మంది బీటర్లను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన నిర్వాహకుడు అతని బంధువులను మట్కా రాయాలని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. అతనికి ప్రొద్దుటూరులోని బాలాజీనగర్, రామేశ్వరం, విజయనగరం వీధి, హైదరాబాద్, బెంగళూరులో సొంత ఇళ్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి రోజూ సుమారు రూ.10 లక్షల మేర మట్కా డబ్బు అతనికి చేరుతున్నట్లు తెలిసింది. అతను గోవా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ వ్యాప్తంగా మట్కా జూదం నిర్వహిస్తున్నాడు. వైఎంఆర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి పట్టణంలో మట్కా బీటర్లను తయారు చేసి, బావా బామ్మర్దులకు సహకరిస్తుంటాడు. ఇందుకు గాను వారు ఇతనికి పెద్ద మొత్తంలో నజరానా కూడా ఇస్తుంటారు. ఇక్కడ ఈ బావా బామ్మర్దులు పట్టణానికి చెందిన మరో బావా బామ్మర్దుల జోడి ఇటీవల మట్కాను ముమ్మరం చేశారు. గతంలో ప్రొద్దుటూరులోని పోలీసులు వీరి కంపెనీపై అడపా దడపా దాడులు నిర్వహించి ఒకరిద్దరు బీటర్లను అరెస్ట్ చేసేవారు. ప్రధాన కంపెనీ నిర్వాహకుల జోలికి మాత్రం పోలీసులు వెళ్లేవారు కాదు. అయితే ఏడాది క్రితం మెరుపు దాడులు నిర్వహించి కంపెనీ యజమానులైన బావా బామ్మర్దులతో పాటు పెద్ద ఎత్తున బీటర్లను, సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో నగదు కూడా రూ.లక్షల్లో స్వాధీనం చేసుకున్నారు. వీరికి కోలుకోలేని దెబ్బ తగలడమే గాక మరోవైపు పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో అప్పటి నుంచి మట్కా కంపెనీ మూసి వేశారు. ఇప్పుడున్న ఎస్పీ అట్టాడ బాబూజీ కూడా మట్కా నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారు. జూదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ‘పరివర్తన’ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయినా ఇటీవల బావా బామ్మర్దులు మట్కా రాస్తున్నట్లు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. సెల్ఫోన్ల ద్వారా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం బావా బామ్మర్దులు విడిగా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
సంసారంలో సెల్ఫోన్ చిచ్చు
- భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య -తల్లి లేని వారైన నలుగురు పిల్లలు వీపనగండ్ల: భార్య సెల్ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించిన భర్త ఎవరితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగడం.. గతంలో కూడా ఇదే మాదిరిగా వేధించడాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆ మహిళ కాలి బూడిదై పోగా.. వారి నలుగురు పిల్లలు తల్లి లేని వారుగా మిగిలారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన వంక ఈదన్న వివాహం ఇదే గ్రామానికి చెందిన రామేశ్వరమ్మతో 11 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరు పూరిగుడిసెలో నివాసముంటూ కూలి పనిచేసుకుని జీవిస్తున్నారు. మంగళవారం ఆ గ్రామంలో బోనాల పండుగ, బుధవారం కర్రీ పండుగ జరుపుకొన్నారు. నిన్న ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి రామేశ్వరమ్మకు ఫోన్ రావడంతో ఆమె మాట్లాడుతుండగా అదే సమయంలో భర్త ఈదన్న ఇంటికి వచ్చాడు. ఆమె నుంచి ఫోన్ లాక్కుని అవతలి వ్యక్తి మాటలు విన్న ఈదన్న ఆయనతో అక్రమ సంబంధం నెపంతో అనుమానించాడు. గతంలో కూడా ఒకటి, రెండుసార్లు ఆమె సెల్ఫోన్లో మాట్లాడుతుండడం గమనించిన ఈదన్న.. తన భార్య రామేశ్వరమ్మపై అనుమానం వ్యక్తంచేస్తూ వేధించాడు. నిన్న కూడా ఇదే పునరావృతం కావడంతో మనస్తాపానికి గురైన ఆమె.. ఈదన్న బయటకు వెళ్లగానే పిల్లలకు రూ. 20 ఇచ్చి ఏమైనా కొనుక్కోవాలని వారిని పంపించింది. ఆ తర్వాత వారు నివసించే గుడిసెపైనే కాకుండా తన ఒంటిపై కూడా కిరోసిన్ చల్లుకుని గుడిసెకు గడియ వేసి నిప్పంటించుకుంది. గుడిసె తగలబడుతుం డడంతో భర్త వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. స్థానికులు కూడా వచ్చి నీళ్లు చల్లినా గుడిసెతోపాటు రామేశ్వరమ్మ కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయి బూడిదే మిగిలింది. ఈ విషయమై రామేశ్వరమ్మ తల్లి ఫిర్యాదు మేరకు వీపనగండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. -
సెల్ఫొన్లో చెబితే.. ఆపరేషన్ చేశారు
జగిత్యాల క్రైం/జగిత్యాల: జగిత్యాల జిల్లా ఆస్పత్రి ఓ వైద్యురాలు డ్యూటీకి రాకుండా ఫోన్లో సూచనలిస్తూ నర్సులతో ఆపరేషన్ చేయించింది. దీంతో పుట్టిన బిడ్డ మృత్యువాత పడగా.. విషయం బయటకు పొక్కకుండా వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన గర్భిణి షేక్ ఇర్ఫాన్కు పురిటి నొప్పులు రాగా, ఆశా కార్యకర్త మల్లేశ్వరి సాయంతో ఈనెల 1న ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి సాధారణ కాన్పు అవుతుందని చెప్పారు. గురువారం అర్ధరాత్రి ఇర్ఫానాకు నొప్పులతోపాటు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో వైద్య సిబ్బంది.. డ్యూటీలో ఉన్న వైద్యురాలికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వైద్యురాలు ఆస్పత్రికి రాకుండానే సిబ్బందికి ఫోన్లోనే డెలివరీకి సంబంధించిన సూచనలు చేయగా.. వారు చిన్న ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో ప్రసవం జరగకపోగా.. గర్భిణి అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. విషయం వైద్యురాలికి వివరించడంతో ఆమె ఆస్పత్రికి వచ్చి.. పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసింది. మగ శిశువు జన్మించిన వెంటనే మృతిచెందాడు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయాడని ఇర్ఫానా భర్త రహమాన్ ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్కుమార్కు ఫిర్యాదు చేశారు. బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా, శిశువు మృతి ఘటనలో వైద్య సిబ్బంది తప్పేమీ లేదని సూపరింటెండెండ్ అశోక్కుమార్ వివరణ ఇచ్చారు. రాత్రి నొప్పులు రావడంతో గైనకాలజిస్ట్ వైద్య సమాచారం ఇచ్చారని, వెంటనే ఆమె ఆస్పత్రికి వచ్చి చికిత్స చేశారన్నారు. కానీ బాబు మృతిచెందాడన్నారు. -
సెల్ఫ్ హెల్ప్ అవుతుందా?
ఒకప్పుడు డబ్బున్న మారాజులకు మాత్రమే పరిమితమైన సెల్ ఫోన్ ఇంచుమించు ప్రతి ఒక్కరి జేబుల్లోనూ ఉంటోంది. దేశవ్యాప్తంగా సెల్ఫోన్ వినియోగదారుల సంఖ్య వందకోట్లు రీచ్ అయిపోయిందిప్పుడు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ సెల్ఫోన్ల వాడకం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సెల్ఫోన్తోనే టైమంతా స్పెండ్ చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఫలితంగా సెల్ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాలు కూడా అంతకు అనేకరెట్లు పెరుగుతున్నాయి. సెల్ వాడేకొద్దీ దానిమూలంగా విడుదలయ్యే రేడియేషన్ కూడా ఆటోమేటిగ్గా పెరుగుతుంది. మెదడు కణాలపైన అది చూపే దుష్ఫలితం అంతా ఇంతా కాదు. సెల్ఫోన్ వాడకం వల్ల బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయనీ, క్యాన్సర్ వస్తుందనీ ఎన్ని పరిశోధనలు తేల్చి చెబుతున్నా, సర్వే నివేదికలు ఎన్ని మొత్తుకుంటున్నా సెల్ వినియోగం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. అసలు సెల్ఫోన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే, వాటివల్ల క్యాన్సర్ ముప్పు ఉందో లేదో తెలుస్తుంది. సెల్ఫోన్లు సిగ్నల్స్ను రిసీవ్ చేసుకోవడం, పంపడం వాటికి దగ్గరలోని సెల్ఫోన్ టవర్స్ ద్వారా జరుగుతుంది. ఈ సెల్ఫోన్ టవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలే ఆధారం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు సెల్ఫోన్ యాంటినా నుంచే వెలువడతాయి. మనం చెవి దగ్గర ఉంచి సెల్ మాట్లాడేటప్పుడు ఈ యాంటినా మన తలకు అతి పమీపంలోకి వస్తుంది. అప్పుడు ఈ తరంగాలు మెదడును తాకుతాయి. మనం ఎంత ఎక్కువ సేపు సెల్ మాట్లాడితే అంత ఎక్కువసేపు ఈ తరంగాలు మెదడును తాకి మెదడును ఉడికే లా చేస్తాయి. సెల్ఫోన్ వాడకం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? పరిశోధనలు, అధ్యయనాల వల్ల తేలిందేమంటే సెల్ఫోన్ వాడకానికీ, మెదడులో కణుతులు ఏర్పడటానికీ సంబంధం లేదని. అయితే, అంతమాత్రాన నిశ్చింతగా ఊరుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో. చిన్నారులు ఎక్కువసేపు సెల్ఫోన్ మాట్లాడటం, సెల్ వాడటం వారి మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. నిపుణులు ఏమి చెబుతున్నారు? ప్రపంచ ఆరోగ్యసంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థలు సంయుక్తంగా చెబుతున్నదేమంటే, సెల్ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో కణుతులు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని. పైన చెప్పిన దానికీ, దీనికీ పూర్తి విరుద్ధంగా ఉన్నప్పటికీ పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు అన్ని రకాల సెల్ఫోన్ల వాడకం వల్లా మెదడులో కణుతులు ఏర్పడకపోవచ్చు కానీ, కొన్ని రకాల అంటే ముఖ్యంగా చైనా ఫోన్లు, చవకబారు, నాణ్యత లేని ఫోన్లు ఎక్కువ మొత్తంలో రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు విడుదల చేస్తాయనీ, దాని మూలంగా మెదడులోని కణాలు ఉడికిపోయినట్లయి, కణుతుల్లా ఏర్పడే అవకాశం ఉందనీ చెబుతున్నాయి. హాని లేకుండా సెల్ఫోన్ వాడలేమా? సెల్ఫోన్ వాడకం వల్ల ముప్పు ఉందని తెలిసినప్పటికీ వాడకుండా ఉండటం మాత్రం సాధ్యం కాదు. అయితే, నష్టశాతాన్ని మాత్రం తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..? ఫోన్లలో సార్ వ్యాల్యూ అని ఉంటుంది. సార్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే, రేడియో ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ సార్ వాల్యూ ఉన్న మోడల్ సెల్ఫోన్లను వాడటం ద్వారా దాని ముప్పును తగ్గించుకోవచ్చు. ∙స్పీకర్ మోడ్లో వాడటం ద్వారా లేదా హ్యాండ్స్ ఫ్రీ ద్వారా లేదా కార్డ్లెస్ ఇయర్ పీస్ వాడటం ద్వారా కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ తగ్గుతుంది. సెల్ మాట్లాడటాన్ని తగ్గించి, వీలయినంత వరకు టెక్ట్స్ మెసేజెస్ అంటే ఎస్సెమ్మెస్లను వాడటం మంచిది. పిల్లలకు సెల్ఫోన్ వీలయినంతవరకు ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వారి మెదడు కణాల అభివృద్ధికి సెల్ఫోన్ వాడకం హాని చేస్తుంది కాబట్టి.గంటల తరబడి సెల్ సొల్లు చెప్పుకుంటూ ముప్పు తెచ్చుకునేబదులు ఆ మాటలేవో నేరుగా మాట్లాడుకోవడం వల్ల మానవ సంబంధాలు, రాకపోకలు కూడా పెరుగుతాయి కదా! డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడకపోవడం మంచిది. -
వ్యక్తి ధర్మం ఇలా..
చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత ఎదుటివాడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం మానేశాం. పైగా దానిని సెల్ఫోన్తో చిత్రీకరించి, కుదిరితే సెల్ఫీలు దిగి ఫేస్బుక్కులోనో, వాట్సాప్లోనో పెడుతున్న రోజులివి. కానీ సిరియాలోని ఒక ఫొటోగ్రాఫర్ నైతిక ధర్మం కోసం కాసేపు తన వృత్తిధర్మాన్ని పక్కన పెట్టేశాడు. గత వారం సిరియాలోని పశ్చిమ అలెప్పొలో రెబల్స్కు పట్టున్న రషీదిన్ వద్ద ఓ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గమ్యానికి చేరే మార్గంలో కాసేపు విశ్రాంతి కోసమని డ్రైవర్ బస్సు నిలపడంతో అందులో నుంచి దిగిన ఓ చిన్నారి చిప్స్ తింటూ నిలబడింది. అంతలోనే పెద్దపేలుడుతో ఆ బస్సులోని 126 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు 80 మంది చిన్నారులే. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ అబ్ద్ అల్ఖదర్ హబక్కు చుట్టుపక్కల దృశ్యాలు చూసేసరికి అతని గుండె ఆగినంత పనైంది. వెంటనే తేరుకున్న అతను కాసేపు కెమెరాలను పక్కనపెట్టేయాలని సహచరులకు చెప్పి క్షతగాత్రులను కాపాడేందుకు రంగంలోకి దిగాడు. తొలుత ఒక చిన్నారి వద్దకు వెళ్లి చూశాడు. అప్పటికే ఆ బాలుడు చనిపోయి ఉన్నాడు. వెంటనే సమీపంలోనే గాయాలతో పడిఉన్న మరో బాలుడి వద్దకు వెళ్లాడు. అతను ఊపిరి తీసుకోవడానికి అవస్థ పడుతున్నట్లు గమనించిన హబక్, వెంటనే బాలుడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్ వద్దకు చేర్చాడు. తర్వాత మరో బాలుడిని కాపాడేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఓ బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయిన హబక్ మోకాళ్లపై కూలబడిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యాలన్నిటిని సమీపంలో ఉన్న వేర్వేరు ఫొటోగ్రాఫర్లు చిత్రీకరించారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వేలసార్లు షేర్ అయ్యాయి. నెటిజన్లు హబక్ మానవత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
సెల్ఫోన్ వాడటం సురక్షితమేనా?
జనరల్/న్యూరో కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 27 ఏళ్లు. సాఫ్ట్వేర్. ఎక్కువగా సెల్ఫోన్లో మాట్లాడుతూ, బ్రౌజ్ చేస్తూ ఉంటాడు. ఇంటర్మీడియట్ నుంచీ ఇలా మాట్లాడే అలవాటు ఉంది. ఇంజనీరింగ్ చేసేటప్పుడు పెరిగింది. ఇటీవల బాగా ఎక్కువైంది. సెల్ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విన్నాను. మా మనవడి వయసు మూడేళ్లు. వాడు కూడా సెల్ఫోన్తో ఎక్కువగా ఆడుతున్నాడు. నాకు చాలా భయంగానూ, ఆందోళనగానూ ఉంది. సెల్ఫోన్తో క్యాన్సర్ వచ్చే మాట నిజమేనా? – నిర్మల, సికింద్రాబాద్ సెల్ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్ టవర్కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్ట్అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్ఫోన్ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఏర్పడ్డాయి. అయితే సెల్ఫోన్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. ఇంతవరకు జరిగిన అధ్యయనాల్లో ఫోన్లు, సెల్ టవర్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందని గుర్తించినా, అది క్యాన్సర్కు దారితీస్తాయని కచ్చితంగా చెప్పడానికి గల ఆధారాలే లేవు. కొన్ని అధ్యయనాలు మొబైల్ఫోన్స్తో మెదడుకు క్యాన్సర్ ప్రమాదం ఉందని చెబితే... మరికొన్ని అలాంటిదేమీ లేదని తేల్చాయి. అయితే ఈ రెండు రకాల అధ్యయనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చాయి. అయితే ఒక అంశం మాత్రం స్పష్టం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సెల్ఫోన్స్ వెలువరించే రేడియేషన్ స్థాయి తగ్గుతూ పోతోంది. పైగా మొబైల్స్ వాడకం ఆధునిక జీవితంలో భాగంగా మారింది. క్యాన్సర్ ప్రమాదం గురించి అనుమానాలు, భయాలు వ్యాప్తిలో ఉన్నా మొబైల్ఫోన్స్ను పూర్తిగా విస్మరించడం సాధ్యం కావడం లేదు. సెల్ఫోన్ రేడియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు పూర్తి వాస్తవాలను తేల్చిచెప్పేలోపు మనం కొన్ని మందు జాగ్రత్తలను పాటించాలి. ►సెల్ఫోన్ రేడియేషన్కు సంబంధించి సురక్షిత స్థాయి అంటూ స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ (ఎస్.ఏ.ఆర్.)ను నిర్ణయించారు. ఆ పరిధిలో ఉన్న ఫోన్స్ వాడాలి n వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్ (లైన్డ్ ఫోన్స్)లో మాట్లాడాలి n సెల్ఫోన్ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి n సెల్ఫోన్ వాడటం తప్పనిసరి అయినప్పుడు హ్యాండ్స్ ఫ్రీ అటాచ్మెంట్ను ఉపయోగించడం, మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి n రింగ్ చేసిన నెంబరు, కనెక్ట్ ఆయిన తర్వాత మాత్రమే సెల్ఫోన్ను చెవి వద్దకు తీసుకెళ్లాలి n పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్ఫోన్ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్ఎంఎస్, చాటింగ్, యాప్ బేస్డ్ మెసేజింగ్, డేటా సర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్ఫోన్ను పరిమితం చేయాలి. ప్రత్యేకించి పిల్లలను సెల్ఫోన్ వాడకానికి దూరంగా ఉంచాలి. పిల్లల మెదడు లేత కణాలతో కూడి ఉంటుంది. వాటిగుండా రేడియేషన్ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అందువల్ల సెల్ఫోన్ రేడియేషన్ ప్రభావం పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గడిచిన ఐదారేళ్ల నుంచే మరీ ఎక్కువగా పిల్లల చేతుల్లోకి సెల్ఫోన్స్ చేరుతున్నాయి. మరో పదేళ్లు పోతేగానీ సెల్ఫోన్ రేడియేషన్ ఎటువంటి ప్రభావం చూపిందన్నది కచ్చితంగా తెలిసిరాదు. అంతవరకు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా అవసరం అని మాత్రం చెప్పగలం. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
సెల్ఫోన్ కోసం స్నేహితుని హత్య
-
అరగంట వ్యవధిలో చోరీ సొమ్ము రికవరీ
కర్నూలు : కర్నూలు నగరం హిందుస్థాన్ హోటల్ పక్కన గల గురుదత్త బట్టల షాపుకు ఓ మహిళ దుస్తుల కొనుగోలుకు వెళ్లింది. చోరీకి అలవాటు పడ్డ ఇద్దరు మహిళలు ఆమెను అనుసరించి పర్సుతో పాటు సెల్ఫోన్ను దొంగలించి ఆటోలో ఎక్కి వెళ్లిపోయారు. బాధితురాలు అరగంట తర్వాత గుర్తించి ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కృష్ణయ్య, ఏఎస్ఐ నిర్మలాదేవి, కానిస్టేబుల్ మద్దిలేటి బృందంగా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజీ సహకారంతో మౌర్యా ఇన్ దగ్గర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ మంగళవారం మధ్యాహ్నం ఒకటవ పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అదే సందర్భంలో బాధితులు స్టేషన్లో ఉండగా వారిని విచారించారు. అరగంట వ్యవధిలో తమ సొమ్ములను పోలీసులు రికవరీ చేశారని బాధితులు ఎస్పీకి తెలిపారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. బాధిత మహిళ ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు భద్రతాభావాన్ని పెంపొందించే విధంగా పోలీసులు పనిచేయాలని సూచించారు. అనంతరం స్టేషన్ అంతా కలియదిరిగి రికార్డులను పరిశీలించారు. సీఐ బి.ఆర్.కృష్ణయ్య, ఏఎస్ఐలు నిర్మలాదేవి, ఎస్.జె.సాహెబ్తో పాటు కానిస్టేబుల్ మద్దిలేటి తదితరులు ఎస్పీ వచ్చినప్పుడు స్టేషన్లో ఉన్నారు. -
చర్లపల్లి జైల్లో సెల్ ఫోన్ కలకలం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ వద్ద సెల్ఫోన్ లభ్యం అయిన ఘటన కలకలం రేపింది. మానస బ్లాక్లో రెండు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్న విదేశీయుడి వద్ద సోమవారం అధికారులు తనిఖీ చేసి సెల్ఫోన్ ఉన్నట్లు తేల్చారు. దీని వెనుక జైలు సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెల్ను స్వాధీనం చేసుకుని, ఖైదీని విచారిస్తున్నారు. -
ఊరికి పోయి రావాల
పాలగిరి విశ్వప్రసాద్ ఉదయం 6 గంటలకు మంచం మీద నుండి లేవడానికి కునికిపాట్లు పడుతుండగా సెల్ఫోన్ మోగింది. ఇంక లేవక తప్పలేదు. అవతలి నుండి ‘విశ్వనాథ్ గారా?’ కన్నడంలో అడిగారెవరో. నాకు కన్నడం రాదు. అతను చెప్పిన పేరు నాదే. ‘ఔను. విశ్వనాథ్నే మాట్లాడుతున్నా’. అవతలి నుండి, తన పేరు రఘురామ సోమయాజి... అంటూ కన్నడంలో చెప్పుకుపోతున్నాడు. నేను ఇంగ్లీషులో అడిగే ప్రయత్నం చేసినా, అతను కన్నడంలోనే చెప్పుకుపోతున్నాడు. అతని మాటల్లో అక్కడక్కడా వినిపించిన ఇంగ్లీషు పదాల ఆసరాగా కొంత అర్థమయింది. ఆర్నెళ్ల కిందట చనిపోయిన మావూరి వాడే అయిన నా మిత్రుడు చంద్రారెడ్డి దానం చేసిన గుండె, ఈ రఘురామ సోమయాజిలో ఉంది. అంతకు మించి అర్థం కాలేదు ‘ఐ విల్ కాల్ బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్’ అని ఫోన్ కట్ చేసినా. వెంటనే కన్నడం తెలిసిన మిత్రుడు భాస్కర్కు ఫోన్ చేసి, సోమయాజి నెంబరు ఇచ్చి విషయం కనుక్కోమన్నాను. నాలో ఆలోచనలు ముసురుకున్నాయి.చంద్రారెడ్డి గుండెను అమర్చుకున్న రఘురామ సోమయాజి! చనిపోయిన చంద్రారెడ్డి గుండెతో జీవిస్తున్న సోమయాజి! ఆ రోజు చంద్రారెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యాక, అవయవ దానానికి చంద్రారెడ్డి భార్య, కొడుకులను ఒప్పించింది తనే. కొడుకులిద్దరూ ఒక్క మాటతోనే ఒప్పుకున్నారు. ఉష మాత్రం ససేమిరా కాదంటే కాదంది.కడపలోనే ఉంటున్న నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణయ్యకు ‘లివర్’ పూర్తిగా చెడిపోయింది. అతన్ని బతికించాలని నా తాపత్రయం. ఎలాగూ మట్టిలో కలిసిపోయే అవయవాల వల్ల మరొకరు, మరికొన్నేళ్ళు జీవించే అవకాశం ఉన్నప్పుడు... ఆ సందర్భం కళ్ళముందుకొచ్చినప్పుడు... నేను ఆమెలాగే విచక్షణ కోల్పోయి మౌనంగా ఉండకూడదనుకున్నాను. కృష్ణయ్యను బతికించడానికి చంద్రారెడ్డి భార్య ఉషను బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది. కృష్ణయ్యకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఒక మనిషిగా నా కర్తవ్యం చేశాననుకున్నాను. తక్కిన అవయవాలు రెండు కళ్ళూ, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె ఎవరికి చేరాయో! గుండె మార్పిడి మాత్రం అప్పుడు టీవీ ఛానెల్స్లో, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. చెన్నై ఆసుపత్రిలో చంద్రారెడ్డి బ్రెయిన్ డెడ్ శరీరం నుండి అన్ని అవయవాలు తీసిన తర్వాత చివరగా గుండెను తీశారు. హాస్పిటల్ నుండి ఏర్పోర్ట్ వరకూ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి ఉంచారు. గాజుపెట్టెలో ఏదో లిక్విడ్లో పెట్టిన గుండె అంబులెన్స్లో ఆఘమేఘాల మీద ఏర్పోర్ట్కు చేరింది. అక్కడి నుండి విమానంలో బెంగుళూరుకు దూసుకుపోయింది. ఆ నగరంలో కూడా ఏర్పోర్ట్ నుండి హాస్పిటల్ వరకూ ట్రాఫిక్ క్లియర్ అయింది. అంబులెన్స్లో ఆ గుండె శరవేగంగా ఆసుపత్రికి చేరింది. గుండెను శరీరం నుండి తీసిన నాలుగు గంటలలోపే అది అవసరమైన వారి శరీరంలో అమర్చాలట. ఈ సంఘటనను చెబుతూ ‘మీడియా’ ఆ రోజు ఆ రెండు ఆసుపత్రులనూ, ఆ డాక్టర్లనూ ఆకాశానికెత్తింది. గుండెను దానం చేసినవారి ఊసుమాత్రం ఆ వార్తల్లో లేదు. చంద్రారెడ్డి గుండె చేరింది ఈ రఘురామ సోమయాజి శరీరంలోకా! ఇప్పుడెందుకు ఫోన్ చేసినట్లు? నా ఫోన్ నెంబరు ఎలా దొరికింది?... అసలు నాకే ఎందుకు ఫోన్ చేసినట్లు?నా ఆలోచనలు గతంలోకి, వర్తమానంలోకి గింగుర్లు తిరుగుతున్నాయి. అర్ధగంట తర్వాత భాస్కర్ నుండి ఫోన్ వచ్చింది. ‘‘బాసూ! మీ ఫ్రెండెవరో బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అతని అవయవాలు దానం చేసినారన్నావు గదా! అతని గుండె అమర్చింది ఈ సోమయాజికేనంట. మామూలుగా అయితే అవయవాలు దానం చేసినవారి వివరాలు తీసుకున్నవారికీ, తీసుకున్నవారి వివరాలు దానం చేసినవారికీ చెప్పరంట. బెంగుళూరు ఆసుపత్రి డాక్టర్లలో తనకున్న పలుకుబడితో, చెన్నై ఆసుపత్రి డాక్టర్లను పరిచయం చేసుకున్నాడట. ఫోన్లలో పని కాకపోతే స్వయంగా చెన్నై వెళ్ళి తనకు జీవితం ఇచ్చిన వారి వివరాలు కనుక్కున్నాడంట. మీ ఫ్రెండ్ భార్యకు, కొడుకులకు ఫోన్లు చేస్తే పనిచేయడం లేదట. పనిచేస్తున్న ఒక్క ఫోన్ వారం రోజుల నుండి రింగవుతోంది గానీ లిఫ్ట్ చేయడం లేదంట. ఆ అవయవ దానానికి సూత్రధారివి నువ్వేనని కనుక్కుని, నీ నెంబరు పట్టుకుని ఫోన్ చేసినాడంట. తనకు జీవితం ఇచ్చినవారిని కలుసుకుని కృతజ్ఞత చెప్పుకోవాలంట. డాక్టర్లు మాత్రం వెళ్ళొద్దు, వాళ్ళను చూసి ఎమోషనల్ అయితే గుండెకు దెబ్బ అంటున్నారంట. అయినా వాళ్ళను కలుసుకుంటాను, తనకు సహకరించమంటున్నాడు. ఈ రోజే బెంగుళూరు నుండి కార్లో బయలుదేరుతున్నారంట. నిన్నూ, నన్నూ కడప విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దనీ ఫోన్లోనే కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఆయన్ను, మీ ఫ్రెండ్ భార్యా కొడుకులతో కలపనంట కలిపి పుణ్యం కట్టుకోరా!’’ గడగడా మాట్లాడి, నన్ను మాట్లాడనీయకుండానే ఫోన్ కట్ చేసినాడు. నాకు దిక్కు తోచలేదు. ఆర్నెల్ల నుండీ మా వూరికి పోవాలంటేనే నాకు మొహమెక్కడం లేదు. ఆరోజు కృష్ణయ్య జీవితం నిలబెట్టాలనే తాపత్రయంతో, చంద్రారెడ్డి భార్యను వత్తిడి చేసి వొప్పించిన సందర్భమే మహాసంకట సమయంలో జరిగింది. ఆ రోజు చంద్రారెడ్డి చనిపోవడమే ఒక విస్మయం. హఠాత్మరణం. మా వూర్లో పెద్ద భూస్వామి చంద్రారెడ్డి. చంద్రారెడ్డికీ వాళ్ళ నాయన మాదిరే రాజకీయాల ధ్యాస లేదు. తనూ, తన కుటుంబం, తన వ్యవసాయం, తన సంపాదన అంతే. ప్రతిఫలం లేకుండా ఎవరికీ ఏ సాయం చేయని ‘లోభి’ తనముందనే పేరుంది.ఆ రోజు ఉదయమే వూరి నుండి ఫోన్. పల్లె నుండి ప్రొద్దుటూరుకు పోతున్న చంద్రారెడ్డి పట్టణ శివారులో యాక్సిడెంట్కు గురైనాడు. ప్రొద్దుటూరు గవర్నమెంటు ఆసుపత్రి నుండి కడపలోని మల్టీకేర్ కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకొస్తున్నారు... అని ఫోన్ సారాంశం. నేను ఊరు విడిచి వచ్చి ఇరవై యేళ్ళయినా... ఊరి దగ్గరున్న అమ్మా, నాయనలు కాలమయి పోయినా ఊరితో నా వేర్లు తెగలేదు. నేను హాస్పిటల్కు చేరుకున్న సమయంలోనే, ప్రొద్దుటూరు నుండి అంబులెన్స్ చేరుకుంది. వెనుక ‘సుమో’లో ఆడవాళ్ళు దిగినారు. మగవాళ్ళెవరూ రాలేదు. వెనుక మోటర్ బైకుల్లో వస్తున్నారన్నారు. ఇక హాస్పిటల్లో ‘అంతా నేనే’ అవ్వాల్సి వచ్చింది. వెంటిలేటర్తో శ్వాస పోసుకుంటున్న చంద్రారెడ్డి శరీరాన్ని అంబులెన్స్ నుండి స్ట్రెచర్ మీద కిందికి దించినారు. చంద్రారెడ్డి అప్పటికే కోమాలోకి పోయినట్లుంది. ముక్కు నుండి, చెవుల నుండి రక్తం కారుతూ మొహమంతా రక్తమయమయింది. డాక్టర్లు చూడగానే అత్యవసర కేసుగా గుర్తించి, సంబంధించిన డాక్టర్ల టీమ్ను నిమిషాల మీద పిలిపించినారు. శరీరంలో మొత్తం అన్ని అవయవాలను ‘స్కానింగ్’ చేయాలని నిర్ధారించినారు. రిపోర్టు రాసి హాస్పిటల్కు చెందిన ప్రత్యేక అంబులెన్స్లో నగరంలో ఖరీదైన అధునాతన స్కానింగ్ సెంటర్కు పంపించారు. వెంట ఆసుపత్రి స్టాఫ్ ఉన్నారు. నాకు తెరపి దొరికి చుట్టూ చూశాను. వెయిటింగ్ హాల్లో ఉష అచేతనంగా కుర్చీలో జారగిలబడి వుంది. స్కానింగ్ సెంటర్ నుండి అంబులెన్స్ వచ్చింది. చంద్రారెడ్డిని హాస్పిటల్కు చేర్చగానే బయట నుండి వచ్చిన డాక్టర్ల టీమ్ ముసురుకుంది. ఓ పది నిమిషాలు రిపోర్టులూ, శరీరాన్నీ పరిశీలించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. హాస్పిటల్కు చెందిన డాక్టరు బయటకు వచ్చి ‘‘చెన్నై తీసుకుపోండి, ఏర్పాట్లు చేస్తాం!’’ అన్నాడు. ప్రక్కనే ఉన్న నర్సుకు ఒక చీటీ ఇచ్చి, ‘‘వాళ్ళతో అడ్వాన్స్ పోనూ ఈ డబ్బు క్యాష్ కౌంటర్లో కట్టించు. కట్టిన వెంటనే వచ్చి చెప్పు’’ పురమాయించాడు. నేను డాక్టర్ను కదిలించినా. ‘బ్రెయిన్ డెడ్. తలలో నరాలన్నీ చిట్లిపోయినాయి. చెన్నై వెళ్ళాక అక్కడ డాక్టర్స్ టీమ్ ఇంకోసారి ఎగ్జామిన్ చేస్తారు. వెంటిలేటర్, స్పెషల్ అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపిస్తాం. అక్కడ ఆర్గాన్స్ డొనేట్ చేసేట్లయితే ముందుగానే నిర్ణయించుకోండి’‘ఆర్గాన్స్ డొనేట్’ మాట వినగానే నాకు కృష్ణయ్య జ్ఞాపకం వచ్చినాడు. వాడికి లివర్ పూర్తిగా చెడిపోయింది. ఏ తాగుడు వ్యసనం వల్లో వాడి లివర్ చెడిపోలేదు. ఏదో ‘సిర్రోసిస్’ అనే రోగం వచ్చింది. కుటుంబ సభ్యుల లివర్ మ్యాచ్ కాలేదు. అయినా మరొకరి లివర్ను కత్తిరించి అమర్చే దశ దాటిపోయింది. ఇపుడు పూర్తి లివర్... కెడావరిక్ లివర్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి పూర్తి లివర్ కావాలి.వాడు ‘జీవన్ దాన్’లో రిజిష్టరు చేయించుకుని, బ్రెయిన్ డెడ్ అయిన వారి లివర్ కోసం చావును కళ్ళల్లో పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు. క్షణమాలోచించకుండా, ఉన్నఫళంగా అంబులెన్స్తోపాటు, వెనుక వాహనంలో నేనూ చెన్నై బయలుదేరాను. వాహనంలో పోతుండగానే, చంద్రారెడ్డి కొడుకులిద్దరికీ ఫోన్ చేశాను. ఎంటెక్ పూర్తిచేసి ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న పెద్ద కొడుకుతో, ఈ నడుమనే పూణేలో సాఫ్ట్వేర్లో చేరిన చిన్న కొడుకుతో మాట్లాడాను. ఇద్దరూ ‘యాక్సిడెంట్ విషయం’ తెలిసిందన్నారు. బ్రెయిన్ డెడ్ విషయం చెప్పి, అవయవ దానానికి వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేశాను. చెన్నై హాస్పిటల్లో మరోసారి డాక్టర్స్ టీమ్ ‘బ్రెయిన్ డెడ్’ నిర్ధారించాక, అవయవ దానం ప్రస్థావన చేశాను. కొడుకులిద్దరూ సమ్మతి తెలిపినారు. ఉష అస్సలు ఒప్పుకోలేదు. ససేమిరా కాదంటే కాదంది. హిస్టీరిక్గా ప్రవర్తించింది. ‘‘అవయవాలన్నీ తీసేసి కాయాన్ని మూటగట్టి ఇస్తే తీసుకుపోవాల్నా? నేనొప్పుకోను. నా మొగుడే పోయిన తర్వాత, ముక్కూ మొఖం తేలీని వాళ్ళెకెవరికో ఆయప్ప అవయవాలిచ్చి వాళ్ళను బతికించేంత దయ నాకు లేదు. ఆ పుణ్యం మాకొద్దు’’ అంటూ చెన్నై హాస్పిటల్లో పిచ్చిదానిలా ఊగిపోయింది. ఏడుస్తూ ఉన్మాదిలా రేగిపోయింది. ఆమె అన్న, తమ్ముళ్ళకు విడమరిచి చెప్పి, వాళ్ళ ద్వారా ఆమెనెలాగో ఒప్పించామందరమూ. కొడుకులిద్దరూ ఆసుపత్రి వాళ్ళిచ్చిన అన్ని కాగితాల మీదా బాధగానే సంతకాలు చేసినారు. ఉష ఏడుస్తూ, అందర్నీ శాపనార్థాలు పెడుతూ సంతకం చేసింది. ఆ రోజు నుండి ఊర్లో ఉష కనపడినవాళ్ళందరి దగ్గరా నన్ను శాపనార్థాలు పెడుతోందని విన్నాను. ఎట్టున్నవాడిని అట్లే పూడ్చి సమాధి కట్టుకోకుండా, తన భర్తను పీలికలు పీలికలు చేసి మూట కట్టి చేతిలో పెట్టించానని దుమ్మెత్తి పోస్తోందని విన్నాను. ఇవన్నీ విని నాకు ఊరికి పోవడానికే మొహమెక్కడం లేదు. పుణ్యానికి పోయి ఏదో పాపం చేశానేమోననే న్యూనత. మా ఊరికి పోయి ఉషకు కృతజ్ఞతలు చెప్పి వద్దామని, కృష్ణయ్య ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాడు. నేను ఆ మొర ఆలకించలేదు. ఇప్పుడు తప్పేటట్లు లేదు. కృష్ణయ్యకూ ఫోన్ చేసినా. ‘‘మా ఊరికి వెల్దాం. గంటలో రడీగా ఉండు.’’ మధ్యాహ్నం రెండు గంటలకు భాస్కర్ నుండి ఫోనొచ్చింది. ‘వాళ్ళు కడపకు ఎంటరయినారంట. హరిత టూరిజం రెస్టారెంట్ దగ్గరకు రమ్మన్నా. నువ్వు రా సామీ!’’ నేను వెళ్ళగానే రఘురామ సోమయాజిని పరిచయం చేశాడు. యాభై యేళ్ళు దాటినట్లున్నాయి. మరో ఇద్దరు. యువకుడు తమిళం. యువతి కన్నడం. ముప్ఫై, ముప్ఫై అయిదేళ్ళ మధ్యలో ఉన్నారు. వాళ్ళకూ తెలుగు రానట్లుంది. ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. ‘‘వీళ్ళిద్దరూ కూడా మీ ఫ్రెండ్ లైఫ్ ఇచ్చినవాళ్ళే. డాక్టర్ శరవణన్, కల్పన. చంద్రారెడ్డి రెండు కిడ్నీలూ వీళ్ళలో చెరొకటి ఉన్నాయి.’’ భాస్కర్ మాటలు, నాకు సంభ్రమం కలిగించాయి. చంద్రారెడ్డి మరణంతో, జీవిస్తున్న ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు నా కళ్ళముందు కనిపిస్తున్నారు. నాలుగోవాడు కృష్ణయ్య వచ్చాడు. ఏవేవో బేకరీ ఐటమ్స్ మోసుకొచ్చాడు. వాటిని కారులో పెడదామని డిక్కీ తెరిపిస్తే, డిక్కీ నిండా పండ్ల పెట్టెలు. ఆపిల్స్, పైనాపిల్స్, ఆల్మండ్స్, కర్జూరాలు... రకరకాలు. వాటితోపాటు తేనె సీసాలు. నేను, భాస్కర్ను పక్కకు పిలిచి, నేను ఊరికి ఎందుకు రాలేనో దీనంగా చెప్పి, నా పరిస్థితి అర్థం చేసుకోమన్నాను. వాళ్ళను మా ఊరికి తీసుకుపోయి ఉషతో మాట్లాడించి తీసుకురమ్మన్నాను. అక్కడ వీళ్ళు గానీ, ఆమె గానీ ఏ రకమైన ఎమోషన్కు గురికాకుండా చూడమన్నాను. ‘అందుకు నువ్వే సమర్ధుడి’వంటూ కాళ్ళా వేళ్ళాపడ్డాను. ‘‘నాకు ఇదేం పితలాటకం సామీ!... సరేలే!’’ ఐదుగురూ కారెక్కారు. డాక్టర్ శరవణన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. నేను కారెక్కకపోయే సరికి, బెంగుళూరు నుండి వచ్చిన ముగ్గురు దిగి నా చేతులు పట్టుకుని బలవంతం చేశారు. భాస్కర్ వారితో కన్నడంలో ఏదో సర్దిచెప్పి కారెక్కించాడు. నాకు మనసు కుదురుగా లేదు. అన్ని పనులు విడిచిపెట్టి ఇంట్లోనే కూర్చున్నా. నిలకడ లేదు... కాలు కాలిన పిల్లినైపోయాను... అక్కడేం జరుగుతోందో! భాస్కర్కు ఫోన్ చేయాలనుకుని చేతికి తీసుకోవడం. మళ్ళీ ఆలోచన విరమించుకుని పక్కన పడేయడం. ఫోన్ రింగైతే, పరుగున పోయి ‘భాస్కరేమో?’ అని చూడడం... నిరాశగా లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళతో పొడిపొడిగా మాట్లాడి, ‘బిజీగా ఉన్నా’నంటూ కట్ చేయడం. నాకు నరాలు చిట్లిపోయేట్లున్నాయి. సాయంత్రం ఆరు గంటలవుతుండగా భాస్కర్ నుండి ఫోన్. ‘‘ఏమైంది రా?’’ ‘‘బాగా టెన్షన్ పడ్తున్నట్లుందే. అంతా సవ్యం బాసూ! బయలుదేరి మీ వూరి పొలిమేర దాటుకున్నాం.’’ ‘‘ఉష ఏమనింది?’’ ‘‘ముందు కొంచెం ముభావంగా ఉన్నింది. వీళ్ళు మాట్లాడిన తీరు ఆమెను కరిగించింది. శరవణన్, కల్పనతో పాటు రఘునాథ సోమయాజి కూడా వంగి ఆమె కాళ్ళకు నమస్కరించేసరికి ఆమె తత్తరపడింది. ఇంకా మనోడు కృష్ణయ్య కూడా పాదాభివందనం చేసేసరికి సిగ్గుపడింది. ఇక్కడ నేనోగొప్ప అనువాదకుడినైపోయినా. వీళ్ళ మాటలు ఆమెకు తెలుగులో, ఆమె మాటలు వీళ్ళకు కన్నడంలో, తమిళంలో చెప్పడమే నా పని అయిపోయింది. మేము పోయిన అర్ధ గంటకు పల్లెలో వాళ్ళు చాలామంది ఆ ఇంటికి చేరినారు. వీళ్ళు, ఊరిలో వాళ్ళతో ఉష మా పాలిట దైవమనీ, ఆమె వల్లే తాము బతుకుతున్నామనీ లేకుంటే ఈ శరీరాలు ఈ పాటికే మట్టిలో కలిసుండేవని పదే పదే చెప్పుకున్నారు. బాసూ! మీ వూర్లో అంతకుముందు చంద్రారెడ్డి ఆర్గాన్స్ డొనేషన్స్ గురించి ఏమనుకున్నారో గానీ, వీళ్ళు పోయిన తరువాత ఇప్పుడు చంద్రారెడ్డి, ఆయన భార్య చాలా గొప్పవాళ్ళయిపోయినారు. వీళ్ళు అక్కడికి చేరిన వారందరికీ పండ్లు, స్వీట్స్ పంచినారు. సోమయాజి డబ్బు ఇవ్వబోతే కూడా ఉష తీసుకోలేదు. వీళ్ళు తెచ్చిన పండ్ల పెట్టెలు, తేనె సీసాలు కూడా వద్దంది. బలవంతం చేస్తే రకానికొక పండ్ల పెట్టె, ఒక తేనె సీసా తీసుకుంది. మిగిలినవన్నీ తిరుగుటపా. అవన్నీ నీకూ నాకే...’’ ‘‘నోర్మూసుకోరా! నీ ఓగల కూతలూ నువ్వూ! పక్కన వాళ్ళున్నారనే సిగ్గు కూడా లేదా!..’’ ‘‘సిగ్గెందుకు బాబూ! వాళ్ళకు మన ఓగల కూతలేవీ అర్థం కావులే. ఆ సరుకంతా తిరిగి తీసుకుపోవడం వాళ్ళు అవమానంగా భావిస్తున్నారు. అయినా...’’ భాస్కర్ మాట్లాడుతుండగానే సెల్లో ఉష ఫోన్. భాస్కర్ను కట్ చేసి ఉష ఫోన్ లిఫ్ట్ చేసినా ‘హలో’ అన్నా సంశయంగా. ‘‘అన్నా! బాగున్నారా! నన్ను క్షమించు. మా ఆయప్ప కాయము అంతా కోసి మూటకట్టి ఇచ్చినారని అందరితో నిన్ను నానా మాటలు మాట్లాడినా. ఈ పొద్దు వాళ్ళొచ్చి పోయినాక తెలుస్తాంది ఎంత గొప్పపని చేయించినావు. చచ్చిపోవాల్సిన నలుగురు మనుషులు మా ఆయప్ప అవయవాలతో బతికి, నా ముందుకొచ్చి నిలబడి ఉంటే నాకు ఏందో వింత జరిగినట్లుంది. ఊర్లో ఈయప్ప ఎవరికీ ఏ సాయం చేయడని అనుకుంటారు. ఈపొద్దు ఎనిమిది మందికి బతుకునిచ్చినాడు గదన్నా. వాళ్ళు నాలుగు లక్షలు లెక్క ఇయ్యబోతే వద్దంటే వద్దని చెప్పినా. ఆ లెక్క తీసుకుంటే ఆయప్పను అమ్ముకున్నట్లు గాదాన్నా!...’ కండ్లు, ఊపిరితిత్తులు, ఇంగా ఏవో అవయవాలు తీసుకున్నవాళ్లు ఎక్కడుంటారో నీకు తెలుసా అన్నా! వాళ్ళను కూడా చూసింటే బాగుండుననిపిస్తాంది.’’ ఉష నన్నేమీ మాట్లాడనీయలేదు. నేనేమీ మాట్లాడలేకపోయాను. ‘‘నువ్వూ, వదినా ఊరికి వచ్చినప్పుడు ఇంటి కాడికి రాండిన్నా!’’ అన్నది చివరగా. ‘‘సరేమ్మా!’’ఉష మాట్లాడాక నా మనసులో ఆర్నెళ్లుగా మోస్తున్న బరువేదో దిగిపోయినట్లయింది. ‘ఒకసారి ఊరికి పోయి రావాల’ అనుకున్నా. -
సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
త్రిపురారం: సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బడాయిగడ్డ గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధనావత్ శ్రీను(30) తన ఇంట్లో సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టడానికి స్విచ్బోర్డులో చార్జర్ను పెడుతుండగా అతని చేతి వేలు చార్జర్ పిన్నులకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాధితుడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
27న సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు(అర్బన్): ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 27వ తేదిన పరిశీలించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సెల్ఫోన్లకు మెసేజ్ వచ్చిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్కు రావాలన్నారు. -
గొప్పల 'సెల్'ఫీస్...!
హ్యూమర్ ‘‘వేమన ఉన్న రోజుల్లో మేం లేము. ఆయన ఉన్న రోజుల్లో మేం గనక ఉండి ఉంటే...’’ అంటూ తన ఆవేదన వెళ్లగక్కింది సెల్ఫోన్. ‘‘వేమన ఉండి ఉంటే ఏమయ్యేది?’’ అడిగింది ల్యాండ్లైన్ హ్యాండ్ సెట్. ‘‘ఏమయ్యేది అని నెమ్మదిగా అడుగుతావేం... ‘చేతిలోన సెల్లు... చెవిలోన హెడ్ఫోను... అరచేత పట్టు ఇంటర్నెట్టు... అందులోనీ ఫేస్బుక్కు, టాపు రేపు వాట్సాప్పు... చేత సెల్లు లేని బాధ ఇంతింత గాదయా’... అంటూ మమ్మల్ని వర్ణిస్తూ పద్యాలు చెప్పే వాడు. ఇప్పుడు ప్రతివాడూ మా సర్వీస్ తీసుకునే వాడే, మమ్మల్ని తిట్టేవాడే’’ అంది సెల్ఫోన్. ‘‘మిమ్మల్ని తిడుతున్నారా... ఎవరూ? ఏమంటున్నారు?’’ అడిగింది హ్యాండ్సెట్. ‘‘మేము వచ్చి మానవ సంబంధాలను మంటగలిపామంట. ప్రతివాళ్లూ మాలోనికి తలదూరుస్తున్నారట. మేం కూడా యథాశక్తి వాళ్ల జీవితాల్లోకి తలదూరుస్తున్నామంట. ఒక్క మాటేమిటీ... పెళ్లిళ్లు కూడా మా ద్వారానే... విడాకులూ మా ద్వారానేనట’’... అంది సెల్ఫోన్ బాధగా. ‘‘అరె... ఒక రింగుల రింగుల సంకెళ్ల ద్వారా ఆ ల్యాండ్ఫోన్కి మేం బందీలమయ్యామే. కానీ మీరు అలా కాదు కదా. స్వేచ్ఛగా బహు స్వతంత్రంగా ఉన్నారని మేం మిమ్మల్ని చూస్తూ కుళ్లుకుంటూ ఉన్నామే. మీకు తిట్లు తప్పడం లేదన్నమాట’’ సానుభూతిగా అంది ల్యాండ్ఫోన్ హ్యాండ్ సెట్. ‘‘తిట్లా... మామూలుగా కాదు. కర్ణపిశాచి అనీ... అదనీ ఇదనీ. అరె... అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ మాలోనే ఇంతగా తలదాచుకుంటున్నారే...’’ అంటుండగా సెల్ఫోన్ మాటల ఫ్లోకి అడ్డుపడింది ల్యాండ్ఫోన్. ‘‘తల దాచుకోవడమేమిటి? అసలు తలదాచుకోవడమనే మాటకు అర్థమేమిటో తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి’’ అంటుండగానే రోషంగా తలెత్తింది సెల్ఫోన్. ‘‘పెద్ద పెద్ద మాటలేమీ కాదు. ఉన్న వాస్తవమే. ఎవరినైనా పలకరించాల్సి వస్తుందనీ, ఎదుటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుందని తెలియగానే మనుషులు ఏం చేస్తారో తెలుసా? మాలో తలదాచుకుంటారు. తమ మెదడు తినేసేవాళ్లు అవతలికి పోయారని తెలిసేవరకూ అలా దాచుకున్న తలను మళ్లీ ఎత్తరు. పైగా మేమిప్పుడు మనషులు దారితప్పకుండా చూసే వాళ్ల పాలిటి గైడ్లం కూడా’’ అంది గొప్పగా. ‘‘మీరేంటి గైడ్లేమిటి? ఎందుకలా మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు’’అంది హ్యాండ్సెట్ అక్కసుగా. ‘‘మేం మనుషుల పాలిటి గైడ్లం అన్న మాట అక్షరాలా నిజం. ఇప్పుడు ప్రతి కారూ... ప్రతి వాహనమూ తాము దారి తప్పకుండా ఉండటం కోసం మా సహాయం తీసుకుంటున్నారు. తాము వాహనంలో కూర్చుని ఎక్కడున్నదీ... ప్రయాణించాల్సిన రూట్ ఏదీ... ఇవన్నీ తెలిసేలా మాలోనే రూట్ మ్యాప్ అంతా సెట్ చేసుకుని, ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు ప్రయాణాలు చేసేవారికి తమ సీటు ఎంత ముఖ్యమో... వాళ్ల గైడ్గా మాకూ అంతే ప్రాధాన్యం. డ్రైవింగ్ సీటుకు ఎదురుగా మమ్మల్ని ఉంచేందుకు ప్రత్యేకంగా ప్రతివాహనంలోనూ మాకో స్టాండు ఏర్పాటు చేస్తున్నారు తెల్సా’’ అంది సెల్ఫోను. ‘‘అవును. గతంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మేము తమ హోదాకు చిహ్నంగా మమ్మల్ని భావించేవారు’’ అంటూ ఉండగానే సెల్ఫోన్ అడ్డుకుంది. ‘‘ఇప్పుడు మీరు మీ పాత గొప్పల్ని చెప్పుకుంటున్నారే... అప్పుడలా బతికాం అంటూ ఇప్పుడు మీ గత ప్రాభవం గురించి ప్రశంసించుకుంటున్నారు కదా. అలాంటిది ఇప్పుడు మాగురించి పరమ వాస్తవాలు మాట్లాడుకుంటుంటే మీరు గబుక్కున ‘పొగుడుకోవడం’ అనేశారు మేమెంత హర్టయ్యామో తెలుసా’’ అంది సెల్ఫోన్ నిష్ఠూరంగా. ‘‘మేం మోగితే తప్పనిసరిగా మమ్మల్ని ఎత్తుకునే వారు. కానీ మీరు మోగితే ఎదుటివాళ్ల కాల్ తాము తీసుకోనక్కర్లేదని తెలిస్తే ఠక్కున మీ పీక నొక్కేసున్నారు కదా. మాకు అలాంటి అగౌరవాలు ఉండేవి కావు తెలుసా’’ అంటూ మళ్లీ తన గొప్పతనాన్ని చాటుకుంది ల్యాండ్లైన్ ఫోన్. ‘‘నోర్మూసుకోండి. ఇంటర్నెట్తో అనుసంధానమై ఇంటర్నేషనల్ కాల్స్ కూడా అందిస్తున్న మేమెక్కడ. ఇప్పుడు ఇంటర్కమ్ స్థాయికి దిగిపోయిన మీరెక్కడ. ఏదో మా ఆవేదన వెలిబుచ్చుకోవాలనుకుంటే మధ్యన మీ బోడి గొప్పలేమిటి?’’ కోప్పడింది మొబైల్ఫోన్. ‘‘ఎంత అందరించిపోయినా డైనోసార్లు డైనోసార్లే... అందుకే ఎంతగా ప్రాచుర్యం పొందినా, ఎంతగా మీమీద మనషులు ఆధరపడ్డా మీరు మీరే. స్టేటస్ సింబల్లా మేము మేమే. తమ కుర్చీ కంటే ఎత్తై స్థానంలో పెట్టుకునే మేమెక్కడా... మగాళ్ల జేబుల్లోనూ, ఆడవాళ్ల హ్యాండ్బ్యాగుల్లోనూ తలదాచుకునే మీరెక్కడ’’ అంటూ ఈసడించింది ల్యాండ్లైన్ ఫోన్. ‘‘అంత మిడిసిపడ్డందుకే అంతరించిపోయి డైనోసార్లలా మిగిలారు’’ అంది మొబైల్. ‘‘డైనోసార్లో ‘సార్’ అనే మాట ఉంది. సెల్లు అనే మాట సొల్లులా ఉంది. అందుకే పరిమితంగా పనిచేసినామా కాలంలో మేమంటే ఎంతో గొప్ప. మంచి తివాచీ పరిచి మమ్మల్ని జాగ్రత్తగా పెట్టుకునేవారు. మీరు ఇన్నిన్ని పనులు చేస్తున్నా, డేటూ టైమూ క్యాలెండరూ కెమెరా ఉన్నా మీకు గౌరవం జీరో. పైగా ఏడాదికోసారి కొత్త మోడల్ రాగానే మిమ్మల్ని చెత్త అంటూ పారేస్తారు’’ అంది ల్యాండ్లైను ఫోన్. ‘‘చెత్త అయినా, తిట్టుకున్నా సరే... ఇప్పట్లో మేమే మనుషుల చేతి ఆభరణం. మహామహుల తల చుట్టూ చక్రం తిరుగుతున్నట్లుగా... ఫైల్ డౌన్లోడ్ అవుతున్నప్పుడు మాలోనూ అలాంటి చక్రమే తిరుగుతూ ఉంటుంది’’ అంది సెల్. ‘‘అదీ సంగతి. రహస్యం తెలిసిపోయింది. మీకు తలతిరుగుడు ఎక్కువనే సంగతి తెలిసే మనుషులు మీ సేవలు తీసుకుంటూనే మిమ్మల్ని లోకువ కడుతున్నారేమో. అందుకే చేతవెన్నముద్ద పద్యం టైప్లో కాకుండా వేమన మిమ్మల్ని చెప్పులో రాయి, చెవిలో జోరిగ టైప్ పద్యం చెబుతాడని మీరన్నది నిజమే’’ అంటూ ‘సెల్’విచ్చింది ల్యాండ్ఫోను. - యాసీన్ -
సెల్ఫోన్ గెలుచుకున్నారంటూ టోకరా!
♦ రూ.1500 చెల్లించి తీసుకున్న పార్సిల్లో నకిలీ వస్తువులు ♦- లబోదిబోమన్న బాధితుడు యాలాల: ‘మీ ఫోన్ నెంబరుకు లక్కీడ్రాలో ఆండ్రాయిడ్ సెల్ఫోన్ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు ఓ కూలీకి టోకరా వేశారు. వీపీపీలో రూ. 1500 చెల్లించి పార్శిల్ తీసుకొని చూడగా అందులో నకిలీ వస్తువులు ఉండడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. ఈ సంఘటన మండలంలోని దేవనూరు గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆంజేయులు స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఐదు రోజుల క్రితం 8143375757 నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీరు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబరు ద్వారా లక్కీడ్రాలో సామ్సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ గెలుచుకున్నారు.. మీ చిరునామా చెబితే పోస్టల్ ద్వారా సెల్ఫోన్ పంపిస్తాం’అని చెప్పారు. దీంతో సంబరపడిపోయిన ఆంజనేయులు తన చిరునామా చెప్పాడు. కాగా సోమవారం ఆంజనేయులు పేరిట తపాల కార్యాలయంలో శ్రీలక్ష ఎంటర్ప్రైజెస్, మంగళం క్వార్టర్స్, తిరుపతి పేరిట ఉన్న చిరునామాతో ఓ పార్శిల్ వచ్చింది. వీపీపీ ద్వారా వచ్చిన పార్సిల్ను ఆయన రూ.1500 చెల్లించి పోస్టుమాన్ నుంచి చెల్లించి తీసుకున్నాడు. వచ్చిన పార్సిల్ను తెరిచిచూడగా అందులో లక్ష్మీకృప ధన్యంత్ర పేరిట ఉన్న కవర్లో మెటల్ బొమ్మలు ఉన్నాయి. తను ఊహించిన సెల్ఫోన్ కాకుండా నకిలీ వస్తువులు కనిపించడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే తేరుకొని తనకు వచ్చిన ఫోన్నంబర్కు తిరిగి కాల్ చేశాడు. అయితే పొరపాటున పార్సిల్ వచ్చిందని ఓమారు.. మళ్లీ సంప్రదిస్తే సెల్ఫోన్ తిరిగి డెలివరీ చేస్తామంటూ అక్కడి వారు చెప్పారని బాధితుడు తెలిపాడు. -
రహస్యంగా నన్ను వీడియో తీశాడు
బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ మొబైల్ ఫోన్తో రహస్యంగా తనను వీడియో తీశాడని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఆటోలోపల పైభాగంలో రహస్యంగా మొబైల్ అమర్చాడని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కాగా తాను వీడియో తీయలేదని, కరెంట్ లేకపోవడంతో అంతకుముందు ప్రయాణికుడికి చిల్లర డబ్బు వెనక్కు ఇచ్చేందుకు మొబైల్ లైట్ వాడేందుకు దాన్ని పైభాగంలో పెట్టానని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఈ నెల 24 రాత్రి రిచ్మండ్ టౌన్ వద్ద సంబంధిత మహిళ ఉద్యోగిని ఆటోలో ఎక్కింది. కొంచెం దూరం వెళ్లాక ఆటోలోపలి పైభాగం నుంచి ఓ వస్తువు ఆమెపై పడింది. దాన్ని మొబైల్ ఫోన్ గా గుర్తించింది. ఆటోడ్రైవర్ తనను వీడియో తీసేందుకు మొబైల్ ఫోన్ను రహస్యంగా ఉంచాడని భావించింది. ఆమె వెంటనే ఆటో ఆపాలని డ్రైవర్కు సూచించింది. ఆటో దిగగానే మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న కుబ్బన్ పార్క్ పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని మొబైల్ ఫోన్లో ఎలాంటి వీడియోలు కనిపించలేదని, ఫోరెన్సిక్ నిపుణులకు మొబైల్ పంపినట్టు పోలీసులు చెప్పారు. సంబంధిత మహిళ ఫిర్యాదు కోసం ఎదురు చూస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమెకు చెప్పినట్టు తెలిపారు. -
సెల్ఫోన్లో మాట్లాడితే రూ.10వేల జరిమానా
కేకే.నగర్: తరగతి గదిలో సెల్ఫోన్లో మాట్లాడితే రూ.10వేలు జరిమానాగా విధించనున్నట్లు గిండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది.శాస్త్రీయ అభివృద్ధిలో ఒక భాగంగా భావించపడే సామాజిక మాధ్యమాలు యువతరాన్ని ముఖ్యంగా విద్యార్థులను తన కబంధ హస్తాలతో బందీలను చేస్తున్నాయని చేతిలో పాఠ్య పుస్తకాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా విద్యార్థుల వద్ద సెల్ఫోన్ ఉండాల్సిందే. సెల్ఫోన్కు దాసులైన విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అంతేకాక వారి చెడు మార్గాలను అనుసరిస్తున్నట్లు పలు సర్వేల్లో తెలిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడానికి చదువుకునే సమయంలో వారి ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు పాఠశాల, కళాశాల నిర్వాహకులు పలు రకాల నిబంధనలు విధించాయి. గిండి ఇంజినీరింగ్ కళాశాలలో తరగతి గదుల్లో సెల్ఫోన్లు ఉపయోగించరాదని, ఒక వేళ మాట్లాడితే వారికి రూ.10వేలు జరిమానా విధిస్తామని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల నుండి ఈ నిబంధనకు ఆదరణ లభించిందని అన్నారు. ఎవరైనా పట్టుబడి జరిమానా చెల్లించినట్లయితే ఆ సొమ్మును పేద విద్యార్థుల ఫీజులకు ఉపయోగిస్తామన్నారు. వారంలో రెండు రోజులు విద్యార్థులకు దీనిపై కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. -
ఇదీ సీసీ కెమెరా ‘క్రెడిట్’
చిక్కడపల్లి: సీసీ కెమెరా ఓ ఎన్నారై జీవితంలో వెలుగులు నింపింది... దీనికి సంబంధించిన వివరాలివీ... ఎల్బీనగర్ నాగోల్ శ్రీ సాయి రాఘవేంద్ర కాలనీకి చెందిన వీరారెడ్డి కుమార్తె శిరిష రెడ్డి(37) అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి విక్టోరియా కేఫ్ వద్ద ఉన్న వ స్త్ర దుకాణంలో జూన్ 22న షాపింగ్కు వెళ్లారు. అక్కడ కారు దిగుతున్నపుడు ఆమె సెల్ఫోన్తో పాటు అమెరికాకు చెందిన సోషల్ సర్వీస్ కార్డు , డెబిట్, క్రెడిట్ కార్డులతో ఉన్న పర్సు కింద పడిపోయింది. షాపింగ్ అనంతరం ఇంటికిచేరుకున్న ఆమె.. పర్సు లేకపోవ డాన్ని గుర్తించి చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో బాధితురాలి పర్సు దొరికిన వ్యక్తి క్రెడిట్ కార్డుతో ఓ దుకాణంలో సెల్ఫోన్ కొనుగోలుకు యత్నించాడు. వెంటనే శిరిషకు మెయిల్ రావడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిమాయత్ నగర్లో ఆ వ్యక్తి సెల్ఫోన్ కొనుగోలుకు యత్నించిన దుకాణానికి వెళ్లిన పోలీసులు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన బావ ఎల్లేష్కు పర్సు దొరకడంతో తనకు ఇచ్చాడని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు నిందితుని నుంచి పర్సు, వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితురాలికి అందజేశారు. సోషల్ సర్వీస్ కార్డు లభించకపోతే తాను మళ్లీ విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసే అవకాశం ఉండేది కాదని ఆమె చెప్పారు. తనకు సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాబీ, ఎస్ఐ నరేందర్తో పాటు క్రైమ్ సిబ్బందిని ఇన్స్పెక్టర్ మంత్రి సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఎస్.ఐ.పురేందర్రెడ్డి అభినందించారు. -
జిల్లా జైలులో ‘సెల్’ కలకలం
వార్డెన్ సస్పెండ్ బుక్కరాయసముద్రం : జిల్లా జైలులో మరోసారి సెల్ఫోన్ కలకలం రేగింది. ఓ ఖైదీ దగ్గర సెల్ఫోన్ దొరకడంతో ఓ వార్డెన్ను సస్పెండ్ చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా సూపరింటెండెంట్ తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లాకు చెందిన మంగళ శీను అలియాస్ శ్రీనివాసులు పలు దొంతనాలు, హత్యా నేరాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని మే-27న వైఎస్సార్ జిల్లా జైలు నుంచి అనంతపురం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాలో ఓ దొంగతనం కేసులో జిల్లా కోర్టుకు వాయిదాల కోసమే అతన్ని జిల్లాై జెల్లో ఉంచారు. అయితే ఈనెల 22న సదరు ఖైదీ సెల్ఫోన్లో మాట్లాడుతూ జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డికి పట్టుబడ్డాడు. సెల్ఫోన్పై ఆరా తీయ గా జిల్లా జైల్లో వార్డెన్గా పని చేస్తున్న హరినాథ్ ద్వారా సెల్ఫోన్ వాడుతున్నానని ఒప్పుకున్నాడు. అతనే డబ్బులకు కక్కుర్తిపడి సెల్ఫోన్ అందించి సహకరించాడని విచారణలో తేలింది. దీంతో వార్డెన్ హరినాథ్ను సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మంగళ శీను వైఎస్సార్ జిల్లా జైల్లో కూడా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. గతంలో కోర్టుకు తీసుకు వచ్చేటప్పుడు ఎస్కార్ట్ ను కూడా అవస్థలకు గురిచేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
నడిరోడ్డుపై మంటగలిసిన మానవత్వం
హసన్: నడిరోడ్డుపై మానవత్వం మంటగలిసింది. బస్టాప్ లో నిల్చున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేస్తున్నా ఒక్కరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు సరి కదా అందరూ వేడుక చూస్తూ తమ సెల్ ఫోన్ లో జరిగిన ఉదంతాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన హృదయ విదారక ఘటన కర్నాటక లోని హసన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న సాయంత్రం ధనుష్ అనే వ్యక్తి బెంగళూరుకు 185 కిలో మీటర్ల దూరంలోని హసన్ లోని బస్టాప్ సమీపంలో ఒక మహిళతో ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దుర్భాష లాడుతూ అతనిపై దాడి చేశారు. దీంతో ధనుష్ తన సోదరున్ని, ఇద్దరు స్నేహితులను సాయం చేయమని కేకలు వేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు దాదాపు 20 నిమిషాలు రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ దాడిలో ధనుష్ సోదరుడు సుదీప్ తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ఇంత జరుగుతున్నా ఒక్కరూ వారికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. .జరుగుతున్న ఉదంతాన్ని తమ చరవాణిలో చిత్రీకరించడానికే ప్రయత్రించారు. కేసును నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి రాహుల్ కుమార్ తెలిపారు. -
సెల్ఫోన్ కోసం చంపేశాడు..
వీడిన చిన్నారుల హత్య కేసు మిస్టరీ మృతులు అన్నదమ్ములు నిందితుడి అరెస్టు హయత్నగర్: కవాడిపల్లిలో గతనెల 18న జరిగిన ఇద్దరు చిన్నారుల హత్య కేసును హయత్నగర్ పోలీసులు ఛేదించారు. సెల్ఫోన్ కోసం ఓ యువకుడు ఉన్మాదిగా మారి ఇద్దరినీ బండరాయితో మోది హత్య చేసినట్టు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన రాంకుమార్గాందో అబ్ధుల్లాపూర్మెట్ సమీపంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద గుడిసెలు వేసుకొని ఉంటూ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఇతనికి ధరమ్రాజ్ రాంకుమార్ (10), మహేష్రాంకుమార్ (7) కొడుకులు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికే చెందిన బాగీరాం కుమారుడు సోహా న్కుమార్ఠాకూర్ (20) జీవనోపాధి కో సం నగరానికి వచ్చి రాంకుమార్ ఉండే ప్రాంతంలోనే గుడిసె వేసుకొని ఉంటున్నాడు. మద్యానికి బానిసైన సోహాన్ తాను పనిచేసే మేస్త్రీ వద్ద కూలీలకు ఇస్తానని చెప్పి రూ.4 వేలు తీసుకున్నాడు. వాటిలో రూ. వెయ్యి ఖర్చు చేశాడు. మిగ తా రూ.3 వేలు జేబులో పెట్టుకోగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో తన ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, చేతిలో డబ్బులు లేవు. అదే సమయంలో తన గుడిసె పక్కనే ఉండే రాంకుమార్ దంపతులు పనికి వెళ్లగా.. వారి కుమారులు ధరమ్రాజ్, మహేష్ లు సెల్ఫోన్తో ఆడుకుంటున్నారు. వారి చేతిలోని సెల్ఫోన్పై సోహాన్ దృష్టి పడింది. దానిని లాక్కొని అమ్ముకోవాలని భావించి వారి వెంట పరుగుతీశాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో బండరాయితో మోది చంపేసి, సెల్ఫోన్ లాక్కు ని పారిపోయాడు. అబ్ధుల్లాపూర్మెట్లో రూ.150కి ఫోన్ అమ్మి అక్కడే మద్యం తాగి ఉడాయించాడు. సాయంత్రం తిరి గి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపిం చకపోవడంతో గాలించగా.. గుడిసెలకు కొద్ది దూరంలో మృతదేహాలు కనిపిం చాయి. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన హయత్నగర్ పోలీసులు సోహా న్పై అనుమానంతో అతడి స్వగ్రామం తో పాటు పలుచోట్ల గాలించారు. అతడి ఆచూకీ కోసం ఫొటోలు, కరపత్రాలు ప్రచురించి రైల్వేస్టేషన్లు, బస్టాప్ల్లో అతి కించడంతో పాటు మీడియా ద్వారా ప్రచారం చేశారు. చివరకు గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిం దితుడిని అదుపులోకి తీసుకొని విచారిం చగా తానే చిన్నారులు ధరమ్రాజ్, మహేష్లను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులకు డీసీపీ రివార్డు అందించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ భాస్కర్గౌడ్, ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ సెల్ఫోన్ కొనివ్వలేదని..
పిఠాపురం(తూర్పుగోదావరి): సెల్ఫోన్ కొనడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం మాదాపురంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అప్పన్న(19) గత కొన్నిరోజులుగా సెల్ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా తల్లిని అడుగుతున్నాడు. అయితే, తన వద్ద డబ్బులు లేకపోవడంతో తల్లి ఇవ్వలేకపోయింది. తనకు కోరిన సెల్ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన అప్పన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. -
పెద్దాసుపత్రిలో దొంగలు!
► సెల్ఫోన్లు, బైక్లు, పర్సులు మాయం ► సీసీ కెమెరాలున్నా ఆగని చోరీలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్తున్నారా..? అయితే మీ వస్తువులు జాగ్రత్త. ఆసుపత్రిలో దొంగలు పడ్డారు. ఎప్పుడు ఏ వస్తువు మాయమవుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే రెండు నెలల కాలంలో 30కి పైగా చోరీలు జరిగాయి. వెలుగులోకి రానివి మరెన్నో..! కర్నూలు(హాస్పిటల్): పెద్దాసుపత్రిలో 40కి పైగా విభాగాలు ఉన్నాయి. ప్రతిరోజూ 2వేలకు పైగానే ఓపీ రోగులు కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, మహబూబ్నగర్, రాయచూరు జిల్లాల నుంచి చికిత్సకోసం వస్తారు. నిత్యం 1200 మంది రోగులు ఇన్పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. ప్రతి రోగికి ఒకరిద్దరు వెంట ఉండటం సహజం. ఈ లెక్కన రోజూ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు కలిపి 5 వేలకు పైగా ఉంటారు. వీ రితో పాటు వైద్యులు, వైద్యవిద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్యాలయ ఉద్యోగులు వెయ్యి మందికి పైగా ఉంటారు. 100 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. 2 నెలల్లో 30 దొంగతనాలు ఆసుపత్రిలో రెండు నెలల కాలంలో 30కి పైగా దొంగతనాలు జరిగాయి. అధికంగా సెల్ఫోన్లు, పర్సులు, హ్యాండ్బ్యాగ్లు, మోటార్బైక్లు మాయం చేస్తున్నారు. కొందరు ఆటో విడిభాగాలను సైతం వదిలిపెట్టడం లేదు. ఈ చోరీలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అందులో కొన్ని .. ►మార్చి 3న ఎంఎం-1లో సెల్ఫోన్ చోరీ, అదేరోజు పేయింగ్బ్లాక్లో మరో సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. ► మార్చి 4న ఎంఎం-1 వార్డు బయట నిలిపి ఉన్న బైక్ చోరీ ► మార్చి 9న మెయిన్ గేట్ వద్ద సెల్ఫోన్ ► మార్చి 16న ఆరోగ్యశ్రీ కార్యాలయం ఎదురుగా ఆటోలోని బ్యాటరీ చోరీ, అదేరోజు శుశ్రుతభవన్ వద్ద ఆటోలోని బ్యాటరీ ఎత్తుకెళ్లారు. ► మార్చి 26న ఎంఎస్-1 వద్ద బైక్ అపహరణ ► మార్చి 28న ఎంఎస్-1 వార్డులో సెల్ఫోన్ చోరీ ► ఏప్రిల్ 14న ఎంసీహెచ్ భవనం వద్ద సెల్ఫోన్ చోరీ, 15న క్యాజువాలిటీలో పర్సు, 27వ తేదీన అదే ప్రాంతంలో సెల్ఫోన్, 28వ తేదీన 24 గంటల ల్యాబ్లో సెల్ఫోన్ చోరీ అయ్యాయి. ► మే 14న గైనిక్ విభాగంలో సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలున్నా ఆగని చోరీలు ఆసుపత్రిలో అడుగడుగునా సీసీ కెమెరాలు 200లకు పైగా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రక్షణ వ్యవస్థ, చోరీలు అరికట్టేందుకు, అనుకోని సంఘటనలను గుర్తించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. అయినా, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆసుపత్రిలో పనిచేసే కొందరు సిబ్బందే అత్యాశతో చేతివాటాన్ని ప్రదర్శిస్తుండగా మరికొందరు పనిగట్టుకుని ఆసుపత్రిలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారు. క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్ సెల్ఫోన్ను ఓ స్టాఫ్నర్సు తస్కరించిన వైనం బయటపడింది. మొదట బుకాయించిన ఆమె పోలీసులు తగిన ఆధారాలు చూపించడంతో కిక్కురుమనకుండా సెల్ఫోన్ అందజేయాల్సి వచ్చింది. అలాగే గైనిక్విభాగంలో జూనియర్ వైద్యుడొకరు మహిళా వైద్యవిద్యార్థినిపై దాడి చేసిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డవడంతో అవి పోలీసులకు సాక్ష్యంగా మారాయి. ఆసుపత్రిలో అపరిచిత వ్యక్తులు ఎక్కువగా తిరుగుతున్నా ఏ ఒక్కరూ గుర్తించలేని పరిస్థితి. ప్రతి ఒక్కరినీ రోగిగానే, వారి సహాయకులుగానే చూడాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. కాగా చోరీ జరిగిన వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే దొంగలను వెంటనే పట్టుకునేందుకు వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు. -
సెల్ టవర్లో మంటలు.. జనం పరుగులు
- ఆందోళనతో జనం పరుగులు - విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం పుల్కల్(మెదక్): ఓ ప్రైవేటు సంస్ధకు చెందిన సెల్ టవర్ నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా టవర్ నుంచి మంటలు రావడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు పరుగులు తీశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన పుల్కల్లోని గ్రామీణ వికాస్ బ్యాంకుకు ఆనుకుని ఎయిర్టెల్ సంస్థకు చెందిన సెల్ఫోన్ టవర్ ఉంది. ఆదివారం మధ్యాహ్నం సెల్ఫోన్ టవర్కు చెందిన జనరేటర్ నుంచి మొదట్లో పొగలు వచ్చాయని స్థానికులు తెలిపారు.ఎండ వేడిమికి పొగలు వేడికి వస్తున్నాయని తాము భావించామని, కొద్దిసేపటికే పెద్దగా మంటలు లేచాయని స్థానికులు తెలిపారు. అప్పటికే సెల్టవర్ ఆవరణలో ఉన్న గ్యాస్ను భద్రపరచిన ప్రదేశంలో మంటలు లేవడంతో మరింత భయం పట్టుకుందని తెలిపారు. అనంతరం జోగిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కాని అంతలోపే సెల్టవర్కు చెందిన పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇప్పటికైనా అదికారులు జనవాసాల మధ్య ఉన్న సెల్ ఫోన్ టవర్లను గ్రామాలకు దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
యువతిని వీడియో తీస్తూ చిక్కాడు...
భాగ్యనగర్కాలనీ: ఆటోలో ప్రయాణిస్తున్న యువతిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడో యువకుడు. కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఎస్సై క్రాంతికుమార్ కథనం ప్రకారం... భాగ్యనగర్కాలనీకి వెళ్లేందుకు ఓ యువతి ఎల్లమ్మబండలో ఆటో ఎక్కింది. అదే ఆటో ఎక్కిన మెదక్ జిల్లాకు చెందిన వీరాస్వామి (25) తన సెల్ఫోన్ ద్వారా ఆమెను వీడియో తీయడం మొదలెట్టాడు. గమనించిన ఆటో డ్రైవర్ యువతికి విషయం చెప్పడంతో వీరాస్వామిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. -
కానూరులో కిడ్నాప్ కలకలం
విజయవాడ/ పెనమలూరు : కానూరులో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైందని, కిడ్నాపర్లు విజయవాడకే తీసుకొచ్చారని తెలుసుకున్న నగరవాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లేశ్వరి దంపతులు ప్రభుత్వోద్యోగులు. వారి కుమార్తె సహస్ర (6). శ్రీనివాసరెడ్డికి రాజేష్రెడ్డి అనే సోదరుడు ఉన్నాడు. రాజేష్ రెడ్డి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అతని ఆర్థిక అవసరాలకు శ్రీనివాసరెడ్డి డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఆస్తిని కూడా పంచకపోవడంతో అన్న కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. తన జల్సాలకు డబ్బు అవసరం కావడంతో సోదరుని కుమార్తె సహస్రను కిడ్నాప్ చేసేందుకు పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో విజయవాడ మురళీనగర్లోని వెంకటరమణ ఎన్క్లేవ్లో ఒక ఫ్లాట్ గత నెల 20న అద్దెకు తీసుకుని తన స్నేహితుడితో కలిసి అక్కడ ఉన్నాడు. స్నేహితుడి సహాయంతో కనిగిరిలో తన సోదరుడి ఇంటి వద్ద ఆడుకుంటున్న సహస్రను కిడ్నాప్ చేశాడు. స్థానికులు గుర్తించకుండా హెల్మెట్ పెట్టుకున్నట్లు సమాచారం. కనిగిరి నుంచి సహస్రను విజయవాడకు తీసుకొచ్చిన రాజేష్రెడ్డి రూ.50 లక్షలు కావాలంటూ స్నేహితుడితో సోదరుడికి ఫోన్ చేయించాడు. దీంతో అప్రమత్తమైన కనిగిరి పోలీసులు ఫోన్ నంబర్, సెల్టవర్ల ఆధారంగా గురువారం రాత్రి విజయవాడకు వచ్చి వెంకట రమణ ఎన్క్లేవ్లో సోదాలు చేశారు. అయితే నిందితులు ఇక్కడ లేరని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుడి స్నేహితుడు వాడిన సెల్ఫోన్ ఆధారంగా కనిగిరిలో అరెస్టు చేసినట్లు తెలిసింది. -
‘ఫోన్లు కావాలనే తెస్తున్నారా..?’
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లు సెల్ఫోన్ తీసుకురావద్దని చెబుతున్నా మారట్లేదు. ఫోన్ తీసుకొస్తే పరీక్ష విధుల నుంచి తప్పించడం మినహా మరే ఇతర శిక్ష లేదు. దీంతో విధుల నుంచి తప్పించుకునేందుకే కొందరు టీచర్లు ఫోన్లు తెస్తున్నట్లు సమాచారం. గురువారం జరిగిన ద్వితీయ భాష పరీక్ష సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఆరుగురు ఇన్విజిలేటర్లు దొరికిపోయారు. దీంతో వారిని పరీక్ష విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారితో సహా 13 మందిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఇక వరంగల్ జిల్లాలో ఒకరికి గుండెపోటు వచ్చినందున పరీక్ష విధుల నుంచి రిలీవ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మాల్ ప్రాక్టిస్ విషయంలో ఒక ఇన్విజిలేటర్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే 13 మంది విద్యార్థులపై మాల్ప్రాక్టీస్ కేసులను నమోదు చేశారు. -
సిన్మా చూపిస్తా
కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కానీ కాళ్లు తొక్కకుండా థియేటర్లోకి వెళ్లి సీట్లో కూచోలేం. ఒకవేళ మనం ఎవరి కాళ్లూ తొక్కకుండా జాగ్రత్త పడినా సరే, మన కాళ్లని ఎవరో ఒకరు తొక్కుడు బిళ్ల ఆడేస్తారు. ఒకసారి ఒకాయన సెల్ఫోన్ వెలుతురులో తారాడుతూ వచ్చి నేనే తన సీటనుకుని మీద కూర్చున్నాడు. గుండె గొంతుకలోకి వచ్చి కుయ్ మని సౌండొచ్చింది. దాంతో ఆయన నన్ను మనిషిగా గుర్తించి క్షమాపణలు చెప్పి పక్క సీట్లో కూచున్నాడు. తరువాత మళ్లీ మళ్లీ క్షమాపణలు చెబుతూ సినిమా చూడకుండా చేశాడు. మొదట్నుంచి సినిమా చూడ్డం కొందరికి ఇష్టం ఉండదు. సడన్గా లోపలికి వస్తే కళ్లు కనపబడవు. ఎబిసిడీలు, అంకెలు లెక్కపెట్టుకుంటూ, స్టెప్స్ వేస్తూ వచ్చి కూచుంటారు. కథ ఏమైనా జరిగిందా అని పక్క సీటర్ని అడుగుతారు. తెలుగు సినిమాల్లో కథ ఉంటుందని నమ్మే అమాయకులు ఇంకా ఉండడమే ఆశ్చర్యం! తిరుపతి థియేటర్లలో గేటు కీపర్లు ఉండరు. టికెట్ తీసుకుని లోనికెళితే సినిమా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఒక నీడ ప్రత్యక్షమౌతుంది. ఆ నీడ మనకు ఫుట్ మసాజ్ చేసుకుంటూ టికెట్లు అడుగుతుంది. ఒకసారి చీకట్లో కన్ఫ్యూజ్ అయి పార్కింగ్ టిక్కెట్ ఇచ్చాను. దాన్ని చించి సగం ముక్క చేతికిచ్చాడు. హైదారాబాద మాల్స్ లోని థియేటర్కెళితే మన పక్కన కూచున్నవాడు బకెట్లో పాప్కార్న్ తింటూ ఉంటాడు. మధ్యలో కోక్ తాగి, పేగుల్ని యాక్టివేట్ చేసి బ్రేవ్మంటాడు. సినిమాలో వినిపించే డిటిఎస్కి ఇది అదనం. పాత రోజుల్లో తాంబూలం పళ్లాలుండేవి. అలాంటి ట్రేలో కొందరు ఫ్రాంకీలు, బర్గర్లు.. ఇలా రకరకాల సామగ్రి తెచ్చుకుంటారు. సినిమాకి రంగు రుచి వాసన కల్పిస్తారు వీళ్లు. చిన్నప్పుడు సగం సినిమా చూసేవాణ్ణి. శుక్ర, శని, ఆదివారాల్లో హిందీ సినిమాలు మ్యాట్నీ షోగా వేసేవాళ్లు. నాలాంటి వాళ్ల సౌలభ్యం కోసం శుక్ర, శని వారాల్లో మధ్యాహ్నం డ్రిల్ క్లాస్ ఉండేది. అందరూ గ్రౌండ్లో డ్రిల్ చేస్తుంటే, పుస్తకాల సంచీ ఎవడో ఒకడి మెడకు తగిలించి, కౌబాయ్ సినిమాలో గుర్రంలాగా నాన్స్టాప్గా కిలోమీటర్ పరిగెత్తి థియేటర్ చేరుకునేవాణ్ణి. గేట్ కీపర్కి ఇరవై పైసలిస్తే నల్లటి పరదాలోంచి ప్రవేశం కల్పించేవాడు. లోపల అడుగుపెడితే ‘ఈ నగరానికి ఏమైంది?’ లెవెల్లో దట్టమైన బీడీల పొగ. దగ్గుకుంటూ వెళ్లి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేల మీద కూర్చున్న వాళ్ల అన్ని స్పేర్ పార్ట్లనీ తొక్కుతూ వెళ్లేవాణ్ణి. అక్షరమ్ముక్క హిందీ రాకపోయినా, చూస్తున్న సన్నివేశాల తలాతోక తెలియక పోయినా కళ్లింతలు చేసుకుని చూసేవాణ్ణి. చదవకపోయినా టెన్త్ హిందీ ఎగ్జామ్ పాస్ కావడానికి ఈ నాలెడ్జే కారణం. ఒకసారి రాజకోట సినిమాకెళితే రచ్చరచ్చయింది. రాయదుర్గంలో అజీజియా అనే టాకీస్ ఉంది. (ఈ అవశేషం ఇప్పటికీ ఉంది. అదే విశేషం). నేను, శేఖర్ అనే మిత్రుడు నలభై పైసల చెక్క బెంచీ క్లాస్కెళ్లాం. ఆ బెంచీల పైన నల్లుల ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి ఇద్దరం కిటీకీ పెకైక్కి కూచున్నాం. అక్కడో తేలు పిల్ల పొంచి ఉందని మాకు తెలియదు. అది దారి తప్పి మావాడి నిక్కర్లో ప్రవేశించి పిర్రని గిల్లింది. ఎన్టీఆర్ కొయ్యగుర్రంపై కళ్లెం లాగుతూ విలన్ని చేజ్ చేస్తూ ఉండగా, మావాడు కెవ్వున కేకేసి కిటికీలోంచి కింద ఉన్న బెంచర్స్ పైకి దూకాడు. తమ పైకి దూకిన ఆకారమేంటో తెలియక వాళ్లు హాహాకారాలు చేసి పరుగులు తీశారు. ఇంత జరిగినా ఆపరేటర్ సినిమా ఆపలేదు. సినిమా నచ్చి జనం అరుస్తున్నారని వాడు అనుకున్నాడు. ఇదే ఊళ్లో జయలక్ష్మి టాకీస్ అని ఒక టెంట్ ఉండేది. దీని యజమానికి ఒక రంపపు మిల్లు ఓనర్ అప్పుపడితే ఆ కొయ్యతో బెంచీలు కుర్చీలు చేయించాడు. వాటిని ఏం చేసుకోవాలో తెలియక టెంట్ సినిమాలో పెట్టాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని వీటి వల్ల మా నిక్కర్లు చిరిగేవి. ఏకుల్ని కూడా మేకులుగా మార్చగల కార్పెంటర్ వాటిని తయారు చేసుంటాడు. కూర్చోవడం వరకే మన వంతు. లేవడం మన వల్ల కాదు. బలవంతంగా లేస్తే పర్రుమని సౌండ్. ఈ టెంట్ ప్రత్యేకత ఏమంటే కొత్త సినిమాలు వచ్చినప్పుడు దీన్ని వెడ ల్పు చేసేవాళ్లు. ఇప్పుడు సకల సౌకర్యాలతో సినిమా చూస్తున్నా సంతోషం లేదు. అమాయకత్వాన్ని మించిన ఆనందం లేదు. వయసు పెరిగే కొద్దీ మనలోకి మాయ ప్రవేశిస్తుంది. మాయలో చిక్కుకుని నవ్వడం మరిచిపోతాం. - జి.ఆర్. మహర్షి -
సెల్ఫోన్ ద్వారా రవాణా శాఖ సేవలు
* రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి * త్వరలో ఎం-వ్యాలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ సేవలను సెల్ఫోన్ ద్వారా అందించి ప్రజలకు మరింత చేరువ చేయబోతున్నామని ఆ శాఖ మంత్రి మహేందర్రెడ్డి చెప్పారు. ఇందుకోసం ‘ఎం-వాలెట్’ విధానాన్ని రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. బుధవారం రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ, కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా, జేటీసీలు వెంకటేశ్వర్లు, పాండురంగనాయక్, రఘునాథ్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లెసైన్సులు, ఆర్సీ, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ, బీమా... తదితర ఎన్నో సేవలను ఎం-వ్యాలెట్ ద్వారా అందించనున్నట్టు తెలిపారు. త్వరలో దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. రవాణాశాఖ కార్యాలయాలను ఈ-కార్యాలయాలుగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,125.5 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ. 1,925 కోట్లు సాధించామన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శాఖ పనితీరు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. త్వరలో అన్ని కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరుస్తామని, ఈ విషయంలో కొన్ని జిల్లాల డీటీసీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోని కొన్ని చెక్పోస్టుల పనితీరు సరిగా లేదని ఆక్షేపించారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఓవర్లోడ్, ఫిట్నెస్ లేని వాహనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్పారు. హెల్మెట్ ధారణపై వాహనదారుల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాకు నిధులు నల్లగొండ జిల్లాకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయ భవనం, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, సూర్యాపేటలో ఎంవీఐ యూనిట్ కార్యాలయ భవనం, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ నిర్మాణానికి రూ.4.56 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి నల్లగొండ జిల్లా డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
బాబోయ్.. మాటగాళ్లు
వర్గల్: సెల్ఫోన్ ద్వారా ఆ యువకునితో మాటలు కలిపారు. కారు చవకకే ఖరీదైన సెల్ఫోన్ అంటూ ముగ్గులో దింపారు. మాటల గారడీతో నమ్మించారు. పోస్టులో పార్సిల్ ద్వారా ఫోన్ పంపుతున్నాం..డబ్బులు కట్టి విడిపించుకో అని సూచించారు. తీరా పార్సిల్ విప్పితే అందులో ఫోన్ లేదు..పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ గొలుసు, లాకెట్ తప్ప.. ఈ మోసపూరిత సంఘటన శనివారం వర్గల్ మండల కేంద్రంలో వెలుగు చూసింది. బాధితుడు వర్గల్కు చెందిన కిష్టనోల్ల షాదుల్లా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం షాదుల్లా సెల్ఫోన్కు హెచ్టీసీ కంపెనీ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారు. తమ కంపెనీకి చెందిన రూ.12,500 విలువైన సెల్ఫోన్ను లాటరీ ద్వారా నీకు రూ. 3,500 లకే లభిస్తుందని చెప్పారు. మాటల గారడీతో అతనిలో ఆశలు కలిగించారు. ఆ వ్యక్తులు పోస్టు ద్వారా సెల్ఫోన్ను పార్సిల్గా పంపుతామని అడ్రసు తీసుకున్నారు. పార్సిల్ రాగానే రూ. 3,500 చెల్లించి విడిపించుకోవాలని సూచించారు. ఈ మేరకు షాదుల్లా పేరిట ఓ పార్సిల్ వచ్చింది. వర్గల్ పోస్టాఫీసుకు శుక్రవారం వెల్లిన షాదుల్లా డబ్బు కట్టేసి పార్సిల్ను అక్కడే తెరచి చూశాడు. ఖరీదైన ఫోన్కు బదులు అందులో నుంచి పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ లాకెట్, గొలుసు బయటపడ్డాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు శనివారం గౌరారం పోలీసులకు బాధితుడు షాదుల్లా ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ మోసగాళ్లే కాదు..మాటగాళ్లూ ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త. -
కొడుకు పుట్టాక భార్యను నీవెవరు అన్నాడు..
కొడుకుతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు అమీర్పేట: సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వచ్చిన యువతికి కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. పెళ్లి కాలేదని నమ్మించి గుడిలో వివాహం చేసుకున్నాడు. కొడుకు పుట్టాక ఇంటికి రావడం మానేశాడు. ఎందుకు రావడంలేదని అడగడానికి పోలీస్స్టేషన్కు వెళ్లిన భార్యను నీవెవరో నాకు తెలియదని కానిస్టేబుల్ అనడంతో ఆ యువతి కొడుకుతో పాటు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యుత్నించింది. గురువారం సంజీవరెడ్డినగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్జిల్లాకు చెందిన నిరోష 2014లో నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లోని హోస్టల్లో ఉండేది. గదిలో సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు ఎస్సార్నగర్ స్టేషన్కు వెళ్లిన ఆమెకు అక్కడ కానిస్టేబుల్ రాజారాం పరిచయం అయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను వలలో వేసుకున్నాడు. ప్రేమ వివాహానికి తన కుటుంబసభ్యులు అంగీకరించరని చెప్పి సాంఘీ ఆలయానికి తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. యూసుఫ్గూడలో ఆమెతో కాపురం పెట్టాడు. కొడుకు పుట్టాక ఇంటికి సరిగా రాకపోవటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా రాజారాంకు అంతకు ముందే పెళ్లైందని తెలిసింది. ఏడాది వయసు కొడుకు ఉండటంతో రాజారాంతోనే కలిసి ఉండాలని నిరోష నిర్ణయించుకుంది. వారం రోజులుగా భర్త రాజారాం పూర్తిగా ఇంటికి రావడం మానేయడంతో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడంలేదు. దీంతో గురువారం ఉదయం ఆమె నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి ఇంటికి ఎందుకు రావడంలేదని ప్రశ్నించగా... రాజారాం అసభ్యంగా మాట్లాడాడు. నీవెవరో నాకు తెలియదు. నీతో నాకు సంబంధం లేదన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన నిరోష కొడుకును తీసుకుని నేరుగా ప్రకృతి చికిత్సాలయం రైల్వేస్టేషన్కు వచ్చి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యుత్నించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా వచ్చి ఆమెకు నచ్చచెప్పి ఠాణాకు తరలించారు. విచారణలో ఆమె ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుందని తెలియడంతో ఆమెను ఆ స్టేషన్లో ఫిర్యాదు చేయమని పంపించామని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. కాగా.. రాజారాం తన ఇద్దరు భార్యలను కొంత కాలంగా ఒకే చోట ఉంచినట్లు తెలిసింది. కుటుంబ పోషణ కోసం ప్రతినెలా రాజారాం రెండో భార్యకు కొంత డబ్బు ఇచ్చేవాడని, అవి సరిపోక పోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, గతంతో రాజారాంపై వరంగల్జిల్లా మర్రిపాడు పోలీస్స్టేషన్లో కేసు పెట్టగా కౌన్సెలింగ్ చేసినట్లు తెలిసింది. -
సెల్ చార్జింగ్తో జర భద్రం
నాణ్యమైన చార్జర్లను వాడండి పిల్లలకు అందుబాటులో ఉంచకండి శ్రీనివాస్ ఒక సేల్స్ ఎక్సిక్యూటివ్. ఉద్యోగంలో భాగంగా సెల్ఫోన్లో నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఒక రోజు శ్రీనివాస్ సెల్ ఛార్జింగ్లో పెట్టి స్నానానికని వెళ్లాడు. స్నానం చేస్తుండగా సెల్ మోగింది. దీంతో అతను తడితోనే బయటకు వచ్చి చార్జింగ్లో ఉన్న సెల్ను పట్టుకుని మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు తక్షణం హాస్పటల్కు తీసుకువెళ్లారు. అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ తగు జాగ్రత్తలు పాటించాలనే స్ప ృహ చాలా మందిలో ఉండదు. అల్లిపురం : సెల్ఫోన్ లేనిదే నేడు ఎవరికీ రోజు గడవదు. 24 గంటలు సెల్ఫోన్ను అంటిపెట్టుకుని ఉంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క కాలకృత్యాల సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో సెల్ చేతిలో ఉండాల్సిందే. దీంతో సెల్ ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి సమయం కూడా కేటాయించలేక పోతున్నారు. దీంతో సెల్ ఛార్జింగ్లో ఉండగానే మాట్లాడుతుంటారు...ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? నకిలీల వల్లే ప్రమాదాలు.. నకిలీ చార్జర్ల వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు గానూ నకిలీ, నాణ్యత లేని వస్తువులు కొనకపోవడమే మంచిదని, కాస్త ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు కొనడం వల్ల సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. సెల్ఫోను, ల్యాప్టాప్, ట్యాబ్ల వంటి గాడ్జెట్స్ను అతి సున్నితమైన పరికరాలతో తయారు చేస్తారు. వీటిలో వివిధ రకాల మెటల్స్తో కలగలిపి ఉంటాయి. వాటి చార్జింగ్కు 5 ఓల్టులు విద్యుత్ సరిపోతుందని ఆ పరికరాల చార్జర్లు, గాడ్జెట్లపై సంబంధిత కంపెనీలు ముద్రించి ఉంచుతాయి. సాధారణంగా ఇళ్ళలోను, కార్యాలయాల్లోను 220 ఓల్టులు వస్తుంటుంది. మన ఇళ్ళలో ప్లగ్ల నుంచి వచ్చే 220 ఓల్టులు విద్యుత్ను చార్జర్లు 5 ఓల్టులుకు తగ్గించి పంపుతాయి. దీంతో గాడ్జెట్లు చార్జింగ్ అవుతుంటాయి. ఒక్కోసారి చార్జర్లో సాంకేతిక లోపాలు కలిగినపుడు 5 ఓల్టులకు బదులు 220 ఓల్టులు విద్యుత్ గాడ్జెట్లకు సరఫరా అవుతుంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తడి కాళ్ళు, చేతులతో వాటిని ముట్టుకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►గాడ్జెట్లకు సంబంధించిన కంపెనీ చార్జర్లు పోయినపుడు నాణ్యమైన విడి చార్జర్లు మాత్రమే కొనుక్కోవాలి. ►చార్జరు వైర్లు తెగిన సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని తెగిన చోట ఇన్సులేషన్ టేపుతో అతికించాలి. లేదా నాణ్యమైన చార్జర్ కొనుక్కోవడం మంచిది. ►సెల్ఫోను చార్జర్ల నుంచి ఎటువంటి ద్రవాలు, పౌడర్లు వంటివి బయటకు పొక్కినట్లు కనిపిస్తే వాటిని విడిచిపెట్టడం ఉత్తమం. ►ఇంట్లో పాకే పిల్లలు ఉన్నట్లయితే చార్జర్లు వారికి దూరంగా ఉంచడంగాని, వారికి అందనంత ఎత్తులో ఉంచడం మంచిది. లేకుంటే వారు పాక్కుంటూ వెళ్లి చార్జర్ నోట్లో పెట్టుకుంటే ప్రమాదాలు సంభవించే వీలుంది. ►ఛార్జింగ్లో ఉన్న సెల్ఫోన్లు పిల్లల చేతికి అందకుండా ఉంచాలి. పెద్దలు కూడా ఛార్జింగ్లో ఉన్న గాడ్జెట్స్ను తాకకుండా ఉండడమే ఉత్తమం. ►నాణ్యత లేని చార్జర్లు వినియోగించడం వల్ల ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. లేదా షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ►ముఖ్యంగా రాత్రి పూట పడుకునే సమయంలో సెల్ఫోన్లు చార్జింగ్లో పెట్టి తలకింద పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. దీనివల్ల నిద్రలో వాటిపై ఒత్తిడి పెరిగి ఛార్జర్, చార్జర్ పిన్ విరిగిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ వేడెక్కి పోయి పేలిపోయే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో చార్జింగ్లో పెట్టుకోకపోవడమే మంచిది. పడుకునే వరకు చార్జింగ్లో ఉంచి పడుకున్న తరువాత వాటిని ఆఫ్ చేసి పెట్టుకోవడం ఉత్తమం. -
సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి ఇద్దరు మృతి
దోమ/కౌడిపల్లి: సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతూ వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా దోమ మండలం దాదాపూర్ తండాకు చెందిన సభావత్ రాజు(32), మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ పంచాయతీ గౌరారానికి చెందిన వడిత్య వెంకట్నాయక్(42)లు బుధవారం సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. -
నటి సెల్ ఫోన్ కొట్టేశారు..
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ అర్షి ఖాన్ మొబైల్ ఫోన్ను ఇద్దరు దుండగులు చోరీ చేశారు. ఆమె ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఆగంతకులు ఫోన్ను లాక్కొని వెళ్లారు. సబర్బన్ మలాడ్లోని ఇన్ఫినిటీ మాల్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. చోరీకి గురైన సెల్ ఫోన్ ఖరీదు దాదాపు రూ.55000 ఉంటుందని అర్షి ఖాన్ మేనేజర్ రాజేశ్ సింగ్ తెలిపారు. చోరీపై ఆమె బాన్గుర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో తనకు శారీరక సంబంధం ఉందని ఆర్షిఖాన్.. సెప్టెంబర్ లో తన ట్విటర్ పేజీలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. 'ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపా. ఎవరితోనైనా ఏకాంతంగా గడపాలంటే ఇండియా మీడియా పర్మిషన్ కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం' అంటూ సంచలన ట్వీట్ చేసి అప్పట్లో ఆమె వార్తల్లో నిలిచారు. -
సెల్పోయిందా.. గుర్తించండిలా..
విజయనగరం: సెల్ఫోన్.. ప్రతి ఒక్కరికీ రోజువారీ కార్యకలాపాల్లో భాగమైపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లు కనిపించడం సర్వసాధారణమైపోయింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ఫోన్ చోరీకి గురవడమో లేదా పోవడమో జరుగుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు అడ్వాన్స్ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ రకమైన సాఫ్ట్వేర్ ఉంటే మన ఫోన్ ఎక్కడున్నా మనం ఇట్టే పట్టుకోవచ్చు. పోయిన ఫోన్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? దాని కోసం ఏం చేయాలి..? ఐఎంఈఐ నంబర్ తప్పనిసరి... * మీ సెల్ఫోన్కు ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫయర్ నంబర్) ఉండాలి. * మీరు సెల్ఫోన్ కొనుగోలు చేసినప్పుడు బిల్పై ఈ నంబర్ కచ్చితంగా ఉంటుంది. ఉండేలా చూసుకోవాలి. * అదే లేకపోతే మీ ఫోన్ నుంచి స్టార్ యాప్ 06 యాష్ను డయల్ చేస్తే స్క్రీన్పై మీ ఐఎంఈఐ నంబర్ కనిపిస్తుంది. * దీని ఆధారంగా నెట్లోని కొన్ని సైట్లు పోయిన మీ ఫోన్ వివరాలు అందిస్తాయి. మొబైల్ థెఫ్ట్ యాప్స్ * ఇంటర్నెట్లో చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. * వీటిని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. * ఇక్కడ కూడా మీరు ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ ఇవ్వాలి * దొంగతనానికి గురైన ఫోన్లో సిమ్ వేసి వాడుతుంటే మీరు రిజిస్టర్ చేసిన సమయంలో ఇచ్చిన నంబర్కు చోరీ అయిన ఫోన్ నంబర్, ప్రాంతం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. వెబ్సైట్లు : http://www.trackimel.co.in/ http:www.lookout.com/ https://www.avst.com/enin/freemobilsecurity https://play.google.com/store/apps/details?idmobile https://theftspy.com/ పైన పేర్కొన్న వెబ్లు మాత్రమే కాకుండా ఇంకా అనేకం ఈ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని పే బిల్ సర్వీసులు ఉన్నాయి. సంబంధిత సైటుల్లో మీ ఫోన్ నంబర్ నమోదు చేసుకుని మీ వ్యక్తిగత వివరాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్ నంబర్ పొందుపరచాలి. పోయిన మీ ఫోన్ వాడుకలో ఉంటే వెంటనే మీకు సమాచారం వస్తుంది. అంతకుముందే పోయిన మీ ఫోన్ ఐఎంఈఐ నంబర్తో పోలీసు కంప్లయింట్ ఇవ్వాలి. మీకు వచ్చిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే మీ ఫోన్ను తిరిగి పట్టుకోవచ్చు. -
మొబైల్ బుక్ చేస్తే.. ఐరన్ లాకెట్ వచ్చింది
గుత్తి: మంచి ఆఫర్ వచ్చిందని సంబరపడ్డాడు. వెంటనే ఆన్లైన్లో సెల్ఫోన్ బుక్ చేశాడు. తీరా పోస్టులో సెల్ఫోన్కు బదులు ఐరన్ లాకెట్ రావడంతో అవాక్కయ్యాడు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెండావీధికి చెందిన మహ్మద్ హుసేన్ అలియాస్ డాన్స్ గోరాకు ఈనెల 23న ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో తాము ఢిల్లీ ప్రథమరత్న ఆస్ట్రాలాజికల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని సామ్సంగ్ గ్రాండ్ మొబైల్ భారీ ఆఫర్ ఉందన్నారు. మొబైల్ అసలు రేటు రూ.8,400 అని అయితే ఆఫర్ డిస్కౌంట్ పోను కేవలం రూ.3,000కే ఇస్తామని చెప్పారు. ఇప్పుడే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని పోస్టులో వచ్చాక పోస్టల్ అధికారులకే బిల్లు (డబ్బు) చెల్లించాలని చెప్పా రు. ఆశపడిన గోరా క్షణం కూడా ఆలోచించకుండా మొబైల్ను బుక్ చేశాడు. సోమవారం పోస్టల్ అధికారులు మీకు పార్సిల్ వచ్చిందని తీసుకెళ్లాలని గోరాకు ఫోన్ చేశారు. గోరా పోస్టాఫీసులో రూ.3 వేలు చెల్లించి పార్సిల్ బాక్స్ను తీసుకున్నాడు. అక్కడే బాక్స్ను ఓపెన్ చేసి చూడగా ఐరన్ లాకెట్ ఉంది. ఒక్క సారిగా తెల్లమొఖం వేసిన గోరా తనకు వచ్చిన సెల్ఫోన్ నంబర్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్లో ఉంది. -
అమ్మాయిలు 10.. అబ్బాయిలు 8..!
న్యూయార్క్: కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారట. రోజుకు సరాసరిన అమ్మాయిలు 10 గంటల పాటు సెల్ఫోన్ వాడితే.. అబ్బాయిలు 8 గంటలు ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఓ యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టెక్సాస్లోని బేలర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స రాబర్ట్స్ బృందం కాలేజీ విద్యార్థులు సెల్ఫోన్ల వాడుక అంశంపై పరిశోధన చేశారు. రాబర్ట్స్ బృందం ఆన్లైన్ ద్వారా ఈ సర్వే చేసింది. సెల్ఫోన్లకు బానిసలయ్యామని 60 శాతం మంది విద్యార్థులు అంగీకరించారని చెప్పారు. సెల్ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. సెల్ఫోన్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్తో ఎక్కువ సమయం గడుపుతుంటారని తెలిపారు. అబ్బాయిలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం సెల్ఫోన్లు వాడుతారని, అమ్మాయిలు సామాజిక విషయాల కోసం ఉపయోగిస్తారని రాబర్ట్స్ వెల్లడించారు. -
సెల్ఫోన్ మాట్లాడుతూ వంట.. తెచ్చిన తంట
బంజారాహిల్స్: సెల్ఫోన్ మాట్లాడుతూనే వంట చేస్తుండగా మంటలంటుకొని ఓ యువతి తీవ్రగాయాలైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని కమాన్లో ఉన్న సయ్యద్ నగర్ అహ్మద్నగర్లో నివసించే కతీజా బేగం(17) శుక్రవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ఫోన్ వచ్చింది. సెల్ఫోన్ మాట్లాడుతూనే వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు ఆమె దుస్తులకు అంటుకున్నాయి. ఫోన్ మాట్లాడటంలో నిమగ్నమైన ఆమె కొద్దిసేపటి వరకు ప్రమాదాన్ని గమనించలేదు. తేరుకునేసరికి ఒళ్లంతా మంటలు వ్యాపించి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలు ఆర్పి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తండ్రి షేక్ జమీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థి ప్రాణం తీసిన సెల్ఫోన్
- దొంగతనం అపవాదు భరించలేక హాస్టల్పై నుంచి దూకిన విద్యార్థి - ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్: సెల్ఫోన్ దొంగిలించాడనే నింద భరించలేక హాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదఘటన నగరంలోని ముషీరాబాద్లోని ఆర్యవైశ్య విద్యార్థి వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో సిమెంట్ దుకాణం నిర్వహించే దేవేందర్ కుమారుడు ఎల్.హరీష్ (20) ఇంటర్ చది వాడు. సీఏ కోర్సు శిక్షణ నిమిత్తం వారం క్రితం నగరానికి వచ్చాడు. ముషీరాబాద్లోని ఆర్యవైశ్య విద్యార్థి వసతి గృహంలో 305 నంబర్ గదిలో ఉంటూ ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ గదిలో హరీష్తో పాటు సాయి అన్వేష్, శైలేష్ ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున అన్వేష్ 4.30 గంటలకు లేచి చూడగా తన సెల్ కనిపించలేదు. దీంతో మిగతా ఇద్దర్నీ లేపి అడగ్గా వారి సెల్ఫోన్లూ కనిపించలేదు. ఉదయం 8.30 గంటలకు విధులకు వచ్చిన వార్డెన్ అరుణాచల్ శర్మ విద్యార్థులందరి బ్యాగులు వెతగ్గా ఓ బ్యాగ్లో 2 సెల్ఫోన్లు దొరికాయి. హరీషే ఫోన్లు దొంగిలించాడని వార్డెన్ ఆరోపించడంతో అతను మనస్తాపానికి గురయ్యా డు. హుటాహుటిన లిఫ్ట్లో 3వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకేశాడు. తలకు బలమైన గాయమైంది. తోటి విద్యార్థులు సమీపంలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. కాసేపటికే హరీష్ మృతి చెందాడు. ముషీరాబాద్ ఎస్సై భాస్కర్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్లో ‘హైదరాబాద్ మెట్రో బస్’
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఆధారిత సేవలపై గ్రేటర్ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. నగరంలోని బస్సుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘హైదరాబాద్ మెట్రో బస్’ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించింది. వారం, పది రోజుల్లో ఈ సరికొత్త మొబైల్ అప్లికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు స్మార్ట్ఫోన్ల ద్వారా సిటీబస్సుల సమాచారాన్ని పొందవచ్చు. జీపీఎస్ వైఫల్యాలను అధిగమించి, సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ... అందులో భాగంగానే మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. దీని ద్వారా నగర ప్రయాణికులే కాకుండా కొత్తగా వచ్చేవారు, పర్యాటకులు, సందర్శకులు గైడ్స్ సాయం లేకుండా సిటీబస్సుల రాకపోకలపై సులువుగా సమాచారాన్ని పొందవచ్చు. ఎన్ని బస్సులు, ఏయే రూట్లు, ఏయే వేళల్లో అందుబాటులో ఉన్నాయనే వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 1287 ఏసీ, మెట్రోడీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్లగ్జరీ బస్సులకు సంబంధించి యాప్ సేవలు అందుతాయి. దశల వారీగా ఆర్డినరీ బస్సులకు విస్తరిస్తారు. ఈ సేవలు ఇక సులువు * ‘హైదరాబాద్ మెట్రో బస్’ యాప్లో ‘రూట్ సెర్చ్’ ద్వారా రూట్ సమాచారం తెలుస్తుంది. ఉదాహరణకు రూట్ నెంబర్ ’86’ను సెర్చ్ చేస్తే సికింద్రాబాద్-కోఠి, సికింద్రాబాద్-అఫ్జల్గంజ్కు రూట్లలో నడిచే బస్సుల్లో ఏది ఎక్కడ ఉందో తెలుస్తుంది. *‘ఫైండ్ బస్టాప్’ ద్వారా పర్యాటకులు, నగరానికి కొత్తగా వచ్చేవారు తాము ఉన్న చోటుకు సమీపంలో ఉన్న బస్ స్టాపులు తెలుసుకోవచ్చు. ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న స్టాపుల వివరాలు మ్యాప్తో సహా డిస్ప్లే అవుతాయి. ఉదాహరణకు ఆర్టీసీ క్రాస్రోడ్స్ నుంచి చిక్కడపల్లి, అశోక్నగర్, ముషీరాబాద్ రూట్లలో ఉన్న బస్ స్టాపుల వివరాలు తెలుసుకోవచ్చు. * ప్రస్తుతం సిటీ బస్సులకే పరిమితమైన యాప్ సేవలను దూరప్రాంత బస్సుల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం మరో మొబైల్ యాప్ను రూపొందించనున్నారు. మొదట ‘హైదరాబాద్-కరీంనగర్’, హైదరాబాద్-బెంగళూరు సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి మిగతా బస్సులకు విస్తరిస్తారు. -
వ్యాపారమంతా అరచేతిలోనే!
♦ దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎం-కామర్స్ ♦ భవిష్యత్తులో వ్యాపార లావాదేవీలన్నీ సెల్ఫోన్లలోనే.. ♦ అందుకే ఈ-కామర్స్ సంస్థల సేవలు ఎం-కామర్స్కు బదిలీ ♦ గతంలో మింత్ర.. సెప్టెంబర్ నుంచి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ బంద్ ♦ 2018 నాటికి రూ.40 లక్షల కోట్లకు ఎం-కామర్స్ వ్యాపారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అయితే మాట్లాడటం. లేదంటే మెసేజ్లతో చాటింగ్ చేయటం. పదేళ్ల కిందటి వరకూ సెల్ఫోన్తో ఉపయోగమంటే ఇదే. కానీ అప్లికేషన్స్ను వినియోగించడానికి వీలయ్యే స్మార్ట్ ఫోన్లు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడైతే అరచేతిలో ఇమిడిపోయే ఈ మొబైల్ ఫోన్లు ఏకంగా వ్యాపార సామ్రాజ్యాలనే శాసిస్తున్నాయి. పెద్దపెద్ద రిటైల్ దిగ్గజాలకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. పరిస్థితి ఇపుడు ఏ స్థాయికి చేరిందంటే... ఈ-కామర్స్ అగ్రగామి సంస్థలైన మింత్ర, ఫ్లిప్కార్ట్ వంటివి తమ ఈ-కామర్స్ వెబ్సైట్లను మూసేసి.. కేవలం ఎం-కామర్స్ (మొబైల్ కామర్స్) ద్వారానే వ్యాపారం నిర్వహించాలనుకునే స్థాయికి!!. మింత్ర ఇప్పటికే ఈ పని చేయగా... ఫ్లిప్ కార్ట్ సైతం రెండు నెలల్లో మొబైల్కు మాత్రమే పరిమితం కాబోతోంది. 2018 నాటికి మొబైల్ కామర్స్ పరిమాణం రూ.40 లక్షల కోట్లకు (638 బిలియన్ డాలర్లు) చేరుతుందని అసోచామ్-డెలాయిట్ నివేదిక తెలిపిందంటే వృద్ధి ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో 23.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఇంటర్నెట్ను డెస్క్టాప్, ల్యాప్టాప్ నుంచి కాక మొబైల్ ఫోన్ల ద్వారానే వినియోగిస్తున్నారు. ఎం-కామర్స్ వృద్ధి ఈ స్థాయిలో ఉండటం, కంపెనీలు కూడా దీనిపైనే దృష్టి పెడుతుండటం గురించి మై స్మార్ట్ప్రైస్ సంస్థ సీఈఓ సీతాకాంత రాయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘ఎం-కామర్స్ అప్లికేషన్ల ద్వారా మెట్రోలకే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపారాన్ని సులువుగా విస్తరించవచ్చు. ఏ ఉత్పత్తిని విడుదల చేసినా ఒకే రోజు అన్ని ప్రాంతాలకూ చేరుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. తమ మొత్తం వ్యాపారంలో 35-40% వాటా మొబైల్స్ నుంచే వస్తున్నట్లు తెలిపారు. అయితే డెస్క్టాప్తో పోల్చుకుంటే సెల్ఫోన్ల డిస్ప్లే చిన్నదిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో ఎం-కామర్స్ విస్తరించటం లేదని అభిప్రాయపడ్డారు. ఎం-కామర్స్ వృద్ధికి స్మార్ట్ఫోన్లే బూస్ట్.. ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా ఫీచర్ ఫోన్లకు బదులు స్మార్ట్ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ట్యాబ్లెట్స్, డెస్క్టాప్లతో పోల్చుకుంటే స్మార్ట్ఫోన్ల ధరలు తక్కువగా ఉండటం. మెమొరీ ఎక్కువగా ఉండటం, బ్రౌజింగ్ సులువుగా చేసే వీలుండటం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. సెల్ఫోన్ల ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడైనా కొనుగోలు చేసే అవకాశం ఉండటమే ఎం-కామర్స్ మార్కెట్ వృద్ధికి కారణమనేది ఎవరూ కాదనలేని నిజం. దీంతో చాలా వరకు ఈ-కామర్స్, ఈ-రిటైల్ కంపెనీలు మొబైల్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా తమ వ్యాపార సేవలను అందించేందుకు ఇష్టపడుతున్నాయి. అయితే ఎం-కామర్స్ సంస్థలు వినియోగదారుల విశ్వాసం పొందడం, లావాదేవీల్లో పారదర్శకత, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, భద్రతా ప్రమాణాలు పాటించటం వంటి అంశాల్లో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందనేది నిపుణుల అభిప్రాయం. మింత్ర, ఫ్లిప్కార్ట్ బాటలోనే మరిన్ని కంపెనీలు! ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కేవలం మొబైల్ యాప్ ద్వారానే సేవలు అందించనున్నట్లు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. తన మొత్తం వ్యాపారంలో 70-75 శాతం లావాదేవీలు మొబైల్ ద్వారానే జరుగుతున్నందున మొబైల్ యాప్కే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోనీ తెలిపారు. ఇప్పటికే ఫ్లిప్కార్ట్కు చెందిన మింత్ర.కామ్ కేవలం మొబైల్ ఫోన్ల ద్వారానే క్రయ, విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఫ్లిప్కార్ట్ కూడా చేరుతోంది. సమీప భవిష్యత్తులో ఈ జాబితాలోకి అమెజాన్, క్వికర్, స్నాప్డీల్, మైస్మార్ట్ ప్రైజ్, జబాంగ్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు కూడా వచ్చి చేరుతాయన్నది పరిశ్రమ వర్గాల అంచనా. ఎందుకంటే ఆయా సంస్థల వ్యాపారంలో 60 శాతానికి పైగా మొబైల్ ఫోన్ల నుంచే వస్తోంది. ఇది చాలు ఈ-కామర్స్ స్థానాన్ని ఎం-కామర్స్ వెబ్సైట్లు, యాప్లు ఎలా ఆక్రమిస్తున్నాయో తెలియటానికి. రూ.12 వేల కోట్ల నుంచిరూ.40 లక్షల కోట్లకు.. దశాబ్ద కాలం నుంచి దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా కొనుగోళ్లు జరిపే వారి సంఖ్య శరవేగంగా పెరిగినట్లు అసోచామ్-డెలాయిట్ నివేదిక తెలిపింది. 2010లో దేశంలో సెల్ఫోన్ల ద్వారా జరిగిన క్రయ, విక్రయాల విలువ కేవలం రూ.12,600 కోట్లు (2 బిలియన్ డాలర్లు). అయితే 2018 నాటికిది రూ.40 లక్షల కోట్లకు (638 బిలియన్ డాలర్లు) చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ఎం-కామర్స్ మార్కెట్ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. వ్యాపార సంస్థల అమ్మకాలు, ఆదాయం పెరగడానికి ఈ-కామర్స్ సంస్థల మొబైల్ అప్లికేషన్లు దోహదపడుతున్నాయనేది నివేదిక సారాంశం. దీనికితోడు రోజురోజుకూ స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటాన్ని ఆసరా చేసుకుని ఈ-కామర్స్ సంస్థలూ ఎం-కామర్స్ స్లెట్లు, యాప్ల వైపు దృష్టిసారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఎక్కడపడితే అక్కడే..
కామారెడ్డి : ఆధునిక పరిజ్ఞానం ప్రజలకు సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉపద్రవాన్ని కూడా తెచ్చిపెడుతోంది. ప్రపంచమంతా యాంత్రికంగా మారిన ప్రస్తు త తరుణంలో సెల్ఫోన్ జీవితంలో ఒక భాగమైంది. దీన్ని క్యాచ్ చేసుకున్న సెల్ఫోన్ కంపెనీలు అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు తహతహలాడుతున్నారుు. ఆయా కంపెనీలు నెట్వర్క్ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించడంతో సిమ్ కార్డులు విక్రరుుంచేందుకు ఎగ్జిక్యూటివ్లను నియమించారు. వారికి టార్గెట్ పెట్టి విక్రయంపై కమీషన్లు ఇస్తుండడంతో మారుమూల గ్రామాల్లో సైతం సిమ్ కార్డులు విక్రరుుస్తున్నారు. అవసరమైతే ఇంటింటికి వెళ్లి విక్రరుుంచే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందనడంలో అతిశయోక్తి లేదు. సిమ్కార్డుల విక్రయం అంశంపై ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిన అవన్నీ తుడిచి పెట్టుకుపోతున్నారుు. దీంతో బినామీ పేర్లలపై సిమ్లు వాడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. వీటితో అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే వారు తాము చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు పోలీసులు జరిపిన పలు విచారణల్లో వెలుగు చూసింది. విచారణకు ఉపయోగపడిన సిమ్ సదాశివనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రధాన నిందితుడు తన సెల్ఫోన్ను ఇంటివద్దే ఉంచి వచ్చాడు. దీంతో నిందితున్ని పట్టుకునేందుకు ఆధారాలు దొరక్క పోలీసులు నానా ఇబ్బంది పడి చివరకు ఇతర నేరస్తులు వాడిన సెల్ఫోన్ల ద్వారా నిందితులను అరెస్టు చేశారు. కాగా, సెల్ఫోన్లలో డబుల్ సిమ్లు వాడే అవకాశం వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరూ రెండు సిమ్లు వాడడం కామన్ అరుు్యంది. అయితే సిమ్లతో కంపెనీలు ఇచ్చే టాక్టైం కోసం విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో సిమ్లను కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. కానీ, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించిన తర్వాత వాటిని విరిచి తమ ఆచూకీ లేకుండా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. సెల్ కంపెనీలు తమ వ్యాపారాభివృద్ధి కోసం, వినియోగదారులను పెంచుకునేందుకు సిమ్లను ఎరవేస్తున్నారు. సిమ్లు అమ్మేవారికి భారీగా బోనస్లు, కస్టమర్లకు ఎక్కువ టాక్టైం ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా సిమ్ కార్డు ఇవ్వడానికి తీసుకునే అడ్రస్ ప్రూఫ్ నిజమైందో..? కాదో తెలుసుకోక ముందే సిమ్ పనిచేయడం ప్రారంభమవుతోంది. దీంతో వినియోగదారులు టాక్టైంను ఒకరోజులో వినియోగించి సిమ్కార్డును పడేస్తున్నట్లు సమాచారం. సిమ్కార్డుల విక్రయాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించని పక్షంలో రానున్న రోజుల్లో మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. ఐఎంఈఐ నంబర్లనూ మార్చేస్తున్నారు.. ప్రతీ సెల్ఫోన్కు ఐఎంఈఐ నంబరు ఉంటుంది. ఏ సెల్ఫోన్లో అయినా ఒక సిమ్కార్డు వాడిన తరువాత ఫోన్ నంబరు ఆధారంగా సదరు సెల్ఫోన్లో మరే సిమ్ను వాడినా దాని నంబరును తెలుసుకోవచ్చు. ఏదైనా నేరం జరిగినపుడు నేరస్తుడిని పట్టుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది. అలాగే సెల్ఫోన్ పోగొట్టుకున్నపుడు ఐఎంఈఐ నంబరు ఆధారంగా సెల్ఫోన్ ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవచ్చు. అయితే సెల్ఫోన్లో ఉండే ఐఎంఈఐ నంబరును మార్చడం కూడా కొందరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ సెల్ఫోన ్ల విషయంలో ఐఎంఈఐ నంబర్లను మారుస్తున్నట్టు సమాచారం. ఇలా నంబర్ మారినప్పుడు దానిని పట్టుకునే అవకాశం ఉండదు. పెరుగుతున్న టెక్నాలజీని ఏదో రకంగా దుర్వినియోగం చేసే పరిజ్ఞానం పెరిగి నేరాలకు ఉపకరిస్తోందనే ఆరోపణలు ఉన్నారుు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, సెల్, సిమ్కార్డుల కంపెనీలు కఠినంగా వ్యవహరించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. -
హోల్సెల్
సెల్ఫోన్... హోల్ మొత్తంగా మనుషుల్ని కలిపింది. మానవ సంబంధాల్లో ఒక హోల్నీ సృష్టించింది! పుట్టెడు మాటలను పొట్టలో నింపుకొని వాటిని ఎవరో ఒకరి చెవిన వేసేదాకా మోగుతూనే ఉంటుంది. ఏడు సముద్రాల ఆవలున్న అనుబంధాలనూ రేడియో తరంగాల కనెక్టివిటీతో కలిపి ఉంచుతోంది. కానీ ఒకే ఇంట్లో బంధాలను కనిపించని వైరుతో వేరుచేస్తోంది! ఎన్నో లవ్ స్టోరీలకు పెళ్లిముడి వేస్తూ... విడాకులతో కొన్ని దాంపత్య ముడులను విప్పుతోంది. శత్రువులను మిత్రులను చేస్తోంది. చెలిమిని వైరంగా మలుస్తోంది. పాలిటిక్స్కే పొలిటికల్ట్రిక్స్ నేర్పుతోంది. ఇన్నీ చేస్తూ గుప్పిట్లో గుంభనంగా ఒదిగే ఆ సంచలనమే... సెల్ఫోన్! ప్రతి ఆధునిక పోకడకు పురాణాల్లో ఆధారం దొరికినట్టు సెల్ఫోన్ సెల్స్ ఏవీ మైథాలజీ ల్యాబ్లో దొరికిన జాడలేదు. పౌరాణికాల్లో వినిపించిన ఆకాశవాణిని దూరవాణికి లింక్ చేసినా సెల్ఫోన్ మాత్రం అచ్చంగా మోడర్న్ క్రియేషనే అని చెప్పొచ్చు. కేవలం మాట్లాడ్డానికి మాత్రమే పరిమితమైన సెల్ఫోన్... తర్వాత తర్వాత మల్టిపుల్ టాస్క్ చేయగల సత్తాను సంపాదించింది. కొత్తలో కార్డ్లెస్కి ఎక్కువ వైర్లెస్కి తక్కువ అన్నట్టుండేది. కొన్ని పదుల కిలోమీటర్ల పరిధిలోనే మోగేది.. పలికేది. ఆనక తన వినికిడి శక్తికి ఆకాశమే హద్దుగా పెట్టుకుంది. మాట్లాడలేని లేని చోట మెసేజ్ను పంపే ఆప్షన్ను పెట్టుకుంది. నైబర్స్ ఎన్వీ.. ఓనర్స్ ప్రైడ్ ఇప్పుడంటే సిమ్ములు ఫ్రీగా టాక్టైమ్ ప్లస్ ఇంటర్నెట్ ఆఫర్స్తో మరీ మార్కెట్లో వాటివైపు చూసేవాళ్లకోసం మొహంవాచి ఉన్నాయి కానీ.. ఇదివరకు మాట్లాడితేనే కాదు... విన్నా బిల్బెల్ మాడును ఠపీమనిపించేది. మధ్యతరగతి ఇళ్లల్లో తొలిసారి మొబైల్ ఫోన్ను ఓ సెలబ్రెటీగా మార్చింది నోకియా కంపెనీయే! కార్డ్లెస్ అంత పరిమాణంలో ఇంకాస్త బరువుగా తూగేది అది. పొరపాటున ఇన్కమింగ్ కాల్తో (కాల్ కాస్ట్ అంత ఖరీదు మరి) రోజుకి ఒక్కసారి మోగినా ఇంట్లోవాళ్లకు సంబరమే. తాము ఓ లగ్జరీని ఆస్వాదిస్తున్నామని ఇరుగుపొరుగువాళ్లకు తెలియడం కోసం ఇంట్లో మోగిన ఫోన్ను చెవి దగ్గర పెట్టుకొని ఆరుబయటకు వెళ్లే పోజులరాయుళ్లేం తక్కువ కాదు. అయినా వీళ్ల పటాటోపం పొరుగింటి కంట పడకపోతే... చెవినైనా వేయాలనే ఆత్రంతో ‘హలో.... హలో... సిగ్నల్ సరిగ్గా లేదు..’ అంటూ కిలోమీటరు ఆవలివరకు వినిపించే గొంతుతో ఆ నైబర్స్కి ఎన్వీని పుట్టించి ఈ ఓనర్ ప్రైడ్గా ఫోన్ కట్ చేసేవాడు. టాక్టైమ్ దాటి ఇంటర్నెట్ నెట్వర్క్లోకి... ఈ పదేళ్లలో సెల్ఫోన్... ఆకారంలోనూ హొయలొలికించింది, ఫీచర్స్లోనూ హంగులు నింపుకొంది. బండలాంటి ఆకారం నుంచి పిడికిట్లో ఒదిగిపోయేంత నాజుగ్గా మారింది. మెసేజ్లు తప్ప అదనపు ఫీచరే లేనితనం నుంచి ఎమ్ఎమ్ఎస్లు, ఎఫ్ఎమ్లు, వాయిస్ రికార్డింగ్, బ్లూ టూత్ ఆప్షన్.. ఇలా టెక్నాలజీలో వచ్చిన కొత్త మార్పులన్నిటికీ ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్తో అది చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. డెస్క్టాప్, లాప్టాప్ అన్నిటి ప్లేస్నూ ఈ బుల్లి ఫోన్ ఆక్రమించేస్తోంది. ఒక కాల్లో ఒకరితో కాదు ఒకేసారి ఓ గుంపుతో మాట్లాడే ఛాన్స్నిస్తోంది. సినిమాలను చూపిస్తోంది.. యూట్యూబ్తో ఎంటర్టైన్ చేస్తోంది. న్యూస్ అడ్డేట్ను ఇస్తోంది.. ఆడవాళ్ల భద్రతకోసం చేసిన యాప్స్నూ అకామిడేట్ చేస్తోంది. కరెంట్ బిల్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఇలా క్యూలో నిలబడి చేసే పనులన్నిటినీ ఏ చికాకు లేకుండా పూర్తిచేసే వెసులుబాటు కల్పిస్తోంది. మనీ ట్రాన్సాక్షన్స్నీ గుట్టుగా కంప్లీట్ చేస్తోంది. బోర్కొడితే బోలెడన్ని గేమ్స్తో అలరిస్తోంది. ఇలా అడుగు తీసి అడుగు వేసే శ్రమలేకుండా కీపాడ్ కదలికలతోనే ప్రపంచాన్ని అరచేతిలో ఉంచుతోంది. సెల్ఫీలతో స్నేహాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. కార్పోరేట్ కలకలం.. రాజకీయ ముసలం సెల్ఫోన్ చెవులకు టాపింగ్ పెట్టి లాగితే టూ జీ స్ప్రెక్ట్రమ్ కుంభకోణం బయటపడింది. పాపం.. కరుణానిధిని కష్టాల్లో పడేసింది. కూతురు కనిమొళి విలన్ అయింది. స్నేహం చేసిన పాపానికి ఎ. రాజా కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. అంతేనా.. కార్గిల్ వార్ కవర్చేసి డేరింగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్గా పేరుగాంచిన బర్ఖాదత్ ఈ టాపింగ్ ఉచ్చులో పడిపోయింది. నీరా రాడియాతో బర్ఖా చేసిన సంభాషణను మోసిన సెల్ఫోన్ నికార్సయిన జర్నలిస్ట్ నిజాయితీకే మచ్చను తెచ్చింది. అంతేనా.. అమర్సింగ్, బిపాషా బసుల విరహాన్ని వినిపించింది. నిన్నటి సంఘటన.. ఓటుకు కోట్లు వ్యవహారంతో రాజకీయాల్లో ముసలమే పుట్టించింది. అలా... వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత ఈ సెల్ఫోన్! - శరాది మొబైల్ పురాణం 1973, ఏప్రిల్ 3న మొదటిసారి మొబైల్లో ఫోన్కాల్ సంభాషణ జరిగింది. మాట్లాడింది మొటొరోలా తొలినాళ్ల సృష్టికర్త మార్టిన్ కూఫర్. అతణ్నే ‘‘ఫాదర్ ఆఫ్ సెల్ఫోన్’’ అంటారు. ఆయన మొదటిసారి ఫోన్ చేసింది తన ప్రత్యర్థి కంపెనీ బాస్కు!21ఏళ్ల కిందట మొదటిసారి ఓ మొబైల్ ఫోన్ నుంచి టెక్ట్స్ మెసేజ్ వెళ్లింది. అది పాప్ వర్త్ అనే 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ తన స్నేహితుడు రిచార్డ్ జావిస్కు ‘‘మెర్రీ క్రిస్ట్మస్’’ అని పంపాడు. అప్పటి ఫోన్లలో కీబోర్డ్ లేకపోవడంతో పాప్ ఆ మెసేజ్ను తన పర్సనల్ కంప్యూటర్ ద్వారా పంపాడు.1997లో మొదటిసారి మొబైల్ ఫోన్ నుంచి ఫిలిప్ క్యాన్ అనే వ్యక్తి తన కూతురి ఫొటోను షేర్ చేశాడు. మెటర్నిటీ వార్డులో అప్పుడే పుట్టిన తన బుజ్జిపాప సోఫీని ఫొటో తీసి అందరికీ చూపించాలనే ఆశతో షేర్ చేసి మురిసిపోయాడు ఆ తండ్రి. {పస్తుతం ఉన్న ఐఫోన్లు రాకముందు 1993లో ఐబీన్ సైమన్ అనే ఫోన్ ఉండేది. ఆ బరువైన ఫోనే మొదటి ఐఫోన్. దాంట్లో క్యాలెండర్, ఫ్యాక్స్, టచ్ స్క్రీన్లాంటి ఎన్నో ఫీచర్స్ ఉండేవి. దాని ఖరీదు 500 పౌండ్లు. {పపంచంలోనే అత్యధిక ఫోన్ బిల్లు చేసింది ఫ్లోరిడాకు చెందిన సెలీనా ఆరన్స్ అనే మహిళ. తన కాలింగ్ ప్లాన్ను మార్చుకోకుండా కెనడాలో ఉన్న స్నేహితులతో రెండు వారాలు విచ్చల విడిగా ఫోన్లో మాట్లాడింది. దాంతో ఆమె మొబైల్ బిల్లు 1,42,000 పౌండ్లు వచ్చింది. ఆ బిల్లు చూసి ఆమెతో పాటు కంపెనీ కూడా అవాక్కయి, దయ తలచి దాన్ని 1,800 పౌండ్లకు తగ్గించింది. {పపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. దాని ఖరీదు 6.7 మిలియన్ల పౌండ్లు. ఆ మొబైల్ను 500 వజ్రాలు, సాలిడ్ గోల్డ్తో తయారు చేశారు. అది ఐఫోన్ వర్షన్తో వస్తోంది. ఆ ఫోన్ కొన్నవారికి ప్లాటినమ్ బాక్స్లో పెట్టి మరీ కస్టమర్ చేతిలో పెడతారట. ‘సోనిమ్ ఎక్స్పీ 3300 ఫోర్స్’ వరల్డ్ టఫ్ఫెస్ట్ ఫోన్ (బండ ఫోన్)గా గిన్నీస్ బుక్లోకి ఎక్కింది. అది ఓసారి 84 అడుగుల మీద నుంచి కింద కాంక్రీట్ నేలపై పడిందట. అయినా ఆ మొబైల్కు ఏమీ కాలేదు. ఆపరేటింగ్ సిస్టమ్లోనూ ఎలాంటి మార్పు రాకపోవడంతో దాన్ని గిన్నీస్ బుక్లోకి ఎక్కించారు. -
ఓం.. హలో హలో!
ఆత్మకూరు రూరల్ : జేబులో రూపాయి లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు రాత్రి సెల్లో మాట్లాడుతూ పడుకునే వారు కొందరైతే.. ఉదయాన్నే సెల్ అలారంతో మేల్కొనే వారు మరి కొందరు. రాత్రి కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడ.. అనే రోజులు పోయాయి. టైం ఎంత అంటే సెల్ కోసం జేబులోకి చేయి వెళ్తోంది. ఇలా సెల్ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడవుతోంది. సెల్ ఫోన్ అందరికీ అవసరమైన వస్తువుగా మారిపోయింది. కరివేన గ్రామంలో సుంకులమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జరిపిన యాగంలో మధ్య మధ్యలో పూజారి సెల్ మోగడం, ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవడం భక్తులవంతైంది. -
ఈ కాలమ్ మీదే
చర్చా వేదిక పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com సెల్ ప్రపంచానికి దూరంగా... నేటి కాలంలో సెల్ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. గతంలో ఒక ఇంటిలో ఒకరికి సెల్ఫోన్ ఉంటే ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఉంది. మామూలు ఫోన్లు కూడా కాదు... స్మార్ట్, టచ్ ఫోన్లు. ఇంట్లో ఉన్న పిల్లలు వీటి మోజులో పడి గంటల తరబడి చాటింగ్లు చేస్తూ, గేమ్స్, ఫేస్బుక్ ఎకౌంట్ ద్వారా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చదువుకు దూరం అవుతున్నారు. పిల్లలు మారాం చేస్తే చాలు... అవసరం ఉన్నా లేకపోయినా కొనిచ్చే తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. ఎప్పుడూ సెల్ఫోన్ చూస్తూనే గడపడం వల్లే చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ అని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం పిల్లల విషయంలో ప్రతికూలంగా మారుతున్నాయి. అందుకే... పిల్లలను సెల్ ప్రపంచానికి దూరంగా ఉంచాలి. పుస్తక ప్రపంచానికి దగ్గర చేసే ప్రయత్నం చేయాలి. - కామిడి సతీష్రెడ్డి, ఉపాధ్యాయులు, పరకాల, వరంగల్ జిల్లా. మన వంతు సహాయం చేద్దాం! ఈమధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇందులో యువత ఎక్కువగా ఉండడం బాధాకరం. ఈ నేపథ్యంలో నాదో సూచన. మన చుట్టుపక్కల ఎవరైనా... విషాదంలో ఉంటే కారణం తెలుసుకోండి. వారి బాధను పంచుకోండి. సమస్య పరిష్కారానికి మీవంతుగా తోడ్పడండి. ఎవరి సమస్య వారిది అనుకోవడం వల్లే, ఒంటరితనం పెరిగి, సమస్యకు పరిష్కారం దొరకక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందుకే బాధలో ఉన్నవారితో మాట్లాడండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. ఎందుకంటే జీవితం అనేది చాలా గొప్పది. ఆ జీవితాన్ని కష్టాలు, కన్నీళ్లతో కాకుండా సుఖసంతోషాలతో గడపడం ముఖ్యం. - గాదెగాని గౌతం, మరిపెడ జాగో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అనేది సాంకేతిక విద్య, అంటే ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలకు అద్దం పట్టేది. ఇప్పుడున్న ఇంజనీరింగ్ విద్య - పైన పటారం లోన లొటారంలాగా మారిపోయింది. ఇప్పటికీ మనం పాత విద్యావిధానంలోనే కొనసాగుతున్నాం. దీనికితోడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు, అందులో అరకొర వసతులు, బోధనాపరమైన ఇబ్బందులు, ల్యాబ్స్ లేకపోవడం... ఉన్నా కూడా పని చేయకపోవడం... ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అరకొర వసతుల నడుమ విద్య అనేది విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. అరకొర వసతుల మధ్య చదువుకున్న వాళ్లు ఆ తరువాత కాలంలో ఉద్యోగాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో పూర్తి వసతులు ఉన్నాయని ప్రశ్నించుకుంటే పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన విద్యతో వచ్చే బతుకు భరోసా ఎక్కడ ఉంది?ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా కోరుకుంటున్నాను. - ఎన్. మంజునాథ్, అనంతపురం ప్రకృతికి మొక్కలు చెల్లించుకుందాం ప్రకృతిలో సమతౌల్యం లోపిస్తే జీవరాశులు మనుగడ సాగించలేవు. అడవులు, వివిధ రకాల చెట్లు, నదులు, చెరువులు, సరస్సులు, సముద్రాలు, పర్వతాలు, కొండలు, గుట్టలు, భూగర్భంలో ఉన్న వివిధ రకాల ఖనిజరాశులు, అలాగే భూమిపై ఉన్న సమస్త జీవరాశులూ ప్రకృతిలో భాగమే. కానీ ఆ ప్రకృతిని మనం అభివృద్ధి పేరుతో ధ్వంసం చేసుకుంటున్నాం. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. పర్యవసానాల గురించి ఆలోచించకపోతే, పర్యావరణ స్పృహను కలిగి ఉండకపోతే ముందు తరాలవారి బతుకులను సైతం ఎడారిపాలు చేసినవాళ్లమవుతాం. మరి కర్తవ్యం ఏమిటి? పర్యావరణాన్ని తక్షణం పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలలో, రహదారులపై విరివిగా మొక్కలను పెంచాలి. ప్రతి ఇంట్లో మేడపైన, గోడలపైన, తొట్టెలలో, కిటికీ పైభాగాలలో కూడా వివిధ రకాల మొక్కలను పెంచాలి. ఎవరింట్లో వారు మొక్కలను పెంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికే కాకుండా పర్యావరణానికి, సమాజానికి మేలు జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యానవన, అటవీశాఖల నుంచి ఉచితంగా సలహాలు తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణంలో ఖాళీ స్థలం వదలక, ఉన్న స్థలంలోనే చిన్నచిన్న గదులను నిర్మించి... కంకర, సిమెంటు వేసి, మొక్కలకు చోటు లేకుండా చేయడం వల్ల కూడా పర్యావరణానికి, సమాజానికి హాని జరుగుతుందని మనం గ్రహించాలి. ఇందుకు ప్రాయశ్చిత్తంగా.. సమాజంలో ప్రతి ఒక్కరు ప్రతి శుభకార్యంలో గుర్తుగా మొక్కలను పెంచే, పంచే సంప్రదాయం అలవరుచుకోవడం వల్ల ప్రకృతి సమతౌల్యం మరింత దెబ్బతినకుండా ఉంటుంది. ఇక నీరులేక, నీరు నిల్వ ఉంచే పరిస్థితి లేక పక్షులు, జంతువులు అంతరించిపోతున్నాయి. వాటిని కూడా మనం కాపాడుకోవాలి. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషిచేసి ప్రజలందరికి అవగాహన కల్పించే నిమిత్తమై జీవ వైవిధ్య సదస్సులు నిర్వహించవలసి వస్తోందంటే పరిస్థితి ఎంత చేయి దాటిందో చూడండి. అందుకే ప్రపంచ దేశాలకు పెనుసవాలుగా మారిన పర్యావరణ పరిరక్షణలో మనవంతు సహకారాన్ని అందించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం. - చెన్నమాధవుని అశోకరాజు, వనస్థలిపురం, హైదరాబాద్ -
హైటెక్ నారాయణ
నేటి ప్రపంచంతో పాటు దూసుకెళ్లాలంటే సాంకేతిక పరిజ్ఞానం తోడు అవసరమని చెప్పడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం. తాను నమ్మిన సిద్ధాంతాలు.. విలువలను భుజానికి తగిలించుకుని.. నేటి తరం వారితో పాటుగా పయనానికి అన్నట్లు ఒకచేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో ట్యాబ్ పట్టుకుని ముందడుగు వేస్తున్నారు సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ. కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్లో గురువారం నిర్వహించిన ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు సంస్మరణ సభకు వచ్చిన నారాయణను సాక్షి క్లిక్ మనిపించింది.