competition
-
గాడిద పందేలు
పండుగలు, జాతరలు భక్తితోనే కాదు సరదా సంబరాలతోనూ మైమరపిస్తాయి!కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి వాటికి అవే వేదికలు! ఇప్పుడు గాడిదల పోటీలూ మొదలయ్యాయి.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో! ఆ వివరాలు..మోటారు వాహనాలు పెరగడంతో రవాణా మొదలు చాలా విషయాల్లో పశువుల మీద ఆధారపడే పరిస్థితి దాదాపుగా కనుమరుగైందనే చెప్పొచ్చు. ఆ క్రమంలో రజకులకు గార్దభాల అవసరమూ లేకుండా పోయింది. కానీ కొన్ని కుటుంబాలు మాత్రం ఇంకా వాటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. ఆ జంతువులను సంరక్షిస్తున్నాయి. పండుగల వేళ వీటితో కలసి సంబరాలు చేసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఆయా పర్వదినాల్లో వాళ్లు వాటిని చక్కగా అలంకరించి, పూజలు చేసి, ఊరేగించి వాటి ప్రత్యేకతను చాటుతున్నారు. వాటి మధ్య పందేలు నిర్వహిస్తున్నారు. ఫలానా ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కరపత్రాలను ముద్రిస్తారు. ఆ సమాచారాన్ని ముందుగా అందుకున్నవారు మిగిలిన పోటీదారులందరికీ వాట్సాప్ చేస్తారు. ఈ పోటీలను కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొన్ని మగ గార్దభాలను సిద్ధం చేస్తారు. ప్రతిరోజూ వీటిపై ఇసుక మూటలను వేసి నేల మీదే కాదు నీటిలోనూపరుగెత్తుతూ శిక్షణనిస్తారు. వీటికి మొక్కజొన్న పిండి, మినప పొట్టు, సజ్జలు తదితరాలను ఆహారంగా పెడతారు.పోటీ పదినిమిషాలే.. బరువును లాగే ఈ గాడిదల పోటీల వ్యవధి కేవలం పదినిమిషాలే! 80 పల్ల ఇసుక (రెండు క్వింటాళ్ల పది కిలోలు)తో పోటీలు నిర్వహిస్తారు. ఆ బరువుతో నిర్దేశించిన పది నిమిషాల్లో ఏ గాడిదైతే ఎక్కువ దూరం వెళ్తుందో దానినే విజేతగా నిర్ణయిస్తారు. విజేతకు నగదు, లేదా వెండిని బహుమతిగా అందిస్తారు. నగదు రూ. 5వేలు మొదలుకొని రూ. 20వేలకు పైనే ఉంటుంది. ఈ పోటీల కోసం అనంతపురం, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లి మరీ గాడిదలను కొంటున్నారు. బ్రీడ్ ఆధారంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లోని గాడిదలను కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటి ధర రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షకు పైనే ఉంటుంది. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. అయితే పోటీల్లో పాల్గొనే గాడిదలకు వయసుతో సంబంధం ఉండదు. మోసే బరువే ప్రామాణికం. లీటరు పాలు రూ.7వేలకు పైనేగాడిద పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. లీటరు పాల ధర రూ.7వేలకు పైగా పలుకుతోంది. అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో డెయిరీలు సైతం ఏర్పాటయ్యాయి. రోజుకు ఓ గాడిద నుంచి 200 మి.లీ. పాలను సేకరిస్తారు. వీటిని పలు వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల్లో గాడిద మాంసానికీ డిమాండ్ ఉంటోంది. అందుకే రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల వాళ్లు వచ్చి వీటిని ఎత్తుకుపోతున్నట్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు.బురదనీటిలో సంబరంఉగాది రోజున కర్నూలు పట్టణంలోని కల్లూరులో కొలువైన చౌడేశ్వరీ మాత దేవాలయ ప్రాంగణాన్ని బురదతో చిక్కగా అలికేస్తారు. గార్దభాలను ముస్తాబు చేసి బండ్లు కడతారు. ఆ బురదలో వీటికి పోటీ నిర్వహిస్తారు. దీన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. గుర్తింపు ఉంటోందిపండుగలు, జాతరల సమయంలో మా జీవితాల్లో భాగమైన గార్దభాలతో సరదాగా బరువులను లాగించే పోటీలను నిర్వహిస్తున్నాం. పోటీల్లో బహుమతి సాధిస్తే గ్రామంలో మంచి గుర్తింపు ఉంటోంది. ఎక్కడ పోటీలు నిర్వహించినా వీటిని తీసుకెళ్తున్నాం.– చాకలి నాగ మద్దిలేటి, ముక్కమల్లఓ సరదా ఆరు సంవత్సరాలుగా గాడిదను పోటీలకు తీసుకెళ్తున్నా. అది ఇప్పటి వరకు 60 పందేల్లో పాల్గొంది. పోయిన ప్రతిచోటా మొదటి లేదా రెండోస్థానాన్ని గెలుచుకుంటోంది. అలా వచ్చిన డబ్బు రాకపోకలకే సరిపోతోంది. అయినా పోటీల్లో పాల్గొనడం ఓ సరదా. ఆ గెలుపుతో మాకు, మా ఊరికి పేరొస్తే చాలు! – చాకలి సుబ్బరాయుడు, వేల్పనూరు · పి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు -
మ్యాథ్స్ మహారాణి
గణితం అంటేనే ఆమడదూరం పరిగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. మొదట్లో గణితంపై పెద్దగా ఆసక్తి చూపని ఓ అమ్మాయి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరంగా గణితాన్ని విడమరిచి చెప్పే లెక్కల టీచర్గా చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన ప్రఖ్యాత గణిత పాఠాల పోటీ ‘బిగ్ ఇంటర్నెట్ మ్యాథ్–ఆఫ్’లో ఘనా దేశానికి చెందిన 35 ఏళ్ల ఏంజెలా తబిరి 16 మందిని వెనక్కునెట్టి ప్రపంచవిజేతగా జయకేతనం ఎగరేసింది. ఈ పోటీలో నెగ్గిన తొలి ఆఫ్రికన్గా, అందులోనూ తొలి ఆఫ్రికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. సమస్యల పరిష్కారంపై ఉన్న మక్కువే తనను మ్యాథ్స్ వైపు నడిపించించిందని తబిరి చెబుతున్నారు. తన విజయం మరింత మంది ఆఫ్రికన్ మహిళలు గణితాన్ని అభ్యసించేందుకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఘనా మ్యాథ్స్ క్వీన్ డాక్టర్ తబిరి ఆఫ్రికన్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యాథమేటికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో అణు బీజగణితం బోధించడంలో నిపుణురాలిగా పేరు సాధించారు. ఇంతటి ఘనత సాధించిన ఘనా దేశస్తురాలి గణితపర్వం ఒక ప్రణాళికాబద్ధంగా మొదలుకాలేదు. ఘనాలో పారిశ్రామికరంగానికి కేంద్ర స్థానంగా ఉన్న రాజధాని నగరం అక్రా సమీపంలోని టెమా నౌకాపట్టణంలోని అషైమాన్ మురికివాడలో ఆమె పెరిగారు. నలుగురు తోబుట్టువులతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇది సంతోషాన్నిచ్చినా చదువుకోవడానికి మాత్రం ఇబ్బంది ఉండేది. స్థానిక యూత్ కమ్యూనిటీ సెంటర్లో చదువుకునేవారు. తన ఇద్దరు సోదరీమణుల్లాగే యూనివర్సిటీలో బిజినెస్ అడ్మిని్రస్టేషన్ చేయాలనుకుంది. అందుకు సరిపడా విద్యా గ్రేడ్స్ లేకపోవడంతో బదులుగా గణితం, ఆర్థిక శా్రస్తాన్ని ఎంచుకుంది. అదే ఆమెకు కలిసొచ్చింది. గణిత సూత్రాలు ఆమెను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరకు గణితాన్నే తన కెరీర్గా ఎంచకున్నారు. 2015లో స్కాట్లాండ్లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు స్కాలర్షిప్ సైతం సంపాదించారు. 1950వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేసిన నల్లజాతి అమెరికన్ మహిళా గణిత శాస్త్రవేత్తల జీవితగాథలున్న ‘హిడెన్ ఫిగర్స్’సినిమా చూశాక ఎంతో స్ఫూర్తిపొందానని ఆమె తెలిపారు. ‘‘ప్రపంచ వేదికపై నల్లజాతి మహిళల కథ నాకెంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా కేథరిన్ జాన్సన్ నుంచి ఎంతో ప్రేరణ పొందా. ఇది నా జీవితంలో కీలక మలుపు’’అని ఆమె అన్నారు. మహిళల్లో గణిత అధ్యయనాన్ని పెంచేందుకు.. గణితంలో డాక్టరేట్ అందుకున్న తబిరి లాభాపేక్షలేని సంస్థ ‘ఫెమ్ ఆఫ్రికా మ్యాథ్స్’నడిపిస్తున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని ఆఫ్రికన్ బాలికలు, మహిళల గణిత కలలను సాకారం చేసుకోవడానికి తబిరి తన పూర్తి మద్దతు పలికారు. హైసూ్కల్ విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడామె సేవలు ఘనా, సెనెగల్, కామెరూన్, రువాండా దేశాలకూ విస్తరించాయి. ఘనాలోని ఉన్నత లేదా మాధ్యమిక పాఠశాల బాలికలకు మార్గదర్శకం చేసే ‘గాళ్స్ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్’ ప్రోగ్రామ్కు తబిరి అకడమిక్ మేనేజర్ వ్యవహరిస్తున్నారు. ‘‘హైసూ్కల్లో గణితం చదివే బాలికలు, బాలుర సంఖ్య దాదాపు సమానంగా ఉందని, విశ్వవిద్యాలయ స్థాయిలో అది తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నా’’అని ఆమె అన్నారు. ఆధునిక క్వాంటమ్ మెకానిక్స్ 100వ వార్షికోత్సవం సందర్భంగా 2025ను ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే ప్రతిపాదనలకు మెక్సికో మద్దతుతో ఘనా తరపున నాయకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సమస్యల పరిష్కారానికి.. ‘‘పిల్లలు తమ పాఠశాల పాఠాలను ఊరకే నేర్చుకోకుండా ఉన్నత లక్ష్యాల సాధనకు పనిముట్టుగా వాడుకోవాలి’’అని తబిరి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు్కలైన ఆఫ్రికా జనాభా 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తిగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అలాంటి పాఠశాల విద్యార్థులకు క్వాంటమ్ సైన్స్ను పరిచయం చేయడంలో తొలి అడుగుగా ‘క్వాంటమ్ రోడ్ షో’ను నిర్వహించాలని ఆమె భావిస్తున్నారు. యునెస్కోతో కలిసి పనిచేస్తున్న తబిరి వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూలైలో ఎయిమ్స్–ఘనాలో వారం రోజుల పాటు ‘క్వాంటమ్ హ్యాకథాన్’ను నిర్వహించనున్నారు. తాము ఎదుర్కొంటున్న సవాళ్లను, నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి క్వాంటమ్ నైపుణ్యాలను ఉపయోగించాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. తబిరి విజయం కేవలం ఆమె వ్యక్తిగత విజయం కాదు. ఆఫ్రికన్ భవిష్యత్ తరాల గణిత శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళలకు ఆశాదీపంగా మారింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మూసాపేటలో ‘సాక్షి’ సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
ఈ–కామర్స్కు పోటీగా క్విక్ కామర్స్
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంప్రదాయ ఈ–కామర్స్ దిగ్గజాలకు క్విక్ కామర్స్ పోటీనిస్తుందని జెప్టో కో–ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలీచా అన్నారు. భారత్లో అమెజాన్/ఫ్లిప్కార్ట్ స్థాయి ఫలితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని క్విక్ కామర్స్ కలిగి ఉందని 2024లో ప్రజలు గ్రహిస్తారని జెప్టో గతేడాది ప్రకటించిందని నూతన సంవత్సరం సందర్భంగా లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో ఆయన గుర్తు చేశారు. 2025లో క్విక్ కామర్స్ కూడా ఈ–కామర్స్తో పోల్చదగిన స్థాయిని చేరుకుంటుందని తెలిపారు. ఐపీవో బాటలో ఉన్న జెప్టో 2023–24లో నిర్వహణ ఆదాయం 120 శాతం పెరిగి రూ.4,454 కోట్లకు చేరుకుంది. స్విగ్గీ ఇన్స్టామార్ట్, జోమాటో బ్లింకిట్ వంటి పోటీ కంపెనీలను అధిగమించింది. ప్రతి కంపెనీకి సవాలు.. కార్యకలాపాలను అసాధారణంగా అమలు చేయడంపై క్విక్ కామర్స్ విజయం ఆధారపడి ఉంటుందని ఆదిత్ నొక్కిచెప్పారు. ఆ స్థాయిలో అమలు చేయడం ప్రతి కంపెనీకి ఒక సవాలుగా ఉంటుందని అన్నారు. ‘2025లో క్విక్ కామర్స్ యొక్క ప్రాథమిక అంశాలు నాటకీయంగా అభివృద్ధి చెందుతాయి. కస్టమర్ చేసే చెల్లింపులకు తగ్గ విలువ మరింత వేగంగా పెరుగుతుంది. నిర్వహణ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్థికాంశాలు, కార్యక్రమాలు మారతాయి. 2023, 2024తో పోలిస్తే ఈ పరిశ్రమకు క్యాపిటల్ మార్కెట్ వాతావరణం కూడా భిన్నంగా కనిపిస్తుంది’ అని అన్నారు. నమ్మశక్యం కాని రీతిలో 2025 ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో వేదికగా నూతన సంవత్సర అమ్మకాల్లో 200 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. రికార్డుల న్యూ ఇయర్.. డిసెంబర్ 31న అత్యధిక విక్రయాలను సాధించామని బ్లింకిట్ ప్రకటించింది. ఒక నిమిషంలో, ఒక గంటలో అత్యధిక ఆర్డర్లతోపాటు.. ఒక రోజులో డెలివరీ భాగస్వాములు అందుకున్న టిప్స్ సైతం అత్యధికమని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా మైక్రో–బ్లాగింగ్ సైట్ ఎక్స్ వేదికగా తెలిపారు. అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయాన్ని భారతీయులు స్వీకరించినందున నూతన సంవత్సర వేడుక రోజున ఒక రోజులో అత్యధికంగా ద్రాక్షలను విక్రయించినట్లు బ్లింకిట్ పేర్కొంది. స్పానిష్ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారిందని వివరించింది. -
ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..
చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్ డిజైనర్గా రూపొందించిన ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ ఫీచర్ ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!? హైదరాబాద్లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఏఎఫ్ఐ)లో ‘ప్రొడక్షన్ డిజైన్’లో ఎంఎస్ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం. తెర వెనక పాత్రల గురించి తెలిసి.. చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లింది.ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ‘తహనన్’.. అమెజాన్ ప్రైమ్లో ప్రసారం అవుతున్న ‘తహనాన్’ అనే ఫీచర్ ఫిల్మ్ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్ ఏంజిల్స్లోని కల్వర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్ వరించింది. అమెరికాలో మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్ స్విఫ్ట్సŠ, ఫోర్ట్నైట్, రెడ్ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్ ఇన్ ది డార్క్, స్టక్ వంటి ఎన్నో మ్యూజిక్ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.తెలుగు చిత్రం రిలీజ్.. ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్ ఫెస్టివల్స్లో 15 అంతర్జాతీయ అవార్డ్లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. అర్జున్ ది స్టూడెంట్, మీన్ గోల్స్, ది హల్కైన్ డేస్, బాడీ చెక్ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్ ఫిల్మŠస్ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్లను దక్కించుకుంది. రవికుమార్ వాసు దర్శకత్వంలో శివకుమార్ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్ సోమకి, టెక్సాస్కు చెందిన పైజాన్ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్ని సొంతం చేసుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్లు చెప్పగా, ఆ రికార్డును బృహత్ బ్రేక్ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం బృహత్ టైటిల్తో సత్తా చాటాడు. ఇక రన్నరప్గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్ పరీఖ్ రెండోవ స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. (చదవండి: US: పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!) -
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
రాజస్థాన్లో అక్షయ తృతీయ వేళ విషాదం చోటుచేసుకుంది. ఈ పండుగను రాష్ట్రంలో అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా బికనీర్లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. అయితే వీటిని ఎగువేసేందుకు వినియోగించే చైనీస్ మాంజాలు పలువురిని గాయాలపాలు చేస్తున్నాయి.చైనీస్ మాంజా తగలడంతో 35 మంది గాయపడ్డారు. ఆరుగురి గొంతులు కోసుకుపోయాయి. మాంజా బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా ఆరోగ్య యంత్రాంగం బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బికనీర్లోని పీబీఎం ఆస్పత్రిలో కూడా గాలి పటాల బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గాలిపటాల మాంజాల కారణంగా గాయపడిన 35 మందికి పీబీఎం ఆస్పత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గొంతు తెగిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ట్రామా సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ కపిల్ తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలువురు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశం నిండా గాలిపటాలు కనిపిస్తున్నాయి. చైనా మాంజా కారణంగా పక్షులు కూడా చనిపోతున్నట్లు తెలుస్తోంది. आखातीज और बीकानेर स्थापना दिवस पर आइए कभी हमारे बीकानेर और देखिए यहां कि पतंगबाजी इतनी धूप में 🔥🎉#Bikaner pic.twitter.com/QdvPW0R66q— MAHENDARA GODARA (@MAHENDRAJAAT010) May 10, 2024 -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
జగనన్న సంక్షేమంపై స్పెషల్ కాంటెస్ట్
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్లైన్ పోటీని ఔత్సాహిక ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ఎన్నారైలు శరత్ ఎత్తపు, తిరుమల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ పోటీని APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి ప్రారంభించి మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో లబ్ధిదారులు పొందిన లబ్ధి గురించి అభిప్రాయాన్ని వీడియో రూపంలో చేసి అందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయాలని కోరారు. ఎలా చేయొచ్చు అంటే.? ఏపీలో సంక్షేమపథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి? ఆర్ధిక, మౌలిక వసతుల రంగాల్లో ఏపీకి పునర్జీవనం వచ్చిందా ? ప్రజల బతుకుల్లో జగనన్న ప్రభుత్వం నింపిన వెలుగులపై ఏమనుకుంటున్నారు? మీ ఫోన్ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాన్ని వీడియో తీయండి, కింద పేర్కొన్న వెబ్సైట్లో అప్లోడ్ చేయండి బెస్ట్ వీడియోకు తగిన గుర్తింపుతోపాటు నగదు పురస్కారం https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయండి ఆసక్తి ఉన్న వారు "మేము సైతం" కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాష్ బహుమతులు గెలవచ్చన్నారు. వీడియోలను అనుభవజ్ఞులైన బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని, మొత్తం రూ.25 లక్షల నగదు బహుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రూ. 25,000, రెండో బహుమతి కింద రూ.15,000, మూడో బహుమతి కింద రూ.10,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5,000, రెండో బహుమతి కింద రూ.3,000, మూడో బహుమతి కింద రూ.2,000 ఇవ్వనున్నట్లు శరత్ చెప్పారు. -
‘భావి భారతం గురించి నీకేం తెలుసు?’.. విద్యార్థులకు రైల్వేశాఖ పోటీ..
భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వేలు ఎంతలా మారనున్నాయి?.. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను వారి అధ్యాపకులు అడుగుతుంటారు. తాజాగా భారతీయ రైల్వే దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించబోతోంది. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు భావి భారతంపై తమకున్న కలల గురించి చెప్పాలని రైల్వేశాఖ కోరింది. ఇందుకోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4000 పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు. భావి భారతం ఎలా ఉండబోతోంది? రైల్వేల భవిష్యత్ ఎలా ఉండనుందనే దానిపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కవితా రచన తదితర పోటీలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోటీలో ప్రతిభ కనబరిచిన 50 వేల మంది విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని డివిజన్లలోని 2000 రైల్వే స్టేషన్లలో పోటీ నిర్వహించనున్నామని, పోటీలు జరిగే సమయంలో ప్రధాని స్వయంగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారని రైల్వే అధికారులు తెలిపారు. -
ఓవరాల్ చాంపియన్ తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు. శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్కుమార్, వి.కిరణ్కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆయా విభాగాల వారీగా చూస్తే.. ► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం ► యాంటీ స్టాబేజ్ చెక్లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు ► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి. ►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. -
ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మహిళల విభాగంలో.. ► క్రికెట్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ నగర్, రన్నరప్గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం–3, రన్నరప్గా కర్నూలు జిల్లా మామిడాలపాడు–1, సెకండ్ రన్నరప్గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి–1 జట్లు నిలిచాయి. ► బ్యాడ్మింటన్ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ 2, రన్నరప్గా వైఎస్సార్ జిల్లా శంకరాపురం–4, సెకండ్ రన్నరప్గా కర్నూలు జిల్లా ఫోర్త్క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్, రన్నరప్గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్ చౌక్, సెకండ్ రన్నరప్గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ 2 జట్లు నిలిచాయి. ► కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్బే కాలనీ, రన్నరప్గా ప్రకాశం జిల్లా పాకాల 2, సెకండ్ రన్నరప్గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో.. ► బ్యాడ్మింటన్ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్ వీధి, రన్నరప్గా తిరుపతి జిల్లా భేరీపేట, సెకండ్ రన్నరప్గా వైఎస్సార్ కడప కాగితాలపెంట 1 జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, రన్నరప్గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్ రన్నరప్గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు –1, రన్నరప్గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల–2, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి. సాగర తీరంలో డ్రోన్ షో సాక్షి, అమరావతి: ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలను ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. విశాఖ సాగర తీరంలో లేజర్ షోతో పాటు డ్రోన్ షోలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైటింగ్ షోకు శాప్ ఏర్పాట్లు చేసింది. ఎల్ఈడీ కాంతుల్లో 150 మంది కూచిపూడి నృత్యకారులతో ఆడుదాం ఆంధ్రపై కళా ప్రదర్శన నిర్వహిస్తారు. బాణసంచా వెలుగులు ఆహుతుల్ని అలరించనున్నాయి. -
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని వైకుంఠ్పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్సేల్లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ అమీతుమీ!
విశాఖ స్పోర్ట్స్: యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ తుది పోటీలకు విశాఖ సిద్ధమైంది. 14,997 గ్రామాల నుంచి మెన్, వుమెన్ జట్లు ఐదు క్రీడల్లో నిర్వహిస్తున్న పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 50 రోజుల పాటు సాగనున్న ఈ పోటీల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. 37.5 లక్షల మంది మెన్, వుమెన్ క్రీడాకారులు గ్రామ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి చివరిదైన ఐదో దశ రాష్ట్ర స్థాయి పోటీల్లో 26 జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు విశాఖలో అమీతుమీ తేల్చుకుంటాయి. 12.21 లక్షల నగదు ప్రోత్సాహాకాల్ని సత్తా చాటిన జట్లు సొంతం చేసుకుంటాయి. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో విజేతలు నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోగా, తుది పోరులో రాష్ట్ర టైటిల్తో పాటు ప్రోత్సాహాకాల్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అందుకోనున్నారు. వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మెన్ క్రికెట్ టైటిల్ పోరును ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభ వేడుక రైల్వే స్టేడియంలో జరగనుంది. రాష్ట్ర క్రీడా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పోటీలను ప్రారంభించనుండగా, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ధ్యాన్చంద్ గురువారం స్టేడియంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా వీక్షించి పలు సూచనలు చేశారు. విజేతలకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాలు వైఎస్సార్ స్టేడియంలో 50 రోజుల క్రీడా పండగ ముగింపు కార్యక్రమాన్ని 13న భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ టోర్నీ ద్వారా సత్తాచాటిన ఆటగాళ్లకు మరిన్ని మెలకువలు నేర్పేందుకు చెన్నయ్ సూపర్ కింగ్స్ పరిశీలకులతో పాటు ఆయా క్రీడల్లో నిష్ణాతుల్ని ఈ మ్యాచ్లు చూసేందుకు ఆహ్వానించామన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో విజేతగా నిలిచిన జట్లు ఐదు లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందుకోనున్నాయి. రన్నరప్ జట్లు మూడు లక్షలు, సెకండ్ రన్నరప్ జట్లు రెండు లక్షలు అందుకోనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్లో విజేతగా నిలిచిన జట్లు రెండు లక్షలు అందుకోనుండగా.. రన్నరప్ లక్ష, సెకండ్ రన్నరప్ జోడి యాభై వేలు అందుకోనుంది. ఏయే ఆటలు ఎక్కడంటే.. రాష్ట్ర స్థాయిలో పోటీపడేందుకు అన్ని జిల్లాల నుంచి 1,482 మంది పురుషులు, 1,482 మంది స్త్రీలు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో జట్లుగా ఆడేందుకు అర్హత సాధించాయి. వారికి స్థానికంగా ఉన్న టిడ్కో గృహాల్లో ఏర్పాట్లు పూర్తయాయి. భద్రతను దృష్టిలో పెట్టుకుని వుమెన్ క్రికెట్ పోటీలను వైఎస్సార్ బి గ్రౌండ్లోనే నిర్వహించనుండగా, మెన్ క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం గ్రౌండ్, ఏఎంసీ గ్రౌండ్, కొమ్మాది కేవీకే స్టేడియం గ్రౌండ్లలో నిర్వహించనున్నారు. కబడ్డీ, ఖోఖో కోసం ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్, వాలీబాల్ కోసం ఏయూ సిల్వర్ జూబ్లీ గ్రౌండ్లను సిద్ధం చేశారు. బ్యాడ్మింటన్ కోసం జీవీఎంసీ ఇండోర్ స్టేడియంలో ఐదు కోర్టులను వినియోగించనున్నారు. -
పాక్ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవుతోంది. గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పాక్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సైన్యం దన్నున్న పార్టీ యే గెలవడం ఆనవాయితీ. ఆ లెక్కన ఈసారి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్)దే విజయం ఖాయమంటున్నారు. మరో మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సైన్యం ఆగ్రహానికి గురై జైలుపాలవడంతో ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కకావికలైపోయింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ కూడా పెద్దగా పోటీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం అంతంతే ఉంది... – సాక్షి, నేషనల్ డెస్క్ పాకిస్తాన్ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 17 వేల మంది పై చిలుకు అభ్యర్థుల్లో మహిళలు ఎందరో తెలుసా? కేవలం 839 మంది! అంటే 4.7 శాతం. సాంప్రదాయికంగా పాక్లో మహిళలకు రాజకీయాల్లో అంతగా ప్రోత్సాహం దక్కదు. దాంతో ఎన్నికల్లో కూడా వారి ప్రాతినిధ్యమూ అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. పరిస్థితిని మార్చేందుకు మహిళలకు కనీసం 5 శాతం టికెట్లివ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. అయినా వారికి ఆ మాత్రం టికెట్లిచ్చేందుకు కూడా ప్రధాన పార్టీ లకు మనసు రావడం లేదు. ఈసారి మహిళలకు ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ ఇచ్చిన 53 టికెట్లే అత్యధికం! అయితే వారిలోనూ జాతీయ అసెంబ్లీకి పోటీ పడుతున్నది కేవలం 28 మందే. మిగతా 25 మంది ప్రావిన్సుల స్థానాల్లో పోటీకి పరిమితమయ్యారు. ఇక మహిళలకు పీపీపీ 4.5 శాతం, పీఎంఎల్ (ఎన్) కేవలం 4.2 శాతం టికెట్లతో సరిపెట్టాయి. పీపీపీ నుంచి 35 మంది, పీఎంఎల్ నుంచి 28 మంది మహిళలే బరిలో ఉన్నారు. వారిలోనూ చాలామంది పోటీ ప్రావిన్సు స్థానాలకే పరిమితం! కాకపోతే పాక్ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతుండటం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలవనుంది. అలాగే ఓ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, తాలిబన్ల చేతిలో భర్తను కోల్పోయిన మరో మహిళా నేత బరిలో ఉన్నారు.... సవీరా.. తొలి హిందూ అభ్యర్థి 25 ఏళ్ల సవీరా ప్రకాశ్ పాకిస్తాన్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్ ఫక్తూన్ఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలోని పీకే–25 నియోజకవర్గం నుంచి పీపీపీ టికెట్పై బరిలో దిగిన ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసిన సవీరాది ఆసక్తికరమైన నేపథ్యం. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ సిక్కు కాగా తల్లి క్రిస్టియన్. వారిద్దరి అంగీకారంతో సవీరా మాత్రం హిందూ మతావలంబిగా మారారు. తద్వారా పాక్ వంటి ముస్లిం మెజారిటీ దేశంలో మత సహనానికి, సామరస్యానికి ప్రతీకగా నిలిచారామె. భారత మూలాలున్న ఓం ప్రకాశ్ ఉచిత వైద్యంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా పేరు పొందారు. ఎన్నడూ ఎన్నికల బరిలో దిగకపోయినా 30 ఏళ్లుగా పీపీపీ కార్యకర్తగా ఉంటూ వస్తున్నారు. చెడు చేయాలని ఏ మతమూ చెప్పదంటూ సవీరా చేస్తున్న ప్రచారానికి ముస్లింల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మత, లింగ వివక్షను నిర్మూలించడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు. ‘‘పాక్లో ప్రజా జీవితంలో మహిళ పట్ల వివక్ష బాగా ఉంది. మా జిల్లానే తీసుకుంటే చదువుకున్న మహిళల సంఖ్య కేవలం 29 శాతం. దేశవ్యాప్తంగా కూడా మహిళల్లో అక్షరాస్యత 46 శాతమే. దీన్ని మార్చేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’’ అని చెబుతున్నారు. మహిళా రిజర్వు స్థానం నుంచి కాకుండా జనరల్ సీటు నుంచి ఆమె బరిలో దిగడం మరో విశేషం. ఓటర్లను ‘ఇన్ఫ్లుయెన్స్’ చేస్తుందా...? లాహోర్లోని ఎన్ఏ–122 స్థానంలో పీఎంఎల్ (ఎన్) అభ్యర్థి ఖవాజా సాద్ రఫీక్, పీటీఐకి చెందిన లతీఫ్ ఖోసా హోరాహోరీ తలపడుతున్నారు. వారిద్దరినీ ఢీకొంటున్న ఓ యూట్యూబ్ సంచలనం ఇప్పుడు దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమే జెబా వకార్. వృత్తిరీత్యా గైనకాలజిస్టు అయిన ఆమె జమాత్ ఇ ఇస్లామీ అనే మతపరమైన పార్టీ సభ్యురాలు. ఆ పార్టీ తరఫునే బరిలో దిగారు. యూట్యూబ్లో ఆమెకు 17,500 మందికి పైగా ఫాలోయర్లున్నారు. ఖురాన్, హదీత్లపై రోజూ ప్రసంగాలు అప్లోడ్ చేస్తుంటారు. విద్యాధికులైన యువతులకు ఖురాన్ పాఠాలు చెప్పే సంస్థను కూడా భర్తతో కలిసి నడుపుతున్నారు. ‘‘నన్ను గెలిపిస్తే మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తా. వారిపై వేధింపులకు తెర దించేలా కఠిన చట్టాల కోసం కృషి చేస్తా’’ అని చెబుతున్నారు. భర్త బాటన... ఇక పెషావర్ నుంచి బరిలో దిగుతున్న సమర్ హరూన్ బిలౌర్ది మరో గాథ. గత ఎన్నికల వేళ ఆమె భర్త హరూన్ను ప్రచారం సందర్భంగా పాక్ తాలిబన్లు కిరాతకంగా కాల్చి చంపారు. దాంతో ఆయన స్థానంలో సమర్ బరిలో దిగాల్సి వచ్చింది. అవామీ వర్కర్స్ పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో నెగ్గి పెషావర్ నుంచి తొలి మహిళా ప్రొవిన్షియల్ ఎంపీగా రికార్డు సృష్టించారామె. దాంతో దేశ రాజకీయాల్లో ఆమె పేరు అందర్లోనూ నానింది. ఈసారి కూడా ఆమె మళ్లీ బరిలో దిగుతున్నారు. అఫ్గాన్ సరిహద్దులకు సమీపంలో ఉండే పష్తూన్ ప్రాబల్య నగరమైన పెషావర్లో, పరిసర ప్రాంతాల్లో మహిళలపై అణచివేత మరింత అధికం. మహిళలపై తీవ్ర అణచివేతలకు పేరుమోసిన తాలిబన్ల ప్రభావం మరింత ఎక్కువ. దాంతో సమర్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు మతోన్మాద మూకల బెదిరింపుల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూనే ప్రచారం చేశారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయంటారు సమర్. నిత్యం ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలను వింటూ, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండటం ఆమెకు బాగా పేరు తెచ్చింది. -
ఒక్కరోజే వంద దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు పార్టీకి శుక్రవారం ఒక్కరోజే వంద దరఖాస్తులు అందాయి. శుక్రవారం గాం«దీభవన్కు వచ్చిన పలువురు నేతలు తమ దరఖాస్తులను అందజేశారు. మహబూబాబాద్, నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ దర ఖాస్తులు రాగా, హైదరాబాద్లో తక్కువగా వచ్చా యి. దరఖాస్తు చేసుకున్న వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ (మల్కాజిగిరి), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్కర్నూల్), ఎంఆర్జీ వినోద్రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్కర్నూల్తో పాటు జనరల్ స్థానమైన మల్కాజిగిరి కోసం 4 దరఖాస్తులు అందజేశారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఇప్పటివరకు 141 దరఖాస్తులు రాగా, శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఖమ్మం బరిలో గడల, వంకాయలపాటి హాట్సీట్గా మారిన ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టికెట్ కోసం శుక్రవారం ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్లు దరఖాస్తు చేసు కున్నారు. గడల సికింద్రాబాద్ స్థానానికి కూడా దర ఖాస్తు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉండి, అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. అప్పట్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే రేవంత్ ప్రభుత్వం గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్లీవ్లో ఉన్న ఆయన ఉన్నట్టుండి గాం«దీభవన్లో దరఖాస్తులివ్వడం గమనార్హం. మెజార్టీ స్థానాలు గెలుస్తాం: బండ్ల గణేశ్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్రావుకు దరఖాస్తు ఇచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ ..విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. -
బీజేపీ ఒంటరి పోరు
సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతోంది. పొత్తులకు సంబంధించి రకరకాల ప్రచారం సాగుతున్నప్పటికీ, జాతీయ పార్టీ సూచనల మేరకు రాష్ట్ర పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గురువారం ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తోంది. కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ గురువారమే నియోజకవర్గ కార్యాలయాలను ప్రారంభిస్తోంది. గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులను భాగస్వాములను చేస్తోంది. నెల క్రితమే.. బీజేపీకీ ‘రాష్ట్రంలో ఒక్క అవకాశం – కేంద్రంలో మరో విడత’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా వాల్ పెయింటింగ్లు, పోస్టర్లు వేయించారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు 20 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ముగ్గురేసి ఒక కమిటీగా ఏర్పడి జిల్లాల్లో పర్యటించారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉండే అభ్యర్ధుల బయోడేటాలు సేకరించారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు 2,438 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జాతీయ పార్టీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్తో జరిగిన రాష్ట్ర ముఖ్యనేతల భేటీలో లోక్సభ స్థానాల్లో పోటీకి అవకాశం ఉన్న నాయకులు, పార్టీ బలాబలాలపై చర్చించారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్, సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులతో పాటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న పరిపూర్ణానంద స్వామి కూడా లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ, లోక్సభ స్థానాల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు కేవలం నామమాత్రంగా కాకుండా, పూర్తిస్థాయిలో పార్టీ పోటీలో ఉండేలా పార్టీ పలు చర్యలు చేపట్టింది. అభ్యర్ధులకు అన్ని విధాలా తోడ్పాటునందించేందుకు ప్రతి లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు 37 మందితో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో అంశాలను 37 విభాగాలుగా వర్గీకరించారు. ఒక్కొక్క విభాగం బాధ్యతలు ఈ కమిటీలోని ఒకరికి అప్పగించారు. పార్టీ ఎన్నికల కార్యక్రమాలను జాతీయ, రాష్ట్ర పార్టీ సులభంగా పర్యవేక్షించేలా ఐదేసి లోక్సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్గా విభజించి, 5 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అగ్రనేతలు రంగప్రవేశం.. ఎన్నికలకు సంబంధించి బీజేపీ రానున్న నెల రోజుల కార్యక్రమాలను సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత పార్టీ అగ్రనేతలు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, జెపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్లస్టర్ల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇతరత్రా కార్యక్రమాలు ఉండవు. ఒక వేళ రెండో పూట పర్యటన ఉంటే ఆ ప్రాంతంలోని వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఫిబ్రవరి 9, 10 తేదీల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు పర్యటించి, బూత్లవారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అక్కడ పార్టీ ఏజెంట్లుగా పనిచేసే వారిని గుర్తించి రాష్ట్ర పారీ్టకి నివేదిస్తారు. ఎన్నికల ప్రక్రియ జరిగే నెలన్నరలో రాష్ట్రమంతటా 20 వేల బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
విజయ్తో కాదు...నాతో నాకే పోటీ
‘‘నాకు, విజయ్కు మధ్య పోటీ లేదు. తనకు తానే పోటీ అని విజయ్ అంటుంటాడు. నేనూ అంతే. నాకు పోటీ నేనే’’ అన్నది రజనీకాంత్ లేటెస్ట్ స్టేట్మెంట్. ‘లాల్సలామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ ఈ విధంగా మాట్లాడారు. దీనికి ఓ కారణం ఉంది. ‘జైలర్’ సినిమా ఆడియో ఫంక్షన్ వేదికగా రజనీకాంత్ ఓ డేగ, కాకి కథ చెప్పారు. ‘కాకులు ఎంత అరిచినా వాటి అరుపులు పట్టించుకోకుండా డేగ ఆకాశానికి ఎగురుతూనే ఉంటుంది’ అంటూ తన జర్నీని ఉద్దేశించి ఆ కథ చెప్పారు రజనీ. దాంతో విజయ్ను ఉద్దేశించే ఆ కథ చెప్పారని కొందరు విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై తాజాగా చెన్నైలో జరిగిన ‘లాల్సలామ్’ ఆడియో లాంచ్ వేదికగా రజనీకాంత్ స్పందించారు. ‘‘జైలర్’ ఫంక్షన్లో నేను చెప్పిన కథ తప్పుగా ప్రచారంలోకి వెళ్లింది. విజయ్ని ఉద్దేశించే నేను ఆ కథ చెప్పానని ప్రచారం జరగడం బాధగా అనిపించింది. ‘ధర్మత్తిన్ తలైవన్’ సినిమా షూటింగ్ టైమ్లో విజయ్ తండ్రి చంద్రశేఖర్ నాకు అతన్ని పరిచయం చేసి, విజయ్ నటనపట్ల ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు. చదువు పూర్తి చేశాక ఇండస్ట్రీలోకి రావాలని విజయ్కి సలహా ఇచ్చాను. తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. ప్రతిభ, క్రమశిక్షణ, కష్టంతో విజయ్ పెద్ద స్టార్గా ఎదిగాడు. ఇకపై మా ఇద్దరి మధ్య పోటీ పెట్టొద్దని ఫ్యాన్స్ని కోరుతున్నాను’’ అన్నారు. ఇక ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. -
విశాఖలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు
-
విశాఖలో పోలీస్ కమాండో పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలకు చెందిన 23 టాప్ కమాండో బృందాలు పాల్గొనే 14వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్(ఏఐపిసిసి) సోమవారం విశాఖలోని ఏపీ గ్రేహౌండ్స్ గ్రౌండ్స్లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విశాఖ నగర సీపీ ఎ.రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి ప్రతిభ కలిగిన జట్టు విజయం సాధిస్తుందని, క్రీడాస్ఫూర్తితో తలపడాలన్నారు. ఏపీ గ్రేహౌండ్స్ అదనపు డీజీ రాజీవ్కుమార్ మీనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోందన్నారు. విశాఖలో 16 రాష్ట్రాల పోలీస్ కమాండో జట్లతో పాటు ఏడు పారామిలిటరీ దళాల కమాండో జట్లు ఐదు దశల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ సమగ్రతకు ఈ పోటీలు చక్కటి ఉదాహరణ అన్నారు. తొలుత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో ప్రారంభమై, ఉత్తరాఖండ్ జట్టు చివరగా మొత్తం 23 జట్లు గౌరవవందనం సమర్పించాయి. గ్రేహౌండ్ బ్యాండ్ మార్చ్పాస్ట్ అలరించింది. ఈ కార్యక్రమంలో ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్కుమార్ సింగ్, పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ ఏడీజీ అతుల్సింగ్, రేంజ్ ఐజీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడ.. ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం హడావుడి మొదలైంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు రూట్ క్లియర్ అనే ప్రచారం నేపథ్యంలో మిగిలిన 13 స్థానాల్లో మాత్రం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా వచ్చే నెల మొదటి వారంలోగా ఎంపీ అభ్యర్థుల ఖరారుపై స్పష్టత వచ్చేలా చూస్తామని అమిత్షా ప్రకటించారు. ఇందుకు అవసరమైన కసరత్తు వేగవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ను ఆయన ఆదేశించినట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎంపీ టికెట్ల కోసం తీవ్రపోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలు (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) మినహాయిస్తే, మల్కాజ్గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ► మహబూబ్నగర్ సీటు విషయానికొస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. ► చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సై అంటున్నారు. ► భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డా.బూరనర్సయ్యగౌడ్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► మహబూబాబాద్ టికెట్కు తేజావత్ రామచంద్రునాయక్, హుస్సేన్నాయక్, దిలీప్నాయక్ పోటీ పడుతున్నారు. ► ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్రెడ్డికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ లేదా గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్రావులకు అవకాశం ఇస్తారా చూడాలి. ► నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా లేకపోతే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత బరిలో దింపుతారా చూడాలి. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► పెద్దపల్లి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్కు మళ్లీ పోటీకి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. మల్కాజ్గిరి.. ఈటల గురి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన అమిత్ షాతో విడిగా ఈటల భేటీ అయ్యారు. లోక్సభకు పోటీపై మాట్లాడేందుకు సమయం కావాలని కోరగా, రెండు, మూడురోజుల్లో ఢిల్లీకి రావాలని చెప్పినట్టు తెలిసింది. పి.మురళీధర్రావు, పేరాల శేఖర్రావు, ఎన్.రామచందర్రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్.మల్లారెడ్డి, టి.వీరేందర్గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడానికి వీలుపడని పక్షంలో జహీరాబాద్, మెదక్ నుంచి అయినా పోటీ సిద్ధమే అన్న సంకేతాలు ఈటల ఇచ్చినట్టు సమాచారం. జహీరాబాద్.. ఏలేటి సురేశ్ రెడ్డి జహీరాబాద్ నుంచి పోటీకి అవకాశం కల్పించాలంటూ ఈ లోక్సభ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన వ్యాపారవేత్త ఏలేటి సురేశ్రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే ఆయన కిషన్రెడ్డిని కోరినట్టు తెలిసింది. ఈ విషయమై అధిష్టానానికీ విజ్ఞప్తి చేయగా, జనవరి 2న ఢిల్లీ వచ్చి కలవాలని ఆయనకు అమిత్షా చెప్పినట్లు తెలిసింది. డాక్టర్ కె.లక్ష్మణ్, వీరశైవ లింగాయత్ సమాజ్కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వరంగల్.. మందకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మరికొందరూ ఇదే సీటుకు పోటీపడుతున్నారు. నాగర్ కర్నూల్..బంగారు శ్రుతి నాగర్కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని బరిలో దింపవచ్చునని లేదంటే ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. హైదరాబాద్..రాజాసింగ్ హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. -
తెలంగాణ నుంచి సోనియా పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియాగాందీని తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానంతో కూడిన లేఖలను వ్యక్తిగతంగా సోనియగాంధీకి, అలాగే పార్టీ అధిష్టానానికి పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే అధ్యక్షతన దాదాపు రెండు గంటలకు పైగా పీఏసీ సమావేశం జరిగింది. సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు, పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయడంతో పాటు ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ నేతలు, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కేడర్, నాయకత్వం, అలాగే ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మొత్తం 3 తీర్మానాలను ఆమోదించారు. రేపట్నుంచి శ్వేతపత్రాలు కాంగ్రెస్ 10 రోజుల పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్ ప్రభుత్వ పనితీరును పలువురు సభ్యులు అభినందించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్పారు. ఇటీవల జరిగిన అధికారుల నియామకాలు, బదిలీల్లో కూడా ఈ విషయం వెల్లడైందని అన్నారు. రాష్ట్ర ఆర్థి క పరిస్థితిని, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖల్లో వాస్తవిక పరిస్థితులను ప్రజల ముందు పెట్టేందుకు బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. లోక్సభ టార్గెట్ 15 వచ్చే ఏప్రిల్లో జరుగుతాయని భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధతపైనా సమావేశంలో చర్చించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పీఏసీ సభ్యులు కోరారు. కాగా లోక్సభ టికెట్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్రాంతి లోపే పదవులు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున నామినేటెడ్ పదవులు ఇస్తే పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పీఏసీ సభ్యులు సూచించారు. వీలున్నంత త్వరగా భర్తీ చేయడం ద్వారా రెండేళ్ల కాలపరిమితికి అనుగుణంగా మరో రెండుసార్లు ఈ పోస్టులకు పార్టీ నేతలను ఎంపిక చేయవచ్చని, దాదాపుగా 1,000 మందికి అవకాశం కల్పించవచ్చని చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే, సంక్రాంతి పండుగ లోపే నామినేటెడ్ పదవులపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని, అధిష్టానం పెద్దలతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేపడతానని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీల అమలు ఆరు గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఈ పథకాల అమలు పార్టీ కేడర్ ద్వారా సక్రమంగా జరిగేలా చూడాలని రేవంత్ కోరారు. పథకాల అమలుతో పాటు లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతలు, కేడర్ చురుకుగా ఉండి అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. బూత్ స్థాయి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఓటర్ల జాబితా సవరణలపై చర్చ జరగ్గా.. ఈ సందర్భంగా పార్టీ పక్షాన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ వివరించారు. ఫిబ్రవరి 8న ప్రకటించే తుది జాబితా ప్రాతిపదికనే లోక్సభకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణల కోసం బూత్ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్ చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఓటర్లను చేర్పించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాజీ మంత్రులు జానారెడ్డి, టి.జీవన్రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్చౌదరి, విష్ణునాథ్, పీఏసీ సభ్యులు జగ్గారెడ్డి, వంశీచందర్రెడ్డి, సంపత్కుమార్, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్రెడ్డి, హర్కర వేణుగోపాల్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ఇన్చార్జులు ఖరారు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు రెండేసి చొప్పున నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా, మంత్రి పదవుల్లో లేని సీనియర్ నేతలు జీవన్రెడ్డి, సుదర్శన్రెడ్డిలకు కూడా ఇన్చార్జి బాధ్యతలిచ్చారు. మిగిలిన 9 మంది మంత్రులకు 9 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వీరంతా మంగళవారం నుంచే లోక్సభ ఎన్నికల పనిలో ఉంటారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు కేటాయించిన నియోజకవర్గాల్లో మంత్రులదే బాధ్యతని తెలిపాయి. ఇన్చార్జులు వీరే: చేవెళ్ల, మహబూబ్నగర్ – రేవంత్రెడ్డి సికింద్రాబాద్, హైదరాబాద్– భట్టి విక్రమార్క మెదక్ – దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ – సీతక్క నల్లగొండ – ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వరంగల్ – కొండా సురేఖ ఖమ్మం, మహబూబాబాద్ – పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పెద్దపల్లి – శ్రీధర్బాబు కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ – టి.జీవన్రెడ్డి జహీరాబాద్ – పి.సుదర్శన్రెడ్డి మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు నాగర్కర్నూల్ – జూపల్లి కృష్ణారావు ఆరు గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని పీఏసీ కన్వినర్ షబ్బీర్ అలీ వెల్లడించారు. గాం«దీభవన్లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేసే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రారంభిస్తుందని తెలిపారు. 28 నుంచి 15 రోజుల పాటు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఎలాంటి వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో జరిగే సభకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
గట్టిపోటీ... అధిక సీట్లు...
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ రాష్ట్రంలో కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 25 నుంచి 30 సీట్లలో బీజేపీ నిర్ణయాత్మకంగా వ్యవహరించడంతో పాటు వాటిలో అధిక స్థానాలు గెలుచుకోవడంపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఆ స్థానాల్లో పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం నినాదంతోపాటు కీలక స్థానాల్లో ప్రచారం చివరి రోజుల్లో అగ్రనేతల విస్తృత ప్రచారం పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి వస్తుందని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆయా వర్గాల ఓట్లు చీలితే పలుచోట్ల బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతలంతా ఇక్కడే... ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ముఖ్య నేతలు విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హైదరాబాద్లోనే మకాం వేసి సంస్థాగతంగా పార్టీ యంత్రాంగం ఏ మేరకు ఎన్నికల యాజమాన్య నిర్వహణ చేస్తోందో లోతుగా సమీక్షిస్తున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్చుగ్, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్తో సంతోష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి ఒక ముఖ్యనేతను ఇన్చార్జిగా నియమించి, పోలింగ్ ముగిసేదాకా అన్ని అంశాలను సమన్వయం చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రధాని సుడిగాలి పర్యటనపై ఆశలు ప్రచారపర్వం ముగిసేలోగా పీఎం మోదీ వరుసగా మూడురోజులు...ఆరుసభల్లో పాల్గొనడంతో పాటు చివర్లో హైదరాబాద్లో రోడ్షో నిర్వహించనున్నారు. 25న కామారెడ్డి (కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ) నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), రంగారెడ్డి జిల్లా(మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కల్వకుర్తి,), 26న తూఫ్రాన్ (గజ్వేల్, దుబ్బాక, మేడ్చల్, మెదక్, నరసాపురం), నిర్మల్ (నిర్మల్, ముథోల్, బాల్కొండ, ఖానాపూర్), 27న మహబూబాబాద్ (మహబూబాబాద్, ములుగు, తదితర ఎస్టీ స్థానాలు) కరీంనగర్ (కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి, కోరుట్ల) ఇలా ఆయా ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలోని వివిధ వర్గాల ఓటర్లపై ప్రభావం చూపేలా మోదీ ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. బీసీ, ఎస్సీల అండపై అంచనాలు..ఎస్టీలకు హామీ? అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కోవడంతో పాటు ఆ పార్టీలకు చెక్ పెట్టేలా బీసీ నేతను సీఎంను చేస్తామన్న ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాస్త అలస్యంగా ప్రకటించినా..ఈ నినాదాన్ని బీజేపీ తన ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోగలిగింది. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ ఉపకులాల వారీగా రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ మద్దతు ప్రకటన మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామనే హామీ కూడా బీజేపీ నేతలు త్వరలోనే ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఓ అంచనా ప్రకారం బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు... ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని... ముథోల్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్ ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో... కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), ఆర్మూరు, జుక్కల్ ♦ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్ల, మానకొండూరు ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో... వరంగల్ (ఈస్ట్), పరకాల, ములుగు, మహబూబాబాద్ ♦ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో... మహేశ్వరం, ఎల్బీనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ♦ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో... కల్వకుర్తి, మహబూబ్నగర్, మక్తల్ ♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో... దుబ్బాక, పటాన్ చెరు, నరసాపూర్, ♦ నల్లగొండ జిల్లాలో... సూర్యాపేట, మునుగోడు ♦ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో... గోషామహల్. అంబర్పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి -
బీజేపీ నేతలొస్తే తరిమికొట్టండి
గజ్వేల్/దుబ్బాకటౌన్: బీడీ కట్టల మీద, పాల మీద జీఎస్టీ వేసి, గ్యాస్ ధరలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పిన బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నేతలను ఈ అంశాలపై నిలదీసి చీపుర్లతో తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌర స్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీ వంద అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఏనాడూ గజ్వేల్ ప్రజలను పట్టించుకోని ఈటల రాజేందర్ ఇప్పుడు కొత్తగా ఎన్నికల బరిలో కి వచ్చి.. వరుసలు కలుపుతూ తెగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిన్నింటి వాసా లు లెక్కపెట్టేవిధంగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్పైనే పోటీకి దిగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ వస్తే కటిక చికటే మిగులుతుందని, ఆ పార్టీ కర్ణాటకలో కనీసం మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఇదే రకమైన పరిస్థితి వస్తుందన్నారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మోసపూరిత విధానాలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్లకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను కల్పిస్తామన్నారు. గజ్వేల్లో కేసీఆర్కు లక్ష ఓట్ల మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుంజ వాయిద్యంతో ఆకట్టుకున్న మంత్రి సీఎం కేసీఆర్కు మద్దతుగా సోమవారం నిర్వహించిన విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు రుంజ వాయిద్యం వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. విశ్వకర్మలకు చెందిన రుంజ కళాకారులు ఈ వాయిద్యంతో అందరినీ అలరిస్తుంటారు. హరీశ్రావు సైతం కొద్దిసేపు వాయించి సభికులను ఉత్సాహపరిచారు. కాగా సీఎం కేసీఆర్కే మా మద్దతు అంటూ.. విశ్వకర్మ సంఘం నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రికి పత్రాలు అందజేశారు. బీజేపీ డకౌట్.. కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ రాష్ట్రంలో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ వస్తుందని హరీశ్రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు తామే అధికారంలోకి వస్తామంటూ చెబుతున్నారని, కానీ వారి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. బీజేపీపై నమ్మకం లేకనే ఆ పార్టీ నుంచి విజయశాంతి, వివేక్, రాజగోపాల్రెడ్డితో పాటు రోజుకో నాయకుడు బయటకు వెళ్లిపోతున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనన్నారు. -
గెలిచామా.. ఓడామా.. కాదు
‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా’.. ఈ పూరీ మార్కు డైలాగ్ను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలామంది..’’ గెలిచామా.. ఓడామా.. కాదు పోటీ చేశామా లేదా అన్నదే ముఖ్యం’’ అన్న రీతిన మార్చేసి బరిలో సై అంటున్నారు. మునుపెన్నడూ అంతగా లేని విధంగా ఈసారి ఎన్నికల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచే కాకుండా చిన్నాచితకా పార్టీల నుంచి, ఇండిపెండెంట్లు కలిపి రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా 2,290 మంది పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 20 మంది పోటీ చేస్తున్నారన్న మాట. ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే 65 చాలా నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగించాల్సి వస్తోంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 16లోపు ఉంటేనే ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది.కానీ, ఈసారి అంతకంటే ఎక్కువ మంది 65 స్థానాల్లో బరిలో ఉండడంతో బ్యాలెట్ యూనిట్లను పెంచాల్సి వస్తోంది. ఎల్బీనగర్ టాప్ ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఎక్కువ మంది పోటీ చేస్తున్న జాబితాలో ఎల్బీనగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ఏకంగా 48 మంది అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి 44 మంది బరిలో ఉన్నారు. ఇక, ఏడుగురే పోటీలో ఉండి రాష్ట్రంలో అతి తక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా బాన్సువాడ నిలిచింది. పది మంది కంటే తక్కువగా పోటీ చేస్తున్న నియోజకవర్గాలు మొత్తం నాలుగు కాగా, 20నుంచి 30 మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 33, 30 మంది కంటే ఎక్కువ మంది పోటీ చేస్తున్న నియోజకవర్గాలు 13 ఉన్నాయి. మొత్తం స్థానాల్లో నామినేషన్ వేసిన 2898 అభ్యర్థులలో 608 మంది విత్డ్రా చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించించిన సంగతి తెలిసిందే. పేరు కోసం ఒకరైతే... పోటీ చేయాలనే తపన మరొకరిది ఎలాగైనా పోటీ చేయాలని కొందరు అభ్యర్థులు భావిస్తే మరికొందరు పేరు కోసం పోటీ చేసినట్టుగా ఉంది. ఏదో నామినేషన్ వేశామా లేదా అన్నట్లుగా పోటీలో ఉంటున్నారు. ప్రచారం చేయడం కానీ, ఎన్నికల సంఘం కేటాయించిన తన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఇప్పటి వరకైతే చేయడంలేదు. మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, అభ్యర్థిపై నిరసనతోనో...లేక ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదనో పోటీకి దిగుతున్నారు.. కొన్నిచోట్ల సొంతపార్టీ నుంచి టికెట్ రాక రెబల్స్గా పోటీ చేస్తున్నారు. మరో వైపు అభ్యర్థి ఓట్లను చీల్చాలని మరికొందరు పోటీ చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. -
దిగ్గజాలకు చిన్న సంస్థల సవాల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీలకు చిన్న సంస్థలు సవాళ్లు విసురుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో చిన్న బ్రాండ్లు మళ్లీ బలంగా పుంజుకుంటున్నాయి. పెద్ద సంస్థలకు బలమైన పోటీనిస్తున్నాయి. మార్కెట్లో వాటాను పెంచుకంటూ, పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించక తప్పని పరిస్థితులను కలి్పస్తున్నాయి. సబ్బులు, టీ, డిటర్జెంట్, బిస్కట్ల విభాగంలో ఈ పరిస్థితి ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా.. చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఉత్పత్తుల ధరలను సవరించాల్చి వచి్చనట్టు పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణం గరిష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థలకు ఉత్పత్తుల తయారీపై అధిక వ్యయం అవుతుంది. దీంతో అవి పెద్ద సంస్థలకు ధరల పరంగా గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండదు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు ఎక్కువగా ఉండడంతో అవి అధిక డిస్కౌంట్లు ఇవ్వగలవు’’అని బ్రిటానియా ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ ఇన్వెస్టర్ల కాల్లో పేర్కొన్నారు. ఒక్కసారి కమోడిటీల ధరలు తగ్గడం మొదలైతే, వాటి మార్జిన్లు పెరుగుతాయని, దీంతో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మొదలు పెడతాయన్నారు. కొన్ని విభాగాల్లో అధిక పోటీ ‘‘ఒకవైపు బలమైన బ్రాండ్లతో పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ధరల యుద్ధంతో అవి మార్కెట్ వాటాను చిన్న సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. మేము ఈ చట్రంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. రెండింటి మధ్య సమతుల్యం ఉందనుకున్న విభాగంలోనే ముందుకు వెళతాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొనడం గమనార్హం. టీ పొడి మార్కెట్లో ప్రాంతీయంగా చిన్న సంస్థల నుంచి పోటీ ఉన్నట్టు తెలిపింది. ఇతర విభాగాల మాదిరిగా కాకుండా, టీ మార్కెట్లో అన్ బ్రాండెడ్ కారణంగా చిన్న సంస్థలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో దీని కారణంగా కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందంటూ.. తమ ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరుగుతున్నందున ఇది తమపై ఏమంత ప్రభావం చూపబోదని వాటాదారులకు టాటా కన్జ్యూమర్ వివరించింది. ధరలు తగ్గింపు.. చిన్న సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, వాటి కారణంగా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని విభాగాల చిన్న సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించి, వినియోగదారులకు విలువను చేకూర్చే చర్యలు అమ్మకాల వృద్ధికి వచ్చే కొన్ని త్రైమాసికాల్లో దోహదపడతాయి’8అని సౌగత గుప్తా తెలిపారు. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్యాదవ్ కార్పొరేటర్గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్లో 2014లో గోపాల్పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జగదీశ్వర్గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్అలీ, మాజిద్ హుస్సేన్లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్యాదవ్ సనత్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
గజ్వేల్ జేజేల కోసం..
యెన్నెల్లి సురేందర్ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. గజ్వేల్ గడ్డ పై మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. కేసీఆర్ : అభివృద్ధి ఎజెండా ఈటల : బీసీ మంత్రం నర్సారెడ్డి : లోకల్ ఫ్లేవర్ అభివృద్ధి మంత్రం.. బహుముఖ వ్యూహం ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్ గజ్వేల్ను రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారు. నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి, ఎడ్యుకేషన్ హబ్ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి బూత్లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేలా వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రజా ఉద్యమాలకు ఊపిరి... గజ్వేల్, తూప్రాన్, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక, కుకునూర్పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం యాదాద్రి, జనగామ, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సరిహద్దున ఉన్నది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ను ఆనుకొని ఉండటం వల్ల ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి. నిర్వాసితులను ఆకట్టుకునే ప్రయత్నం గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన సంగతి తెలిసిందే. ఆయా గామాల్లో 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఎన్నికల్లో తమకు మద్దతు ప్రకటిస్తే పోరాడుతామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈటల ముమ్మర ప్రచారం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాతో ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో సుమరుగా 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గం ముదిరాజులు 55వేల వరకు ఉంటారు. వీరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పేరిట 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డారని చెబుతూ...వారందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1992 నుంచి సుమారు పదేళ్లకుపైగా ఈటల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ’లోకల్’ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నేను లోకల్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా స్థానిక వ్యక్తి కాదని, ఆయన గెలిచినా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. -
అందరి దృష్టి కామారెడ్డిపైనే..
ఎస్. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాలన్న పట్టుదలతో కేసీఆర్లో కామారెడ్డిలో బరిలోకి దిగగా, ఆయనపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోటీకి దిగడమే చర్చకు ప్రధాన కారణం. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు జనం నాడి పట్టేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి. కేసీఆర్, రేవంత్రెడ్డితోపాటు బీజేపీ నుంచి స్థానికంగా గట్టి పట్టు సంపాదించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. మూడ్ ఎలా ఉంటుందో.. సాధారణంగా వీవీఐపీలు పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రజల నాడి త్వరగా బయటపడుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తుండడం, వారికితోడు స్థానికుడైన బలమైన నాయకుడు బరిలో ఉండడంతో పోటీ ఎవరి మధ్యన ఉంటుందన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ రావడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన కొన్ని సెక్షన్లలో ఉండడం సహజం. అధికార బీఆర్ఎస్పై ఉన్న ఒకింత వ్యతిరేకత ఓట్లను ప్రతిపక్ష పార్టీలు రెండూ పంచుకుంటే అధికార పార్టీకి లాభం జరుగుతుందనే అంచనాలు ఉంటాయి. పేగుబంధం సెంటిమెంట్తో కేసీఆర్ రెండు పర్యాయాలుగా గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్తో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. తాను పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఐదారు నియోజక వర్గాలపై ప్రభావం చూపవచ్చనే ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. 44వ నంబరు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్కు కేవలం గంటన్నరలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ తల్లి పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఈ ప్రాంతంతో ఆయనకు పేగుబంధం ఉన్నది. ఇక్కడ పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్ఛిన దరిమిలా కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. సర్వేల మీద సర్వేలు... ఇప్పుడు కామారెడ్డి సర్వే రాయుళ్లకు కేరాఫ్ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. జనం నాడి పట్టేందుకు ఓ పక్క రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటుండగా, మరో పక్క నిఘా వర్గాలు, మీడియా సంస్థలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి. కాటిపల్లి ’లోకల్’ బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నాలుగైదేళ్లుగా నియోజక వర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, మాస్టర్ ప్లాన్తో నష్టం జరుగుతోందని ఆందోళన చెందిన రైతుల కోసం ఈయన అండగా అండగా నిలిచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద పోరాటమే చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో జనంతో మమేకమైన వెంకటరమణారెడ్డి తనకు స్థానికులు ఓట్లు వేసి పట్టం కడతారని ఆశిస్తున్నారు. ఆ మేరకు రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించాడు. సీఎం పోటీ చేస్తున్నా.. వెరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సవాల్ చేసి మరీ బరిలోకి దిగిన రేవంత్... అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన జరిగే మాటల యుద్ధంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సీఎంకు దమ్ముంటే కొడంగల్కు వచ్చి నిలబడమని లేదంటే, తానే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానంటూ పలుమార్లు సవాళ్లు విసిరారు. సీఎం గానీ, ఆయన పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ సవాల్ విసిరిన రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. -
అదే బరి.. వీరులు వారే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ కాదు. పదేపదే పోటీ చేస్తుంటే..ఓసారి గెలిచి మరోమారు ఓడిపోతుంటే.. పదే పదే గెలుస్తుంటే.. లేదా పదే పదే ఓడిపోతుంటే.. ఆ ఉత్కంఠ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అలా పదేపదే పోటీ చేయడం కత్తిమీద సాము లాంటిదే. పోటీ చేసిన వారే పదేపదే పోటీ చేయడం.. ఒకే నియోజకవర్గంలో నేతలు రెండు నుంచి ఐదు సార్లు తలపడితే వారినే ‘పాతకాపు’లంటారు. నియోజకవర్గం మారినా, పార్టీలు మారినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ వారి మధ్యనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అలా పాతుకుపోతారంతే. ఇలాంటి పాతకాపులు ఈసారి కూడా హోరాహోరీ తలపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతకాపుల పోటాపోటీ ఎలా ఉందంటే..! నిజామాబాద్ బోధన్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి హోరాహోరీ తలపడిన షకీల్ అహ్మద్, సుదర్శన్రెడ్డి ఈసారి కూడా అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్లోనూ పాతకాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. 2018లో నిల్చున్న బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్), భూపతిరెడ్డి (కాంగ్రెస్)లు ఈసారీ బరిలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్రెడ్డి (బీఆర్ఎస్)పై గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన తలపడిన సునీల్కుమార్ ఈసారి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఆదిలాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు పాతకాపులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తలపడిన కోనేరు కోనప్ప (బీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీశ్ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్), జి.వినోద్లు మళ్లీ పోటీ పడుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలో ఉన్నారు. మంచిర్యాలలో ఎన్.దివాకర్రావు (బీఆర్ఎస్), కె.ప్రేమ్సాగర్రావు (కాంగ్రెస్) మళ్లీ అవే పార్టీల తరఫున రంగంలోకి దిగారు. నిర్మల్లో వరుసగా ఏడోసారి ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనపై రెండు వరుస ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన మహేశ్వర్రెడ్డి, కూచాడి శ్రీహరిరావులిద్దరూ ఈసారి ఆయనపై బీజేపీ, కాంగ్రెస్ల నుంచి పోటీలో నిలిచారు. ఖమ్మం పినపాకలో గత ఎన్నికల్లో రేగా కాంతారావు (కాంగ్రెస్), పాయం వెంకటేశ్వర్లు (బీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా, ఇప్పుడు కూడా వీరే తలపడుతున్నా పార్టీలు మారారు. ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియానాయక్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మధిరలో గత నాలుగో ఎన్నికల్లోనూ మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్రాజ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భట్టి కాంగ్రెస్ అభ్యర్థి గా నాలుగుసార్లు రంగంలో ఉండగా, కమల్రాజ్ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పొదెం వీరయ్య (కాంగ్రెస్), తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మెదక్ అందోల్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్), చంటి క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్)లు వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్), చింత ప్రభాకర్ (బీఆర్ఎస్)లు వరుసగా నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. పటాన్చెరులోనూ 2018 ఎన్నికల్లో తలపడిన మహిపాల్రెడ్డి (బీఆర్ఎస్), శ్రీనివాస్గౌడ్ (కాంగ్రెస్)లే 2023 ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు. వరంగల్ డోర్నకల్లో రెడ్యానాయక్ (బీఆర్ఎస్), రామచంద్రునాయక్ (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్), పెద్ది సుదర్శన్రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి తలపడుతున్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్ఎస్), గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్) రెండోసారి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి, సత్యనారాయణరావు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరిలో వరుసగా రెండోసారి మైనంపల్లి హనుమంతరావు, ఎస్.రాంచందర్రావు (బీజేపీ)ల నడుమ పోరు జరుగుతోంది. మైనంపల్లి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దిగగా, ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్లో కేపీ వివేకానంద (బీఆర్ఎస్), కూన శ్రీశైలం గౌడ్ మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. శ్రీశైలం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం జనరల్ స్థానంగా మారిన తర్వాత జరుగుతున్న నాలుగు ఎన్నికల్లోనూ మంచిరెడ్డి కిషన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గతంలో బీఎస్పీ నుంచి, ఇండిపెండెంట్గా పోటీచేసిన మల్రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటున్నారు. పరిగిలో కొప్పుల మహేశ్రెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి మధ్య బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వరుసగా రెండోసారి పోటీ జరుగుతోంది. వికారాబాద్లోనూ మెతుకు ఆనంద్ (బీఆర్ఎస్), గడ్డం ప్రసాద్కుమార్ (కాంగ్రెస్) రెండోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ జగిత్యాల నుంచి సంజయ్కుమార్ (బీఆర్ఎస్), టి.జీవన్రెడ్డి (కాంగ్రెస్) వరుసగా మూడోసారి తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరోసారి విజయం సాధించగా, ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)పై అడ్లూరి లక్ష్మణ్కుమార్ (కాంగ్రెస్) వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఐదు ఎన్నికల్లో ఓటమిపాలైనా గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంథనిలో పుట్టా మధు (బీఆర్ఎస్), దుద్దిళ్ల శ్రీధర్బాబు (కాంగ్రెస్) వరుసగా నాలుగోసారి ఢీ కొడుతున్నారు. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్రెడ్డి (బీఆర్ఎస్), విజయరమణారావు (కాంగ్రెస్) వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)పై బండి సంజయ్ (బీజేపీ) వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. చొప్పదండిలోనూ సుంకె రవిశంకర్ (బీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ నెలకొంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ (బీఆర్ఎస్)పై పాతకాపు కె.కె.మహేందర్రెడ్డి (కాంగ్రెస్) మరోమారు పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మినహా గత నాలుగు ఎన్నికల్లోనూ ఆ ఇద్దరే ముఖాముఖి తలపడటం గమనార్హం. నల్లగొండ దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో బాలూనాయక్ (కాంగ్రెస్), రవీంద్రకుమార్ (బీఆర్ఎస్) రెండోసారి తలపడుతున్నారు. కోదాడలో పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), బొల్లం మల్లయ్య (బీఆర్ఎస్), సూర్యాపేటలో జగదీశ్రెడ్డి (బీఆర్ఎస్), దామోదర్రెడ్డి (కాంగ్రెస్)లు వరుసగా రెండుసార్లు తలపడుతున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భూపాల్రెడ్డి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (కాంగ్రెస్), కె. ప్రభాకర్రెడ్డి (బీఆర్ఎస్) మధ్య కూడా వరుసగా మూడోసారి పోటీ జరుగుతోంది. భువనగిరిలో పైళ్ల శేఖర్రెడ్డి (బీఆర్ఎస్), కుంభం అనిల్కుమార్రెడ్డి (కాంగ్రెస్) మధ్య కూడా వరుసగా రెండోసారి సమరం జరుగుతోంది. నకిరేకల్లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యల నడుమ మూడోసారి పోటీ జరుగుతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసిన పార్టీలు వేర్వేరు కావడం గమనార్హం. మహబూబ్నగర్ కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి (బీఆర్ఎస్) నడుమ రెండోసారి యుద్ధం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు (బీఆర్ఎస్), చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్) కూడా వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కల్వకుర్తి నుంచి జైపాల్యాదవ్ (బీఆర్ఎస్), టి.ఆచారి (బీజేపీ) కూడా రెండోసారి పోటీ పడుతున్నారు. కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), హర్షవర్దన్రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. -
సింగపూర్ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’
హైదరాబాదీ వంటకం బిరియానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగపూర్లో జరిగిన ఫేవరెట్ హాకర్ ఆహార పోటీల్లో ఈ హైదరబాదీ వంటకం విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 12 ఆహార పదార్థాలను విజేతలుగా ఎంపిక చేయగా అందులో బిరియాని ఒకటిగా నిలిచింది. అక్కడ బిరియాని తయారీకి ప్రసిద్ధి చెందిన హాజీ హనీఫా ఎం అన్సారీ ఈటింగ్ హౌజ్ బహుమతిని అందుకుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సిటీ ఎనర్జీ పీటీఈ లిమిటెడ్ అనే సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఈ సంస్థ అక్కడి ఫుడ్ కోర్టులు, ఆహార దుకాణాలకు గ్యాస్ను సరఫరా చేస్తుంది. జులై 4 నుంచి సెప్టెంబర్ 15 వరకు దాదాపు రెండున్నర నెలలపాటు ఈ పోటీలు జరిగాయి. 13వ వార్షిక సిటీ హాకర్ (వీధి దుకాణాలు) ఫుడ్ హంట్లో భాగంగా సింగపూర్ ప్రత్యేకమైన హాకర్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతకు 500 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.30 వేలు), మెడల్, సర్టిఫికెట్ను అందజేస్తారు. -
కొడంగల్లో ‘బంటు’ సిద్దిపేటలో శ్రీకాంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ అధిష్టానం మంగళవారం విడుదల చేసింది. కసరత్తు పూర్తి చేసిన తర్వాత 12 మంది అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్సింగ్ ప్రకటన జారీ చేశారు. బీజేపీ ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పార్టీతో పొత్తు, సీట్ల అంశంపై జరుగుతున్న చర్చల్లో స్పష్టత వచ్చాక మిగిలిన అభ్యర్థులను ప్రకటించనుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వి.సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి స్థానాన్ని, చల్లమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు, తుల ఉమకు వేములవాడ, బొమ్మ శ్రీరామ్చక్రవర్తికి హుస్నాబాద్ స్థానాన్ని కేటాయించింది. బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్–బొమ్మ శ్రీరామ్చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్రెడ్డి, వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్కుమార్, కొడంగల్– బంటు రమేశ్కుమార్, గద్వాల్– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. -
16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుద లైంది. 16 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థు లను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ, ఐదు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కామారెడ్డి నుంచీ సీఎం కేసీఆర్పై బరిలో దింపారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన జి.వివేకానందకు చెన్నూ రు టికెట్ ఇచ్చారు. ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సు వాడ నుంచి, షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ నారాయణ్ఖేడ్ నుంచి, నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నుంచి పోటీ చేయనున్నారు. తాజా జాబితాలో 14 స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించగా, మరో రెండు స్థానాలకు గతంలో ప్రకటించిన అభ్యర్థులను మార్చారు. గతంలో బోథ్ నియోజకవర్గానికి వన్నెల అశోక్ పేరును ప్రకటించగా, తాజాగా ఆ యన స్థానంలో ఆదె గజేందర్కు అవకాశం ఇచ్చింది. అలాగే వనపర్తికి గతంలో జిల్లెల చిన్నారెడ్డి పేరు ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. అనేక కసరత్తుల తర్వాత ఆయన స్థానంలో తుడి మేఘారెడ్డిని బరిలోకి దింపుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో కలిపి మొత్తం 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐకి కొత్తగూడెం కేటాయించగా.. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ సీట్లను పెండింగ్లో ఉంచింది. ఒకవేళ సీపీఎంతో చర్చలు సఫలం అయితే వారికి మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ధుంధాడ్లో దూకుడెవరిదో!
ధుంధాడ్. రాజస్తాన్కు అధికార కేంద్రంగా చెప్పుకునే ప్రాంతం. రాష్ట్ర రాజకీయాలకు కూడా ఒకరకంగా ఆయువుపట్టు. పైగా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ ఎక్కువ సీట్లు సాధించిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. అందుకే 32 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం కాంగ్రెస్, బీజేపీ ఈసారి కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ధుంధాడ్ ఒక్కోసారి ఒక్కో పార్టీని అందలమెక్కిస్తూ వస్తోంది. ఈసారి ఇక్కడ ఎవరు దూకుడు ప్రదర్శిస్తారన్నది ఆసక్తికరంగా మారింది... ధుంధాడ్ తూర్పు–మధ్య రాజస్తాన్లో ఉన్న ప్రాంతం. తొలుత ఇక్కడ 25 అసెంబ్లీ స్థానాలుండేవి. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం 32కు పెరిగాయి. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 11, కాంగ్రెస్ 13 సీట్లు గెలిచాయి. ఐదు సీట్లలో స్వతంత్రులు, రెండింట్లో బీఎస్పీ నెగ్గగా ఒకటి లోక్తాంత్రిక్ సమాజ్వాదీ ఖాతాలోకి వెళ్లింది. కానీ 2013లో మాత్రం బీజేపీ ఇక్కడ ఏకంగా 28 స్థానాలను గుప్పిట పట్టి కాంగ్రెస్ను కేవలం ఒక్క స్థానానికి పరిమితం చేసింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 2, స్వతంత్రులు ఒక సీటు గెలుచుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పరిస్థితి మారింది. కాంగ్రెస్ 20 సీట్లు హస్తగతం చేసుకుంది. బీజేపీ ఆరింటితో సరిపెట్టుకుంది. స్వతంత్రులు కూడా ఆరు సీట్లలో గెలవడం విశేషం. ఇక్కడి పట్టణ ప్రాంతాలు సాంప్రదాయికంగా బీజేపీకి కంచుకోటలంటారు రాజకీయ విశ్లేషకుడు నారాయణ్ బరేథ్. ఇక్కడ ఎక్కువగా ఉండే బ్రాహ్మణ, బనియా సామాజికవర్గాల వాళ్లు బీజేపీని తమ పార్టీగా భావిస్తుండటమే ఇందుకు కారణమన్నారాయన. ధుంధాడ్లో పోయినసారి కాంగ్రెస్ ప్రదర్శన బాగున్నా ఈసారి మాత్రం పోటీ హోరాహోరీగా ఉండనుందని జోస్యం చెప్పారు. ‘‘అయితే ఇరు పార్టీలనూ వర్గపోరు కుంగదీస్తోంది. దాన్ని సరి చేసుకుని ప్రచారంలో దూకుడుగా వెళ్లడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త పడేవాళ్లదే ఈసారి ధుంధాడ్లో పైచేయి’’అని అభిప్రాయపడ్డారు. రాచరికపు ప్రభావం... ధుంధాడ్ ప్రాంతంపై జైపూర్ రాజ వంశీకుల ప్రభావం చాలా ఎక్కువ. స్కూళ్లు, కాలేజీలు వంటి పలు విద్యా సంస్థలు, ఆస్పత్రులు తదితర నిర్మాణాలతో ప్రజల్లో రాజ కుటుంబం మంచి ఇమేజీ తెచ్చుకుంది. 1962 దాకా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో స్వతంత్ర పార్టీ ఆవిర్భావంతో కథ మారింది. మహరాణి గాయత్రీ దేవి సారథ్యంలో ఆ పార్టీ ప్రాబల్యం పెరిగింది. ఆ ఇమేజీని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ఈసారి రాజ వంశానికి చెందిన తమ ఎంపీ దియా కుమారిని విద్యాధర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపింది. కుల ప్రభావం ఎక్కువ హీరాలాల్ శాస్త్రి, తికారాం పలివాల్ రూపంలో రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన చరిత్ర ధుంధాడ్ ప్రాంతానిది. ఇక్కడ కుల సమీకరణలు చాలా కీలకంగా ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ ఉండగా గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుంటాయి. కాకపోతే గుజ్జర్లు తమ సామాజిక వర్గానికి చెందిన సచిన్ పైలట్కు 2018లో సీఎం అవకాశం ఇవ్వనందుకు ఈసారి కాంగ్రెస్పై బాగా అసంతృప్తితో ఉన్నారు. ధుంధాడ్లో చాలా నియోజకవర్గాల్లో గుజ్జర్ల ప్రాబల్యమున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్కు ఇబ్బందికరంగానే మారే అవకాశముంది. మీనా, ఎస్సీ సామాజికవర్గాల్లోనూ కాంగ్రెస్కు ఆదరణ ఉంది. బ్రాహ్మణ, రాజ్పూత్, బనియాలు బీజేపీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటూ వస్తున్నారు. -
ఒంటరిగానే పోటీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గురువారం ఎంబీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు ప్రయత్నించామని, రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ రెండు స్థానాలేమిటో కాంగ్రెస్ చెప్పలేదన్నారు. కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ పార్టీ వైఖరి వల్లే పొత్తు నుంచి తప్పుకొని ఒంటరిగా పోటీకి నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని తెలిపారు. తొలుత 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఈ సంఖ్య పెరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఐక్య పోటీపై సీపీఐ వైఖరి చెప్పలేదు.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని తమ్మినేని పేర్కొన్నారు. అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని, ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేసినా ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతరులెవరున్నా సీపీఎం మద్దతుగా నిలుస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. 17 స్థానాలు ఇవే... ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ (ఎస్సీ), భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ జాబితాలో ముషీరాబాద్ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్ పేరు ఖరారైనట్లు తెలిసింది. -
తటస్థులు, మేధావులకూ బీజేపీ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్న వ్యూహంతో కమలదళం ముందుకు వెళ్లనుంది. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీ పిస్తున్నా టికెట్లు ఖరారు కాలేదంటూ, మేనిఫెస్టో, ప్రచార వ్యూహమే ఖరారు కాలేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ దూకుడు పెంచేలా కార్యా చరణ ప్రణాళిక అమలు చేయనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ లోని పాత, కొత్త నేతలతోపాటు తటస్థులు, మేధావులు, ప్రముఖులకు ఈసారి పోటీ అవకాశం కల్పించాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు వివరిస్తున్నాయి. మొత్తం 119 స్థానాల్లో ఎస్సీ 19, ఎస్టీ 12 సీట్లుపోగా మిగతా 88 సీట్లలో యాభై శాతానికిపైగా బీసీలు, ఇంతవరకు శాసనసభలో అడుగుపెట్టని ఎంబీసీ కులాల వారికి టికెట్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగిందని పేర్కొంటున్నాయి. మొత్తంగా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించి ఎన్నికల గోదాలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్టు వివరిస్తున్నాయి. దూకుడుగా ప్రచారం చేపట్టేలా.. అన్ని ప్రసార, ప్రచార సాధనాలు, మీడియా, సోషల్, డిజిటల్ మీడియాలలో ఒకేసారి దూకుడుగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రాధాన్యతా అంశాల వారీగా.. ముఖ్యంగా అందులో బీసీలు, ఎంబీసీలు, మహిళలకు సంబంధించిన సమస్యలు, అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వివరిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం, ప్రాంతానికి అన్నట్టుగా కాకుండా మొత్తంగా 119 సీట్లకు వర్తించేలా కామన్ ఎజెండాతో ముందుకెళ్లాలనే యోచనలో పార్టీ నేతలు ఉన్నట్టు తెలిసింది. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ సర్కారు పాలన లోపాలు, వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, అవినీతి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతా కలసి ముందుకు.. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలోని పాత, కొత్త, జూనియర్, సీనియర్ నేతలు అంతా కలసి ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లు, ఇతర పార్టీల నుంచి చేరి ప్రధానమైన బాధ్యతల్లోని వారూ ఉన్నారని అంటున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావు, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్రావు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి, గరికపాటి మోహన్రావు, విజయశాంతి, సీనియర్ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు తదితరులు కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నాయి. -
గెలాక్సీ గ్రానైట్లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్డిస్క్లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఒంటరిగా 119 స్థానాల్లో వైఎస్సార్టీపీ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. గురువారం ఇక్కడి లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను పాలేరుతోపాటు మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అవసరమైతే తన తల్లి విజయలక్ష్మి, బ్రదర్ అనిల్ కూడా ఎన్నికల్లో నిలబడతారని తెలిపారు. వైఎస్సార్టీపీ తర ఫున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల సూచించారు. -
కేసీఆర్పై పోటీ చేస్తా!
హుజూరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు.. అక్కడ కూడా పోటీ చేస్తానని (పరోక్షంగా సీఎం కేసీఆర్పై) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనను హుజూరాబాద్లో గెలిపించేందుకు కథానాయకులుగా మారి బీజేపీ శ్రేణులు పనిచేయాలని కోరారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘నేను ఆరు ఫీట్ల హైట్ లేకపోవచ్చు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చుగానీ ప్రజల బాధలు తీర్చేవాడిని..’అని ఈటల అన్నారు. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడుచేసిన దుర్మార్గపు పార్టీ.. భారత్ రాష్ట్ర సమితి అని ఆరోపించారు. ‘హుజూరాబాద్లో హోదా ఉన్నవాడితో కొట్లాడతాంగానీ సైకోతో ఏం కొట్లాడుతాం.. పొలిటికల్ లీడర్ పొలిటికల్గా కొట్లాడాలి..’అన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుందని, మొన్నటితో వారి పీడ విరగడైందని పేర్కొన్నారు. ‘కొట్టడం చేతకాక కాదు.. కార్యకర్తలు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగాను. కొట్లాట నా సంస్కృతి కాదు. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ ను. గూండాను కాదు. రౌడీని కాదు’అని అన్నారు. కొంతమంది చిల్లరగాళ్లు తను కేసీఆర్ కోవర్టు అని ఇంకా మాట్లాడుతుంటే బాధగా ఉందన్నారు. కేసీఆర్ వల్ల నరకం అంటే ఏమిటో సంపూర్ణంగా అనుభవించిన వాడినని తెలిపారు. తన శక్తిని మొత్తం బీఆర్ఎస్ ఓటమికి వినియోగిస్తానన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా బెదిరిస్తే చమడాలు తీస్తాం.. జాగ్రత్త.. అని చెప్పాలంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అధికారులు పిచ్చి పనులు చేసినా.. పక్షపాతంతో వ్యవహరించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తన వాళ్ల మీద చెయ్యి పడినా అంతు చూసేవరకూ వదిలిపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రాదన్నారు. ఈనెల 16న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హుజూరాబాద్కు రాబోతున్నారని, సభను గొప్పగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
మగాళ్లు.. తగ్గట్లే!
సాక్షి, అమరావతి: ఫ్యాషన్.. ప్రపంచానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యాషన్ పేరు చెప్పి మన దేశంలో ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా మహిళలు సౌందర్యం, అలంకరణ వస్తువుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. ఈ విషయంలో మగవారు మగువలకు ఏమాత్రం తక్కువ కాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ మార్కెట్ 11 శాతం వృద్థి చెందడమే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్కెట్ టర్నోవర్ ఏటా రూ.31 వేల కోట్లు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతలా మగాళ్లు తగ్గట్లేదంటే మారుతున్న సామాజిక ధోరణులు (ట్రెండ్స్) దీనికి కారణమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ, గడ్డం గ్రూమింగ్, ఫెర్ఫ్యూమ్స్కు సంబంధించి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వినియోగం పురుషులు ప్రపంచ ట్రెండ్లను అనుసరించేలా చేస్తోంది. అలా మొదలై.. ఇలా పెరిగింది పురుషులు వస్త్రధారణ, అలంకరణలో ప్రత్యేకత చూపించడమేది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. పూర్వకాలం నుంచీ రాజసాన్ని, దర్పాన్నీ ప్రదర్శించే విధంగా దుస్తులను ధరించే అలవాటు ఉండేది. మహారాణి, యువరాణుల మెడలో బంగారం, వజ్రాల నగలు వేసుకుంటే.. వారికి సమానంగా రాజు, యువరాజులు కూడా హారాలు, కిరీటాలు ధరించే వారు. రాజుల తరువాత మండలాధీశులు, వ్యాపారులు కొంతవరకూ ఇలాంటి అలంకరణలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే సామాన్య ప్రజల్లో ఇలాంటివి చాలా అరుదుగా ఉండేవి. వారంతా సాధారణ వస్త్రాలు, మామూలు నగలు ధరించే వారు. కానీ.. కాలంతో పాటు పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు ఫ్యాషన్గా కనిపించేందుకు తాపత్రయపడటం ప్రారంభించారు. కేవలం విలువైన వస్తువులు ధరించడమే ఫ్యాషన్ అనుకునే స్థాయి నుంచి తాము ఏది ధరిస్తే అదే ఫ్యాషన్ అనే స్థితికి వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది ట్రెండింగ్లో ఉందో చూసుకుని ఆ ఫ్యాషన్ మోడల్ను ఫాలో అయిపోతున్నారు. కొందరు సినిమా, క్రికెట్ స్టార్లు తమ ప్రత్యేక వస్త్రధారణ, అలంకరణతో ట్రెండ్ సెట్ చేస్తూ, యూత్కి మార్గదర్శకం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కార్పొరేట్ దిగ్గజాలు వారి రిటైల్ అవుట్లెట్లలో మగవారి కోసం ప్రత్యేకంగా బ్రాండెడ్ వస్త్రాలు, వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. దుస్తుల తర్వాత ప్రాధాన్యం వాటికే.. పురుషులు ఎక్కువగా ఖర్చు చేస్తున్న వాటిలో మొదటి స్థానంలో దుస్తులున్నాయి. అంతర్జాతీయ ఫ్యాషన్లను యథాతథంగా అనుసరిస్తున్నారు. ఆన్లైన్ ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెడితే ఎక్కడి నుంచైనా కావాల్సిన దుస్తుల్ని ఇంటికి తెప్పించుకునే వెసులుబాటు రావడంతో దుస్తుల ఫ్యాషన్లో సరిహద్దులు చెరిగిపోయాయి. మారుతున్న సాంస్కృతిక ప్రమాణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఎండ ప్రభావం నుంచి మొహాన్ని.. చర్మాన్ని రక్షించే సన్బ్లాక్ క్రీమ్లు రాసుకోవడాన్ని మగవారు ఒకప్పుడు వింతగా భావించే వారు. కానీ.. ఇప్పుడు క్రీమ్లతో పాటు సువాసనలు వెదజల్లే ఫెర్ఫ్యూమ్స్ వాడకం పెరిగింది. పురుషులు మునుపెన్నడూ లేనివిధంగా వ్యక్తిగత సంరక్షణ పద్ధతులను పాటిస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్, జీవనశైలి ధోరణులకు మన దేశంలో పురుషులు ఆకర్షితులవుతున్నారు. అందుబాటులో ఉన్న అనేక మాధ్యమాల ద్వారా తమకు అవసరమైన వాటిపై వారు అవగాహన పెంచుకుంటున్నారు. ఆరోగ్య స్పృహ పెరగడం కూడా ఇందుకు మరో కారణమని చెప్పవచ్చు. ఆడవారితో పాటు పురుషులకు కూడా జుట్టు సంరక్షణ ముఖ్యమని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు మెన్స్ బార్బర్ షాప్లు విపరీతంగా పెరిగాయి. ఇవి హెయిర్ కట్లతో పాటు గడ్డం ట్రిమ్మింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, షేవ్, ఫేషియల్స్ వంటి సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి చోటనే పురుషులు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వివిధ వస్త్రధారణ పద్ధతులు, సౌందర్య ఉత్పత్తుల గురించి తెలిపే సామాజిక సమావేశ స్థలాలుగా సెలూన్స్ పరిణామం చెందాయి. -
వరల్డ్ కప్ టెన్నికాయిట్ పోటీల్లో మెరిసిన హేమమాధురి
ఏలూరు రూరల్: సౌతాఫ్రికాలో జరిగిన టెన్నికాయిట్ వరల్డ్ కప్ పోటీల్లో పశ్చిమగోదావరి క్రీడాకారిణి జి.హేమమాధురి కాంస్య పతకం సాధించిందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి సంపంగి తిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు సౌతాఫ్రికాలో 5వ టెన్నికాయిట్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయని, శుక్రవారం జరిగిన జూనియర్ డబుల్స్ విభాగంలో విశాఖపట్టణం క్రీడాకారిణి ఆర్.మౌనికతో కలిసి హేమమాధురి తృతీయస్థానంలో నిలిచిందని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఈ క్రీడాకారిణి పలుసార్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి బాలికల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. విజేతలను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్ యు.రాంప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.రవీంద్ర అభినందించారు. -
ఓ మంచి డాక్టరమ్మ -మిసెస్ తెలంగాణ
సేవకు అందమైన మాధ్యమం మిసెస్ తెలంగాణ తెచ్చిన సెలబ్రిటీ గుర్తింపుతో ఒక డాక్టర్గా, ఒక మహిళగా నా వంతు సామాజిక బాధ్యత అని నేను చేపట్టిన అనేక కార్యక్రమాలను ఇంకా వేగంగా తీసుకువెళ్లగలుగుతాను. వయలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. జెండర్ ఈక్వాలిటీ కోసం పని చేస్తున్నాను. భ్రూణ హత్యలకు కారణం అమ్మాయంటే ఇష్టం లేక కాదు. సమాజంలో అఘాయిత్యాలు పెచ్చుమీరిన ఈ రోజుల్లో అమ్మాయిని భద్రంగా పెంచగలమా లేదా అనే భయమే ప్రధాన కారణమని అనేక మంది మహిళల మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎన్జీవోలతో కలిసి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ఆడపిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం, అబ్బాయిలను సెన్సిటైజ్ చేస్తున్నాను. ఇక ఇలాంటి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతాను. – డాక్టర్ స్రవంతి గాదిరాజు, అసోసియేట్ ప్రోఫెసర్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు... తెలంగాణ, నిజామాబాద్లో డాక్టర్. యూఎస్లో గైనిక్ ఆంకాలజీ చేసి తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ మహిళల్లో ఎదురవుతున్న సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్నారు. ‘డాక్టర్ తన ఉద్యోగం హాస్పిటల్లోనే అనుకుంటే సమాజం సంపూర్ణ ఆరోగ్యవంతం కాలేదు. పేషెంట్లను వెతుక్కుంటూ వైద్యులు వెళ్లగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. అందుకోసమే ఆదివాసీలు ఎక్కువగా నివసించే, ఆరోగ్యం పట్ల కనీస అవగాహన లేని వారి ఇళ్ల ముందుకు వెళ్తున్నాను. ఆరోగ్య పరిరక్షణ అవసరాన్ని తెలియచేస్తున్నాను. నాలోని ఈ గుణమే నన్ను మిసెస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిపింది. నేను బ్యూటీ కాంటెస్ట్ల వైపు అడుగులు వేయడం సెలబ్రిటీ గుర్తింపు కోసం కాదు. ఒకవేళ సెలబ్రిటీ గుర్తింపు వస్తే... ఆ గుర్తింపుతో సమాజంలో నేను కోరుకున్న మార్పు కోసం పని చేయడం సులువవుతుంది. బ్యూటీ పజంట్గా ఇప్పుడు నేను సమాజానికి చేస్తున్న వైద్యసేవలను మరింత త్వరగా విస్తరించగలుగుతాను’ అన్నారు ‘సాక్షి’తో డాక్టర్ స్రవంతి. పేషెంట్ల దగ్గరకు వెళ్లాలి! ఈ రోజు మీకు కనిపిస్తున్న ఈ విజేత గుర్తింపు అన్నది నేను సాధించిన ఘనత అని అనుకోను. మా అమ్మానాన్నలు తీర్చిదిద్దిన కూతుర్ని. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. నాన్న విజయ డైరీలో మేనేజర్. అమ్మ తన డ్యూటీ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదో, తన సలహా సూచనల కోసం వచ్చిన వారిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో దగ్గరగా చూశాను. ప్రభావతక్క అని అందరూ ఆమెని సొంత అక్కలా అభిమానించేవారు. అమ్మతోపాటు హాస్పిటల్కి వెళ్లినప్పుడు డాక్టర్ కనిపించగానే పేషెంట్లు సంతోషంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం చూసి అమ్మను అడిగితే, డాక్టర్ను దేవుడిలా చూస్తారని చెప్పింది. అంతే! ఇది అత్యుత్తమమైన వృత్తి అనే అభి్రపాయం స్థిరపడిపోయింది. అమ్మకు నైట్ షిఫ్ట్లుండేవి. అప్పుడు నాకు జడలు వేయడం నుంచి బాక్స్లు పెట్టడం వరకు మా నాన్నే చేశారు. మా అన్నయ్యను, నన్ను పెంచడం, చక్కగా తీర్చిదిద్దడం కోసమే వాళ్ల జీవితాలను అంకితం చేశారు. నేను సిక్త్స్ క్లాస్ వరకు విజయవాడలో చదివాను. ఉద్యోగాల్లో బదిలీలతో గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్నీ చూశాం. నెల్లూరులోని కస్తూరిదేవి విద్యాలయం నాకు బాగా గుర్తున్న స్కూలు. ఎమ్సెట్ తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదు. అప్పుడు అమ్మ ‘మనది మధ్యతరగతి కుటుంబం. డొనేషన్ సీట్లతో చదివించలేం. బీఎస్సీలో చేరి మళ్లీ ప్రయత్నం చెయ్యి. అప్పుడూ రాకపోతే డిగ్రీ పూర్తి చెయ్యి’ అని కరాకండిగా చెప్పి డిగ్రీలో చేర్చింది. ఆ ఉక్రోషంతో చేసిన రెండవ ప్రయత్నంలో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీటు వచ్చింది. తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా రాకట్ల డిస్పెన్సరీలో. అప్పుడు కూడా మార్గదర్శనం చేసింది అమ్మే. ప్రైవేట్ డాక్టర్ క్రేజ్ ఉండేది నాకు. గవర్నమెంట్ ఉద్యోగం విలువ తెలుసుకోమని గట్టిగా చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టే ఉద్యోగం చేస్తూ మధ్యలో సెలవు పెట్టుకుని యూఎస్లో కోర్సులు చేయడం సాధ్యమైంది. అంతేకాదు. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల మారుమూల ప్రదేశాలను దగ్గరగా చూడడం, అక్కడి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం వల్ల, ఉద్యోగ పరిధి దాటి బయటకు వచ్చి మరింత ఎక్కువగా సర్వీస్ చేయాల్సిన అవసరం తెలిసి వచ్చింది. కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి మహిళలకు మెన్స్ట్రువల్ హైజీన్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి పాప్స్మియర్ పరీక్షలు చేయడం, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో బిజీ అయిపోయాను. నేను రోబోటిక్ గైనిక్ ఆంకాలజిస్ట్ని. సర్వైకల్ క్యాన్సర్ను రూపుమాపాలనేది నా లక్ష్యం. ఈ నెల బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా శిల్పకళావేదికలో బ్యూటీ పజంట్స్ అందరం అవేర్నెస్ ర్యాంప్ వాక్ చేస్తున్నాం. సావిత్రినయ్యాను! ఇక బ్యూటీ పజంట్ విషయానికి వస్తే... నాకు చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజ్ పోటీల్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం. డాన్స్, పెయింటింగ్తోపాటు కాలేజ్లో ర్యాంప్ వాక్ కూడా చేశాను. మిసెస్ ఇండియా పోటీల గురించి చాలా ఏళ్లుగా పేపర్లో చూడడమే కానీ పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ మమతా త్రివేది నిర్వహిస్తున్న కాంటెస్ట్ గురించి తెలిసి గత ఏడాది నవంబర్లో నా ఎంట్రీ పంపించాను. కొత్తతరం పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు. మా పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది. తను నన్ను ఈ పోటీలకు సిద్ధం చేసింది. మా హజ్బెండ్ నా క్లాస్మేట్, దూరపు బంధువు కూడా. ఎమ్ఎన్జేలో డాక్టర్. నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఇరవై రౌండ్లు కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్లైన్లో జరిగాయి. ఆహార్యం రౌండ్లో మహానటి సావిత్రిని తలపించాలని టాస్క్ ఇచ్చారు. సావిత్రి పాత్రలో మెప్పించడమే నన్ను విజేతను చేసింది. మా తోటి పీజంట్లు నన్ను సావిత్రి అనే పిలుస్తున్నారిప్పుడు. నా స్మైల్కి కూడా ఈ పోటీల్లో మంచి గుర్తింపు వచ్చింది. విజేతలను ప్రకటించేటప్పుడు మాత్రం నర్వస్ అయ్యాను. నా ముఖంలో నవ్వు విరిసే తీర్పు వచ్చింది’’ అని చక్కగా నవ్వారు సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, మిసెస్ తెలంగాణ విజేత డాక్టర్ స్రవంతి. రాబోయే డిసెంబర్లో జరిగే ‘మిసెస్ ఇండియా’ పోటీల్లో ఆమె తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. ‘మిసెస్ ఇండియా’ కిరీటం ఆమె కోసం ఎదురు చూస్తోందేమో!. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
నాలుగోరోజు 333 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం గురువారం 333 దరఖాస్తులు అందినట్లు పార్టీవర్గాల సమాచారం. ఎన్నికల్లో పోటీకి ఉత్సాహపడుతున్నవారి నుంచి బుధవారం వరకు 666 దరఖాస్తులు అందగా, నాలుగోరోజు కూడా కలిపి మొత్తంగా 999 దరఖాస్తులు కమిటీకి చేరినట్టు అయింది. గురువారం పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించినవారిలో మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జైపాల్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, పాండు తదితరులు ఉన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాలకు చెందిన నాయకులు దరఖాస్తులు సమర్పించి టికెట్ వస్తుందా లేదా అన్న దానిపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీరిలో మెజారిటీ ‘నాన్ సీరియస్’అభ్యర్థులే ఉన్నారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని అనుకునే నేతలంతా వారి వారి సీనియారిటీ, స్థానికంగా బలం, పార్టీలో పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో పలుకుబడి వంటి వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ తాజాగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే ముఖ్యనేతలంతా రాబోయే మూడురోజుల్లో మరీ ముఖ్యంగా, వచ్చే శని, ఆదివారాల్లో తాము పోటీచేసే స్థానాలకు దరఖాస్తులు అందజేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారనే దానిపైనా స్పష్టత వస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. -
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్లోని జైపూర్లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
కొడంగల్ సీటుకు రేవంత్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే వివిధ నియోజకవర్గాల నుంచి 200 వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 700కు చేరినట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈసారి ఎన్నికల్లో తనకు కొడంగల్ అసెంబ్లీ టికెట్ కేటాయించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొడంగల్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అనుచరులు, నియోజకవర్గ నేతలు గురువారం గాందీభవన్కు వచ్చి రేవంత్ తరఫున దరఖాస్తు అందజేశారు. దీంతో రేవంత్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానికి తెరపడినట్టేనని గాందీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. మధిర టికెట్ కోసం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తన దరఖాస్తును అందజేశారు.సీఎల్పీ కార్యాలయ కార్యదర్శి పూర్ణబోధ శ్రీకాంత్.. భట్టి తరఫున గాందీభవన్లో దరఖాస్తును సమర్పించారు. కాగా, జగిత్యాల నుంచి జీవన్రెడ్డి, జనగామ టికెట్కోసం పొన్నాల లక్ష్మయ్య, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, నాగార్జున సాగర్ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డిలు కూడా గురువారమే దరఖాస్తు చేసుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్రావు, మునుగోడు టికెట్ కోరుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కై లాశ్నేత, కరీంనగర్ టికెట్ కోసం మాజీ అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యారావు కూడా దరఖాస్తులు సమర్పించారు. కాగా, కాంగ్రెస్ టికెట్లకోసం దరఖాస్తు చేసుకునే గడువు శుక్రవారంతో ముగియనుంది. ఎంపీ ఉత్తమ్తోపాటు సీడబ్ల్యూసీ ఆహా్వనితుడు దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు చివరి రోజున దరఖాస్తులు సమర్పిస్తారని తెలిసింది. -
కిక్కెక్కించిన మద్యం దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు ‘మద్యం దరఖాస్తుల’రూపంలో కాసుల వర్షం కురిసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్రంలోని వైన్షాపులకు లైసెన్సుల మంజూరు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు అనూహ్య రీతిలో స్పందన కనిపించింది. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, శనివారం మధ్యాహా్ననికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న లెక్కలను ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,620 వైన్షాపుల లైసెన్సుల కోసం ఏకంగా 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈసారి గతం కంటే 63,263 దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత రెండేళ్లతో పోలిస్తే రానున్న రెండేళ్ల కాలానికి గాను దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,639 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే లభించింది. ఈ దరఖాస్తుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈనెల 21న డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలో భారీగా.. భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లోని వైన్షాపులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని షాపుల కోసం వ్యాపారులు భారీ స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. సరూర్నగర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలోని 134 షాపులకు ఏకంగా 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్లోని 100 షాపులకు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇవే షాపులకు గత రెండేళ్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో రావడం గమనార్హం. సరూర్నగర్ పరిధిలోని షాపులకు గత రెండేళ్ల కాలానికి 4,102, శంషాబాద్లో 4,122 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక మరో ఏడు జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 5 వేలు దాటింది. ఖమ్మం (7,207), కొత్తగూడెం (5,057), సంగారెడ్డి (6,156), నల్లగొండ (7,058), మల్కాజ్గిరి (6,722), మేడ్చల్ (7,017), వరంగల్ అర్బన్ (5,858)లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కాగా, క్రితం సారి 10 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో మొత్తం కలిపి 68 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి చివరి ఒక్కరోజే 56,980 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి చివరి నాలుగు రోజుల్లోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 15న సెలవు దినాన్ని మినహాయిస్తే 14,16,17, 18 తేదీల్లో కలిపి 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఆదిలాబాద్లో 979, ఆసిఫాబాద్లో 967 దరఖాస్తులు వచ్చాయి. ఇక, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాబితాలో నిర్మల్ (1,019), గద్వాల (1,179), వనపర్తి (1,329) ఉన్నాయి. ఈ దరఖాస్తుల సరళిని బట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపార రంగ సంస్థల యజమానులతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ వ్యాపారులు కూడా దరఖాస్తు చేసి ఉంటారని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
గుంటూరు మిర్చి: అ‘ధర’గొట్టిన ఎగుమతులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.10,445 కోట్ల మార్కును దాటా యి. మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావటం విశేషం. ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ.. ధర ఎక్కువ గా ఉండటంతో గత ఏడాది కంటే రూ.1,861 కోట్ల ఆదాయం అధికంగా లభించింది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 78 వేల హెక్టార్లు కాగా.. 2022– 23లో అత్యధికంగా 84,861 హెక్టార్లలో సాగు చేశారు. అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా, శ్రీలంక, మలేషియా, థాయ్లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. కారం, విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపైనా గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్నిరకాల మిర్చికి ఎగుమతుల హబ్గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ఇతర మసాలా ఉత్పత్తులతోపాటు పత్తి, నూలు ఎగుమతులపైనా దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎక్స్పోర్టు హబ్గా మారుస్తాం గుంటూరును మిర్చి ఎక్స్పోర్ట్ హబ్గా మారిస్తే మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ, ముడి పదార్థాల లభ్యత పెంపు, నైపుణ్యం పెంపు, సాంకేతికత బదిలీ జరుగుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెటింగ్ ఈవెంట్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. – ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్, గుంటూరు చిల్లీస్ బోర్డు ఏర్పాటు చేయాలి స్పైసెస్ బోర్డులో అత్యధిక విదేశీ ఆదాయాన్ని సమకూరుస్తున్న మిర్చి పంట కోసం కేంద్రం ప్రత్యేకంగా చిల్లీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. పంట చేతికొచ్చిన తర్వాత విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెడుతున్న బోర్డు, రైతులకు కావాల్సిన మంచి విత్తనం, దీనికి సంబంధించిన పరిశోధనలపై దృష్టి పెట్టడం లేదు. అందుకే చిల్లీస్కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. – తోట రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ధర ‘తేజో’మయమే ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర క్వింటాల్కు రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలుకుతోంది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేల వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్కు రూ.12,500 నుంచి రూ.23,500 వరకు, ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.14 వేల నుంచి రూ.25,500 వరకు ధర లభిస్తోంది. కారం తయారీకి అధికంగా ఉపయోగించే 341, దేవనూరు డీలక్స్, 334 రకాల మిర్చి క్వింటాల్ రూ.23 వేలకు పైగా పలుకుతోంది. -
మంచి చేయడానికే పోటీ చేస్తున్నా
‘‘చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికల్లో అధ్యక్షునిగా, ప్యానల్ సభ్యులుగా నిజాయతీగా సేవ చేసేవాళ్లను ఎన్నుకోండి’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఈ నెల 30న చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సి. కల్యాణ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మాట్లాడుతూ– ‘‘గతంలో నేను పో టీ చేయాలనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు ‘యూఎఫ్ఓ, క్యూబ్’ వంటి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నాను. కానీ, వాళ్లు సభ్యుల శ్రేయస్సు కోసం కృషి చేయలేదు. అందుకే.. అందరికీ మంచి చేయాలనే ఆశయంతో పో టీ చేస్తున్నాను’’ అన్నారు. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్ -
బసలదొడ్డి గ్రామంలో మహిళలకు పరుగు పందెం పోటీలు
-
రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్.. రూ. 75 వేలు గెలుచుకునే ఛాన్స్
ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడిపోయారు. రోజులో కనీసం ఒకటి రెండు గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ట్విట్టర్.. దేన్ని వదలడం లేదు. టిక్టాక్పై నిషేధం తర్వాత ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ‘రీల్స్ ఫీచర్’ పై జనాలు ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. చిన్నచిన్న వీడియోలు సైతం వైరల్గా మారుతున్నాయి. ఇది సామాన్యులను సైతం కంటెంట్ సృష్టికర్తలుగా మార్చేస్తోంది. రాత్రికి రాత్రే పెద్ద స్టార్డమ్ను తీసుకొస్తుంది. తాజాగా తెలంగాణ సర్కార్ రీల్స్ చేసే వారికి తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువైతుండటంతో.. తామ కాన్సెప్ట్కు తగ్గట్టు ఆకట్టుకునే విధంగా రీల్స్ చేస్తే.. భారీ మొత్తం నగదు బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది. యువత డ్రగ్స్కు బానిసలుగా మారి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మాదక ద్రవ్యాల వినియోగం, దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’’ పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, దీనికి బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను తమ రీల్స్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ పోటీ ఉద్దేశం. 18 ఏళ్లు నిండిన వారందరూ ఈ పోటీలకు అర్హులని తెలిపింది. ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించాల్సి ఉంది. కాగా జూన్ 20లోపు వీడియోలను పంపాల్సి ఉంటుంది.ఈ పోటీలో విజేతలకు బహుమతులు కూడా అందిజచున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విజేతకు రూ. 75,000 , రెండో స్థానంలో గెలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 వేల నగదు బహుమతి ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 96523 94751 నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొంది. చదవండి: వరంగల్లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్ -
షబీనాకు ఘనస్వాగతం
తెనాలి: అంతర్జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో నాలుగు బంగారు పతకాలను కైవసం చేసుకుని స్వస్థలానికి తిరిగి వచ్చిన పట్టణ లిఫ్టర్ షేక్ షబీనాకు తెనాలిలో ఘనస్వాగతం లభించింది. కేరళ రాష్ట్రం అలెప్పీలో ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో షబీనా 84 కిలోల కేటగిరీలో తలపడి, స్క్వాట్, బెంచ్ప్రెస్, డెడ్లిఫ్ట్లో ప్రథమ స్థానంలో నిలిచి, ఓవరాల్గా అగ్రగామిగా నాలుగు విభాగాల్లోనూ బంగారు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ పూర్తయే సరికి అంతర్జాతీయస్థాయిలో పతకాలను సాధించిన షబీనా, కేరళ నుంచి మంగళవారం తెనాలికి తిరిగొచ్చింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులు తనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి షబీనా నివాసమైన సీబీఎన్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. టాపులేని జీపులో నిలబడి, జాతీయ జెండాతో షబీనా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగింది. ర్యాలీకి ముందుభాగాన డప్పుల విన్యాసం కొనసాగింది. తల్లిదండ్రులు షంషద్, బుజ్జి, కోచ్ ఎస్కే సంధానితో సహా వచ్చిన షబీనాకు పట్టణానికి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు షేక్ దుబాయ్బాబు, మొగల్ అహ్మద్, టీడీపీ నేత మహమ్మద్ ఖుద్దూస్లు స్వాగతం పలికారు. భారతదేశానికి పతకాలను సాధించి, తెనాలికి పవర్ లిఫ్టింగ్లో గల ఘనకీర్తిని నిలిపిన క్రీడాకారిణిగా అభినందనలతో ముంచెత్తారు. దారిపొడవునా పలువురు పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా షబీనా మాట్లాడుతూ అంతర్జాతీయ పతకాల సాధనే లక్ష్యంగా కష్టమైనప్పటికీ పట్టుదలతో సాధన చేశానని చెప్పింది. ఆశించిన విధంగానే ఆసియా స్థాయిలో పతకాలను సాధించగలిగినట్టు తెలిపింది. ప్రపంచ పోటీలు, కామన్వెల్త్ గేమ్స్లోనూ పతకాలను సాధించాలనేది తన లక్ష్యంగా చెప్పా రు. తనను ప్రోత్సహించి, ఆశీర్వదిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. వీరితోపాటు రహంతుల్లా, కరిముల్లా, జాఫర్, పినపాటి రవీంద్ర, జగన్, ఫణిదపు దుర్గా, చల్లగాలి శివశంకర్, ముజీబ్ ప్రభృతులు పాల్గొన్నారు. -
ఒక పోస్టు..174 మంది పోటీ
సాక్షి, హైదరాబాద్: ఖాకీ కొలువులకు యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. అవకాశం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్ ఉద్యోగానికి పోటీ పడుతుంటారు. ఈసారి కూడా కానిస్టేబుల్ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంది. ఈ నెల నిర్వహించనున్న కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్షకు పార్ట్–2 దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే కానిస్టేబుల్ పోస్టులకు కాంపిటీషన్ ఫుల్ అన్న విషయం స్పష్టం అవుతోంది. సివిల్ పోలీస్, టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్లశాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఈనెల తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఉమ్మడి పది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పోలీస్ నియామక మండలి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యర్థులకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. ప్రతి అభ్యర్థి www.tslprb.in వెబ్సైట్లోకి వెళ్లి తమ లాగిన్ ఐడీ ద్వారా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్స్కు పోటీ తీవ్రం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. మొత్తం 614 పోస్టులకుగాను 1,06,272 మంది తుది రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్ కానిస్టేబుల్, ఇతర పోస్టులకు కలిపి మొత్తం 3,40,639 మంది తుది రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. -
పోలింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హీటెక్కుతున్న రాజకీయం
-
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పోటీయే లేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అసలు పోటీయే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మాత్రమే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఏ పార్టీకి వారు ఇవ్వలేదని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చిందని అమిత్షా పేర్కొన్నారు. అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలంతా ప్రధాని మోదీకే మరోసారి పట్టం గడతారని దీమా వ్యక్తం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, నాగలాండ్, మేఘాలయలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేయకపోవడంపై అమిత్ షా సెటైర్లు వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో తేలిపోతుందన్నారు. ఒకప్పుడు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉండేదని గుర్తు చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు.. -
మిస్ యూనివర్స్ ప్రిలిమినరీ పోటీల్లో అందాల భామల సందడి (ఫొటోలు)
-
స్విమ్మింగ్ విన్యాసాలు (ఫొటోలు)
-
‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు
సాక్షి, అమరావతి: తెలుగు భాష, తెలుగు కార్టూన్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు అంతర్జాతీయ కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు ప్రసాద్ తోటకూర తెలిపారు. మంగళవారం విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో కార్టూన్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిసారిగా తానా అంతర్జాతీయ తెలుగు కార్టూన్ పోటీలు–2023ను ఏర్పాటు చేసిందన్నారు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటేలా కార్టూన్లు పంపాలని తెలిపారు. పోటీల్లోని ఎంట్రీల నుంచి 12 అత్యుత్తమ కార్టూన్లను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.5,000, మరో 13 ఉత్తమ కార్టూన్లకు గాను ఒక్కొక్కరికీ రూ.3,000 చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు కార్టూనిస్టులు పోటీల్లో పాల్గొనవచ్చని, ఒక్కొక్కరి నుంచి మూడు కార్టూన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎంట్రీలను 300 రిజల్యూషన్ జేపీఈజీ ఫార్మేట్లో tanacartooncontest23@gmail.comకు ఈ నెల 26లోగా పంపాలన్నారు. ఫలితాలను జనవరి 15న సంక్రాంతి రోజు ప్రకటిస్తామని చెప్పారు. వివరాల కోసం 9154555675, 9885289995 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్, కలిమిశ్రీ, జాకీర్ పాల్గొన్నారు. (క్లిక్: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి) -
మార్కెట్లోకి ఐటీసీ కొత్త చాక్లెట్.. ప్రత్యేక టెక్నాలజీతో తయారీ!
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ లిమిటెడ్లో భాగమైన దేశీ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్ ఫాబెల్ కొత్తగా ఫైనెస్ పేరిట మరో కొత్త చాక్లెట్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రచారం కోసం ప్రముఖ ఆస్ట్రేలియన్ షెఫ్ ఎడ్రియానో జుంబోతో ఫాబెల్ చేతులు కలిపింది. ది కోకో ఫైనెసర్ అనే ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ చాక్లెట్ కన్నా మృదువైనది తయారు చేసిన వారికి రూ.1 కోటి బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా ఐటీసీ తరఫున ఫాబెల్ సవాలు కూడా విసిరారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
ఒక చావు.. మరో పుట్టుక.. ఈగను చంపేసి వృద్ధి చెందిన ‘జాంబీ’ ఫంగస్
ఈ ఫొటో చూశారా? ‘బీఎంసీ ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ ఇమేజ్’ పోటీలో మొదటిస్థానం దక్కించుకుంది. అందులో ప్రత్యేకత ఏముందనేగా సందేహం? ఈగలోకి ప్రవేశించిన ‘జాంబీ’ ఫంగస్ ఈగను చంపేసి.. అది వృద్ధి చెందింది. ఈగ మరణించి... ఫంగస్ బతకడమే కాదు, మరింత విస్తరించటానికి ఉపయోగపడింది. ఒక చావు.. మరో పుట్టుక. జీవ పరిణామ క్రమమే అది కదా! సైన్స్ ఫిక్షన్ను తలపిస్తున్న ఈ చిత్రాన్ని పరిణామ జీవశాస్త్రవేత్త రాబర్టో గ్రాసా రో, పెరూలోని తంబోపత నేషనల్ రిజర్వ్లో క్యాప్చర్ చేశాడు. రిలేషన్షిప్స్ ఇన్ నేచర్, బయోడైవర్సిటీ అండర్ థ్రెట్, లైఫ్ క్లోజప్, రీసర్జ్ ఇన్ యాక్షన్ అనే నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో... జాంబీ ఫంగస్ ఫొటో టాప్ ప్రైజ్ గెలుచుకుంది. చదవండి: మిస్టరీ కేసు: ఆన్లైన్ వేలంలో కొన్న సూట్కేసులో ఏముందంటే... -
టాటా కార్లపై ఆనంద్ మహీంద్రా స్పందన
Anand Mahindra Tweet on Tata Motors: దేశంలో టాటా మోటార్స్, మహీంద్రా వాహనాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. అదే సమయంలో మార్కెట్లో ఆ రెండింటి మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. అయితే ప్రత్యర్థి కంపెనీ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చారు. ఆ సమాధానం నెటిజన్ల మనసును దోచుకుంటోంది ఇప్పుడు. ఓ ట్విటర్ యూజర్.. మహీంద్రా ఎక్స్యూవీ700 గురించి పొగడ్తలు గుప్పిస్తూ శనివారం నాడు ఓ ట్వీట్ చేశాడు. దానికి ఆనంద్ మహీంద్రా బదులు కూడా ఇచ్చారు. అయితే.. ఆ సంభాషణకు కొనసాగింపుగా మరో యూజర్.. ‘సర్.. టాటా కార్ల మీద మీ ఫీలింగ్ ఏంటి?’ అని ప్రశ్నించాడు. దానికి ఆయన అంతే పాజిటివ్గా స్పందించారు. టాటా మోటార్స్ వంటి బలమైన పోటీదారులు ఉండడం ఎంతో ప్రత్యేకం. వారు తమను తాము(టాటా మోటార్స్) పునర్నిర్మించుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ల ప్రయత్నం మరింత మెరుగ్గా పని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది… పోటీతత్వం అనేది ఎప్పుడూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది అని చాలా చాలా సానుకూలంగా స్పందించారు ఆనంద్ మహీంద్రా. It’s a privilege to have strong competitors like @TataMotors They keep reinventing themselves and that inspires us to do even better… Competition spurs Innovation.. https://t.co/MwpBYsMOWZ — anand mahindra (@anandmahindra) July 11, 2022 ఎప్పుడూ కూల్గా సమాధానమిచ్చే ఆనంద్ మహీంద్రా.. ఈసారి పోటీ కంపెనీపై ట్వీట్తో ఎంతో మంది మనసులను దోచుకున్నారు కూడా. -
ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ
Mr Happy Face Winner: పలు దేశాల్లో చాలా చాలా వింత వింత పోటీలు జరుగుతుంటాయి. ఇవేం పోటీలు అన్నంత విచిత్రంగా ఉంటాయి. అందమైన కుక్కల పోటీలు లేదా చురుకైన లేక తెలివైన కుక్కల కాంపిటీషన్ వంటి విచిత్రమైన పోటీలు గురించి విన్నాం. అంతేగానీ అత్యంత అసహ్యంగా ఉండే శునకాల పోటీ గురించి విన్నారా! ఔను అత్యంత వికారంగా ఉంటే శునకాల పోటీ కూడా ఉందటా. పైగా ఏటా భారీ ఎత్తున నిర్వహిస్తారట! అమెరికాలో ఆరిజోనాకు చెందిన 17 ఏళ్ల చివావా మిక్స్ అనే కుక్క.. ప్రపంచంలోనే అత్యంత అంద విహీనమైన కుక్కగా ఎంపికైంది. కాలిఫోర్నియాలో సోనోమా మారిన్ఫెయిర్ సందర్భంగా మిస్టర్ హ్యాపీ ఫేస్ అను అత్యంత అసహ్యమైన కుక్కల కాంపిటీషన్ జరుగుతుంది. ఐతే దాదాపు 50 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారీ కారణంగా రెండేళ్ల తదనంతరం, మళ్లీ ఇప్పుడు ఈ పోటీని నిర్వహించారు. ఆ కుక్క ముఖమంతా కణితులు, పైగా నరాల సంబంధిత వ్యాధితో నుంచోలేని అత్యంత దీనావస్థలో ఉంది. ఆ కుక్కకథ.. ఆ పోటీలు నిర్వహిస్తున్న న్యాయ నిర్ణేతలను కదిలించడంతో విజేతగా ప్రకటించారు. అంతేకాదు ఈ పోటీలో పాల్గొన్న మిగతా ఎనిమిది కుక్కలను వెనక్కినెట్టి మరీ విజేతగా నిలివడం విశేషం. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ కుక్క సంతోషంగా ఉన్నప్పుడు డీజిల్ ట్రక్లాంటి చిన్న శబ్దాన్ని కూడా చేస్తుందట. యజమాని జెనెడా బెనెల్లీ ఆరిజోనాలో ఆశ్రయం పొందుతున్న ఈ కుక్కని 2021లో దత్తత తీసుకున్నాడు. అప్పుడు ఈకుక్క డైపర్ వేసుకుని కణుతులతో ఉండి దారుణమై ఆరోగ్య సమస్యలతో దీనస్థితిలో ఉందని పేర్కొన్నాడు. ఐతే ఈ కుక్క ప్రస్తుతం ఒక నెల మాత్రమే జీవించగలదని యజమాని జెనెడా చెబుతున్నాడు. ఈ కుక్క ఈ పోటీలో విజేతగా నిలవడంతో సుమారు రూ. లక్షరూపాయాల ప్రైజ్మనీ తోపాటు న్యూయార్క్ సిటీని చుట్టివచ్చే అవకాశాన్ని కూడా పోందింది. పేరుకే ఇది అత్యంత అందవిహీనమైనం కావొచ్చు.. కానీ, దానంత అందమైన జీవితం మరొకటి లేదంటున్నారు పలువురు నెటిజన్స్. (చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...) -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్లో బిడ్లు వేస్తారు. స్క్రీన్లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి
సాక్షి, చెన్నై: కూవాగం వైపుగా హిజ్రాలు తరలుతున్నారు. మిస్ కూవాగం పోటీలు హోరాహోరీగా మొదలయ్యాయి. మంగళవారం హిజ్రాల పెళ్లి సందడి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్ హిజ్రాలకు ఆరాధ్యుడు అనే విషయం తెలిసిందే. ఈ ఆలయంలో ఈనెల 6వ తేదీ నుంచి చైత్రమాసం(చిత్తిరై) ఉత్సవాలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలు జరగలేదు. అయితే, ఈ ఏడాది అనుమతి దక్కడంతో అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధమయ్యారు. చదవండి: పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురాయె! తండోపతండాలుగా.. ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టమైన హిజ్రాల పెళ్లి సందడి అత్యంత వేడుకగా మంగళవారం జరగనుంది. ఈ వేడుక కోసం హిజ్రాలు కూవాగం వైపుగా పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు తరలి వస్తున్నారు. వీరి రాకతో విల్లుపురం, ఉలందూరు పేట పరిసరాల్లోని లాడ్జీలు, గెస్ట్ హౌస్లు కిటకిటలాడుతున్నాయి. అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్లుగా సింగారించుకుని హిజ్రాలు రోడ్ల మీద ప్రత్యక్షం కావడంతో వారిని చూసేందుకు యువకులు ఎగబడుతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఉత్సవాల్లో భాగంగా హిజ్రాలకు ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలిరోజు ఓ సంఘం నేతృత్వంలో మిస్ కూవాగం పోటీలు అర్ధరాత్రి వరకు నిర్వహించారు. మరో సంఘం నేతృత్వంలో సోమవారం అందాల పోటీలు, సాంస్కృతిక వేడుకలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాలపై చెన్నై హిజ్రాల సంఘం కన్వీనర్ సుధా మాట్లాడుతూ, డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం తమకు గుర్తింపు పెరిగిందన్నారు. తమకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా, పథకాల్ని అందజేస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ తమకు ప్రాధాన్యతను ఇచ్చారని గుర్తు చేశా రు. అందుకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంత్రి పొన్ముడి, ఎంపీలు తిరుచ్చి శివ, గౌతమ్ శిగామని, రవికుమార్, సినీ నటుడు సూరి, నళని వంటి వారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. -
ఎంసెట్కు నాన్లోకల్ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసేవారి సంఖ్య ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది టీఎస్ ఎంసెట్కు హాజరయ్యే వీలుందని చెబుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడం, హాస్టళ్లు తెరవడంతో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించాయి. గత రెండేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంసెట్కు దరఖాస్తు చేసినా పరీక్ష రాసే వారి సంఖ్య దాదాపు 50 శాతం తగ్గిందని, ఇంజనీరింగ్లో చేరే వారి సంఖ్య కూడా 45 శాతం పడిపోయినట్టు ప్రైవేటు కాలే జీలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఈ సమస్య లేకపోవడంతో ప్రమాణాలున్న కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడే వీలుందని చెబుతున్నారు. ఎంసెట్, జేఈఈ కోసం శిక్షణ పొందే వారు హైదరాబాద్నే కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఇక్కడ చదువుతూనే ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా స్థిరపడిన వారి పిల్లలు సైతం హైదరాబాద్లోని కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముం దు మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఏపీకి చెందిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇప్పుడూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఓ కాలేజీ నిర్వాహకుడు తెలిపారు. 15 శాతం కోటాలో పోటీ...: తెలంగాణవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే అందులో 70 వేల వరకు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లలో 15 శాతం నాన్–లోకల్ కోటా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కోటాలోనే పోటీ పడాల్సి ఉం టుంది. దీంతో ఈసారి పోటీ ఎక్కువ ఉండే వీలుందని ఎంసెట్ వర్గాలు అంటు న్నాయి. కొన్ని కోర్సులకు నాన్లోకల్స్ పోటీ వల్ల మేనేజ్మెంట్ కోటా విషయంలో యాజమాన్యాలు భారీగా డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కరోనా వల్ల రెండేళ్ళుగా ఈసీఈ సహా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడలేదు. టాప్ టెన్ కాలేజీల్లోనూ ఈ సీట్లకు పెద్దగా డిమాండ్ కనిపించ లేదు. ఈసారి కూడా కంప్యూటర్ కోర్సులనే ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారు. దీంతో ఏపీ నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్లలో కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్యం ఉండే వీలుందని భావిస్తున్నారు. 2021 లో జరిగిన ఎంసెట్కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94, 550 మంది అర్హత సాధించారు. -
వరంగల్లో ఉత్సాహంగా పోలిస్ క్రీడా పోటీలు ఫొటోలు
-
అనేక రంగుల్లో ఉన్న ఆకును ఎప్పుడైనా చూశారా..
న్యూయార్క్: ఆకులు ఏ రంగులో ఉంటాయో తెలుసా? అంటే.. ఇదేం ప్రశ్న.. ఆకుపచ్చ రంగులోనే కదా అంటారా.. మనకు కనబడేది ఆకుపచ్చ రంగులోనే. కానీ దాన్ని దగ్గరగా జూమ్ చేసి చూస్తే.. చాలా రంగులు కనిపిస్తాయి. ఇదిగో.. ఈ ఫొటోనే దీనికి ఎగ్జాంపుల్. ఇందులో వివిధ రంగుల్లో మెరిసిపోతున్నది ఆలివ్ చెట్టు ఆకు. అమెరికాలోని బేలోర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త జేసన్ కిర్క్ మైక్రోస్కోప్తో ఈ ఫొటో తీశారు. ఇందులో తెల్లగా పైకి పొడుచుకు వచ్చిన భాగాలను ట్రైకోమ్స్ అంటారు. ఆకులపై ఒత్తిడి పడినప్పుడు అవి షాక్ అబ్జార్వర్లలా పనిచేసి రక్షిస్తాయి. వంకాయ రంగులో ఉన్నవేమో ఆకులు కార్బన్డయాక్సైడ్, ఆక్సిజన్లను పీల్చి వదిలేసే రంధ్రాలు (స్టొమాటా). ఆకుల్లో నీళ్లు, ఇతర పోషకాలను రవాణా చేసే నాళాలు నీలం రంగులో కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత కెమెరా తయారీ సంస్థ నికాన్ నిర్వహించే ‘స్మాల్ వరల్డ్ కాంపిటీషన్’లో ఈ ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి -
ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?
పెదగంట్యాడ(గాజువాక): కోడి పందాలు చూశాం.. పొట్టేళ్ల పందాలు చూశాం. కానీ పందుల పోటీలు ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా.? ఇప్పుడు పందుల పోటీలకు వుడా కాలనీ వేదికైంది. మండలంలోని కొత్తకర్ణవానిపాలెం వుడా కాలనీలో వాకర్స్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బహిరంగంగా పెంపకందారులు గురువారం పందుల పందాలు నిర్వహించారు. రెండు పందుల మధ్య పోటీ పెట్టి వారంతా చుట్టూ చేరి కేరింతలు కొట్టారు. దీంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఒక పక్క జీవీఎంసీ అధికారులు పందులను ఏరివేస్తుంటే మరోపక్క పెంపకందారులు ఈ పోటీలను నిర్వహించి ఆశ్చర్యానికి గురి చేశారు. భవిష్యత్లో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. యువతికి వేరొకరితో నిశ్చితార్థం.. వాట్సాప్లో అశ్లీల ఫొటో -
నేషనల్ గట్క పోటీలలో ఏపీకి రజతం.. తొలి ప్రయత్నం లోనే..
సాక్షి, తిరుపతి (చిత్తూరు): 9వ జాతీయస్థాయి గట్క మెన్ అండ్ ఉమెన్ చాంపియన్షిప్ పోటీలలో తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి సత్తా చాటింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఈ పోటీలు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఇండియన్ గట్క అసోసియేషన్ నిర్వహించింది. ఉత్తమ ప్రతిభ కనరబరచి నవశక్తి సిల్వర్ మెడల్ సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ గట్క అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోత్సా్నదేవి తెలిపారు. అండర్–19 విభాగంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన నవశక్తి వరుసగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక క్రీడాకారిణులపై గెలిచి, ఫైనల్స్లో పంజాబ్తో తలపడి రెండో స్థానంలో నిలిచిందని ఆమె చెప్పారు. ముగింపు రోజున కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాగూర్ చేతుల మీదు గా రజత పతకాన్ని అందుకుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎందరో క్రీడాకారిణులు పాల్గొన్నప్పటికీ నవశక్తి మాత్రమే పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని జ్యోత్సా్నదేవి, రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, జిల్లా గట్క అసోసియేషన్ సెక్రటరీ శివ ఆమెను అభినందించారు. డిసెంబర్లో హర్యానా రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా నేషనల్స్కు నవశక్తి ఎంపికైందని తెలిపారు. ప్రయాణం చేస్తూనే..ఆన్లైన్ ఎగ్జామ్కు హాజరు! నవశక్తి చిన్నతనం నుంచే క్రీడల్లో విశేషంగా రాణి స్తోంది. పలు రికార్డులు సొంతం చేసుకుంది. రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలు సైతం ఎన్నో అందుకుంది. తొలుత స్విమ్మింగ్, స్కేటింగ్, తర్వాత కరాటే, రెజ్లింగ్, ఇప్పుడు గట్కలో తన సత్తా చాటుతూ క్రీడల్లో తన ప్రత్యేకతను చాటు కుంటోంది. ప్రస్తుతం చెన్నైలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నవశక్తి జాతీయస్థాయి గట్క పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి ట్రైన్లో ఆంధ్రప్రదేశ్ జట్టుతో వెళ్తూనే తనతోపాటు లాప్టాప్ తీసుకెళ్లింది. ప్రయాణిస్తూనే ఆన్లైన్ క్లాసులకు హాజరవడమే కాకుండా ఫైనల్ సెమిస్టర్ పరీక్ష సైతం రాయడం గమనార్హం! -
ఆర్యభట్ట మ్యాథ్స్ కాంపిటీషన్; మొదటి విజేతకు లక్షన్నర
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డవలప్మెంట్(ఏఐసీటీఎస్డీ), ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. మ్యాథమెటిక్స్లో ప్రతిభావంతులను గుర్తించి.. భవిష్యత్ టెక్నాలజీ సైంటిస్ట్లుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష జరుపుతోంది. ఈ ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్కు అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. అర్హతలు దేశంలోని ఏదైనా కళాశాల, లేదా పాఠశాల విద్యార్థులు ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 10ఏళ్ల నుంచి 24ఏళ్లలోపు ఉండాలి. జాతీయ స్థాయి పోటీలో తమ మ్యాథమెటిక్స్ నైపుణ్యాలను ప్రదర్శించాలనే అభిలాష ఉండాలి. ప్రయోజనాలు పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో టాప్ –3ని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి విజేతకు రూ.1.5 లక్షలు, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో విజేతకు రూ.పదివేలు అందిస్తారు. దీంతోపాటు ఏఐసీటీఎస్డీ ధ్రువపత్రం, నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ ఇస్తారు. అదేవిధంగా రోబోటిక్స్ ఆటోమేషన్, సాఫ్ట్వేర్స్ విత్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్లో ఉచిత శిక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఏఐసీటీఎస్డీ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా పొందొచ్చు. స్కాలర్షిప్కు కూడా అవకాశం ఉంది. పరీక్ష విధానం! పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఇంటి నుంచే రాయొచ్చు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానం(ఎంసీక్యూ)లో ఉంటుంది. 30 ప్రశ్నలకు– 60 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. ల్యాప్ట్యాప్ లేదా పీసీ ద్వారా పరీక్షకు హాజరుకావచ్చు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందికి ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూ ఇంటి నుంచే హాజరుకావచ్చు. ► పది నుంచి పదమూడేళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–1 విభాగం పరీక్ష; 14ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–2 విభాగం పరీక్ష; 18ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులకు గ్రూప్–3 విభాగం పరీక్ష ఉంటుంది. ఆయా విభాగం పరీక్షలకు సిలబస్ భిన్నంగా ఉంటుంది. ► గ్రూప్–1 విభాగం విద్యార్థులకు చైన్ రూల్, పర్సంటేజెస్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, నంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ క్యాలెండర్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ► గ్రూప్–2 విభాగం విద్యార్థులకు కంపేరింగ్ క్వాంటిటీస్, ఏజెస్, ట్రైన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రూ డిస్కౌంట్, చైన్ రూల్, హెచ్సీఎఫ్ అండ్ ఎల్సీఎం, ప్రాఫిట్ అండ్ లాస్ అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. ► గ్రూప్–3 వి«భాగం విద్యార్థులకు ప్రాఫిట్ అండ్ లాస్,రేషియో అండ్ ప్రపోర్షన్,స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంటరెస్ట్, టైమ్ అండ్ వర్క్, ట్రైన్స్, చైన్ రూల్, ఏజెస్పై ప్రశ్నలు అడుగుతారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.290. మొదట దరఖాస్తు చేసిన పదివేల మందిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ► దరఖాస్తులకు చివరి తేది: 20.05.2021 ► ఆన్లైన్ పరీక్ష తేది: 10.06.2021 ► తుది ఫలితాల వెల్లడి: 30.06.2021 ► వెబ్సైట్: https://www.aictsd.com/aryabhatta-national-maths-competition After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్! -
అందరి దృష్టి రెండో ప్రాధాన్యతపైనే!
సాక్షి, హైదరాబాద్: రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓ వైపు తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మరోవైపు ఓటింగ్ విధానంపైనా అవగాహన కల్పించేందుకు పార్టీలు, అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఎన్నికలు జరిగే ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్’, ‘నల్లగొండ-ఖమ్మం -వరంగల్’ స్థానాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులుతో పాటు, స్వతంత్రులు కూడా ఎక్కువమంది పోటీ చేస్తుండటంతో ‘ప్రాధాన్యత’ ఓట్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోలయ్యే ఓట్లలో (చెల్లుబాటు అయ్యే ఓట్లలో) సగానికి పైగా (50 శాతం + ఒక ఓటు) ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క అభ్యర్థి ‘ప్రథమ ప్రాధాన్యత’తో గెలుపొందే అవకాశాలు లేవని పార్టీలు, అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను వీలైనన్ని ఎక్కువ సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. తమకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం లేకుంటే... ఓటింగ్ సమయంలో కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని ప్రచారం సందర్భంగా అభ్యర్థులు, పార్టీలు కోరుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల నమోదు రెట్టింపు కావడంతో పోలయ్యే ఓట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. హైదరాబాద్లో బహుముఖ పోటీ ఆరేండ్ల క్రితం... 2015లో ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్’ స్థానంలో 2.96 లక్షల ఓటర్లగాను కేవలం 39 శాతం అంటే 1.13 లక్షల ఓటర్లు మాత్రమే పోలింగ్లో పాల్గొన్నారు. 31 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా 53,881 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్పై గెలుపొందారు (చెల్లని ఓట్లు ఎనిమిది వేల పైచిలుకు ఉండటంతో రాంచందర్రావు ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే విజయాన్ని అందుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం రాలేదు). ఈసారి టీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ పక్షాలు, ఔత్సాహిక అభ్యర్థులు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంపై ముందస్తుగా దృష్టి సారించడంతో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో ‘హైదరాబాద్- రంగారెడ్డి మహబూబ్నగర్’ పట్టభద్రుల స్థానంలో ఏకంగా 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు వివిధ రంగాలకు చెందిన స్వతంత్రులు కూడా పోటీలో ఉండటంతో గతంలో మాదిరిగా ఏ అభ్యర్థి కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు వీలైనన్ని రెండో ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటం తమకు అనుకూలిస్తుందని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నాయి. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’లో హేమాహేమీలు ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’పట్టభద్రుల స్థానానికి 2015లో జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. 2015 ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2.81 లక్షల ఓట్లకు గాను 1.49 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్లో పాల్గొన్నారు. 53.25 శాతం పోలింగ్ నమోదైనా ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా పోలైన ఓట్లలో 50 శాతం మార్క్ను దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 5.05 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 71 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మరోమారు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ నుంచి రాణీరుద్రమతో పాటు జయసారధి రెడ్డి, తీన్మార్ మల్లన్న తదితరులు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పలువురు ఎన్నికల బరిలో నిలవడంతో ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల వేట సాగిస్తూనే రెండో ప్రాధాన్యత ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లుకు అవార్డుల పంట
-
'ఆటా' అధ్వర్యంలో పాటల పోటీలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్వర్యంలో "ఝుమ్మంది నాదం" జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ పాటల పోటీలను జులై 4, 5,11 తేదీలలో ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 80 మంది గాయని గాయకులు అమెరికాలో పలు రాష్ట్రాల నుంచి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ.రామ క్రిష్ణా రెడ్డి ఆల బోర్డు అఫ్ ట్రస్టీ శ్రీమతి.శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. అమెరికా, ఇండియా నుండి సంగీత దర్శకులు శ్రీ. శ్రీని ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల, ప్లే బ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీ. నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ మరియు నందిని అవార్డు గ్రహీత శ్రీమతి. సురేఖ మూర్తి దివాకర్ల, సంగీత దర్శకులు శ్రీ..కార్తీక్ కొడకండ్ల, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆటా సంస్థ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులు, 1.అభిజ్ఞ ఎనగంటి, 2.అభిరాం తమన్న, 3.ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, 4.అదితి నటరాజన్, 5.అంజలి కందూర్, 6.హర్షిని మగేశ్, 7.హర్షిత వంగవీటి, 8.లాస్య ధూళిపాళ, 9.మల్లిక సూర్యదేవర, 10.మేధ అనంతుని, 11.ప్రణీత విష్ణుభొట్ల, 12.రోషిని బుద్ధ, 13.శశాంక ఎస్.యెన్, 14.శ్రియ నందగిరి, 15.ఐశ్వర్య నన్నూర్లను వర్జీనియా, న్యూ జెర్సీ, జార్జియా, కాలిఫోర్నియా, మసాచూట్స్, మిచ్చిగన్, వాషింగ్టన్ , టెక్సాస్, మిన్నిసోటా తదితర రాష్ట్రాల నుంచి ఫైనలిస్ట్స్గా ఎంపిక చేసారు. ఆటా ప్రెసిడెంట్ శ్రీ..పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల , బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్ ,రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వెన్షన్ టీం, ఝుమ్మంది నాదం టీం, సోషల్ మీడియా టీం ఫైనలిస్ట్స్ అందరికి అభినందనలు తెలియ చేసారు. పోటీలో పాల్గొన్న గాయని గాయకులు, వారి తల్లి తండ్రులు ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతల కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణం. ఆటా ఝుమ్మంది నాదం సెమీఫైనల్స్ పాటల పోటీలు ఆగష్టు 2, 2020 వరకు ఫైనల్స్ ఆగష్టు 8, 2020 నుంచి ఆగష్టు 9 వరకు కొనసాగిస్తారు. ఆటా సంస్థలకు లైవ్ ప్రచారం చేస్తున్న వివిధ టీవీ చానళ్లకు, జి.యెన్.యెన్, ఏ.బి.ఆర్ ప్రొడక్షన్స్, అలాగే తెలుగు ఎన్.ఆర్.ఐ రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఝుమ్మంది నాదం పాటల పోటీలు విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ శ్రీ .పరమేష్ భీంరెడ్డి ప్రశంసలను తెలిపారు. -
హాట్కేకు.. ట్రిపుల్ఐటీ సీటు
జ్యోతినగర్(రామగుండం): ట్రిపుల్ఐటీ అనేది పదోతరగతి పూర్తిచేసిన ప్రతీ విద్యార్థి కల. అందులో సీటు సంపాదిస్తే.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడొచ్చనే ఉద్దేశం. పదోతరగతిలో ప్రతిభ ఆధారంగా 10 జీపీఏ సాధించిన వారికి ట్రిపుల్ఐటీలో చోటు దక్కుతుంది. ఈసారి కరోనా ఎఫెక్ట్... ప్రభుత్వ నిర్ణయంతో ఈ సీట్లు హాట్కేకులు అవబోతున్నాయి. పదో తరగతిలో అందరినీ పాస్ చేయగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 42,456 మంది విద్యార్థులకు 16,739 మంది 10 జీపీఏ సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా బాసర ట్రిపుల్ఐటీకి ప్రాధాన్యత ఇస్తారు. అందులో 1,500 సీట్లు ఉండగా.. తెలంగాణవ్యాప్తంగా పెద్దమొత్తంలో 10 జీపీఏ సాధించినవారున్నారు. ఈసారి ట్రిపుల్ఐటీ సీటుకు పోటీ ఉండడంతో మూడు దశల్లో ఎంపిక విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి నుంచే కసరత్తు.. ప్రతీ ఏడాదికన్నా ఈసారి ట్రిపుల్ఐటీలో సీటు సాధించడం కష్టంగానే మారబోతోంది. ప్రభుత్వం ‘పది’లో అందరినీ పాస్ చేయగా.. 10 జీపీఏ సాధించిన వారుకూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మూడు ప్రమాణాలు నిర్వచించింది. సీట్ల కేటాయింపును వివిధ దశల్లో పరిశీలించి, మెరుగైన ర్యాంకువచ్చిన వారిని ఎంపిక చేస్తారు. అయినా పోటీ ఉంటే ర్యాండమ్ విధానం అవలంబిస్తారు. ఇంకా ట్రిపుల్ఐటీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరనప్పటికీ.. ఇప్పటినుంచే అధికారులు ప్రక్రియకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. మూడు దశల్లో పరిశీలన... ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందాలంటే వివిధ సామాజిక రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకోవడంతోపాటు పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రధాన్యత ఇస్తారు. రెండోదశలో వివిధ పాఠ్యాంశాల్లో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. మొదటి ప్రాధాన్యత గణితంకు ఇవ్వగా.. సామాన్యశాస్త్రం, ఇంగ్లిష్, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్లో వచ్చిన మార్కులు పరిశీలిస్తారు. ప్రతీదశలోనూ మార్కులు సమానంగా వస్తే.. మరోదశలో విద్యార్థి పుట్టిన తేదీని ప్రమాణంగా తీసుకుంటారు. దీని ఆధారంగా గరిష్ట వయసున్న వారికి ప్రాధాన్యమిస్తారు. ఈ మూడు దశల్లోనూ సమానంగా మార్కులు వచ్చి పోటీ నెలకొంటే చివరగా విద్యార్థి పదో తరగతి హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ర్యాండమ్స్కోర్ ద్వారా సీటు కేటాయిస్తారు. ర్యాండమ్ విధానం ఇలా మూడు దశల్లోనూ సీటు కేటాయింపుపై సందిగ్ధత నెలకొన్న క్రమంలో చివరకు ర్యాండమ్ విధానం అమలు చేస్తారు. విద్యార్థి హాల్టికెట్ నంబర్ ఆధారంగా దీన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియ అంతసులువుకాదని, విద్యావ్యవహారాలు ఇంటర్నెట్లో ఉంచే ఒక వెబ్సైట్ ద్వారా సులభపద్ధతిని అందుబాటులో ఉంచిందని పెద్దపల్లి డీఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. https://www.teachersteam.co.in/ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మొదటి ఆఫ్షన్లో హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే ర్యాండమ్ ర్యాంకు లభిస్తుంది. ప్రవేశాలకు పేర్కొన్న ప్రమాణాలు సంతృప్తి పరిచి టై అయిన సమయంలో చివరగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్జీకేయూటీ సైట్లో వివరించారు. -
ఆటా ‘జుమ్మంది నాదం’ పాటల పోటీ
న్యూయార్క్ : డిసెంబర్, 2020లో జరగనున్న కన్వెన్షన్ను పురష్కరించుకుని ‘అమెరికన్ తెలుగు అసోషియేషన్’ ( ఆటా) ‘జుమ్మంది నాదం’ పేరిట ఆన్లైన్ సోలో పాటల పోటీ నిర్వహించనుంది. అమెరికాలో ఉంటున్న వారు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు. మొదటి రౌండ్ను యూట్యూబ్ ద్వారా నిర్వహించనున్నారు. పోటీలో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ ఫాంలో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా ఆడిషన్స్ పంపాల్సి ఉంటుంది. ఫైనల్, సెమీ ఫైనళ్లు జూమ్ ద్వారా నిర్వహించబడతాయి. విజేతలను ప్రముఖుల చేతుల మీదుగా ఆటా టైటిల్తో సత్కరించనున్నారు. పోటీలోని ఆరు విభాగాలు : వయసు పరిమితి 1) క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు) 2) క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు) 3) క్లాసికల్ : సీనియర్స్ ( 15 పైబడిన వారు) 4) నాన్ క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు) 5) నాన్ క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు) 6) నాన్ క్లాసికల్ : సీనియర్స్ ( 15 సంవత్సరాల పైబడిన వారు) రిజిస్ట్రేషన్ చివరి తేదీ : జూన్ 7, 2020 రిజిస్ట్రేషన్ కోసం : https://tinyurl.com/ATA-JN2020 క్లిక్ చేయడి. మరిన్ని వివరాల కోసం : https://tinyurl.com/ATA-JN-Details ను సందర్శించండి. -
కుంచనపల్లిలో పందుల పోటీలు
తాడేపల్లిగూడెం రూరల్: సంక్రాంతి పేరు చెబితే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది కోడిపందేలు. అయితే, మండలంలోని కుంచనపల్లి గ్రామంలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా పందుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు సింగం పట్టాభి, సుబ్బారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు బుధవారం జరిగాయి. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పందుల పెంపకందారులు ఈ పోటీలకు తరలివచ్చారు. కత్తులు కట్టకుండా ఎటువంటి జీవహింస లేకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు సింగం సుబ్బారావు తెలిపారు. పోటీ నుంచి పారిపోయిన పంది పరాజయం పొందినదిగా భావించి బరిలో నిలబడిన పంది విజయం సాధించినట్లుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎటువంటి జీవహింస లేదని, తమపై వన్యప్రాణి సంరక్షణ సమితి వారు కేసులు నమోదు చేయడం సరికాదని వివరించారు. పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ
సాక్షి, కర్నూలు : జిల్లాలో గ్రామ వలంటీరు పోస్టులకు భారీ పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 909 గ్రామ పంచాయతీల్లో 14,118 పోస్టులు ఉన్నాయి. వీటికి మొత్తం 83,123 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివిధ కారణాల వల్ల 1,515 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 24 పరిశీలనలో ఉన్నాయి. మిగిలిన 81,584 ఇంటర్వ్యూకు అర్హత సాధించాయి. అభ్యర్థులకు గురువారం నుంచి ఈ నెల 23 వరకు ఆయా మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 800 దరఖాస్తులకు మించి ఉన్న మండలాల్లో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేందుకు కలెక్టర్ అదనపు కమిటీలను ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి మండలంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఈఓఆర్డీలతో ఏర్పాటైన కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే.. 800 కంటే ఎక్కువ దరఖాస్తులు ఉన్న మండలాల్లో ఈ కమిటీతో పాటు మండల ప్రత్యేకాధికారి, వ్యవసాయాధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో ఒక కమిటీ, ఇంకా ఎక్కువ దరఖాస్తులు ఉంటే పీఆర్ డీఈ, డిప్యూటీ తహసీల్దార్, పీఆర్ ఏఈతో మరో కమిటీ ఉంటుంది. ఈ 20 మండలాల్లో... : 20 మండలాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా వాటిలో మూడు కమిటీల చొప్పున ఇంటర్వ్యూలు చేయనున్నాయి. ఈ జాబితాలో ఓర్వకల్లు, అవుకు, వెల్దుర్తి, సీ బెళగల్, ఆస్పరి, నంద్యాల, డోన్, తుగ్గలి, ప్యాపిలి, నందవరం, ఆదోని, కల్లూరు, బేతంచెర్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, గోనెగండ్ల, కర్నూలు మండలాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో మండలంలో 1,600కు మించి దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు కమిటీలు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నాయి. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం పోస్టులను కేటాయిస్తున్నారు. మొత్తం పోస్టులు : 14,118 బీసీ : 4,092, ఎస్సీ : 2,120, ఎస్టీ : 850, పీహెచ్సీ : 422, జనరల్ : 6,634 -
వైస్ చైర్మన్ పదవికి పోటాపోటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల, జిల్లా పరిషత్ ఫలితాలు తేలడంతో అందరి దృష్టి ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ స్థానాలపై పడింది. జెడ్పీ చైర్పర్సన్గా డాక్టర్ తీగల అనితారెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇక.. వైస్ చైర్మన్ పదవిపై ఆశావహులు గురిపెట్టారు. ఈ స్థానానికి రిజర్వేషన్తో సంబంధం లేకపోవడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి సొంత అన్న కుమారుడు పట్నం అవినాష్రెడ్డి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే పట్నం ఫ్యామిలీ నుంచి నలుగురికి పదవులు దక్కాయి. కొడంగల్కు నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేందర్రెడ్డి తాజాగా ఎమ్మెల్సీగా నెగ్గారు. అలాగే వికారాబాద్ జిల్లా కోట్పల్లి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన ఈయన సతీమణి సునితారెడ్డిని ఆ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవికి ఖరారు చేశారు. అంతేగాక షాబాద్ నుంచి అవినాష్రెడ్డి జెడ్పీటీసీగా నెగ్గారు. ఈ క్రమంలో అవినాష్కు జెడ్పీ వైస్చైర్సన్గా అవకాశం ఇస్తారా? అనే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన వైపు మొగ్గుచూపితే పార్టీలో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితులు ఉన్నాయని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారు. పార్టీని ఆది నుంచి నమ్ముకున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు శ్రీకాంత్ కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్యే సతీమణి కూడా నవాబుపేట జెడ్పీటీసీగా, రెండో కోడలు ఎంపీటీసీగా గెలుపొందారు. ఈ కుటుంబంలోనూ నలుగురికి పదవులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని కూడా కట్టబెడతారా అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. రేసులో వెంకటేష్ కూడా.. తలకొండపల్లి జెడ్పీటీసీగా ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) తరఫున అత్యధిక మెజారిటీతో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించిన ఉప్పల వెంకటేశ్ కూడా రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏఐఎఫ్బీ నుంచి నెగ్గినప్పటికీ.. ఈయన టీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడని తెలుస్తోంది. ఈయనకు వైస్ చైర్మన్ పదవి ఖరారు చేస్తే గులాబీ కండువా కప్పుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వెంకటేష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు ఆయన తలకొండపల్లి మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాల్లో తన వర్గాన్ని గెలిపించుకుని సత్తా చాటారు. స్థానిక రాజకీయాల వల్ల టీఆర్ఎస్ నుంచి టికెట్ లభించకున్నా ఏఐఎఫ్బీ నుంచి పోటీచేసి తనకున్న మంచిపేరుతో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్న వెంకటేష్ పట్ల అధికార పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని ఆయన అనుయాయులు నమ్మకంతో ఉన్నారు. వీరితోపాటు మరికొందరు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ఇలా ఆశా వహ అభ్యర్థులు తమ మార్గాల్లో వైస్ చైర్మన్ పదవి కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెరమీదకు బీసీ నినాదం జెడ్పీ పీఠం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. బీసీ అంశానికి అధిష్టానం కట్టుబడి ఉంటే.. ప్రధానంగా వినిపిస్తున్న అవినాష్, శ్రీకాంత్, వెంకటేష్ పేర్లను పక్కన పెట్టినట్లే. అవినాష్ది రెడ్డి సామాజిక వర్గం కాగా, శ్రీకాంత్.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక వెంకటేష్ ఆర్యవైశ్యులు. ఈ నేపథ్యంలో ఇతరుల పేర్లు పరిశీలనలోకి వచ్చే వీలుంది. తద్వారా ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. మొత్తం మీద జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక జరిగే 8వ తేదీనే వైస్ చైర్మన్ను కూడా ఎన్నుకుంటారు. అంటే ఏదో తేదీలోగా వైస్ చైర్మన్ పదవికి పార్టీ ఎవరిని ఖరారు చేస్తుందో తేలనుంది. అధిష్టానం ఖరారు చేసిన వ్యక్తికే ఆ పదవి దక్కుతుందని పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఎంపీపీ పీఠాలకు బేరాలు.. మండల రాజకీయాల్లో కీలకమైన ఎంపీపీ పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. అధికార పార్టీకి తొమ్మిది మండలాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఎంపీపీ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అయినా కొందరు నేతలు క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్టం వెంటాడితే ఏదైనా జరగొచ్చన్న ముందస్తు చర్యగా ఎంపీటీసీలతో శిబిరం నిర్వహిస్తూ చేజారకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇక హంగ్ ఏర్పడిన 11 స్థానాలనూ సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ మండలాల్లో ఎంపీపీ స్థానాలను సాధించడంలో.. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలు కీలకంగా మారుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోపక్క చేవెళ్ల, మంచాల ఎంపీపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. వీరి ఎన్నికలో కీలకమైన ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇలా ఆయా పార్టీల అవసరాలను గమనించిన కొందరు ఎంపీటీసీలు తమ కోరికల చిట్టాను వారి ముందు పెడుతున్నారు. తమకు ఎంపీపీ లేదా వైస్ ఎంపీపీ పదవులు ఇస్తేనే ముందుకు వస్తామని నిర్మొహమాటంగా చెబుతున్నారు. మొత్తం మీద ఎంపీసీల ఎన్నిక సరవత్తరంగా మారుతోంది. -
ప్రత్యేక ఆకర్షణగా సినిమాలోని ఎద్దు
సాక్షి,పెద్దవూర : ప్రముఖ హీరో పవన్కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాలో ఉన్న ఎద్దు పందేలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాశివరాత్రి సందర్భంగా దున్న ఇద్దాస్ ఆరాధనోత్సవాలలో భాగంగా తెలుగు రాష్ట్రాల ఎద్దుల పందేలను గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన సోమవారం నిర్వహించిన సీనియర్ సైజు విభాగంలో కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన నవనీతకృష్ణ ఎద్దులు పాల్గొన్నాయి. చివరికి ఆ ఎద్దులు 3200 అడుగుల దూరం లాగి చతుర్థ బహుమతిని గెల్చుకున్నాయి. -
మంచిర్యాల నుంచి పోటీ మంచిది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పోటీ చేయాల్సిన నియోజకవర్గంపై తర్జనభర్జన జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల ఐక్యకూటమి అభ్యర్థిగా ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో కోదండరాం తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఐక్యంగా పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. ఈ కూటమిలో ఏయే పార్టీ, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనే దానిపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో అమలు కమిటీకి కోదండరాం చైర్మన్గా ఉండాలని అన్నిపార్టీలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. కూటమి అభ్యర్థిగా కోదండరాం పోటీపై సందిగ్థత కొనసాగుతోంది. పోటీచేయాలా, పోటీకి దూరంగా ఉండాలా అనే దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనగామ లేదావరంగల్ పశ్చిమ కోదండరాం స్వగ్రామం మంచిర్యాల పరిధిలో ఉంది. దీనితోపాటు తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటం, కోదండరాంకు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలు, సంబంధాలుండటం వంటి కారణాలతో మంచిర్యాలలో పోటీ చేయ డం మంచిదని అంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు పరిసరాల్లో ఉండే నియోజకవర్గం అయితే సౌకర్యంగా ఉంటుందని మరికొందరు వాదిస్తున్నా రు. వరంగల్ పశ్చిమ, జనగామ నియోజకవర్గంలో పోటీ చేయాలని కొందరు కోరుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం కూడా అనుకూలంగానే ఉంటుందని కొందరు ప్రతిపాదిస్తున్నారు. అయితే, మంచిర్యాల లేదా జనగామ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో పోటీ చేసే అంశంపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. శాసనసభకు పోటీ చేయకుండా కనీస ఉమ్మడి కార్యక్రమాల అమలు కమిటీకి చైర్మన్గా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే మంచిదని మిత్రపక్షాల నేతలు అంటున్నారు. ఉద్యమసమయంలో తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాంకు యువత, ఉద్యోగులు, విద్యా ర్థులు, తెలంగాణవాదుల్లో క్రేజ్ ఉందని, సీఎం కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కోదండరాంను ఉద్యమశక్తులు ఆమోదిస్తాయని, దీనిని ఓట్లుగా మార్చుకునే వ్యూహంతో పనిచేయాలని వాదిస్తున్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన మందు పందెం
కోదాడ అర్బన్ : ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం తాగే విషయంలో వేసుకున్న పందెం ఓ డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన గురువారం కోదాడ లో చోటు చేసుకుంది. వివరాలు.. లారీ డ్రైవర్లు మామిడి లక్ష్మయ్య, బ్రిటిష్స్నేహితులు. వీరు ఉదయం లారీ అసోసియేషన్ వద్ద మద్యం తాగేం దుకు ఉపక్రమంచారు. ఆ సమయంలో వారద్దిరి మద్యం తాగే విషయంలో వాదన మొదలైంది. మామిడి లక్ష్మయ్య తాను మద్యంలో నీళ్లు కలపకుండా అరగంటలో ఫుల్బాటిల్ తాగుతానని బ్రిటిష్తో పందెం కట్టాడు. అలా తాగితే తాను రూ.5వేలు ఇస్తానని పందెం కాశాడు. ఈ సందర్భంగా వారు తాగిన తరువాత ఏదైనా జరిగితే పందెం కాసిన వారికి సంబంధం లేదని ఒక కాగితంపై రాసుకున్నారు. అనంతరం లక్ష్మయ్య పందెం ప్రకారం ఎంసీ విస్కీ ఫుల్బాటిల్ను పావుగంటలోనే తాగి పడిపోయాడు. దీంతో బ్రిటిష్ పందెం మొత్తాన్ని లక్ష్మయ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లక్ష్మయ్య పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రేపటి వరకు ఎలా ఉంటుందనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. మొత్తం మీద మందుపందెం ప్రాణం మీదకు తెచ్చింది. -
తొలి ‘ట్రైబల్ క్వీన్’గా పల్లవి దరువా
భువనేశ్వర్ : భారతదేశ తొలి ట్రైబల్ క్వీన్గా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాకు చెందిన పల్లవి దరువా చరిత్ర సృష్టించారు. ఆది రాణి కళింగ ట్రైబల్ క్వీన్ పోటీలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని ఓడించి ఆమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్ ఫేస్, బెస్ట్ స్కిన్, బెస్ట్ పర్సనాలిటీ వంటి ఏడు విభిన్న విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచారు. ఈ పోటీలో టిట్లాఘడ్కు చెందిన పంచమీ మజీ మొదటి రన్నరప్గా నిలవగా.. మయూర్భంజ్కు చెందిన రష్మీరేఖా హన్స్దా రెండో రన్నరప్తో సరిపెట్టుకున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక ఉత్కళ్ మండపంలో జరిగిన ఈ పోటీలో ‘పద్మశ్రీ’ తులసి ముండా నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయించారు. సమయం ఆసన్నమైంది... ‘చాలా మంది గిరిజన బాలికలు, మహిళలకు నాలాగా ఈ విధంగా బయటి ప్రపంచంలోకి రావడం, చదువుకోవడం వంటి అవకాశాలు దక్కడం లేదు. ట్రైబల్ క్వీన్గా కిరీటాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ వారందరికీ నేనొక చక్కని ఉదాహరణగా నిలుస్తానని అనుకుంటున్నాను. మూఢనమ్మకాలు వదిలేసి.. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చేసిందంటూ’ ట్రైబల్ క్వీన్ పల్లవి దరువా పిలుపునిచ్చారు. చరిత్ర సృష్టించాం... విజేతలను ప్రకటించిన అనంతరం అవార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి చిదాత్మిక ఖట్వా మాట్లాడుతూ... ‘ఈరోజు మేము చరిత్ర సృష్టించాం. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతిని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన పోటీ కానే కాదు. కేవలం కళలు, నృత్యరీతుల ద్వారానే కాకుండా గిరిజన మహిళలకంటూ ఒక సొంత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోటీ నిర్వహించాం. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్పై నడవడం, అందరి ముందు అభిప్రాయాలను వెల్లడించడం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంటూ’ వ్యాఖ్యానించారు. -
ఒక్క ఐడియాతో రూ.10 లక్షలు గెల్చుకోండి
మీరు చక్కటి ఐడియాలు ఇవ్వగలరా...? మీ ఆలోచనతో అందరిని ఒప్పించి, మెప్పించగలరా..? అయితే ఇది మీ కోసమే. భారత రైల్వే శాఖ మీరు పది లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఓ మంచి ఐడియా చెప్పడమే. భారత రైల్వే శాఖ జన్ భాగీదారి ప్రోగ్రామ్ పేరిట ఓ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొన్న వారు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఐడియా చెబితే చాలు. మీ ఆలోచన కొత్తగా, అద్భుతంగా ఉందంటే పది లక్షల రూపాయలు మీవే. అంతేకాదు ఆ తర్వాత మరో మూడు నగదు బహుమతులు కూడా ఉన్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి మీరు ‘ఇన్నోవేటివ్.మైగోవ్.ఇన్’ వెబ్సైట్లోకి వెళ్లి మీ ఆలోచనను ఆన్లైన్లో పంపితే సరిపోతుంది. రైల్వే స్టేషన్లలో చక్కటి సౌకర్యాలు కల్పించడానికి డబ్బును ఎలా సమకూర్చాలో క్లుప్తంగా వివరించాలి. మీ ఆలోచన మన ప్రస్తుత రైల్వే వ్యవస్థకు సరిపోయేదిగా ఉండాలి, ఆచరణ సాధ్యంగా కూడా ఉండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మెదడుకు పదును పెట్టిండి, పది లక్షలు గెల్చుకోండి! -
పడవల పోటీకి సై!
రాష్ట్రస్థాయి సంప్రదాయ పడవల పోటీలకు నాగాయలంక పడవల రేవు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా నాలుగేళ్ల క్రితం ఇక్కడ సంప్రదాయ ఈ పోటీలు ప్రారంభించారు. రెండేళ్ల నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఈ ఏడాది వినూత్నంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేక పడవలను రప్పించగా, పోటీదారులు రిహార్సల్స్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో జరిగే ఈ పోటీలకు లక్షమంది హాజరవుతారని అంచనా. అవనిగడ్డ/నాగాయలంక: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నాగాయలంకలో నాలుగేళ్ల నుంచి కేరళ తరహాలో సంప్రదాయ పడవల పోటీలు నిర్వహిస్తున్నారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువగా ఉండటం, సంప్రదాయ పోటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంక్రాంతి సందర్భంగా నాలుగేళ్ల క్రితం నాగాయలంక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభించారు. 2017 నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే ఈ పోటీలు పర్యాటకశాఖతో పాటు జిల్లా యంత్రాంగం, నాగాయలంక గ్రామ అభివృద్ధి కమిటీ, స్వచ్ఛ నాగాయలంక, గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో జరుగుతాయి. విజేతలకు నజరానా కోల పడవలు, మెడ్డుడు, డ్రాగన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. తొమ్మిది మంది పాల్గొనే కోలపడవ విభాగంలో మొత్తం 36 టీంలు పాల్గొంటాయి. మొదటి బహుమతిగా రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10వేలతో పాటు పాల్గొన్న ప్రతి పడవకు రూ.4వేలు ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. ఒక పురుషుడు, ఒక మహిళ పాల్గొనే మెడ్డుడు పడవల పోటీలకు 50 టీంలు అనుమతిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ రూ.6వేలు, తృతీయ రూ.3వేలతో పాటు పాల్గొన్న ప్రతి పడవకు రూ.1,000 ఇస్తారు. 11 మంది పాల్గొనే డ్రాగన్ విభాగంలో 36 టీంలను అనుమతిస్తారు. ఈ పోటీలో మొదటి బహుమతిగా రూ.25వేలు, ద్వితీయ రూ.15, తృతీయ బహుమతిగా రూ.10వేలతో పాటు పాల్గొన్న ప్రతి పడవకు రూ.4,500 నగదు బహుమతి ఇస్తారు. 13వ తేదీన కోలపడవల పోటీలు నిర్వహించనుండగా, 14న డ్రాగన్, మెడ్డుడు పోటీలు జరుగుతాయి. మహిళలకు పోటీలు సంప్రదాయ పడవల పోటీలను పురస్కరించుకుని మహిళలకు ప్రత్యేక పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 13వ తేదీన పాస్ ద బాల్, లెమన్ అండ్ స్పూన్, డార్జ్ బాల్, 14న భోగిపళ్లు, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ పోటీలు జరుగుతాయి. విజేతలకు ప్రత్యేక బహుమతులు ఇస్తారు. సినీ సందడి 13వ తేదీ ఉదయం 8 గంటలకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జల క్రీడలలో ఉపయోగించే కెనోయింగ్, కయా కింగ్, రోయింగ్, సెయిలింగ్ పడవలతో అద్భుత విన్యాసాలు ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, సినీ గాయకుడు ధనుంజయ్, గాయని ఉష, మాళవిక సంగీత విభావరి ఉంటుంది. ఈ సందర్భంగా పడవల రేవును ప్రత్యేక పడవలు, రంగురంగుల తెరచాపలతో అందంగా అలంకరించారు. పోటీలు నిర్వహించనున్న శ్రీపాద క్షేత్రంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ లక్ష్మీకాంతం, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్తో పాటు పలువురు మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
గుజరాత్ బరిలోకి మేవానీ
అహ్మదాబాద్: గుజరాత్లోని వాద్గాం(ఎస్సీ) స్థానం నుంచి ఎన్నికల పోటీకి దిగుతున్నానని దళిత నేత జిగ్నేష్ మేవానీ ప్రకటించారు. కాంగ్రెస్ పరోక్ష మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా మేవానీకి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ కోసం సోమవారం 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను విడుదల చేయగా.. మేవానీకి మద్దతుగా వాద్గాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను నిరాకరించిన ఆ పార్టీ.. ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్కు రాధన్పూర్ నియోజకవర్గాన్ని కేటాయించింది. రెండు స్థానాల్ని జేడీయూ ఎమ్మెల్యే ఛోటుభాయ్ వసావా నేతృత్వంలోని భారతీయ ట్రైబల్ పార్టీకి వదిలిపెట్టింది. భారతీయ ట్రైబల్ పార్టీ మొత్తం ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆదివారం 76 మందితో కాంగ్రెస్ పార్టీ రెండో దశ ఎన్నికల కోసం తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కోల్గేట్ కష్టాలు
న్యూఢిల్లీ: ఊళ్లలో ఎక్కువ మంది వినియోగించే టూత్పేస్ట్ ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం కోల్గేట్. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్లోని మారుమూల గ్రామల్లో సైతం టూత్పేస్ట్ అంటే కోల్గేట్ అనే పేరు పాతుకుపోయింది. అలాంటిది తొలిసారి ఆ కంపెనీ తాము కష్టాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. బాబా రామ్దేవ్ కంపెనీ పతంజలి నుంచి కోల్గేట్ గట్టి పోటీ ఎదురవుతోందని తెలిపింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.142.58 కోట్ల ఆదాయానికి గండి పడినట్లు చెప్పింది. గతేడాది ఇదే సమయానికి ప్రకటించిన వివరాల్లో కోల్గేట్ రూ.143.27 కోట్ల లాభాలు గడించింది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన కోల్గేట్ కంపెనీ సీఈవో ఇయాన్ కుక్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. భారత్లో మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రొడక్ట్స్ను అందుబాటులో ఉంచాలని సూచించారు. పతంజలి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వినియోగదారుని అభిరుచిని తెలుసుకుని ఉత్పత్తులను తయారు చేయాలని చెప్పారు. పతంజలి 'దేశీయత' అనే భిన్నమైన కాన్సెప్ట్తో మార్కెట్ను కొల్లగొడుతోందని, దానికి సరిజోడుగా సహజసిద్ధంగా తయారు చేశామని చెబుతోందని ఇన్వెస్టర్ల కాన్ఫెరెన్స్లో చెప్పుకొచ్చారు కుక్. కొల్గేట్ కూడా ప్రజల అభిరుచులకు అనుగుణంగా సహజపద్దతిలో ఉత్పత్తులను తయారుచేసి అందించే మార్గాన్ని అనుసరించాలని సూచించారు. -
పోటీ లేకుండా ఉంటే బాగుండేది: వెంకయ్యనాయుడు
అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ లేకుండా ఉంటే బాగుండేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రతిపక్ష మిత్రులు పోటీ పెట్టారని అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాబోయే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేరుగా వచ్చి కలవడం అరుదైన అవకాశమని ఆయన తెలిపాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి రావాలని ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపామని, అభ్యర్థి ఖరారు అయ్యాక కూడా ప్రతిపక్షాలను సంప్రదించామని..అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఎన్డీఏ బయట ఉన్న టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ లాంటి పార్టీలతో పాటు జేడీయూ, బీజేడీ, ఏఐడీఎంకే వంటి పార్టీలు సహకరించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా రామ్ నాధ్ కోవిందుకు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని వ్యాఖ్యానించారు. -
ముగిసిన నాటిక పోటీల సంరంభం
భీమవరం : సినీ, టీవీ రంగాల వల్ల కనుమరుగైపోతున్న నాటక రంగానికి కళా పరిషత్లే ఊపిరిపోశాయని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో ఐదురోజులుగా జరిగిన చైతన్య భారతి సంగీత నృత్య, నాటక పరిషత్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జాతీయ స్థాయి నాటిక పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో సినీ హీరో సుమన్ను కళాకారులు సత్కరించారు. అనంతరం జరిగిన సభలో శివరామరాజు మాట్లాడారు. నాటక రంగ పునరుజ్జీవనానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు కేశిరాజు సంస్కృతి, గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా నాటిక పోటీల్లో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించారు. ఈ సభకు నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షత వహించగా మంతెన వెంకటనర్సింహ సీతారామరాజు, మానాపురం సత్యనారాయణ, డాక్టర్ పి.పెర్సీ, వర్ధమాన సినీ హీరో అల్లు వంశీకృష్ణ, దర్శకుడు సంతోష్ ఇట్టమళ్ల, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, మంతెన రాంకుమార్రాజు, కృత్తివెంటి సత్యకుమార్, కాగిత వెంకటరమణారావు, బొండా రాంబాబు, బటిప్రోలు శ్రీనివాసరావు, పేరిచర్ల లక్ష్మణవర్మ, బుర్రా పద్మనాభం, విన్నకోట వెంకటేశ్వరరావు, బుద్దాల వెంకటరామారావు, వంగా నర్సింహరావు, చవ్వాకుల సత్యనారాయణమూర్తి, జవ్వాది దాశర«థి శ్రీనివాసరావు, గంటా ముత్యాలరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు శ్రీసాయి ఆర్ట్స్ (కొలుకలూరు) ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ప్రథమ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. విజేతల వివరాలను న్యాయ నిర్ణేతలు కేఎస్టీ సాయి, కోనా హేమచంద్, మానాపురం సత్యనారాయణ గురువారం విలేకరులకు వెల్లడించారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లివారి ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా పండు క్రియేష న్స్ కొప్పోలు వారి ‘అమ్మ సొత్తు’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటులు, సాంకేతిక నిపుణులు వీరే.. ఉత్తమ దర్శకుడిగా కేకేఎల్ స్వామి (తేనేటీగలు పగబడతాయి), ఉత్తమ విలన్గా వి.కృష్ణమూర్తి(సైకత శిల్పం), ఉత్తమ రచయితగా కావూరి సత్యనారాయణ (శ్వేతపత్రం), ఉత్తమ నటిగా ఎస్.అమృత వర్షిణి (గోవు మా లచ్చిమి). ఉత్తమ నటుడిగా పి.బాలాజీనాయక్(నాన్నా నువ్వో సున్నావా?) బహుమతులు అందుకున్నారు. ఉత్తమ కారెక్టర్ నటిగా టి.లక్ష్మి (కేవలం మనుషులం), ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా బి.లక్ష్మయ్య(ఆగ్రహం), ద్వితీయ ఉత్తమ నటిగా డి.సరోజ(ఆగ్రహం), ద్వితీయ ఉత్తమ నటుడిగా గోపరాజు రమణ (చాలు ఇక చాలు), ఉత్తమ సహాయ నటిగా మాధవి (నాన్నా నువ్వో సున్నావా?), ఉత్తమ సహాయ నటుడిగా బి.నాగేశ్వరరావు (అమ్మసొత్తు), ఉత్తమ హాస్య నటుడిగా పీఎన్ఎం కవి(ప్రియమైన శత్రువు) ఎంపికయ్యారు. ఉత్తమ మేకప్ మేన్గా ఎస్.రమణ (తేనేటీగలు పగబడతాయి ) ఉత్తమ సంగీతం పి.రాజు(నాన్న నువ్వో సున్నావా?) ఉత్తమ బాల నటుడుగా ఎ.పవన్కుమార్ (శ్వేతపత్రం)బహుమతులు అందుకున్నారు. ప్రత్యేక జ్యూరీ అవార్డులకు జి.దిలీప్కుమార్, కేవీ సుబ్బారాయుడు ఎంపికైనట్టు న్యాయనిర్ణేతలు సాయి, హేమచంద్, సత్యనారాయణ వెల్లడించారు. -
ముగిసిన నాటిక పోటీల సంరంభం
భీమవరం : సినీ, టీవీ రంగాల వల్ల కనుమరుగైపోతున్న నాటక రంగానికి కళా పరిషత్లే ఊపిరిపోశాయని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో ఐదురోజులుగా జరిగిన చైతన్య భారతి సంగీత నృత్య, నాటక పరిషత్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జాతీయ స్థాయి నాటిక పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో సినీ హీరో సుమన్ను కళాకారులు సత్కరించారు. అనంతరం జరిగిన సభలో శివరామరాజు మాట్లాడారు. నాటక రంగ పునరుజ్జీవనానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు కేశిరాజు సంస్కృతి, గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా నాటిక పోటీల్లో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించారు. ఈ సభకు నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షత వహించగా మంతెన వెంకటనర్సింహ సీతారామరాజు, మానాపురం సత్యనారాయణ, డాక్టర్ పి.పెర్సీ, వర్ధమాన సినీ హీరో అల్లు వంశీకృష్ణ, దర్శకుడు సంతోష్ ఇట్టమళ్ల, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, మంతెన రాంకుమార్రాజు, కృత్తివెంటి సత్యకుమార్, కాగిత వెంకటరమణారావు, బొండా రాంబాబు, బటిప్రోలు శ్రీనివాసరావు, పేరిచర్ల లక్ష్మణవర్మ, బుర్రా పద్మనాభం, విన్నకోట వెంకటేశ్వరరావు, బుద్దాల వెంకటరామారావు, వంగా నర్సింహరావు, చవ్వాకుల సత్యనారాయణమూర్తి, జవ్వాది దాశర«థి శ్రీనివాసరావు, గంటా ముత్యాలరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు శ్రీసాయి ఆర్ట్స్ (కొలుకలూరు) ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ప్రథమ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. విజేతల వివరాలను న్యాయ నిర్ణేతలు కేఎస్టీ సాయి, కోనా హేమచంద్, మానాపురం సత్యనారాయణ గురువారం విలేకరులకు వెల్లడించారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లివారి ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా పండు క్రియేష న్స్ కొప్పోలు వారి ‘అమ్మ సొత్తు’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటులు, సాంకేతిక నిపుణులు వీరే.. ఉత్తమ దర్శకుడిగా కేకేఎల్ స్వామి (తేనేటీగలు పగబడతాయి), ఉత్తమ విలన్గా వి.కృష్ణమూర్తి(సైకత శిల్పం), ఉత్తమ రచయితగా కావూరి సత్యనారాయణ (శ్వేతపత్రం), ఉత్తమ నటిగా ఎస్.అమృత వర్షిణి (గోవు మా లచ్చిమి). ఉత్తమ నటుడిగా పి.బాలాజీనాయక్(నాన్నా నువ్వో సున్నావా?) బహుమతులు అందుకున్నారు. ఉత్తమ కారెక్టర్ నటిగా టి.లక్ష్మి (కేవలం మనుషులం), ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా బి.లక్ష్మయ్య(ఆగ్రహం), ద్వితీయ ఉత్తమ నటిగా డి.సరోజ(ఆగ్రహం), ద్వితీయ ఉత్తమ నటుడిగా గోపరాజు రమణ (చాలు ఇక చాలు), ఉత్తమ సహాయ నటిగా మాధవి (నాన్నా నువ్వో సున్నావా?), ఉత్తమ సహాయ నటుడిగా బి.నాగేశ్వరరావు (అమ్మసొత్తు), ఉత్తమ హాస్య నటుడిగా పీఎన్ఎం కవి(ప్రియమైన శత్రువు) ఎంపికయ్యారు. ఉత్తమ మేకప్ మేన్గా ఎస్.రమణ (తేనేటీగలు పగబడతాయి ) ఉత్తమ సంగీతం పి.రాజు(నాన్న నువ్వో సున్నావా?) ఉత్తమ బాల నటుడుగా ఎ.పవన్కుమార్ (శ్వేతపత్రం)బహుమతులు అందుకున్నారు. ప్రత్యేక జ్యూరీ అవార్డులకు జి.దిలీప్కుమార్, కేవీ సుబ్బారాయుడు ఎంపికైనట్టు న్యాయనిర్ణేతలు సాయి, హేమచంద్, సత్యనారాయణ వెల్లడించారు. -
నేటి నుంచి నాటిక సంరంభం
భీమవరం : జాతీయ స్థాయి నాటిక సంరంభానికి భీమవరం వేదిక కానుంది. స్థానిక చైతన్యభారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించే పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్మారక పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక డీఎన్నార్ కళాశాల ఆవరణలో పోటీలకు వేదికను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిల్లో అనేకమంది సినీ, నాటక రంగ ప్రముఖులను వివిధ వర్గాలవారిని సత్కరించడం ఆనవాయితీ. ఈ ఏడాది సన్మాన గ్రహీతలు వీరే.. నాటిక పోటీల ప్రారంభం సందర్భంగా ఆదివారం రాత్రి ప్రముఖ సినీ దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, సీనియర్ సినీ, టీవీ, రంగస్థల నటుడు వంకాయల సత్యనారాయణ, నటుడు, దర్శకుడు గంగోత్రిసాయిని సత్కరించనున్నారు. ప్రముఖుల రాక పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్రమంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, భూమా అఖిలప్రియ, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ మహిళా మోర్చా ఇన్చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతోపాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక, రంగస్థల, ప్రజాసంఘాల ప్రముఖులు హాజరవుతారని చైతన్యభారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ చెప్పారు. సైకత శిల్పం నాటిక ప్రదర్శన తొలి రోజు ఆదివారం రాత్రి 9.30 గంటలకు కళారాధన(నంద్యాల) ఆధ్వర్యంలో ‘సైకత శిల్పం’ నాటికను ప్రదర్శిస్తారు. ఈ నాటికకు రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం డాక్టర్ జి.రవికృష్ణ. -
నేటి నుంచి నాటిక సంరంభం
భీమవరం : జాతీయ స్థాయి నాటిక సంరంభానికి భీమవరం వేదిక కానుంది. స్థానిక చైతన్యభారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించే పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్మారక పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక డీఎన్నార్ కళాశాల ఆవరణలో పోటీలకు వేదికను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిల్లో అనేకమంది సినీ, నాటక రంగ ప్రముఖులను వివిధ వర్గాలవారిని సత్కరించడం ఆనవాయితీ. ఈ ఏడాది సన్మాన గ్రహీతలు వీరే.. నాటిక పోటీల ప్రారంభం సందర్భంగా ఆదివారం రాత్రి ప్రముఖ సినీ దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, సీనియర్ సినీ, టీవీ, రంగస్థల నటుడు వంకాయల సత్యనారాయణ, నటుడు, దర్శకుడు గంగోత్రిసాయిని సత్కరించనున్నారు. ప్రముఖుల రాక పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్రమంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, భూమా అఖిలప్రియ, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ మహిళా మోర్చా ఇన్చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతోపాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక, రంగస్థల, ప్రజాసంఘాల ప్రముఖులు హాజరవుతారని చైతన్యభారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవా చెప్పారు. సైకత శిల్పం నాటిక ప్రదర్శన తొలి రోజు ఆదివారం రాత్రి 9.30 గంటలకు కళారాధన(నంద్యాల) ఆధ్వర్యంలో ‘సైకత శిల్పం’ నాటికను ప్రదర్శిస్తారు. ఈ నాటికకు రచన తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం డాక్టర్ జి.రవికృష్ణ. -
దక్షిణ భారత తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేరళ తైక్వాండో అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 6వ దక్షిణ భారత తైక్వాండో చాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన 13 మంది ఎంపికయ్యారని కోచ్ రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులను డీఎస్డీఓ బాషామోహిద్దీన్ అభినందించారు. 2016లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సబ్–జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ క్రీడాకారులను దక్షిణ భారత తైక్వాండో క్రీడా పోటీలకు ఎంపిక చేశామన్నారు. పోటీలు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ వీకే కృష్ణమీనన్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 20 నుంచి 23వ తేది వరకు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో విజయంతో తిరిగి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోచ్లు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలు సబ్–జూనియర్ విభాగం(అండర్–11) బాలురు 18 కిలోలు–గౌతంకృష్ణారెడ్డి 41 లోలు–రిషీచౌహాన్ బాలికల విభాగం 18 కిలోలు–నిహారిక 20 కిలోలు–నీతు శ్రీ సాయి 24 కిలోలు–జోహ్న 26 కిలోలు–వెన్నెల 29 కిలోలు–నిఖీత సోరేలు క్యాడెట్ విభాగం(అండర్–14) బాలురు 65 కిలోలు–జయేష్ 65 కిలోలు–దత్తుసాయి బాలికలు 33 కిలోలు–రోజా 41 కిలోలు–సాయిదీప్తి 47 కిలోలు–హేమ జూనియర్ విభాగం(అండర్–17) 68 కిలోలు–ఆశాదీక్షిత -
పోటాపోటీగా నామినేషన్లు
– మూడేళ్ల తర్వాత ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి ఎన్నికలు – అధ్యక్ష పదవి కోసం ఏడుగురు నామినేషన్లు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక కోసం శనివారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర సంఘం కార్యదర్శి డీఎస్ కొండయ్య ఎన్నికల అధికారి హోదాలో సి.క్యాంపు సెంటరులోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం పంక్షన్ హాల్లో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష పదవికి ఏడుగురు నామినేషన్లు వేయడం విశేషం. మాజీ అధ్యక్షుడు అబ్దుల్హమీద్, మాజీ ఉపాధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, ఇతర నాయకులు గోవిందు, ఇలియాస్బాషా, ఎన్ మౌలాలి, పి. విజయకుమార్, ఎ. శ్రీను.. తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేరోజున ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఈ నెల 16న పోలింగ్ జరుగనుంది. సంఘంలో ఓటర్లుగా 208 మంది ఉన్నారు. పోటీలో ఉండే అభ్యర్ధులు సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. అబ్దుల్హమీద్, నాగేశ్వరరావు మినహా మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అలజడి
జీవితం అనే సాగరంలో మన ప్రయాణం కాగితపు పడవలోనే. అలలో జడి లేకున్నా... మనలో అలజడి ఉన్నా ప్రయాణం కష్టం. ఇతరుల కన్నా ముందే ఉండాలన్న అలజడి ఎన్నో జీవితాలను ముంచేస్తోంది. ముందుండాల్సింది ఇతరుల కన్నా కాదు... పోరాడాల్సింది సాటివాళ్లతో కాదు... మీ సామర్థ్యంతో మీరే ప్రతిరోజూ తలపడండి. పోరాడండి. అప్పుడు మీ ప్రతి అడుగూ ఒక ముందడుగు అవుతుంది. కాగితపు పడవలో కూడా సుదూర ప్రయాణం చేస్తారు. కాలింగ్బెల్ మోగింది. డైనింగ్ టేబుల్ మీదే తలపెట్టి నిద్రపోతున్న కీర్తి లేచి టైమ్ చూసింది. అర్థరాత్రి దాటింది. డోర్ తీసింది. ఎదురుగా భర్త వంశీ. గుమ్మంలోనే ప్రశ్నించింది కీర్తి. ‘‘కనీసం ఈ ఒక్కరోజైనా ఇంటికి త్వరగా రావచ్చు కదా. ఎప్పుడూ పని పని.. అంటారు. ఈ రోజు దినేష్ బర్త్ డే అనైనా గుర్తుందా. వాడు ఇంత సేపు చూసి చూసి కేక్ కట్ చేయకుండా అలాగే నిద్రపోయాడు..’’ బాధగా అంది కీర్తి.‘‘ఈ పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసినా ఇంకా వెనకపడిపోతాం. కష్టపడితేనే కదా విజయం సాధించేది. నీకిది చెప్పినా అర్థం కాదు. కేక్ కట్ చేయడమేగా. చేసేయాల్సింది..’’ సింపుల్గా అంటూ వెళ్లి పడుకున్నాడు వంశీ. నీళ్లు నిండిన కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది. టేబుల్ మీద అలాగే వదిలేసిన కేక్ తీసి ఫ్రిజ్లో పెట్టింది. పోటీలో వెనకపడిపోతే... ఆఫీస్ లిఫ్ట్డోర్ తెరిచీ తెరుచుకోకముందే లోపలికి పరిగెత్తాడు వంశీ. అంతే వేగంగా తన క్యాబిన్కి వెళ్లి సీట్లో కూర్చుని, సిస్టమ్ ఆన్ చేశాడు. ఆయాసంతో గుండె పట్టేసినట్టయింది. రొప్పుతున్నాడు. ఇక కుర్చీలో కూర్చోలేననిపించింది. తప్పనిసరై హాస్పిటల్కి వెళ్లాడు. డాక్టర్ పల్స్ చెక్ చేసి ‘‘ఎందుకంత అలజడి పడుతున్నారు. హైబీపి ఉంది. రోజుకి ఎన్నిగంటల పనిచేస్తారు’’ అన్నాడు. ‘‘కనీసం 18 నుంచి 20 గంటలు. ఎందుకలా అడిగారు?’’ అన్నాడు వంశీ ‘‘అలా మిషన్లా పనిచేస్తే ఆరోగ్యం ఇలాగే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోండి’’ అంటున్న డాక్టర్ని వారిస్తూ.. ‘‘అలా అయితే ఈ పోటీ ప్రపంచంలో బతగ్గలమంటారా?’’అంటూనే లేచి వెళ్లడానికి నాలుగడుగులు వేసి, కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఫైళ్లతోనే కుస్తీ ఫోన్లో సమాచారం తెలియగానే కీర్తి అన్నయ్య రఘు వచ్చాడు. అన్నను చూడగానే ఏడుపు ఆగలేదు కీర్తికి. ‘‘ఆరోగ్యం పాడుచేసుకునేంతగా ఏమైంది?’’ అని అడిగాడు చెల్లెలిని. ‘‘ఇరవై నాల్గంటలూ పని పని అంటూ ఆఫీసులోనే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నా ఆఫీసుకు సంబంధించిన ఫోన్లు, ఫైళ్లతోనే ఉంటాడు. నన్నూ, దినేష్ను పూర్తిగా మర్చిపోయాడు. తన తిండి, నిద్ర గురించి కూడా పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ మనిషికి ఆందోళనే. అదేమని అడిగితే ‘పనిలో ఉంటున్నాను కదా. పోటీకి తగ్గ స్పీడ్ లేకపోతే ఎలా?’ అంటున్నాడు. చెబితే కోపం, చెప్పకపోతే ఏమైపోతాడో అని భయం. ఎలా చక్కదిద్దాలో అర్థంకావడంలేదన్నయ్యా!’’ ఏడుస్తూనే తమ పరిస్థితి అంతా వివరించింది కీర్తి. శ్రమలోనే కాలమంతా! కౌన్సెలర్ ముందున్నాడు వంశీ. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే రిగ్రెషన్ థెరపీ ఒక గైడెన్స్లా ఉపయోగపడుతుందని నచ్చజెప్పి వంశీని రిగ్రెషన్ థెరపీకి తీసుకొచ్చాడు రఘు. కళ్లు మూసుకొని మౌనంగా ధ్యానముద్రలో ఉన్న వంశీకి కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సూచనలతో మెల్లగా తన జీవితాన్ని అర్థం చేసుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు వంశీ. కంపెనీలో తను. తన అవసరానికి మించి పనిచేస్తున్నాడు. కింది ఉద్యోగులను బాగా పనిచేయాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని గైడ్ చేస్తున్నాడు. అటు నుంచి గతంలో చేసిన ఉద్యోగాల జాబితా పరిశీలించాడు. అంతటా తన తోటివారందరిలోనూ ముందుండాలని ఎక్కువ శ్రమిస్తున్నాడు. అయినా, తనకన్నా తక్కువ గంటలు పనిచేసేవారే ముందుంటున్నారు. కాలేజ్, స్కూల్ రోజుల్లో తను అందరికన్నా ముందుం డాలని అనిపించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఎందుకు? అన్వేషణ మొదలైంది. ఆ శోధనలో బాల్యదశలో ఒక చోట ఆగిపోయాడు వంశీ. కాసేపు ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘నేను మూడు, అన్నయ్య ఐదవ తరగతి చదువుతున్నాం. మేమిద్దరం నాన్న ముందు నిల్చుని ఉన్నాం. నాన్నకు మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చాం. నాన్న అన్నయ్యను మెచ్చుకుంటున్నాడు. తన జేబులో ఉన్న పెన్ను తీసి అన్నయ్య జేబులో పెట్టి, ‘నా పేరు నిలబెట్టేది నువ్వేరా’ అని ముద్దులు పెడుతున్నాడు. ‘మరి నాకు పెన్ను’ అన్నాను. ‘అన్నయ్యకన్నా మార్కులు ఎక్కువ తెచ్చుకో, అప్పుడు చూద్దాం’ అని వెళ్లిపోయాడు నాన్న. కష్టపడి చదవాలని అప్పుడే అనుకున్నా. అమ్మ అన్నానికి పిలిచినా వెళ్లకుండా చదువుతున్నాను. రాత్రిళ్లు కరెంట్ పోయినా దీపం పెట్టుకొని చదువుతున్నాను. నెక్ట్స్ క్లాస్కి స్కూళ్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ అన్నయ్యకే ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను ఇంకా ఎక్కువ కష్టపడి చదువుతున్నాను’’ అంటూ ఆగిపోయాడు వంశీ. ‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. ఆ ప్రయాణంలో మిమ్మల్ని అమితంగా బాధించిన సంఘటన ఏదున్నా చెప్పండి’’ అన్నారు కౌన్సెలర్. వంశీ ప్రయాణం ఇంకా వెనక్కి తిరిగింది. వంశీ చెబుతున్నాడు ‘‘నేను, అమ్మ గర్భంలో నుంచి అప్పుడే బయటకు వచ్చాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను చూడ్డానికి వచ్చిన నాన్న ‘వీడేంటి ఇంత నల్లగా పుట్టాడు. పెద్దోడిది మంచి రంగు’ అంటున్నాడు. ఆయన చూపులు నన్ను అసహ్యించుకున్నట్టు ఉన్నాయి. అన్నీ సక్రమంగా ఉంటేనే ముందంజనా! ‘‘వంశీ, మీరు ఇప్పుడు అమ్మ గర్భంలో నుంచి మీ గత జన్మలోకి ప్రయాణిస్తున్నారు. ఆ గతం తాలూకు అవశేషం ఎక్కడుందో చూడండి’’ అన్నారు కౌన్సెలర్. తల్లి గర్భంలో.. అటు నుంచి గతజన్మలోకి వంశీ ప్రయాణం సాగింది. ఆ అవశేషం గురించి వంశీ చెబుతూ ‘‘నేను అంధుడిని. రోడ్డుదాటలేకపోతున్నాను. ఎవరో వచ్చి నన్ను రోడ్డు దాటిస్తామన్నారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అందరూ పరిగెడుతున్నారు. కనీసం నేను రోడ్డు కూడా దాటలేకపోతున్నాను. దేవుడు నన్ను ఎందుకిలా పుట్టించాడు. అన్నీ సక్రమంగా ఉంటే అందరి కన్నా ముందుండేవాడిని. జీవితమంతా ఆ బాధతోనే గడిపాను. అలాగే మరణించాను’’ చెబుతున్న వంశీ గుండె నీరైంది. పోటీ మీద అవగాహన ‘‘వంశీ ఈ జన్మకు రండి. ప్రస్తుత పరిస్థితికి గత సంఘటనలకు బేరీజు వేసుకొని చూడండి’’ అంటూ కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘‘వంశీ, మీ జీవనప్రయాణంలోని స్పష్టత మీద దృష్టి పెట్టండి. మొదటిది: ‘అన్నయ్య కన్నా నేను తక్కువ’ అనే భావన మీలో ఎనిమిదేళ్ల వయసులో పడిపోయింది. దీంతో మెప్పు కోసం పోటీ పడాలని నిర్ణయించుకొని కష్టపడటం మొదలుపెట్టారు. మీ కష్టంలో ‘నాలో సామర్థ్యం తక్కువ’ అనే ఆలోచన బలంగా పడిపోయింది. సామర్థ్యాన్ని మెరుగుపెట్టుకుంటే మీ అన్నకన్నా నాలుగు మార్కులు సంపాదించడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నపని కూడా సామర్థ్యంతో కాకుండా కష్టంతో లాక్కొస్తున్నారు. రెండవది: నల్లగా పుట్టానని, అందంగా ఉన్నవారితో పోటీపడలేననే భయాన్ని పెంచుకున్నారు. నల్లగా ఉన్న వారెంతో మంది సాధించిన విజయాలు ఇన్నేళ్లలో మీకు కనిపిం^è లేదా! అవగాహనకు రండి. శ్రీకృష్ణుడు నల్లగానే పుట్టి, అవతారపురుషుడయ్యాడనీ మీకూ తెలుసు కదా. మూడవది: అంధుడిగా గత జన్మ అంతా బాధపడ్డారు. బాగుంటే అందరితో పోటీ పడి, వేగంగా పరిగెత్తేవాడిని అనుకున్నారు. అంధులుగా ఉన్నవారు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. వాళ్లు సాధించిన విజయాలను ఒకసారి పరిశీలించండి. ‘నేను ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే’ అనుకోకుండా ‘మేధస్సుతో సాధించగలను’ అని నిర్ణయం తీసుకోండి. అందరితో కాకుండా మీతో మీరు పోటీ పడండి. కష్టంగా కాదు, ఇష్టంగా జీవించండి’’ కౌన్సెలర్ మాటలతో ప్రశాంతంగా మేలుకొన్నాడు వంశీ! ఇప్పుడు అతడికి హాయిగా ఉంది. తుఫాను తీరిన సముద్రంలా ఉన్నాడతను. జీవితం సమతూకం.. కాలింగ్బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీసింది కీర్తి. ఎదురుగా వంశీ! నమ్మబుద్ధికాక గడియారం కేసి చూసింది, సాయంత్రం ఆరు. హోమ్వర్క్ చేసుకుంటున్న దినేష్ తండ్రి చూసి ఆనందంగా ‘డాడీ..’ అంటూ పరిగెత్తుకువచ్చి తండ్రిని చుట్టేశాడు. ‘పని ఎప్పుడూ ఉండేదే. ఇవాళ సినిమాకెళ్దామా’ అంటూ సరదాగా మాట్లాడుతున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది కీర్తి. ‘‘ఇలాగే ఉంటే ఎలా సినిమాకు లేట్ అయిపోతుంది పద పద..’’ అని తొందరపెడుతున్న వంశీని చూసి తమ జీవితాల్లోకి వసంతం వచ్చేసిందని సంబరపడిపోయింది కీర్తి. మన వాస్తవ పరిస్థితులకు మనమే సృష్టికర్తలం ‘యద్భావం తద్భవతి’ అంటే ఏది ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. తమ వాస్తవ పరిస్థితులకు తామే సృష్టికర్తలం అని గ్రహిస్తే సమస్యలుగా అనిపించినవన్నీ పరిష్కారమవుతాయి. అన్నింటా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆలోచనలను నమ్మకాలవైపు పయనింపజేయాలి. అదెలాగంటే, చిత్రకారుడు తెల్లని కాన్వాస్పై అద్భుతమైన చిత్రం వేయడానికి ఎంతటి బాధ్యత తీసుకుంటాడో ఎవరికి వారు తమ జీవితాన్ని మలచుకోవడంలో అలా స్వీయ బాధ్యత తీసుకోవాలి. – డాక్టర్ న్యూటన్, పాస్ట్లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ సామర్థ్యాల పెంపుకు కృషి అవసరం చెడు ఆలోచనలకు బలం ఇస్తే అలాంటి వాస్తవమే మనం చూస్తాం. దీంతో మన చుట్టూ అలాంటి వాతావరణమే ఉందనుకుంటాం. వంశీ ఆలోచనలో ఎప్పుడూ ‘అందరికన్నా ముందుండాలి’ అనుకునే వాడు. అయితే, ఆ పోటీని సామర్థ్యంతో కాకుండా, సమయంతో లెక్కించాడు. దీంతో జీవితంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. మన ఆలోచనలను గమనించి, సరైనదారిలో సామర్థ్యాలను పెంచుకున్నప్పుడే విజయం. – డాక్టర్ లక్ష్మి, పాస్ట్లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అపనమ్మకాలను నమ్మకాలవైపుగా మళ్లించాలంటే... ఏదైనా చెడు ఆలోచన, అపనమ్మకం వంటివి కలిగినప్పుడు దానికి పూర్తి వ్యతిరేక ఆలోచనను పేపర్మీద రాయండి. ఇది మీలో ఒక శక్తివంతమైన ఆలోచనవుతుంది.మీకు అనుకూలమైన నిర్ణయాలను రాస్తూ ఉండండి. ఉదాహరణకు: నేను చాలా బాగున్నాను. నేను చేయగలను. నేను సాధించగలను.. ఇలాంటివి స్వీయ ఆనందం, ఆరోగ్యం, చుట్టూ అనుబంధాలు ఏవిధంగా ఉంటున్నాయో గుర్తించివీటి పట్ల ఉంటున్న అపనమ్మకాలను నమ్మకం వైపుగా మల్లించాలి.సినిమా దృశ్యం మాదిరి జీవితాన్ని కళ్లతో అత్యద్భుతంగా ఉన్నట్టు దర్శించాలి. అనుకూలంగా లేని సంఘటనలను చిత్రాలుగా ఊహించుకొని అవన్నీ చాలా బాగవుతున్నట్టు ఊహించాలి.రోజూ 30–40 నిమిషాలు ధ్యానం చేయాలి. దీని వల్ల చెడు ఆలోచనలు మంచివైపుగా ప్రయాణిస్తాయి.విశ్రాంతి లేకపోవడం, ఆందోళనలు, భయాలు అన్నీ ధ్యానంలో కరిగిపోతాయి. పాజిటివ్ ఆలోచనలకు దారి తీసి, ఆత్మవిశ్వాసాన్ని, వికాసాన్ని ధ్యానం పెంపొందింపజేస్తుంది. – నిర్మల రెడ్డి చిల్కమర్రి -
విజయవాడలో సాక్షి ఎరినా వన్
-
ఒడ్డూపొడవూ, ఒడుపూవేగం..
వాలీబాల్లో ఇవే గెలుపు సూత్రాలు దిగ్గజ క్రీడాకారులకు వేదికైన గొల్లవిల్లి టోర్నీ అమలాపురం : వాలీబాల్ క్రీడలో రాణించాలంటే మాటలు కాదు. పొడవుండాలి.. బలముండాలి.. రాణించాలనే తపనుండాలి.. కఠోరంగా శ్రమించాలి.. అలుపెరగని సాధన చేయాలి. అంతకు మించి ఆత్మవిశ్వాçÜం, తెలివీ, సమయస్ఫూర్తీ ఉండాలి. పక్కనే ఉన్న క్రీడాకారులను సమన్వయం చేసుకుని పాయింట్లు సాధించాలి. వీటన్నింటి ఫలితంగానే జట్టుకు విజయం సొంతమవుతుంది. వేగమూ, గురీ కీలకమైన ఈ క్రీడలో మన క్రీడాకారులెందరో జాతీయస్థాయిలో రాణించడమే కాదు.. అంతర్జాతీయ క్రీడావేదికలపైనా దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. గొల్లవిల్లిలో జరుగుతున్న నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ నేషనల్ వాలీబాల్ ఇన్విటేష¯ŒS మె¯ŒS అండ్ ఉమె¯ŒS టోర్నమెంట్లో పాల్గొంటున్న వారిలో పురుషుల విభాగంలో తులసిరెడ్డి, ప్రదీప్, ప్రసాద్బాబు, శేఖర్ధామ¯ŒS, కృష్ణంరాజు, నరేష్, రాజశేఖర్, సొహె¯ŒSకుమార్, మహిళల విభాగంలో హైమ, శాంతి, రైజా, జ్వాలాలత వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు. అథ్లెటిక్స్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారునిగా.. చెన్నై ఇ¯ŒSకం ట్యాక్సుజట్టుకు చెందిన ప్రసాద్బాబు 2012లో రష్యాలో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొన్నారు. తరువాత మరో నాలుగుసార్లు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నారు. ప్రసాద్బాబు తొలుత అథ్లెట్. 2004లో ప్రమాదం జరగడంతో అథ్లెటిక్స్ను వదిలి వాలీబాల్ వైపు దృష్టి సారించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. తండ్రి ప్రోత్సాహంతోనే అంతర్జాతీయ క్రీడాకారునిగా మారానంటున్న ఆయన చెన్నై స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 25 మంది శిక్షణ పొంది వివిధ టీమ్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి టోర్నీ గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు తయారవడానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రసాద్బాబు తెలిపారు. కఠోరశ్రమతో సాధన చేయాలి.. న్యూఢిల్లీకి చెందిన శేఖర్ ధామ¯ŒS సీనియర్ నేషనల్ జట్టు సభ్యునిగా థాయిలాండ్, రష్యాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ క్రీడాకారునిగా నీరాజనాలందుకుంటున్నారు. ‘వాలీబాల్ల్లో రాణించాలంటే ఎత్తు ప్రధానం. ఈ కారణంగానే పోలీసు డిపార్ట్మెంట్ నుంచి వాలీబాల్ ఆడేందుకు ఎక్కువ మంది వస్తారు. సీఆర్పీఎఫ్ నుంచి దేశవ్యాప్తంగా మూడు జట్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ ఆటలో రాణించాలంటే కఠోరమైన శ్రమతో సాధన చేయాల్సి ఉంటుంది’ అని శేఖర్ధామ¯ŒS తెలిపారు. ఐదు సెట్లు.. రెండున్నర గంటలు.. అమలాపురం/ఉప్పలగుప్తం (అమలాపురం) : రెండు మహిళా జట్ల మధ్య రెండున్నర గంటల పాటు ఐదుసెట్లుగా సాగిన వాలీబాల్ మ్యాచ్ నరాలు బిగుసుకునే ఉత్కంఠకు గురి చేసింది. గొల్లవిల్లిలో జరుగుతున్న ఎ¯ŒSవీఆర్ మెమోరియల్ జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీలో ఆదివారం ఎస్సీ రైల్వే సికింద్రాబాద్, చెన్నై జట్ల మధ్య జరిగిన పోరులో రెండు జట్లు మొదటి నాలుగు సెట్లలో చెరో రెండు చొప్పున గెలుచుకున్నాయి. తొలిసెట్ను చెన్నై 25–14 తేడాతో గెలుచుకోగా, రెండవ సెట్ను ఎస్సీ రైల్వే 25–22 తేడాతో, మూడవ సెట్ను చెన్నై 25–15తో, నాలుగో సెట్ ఎస్సీ రైల్వే 25–19 తేడాతో గెలుచుకున్నాయి. కీలకమైన ఐదో సెట్ను ఎస్సీ రైల్వే 15–13 తేడాతో గెలుచుకుని విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి జరిగిన పోటీల్లో ఆంధ్రా స్పైకర్స్ వెస్ట్ర¯ŒSరైల్వే ముంబయిపై 25–20, 25–27, 25–14, 23–25, 15–11 తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ సైతం ఉత్కంఠకు గురి చేసింది. తరువాత జరిగిన పోటీలో ఇ¯ŒSకంటాక్స్ చెన్నై జట్టుపై 20–25, 25–19, 25–22, 27–25 స్కోర్తేడాతో కర్ణాటక పోస్టల్ గెలుపొందింది. ఆదివారం జరిగిన మొదటి మహిళామ్యాచ్లో సాయి గుజరాత్పై 25–19, 25–22, 25–16 స్కోర్ తేడాతో కర్ణాటక స్పోర్ట్స్ గెలుపొందింది. మూడో రోజు ఆదివారం అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు
భానుగుడి (కాకినాడ) : కాకినాడ ప్రెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో మూడు రోజులగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేడ్ జర్నలిస్టుల క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మసత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ నిరంతరం మెదడుతో పనిచేసే జర్నలిస్టులకు మానసిక ప్రశాంతత చేకూర్చే క్రీడలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. కబడ్డీలో కృష్ణా జిల్లా విజేతగా నిలవగా, తూర్పుగోదావరి రన్నర్గా నిలిచింది. క్రికెట్లో పశ్చిమ గోదావరి విజేతగా నిలవగా, గుంటూరు రన్నర్గా నిలిచింది. ఈ క్రీడల్లో 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. నాకౌట్ పద్దతిలో నిర్వహించిన ఈ క్రీడల్లో జర్నలిస్టులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రెస్ఫోరమ్ అధ్యక్షుడు వీసీ వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జర్నలిస్టుల క్రీడాపోటీలు
భానుగుడి(కాకినాడ) : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడాపోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. రెండోరోజు షటిల్పోటీలు జేఎన్టీయూకే ఇండోర్ స్టేడియంలో, క్రికెట్ పోటీలు రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలో, కబడ్డీ జేఎన్టీయూ క్రీడా మైదానంలో జరిగాయి. రెండో రోజు క్రీడల్లో 13 జిల్లాల నుంచి వచ్చిన 300కిపైగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని వివిధ క్రీడల్లో చాటారు. ప్రొఫెషనల్ ప్లేయర్స్లా మైదానంలో మెరిశారు. క్రికెట్లో తూర్పుగోదావరి జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై ఓటమి పాలైంది. శ్రీకాకుళం- నెల్లూరు జట్ల మధ్య సాగిన క్రికెట్ పోటీలో శ్రీకాకుళం విజయం సాధించింది. పశ్చిమ గోదావరి-అనంతపురం జట్లమధ్య సాగిన పోరులో అనంతపురం అత్యధిక పరుగుల తేడాతో గెలిచింది. కబడ్డీలో శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి అత్యుత్తమ ప్రతిభతో ఘన విజయాన్ని సాధించింది. పశ్చిమగోదావరి-కృష్ణాజట్ల మధ్య కబడ్డీ పోరులో కష్ణాజట్టు విజయాన్ని అందుకుంది. కబడ్డీ క్రీడాకారులను జిల్లా కబడ్డీజట్టు గౌరవా«ధ్యక్షుడు ఎంపీ తోటనరసింహాం ముఖ్యఅతిథిగా పాల్గొని ఉత్సాహపరిచారు. -
11, 12 తేదీల్లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
తాడితోట(రాజమహేంద్రవరం) : రాష్ట్రస్థాయి 3వ సబ్ జూనియర్ బాల బాలికల పవర్ లిఫ్టింగ్ పోటీలు ఈ నెల 11,12 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతాయని జిల్లా పవర్ లిఫ్టింగ్ సమాఖ్య ప్రతినిధి డి.వి.వి.సత్యనారాయణ తెలిపా రు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తొలిసారి రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న పోటీల నిర్వహణకు భవాని చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఆదిరెడ్డి వాసు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులరెడ్డి, సహకరిస్తున్నారని తెలిపారు. తాను పవర్ లిఫ్టింగ్ క్రీడలో 14వ ఏట నుంచి పలు విజయాలు సాధించానని, 1988లో తపాలా శాఖలో క్రీడల కోటాలో ఉద్యోగం వచ్చిందని, జాతీయస్థాయిలో గుర్తింపు లభించి నేషనల్ రిఫరీగా ఎంపిక చేశారని చెప్పారు. -
కులాల కుమ్ముడు
భీమవరం :తెలుగుదేశం పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఆశావహులు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. తమకు ఆదినుంచీ అన్యాయమే జరుగుతోందని.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. గ్రూపు రాజకీయాలకు తెరలేపడమే కాకుండా కులాల కోణాన్ని సైతం ప్రయోగిస్తున్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వీరంతా సామాజిక వర్గాల వారీగా విడిపోయి రాజకీయాలను వేడెక్కించారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వీరవల్లి చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అప్పట్లో చంద్రశేఖర్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలించినా చివరకు అదే సామాజిక వర్గానికి చెందిన అంగర రామ్మోహనరావుకు ఎమ్మెల్సీ పీఠం కట్టబెట్టింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తనయుడు జగదీష్ భీమవరం అసెంబ్లీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు టీడీపీలో చేరిన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సీటు దక్కించుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. వీరంతా మూడు గ్రూపులుగా విడిపోయారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీ విషయంలోనూ వర్గాలవారీగా విడిపోయి ఆ పదవి దక్కించుకునేందుకు యత్నిం చి విఫలమయ్యారు. ఎమ్మెల్సీ పదవిని సీనియర్ నాయకుడైన మెంటే పార్థసారథికి కట్టబెట్టేలా అంతా కలిసి ప్రయత్నిద్దామని ఎమ్మెల్యే పులపర్తి అంజి» êబు ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ప్రకటించడంతో కులం కోణం తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడతారా అంటూ కొందరు నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెంటే పార్థసారథితోపాటు గాదిరాజు బాబు, వీరవల్లి చంద్రశేఖర్ తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్సీ పదవిని బీసీలకే ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతోంది. మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామ్మోహనరావు ఇదే పదవి కోసం తిరిగి ప్రయత్నిస్తుండగా.. ఏలూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఈ పదవిపై కన్నేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినందున ఈ పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో అంబికా ఉన్నారు. ఇక్కడా సామాజిక కోణమే నడుస్తోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన సామాజిక వర్గానికి చెందిన టీజీ వెంకటేష్కు ఇచ్చినందున ఎమ్మెల్సీ పదవి ఈయనకు ఇవ్వకపోవచ్చని టీడీపీలో చర్చ సాగుతోంది. మరోవైపు బీసీ కోటాలో ఏలూరు నుంచి సైదు సత్యనారాయణ, తణుకు నుంచి డాక్టర్ దొమ్మేటి సుధాకర్, వావిరాల సరళాదేవి, తాడేపల్లిగూడెం నుంచి కిల్లాడి ప్రసాద్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ సామాజిక చిచ్చు రగులుస్తున్న పదవుల వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియక తెలుగు తమ్ముళ్లు తికమక పడుతున్నారు. -
రాష్ట్రస్థాయి డీఎడ్ క్రీడాపోటీల ఓవరాల్ ఛాంప్గా ‘తూర్పు’
రాజమహేంద్రవరం రూరల్ : గుంటూరు జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీల్లో 55 పాయింట్లతో తూర్పు గోదావరి జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుందని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు తెలిపారు. డైట్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను ఆయన అభినందించారు. బొమ్మూరు డైట్ కళాశాల విద్యార్థులు 400 మీటర్ల పరుగు రిలేలో ప్రథమ, బాలికల విభాగంలో ద్వితీయ స్థానాలు సాధించారని తెలిపారు. విజేతలను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు, ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి, డివైఈవో ఎస్.అబ్రహం, పీఈటీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవన్దాస్, ప్రైవేటు డీఎడ్ కళాశాలల ప్రతినిధులు డీవీ సుబ్బరాజు, ఆర్.విశ్వనాథరావు, ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐహెచ్జీఎన్ ప్రసాద్, ఐఏఎస్ఈ కళాశాల ప్రాంగణ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆర్.నాగేశ్వరరావు, డైట్ అధ్యాపకులు జె.సుబ్రహ్మణ్యం, డి.నాగేశ్వరరావు, ఆర్జేడీ రాజు, ఎ.రామకృష్ణ, కేవీ సూర్యనారాయణ, సాల్మన్రాజు, బావాజీరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి విజేతలు వీరే.. బాలుర వాలీబాల్ పోటీలో రత్న సలోమన్ డీఎడ్ కళాశాల (గోకవరం), కబడ్డీలో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), హైజంప్లో వీవీఎస్ డీఎడ్ కళాశాల (యు.కొత్తపల్లి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల, బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో సాయిరామ్ డీఎడ్ కళాశాల (పిడింగొయ్యి) ప్రథమ స్థానాలు సాధించాయని జయప్రకాశరావు తెలిపారు. చెస్లో వైవీఎస్ అండ్ బీఆర్ఎం డీఎడ్ కళాశాల (ముక్తేశ్వరం) ద్వితీయ, బాలికలు 200 మీటర్ల రన్నింగ్, పాటల పోటీల్లో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), లాంగ్జంప్లో నారాయణ డీఎడ్ కళాశాల (మలికిపురం), వక్తృత్వ పోటీల్లో జీబీఽఆర్ డీఎడ్ కళాశాల (అనపర్తి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల ద్వితీయ స్థానాలు సాధించాయని వివరించారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు 15 మంది
భానుగుడి (కాకినాడ): ఫిబ్రవరి 21 నంచి 25 వరకు హైదరబాద్లో జరిగే ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 15 మందితో కూడి బృందాన్ని ఎంపిక చేసినట్టు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అధ్యక్షుడు బి.రామకృష్ణ తెలిపారు. ఎంపికైన వారిని ఒలింపిక్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, బుద్ధరాజు సత్యనారాయణ, ఎం.బాపిరాజు, అభినందించారు. ఎంపికైన వారు వీరే.. టి.గోపి, కె.కొండలరావు, కేపీబీ చంద్రశేఖర్, డీవీ విజయానందరెడ్డి, వి.మాధవి, పి.కోయరాజు, పి.రామకృష్ణ, రత్నకుమార్, పృథ్వీరాజ్, వెంకటరమణ, వీరభద్రరావు, జానకిరామయ్య, నరసింహారావు, భాస్కరరావు, పద్మనాభం తదితరులు. -
రేపు ‘సాక్షి’ ముగ్గుల పోటీలు
అనంతపురం కల్చరల్ : తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ దినపత్రిక, ఫర్నీచర్ వరల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం పది గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయి. మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా చాటేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు మంచి బహుమతులుంటాయి. ఆసక్తి గల్గిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 08554–248896, 9052300933, 9849067681 నంబర్లలో సంప్రదించాలి. -
ఉత్సాహ‘బరి’తం!
పెద్దాపురం : ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అంతర్ కళాశాలల కబడ్డీ మీట్ – 2016 పోటీలు సోమవారం పెద్దాపురం మహారాణి కళాశాలలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ మీట్ను కాకినాడ ఎంపీ తోట నరసింహం ప్రారంభించారు. సుమారు 26 కళాశాలలకు చెందిన 26 టీములు పాల్గొన్నాయి. మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన క్రీడా ప్రారంభ సభలో ఎంపీ నరసింహం మాట్లాడుతూ క్రీడారంగంలో రాణిస్తే మంచి భవిష్యత్ సాధ్యపడుతుందన్నారు. మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం కబడ్డీ పోటీలను ఎంపీ తోట నరసింహం ఆటలు ఆడి పోటీలు ప్రారంభించారు. తొలుత ఆయా కళాశాలల విద్యార్థులు కవాతు నిర్వహించగా ఎంపీ గౌరవ వందనం స్వీకరించారు. నన్నయ్య యూనవర్సిటీ పీడీ ఎ.సత్యనారాయణ, ఏఎంసీ చైర్మ¯ŒS ముత్యాల రాజబ్బాయి, ఎంపీపీ గుడాల రమేష్, కళాశాల కరస్పాండెంట్ తాళ్లూరి వీరభద్రరావు, చందలాడ అనంతపద్మనాభం, పీఈటీ వీరయ్యచౌదరి, చదలవాడ బాబి, దోమల గంగాధర్, తుమ్మల రాజా, కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్, ఆయా కళాశాలల పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు
బాలికల్లో ‘అనంత’.. బాలురలో ‘ప్రకాశం’ గుంతకల్లు : పట్టణంలోని రైల్వే క్రీడా మైదానంలో మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల ఖోఖో పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలికల విభాగంలో అనంతపురం, బాలుర విభాగంలో ప్రకాశం జిల్లాల క్రీడాకారులు విజయ దుందుబి మోగించారు. సోమవారం ఉదయం బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు గుంటూరుపైన, చిత్తూరు జట్టు విజయనగరంపైనా గెలుపొంది ఫైనల్కు చేరాయి. మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్లో ప్రకాశం జట్టు చిత్తూరు జట్టుపై గెలుపొంది టోర్నీ విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజయనగరంపైన, చిత్తూరు జట్టు ప్రకాశంపైన గెలుపొంది ఫైనల్కు చేరాయి. ఫైనల్ మ్యాచ్లో అనంతపురం జట్టు చిత్తూరుపై విజయ కేతనం ఎగురవేసి టోర్నీ విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జట్టు, బాలికల విభాగంలో అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. గుంతకల్లు డీఎస్పీ సీహెచ్.రవికుమార్, మార్కెట్యార్డు చైర్మన్ బండారు ఆనంద్ బహుమతులు, షీల్డులు అందజేసి విజేతలను అభినందించారు. సెలక్షన్ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్, జిల్లా ఖోఖో క్రీడా సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముక్కన్నగారి రామాంజినేయులు, ఆర్గనైజర్లు శ్రీనివాసులు, మల్లికార్జున, సత్యనారాయణ, ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఖోఖో బాల బాలికల జట్లు ఎంపిక : ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారితో అండర్-14 ఖోఖో బాలబాలికల రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. బాలికల జట్టు : కవిత, వరలక్ష్మి, రుబినా(అనంతపురం), అఖిల, శిరీష(ప్రకాశం), శారద(కర్నూలు), అమృత(తూర్పు గోదావరి), శరణి (కడప), యశోద(నెల్లూరు), పూజిత, అనూష, కుమారి(చిత్తూరు). బాలుర జట్టు : బాండ్రాజ్, సందీప్(ప్రకాశం), శశాంక్, నీరజ్రాఘవ్, సింహాద్రి(చిత్తూరు), ప్రవీణ్ (తూర్పు గోదావరి), సాయికృష్ణ(అనంతపురం), సాయినాయక్(గుంటూరు), భానుప్రసాద్(విజయనగరం), మదన్మోహన్రావు(కడప), సురేంద్ర(విశాఖ), కరణ్(నెల్లూరు). -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
ప్రారంభ మ్యాచ్గా ఆంధ్ర, బెస్ట్ ఆఫ్ ఆంధ్ర మహిళా జట్లు తుని రూరల్ : వైఆర్కే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఇన్విటేష¯ŒS కబడ్డీ పోటీలను టి.తిమ్మాపురంలో జిల్లా పరిషత్ చైర్మ¯ŒS నామన రాంబాబు ప్రారంభించారు. ఆదివారం రాత్రి అసోసియేష¯ŒS అధ్యక్షుడు పోల్నాటి శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS యనమల కృష్ణుడు, ఏపీ కబడ్డీ అసోసియేష¯ŒS కార్యదర్శి వి.వీరలంకయ్య క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్ర మహిళా జట్టు, బెస్ట్ ఆఫ్ ఆంధ్ర మహిళా జట్లు మధ్య ఎగ్జిబిష¯ŒS మ్యాచ్తో పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుసాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల జట్లు పాల్గొంటున్నట్టు జిల్లా అసోసియేష¯ŒS అధ్యక్షుడు టీవీవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
తైక్వాండో పోటీలు ప్రారంభం
భానుగుడి (కాకినాడ) : రాష్ట్ర స్థాయి 34వ సబ్ జూనియర్, 35వ సీనియర్ తైక్వాండో టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఈ పోటీలను ప్రారంభించారు. కాకినాడలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తొలిరోజు పోటీల్లో సబ్జూనియర్ విభాగంలో 13 జిల్లాల నుంచి వచ్చిన 150 మందికిపైగా క్రీడాకారులు తలపడ్డారు.ఆటలో చిన్నారులు చూపించిన పోరాట పటిమ అబ్బురపరిచింది. తొలిరోజు విజేతలు వీరే 18 నుంచి 50 కేజీల వరకు ఉన్న సబ్ జూనియర్ విభాగంలో పోటీలు నిర్వహించారు. 18 కేజీల విభాగంలో ఎల్.గౌతమ్కృష్ణారెడ్డి, అనంతరపురం)(గోల్డ్), వి.లిఖిత్ , చిత్తూరు (సిల్వర్), 21కేజీల విభాగంలో ఎ¯ŒS.చైతన్య దుర్గాప్రసాద్, విశాఖపట్నం( గోల్డ్), బి.జశ్వంత్ చిత్తూరు, í(Üసిల్వర్), 23 కేజీల విభాగంలో సిహెచ్ లోహి™Œ, కర్నూలు (గోల్డ్), కె.అవినాష్, విజయనగరం(సిల్వర్), 25 కేజీల విభాగంలో జి.దినేష్ అదిత్య, తూర్పుగోదావరి(గోల్డ్), ఎస్.సాయిగణేష్, చిత్తూరు(సిల్వర్), 27 కేజీల విభాగంలో దేవ్ భరత్ సాçహు, శ్రీకాకుళం(గోల్డ్), జి.తేజ, తూర్పుగోదావరి(సిల్వర్), 29 కేజీల విభాగంలో ఎ¯ŒSఎం దిలీప్, వైఎస్సార్ కడప (గోల్డ్), రెడ్డి లోవరాజు, విశాఖపట్నం( సిల్వర్), 32 కేజీల విభాగంలో బి.కాశీబాబా, వైఎస్సార్ కడప, (గోల్డ్), ఎస్.దేవీ శ్రీ«కర్, గుంటూరు(సిల్వర్), 35 కేజీల విభాగంలో ఎం.వెంకట కార్తీక్ , విశాఖపట్నం (గోల్డ్), సీఎస్ సమరత్, చిత్తూరు(సిల్వర్), 38 కేజీల విభాగంలో కృష్ణబాబు (వైఎస్సార్ స్పోరŠట్స్ స్కూల్) గోల్డ్, జి.వేద కార్తీక్, కర్నూల్(సిల్వర్), 41 కేజీల విభాగంలో ఎం.రిషీ చోహాన్, అనంతపూర్(గోల్డ్), కె.పరశురామ్( వైఎస్సార్ స్పోరŠట్స్ స్కూల్), (సిల్వర్), 44 కేజీల విభాగంలో రిషప్ సింగ్, విశాఖపట్నం (గోల్డ్), బద్రీనాధ్, వైఎస్సార్ కడప, í(Üసిల్వర్), 50 కేజీల విభాగంలో ఆర్.యశ్వంత్, విశాఖ పట్నం, (గోల్డ్), బి.యశ్వంత్ రెడ్డి, తూర్పుగోదావరి(సిల్వర్) పతకాలను గెలుచుకున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.అర్జున రావు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఆకుల మధుసూధనరావు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై.భాస్కరరావు, ప్రొహిబిష¯ŒS అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, కె.పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. -
తైక్వాండో పోటీలకు 40 మంది ఎంపిక
కాకినాడ సిటీ : తైక్వాండో అసోసియేష¯ŒS రాష్ట్రస్థాయి పోటీలకు వివిధ వెయిట్లలో జిల్లా నుంచి 40 మంది ఎంపికయ్యారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలో వివిధ కేటగిరీల్లో జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం జరిగాయి. జిల్లా అసోసియేష¯ŒS ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మురళీధరరావు, సీబీసీఎ¯ŒSసీ అధ్యక్షుడు ఎం.రత్నకుమార్ ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో 20 వెయిట్లలో బాల బాలికల విభాగాల్లో 160 మంది క్రీడాకారులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. స్వర్ణ పతకాలు సాధించినవారు నవంబర్ 11, 12, 13 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని జిల్లా తైక్వాండో అసోసియేష¯ŒS కార్యదర్శి బి.అర్జు¯ŒSరావు తెలిపారు. -
తుల్యభాగ టు మలేషియా
స్విమ్మింగ్లో సత్తా చాటుతున్న గుణశేఖర్ అంతర్జాతీయ పోటీలకు ఎంపిక త్వరలో మలేషియాలో పోటీలు జి.మామిడాడ (పెదపూడి) : ఇక్కడి కాలువల్లో ఈత నేర్చుకున్న కుర్రాడు అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పలు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నాడు. వివరాలివి... జి.మామిడాడలోని బసివిరెడ్డి పేటకు చెందిన కొల్లకోట గుణశేఖర్ తండ్రి సీతారాముడు గతంలో రజక వృతి చేసేవారు. తండ్రి స్థానిక తుల్యభాగ నది కాలువలో దుస్తులు ఉతికే సమయంలో మూడో తరగతి చదువుతున్న గుణశేఖర్ ఈత నేర్చుకోవడంపై ఆసక్తి చూపడంతో కుమారుడికి ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా జిల్లా స్థాయి స్మిమ్మింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. స్థానిక డీఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి, డీఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతుండగా కాకినాడలో జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేష¯ŒS(ఎస్జీఎఫ్) అండర్–17 పోటీల్లో నాల్గో స్థానం 2014లో (ఇంటర్ ఫస్ట్ ఇయర్) కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్–19 పోటీల్లో జిల్లా ప్రథమ స్థానం అదే ఏడాది కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS పోటీల్లో నాల్గో స్థానం సాధించాడు. జాతీయ స్థాయి పోటీలకు స్టాండ్బైగా ఎంపికైయ్యాడు – 2015లో (ఇంటర్ సెకండియర్) కాకినాడలో జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్–19 పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 2016 ఏప్రిల్లో రాజమహేంద్రవరంలో జరిగిన స్టూడెంట్ ఒలింపిక్ అసోసియేష¯ŒS అండర్–19 పోటీల్లో ప్రథమ స్థానం సెప్టెంబర్లో నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. గుజరాత్ రాష్ట్రం వడోదర ప్రాంతంలో జరిగిన ఒలింపిక్ అసోసియేష¯ŒS అండర్–19 జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి, అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో నిర్వహించే పోటీలకు ఎంపికయ్యాడు. ప్రత్యేకంగా కోచ్ లేరు తనకు ఎవరూ కోచ్ లేరని గుణశేఖర్ తెలిపారు. పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధతో మెళకువలు తెలుసుకుని, వాటిని పాటించాను. తొలినాళ్లలో నా తండ్రే ఈత నేర్పించారు. ప్రాథమిక మెళకువలు చెప్పారు. రైల్వేలో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉంది. మలేషియాలో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నాను. – కె.గుణశేఖర్ -
జాతీయస్థాయి రోప్స్కిప్పింగ్కు గిరిజన విద్యార్థి
రంపచోడవరం : జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీలకు ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శారపు దుర్గా వెంకట గణేష్దొర అర్హత సాధించాడు. నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకూ మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో జరిగే రోప్స్కిప్పింగ్ పోటీల్లో ఏపీ జట్టు తరఫున పాల్గొంటాడని పీడీ కె.తిరుపతిరావు శుక్రవారం తెలిపారు. గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి రోప్స్కిప్పింగ్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొన్న అతడు విశేష ప్రతిభ కనపరచి ఈ అవకాశం దక్కించుకున్నాడన్నారు. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు ఏపీ రోప్స్కిప్పింగ్ జట్టుకు నారాయణపురంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారని, అందులో గణేష్దొర పాల్గొంటాడన్నారు. గణేష్దొర జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల డీడీ ఎం. సరస్వతి, పాఠశాల హెచ్ఎం డి. శ్రీనువాస్, వార్డె¯ŒS చోడి సత్యనారాయణ, పీఈటీ డి. శశికాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
‘శ్రీప్రకాష్’లో జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలు
ప్రారంభించిన ఎంపీ తోట నరసింహం పెద్దాపురం : శారీరక, మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో మూడురోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్లస్టర్–7 పోటీలను గురువారం సాయంత్రం జ్యోతిప్రజల్వన చేసి ఆయన ప్రారంభించారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో ఎంపీ తోట మాట్లాడుతూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్న నేటి విద్యా విధానంలో శ్రీప్రకాష్ పాఠశాల జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. భాస్కరరామ్లు మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో క్రీడల ప్రాముఖ్యతను చాటుతూ క్రీడలకు ఉన్నతస్థానాన్ని కల్పించిన ఘనత శ్రీ ప్రకాష్ యాజమాన్యానికే దక్కుతుందన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ నైపుణ్యాన్ని కనబరిచి గెలుపునకు ముందడుగు వేయాలన్నారు. అనంతరం ఎంపీ నరసింహం, చైర్మన్ సూరిబాబురాజు టేబుల్ టెన్నిస్ ఆడి అండర్–14, అండర్–17, అండర్–19 బాలుర, బాలికల క్రీడా పోటీలను ప్రారంభించారు. టీటీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పీవీఎన్ సూర్యారావ్, యూఐసీ కోచ్ అచ్యుత్కుమార్, ఓవరాల్ టెక్నికల్ ఇన్చార్జి పి.వేణుగోపాల్, పాఠశాల డీన్ రాజేశ్వరి, లైజాన్ ఆఫీసర్ ఎం.సతీష్, ఆయా రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థి
పిట్లం : రాష్ట్రస్థాయి త్రోబాల్ క్రీడలకు పిట్లంలోని బ్లూబెల్స్ పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ ధర్మవీర్ తెలిపారు. బ్లూబెల్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చగా రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో జిల్లా జట్టు నుంచి పోటీల్లో పాల్గొననున్నాడని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల నిర్వాహకులు నర్సింహా రెడ్డి, ప్రిన్సిపాల్, పీఈటీలు దవులత్, సుధాకర్, సుమలత, అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించారు. -
జానపద కళలను ప్రోత్సహిద్దాం
కర్నూలు (కల్చరల్): పల్లె సీమల సంస్కృతికి ప్రతీకగా నిలిచే జానపద కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్సీ సుధాకర్బాబు తెలిపారు. స్థానిక కృష్ణానగర్లోని శ్రీలక్ష్మి ఫంక్షన్హాలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 16వ రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీలను ఆయన ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా ఎస్వీ ఫౌండేషన్ సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సీమ కళాకారులు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో బాగా రాణిస్తున్నారన్నారు. ఎస్వీ ఫౌండేషన్ విద్యార్థులలో చక్కని కళాభిరుచులను పెంపొందించే దిశగా కషి చేస్తోందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ ఎస్వీ ఫౌండేషన్ నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో విజేతలైన కళాకారులు చాలా మంది రాష్ట్రస్థాయిలో ఉత్తమ కలాకారులుగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించడం హర్షణీయమన్నారు. కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ గోగినేని విజయకుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా జానపద కళలకు నిలయమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి పిల్లల్లో చక్కని కళాసక్తులు కల్గిస్తూ ఎస్వీ ఫౌండేషన్ వారిలో ఉత్తమ మానవీయ విలువలు పెంపొందిస్తుందన్నారు. శ్రీలక్ష్మి ఫంక్షన్హాలులో చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మెప్మా పీడీ రామాంజనేయులు, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ కార్యధక్షులు రాయపాటి శ్రీనివాస్, వివిధ జిల్లాల నుండి వచ్చిన కాళాకారులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
కొత్తపేట : సౌత్జోన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల క్రీడాకారుల ఎంపికలో తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల క్రీడాకారుల హవా నడిచింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఈ నెల 21 నుంచి 24 వరకూ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2016 పోటీలు జరిగాయి. ఫైనల్స్ అనంతరం సౌత్ జోన్ క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ రెండు జిల్లాల క్రీడాకారులు సీనియర్, జూనియర్స్ విభాగాల్లో ఐదుగురు చొప్పున ఎంపికయ్యారు. వీరిలో నలుగురు చొప్పున రెగ్యులర్ క్రీడాకారులు కాగా, ఒక్కొక్కొరు రిజర్వ్ క్రీడాకారులు ఉండడం గమనార్హం. కేరళలోని ఒట్టుపాలెంలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే సౌత్జోన్ పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో ఎం.కనిష్క(గుంటూరు), సాత్విక్ సాయిరాజ్ (తూర్పుగోదావరి), కృష్ణ ప్రసాద్ (తూర్పు గోదావరి), కె.పి.చైతన్య (శ్రీకాకుళం), కిరణ్మౌళి (తూర్పుగోదావరి) ఎంపిక కాగా, రిజర్వ్ సభ్యులుగా బి.కిరణ్కుమార్ (విశాఖపట్నం), వి.గంగాధర్ (కృష్ణా)లను ఎంపిక చేశారు. ‘మహిళల విభాగంలో తనిష్క (గుంటూరు), బి.నిషితావర్మ (విశాఖపట్నం), డి.సుధా కళ్యాణి (తూర్పుగోదావరి), వి.హరికా (పశ్చిమ గోదావరి), పి.సోనికా (కృష్ణా)లు ఎంపికయ్యారు. జూనియర్స్ బాలుర విభాగంలో డి.జశ్వంత్ (చిత్తూరు), ఎం.కనిష్క (గుంటూరు), ఎ.వేదవ్యాససాయి (ప్రకాశం), బషీర్, గౌస్ (నెల్లూరు)లు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎస్వీ రాయుడు (తూర్పు గోదావరి), పి.చంద్రగోపీనాథ్(గుంటూరు), బాలికల విభాగంలో ఎం.తనిష్క(గుంటూరు), కె.ప్రీతి(విజయనగరం), ఎ.అక్షిత (తూర్పుగోదావరి), రిజర్వ్ స్థానాలకు డి.ఆసియా(కర్నూలు), డి.షబ్నాబేగమ్(కర్నూలు)లు ఎంపికయ్యారని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి ప్రకటించారు. జట్టుకు శాప్కు చెందిన జి.సుధాకర్రెడ్డి, ఏపీబీఏకు చెందిన జె.బి.ఎస్. విద్యాధర్లు కోచ్లుగా, ఎం.సుధాకర్రెడ్డి మేనేజర్గా సేవలందించనున్నారు. -
‘స్కౌట్స్ అండ్ గైడ్స్’లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానం
మచిలీపట్నం (కోనేరు సెంటర్) : స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ ఎస్.శ్రీదేవి తెలిపారు. కృష్ణాజిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంపస్లో విద్యార్థినుల తృతీయ సోఫాన్ శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం స్థానిక జెడ్పీ సెంటర్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు, పుష్కరాలు వంటి పుణ్యకార్యాలు, మొక్కలు పెంచడం వంటి సామాజిక కార్యక్రమాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు సమాజానికి సేవలు అందించటం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి క్రమశిక్షణ కలిగిన రంగాల్లో శిక్షణ పొంది సమాజానికి మంచి సేవలను అందించేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కౌట్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి కరింశెట్టి కైలాసపతి, లయన్స్ జిల్లా చైర్మన్ పంచపర్వాల సత్యనారాయణ, రజియాబేగం, ఐ.శ్రీనివాసరావు, కె.శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఓపెన్ చెస్ పోటీలు ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: వెనిగండ్ల విలేజి చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో కె.శ్రావణి మెమోరియల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్లో 50 మంది రేటెడ్ క్రీడాకారులతో పాటు మొత్తం 90 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు చెస్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెస్ మేధోశక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. చెస్లో రాణించే క్రీడాకారులు చదువుల్లోను రాణిస్తారని చెప్పారు. టోర్నమెంట్ నిర్వహకుడు కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రూ.7వేలు నగదు బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ
పాలకుర్తి : జాతీయ స్థాయి అండర్ 17 బాలుర క్రికెట్ పోటీల్లో పాల కుర్తి మండలం దర్దేపల్లికి చెందిన నిమ్మల అనిల్ అత్యుత్తమ ప్రతిభ కనబరి చాడు. ట్రెడిషనల్ ఒలిం పిక్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ హర్డోయి నగరంలో ఇటీవల ప్రథమ జాతీయ క్రీడోత్సవాలు జరి గాయి. ఈ పోటీల్లో రాష్ట్ర జట్టులో అనిల్ పాల్గొని స్వర్ణ పతకం సాధిం చాడు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ క్రికెట్లో అంతర్జాతీయ స్థాయి లో రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్లో జరగనున్న అంతర్జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ఆడనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నానని, కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బం దులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి చేయూతనందించాలని అనిల్ కోరారు. -
‘తైక్వాండో’ ధీరులకు బహుమతులు
రేపల్లె: పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన అండర్–14, అండర్–17 విభాగాలలో నిర్వహించిన రాష్ట్ర తైక్వాండో ట్రైల్స్, జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం క్రీడాప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కే.జగన్మోహనరావు, పీఈటీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–17 జూనియర్ బాలుర విభాగంలో నరసరావుపేటకు చెందిన ఎం.వి.ఎన్.మణికంఠ, పి.చైతన్యకుమార్, గుంటూరుకు చెందిన వి.వి.సాయిరామ్కుమార్, డి.పార్థుశివసాయికుమార్, కొల్లూరుకు చెందిన ఎన్.పవన్కుమార్, రేపల్లెకు చెందిన కె.క్రాంతివర్మ, పి.రాజదేవ్కుమార్, జి.హరి, కె.నాగవంశీ, బాలికల విభాగంలో రేపల్లెకు చెందిన చైతన్య, సాయిశర్వాణీ, గుంటూరుకు చెందిన జె.ఉమామహేశ్వరి, అండర్–14 విభాగంలో గుంటూరుకు చెందిన వి.హర్షవర్థనరెడ్డి, జె.దేశ్ముఖ్, మహేష్, తెనాలికి చెందిన దేవకీనందన్, కొల్లూరుకు చెందిన ధీరజ్ నాగసాయికుమార్, నరసరావుపేటకు చెందిన మోహన్గోపాల్, బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన వై.జ్ఞానశివాని, కె.యశశ్విని, టి.లక్ష్మీలావణ్య, తెనాలికి చెందిన టి.లావణ్య, కొల్లూరుకు చెందిన ఆర్పీ మమత, నరసరావుపేటకు చెందిన డి.భానుసాయిలక్ష్మి, రేపల్లెకు చెందిన వి.లిఖితా మనోజ్ఞ విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని పలువురు అభినందించారు. -
సిలిగురిలో మాస్టర్ షెఫ్ కుకింగ్ కాంపిటీషన్
-
విశాఖలో శ్రావణ లక్ష్మి పోటీలు
-
హోరాహోరీగా టెన్నిస్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్ : అండర్–14 బాలబాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. టోర్నమెంట్ బాలికల విభాగంలో సెమీ ఫైనల్స్కు చేరగా, బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్స్కు చేరింది. స్థానిక బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో ఆదివారం బాలికల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో లేళ్ళ ఆశ్రిత (గుంటూరు) 7–1 స్కోర్తో పి.లావణ్య (విజయవాడ)పై విజయం సాధించింది. అలాగే, ఆర్ఆర్వీ శరణ్య (విశాఖ) 7–5 స్కోర్తో ప్రవల్లిక (విజయవాడ)పై, సాత్విక (విశాఖ) 7–0 స్కోర్తో ఈషసాయి మండవ (హైదరాబాద్)పై, జ్ఞానిత (విశాఖ) 7–0 స్కోర్తో చింత రాగిణి (విశాఖ)పై విజయం సాధించి సెమీ ఫైనల్స్కు చేరారు. టెన్నిస్ పోటీలను ఐటా చీఫ్ రిఫరీ శ్రీకుమార్, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్ పర్యవేక్షించారు. -
బాక్సింగ్ పోటీలకు నారాయణ విద్యార్థి
గుంటూరు ఎడ్యుకేషన్ : బ్యాంకాక్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్కు ఎంపికైన తమ విద్యార్థి పి. జానీ బాషాను నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పిడికిటి తిలక్బాబు అభినందించారు. అమరావతి రోడ్డులోని సంస్థ జోనల్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తిలక్ బాబు పాల్గొని మాట్లాడారు. స్టూడెంట్స్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్–17 జాతీయ స్థాయి ఉషూ బాక్సింగ్ పోటీలో బృందావన్ గార్డెన్స్లోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి జానీ బాషా ప్రథమ స్థానంలో విజేతగా నిలిచాడని చెప్పారు. త్వరలో బ్యాంకాక్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్కు అర్హత సాధించాడని తెలిపారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగి దేశానికి అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. జానీ బాషా మాట్లాడుతూ పోటీలో విజేతగా నిలిచేటందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జానీ బాషాతో పాటు అతని తండ్రి మస్తాన్ ఖాన్, కోచ్ నరసింహారావును జీఎం తిలక్బాబు, డీన్ వీరగంధం శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అభినందించారు. -
కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
వరంగల్ స్పోర్ట్స్ : కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంపెంపొందుతుందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. రియో చిం కాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హంట ర్ రోడ్లోని సీఎస్ఆర్ గార్డెన్స్లో ఆదివారం జాతీ య స్థాయి ఓ పెన్ టు ఆల్ కరాటే పోటీలు నిర్వహించారు. జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా బాలికలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించాల్సిన బాధ్యత పేరెంట్స్పై ఉందన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 500 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారని టోర్నీ నిర్వాహకæ కార్యదర్శి, గ్రాండ్ మాస్టర్ ధన్రాజ్ తె లిపారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఆగ స్టు 26 నుంచి 30 వరకు పాండిచ్చేరిలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొం టారన్నారు.కార్యక్రమంలో జేఎస్ కలైమణి, సాల్మ న్, మహమూద్ అలీ, వివేక్ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పరుగు
-
పోలీసు ఉద్యోగాలకు పురుషులకి పోటీగా మహిళలు
-
కంపెనీల మధ్య పోటీతో.. కస్టమర్లకే ప్రయోజనం
♦ మొబైల్ కంపెనీల మధ్య పోటీ ♦ ఆషాఢం సేల్లో 51 శాతం దాకా డిస్కౌంట్ ♦ బిగ్ సి మొబైల్స్ సీఎండీ బాలు చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు నేరుగా భారత్లో అడుగుపెడుతున్నాయి. దీంతో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు స్మార్ట్ ఫీచర్స్తో మొబైల్స్ను ప్రవేశ పెడుతున్నాయని బిగ్ సి మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. అది కూడా అందుబాటు ధరలో విక్రయించడంతో కస్టమర్లకే అధిక ప్రయోజనం చేకూరుతోందని శుక్రవారమిక్కడ మీడియాతో చెప్పారు. బ్రాండ్కు బదులు వినియోగదార్లు విలువ చూస్తున్నారని అన్నారు. రూ.3 వేలకే 4జీ స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో భారత టెలికం రంగంలో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు. ఉచిత డేటాతో కస్టమర్లను ఈ కంపెనీ ఆకట్టుకుంటోందని వివరించారు. ముప్పు తొలగింది..: ఈ-కామర్స్ కంపెనీలు గతేడాది భారీ డిస్కౌంట్లతో ఉపకరణాలను విక్రయించడంతో రిటైలర్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడా కంపెనీలు డిస్కౌంట్లు ఇవ్వడం మానేశాయని బాలు చౌదరి తెలిపారు. ‘రిటైల్ వ్యాపారులు ఈ-కామర్స్ ముప్పు నుంచి బయటపడ్డారు. బిగ్-సి ప్రతినెలా 30-40% వృద్ధి నమోదు చేస్తోంది. 115 స్టోర్లతో 1.8 కోట్ల మంది వినియోగదార్లకు చేరువయ్యాం. వీరిలో 80% మంది రిపీటెడ్ కస్టమర్లు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ఒకరు బిగ్ సి వినియోగదారు. మొబైల్స్ సగటు విక్రయ ధర ఏడాదిలో రూ.4,400 నుంచి రూ.5 వేలకు వచ్చి చేరింది’ అని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో.. ఆషాఢం సేల్లో భాగంగా మొబైల్స్పై 51 శాతం దాకా డిస్కౌంట్ను బిగ్ సి ప్రకటించింది. ఏడేళ్లుగా ఈ ఆఫర్ను కొనసాగిస్తున్నామని, కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని వివరించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సేల్లో 50 శాతం ఎక్కువ మోడళ్లను జోడించారు. ఐఫోన్ 6 ప్లస్పై రూ.18 వేల డిస్కౌంట్, ఎల్జీ మాగ్నాపై 55 శాతం, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్పై 53 శాతం, లైఫ్ విండ్-1పై 35 శాతం, శాంసంగ్ గెలాక్సీ నోట్-5పై 30 శాతం డిస్కౌంట్ ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై రెండు ఫీచర్ ఫోన్లు, వీఆర్ బాక్స్, హెడ్సెట్లలో ఒకదానిని రూ.51లకే అందుకోవచ్చు. జీరో డౌన్పేమెంట్ సౌకర్యమూ ఉంది. -
నాసా పోటీల్లో భారత 'స్క్రూ డ్రైవర్స్'
హ్యూస్టన్ః అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ (నాసా) ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక పోటీల్లో భారత విద్యార్థులు పాల్గొన్నారు. ముంబై లోని ముఖేశ్ పటేల్ సాంకేతిక కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న 13 మంది విద్యార్థుల బృందం పోటీకి ఎంపికైంది. ప్రపంచంలోని మొత్తం 40 బృందాలతో ముంబై 'స్క్రూ డ్రైవర్స్' టీమ్ తలపడుతోంది. హ్యూస్టన్ లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు.. మారుమూల ప్రాంతాలనుంచి సందేశాలను అందుకొనే సామర్థ్యం గలవాహనాలను రూపొందిస్తున్నారు. వాహనాలను తయారు చేసేందుకు వ్యర్థాలను వినియోగిస్తున్నారు. -
రామ్దేవ్పై గోద్రెజ్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్దేవ్ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ విభాగం ఐఎంసీ మంగళవారం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో మాట్లాడిన గోద్రేజ్ రామ్దేవ్ పేరు వల్లే పతంజలి నడుస్తోంది తప్ప, వారి ఎఫ్ ఎం సీజీ ఉత్పత్తులకు తమతో పోటీలేదన్నారు. ఆయన ఇమేజ్, పరపతి మూలంగా యోగా, ఆయుర్వేద ఉత్పత్తులు బావున్నాయి తప్ప మిగిలిన వాటికి అంత సీన్ లేదని తేల్చి పారేశారు. నెయ్యి, తేనె వంటి సాధారణ ఉత్పత్తులు మాత్రమే మార్కెట్లో అధికంగా అమ్మడవుతున్నాయని పేర్కొన్నారు. విలువ ఆధారిత విభాగంలో ఆ సంస్థ వాటా చాలా తక్కువని గోద్రెజ్ స్పష్టం చేశారు. కేవలం టాయిలెట్ సబ్బుల విభాగంలోనే కన్జూమర్ ప్రోడక్ట్స్ తో పోటీ పడుతోందన్నారు. ఈ విభాగంలో పతంజలి ప్రాతినిధ్యం చాలా తక్కువ అని వెల్లడించారు. డీజిల్ వాహనాలు నిషేధం వ్యతిరేకంగా మాట్లాడిన ఆది గోద్రేజ్ నిషేధానికి బదులుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు, భూతాపాన్ని నిరోధించేందుకు టెక్నాలజీని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పొడిగింపుపై సానుకూలంగా మాట్లాడారు. అలాగే ప్రస్తుతం కుంగిపోయిన రియాల్టీ రంగానికి జిఎస్టి బిల్లు బూస్ట్ ఇస్తుందని తెలిపారు. కాగా మ్యాగీ నూడల్స్ వివాదం తరువాత పతంజలి ఆదాయం రూ.5000 కోట్ల మైలురాయిని దాటడం.. ఎఫ్ఎమ్సీజీ రంగంలో చర్చనీయాంశమైంది. దీనిపై బ్రోకరేజి సంస్థలు, ఎనలిస్టులు 2020 నాటికి సంస్థ ఆదాయం 20,000 కోట్లకు చేరుతుందని అంచనావేసిన సంగతి తెలిసిందే. -
పెయింటింగ్ వేసి గెలిచిన కోహ్లీ!
మైదానంలో పరుగుల వరద పారిస్తున్న స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ.. తాజాగా చేతికి పని చెప్పాడు. క్రికెట్ ఆడటమే కాదూ కుంచెతో బొమ్మలు గీయడం కూడా వచ్చని నిరూపించాడు. అంతేకాదండోయ్ ఆ పెయింటింగ్ పోటీలో గెలుపొందాడు కూడా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆటగాళ్లను ఎప్పుడూ ఏదో ఒక ఇంటర్వూ చేసే నేగ్స్ తాజాగా కోహ్లీని ఇంటర్వూ చేశాడు. నేగ్స్ అడిగిన తమషా ప్రశ్నలకు సమాధానం చెప్పిన కోహ్లీ.. పెయింటింగ్ తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. దాంతో తనతో పెయింటింగ్ వేసి గెలవమని నేగ్స్ కోరడంతో కోహ్లీ స్వయంగా బొమ్మను గీసి నేగ్స్ ని ఓడించేశాడు. మరి కోహ్లీ పెయింటింగ్ వేసిన వీడియోను ఓ సారి చూసేయండి. -
జయకు పోటీగా 44 మంది
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉత్కంఠ భరితంగా సాగుతున్న తమిళనాడు ఎన్నికల రణరంగంలో 3800 మంది పోటీకి నిలిచారు. మొత్తం 234 స్థానాల్లో 3800 మంది తలపడుతున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గత నెల 22వ తేదీన మొదలైన నామినేషన్ల ఘట్టంలో 234 స్థానాలకు 7156 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగగా 2975 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 4181 నామినేషన్లు అర్హత పొందాయి. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ అంకం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు, వారి డమ్మీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే ప్రధాన పార్టీల్లో సైతం డమ్మీ అభ్యర్థులు అసలు అభ్యర్థులుగా మారిపోయారు. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఉపసంహరణల అంకంతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎందరో తేలిపోయింది. 300 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా మొత్తం 234 స్థానాలకు 3800 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీచేస్తున్న ఆర్కేనగర్లో 45 మంది, డీఎంకే అధినేత పోటీపడుతున్న తిరువారూరులో 15 మంది, డీఎండీకే అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి విజయకాంత్ రంగంలో ఉన్న ఉళుందూర్పేటలో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే చెన్నైలోని 16 నియోజకవర్గాల నుంచి 378 మంది తలపడుతున్నారు. -
కోళ్ల పందెం కాదు.. గుర్రాల పందెం!
బీజింగ్: సంక్రాంతి వచ్చిందంటే మన దగ్గర కోడి పందాలు సందడి చేస్తాయి. కోడిపుంజులు ఒక దానితో ఒకటి తలపడుతుంటే ఏది నెగ్గుతుందా అని చిన్నాపెద్దా అంతా చేరి ఆ పోరును ఆసక్తిగా చూస్తారు. చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా ఇలాంటి పోటీలే నిర్వహిస్తారు. అయితే వారు మాత్రం ఆ పందేలను గుర్రాలతో నిర్వహిస్తారు. గుర్రపు పందెం అంటే గుర్రాల మధ్య రన్నింగ్ రేస్ అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే. అచ్చం కోడిపుంజుల మాదిరిగానే రెండు గుర్రాలు పోట్లాడుకుంటాయి. కోడి పుంజులు ఒక దానికి ఒకటి ఎదురుపడగానే పోట్లాడుకుంటూనే ఉంటాయి. మరి గుర్రాలు ఎందుకు అలా పోట్లాడుకుంటాయి అనుమానం వస్తుంది కదూ. దీనికోసం ఓ టెక్నిక్ వాడుతారు. ఓ ఆడగుర్రాన్ని ముందుగా రింగ్లోకి వదిలిన తర్వాత.. రెండు మగ గుర్రాలను వదులుతారు. ఆ ఆడగుర్రాన్ని ఇంప్రెస్ చేయడానికి రెండు మగగుర్రాలు కోడిపుంజుల మాదిరిగా పోట్లాడుకుంటాయి. మగ గుర్రాలను ఉత్సాహపరుస్తూ ఆడగుర్రం రింగ్ చుట్టూ తిరగుతుంది. పోటీలను చూసేవారు గుర్రాలపై జోరుగా బెట్టింగ్ లు నిర్వహిస్తారు. దక్షిణ చైనాలోని మియావో ప్రాంతంలో 500 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పెద్ద ఉత్సవంలా నిర్వహిస్తున్నారు. దీనిపై జంతుప్రేమికుల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నా నిర్వాహకులు మాత్రం తమ పూర్వీకుల సాంప్రదాయాన్ని కొనసాగిస్తామంటున్నారు. -
క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా
గుర్గావ్లో ఇటీవల ‘క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా’ పోటీ జరిగింది. దీనికి ‘ఆయుర్వేదిక్ రూప్ మంత్రా’ స్పాన్సర్గా వ్యవహరించింది. పోటీలో విజేతలుగా నిలిచిన వారికి దివిసా హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా అవార్డులను ప్రదానం చేశారు. సంజీవ్ జునేజా (ఎడమవైపు నుంచి రెండోవారు)తో పాటు ‘క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా’కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన నటి అదితి గొవిత్రికర్, బాలీవుడ్ నటుడు అస్మిత్ పటేల్, డిజైనర్ పూనమ్ భగత్ తదితరులు పై చిత్రంలో వున్నారు. -
అయితే, ప్రేమికులు ఎక్కువగా వస్తారులే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల రేసులో తానూ ఉన్నానని పీఎంకే యువజన నేత, ఎంపీ అన్బుమణి వెల్లడించారు. ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతోన్నట్టు తెలిపారు. తనయుడు, పార్టీ యువజన నేత అన్బుమణిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగని అన్బుమణి, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఆ అనుభవాన్ని ఎదుర్కోక తప్పలేదు. ధర్మపురి నుంచి బరిలో దిగి, చివరి క్షణంలో సామాజిక వర్గం ఓట్లతో గట్టెక్కి ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కారు. రాజ్య సభ పదవులతో కాలం నెట్టకొచ్చిన అన్బుమణి తొలి సారిగా ఎన్నికల్లో గెలవడం పీఎంకే వర్గాలకు ఆనందమే. తాజాగా ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మార్పు తమతో అన్న నినాదాన్ని అందుకుని ప్రజల్లోకి దూసుకెళ్లే పనిలో పడ్డారు. గతంలో వలే మార్చి మార్చి కూటముల్లోకి దూరకుండా, ఈసారి తమ నేతృత్వంలోనే కూటమి ప్రకటించుకుని ప్రజాకర్షణ దిశగా ఉరకలు తీస్తున్నారు. సీఎం అభ్యర్థి రేసులో తాను ఉన్నానని, తాను తప్పకుండా అధికార పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాతో ప్రజల్లో చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డ అన్భుమణి రాందాసు, ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధం అని ప్రకటించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా పీఎంకే శ్రమిస్తున్నదని, రాష్ట్రంలో మార్పు అన్నది తమతోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించి ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, వారు సూచించే స్థానం నుంచి బరిలో దిగి భారీ అధిక్యంతో గెలవడమే కాదు, అధికార పగా్గాలు చేపట్టి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. ధర్మపురి నుంచే బరిలోకి దిగుతారా..? అని ప్రశ్నించగా, అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కదా..? ఆరోజున మహానాడుకు పిలుపు నిచ్చారేమిటో అని ప్రశ్నించగా..? అవునా...ప్రేమికుల దినోత్సవమా..!. అయితే, ప్రేమికులు ఎక్కువగా వస్తారులే అని చమత్కరించి ముందుకు సాగారు. అసెంబ్లీలో తొలి సారిగా అన్భుమణి అడుగు పెట్టిన పక్షంలో, ఎంపీ పదవికి రాజీనామా చేయక తప్పదేమో..!. ఈ దృష్ట్యా, ధర్మపురికి మళ్లీ ఉప ఎన్నిక వచ్చేనా?, లేదా అధికారం చే జిక్కని పక్షంలో ఎంపీ పదవే బెస్ట్ అని, ఎమ్మెల్యే పదవిని వదులుకునేనా..?అన్నది వేచి చూడాల్సిందే. నేటి నుంచి దరఖాస్తుల పర్వం : పీఎంకే తరఫున ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు నిర్ణయించారు. బుధవారం నుంచి ఈ పర్వం ఆరంభం కానున్నది. రూ.ఐదు వేలు చెల్లించి దరఖాస్తును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల్ని విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలాపురం ఎస్టేట్లో ఉన్న పీఎంకే కార్యాలయంలో స్వీకరించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఫిబ్రవరి ఐదో తేదీ చివరి గడవు. -
'కార్టింగ్' ఛాంపియన్షిప్ పోటీలు
-
తెరపై మరో 'అందాల రాక్షసి'
-
నగరంలో 'మిస్ ట్విన్ సిటీస్' పోటీలు
-
హుషారెత్తించిన పడవ పోటీలు
-
’సాక్షి’ ఇండియా స్పెల్బీ 2015 ప్రిలిమ్స్ ఎగ్జామ్
-
ప్రపంచ 'స్థానిక క్రీడల' పోటీలు
-
బాలాపూర్ లడ్డూకి చాలా మహిమ ఉంది
-
చిట్టిచేతుల సృష్టి..
-
నేను పోటీ కోరుకుంటాను
నేను పోటీని కోరుకుంటున్నాను. నాకు పలువురు పోటీగా ఉండాలి అంటున్నారు నటి తమన్న. ఈ గుజరాతి భామకు కోలీవుడ్లో అవకాశాలు రానురాను అంటూనే వరుసగా రావడం విశేషం. ఆ మధ్య తమన్న పని అయిపోయింది అనుకున్న వారి నోళ్లను బాహుబలి మూయించింది. ఇక తమిళంలో వీరం చిత్రం విజయం సాధించినా తమన్నకు చిన్న గ్యాప్ వచ్చింది. ఇటీవల ఆర్యతో నటించిన వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగ చిత్రం విడుదలై సక్సెస్ అనిపించుకుంది. ప్రస్తుతం నాగార్జున కార్తీలతో బెంగళూర్ టైగర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మిల్కీబ్యూటీ తమన్నను పలకరిస్తూ నటిగా గట్టి పోటీని ఎదుర్కొంటునట్లున్నారే అని అడగ్గా నేనెప్పుడూ పోటీని కోరుకుంటాను. పోటీతోనే ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి చేరుకోగలం. ఇంకో విషయం ఏమిటంటే నా చిత్రాల విజయాలకు సంతోషిస్తాను.అయితే నేనొక్కదాన్నే ఇక్కడ ఉండాలని కోరుకోను. నేనొక్కదాన్నే ఉంటే బోర్. ఇతర హీరోయిన్లు కూడా నాలా ఉండాలనుకుంటాను. బాహుబలి చిత్ర విజ యం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బయట ఎక్కడికెళ్లినా అనామిక అంటూ గౌరవిస్తుంటే గర్వంగా ఉంది. ప్రస్తు తం నాగార్జున, కార్తీలతో బెంగాలీ టైగర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం.ప్రతి చిత్రంలోనూ ఒక్కో విషయాన్ని నేర్చుకుం టున్నాను. అయినా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక దక్షిణాది ప్రతిభావంతులైన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఇలాంటప్పుడు హీరోయిన్ల మధ్య పోటీ తప్పకుండా ఉంటుంది. అలాంటి పోటీ నే నేను కోరుకుంటాను. పోటీతోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యం అన్నది నా భా వన అని తమ్మన అన్నారు. -
కాలిఫోర్నియాలో డాగ్స్ సర్ఫింగ్ పోటీలు
-
పోటీ ప్రపంచం!
కంటికి కనబడే ఈ వస్తుగత ప్రపంచంలో మరో ప్రపంచం అంతర్లీనంగా ఉన్నదని బడి చదువుల సమయంలోనే అందరికీ అర్థమవుతుంది. ఆ ప్రపంచం పోటీ ప్రపంచం. నిరంతరం శ్రమించడానికి సంసిద్ధులయ్యేవారికే అందులో చోటు. ఒకసారి విజేతగా నిలబడితే చాలదు. పదే పదే పోటీపడాలి. ఒక సబ్జెక్టులో మెరిసిపోతే కుదరదు. అన్నిటా ముందుండాలి. ఎప్పుడో వచ్చే పరీక్షల్లో కాదు... రోజూ తరగతి గదిలో టీచర్నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సైతం జవాబివ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఆల్ రౌండర్ అనిపించుకోవడంలో...అందుమీదట లభించే ఆధిక్యతాభావాన్ని అనుభవించడంలో ఉండే మజాయే వేరు. పై తరగతులకు వెళ్లేకొద్దీ ఇది విస్తరిస్తున్నది. యూనివర్సిటీ కావొచ్చు, మరో ఉన్నతశ్రేణి విద్యా సంస్థ కావొచ్చు...చదువు పూర్తవుతుండగా క్యాంపస్ ఇంటర్వ్యూల రూపంలో పతాక సన్నివేశం ఉంటుంది. విజేతలెవరో, పరాజితులెవరో ఆఖరుగా తేలి పోతుంది. దాంతో పోటీలో ఒక అంకం ముగిసి మరొకటి ప్రారంభమవుతుంది. సరిగ్గా ఇక్కడే పిల్లలు సందిగ్ధావస్థలో పడుతున్నారు. చదువులో తదుపరి దశకు వెళ్లడమా... బహుళజాతి సంస్థలు ఆశపెట్టే డాలర్ డ్రీమ్స్ వెనక పరుగులెత్తడమా అనేది తేల్చుకోలేకపోతున్నారు. తమ అభిరుచులేమిటో, సామర్థ్యమేమిటో, తమకు సరిపడేదేమిటో నిర్ధారించుకోలేక పోతున్నారు. అమ్మానాన్నల నుంచి వచ్చే ఒత్తిళ్లు వారికి అలా తేల్చుకోవడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న రెండు ఉదంతాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. మొదటిది కొన్ని రోజులక్రితం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన 22 ఏళ్ల యువకుడు సర్వశ్రేష్ట గుప్తాకు సంబంధించింది. ఢిల్లీ చదువుల అనంతరం అమెరికా వెళ్లి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పట్టభద్రుడైన సర్వశ్రేష్ట నిరుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రముఖ బ్యాంకింగ్ రంగ దిగ్గజం గోల్డ్మాన్ శాక్స్లో ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రపంచం మొత్తాన్ని తన కనుసైగలతో శాసిస్తున్న వాల్స్ట్రీట్లో ప్రవేశించాడు. మన దేశంలోని మధ్యతరగతి యువకులు ఎంతగానో ఆరాటపడే, కలలుగనే ఉన్నత శిఖరాన్ని అధిరోహించాననుకున్నాడు. కానీ ఆ ఉద్యోగంలో ఉండే ఒత్తిడి కొంచెం కొంచెంగా తన ప్రాణాన్ని పీలుస్తున్నదని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకుని నాన్నను ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే కాలాతీతమైంది. తన అపార్ట్మెంట్లోని కారు పార్కింగ్లో విగతజీవుడిగా మిగిలిపోయాడు. అతను భరించలేని మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునన్నది స్థానిక మీడియా ఊహాగానం. తండ్రి సైతం ఇప్పుడు అదే చెబుతున్నాడు. ఎంతో భవిష్యత్తున్న తన గారాలపట్టీని పని ఒత్తిడే చిదిమేసిందని వాపోతున్నాడు. ‘ఎన్నటికీ మరణించని కుమారుడి’ స్మృతిలో ఎలిజీ రాసుకున్నాడు. మరణానికి కొద్దిరోజుల ముందు ‘ఇది మరీ దారుణం. గత రెండురోజులుగా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నాను. మళ్లీ రేపు ఉదయాన్నే మీటింగ్ అంటున్నారు. అందుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని కోప్పడుతున్నారు’ అని కొడుకు తనకు పంపిన ఎస్సెమ్మెస్ను అందులో ప్రస్తావించాడు. ఆ తండ్రిపై ఏం ఒత్తిళ్లు వచ్చాయో ఏమో బ్లాగ్లో ఉన్న ఆ ఎలిజీ మాయమైంది. వాల్స్ట్రీట్లో ఈ తరహా మరణాలు గత ఏడాది కాలంలో అనేకం సంభవించాయని ‘న్యూయార్క్ టైమ్స్’ చెబుతోంది. సిబ్బందిపై పనిభారాన్ని తగ్గిస్తే తప్ప వీటిని అరికట్టడం అసాధ్యమంటున్నది. రెండో ఉదంతం ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థికి సంబంధించింది. ఆ సంస్థలో చదివిన శిఖర్ బీటెక్కు సంబంధించిన అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకంటే అత్యుత్తమంగా నిలిచి పట్టభద్రుడు కావడమేకాక ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్కు ఎంపికయ్యాడు. అయితే తాను చదివిన కంప్యూటర్ సైన్స్లో పరిశోధనలకే ప్రాముఖ్యతనీయాలని నిర్ణయించుకుని ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఈ విషయంలో తనకు రెండో ఆలోచన లేదని, కుటుంబసభ్యులంతా తన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని చెప్పాడు. అందరి పిల్లలకూ శిఖర్కున్న స్వేచ్ఛ ఉండదు. పిల్లల అభిరుచులేమిటో, వారి ఆసక్తులేమిటో తెలుసుకుని అందుకనుగుణమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛనివ్వకపోతే...ప్రతి అంశంలోనూ తామే శాసిస్తే...పోటీయే ప్రపంచంగా మిగిలిస్తే చివరికెలాంటి ఫలితాలు వస్తాయో తెలియడానికి సర్వశ్రేష్ట గుప్తా ఉదంతం ఉదాహరణగా నిలిస్తే శిఖర్ నిర్ణయం ఆరోగ్యకరమైన స్థితికి అద్దం పడుతుంది. నిజానికి విద్యారంగంలోని రుగ్మతలే తల్లిదండ్రులను ఆలోచించలేని స్థితికి నెడుతున్నాయి. పిల్లలపై శక్తికి మించిన లక్ష్యాలను రుద్దేలా చేస్తున్నాయి. ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో మన వర్సిటీల స్థానం అట్టడుగున ఉంటున్నది. తొలి 200 యూనివర్సిటీల్లో చైనాకు సంబంధించినవి 6 ఉండగా మన దేశం స్థానం 400 దాటాక ఎక్కడో ఉంది. ప్రపంచ మేధోపరమైన హక్కుల సంస్థకు చైనా ఉన్నత శ్రేణి సంస్థలనుంచి పేటెంట్ల కోసం 2013లో 8,25,136 దరఖాస్తులు రాగా, భారత్నుంచి వెళ్లినవి కేవలం 43,031 మాత్రమే! 1995లో ప్రాజెక్ట్-211 కింద చైనా వంద యూనివర్సిటీలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఆ రంగంలో భారీయెత్తున నిధులు ఖర్చుపెట్టి అత్యుత్తమశ్రేణి వర్సిటీలను నెలకొల్పడంలో నిమగ్నమైతే... మనం ఇంచుమించు అదే సమయంలో ఉన్నత విద్యారంగాన్ని భ్రష్టుపట్టించే పనిని మొదలెట్టాం. విద్యారంగానికి నిధులివ్వడంలోగానీ, యూనివర్సిటీల్లో అవసరమైనంతమంది బోధనా సిబ్బందిని నియమించడంలోగానీ, పరిశోధనలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంలోగానీ పూర్తిగా వెనకబడ్డాం. పెపైచ్చు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట చదువులను కొనుక్కునే విధానాన్ని ప్రవేశపెట్టి సామాన్యులు ఆ వైపు అడుగుపెట్టకుండా జాగ్రత్తపడ్డాం. సృజనకూ, పరిశోధనకూ అమిత ప్రాధాన్యతనిచ్చేలా కొత్తగా యూనివర్సిటీలను నెలకొల్పాలని ఉద్దేశించిన 2012నాటి బిల్లు అతీ గతీ లేకుండా అదృశ్యమైంది. దాని సంగతలా ఉండగానే రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ పేరిట కొత్త పథకం పుట్టుకొచ్చింది. ఉన్నత విద్యారంగాన్ని ఉద్ధరిస్తానంటున్న ఈ పథకం ఏమవుతుందో చూడాలి. సర్వీస్ రంగంలో వచ్చే ఉద్యోగాలే, జీతాలే జీవితధ్యేయంగా మార్చి యువత శక్తిసామర్థ్యాలను నీరుగారుస్తున్న... వారి ఉసురుతీస్తున్న ప్రస్తుత ధోరణులను మార్చడానికి ఏంచేయదల్చుకున్నారో పాలకులు సెలవీయాలి. -
ఇదిగిదిగో... క్రీమ్!
ప్రసిద్ధ ‘సోనీ వరల్డ్స్ ఫొటోగ్రఫీ’ అవార్డ్ల కోసం జరిగిన వడపోతలో మిగిలిన కొన్ని ఫొటోల్లో ఇవి కూడా కొన్ని. వీటిని ‘క్రీమ్' అని పిలుస్తున్నారు. 171 దేశాల నుంచి వేలాది ఎంట్రీలు ఈ పోటీకి వచ్చాయి. మానవ ఆసక్తికి సంబంధించిన ్గఫొటోలతో పాటు ప్రకృతి, భౌగోళిక అందం, సామాజిక న్యాయం...ఇలా వివిధ విభాగాలకు చెందిన ఫొటోలు ఇందులో ఉన్నాయి. నలుపు తెలుపుల్లో పంచరంగుల అందం... బంగ్లాదేశ్లో మహ్మద్ అద్నాన్ తీసిన మొదటి ఫొటో చూసి ‘వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే’ అని పిల్లల గురించి మాత్రమే పాడుకోనక్కర్లేదు. ఆ ఆనంద గీతాన్ని పెద్దల దగ్గరికీ తీసుకువెళ్లవచ్చు. టర్కీ ఫొటోగ్రాఫర్ కెన్డిస్లిగో తీసిన ఫొటోలో... వానను ప్రేమించే వృద్ధురాలు కనిపిస్తుంది. ఆమె వానోత్సవాన్ని కొలవడానికి ఏ పరికరాలూ చాలవేమో! పేదరికపు సంపన్న దృశ్యం... ఒకటి: ఓపెన్ ట్రావెల్ కేటగిరిలో ఎంపికైన ఈ ఫొటోను చెన్నై బీచ్లో ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ చెవెసోవ తీశారు. అడుక్కునే అమ్మాయి చేతిలో కోతి అందరిని ఆకట్ట్టుకుంటోంది. జీవితం అనేది ఒక సముద్రం అనుకుంటే దాని ముందు బేలగా ‘కోతి’ అనే ఉపాధితో నిల్చుంది అమ్మాయి. ‘‘ఈ అమ్మాయి విధిరాతతో నాకేమిటి సంబంధం? నాకు ఎందుకు స్చేచ్ఛ లేదు’’ అని కోతిగారు లోకాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో. రెండు: పశ్చిమబెంగాల్లో నబద్విప్ ప్రాంతంలో వెనిజులా ఫొటోగ్రాఫర్ మహదేవ్ రోజాస్ టొర్రెస్ తీసిన ఫొటోలో ఇటుకలు తయారు చేసే కార్మికుల ‘పేదరికం’ పిల్లల రూపంలో కనిపిస్తుంది. ఈ పిల్లలు ఏదో ఆలోచిస్తున్నారా? ఈ సమాజాన్ని ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా?! -
నయన తారను అధిగమిస్తానా? లేదా?
కోలీవుడ్లో ఎవరేమన్నా...కాదన్నా...దుమ్ము రేపుతున్న ప్రస్తుత హీరోయిన్లు ఇద్దరే. వారిలో ఒకరు నయన తార, మరొకరు హన్సిక. ఈ ఇద్దరిలో ఒకరు ఉంటే, ఆ చిత్రం విజయం మినిమం గ్యారంటీ అనే స్థాయికి ఎదిగారు. పారితోషికంలోను కోటి దాటారు. దీంతో నయన తార, హన్సికల మధ్య పోటీ నెలకొందన్న ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్య విజయాల పరంగా హన్సిక, నయన తారను ఓవర్ టేక్ చేస్తున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా నటి హన్సికతో మినీ ఇంటర్వ్యూ. ప్ర: ఉత్తరాది నుంచి వచ్చి తమిళంలో సినీ అభిమానుల మనసును దోచుకున్న మీరు వారి గురించి ఏమి చెబుతారు..? జ: నన్ను ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ఇక్కడి యువత గురించి చెప్పాలంటే, అన్ని విషయాల్లో అడ్వాన్స్గా ఉన్నారు. చాలా వివరాలు తెలుసుకుంటున్నారు. దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇది గ్రహించాల్సిన విషయమే. ప్ర: మీరు ముంబైలో అనాథ, వృద్ధాశ్రమాలకు విశేష సేవలు అందిస్తున్నారుగా..? మరి తమిళనాడులో సేవలందించరా? జ: ముంబైలో మా అమ్మ, అన్నయ్య ఉన్నారు. వారు ఆశ్రమాల నిర్వహణ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ప్రత్యక్షంగా పరిరక్షణ బాధ్యతలు చేపడితేనే అలాంటి సేవా కార్యక్రమాలకు న్యాయం జరుగుతుంది. అయి తే, తమిళనాడులో అనాథ ఆశ్రమాలు నెలకొల్పాలన్న కోరిక నాకూ ఉంది. అందుకు దైవ నిర్ణయ ఎలా ఉం టుందో చూడాలి. ప్ర: తమిళనాడులో మీకు నచ్చిన వంటకం? జ: తమిళనాడులోనే కాదు. ఎక్కడైనా ఇష్టమైన వం టకం ఇడ్లీ. స్కూల్లో కూడా కొంచెం బొద్దుగా ఉండడం తో ఇడ్లీ అని ఆట పట్టించేవారు. ప్ర: హన్సిక నాకు నచ్చిన హీరోయిన్ అని ఇటీవల విశాల్ చేసిన వ్యాఖ్యల గురించి కామెంట్... జ: ఆయన వ్యాఖ్యలు చాలా సంతోష పరిచాయి. విజయ్ , ధనుష్, జయం రవిల వరుసలో నాకు నచ్చిన మరో నటుడు విశాల్. ప్ర: 2015లో మీకు, నయనకు మధ్యలో అసలైన పోటీ గురించి...? జ: నయన తార నాకంటే సీనియర్. ఆమె నటించిన చిత్రాలు నేను చూస్తాను. నాకు ఆమె నటన అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా, ఓ సీనియర్ నటిగా ఆమె అంటే గౌరవం. ఇక పోతే నా పోరితోషికం ఎంత? అన్న విషయం నాకే తెలియదు. అవన్నీ మా అమ్మ చూసుకుంటుంది. అలాగే 2015లో నేను, నయన తారను అధిగమిస్తానా? లేదా అన్న విషయంలో ఎలాంటి చింత లేదు. నాకు నేనే పోటీ. 24 గంటలు శ్రమిస్తా. చిత్రం చిత్రానికి వైవిధ్యం చూపడానికి ప్రయత్నిస్తుంటాను. ప్ర: అరణ్మణై చిత్రంలో దెయ్యంగా నటించి మెప్పించారుగా? మళ్లీ అలాంటిపాత్ర వస్తే నటిస్తారా..? జ: అరణ్మణై చిత్రానికి సీక్వెల్ తీస్తే నటించేందుకు సిద్ధం. ప్ర: మీకు వరుసగా విజయాలను అందిస్తున్న సుందర్ సీ గురించి..? జ: చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సుందర్ సీ , కుష్భు మేడమ్ మా కుటుంబ సభ్యులు. నాకు నచ్చిన మొనగాడు సుందర్ సీ. అంబళ చిత్రం షూటింగ్లో నన్ను తేనేటీగ కుట్టినప్పుడు, ఒక రోజంతా ఆహారం తీసుకోలేదు. అప్పుడు ఆయన ఓ తల్లిలా నన్ను చూసుకున్నారు. సుందర్ సీ షూటింగ్ అంటే, అమ్మకు నా గురించి ఎలాంటి చింత ఉండదు. సుందర్ సీ, ఖుష్భు నన్ను సొంత కూతురిలా చూసుకుంటున్నారని అమ్మ చెబుతారు. -
ఆనందం దక్కేనా..?
నెల్లిమర్ల : ఎయిమ్స్ విద్యా సంస్థల చైర్మన్, టీడీపీ నాయకుడు కడగళ ఆనంద్కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నట్టు సమాచారం. విజయనగరం డివిజన్కు సంబంధించి వేరెవరూ ఆ పదవికి పోటీ పడకపోవడంతో ఎమ్మెల్యే లు పతివాడ నారాయణస్వామినాయుడుతో పాటు మీ సాల గీత కూడా ఆయనకే మద్దతు ప్రకటిస్తున్నట్టు స మాచారం. అయితే పార్వతీపురం డివిజన్కు చెందిన ఆ పార్టీ నేతలు కొంతమంది ఆయనకు అడ్డు తగులుతున్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డివిజన్కే ఆ పదవి కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం. దీంతో ఆనంద్కుమార్కు పదవి దక్కుతుందా.. లేదా అన్నది జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. నెల్లిమర్ల మండలం బొడ్డపేట గ్రా మానికి చెందిన కడగళ ఆనంద్కుమార్ స్వయానా నెల్లిమర్ల ఎంపీపీ సువ్వాడ వనజాక్షికి తమ్ముడు. అం తేకాకుండా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సువ్వాడ రవిశేఖర్కు బావమరిది. ఇటీవల జరిగిన స్థానిక, సా ధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున బాగా పని చేశారు. ఎంపీపీ ఎన్నికల్లో తన సోదరి గె లుపులో కీలకపాత్ర పోషించారు. కొన్ని పంచాయతీలను దత్తత తీసుకుని పార్టీ గెలుపునకు కృషి చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేసులో ఆయన ఉన్నట్టు తెలిసింది. విజయనగరం డివిజన్ నుంచి ఈ పదవికి ఎవరూ పోటీ లేకపోవడంతో తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ నెల్లిమర్ల, విజయనగరం ఎమ్మెల్యేలను ఆయన కోరిన ట్టు సమాచారం. వారు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. * అయితే ఇదే పదవి కోసం పార్వతీపురం డివిజన్ నుంచి మరో ఇద్దరు నేతలు పోటీలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి తమ డివిజన్కు ఇవ్వాలని ఆ నేతలు పట్టుబడుతున్నట్టు తెలిసింది. * ఈ మేరకు వారిని బుజ్జగించేందుకు విజయనగరం డివిజన్కు చెందిన కొంత మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంద్కుమార్ పార్టీ కి కావాల్సిన వ్యక్తని, ఈసారికి డ్రాప్ అయిసొమ్మని వారిని వారిస్తున్నట్టు తెలిసింది. -
ఆళ్లగడ్డలో పోటీ వద్దు..?
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలతో సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే జిల్లా టీడీపీ నేతలు మాత్రం బరిలో నిలిచేందుకే మొగ్గుచూపుతున్నారు. పోటీపై పునరాలోచనలో పడడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ట్రాక్ రికార్డును పరిశీలిస్తే గెలిచే అవకాశం లేదన్నది ఒక కారణం కాగా, దీంతోపాటు హుదూద్ తుపాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అల్లకల్లోలమైంది. దీనిపై రాష్ట్ర ప్రజలందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం వల్ల, గత సాంపద్రాయాన్ని కాదని రాజకీయాలు చేస్తున్నారన్న అపప్రద మూటుకట్టుకోవడం ఎందుకన్నది మరోకారణంగా కనిపిస్తోన్నది విశ్లేషకుల భావన. ఇదే భావన టీడీపీ పెద్దల్లోనూ నెలకొనడంతో పోటీపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే పోటీ వద్దని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా టీడీపీ నేతలు ధృవీకరించడం లేదు. సోమవారం సమావేశమయ్యాకే నిర్ణయం వెలువడతుందని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసే అంశంపై తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించనుంది. కాగా, మంగళవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు. సాధారణంగా సెంటిమెంట్తో మంగళవారం రాజకీయ నాయకులు నామినేషన్లు దాఖలు చేయరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా పోటీపై సోమవారం ఉదయమే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. -
గోపాలడుకి ఐ పోటి ఇస్తుందా...