down
-
ఎక్స్ డౌన్: గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.ఆన్లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్ఫామ్ డౌన్డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.X Twitter Down, Users Face Outage: Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025యాప్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్సైట్లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025 -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ఓపెన్ఏఐ (OpenAI)కి చెందిన ఉత్పాదక కృత్రిమ మేధస్సు చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT) సేవల్లో గణనీయమైన అంతరాయాలను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఓపెన్ఏఐ వ్యాఖ్యానించనప్పటికీ, చాట్జీపీటీని ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలను గుర్తించినట్లు వేలాది మంది యూజర్లు అవుట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్లో ఫిర్యాదులను నమోదు చేశారు.అంతరాయాలు కేవలం చాట్జీపీటీని మాత్రమే కాకుండా ఇతర ఓపెన్ఏఐ సేవలను కూడా ప్రభావితం చేశాయి. జీపీటీ-4ఓ (GPT-4o), జీపీటీ-4ఓ మినీ (GPT-4o mini) మోడల్లు డౌన్టైమ్ను ఎదుర్కొన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ‘ఎక్స్’, ఇన్స్టాగ్రామ్లలో వినియోగదారులు తమ అనుభవాలు, ఇబ్బందులను షేర్ చేశారు.ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి రోజువారీ జీవితంలో చాట్జీపీటీ, ఇతర కృత్రిమ మేధస్సు ప్లాట్ఫామ్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇది త్వరలో మానవ మేధస్సును అధిగమించబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ ఒక అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ కూడా ఏఐ కంటే తెలివిగా ఎప్పటికీ ఉండడని పేర్కొన్నారు. ఇటీవల ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించే భవిష్యత్తు గురించి తన దృష్టిని పంచుకున్నారు. త్వరలో తండ్రి కాబోతున్న ఆల్ట్మన్ ఈ మార్పు తరతరాలుగా జీవితంలో సహజమైన భాగంగా ఉంటుందని నమ్ముతున్నారు. -
మెరుపు తగ్గిన ‘మిరప’
సాక్షి, అమరావతి: మిరప మెరుపు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు భారీగా దెబ్బతినడంతో పాటు నల్లతామరతో సహా చీడపీడలు, తెగుళ్ల ప్రభావానికి తోడు మార్కెట్లో ధర లేకపోవడం మిరప రైతులను కలవర పెడుతోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా, 2022లో 5.70 లక్షల ఎకరాల్లో సాగవగా, 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 3.36లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేయగలిగారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15 వేల ఎకరాలకు పైగా వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. సీజన్ ముగిసే నాటికి 4.50 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.అవగాహన కల్పించే వారేరి?సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు కాస్త కలవరపెట్టాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. తెల్లతామర తెగులుతో పాటు ఇతర చీడపీడలపై గడచిన నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రొటోకాల్ మేరకు ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేవారు. ఫలితంగా నల్లతామరతో సహా ఇతర చీడపీడలు, తెగుళ్ల జాడ కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా మచ్చుకైనా కన్పించడంలేదు. నల్లతామర నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు పూజ్యమనే చెప్పాలి.భారీగా పతనమైన ధర2022–23లో క్వింటాకు గరిష్టంగా రూ.27వేల ధర పలకగా, 2023–24 సీజన్లో గరిష్టంగా రూ.29 వేల వరకు పలికింది. అలాంటిది ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు గరిష్టంగా రూ.18,600, కనిష్టంగా రూ.9,500 చొప్పున ధర పలకడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది క్వింటా రూ.50వేలకుపైగా పలికిన బాడిగ రకం మిరపకు ఈసారి రూ.10వేలకు మించి పలకని పరిస్థితి నెలకొంది. మరొక పక్క 2022–23 సీజన్లో ఎకరాకు 18–23 క్వింటాళ్ల చొప్పున 11.50లక్షల టన్నుల దిగుబడి రాగా, 2023–24లో 20–25 క్వింటాళ్ల చొప్పున 12.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుండడంతో 10లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
పురోగతి కోసం ప్రక్షాళన!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్బాల్లో మన టీమ్ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్ఎఫ్ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్ కప్లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్తో కూడా మ్యాచ్ గెలవలేకపోయామని భూటియా అన్నాడు. ‘భారత ఫుట్బాల్కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు. ఏదో విజన్ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్బాల్కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్బాల్ ఫెడరేషన్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్బాల్ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు. -
యూట్యూబ్ డౌన్!.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ యాప్, వెబ్సైట్లో వీడియోలను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు కొందరు యూజర్స్ పిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి యూట్యూబ్లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.యూట్యూబ్లో సమస్య గురించి వచ్చిన ఫిర్యాదుల్లో.. 43 శాతం మంది వినియోగదారులు యాప్తో సమస్య ఉన్నట్లు వెల్లడించారు. 33 శాతం మంది వీడియోను అప్లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు, 23 శాతం మందికి యూట్యూబ్ వెబ్సైట్తో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.నెటిజన్లు ఎదుర్కొన్న సమస్యలను గురించి ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. యూట్యూబ్ డౌన్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమస్య మరువక ముందే.. యూట్యూబ్ సమస్య వచ్చిందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని యూట్యూబ్ టీమ్ పేర్కొంది.Youtube Video Upload But not showing in YouTube application as well as Yt studio please fix this issue as early as possible.... #Youtubedown #Videouploadbutnotshowingproblem @TeamYouTube @YouTubeIndia @YouTubeCreators— Piyush Joshi (@Piyush_j_7) July 22, 2024#YouTube Ka Bhi Systumm Hang Ho Gya Aaj 🤦♀️🤦♀️Upload Nahi Ho Rahi Videos#YoutubeDown— Aditi Shharmaa (@AditiSharma780) July 22, 2024 -
హౌతీల మిసైల్ కూల్చివేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్లోని అల్ హొదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిసైల్ను ఇజ్రాయెల్ డిఫెన్స్ఫోర్స్ (ఐడీఎఫ్) దళాలు మధ్యలోనే దానిని కూల్చివేశాయి.תיעוד: שיגור המיירט בערבה >>@ShaniRami (צילום: אלון וייס, קיבוץ יטבתה) https://t.co/4J3h0Jipsl pic.twitter.com/PnGcJhLIxc— גלצ (@GLZRadio) July 21, 2024 తమ దేశ గగనతలంలోకి ప్రవేశించకముందే క్షిపణిని యారో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని ఇలాట్ నగరంలో ఇప్పటికీ క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐరన్డోమ్) సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాజధాని టెల్అవీవ్పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా యెమెన్లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. మరోవైపు ఐడీఎఫ్ దళాలు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి. హెజ్బొల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడులను లెబనాన్ మీడియా ధృవీకరించింది. -
మైక్రోసాఫ్ట్ డౌన్ : మస్క్ సైటైర్, సోషల్మీడియా మీమ్స్, ఫన్సీ ట్వీట్స్ వైరల్
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. అర్థాంతరంగా విండోస్ స్క్రీన్లపై "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" కనిపించింది. దీంతో మైక్రోసాఫ్ట్ వినియోగదారులంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే అనేక వ్యాపార సంస్థలు బ్యాంకింగ్, విమానయాన రంగ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ సందడి చేశాయి. పనిలో పనిగా టెస్లా అధినే, ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం.మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయంపై స్పందించిన సంస్థ 365 యాప్లు, సేవలను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తినట్టు వివరణ ఇచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని, వీలైనంత త్వరగా దీనిని పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. మస్క్ రియాక్షన్ మస్క్ ఎక్స్లో స్పందిస్తూ ఒక మీమ్కు లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ కాదు..మాక్రోహార్డ్ అంటూ సెటైర్ వేస్తూ పాత ట్వీట్ను రీట్వీట్ చేవారు. అంతేకాదు ఎలన్ మస్క్ జోస్యం నిజ మైందంటున్నార నెటిజన్లు.IT departments: #Microsoft #Windows #bluescreen pic.twitter.com/cwO7x4QqF4— NEELKAMAL MEENA NEWAI (@NEELKAMALBhonda) July 19, 2024 Happy Weekend, thank you #Microsoft #Bluescreen pic.twitter.com/P8NywbSv6S— Parmatma Yadav (@yparmatma561) July 19, 2024 కార్పొరేట్ ఉద్యోగులకు వీకెండ్ ముందే వచ్చిందని కొందరు, సంబరాల్లో ఉద్యోగులు అంటూ మరికొందరి మీమ్స్ , ఫన్నీ జోక్లతో ఇంటర్నెట్ సందడిగా మారింది.… https://t.co/X9a2ghyo4P— Elon Musk (@elonmusk) July 19, 2024 -
ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
విమాన ప్రమాదమనగానే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏదైనా విమాన ప్రమాదం తప్పిందని తెలియనే ఊపిరి పీల్చుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆయా విమానాల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురవుతారు. తాజాగా ముంబైలో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఊహించని విధంగా అదే సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది.ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇక ఈ రెండు విమానాలు సమీపంగా వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024 -
తగ్గిపోయిన కొత్త అఫోర్డబుల్ ఇళ్లు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే అఫోర్డబుల్ ధరల్లోని కొత్త ఇళ్ల సరఫరా జనవరి–మార్చి త్రైమాసికంలో తగ్గింది. ప్రాప్ఈక్విటీ డేటా ప్రకారం హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో 33,420 యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 53,418 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. మరోవైపు 2023 క్యాలెండర్ ఇయర్లో ఈ కేటగిరీలో సరఫరా 20 శాతం తగ్గిందని ప్రాప్ఈక్విటీ ఎండీ సమీర్ జసూజా తెలిపారు. 2022లో ఈ విభాగంలో 2,24,141 యూనిట్లు లాంచ్ కాగా 2023లో కేవలం 1,79,103 యూనిట్లు మాత్రమే లాంచ్ అయినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘రియల్ ఎస్టేట్ ధరలతో పాటు (గత రెండేళ్లుగా కొన్ని నగరాల్లో 50–100 శాతం పెరిగాయి), నిర్మాణ ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో అఫౌర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులనేవి డెవలపర్లకు అంత లాభసాటిగా ఉండటం లేదు‘ అని జసూజా తెలిపారు. కరోనా అనంతరం పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో డెవలపర్లు మధ్య స్థాయి, లగ్జరీ సెగ్మెంట్లపై దృష్టి పెడుతున్నారని, వీటిలో మార్జిన్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. డేటా ప్రకారం హైదరబాద్లో రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే కొత్త ఇళ్ల సరఫరా 2,319 యూనిట్ల నుంచి 2,116 యూనిట్లకు తగ్గింది. చెన్నైలో 501 తగ్గి 3,862 యూనిట్లకు పరిమితమైంది. పుణెలో సరఫరా 12,538 యూనిట్ల నుంచి ఏకంగా 6,836కి పడిపోయింది. బెంగళూరులో 657 యూనిట్లు తగ్గి 3,701కి, కోల్కతాలో 2,747 యూనిట్ల నుంచి 2,204 యూనిట్లకు అఫోర్డబుల్ ఇళ్ల సరఫరా తగ్గింది. -
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) స్తంభించాయి. అవుట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్’ (ట్విటర్)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్బ్లాక్స్ రెండు సామాజిక వెబ్సైట్లు (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్లో పేర్కొంది. -
మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ సేవలు గడిచిన 24 గంటల్లో పలుసార్లు నిలిచిపోయాయి. యూజర్లు టెలిగ్రామ్లో మెసేజ్లు పంపడం, డౌన్లోడ్, లాగిన్ చేసేపుడు ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదు చేశారు.దాదాపు 6700 మందికిపై టెలిగ్రామ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్డిటెక్టర్ డేటా ద్వారా తెలిసింది. మొత్త ఫిర్యాదు చేసిన వారిలో 49 శాతం మంది మెసేజ్లు పంపించడంతో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. 31 శాతం మంది యాప్ పనిచేయలేదని, 21 శాతం మంది లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.Twitter users to telegram users right now#telegramdown pic.twitter.com/X4gP9hYn1R— Dr.Duet🇵🇸 (@Drduet56) April 26, 2024ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, లక్నో, పాట్నా, జైపుర్, అహ్మదాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.అయితే ఇప్పటివరకు టెలిగ్రామ్ ఈ సమస్యపై స్పందించలేదు. ఇలా ప్రముఖ యాప్లో సమస్య ఎదురైందనే వార్త క్షణాల్లో వైరల్ అవ్వడంతో వాటికి సంబంధించి ట్విటర్లో చాలా మీమ్స్ చక్కర్లు కొట్టాయి.telegram users rn#telegramDownpic.twitter.com/wz7KYfLwIS— F. 🇵🇸🚩 (@aaatankwaadi) April 26, 2024 -
స్తంభించిన యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్ల గగ్గోలు!
ప్రముఖ ఉచిత వీడియో-షేరింగ్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్ (YouTube) కొద్దిసేపటి నుంచి కంటెంట్ క్రియేటర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కంటెంట్ క్రియేటర్లు గగ్గోలు పెడుతూ యూట్యూబ్ సమస్యను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. వివిధ వెబ్సైట్లు, సర్వీస్ స్టేటస్ గురించి యూజర్లకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ డౌన్డెటెక్టర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు వేల సంఖ్యలో క్రియేటర్లు తెలియజేశారు. తమ దగ్గరున్న వీడియోలను అప్లోడ్ చేసినా.. అవి రియల్టైంలో యూజర్లకు కనిపించడం లేదని తెలిపారు. ఏం జరిగిందంటే.. డౌన్డెటెక్టర్ ప్రకారం.. 80 శాతం మంది క్రియేటర్లు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. అయితే ఈ సమస్య కేవలం భారతీయ యూజర్లలకు మాత్రమే తలెత్తిందా లేదా ప్రపంచవ్యాప్తంగా ఇలా జరిగిందా అనేది తెలియరాలేదు. ప్రధానంగా న్యూస్ ఛానళ్ల నుంచి ఫీడ్/ వీడియోలు/ లైవ్ రాకపోవడంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. అలాగే కంటెంట్ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే క్రియేటర్లు కూడా దీనిపై యూట్యూబ్కు సర్వీస్ రిక్వెస్ట్లు పంపించారు. వర్కింగ్ డే కావడం, అందునా భారతీయ కాలమానం ప్రకారం పీక్ టైంలో ఇలాంటి సమస్య రావడంతో యూట్యూబ్ ఆధారిత వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. Any YouTube Server Down or any other issues please clarify I go live and upload shorts but nothing shown in channel and yt studio #YouTubeDown @YouTubeCreators @YouTubeIndia https://t.co/qnIvSd0OiV — Nithish R Yuvirosk (@OneNimitPlzz_NR) February 27, 2024 -
‘ఎక్స్’లో పోస్టులు మాయం.. యూజర్ల గగ్గోలు!
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ఎక్స్ (ట్విటర్) సేవల్లో తరచూ అంతరాయం కలుగుతోంది. ఇటీవల మొరాయించిన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాం రోజుల వ్యవధిలో మళ్లీ స్తంభించడంతో యూజర్ల గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గురువారం ఉదయం 11 గంటల తర్వాత ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అకౌంట్ను యాక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఏం జరిగిందో తెలియక లక్షలాదిమంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ఓపెన్ అవుతున్నా.. అసంపూర్తిగా ఉండడంతోపాటు పోస్టలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. తమ పోస్టులు కూడా కనిపించకుండా పోయాయని కొందరు యూజర్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తమకు ఎక్స్ అకౌంట్ యాక్సెస్ లభించలేదంటూ 67 వేల మందికిపైగా ఫిర్యాదు చేశారు. ఇండియన్ వెర్షన్ వెబ్సైట్స్కు ఇలాంటి ఫిర్యాదులు 4,800 వచ్చాయి. అయితే సేవల్లో అంతరాయంపై ఎక్స్ ఎలాంటి స్పందనా రాలేదు. -
భారీగా క్షీణించిన ఎఫ్డీఐలు.. కేమన్ ఐల్యాండ్స్, సైప్రస్ వెనకడుగు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఆరు నెలల(ఏప్రిల్–సెప్టెంబర్)లో కేమన్ ఐలాండ్స్, సైప్రస్ నుంచి భారత్కు వచ్చిన ఎఫ్డీఐలు భారీగా క్షీణించాయి. వెరసి దేశీయంగా నమోదైన ఎఫ్డీఐలు 24 శాతం బలహీనపడ్డాయి. కేమన్ ఐల్యాండ్స్ నుంచి 75 శాతం తగ్గి 14.5 కోట్ల డాలర్లకు పరిమితంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో 58.2 కోట్ల డాలర్లు లభించాయి. ఇక సైప్రస్ నుంచి మరింత అధికంగా 95 శాతం పడిపోయి 3.5 కోట్ల డాలర్లకు చేరాయి. గతంలో 76.4 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. ఇందుకు ఈ రెండు దేశాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించడం ప్రభావం చూపింది. ఈ బాటలో సింగపూర్, యూఏఈల నుంచి సైతం పెట్టుబడులు వెనకడుగు వేశాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా యూఎస్, ఇతర పశ్చిమ దేశాలలో వడ్డీ రేట్లు పెరగడం, తూర్పు యూరప్, పశ్చిమాసియాలలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు తదితర అంశాలు భారత్కు వచ్చే ఎఫ్డీఐలను దెబ్బతీసినట్లు రెగ్యులేటరీ, నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్నర్ అంజలీ మల్హోత్రా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైప్రస్ పెట్టుబడులు వార్షికంగా 62 శాతం తగ్గినట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సంజయ్ కుమార్ తెలియజేశారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి కేమన్ ఐల్యాండ్స్ను ఎఫ్ఏటీఎఫ్ రిస్కుల జాబితా(గ్రే లిస్ట్) నుంచి తప్పించడంతో రానున్న కాలంలో భారత్కు పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 199 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి 0.9 శాతం అధికంగా ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 74.96 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిన ప్రతిసారీ బీజేపీకి, తగ్గినప్పుడు కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతూ వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుందనే దానిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రాజస్థాన్లో గత ఐదు సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే, ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం వస్తోంది. గత 20 ఏళ్ల ఓటింగ్ ట్రెండ్ కూడా ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ లాభపడిందని, ఓటింగ్ పెరిగినప్పుడు బీజేపీకి లబ్ధి చేకూరిందని తెలుస్తోంది. దీంతో డిసెంబరు 3న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాత ట్రెండ్ కొనసాగుతుందో లేదో అనేది ఆరోజున తేలిపోనుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని 20 ఏళ్ల రాజస్థాన్ ఎన్నికల చరిత్ర చెబుతోంది. 1998 ఎన్నికల్లో 63.39 శాతం ఓటింగ్ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గెహ్లాట్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2003 ఎన్నికల్లో ఓటింగ్ 3.79 శాతం పెరిగింది. 67.18 శాతం ఓటింగ్ జరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వసుంధర రాజే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2008లో రాష్ట్రంలో 66.25 శాతం ఓటింగ్ నమోదై, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఓటింగ్ శాతం 0.93 శాతం తగ్గింది. గెహ్లాట్ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 2013 ఎన్నికల్లో మరోసారి 8.79 శాతం ఎక్కువ ఓటింగ్ రావడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. రాజే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో 0.98 శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. మొత్తం 74.06 శాతం ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో తక్కువ ఓటింగ్ శాతం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో బీజేపీకే విజయావకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్ఫేక్లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
అగ్రి - టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు డౌన్ - మరింత తగ్గే అవకాశం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల ప్రభావం దేశీ అగ్రి - టెక్ స్టార్టప్పైనా పడుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో (2021–22, 2022–23) వాటిలో పెట్టుబడులు 45 శాతం మేర పడిపోయాయి. అటు 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయంగా అగ్రి - టెక్ పెట్టుబడులు 10 శాతం మేర తగ్గాయి. కన్సల్టింగ్ సంస్థ ఎఫ్ఎస్జీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫండింగ్ తగ్గుదల కొనసాగవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకోగలదని నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిలదొక్కుకునేందుకు అంకుర సంస్థలు లాభదాయకతపైనా దృష్టి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కొనసాగించవచ్చు. తమ దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న నిధులను.. ఇప్పటికే నిలదొక్కుకున్న వ్యాపారాలవైపు మళ్లించే అవకాశం ఉంది‘ అని ఎఫ్ఎస్జీ వివరించింది. ‘పెట్టుబడుల తీరు మారిపోతుండటం.. అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల ప్రభావం దేశీ అగ్రి–టెక్ రంగంపై ఎలా ఉంటాయనేది తెలియజేస్తోంది. పెట్టుబడులు మందగించిన ఈ తరుణాన్ని స్టార్టప్లు.. తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లాభదాయకతవైపు మళ్లేందుకు ఉపయోగించుకోవాలి‘ అని సంస్థ ఎండీ రిషి అగర్వాల్ తెలిపారు. డీల్స్ పెరిగినా ఫండింగ్ తగ్గింది.. నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల డీల్స్ 121 నమోదు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 140కి చేరాయి. కానీ, అగ్రి–టెక్ స్టార్టప్లు సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఆర్థిక సంవత్సరంలో 1,279 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 706 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరంలో అగ్రి–టెక్ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల బూమ్ వచ్చి, వాటి వేల్యుయేషన్స్ అసాధారణ స్థాయులకు ఎగిశాయి. కానీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కరెక్షన్ రావడంతో కొంత విచక్షణాయుతమైన పెట్టుబడుల వాతావరణం నెలకొంది. -
సాక్షి మనీ మంత్రా: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు FPI అమ్మకాల నేపథ్యంలో ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు చివరి దాకా అదే ధోరణి కొనసాగించాయి. చివరికి సెన్సెక్స్ 316 పాయింట్లు కోల్పోయి 65,512 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పడి 19,528 వద్ద ముగిసింది. ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. దీంతో నిఫ్టీ 19,500 దిగువకు చేరింది. అయితే క్యాపిటల్ గూడ్స్ , పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్లలో కొనుగోళ్లతో మిడ్ సెషన్లో నష్టాల తగ్గాయి.నిఫ్టీలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ టాప్ లూజర్గా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫిన్సర్వ్ అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. రూపాయి: అటు డాలరుమారకంలో రూపాయి కూడా 83.20వద్ద నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ
Today StockMarket Closin: దేశీయ స్టాక్మామార్కెట్లు వారాంతంలో కూడా నష్టాల ఇన్వెస్టర్లను నిరాశ పర్చాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ లాభ నష్టాల ఒడిదుడుకులకు లోనైంది. పీఎస్యూ బ్యాంకులు, ఐటీ, మెటల్స్, ఫార్మా ఒత్తిడికి లోనయ్యాయి. చివరి 221 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్ 66,009 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 19,674 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వరుస నష్టాలతో నిఫ్టీ వారాంతంలో 19700 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేవలం నాలగు ట్రేడింగ్ సెషన్ల నష్టాలతో లక్ష కోట్ల మార్కెట్లు కోల్పోయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, ఎం అండ్ఎం ఎస్బీఐ, కోల్ ఇండియా టాప్ గెయనర్స్గా నిలవగా, డా.రెడ్డీస్, విప్రో,యూపీఎల్, బజాజ్ ఆటో, సిప్లా టాప్ లూజర్స్గా ఉన్నాయి. రూపాయి: గురువారం ముగింపు 83.09 పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 19పైసలు ఎగిసింది. 82.93 ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో బ్లడ్ బాత్..రోజంతా నష్టాలే
Bloodbath in Today StockMarket: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా పతనమైన మార్కెట్ రోజంతానష్టాలతోనే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 620 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 19,730 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్ 571 పాయింట్టు కుప్పకూలి 66,230 వద్ద నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19742 వద్ద ముగిసింఇ. ఆటో, బ్యాంక్, ఫార్మా సూచీలుతోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కొనసాగింది. యాక్సిస్; హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండస్,కోటక్ మహీంద్ర, పీఎన్బీ, ఫెడలర్, ఎస్బీఐ, తదితర బ్యాంకింగ్ షేర్ల నష్టాలో నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇండా ఎంఅండ్ఎం, సిప్లా, హీరో మోటో కార్ప్ ఇతర టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు అదానీ పోర్ట్స్,టెక్ మహీంద్ర, ఏసియన్ పెయింట్స్, డా. రెడ్డీస్ బీపీసీఎల్, లాభపడ్డాయి. రూపాయి: బుధవారం ముగింపు 83.07తోపోలిస్తే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయి 83.09 వద్ద ముగిసింది -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో భారీ నష్టాలు
Today Stock Market Closing: దేశీయ స్టాక్మార్కెట్లు పండగరోజు విరామం తరువాత భారీ పతనాన్నినమోదు చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.వరుగా రెండో సెషన్లో పతనమైనాయి. చివరికి సెన్సెక్స్796 పాయింట్లు పతనమై 66,800 వద్ద, నిఫ్టీ 239 పాయింట్ల నష్టతో 19, 901వద్ద స్థిరపడింది. బ్యాంకులు, ఫైనాన్షియల్లు, టెక్నాలజీ, మెటల్స్,ఎనర్జీ స్టాక్ల మార్కెట్ను ప్రభావితం చేవాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 19,900 స్థాయిని తాకింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద, బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) దాదాపు రూ. 2.60 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. హెచ్డీఎఫ్సీ ఏకంగా 4 శాతం కుప్పకూలాగా రిలయన్స్ 2.5 శాతం నష్టపోయింది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, సన్ ఫార్మ, ఏసిన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలవగా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్,రిలయన్స్ బీపీసీల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికనిపించింది. రూపాయి: సోమవారం నాటి ముగింపు 83.27తో పోలిస్తే బుధవారం డాలర్మారకంలో దేశీయ కరెన్సీ 19 పైసలు పెరిగి 83.08 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లో స్టాక్మార్కెట్లు
Today Stockmarket Opening దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతవారం లాభాలతో మురిపించిన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో దాదాపు 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 67,754 వద్ద ,నిఫ్టీ 15 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 20,177 వద్ద ఉంది. తద్వారా కీలక 20 వేలకు ఎగువన సాగుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, కోల్ ఇండియా లాభపడుతుండగా, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, విప్రో, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,నెస్టే నష్టపోతున్నాయి. మరోవైపు ఈ రోజు పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల కొనసాగే అవకాశం ఉంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం
Today Gold and Silver Price పండుగల వేళ బంగారం ప్రియులకు తీపి కబురు. భారతీయ మార్కెట్లో రెండు రోజులు వరుసగా పెరిగిన వెండి బంగారం ధరలు (సెప్టెంబర్ 13, 2023 )బుధవారం దిగి వచ్చాయి. దేశవ్యాప్తంగా వెండి బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి.22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.340 మేర తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.380లు తగ్గి 59,450 పలుకుతోంది. వెండి కిలో ఏకంగా వెయ్యి రూపాయిలు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 73,500గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 74 లేదా 0.13 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ. 58,592 వద్ద ఉంది. క్రితం ముగింపు రూ.58,626గా నమోదైంది. అదేవిధంగా డిసెంబర్ 5, 2023న వెండి ఫ్యూచర్స్ రూ. 385 లేదా 0.54 శాతం పతనాన్ని చవిచూశాయి .మునుపటి ముగింపు రూ. 71,934తో పోలిస్తే కిలోకు రూ. 71,750 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా బుధవారం నాడు బంగారం ధరలు పడిపోయాయి. అయితే మునుపటి సెషన్లో రెండు వారాల కనిష్ట స్థాయికి స్వల్పంగా అధిగమించాయి. . అమెరికా మార్కెట్, ద్రవ్యోల్బణ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుందా అనే కీలక అంశాలకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.1 శాతం తగ్గి 1,910.87 డాలర్లు వద్ద ఉంది. ఆగస్టు 25 తరువాత నిన్న(మంగళవారం) 1,906.50 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్స్కు 0.8 శాతం తగ్గి 22.92 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నాయి.సెన్సెక్స్ ఏకంగా 330 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 20090 వద్ద రికార్డు స్తాయిలో కొనసాగుతోంది. -
భారీ ఊరట: దిగొచ్చిన ద్రవ్యోల్బణం
ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. జూలై 7.44 శాతం నుండి 6.83 శాతానికి తగ్గి స్వల్ప ఊరట నిచ్చింది. అయితే ఆర్బీఐ 2-6 శాతం పరిధితో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) తాజా డేటా ప్రకారం జూలైతో పోల్చితే ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. జూలైలో 7.44 శాతం వద్ద 15 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో తగ్గి 6.83 శాతానికి చేరుకుంది. అలాగే జులైతో పోల్చితే ఆగస్టు నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి 10 శాతం దిగువకు చేరింది. జులైలో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.94 శాతానికి చేరుకుంది.అయితే పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.59 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 26.14 శాతానికి దిగి వచ్చింది. అలాగే పాలు, ఇతర పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.34 శాతం నుంచి తగ్గి 7.73 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు తాజా డేటా బుధవారం నాటి స్టాక్మార్కెట్ను ప్రభావితం చేయనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం కొంతవరకు కారణం.అయితే, ఈ కాలంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు మరియు పండ్ల వంటి కొన్ని అవసరమైన వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయయి. ద్రవ్యోల్బణాన్ని గణించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఆహార ధరలు, దేశవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులు బాగా ప్రభావితం చేశాయి.ముఖ్యంగా టొమాటోలు , ఉల్లిపాయలు వంటి ప్రధానమైన వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. -
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
‘మూసీ’కి పెరిగిన ఇన్ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లో ముగిసిన మార్కెట్, అదానీ జోరు
TodayStockMarketClosingదేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సేచీలు చివరికి వారాంతంలో నెగిటివ్గానే ముగిసాయి. సెన్సెక్స్ 202.36 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 64,949వద్ద, నిఫ్టీ 55.10 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 19,310 ముగిసాయి. ఎఫ్ఎంసిజి, పవర్ మినహా దాదాపుఅన్ని రంగాలునష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 1.5 శాతం, మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలుప్రతికూలంగా ముగిశాయి. అయితే పెట్టుబడుల జోష్తో అదానీ గ్రూపు షేర్లుభారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ దాదాపు 3 శాతం ఎగిసాయి. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు లాభాలనార్జించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ డేట్ ప్రకటించడంతో రిలయన్స్ లాభపడింది. ఇంకా ఐషర్ మోటార్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంకు లాభపడిన వాటిల్లోఉండగా కోల్ ఇండియా, హీరోమోటో కాప్, టెక్ మహీంద్ర, టీసీఎస్, హిందాల్కో టాప్ లూజర్స్గా ఉన్నాయి. (ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?) అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.15తో పోలిస్తే స్వల్పంగా పెరిగి 83.10 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి
Gold Price Today: పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. శ్రావణ మాసం తొలి రోజునే బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు (ఆగస్ట్ 17) బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయిన నేపథ్యంలో దేశీయంగా కూడా పసిడి ధరలు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి ఊరట లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధర గురువారం 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.350 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం నమోదైన బంగారం ధరలను పరిశీస్తే.. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100గా ఉంది. బుధవారంతో పోల్చితే 10 గ్రాములపై రూ. 350 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 59,020లుగా ఉంది. బుధవారంతో పోల్చితే రూ. 380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. వెండి ధర తగ్గుముఖం బంగారం తర్వాత అత్యంత ప్రీతికరమైన లోహం వెండి ధర కూడా గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.500 మేర తగ్గింది. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,700గా ఉంది. అంతకు ముందు రోజు రూ.76,200గా ఉండేది. ఇదీ చదవండి: దేశంలోని వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు -
నష్టాలు తగ్గుతాయి! దేశీయ ఎయిర్లైన్స్కు ఊరట
ముంబై: దేశీయ ఎయిర్లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు మరింత తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నష్టాలు రూ.5,000–7,000 కోట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదల సానుకూలంగా ఉండడం ఎయిర్లైన్స్ ఆదాయ వృద్ధికి సాయపడుతుందని తెలిపింది. ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతోపాటు, డాలర్తో రూపాయి క్షీణించడం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఎయిర్లైన్స్ నష్టాలు రూ.11,000–13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఏటీఎఫ్ ధరలు త్రైమాసికం వారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం అనే సవాళ్లను దేశీ ఎయిర్లైన్స్ పరిశ్రమ ఎదుర్కొన్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై నెలలో ప్రయాణికుల సంఖ్య 1.22 కోట్లుగా నమోదైందని, క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఏవియేషన్ రంగానికి స్టెబుల్ రేటింగ్ (స్థిరత్వం) ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వేగంగా రికవరీ కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాతో స్థిరత్వం రేటింగ్ను ఇచ్చింది. గణనీయంగా తగ్గిన నష్టాలు ఎయిర్లైన్స్ పరిశ్రమ 2021–22లో రూ.23,500 కోట్లు నష్టపోవడం గమనార్హం. దీంతో పోలిస్తే 2022–23లో నష్టాలు గణనీయంగా తగ్గాయి. తొలుత రూ.17,000 కోట్ల వరకు రావచ్చని ఇక్రా అంచనా వేయగా, వాస్తవ నష్టాలు రూ.11,000–13,000 కోట్లకు పరిమితం అయ్యాయి. ఎయిర్లైన్స్ సంస్థలు కాస్ట్ ఆఫ్ అవైలబుల్ సీట్ కిలోమీటర్ను మెరుగుపరుచుకున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే సగానికి తగ్గుతాయని అంచనా. పరిశ్రమలో టారిఫ్ల పరంగా క్రమశిక్షణ నెలకొనడంతో ఈ ధోరణి కొనసాగుతుందని ఇక్రా తెలిపింది. ఏటీఎఫ్ ధరలు కొంత తగ్గడం కలిసొస్తుందని పేర్కొంది. జూలైలో విమానయానం 25 శాతం అప్.. దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య జూలైలో 25 శాతం ఎగిసింది. 1.21 కోట్లుగా నమోదైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం గతేడాది జూలైలో విమాన ప్రయాణికుల సంఖ్య 97.05 లక్షలుగా నమోదైంది. తాజాగా గత నెల విమానయాన సంస్థ ఇండిగో 76.75 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 63.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్లో భాగమైన ఎయిరిండియా 11.98 లక్షల మంది ప్రయాణికులు 9.9 శాతం మార్కెట్ వాటాతో తర్వాత స్థానంలో ఉంది. ఇక టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార 10.20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి 8.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిర్ఏషియా ఇండియా (ఏఐఎక్స్ కనెక్ట్) 9.01 లక్షల ప్రయాణికులు (7.5 శాతం వాటా), ఆకాశ ఎయిర్ 6.24 లక్షల మంది ప్యాసింజర్లను (5.2 శాతం వాటా) గమ్యస్థానాలకు చేర్చాయి. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న స్పైస్జెట్ 5.04 లక్షల మంది ప్రయాణికులు, 4.2 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది. సమయ పాలన విషయంలో ఇండిగో 86.8 శాతంతో అగ్ర స్థానంలో నిల్చింది. -
బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!
దేశంలో బంగారం ధరలు స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల కాస్త పుంజుకున్న ధరలు సోమవారం మాత్రం అక్కడక్కడే కదలాడుతున్నాయి. గతం వారం పది గ్రాములకు రూ. 60 వేలకు పైన ఉన్న పసిడి ఒక దశలో 60వేల దిగువకు వచ్చింది. ప్రస్తుతం మద్దతు స్థాయిల వద్ద కొనసాగుతోంది. గత వారం బాగా పెరిగిన వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్లో 80 వేల దిగుకు చేరింది. హైదరాబాద్లో స్వల్పంగా ఎగిసిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,150 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.60,160 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఇక వెండి రూ. 200 తగ్గి 78,300 గా ఉంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.60,310 పలుకుతోంది. ఢిల్లీలో కిలో వెండి 75,100గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఎంసీఎక్స్లో పతనం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో (ఆగస్ట్ 7, 2023 సోమవారం)బంగారం , వెండి ధరలు రెండూ పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 91 లేదా 0.15 శాతం స్వల్ప తగ్గుదలని నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ.59,436గా ఉంది. క్రితం ముగింపు రూ.59,527గా నమోదైంది. అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న వెండి ఫ్యూచర్లు రూ. 300 లేదా 0.41 శాతం క్షీణతను చవిచూశాయి. మునుపటి ముగింపుతో పోలిస్తే MCXలో కిలో రూ. 72,178 వద్ద రిటైల్ అవుతున్నాయి. ఎక్సైజ్ సుంకం, మేకింగ్ ఛార్జీలు, పన్నుల వంటి నిర్దిష్ట పారామితుల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధర మారుతూ ఉంటుందనేది గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధర అమెరికాలో జాబ్ గ్రోత్మందగింపు నేపథ్యంలో సోమవారం బంగారం ధరలు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఉద్యోగ వృద్ధి డాలర్, బాండ్ ఈల్డ్స్ ఫలితాలు పసిడి గరిష్ట స్థాయినుంచి దిగజారాయి.. తాజా నివేదిక ప్రకారం, స్పాట్ గోల్డ్ 0325 ఔన్స్కు 1,940.99 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. స్పాట్ వెండి ఔన్స్కు 0.3శాతం తగ్గి 23.54 డాలర్ల వద్ద , ప్లాటినం 0.4శవాతం లాభంతో 926.05డాలర్లు వద్ద, పల్లాడియం 0.5శాతం లాభపడి 1,263.26డాలర్లకి చేరుకుంది. -
సాక్షి మనీ మంత్రా: కుప్పకూలిన స్టాక్మార్కెట్
Sensex tanks, Nifty down: దేశీయస్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు చివరల్లో కాస్త కోలుకున్నాయి. ఒక దశలో 1000 పాయింట్లు దాకా కుప్పకూలింది మార్కెట్. చివరకు సెన్సెక్స్ 677 పాయింట్ల మేర పతనమై 65783వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో 19,514 వద్ద ముగిసింది. అయితే ఇంట్రా-డే కనిష్ట స్థాయిలనుంచి కోలుకుంది. ముఖ్యంగా అమెరికా సావరిన్ రేటింగ్ను ఫిచ్ కోత పెట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా మారాయి. దీనికితోడు జూలై నెల ఆటోసేల్స్ ఆటో రంగ షేర్లను ప్రభావితం చేశాయి. దివీస్, నెస్లే, హెచ్యూఎల్, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర టాప్ గెయినర్స్గా ఉండగా, హీరోమోటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్గా మిగిలాయి. నిఫ్టీ బ్యాంక్ 597 పాయింట్లు పడిపోయి 44,996 స్థాయికి, మిడ్క్యాప్ ఇండెక్స్ 501 పాయింట్లు 37,233కి పడిపోయింది. ఫలితంగా దాదాపు రూ. 2.61 లక్షల కోట్ల బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది. అటు డాలరుమారకంలో రూపాయి 82.58 వద్ద నెగిటివ్గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
కొనుగోలుదారులకు గుడ్ న్యూస్, దిగొస్తున్న పసిడి, వెండి ధరలు
Today August 2nd gold and silver prices: హైదరాబాద్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. శ్రావణ మాసంలో బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈనేపథ్యంలో వరుస సెషన్లలో బంగారం కాస్త నెమ్మదిస్తున్నారు.తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 300 రూపాయలు క్షీణించి రూ. 55,110 గా ఉంది.అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 330 రూపాయలు తగ్గి రూ. 66110గా ఉంది. అటు వెండి ధర కూడా తగ్గింది. కిలోవెండి ధర 700 రూపాయలు పతనమై రూ. 80,300గా ఉంది. ( దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు (ఆగస్టు 2) బంగారం ధరలకోసం క్లిక్ చేయండి) దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 1 కేజీ వెండి ధర ఢిల్లీ- రూ.77,300 చెన్నై- రూ. 80,300 ముంబై - రూ. 77,300 కోల్కతా - రూ. 78,000 బెంగళూరు - 76,500 ఎంసీఎక్స్ షాక్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మంగళవారం భారత మార్కెట్లో క్షీణించిన పసిడి ధరలు ఆగస్టు 2, బుధవారం బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 182 లేదా 0.31 శాతం స్వల్ప పెరుగుదను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ అమెరికా డాలర్తోపోలిస్తే బుధవారం బంగారంధర పెరిగింది. ట్రెజరీ దిగుబడులు, ఆసియా స్టాక్లు ఫిచ్ అమెరికా ట్రిపుల్-ఎ క్రెడిట్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేయడంతో డాలర్ బలహీన పడింది. దీంతో సురక్షితమైన బులియన్పై ఆసక్తిని పెంచిందని రాయిటర్స్ నివేదించింది. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్స్కు 1,946.97 డాలర్లగానూ, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,984కి డాలర్లు చేరుకుంది. -
స్తంభించిన మార్గదర్శి చిట్ఫండ్ వెబ్సైట్.. ఖాతాదారుల్లో అనుమానాలు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్ స్తంభించింది. నిర్వహణ సమస్య వలన నిలిచిపోయినట్లు మార్గదర్శి పేర్కొంది. త్వరలో పునరుద్ధరిస్తామంటూ మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ వెల్లడించింది. అకస్మాతుగా మార్గదర్శి వెబ్సైట్ స్తంభించడంపై ఖాతాదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శుక్రవారం.. ఏపీ సీఐడీ కీలక ప్రెస్మీట్ నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని, మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐడీ వెల్లడించింది. ‘‘మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశాం. రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైంది’’ అని సీఐడీ పేర్కొంది. చదవండి: ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్మీట్ -
దిగొస్తున్న పసిడి, వెండి భారీ పతనం
Gold Price Today 28th July అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేటుపెంపుతో శుక్రవారం బంగారం ధరలు దిగి వచ్చాయి. శ్రావణ శుక్రవారం సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం శుభ సంకేతంగా మారింది. అటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. యూఎస్ ఫెడ్ రీసెంట్ రివ్యూలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేపు పెంపుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు దూసుకు పోతోందన్న అందోళన మొదలైంది. దీంతో అమెరికా కరెన్సీ డాలరు నష్టాల్లోకి జారుకుంది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలపై చూపుతోంది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) హైదరాబాదులో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకి 350 రూపాయలుదిగి వచ్చి ధర రూ. 55,100 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 380 పతనమై రూ. 60,110 గా ఉంది. వెండి ధర కూడా దిగి వచ్చి 80 వేల దిగువకు చేరింది. ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ వస్తున్న వెండి ధర శుక్రవారం ఏకంగా 2 వేల రూపాయలు పతనమైంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 79,500 గాఉంది. (హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్తో రీఎంట్రీ!) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి కొద్దిగా పుంజుకుంది. ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 59,565 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కూడా రూ.128 లేదా 0.17శాతం పెరిగి కిలోకు రూ.73,875 వద్ద ట్రేడవుతున్నాయి. (ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) అంతర్జాతీయంగా బంగారం ధరలు వోలటైల్గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.3శాతం పెరిగి ఔన్స్కు 1,951.19 డాలర్లుగా ఉంది. అంతకుముందు జూలై 12న కనిష్ట స్థాయిని తాకింది. అలాగే మునుపటి సెషన్లో 1.4 శాతం క్షీణించింది. ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 0.4శాతం పతనాన్ని నమోదుచేసింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్కు 0.2 శాతం పెరిగి 1,950డాలర్ల వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాల్టి బంగారం ధరలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి! -
సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్బుకింగ్, 440 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ మిడ్సెషన్నుంచి ప్రాఫిట్ బుకింగ్తో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్ నిర్ణయం, జూలై సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల గడువు ఈరోజున ముగియనుండటంతో దాదాపు అన్ని రంగాలు రెడ్లోకి జారుకోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆటో, ఆయిల్ & గ్యాస్, మెటల్, ఎఫ్ఎంసిజి పేర్లలో అమ్మకాల ప్రభావితం చేశాయి. అయితే ఫార్మా ఇండెక్స్ 3 శాతం, రియల్టీ ఇండెక్స్ 2 శాతం పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 440.38 పాయింట్లు లేదా 0.66 శాతం క్షీణించి 66,267 వద్ద, నిఫ్టీ 118.40 పాయింట్లు లేదా 0.60 శాతం క్షీణించి 19,660 వద్ద ముగిసాయి. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి నిఫ్టీ టాప్ లూజర్స్లో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిప్లా, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్ ,భారతీ ఎయిర్టెల్ లాభపడ్డాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!
IRCTC down: ఐఆర్సీటీసీ వినియోగదారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారిక వెబ్సైట్, యాప్లో రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు సమస్యలపై యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన, ఫిర్యాదులు స్క్రీన్షాట్లతో సోషల్ మీడియా హోరెత్తితింది. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది. ప్లాట్ఫారమ్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడయ్యాని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ల కోసం కేటాయించిన స్లాట్లతో టైమింగ్ క్లాష్ అవ్వడంతో వినియోగదారులు మరింత ఇబ్బంది పడ్డారు. ఏసీ (2A/3A/CC/EC/3E) తత్కాల్ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతికి (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో దాదాపు ఉదయం 8 గంటలనుంచే చెల్లింపులకు సంబంధించిన సమస్యల గురించి కూడా ఫిర్యాదులు మొదలైనాయి. "సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ సేవ అందుబాటులో లేదు. మా సాంకేతిక బృందం సమస్యను పరిష్కరిస్తోంది. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన వెంటనే మేము తెలియజేస్తాము." ఐఆర్సీటీసీ ట్వీట్లో తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయంగా అమెజాన్, మేక్మైట్రిప్ తదితర B2C ప్లేయర్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చుని తెలిపింది. Not able to tatkal booking ticket... Facing some error in #IRCTC app... Please dot the something... I have emergency to back to my home...@IRCTCofficial @RailwaySeva#railways — Vijay Arya (@Im_vijayarya) July 25, 2023 #irctc As usual down ... Can't book tickets Two times banking transactions failed.... Waiting for refund and no further booking @AshwiniVaishnaw@RailwaySeva @RailMinIndia pic.twitter.com/TOPJdXiuy8 — Dhimant Bhatt (@dhimantbhatt) July 25, 2023 కాగా ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా 5 కోట్ల రెగ్యులర్ యూజర్లు ప్రతీ రోజూ సైట్ లో టికెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటారని అంచనా. Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.— IRCTC (@IRCTCofficial) July 25, 2023 -
ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ
వెంగళరావునగర్: యూసుఫ్గూడ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్గా పి.మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఏకే మిశ్రా బదిలీపై వెళ్లారు. కొండాపూర్లోని 8వ పటాలంలో విధులు నిర్వహించే మురళీకృష్ణను ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్గా నియమించారు. మురళీకృష్ణకు ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పటాలం సిబ్బంది చేసిన పరేడ్లో ఆయన పాల్గొన్నారు. వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ బెటాలియన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజాసేవలో తమవంతు బాధ్యతలు నెరవేర్చడంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది ముందుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ సత్యనారాయణ, రంగారెడ్డి, జవహర్లాల్, నరసింహ, ఆర్ఐలు సురేష్, ధర్మారావు, సాంబయ్య, శంకర్, జాఫర్, రవీందర్, రాజేశం, ఆర్ఎస్ఐలు, ఇతర ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ లేఆఫ్స్డౌన్ ట్రెండ్లో ఐటీ.. టెకీల తొలగింపులో బెంగళూరు టాప్
సాక్షి, హైదరాబాద్: లేఆఫ్స్ పెరుగుదలతో టెకీలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా టెకీల ఉద్వాసన పర్వం ఉధృతమవుతోంది. అమెరికా, ఐరోపాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణపెంపుతో ఐటీ, ఇతర కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. ఆర్థికరంగ ఒడిదొడుకుల కారణంగా స్టార్టప్లలో పెట్టుబడుల సంఖ్య కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఆరునెలల్లోనే 2,13,020 మంది టెకీలకు ఉద్వాసన 2023లో (జనవరి నుంచి జూన్) ప్రపంచవ్యాప్తంగా 2,13,020 మంది ఉద్యో గులకు ఉద్వాసన పలికినట్టు లేఆఫ్స్. ఎఫ్వైఐ వెబ్సైట్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 45,166 టెకీలు ఉద్యోగాలు కోల్పో గా, ఈ ఆరునెలల్లో ఉద్యోగుల లేఆఫ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగులను తొలగించిన జాబితాలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహు, మెటా, జూమ్ ఉన్నాయి. భారత్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గర ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా 10,774 మంది టెకీలను తొలగించినట్టు లేఆఫ్స్.ఎఫ్వైఐ నివేదిక వెల్లడించింది. 2022లో ఉద్వాసనకు గురైన టెకీ ఉద్యోగుల సంఖ్య 6,530. ఈ ఏడాదితో పోల్చి చూసినప్పుడు తొలి ఆరునెలల్లో టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నవారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ విజృంభించిన 2020లోనూ భారత్లోని 12,932 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పో యారు. 2021లో కొత్త స్టార్టప్లకు ఫండింగ్ పెరిగింది. దీంతో ఈ సంఖ్య 4,080కు తగ్గింది. బెంగళూరు టాప్ టెకీల తొలగింపులో భారత్లో బెంగళూరు మొదటి వరుసలో ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే అక్కడ 6,967 మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్టార్టప్ హబ్గా రూపొందుతున్న క్రమంలో ఈ ప్రభావం అధికంగా పడినట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో లేఆఫ్లు పెద్దగా లేకపోవడంతో లేఆఫ్స్,ఎఫ్వైఐ నివేదికలో టెకీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన గణాంక వివరాలు పొందుపరచలేదు. ఇప్పుడు స్టార్టప్లదీ వ్యథే... గత శీతాకాలం నుంచి ఇప్పటిదాకా 107 ఇండియన్ స్టార్టప్లలో 28,046 మంది ఉద్యోగులకు లే ఆఫ్ సెగ తాకినట్టు ఐఎన్సీ 42 తాజా నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 22 భారత ఎడ్టెక్ స్టార్టప్లు 9,871 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని, 59 స్టార్టప్లు 9,271 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొన్నారు. ఆ ఏడాది చివరి దాకా తప్పదు ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్ డౌన్ట్రెండ్లోనే ఉందని చెప్పాలి. టెకీల లేఆఫ్ చేసే పరిస్థితులు ఈ ఏడాది చివరిదాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఎకానమీ ఎఫెక్ట్ కారణంగా ఆర్థికరంగ పరిస్థితి బాగా లేకపోవడంతో అమెరికా తో సహా ఇతరదేశాలు ప్రభావితమవుతున్నాయి. ఐటీ ఎనబుల్డ్ సర్వీసెస్పై ఈ ప్రభా వం ఎక్కువగా ఉండగా, భారత్లోనే కొంత ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. పాత టెక్నాలజీపై పనిచేస్తూ, పనితీరు బాగాలేని వారికి ఉద్వాసన పలికేందుకు దీనిని కంపెనీలు ఒక అవకాశంగా తీసుకున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం స్టార్టప్లపై తీవ్రంగా పడింది. – రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీ -
బైక్పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి..
నేపాల్కు చెందిన సైనికుడు అరుదైన గిన్నీస్ రికార్డ్ను క్రియేట్ చేశాడు. కేవలం చేతులను మాత్రమే ఉపయోగించి 75 మెట్లను 25.03 సెకన్లలో కిందకు దిగి చరిత్ర సృష్టించాడు. దీంతో ప్రపంచంలోనే ఇప్పటివరకు ఈ ఫీట్ను సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వేగంగా మెట్లపై కిందకు దిగే పోటీకి ప్రపంచంలోనే మంచి ప్రజాధరణ ఉంది. అయితే.. ఇందులో ఇలా మెట్లను దిగడంలో కేవలం చేతులను మాత్రమే ఉపయోగించాలి. శరీర బరువు మొత్తం చేతులపై మోస్తూ మెట్లపై నుంచి కిందకు దిగాలి. ఇలా దిగే క్రమంలో బ్యాలెన్స్ మిస్ కాకుండా చూసుకోవడం చాలా కీలకం. ఈ పోటీలో ఇప్పటివరకు 30..8 సెకన్లతో అమెరికాకు చెందిన వ్యక్తిపై రికార్డ్ ఉంది. దీనిని ప్రస్తుతం నేపాల్కు చెందిన సైనికుడు హరి చంద్ర గిరి ఛేదించాడు. ఖాట్మండ్ లోయలో ఉన్న బుద్దిస్ట్ దేవాలయం జమ్చెన్ విజయ స్థూపంపై ఉన్న మెట్లపై హరి చంద్ర ఈ ఫీట్ను సాధించాడు. అయితే.. తాను 8 ఏళ్ల వయస్సు నుంచి చేతులపై నడిచే నైపుణ్యాన్ని సాధన చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్ వేషధారణలో బాలుడు.. పార్కుకి వెళ్తే.. -
ట్విటర్లో సాంకేతిక సమస్యలు.. యూజర్ల గగ్గోలు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లకు ట్విటర్ మొరాయించినట్లుగా ఆన్లైన్లో సాంకేతిక సమస్యలను సమీక్షించే వేదిక ‘డౌన్ డిటెక్టర్’ నివేదించింది. ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం.. భారత్లో 300 మందికి పైగా ట్విటర్ యూజర్లు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. 7 వేల మందికి పైగా యూజర్లు అవుట్టేజ్ ట్రాకర్ వెబ్సైట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను నివేదించారు. సాంకేతిక సమస్యలపై యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ట్విటర్లో #TwitterDown హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. యూజర్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎలాన్ మస్క్ను తమ కామెంట్లతో ఆడేసుకున్నారు. "ఎలాన్ మస్క్ను ఎవరైనా నిద్రలేపి అతని 44 బిలియన్ డాలర్ల యాప్ పని చేయడం లేదని చెప్పండి!" అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. “ట్విటర్ డౌన్ అయిందా? ఇంకా ఎవరికైనా ఇదే సమస్య వచ్చిందా? కామెంట్ సెక్షన్ తెరవడం సాధ్యం కాలేదు" అని మరొక యూజర్ ట్వీట్ చేశారు. "నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ.... #TwitterDown" ఇంకొక యూజర్ పోస్ట్ చేశారు. “Sorry. You are rate limited. Please try again in a few minutes.” That’s what I’m getting now. 🙃 #TwitterDown — SamanthaM (@Sammy6170) July 1, 2023 Twitter Down now Elon Musk trying to fix the problem be like😅#TwitterDown pic.twitter.com/7OeWprN7CJ — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) March 1, 2023 Live footage of Elon at Twitter HQ trying to fix the rate limit exceeded debacle.#twitterdown pic.twitter.com/KtzqdRj9HH — Em (@emmasaurustex) July 1, 2023 -
ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఇటీవలి ఆకాశాన్నంటిన పసిడి ధరతో బెంబేలెత్తిన కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా గురువారం కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత బులియన్ మార్కెట్లో ఈ రోజు (గురువారం) బంగారం ధర క్షీణించగా, వెండి కూడా అదే బాటలో ఉంది. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) రాయిటర్స్ నివేదిక ప్రకారం బలమైన డాలర్ విలువ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.59,050కి తగ్గింది. కిలో వెండి రూ. 350 తగ్గి 71,250కి వద్ద ఉంది గత ట్రేడింగ్ సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.59,350 వద్ద ముగిసింది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రా. ధర 210రూపాయలు తగ్గి, 58,750 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. ధర 200 రూపాయలు తగ్గి, 53,850గా ఉంది. అలాగే వెండి కిలో రూ. 400 తగ్గి, 75,700గా ఉంది. -
ఇన్స్టాగ్రామ్ డౌన్ - ఫన్నీ పోస్ట్లతో చెలరేగిపోతున్న నెటిజన్లు
Instagram Down: మెటా యాజమాన్యంలో ఉన్న 'ఇన్స్టాగ్రామ్' (Instagram) మళ్లీ డౌన్ అయింది. ఈ కారణంగా ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 56 శాతం మంది వినియోగదారులు ఈ అంతరాయం వల్ల ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్ చేయలేకపోయారు. డౌన్ డిటెక్టర్ నివేదికల ప్రకారం.. ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు లాగిన్ అవ్వడం, ఫోటో అండ్ వీడియో షేరింగ్, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ డౌన్లోడ్ చేయడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఎంత మంది ఎదుర్కొన్నారు అనేదాని మీద ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇది సుమారు 2 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్ని యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నామని ట్విట్టర్లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు. me thinking my account is hacked cause instagram down AGAIN 🤦🏾♂️ pic.twitter.com/GG0y0OYm3m — Jay-Wuan© (@__jaywuan) June 9, 2023 ఇన్స్టాగ్రామ్ డౌన్ కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాదిలో ఇది రెండవ సారి కావడం గమనార్హం. 2023 మార్చి నెలలో కూడా ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు కూడా వేలాదిమంది ఇన్స్టాగ్రామ్ వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఏర్పడిన అంతరాయానికి గల కారణాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది. Here we go again #instagramdown pic.twitter.com/EDT9FKtJXZ — z (they/them) (@ryzuknife) June 9, 2023 -
గుడ్ న్యూస్ చెప్పిన మోడీ భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు..!
-
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
LIC: ఏడాదిలో రూ. 1.93 లక్షల కోట్లు ఆవిరి!
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్లు లిస్టయిన ఏడాది వ్యవధిలో 40 శాతం క్షీణించాయి. దీంతో రూ. 1.93 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఎల్ఐసీ గతేడాది ఐపీవో ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించి, రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో టాప్ 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. షేర్లు మే 17న ఇష్యూ రేటుతో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంటుకు బీఎస్ఈలో రూ. 872 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 867 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ప్రస్తుతం షేరు ఎన్ఎస్ఈలో 39.93 శాతం క్షీణించింది. బుధవారం రూ. 570 వద్ద ముగిసింది. తొలి ఏడాది ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 920ని, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 530.20ని తాకాయి. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) గురువారం కూడా షేరు ధర మరో 3 శాతం నష్టాలతో ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఇష్యూ ధరను మాత్రం దాటలేకపోయాయి. ఇదే వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 13.33 శాతం, నిఫ్టీ 11.82 శాతం పెరిగాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) -
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
-
ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!
న్యూఢిల్లీ:సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్ యూజర్లకు మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే బ్లూటిక్ పోవడంతో హతాశులైన యూజర్లు చాలామందికి ఇపుడిక ట్విటర్ లోడ్ కూడా కావడం లేదు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులకు మైక్రో బ్లాగింగ్ సేవలు అందుబాటులో లేవు. ప్రధానంగా డెస్క్టాప్ యూజర్లకు ‘దిస్ పేజ్ ఈజ్ డౌన్’ అనే సందేశం కనిపిస్తోంది. అయితే తొందరలోనే లోపాన్ని సవరిస్తామనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీంతో ట్విటర్ మీకు పనిచేస్తోందా అంటూ నెటిజన్లు తెగ ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్! ట్విటర్-డౌన్ ట్విటర యాప్ లేదా వెబ్సైట్ (డెస్క్టాప్, మొబైల్ రెండూ)చాలావరకు పని చేయలేదు. మొబైల్ సైట్ని యాక్సెస్ చేసినప్పుడు, ప్రస్తుతం ‘మీ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ సైట్ని చేరుకోవడం సాధ్యం కాదు’ అని లాంటి మెసేజెస్ కనిపించింది. ఈ సమస్య ఎంత విస్తృతంగా వ్యాపించిందనే దాని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీకి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కాగా శుక్రవారం ఉదయం నుంచి సెలబ్రిటీలకు బ్లూటిక్ తీసివేయడంతో కలకలం రేగింది. దీంతో యూజర్లు జోక్స్, మీమ్స్తో ట్విటర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. Elon Musk be like.#BlueTick pic.twitter.com/hlB9NxDKgd — Farhan Khan (@babarazam215) April 21, 2023 ట్విటర్ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత చేసిన పలు మార్పుల్లో భాగంగా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్లూటిక్ కావాలనుకునే యూజర్లు బ్లూటిక్ కోసం నెలవారీ రుసుము చెల్లించాలి. -
నిలిచిపోయిన నెట్ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ ప్రసారాలు ఆదివారం (ఏప్రిల్ 16) కొంత మంది సబ్స్క్రయిబర్లకు నిలిచిపోయాయి. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector.com ప్రకారం.. ఆదివారం సాయంత్రం యునైటెడ్ స్టేట్స్లో 11,000 కంటే ఎక్కువ మంది యూజర్లకు నెట్ఫ్లిక్స్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5 గంటలకు తలెత్తిన అంతరాయం 6.49 గంటలకు ముగిసింది. దీంతో ‘లవ్ ఈజ్ బ్లైండ్: ది లైవ్ రీయూనియన్’ స్ట్రీమింగ్ ఆలస్యం అయింది. వెనెస్, నిక్ లాచీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం లాస్ ఏంజెల్స్ నుంచి సాయంత్రం 5 గంటలకు ( భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30) ప్రారంభం కావాల్సిఉంది. ఈ షో కోసం సబ్స్క్రయిబర్లు ప్రారంభ సమయానికి 10 నిమిషాల ముందే నుంచి వేచిఉన్నారు. ఇంతలో అంతరాయం తలెత్తడంతో ఒక గంటకు పైగా యూజర్లు వేచిఉన్నారు. ఈ కార్యక్రమ ప్రసారం చివరకు సాయంత్రం 6:16 (పసిఫిక్ కాలమానం) గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా మేల్కొన్న నెట్ఫ్లిక్స్ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. లవ్ ఈజ్ బ్లైండ్ లైవ్ రీయూనియన్ షో స్ట్రీమింగ్ ఆలస్యమైనందుకు చింతిస్తున్నామంటూ సాయంత్రం 6:29 గంటల (పసిఫిక్ కాలమానం) సమయంలో ట్వీట్ చేసింది. -
రూ. 88 వేల కోట్లకు పీ-నోట్స్ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్ల వేల్యుయేషన్లు గరిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్న నేపథ్యంలో పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) రూపంలో వచ్చే పెట్టుబడుల విలువ ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లకు పరిమితమైంది. జనవరిలో ఇవి రూ. 91,469 కోట్లుగా నవెదయ్యాయి. పీ-నోట్ల పెట్టుబడులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. నేరుగా రిజిస్టర్ చేసుకోకుండా భారత వర్కెట్లలో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) పీ-నోట్స్ ద్వారా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్లో పీ-నోట్ల పెట్టుబడుల విలువ ర. 96,292 కోట్లుగా, నవంబర్లో ర. 99,335 కోట్లుగా, అక్టోబర్లో రూ. 97,784 కోట్లుగాను ఉన్నాయి. ఇతర వర్ధవన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ ఖరీదైనదిగా ఉంటోందని ఎఫ్పీఐలు భావిస్తున్నారని నిపుణులు తెలిపారు. భారత్లో లాభాలు బుక్ చేసుకుని, ఇతరత్రా చౌక మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయ్యాలనే ఆచనతో వారు ఉన్నట్లు వివరించారు. పీ-నోట్ల రపంలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన పెట్టుబడుల్లో ర. 78,427 కోట్లు ఈక్విటీల్లోనూ, రూ. 9,851 కోట్లు డెట్లోన, రూ. 119 కోట్లు హైబ్రిడ్ సెక్యరిటీల్లోను ఉన్నాయి. -
దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు
న్యూఢిల్లీ: భారత్ బంగారం దిగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 30 శాతం పడిపోయాయి. దిగుమతులుమొత్తం విలువ 31.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది యల్లో మెటల్ దిగుమతుల విలువ 2021-22 ఇదే కాలంలో 45.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 ఆగస్టు నుంచి దిగుమతుల్లో పెరుగుదల లేకపోగా, క్షీణత నమోదుకావడం దీనికి నేపథ్యం. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు విలువైన లోహం దిగుమతులు తగ్గడానికి కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కేంద్రం పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులను నిరుత్సాహ పరచడం, తద్వారా ఈ బిల్లును తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరక్కుండా కట్టడి చేయడం ఈ నిర్ణయం లక్ష్యం. వెండి వెలుగులు.. కాగా, వెండి దిగుమతులు మాత్రం 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. -
Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్ న్యూసేనా?
సాక్షి,ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం బంగారం ధరలుభారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి 10 గ్రాములకు రూ. 59,251స్థాయికి చేరింది. శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది. వెండి ధర కూడా కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. (ఇదీ చదవండి: NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?) హైదరాబాద్మార్కెట్లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి కూడా 500 తగ్గి 74000గా ఉంది. (NMACC: డాన్స్తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్కైతే) ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్సైట్ ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 3, 2023) పది గ్రాములకు రూ. 59251 వద్ద ట్రేడవుతోంది. అలాగే శుక్రవారం రూ.1582 పెరిగిన కిలో వెండి ధర రూ.71173 వద్ద ట్రేడవుతోంది. (మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!) అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో కూడా బంగారం వెండి ధరలు బలహీనంగా ఉన్నాయి. ఏప్రిల్ 2023 ఫ్యూచర్స్ రూ. 342.00 పతనంతో రూ. 59,060.00 వద్ద, మే 5, 2023న వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రూ. 604.00 పతనంతో రూ.71,614.00 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4.33 డాలర్ల లాభంతో 1,953.72 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్స్కు 0.21 డాలర్లు తగ్గి 23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మొన్న ట్విటర్.. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ డౌన్
గత కొన్ని రోజులకు ముందు ట్విటర్ సేవలు కొంత అంతరాయం కలిగించాయి, అయితే ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజర్లు ఫోటో షేరింగ్ ప్లాట్ఫారమ్ను యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు. ఇన్స్టాగ్రామ్లో ఏర్పడ్డ ఈ అంతరాయం వేలాది మంది వినియోగదారులను ప్రభావితం చేసిందని, యునైటెడ్ స్టేట్స్లో 46,000 కంటే ఎక్కువ మంది, యూకేలో 2,000 మంది, ఇండియా, ఆస్ట్రేలియా నుంచి 1,000 కంటే ఎక్కువమంది దీనిపైన పిర్యాదులు అందించారు. ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన అంతరాయానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ వినియోగదారులు లాగిన్ చేయడం, కంటెంట్ను పోస్ట్ చేయడం, యాప్ ఫీచర్లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదుల్లో తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్యలకు సంబంధించినదా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు. 2022 సెప్టెంబర్ నెలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సమస్యలు తలెత్తాయని నివేదికలు వెల్లడించాయి. ఆ తరువాత అలంటి సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యకుగల కారణాలు త్వరలోనే తెలుస్తాయి. -
మార్కెట్లో రూ.3 లక్షల కోట్లు గోవిందా?
సాక్షి, ముంబై: వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం ట్రేడింగ్లో సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 17700 స్థాయి వద్ద ఊగిసలాడింది. ఆ తరువాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 785 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు చేరింది. అటు కుప్పకూలిన నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో 17600 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 927.74 పాయింట్లు క్షీణించి 59,744.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 272.40 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటికే మంగళవారం నాటి గణాంకాల ప్రకారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.265.21 లక్షల కోట్ల నుంచి రూ.2.79 లక్షల కోట్ల నుంచి రూ.262.41 లక్షల కోట్లకు పడిపోయింది. అటు హిండెన్బర్గ్ ఆరోపణలతో వరుస నష్టాలతో అదానీకి భారీ షాకే తగులుతోంది. అదానీ గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ మంగళవారం రూ.8,07,794 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు పడి పోయింది. ఇది దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం క్యాప్ రూ. 9,12,986 కోట్ల కంటే తక్కువ కావడ గమనార్హం. జనవరి 24న ప్రారంభమైన అమ్మకాల సెగతో అదానీ గ్రూప్ స్టాక్లు గత పంతొమ్మిది సెషన్లలో రూ.11,43,702 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా సంస్థ ఎం క్యాప్ 19,18,058 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ( రూ.16,24,156 కోట్లు) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.12,57,268 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోరర్ట్స్జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫినాన్స్, గగ్రాసిం భారీగా నష్టపోగా, సిప్లా, ఐటీసీ, దివీస్, డా. రెడ్డీస్, బజాజ్ ఆటో లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో 82.85 వద్ద ఉంది. -
TodayStockMarket: ఐటీ, ఆటో తప్ప అన్నింటా నష్టాలే
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిసాయి. మిడ్ సెషన్ నష్టాల కాస్త తేరుకున్నప్పటికీ ప్రధాన సూచీలు కీలక మద్దతు స్థాయిలకు దిగువనే ముగిసాయి.సెన్సెక్స్ 311 పాయింట్లు పతనమై 60692 వద్ద, నిఫ్టీ100 పాయింట్లు నష్టపోయి 17845 వద్ద ముగిసాయి. దివీస్ ల్యాబ్స్,అల్ట్రాటెక్ సిమెంట్, టెక్మహీంద్ర, హిందాల్కో, పవర్గ్రిడ్ టాప్ విన్నర్స్గానూ, అదానీ ఎంటర్పప్రైజెస్, సిప్లా, బీపీసీఎల్, బ్రిటానియ, యూపీఎల్ టాప్ లూజర్స్గానూ స్థిర పడ్డాయి. ఐటీ, ఆటో రంగ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లు ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి12 పైసల లాభంతో 82.73 వద్ద ముగిసింది. గత సెషన్లో 82.83 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
TodayStockMarket: లాభాలకు చెక్, సెన్సెక్స్ 317 పాయింట్లు పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.వరుస లాభాల తరువాత సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ డేటాషాక్తో మళ్లీ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాయి. ఆర్థిక, ఐటీ ,ఎఫ్ఎమ్సిజి షేర్లు అమ్మకాల ఒత్తిడి ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 317 పాయింట్లు నష్టపోయి 61,003 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు క్షీణించి 17,944 వద్ద స్థిరపడింది. అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే, ఇండస్ఇండ్, ఎస్బిఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా , ఎస్బీఐ టాప్ లూజర్స్గా, మరోవైపు లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రాటెక్, భారత్ పెట్రోలియం, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. హెవీవెయిట్లలో, ఇన్ఫోసిస్, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 83 స్థాయి వైపు పయనిస్తోంది. డాలరు బలం పుంజుకోవడంతో రూపాయి 14పైసల నష్టంతో 82.83వద్ద ముగిసింది. -
సెయిల్ లాభం నేలచూపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 542 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,529 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25,398 కోట్ల నుంచి రూ. 25,140 కోట్లకు స్వల్పంగా తగ్గింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 23,210 కోట్ల నుంచి రూ. 24,825 కోట్లకు ఎగశాయి. ముడిస్టీల్ ఉత్పత్తి 4.531 మిలియన్ టన్నుల నుంచి 4.708 ఎంటీకి పుంజుకుంది. అమ్మకాలు సైతం 3.84 ఎంటీ నుంచి 4.15 ఎంటీకి బలపడ్డాయి. కంపెనీ వార్షికంగా 21 ఎంటీ స్టీల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
Today StockMarketOpening: అదానీ, ఐటీ షేర్లు ఢమాల్; సెన్సెక్స్ పతనం
సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఏకంగా 372 పాయింట్లు కుప్ప కూలి 60307 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల పతనంతో 17749 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్ తప్ప అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అదానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఫసిస్ తదితర ఐటీ స్టాక్స్ పతనం మార్కెట్ను ప్రభావితం చేస్తోంది. అదానీ సంక్షోభం మార్కెట్లో అదానీ సంక్షోభం కొనసాగుతోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (శుక్రవారం) నాలుగు అదానీ స్టాక్ల రేటింగ్ 'స్టేబుల్' నుండి 'నెగటివ్'కి డౌన్గ్రేడ్ చేయడంతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. అటు సంస్థ కూడా తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని సగానికి తగ్గించింది. తాజాగా మూలధన వ్యయాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అదానీ. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది. ఇప్పటికే అదానీ లిస్టెడ్ ఎంటిటీలు మార్కెట్ విలువ 120 బిలియన్ డాలర్లకు పైగా కుప్పకూలింది. అటు జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల కోసం పెట్టుబడిదారులు వెయిట్ చేస్తున్నారు. టైటన్, హిందాల్కో, టాటా స్టీల్, సన్ఫార్మ, బజాజ్ ఆటో లాభపడుతుండగా, అదానీ ఎంటర్పప్రైజెస్, ఎస్బీఐ, ఎం అండ్ఎం, ఇన్ఫోసిష్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి 28 పైసలు నష్టంతో 82.73 వద్ద కొనసాగుతోంది. -
రెడిక్యులస్..నా పాపులారిటీ తగ్గుతోందంటావా? ట్విటర్ ఉద్యోగిపై వేటు
సాక్షి,ముంబై: ట్విటర్ ఇంజనీర్ ఉద్యోగి ఒకరు పొరపాటున డేటాను డిలీట్ చేయడమే బుధవారం నాటి సర్వర్ డౌన్ సమస్యకు కారణమని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఉద్యోగాల కోత నేపథ్యంలో బుధవారం టెక్నికల్ సమస్యను పరిష్కరించే నాధుడే లేకపోయాడట. ట్విటర్ యూజర్ల ట్వీట్లు, ఫాలోవర్లు తదితర అంశాలపై ట్విటర్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ సెటింగ్స్ నిర్వహణలోనే యాక్సిడెంటల్గా డేటా డిలీట్ అయిందట. ఇది ఉలా ఉంటే మరో కీలక పరిణామం మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెర్జ్ నివేదిక ప్రకారం ట్విటర్ మస్క్ తన అకౌంట్ను ఒక రోజు ప్రయివేట్ ఖాతాగా మార్చాడు. తద్వారా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుందా, లేదా, తన ట్వీట్ల ఎంగేజ్మెంట్, ప్రభావం తదితర విషయాలపై స్టడీ చేస్తున్నాడట. ఈ మేరకు ఇంజనీర్లు, సలహాదారుల బృందంతో రివ్యూ చేస్తున్నాడు. అయితే ఈ పరిశీలనలో తనకు 100 మిలియన్లకు మించి ఫాలోయర్లు ఉండగా కేవలం పదివేల ఇంప్రెషన్లు మాత్రమే వస్తున్నాయని తెలిసి మస్క్ అసహనంతో రగిలి పోయాడు. దీనిపై అసంతృప్తితో మస్క్ ఇచ్చిన వివరణను అంగీకరించని ఉద్యోగిపై వేటు వేశాడు మస్క్. రెడిక్యూలస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని నివేదించింది. మస్క్ ట్వీట్లపై ప్రజల ఆసక్తి క్షీణిస్తోందని సదరు ఇంజనీరు వాదించాడు. దీనికి సంబంధించి గూగుల్ ట్రెండ్స్ డేటాను కూడా చూపించాడు. అంతేకాదు ట్విటర్ అల్గారిథమ్ మస్క్ పట్ల పక్షపాతంగా ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఇంజనీర్ చెప్పాడు. అంతే మరుక్షణమే యూ ఫైర్డ్ అంటూ మస్క్ మండిపడటం హాట్ టాపిగ్ నిలిచింది. అయితే తాజా పరిణామం ట్విటర్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ట్విటర్ డేటా ప్రకారం మస్క్ చేసిన ట్వీట్లు మామూలుగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తాయనీ, కానీ మస్క్ 128 మిలియన్ల ఫాలోయర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని ఫార్చ్యూన్ నివేదిక వ్యాఖ్యానించింది -
హైదరాబాద్లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నివాస విభాగం నేల చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది తొలి నెలలో గ్రేటర్లో రూ.2,422 కోట్ల విలువ చేసే 4,872 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. 2021 మొదటి నెలలో రూ.3,269 కోట్లు విలువ చేసే 7,343 యూనిట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ జరిగిన వాటిల్లో అత్యధికంగా 54 శాతం గృహాలు రూ.25–50 లక్షలవే. 2021 జనవరిలో ఈ ఇళ్ల వాటా 39 శాతంగా ఉంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. ఇక రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ ఇళ్ల వాటా 2021 జనవరిలో 36 శాతం కాగా.. గత నెలలో 18 శాతానికి పడిపోయాయి. ఈ జనవరిలో 1,000 నుంచి 2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న గృహాలే ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి వాటా 71 శాతం ఉంది. అయితే గతేడాది జనవరిలో వీటి వాటా 72 శాతంగా ఉంది. 2021 జనవరిలో 500–1,000 చ.అ. ఇళ్ల వాటా 15 శాతం ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 2 వేల చ.అ.లకు పైగా విస్తీర్ణం ఉన్న యూ నిట్ల వాటా 9 శాతంగా ఉంది. ఎందుకు తగ్గాయంటే.. ప్రతి ఏటా మొదటి కొన్ని నెలల పాటు స్థిరాస్తి కార్యకలాపాలు మందగిస్తాయని దీంతో విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని నైట్ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. గృహ కొనుగోలుదారుల కొనుగోలు నిర్ణయంలో ఊహించని మార్పులు, ధరలలో ప్రతికూలతలుంటాయి. వేతన సవరణలు, రాయితీలు, పండుగ సీజన్ల వంటి వాటితో మార్కెట్లో సానుకూల ధోరణి కనిపించినప్పుడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాపర్టీల డెలివరీకి సమయం పడుతుంది దీంతో విక్రయాలు ఎక్కువ జరిగినా.. ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదవుతాయని వివరించారు. -
మరోసారి ట్విటర్ సర్వర్ డౌన్.. షాకింగ్ లిమిట్స్ తెలుసా?
సాక్షి,ముంబై: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విటర్ సర్వర్ మరోసారి డౌన్ అయ్యింది. దీంతో వినియోగదారులు తమ అకౌంట్లను లాగిన్ చేయలేక ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు ట్వీట్ డెక్ సైతం పని చేయలేదంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి మైక్రోబ్లాగింగ్ సైట్లో పలు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ట్వీట్ చేయలేక పోవడం, ప్రత్యక్ష సందేశాలు పంపడం లేదా ప్లాట్ఫారమ్లో కొత్త ఖాతాలను అనుసరించడం వంటివి చేయలేకపోయారు. కొత్త ట్వీట్లను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వినియోగ దారులు "మీరు ట్వీట్లను పంపడానికి రోజువారీ పరిమితిని మించిపోయారు" అని పాప్-అప్ సందేశం రావడం గందరగోళానికి దారి తీసింది. ట్విటర్ కొత్త లిమిట్స్ - రోజుకు 2,400 ట్వీట్లు - రోజుకు 500 ప్రత్యక్ష సందేశాలు (డైరెక్ట్ మెసేజెస్) - కేవలం 5,000 ఫాలోవర్లకు అనుమతి - రోజుకు 400 కొత్త ఖాతాల ఫాలోయింగ్కు అనుమతి బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగత , వ్యాపార ఖాతాలను ఆపరేట్ చేసే వినియోగదారులు "ట్వీట్లు పంపడానికి రోజువారీ పరిమితిని" ఉంటుంది. హెల్ప్ పేజీ సైట్ సమాచారం ప్రకారం ట్విటర్ కొంత ఒత్తిడిని తగ్గించడానికి,సర్వర్ డౌన్, ఎర్రర్ పేజీలను తగ్గింపు ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లూ టిక్ బాదుడు షురూ: భారతదేశంలో ట్విటర్ బ్లూ ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియా యూజర్లు నెలకు బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ రూ.900 ప్రారంభం. కాగా ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు తరువాత గతేడాదిలో పలుమార్లు సర్వర్ డౌన్, సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. -
Today StockMarketUpdate: నష్టాల ముగింపు, అదానీ ఇన్వెస్టర్లకు భారీ ఊరట
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్న సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొ న్నాయి. చివరికి సెన్సెక్స్ 220.86 పాయింట్లు లేదా 0.37 శాతం 60,286 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 17,721.50 వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తర్వాత రేట్ల పెంపును నిలిపివేస్తుందన్న పెట్టుబడిదారులలో స్వల్ప ఆశావాదంతో సూచీలు చూస్తూనే ఉన్నాయి. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతోనూ, ఎఫ్ఎంసిజి షేర్లు నష్టాల్లోముగిసాయి. అలాగే ఫ్లాగ్షిప్ అదానీ ఎంటర్ప్రైజెస్ సహా కొన్ని లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగిసాయి. హిండెన్ వర్గ్ వివాదంతో ఎఫ్పీవోను కూడా అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఈరోజు 20 శాతం ఎగిసింది. ఇదే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ 3.93 శాతం, అదానీ పోర్ట్స్ స్టాక్ ఏకంగా 8.65 శాతం పుంజుకుంది. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. చివరికి అదానీ ఎంటర్ ప్రైజెస్ 15 శాతం, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ టాప్ గెయినర్స్గా, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.70 వద్ద ఫ్లాట్గా ముగిసింది. సోమవారం 82.73 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
Today StockMarket Update భారీ నష్టాలు, 17750 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారం ఆరంభంలోనే నస్టాల్లోకి జారుకున్నాయి. ఓపెనింగ్లో పాజిటివ్గా ఉన్నప్పటికీ తరువాత నెగిటివ్గా మారాయి. లాభనష్టాల ఊగిసలాటల మధ్య సెన్సెక్స్ ఏకంగా 424 పాయింట్ల నష్టంతో 60417వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 17720 వద్ద కొనసాగు తున్నాయి. తద్వారా నిఫ్టీ కీలకమైన 17750 మార్క్ను కోల్పోయింది. ముఖ్యంగా ఐటీ, మెటల్ నష్టాలు ప్రభావవితం చేస్తున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్ప్ ఎక్కువగా లాభపడుతుండగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, హిందాల్కో భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు ఎల్ఐసి, అదానీ ట్రాన్స్మిషన్, టాటా స్టీల్ ఈ రోజు ఫలితాలను ప్రకటించనున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీ నష్టాల్లోఉంది. 73 పైసలు కుప్పకూలి 82.43 స్థాయికి రూపాయి పడిపోయింది. -
షార్ట్ కవరింగ్, నష్టాల నుంచి సూచీల రికవరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుస నష్టాల నుంచి షార్ట్ కవరింగ్ కారణంగా కాస్త రికవరీ సాధించాయి. ముఖ్యంగా అదానీ కంపెనికి చెందిన కొన్ని షేర్లతోపాటు, బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. అయితే ఐటీ షేర్లు లాభ పడుతున్నాయి. ప్రస్తుతం 46 పాయింట్ల నష్టంతో 17557 వద్ద నిఫ్టీ, 113 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 59193 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ హెచ్సీఎల్ టెక్, బజాజ్ఫిన్సర్వ్ లాభపడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్; జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ఆటో, హెచ్ యూఎల్ నష్టపోతున్నాయి. -
రెండో రోజూ తప్పని నష్టాలు: విండ్ఫాల్ టాక్స్ కోత ఆయిల్ రంగ షేర్లు జూమ్
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోట్రేడ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఫార్మా, ఆటో, ఐటీషేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 61500 మార్క్ను, నిఫ్టీ 18300మార్క్ను కోల్పోయాయి.విండ్ ఫాల్ టాక్స్ కోతతో ఆయిల్రంగ షేర్లు భారీ లాభాలతో 5నెలల గరిష్టం వద్ద ఉన్నాయి. ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, లార్సెన్, ఐషర్ మోటార్స్, నెస్లే లాభపడుతుండగా, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డా. రెడ్డీస్, అపోలో హాస్సిటల్స్ తదితర షేర్లు నష్టపోతున్నాయి.11 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లు బ్లాక్ డీల్స్ కారణంగా GMM Pfaudler షేర్లు 18 శాతం పడి పోయాయి. అంతేకాకుండా, అమ్మకాల ఒత్తిడి కారణంగా ఐటీసీ షేర్లు 2 శాతం పడిపోయి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.331.90కి చేరాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 12 పైసలుక్షీణించి 82.84 వద్ద ఉంది. 3.30 PM చివరికి సెన్సెక్స్ 461 పాయింట్లు కుప్పకూలి 61337 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల నష్టంతో వద్ద 18269 ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. వరుసగా రెండో సెషన్లో నష్టపోయిన సూచీలు వారాంతంలో ఒక నెల కనిష్టాన్ని నమోదు చేశాయి. దేశీయ కరెన్సీ రూపాయి 82.87 వద్ద ముగిసింది. -
Viral Video: బుడ్డోడు.. గోల్ కొడుదాం అనుకున్నాడు.. కానీ బోర్ల పడ్డాడు..
-
వడ్డీ రేటుపెంపు అంచనాలు: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలతో ఆరంభంలో భారీగా నష్టపోయిన మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. కానీ హై స్థాయిల వద్ద సూచీల కన్సాలిడేషన్ కొన సాగుతోంది. చివరికి సెన్సెక్స్ 208 పాయింట్ల నష్టంతో 62626 వద్ద, నిఫ్టీ 58పాయింట్ల నష్టంతో 18642 వద్ద స్థిరపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్యూఎల్, బజాజ్ ఆటో, నెస్లే, బ్రిటానియా నష్టపోగా ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా బాగా లాభపడ్డాయి. సిమెంట్ ధరలు పెరుగుతాయన్న అంచనాలో అన్ని సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిసాయి. బీపీసీఎల్, టాటాస్టీల్, డా.రెడ్డీస్, హిందాల్కో యూపీఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఆగని రూపాయి పతనం డాలరు మారకంలో రూపాయి భారీగా కుప్పకూలింది. ఏకంగా 96 పైసలు కుప్పకూలి 82.57 స్థాయికి చేరింది. మరోవైపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రేపు(బుధవారం) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వడ్డీరేటుపెంపునకే మొగ్గు చూపవచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
మెటల్ షాక్: భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా మూడో సెషన్లోనే నష్టాలతో ప్రారంభ మయ్యాయి. సెన్సెక్స్ 370 పాయింట్లకు పైగా పతనంతో 62515వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు నష్టంతో 18602 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా వేదాంత, సిప్లా, సెయిల్ తదితర మెటల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా బాగా లాభపడుతుండగా హిందాల్కో, టాటాస్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. రూపాయి భారీ పతనం: డాలరు మారకంలో రూపాయి భారీగా కుప్పకూలింది. అమెరికా జాబ్ మార్కెట్ రిపోర్ట్ అందోళన, ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు అంచనాలతో డాలర్ బలం పుంజుకుంది. దీంతో దేశీయ కరెన్సీ బలహీనపడింది. ఏకంగా 60పైసలు పతనమై 82.23 స్థాయికి చేరింది. -
భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు: బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. బ్యాంకింగ్, ఎఎఫ్సీజీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 342 పాయింట్లు కుప్పకూలి 62524 వద్ద నిఫ్టీ 97 పాయింట్లు కోల్పోయి 18598 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, టాటాస్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు యూపీఎల్ లాభపడుతుండగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎం అండ్ ఎం టైటన్ నష్టపోతున్నాయి. అలాగే డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 81.37 వద్ద ఉంది. -
లాభాల స్వీకరణ, అయినా హైస్థాయిల వద్ద సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో పప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుసగా ఏడో సెషన్లోనూ లాభాల జోరు కంటిన్యూ చేశాయి. కానీ లాభాల స్వీకరణతో నష్టాల్లోకి మళ్లింది. ప్రస్తుతం 81 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 62751 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 18646 వద్ద కొనసాగుతుండటం విశేషం. ఆటో మెట్ రంగ షేర్లు లాభాల్లో ఉండగా, బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టోతున్నాయి. హిందాల్కో, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో జేఎస్డబ్ల్యూ స్టీల్, డా.రెడ్డీస్ లాభాల్లో టాప్లో ఉండగా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, బిపిసిఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ బ్యాంక్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 11 పైసలు ఎగిసి 81.63 వద్ద ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)దేశీయ జీడీపీ డేటా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు విడుదల కానుంది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం పై టట్రేడర్లు దృష్టిపెట్టారు. -
భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్: కీలక మద్దతు స్థాయిలు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ, వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 312 పాయింట్లు కుప్పకూలి 61437 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల పతనమై 18244 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు వారాంతం కావడంతో టట్రేడర్ల లాభాల స్వీకరణ కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 61500 దిగువకు, నిఫ్టీ 18300 స్థాయిని కోల్పోయి మరింత బలహీన సంకేతాలిస్తున్నాయి. కోటక్ మహీంద్ర బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టాటామోటార్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్ తదితరాలు లాభపడుతున్నాయి. ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, టైటన్, టాటా కన్జ్యూమర్స్ తదితరాలు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి నష్టాల్లో ఉంది. 81.65 వద్ద ట్రేడ్ అవుతోంది. -
రోజంతా ఊగిసలాట, చివరికి భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివరికి భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టంతో 61,750 నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 18,343 ముగిసింది. మరోవైపు గరిష్టస్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్, బలహీనమైన ప్రపంచ సూచన దాదాపు అన్ని రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్ ఐటీషేర్లు భారీగా నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ టాటా కన్జ్యూమర్, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంకు ,భారతి ఎయిర్టెల్, భారీగా నష్టపోగా టైటన్, ఎం అండ్, టాటా మెటార్స్, అపోలో హాస్పిటల్స్, ఐషర్మోటార్ లాభపడ్డాయి. అటు ద్రవ్యోల్బణం దిగిరావడం, వడ్డీరేటు పెంపు పెద్దగా ఉండదనేభరోసా మద్య డాలరు పుంజుకోవడంతో గురువారం డాలర్తో రూపాయి పడిపోయింది. అటు రూపాయి గత ముగింపు 81.30తో పోలిస్తే డాలరు మారకంలో రూపాయి భారీ నష్టపోయింది. 35 పైసల నష్టంతో 81.65 వద్ద ముగిసింది. -
ప్రాఫిట్ బుకింగ్:18400 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 61757 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18367 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరడంతో మంగళవారం రికార్డు స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్ బుధవారం ప్రారంభంలోనే నష్టాలను చవి చూసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస షేర్లు నష్ట పోతున్నాయి. డా. రెడ్డీస్, సిప్లా, టీసీఎస్, అదానీపోర్ట్స్ లాభాల్లోనూ, దివీస్ ల్యాబ్స్, టాటాస్టీల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. 51 పైసల నష్టంతో 81.50 వద్ద ట్రేడ్ అవుతోంది. -
భారీగా నష్టపోతున్న సూచీలు, మద్దతు స్థాయిలు బ్రేక్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 61 వేలు, నిఫ్టీ 18100స్థాయి దిగువకు చేరాయి . ఫార్మా మినహా, ఆటో ఇండెక్స్ అత్యధికంగా 1 శాతానికి పైగా క్షీణించింది. ఇంకా మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 335 పాయింట్లను కోల్పోయి 60698 వద్ద, నిఫ్టీ 102పాయింట్ల నష్టంతో 18155 వద్ద కొనసాగుతున్నాయి. నైకా షేర్లు 3 శాతం ఎగిసాయి. సిప్లా, హెచ్యూఎల్, డా. రెడ్డీస్, దివీస్, భారతి ఎయిర్టెల్ లాభ పడుతుండగా, టాటామోటార్స్, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్, పీఎన్బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్ర, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 15 పైసలు నష్టంతో 81.56 వద్ద ఉంది. బుధవారం 81.44 వద్ద ముగిసింది. -
ట్విటర్ డౌన్: యూజర్లకు లాగిన్ సమస్యలు,ఏమైంది అసలు?
సాక్షి, ముంబై: మైక్రో-బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్లో లాగిన్ సమస్య యూజర్లను అయోమయానికి గురిచేసింది. శుక్రవారం ఉదయం ట్విటర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లను లాగిన్ సమస్య ఇబ్బంది పెట్టింది. యూజర్లు లాగిన్ అవుతోన్న సందర్భంలో ఎర్రర్ మెసేజ్ దర్శనమివ్వడంతో అసౌకర్యానికి గురయ్యారు. అయితే మొబైల్ యూజర్లకు ట్విటర్లాగిన్లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. డెస్క్టాప్ యూజర్లకు ‘సమ్థింగ్ వెంట్ రాంగ్’ అనే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. కొత్త ఫీచర్ మార్పులు కారణంగా సమస్య ఏర్పడుతోందా, అందుకోసమే డౌన్టైమ్ ప్లాన్ చేశారా అనేది క్లారిటీ లేదు. అయితే ఏ మేరకు ప్రభావితమైంది?, సమస్యకు గల కారణం ఏంటి అనే దానిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఇటీల సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా నిలిచి పోవడం పెద్ద కలకలమే రేపింది. గత వారం ట్విటర్ను ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేశారు. మరుక్షణం నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్ కీలక ఎగ్జిక్యూటివ్లకు ఉద్వాసన పలికారు. దాదాపు సగానికిపైగా సంస్థ ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల్లో ఉన్నారన్న నివేదికలు ఆందోళన రేపాయి. ముఖ్యంగా ఈ రోజునుంచే ఈ తొలగింపులను ప్రారంభించ నుందని అంచనా. -
Instagram Down: ఇన్స్టాగ్రామ్కు ఏమైంది? యూజర్ల గగ్గోలు, మీమ్స్ వైరల్
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సేవలు నిలిచిపోవడం యూజర్లలో గందర గోళానికి తీసింది. తాజాగా మెటా సొంతమైన ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయిందంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. ఇన్స్టాలో సమస్యలను ఎదుర్కొంటున్న పలువురు యూజర్లు సోషల్ మీడియాలో సోమవారం ఫిర్యాదు చేశారు. తమ ఖాతాలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ఒక అలర్ట్ మెసేజ్ వచ్చినట్టు వినియోగదారులు వాపోయారు. వినియోగదారులు తమ ఖాతాలకు తిరిగి లాగిన్ చేయడంలో సమస్యలు, అకౌంట్ సస్పెండ్ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు ట్విటర్లో వెల్లువెత్తాయి. తమ ప్రొఫైల్లను యాక్సెస్ చేయలేకపోతున్నామని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయినట్టు కనిపిస్తోంది లేదంటే..నాఅకౌంట్ బ్లాక అయిందా అంటూ ఒక వినియోగదారు సోమవారం ట్వీట్ చేశారు. ఏకంగా తమ ఖాతా 30 రోజుల పాటు సస్పెండ్ అనే మెసేజ్తోపాటు శాశ్వతంగా నిలిపివేసే ప్రమాదం ఉందనే అలర్ట్ వచ్చిందంటూ ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు తమ ఫాలోవర్ల సంఖ్య కూడా పడిపోయిందని తెలిపారు. All of us coming to twitter to confirm instagram is down #instagramdown pic.twitter.com/DT6BthlNDK — cesar (@jebaiting) October 31, 2022 #instagramdown again. The only ones who never disappoint me pic.twitter.com/yeWxZurwvn — Mr bean (@thisbeann) October 31, 2022 Me trying to recover my Instagram account #instagramdown pic.twitter.com/3cOPNCBX2w — sparsh kanak (@kanak_sparsh) October 31, 2022 దీంతో ఈ వార్త ట్విటర్లో ట్రెండింగ్లో నిలిచింది. దీనిపై ఇన్స్టాగ్రామ్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. Me apologising to my wifi after finding out Instagram is down #instagramdown pic.twitter.com/wk0I5XT91e — ABSOLUT VODKA (@VodkaTweetz) October 31, 2022 My account was blocked, anyone with the same problem? #instagramdown #instagramerror #instadown #Instagramcrashing pic.twitter.com/y4M7rmrzXq — ThatGirl. (@claudiahellen_) October 31, 2022 -
పొలిటికల్ కారిడార్ : తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ చిన్న చూపు
-
ఆరంభ లాభాలు ఆవిరి: నైకా షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలను వెంటనే కోల్పోయిన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో ఒక దశలో 60వేలను దాటేసిన సెన్సెక్స్ చివరికి 288 పాయింట్లు నష్టపోయి 59543 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 17659 వద్ద స్థిరపడింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలతో భారీ నష్టాలనుంచి సేచీలు కోలుకున్నాయి. టెక్ మహీంద్ర, మారుతి సుజుకి, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ , ఐషర్ మోటార్స్ లాభపడగా, నెస్లే, కోటక్ మహీంద్ర, హెచ్యూఎల్, బజాజ్ఫిన్సర్వ్, బ్రిటానియా నష్టపోయాయి. అలాగే నైకాషేర్లు 2శాతం పతనాన్ని నమోదు చేశాయి. భారీ అమ్మకాలతో ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా ఆరంభం లాభాలను కోల్పోయింది. తీవ్ర ఒడి దుడుకుల మధ్య శుక్రవారం నాటి 82.68 ముగింపుతో పోలిస్తే స్వల్ప నష్టాలతో 82.73 వద్ద ముగిసింది. -
వాట్సాప్ కలకలం: స్పందించిన సంస్థ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇంటస్టెంట్ మెసేజ్ ప్లాట్ఫాం వాట్సాప్ సేవలు నిలిచి పోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ పనిచేయడం లేదంటూ ట్విటర్లో వేలాది మంది యూజర్లు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో వాట్సాప్ ఎర్రర్, వాట్సాప్ డౌన్ హ్యాష్ట్యా గ్స్ ట్రెండింగ్లో నిలిచాయి. దీంతో సంస్థ స్పందించింది. ప్రస్తుతం కొంతమందికి మెసేజెస్ పంపడంలో సమస్య ఉందని గుర్తించాం. ఈ సమస్యలను వీలైనంత త్వరగా సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే అందరికీ సేవలను అందుబాలుఓకి తీసుకొస్తామని మెటా కంపెనీ ప్రతినిధి తెలిపారు. వినియోదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మరోవైపు వాట్సాప్ సేవలకు అంతరాయం రావడంతో దేశవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు సోషల్ మీడియాలో జోక్స్, సెటైర్లతో తమ స్పందన తెలియ జేస్తున్నారు. #UPDATE | "We're aware that some people are currently having trouble sending messages and we're working to restore WhatsApp for everyone as quickly as possible," says Meta Company Spokesperson — ANI (@ANI) October 25, 2022 Pics not getting uploaded, messages showing single tick!! Is WhatsApp down for everyone? #whatsappdown pic.twitter.com/yGqNXFxL1i — Divyanshu Dubey (@itsdivyanshu) October 25, 2022 People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ — Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022 -
లాభాలకు చెక్, రూపాయి రికార్డు పతనం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నాలుగు రోజుల లాభాలకు చెక్ పెట్టింది. ఆరంభంలోనే 230 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్ 59 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 17500 మార్క్ను కోల్పోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దూకుడు కొనసాగిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్ల నష్టంతో 58989 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పతనమై 17479 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల నష్టపోతున్నాయి. ఇండస్ ఇండ్, టైటన్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, బజాజ ఫైనాన్స్నష్టపోతుండగా, నెస్లే, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్టెక్, టీసీఎస్ లాభాల్లో ఉన్నాయి. మరో ఆల్టైం కనిష్టానికి రూపాయి మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి చేరింది. బుధవారం డాలరు మారకంలో 83 స్థాయికి దిగజారిన కరెన్సీ గురువారం మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. 17 పైసలు నష్టంతో 83.16 వద్ద ఉంది. -
రూపాయి పతనం:ఆమెకు నోబెల్ ఇవ్వాల్సిందే! సోషల్ మీడియాసెటైర్లు
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో ప్రకంకపనలు పుట్టిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర విలువ పెరుగుతోందని పేర్కొన్నారు డాలర్ నిరంతరం బలపడుతూ ఉండటంతో అన్ని కరెన్సీలు బలహీన పడుతున్నాయి. కానీ భారత రూపాయి అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీల కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్య బాణాలు విమర్శలతో హల్చల్ చేస్తున్నారు. ‘రుపీ ఈజ్ నాట్ స్లైడింగ్’ ట్విటర్లో ట్రెండింగ్లో నిలిచింది. హైదరాబాద్కు చెందిన ప్రొ. నాగేశ్వరావు స్పందిస్తూ మన కేంద్ర మంతత్రి నోబెల్ బహుతి ఇవ్వాల్సిందే నంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బంగారం ఒకటి చెప్పనా.. రూపాయి విలువతగ్గితేనే.. డాలర్ పెరిగేది అంటూ మరో యూజర్ కమెంట్ చేశారు. ఇది ఇలా ఉంటే సోమవారం డాలరు మారకంలో రూపాయి 16 పైసలు నష్టంతో 82.35 వద్ద ముగిసింది. Nirmala Sitharaman deserves a Nobel prize in economics for her innovative thesis on currency exchange value. The rupee has not lost, the dollar gained, a finance minister postulates. — Prof. K.Nageshwar (@K_Nageshwar) October 17, 2022 #WATCH | USA: Finance Minister Nirmala Sitharam responds to ANI question on the value of Indian Rupee dropping against the Dollar as geo-political tensions continue to rise, on measures being taken to tackle the slide pic.twitter.com/cOF33lSbAT — ANI (@ANI) October 16, 2022 PM: Climate has not changed, We have changed FM: Rupee is not sliding, Dollar is strengthening#deMOCKracy pic.twitter.com/Lz9ObFL2P6 — Neha (@NehaKoppula) October 16, 2022 The rupee is not sliding but the dollar strengthening. Yes, but we need the rupee to get strengthened against the dollar. — taslima nasreen (@taslimanasreen) October 16, 2022 -
అనూహ్యం: నష్టాల్లోంచి లాభాల్లోకి జంప్ చేసిన స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల ప్రభావంతో సూచీలు గ్యాప్ డౌన్ తో ఓపెనయ్యాయి. సెన్సెక్స్ 121 పాయింట్లు కోల్పోయి 57798 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 17146 వద్ద కొనసాగాయి. కానీ మొదటి గంట తరువాత సూచీలు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 205 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు ఎగిసి ట్రేడ్ అవుతోంది. బజాజ్ ఆటో, ఐసీఐసీఐ, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, హీరో మోటో కార్ప్, లాభపడు తుండగా, ఎం అండ్ ఎండ్, జేఎస్డబ్ల్యు స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 82.38 వద్ద ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకులు, రియాల్టీ, ఐటీ షేర్ల నష్టాలు ప్రభావితంచేశాయి. చివరికి సెన్సెక్స్ 391 పాయింట్లు కుప్పకూలి 57235 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 17014 వద్ద క్లోజ్ అయ్యాయి. అయితే సెన్సెక్స్ 57200 మార్క్ను, నిఫ్టీ 17వేల మార్క్ను నిలబెట్టుకున్నాయి. ఫలితాల షాక్తో విప్రో షేరు ఏకంగా 6శాతం నష్టపోయింది. అలాగే ఎస్బీఐ, ఐసీఐసీఐ, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్ టీ భారీగా నష్టపోయాయి. అయితే ఫలితాలు, డివిడెండ్ నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ 4 శాతం ఎగిసింది. ఇంకా సన్ ఫార్మ, కోల్ ఇండియా, బ్రిటానియా, గ్రాసిం బాగా లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్పల్ప లాభంతో 82.35 వద్ద ముగిసింది. -
ఇన్ప్లేషన్ సెగ: నష్టాల్లో మార్కెట్, ఇన్ఫీ ఫలితాలపై దృష్టి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సంకేతాలకు తోడు, రిటైల్ ద్రవ్యోల్బణం, ఐటీ మేజర్ కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 121 పాయింట్లు నష్టపోయి 57505 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు నష్టంతో 17095 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు బలహీనంగా ఉన్నాయి. సెప్టెంబరు రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో బరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మరింత వడ్డీరేట్ల పెంపు ఆందోళన నెలకొంది. అటు ఆహార ధరలు పెరగడంతో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 7.41 శాతానికి పెరిగింది.మరోవైపు ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ క్యూ 2 ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. -
మూన్లైటింగ్పై విప్రో సీఈవో కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3శాతం క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15శాతం పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్గా లాభం సుమారు 4శాతం, ఆదాయం 5శాతం వృద్ధి చెందాయి. (‘అదానీ’ కి టెలికం లైసెన్స్: డాట్ గ్రీన్ సిగ్నల్) ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్లైటింగ్పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: హోం లోన్లపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఆఫర్స్ ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. (క్లిక్ : అంచనాలు మించి అదరగొట్టిన హెచ్సీఎల్ టెక్) -
రొయ్యో.. అయ్యయ్యో.. భారీగా ధర పతనం!
కాజులూరు(కాకినాడ జిల్లా): రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రొయ్యల సాగు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఏరియేటర్లు పెడుతూ.. అవసరమైన మందులు వాడుతూ రైతులు రొయ్యల సాగును ముందుకు నెట్టుకొస్తున్నారు. ఏదో ఒకవిధంగా కనీసం 30 కౌంట్ వరకూ అయినా రొయ్యలను పెంచితే గత ఏడాది నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వైట్స్పాట్, రెడ్గ్రిల్ వంటి వ్యాధులకు గురై చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు 150, 120 100, 90 వంటి తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు ధరను అమాంతం తగ్గించేశాయి. వారం క్రితం 100 కౌంట్ ధర రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.210కి మించి రావడం లేదు. దీనికి తోడు పట్టుబడి పట్టిన రొయ్యలు పీలింగ్, గుళ్లకొట్టులో ఉన్నాయంటూ నాణ్యత లోపం పేరుతో మరికొంత కోత విధిస్తున్నారు. ఎకరం చెరువులో సగటున రెండు టన్నుల దిగుబడి వస్తే కేజీకి రూ.60 చొప్పున రూ.1.20 లక్షల వరకూ రైతు నష్టపోవాల్సి వస్తోంది. తగ్గిపోయిన ధర రూపంలో కష్టార్జితమంతా కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఈక్వెడార్ వంటి దేశాల నుంచి ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూండటంతో ఇక్కడి రొయ్యలకు డిమాండ్ తగ్గి, ధర పడిపోతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదని, వాతావరణ మార్పులతో వ్యాధులు సోకి రొయ్యలు చనిపోతుండటంతో అందరూ ఒకేసారి పట్టుబడి పట్టాల్సి వస్తోందని, ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రావడంతో కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయని ఆక్వా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగే ఆక్వా మార్కెట్కు ఆ స్థాయిలో డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులుంటాయని.. అయితే స్థానిక కంపెనీలన్నీ సిండికేటుగా మారి సరుకు ఎక్కువగా వచ్చే సమయానికి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేతలు, మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా పట్టుబడి సమయానికి రొయ్యల ధరలు తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని కోరుతున్నారు. అదును చూసుకుని.. రైతుల నుంచి ఒకేసారి సరకు వస్తుంటే కంపెనీలన్నీ ఏకమై ధర తగ్గించేస్తున్నాయి. వ్యాధుల బారిన పడి చెరువుల్లో రొయ్యలు తేలిపోతుండటంతో తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. రొయ్య కేజీ 150 కౌంట్ కంటే చిన్నదిగా ఉంటే కంపెనీలు కొనటం లేదు. డైలీ మార్కెట్లో కేజీ రూ.50కి అమ్ముకోవాల్సి వస్తోంది. – పిల్లి కృష్ణమూర్తి ఆక్వా రైతు, కుయ్యేరు ఇలాగే ఉంటే సాగు కష్టమే మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. పైగా పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే. – వీరవల్లి గణపతి, ఆక్వా ట్రైనీ టెక్నీషియన్, గొల్లపాలెం -
మరింత కుదేలవుతున్న మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బుధవారం నష్టాలతో ప్రారంభమైనాయి. వరుసగా ఏడో రోజు నష్టపోతున్న సెన్సెక్స్ 287 పాయింట్లు కుప్పకూలి 56821 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 16918 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా కీలక సూచీలు రెండు మద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. సెన్సెక్స్ 57వేల స్థాయిని, నిఫ్టీ 17వేల స్థాయిని కోల్పోయి మరింత బలహీన సంకేతాలిచ్చాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఓఎన్టీజీ, ఎన్టీపీసీ హెచ్డీఎఫ్సీ నష్టపోతుండగా, సన్ఫార్మ, పవర్గగ్రిడ్, ఎం అండ్ ఎండ, డా.రెడ్డీస్, టాటా మోటార్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 36 పైసలు కోల్పోయి 81.88 వద్ద సరికొత్త ఆల్ టైం కనిష్టానికి పతనమైంది. -
నష్టాల ముగింపు: ఐటీ, బ్యాంకింగ్ షేర్లు డౌన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అయితే ఆరంభంలో బాగా నష్టపోయిన సూచీలు మిడ్సెషన్లో ఒక దశలో 59 వేల స్తాయిని కోల్పోయింది.తిరిగి అదే రేంజ్లో పుంజుకుంది. చివరికి సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించి 59119 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో 17629 వద్ద ముగిసింది. గురువారం ఎఫ్అండ్ఓ గడువు ముగిసే రోజు కావడంతో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడినిఎదుర్కొన్నాయి.ఐటీ, బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మరింత ఒత్తిడి పెంచాయి. ఇన్ఫోసిస్ షేర్లు ఏడు సెషన్లలో ఆరు సెషన్లకు పడిపోయి 16 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ,కోల్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ భారీగా నష్టపోయాయి. టైటన్, హెచ్యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఐఫర్ మోటార్స్, బ్రిటానియా లాభపడ్డాయి. రుపీ ఢమాల్ అటు డాలరు మారకంలో రూపాయి ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. 91 పైసలు కుప్పకూలి 80.70 చేరింది. ఆ తరువాత మరింత క్షీణించి ఏకంగా 99 పైసలు పతనమై 80.95 వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. -
ఫెడ్ వడ్డీ పెంపు: నష్టాల్లో స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఎఫ్అండ్ఓ గడువు ముగిసే రోజు.సెన్సెక్స్ 168 పాయింట్లు క్షీణించి 59288 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు నష్టంతో 17666 వద్ద కొనసాగుతోంది. దాదాపుఅన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, బ్రిటానియా,మారుతి సుజుకి లాభాల్లో ఉన్నాయి. ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, ఓఎన్జీసీ నష్టాల్లో ఉన్నాయి.మరో వైపు డాలరుమారకంలో రూపాయి భారీగా నష్టపోతోంది.ఏకంగా 60 పాయింట్లు పతనమై 80.45 వద్ద రికార్డ్ లోను నమోదు చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడవసారి వడ్డీ రేట్లను 75 బీపీఎస్పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. -
ఫెడ్ భయాలు: చివరికి నష్టాలే
సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి.గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఫెడ్ రేటు పెంపు భయాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయిన సూచీలు మిడ్సెషన్లో చాలా బాగా పుంజుకున్నాయి.కానీ చివర్లో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో కీలక మద్దతుస్థాయిలకు దిగువకు చేరాయి.సెన్సెక్స్ 263 పాయింట్లుకుప్పకూలి 59456 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 17718 వద్ద ముగిసాయి. తద్వారా సెన్సెక్స్ 59, 500 స్థాయిని, నిఫ్టీ 17800 స్థాయిని కోల్పోయాయి. దాదాపు అన్నిరంగాల షేర్లు ఒత్తడి మధ్య కొనసాగాయి. బ్రిటానియా, హెచ్యూఎల్, అపోలో హాస్పిటల్స్,కోల్ ఇండియా, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ,సన్ ఫార్మా, ఐటిసి షేర్లు టాప్విన్నర్స్గా నిలవగా, శ్రీ సిమెంట్స్, అదానీపోర్ట్స్, ఇండస్ఇండ్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్సిఎల్ టెక్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 28పైసలు కుప్పకూలి 79.97వద్ద 80 మార్క్కు చేరువలో ఉంది. -
ఫెడ్పై కన్ను: భారీ నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడ్ మీట్ ఫలితాలకు ముందు పెట్టుబడిదారుల అప్రమత్తత నేపథ్యంలో బుధవారం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 401 పాయింట్లు క్షీణించి 59318 వద్ద, నిప్టీ 135 పాయింట్లు పతనమై 17681 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుఅన్ని రంగాల షేర్లుఅమ్మకాల ఒత్తిడిలోఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించి 41339 స్థాయిలకు చేరుకుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్సిఎల్ టెక్ టాప్ ఇండెక్స్ డ్రాగర్స్గా ఉన్నాయి. నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, ఐటిసి షేర్లు టాప్ లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలహీనంగా ఉంది. 22పైసల నష్టంతో 79.92 వద్ద ఉంది. ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నేతృత్వంలోని పాలసీ మీట్ ఈ రోజుతో ముగియనుంది. 75 బీపీఎస్ వడ్డీ రేటు పెంపును ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నాయి. 100 బీపీఎస్ పాయింట్లు పెంచవచ్చని కూడా చాలా మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వ్యాఖ్యలు: నష్టాల్లో స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: గ్లోబల్ ట్రెండ్కు అనుగుణంగా దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆరంభంలో 500 పాయింట్లు కుప్పకూలింది. సెన్సెక్స్ 324 పాయింట్లు కోల్పోయి 59609 వద్ద,నిఫ్టీ 91 పాయింట్లు బలహీనపడి 27786 వద్ద కొనసాగుతోంది. ప్రపంచ బ్యాంక్ , అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికల తర్వాత ప్రపంచ మాంద్యం ఆందోళనల మధ్య పెట్టుబడి దారుల సెంటిమెంట్ బలహీనంగా ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆటో షేర్లు లాభపడుతున్నాయి. మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్,ఎఎన్టీపీసీ లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్ర, విప్రో, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. గ్లోబల్ ఎకనామిక్ ఔట్లుక్ డౌన్బీట్గా ఉందని, కొన్నిదేశాలు 2023లో మాంద్యంలోకి జారిపోతాయనే ఆందోళన ఇన్వెస్టర్లను భయపెడుతోంది.అయితే విస్తృతమైన ప్రపంచ మాంద్యం ఉంటుందా అనేది ఇపుడే అంచనా వేయలేదని ఐఎంఎఫ్ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్ల పెంపుతో 2023లో ప్రపంచం ప్రపంచ మాంద్యం వైపు దూసుకు పోవచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ముఖ్యంగా ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా, యూరో జోన్ ప్రభావితం కావవచ్చని తెలిపింది. -
కీలక మద్దతుస్థాయిలు పాయే..బలహీనంగా ముగిసిన మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీనంగా ఉన్నప్పటికీ ఉదయం పటిష్టంగా ఉన్న మార్కెట్లు గురువారం కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ డే హైనుంచి ఏకంగా 600పాయింట్లకు పైగా కుప్పకూలింది. ఫలితంగా 60వేల స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ కూడా 18వేలస్థాయి దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు కుప్పకూలి 59934 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు క్షీణించి 17877 వద్ద ముగిసాయి. మారుతి సుజుకి, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ లాభపడగా, హిందాల్కో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, సిప్లా, హీరో మోటాకార్ప్ నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయల 31పైసలు నష్టంతో 79.69 వద్ద ఉంది. -
ఐటీ షాక్, నష్టాల్లో మార్కెట్లు, అయినా పటిష్టంగానే
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభం నుంచీ అమ్మకాలఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు అదే ధోరణిలో ఉన్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 202 పాయింట్లు కుప్పకూలి 6068 వద్ద,నిఫ్టీ 56పాయింట్లు బలహీన పడి 18013 వద్ద కొనసాగుతున్నాయి. ఒక దశలో 700 పాయింట్లు పతనమై 60 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 50 1.13 శాతం క్షీణించి 17865 వద్దకు చేరుకుంది. బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాభపడుతుండగా, ఇన్ఫోసీస్, టెక్ ఎం, టీసీఎస్ , హెచ్సీఎల్, టెక్, విప్రో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. -
రిలయన్స్ షాక్, భారీ నష్టాలు
సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. ప్రపంచ వృద్ధి ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రభావం చూపడంతో గురువారంకీలక సూచీలు ఆరంభంలోనే కుప్పకూలాయి. రోజంతా అమ్మకాలు, కొనుగోళ్ళ మధ్య తీవ్ర ఒత్తిడితో ఊగిసలాడాయి. దీనికితడు బలహీనమైన దేశీయ జీడీపీ డేటా, ఆగస్ట్ తయారీ రంగం పీఎంఐ తగ్గుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్నుప్రభావితం చేసింది. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రా-డేలో 1,014 పాయింట్లు పతనమైంది. చివరికి 770.5 పాయింట్లు లేదా 1.29 శాతం క్షీణించి 58,766 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 50 కూడా 216.5 పాయింట్లు లేదా 1.22 శాతం క్షీణించి 17,543 వద్ద స్థిరపడింది. ఒకదశలో 17,468 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.9 శాతం నిఫ్టీ ఫార్మా 1.12 శాతం నష్టపోయాయి. విండ్ ఫాల్టాక్స్ ప్రభావంతో ఆయిల్ రంగషేర్లుకూడా నష్టాల్లోనే ముగిసాయి. రిలయన్స్ 3 శాతం నష్టపోగా, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ ఎం,హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐషేర్లు ఒక్కొక్కటి 1.5 శాతానికి పైగా పడిపోయాయి. అయితే రియాల్టీ , ఆటో స్వల్పంగా లాభపడ్డాయి. ఏసియన్పెయింట్స్, బజాజ్ఫిన్స్సర్వ్, ఐషర్ మోటార్స్, హీరోమోటో లాభపడ్డాయి. అటు డాలరుమారకంలో రూపీ 10 పైసల నష్టంతో 79.53 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2 శాతం తగ్గి బ్యారెల్ మార్క్కు 100 డాలర్ల కంటే దిగువకు చేరింది. -
అటు భారీ నష్టాలు,ఇటు సీఎఫ్వో గుడ్బై, కుప్పకూలిన షేర్లు
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్జెట్కు మరోషాక్ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్జెట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్ స్నాగ్ కారణంగా ఢిల్లీ-నాసిక్ స్పైస్జెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్జెట్ లిమిటెడ్ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య సంజీవ్ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి) కాగా జూన్తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్జెట్ వివరణ ఇచ్చింది. -
ఐటీ షేర్లు నష్టాలు, సెన్సెక్స్ 800 పాయింట్లు డౌన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఐటీ స్టాక్స్ బాగా నష్టపోతున్నాయి. ఫలితంగా కీలక సూచీలు కూడా నష్టాల్లో ఉన్నాయి. వినాయక చవితి సెలవు తరువాత సెప్టెంబరు తొలి రోజు మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 772 పాయింట్లు కుప్ప కూలి 58787 వద్ద,నిఫ్టీ 217పాయింట్ల నష్టంతో 17543 వద్ద కొనసాగుతున్నాయి. ఫలితంగా నిఫ్టీ 17600 స్థాయి దిగువకు చేరింది. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, టాటా మోటార్స్ అశోక్ లేలాండ్, అదానీ గ్రూపు షేర్లు, లాభపడుతున్నాయి. హిందాల్కో, ఇన్ఫోసిస్,టీసీఎస్, ఓఎన్జీసీ నష్టపోతున్నాయి.అటు డాలరు మారకంలో రూపాయి 24 పైసలు నష్టంతో 79.64 వద్ద ఉంది. -
అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!
పనీపాటా లేకుండా తిని, పడుకుంటే డబ్బులొస్తాయా? అంటారు కానీ... నిజంగానే ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్డౌన్ కాంపిటీషన్’. పన్నెండో ఏడాది దిగ్విజయంగా జరిగిన ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహుమతి గెలుచుకున్నాడు జర్కో పెజనోవిక్. నగదుతోపాటు ఇద్దరికి రెస్టారెంట్లో భోజనం, ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్స్టే, రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. యూరప్ దేశమైన మాంటెనెగ్రోలోని నగరం నిక్సిక్లో ఈ వింత పోటీ జరిగింది. ‘ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడమేగా. ఈజీగా చేసేయొచ్చు అనుకున్నాను.. కానీ కష్టమే’ అన్నాడు జర్కో. చూడటానికి కుటుంబసభ్యులెవరైనా వచ్చినప్పుడు కూడా లేవకుండా ఉండగలగడం కష్టమైన విషయమని చెప్పాడు. వంద సంవత్సరాల కిందటి ఓ చెట్టు కింద పోటీ నిర్వహించారు. తొమ్మిది మందితో పోటీ ప్రారంభమైనా.. ఏడుగురు మొదటిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండురోజులు మిగిలిన ఇద్దరి మధ్యే కాంపిటీషన్ జరిగింది. చివరకు జర్కో గెలిచాడు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..:) -
ఆఖరి గంటలో అమ్మకాలు, హై నుంచి 800 పాయింట్లు పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.ఆరంభం లాభాలనుంచి మిడ్ సెషన్ తరువాత మరింత ఎగిసినప్పటికీ, ఆ తరువాత ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ కురిసింది. ఫలితంగా డే హైనుంచి సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైన కుప్పకూలింది. చివర్లో కాస్త పుంజుకుని సెన్సెక్స్ 310 పాయింట్ల పతనమై 58774 వద్ద,నిఫ్టీ83 పాయింట్లు క్షీణించి 17522 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల నష్టాలు ప్రభావితం చేశాయి. ఇండస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, అదానీ, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, సిప్లా, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. శ్రీ సిమెంట్, దివీస్, హిందాల్కో, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. -
భారత్లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2022 జూలైలో 3.8 శాతం తగ్గింది. 2021 జూలైలో 2.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే, తాజా సమీక్షా నెల జూలై ఈ పరిమాణం 2.45 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి దీనికి ప్రధాన కారణం. దేశ నెలవారీ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి లక్ష్యం 2.59 మిలియన్ టన్నులకన్నా తక్కువ ఉత్పత్తి నమెదయినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. పశ్చిమ సముద్ర తీరంలో ఓఎన్జీసీ ఉత్పత్తి వార్షికంగా చూస్తే 1.7 శాతం తగ్గి 1.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న క్షేత్రాల్లో సైతం ఉత్పత్తి 12.34 శాతం క్షీణించింది. వార్షిక అంచనాలు ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాలుగు నెలల కాలాన్ని పరిశీలిస్తే (2021-22 ఇదే కాలంతో పోల్చి) క్రూడ్ ఉత్పత్తి 9.96 మిలియన్ టన్నుల నుంచి స్వల్పంగా 9.91 మిలియన్ టన్నులకు తగ్గింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 29.7 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి వరుసగా 39.8 మిలియన్ టన్నులు, 34 మిలియన్ టన్నులుగా నమోద వుతుందని అంచనావేస్తున్నట్లు చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవలే పేర్కొన్నారు. దేశం తన మొత్తం క్రూడ్ అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడే సంగతి తెలిసిందే. మిగిలిన 15 శాతం క్రూడ్ను భారత్ ఉత్పత్తి చేస్తుంది. చమురు శుద్ధికి దేశంలో 22 ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. అక్కడక్కడే సహజ వాయువు ఉత్పత్తి కాగా, దేశీయ సహజ వాయువు ఉత్పత్తి జూలైలో దాదాపు అక్కడక్కడే 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా (బీసీఎం) ఉంది. అయితే నాలుగు నెలల కాలంలో మాత్రం ఉత్పత్తి 3.4 శాతం పెరిగి 11.43 బీసీఎంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ముంబై సముద్రతీరంలోని డామన్ క్షేత్రంలో తక్కువ గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఓఎన్జీసీ గ్యాస్ ఉత్పత్తి జూలైలో దాదాపు 4 శాతం క్షీణించింది. -
అన్నింటా అమ్మకాలే: సెన్సెక్స్ 872 పాయింట్లు ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లుభారీ నష్టాలతోముగిసాయి. ఆరంభంలోనే భారీగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తరువాత మరింత అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అన్ని రంగాల షేర్లలోలనూ ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 872 పాయింట్లు కుప్పకూలి 58773 వద్ద ముగిసింది. తద్వారా 59వేల స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ కూడా 267 పాయింట్ల నష్టంతో 17490 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్, రియల్టీ స్టాక్లలో సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్ను ప్రభావితం చేసింది. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో, కోటక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, విప్రో, యూపిఎల్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాప్ లూజర్స్గా ఉన్నాయి. టాటా కన్జూమర్, ఐటీసీ, కోల్ ఇండియా, బ్రిటానియా, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 12 పైసలు నష్టపోయి 79.87 వద్ద ముగిసింది. -
బ్యాంకు షేర్లు బేజారు, సెన్సెక్స్ భారీ పతనం
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా టట్రేడింగ్ను ఆరంభహించాయి.అనంతరం మరింత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమై 59021 వద్ద,నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 17569వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2 శాతం కుప్పకూలింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.5శాతం, యాక్సిస్ బ్యాంక్ ,టెక్ మహీంద్రా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దివీస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ కూడా నష్టాల్లోకొనసాగుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్ టాప్ గెయినర్, హిందుస్తాన్ యూనిలీవర్ . డాక్టర్ రెడ్డీస్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. 11 పైసలుకోల్పోయి 79.86వద్ద ట్రేడ్ అవుతోంది. -
భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ భారీగా నష్టపోయింది. మధ్యాహ్నం సెషన్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఒకదశలో సెన్సెక్స్ ఏకంగా700 పాయింట్లు కుప్ప కూలింది. చేరింది. చివరికి సెన్సెక్స్ 651 పాయింట్ల నష్టంతో 59646 వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు కుప్పకూలి 17758 వద్ద ముగిసింది. అలాగే తాజా నష్టాలతో సెన్సెక్స్ 60వేల దిగువకు, నిఫ్టీ కూడా 17800 దిగువకు పడిపోయింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు,నష్టపోగా ఐటీ జోరు కొనసాగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.58 శాతం,బజాజ్ ఫిన్సర్వ్ 2.50 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.77 శాతం నష్టపోయింది. అలాగే ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ సెన్సెక్స్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఐటీ జోరు నష్టాల మార్కెట్లో ఐటీ షేర్లు మాత్రం కొనుగోళ్లు కనిపించాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు డాలరుమారకరంలో రూపాయి 14 పాయింట్లు నష్టంతో 79.78 వద్ద ఉంది. -
లాభాల స్వీకరణ, సెన్సెక్స్ 280 పాయింట్లు డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుస లాభాలు, హైస్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సెన్సెక్స్ 60వేల పాయింట్లు దిగువకు, నిఫ్టీ 17900 దిగువకు చేరాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనే అమ్మకాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు జూలై ఫెడ్ మినిట్స్ లో ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడం, సెప్టెంబర్లో మరో 75 బేసిస్ పాయింట్ల వడ్డీరెటుపెంపు తప్పదన్న అంచనాలతో గ్లోబల్ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతింది. దేశీయంగా గురువారం నాటి మార్కెట్లో ఐటీ, ఫార్మ రంగాలు నష్టపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ లైఫ్ టాప్ గెయినర్స్గా కొనసాగుతుండగా, డా.రెడ్డీస్, ఓఎన్జీసీ, సన్ ఫార్మ, విప్రో, బీపీసీఎల్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 26 పాయింట్లు నష్టంతో 78.65 కి చేరింది. -
డా.రెడ్డీస్ లాభం 108 శాతం అప్: అయినా షేరు ఢమాల్
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాల్లో భారీ పురోగతి సాధించినప్పటికీ శుక్రవారం నాటి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 4 శాతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. క్యూ1లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 1,188 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 571 కోట్లతో పోలిస్తే ఇది 108 శాతం అధికం. సమీక్షాకాలంలో ఆదాయం ఆరు శాతం పెరిగి రూ. 4,919 కోట్ల నుంచి రూ. 5,215 కోట్లకు ఎగిసింది. ప్రధానంగా ఇండివియర్, అక్వెస్టివ్ థెరాప్యూటిక్స్లతో సుబాక్సోన్ ఔషధ వివాద సెటిల్మెంట్తో వచ్చిన నిధులు, అలాగే కొన్ని బ్రాండ్ల విక్రయాలు తదితర అంశాలు ఇతర ఆదాయం పెరగడానికి కారణమని ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఉత్పాదకతను పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర చర్యలతో వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ కో-చైర్మన్, ఎండీ జి.వి. ప్రసాద్ తెలిపారు. బూస్టర్ డోస్గా స్పుత్నిక్ లైట్.. కోవిడ్కి సంబంధించి స్పుత్నిక్ లైట్ను దేశీయంగా ఇతర టీకాలకు యూనివర్సల్ బూస్టర్ డోస్గా ఉపయోగించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ వెల్లడించారు. -
హైబ్రిడ్ వర్క్: ఐటీ దిగ్గజాలకు ఆ తలనొప్పి బాగా తగ్గిందట!
కాలిఫోర్నియా: వర్క్ ఫ్రం హోం పని విధానం అటు ఐటీ ఉద్యోగులకు, ఇటు ఐటీ సంస్థలకు బాగా ఉపయోగపడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే హైబ్రిడ్ వర్క్ కంపెనీలకు ఇతర ఉపయోగాలతోపాటు మరో ప్రయోజనం కలిగిందని తాజా అధ్యయనంలో తేలింది. పని విధానం రేటింగ్, ప్రమోషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోవడమేకాదు, ఐటీ దిగ్గజాలకు అట్రిషన్ (కంపెనీనుంచి మరో కంపెనికి తరలిపోవడం) అనే పెద్ద తలనొప్పినుంచి మూడోవంతు ఊరట లభించిందట. హైబ్రిడ్ పనివిధానంతో ప్రముఖ ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు 35 శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నికోలస్ బ్లూమ్ ఆధ్వర్యంలోని కొత్త అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. మొత్తంగా హైబ్రిడ్, లేదా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, సంస్థలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో హైలైట్ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో లాక్డౌన్లు, ప్రయాణ ఆంక్షలతో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలబించాయి. ఆ తరువాత సడలింపులతో హైబ్రిడ్ వర్క్ పద్దతిని ఫాలో అవుతున్నాయి. సాధారణంగా ప్రతి వారం కార్యాలయంలో రెండు నుండి మూడు రోజులు పని చేయడం , మిగిలిన రోజుల్లో ఇంట్లోనుంచే పని చేయడం అన్నమాట. నిరుద్యోగం రేటు ఐదు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఇంటి నుండి పని చేసే విధానాన్ని తీవ్రంగా విమర్శించిన కొందరు కూడా ఉద్యోగులను ఆకర్షించడానికి వర్క్ ఫ్రం హోంను ఎంచు కున్నారుని స్టడీ వ్యాఖ్యానించింది. గ్లోబల్ ట్రావెల్ ఏజెంట్ Trip.comలో 2021, 2022లో 1,612 ఇంజనీర్లు, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉద్యోగులపై ట్రయల్ స్టడీ చేసింది. ఇందులో భాగంగా బేసి డేట్స్లో జన్మించిన వారు బుధ, శుక్రవారాల్లో ఇంటి నుండి పని చేసేందుకు నిర్ణయించుకోగా, మరికొందరు పూర్తి సమయం కార్యాలయంలో పని చేశారు. ఈ అధ్యయనం సానుకూల ఫలితాలతో Trip.com మొత్తం కంపెనీకి హైబ్రిడ్ పనిని అందించిందని ఈ స్టడీ నివేదించింది. బ్లూమ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన రూబింగ్ హాన్ , జేమ్స్ లియాంగ్ సహ రచయితలుగా ఒక పేపర్ను పబ్లిష్ చేశారు. అట్రిషన్లో మెరుగుదలతో పాటు, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ పేపర్ హైబ్రిడ్ ఏర్పాట్లు పని షెడ్యూల్లు ,అలవాట్లను ఎలా మారుస్తుందో కూడా హైలైట్ చేసింది. రిమోట్ రోజులలో తక్కువ గంటలు పని చేసినా కానీ వారాంతంతో సహా ఇతర రోజులలో పని గంటల సంఖ్యను పెంచారు. మొత్తంగా, ఉద్యోగులు ఇంటి రోజులలో దాదాపు 80 నిమిషాలు తక్కువ పనిచేశారు కానీ ఇతర పని దినాల్లో వారాంతంలో దాదాపు 30 నిమిషాలు ఎక్కువ పనిచేశారు. ఈ పనివిధానంతో వర్క్ రివ్యూ, ప్రమోషన్స్లో ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. మొత్తంగా ఇంటి నుండి పని చేసే అవకాశం ఉన్నవారు కొంచెం ఎక్కువ ఉత్పాదకతను నివేదించారు. ఆఫీసుల్లో పనిచేసినవారితో పోలిస్తే కోడ్ లైన్లలో 8 శాతం పెరుగుదల నమోదైందట. -
ఫారెక్స్ నిల్వల భారీ తగ్గుదల
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫారెక్స్ నిల్వలు ఏ వారానికావారం భారీగా తగ్గుతున్నాయి. జూలై 8తో 8.062 బిలియన్ డాలర్లు తగ్గి, 580.252 బిలియన్ డాలర్లకు పడిపోయిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూలై 15వ తేదీతో ముగిసిన వారంలో మరో 7.541 బిలియన్ డాలర్లు తగ్గి 572.712 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలను వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్లో అవసరాలకు సంబంధించి డాలర్ల లభ్యత తగిన విధంగా ఉండేలా చూడ్డం, ఎగుమతులకన్నా, దిగుమతులు పెరుగుదల వంటి అంశాలు ఫారెక్స్ నిల్వల తగ్గుదలకు కారణం అవుతోంది. 2021 సెపె్టంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. గణాంకాల ప్రకారం.. అన్ని విభాగాల్లోనూ తగ్గుదలే... ♦ డాలర్ రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ సమీక్షా వారంలో 6.527 బిలియన్ డాలర్లు తగ్గి 511.562 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ పసిడి నిల్వలు 830 మిలియన్ డాలర్లు తగ్గి, 38.356 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. ♦ ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 155 మిలియన్ డాలర్ల తగ్గి 17.857 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థాయి కూడా 29 మిలియన్ డాలర్లు తగ్గి 4.937 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గవర్నర్ భరోసా కాగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఒక కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడుతూ, దిగుమతులు, రుణ సేవల అవసరాలు, పోర్ట్ఫోలియో అవుట్ఫ్లోల కారణంగా డిమాండ్కు సంబంధించి ఫారెక్స్ మార్కెట్లో విదేశీ మారకపు సరఫరాలకు సంబంధించి వాస్తవంగా కొరత ఉందని అన్నారు. తగినంత విదేశీ మారక ద్రవ్య లభ్యత ఉండేలా సెంట్రల్ బ్యాంకు మార్కెట్కు అమెరికా డాలర్లను సరఫరా చేస్తోందని చెప్పారు. ‘‘మూలధన ప్రవాహం బలంగా ఉన్నప్పుడు మనం ఫారెక్స్ నిల్వలను భారీగా కూడబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నాం. వర్షం పడుతున్నప్పుడు ఉపయోగించేందుకు మీరు గొడుగును కొనుగోలు చేస్తారు’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
లాభాలు పాయే, ఫ్లాట్గా సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 179 పాయింట్ల నష్టంతో 54,341 వద్ద,నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించి 16,225 వద్దకు చేరాయి. ప్రస్తుతం నష్టాలను పరిమితం చేసుకుని ఫ్లాట్గా కొన సాగుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నష్టపోతున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ టాప్ నిఫ్టీ లూజర్గా ఉంది.ఎస్బీఐ లైఫ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ కూడా వెనుకబడి ఉన్నాయి. అలాగే దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ అండ్ టి, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ లూజర్గా ఉన్నాయి. టాటా స్టీల్, ఎంఅండ్ ఎం అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా సోమవారంసెన్సెక్స్ ఏకంగా 740 పాయింట్లు ఎగిసి 54,521 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 16,279 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి తొలిసారి డాలరు మారకంలో 80 రూపాయిల స్థాయికి పడిపోయింది. ఈ వారం సెంట్రల్ బ్యాంక్ సమావేశాలపై, ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్పై ట్రేడర్లు దృష్టి సారించినందున, మంగళవారం నాడు తొలిసారిగా రూపాయి డాలర్కు 80కి చేరుకుంది. దీంతో మరింత క్షీణత తప్పదనే ఆందోళన నెలకొంది. -
తీవ్ర ఊగిసలాట; కోలుకున్నా చివరికి నష్టాలే
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో కళకళలాడిన సూచీలు మిడ్ సెషన్ నుంచీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఎఫ్అండ్ఓ సిరీస్ గడువు ముగింపు రోజు కావడంతో తీవ్ర ఓలటాలిటీ మధ్య కొనసాగాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. యూరోపియన్ మార్కెట్లలో బలహీన ధోరణుల మధ్య ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ షేర్లు నష్టపోయాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టాలకు పరిమితమై 53416 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 15938 వద్ద ఫ్లాట్గా స్థిరపడ్డాయి. సన్ఫార్మా, కోటక్ మహీంద్ర, మారుతి సుజుకి, బ్రిటానియా, డా.రెడ్డీస్ లాభపడగా,హెచ్సీఎల్ టెక్, హీరోమోటో కార్ప్,టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి పతనానికి అంతు లేకుండాపోతోంది. 79.87 వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరింది. -
బ్యాంకింగ్ షేర్లు ఢమాల్: మార్కెట్లకు భారీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి 372 పాయింట్లు పతనమై 53514 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 92 పాయింట్లు నష్టపోయి 15966 వద్ద స్థిరపడింది. దాదాపు అన్నిరంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా వరుసగా మూడవ సెషన్లో బుధవారం కూడా నష్టపోయాయి. బ్యారెల్కు క్రూ డ్ ధరలు 100 డాలర్లకు పైకి చేరడంతో మార్కెట్లను ప్రభావితం చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టపోగా, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. దివీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్యూఎల్, సిప్లా, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు ఇండస్ ఇండ్, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్, కోల్ ఇండియా, టిసిఎస్, టైటాన్, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనం బుధవారం కూడా కొనసాగింది. డాలరు మారకంలో రూపాయి 79.64 వద్ద రికార్డు క్లోజింగ్ను నమోదు చేసింది. -
నష్టాల్లో స్టాక్మార్కెట్లు: ఆగని రూపాయి పతనం
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 324 పాయింట్లు 54071 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 16150 స్థాయిల దిగువకు చేరింది. సెన్సెక్స్ 217 పాయింట్ల నష్టంతో 54177 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 16143 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్, విప్రో లాభపడుతున్నాయి. మరోవైపు హిందాల్కో, జేఎస్డబ్ల్యు స్టీల్, యూపీఎల్, టాటా స్టీల్, బజాజ్ఫిన్ సర్వ్ ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), హెచ్డిఎఫ్సి బ్యాంక్ ననష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ మంగళవారం మరో ఆల్ టైం కనిష్టానికి చేరింది. డాలరు పోలిస్తే 79.58 రికార్డు కనిష్టం వద్ద కొనసాగుతోంది. -
స్టార్టప్లకు నిధులు: 40 శాతం ఢమాల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక-రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో దేశీ స్టార్టప్లలోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 40 శాతం పడిపోయి 6.8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన స్టార్టప్ డీల్స్ ట్రాకర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంకుర సంస్థల్లో సగటున 5 మిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో 60 శాతం వాటాను ప్రారంభ దశలోని అంకుర సంస్థలే దక్కించుకున్నాయి. వరుసగా మూడు త్రైమాసికాల పాటు 10 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమకూర్చుకున్న దేశీ స్టార్టప్ వ్యవస్థ ఈ ఏడాది (2022) రెండో త్రైమాసికంలో 6.8 బిలియన్ డాలర్లు మాత్రమే సమకూర్చుకోగలిగిందని నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది. టెక్నాలజీ స్టాక్స్ వేల్యుయేషన్లు పడిపోవడం, ద్రవ్యోల్బణం ఎగియడం, అంతర్జాతీయంగా మందగమనం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సాస్ కంపెనీల్లోకి అత్యధికంగా నిధులు.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్), ఫిన్టెక్ కంపెనీల్లోకి అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల మేర నిధులు వచ్చాయి. ప్రారంభ దశలోని అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు సుమారు 800 మిలియన్ డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. రాబోయే త్రైమాసికాల్లోనూ ఇదే ధోరణి ఉండవచ్చని లేదా డిజిటైజేషన్ ఊతంతో మరింతగా పెరగవచ్చని నివేదిక తెలిపింది. మొత్తం మీద నిధుల ప్రవాహం ఒక స్థాయిలో స్థిరపడటానికి 12-18 నెలలు పట్టొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈలోగా స్టార్టప్లు తాము నిధులు సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వ్యాపారాలను తీర్చిదిద్దుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ అమిత్ నావ్కా పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న స్టార్టప్ల వేల్యుయేషన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు .. ♦ బెంగళూరు, ముంబై, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) కీలక స్టార్టప్ నగరాలుగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 95 శాతంగా ఉంది. చెన్నై, పుణె ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ♦ బెంగళూరులో ఏడు కంపెనీలు 100 మిలియన్ డాలర్ల పైగా సమీకరించాయి. డైలీహంట్, ర్యాపిడో, లీడ్స్క్వేర్డ్, లెన్స్కార్ట్, క్రెడ్, ఎథర్ ఎనర్జీ, అబ్జర్వ్.ఏఐ వీటిలో ఉన్నాయి. ♦ ఎన్సీఆర్లో 7 కంపెనీలు 100 మిలియన్ డాలర్ల పైగా సమీకరించాయి. ♦ ముంబైలో నాలుగు కంపెనీలు తలో 100 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. అప్గ్రాడ్, జెప్టో, కాయిన్డీసీఎక్స్, టర్టిల్మింట్ వీటిలో ఉన్నాయి. ♦ 2022 రెండో త్రైమాసికంలో దేశీయంగా నాలుగు అంకుర సంస్థలు మాత్రమే యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్) హోదా దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా యూనికార్న్ల సంఖ్య 1,200కి చేరింది. ఇక, డెకాకార్న్ల సంఖ్య (10 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవి) 57కి చేరింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్తగా నాలుగు సంస్థలు ఈ జాబితాలోకి చేరాయి. -
ఆటో జోరు, ఐటీ బేజారు నష్టాల్లో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా ఐటీ రంగ షేర్లు నష్టపోతుండగా, ఆటో, ఆయిల్ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎం అండ్ ఎండ్ ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా లాభ పడుతుండగా, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్సీఎల్, టెక్ ఎం, విప్రో నష్టపోతున్నాయి. -
డే హై నుంచి మార్కెట్ పతనం: రికార్డు కనిష్టానికి రూపాయి ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్లో 600 పాయింట్ల మేర ఎగిసిన డే హై నుంచి పతనమైంది. సెన్సెక్స్ ఒక దశలో 53,866 గరిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా 16,000 మార్క్ను దాటింది. యితే లాభాల స్వీకరణతో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. డై హై నుంచి 600 పాయింట్లు కోల్పోయింది. చివరకు సెన్సెక్స్ 100 పాయింట్లు క్షీణించి 53134 వద్ద, నిఫ్టీ24 పాయింట్ల నష్టంతో 15810 వద్ద స్థిరపడ్డాయి. మెటల్ రంగ షేర్లు లాభపడగా ఆటో, ఐటీ షేర్లు నష్టాల్లో ముగిసాయి. హిందాల్కో, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, శ్రీసిమెంట్స్, పవర్ గ్రిడ్, ఎంఎంటీసీ, మార్క్సన్స్ ఫార్మా టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇంకా ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, బ్రిటానియా, బీపీసీఎల్ టాప్ లూజర్స్గా ముగిసాయి. మరో వైపు దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం 79.14 వద్ద మరో రికార్డు కనిష్టానికి చేరింది. చివరలో మరింత పతనమై 79.36 వద్ద రికార్డు కనిష్టం, ముగింపును నమోదు చేసింది. సోమవారం 78.95 వద్ద ముగిసిన రూపాయి నేడు ఆరంభంలోనే బలహీనపడింది. -
మార్కెట్ క్యాప్ ఢమాల్: బిలియన్ డాలర్ కంపెనీలు ఔట్
కొద్ది రోజులుగా గ్లోబల్ ట్రెండ్కు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి తదుపరి ధరలు ఊపందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బలపడుతున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన లిక్విడిటీ విధానాలకు తెరతీయడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయంగానూ పలు స్టాక్స్ బేర్మంటున్నాయి. 2021 అక్టోబర్లో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు నేలచూపులకు పరిమితమవుతున్నాయి. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు చిల్లు పడుతోంది. రికార్డ్ స్థాయి నుంచి.. గతేడాది అక్టోబర్లో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 62,245 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో బిలియన్ డాలర్ల(అప్పట్లో సుమారు రూ. 7,500 కోట్లు) మార్కెట్ విలువను అందుకున్న కంపెనీలు 400కుపైగా నమోదయ్యాయి. అయితే తదుపరి ద్రవ్యోల్బణం ధాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్సహా, ఆర్బీఐవరకూ వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టడంతో ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. దీనికితోడు రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ముడిచమురు ధరలకు రెక్కలిచ్చింది. ఫలితంగా డాలరు భారీగా బలపడితే.. రూపాయి పతన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53,235 పాయింట్ల స్థాయికి తిరోగమించింది. దీంతో లిస్టెడ్ కంపెనీల విలువలూ నీరసించాయి. గత 9 నెలల్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో 660 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52 లక్షల కోట్లు) ఆవిరైందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు! ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,23,834 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మధ్య, చిన్నతరహా కంపెనీలకు అమ్మకాల సెగ తగులుతోంది!! విలువల నేలచూపు మార్కెట్లతోపాటు ఇటీవల షేర్ల ధరలు సైతం కుదేలవుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79కు చేరింది. ఫలితంగా బిలియన్ డాలర్ల(రూ. 7,900 కోట్లు) జాబితాకు రెండు వైపులా దెబ్బతగులుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. షేర్ల ధరలు తగ్గడానికితోడు రూపాయి విలువ నీరసించడంతో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ జాబితాలో కంపెనీల సంఖ్య క్షీణించింది. దీంతో వీటి సంఖ్య తాజాగా సుమారు 340కు చేరింది. జాబితాలో వీక్ గత 9 నెలల్లో కొన్ని కంపెనీల షేర్లు పతన బాటలో సాగాయి. దీంతో వీటి విలువకు భారీగా చిల్లు పడింది. ఈ జాబితాలో మణప్పురం ఫైనాన్స్, వెల్స్పన్ ఇండియా, హెచ్ఈజీ, నజారా టెక్నాలజీస్, జెన్సార్, లక్స్ ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్కాన్ 70–50 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, మెట్రోపోలిస్ హెల్త్కేర్, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, ఇండిగో పెయింట్స్, వైభవ్ గ్లోబల్, ఇండియాబుల్స్ హౌసింగ్ తదితరాలు సైతం అత్యధికంగా క్షీణించాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ విలువను కోల్పోవడం గమనార్హం! ఈ కాలంలో బీఎస్ఈలోని 1,100 షేర్లను పరిగణిస్తే 75 శాతంవరకూ నష్టాల బాటలోనే సాగాయి! లాభపడ్డవీ ఉన్నాయ్ కొద్ది రోజులుగా మార్కెట్లు డీలా పడినప్పటికీ జోరందుకున్న కంపెనీలూ ఉన్నాయి. దీంతో ఇదే కాలంలో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న జాబితాలో ఆటో, ఇండస్ట్రియల్ విడిభాగాల కంపెనీ ఎల్జీ ఎక్విప్మెంట్స్తోపాటు, శ్రీ రేణుకా షుగర్స్, జీఎన్ఎఫ్సీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సుందరం క్లేటాన్, ఆర్హెచ్ఐ మెగ్నీసిటా, బోరోసిల్ రెనెవబుల్స్ చోటు సాధించాయి. ఈ షేర్లు 20–70 శాతం మధ్య జంప్చేయడం ఇందుకు సహకరించింది. -
అయ్యో ఓలా ఎలక్ట్రిక్: కస్టమర్ల షాక్ మమూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దేశంలో ఎలక్ట్రానిక్ టూవీలర్స్ సెగ్మెంట్లో టాప్లో ఒక వెలుగు వెలిగిన ఓలా ఎలక్ట్రిక్కు వరుసగా మరో షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ వాహనాల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తి భారీగా తగ్గిపోతోంది. అమ్మకాలు లేక వెలవెలబోతోంది. రిజిస్ట్రేషన్లు పతనంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఓలా రిజిస్ట్రేషన్లు మే 30తో పోలిస్తే జూన్ 30 నాటికి 30 శాతానికి పైగా తగ్గాయి. అయితే ఏప్రిల్,మే నెలల్లో నెలవారీగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ జూన్లో స్వల్పంగా పెరిగాయి. జూలై 2 నాటి వాహన్ పోర్టల్ తాజా సమాచారం ప్రకారం జూన్లో నమోదైన మొత్తం ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు)42,233 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో 2022లో ఇప్పటివరకు కేటగిరీలో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 2.4 లక్షల యూనిట్లకు చేరుకుంది. కానీ భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్ జూన్లో బాగా తగ్గిపోయాయి. అధికారిక డేటా ప్రకారం జూన్ 30 నాటికి 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒకినావా ఆటోటెక్ దేశవ్యాప్తంగా 6,976 వాహనాల రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కూటర్స్ 6,534తో రెండవ స్థానంలో నిలిచింది. 6,486 ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్ట్రేషన్లతో హీరో కంపెనీ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఏథర్ ఎనర్జీ 3,797 రిజిస్ట్రేషన్స్, 2,419 రివోల్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇటీవల ప్రమాదానికి గురైన కంపెనీల్లో ఒకటైన ప్యూర్ ఈవీ రిజిస్ట్రేషన్లు 1125 యూనిట్లకు తగ్గాయి. ఈ ఏడాది మేలో 1,466 యూనిట్లు ఏప్రిల్లో 1,757 యూనిట్లను విక్రయించింది. ఒకినావా మేలో 9,302 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్ 9,225 యూనిట్ల ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. ఇది ఇలా ఉంటే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బ్యాటరీలలో సెక్యూరిటీ లోపాలున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలోనే పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు, బ్యాటరీ పేలుళ్లు, బ్యాటరీలలో లోపాలు లాంటి అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా దాదాపు అన్ని కంపెనీలకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. -
ఎకానమీ వృద్ధి అంచనాలకు క్రిసిల్ కోత
సాక్షి, ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం 7.3 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఎగుమతుల డిమాండ్ మందగమనం తన తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. ఈ మేరకు క్రిసిల్ విడుదల చేసిన నివేదికలో కొన్నిముఖ్యాంశాలు.. ♦ అధిక కమోడిటీ, సరకు ధరలు, ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గుముఖం పట్టడంతో ఎగుమతులకు డిమాండ్ తగ్గే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ వినియోగంకు దోహదపడే అంశాలు కూడా బలహీనంగా ఉండటం తీవ్ర ప్రతికూలాంశం. ♦ కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల్లో పెరుగుదల, సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ప్రస్తుతం ఎకానమీకి ఉన్న బలాలు. ♦ ద్రవ్యోల్బణం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతం ఉంటే, 2022–23లో సగటున 6.8 శాతంగా ఉంటుందని అంచనా. ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వినియోగం పునరుద్ధరణపై ప్రభావం చూపుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో కొనుగోలు, వినియోగ రంగాలపాత్ర కీలకం. ♦ అధిక కమోడిటీ ధరలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, సరఫరా చైన్లో సవాళ్లు భారత్ కరెంట్ ఖాతాపై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతుంది. కరెంట్ ఖాతా లోటు 2021-22లో (జీడీపీ) 1.2 శాతం ఉంటే, 2022-23లో 3 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ♦ఆర్థిక బలహీనతల నేపథ్యంలో 2023 మార్చి నాటికి అమెరికా డాలర్లో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉంది. పెరుగుతున్న వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) ప్రవాహాలు భారీగా వెనక్కు మళ్లడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలోపేతం (రిజర్వ్ రేట్ల పెంపుదల కారణంగా) రూపాయి-డాలర్ మారకపు విలువ సమీప కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు, దిగువముఖ పయనానికి దారితీసే వీలుంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఎంచుకోవచ్చు. ♦2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ క్రూడ్ సగటు బ్యారెల్కు 105-110 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2013 తర్వాత క్రూడ్ ఈ స్థాయిలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ♦ అధిక కమోడిటీ ధరలు భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెరుగుతున్న దిగుమతి బిల్లుతో వాణిజ్య లోటు తీవ్రం అయ్యే వీలుంది. దిగుమతుల బిల్లు పెరగడం ద్ర వ్యోల్బణం పెరుగుదలకూ కారణం అవుతుంది. ♦ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను మరో 75 బేసిస్ పాయింట్లకు పెంచే వీలుంది. మే, జూన్ నెలల్లో రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి ఎగసింది. వడ్డీరేట్ల పెరుగుదల వృద్ధి అవకాశాలను దెబ్బతీసే అంశం. రియల్టీ మహమ్మారి స్థాయికన్నా కిందకు పడిపోయే వీలుంది. ద్రవ్యోల్బణం కట్టడికి ద్రవ్య పరపతి విధానాలు మరికొంతకాలం కఠినంగా కొనసాగే అవకాశం ఉంది. 2022-23పై అంచనాల కోతలు (శాతాల్లో) ఇలా... సంస్థ తాజా తొలి ఆర్బీఐ 7.2 7.8 ఎస్అండ్పీ 7.3 7.8 ఫిచ్ 8.5 10.3 ప్రపంచ బ్యాంక్ 7.5 8.0 ఐఎంఎఫ్ 8.2 9 ఏడీబీ 7.5 –– ♦ మూడీస్ గత ఏడాది నవంబర్లో 2022–23లో భారత్ వృద్ధి 9.3 శాతం ఉంటుందని అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంచనా తగ్గించే అవకాశం ఉంది. అయితే 2022 క్యాలెండర్ ఇయర్లో వృద్ధి రేటు అంచనాలను మూడీస్ 9.1 శాతం నుంచి 8.8 శాతానికి కోత పెట్టింది. -
గ్లోబల్ సంకేతాలు: నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బలహీన గ్లోబల్ సంకేతాలతో ఆరంభంలోనే శుక్రవారం 300 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్388 పాయింట్లు నష్టపోయి 52631 వద్ద, నిప్టీ 115 పాయింట్లు పతనంతో 15665 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టైటన్, ఎం అండ్ఎం, టాటా మెటార్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్ర, సిప్లా, టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి. కాగా గ్లోబల్ ఎకనామిక్ ఔట్లుక్పై ఇన్వెస్టర్లు ఆందోళన నేపథ్యంలో ఆసియా స్టాక్లు నష్టపోతున్నాయి. దీనికి తోడు వాల్ స్ట్రీట్ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 21 శాతం పతనాన్ని నమోదు చేసింది . 1970 తర్వాత అత్యంత దారుణమైన పతనమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు, అసలు కారణం ఇదే!
న్యూఢిల్లీ: హైదరాబాద్తోపాటు దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–జూన్) 15 శాతం తగ్గాయి. 84,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) ఇళ్ల విక్రయాలు 99,550 యూనిట్లుగా ఉన్నాయి. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల విక్రయాలు 24,569 యూనిట్లతో పోలిస్తే 3.5 రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో 11,190 యూనిట్లు ఏప్రిల్–జూన్లో హైదరాబాద్ మార్కెట్లో 11,190 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చిలో విక్రయాలు 13,140 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే, జూన్ త్రైమాసికంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం తగ్గి 25,785 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 19 శాతం తక్కువగా 15,340 యూనిట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులో 14 శాతం తగ్గి 11,505 యూనిట్లుగా ఉన్నాయి. పుణెలో 11 శాతం తగ్గి 12,500 యూనిట్లు, చెన్నైలో 24 శాతం క్షీణించి 3,810 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్కతాలోనూ 20 శాతం తక్కువగా 4,800 యూనిట్లు విక్రయమయ్యాయి. కొనుగోలు వ్యయాలు పెరగడం వల్లే.. ‘‘నిర్మాణ వ్యయాలు పెరిగినందున డెవలపర్లు ప్రాపర్టీల రేట్లను పెంచాల్సి వచ్చింది. ఆర్బీఐ రెండు విడతలుగా రేట్ల పెంపుతో గృహ రుణ రేట్లు పైకి ఎగబాకాయి. ఈ రెండు అంశాలతో కొనుగోలు వ్యయం పెరిగిపోయింది. ఇళ్ల విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. చదవండి👉 దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్లోనే ఇళ్ల ధరలు తక్కువే! -
రోజంతా నష్టాలే; బ్యాంకింగ్, ఐటీ షేర్ల దెబ్బ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ, నష్టాలు తప్పలేదు.కానీ కనిష్ట స్థాయిల నుండి పాక్షికంగా కోలుకున్నాయి. సెన్సెక్స్ 53 వేల ఎగువన ముగిసింది. అయితే మరో కీలక సూచీ నిఫ్టీ 15800 దిగువకు చేరింది. సెన్సెక్స్ 134 పాయింట్లను కోల్పోయి 53027 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 15799 వద్ద స్థిరపడింది. ఆయిల్ రంగం తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. ముఖ్యంగా బ్యాంక్, ఎఫ్ఎంసిజి, ఐటీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, రియలన్స్, సన్ఫార్మ, కోల్ ఇండియా టాప్ గెయినర్స్గా నిలవగా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్యూఎల్, అపోలో హిస్పిటల్స్, యాక్సిస్ బ్యాంకు, టాటాసన్స్ నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి బుదవారం కూడా రికార్డు క్లోజింగ్ను నమోదు చేసింది. వరుసగా పతనమవుతున్న రూపాయి 78.97 వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరింది. చివరికి 78.96 వద్ద క్లోజ్ అయింది. -
వరుసగా రెండో వారంలోనూ పసిడికి దెబ్బ, వెండి అక్కడక్కడే
సాక్షి, ముంబై: గ్లోబల్ ఆర్థికమాంద్యం ఆందోళన, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అటు ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్లు దాదాపు రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి. 10 గ్రాముల పసిడి ధర రూ 50,510గా ఉండగా, వెండి ఫ్యూచర్స్ కిలో 59,510 వద్ద ఫ్లాట్గా ఉన్నాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ. 4745గా ఉంది. 24 క్యారెట్ల పసిడి గ్రాము ధర రూ. 4765గా ఉంది. వెండి కిలో ధర 66 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అంటే వరుసగా రెండో వారం తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్సుకు 1,824.72 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉన్నాయి. గ్లోబల్గా ఆర్థికమాంద్య భయాలు, అదుపులేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్లు దూకుడుగా రేట్ల పెంచనున్నాయనే ఆందోళనతో బంగారం ధరలు దాదాపు 0.9శాతం తగ్గాయి. సిల్వర్ ఔన్స్కు 0.4శాతం పెరిగి 21.02 వద్ద ఉంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే లక్ష్యంతో వడ్డీ రేట్ల పెంపుపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ వ్యాఖ్యలు డాలర్కు బలాన్నిచ్చాయి. #Gold and #Silver Opening #Rates for 24/06/2022#IBJA pic.twitter.com/4iKdbMZNCm — IBJA (@IBJA1919) June 24, 2022 అటు గోల్డ్ ఇటిఎఫ్లలోకి ఇన్ఫ్లోలు ఇటీవలికాలంలో మిశ్రమంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ గురువారం1,071.77 టన్నుల నుంచి 0.81 శాతం తగ్గి 1,063.07 టన్నులకు పడిపోవడం గమనార్హం. -
డాలరు మారకంలో దిగజారుతున్న రూపాయి విలువ
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రోజురోజుకి క్షీణిస్తూ బుధవారం మరో కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవడంతో పాటు భారతదేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం ఆందోళలు, తదితర కారణాల రీత్యా రూపాయి డాలర్తో బుధవారం 78.40 వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఇంట్రా-డేలో గరిష్టంగా 78.13 కనిష్ట స్థాయి 78.40 మధ్య కదలాడింది. 78.13 వద్ద నిన్న(మంగళవారం) కనిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల అమ్మకాలు జోరు, దేశీయ ఈక్విటీలలో నష్టాల కారణంగా బుధవారం 27 పైసలు క్షీణించిన రూపాయి 78.40 (తాత్కాలిక) వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. 2011 తర్వాత మొదటిసారిగా 3శాతం దిగువకు పడిపోయింది. ఓవర్సీస్లో బలమైన గ్రీన్బ్యాక్ కూడా రూపాయి సెంటిమెంట్పై ప్రభావం చూపిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఆరు కరెన్సీల గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.05 శాతం బలపడి 104.48కి చేరుకుంది. ఇదిలా ఉంటే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు గత వరుసగా ఎనిమిదో నుంచి తొమ్మిది నెలల నుంచి దేశం నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం కూడా దేశీయ కరెన్సీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. జూన్లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ. 38,500 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జూన్ 10, 2022తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 4.59 బిలియన్ డాలర్లు క్షీణించి 596.46 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ డేటా వెల్లడించింది. -
లాభాలన్నీ పాయే: భారీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభం నుంచీ నెగిటివ్గా ఉన్న సూచీలు ఆ తరువాత మరింత పతనాన్ని నమోదు చేశాయి. చివరి వరకూ అదే ధోరణి కొనసాగించాయి. అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ కీలకమైన 52 వేల స్థాయిని, నిఫ్టీ 15,500 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 710 పాయింట్లు కుప్పకూలి 51823 వద్ద, నిఫ్టీ 226 పాయింట్ల నష్టంతో 15413 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా రెండు రోజుల రిలీఫ్ ర్యాలీకి బ్రేక్పడింది. హిందాల్కో, యూపీఎల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూస్టీల్, విప్రో, రిలయన్స్, అదానీ, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు బీపీసీఎల్, హీరో మోటో కార్ప్, టీసీఎస్, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి స్వల్పంగా లాభపడ్డాయి. అటుగ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర పుంజుకోవడం, భారతదేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం 27 పైసలు క్షీణించి 78.40 వద్ద ఆల్టైం కనిష్టాన్ని నమోదు చేసింది. మంగళవారం 78.13 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. -
ఏమన్నా ట్విస్టులా: చివరికి లాభాలే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోను కొనుగోళ్ల మద్దతుగా పాజిటివ్గా ఉన్నా తరువాత దాదాపు సెషన్ అంతా లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట కొనసాగింది. గ్లోబల్ చమురు ధరల పతనంతో ఆయిల్రంగ షేర్లన్నీ కుప్పకూలి పోయాయి. దీంతో కీలక సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. కాని చివరి అర్థగంటలో భారీగా ఎగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 51598 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు ఎగిసి 15350 వద్ద ముగియడం విశేషం. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ముగిసాయి. మెటల్, రియల్టీ, ఆయిల్ రంగ షేర్లలో అమ్మకాలువెల్లువెత్తాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీ పతనం ప్రభావాన్ని చూపించాయి. హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఏసియన్ పెయింట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్ లాభపడ్డాయి. ఓఎన్జీసీ, టాటా స్టీల్,హిందాల్కో, యూపీఎల్ ఇండస్ ఇండ్ బ్యాంకు భారీగా నష్టపోయాయి. -
గ్లోబల్ ఆయిల్ సెగ: ఆయిల్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: గ్లోబల్గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్లో రూపాయి డాలర్తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. -
ఆరో రోజూ అదే కథ: ఐటీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. గత ఐదు సెషన్లుగా భారీగా నష్టపోతున్న సూచీలు 6వ సెషన్, వారాంతంలో స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఆరంభంలోనే కుప్పకూలిన సెన్సెక్స్ ఆ తరువాత భారీగా కోలుకుంది. ఐటీ, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ నష్టపోగా, మెటల్ బ్యాంకింగ్ పేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపించింది. చివరికి సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో 51, 360 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల నష్టపోయి 15693 వద్ద స్థిరపడ్డాయి. టైటన్ టాప్ లూజర్గా నిలిచింది. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, శ్రీసిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, డా.రెడ్డి ల్యాబ్స్ సన్ ఫార్మా షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్,హెచ్డీఎఫ్సీబ్యాంకు, ఐటీసీ లాభపడ్డాయి. -
రోజంతా ఊగిసలాటే: రియల్టీ, మెటల్ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి దాదాపు 200 పాయింట్లకుపైగా సెన్సెక్స్ 53 వేల ఎగువకు చేరింది. కానీ అమ్మకాలు వెల్లువెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఇదే ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 52693, 15732 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు నష్టంతో 15732 వద్ద స్థిరపడింది. రియల్టీ, మెటల్, బ్యాంకింగ్ మినహా మిగిలిన రంగాలు నష్టపోయాయి. బజాజ్ ఆటో, ఇండస్ బ్యాంకు, ఓఎన్జీసీ, హిందాల్కో, టెక్ మహీంద్ర నష్టపోగా ఎన్టీపీసీ, భారతి ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, దివీస్ లాభపడ్డాయి. -
ఆర్బీఐషాక్:16400 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా ఆర్బీఐ రెపో రేటు వడ్డింపు తరువాత భారీ అమ్మకాల ఒత్తిడితో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. చివరి అర్థ గంటలో కాస్త పుంజుకుని సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 54892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16356వద్ద స్థిరపడ్డాయి. అయితే కీలక మద్దతు స్థాయి 16400 పాయింట్ల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ మరింత బలహీన సంకేతాలిచ్చింది. భారతి ఎయిర్టెల్, ఐటీసీ, రిలయన్స్, యూపీఎల్, ఏషియన్స్ పెయింట్స్ నష్టపోగా, ఎల్ఐసీ బుధవారం కూడా మరో 3 శాతం పతనమైంది. ఎస్బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, డా. రెడ్డీస్ లాభాల్లో ముగిసాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపుతో పోలిస్తే 77.68 వద్ద ప్రారంభమైంది. చివరికి 77.73 వద్ద ముగిసింది. -
తగ్గిన బంగారం, భారీగా తగ్గిన వెండి ధర
సాక్షి,ముంబై: గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పుంజుకున్న నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు మరో విలువైన మెటల్ వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈ వారం చివర్లో అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఎంసీఎక్స్లో బంగారం10 గ్రాముల ధర రూ. 50,862గా ఉండగా, వెండి కిలో ధర 61,830కి చేరుకుంది. అటు హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర 270 రూపాయలు తగ్గి 51,930గా ఉంది. వెండి కిలో ధర సుమారు 800 రూపాయలు తగ్గి రూ. 67770 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లలో పసిడి ఔన్సు ధర 1842 డాలర్ల వద్ద వారం కనిష్టానికి చేరింది. వెండి 0.6 శాతం పడి 21.92 డాలర్లుగా ఉంది. గత నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5.5శాతంగా ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తుండగా, 6శాతానికి పైనే నమోదు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అధిక చమురు ధరల రూపంలో రిస్క్ ఉంటుందని అంచనా. పెరుగుతున్న ఇంధన ధరలు, ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల అనిశ్చితి, ఉత్తర కొరియా టెన్షన్లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ప్రపంచవృద్ధి ఆందోళనల మధ్య పసిడి ధర 1850 డాలర్లు సమీపంలో కదలాడవచ్చని, అయితే అమెరికా డాలర్ బలం గోల్డ్ ధరలపై ఒత్తిడిని కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్లోని విపి- హెడ్ కమోడిటీ రీసెర్చ్ రవీంద్ర రావు అన్నారు. #Gold and #Silver Opening #Rates for 07/06/2022#IBJA pic.twitter.com/BYWCDRNpYu — IBJA (@IBJA1919) June 7, 2022 -
భారీ నష్టాల ముగింపు: ఆర్బీఐ వడ్డింపు తప్పదా?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలోనే నష్టాల బాట పట్టిన సూచీలు రోజంతా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, డ్యూరబుల్స్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా కుప్పకూలాయి. చివరికి సెన్సెక్స్ 568 పాయింట్లు కుప్పకూలి 55107 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు నష్టంతో 16416 వద్ద స్థిరపడింది. అన్ని సెక్టార్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. టైటన్, యూపీఎల్, డా. రెడ్డీస్, బ్రిటానియా, టీసీఎస్, ఎల్ అండ్ టీ భారీగా నష్టపోగా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, రిలయన్స్ లాభపడ్డాయి. అటు ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి 5 పైసలు(77.71) పడిపోయింది దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ మూలధన ప్రవాహాలు నిలకడగా ఉండడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. -
రోజంతా లాభనష్టాల ఊగిసలాట: చివరికి నష్టాలే
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ద్రవ్యోల్బణం, క్రూడ్ ధరలు, తదితర అంతర్జాతీయ పరిణమాల నేపథ్యంలో రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి నష్టాలనే మూటగట్టుకున్నాయి.తద్వారా మూడు రోజుల లాభాలను బ్రేక్ ఇచ్చాయి. సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 55581 వద్ద,నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 16522 వద్ద ముగిసాయి. చివరి అర్థ గంటలో బ్యాంకింగ్, మెటల్ షేర్లు పుంజుకోవడంతో నష్టాల తీవ్ర తగ్గింది. జేఎస్ డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా,హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ ఎం కోటక్ మహీంద్ర బ్యాంకు లాభపడగా, బజాజ్ ఆటో, అపోలో, టెక్ ఎం, హిందాల్కో, బజాజ్ ఫిన్ సర్వ్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రుపీ 77.53 వద్ద ముగిసింది. మరోవైపు ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా డెల్టాకార్ప్ కంపెనీలో 25 లక్షల ఈక్విటీ షేర్లను (మొత్తం షేర్ హోల్డింగ్లో 0.93 శాతం)విక్రయించారు. దీంతో జున్జున్వాలా షేర్ హోల్డింగ్ 7.1 శాతం నుంచి 6.16 శాతానికి పడిపోయింది. దీంతో కంపెనీ షేర 2.28 శాతం నష్టపోయింది. -
పుత్తడి, వెండి: కొనుగోలుదారులకు ఊరట
సాక్షి, ముంబై: జూన్ మాసం ఆరంభంలోనే వెండి, బంగారం ధరలు వినియోగదారులకు ఊరటనిచ్చాయి. వరుసగా రెండో రోజు బుధవారం (జూన్,1) ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) పుత్తడి, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఆగస్టు 5, 2022న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ. 281 తగ్గి రూ. 50,700గా ఉంది. అదేవిధంగా, జూలై 5, 2022 నాటి వెండి ఫ్యూచర్లు రూ. 535 లేదా 0.88 శాతం క్షీణించాయి. మునుపటి ముగింపు రూ. 61,125తో పోలిస్తే ఎంసీఎక్స్లో కిలో రూ. 60,876 వద్ద కొనసాగుతోంది. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 47,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి దాదాపు 300 తగ్గి ప్రస్తుత ధర 51, 820గా ఉంది. అలాగే కిలో వెండి ధర 67వేల రూపాయలుగా ఉంది. మంగళవారం నాటితో పోలిస్తే 500 రూపాయలు తగ్గింది. కాగా ఫెడరల్ రిజర్వ్ మనీ పాలసీ, డాలర్ బలం గత రెండు నెలలుగా పసిడిపై ఒత్తిడి పెంచుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 200 రోజుల యావరేజ్ కిందికి చేరాయి. ఈ మేరకు ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో నెల. 200-రోజుల మూవింగ్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందనీ, దీంతో పసిడి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని ట్రేడ్బుల్స్ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ ఎనలిస్ట్ భవిక్ పటేల్ అంచనా #Gold and #Silver Opening #Rates for 01/06/2022#IBJA pic.twitter.com/Cdwx54n6H3 — IBJA (@IBJA1919) June 1, 2022 -
ఆరంభ లాభాలు ఆవిరి, నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలో 200 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు బలహీనంగా ఉన్నప్పటికీ మెటల్స్ ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభపడుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, పవర్గ్రిడ్, విప్రో మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ లూజర్స్గా ఉండగా, టైటాన్ , ఎన్టిపిసి , హెచ్యుఎల్ , ఏషియన్ పెయింట్స్ , ఎం అండ్ ఎం, టెక్ ఎం, మారుతీ, ఐటీసీ లాభపడుతున్నాయి . సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టంతో 55418 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 16544 వద్ద కొనసాగుతున్నాయి. -
చమురు షాక్: సెన్సెక్స్ ‘బేర్’
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోముగిసాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ఆరంభంలోనే భారీ నష్టాల్లోకి జారు కున్నాయి. రోజంతా అదేధోరణి కొనసాగి చివర్లో కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్ 359 పాయింట్లు కుప్పకూలి 55566 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు నష్టంతో16584 వద్ద ముగిసాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ తప్ప దాదాపు మిగతా అన్ని సెక్టార్లు నష్టాలను చవి చూశాయి. కోటక్ మహీంద్ర బ్యాంకు, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, టైటన్, హెడీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, భారీగా నష్టపోయాయి. మరోవైపు ఓఎన్జీసీ, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, కోల్ ఇండియా లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయ 77.63 వద్ద ముగిసింది. -
వరుసగా రెండో రోజూ తగ్గిన పసిడి ధర, ఎంత తగ్గిందంటే..
సాక్షి, ముంబై: పసిడి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీరేట్లను పెద్దగా పెంచకపోవచ్చనే పెంచనుందన్న సంకేతాల నడుమ గురువారం బంగారం ధరలు క్షీణించాయి. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల దన్ను, డాలరు మారకంలో దేశీయ రూపాయి బలంతో పసిడి పుంజుకుంది. గురువారం బంగారం ధర రూ.250 తగ్గిన 10గ్రాం 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 24 క్యారెట్ల బంగారం ధర 270 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.47, 900గా ఉంది. 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 52, 250 గా ఉంది. జూన్ డెలివరీకి సంబంధించిన ఎంసీక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 324 లేదా 0.63 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.50,833 వద్ద ఉన్నాయి. అలాగే ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్స్ రూ.447 లేదా 0.72 శాతం క్షీణించి రూ.61,529కి చేరుకుంది. స్పాట్ గోల్డ్ 3.24 డాలర్లు తగ్గి 1,849 డాలర్ల రేంజ్కి పడిపోయింది. దేశీయంగా స్పాట్ గోల్డ్ ధర 0.12 శాతం లేదా రూ.178 తగ్గింది. అధిక ట్రెజరీ దిగుబడుల కారణంగా అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా బంగారం ధరలు గురువారం తగ్గాయి. దేశీయ ఈక్విటీలలో సానుకూల ధోరణి మరియు బలహీనమైన డాలర్ కారణంగా డాలరుమారకంలో 77.54 వద్ద ముగిసింది. -
2022లో ఐటీ షేర్లకు ఏమైంది? ఎందుకింత నష్టం
సాక్షి, ముంబై: భారతీయ ఐటీ కంపెనీల షేర్లు ఈ ఏడాది ప్రధాన రంగాల నష్టాల్లో నిలిచాయి. సాధారణంగా రేసుగుర్రాల్లా దూసుకుపోయే ఐటీ కంపెనీలకు 2022లో ఎదురు దెబ్బ తగిలింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్యూ4 ఆదాయాల సీజన్లో ప్రతికూల సెంటిమెంట్, ఎఫ్ఐఐల నిరంతర విక్రయాలు మార్కెట్లో ఐటీ షేర్లను అశనిపాతంలా చుట్టుకుంది. బిజినెస్ టుడే కథనం ప్రకారం బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2022లో 25 శాతం లేదా 9,524 పాయింట్లను కోల్పోయింది. ఈ కాలంలో సెన్సెక్స్ 7.44 శాతం లేదా 4,336 పాయింట్లు క్షీణించింది. అలాగే, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 37,071 స్థాయినుంచి 27,708కి పడిపోయింది. వార్షిక ప్రాతి పదికన 9,363 పాయింట్లు లేదా 25.25 శాతం నష్టపోయింది. అలాగే ఎఫ్ఐఐలు ఈ ఏడాది భారత మార్కెట్లో రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడంతో ఐటీ స్టాక్ల సెంటిమెంట్ బలహీనపడింది. టెక్ మహీంద్ర, విప్రో, సియంట్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, జస్ట్ డయల్, టీ సీఎస్ ప్రధానంగా నష్టపోయిన ఐటీ షేర్లు ఇక ఆదాయాల విషయంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వృద్ధి అంచనాలను అందుకో లేకపోయాయి. క్యూ4లో దిగ్గజ ఐటీ కంపెనీల మార్జిన్ ఔట్లుక్ మితంగా ఉండడం కూడా ఈ నష్టాలకుఒక కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా బుధవారం నాటి స్టాక్మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 303 పాయింట్ల నష్టంతో 54 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ 99 పాయంట్లను కోల్పోయి 16025 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల నష్టాలతో వరుసగా మూడో రోజు కూడా ఈక్విటీ మార్కెట్ నెగిటివ్గా ముగిసింది. -
ఐటీ షాక్: నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలోనే 300 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే ఆరంభ లాభాలను కోల్పోయింది.మిడ్ సెషన్ నుంచి మరింత బలహీనపడింది. చివరకు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో వద్ద ముగిసింది. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపునకు మొగ్గు చూపనుందనే అంచనాలు ట్రేడర్లను ప్రభావితం చేశాయి.సెన్సెక్స్ 303 నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయాయి. బుధవారం నాటి నష్టాలతో సెన్సెక్స్ 54 వేల స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ 1600 వద్ద ఊగిసలాడుతోంది. రియల్టీ, ఐటీ షేర్లు బాగా నష్టపోయాయి. బ్యాంక్ మినహా అన్ని రంగాల సూచీలు ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ ఇండెక్స్ 2-3శాతం క్షీణించాయి. కెమికల్, సుగర్ రంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టు కున్నాయి. రెడ్లో ట్రేడవుతున్నాయి. దీపిక్, చంబల్ ఫెర్టిలైజర్స్ నష్టపోయాయి. ఫలితాల దెబ్బతో దివీస్ భారీగా నష్టపోయింది. అలాగే ఏసియన్ పెయింట్స్, కోరమండల్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్ర నష్టాల్లో ముగిసాయి. ఎన్టీపీసీ, బ్రిటానియా, కోటక్, హెడ్ఎఫ్సీ, ఐసీఐసీఐ, నెస్లే, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ లాభపడ్డాయి. -
మెటల్, ఎఫ్ఎంసీజీ నష్టాలు, సెన్సెక్స్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. అలా రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరికి 236 పాయింట్లు కోల్పోయి 54,052 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ముగిసాయి. తద్వారా నిఫ్టీ 16, 150 స్థాయి దిగువకు చేరింది. మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మ పవర్ రియల్టీ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ ,హెచ్యుఎల్ టాప్ లూజర్స్గానూ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. -
దావూద్ అనుచరుడితో ఫడ్నవీస్కు లింకు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా చెప్పుకునే రియాజ్ భాటితో లింకులు ఉన్నాయని రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఫడ్నవీస్, రియాజ్ భాటి కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. రియాజ్ భాటి నకిలీ పాస్పోర్టు కేసులో పట్టుబడితే రెండు రోజుల్లోనే అతనిని విడుదల చేశారని, ఆ తర్వాత ఫడ్నవీస్తో కలిసి ఒక ఫంక్షన్లో కనిపించారని వెల్లడించారు. నవాబ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఫడ్నవీస్పై ఇంకా వెయ్యాల్సిన బాంబులు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు నకిలీ నోట్ల రాకెట్ని చూసీచూడనట్టు వదిలేశారని, నేరచరిత కలిగిన వారిని ప్రభుత్వ బోర్డుల్లో నియమించారని తీవ్ర విమర్శలు చేశారు. పందితో పోరాడితే.. నవాబ్ ఆరోపణల తర్వాత ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా ప్రముఖ నాటక రచయిత జార్జ్ ఫెర్నాండెజ్ షా కొటేషన్ని పోస్టు చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ‘నేను చాలా కాలం క్రితమే ఒక విషయం నేర్చుకున్నాను. పందితో ఎప్పుడూ కొట్లాడకూడదు. అలా చేస్తే మనకి బురద అంటుకుంటుంది. పందికి అది ఇష్టంగా అనిపిస్తుంది’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. చదవండి: పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు -
ఎన్బీఎఫ్సీల ఏయూఎం డౌన్
ముంబై: నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రుణ పంపిణీ తగ్గడం, పోర్ట్ఫోలియో విలువలు క్షీణించడం ప్రభావం చూపినట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే గతేడాది(2020–21) ద్వితీయార్థంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్సీ)ల రుణ మంజూరీ పుంజుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంటే గత క్యూ3(అక్టోబర్–డిసెంబర్), క్యూ4(జనవరి–మార్చి)లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన ఈ క్యూ1లో 55 శాతం తిరోగమించినట్లు తెలియజేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే మారటోరియంలు లేని పరిస్థితుల్లో ఈ క్యూ1లో ఎన్బీఎఫ్సీల ఏయూఎం నీరసించినట్లు నివేదిక వివరించింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం మాత్రం దాదాపు యథాతథంగా నమోదైనట్లు పేర్కొంది. పెంటప్ డిమాండ్ .. పెంటప్ డిమాండ్ కారణంగా ఈ జులైలో రుణ విడుదల ఒక్కసారిగా ఊపందుకున్నట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ స్పీడ్ కొనసాగేదీ లేనిదీ స్థూల ఆర్థిక సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎన్బీఎఫ్సీ రంగంలో రికవరీని తాత్కాలికంగా దెబ్బతీసినట్లు ఇక్రా వైస్ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ రంగ హెడ్ మనుశ్రీ సగ్గర్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలో రుణ మంజూరీ వార్షిక ప్రాతిపదికన 6–8 శాతం పుంజుకోగలదని అంచనా వేశారు. ఇక ఏయూఎం అయితే 8–10 శాతం స్థాయిలో బలపడవచ్చని అభిప్రాయపడ్డారు. గతే డాది లోబేస్ కారణంగా పలు కీలక రంగాల నుంచి డిమాండ్ మెరుగుపడనున్నట్లు తెలియజేశారు. ఆస్తుల నాణ్యతపై.. స్థానిక లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో ఎన్బీఎఫ్సీల ఆస్తుల(రుణాల) నాణ్యత భారీగా బలహీనపడినట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే వసూళ్లు ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది నికర రికవరీలు, రద్దులతో కూడిన ఓవర్డ్యూస్లో 0.5–1 శాతం పెరుగుదల నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇవి ఇకపై లాక్డౌన్లు ఉండబోవన్న అంచనాలుకాగా.. రుణ నాణ్యతపై ఒత్తిళ్లు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత అనిశి్చతుల నేపథ్యంలో రైటాఫ్లు అధికంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
ఆ నిర్ణయం దురదృష్టకరం: మేరీ కోమ్ భావోద్వేగం
టోక్యో ఒలింపిక్స్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (38) నిష్క్రమణ పలువుర్ని షాక్కు గురిచేసింది. మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఇంగ్రిట్ వాలెన్సియాపై ఓడిన తరువాత మీడియాతో మాట్లాడిన మేరీ కోమ్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జెస్ నిర్ణయం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా.. కానీ తన తప్పు ఏమిటో అర్థం కాలేదనీ, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే 40 ఏళ్ల వయస్సు వరకు తన బాక్సింగ్ వృత్తిని కొనసాగిస్తానని మేరీ కోమ్ ప్రకటించారు. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్లో కొలంబియా ప్రత్యర్థిపై న్యాయ నిర్ణేతల విభజన నిర్ణయంతో అనూహ్యంగా ఓడిపోయారు. ఈ పరిస్థితిని మేరీ కోమ్ కూడా ఊహించలేదు. ఒక దశలో ఇంగ్రిట్ విజేతగాప్రకటించడానికి ముందే విజేతగా మేరీ తన చేయిని పైకి లేపారు. ముగ్గురు జడ్జిలు ఇంగ్రిట్కు అనుకూలంగా బౌట్ తీర్పు ఇవ్వగా ఇద్దరు మేరీ కోమ్కు మద్దతిచ్చారు. కానీ పాయింట్ల కేటాయింపులో తేడా మేరీని విజయానికి దూరం చేసింది. మరోవైపు ఇదే విషయంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ట్వీట్ చేశారు. అందరి దృష్టిలో మీరే విజేత. కానీ న్యాయమూర్తులకు వారి వారి లెక్కలు ఉంటాయంటూ ట్విటర్లో వ్యాఖ్యానించారు. ప్రియమైన మేరీ కోమ్, టోక్యో ఒలింపిక్స్లో కేవలం ఒక పాయింట్తో ఓడిపోయారు. కానీ ఎప్పటికీ మీరే ఛాంపియన్ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మరే మహిళా బాక్సర్ సాధించనిది మీరు సాధించారన్నారు. మీరొక చరిత్ర. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని కేంద్ర మాజీ క్రీడామంత్రి ప్రశంసించారు. అలాగే ఇతర క్రీడాభిమానులు కూడా మేరీ కోమ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఓడిపోయినా ‘యూ ఆర్ ది లెజండ్.. మీరే విజేత.. మీరే మాకు ఆదర్శం’ అన్న సందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. For all of us @MangteC was the clear winner but Judges have their own calculations😥 https://t.co/bDxjHFK9MZ pic.twitter.com/gVgSEugq4Q — Kiren Rijiju (@KirenRijiju) July 29, 2021 -
అమెజాన్ కస్టమర్లకు షాక్! ఫిర్యాదుల మోత
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటల పాటు ఆన్లైన్ షాపింగ్లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్గా కస్టమర్లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా సమస్యలను ఎదుర్కొన్నారు. లాగిన్, షాపింగ్ సమస్యలు, ప్రైమ్ వీడియో సేవలకు అంతరాయం లాంటి ఫిర్యాదులతో ట్విటర్ మారు మోగింది. ఇండియాతో పాటు యుకె, కెనడా, ఫ్రాన్స్ , సింగపూర్లోని పలు కస్టమర్లు అమెజాన్ డౌన్ అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై వినియోగ దారుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అమెజాన్ స్పందించింది. ఇబ్బందులు తలెత్తినమాట నిజమేనని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. అయితే, సేవల అంతరాయానికి గల కారణాలను స్పష్టం చేయలేదు. ఇంటర్నెట్లో అంతరాయాలను గుర్తించే వెబ్సైట్ డౌన్డెటెక్టర్.కామ్ ప్రకారం అమెజాన్లోని పలు రకాల సేవలు గంటల పాటు నిలిచిపోయాయి. 40 మందికి వేలకు పైగా వినియోగదారులు తమ అమెజాన్ ఖాతా స్పందించడం లేదని నివేదించారు. అమెజాన్ షాపింగ్ ప్లాట్ఫామ్తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్లో కూడా సమస్య లొచ్చాయని ఆరోపించారు. ఫలితంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. -
ఐబీఎంకు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్బై: షేర్లు పతనం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎంకు అనూహ్య పరిణామం ఎదురైంది. సంస్థ ప్రెసిడెంట్ జిమ్ వైట్ వైట్హర్స్ట్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఐబీఎం ధృవీకరించింది. పదవిని చేపట్టిన 14 నెలలకే కంపెనీ ఆయన ధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఐబీఎం ప్రకటించింది. అయితే అమెరికాకు చెందిన రెడ్ హ్యాట్ సంస్థను 34 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పదంలో కీలక పాత్ర పోషించారని కొనియాడింది. సీఈవోకి అరవింద్ కృష్ణుడికి సీనియర్ సలహాదారుగా కొనసాగుతారని తెలిపింది. అయితే జిమ్ ఎందుకు వైదొలగుతున్నారు, ఆయన స్థానంలో ఎవర్ని నియమించబోతోందన్న వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రకటనతో ఐబీఎం 4.8 శాతం కుప్పకూలాయి. ఐదు నెలల కనిష్టానికి చేరాయి. వైట్హర్స్ట్ నిష్క్రమణ విశ్లేషకులకు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సీఈవో అరవింద్ కృష్ట తరువాతి ఆ స్థానంలో జిమ్ ఉంటారనే అంచనాలున్నాయి. రెడ్ హ్యాట్ విలీనం తరువాత ఐబీఎంలో ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు జిమ్. ఐబీఎం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ తరువాత ఐబీఎం ఛైర్మన్, సీఈవో గిన్నీ రొమెట్టి వైదొలగడంతో జనవరి 2020 లో అరవింద్ కృష్ట సీఈవోగా ఎంపికయ్యారు. ఒక దశలో అరవింద్ స్థానంలో జిమ్ సీఈవో అవుతారనే కూడా చాలామంది భావించారు. రెడ్ హ్యాట్ విలీనంతో ఐబీఎం క్లౌడ్ మార్కెట్లో ఐబీఎం రూపురేఖలను మార్చడంలో కీలక ప్రాత పోషించిన ఆయన కంపెనీ వీడటం ఎదురుదెబ్బ అని వెడ్బష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మోషే కత్రి వ్యాఖ్యానించారు. సీఈవో పదవిని చేపట్టిన తరువాత అరవింద కృష్ట సంస్థను పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన మార్పులు, కార్పొరేట్ కంప్యూటర్ వ్యవస్థలను నిర్వహించే వ్యాపారం నిలిపివేత, గత ఏడాది చివర్లో ఐరోపాలో భారీగా ఉద్యోగ కోతలు పరిణామాలు కారణమా? అని పలువురు భావిస్తున్నారు. -
ఫేస్బుక్ 3 కోట్ల యూజర్లకు షాక్: ఏం చేసిందంటే..
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్పై వేటు వేసింది. దేశీయంగా ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తన తొలి నెలవారీ కంప్లయిన్స్ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. తమ తదుపరి నివేదికను జూలై 15న ప్రచురిస్తామని, అందులో వినియోగదారుల ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలుంటాయని పేర్కొంది. ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 - జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో తొమ్మిది వర్గాలలోని రెండు మిలియన్ల యూజర్ల కంటెంట్పై ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ చర్యలు తీసుకుంది. ఇందులో స్పామ్ (25 మిలియన్లు), హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ (2.5మిలియన్లు), వయోజన నగ్నత్వం, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్లు కంటెంట్ ఉంది. ఉగ్రవాద ప్రచారానికి సంబంధించి 106,000 పోస్ట్లు, విద్వేషపూరిత ప్రసంగాలపై 311,000, వేధింపులకు సంబంధించిన కంటెంట్ 118,000 పోస్ట్లున్నట్టు తెలిపింది. కొత్త కొత్త ఐటి నిబంధన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లు (5 మిలియన్లకు పైగావినియోగదారులతో) ప్రతి నెలా కంప్లయిన్స్ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. ఆయా వేదికలపై ఫిర్యాదుల వివరాలను, దానిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలి. స్వేచ్చాయుత భావవ్యక్తీకరణతోపాటు, ఆన్లైన్ భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధి వెల్లడించారు. ఫిర్యాదులు, కృత్రిమ మేధస్సు, తమ సమీక్షా బృందం నివేదికల ఆధారంగా తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ను గుర్తిస్తామని తెలిపింది. -
Stockmarkets: డెల్టా సెగ, ఇన్ఫీ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా నాల్గవ సెషన్లో కూడా నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 164 పాయింట్లు క్షీణించి 52,318 వద్ద ముగియగా, నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 15,680 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్ 52500, నిఫ్టీ 15700 స్థాయిని కోల్పోయాయి. ఆటో, ఫార్మ లాభపడగా,బ్యాంకింగ్ ,రియాల్టీ ఇతర రంగాల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిసాయి. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి డెల్టా, డెల్టా ప్లస్ కొత్త వేరియంట్లు పెరుగుతున్న ఆందోళన పెట్టుబడిదారులను వెంటాడినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ , హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టిసిఎస్ టాప్ లూజర్స్గా నిలిచాయి.డాక్టర్ రెడ్డి ల్యాబ్, బజాజ్-ఆటో, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టైటాన్ లాభపడ్డాయి. చదవండి: Stockmarkets : నష్టాలు, వొడాఫోన్ ఐడియా ఢమాల్! Twitter down: సమ్థింగ్ వెంట్ రాంగ్.. -
Twitter down: సమ్థింగ్ వెంట్ రాంగ్..
సాక్షి, న్యూఢిల్లీ: యూజర్ల ప్రైవసీ, ఫేక్ న్యూస్ వ్యవహారంలో దేశంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ట్విటర్ మరోసారి చిక్కుల్లో పడింది. భారత్ సహా పలు దేశాల్లో ట్విటర్ లాగిన్ సమస్య తలెత్తడం కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్విటర్ పనిచేయడం లేదంటూ యూజర్లు గగ్గోలు పెట్టారు. పదే పదే రిఫ్రెష్ కొట్టి మరీ లాగిన్కి ప్రయత్నించినపుడు సమ్థింగ్ వెంట్ రాంగ్..అన్న సందేశం యూజర్లను వెక్కిరించింది. సాంకేతిక సమస్యల కారణంగా ట్విటర్లోకి లాగిన్ కాలేకపోతున్నామంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెబ్సైట్ను యాక్సెస్ చేస్తున్నప్పుడు ట్విట్టర్ వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవడం కలకలం రేపింది. అలాగే తమ ప్రొఫైల్ యాక్సెస్ అవడం లేదని, కొందరికి టైమ్ లైన్ ఫీచర్ రావడం లేదని ఆరోపించారు. అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఎలాంటి సమస్యలేక పోవడంతో కొంతమంది వినియోగదారులకు ఊపిరి పీల్చుకున్నారు. డౌన్డిటెక్టర్ నివేదిక ప్రకారం 80 శాతం మంది వినియోగదారులు ముఖ్యంగా ఉదయం 8 గంటల సమయంలో వెబ్సైట్తో ఇబ్బంది పడ్డారు.16 శాతం ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు ఈ యాప్ను యాక్సెస్ చేయలేకపోయారని, 8 శాతం ఐఓఎస్ యూజర్లు యాప్లో సమస్య తలెత్తిందని నివేదించింది. దాదాపు గంట సేపు ఈ గందరగోళం కొనసాగినట్టు పేర్కొంది. మరోవైపు ఈవ్యవహారంపై ట్విటర్ అధికారికంగా స్పందించింది. ఇబ్బందుల విషయం తమ దృష్టికి వచ్చిందని పరిష్కరిస్తున్నామని తెలిపింది. యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది. ఆతరువాత సమస్య పరిష్కారమైనట్టు వెల్లడించింది. అయితే కొంతమంది ఇప్పటికి ఈ సమస్య విముక్తి లభించలేదని తెలుస్తోంది. చదవండి : ట్విట్టర్కు జాతీయ మహిళా కమిషన్ ఆదేశం Profiles’ Tweets may not be loading for some of you on web and we’re currently working on a fix. Thanks for sticking with us! — Twitter Support (@TwitterSupport) July 1, 2021 Is #twitterdown since seeing error messages. What about others? pic.twitter.com/Y77evfbSxZ — The Normal Investor (@DataXTradeXInv1) July 1, 2021 Aaaand we’re back. Twitter for web should be working as expected. Sorry for the interruption! — Twitter Support (@TwitterSupport) July 1, 2021 -
Stockmarkets : నష్టాలు, వొడాఫోన్ ఐడియా ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. ఆరంభంలో అటూ ఇటూ కదలాడినప్పటికీ, ప్రస్తుతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 132 పాయింట్ల నష్టంతో 52350 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 15688 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంక్, ఐటీ, మీడియా నష్టాల్లో, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లు మిశ్రమంగానూ ట్రేడవుతున్నాయి. అయితే ఆటో షేర్లు జోరుగా ఉన్నాయి. ముఖ్యంగా క్యూ4 ఫలితాలతో వొడాఫోన్ ఐడియా 10 శాతం కుప్పకూలింది. వొడాఫోన్ ఐడియా 2021 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 7,022.8 కోట్ల రూపాయల నికర నష్టాన్నినివేదించింది. బజాజ్ ఆటో 2.33 శాతం ఎగిసింది. ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, హిందాల్కో, ఎస్బిఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, శ్రీసిమెంట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, భారత్ పెట్రోలియం, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నష్టపోతున్నాయి. -
stockmarket: ఆరంభ లాభాలన్నీ గోవిందా
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంలోనే దాదాపు 200 పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగింది. ఒక దశలో 300 పాయింట్ల మేర లాభపడింది. కానీ వెంటనే అమ్మకాల ఒత్తిడి కారణంగా చివరికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 52482 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు క్షీణించి 15721 వద్ద స్థిరపడింది. డై గరిష్టంనుంచి సెన్సెక్స్ స్లిప్స్ 393 పాయింట్లు నిఫ్టీ 118 పాయింట్లు పతనమైనాయి. రూపాయి బలహీనతతో ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ఎఫ్ఎంసిజి అత్యధికంగా నష్టపోయాయి. శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ భారీగా నష్టపోగా, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, డివిస్ లాబొరేటరీస్, ఇన్ఫోసిస్ మరియు టెక్ మహీంద్రా టాప్ ఇండెక్స్ లాభపడ్డాయి.. -
stockmarket: 53వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో రికార్డు స్తాయిలను తాకిన సూచీలు ఆ తరువాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి మరింత అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వైద్య, పర్యాటకరంగ ఉపశమన చర్యలు ఆయా రంగాలకు కొంత ఊరటనిచ్చాయి. చివరికి సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో 52735 వద్ద,నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 15814 వద్ద స్థిరపడ్డాయి. ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీబ్యాంక్ నష్టాలతో ఇంట్రాడే లాభాలు హరించుకు పోయాయి. దివీస్ ల్యాబ్స్, ఒఎన్జిసి, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సిప్లా, జెఎస్డబ్ల్యు స్టీల్, గ్రాసిం, హిందాల్కో, ఎన్టీపీసీ, సన్ ఫార్మా లాభాల్లో ముగిసాయి. అయితే దేశీయంగా డెల్టా ప్లస్ వేరియంట్ఆందోళనకు తోడు, ఆసియాలో కరోనా ఉధృతి ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
Stockmarket లాభాలు: అంతలోనే పతనం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్ మిశ్రమ సంకేతాల మధ్య సెన్సెక్స్ 235 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ కూడా 15,753 స్థాయికి చేరుకుంది. కానీ అంతలోనే లాభాలన్నీ తుడిచిపెట్టుక పోయాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 162 పాయింట్లు క్షీణించి 52161 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టంతో 15 622 వద్ద కొనసాగుతోంది. బజాజ్ ఫిన్సర్వ్ 2 శాతం లాభ పడగా, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టిసిఎస్, హెచ్సిఎల్ టెక్ లాభాల్లో ఉన్నాయి. ఓఎన్జిసి, ఎం అండ్ ఎం, హెచ్డిఎఫ్సీ ట్విన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.