mahesh
-
భార్యకు సాఫ్ట్వేర్ ఉద్యోగం .. భర్త అనుమానాస్పద మృతి!
వెదురుకుప్పం : ‘ఐటీ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు.. వివాహమై 14 నెలలు అవుతోంది. సంతోషంగా ఉన్నాడనుకున్నాం. అక్కడ ఏం జరిగిందో ఏమో శవమై తిరిగి వచ్చాడంటూ..’ మండలంలోని కొమరగుంట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల కథనం మేరకు.. కొమరగుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డి కుమారుడు జి.మహేష్ (30)కి దామరకుప్పం గ్రామానికి చెందిన గుణవర్ధన్రెడ్డి కుమార్తె అనితకు 14 నెలల క్రితం ప్రేమించుకుని పెద్దల ఆమోదంతో వివాహం చేసుకున్నారు.మహేష్ భార్య అనిత సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. వీరు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం కొమరగుంటలో ఉన్న మహేష్ తండ్రి చంద్రశేఖర్రెడ్డికి ఫోన్ ద్వారా దిగ్బ్రాంతికర సమాచారం అందింది. ఉరి వేసుకుని చనిపోయినట్లు మహేష్ భార్య అనిత కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆ సమాచారం అందింన వెంటనే కుప్పకూలిపోయారు. మహే ష్ మృతి చెందడంతో భార్య అనిత అక్కడే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఘటనను పరిశీలించి ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి శవపరీక్ష కూడా నిర్వహించారు.ఆనవాళ్లు లేకుండా చంపేశారు..బంధువుల ఆందోళనఘటనకు సంబంధించి కొమరగుంట గ్రామస్తులు మంగళవారం ఉదయం పచ్చికాపల్లం–పెనుమూరు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున భైఠాయించారు. మహేష్ను పథకం ప్రకారం ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ధర్నా చేపట్టారు. భార్య అనిత కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ.. అది ఆత్మహత్య కాదు.. హత్యగావించినట్లు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మోహరించారు. ఈసందర్భంగా తమకు న్యాయం జరిగే వరకూ మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపైనే భీష్మించుకూర్చున్నారు. పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినిపించుకోలేదు. ఓ దశలో పోలీసులకు ఆందోళన కారులకు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం ఆందోళన చేస్తున్న సమ యంలో శవం రావడంతో స్థానికులు మరింత కోపోద్రిక్తులై ఆందోళనను తీవ్ర తరం చేశారు. మృతదేహం వెంట భార్య అనిత రాకపోవడంతో అనుమానం మరింత బలమైంది. మృతదేహాన్ని పక్కన పెట్టి నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు. ఎట్టకేలకు రెవెన్యూ, పోలీసు శాఖ సమ న్వయంతో మధ్యాహ్నం కొమరగుంట గ్రామస్తులతో చర్చించి అనిత తరపున రావాల్సిన నగదు, బంగారాన్ని ఇచ్చేలా రాజీ కుదర్చడంతో ధర్నాను విరమింప చేశారు. ఈ ఆందోళనలో కానిస్టేబుల్కు గాయాలైనట్లు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం కొమరగుంట సమీపంలో మహేష్కు అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైనట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. -
పల్లెటూరిలో నవ్వులు
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రం ‘బద్మాషులు’. ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుని, ఆ అనుభూతిని నలుగురూ పంచుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజ జీవితంలో మనకి తారసపడే వారిలాగే ఉంటూ నవ్విస్తుంటుంది. పూర్తి వినోదంతో పాటు గొప్ప సందేశం ఇచ్చే సినిమా ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తేజ కూనూరు, కెమేరా: వినీత్ పబ్బతి. -
KSR Live Show: కేటీఆర్ అరెస్ట్ ఖాయమా ?
-
బహిరంగ చర్చకు రండి.. చార్జిషీట్ సంగతి తేలుస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జిషీట్ అంటూ బీజేపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనపై ఆ పార్టీ నేతలు తమతో బహిరంగ చర్చకు వస్తే చార్జిషీట్ సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. తమతో చర్చకు వచ్చే సత్తా బీజేపీ నేతలకు ఉందా అని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కాలంలో తెలంగాణలో అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాము చర్చకు రెడీగా ఉన్నామని చెప్పారు.ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని, వంద రోజుల్లో అన్ని ధరలు తగ్గిస్తామని, డాలర్కు పోటీగా రూపాయి విలువ పెంచుతామని, నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, రూ.50కే లీటర్ పెట్రోల్ ఇస్తామని చెప్పిన బీజేపీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించి ప్రభుత్వాలను కూల్చా రని, దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను చేర్చు కున్న బీజేపీ నేతలు తమకు సుద్దులు చెబుతారా అని ప్రశ్నించారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగ తీవ్రత ఉందని గుర్తు చేశారు.2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను తీసుకొని ఆ పార్టీ నేతలు వస్తే, తమ 2023 ఎన్నికల మేనిఫెస్టోను తీసుకొని తాము వస్తామని, ఏడాదిలో ఏం చేశామో తాము చెబుతామని, పదేళ్లలో ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని మరోమారు రుజు వైందని, సమయం వచ్చినప్పుడల్లా ఆ పార్టీలు ఏ టీం, బీ టీంలా వ్యవహరి స్తాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకున్నందుకే తెలంగాణలో బీజేపీ అడుగంటిపోతోందని, ఇప్పుడు చార్జిషీట్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు కవల పిల్లల్లాంటివని ఈ చార్జిషీట్తో రుజువైందన్నారు. ఏడాదిగా తాము చేస్తున్న కార్యక్రమాలేవీ బీజేపీ నేతలకు కనపడడం లేదా అని మహేశ్గౌడ్ ప్రశ్నించారు. -
కుల గణన.. కాంగ్రెస్ పార్టీ పేటెంట్
సనత్నగర్ (హైదరాబాద్): కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, అది జరగనిదే స్థానిక సంస్థల ఎన్నిక లు జరగవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ స్పష్టం చేశారు. యూనివర్సిటీ వైస్చాన్స్లర్ల నియామకాల్లో కూడా నలుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ‘సమగ్ర కుల గణన–బీసీ రిజర్వేషన్ల పెంపుపై’బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం బుధవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ, కులగణన అంశాన్ని తెరమీదకు తీసుకువచి్చన నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి అందాలనే ఉద్దేశంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని గుర్తుచేశారు. నాలుగైదు రోజుల్లో కులగణనపై విధి విధానాలను ఖరారు చేసి ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర ఖజానా అధ్వాన్న స్థితిలో ఉందని, నెలసరి ఆదాయం 18 వేల కోట్లు కాగా, గత ప్రభుత్వం చేసిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు తీర్చేందుకే ఎక్కువ శాతం ఆదాయం కేటాయిస్తూ వస్తున్నట్లు చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అనవసర ప్రాజెక్టులతో దుబారా చేసి అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కులగణన అంశాన్ని లేవనెత్తగానే బీజేపీ కూడా స్వరం మార్చి ఆర్ఎస్ఎస్తో మద్దతు తెలియజేస్తోందన్నారు. బీజేపీ హయాంలో పెట్టుబడిదారులకు న్యాయం జరిగిందే తప్ప ప్రజలకు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేసిందే తప్ప లాభాల్లో ఉన్న వాటి జోలికి వెళ్లలేదని, నేడు బీజేపీ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ కూడా కులగణనకు మద్దతు అంటూ ఇప్పుడు చెబుతోందని, గత పదేళ్లు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా కులగణన జరిపి తీరుతామని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కులగణన చేసి తీరాల్సిందేనన్నారు. జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కులగణనపై గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టామని, చివరిగా హైకోర్టులో కేసు కూడా వేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే తాము కులగణన మార్చ్ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని జాజుల తెలిపారు. -
తొలిరోజు 285 దరఖాస్తులు... 30 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజల నుంచి 4 గంటల పాటు దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 285 దరఖాస్తులు రాగా, అందులో 30కి పైగా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఇందుకోసం బాధితుల సమక్షంలోనే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన దామోదర.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న గురుకుల ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు వచ్చి తమ అర్జీలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని, రేషన్కార్డులు కావాలని, ఉపాధి కల్పించాలని, చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సాయం చేయాలని, 108 సిబ్బందికి ఏఎన్ఎం ఉద్యోగ నోటిఫికేషన్లలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ పలువురు దరఖాస్తులు సమర్పించారు. గత పదేళ్లలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. తొలిరోజు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించామని, ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కార దశలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. అద్భుత ఆలోచన: మంత్రి దామోదర గాంధీభవన్లో ప్రజావాణి చేపట్టడం అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరించే మాట అటుంచితే కనీసం వారి గోడు వినేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తాము ప్రజల సమస్యలు విని పరిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖలకు పంపుతామని, వీలున్న దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్రావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు, కార్యకర్తలంటే ఎంతో గౌరవమని, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం గాంధీభవన్లో ప్రజావాణి లాంటి కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్కు వచ్చి ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతారని, వారి సమస్యలపై అర్జీలు తీసుకుంటారని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన కార్యక్రమ ప్రారంభ సభలో చెప్పారు. -
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్గౌడ్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
పవన్ కళ్యాణ్... చర్చకు రెడీ... పోతిన మహేష్ ఓపెన్ ఛాలెంజ్
-
అమ్మ సాక్షిగా అవినీతి
-
చేతకాని ప్రభుత్వం 4పులిహోర ప్యాకెట్లు..400 ఫోటోలు
-
శ్రవణమే.. నయనం
పుట్టుకతోనే అంధత్వంతో అంతా చీకటి. కానీ తన కళతో చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగులు పంచాడు. అంధత్వంతో పాటు పేదరికం పుట్టినప్పటి నుంచి అతడిని వెక్కిరిస్తూ వస్తోంది. అయినా తన సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే అయ్యాయి. ఢోలక్, కంజీర, రిథమ్ ప్యాడ్ వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతడి పేరే సిరిపురం మహేశ్. మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం దొనబండ మహేశ్ స్వగ్రామం. ఇటీవలే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మహేశ్ తన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. పుట్టుకతోనే చూపు లేకపోయినా తనకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని తన నమ్మకం. శాంతారాం అనే తన చిన్ననాటి స్నేహితుడు ఢోలక్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగిందని మహేశ్ పేర్కొన్నాడు. అయితే దుర్గం శంకర్ అనే మాస్టారు ఢోలక్లో మెళకువలు నేరి్పంచి, తనను ఇంతవరకూ తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నాడు. చాలా ఫంక్షన్లలో జరిగే ఆర్కెస్ట్రాల్లో వాయిద్య పరికరాలను వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అవార్డులు, రివార్డులు తెలుగు టాలెంట్స్ మ్యూజిక్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం కళోత్సవం సందర్భంగా రెండుసార్లు అవార్డు తనను వరించింది. ఆర్కెస్ట్రాలో ఢోలక్, కంజీర వాయిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయి మెచ్చుకునే వారని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంగీతంతో పాటు తెలుగులో కూడా ప్రావీణ్యం సాధించాడు మహేశ్. పేరడీ పాటలు, కవితలు కూడా రాస్తుంటాడు. అదే నా కల.. భవిష్యత్తులో తెలుగు టీచర్గా స్థిరపడాలనేది తన కల అని చెబుతున్నాడు. అంధులకు తెలుగులో వ్యాకరణం నేర్చుకోవడం చాలా కష్టం. కానీ నిజామ్ కాలేజీలో చంద్రయ్య శివన్న అనే తెలుగు మాస్టారు ఎంతో ఓపికగా పాఠాలు నేరి్పంచేవారని చెప్పుకొచ్చారు. పదో తరగతి వరకూ బ్రెయిలీ లిపిలో పాఠాలు ఉండేవని, ఇంటర్ తర్వాత అంధులు పాఠాలు నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. చంద్రయ్య మాస్టారు పుస్తకాలను పీడీఎఫ్లోకి మార్చి తన లాంటి వారికి ఇచ్చేవారని చెప్పాడు. -
స్కూల్ లైఫ్ ఆరంభం
పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లోప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్కి అభినందనలు తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ నా ఒక్కడిదే కాదు.సినిమా మీద ఉన్న ఇష్టంతో పాటు కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. మా బడ్జెట్ సరిపోకపోవడంతో కథ నచ్చి, నన్ను నమ్మి సహకారం అందిస్తున్న నిర్మాత రాహుల్ త్రిశూల్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ రెగ్యులర్ షూటింగ్ని ఆగస్టు 2నప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్. -
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్నగర్కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్నగర్కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్కుమార్రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్రెడ్డి బృందం పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
మాజీ ఎంపీటీసీ మహేష్ హత్య కేసులో
-
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్తో కలిసి గజేందర్ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్ను మొదట వె నుక నుంచి బైక్తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
కేసీఆర్ లేఖలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: తన తప్పులకు శిక్ష పడుతుందేమోనని భయపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేజీలకు పేజీలు లేఖలు రాసి భయపెట్టే ప్రయ త్నం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు.విద్యుత్ ప్రాజెక్టులు, కొనుగోళ్ల విషయంలో విచా రణ జరుపుతున్న కమిషన్కు 12 పేజీల లేఖ రాసే బదులు కమిషన్ ముందుకు వెళ్లి తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ చేసిన తప్పులు ఒప్పుకుని విచారణకు సహకరించాలని, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన కుంభకోణం, అక్రమాలు ప్రజలకు తెలియాలని శనివారం విలేకరులతో మాట్లాడుతూ మహేశ్గౌడ్ అభిప్రాయపడ్డారు. -
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
-
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన. -
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
-
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఒకరి గురించి ఒకరు భజన ఈ భజన బ్యాచ్ మనకు అవసరమా
-
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
మహేష్బాబుతో సన్రైజర్స్ ఆటగాళ్లు.. (ఫోటోలు)
-
పవన్ బాక్ మనీ దందా.. ఐటీకి దిల్ రాజు ఫిర్యాదు
-
అల్లు అర్జున్ తెలుసు కదా.. బ్రాండ్ అంటే అతను..నువ్వు కాదు..!
-
బాబును జైల్లో కలిసిన తరువాత పవన్ కొన్న ఆస్తులు "ఆధారాలతో"
-
జనసేనలో మహిళలకు జరిగేది ఇదే..!
-
YSRCPలో చేరిన జనసేన నేత పోతిన మహేష్
-
పవన్ కళ్యాణ్ పై పోతుల మహేష్ ఫైర్
-
రాజకీయాల్లోనూ పవన్ది నటనే
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): జనసేన అధినేత, సినీనటుడు పవన్కళ్యాణ్ రాజకీయాల్లోనూ అద్వితీయంగా నటించి జనసేన నాయకులను నట్టేట ముంచుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు ఆయన చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో సోమవారం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు, కార్యకర్తలకు భరోసాను, నమ్మకాన్ని కలిగించే వారే నాయకులవుతారని, రాజకీయాల్లో నటించే వారు నాయకుడు కాలేరని పవన్పై ఆయన విరుచుకుపడ్డారు. పవన్ను నమ్మి అతనితో అడుగులు వేశామని.. కానీ, ఆయనతో ప్రయాణం చేసినందుకు ఇప్పుడు తమపై తమకే అసహ్యం వేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 2014లో పోటీచేయకపోయినా 2019లో ఒక్క సీటు గెలిచినా, 2024పై ఆశలు పెట్టుకున్నాం. కానీ, పారీ్టలో జరుగుతున్నది, జరిగిన పరిణామాలను చూస్తే ఏమీ అర్థంకాక పిచ్చెక్కుతోంది. ఇంత జరుగుతున్నా పవన్కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందనలేదు. జనసేన నాయకులను దారుణంగా మోసం చేసిన పవన్ రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు, నాలాంటి కొత్తతరం నాయకులకు సమాధానం చెప్పాలి. గడిచిన ఐదేళ్లలో పార్టీ నిర్మాణంపై ఎక్కడా దృష్టిపెట్టలేదు. పవన్కళ్యాణ్ స్వార్థం కోసమే పార్టీని పెట్టినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్ధంకావట్లేదని అనుకున్నాం.. కానీ, స్వార్థంతో ఉన్న పవన్ను ప్రజలు గ్రహించారు. అందుకే జనసేనపట్ల వారికి నమ్మకం కుదరలేదు. అసలు 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకు పవన్ ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? అందులో సగానికి పైగా టీడీపీకి చెందిన వారికి సీట్లు కేటాయించారు.. ఒకవేళ గెలిచిన నాయకులు పార్టీ కోసం నిలబడతారా? లోపాయికారి ఒప్పందాలతో, త్యాగం పేరుతో నాలాంటి కొత్త నాయకులను పవన్ నట్టేట ముంచారు. నిజానికి.. రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీని నేను ఎంతో కష్టపడి నిలబెట్టా. కానీ, జనసేన నన్ను రాజకీయంగా చంపేసింది. జనసేనకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గెలిచే భీమవరం వదిలి పిఠాపురం ఎందుకెళ్లారు పార్టీ బలంగా ఉన భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్లారో పవన్ స్పష్టంచేయాలి. అక్కడ మీకు అండగా నిలిచిన వ్యక్తికి సీటు ఇవ్వకుండా టీడీపీకి ఆ సీటు వదిలేయటం ఏమిటి? దీనిలో ఏ ప్రయోజనం ఆశించి బయటకొచ్చారో చెప్పాలి. అలాగే, అనకాపల్లి సీటు నాగబాబుకు అని చెప్పి తరువాత దానిని వదులుకున్నారు. అక్కడకు నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల నుంచి భారీగా ఫండ్స్ వసూలుచేశారు. వారంతా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాగానే అక్కడి నుంచి బయటకొచ్చారు. జనసేనను మనోహర్ పూర్తిగా నాశనం చేశారు జనసేన అనే బస్సు స్టీరింగ్ను పవన్కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చేతికిచ్చారు. కానీ, ఆ బస్సును మనోహర్ కొండకు ఢీకొట్టి పార్టీని నాశనం చేశారు. పవన్, మనోహర్ ఇద్దరూ కలిసి జనసైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు చంద్రబాబును, ఆ తర్వాత ఆయన కొడుకును, ఆపైన దేవాన్షును ముఖ్యమంత్రులను చేసేందుకు జనసేనని జనసైనికులను బలిచేస్తున్నారు. అసలు నాదెండ్ల మనోహర్ బాగోతమంతా తెనాలిలో ప్రెస్మీట్ పెట్టి చెబుతా. ఇక చివరిగా నాదో కోరిక.. దానిని పవన్కళ్యాణ్ తీర్చాలి. పిఠాపురంలో మీ ఇంటి గృహ ప్రవేశానికి అన్నా లెజినోవాతోనే రావాలి. మున్ముందు ఇంకా చాలా విషయాలను ఆధారాలతో బయటపెడతా. కాపు–బీసీల మధ్య గొడవకు పవన్ కుట్ర రాష్ట్రంలో కాపు, బీసీల మధ్య గొడవ పెట్టి తద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలనే భారీ కుట్రకు పవన్ ప్రయత్నిస్తున్నారు. 21 సీట్లలో పారీ్టకి తీవ్ర నష్టం జరుగుతుందని కాపులు హెచ్చరించి పారీ్టకి దూరంగా వెళ్లిపోయారు. అయితే, వారిని దగ్గర చేసుకోవడం కోసం బీసీలకు సీట్లు ఎగ్గొట్టి కాపులకు బీసీలకు మధ్య గొడవ పెట్టాలని కుట్ర పన్నారు. బీసీలు సీట్ల కోసం ప్రశ్నిస్తే కాపులు తనకు మద్దతుగా నిలిచి బీసీలపై దాడిచేస్తారన్నది ఆయన ఉద్దేశం. పవన్.. దయచేసి కాపులను బలిచెయ్యొద్దు. మేం ఆస్తులు అమ్ముకుంటే మీరు కొనుక్కున్నారు నేను, నాలాంటి నాయకులు పార్టీలో చేరి మా ఆస్తులు అమ్ముకుంటే మీరు మాత్రం ఆస్తులు కూడబెట్టుకున్నారు. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ త్వరలో అన్ని ఆధారాలతో బయటపెడతా. నిజానికి.. మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు. సుజనాచౌదరి గతంలో తన బినామీ ఛానల్లో తన తల్లిని దూషించారని పవన్కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్లో పోస్టు పెట్టారు. అలాంటి సుజనాకు పవన్ టికెట్ ఎలా ఇప్పించారు? సుజనా గెలుపు కోసం మీరు ఎలా భాగస్వాములు కావాలనుకుంటున్నారు? కన్నతల్లిని విమర్శించి, పచ్చనోటు పడేస్తే అన్నీ మర్చిపోయారా? -
జనసేనకు మూకుమ్మడి రాజీనామా..!
-
పెద్ద మాయగాడు..అంతా నటనే.. అందుకే 2019లో ఆ గతి పట్టింది..!
-
విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
-
పవన్తో పని చేసినందుకు అసహ్యం వేస్తోంది: పోతిన మహేష్
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఆవేశంలోనో.. సీటు రాలేదోనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న.. భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని పోతిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు భవిష్యత్తుకు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేదు పవన్ కల్యాణ్ను నమ్మి అడుగులు వేశాను కొత్తతరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది అయినా పవన్ కల్యాణ్లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు , నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కల్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది పార్టీ నిర్మాణం, క్యాడర్ పై పవన్ దృష్టి సారించలేదు అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయలేకపోయారు 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా? 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిషత్తు ఇవ్వగలరు పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే అన్నీ జరుగుతున్నాయి పవన్ కల్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా? జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు.. అసలు జనసేన ఎవరికోసం పెట్టారు? పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది అన్నీ ఆధారాలను బయటపెడతాను కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నా మీరు మా గొంతు కోస్తున్న నొప్పి తెలుస్తుంది మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే, మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు కాకినాడ మేయర్ సరోజ, శేష కుమార్, విశాఖలో మహిళా నాయకురాలికి మాత్రమే పదవులు పొడిగించారు మీ గురించి, పార్టీలో బ్రోకర్ పనులు బయట పెడుతున్నారనే భయంతోనే వాళ్ల పదవులు పొడిగించారు సుజనా చౌదరి(విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి) గతంలో బినామీ ఛానల్ లో మీ తల్లిని దూషించారు అలాంటి సుజనాకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు? సుజనా గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు కన్నతల్లిని విమర్శించి, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోయారా? విజయవాడలో జనసేన జెండా లేదు.. గాజు గ్లాసు గుర్తు లేదు మేము బతికించిన పార్టీని మీరు చంపేశారు టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకి వద్దు అన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు జనసేనను సీట్లు అడగకుండా బీజేపీ ఎందుకు త్యాగం చేశారో చెప్పాలి బీజేపీ, టీడీపీని సీట్లు అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు? పొత్తు ధర్మం బిజెపి, టీడీపీలకు లేదా, కేవలం జనసేనకు మాత్రమే ఉందా పొత్తు కుదిర్చితే ఎక్కువ స్థానాలు కోరుకోవాలి కదా.. ఎక్కువ సీట్లు సాధించాలి కదా! మీరెందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుండి పోటీకి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా.. అన్ని పార్టీలు విధేయతకు పట్టం కట్టాయి కసాయివాడికి కనికరం ఉంటుంది.. మీపట్ల విధేయతతో ఉన్నందుకు కనీసం కనికరం లేదా? మీమనసు ఇంత పాషాణ హృదయం అని ఊహించలేదు 21 అసెంబ్లీ, 2ఎంపీల్లో ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ మాత్రమే జనసేన కోసం పనిచేసినవాళ్లకు ఇచ్చారు టీడీపీ నుండి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? రాబోయే 12 నెలలో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుంది జనసేన పార్టీ ప్రజారాజ్యం-2 అయి తీరుతుంది త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా? మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా? పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుగా? పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు? పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు? సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా? ఇదెక్కడి సామాజిక న్యాయం ? పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు 21 సీట్లలో ఒక్క చోట కూడా కాపులు హర్షించలేదు పార్టీ భవిషత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది కాపులు జనసెనకు దూరమయ్యారు.. పవన్ కి కాపులు మద్దతు ఇవ్వట్లేదు కులాల మధ్య కుట్రలకు తెరలేపారు గెలిచే భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్ళారు భీమవరంలో టీడీపీ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చావు సొంతఇల్లు కట్టుకోవడానికి భీమవరం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పిన మాట అవాస్తవం ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యుండి వేరే పార్టీ నేత కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్? అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు? అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు.. అందుకే అక్కడినుండి వచ్చేశారు నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలుముక్కలు చేసారు నష్టపోయింది మాత్రం మేము మేము చెప్పేది వినే ఓపిక లేనపుడు పార్టీ ఎందుకు పెట్టారు పొత్తు మరో పదేళ్లు కావాలా? ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత, ఆ తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మొస్తాం నాదెండ్లా(నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి)... తెనాలి వస్తా, అక్కడే ప్రేస్మీట్ పెడతా నేను చెప్పేవన్నీ నిజాలే.. నాకు దేనికీ భయం లేదు చివరిగా నాకు ఓకే ఒక కోరిక.. పిఠాపురంలో మీ ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవాతోనే రావాలి మీ నెల రోజులు పర్యటన షెడ్యూల్ కి ఏర్పాట్లు చేయండి జనసేన పార్టీ మొత్తం వాట్సాప్ లోనే నడుస్తుంది ‘‘కొత్తతరం నేతల్ని పవన్ తయారు చేస్తారని గుడ్డిగా అడుగులు వేశాం. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్తో నడిచి భంగపడ్డాం. నటించేవాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరు. స్వార్థరాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్. అందుకే పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్పైగానీ ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. ’’ అని పవన్కు పోతిన మహేష్ చురకలు అంటించారు. ఇదిలా ఉంటే.. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారాయన. ఈ క్రమంలోనే వెస్ట్ సీటుపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు టికెట్ కోసం పెత్తందారులతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. టీడీపీ నుంచి ఇద్దరు నేతలు సీటు కోసం యత్నించగా.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లొచ్చనే ప్రచారం తొలి నుంచి నడిచింది. దీంతో మహేష్ పవన్ నుంచి ఆ సీటు తనకేనని మాట తీసుకున్నారు. ఈ లోపు సీన్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఏపీ బీజేపీ.. పొత్తులో భాగంగా ఆ సీటును తన్నుకుపోయింది. పవన్ ద్వారా చంద్రబాబు తన అనుచరుడు సుజనా చౌదరి(బీజేపీ)కి ఇప్పించుకున్నారు. అయినా కూడా మహేష్ సీటు కోసం ప్రయత్నించారు. పవన్పై చివరి నిమిషం వరకు నమ్మకం ప్రదర్శించారు. అయినప్పటికీ చివరకు.. వేల కోట్లున్న అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత అయిన మహేష్ను పవన్ దగా చేశారు. పవన్ను నమ్మి తాను మోసపోయినట్లు మహేష్ ఇప్పుడు తన అనుచరుల వద్ద వాపోయారు. అధికారంలోకి వస్తే.. ఏదైనా పదవి ఇస్తామని పవన్ ఆఫర్ చేసినప్పటికీ మహేష్ అందుకు లొంగలేదని తెలుస్తోంది. పోతిన మహేష్ తదుపరి రాజకీయ అడుగులు ఎటు అనేది తెలియాల్సి ఉంది. -
'మనవడి' పై తాత హత్యాయత్నం!
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన సామంతుల మహేశ్ (28)పై తాత సామంతుల కొమురయ్య హత్యాయత్నం చేశాడు. ఎస్సై సత్యనారాయణ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురయ్యకు కుమారుడు మల్లేశం, కూతురు కనుకవ్వ సంతానం. మల్లేశంకు వివాహమై ఇద్దరు కుమారులు జన్మించిన తరువాత దాదాపు 20ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతడి కుమారులిద్దరు అశోక్, మహేశ్ను కొమురయ్య పెంచి పెద్దచేశాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి వారికి తన వ్యవసాయ భూమిని పంపకం చేశాడు. కాగా మహేశ్ తరచూ తాగి వచ్చి తాతతో గొడవపడేవాడు. తన అన్న అశోక్కు ఎనిమిది గుంటల భూమి ఎక్కువ ఇచ్చావని దూషిస్తూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మహేశ్తో ఎప్పటికైనా తనకు ఇబ్బందులు తప్పవని కొమురయ్య భావించాడు. ఇంటి ముందు పడుకున్న మహేశ్పై శనివారం వేకువజామున గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతడి తల్లి, భార్యకు మెలకువ వచ్చి బయటకు రావడంతో కొమురయ్య గొడ్డలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మహేశ్ మేనమామ కట్ట కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మహేశ్ను చికిత్స నిమిత్తం కరీంనగర్ తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఇవి చదవండి: ఉసురు తీసిన నకిలీ జ్యోతిష్యుడు -
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్ఖాన్తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్ను కలిశారు. టికెట్పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
పవన్ కళ్యాణ్ గురించి పోతిన మహేష్
-
ఫ్యామిలీతో దీక్ష చేపట్టిన పోతిన మహేష్
-
పవన్ కు పోతిన మహేష్ ఫైనల్ వార్నింగ్
-
పవన్పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్గా పోటీ?
-
పవన్పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్గా పోటీ?
సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ సీటు పంచాయితీ పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలని పోతిన మహేష్ కోరగా, టిక్కెట్ ఇచ్చేది లేదంటూ పవన్ తేల్చేశారు. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్నారు. పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలంటూ మహేష్ పట్టుబట్టారు. పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని పోతిన నిర్ణయించారు.ఇండిపెండెంట్గా పోటీచేస్తానని పవన్కు పోతిన స్పష్టం చేశారు. పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు? -
విజయవాడ వెస్ట్: దేవుడా పవన్ మనసు మార్చు.. జనసైనికుల నిరసన
సాక్షి, విజయవాడ: పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు, పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తుల్లో పశ్చిమ సీటు బీజేపీకి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట బల ప్రదర్శనలు చేపట్టారు. వెస్ట్ టిక్కెట్ తనదే అంటున్న వక్కలగడ్డ భాస్కర్.. ఇటీవల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా తెరపైకి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ‘‘వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారని, ఏడుగురు ఆశావాహుల పేర్లను అధిష్టానానికి పంపించాం. ముగ్గురు పేర్లను అధినాయకత్వం పరిశీలిస్తోంది. టిక్కెట్ తనకు వస్తుందని ఆశిస్తున్నానని శ్రీరామ్ అన్నారు. -
చంద్రబాబు పై జనసేన పోతిన మహేష్ సంచలన కామెంట్స్
-
చంపడానికొచ్చి.. హతమయ్యాడు
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్లో వేధిస్తున్నాడు. భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. పంచాయితీ పెట్టించినా మారని తీరు యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నిర్మాత మహేశ్ కన్నుమూత
ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, రచయిత వి.మహేశ్ (85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. స్వగృహంలో బాత్ రూమ్ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన మహేశ్ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు జిల్లా కొరుటూరు వి.మహేశ్ స్వస్థలం. ‘మాతృమూర్తి’ సినిమాతో సినిమా నిర్మాణంలోకి ప్రవేశించారు మహేశ్. ఎన్టీ రామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మనుషులంతా ఒక్కటే’, లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్వకత్వంలో ‘సింహపురి సింహం’, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా ‘ముసుగు దొంగ’ వంటి పలు సినిమాలు నిర్మించారాయన. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు వి.మహేశ్. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్లో ప్రసారమైన ‘హరి భక్తుల కథలు’ సీరియల్కి ఆయన నిర్మాతగా, రచయితగా వ్యవహరించారు. అలాగే ‘విప్రనారాయణ’కు 2009లో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారాయన. తన అన్నయ్య, ప్రముఖ కళా దర్శకుడు వి. వి. రాజేంద్ర కుమార్తో కలసి సినిమాలకు ప్రచార సామగ్రిని తయారు చేసేందుకు ‘స్టూడియో రూప్ కళ’ అనే సంస్థను, ‘ఆదిత్య చిత్ర ’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు వి. మహేశ్. అయితే ఆయన వివాహం చేసుకోలేదు. వి.మహేశ్ మృతికి సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
బాత్రూమ్లో కాలుజారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి.మహేశ్ (85) గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంట్లోని బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కాలుజారి పడ్డారు. దీంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు మహేశ్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) 1975లో 'మాతృమూర్తి' సినిమాతో వి.మహేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ 'మనుష్యులంతా ఒక్కటే', 'మహాపురుషుడు', చిరంజీవి 'సింహపురి సింహం', సుమన్ 'ముసుగు దొంగ' చిత్రాల్ని నిర్మించారు. మనుష్యులంతా ఒక్కటే సినిమాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమైన 'హరి భక్తుల కథలు' సీరియల్కి ప్రొడ్యూసర్, రైటర్గా పనిచేశారు. నెల్లూరు జిల్లాలోని కొరుటూరు నిర్మాత మహేశ్ సొంతూరు. పెళ్లి చేసుకోకుండానే చివరివరకు ఉండిపోయారు. ఈయన అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ చెప్పారు. (ఇదీ చదవండి: అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత) -
'షాపింగ్ మాల్' హీరో ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వస్తుంటారు. కానీ వీళ్లలో హిట్ కొట్టి నిలబడేది చాలా తక్కువమంది. ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉండే పర్లేదు కానీ ఒకవేళ సినీ నేపథ్యం ప్లస్ హిట్లు లేకపోతే మాత్రం ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నారో అంతే ఫాస్ట్గా కనుమరుగైపోతారు. 'షాపింగ్ మాల్' సినిమా హీరోది కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అసలెలా ఉన్నాడనేది చూద్దాం. తమిళనాడులోని దిండిగల్ పుట్టి పెరిగిన మహేశ్.. స్వతహాగా వాలీబాల్ ప్లేయర్. ఓ రోజు గేమ్ ఆడుతున్నప్పుడు ఇతడిని చూసిన డైరెక్టర్ వసంతబాలన్.. తన తీయబోయే సినిమాలో నటించమని కోరాడు. కానీ తనకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మహేశ్ చెప్పాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మారడంతో అదే వసంతబాలన్ తీసిన 'అంగడి తెరు' మూవీలో హీరోగా నటించాడు. దీన్నే తెలుగులో 'షాపింగ్ మాల్' పేరుతో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) 'షాపింగ్ మాల్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. ఆ తర్వాత మాత్రం కెరీర్ని సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే తమిళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అలానే మలయాళ, ఫ్రెండ్, తెలుగులోనూ తలో చిత్రం చేశాడు. కానీ ఏం లాభం... ఒక్కటంటే ఒక్క మూవీ కూడా 'షాపింగ్ మాల్' మాదిరి హిట్ అవ్వలేదు. మనోడికి పేరు రాలేదు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సెటిలైపోయారు కానీ హీరోగా పలు సినిమాలు చేసిన మహేశ్ మాత్రం హిట్లు లేకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయాడు. సినిమాల వల్లనో ఏమో గానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత ఇతడిని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ తర్వాత 'షాపింగ్ మాల్' హీరో అని తెలిసి తెలుగు నెటిజన్స్ అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) -
విచారణకు వెళ్లిబాలికతో అసభ్య ప్రవర్తన
ఖలీల్వాడి (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహేశ్పై పోక్సో కేసు నమోదైంది. కానిస్టేబుల్ మహేశ్ ఓ కేసు విషయమై నిందితుడికి సమన్లు అందించడానికి ఆదివారం నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో నిందితుడు లేకపోవడంతో పక్కింట్లో ఉన్న బాలికతో మాట్లాడి నిందితుడి వివరాలను తెలుసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చాక బాలిక వారికి విషయం చెప్పింది. దీంతో వారు సోమవారం ఉదయం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఎస్సై మహేశ్ నిజామాబాద్ సౌత్ సీఐ వెంకటనారాయణకు వివరించారు. ఆయన సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం మహేశ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహేశ్ గతంలో ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తేశాక మళ్లీ అదే స్టేషన్లో విధుల్లో కొనసాగుతున్నారు. పోక్సో కింద కేసు నమోదు కావడంతో సదరు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. -
చిన్న పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోతే... పేరెంట్స్ ఇలా చెయ్యండి
-
క్రైమ్ కామెడీ
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్, ‘తాగుబోతు’ రమేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘నటరత్నాలు’. శివ నాగు దర్శకత్వంలో చంటి యలమాటి, డా. దివ్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి, సినిమా తీయాలనుకునేవాళ్లు ఎలా సఫలమవుతున్నారు? ఎలా విఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘2002లో ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి, లాస్ అయ్యాను. ‘నటరత్నాలు’ కథ సినిమాలో సినిమాలాంటిది. ప్లాన్ చేసిన బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు చంటి యలమాటి. -
'నటరత్నలు’.. ‘జాతి రత్నాలు’ అంత హిట్ అవ్వాలి
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు మరియు రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఇండస్ట్రీలో కష్టసుఖాలు ఉంటాయి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ కనబడతాయి అవన్నీ అధిగమించి నిలబడ్డమే కళ, ఇక్కడ ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. 'నటరత్నలు' జాతి రత్నాలు లా ఉంది పేరు అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక మెడిసిన్ లాంటిది అది ఎంత తీసుకుంటే అంత మంచిది. నటరత్నాలు టైటిల్ చాలా బాగుంది. నటరత్న అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశీస్సులతో నటరత్నాలు అనే టైటిల్ చాలా బాగా పెట్టారు.డైరెక్టర్ శివ నాగు ది కష్టపడే వ్యక్తిత్వం, 24 గ్రాఫ్స్ ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి మంచి సినిమా అవ్వాలి మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ .. సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను’ అన్నారు. నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ.. ‘ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎంత బడ్జెట్ చెప్పారు అంతే బడ్జెట్లో సినిమా తీయగల దర్శకుడు శివ నాగు గారు. అతి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమా ని చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. -
సుపారీ ఇచ్చి.. భర్తను హత్య చేయించి
జోగిపేట (అందోల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించి మృతదేహాన్ని తగలబెట్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం వెలుగుచూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్కుమార్ కథనం ప్రకారం.. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం(30)కు అందోల్ మండలం మన్ సాన్పల్లికి చెందిన కల్పనతో 2015లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జోగిపేట పట్టణం అందోల్లోని డబుల్ బెడ్రూం కాలనీల వద్ద వీరు నివాసం ఉంటున్నారు. కల్పనకు మన్సాన్పల్లికి చెందిన మస్కూరి మహేశ్తో పెళ్లికి మందు నుంచీ సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయమై మల్లేశం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి విషయం ప్రియుడు మస్కూరి మహేశ్కి వివరించింది. దీంతో మహేశ్.. రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజీకి చెప్పగా, అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తలారి మహేశ్తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేలా సుపారీ మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశారు. ఈ విషయంలో తన స్నేహితుడు, గంగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వజ్జరి మహేశ్ సహకారం తీసుకున్నారు. హత్య జరిగిందిలా.. వజ్జరి మహేశ్, మస్కూరి మహేశ్, తలారి మహేశ్.. ఈ ముగ్గురూ ఓ కారు అద్దెకు తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున కల్పన ఇంటి వద్దకు వెళ్లి కాపుకాశారు. 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటకు రాగానే అతని తలపై బండరాయితో మస్కూరి మహేశ్ బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతను కారులోనే మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం కోనాపూర్ చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లేశం భార్య కల్పనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. నిందితులు మస్కూరి మహేశ్, కల్పన, తలారి మహేశ్, వజ్జరి మహేశ్, ఉసికే అంబాజీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసును కేవలం 22గంటల వ్యవధిలో ఛేదించిన జోగిపేట పోలీసులను ఎస్పీ రూపేశ్ అభినందించారు. -
ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 11న వెలువడింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నిక ఏకగ్రీవమే రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేషన్ల అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ ఇద్దరు నాయకులను శాసన మండలికి పంపడమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. -
సార్వత్రిక ఎన్నికలపైనే ప్రధాన పార్టీల ఫోకస్
-
మెగాస్టార్ సినిమాతో ఎంట్రీ.. సలార్ వంటి భారీ చిత్రాల్లో ఛాన్స్
పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగు చిత్రాలకు, నటులకు పరభాషా అభిమానుల ఆదరణ పెరిగిందని సినీనటుడు వడ్డి నాగ మహేష్ అన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన వరుసగా రంగస్థలం, గద్దలకొండ గణేష్, ఉప్పెన, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. రచయితగా ప్రయాణం మొదలు పెట్టి నటుడిగా స్థిరపడిన నాగ మహేష్ హనుమాన్జంక్షన్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. రచయిత నుంచి నటుడిగా.. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో 1990లో చైన్నె వెళ్లి ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఫలితం దక్కలేదని నాగ మహేష్ చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయంగా 1996లో ‘కొత్తపుంతలు’ కథతో రచయితగా ప్రయాణం మొదలు పెట్టానని, ‘శ్రీవల్లి’ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ వద్ద సహాయకుడిగా పని చేశానని తెలిపారు. ఎస్కే మిశ్రో శిష్యరికంలో రంగస్థల నటుడిగా పలు సాంఘిక నాటకాలలో నటించటంతో పాటు సినిమా రంగంపై ఆసక్తితో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించిన్నట్లు తెలిపారు. దీంతో 2016లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించే చాన్స్ దక్కిందని వివరించారు. ఆ సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్ర, రంగస్థలంలో హీరోయిన్కి తాగుబోతు తండ్రిగా, ఉప్పెనలో విలన్ విజయ్ సేతుపతితో పాటు నటించిన గోవింద్ పాత్రలు ప్రేక్షకులకు దగ్గర చేశాయన్నారు. ఆ తర్వాత గద్దలకొండ గణేష్, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. ఇప్పటికీ సుమారు 50కిపై తెలుగు చిత్రాలలో నటించగా, త్వరలో విడుదల కానున్న సలార్, ఉస్తాద్ భగత్ సింగ్, గేమ్ ఛేంజర్, యురేకా కసామిసా, శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్, రజకార్ చిత్రాలలోనూ మంచి పాత్రలలో నటించానని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోందని, దీని వల్ల తెలుగు నటులకు ఇతర భాషల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా మార్కెటింగ్ కోసం దర్శక, నిర్మాతలు వేర్వేరు భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. -
నాలుగు కథలతో...
యడ్లపల్లి మహేశ్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కరెన్సీ నగర్’. వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో ముక్కాముల అప్పారావు, డా. కోడూరు గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో డబ్బుకీ, మనిషికీ ఉన్న సంబంధాన్ని వెన్నెల కుమార్ చక్కగా చూపించారు. నాలుగు కథలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
Mahesh Babu: మాస్ లుక్ అయిన క్లాస్ లుక్ అయిన మహేష్ బాబే..
-
ఆప్యాయనురాగాలతో..
పులివెందుల మహేశ్, ప్రియా పాల్ జంటగా శివరామ్ తేజ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి సిన్మా’. జి. మంజునాథ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ కాసుల రామకష్ణ (శ్రీధర్), నటులు నాగమహేశ్, ‘బలగం’ సంజయ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించినవారికి థ్యాంక్స్’’ అన్నారు జి. మంజునాథ రెడ్డి. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు శివరామ్ తేజ. ‘‘తండ్రీకొడుకుల అనురాగం, బావా–మరదళ్ల ఆప్యాయతతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు పులివెందుల మహేశ్. -
‘మా ఊరి సిన్మా’వచ్చేస్తుంది
పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా శివరాం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా ఊరి సిన్మా’. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై మంజునాధ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ..‘మా ఊరి సిన్మా’ కొంతమంది చూపించాం. వారంతా బాగుందని అభినందిస్తూ ఉంటే ఆనందంగా ఉంది. మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను’ అన్నారు . చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ‘మా సినిమా కోసం మా టీమ్ చాలా కష్ట పడ్డారు. వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు. హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ ‘ మా సినిమాలో తండ్రి కొడుకుల అనురాగం ఉంది. బావ మరదళ్ల ఆప్యాయత ఉంది. అన్ని ఎమోషన్స్ మా చిత్రం లో ఉన్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను ’అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామ కృష్ణ (శ్రీధర్), ప్రముఖ నటులు నాగ మహేష్, బలగం సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
'చనిపోకముందే.. చనిపోయిందని చప్పడంతో'.. ప్రేమికులిద్దరూ తీవ్ర నిర్ణయం..!
మహబూబ్నగర్: మండలంలోని మిరాసిపల్లికి చెందిన స్వాతి(15) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం మోట్లంపల్లికి చెందిన మహేష్(19), స్వాతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతి కుటుంబ సభ్యులు మహేష్కు ఫోన్ చేసి స్వాతి చనిపోకముందే చనిపోయిందని, మా అమ్మాయి చావుకు నీవే కారణం నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపుతామని చెదిరించారు. దీంతో మహేష్ తన తండ్రికి విషయాన్ని చెప్పడంతో మాట్లాడుదాము నీవేమి బెంగపెట్టుకోవద్దని సర్దిచెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. మహేష్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న స్వాతి ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్వాతి తండ్రి కుర్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కాగా స్వాతి స్థానిక జెడ్పీహెచ్లో 10వ తరగతి చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
TS Crime News: మందలించాడని.. కన్న తండ్రినే రోకలి బండతో.. విషాద ఘటన!
పెద్దపల్లి: తండ్రిని కిరాతకంగా హతమార్చిన ఓ తనయుడికి పెద్దపల్లి న్యాయస్థానం జీవితఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. వివరా ల్లోకి వెళ్తే.. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్కు చెందిన కత్తెర్ల మహేశ్ డిగ్రీ ఫెయిలయ్యి, పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో 7–5–2021 రోజున అతని తండ్రి లచ్చయ్య మందలించాడు. తన మిత్రులు, చుట్టుపక్కనున్నవారి ముందు ఇలా చేయడాన్ని మహేశ్ అవమానంగా భావించాడు. అదేరోజు రాత్రి ఆరుబయట త్రండి మంచం పక్కనే మరో మంచం వేసుకొని, నిద్రించాడు. అర్ధరాత్రి లేచి, పక్కనున్న రోకలి బండతో లచ్చయ్యపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్హెచ్వో కేసు నమోదు చేయగా సీఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో మహేశ్కు న్యాయమూర్తి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ మహేశ్ల పర్యవేక్షణలో సాక్షులను ప్రవేశపెట్టడానికి సహకరించిన ఎస్సై వెంకటకృష్ణ, సీఐ జగదీశ్, సుల్తానాబాద్ సీడీవోలు శ్రీనివాస్, సందీప్, లైసన్ అధికారి హెచ్సీ కోటేశ్వర్రావులను సీపీ రెమారాజేశ్వరి అభినందించారు. -
గొడవపడి అన్నాచెల్లి తీవ్ర నిర్ణయం..! చివరికి తల్లి!
మహబూబ్నగర్: అన్నాచెల్లి బలవన్మరణంతో జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని పళ్ల ఏరియాలోని కోటవీధికి చెందిన చేనేత కుటుంబం అన్నాచెల్లెలు మహేష్ (35), లక్ష్మి (32) తల్లి రాములమ్మ కొన్నేళ్లుగా మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆదివారం రాత్రి అన్నాచెల్లి గొడవపడ్డారు. దీంతో అన్న మహేష్ మనస్తాపంతో చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన చెల్లి చీరను కత్తిరించగా, అప్పటికే ఆయన మృతి చెందాడు. చెల్లి సైతం మానసిక స్థితి బాగులేకపోవడంతో ఉరేసుకుంది. తల్లి రాములమ్మకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఇంట్లో ఏమి అయ్యిందో తెలియని పరిస్థితి. తెల్లారేసరికి కొడుకు, కుతురుని పిలిచినా పలకకపోవడంతో రోధించింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడడంతో వారు మృతి చెందినట్లు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఏఎస్ఐ ఆరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చందాలు పోగుచేసి అంత్యక్రియలు.. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్, నాయకులు కెంచె శ్రీనివాస్, గోపాల్యాదవ్, ఆ ప్రాంత యువకులు ముందుకు వచ్చి చందాలను పోగుచేశారు. పోలీసు అధికారులు సైతం వారికి తొచిన ఆర్థిక సాయం చేశారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించి యువకులు మానవత్వం చాటుకున్నారు. రాములమ్మను జిల్లా ఆస్పత్రికి తరలింపు.. కొడుకు, కుమార్తె మృతి చెందడంతో తల్లి రాములమ్మ అనాథగా మారింది. పళ్ల ఏరియా యువకులు ఆమెను ఆటోలో వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యపరిస్థితి బాగలేకపోవడంతో సిబ్బంది నిరాకరింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారాన్ని డీడబ్ల్యూఓ వేణుగోపాల్కు ఇవ్వగా ఆయన స్పందించి సఖి కేంద్రం నుంచి సిబ్బందిని పంపించారు. వృద్దురాలి ఆరోగ్యం బాగైన తర్వాత వృద్ధాశ్రమనికి తరలిస్తామని తెలిపారు. -
వివాహితపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
అనంతపురంశ్రీకంఠంసర్కిల్: అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ మార్కెట్ మహేష్ ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వన్టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం వేణుగోపాల్నగర్కు చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆమెకు తన భర్త ద్వారా అంబార్ గేరి వాసి.. ప్రస్తుతం భవానీనగర్లో ఉంటున్న టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ మార్కెట్ మహేష్ ఏడాది క్రితం పరిచయమయ్యాడు. అప్పటినుంచి అవకాశం దొరికిన ప్రతిసారి లైంగిక వేధింపులకు గురిచేయసాగాడు. ఈ ఏడాది జూలై 27న ఆ యువతి భర్త మిత్రులంతా కలసి గోవా టూర్ ప్లాన్ చేశారు. భర్తకు వేరే పని పడడంతో యువతిని టూర్కు పంపాడు. అక్కడ ఆమె సోదరుడి వరుసైన వ్యక్తితో కలసి తీసుకున్న వీడియోలు, ఫొటోలను ఎవరి ద్వారానో తెప్పించుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే వాటిని యువతి భర్తతో పాటు అందరికీ పంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీడీపీ నాయకుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మహేష్ ను రక్షించేందుకు బడా టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. -
హైదరాబాద్లో అన్నదమ్ములు మృతి
మహబూబ్నగర్: హైదరాబాద్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆదివారం మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం చెందిన చంద్రయ్య కుమారుడు జయకృష్ణ(12) శామీర్పేటలో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చంద్రయ్య సొంత అన్న జెనిగె రాములు కుమారుడు జనిగె మహేష్(20) హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జయకృష్ణను హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి తిరిగి హాస్టల్లో వదిలేందుకు జయకృష్ణ తనకు చెందిన బైక్పై వెళ్తుండగా బాబాగూడ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంట్ స్తంభానికి ఢీకొట్టింది. జయకృష్ణ, జనిగె మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్కు వెళ్లారు. -
ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్ను నిర్మించాడు. తాజాగా వీరి రూట్లోనే అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడు. హైదరాబాద్లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్ను నడిపిస్తున్నాడు బన్నీ. వీటంన్నిటితో పాటు గతేడాది అమీర్ పేట్లో మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు మొదలుపెట్టిన విషయం తెల్సిందే. (ఇదీ చదవండి: ఇలియానాపై ట్రోల్స్.. అతని ఫోటో రివీల్) ఇప్పటికే అది పూర్తయ్యింది. ఏషియన్స్ సినిమాస్, అల్లు అర్జున్ పేరు వచ్చేలా 'AAA' సినిమాస్ పేరు కూడా పెట్టేశాడు. తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ థియేటర్ను జూన్ 16న బన్నీ ప్రారంభించనున్నారట. అదేరోజు ప్రభాస్ 'ఆదిపురుష్' విడదల కానుంది. రాముని సినిమాతో మల్టీప్లెక్స్ను ప్రారంభిస్తే శుభసూచకమని భావించి పనులను కూడా వేగవంతం చేయించాడట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే.. జూన్ 16 న 'AAA' సినిమాస్లో మొట్టమొదటి స్క్రీనింగ్గా ఆదిపురుష్ ఉండనుంది. (ఇదీ చదవండి: నిశ్చితార్థ వేడుకలో మెరిసిపోయిన లావణ్య.. చీర ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!) -
క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్
బుల్లితెరపై కమెడియన్గా కనిపించిన మహేశ్ సిల్వర్ స్క్రీన్పైనా నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. కామెడీతో నవ్వించడమే కాదు.. ఎమోషనల్ సీన్స్లో నటించి ఏడిపించగలరు. ఇక విలనిజాన్ని కూడా ప్రదర్శించగలరు. అలా విభిన్న పాత్రలతో ఆడియెన్స్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేశ్ కెరీర్ను రంగస్థలం ఒక్కసారిగా మార్చేసింది. రంగస్థలం సినిమానే తన ఇంటి పేరు అన్నంతగా మారిపోయింది. ఆ చిత్రం తరువాత మహేశ్ కాస్తా.. రంగస్థలం మహేశ్ అన్నట్టుగా మారిపోయింది. ఇప్పుడీ నటుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అగ్ర హీరోలతో పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లోని పలు క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన నటిస్తున్నాడు. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో, అలాగే మారుతి ప్రభాస్ - కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాల్లో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రాజెక్టులోనూ మహేశ్ కనిపించనున్నాడు. ఇలా టాలీవుడ్లోని క్రేజీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు దక్కించుకుంటూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కమెడియన్, ఆర్టిస్టుగా అన్ని రకాల క్యారెక్టర్లు వేస్తూ నటుడిగా దూసుకుపోతోన్నాడు రంగస్థలం మహేశ్. -
ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్
జబర్దస్త్ కమెడియన్ మహేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాతో ఓ రేంజ్లో గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫుల్ ఎమోషనల్ సీన్స్లో మహేశ్ అద్భుతమైన నటనతో మెప్పించారు. అతనికి యాస, లుక్ మహేశ్కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేశ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్పై మహేశ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!) మహేశ్ మాట్లాడుతూ.. 'చైతన్యతో నేను ఓసారి ట్రావెల్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నాకు డ్యాన్స్ నేర్పించారు. చైతన్య మంచి టాలెంటెడ్. ఆయన అలా చేసుకున్నాడంటే ఎంత స్ట్రగుల్ అయ్యాడో. ఆరోజు చాలా బాధపడ్డా. అంత క్రేజ్ ఉన్న ఆయనే అలా చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి?' అని అన్నారు. రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతూ..'కానీ నాకు అయితే రెమ్యూనరేషన్స్ బాగానే వస్తున్నాయి. నాకు ప్రారంభంలో తక్కువగానే ఉండేది. ఎందుకంటే మనకు అవకాశం రావాలి కదా. క్రేజ్ను బట్టి అమౌంట్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ తక్కువ డబ్బులు వచ్చినా మనం కష్టపడాలి. ఆ తర్వాతే నాకు బాగా డబ్బులొచ్చాయి. కామెడీలో నాకు రవితేజ టైమింగ్ అంటే చాలా ఇష్టం. సీన్ వందశాతం నిలబెట్టడంలో ఆయన బెస్ట్. ఎలాంటి సీన్ అయినా పండించగలరు. నా ఫేవరేట్ హీరోయిన్ అంటే అనుష్క. నా చిన్నప్పుడు అయితే రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. అయితే ఆమెను ఎప్పుడు కలవలేదు.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్) -
నాన్న చితికి కూడా నా వద్ద డబ్బులు లేవు: రంగస్థలం మహేశ్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు సంపాదించుకున్న మహేశ్. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్నాడు. కామెడీ షోలో ఎప్పుడు కడుపుబ్బా నవ్వించే మహేశ్.. తన యాస, డైలాగ్స్తో సినిమాల్లో తన మార్క్ చూపించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో ఎమోషనల్ సీన్స్లో అదరగొట్టాడు. ఆ సినిమాతో రంగస్థలం మహేశ్గా అభిమానుల్లో పేరు సంపాదించాడు. (ఇది చదవండి: 'సేవ్ ది టైగర్స్'.. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన యాత్ర డైరెక్టర్!) అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న మహేశ్ తన జీవితంలో పడ్డ కష్టాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు పేరు ఒక్క రోజులో వచ్చింది కాదని చెప్పారు. మహేశ్ మాట్లాడుతూ ..'నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జీరో. మన టాలెంట్ నమ్ముకొని వచ్చా. ఏం జరిగినా ముందుకెళ్లడమే నాకు తెలుసు. నాకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్కు వచ్చా. సినిమాలనే నమ్ముకున్నా. నేను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ సమయంలో నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులిచ్చే స్తోమత లేదు. అప్పుడు నా జేబులో రూ.500 కూడా లేవు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో ఈ బతుకు ఎందుకురా అనిపించింది. దీంతో చాలామంది బంధువులు, స్నేహితులు సినిమాలు అవసరమా? అంటూ నన్ను తిట్టారు. ఆ సందర్భంలో నేను మాత్రం చాలా బాధపడ్డా. నాకు మంచి అవకాశం ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. కొన్నేళ్లు పట్టినా కూడా మంచిపాత్ర చేసే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్లో ఇల్లు లేదని.. సొంతూళ్లో ఇటీవలే ఇంటిని నిర్మించా. ' అంటూ మహేశ్ తీవ్ర భావోద్వాగానికి గురయ్యాడు. (ఇది చదవండి: నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!) -
కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు
వెల్గటూర్(ధర్మపురి): కొడుకు వేధింపులకు విసిగి వేసారిన ఓ దంపతులు అతడిని కొట్టి చంపారు. జగి త్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకార.. రాంనూర్కు చెందిన కొదురుపాక భూమయ్య–రాజమ్మ దంపతులు. వీరికి మహేశ్ (35)అనే ఒక కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉన్నారు. భూమయ్య సింగరేణి సంస్థలో కార్మికుడిగా పనిచేస్తూ గోదావరిఖనిలో నివాసం ఉండేవాడు. ఉద్యోగ విరమణ చేశాక స్వగ్రామం రాంనూర్ వచ్చి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులు, భార్యతో మహేశ్ గొడవపడుతున్నాడు. ఈనెల 20న తనకు రూ.200 కావాలని తండ్రి భూమయ్యను మహేశ్ అడిగాడు. అయితే భూమయ్య ఇవ్వకపోవడంతో గొడవకు దారితీసింది. గొడవ పెద్దది కా వడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కౌలు దారు శేఖర్తో కలసి మహేశ్ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడి లో అతని కాళ్లు, చేతులు విరిగి తీవ్రరక్తస్రావమైంది. తొ లుత జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. -
మంచి కథకు పాటలు అవసరంలేదు
సుధీర్బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. ఎస్. మహేశ్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఎస్. మహేశ్ మాట్లాడుతూ– ‘‘ఓ యాక్సిడెంట్లో గతం మర్చిపోయే ఓ పోలీసాఫీసర్ తన గురించి ఎలా తెలుసుకున్నాడు? తన లైఫ్లో జరిగిన ఓ చేదు ఘటన తాలూకు మిస్టరీని ఎలా ఛేదించాడు? అన్నదే ఈ చిత్రకథ. మంచి కథ కుదిరితే సినిమాలో కమర్షియల్ సాంగ్స్ అవసరం ఉండదు. ‘హంట్’లో అలాంటి పాటలు ఉండవు. అయితే సందర్భోచితంగా సాగే ఒకే ఒక్క పాట ఉంటుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ లేదు. ఈ మధ్య వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాల్లో హీరోయిన్ పాత్ర, కమర్షియల్ పాటలు లేకపోయినా ప్రేక్షకులు ఆదరించారు. నేను ‘హంట్’ చేయడానికి ఆ సినిమాలు కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఇక ఈ సినిమాలోని ఆరు యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. క్లైమాక్స్ చూశాక ఓ మంచి ఫీలింగ్తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్తారు’’ అని అన్నారు. -
మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం
యువ నటులు మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. సి.హెచ్ సుజాత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’అని అన్నారు. ‘మంచి సినిమా చేస్తాడని నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాను’ అని దర్శకుడు కుమార్ అన్నారు. ‘ఈ సినిమాతో సుజాత, కుమార్లకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’అని సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు అన్నారు. షూటింగ్ ప్రారంభోత్సవంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు, విలయిల్ ఫిలిప్స్ థామస్ పాల్గొన్నారు. -
నాన్న నాకు ఎన్నో ఇచ్చారు వాటిలో గొప్పది.. మీ అభిమానం : మహేష్ బాబు
-
డ్యూటికి వెళ్లి వచ్చేసరికి ఘోరం...షాక్లో భర్త
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కె.భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మహేశ్, అనిత(22) దంపతులకు వర్షిణి(22 నెలలు), శ్రీహాన్ (9నెలలు) సంతానం. వారు గత నాలుగేళ్లుగా బాలానగర్ డివిజన్ గౌతంనగర్లో నివాసం ఉంటున్నారు. మహేష్ వృత్తిరీత్యా డ్రైవర్. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మహేష్ డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. పలుమార్లు పిలిచినా అనిత తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన మహేష్ కిటికీ లోంచి చూడగా అనిత ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అనిత ఉరేసుకుని ఉండగా ఇద్దరు పిల్లలు మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. (చదవండి: పెళ్లై మూడేళ్లే అంతలోనే....ప్రాణం తీసిన కట్నపిశాచి) -
52 దేశాల ఎన్నారైల మద్దతు బీఆర్ఎస్కే
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితికి ప్రపంచంలోని 52 దేశాల ఎన్నారైలు మద్దతు ప్రకటించారని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కో–ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఎన్నారై ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... కేసీఆర్ దసరా రోజు తీసుకున్న బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయాన్ని ఆయా దేశాల ఎన్నారై ప్రతినిధులు స్వాగతించారని తెలిపారు. తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాల ఎన్నారైలు సైతం మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్నారైలు భావిస్తున్నారని, బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేసీఆర్ అడుగుజాడల్లో ముందుకెళ్తామని ఎన్నారైలు పేర్కొన్నట్లు మహేష్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నారైల మద్దతు బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు. (క్లిక్: కాంగ్రెస్కు గట్టి షాకిచ్చిన కోమటిరెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ!) -
కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు. -
‘మాటరాని మౌనమిది ’మూవీ రివ్యూ
టైటిల్ : మాటరాని మౌనమిది నటీనటులు : మహేష్ దత్త,శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు నిర్మాణ సంస్థ :రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ దర్శకత్వం: సుకు పూర్వాజ్ సంగీతం : అషీర్ లుక్ సినిమాటోగ్రఫీ:చరణ్ విడుదల తేది: ఆగస్ట్ 19, 2022 మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి హీరోలుగా, సోనీ శ్రీవాస్తవ హీరోయిన్గా నటించిన చిత్రం ‘మాట రాని మౌనమిది’. ‘శుక్ర’ఫేం సుకు పూర్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో మల్టీ జోనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రామ్(మహేశ్ దత్త) చాలా కాలం తర్వాత తన భావ ఈశ్వర్(శ్రీహరి ఉదయగిరి)ని కలవడానికి అరకు వెళ్తాడు. అక్కడ ఓ పెద్ద బంగ్లాలో ఈశ్వర్ ఒక్కడే ఉంటాడు. ఓ రోజు బిజినెస్ పని మీద ఈశ్వర్ బయటకు వెళ్లగా.. రామ్ ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. దీంతో రామ్ మేడపైకి వెళ్లి అక్కడ గది తలుపులు తెరచి చూడగా.. ఈశ్వర్ శవం కనిపిస్తుంది. భయంతో రామ్ ఇంటి నుంచి బయటకు పరుగులు తీస్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రాత్రంతా హాల్లోనే గడుపుతాడు. అయితే మరుసటి రోజు ఉదయమే ఈశ్వర్ తిరిగి ఇంటికి వస్తాడు. అతన్ని చూసి రామ్ షాకవుతాడు. నువ్వు చనిపోయావు కదా మళ్లీ ఎలా వచ్చావని అడుగుతాడు. నేను చనిపోవడం ఏంటి.. అసలు ఏం జరిగిందని అడగ్గా.. రాత్రి జరిగిన విషయమంతా చెబుతాడు రామ్. డెడ్బాడీ ఎక్కడ ఉందో చూద్దాం పదా అని పైకి వెళ్లి చూడగా..అక్కడ రామ్ శవం కనిపిస్తుంది. రామ్ డెడ్బాడీ ఈశ్వర్కు, ఈశ్వర్ డెడ్బాడీ రామ్కి కనిపిస్తుంది. అలా ఎందుకు జరిగింది? నిజంగానే వాళ్లు చనిపోయారా? ఆ ఇంట్లో ఏంముంది? ఈ సస్పెన్స్ థ్రిల్లర్కు ‘మాటరాని మౌనమిది’అనే టైటిల్ ఎందుకు పెట్టారని తెలియాలంటే థియేటర్కి వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లవ్ స్టోరీ, థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన చిత్రం ‘మాటరాని మౌనమిది’. దర్శకుడు సుకుమార్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. సినిమాలో సస్పెన్స్, ట్విస్టులు ఉంటాయి కానీ.. స్లో నెరేషన్ మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఫస్టాఫ్లో రామ్, సీత మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. రామ్ ఉంగరం ధరించడం..ఇంట్లో ఏదో తిరిగినట్లు కనిపించి.. అది ఏంటో తెలియకుండా క్యూరియాసిటీ పెంచేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. అయితే అక్కడ మాత్రం దర్శకుడు కథను కామెడీగా మలిచాడు. అది అంతగా వర్కౌట్ కాలేదు.సెకండాఫ్లో సాగదీత సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే సీత ఫ్లాష్బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటంది. మ్యాజిక్తో ఇంకో వ్యక్తిని సృష్టించడం.. సీతకు రామ్ ప్రపోజ్ చేయడం లాంటి సీన్లను ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. హారర్ చిత్రాలను ఆస్వాదించేవారిని ‘మాటరాని మౌనమిది’ అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రామ్ పాత్రకి మహేశ్ దత్త న్యాయం చేశాడు. అతనికిది తొలి చిత్రం. ఇక రామ్ భావ ఈశ్వర్గా శ్రీహరి ఉదయగిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి చుట్టే కథ ఎక్కువగా తిరుగుంది. ఇక క్లాసికల్ డ్యాన్సర్ సీతగా సోనీ శ్రీవాస్తవ మంచి నటనను కనబరిచింది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర తనది. అర్చనా అనంత్,సునీల్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అషీర్ లుక్ నేపథ్య సంగీతం పర్వాలేదు. దంపుడు లచ్చి అనే పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
నవ్వించేందుకు సిద్ధమవుతున్న ‘నటరత్నాలు’
సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘నటరత్నాలు’. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇనయా సుల్తాన హీరోయిన్. మర్డర్ మిస్టరీ, క్రైం నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా. దివ్య నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు నర్రా శివనాగు అన్నారు. టాకీ పార్ట్ పూర్తయిందని, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ తెలిపారు. త్వరలోనే మిగతా పార్ట్ షూటింగ్ అంతా కూడా పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యానారాయణ, సీరియర్ దర్శకులు ఏఎస్ రవికుమార్ చౌదరి, సూర్య కిరణ్, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్గా..
మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టారు. లెక్చరర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని నిరూపించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నగరికి చెందిన మహేష్ అలకాటూరు. నగరి: మండలంలోని నంబాకం గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి, సరోజమ్మ దంపతుల కుమారుడు మహేష్ గ్రూప్–1 పరీక్షలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్గా అర్హత సాధించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. నంబాకం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఈయన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్నారు. 2011లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2013లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా చేరారు. అయితే కలెక్టర్ కావాలన్న చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు సివిల్స్కు తర్ఫీదయ్యారు. 2016లో సివిల్స్ రాసినా మెయిన్స్ క్లియర్ కాలేదు. లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ ఉన్న తక్కువ సమయంలో ఏకాగ్రతతో పట్టు వదలకుండా సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. ఫోన్ ద్వారా ఆన్లైన్లోని మెటీరియల్నే చదివారు. 2018లో సివిల్స్ పరీక్ష రాశారు. అయితే కోర్టు వివాదాల కారణంగా నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇంతలో 2022లో సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మహేష్ డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఈయన భార్య స్వాతి నగరి మున్సిపాలిటీ, కాకవేడు సచివాలయంలో అడ్మిన్గా ఉన్నారు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) సాధనతోనే సాధ్యం సాధించాలన్న తపన ఉంటే తప్పక సివిల్స్లో మంచి ఫలితాలు పొందవచ్చు. లెక్చరర్గా పనిచేస్తూనే ఉన్న సమయంలో ఆన్లైన్లో ఎన్సీటీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని చదివారు. అలాగే ఆన్లైన్లో ఇగ్నో పుస్తకాలు, ప్రీమెటీరియల్స్ సివిల్స్లో రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. చేతిలోని ఫోన్ నాకు మెటీరియల్గా మారింది. నిరంతర సాధన, ఏకాగ్రత ఉండి బేసిక్స్పై పట్టు పెంచుకుంటే సివిల్స్లో రాణించవచ్చు. న్యూస్ రీడింగ్ తప్పనిసరి. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా వెన్నంట ఉన్న భార్య స్వాతి అందించిన సహకారం, ప్రోత్సాహం నా విజయానికి ఎంతో ఉపయోగపడింది. –మహేష్, నంబాకం గ్రామం, నగరి మండలం. -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. పర్యటన ముగించుకుని ఎయిర్పోర్ట్కు వెళ్తున్న సమయంలో ఓ యువకుడు రోడ్డుపై అర్జీతో కనిపించాడు. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ను ఆపి సెక్యూరిటీ సిబ్బందిని అర్జీ తీసుకోమని పురమాయించారు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన మహేష్కి 2019లో యాక్సిడెంట్లో అంగ వైకల్యం కలిగింది. సీఎం జగన్ జిల్లా పర్యటనకు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని తన బాధను చెప్పుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో సీఎం జగన్.. ఎయిర్పోర్ట్కు వెళ్లే మార్గంలో రోడ్డుపై అర్జీతో నిల్చోవడంతో సీఎం జగన్ చూసి స్పందించారు. అయితే, అర్జీలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనను ఆదుకోవాలని అర్జీలో కోరినట్లు మహేష్ తెలిపారు. చదవండి: (ఏ సమస్య వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం: సీఎం జగన్) -
నవ్వించేందుకు రెడీ అవుతున్న 'నటరత్నాలు’
కంటెంట్లో దమ్ముంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో చోటా సినిమాలు భారీగా వస్తుంటాయి. డిఫరెంట్ స్టోరీలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్న నేపథ్యంలో.. యంగ్ డైరెక్టర్స్ అలాంటి కథలతో సినిమాలను తెరకెక్కించి, విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. తాను కూడా అలాంటి డిఫరెంట్ కథతోనే ‘నటరత్నాలు’తెరకెక్కిస్తున్నానని చెబుతున్నాడు దర్శకుడు గాదె నాగభూషణం. ఎన్.ఎస్ నాగేశ్వర రావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశం 'నటరత్నాలు'. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం చేయబోతున్నారు మేకర్స్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా శివ నాగు వహించగా ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్,డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి, తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా కథకు తెరరూపమివ్వబోతున్నారట. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరత్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానన్నాడు.. అయితే..
సాక్షి, మదనపల్లె: ఇంటర్ చదివే రోజుల్లో పరిచయమయ్యాడు.. అమ్మాయిగా మారితే పెళ్లి చేసుకుంటానన్నాడు.. అమ్మాయిగా మారాక ఆరేళ్ల పాటు నాతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ ట్రాన్స్జెండర్ పోలీసులను ఆశ్రయించింది. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన స్వీటీ అలియాస్ లోకేష్ మదనపల్లెలో ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో చదివేటప్పుడు ములకలచెరువు మండలం పత్తికోటకు చెందిన మహేష్తో పరిచయమేర్పడింది. ఇద్దరు ఒకరు విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. చదవండి: (పెళ్లి చేసుకోవాలని కోరితే.. తల్లిని అడగాలని వెళ్లాడు.. అంతలోనే..) ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని లోకేష్ను అమ్మాయిగా మారాలని మహేష్ కోరాడు. దీంతో లోకేష్ శస్త్రచికిత్స చేయించుకుని స్వీటీగా మారిపోయాడు. ఇద్దరూ ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, వంశవృద్ధి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మహేష్ హేళన చేస్తూ ఇటీవల స్వీటీతో తెగతెంపులకు సిద్ధపడ్డాడు. దీంతో తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు మహేష్పై కేసు నమోదుచేసి తనతో పెళ్లి జరిపించాల్సిందిగా రూరల్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి స్వీటీ ఫిర్యాదుచేసింది. చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..) ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో స్వీటీ మీడియాతో మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణానికి సంబంధించి ఆధారాలు తన సెల్ఫోన్లో ఉంటే వాటిని మహేష్ తొలగించాడంది. గతంలో ఓసారి వన్టౌన్ పోలీస్స్టేషన్లో మహేష్పై ఫిర్యాదుచేయగా.. పోలీసుల ముందు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి ఆపై మాట మార్చాడని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించే సరికి.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతోనూ ఉంటానని రాజీకి వచ్చాడంది. అయితే తనను కాకుండా మహేష్ వేరొకరిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వాపోయింది. మహేష్ కోసం మగతనాన్ని త్యాగం చేసిన తనకు అతడితోనే పెళ్లి జరిపించి న్యాయం చేయాల్సిందిగా ప్రాధేయపడింది. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ‘హాఫ్ స్టోరీస్’
రాజీవ్, `రంగస్థలం` ఫేమ్ మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హాఫ్ స్టోరీస్'. శివవరప్రసాద్ కె. దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై యం. సుధాకర్ రెడ్డి నిర్మించారు. . కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అతిథి పాత్రలో నటించడం విశేషం. తాజాగా అన్ని పనులు పూర్తి చేసుకుని జనవరి 7 న విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ వరప్రసాద్ కె మాట్లాడుతూ..డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన హాఫ్ స్టోరీస్ సినిమా ను జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎంతో కష్టపడి ఈ సినిమా ను తెరకెక్కించాం. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ఈ సినిమా ఉంటుంది. అందరు ఈ సినిమా ను చూడాలని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ సినిమాకు కూడా వస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నాం. జనవరి 7 ఈ సినిమా అందరి ముందుకు రాబోతుంది. మీ అందరిని ఈ సినిమా అలరిస్తుంది. దర్శకుడు మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కించాడు. కోటి సంగీతం సినిమాకి హైలైట్. అన్నారు. -
వీరుడా వందనం.. వీరజవాన్ మహేష్ అంత్యక్రియలు
-
వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
-
నేడు వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు
సాక్షి, నిజామాబాద్: ఇందూరు గడ్డపై జన్మించి.. దేశ సరిహద్దులో రక్షణ కవచమై నిలిచి ఉగ్రమూకల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ర్యాడ మహేష్ పార్ధీవ దేహం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు వేల్పూర్ మండలం కోమన్పల్లికి చేరుకొంది. ఆశ.. శ్వాస ఆర్మీనే అంటూ అయినవాళ్లకు దూరంగా ఉంటూ దేశ ఊపిరే తన ప్రాణంగా పిడికిలి బిగించి ఎదిరించిన మహేష్ విగతజీవిగా రావడంతో పురిటిగడ్డ ఘొల్లుమంది. సతీమణి సుహాసిని, తల్లిదండ్రులు రాజులు, గంగమల్లు కన్నీటి సంద్రమయ్యారు. కోమన్పల్లి చిన్నబోయింది. కాగా.. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వీర జవాను ర్యాడ మహేశ్ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామమైన కోమన్పల్లిలో జరగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. దేశ రక్షణలో ప్రాణాలొదిలిన మహేశ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం మంగళవారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ రఘు ఆధ్వర్యంలో రెండు శాఖలకు చెందిన సిబ్బంది, స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంతిమయాత్ర, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్థానిక వైకుంఠధామాన్ని, అంతిమ యాత్ర సాగే రహదారులను పూర్తిగా శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసుల మోహరింపు బుధవారం జరిగే మహేశ్ అంతిమ యాత్రకు వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులు భారీగా బలగాలను మోహరించారు. మంగళవారం సాయంత్రమే పెద్ద సంఖ్యలో పోలీసులు కోమన్పల్లికి చేరుకున్నారు. అంతిమయాత్రకు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ ధర్వపురి అర్వింద్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం. (ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) -
బెజవాడ మహేష్ హత్య : చేధించిన పోలీసులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి గజకంటి మహేష్ హత్యకేసును చేధించినట్లు సిటీపోలీస్ కమిషనర్ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం విజయవాడలో కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ' మూడు రోజులపాటు అన్ని కోణాల్లో కేసు విచారణ చేసిన ప్రత్యేక బృందం అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారమే మహేష్ హత్య జరిగినట్లు స్ఫష్టమైంది. మహేష్ని తుపాకీ తో కాల్చి హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాం. మద్యం మత్తులో వివాదం జరగడంతోనే హైదరాబాద్ కి చెందిన సాకేత్ రెడ్డి మహేష్పై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన జరిగినపుడు సాకేత్ రెడ్డితో పాటు గంగాధర్ కూడా ఉన్నట్లుగా నిర్థారణ అయింది. (చదవండి : బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం) కాగా సాకేత్ రెడ్డికి బెజవాడలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న రాధాకృష్ణ రెడ్డి స్నేహితుడని.. రాధాకృష్ణ రెడ్డి ఆటోలోనే సాకేత్, గంగాధర్ మద్యం తాగటానికి వచ్చారు. తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయటంతో పాటు, మరొకరికి వార్నింగ్ ఇవ్వటానికి సాకేత్ రెడ్డిని పిలిపించాడు. అయితే కిడ్నాప్ చేద్దాం అని వచ్చిన సాకేత్ మద్యం మత్తులో మహేష్తో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే సాకేత్ తుపాకీతో మహేష్పై కాల్పులు జరిపాడు . కాగా సాకేత్ ఎప్పుడూ తన వెంట రివాల్వర్ వెంటపెట్టుకొని తిరుగుతాడని.. అతను ఆ తుపాకీని బీహార్ గయాలో రూ. 45వేలకు కొనుగోలు చేశాడని' సీపీ బత్తిని శ్రీనివాస్ వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై కేసులు నమోదు చేశామని.. ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని సీపీ పేర్కొన్నారు.(చదవండి : విజయవాడ నగర శివారులో దారుణ హత్య) (చదవండి : పక్కా పథకం ప్రకారమే మహేష్ హత్య) -
పక్కా పథకం ప్రకారమే మహేష్ హత్య
సాక్షి, విజయవాడ: సంచలనం కలిగించిన విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి గజకంటి మహేష్ హత్యకేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. మూడు రోజులపాటు అన్ని కోణాల్లో కేసు విచారణ చేసిన ప్రత్యేక బృందం అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారమే మహేష్ హత్య జరిగినట్లు నిర్థారణకు వచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యవహారమే కారణమా..? ఓ రియల్ ఎస్టేట్ వ్యవహారమే మహేష్ హత్యకు కారణం అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మహేష్ స్నేహితుల్లో ఒకరు అగంతకులకు సహకారం అందించి, తమ పథకం ప్రకారం మహేష్ను నున్న బైపాస్రోడ్డుకు వచ్చేలా చేసి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ఎవరీ మహేష్.. హత్యకు కారణం ఏంటి? మూడు రోజులుగా కష్టపడుతున్న పోలీసులు మహేష్ హత్య కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు శనివారం అర్థరాత్రి నుంచి కష్టపడుతున్నారు. సింగ్నగర్, పాయకాపురం, నున్న పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను అన్ని కోణాల్లోనూ పరిశీలించారు. ముందుగా స్నేహితులు, ప్రేమ వ్యవహారమని భావించి కొన్ని బృందాలు ఆ దిశగా విచారణ చేయగా, మరికొన్ని బృందాలకు సంఘటన జరిగిన సాయిబాబా బార్ వద్ద ఉన్న కారుపై అనుమానం రావడంతో ఆ వివరాలు సేకరించారు. ఆ కారు యాదృచ్ఛికంగా వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ పక్కనున్న ఆటోపై కూడా అనుమానం వచ్చి ఆటో వివరాలను తెలుసుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం తెలిసినట్లు సమాచారం. ప్రియురాలిపై పెట్రోల్ పోసి హత్య సాక్షి, గాంధీనగర్: ప్రేమిస్తున్న యువతి తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించి..తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో ప్రేమికుడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన నాగభూషణం(27), చిన్నారి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చిన్నారి హనుమాన్పేటలోని ఓ ప్రైవేటు కోవిడ్ సెంటర్లో ఏఎన్ఎంగా పనిచేస్తున్నది. స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నది. నాగభూషణం గ్రామంలోనే ఉంటున్నాడు. కొంత కాలంగా ఇద్దరికీ స్పర్థలు రావడంతో అతనిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు పలుమార్లు చిన్నారి పనిచేస్తున్న హాస్పిటల్ వద్దకు వచ్చి వేధించినట్లు తెలిసింది. అతనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మళ్లీ ఆమె జోలికిరానని నాగభూషణం రాజీకి రావడంతో కేసు వాపసు తీసుకుంది. కాగా, రోజూలానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి సమయంలో విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం తనతో తెచ్చుకున్న పెట్రోల్ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. వెంటనే తను కూడా నిప్పంటించు కున్నాడు. అయితే ఘటనలో చిన్నారి పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గవర్నర్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం
సాక్షి, విజయవాడ: బెజవాడలో కలకలం రేపిన సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అతని స్నేహితుడు హరికృష్ణపై మహేష్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సోదరి సునీత మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడిని పక్కా పథకంతో హతమార్చారని తెలిపారు. పొలాల మధ్యలో మిత్రులతో కలిసి మహేష్ ఉన్నాడన్న విషయం తెలుసుకొని హరి అక్కడకు వెళ్లాడని చెప్పారు. ఇంటికి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో మళ్లీమద్యం సేవిద్దామని మహేష్ని హరి ఆపాడని అన్నారు. డబ్బులు పేటిఎం చేసి మద్యం కొనుక్కురమ్మని ఇద్దరు వ్యక్తులను బలవంతంగా పంపాడని తెలిపారు. చదవండి: విజయవాడ నగర శివారులో దారుణ హత్య మద్యం తీసుకురావడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్లిన తర్వాత మరో ఇద్దరు వచ్చి తన తమ్ముడుపై కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తులు వెళ్లడానికి హరి కారును రివర్స్ చేసి మరీ ఇవ్వటంపై పలు అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. హరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. ప్రేమ వ్యవహారం అని అందరూ అంటున్నారని, అది తప్పుడు సమాచారమన్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలు ఉన్నాయన్నది కూడా నిజం కాదని సునీత తెలిపారు. -
వారిని కఠినంగా శిక్షించాలి
-
మహేష్కి ఎవరితోనూ విభేదాలు లేవు: సునీత
సాక్షి, విజయవాడ: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అటెండర్గా పనిచేసే మహేష్ హత్యకు గురికావడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. మరణవార్త తెలిసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 'నా కొడుకు చివరగా శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత అర్ధరాత్రి సమయంలో నా కొడుకు చనిపోయినట్లు పోలీసులు సమాచారం అందించారు. మహేష్కు ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు. నా కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి' అంటూ మహేష్ తల్లి విమల మీడియాకు వివరించారు. మహేష్ సోదరి సునీత మాట్లాడుతూ.. 'మహేష్కి ఎవరితోనూ విభేదాలు లేవు. అందరితోనూ సరదాగా ఉండేవాడు. అలాంటి వాడిని హత్య చేశారు. పోలీసులు మాకు న్యాయం చేయాలి' అని అన్నారు. (బెజవాడ నగర శివారులో దారుణ హత్య) -
ఎవరీ మహేష్.. హత్యకు కారణం ఏంటి?
సాక్షి, విజయవాడ: బెజవాడ శివారులో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలసి మద్యం సేవిస్తున్న ఓ యువకుడిని కొందరు ఆగంతకులు కిరాతంగా కాల్చిచంపారు. మృతుడు నగర పోలీసు కమిషనరేట్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ గజకంటి మహేష్(33)గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటన శనివారం అర్ధరాత్రి నున్న బైపాస్రోడ్డు ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. మహేష్ తన నలుగురు స్నేహితులు కుర్ర హరి కృష్ణ(24), ఉయ్యూరు దినేష్(29), యండ్రపతి గీతక్ సుమంత్ అలియాస్ టోనీ, కంచర్ల అనుదీప్ అలియాస్ దీపులతో కలిసి శనివారం రాత్రి నున్న బైపాస్ రోడ్డులోని ఓ బార్లో మద్యం కొనుగోలు చేసి.. నున్న మ్యాంగో మార్కెట్ వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి రోడ్డుపైనే కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో సిగరెట్లు, బీరు సీసాలు ఖాళీ అవడంతో మహేష్ స్నేహితులు టోనీ, అనుదీప్ తీసుకొచ్చేందుకు బార్ వద్దకు వెళ్లారు. ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి 7.65 ఎంఎం తుపాకీ చూపించి డబ్బులు కావాలంటూ అకారణంగా మహేష్తో గొడవ పెట్టుకున్నారు. పక్కనున్న స్నేహితులు గొడవ ఎందుకని సర్ది చెబుతుండగానే వెనుక ఉన్న వ్యక్తి తుపాకీతో మహేష్ను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మహేష్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఘటన అనంతరం పారిపోదామనుకున్న నిందితులు ఒకరు స్కూటీపై మరొకరు బాధితుల కారులో పారిపోయారు. కొంత దూరం వెళ్లాక ముస్తాబాద్ రోడ్డులో వదిలేశారు. రక్తపు మడుగుల్లో ఉన్న మహేష్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ హాస్పిటల్కు స్నేహితులు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అసలు ఎవరీ మహేష్.. విజయవాడ క్రీస్తురాజుపురం ప్రాంతానికి చెందిన గజకంటి మహేష్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మహేష్ తండ్రి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ కొంతకాలం క్రితం చనిపోవడంతో మహేష్కు ఆ ఉద్యోగం లభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పోలీసు కంట్రోల్ రూమ్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే కారణంతో ఈ ఏడాది మే నెలలో సీపీ ద్వారకా తిరుమలరావు మహేష్ను సస్పెండ్ చేశారు. సెప్టెంబరు చివరాఖరున సస్పెన్షన్ ఎత్తివేశాక గత 15 రోజుల కిందట విధుల్లో చేరాడు. మహేష్కు 2015లో వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. కారణం ఏంటి? భార్యతో విడాకులు తీసుకున్న మహేష్ నగరంలోని ఓ మహిళా డాక్టర్తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తెలిసింది. అలానే మహేష్ సోదరి వరసయ్యే ఓ మహిళ గుంటూరుకు చెందిన ఓ వివాహితుడితో ప్రేమయాణం సాగిస్తున్నట్లు.. దీనికి మహేష్ సాయం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం గ్రహించిన ఆ వివాహితుడి భార్య తరపు వ్యక్తులు కానీ, మహేష్ ప్రేమిస్తున్న డాక్టర్ తరపు వ్యక్తులు కానీ.. లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలెత్తిన వివాదాలు కానీ మహేష్ హత్యకు దారి తీశాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలు.. ఈ కేసును ఛేదించేందుకు నగర పోలీసు కమిషనర్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ హత్య మిస్టరీగానే ఉంది. పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. -
‘అతన్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆరేటి ఉమ మహేశ్వరరావుకు ఎటువంటి సంబంధం లేదని ఏయూ దళిత ప్రొఫెసర్లు షరోన్రాజ్, ఏన్ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ యాక్టివ్ రోల్స్లో కూడా లేని మహేష్ ఏయూ ప్రతిష్టను మసక బార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి పారదర్శక పాలన అందిస్తూ, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమాచారహక్కు చట్టం పేరుతో అనేక మంది ప్రొఫెసర్ల, నాన్ టీచింగ్ సిబ్బంది బ్లాక్ మెయిలింగ్కు గురవుతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆరేటి ఉమా మహేశ్వరరావుపై గవర్నర్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరేటి మహేష్ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహేష్పై పోలీసులు అధికారులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ భయమే ఆయువు తీసిందా?
రాంగోపాల్పేట్: ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో పోలీస్ కేసు అవుతుందేమోననే భయంతో ఓ యువకుడు హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్హాట్కు చెందిన విశాంబర్ బిర్దార్ చిన్న కుమారుడు బి.మహేష్ (26) 7 నెలలుగా సికింద్రాబాద్లోని ఓ జ్యువెలరీ షోరూమ్లో సేల్స్మన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న సాయంత్రం విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నాడు. బైబిల్ హౌస్ సిగ్నల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు వెళుతుండగా బోట్స్ క్లబ్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేష్ను గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు వివరాలు తీసుకుని మరుసటి రోజు తిరిగి రావాలని పంపించారు. ప్రమాదం జరిగిన సమయంలో మహేష్ మొబైల్ ఫోన్ అక్కడే పడిపోవడంతో అదే రోజు రాత్రి కిశోర్ అనే వ్యక్తి మహేష్ స్నేహితుడైన గంగా సాగర్కు ఫోన్ చేసి అక్కడ జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు. మహేష్ కూడా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నాడు. విషయం తెలుసుకున్న మహేష్ తండ్రి మహేష్ కోసం ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రికి వెళ్లి వాకబు చేసినా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన అదే రోజు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే మంగళవారం ఉదయం నెక్లెస్రోడ్లోని సంజీవయ్య పార్కు సమీపంలోని హుస్సేన్ సాగర్లో మహేష్ శవమై తేలాడు. అతడి దగ్గర లభించిన ఆధారాలతో మహేష్గా పోలీసులు గుర్తించారు. తాను చేసిన ప్రమాదంతో ఏమైనా జరుగుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేధింపులే ఉసురు తీశాయి బన్సీలాల్పేట్: హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం రాత్రి మృతుడి కుటుంబికులు, స్నేహితులు గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు విక్రమ్, స్నేహితులు విలేకరులతో మాట్లాడారు. మహేష్ మరణానికి పోలీసుల వేధింపులు కారణమని ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో తమ సోదరుడి సెల్ను ఎవరో బలవంతంగా లాక్కుని తాను కానిస్టేబుల్ను అంటూ మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. మహేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. మహేష్ మరణంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. మాకెలాంటి సంబంధమూ లేదు.. హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న మహేష్ మరణంతో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని గాంధీనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు స్పష్టంచేశారు. ఈ నెల 23న సాయంత్రం ఆర్పీ రోడ్డు నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే రహదారిలో మహేష్ తన ద్విచక్ర వాహనంపై వెళుతూ హైదర్బస్తీ ప్రాంతానికి చెందిన సుభాషిణి అనే మహిళను ఢీకొట్టాడని చెప్పారు. డయల్ 100 నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. వాహనం ఢీకొన్న మహిళ అపస్మారక స్థితికి చేరుకోడంతో ఉస్మానియా ఆస్పత్రికి చికిత్ప కోసం తరలించి మహేష్ను పోలీసు స్టేషన్కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మహేష్ను ఇంటికి పంపించినట్లు చెప్పారు. లాక్డౌన్ కర్ఫ్యూ నేపథ్యంలో తమ కానిస్టేబుల్ వాహనంపై ఇంటికి పంపిస్తామని చెప్పినా మహేష్ వినిపించుకోకుండా కాలినడకన వెళ్లిపోయాడని వివరించారు. మహేష్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోడానికి తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ విషయాన్ని మహేష్ తండ్రి విశ్వంభరం, చిన్నాన్న రాజేందర్ కుటుంబ సభ్యులకు కూడా వివరించినట్లు చెప్పారు. ట్యాంక్బండ్పై జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలో మహేష్ ఈ నెల 23 రా>త్రి సుమారు 8 గంటల సమయంలో హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నామని సీఐ శ్రీనివాస్రావు పేర్కొన్నారు. -
ఒక ఇంటివారయ్యారు
గురువారం రెండు వివాహ వేడుకలు జరిగాయి. హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయితే, సహాయ నటుడు మహేష్ పావనిని పెళ్లాడి ఇంటివాడు అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరిగింది. అతి కొద్ది మంది బంధువుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. మహేష్ వివాహం తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది. ఈ రెండు వేడుకలను లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే నిర్వహించారని తెలిసింది. -
ఓ ఇంటివాడైన ‘రంగస్థలం’ మహేశ్
‘రంగస్థలం’ ఫేమ్ మహేశ్ ఆచంట ఓ ఇంటి వాడయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేశ్.. తన సమీప బంధువుల అమ్మాయి పావనిని గురువారం పెళ్లి చేసుకున్నాడు. గత కొద్దిరోజుల క్రితమే పావనితో నిశ్చితార్థం చేసుకున్న మహేశ్ లాక్డౌన్ సమయంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ నటుడి వివాహం జరిగింది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సాధించిన మహేశ్ ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబు స్నేహితుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శతమానం భవతి, మహానటి చిత్రాలతో నటుడిగా స్థిరపడిపోయాడు. ఇక ఇదే రోజు యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్ పవన్ కల్యాణ్.. ‘డ్రైవింగ్ లైసెన్స్’? -
15వ ఏట నుంచే నేరబాట
సాక్షి, హైదరాబాద్: తన పదిహేనో ఏట నుంచే నేరాలు చేయడం ప్రారంభించిన మహేష్ మైనర్గానే అనేకసార్లు అరెస్టు అయ్యాడు. ఓ కేసులో శిక్ష పడటంతో స్పెషల్ హోమ్కు తరలించారు. శిక్షాకాలం పూర్తికాకుండానే తప్పించుకుని పారిపోయాడు. ఆ వెంటనే మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించి వారం రోజుల్లో నాలుగు చోట్ల పంజా విసిరాడు. ఈలోపు మైనార్టీ సైతం పూర్తయి మేజర్గా మారిన ఇతగాడిని ఈస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ నేరగాడి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శనివారం వెల్లడించారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్ మహేష్ (19) తన 15వ ఏట నుంచే నేరబాటపట్టాడు. రాజధానితో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో తొలినాళ్ళల్లో వాహన చోరీలు చేసిన ఇతగాడు ఆపై ఇళ్లల్లో దొంగతనాలు మొదలెట్టాడు. ఇప్పటి వరకు మహేష్పై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. మూడేళ్ల క్రితం మైనర్గా ఉన్న మహేష్ను పట్టుకున్న వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి మూడేళ్ల శిక్ష విధించడంతో గాజులరామారంలోని గవర్నమెంట్ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్లో ఉంచారు. అక్కడి అధికారులు మహేష్ సహా మరికొందరికి వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించారు. అందులో భాగంగా ఇతగాడిని గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో (ఎన్ఐసీ) చేర్పించారు. రెండేళ్ల ఎనిమిది నెలల శిక్షకాలం పూర్తి చేసుకున్న మహేష్ గత నెల్లో ఎన్ఐసీ నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించి గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. లాక్డౌన్కు వారం రోజుల ముందు ఇలా బయటకు వచ్చిన మహేష్కు మైనార్టీ సైతం తీరింది. అప్పటి నుంచి లాక్డౌన్ మొదలయ్యే వరకు కంచన్బాగ్, సరూర్నగర్, నల్లగొండ, మలక్పేటల్లో నాలుగు నేరాలు చేశాడు. ఇందులో రెండు వాహనచోరీలు కాగా, మరో రెండు ఇళ్లల్లో దొంగతనాలు. ఇతడి ఆచూకీ కోసం ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. కంచన్బాగ్ పరిధిలో శనివారం వాహన తనిఖీలు చేపడుతుండగా చోరీ వాహనంపై వచ్చిన ఇతగాడు చిక్కాడు. ఇతడి నుంచి రూ.15 లక్షలు విలువైన సొత్తు, వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. మహేష్ పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించినట్లు కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నడిరోడ్డు పైనే నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా కమిషనర్ కార్యాలయం ముందున్న రోడ్డు విలేకరుల సమావేశానికి వేదికైంది. ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన మహేష్ ప్రెస్మీట్తో పాటు నటుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు శంకర్లు అతిథులుగా హాజరైన ఫేస్షీల్డ్స్ పంపిణీ కార్యక్రమం సైతం కమిషనర్ కార్యాలయం ముందున్న రోడ్డుపై జరిగాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో కమిషనరేట్తో పాటు కాన్పరెన్స్ హాల్లోకి రాకపోకలు నియంత్రించిన అధికారులు ఈ రకంగా రోడ్డుపై తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. విలేకరులు సహా అంతా స్టేజ్ మీద, దాని పక్క, చెట్ల కింద నిల్చునే ఉన్నారు. -
కరోనా : ఇంట్లోకి రానివ్వకపోవడంతో
దౌల్తాబాద్: జీవితంపై విరక్తిచెంది ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం మండలంలోని బిచ్చాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వడ్లమహేష్(32) ఏడాదిన్నర క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భార్యభర్తలు హైదరాబాద్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం అమ్మాయి తల్లిదండ్రులు వివాహితను గ్రామానికి రప్పించుకున్నారు. అప్పటి నుంచి మహేష్ ఒక్కడే ఉన్నాడు. రెండు రోజుల క్రితం మహేష్ కరోనా వైరస్ నేపథ్యంలో తన సొంత ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కులాంతర వివాహం చేసుకున్నందుకు మహేష్ను ఇంట్లోకి రానివ్వకపోవడంతో జీవితంపై విరక్తి చెంది పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి రాములు ఫిర్యాదు మేరకు అనుమానస్పదస్థితి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపారు. -
అమ్మను సర్ప్రైజ్ చేస్తానని.. అనంత లోకాలకు
రాజమహేంద్రవరం క్రైం: గల్ఫ్ దేశం వెళ్లి అప్పుల పాలయ్యాడు. స్వదేశం వచ్చి ఆటో నడుపుకొంటూ జీవిద్దామంటే అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. మరోసారి ఇతర దేశం వెళ్లి సంపాదించిన సొమ్ము తో అప్పులు తీర్చాలనుకున్నా డు. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ దేశం వెళ్లి ఎలక్ట్రికల్ పనిలో కుదిరాడు. సవ్యంగా సాగుతున్న అతడి జీవితాన్ని కరోనా అర్ధాంతరంగా అతడి జీవితం ముగిసేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఉల్లితోట వీధి, బంగారయ్య స్కూల్లో నివశిస్తున్న వనపర్తి లక్ష్మి, వనపర్తి వెంకటేశ్వరరావుల ఇద్దరు సంతానంలో కుమారుడు వనపర్తి మహేష్ కాగా, కుమార్తె రత్నం. కుమార్తెకు వివాహం చేశారు. మహేష్ కొంతకాలం క్రితం అప్పు చేసి గల్ఫ్ దేశం వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ చేసిన అప్పులు తీర్చకపోవడంతో రుణదాతల నుంచి అతడిపై ఒత్తిడి ఎక్కువైంది. ఉన్న ఆటో అమ్ముకొని, మరికొంత అప్పు చేసి బహ్రెయిన్ దేశం వెళ్లాడు. అక్కడికి వెళ్లాక మహేష్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దాంతో తిరిగి ఇండియా వచ్చేసేందుకు మార్చి 22న అతడు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అదే రోజు అతడు తన చెల్లెలికి ఫోన్ చేసి తాను వస్తున్న విషయం చెప్పాడు. తల్లికి చెప్పవద్దని సర్ప్రైజ్గా వస్తానని చెప్పాడు. తీరా చూస్తే మార్చి 22న అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దాంతో మహేష్ తీవ్రంగా కలత చెందాడు. ఇక ఇప్పట్లో స్వదేశం వెళ్లలేననే బెంగతో రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల పాలిట ఈ వార్త ఆశనిపాతంలా మారింది. సర్ప్రైజ్గా వస్తాడని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ మహేష్ తల్లి లక్ష్మి, తండ్రి వెంకటేశ్వరరావు, చెల్లెలు రత్నం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కడసారి చూపునకు నోచుకోని వైనం ఒక్కగానొక్క కొడుకు కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి మృతదేహం తీసుకురావాలంటే కనీసం రెండు నెలలు పడుతుందని, అప్పటి వరకూ మృతదేహాన్ని భద్రపరిచేందుకు మార్చరీలు ఖాళీగా లేవని ఇండియన్ ఎంబసీ వారు తెలిపారని వారు చెప్పారు. కరోనా వైరస్ విజృంభించడంతో మృతదేహాలు భద్రపరిచేందుకు ఒప్పుకోవడం లేదని పేర్కొంటున్నారు. అంత్యక్రియలు నిర్వహించినట్లు వాట్సాప్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఏజెంట్ పేర్కొన్నారు. -
ఎప్పుడూ ఇదే పనా : మహేశ్ బాబు
మహేశ్.. ఆ పేరులోనే ఓ మత్తుందబ్బా అంటారు అమ్మాయిలు. అవును మరి, అందానికి కేరాఫ్ టాలీవుడ్ ప్రిన్స్. ఈ రాజకుమారుడిని చూసేందుకు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా క్యూ కడుతుంటారు. ఆయన కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్మనిపిస్తారు. ఇక మహాశ్ కూడా ఫ్యాన్స్తో ఎప్పుడూ నవ్వుతూ.. సరదాగా ఉంటారు. సినిమాలో కూడా తనదైన పంచులతో నవ్విస్తుంటాడు. మహేశ్ కామెడీ చేశాడంటే పగలబడి నవ్వాల్సిందే. ఖలేజా, దూకుడు, సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తనలోని కామెడీ యాంగిల్ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించారు. (చదవండి : ప్లాన్ మారిందా?) ఇక నిజ జీవితంలోనూ మహేశ్ బాబు కామెడీ పంచులు వేస్తూ సరదాగా ఉంటాడు. ఇటీవల ఓ ఎయిర్పోర్ట్లో తనను ఫోటో తీస్తున్న ఒక అభిమానిని తనదైన కామెడీ డైలాగ్తో నవ్వించేశాడు. ఎయిర్పోర్ట్లో నుంచి వస్తున్న మహేశ్ను ఒక అభిమాని కెమెరాలో ఫోటోలు తీస్తున్నాడు. మహేశ్ కారు దిగి నడిచి వస్తున్నంత సేపు ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ఇది గమనించిన మహేశ్.. ‘ఆపమ్మా ఆపు.. నీకు బోరు కొట్టట్లేదా.. ఎప్పుడూ ఇదే పనా’ అంటూ తనదైన కామెడీ డైలాగ్తో అతన్ని ఆపాడు. మహేశ్ మాటలకు అక్కడి సిబ్బందితో పాటు ఆ కెమెరామెన్ కూడా గొల్లున నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించారు. మహేశ్బాబు త్వరలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ సినిమాలో నటించనున్నారు. -
విషాదాంతమైన ప్రేమ వివాహం
-
బండ్ల గణేష్కు రిమాండ్, కడప జైలుకు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత బండ్ల గణేష్కు న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు కడప జైలుకు తరలించారు. కాగా కేసు విచారణ నిమిత్తం బండ్ల గణేష్ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. చెక్ కూడా బౌన్స్ కావడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో బండ్ల గణేష్పై కోర్టు సెప్టెంబర్ 18న అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇక ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్ -
పోలీసుల అదుపులో నిర్మాత బండ్ల గణేష్
-
నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్
బంజారాహిల్స్: పోలీసుల కళ్లు గప్పి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ను ఎన్బీడబ్ల్యూ కింద బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో కడప ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ న్యాయమూర్తి సెప్టెంబర్ 18న గణేష్కు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఫిలింనగర్లో నివసించే గణేష్కు వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు ప్రయతి్నస్తుండగా తప్పించుకు తిరుగుతున్నాడు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు పోలీస్స్టేషన్కు రాగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గురువారం కడప కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్ ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. ఈ నెల 5న బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే గణేష్కు నోటీసులు జారీచేశారు. వీటికి సమాధానం చెప్పేందుకు ఆయన పోలీస్స్టేషన్కు రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’
సాక్షి, బెంగళూరు : కర్ణాకటకలో 14 నెలల పాటు కొనసాగిన కుమారస్వామి ప్రభుత్వం.. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కుమారస్వామి ప్రవేశ పెట్టిన తీర్మాణానికి 99 మంది అనుకూలంగా మద్దతు ఇవ్వగా.. 105 మంది వ్యతిరేకించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాలేదు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించనా.. ఓటింగ్లో పాల్గొనకపోవడం పట్ల పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కుమార ‘మంగళం’) మాయావతి నిర్ణయంపై ఎమ్మెల్యే మహేశ్ స్పందింస్తూ.. తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అర్థం కావడంలేదన్నారు. తాను ఓటింగ్లో పాల్గొనడంలేదని ముందే చెప్పానని, అయినప్పటికీ ఎందుకు బహిష్కరించారో తెలియడం లేదన్నారు. మయావతి ట్వీట్ గురించి తనకు తెలియదని, ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. కాగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పినా.. పార్టీ నియమామలను ఉల్లంఘిస్తూ మహేశ్ సభకు హాజరుకాలేదని అందుకే అతన్ని బహిష్కరిస్తున్నాని మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు) 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్ను ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ అధ్యక్షురాలు మయావతి ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మహేశ్ ఓటింగ్కు గైర్హాజరు కావడంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మయావతి ప్రకటించారు. ‘కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొనాలనే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహేశ్ మంగళవారం రోజున సభకు హాజరుకాలేదు. దీనిని పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. తక్షణమే మహేశ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాన’ని మయావతి ట్విటర్లో వెల్లడించారు. అయితే 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. कर्नाटक में कुमारस्वामी सरकार के समर्थन में वोट देने के पार्टी हाईकमान के निर्देश का उल्लंघन करके बीएसपी विधायक एन महेश आज विश्वास मत में अनुपस्थित रहे जो अनुशासनहीनता है जिसे पार्टी ने अति गंभीरता से लिया है और इसलिए श्री महेश को तत्काल प्रभाव से पार्टी से निष्कासित कर दिया गया। — Mayawati (@Mayawati) July 23, 2019 చదవండి : కుమార ‘మంగళం’ -
వాహన సర్వీసింగ్... ఇంటికే!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెట్రో నగరాల్లో కారు లేదా బైక్ సర్వీసింగ్ అంటే పెద్ద ప్రహసనం. ఫ్లిప్కార్ట్, స్విగ్గీలో ఎలాగైతే ఆర్డర్ చేసుకుంటున్నామో.. అంతే సులువుగా వాహన సర్వీసింగ్ సేవలందిస్తే? జస్ట్.. సింపుల్! ఆర్డర్ బుక్ చేసిన 20 నిమిషాల్లో ఇంటి వద్దకే టెక్నీషియన్ వచ్చి... బైక్, కార్ సర్వీసింగ్ చేసేస్తారు. ఇదే డూయర్స్ పని. మరిన్ని వివరాలు కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మహేశ్ షేట్కర్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘బెంగళూరు, పుణే, హైదరాబాద్లో సేవలందిస్తున్నాం. వర్క్షాప్స్, టెక్నీషియన్స్, వాహన విడిభాగాల కోసం స్థానిక సర్వీసింగ్ సెంటర్లతో ఒప్పందం చేసుకున్నాం. 45 రోజులు వర్క్షాప్ నిర్వహించి, డిమాండ్ను పరిశీలించాక టెక్నీషియన్స్కు శిక్షణ ఇచ్చి డూయర్స్లో నమోదు చేస్తాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి 200 వర్క్షాప్స్, 500 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. వచ్చే ఏడాది కాలంలో వీటి సంఖ్యను 500కు చేరుస్తాం. ఆర్డర్ బుక్ కాగానే దగ్గర్లోని వర్క్షాప్కు అలర్ట్ వెళుతుంది. 20–40 నిమిషాల్లో టెక్నీషియన్ ఇంటికి చేరుకొని.. మైనర్ సర్వీసింగ్ అయితే అక్కడే పూర్తి చేస్తాడు. మేజర్ అయితే వర్క్షాప్కు తీసుకెళ్లి వాహన రిపోర్ట్, ఇన్వాయిస్ను కస్టమర్కు పంపిస్తాడు. ఓకే అయితే సర్వీసింగ్ ప్రారంభమవుతుంది. నెలకు 8–10 వేల ఆర్డర్లు... హోమ్ సర్వీసింగ్తో పాటూ బ్రేక్ డౌన్, టైర్ల మార్పు, పెయింటింగ్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలనూ అందిస్తున్నాం. ప్రస్తుతానికి మూడు నగరాల్లో కలిపి నెలకు 8–10 వేల ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో 60 శాతం బైక్, 40 శాతం కార్ సర్వీసింగ్ ఆర్డర్లు. బైక్కు 4 గంటలు, కార్కు 7 గంటల సమయం పడుతుంది. ధరలు రూ.150 నుంచి లక్షన్నర వరకున్నాయి. ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్తో పోలిస్తే 20–45 శాతం వరకు ధరలు తక్కువగా ఉంటాయి. ప్రతి నెలా ఆర్డర్లు, ఆదాయంలో 40% వృద్ధిని నమోదు చేస్తున్నాం. 6 నెలల్లో విజయవాడ, వైజాగ్లో.. ప్రస్తుతం హైదరాబాద్లో 25 వర్క్షాప్స్, 150 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. నెలకు వెయ్యి ఆర్డర్లు వస్తున్నాయి. 3 నెలల్లో చెన్నై, ముంబై, ఢిల్లీ, గుర్గావ్ నగరాలకు విస్తరించనున్నాం. 6 నెలల్లో 50 వర్క్షాప్స్తో విజయవాడ, విశాఖపట్నంలో సేవలు ప్రారంభిస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 25 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను మూడింతలు చేస్తాం. ఏడాదిలో నిధుల సమీకరణ పూర్తి చేసి.. ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్ సరఫరా సేవలను ప్రారంభిస్తాం’’ అని’ మహేశ్ వివరించారు. -
పిచ్చుకపై ప్రేమాస్త్రం
‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే మాట పురాణాల్లో ఉంది. దాన్ని మనం నిజం చేసేశాం! పిచ్చుకపై ఇంత ఇసుక, కంకర, సిమెంట్ వేస్తున్నాం. మన గూడు కోసం పిచ్చుక గూళ్లనుకొట్టేస్తున్నాం. పిచ్చుకపై మనం వేస్తున్న ఈ అమానుషాస్త్రాన్ని, పిచ్చుక జాతిపై తనకున్నప్రేమ అనే అస్త్రంతో తిప్పికొడుతున్నారు మహేష్ అనే పక్షి ప్రేమికుడు. ఊర పిచ్చుక.. ఒకప్పుడు మన ఆవాసాలలో కిలకిలరావాలతో తిరుగాడిన మానవ స్నేహజీవి. మన లోగిళ్లలో.. చూరులలో.. గూళ్లు కట్టుకుని సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉండేవి. మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేవి. అలాంటి పిచ్చుక ఇప్పుడు చాలా చోట్ల అదృశ్యమై.. దేశంలో అంతరించే జాతుల జాబితాలో చేరింది. ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) వారు రెడ్ లిస్ట్లో చేర్చారంటేనే వాటి మనుగడ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వీరా మహేష్ కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకల ‘వృద్ధి సంరక్షణ’లపై 2014 నుంచి పరిశోధన చేస్తున్నారు. మార్చి 20 ‘వరల్డ్ స్పారో డే’ సందర్భంగా పిచ్చుకల ఆవాసాల ఏర్పాటు అవసరం గురించి మహేష్ ‘ఫ్యామిలీ’తో మాట్లాడారు. పిచ్చుకకు ప్లేస్ ముఖ్యం పదేళ్ల క్రితం 2009లో కొత్తగా నిర్మించిన మా ఇంటికి ఒక పిచ్చుకల జంట వచ్చింది. వాటి కోసం ఒక అట్టపెట్టెతో చేసిన గూడును స్లాబుకు దగ్గరగా అమర్చాను. ఏడాది తరువాత ఒక సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారాన్ని అందించడం గమనించాను! పిచ్చుకలు గూడు బయటికి వెళ్లిన తరువాత పరిశీలిస్తే ఆ గూడులోనే ఆరు గూళ్లు ఉన్నాయి. ఒక్కొక్క గూటినుంచి కనీసం రెండు పిల్లలు వచ్చినా సంవత్సర కాలంలో పన్నెండు పిల్లలు వస్తాయి. ఇలా ఆలోచిస్తే పిచ్చుకలు గూళ్లు నిర్మించుకోవడానికి స్థలం ఎంతో అవసరం అని అర్ధమైంది. ఈ ఆలోచనతోనే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2012లో చెక్కలతో గూళ్లను తయారుచేసి మా ప్రాంతంలో స్థానికుల సహకారంతో వాళ్ల వాళ్ల ఇళ్ల వద్ద ఏర్పాటు చేశాను. క్రమంగా జంగారెడ్డిగూడెం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాను. ప్రస్తుతం పట్టణంలో 400 వరకు కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయగలిగాను. మొదటగా వివిధ ఆకృతులలో చెక్క గూళ్లను నిర్మించి పెట్టాను. వాటిల్లో ప్రధానంగా పిచ్చుకలు ఆవాసం పొందిన గూటిని ప్రామాణికంగా తీసుకున్నాను. ఈ ప్రామాణిక గూళ్లకు పిచ్చుకలు త్వరగా ఆకర్షితమై వాటిలోకి చేరాయి. ఈ గూటిలో కాకులకు పిచ్చుకల పిల్లలు అందవు. వివిధ జాతుల చేరికకు వీలు కలగదు. ఒకసారి చిలుకలు, గోరింకలు లోపలికి చేరేందుకు విఫలయత్నం చేయడం చూశాను. ఇక ఈ గూళ్లలో పిచ్చుకలు వాటి పిల్లలకు ఆహారం అందించడం తేలిక. పిచ్చుకల వృద్ధికి అదో ప్లస్ పాయింట్. దాదాపు గూళ్లన్నీ నిండాయి! గూళ్లను ఏర్పాటు చేసిన తరువాత ప్రతీ సంవత్సరం జనవరి చివరి వారంలో ప్రతి గూడును పరిశీలిస్తూ సర్వే చేస్తున్నాను. గూళ్లకు పిచ్చుకలు చేరాయా లేదా, వాటి రాకపోకలు, సంతాన వృద్ధి, ఇతర పక్షుల వల్ల వాటికి కలిగే ఇబ్బందులు.. తదితర సమాచారాన్ని వాటిని ఏర్పాటు చేసిన వారి నుంచి తెలుసుకుంటాను. అలా 2019 జనవరి వరకు 413 గూళ్లను ఏర్పాటు చేశాను. వీటిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన గూళ్లు 340 కాగా, పిచ్చుకలు ఆవాసాలకు వినియోగించిన గూళ్లు 329. సంవత్సరానికి ఈ గూళ్ల కారణంగా సరాసరిన 2 నుంచి 3 పిల్లలతో పిచ్చుక సంతానం వృద్ధి చెందినట్లు గుర్తించాను’’ అని చెప్పారు మహేష్.మహేష్ ప్రయత్నం కారణంగా గతంలో పోల్చితే ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట, హైస్కూల్ ప్రాంతం, అయ్యన్నకాలనీ, రాజులకాలనీలలో పిచ్చుక సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ఉప్పలమెట్ట ప్రాంతంలో పదుల సంఖ్యలో ఉండే పిచ్చుకలు నేడు సుమారు 300 వరకు ఉన్నాయి. ‘‘ప్రకృతి సమతౌల్యానికి జీవ వైవిధ్యం తప్పనిసరి. మానవ మనుగడలో భాగమైన పిచ్చుకను సంరక్షించుకుంటే పంటలకు పురుగు మందుల అవసరాలే మనకు ఉండవు’’ అంటారు మహేష్. – డి.వి.భాస్కరరావు, సాక్షి, జంగారెడ్డిగూడెం పక్షి ప్రేమికుడు.. పరిశోధకుడు వీరా మహేష్ ఎమ్మెస్సీ జంతుశాస్త్రం చదివారు. ప్రస్తుతం కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకలపై పీహెచ్డీ చేస్తున్నారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో పరిశోధకునిగా కూడా మహేష్కు అనుభవం ఉంది. పక్షి సమూహాలపై వివిధ ప్రాంతాల్లో పరిశోధన చేశారు. కలివి కోడిపై పరిశోధన, పక్షుల వలసలపై పరిశోధన చేశారు. పిచ్చుకలు, ఆవాసాలు తదితర విషయాలపై మహేష్ రాసిన పరిశోధనాత్మక పత్ర వ్యాస వివరణ ఎన్టీఎస్సీ 2018లో జాతీయ స్థాయిలో ఎంపికైంది. ఆవాసాలు లేకనే అదృశ్యం ఆధునిక ఒరవడిలో పట్టణాల నుంచి గ్రామాల వరకు శాశ్వత గృహాలు కాంక్రీట్ శ్లాబులతో నిర్మితమవుతున్నందున పిచ్చుక జాతికి గూడు నిర్మించుకోవడానికి అనుకూలమైన తాటాకిళ్లు, పెంకుటిళ్లు కనుమరుగువుతున్నాయి. దాంతో గూళ్లు పెట్టుకునే సదుపాయం తగ్గిపోయింది. సంతానోత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. పిచ్చుక జాతిని నిలబెట్టడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయడం. సమస్యను ముందుగానే గుర్తించి మన ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటే, అవి గూడును కట్టుకోగలుగుతాయి. దీని వల్ల పిచ్చుక జాతి వృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతాయి. -
ఆమె చావుకు నువ్వే కారణమంటూ వేధింపులు.. !
సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి మహేష్(25) అనే యువకుడు గ్రామానికి చెందిన పెరుగు తిరుపతి అనే వ్యక్తి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రెండు నెలల కిందట బలరావుపేట గ్రామానికి చెందిన ఓ యువతి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతితో మహేష్కు పరిచయం ఉన్నదనీ, ఆమె ఆత్మహత్యకు నువ్వే కారణమంటూ తిరుపతి మహేష్ ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు ఇవ్వాలనీ, లేకుంటే విషయాన్ని పోలీసులకు చెబుతాన ని బెదిరించాడన్నారు. మహేష్ తన వద్ద అంత డబ్బు లేదనీ, ఆటో నడుపుతూ బతుకుతున్నానని ఎంత బతిమిలాడినా వినకుండా.. నేను ఆల్ ఇం డియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శినని, నీపై అట్రాసిటీ కేసు పెడతానని, సదరు యువతి చావుకు నువ్వే కారణమని ధర్నా చేస్తానని తిరుపతి మహేష్ను వేధించాడు. దీంతో మృతుని కుటుంబీకులు కూడా డబ్బులు లేవని, తమను తప్పుడు కేసులో ఇరికించొద్దని తిరుపతి కాళ్లు మొక్కినా వినకుండా పోలీసులకు తెలిపాడు. దీం తో పోలీసులు మహేష్ను పలుమార్లు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ఈ క్రమంలోనే శనివారం జన్నారం మండలం గొడిసెరాలలో ఉన్న ఆలయానికి మహేష్ కుటుం బ సభ్యులతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికి మహేష్ భార్య శారద భర్త కనిపించకపోవడంతో ఫోన్ చేయగా, నన్ను పెరుగు తిరుపతి డబ్బుల కోసం వేధిస్తున్నాడనీ, అందుకే భయంతో పురుగుల మందు తాగానని చెప్పాడు. భార్య శారద వెంటనే ఆలయం దగ్గరికి రమ్మనగా అప్పటికే పురుగుల మందు తాగిన మహేష్ ఆలయానికి ఎలాగోలా వచ్చాడు. అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే మహేష్ ప్రాణాలు వదిలినట్లు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కటుకూరి రాజన్న, నాయకులు తిరుపతి, లక్ష్మణ్, శ్రీనివాస్ మృతుడి కుటుం బానికి నష్టపరిహారం చెల్లించి, మృతికి కారణమై న తిరుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సీఐ చట్ట పరమైన చర్యలు తీసుకొని మృతుని కుటుంబాని కి న్యాయం చేస్తామని తెలుపడంతో వారు శాం తించారు. మృతుడి తల్లి రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిసారు. కాగా, మృతుడికి నాలుగు నెలల పాప కూడా ఉంది. -
శభాష్.. మహేష్
యాప్రాల్: కృషి, పట్టుదల ఉండి లక్ష్యాన్ని ఏర్పరచుకొని కృషి చేస్తే ఎంచుకున్న రంగంలో అద్బుతాలు సుష్టించవచ్చని నిరూపించాడో యువకుడు.బుధవారం యాప్రాల్ ప్రగతి ఉన్నత పాఠశాల ఆవరణలో ఒకినవ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమి ఆద్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బక్ ఆఫ్ రికార్డ్ పోటీలు నిర్వహించారు. వండర్ బక్ ఆప్ రికార్డ్స్, జీనియస్ బక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కో ఆర్డినేటర్ బింగి నాగెందర్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలో రమేష్ బ్లాక్ బెల్ట్, పాఠశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 9.35 నిమిషాలలో 1000 టైల్స్పే తన నుదిటితో పగులగొట్టి ఇంటర్నేషన్ వండర్ బక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నాడు. ఈ రికార్డ్స్ 16 నిమిషాలలో చేయాల్సి ఉండగా రమేష్ కేవలం 9 నిమిషాల 35 సెకన్లలోనే సాధించాడు. చీఫ్ జడ్జి బింగి నాగెందర్గౌడ్, పాఠశాల కరస్పాండెంట్ శ్రీనువాసురెడ్డి, ఒకనవ మా ర్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్ కిషోర్కుమార్, నాగెందర్, సమక్షంలో వండర్ బక్ ఆప్ రికార్డ్స్ పతకం, సర్టిఫికట్ అందుకున్నాడు. -
డైరెక్టర్ ప్రదీప్.. సన్నాఫ్ ఏవీఎస్
‘‘ఏవీయస్గారు నాకు మంచి మిత్రులు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ‘తుత్తి, రంగు పడుద్ది’ వంటి మేనరిజమ్స్ను ఆయన చాలా బాగా వాడేవారు. ఏవీఎస్గారు లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన ‘వైదేహి’ ట్రైలర్ బావుంది’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మహేష్, ప్రణతి, సందీప్, అఖిల, లావణ్య, ప్రవీణ్ ముఖ్య తారలుగా ఏవీయస్ తనయుడు ఎ.రాఘవేంద్ర ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైదేహి’. ఎ.జి.ఆర్. కౌశిక్ సమర్పణలో యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జననీ ప్రదీప్ నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఏవీయస్ జయంతిని పురస్కరించుని బుధవారం హైదరాబాద్లో ఈ సినిమా ట్రైలర్ని ఎన్. శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. ఎ.రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి జయంతి నాడు మా సినిమా ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీ. మా బావగారు నాకు ఇచ్చే సపోర్ట్ను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఆయన మా నాన్నగారిలాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘బాపు–రమణగారికి, ఏవీయస్గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏవీయస్గారితో నాకూ చక్కటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్. -
కర్ణాటకలో బీఎస్పీ మంత్రి రాజీనామా
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బీఎస్పీ నేత మహేశ్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీని పటిష్టం చేసేందుకు వీలుగానే ముఖ్యమంత్రి కుమారస్వామికి రాజీనామా సమర్పించినట్లు మహేశ్ మీడియాకు తెలిపారు. మంత్రిగా తాను బెంగళూరుకు పరిమితమైనందున సొంత నియోజకవర్గం కొల్లెగల్లో తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే నెల 3న మూడు లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొంటానని పేర్కొన్నారు. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా సమర్పించానని పునరుద్ఘాటించారు. -
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఏడో తరగతి విద్యార్థి మహేశ్(12) కేసు మరో మలుపు తిరిగింది. మహేశ్ ఆత్మ హత్యకు పాల్పడడానికి ముందే తలపై బలమైన గాయమయిందని పోలీసలు తెలిపారు. స్కూల్ ఫీజు వేధింపుల వల్లే హైదరాబాద్లోని కవాడిగూడలో గల లిటిల్ ప్లవర్ హైస్కూల్ విద్యార్థి మహేశ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం ఖండించింది. కాగా మహేశ్ ఆత్మ హత్యకు ముందే తలపై బలమైన గాయమయిందని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్లో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోర్ట్మార్టం అనంతరం మృత దేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జరిగిందేంటి కవాడిగూడ ప్రధానరోడ్డులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మహేశ్ 7వ తరగతి చదువుతున్నాడు. రోజులానే బుధవారం ఉదయమే నాగమణి పనికి వెళ్లింది. కొద్దిసేపటికే ఊరి నుంచి శ్రీనివాస్ ఇంటికి రాగా తాళం వేసి ఉంది. మహేశ్ వద్దనున్న తాళం చెవి కోసమని అతడు స్కూల్కు వెళ్లాడు.అయితే, మహేశ్ 2 రోజుల నుంచి స్కూలుకు రావడంలేదని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇంటికి వెనుదిరిగి వచ్చేసరికి మహేశ్ టీవీ చూస్తూ కనిపించాడు. స్కూల్కు ఎందుకెళ్లలేదని తండ్రి మందలించగా ఫీజు కట్టాలని టీచర్లు అడుగుతున్నారని, అందుకే వెళ్లలేదని చెప్పాడు. కొద్దిసేపటికి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి ఇంటికి వచ్చేసరికి లోపల గడియపెట్టి ఉంది. తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్కు మహేశ్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
హాస్య నటుడు మహేశ్ కన్నుమూత
యశవంతపుర : హాస్య నటుడు మహేశ్ (మల్లేశ్) మృతి చెందారు. కిడ్నీ సమస్య కారణంగా అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వందకు పైగా సినిమాల్లో నటించిన మహేశ్ హాస్యనటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, మహేశ్ పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. హాస్య నటుడి మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ కుటుంబానికి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
స్టోరీ.. స్క్రీన్ప్లే.. డైరెక్షన్.. అన్నీ వారే..
సుజిత్.. ఒకప్పుడు షార్ట్ ఫిలిం మేకర్.. సినీ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకున్న అతనిలో ఓ షార్ట్ ఫిలిం ఆత్మవిశ్వాసాన్ని నింపింది.. ప్రస్తుతం రూ.300 కోట్లతో ప్రభాస్ హీరోగా నిర్మి స్తున్న ‘సాహో’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేసేలా చేసింది. సుజిత్ ఎక్కడ అవకాశాల కోసం వెదకలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకున్నాడు.. అవకా«శాన్ని అందిపుచ్చుకున్నాడు.. తన సినీ ప్రస్థానాన్ని సిల్వర్స్క్రీన్ వైపు నడిపించాడు.. ఫన్ బకెట్.. యూట్యూబ్లో అత్యంత హిట్ కొట్టిన నవ్వుల షార్ట్ ఫిలిం.. ఇందులో కనిపించే యువకులంతా ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.. వారు అవకాశాల కోసం ఎదురుచూడలేదు.. కాళ్లు అరిగేలా తిరగలేదు.. కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లోనే తమ ఆశయానికి నారు పోశారు. అదే ఫన్ బకెట్గా నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో నటించిన మిల్క్ మహేష్ తదితర నటులకు సినీ అవకాశాలను కల్పించింది. అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన రామ్ కట్రూకు సినిమాలంటే ప్యాషన్. ఇక్కడికొచ్చిన అతనికి సినిమా తీయడానికి కొంత ఇబ్బంది ఎదురైంది. తన ప్రతిభను చూపడానికి సినిమా ఒకటే అవకా«శం కాదు.. అందుకే.. తనలాంటి ఆలోచనలు ఉన్న ఒక టీంతో ఆయన కలిశాడు. అంతే.. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం తనకు తాను రాసుకున్నారు.. కృష్ణానగర్, గచ్చిబౌలి, మసీదు బండ ప్రాంతాల్లో ‘ప్రక్షాళన’ పేరుతో ఒక షార్ట్ ఫిలింను తెరకెక్కించాడు.. ఇది 16 ఫిలిం ఫెస్టివల్స్లో నామినేట్ అయ్యింది. ప్రతిభ ఒకరి సొత్తు కాదని కృష్ణానగర్ అడ్డాగా నిరూపితమైంది. బంజారాహిల్స్: సినిమాల్లో అవకాశాలు నేరుగా ఎవరికీ రావు. అదృష్టం ఉంటే తప్ప. ఇప్పుడు అదృష్టం ఉండాల్సిన పనిలేదు. ప్రతిభ ఉండి, పట్టుదల ఉంటే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అందుకే.. కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్కాలనీ ప్రాంతాల్లో ప్రతి రోజు ఔత్సాహిక యువకులు షార్ట్ ఫిలింల రూపకల్పనతో బిజీగా ఉంటున్నారు. కృష్ణనగర్లో ఉండేటువంటి పార్కులు, బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు ఇలా అన్ని ప్రాంతాలు వీరికి లోకేషన్లుగా మారుతున్నాయి. అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో నివసించే చాలా మంది ఔత్సాహిక కళాకారులు తమను తాము నిరూపించుకొంనేందుకు ఈ లఘుచిత్రాల బాట పడుతున్నారు. ఇందుకు కృష్ణానగర్ ప్రాంతమే అడ్డాగా నిలుస్తోంది. ముడి సరుకులు అవే.. సమాజంలోని చిన్నచిన్న సంఘటనలే కథకు ముడి సరుకులుగా మారుతున్నాయి. ఇక ప్రతిభ ఉన్నవారు, ఉత్సాహం ఉన్నవారు వారికి వారే కథను రాసుకుంటున్నారు. స్క్రీన్ప్లే, దర్శకత్వం చేస్తున్నారు. యాక్షన్ దగ్గరి నుంచి మొదలుకొని ప్యాకప్ వరకు అంతా వారే చూసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ముందడుగు వేసి హీరోలుగా తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 నిమిషాల నుంచి అరగంట నిడివి ఉండేటువంటి షార్ట్ ఫిలింలు ఇప్పుడు యూట్యూబ్లో హిట్ కొడుతున్నాయి. మహాతల్లి, ఫ్రస్టేషన్ ఉమెన్లాంటి స్వీయ కార్యక్రమాలతోపాటు ఫన్బకెట్, మై విలేజ్ షో, దేత్తడి, పక్కింటి కుర్రాడు ఇలాంటి షోలన్నీ ఇప్పుడు పెద్ద పాపులర్గా మారాయి. ఇంతెందుకు నిన్నామొన్నటి వరకు కృష్ణానగర్ వీధుల్లో తిరిగి జబర్దస్త్ టీంలో చేసి మహేష్ ఏకంగా ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్ తేజ పక్కన చాన్స్ కొట్టాడు. కృష్ణానగర్ వీధుల్లో లఘు చిత్రాల చిత్రీకరణ అన్నీ ఇక్కడే.. లఘుచిత్రాలు చేయడమంటే కేవలం నటించడమే కాదు.. పాత్రకు తగిన విధంగా గెటప్ వేస్తున్నారు. భాష, యాస, మేకప్, దుస్తులు ఇలా అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. ఇక వీటన్నింటికీ కృష్ణానగర్ ప్రాంతమే అడ్డా. కెమెరాలు ఇక్కడే అద్దెకు లభిస్తాయి. చిన్న కెమెరాల నుంచి మొదలుకొని పెద్ద కెమెరాల వరకు ఇక్కడ అద్దెకు ఇస్తారు. దుస్తులు, విగ్గులు, వివిధ వేషధారణలకు తగిన ఉత్పత్తులు ఇలా అన్నీ కృష్ణానగర్ అడ్డాలోనే లభిస్తాయి. అందుకే.. ఒకప్పుడు కేవలం అవకాశాల కోసం ఏర్పడిన కృష్ణానగర్ నేడు అవకాశాలు సృష్టించుకొనే డిజిటల్ స్థాయి వైపు తీసుకెళ్తోంది. ఆలోచనలే కాదు.. కృష్ణానగరూ మారుతోంది. షార్ట్ ఫిలిం నుంచిఫీచర్ ఫిలింకు.. సినిమాల్లో అవకాశం కోసం చాలా రోజులు కష్టపడ్డాం. కృష్ణానగర్ వీధులన్నింటినీ పరిచయం చేసుకున్నాం. అవకాశాలు అంత సులువుగా రాలేదు. చివరికి ప్రక్షాళన పేరుతో చేసిన షార్ట్ ఫిలిం చేశాం. అది ప్రపంచ స్థాయిలో ఆకర్షించింది. అంతే.. చాలా మంది పెద్ద డైరెక్టర్లు భుజం తట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. – భరత్రాజు, నటుడు షార్ట్ఫిలింలో పాత్ర కోసం క్యాస్టూమ్స్ అద్దెకు తీసుకుంటూ.. అవకాశాలను సృష్టించుకొన్నాం.. ఫన్బకెట్లో దాదాపు 90 ఎపిసోడ్లు చేశాను. అదంతా కృష్ణానగర్, శ్రీనగర్కాలనీ ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొనే వాళ్లం. అలా నా వీడియో చూసి మొదటిసారి దర్శకులు తేజ అవకాశం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అవకాశం కల్పించారు. ఇప్పటికీ 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. పట్టుదల ఉంటే మనమే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం చేసుకోవడమే కాదు.. నటించి మనల్ని మనం నిరూపించుకోవచ్చు. – మహేష్ విట్టా, నటుడు, ఫన్ బకెట్ ఫేం -
అమాయకుడిని బలి చేశారు
ఇందూరు: డ్రగ్స్ మాఫియా వలలో చిక్కిన ఓ అమాయకు డు దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నిజామాబా ద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల వాసి పూసల శ్రీనివాస్ 2016లో దుబాయ్ వెళ్లాడు. విమాన టికెట్ బుక్ చేసుకోవడానికి మోర్తాడ్ మండల కేంద్రంలో గల్ఫ్ ఏజెంటుగా వ్యవహరిస్తున్న మహేశ్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో మహేశ్ ఓ మందుల పార్శిల్ శ్రీనివాస్కు ఇచ్చి.. దుబాయ్లో తమ మనిషి వచ్చి మందులు తీసుకెళ్తాడని చెప్పాడు. అక్కడి పోలీసుల తనిఖీల్లో పార్సిల్ డ్రగ్స్గా తేలింది. దీంతో శ్రీని వాస్ను అరెస్టు చేసిన పోలీసులు, రూ.10 లక్షల జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. దీనిపై శ్రీనివాస్ కుటుంబీకులు సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణలో వీఆర్ ఏగా పనిచేసే అశోక్ ఆ పార్సిల్ ఇచ్చాడని మహేశ్ చెప్పా డు. దీంతో శ్రీనివాస్ తప్పిదం లేదని, క్షమాభిక్ష కింద అత డిని విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం నుంచి దుబాయ్ ఇండియన్ ఎంబసీకి సీఐడీ అధికారులు లేఖ రాశారు. నివేదిక దుబాయ్ ప్రభుత్వానికి చేరే సరికి ఆలస్యమవడంతో ఫలితం లేకపోయింది. శ్రీనివాస్ను క్షమాభిక్ష కింద విడిపించాలని తల్లిదండ్రులు రాములు, పోసాని, భార్య లతిక గురువారం కలెక్టర్ రామ్మోహన్రావును వేడుకున్నారు. -
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో జగిత్యాల జిల్లా విద్యానగర్కు చెందిన మేడిశెట్టి మహేశ్(24) మంగళవా రం హైదరాబాద్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీఏ పూర్తి చేసిన మహేశ్ హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నరేశ్ అనే వ్యక్తి రూ.2 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా అతను ఉద్యోగం చూపించకపోవడంతో మనస్తాపానికి గురైన మహేశ్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కాగా, మహేశ్ స్వగ్రామంలో సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని ఉంచడానికి నిరాకరించారు. దీంతో శవాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా గొల్లపల్లి రోడ్లోని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతుడి తండ్రి మూడేళ్లక్రితం ఆత్మహత్య చేసుకోగా.. తల్లి పద్మ ఉన్నారు. -
ఆ పార్టీకో దండం
అంతా అనుకున్నట్లుగానే అయ్యింది. రాజకీయాల్లో ప్రజలే ప్రభువులని, ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని, ప్రజా రాజకీయాలే నడపాలని ప్రకటిస్తూ కేపీజేపీని ఆరంభించిన హీరో ఉపేంద్ర ఆ పార్టీకో దండం పెట్టి బయటకు వచ్చారు. ఆ వెంటనే ప్రజాకీయ అనే మరో పార్టీకి ప్రాణం పోశారు. సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు ఉపేంద్ర కేపీజేపీ పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే చీలికలు ఏర్పడ్డాయి. గత ఏడాది అక్టోబర్ 31న బెంగళూరులో పార్టీ పురుడు పోసుకోవడం తెలిసిందే. వ్యవస్థాపకుడు మహేశ్గౌడ, పార్టీ అధ్యక్షుడు ఉపేంద్రల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో మంగళవారం నటుడు ఉపేంద్ర కేపీజేపీకి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికతో పాటు అనేక విషయాల్లో ఉభయుల మధ్య తీవ్ర పొరపొచ్ఛాలు వచ్చినట్లు తేలింది. మీరు సూచించిన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపితే కనీసం 20 ఓట్లు కూడా రాలవని మహేశ్గౌడ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నేతల వైఖరితో ఆవేదన చెందిన ఉప్పి గతకొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతర్గత విభేదాలు సోమవారం బహిర్గతం కావడంతో ఉపేంద్ర రాజీనామాకే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉపేంద్ర నగరంలోని రుప్పీస్ రిసార్ట్లో మీడియాతో మాట్లాడారు. కేపీజేపీ పార్టీతో ఇక తనకు ఎలాంటి సంబంధం లేదు, నేటితో కేపీజేపీతో బంధం తెగిపోయిందంటూ వాఖ్యానించారు. చివరిసారిగా మహేశ్గౌడకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించామని అయితే ఆయనకు పార్టీ శ్రేయస్సు, ప్రజాసేవ కంటే పబ్లిసిటీనే కావాలన్నట్లు అర్థమయిందని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, సొంతంగా ‘ప్రజాకీయ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించనున్నామని నేటి నుంచే ప్రజాకీయ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. తమతో పాటు తమ సిద్ధాంతాలు నచ్చిన మరికొంత మంది నేతలు,కార్యకర్తలు కూడా కేపీజేపీ పార్టీకి రాజీనామా చేసి ప్రజాకీయ పార్టీలో చేరారన్నారు. మహేశ్గౌడపై ప్రియాంక విమర్శలు ఉపేంద్ర సతీమణి, నటి ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. ఈ పరిణామాలతో ఉపేంద్ర ఇమేజ్ దెబ్బతింటుందని భయపడ్డామన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసి ప్రజాకీయ అనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించడం ద్వారా ఉపేంద్ర మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. మహేశ్గౌడ ప్రవర్తన ఉపేంద్రతో పాటు తమను,పార్టీకి రాజీనామా చేసిన నేతలను కూడా ఎంతగానో బాధించిందన్నారు. కేపీజేపీ రాజీనామా చేసిన అనంతనం ఉపేంద్రకు కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని అయితే ఎటువంటి రాజకీయ చట్రంలో చిక్కుకోకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే కొత్త పార్టీని స్థాపించారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో దర్శకురాలు రూపా అయ్యర్, ముఖ్య అభిమానులు పాల్గొన్నారు. రూపా మాట్లాడుతూ మహేశ్గౌడ ఈ విధంగా ప్రవర్తించడం తమను కలచివేసిందని, అతని మనసులో ఇంత కుట్ర దాగి ఉన్నట్లు తాము గుర్తించలేకపోయామని అన్నారు. -
ఆయన తెలుగు రాష్ట్రాల పాలిట శాపం
హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పాలిట శాపంగా మారాడని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ విమర్శించారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ..నేటితో తెలంగాణపై బీజేపీ నిజస్వరూపం బయట పడిందని వ్యాఖ్యానించారు. మోదీ తెలంగాణ పై విషం గక్కారని ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వకుండా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టే సాహసం చేశారని మండిపడ్డారు. మోదీ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసిన తరువాత కూడా ఆత్మగౌరవం ఉన్న నాయకులు ఎవరూ బీజేపీలో ఉండరని వ్యాఖ్యానించారు. మోదీ దెబ్బకు తెలంగాణలో బీజేపీకి ఉన్న దింపుడు కళ్లెం ఆశలు కూడా కరిగిపోయాయన్నారు. తెలంగాణ ద్రోహులు మాత్రమే బీజేపీలో మిగులుతారని వ్యాఖ్యానించారు. -
ఎక్కువ రీటేక్లు తీసుకున్నందుకు చెర్రీ రివెంజ్!?
సాక్షి, హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న చిత్రం ‘రంగస్థలం 1985’.. ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను తాజాగా రామ్చరణ్ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేసుకున్నాడు. షూటింగ్ స్పాట్లో రామ్చరణ్ ఓ చెక్క ముక్కను గట్టిగా ఉందా, లేదా అన్నది చెక్ చేసి..దానితో కమేడియన్ మహేశ్ను ఎలా కొట్టాలో చూపించాడు. ఆ తర్వాత ఆ చెక్కను మరో జబర్దస్త్ కమేడియన్ శ్రీనుకు అందించాడు. ప్రాణం బిగపట్టుకొని నిలబడిన మహేశ్ను శ్రీను ఆ చెక్క బద్దలు అయ్యేలా కొట్టాడు. ఇదంతా ఎందుకంటే.. మహేశ్ చేసిన తప్పిదానికి. అతను గతరాత్రి చాలా రీటేక్లు తీసుకున్నాడట. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇలా రీటేక్లు తీసుకుంటే షూటింగ్ స్పాట్లోని సిబ్బంది కాలాదా? అందుకే చిత్రయూనిట్ తరఫున ఇలా కొట్టి పనిష్మెంట్ ఇచ్చారు. మరీ ఇది నిజంగానే పనిష్మెంటా అంటే కాదు.. షూటింగ్ మధ్యలో సరదా కోసం ఇలా ఓ వీడియోను చిత్రీకరించి అభిమానులకు కానుకగా చెర్రీ షేర్ చేశాడు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ’గతరాత్రి జరిగిన షూటింగ్లో మహేశ్ ఎక్కువ రీటేక్లు తీసుకున్నాడు. అందుకే చిత్రయూనిట్ తరఫున అతను ఇది భరించాల్సి వచ్చింది’ అని చెర్రీ ఈ పోస్ట్కు కామెంట్ పెట్టాడు. -
ఫన్నీ వీడియో పోస్టు చేసిన రాంచరణ్
-
వియ్యంకునికోసం అధికార దుర్వినియోగం
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వియ్యంకుడైన రిటైర్డ్ అధికారి వెంకట్రామ్రెడ్డిని నాబార్డు డైరెక్టరుగా నియమించడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వెంటనే మంత్రివర్గం నుంచి ఈటలను భర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హార్టికల్చర్ శాఖలో ఉద్యోగ విరమణ చేసినరోజే వెంకట్రామ్రెడ్డిని నాబార్డు డైరెక్టరుగా నియమిస్తూ, చట్టవిరుద్ధంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించరాదని ఆర్థిక శాఖ గతంలోనే స్పష్టమైన ఆదేశాలను జారీచేసిందని గుర్తుచేశారు. అదే శాఖకు మంత్రిగా ఉన్న ఈటల తన వియ్యంకునికోసం నిబంధనలను, చట్టాన్ని ఉల్లంఘించారని, నాబార్డు నిధులను కాజేయడానికే ఈ నియామకం జరిగిందన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, కానీ టీఆర్ఎస్లో పలుకుబడి ఉన్నవారంతా రెండుమూడు ఉద్యోగాలు పొందుతున్నారని మహేశ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. -
టీజర్ చూశా.. చాలా బాగుంది – కృష్ణ
‘‘కిరణ్గారు మంచి మంచి సినిమాలు చేశారు. ఆ బ్యానర్తో కలిసి ఇందిర ప్రొడక్షన్ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. మంజుల కథ, డైలాగ్స్ కూడా రాసుకుని డైరెక్షన్ చేస్తుందని నాకు తెలియదు. ఈ సినిమా కథ నాకు తెలియదు. అయితే, ఫస్ట్ లుక్ టీజర్ చాలా బాగుంది. కచ్చితంగా సినిమా సూపర్హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని సూపర్స్టార్ కృష్ణ అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తుర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా ఘట్టమనేని మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి బ్యానర్పై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ని కృష్ణ, ఫస్ట్లుక్ పోస్టర్ని దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మంజుల నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, ఆ తర్వాత డైరెక్షన్ చేస్తానని చెప్పింది. ఓరోజు సడన్గా వచ్చి డైరెక్షన్ చేస్తున్నాను అంది. అదేంటి? నా అసిస్టెంట్గా చేస్తానన్నావు కదా? అని అడిగితే.. ‘నేను మీ ఏకలవ్య శిష్యురాల్ని.. మీ సినిమాలు చూసి తెలుసుకున్నాను’ అంది. నాకు గురుదక్షిణగా రెండు పాటలు చూపించింది. చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నాన్నలా పేరు రావాలంటే సినిమాలే మార్గమని ఈ రంగంలోకి అడుగుపెట్టా. సినిమాల్లో నటించడంతో పాటు నిర్మించాను. ఇంకా ఏదో చేయాలనిపించి దర్శకత్వం చేశా’’ అన్నారు మంజుల. ‘‘స్వీట్ అండ్ సింపుల్ హార్ట్ టచింగ్ లవ్స్టోరీ ఇది. ఎప్పటి నుంచో ఇలాంటి లవ్స్టోరీ చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. నాకు అక్కయ్య లేని లోటును మంజులగారు తీర్చారు’’ అన్నారు సందీప్కిషన్. ‘‘ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సినిమా బాగా వచ్చింది. జనవరి 26న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సంజయ్ స్వరూప్, పి.కిరణ్. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నటులు ప్రియదర్శి, పునర్నవి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: రవియాదవ్. -
హాస్య నటుడిగా స్థిరపడాలన్నదే లక్ష్యం
మామిడికుదురు (పి.గన్నవరం): తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా గుర్తింపు పొందాలన్నదే తన లక్ష్యమని వర్ధమాన హాస్యనటుడు మహేష్ ఆచంట పేర్కొన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు పెదపట్నంలంక వచ్చిన మహేష్ మంగళవారం స్థానిక విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’,.. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్తేజ్ నటిస్తున్న చిత్రంతో పాటు.. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ‘ఒక్క క్షణం’ , ‘మహానటి సావిత్రి’ చిత్రాల్లో ప్రస్తుతం తాను నటిస్తున్నాని చెప్పారు. మలికిపురం మండలంలోని శంకరగుప్తం తమ స్వగ్రామమని తెలిపారు. మలికిపురంలో ఇంటర్ పూర్తిచేసి హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేశానని మహేష్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంబీఏ చేస్తూనే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించానన్నారు. ఆ ప్రయత్నంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. ఇంత వరకూ 65 సినిమాల్లో నటించానని, 80కి పైగా టీవీ ఎపిసోడ్స్లో నటించానని చెప్పారు. ‘ఖైదీ నెంబర్–150’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలు తనకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయని మహేష్ పేర్కొన్నారు. చిన్నాన్న బోనం అంజి, సోదరుడు రేకపల్లి బాబీ తనను ఎంతో ప్రోత్సహించారన్నారు. -
ప్రజలను ప్రేమించే సీఎం!
అతడు ప్రజలను పాలించడానికి మాత్రమే కాదు.. ప్రేమించడానికి సీఎం అయ్యాడు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే యంగ్ సీయం రాబోతున్నాడు. మహేశ్ అభిమానులు తమ హీరో క్యారెక్టరైజేషన్ గురించి ఇలా ఓ రేంజ్లో చెప్పుకుంటున్నారు. కొరటాల శివ దర్శత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’. డివీవీ దానయ్య నిర్మాత. ఇందులో మహేశ్బాబు సీయంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీంతో మహేశ్ లుక్ రివీలైంది. లీకైన స్టిల్లో యంగ్ సీయంలా మహేశ్ సూపర్గా ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారని ఫిల్మ్నగర్ టాక్. ఈలోపు స్టిల్ బయటకు రావడం చిత్రబృందాన్ని బాధపెట్టింది. మా కష్టాన్ని వృథా చేయవద్దు ‘‘లీకైన మా సినిమా స్టిల్ను సర్క్యులేట్ చేయొద్దని నెటిజన్లను, ఇతర మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటివి చేయడం వల్ల మా అందరి కష్టాన్ని వృథా చేసినట్లు అవుతుంది. మేం మంచి అవుట్పుట్ ఇవ్వడానికి మా వంతు కృషి చేస్తున్నాం’’ అని చిత్రదర్శకుడు కొరటాల శివ విన్నవించుకున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► చిరంజీవి నటించి, కో–ప్రొడ్యూసర్గా చేసిన ఒక సినిమాకి ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్’ అనే జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమా పేరేంటì ? ఎ) స్వయంకృషి బి) ఆపద్భాందవుడు సి) యద్ధభూమి డి) రుద్రవీణ ► మహేశ్ బాబు నటి నమ్రతను ఏ సినిమా టైమ్లో పెళ్లి చేసుకున్నారో గుర్తు తెచ్చుకోండి. ఎ) వంశీ బి) బాబి సి) అతడు డి) నాని ► నటి భానుప్రియ 150 సినిమాలకు పైగా చేశారు. ఒకే సంవత్సరంలో ఆమెవి 14 సినిమాలు రిలీజయ్యాయి. అది ఏసంవత్సరమో కనుక్కోండి. ఎ) 1985 బి) 1986 సి) 1983 డి) 1987 ► ఎస్.ఎస్. రాజమౌళి మొదట సినిమాకు సంబంధించిన ఏ శాఖలో శిష్యరికం చేశారో తెలుసా? ఎ) అసిస్టెంట్ డైరెక్టర్ బి) కెమెరా అసిస్టెంట్ సి) అసిస్టెంట్ ఎడిటర్ డి) అసిస్టెంట్ రైటర్ ► చదువుకున్న అమ్మాయిలు’ చిత్రానికి స్క్రీన్ప్లే రైటర్గా చేసి, ఆ తర్వాత తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడయ్యారు. ఆయనెవరు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) కె.విశ్వనాథ్ డి) ఎ.కోదండరామిరెడ్డి ► గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం 2012లో ఒక ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు. ఆ అవార్డు ఏమిటి? ఎ) పద్మశ్రీ బి) పద్మభూషణ్ సి) పద్మవిభూషణ్ డి) దాదాసాహెబ్ ఫాల్కే ► నటుడు కోట శ్రీనివాసరావు సినీరంగంలోకి రాకముందు ప్రభుత్వోద్యోగి. ఆయన ఏ శాఖలో పనిచేసే వారో తెలుసా? ఎ) బ్యాంకింగ్ రంగం బి) రోడ్లుభవనాలు సి) వాటర్ వర్క్స్ డి) ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ ► ఈ నలుగురిలో ఒక నటి అసలు పేరు సుజాత నిడదవోలు. ఈమె తెర పేరు కూడా కనుక్కుంటారా? ఎ) జయప్రద బి) జయసుధ సి) జయలలిత డి) జయచిత్ర ► ‘కళాశాలలో... కళాశాలలో కాదా మనసొక ప్రయోగశాల...’ పాటను రాసిందెవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) జొన్నవిత్తుల సి) అనంత శ్రీరాం డి) సీతారామ శాస్త్రి ► డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఏ హీరోయిన్కు తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ వాయిస్ ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యింది? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తమన్నా సి) సమంత డి) అదా శర్మ ► హీరో నాని ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా? ఎ) మై నేమ్ ఈజ్ నాని బి) నాని ఈజ్ మై నేమ్ సి) నేమ్ ఈజ్ నాని డి) యువర్స్ నాని ► నాగార్జునకు నటి, నిర్మాత సుప్రియ మేనకోడలు.మరి సుప్రియకు అఖిల్ ఏమవుతాడు? ఎ) మరిది బి) కొడుకు సి) అల్లుడు డి) బావ ► సావిత్రి తన 31 సంవత్సరాల సినీ కెరీర్లో అన్ని భాషలలో కలిపి ఎన్ని సినిమాల్లో నటించారు? ఎ) 264 బి) 275 సి) 233 డి) 245 ► కొరటాల శివ డైరెక్షన్లో చేసిన ‘మిర్చి’లో ప్రభాస్ ‘కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరూ వాడలేరు..’ అని చెప్పిన డైలాగుని రాసిన దర్శకుడెవరు? ఎ) దశరథ్ బి) వంశీ పైడిపల్లి సి) కొరటాల శివ డి)బోయపాటి శ్రీను ► మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో కమలహాసన్ ఓ కెమెరామేన్తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయనెవరు? చిన్న క్లూ.. తర్వాత కాలంలో వారిద్దరూ చాలా సినిమాలకు వర్క్ చేశారు? ఎ) చోటా కె. నాయుడు బి) పి.సి. శ్రీరాం సి) వి.ఎస్.ఆర్ స్వామి డి) కె.వి.ఆనంద్ ► నటి కాజల్ కన్నడ భాషలో గాయనిగా కూడా చేశారు. ఆమె పాడిన పాటకు సంగీత దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) అనూప్ రూబెన్స్ సి) ఎస్.ఎస్ తమన్ డి) సాయి కార్తీక్ ► మగధీర’ సినిమాలోని బైక్ యాక్షన్ సీక్వెన్స్లో జరిగిన ప్రమాదంలో ఏ ఫైట్ మాస్టర్ తీవ్ర గాయాల పాలయ్యాడు? ఎ) విజయన్ బి) స్టంట్ శివ సి) విజయ్ డి) పీటర్ హెయిన్ ► విజయనిర్మల తను నటించి, మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఏంటి? ఎ) రంగుల రాట్నం బి) మీనా సి) సాక్షి డి) పిన్ని ► పై ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టగలరా? ఎ) కృష్ణకుమారి బి) రమాప్రభ సి) శ్రీలక్ష్మి డి) షావుకారు జానకి ► నందమూరి తారక రామారావు నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిది? ఎ) కృష్ణావతారం బి) కృష్ణ పాండవీయం సి) కృష్ణార్జున యుద్ధం డి) కృష్ణలీలలు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) సి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) సి 11) సి 12) ఎ 13) ఎ) 14) సి 15) బి 16) సి 17) డి 18) బి 19) సి 20) ఎ -
డ్రాకులా పుట్టినచోట... మహేశ్, నేనూ!
...స్టెప్పులేస్తూ ఓ పాటేసుకున్నామని రకుల్ప్రీత్ సింగ్ చెబుతున్నారు. డ్రాకులా అంటే రక్తపిశాచి. నవలలు చదివేవారికి, హాలీవుడ్ హారర్ సిన్మా ప్రేమికులకు బాగా పరిచయమున్న పేరు. కొంతమంది అయితే ఈ పేరు వింటే ప్యాంటు తడిపేసుకుంటారంటే నమ్మండి. డ్రాకులా బేస్డ్ ఫిల్మ్స్ అంతలా భయపెట్టేశాయి మరి! అవ్వడానికి ఫాంటసీ అయినా.. డ్రాకులా పుట్టింది రొమేనియాలో! మహేశ్బాబు, రకుల్ జంటగా నటించిన ‘స్పైడర్’లో ఓ పాటను ఇటీవలే అక్కడ చిత్రీకరించారు. డ్రాకులా పుట్టిన కోట(రాజ భవనం) దగ్గరే రెండు రోజులు షూటింగ్ చేశారు. కానీ, రకుల్కి ఆ కోటలోకి వెళ్లే టైమ్–ఛాన్స్ దొరకలేదట. అందువల్ల, ఇంకోసారి అక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. ‘‘రొమేనియాలో ఎక్కడ చూసినా పురాతన కట్టడాలే. డ్రాకులా గురించి అక్కడ కథలు కథలుగా చెబుతుంటారు. రెస్టారెంట్స్లో డ్రాకులా పేరుతో స్పెషల్ ఫుడ్ వడ్డిస్తున్నారు. ఓ రెస్టారెంట్లో డ్రాకులా మీల్స్ బాగుంటుందనీ, తినమనీ అన్నారు. అదోలా ఉండడంతో తినలేదు. కానీ, రొమేనియా నాకు బాగా నచ్చింది. త్వరలో అక్కడికి వెళ్తా’’ అన్నారు రకుల్. దర్శకుడు మురుగదాస్ అక్కడ ఏ పాట తీశారో మరి! ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. -
బీఎండబ్ల్యూ కారు బీభత్సం ఇద్దరికి స్వల్ప గాయాలు
హైదరాబాద్: మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు మూలమలుపు వద్ద ఫుట్పాత్ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కారు యజమానితోపాటు మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్లో నివసించే మహేశ్ అనే రియల్ ఎస్టేట్వ్యాపారి‡ విందు ముగించుకొని బీఎండబ్ల్యూ కారులో హర్ష అనే యువతితో కలసి పంజగుట్ట వైపు వస్తున్నారు. తెలంగాణ భవన్ వైపు నుంచి కేబీఆర్పార్కు వైపు వెళ్తుండగా క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో యూ టర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడమే కాకుండా కారు ముందు భాగం ఫుట్పాత్పైకి ఎక్కింది. బెలూన్లు తెరుచుకోవడంతో మహేశ్, హర్ష స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కిందకు దిగిన మహేశ్ కారు నంబర్ ప్లేట్లను, కారులో ఉన్న మద్యం సీసాలను బ్యాగులో వేసుకొని కారును వదిలేసి పరారయ్యాడు. పోలీ సులు కొద్దిసేపటి తర్వాత ఘటనాస్థలానికి చేరుకొని ఆధా రాలు సేకరించారు. బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్లో పోలీ సులు సమాచారాన్ని సేకరించగా ఆ కారు నిషికేశ్ పేరిట ఉందని తేలింది. మహేశ్ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు చేయగా మద్యంసేవించి ఉన్నాడని తేలింది. ఈ కేసులో మహేశ్, నిషితేశ్లను పోలీసులు అరెస్టు చేశారు. -
పిరికిపందల చర్య: కొనగల
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీపై జరిగిన దాడికి బీజేపీ అధినాయకత్వం క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ డిమాండ్ చేశారు. గుజరాత్లో దారుణాలు, అరాచకాలు బాహ్యప్రపంచానికి తెలు స్తాయనే భయంతోనే బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారని ఆరోపించారు.ఇది పిరికిపందల చర్యన్నారు. దాడులకు బాధ్యతగా క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు అమిత్షాను అడ్డుకుంటా మని హెచ్చరించారు. -
రియాక్టర్ పేలుడు: యువకుడు మృతి
కొమురవెల్లి: హైదరాబాద్లోని రెడ్డి ల్యాబ్లో గ్యాస్ రియాక్టర్ పేలిన ఘటనలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన సార్ల మహేష్ (20) అనే యువకుడు మృతిచెందాడు. ఈ ల్యాబ్లో గ్యాస్ రియాక్టర్ వద్ద మహేష్, మరో ఇద్దరు సోమవారం రాత్రి పనిచేస్తున్న సమయంలో అత్యధిక వేడితో రియాక్టర్ పేలింది. దీంతో అతని ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడగా.. ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మహేష్ కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలి వచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేసినట్లు తెలుస్తోంది. -
ప్రేమించకుంటే.. ఇద్దరినీ పెట్రోల్ పోసి తగలేస్తా..
బంజారాహిల్స్: తనను ప్రేమించకపోతే పెట్రోల్ పోసి తగలేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కల్లకూరు గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో నివాసం ఉంటోంది. సమీపంలోని ఓమెగా ఆస్పత్రిలో 2014 నుంచి టెక్నికల్ ఆపరేటర్గా పని చేస్తోంది. ఆస్పత్రికి వచ్చిపోయే సమయంలో అందులోనే గతంలో ఎలక్ట్రీషన్గా పనిచేసిన మహేష్ ఏడాది కాలంగా ప్రేమించాలంటూ వెంట పడుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు ఫోన్ చేసి ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. తనను కాకుండా ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటే ఇద్దరినీ కలిసి పెట్రోల్ పోసి తగలేస్తానంటూ గత నెల మరోసారి ఎస్వీఆర్ స్కూల్ వద్ద అడ్డగించి బెదిరించాడు. రెండో రోజుల క్రితం మరోసారి ఫోన్ చేసి తనను ప్రేమిస్తావా లేకపోతే చస్తావా అంటూ హెచ్చరించాడు. తనను కాదని పెళ్ళి చేసుకుంటే అంతు చూస్తానంటూ బెదిరించడమే కాకుండా మానసికంగా వేధింపులకు గురి చేస్తానని బెదిరించాడు. దీంతో మహేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు మహేష్పై సెక్షన్ 354(డి), 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా పిల్లల తప్పేమీ లేదు
► హవాలా కేసు నిందితుల తల్లిదండ్రులు విశాఖపట్నం: హవాలా కేసులో విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న పెరవలికి చెందిన ఆచంట రాజేష్, హరీష్ల తప్పేమీ లేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే వీరి తండ్రి జయకృష్ణ పెరవలిలో రాయల్ హోటల్ను నడిపేవారు. నష్టాలు రావడంతో దానిని కొంతకాలంగా మూసివేశారు. దీంతో హరీష్, రాజేష్లు ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో హవాలా కేసులో అసలు సూత్రధారిగా భావిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన మహేష్ తండ్రి వీరికి రూ.20 వేలు జీతం ఇస్తానని వారిని తీసుకెళ్లారని హరీష్, రాజేష్ల తల్లిదండ్రులు వివరించారు. ఇటీవలే వారు అక్కడ మానేసి వచ్చేసారని, ఇపుడు పోలీసులు కేసులు అంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుల తప్పేమీ లేదంటున్న తల్లితండ్రులు మీడియాతో మాట్లడటానికి నిరాకరించారు. -
హవాలా వెనుక నల్ల కుబేరులెవరు?
- బడా నేతల పాత్రపై అనుమానాలు - ఓ ఏపీ మంత్రి, ఎంపీ అండతోనే వ్యవహారం - ఇప్పుడేమీ చెప్పలేమంటున్న ఖాకీలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ హవాలా రాకెట్ వెనుక సూత్రధారులెవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖ కేంద్రంగా బోగస్ కంపెనీల పేర్లతో సుమారు రూ.1,500 కోట్లను హవాలా రూపంలో తరలించిన ముఠా వెనుక ఎవరున్నారన్నది కనుక్కోవడం పోలీసులకు సవాల్గా మారింది. అన్ని వంద ల కోట్లెవరివి? అవి హవాలా మార్గంలో ఎటు తిరిగి ఎటొచ్చాయి? అనే దానిపెనే ఇప్పుడు వారు ప్రధానంగా కూపీ లాగుతున్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీ కేంద్రంగా శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పాండురంగాపురంలోని బాలముకుంద వేర్హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు డొల్ల కంపెనీల పేరిట నగరంలోని 20 బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా లావాదేవీలు సాగించిన ఘరానా ముఠాకు ఇక్కడ ఎవరు అండగా ఉన్నారనే అంశంపైనే పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. అత్తిలి టు కోల్కతా వయా శ్రీకాకుళం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు 20 ఏళ్ల క్రితమే కోల్కతాకు వలస వెళ్లాడు. అక్కడ ఉల్లిపాయల ఏజెంట్గా పనిచేసి సంపాదించిన డబ్బుతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురిడిలో కొంతకాలంగా శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట క్రషర్ నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం ఏడాదిన్నరగా శ్రీకాకుళం పట్టణం ఎల్బీఎస్ కాలనీలో భార్యతో కలసి నివాసముంటున్నాడు. ఇతని కొడుకు వడ్డి మహేష్ కోల్కతాలోనే ఉంటూ హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బును విదేశాలకు పంపడంలో దిట్టగా పేరొందాడు. ప్రభుత్వాలకు పన్ను చెల్లించకుండా ఎగవేసే నల్లకుబేరులకు చెందిన కోట్లాది రూపాయల సొమ్మును బినామీ కంపెనీల ద్వారా విదేశాలకు పంపి వైట్ చేసి పెడుతూ కమీషన్లు దండుకుంటున్నాడు. విశాఖతోపాటు హైదరాబాద్, కోల్కతాల్లోని మొత్తం 30కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా బడా వ్యాపారుల సొమ్మును విదేశాలకు పంపుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బెంజ్తో దొరికేశాడు.. రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాను మహేష్ కొన్న కొత్త బెంజి కారు బట్టబయలు చేసింది. ఓ చిన్న స్టోన్ క్రషర్ యజమాని కొడుకు ఖరీదైన బెంజ్ కారు కొనడంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు అతని బ్యాంకు లావాదేవీలపై కన్నే శారు. విశాఖ, శ్రీకాకుళం, కోల్కతాల్లో సోదాలు నిర్వహించి 4 రోజుల క్రితమే మహేష్ను కోల్కతాలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతను ఇచ్చిన సమాచారంతోనే శ్రీకాకుళంలో నివాసముంటున్న తండ్రి వడ్డి శ్రీనివాసరావును, కారు డ్రైవర్ను, ఇంట్లో పనిచేసే వంట మనిషిని సైతం అదుపులోకి తీసుకుని విశాఖలో విచారిస్తున్నారు. తెర వెనుక ఎవరు? హవాలా వ్యాపారంలో ఆరితేరిన మహేష్ విశాఖ కేంద్రంగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఇక్కడి నుంచే వందల కోట్ల డబ్బు పంపడం వెనుక కచ్చితంగా ఉత్తరాంధ్ర రాజకీయ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిండా పాతికేళ్లు కూడా లేని యువకుడు రూ.కోట్ల హవాలా రాకెట్ నడిపాడంటే అధికార పార్టీ నేతల అండదండలు లేకుండా సాధ్యం కాదని పోలీసులే భావిస్తున్నారు. పక్కాగా ధ్రువీకరించడం లేదు కానీ.. ఏపీకి చెందిన ఓ మంత్రి, మరో ఎంపీ పాత్రపైనే పోలీసులు కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ హవాలా వెనుక ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ తండ్రి శ్రీకాకుళంలోనే ఎందుకు మకాం వేశాడు? కోల్కతా నుంచి శ్రీకాకుళానికి ఎందుకు మకాం మార్చాడు? క్రషర్ పేరిట అక్కడ ఆయన చేస్తున్న వ్యవహారాలేమిటి? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునారు. మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావుల ఫోన్ కాల్ లిస్టును పరిశీలిస్తున్నారు. అధికార పార్టీ ప్రముఖుల పాత్ర ఉండొచ్చని భావిస్తున్న ఈ కేసులో పోలీసులు పక్కాగా విచారణ చేçపడతారా.. లేదంటే దొరికిన వారితోనే సరిపెట్టేస్తారా అన్నది త్వరలో తేలనుంది. -
క్లాస్.. మాస్... స్పైడరే
చూపుల్లో బుల్లెట్ కంటే పవరూ... యాటిట్యూడ్లో ఇతరులకు అంతు చిక్కని ఆలోచనలూ... ఈ రెండిటికీ మించి సూపర్ స్టైలూ... మహేశ్బాబు కొత్త లుక్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. మహేశ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్పైడర్’ను టైటిల్గా ఖరారు చేశారు. బుధవారం టైటిల్తో పాటు సినిమాలో మహేశ్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. గన్ పట్టుకోవడం, ఇన్షర్ట్ చేసుకోవడం మహేశ్కు కొత్త కాదు. కానీ, మాస్లో క్లాస్... క్లాస్లో మాస్.... మిక్స్ చేసిన ఈ లుక్కి మంచి స్పందన లభిస్తోంది. మహేశ్ జేమ్స్ బాండ్లా ఉన్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. జూన్ 23న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు ఎస్.జె. సూర్య, తమిళ నటుడు భరత్ తదితరులు నటిసున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, సంగీతం: హ్యారీస్ జయరాజ్. -
ఆన్లైన్ వేధింపుల కేసులో నిందితుడి అరెస్టు
సిటీబ్యూరో: యువతిని ఆన్లైన్లో వేధింపులకు గురిచేస్తున్న నగరానికి చెందిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తన వ్యక్తిగత ఫొటోలను నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేసి అందులో పోస్టు చేస్తూ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ జూనియర్ సివిల్ జడ్జి ఫిర్యాదు మేరకు రామంతపూర్కు చెందిన మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. సైబర్క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం...2010లో నిందితుడు మహేశ్ బాధితురాలితో కలిసి జూనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్న సమయంలో వారికి పరిచయం ఏర్పడింది. దీనిని అలుసుగా తీసుకున్న అతను ఫోన్లో మాట్లాడాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో మహేశ్ బాధితురాలి ప్రతిష్టను దిగజార్చేందుకుగాను ఆమె పేననకిలీ ఫేస్బుక్ ఖాతాను క్రియేట్ చేసి ఆమె వ్యక్తి గత ఫొటోలు పోస్టు చేశాడు. బాధితురాలి ఫిర్యాదువ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
శాడిస్ట్ భర్త !
► అదనపు కట్నం తెస్తేనే మొదటి రాత్రి ► పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు బెంగళూరు(బనశంకరి) : అదనపు కట్నం తీసుకువస్తేనే ఫస్ట్నైట్ అంటూ కండిషన్ పెట్టిన ఓ శాడిస్టు భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బసవేశ్వర నగరలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బసవేశ్వరనగర్ లోని మహాగణపతి లేఔట్కు చెందిన మహేశ్తో 2016 మే ఒకటిన గౌరి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన తొలిరాత్రి నుంచే అదనపు కట్నం తీసుకురావాలని భార్యను సంసారానికి దూరం పెట్టాడు. ఎంత సర్దుకుపోదామని అనుకున్నా అతడు పెట్టే బాధలు భరించలేక ఈ ఏడాది జనవరిలో పుట్టింటికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అత్త శకుంతల, మామ శివ నారాయణ వేధింపులు కూడా ఇందుకు తోడయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఈనెల 19న బసవేశ్వర నగర పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాహుల్పై విమర్శలు.. రాజీనామా
కొల్లం: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళ యువజన కాంగ్రెస్ నేత సీఆర్ మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిపై విమర్శలు చేయడంపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించింది. బుధవారం మహేష్ను సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, సస్పెన్షన్ వార్త బయటకు రాక ముందే రమేష్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోవటం లేదని తెలిపారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు తెలిపారు. 2016 ఎన్నికల్లో కొల్లం నుంచి పోటీ చేసిన ఆయన సీపీఎం అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా, మంగళవారం రమేష్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా రాహుల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం చేతకాకుంటే వైదొలగాలని కోరారు. అలాగే, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఏకే ఆంటోనీని మౌన మునిగా అభివర్ణించిన విషయం విదితమే. -
సూపర్ స్టార్కు సైడ్ ఇచ్చాడు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు మురుగదాస్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి సూపర్ స్టార్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మహేష్ సినిమా రిలీజ్ అవుతున్న జూన్ 23నే కోలీవుడ్ టాప్ హీరో అజిత్ మూవీ, వివేగంను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. అదే జరిగితే కోలీవుడ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్న మహేష్, మురుగదాస్ల సినిమాకు కష్టాలు తప్పవు. అయితే వివేగం టీం తాజా ప్రకటనతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వివేగం సినిమాను ముందుగా అనుకున్నట్టుగా జూన్ 23న కాకుండా ఆగస్ట్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో పోస్ట్ ప్రొడక్షన్కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు గ్యాప్ దొరికింది. -
ప్రతి సినిమా వైవిధ్యభరితమే..
సినీ దర్శకుడు చంద్రమహేష్ రావులపాలెం(కొత్తపేట) : ప్రేయసి రావే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన చంద్రమహేష్ ఇంత వరకూ తాను చేసిన ప్రతి సినిమా వైవిధ్యభరితమైనవేనని అంటున్నారు. తన స్నేహితులు పడాల రామిరెడ్డి, సబెళ్ల సత్యనారాయణరెడ్డి(సన్ని)లను కలిసేందుకు సోమవారం నిర్మాత సామా సురేంద్రరెడ్డితో కలసి రావులపాలెం వచ్చిన ఆయన కాసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది కాకినాడ. సినిమాలపై ఇష్టంతో సురేష్ ప్రొడక్షన్స్లో చేరాను. కె.మురళీమోహనరావు, సురేష్కృష్ణ, జయంతి సీ పరాన్జీ, సురేష్ వర్మ, బోయిన సుబ్బారావు, జంధ్యాల వంటి దర్శకుల వద్ద అసిస్టెంటుగా పనిచేశా. 1999లో ప్రేయసి రావే చిత్రంతో దర్శకుడిగా మారా. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు ఉత్తమ కొత్త దర్శకుడిగా నంది అవార్డు లభించడంతోపాటు చిరంజీవి, కె.విశ్వనాథ్ వంటి పెద్దల ప్రసంశలు లభించాయి. అలాగే అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం విషం, లవ్ ఇన్ హైదరాబాద్ చిత్రాలకు దర్శకత్వం వహించా. ఇప్పటి దాకా తెలుగులో తొమ్మిది సినిమాలు చేశా. హనుమంతు సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నా. రెడ్ అలర్ట్ అనే సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని నిర్మించాం. అయితే తెలుగు, కన్నడలో రెడ్ అలర్ట్, మళయాళంలో హై అలర్ట్, తమిళంలో చెన్నై నగరంగా విడుదల చేయాలని అనుకున్నా, నిర్మాత మృతితో ఒకే సారి చేయలేకపోయాం. తమిళంలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించింది. ఒక ప్రేమకథను సిద్ధం చేసి ఒక యువ హీరోకి చెప్పాను. ఆయనకు నచ్చడంతో త్వరలో ఈ సినిమా తెలుగులో చేయనున్నాం.’’ -
మీ సేవా కేంద్రంలో చొరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు
-
మహేష్ కొత్త సినిమా మేకింగ్ వీడియో లీక్!
-
ప్రేమికురాలిని కాపాడబోయి..
భీమవరం: పశ్చిమగోదారి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు డ్రెయిన్లో సోమవారం ఉదయం ఓ యువకుడి మృతదేహం లభించింది. ఈ మృతదేహం మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోబోతున్న తన ప్రేయసిని కాపాడేందుకు డ్రెయిన్లో దూకిన యువకుడిదిగా పోలీసులు గుర్తించారు. వివరాలు.. సుంకర పద్దయ్య వీధికి చెందిన పి. సత్యస్వరూప(18), చిన్నఅప్పారావుతోటకు చెందిన కనిమిరెడ్డి మహేష్(25) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో అమ్మాయి తరఫు వారు యువకుడిని హెచ్చరించారు. ఈ క్రమంలో కొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఈ నేపథ్యంలో గత నెల 31(శనివారం) సాయంత్రం లంకపేట సమీపంలో వీరిద్దరు కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవ పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన సత్యస్వరూప వంతెన పై నుంచి డ్రెయిన్లోకి దూకింది. వెనుకనే బైక్పై వచ్చిన మహేష్ ఆమెను రక్షించేందుకు అందులోకి దూకాడు. ఇది గుర్తించిన స్థానికులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం ఉదయం మహేష్ మృతదేహం లభించింది. స్వరూప కోసం గాలింపు చర్యలు కొన సాగుతున్నాయి. -
హాస్య నటులు కూడా హీరోలే
‘‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అదే ఐడియా నలుగురు ప్రేమికుల జీవితాన్ని ఎలా మార్చిందన్నదే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కథ’’ అన్నారు కథానాయిక సలోని. నవీన్చంద్ర, శ్రుతీ శోధి, పృధ్వీ, సలోని ముఖ్య పాత్రల్లో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సలోని చిత్ర విశేషాలు పంచుకున్నారు. ⇒ లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో మహేశ్ పాత్రలో ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, సమంత పాత్రలో నేను ఇంటర్మీడియట్ విద్యార్థులుగా కనిపిస్తాం. మా ఇద్దరి మధ్య వచ్చే పాటకు సెట్స్లో క్లాప్స్, విజిల్స్ కొట్టారు. ⇒ కామెడీ సీన్స్ చేయడం చాలా కష్టం.నా దృష్టిలో హాస్య నటులు కూడా హీరోలే. నా మనసుకు నచ్చితే ఎవరితోనైనా నటిస్తా. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రా వదులుకోను. ఈ చిత్రదర్శకుడు సత్తిబాబు కూల్ పర్సన్. తనకు కావాల్సిన నటన రాబట్టుకున్నారు. రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. ⇒హిందీలో అమితాబ్ బచ్చన్గారితో ఓ చిత్రం డిస్కషన్స్లో ఉంది. కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
ఆ పాట కోసం నీళ్లు తాగలేదు!
టాలీవుడ్లో చేతి నిండా వరుస చిత్రాలతో బిజీగా దూసుకెళుతున్న కథానాయిక రకుల్ ప్రీత్సింగ్. రామ్చరణ్కు జోడీగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన ‘ధృవ’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ పత్రికలవారితో పలు విశేషాలు పంచుకున్నారు. ♦ ‘అందరూ అనుకుంటున్నట్లు ‘ధృవ’లోని ‘పరేషానురా’ పాట కోసం వాటర్ మిలన్ డైట్ తీసుకోలేదు. అయితే ఆ పాట కోసం చాలా కేర్ తీసుకున్నా. పొట్ట ఉబ్బెత్తుగా ఉండకూడదని ఉదయం 9:30 నుంచి సాయంత్రం వరకూ నీళ్లు తాగేదాన్ని కాదు. మరీ దాహం వేస్తే నోరు తడుపుకునేదాన్ని. నీరసంగా ఉంటే ఒకటో, రెండో పుచ్చకాయ ముక్కలు తినేదాన్ని. అలా నాలుగు రోజులున్నా. ♦ ‘బ్రూస్లీ’ ఆశించని ఫలితం దక్కకపోయినా, తర్వాత ‘ధృవ’ కోసం నన్ను అడిగారు. ‘కిక్ 2’ సరిగ్గా ఆడకున్నా నాపై నమ్మకంతో సురేందర్రెడ్డిగారు ఈ అవకాశమిచ్చారు. అయినా, సినిమా జయాపజయాలు మా చేతుల్లో ఉంటాయా? హిందీలో షారుఖ్ ఖాన్, కాజోల్, సల్మాన్ ఖాన్, రాణీ ముఖర్జీ హిట్ పెయిర్ అంటారు. అలాగని వారు చేసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయా? ♦ నేను ఒక్క రాత్రిలో స్టార్ని కాలేదు. అందుకు చాలా టైమ్ పట్టింది. కానీ, షూటింగ్ పూర్తవగానే నేను మామూలు రకుల్లానే ఉంటా. ఇప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగమ్మాయిని అయిపోయా. మా తమ్ముడు కూడా నటుడిగా సినీ రంగంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ♦ రాజమౌళిగారితో పని చేయాలన్నది నా డ్రీమ్. పూర్తి స్థాయి రొమాంటిక్ మూవీ చేయాలని ఉంది. ప్రస్తుతం మహేశ్, కార్తీ, నాగ చైతన్య, సాయిధరమ్ తేజ్ చిత్రాలకు కమిట్ అయ్యా. ‘విన్నర్’లో అథ్లెట్ పాత్రలో కనిపిస్తున్నా. ♦ రానున్న కొత్త ఏడాదిని గోవాలో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోనున్నా’ అని రకుల్ ప్రీత్ చెప్పారు. -
వికారాబాద్ జిల్లాలో దారుణం
వికారాబాద్: జిల్లాలోని బొమ్రస్ పేట మండలం దుగ్యాలలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని ఓ వ్యక్తి కడతేర్చాడు. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని చంపి మహేష్ కు జైలుకు వెళ్లొచ్చాడు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
మహేష్-మురుగ: వాయిదాకు కారణం ఇదే!
మహేష్బాబు-మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్లుక్గానీ, అఫీషియల్ అప్డేట్గానీ ఏమీ వెలువడకున్నా మహేష్ అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళికి మహేష్ ఫస్ట్లుక్ను విడుదల చేసి అభిమానుల్ని ఖుషీ చేయాలని చిత్రయూనిట్ భావించింది. అందుకు ఏర్పాట్లు కూడా జరిగినట్టు కథనాలు వచ్చాయి. కానీ, దీపావళి రోజున అలాంటిదేమీ విడుదల కాలేదు. సినిమా టైటిల్పై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం వల్లే ఈ చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేయలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాష (తెలుగు-తమిళ) చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పలు టైటిళ్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీ చిత్రయూనిట్ మాత్రం 'ఏజెంట్ శివ' టైటిల్కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఒక్కసారి సినిమా టైటిల్పై స్పష్టత వస్తే వెంటనే ఫస్ట్లుక్ విడుదల చేయవచ్చునని వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతోంది. పూర్తిగా సరికొత్త రీతిలో ఈ సినిమాలో మహేష్ పాత్రను మురుగదాస్ తీర్చిదిద్దాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్లుక్ విషయంలో త్వరలోనే మహేష్ అభిమానుల ఎదురుతెన్నులు ముగిసే అవకాశముందని ఆ వర్గాలు అంటున్నాయి. -
ఘోరం..
ఆడుకుంటూ.. మృత్యు ఒడికి రోడ్ రోలర్ కింద పడి విద్యార్థి మృతి ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు ధర్మవరం రూరల్ : రోలర్ కిందకు రాళ్లు విసురుతూ.. అవి అణిగిపోతుండటాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు అదే రోలర్ కింద పడి మృతి చెందిన హదయవిదారక సంఘటన ఓబుళనాయునిపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... ఎస్సీ కాలనీకి చెందిన చంద్రశేఖర్, భాగ్యమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చివరి సంతానమైన మహేష్ (6) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎస్సీ కాలనీ నుంచి కొందరు పిల్లలు పాఠశాలకు బయల్దేరారు. రోడ్డు పనుల్లో భాగంగా అక్కడ రోలింగ్ చేస్తున్న రోడ్ రోలర్ కనిపించింది. రోలర్ కింద కంకరరాళ్లు అణిగిపోతుండటం చూసిన చిన్నారులు రోలర్ కిందకు కొన్ని కంకర రాళ్లు విసురుతూ ఆసక్తిగా తిలకించారు. అలా రోలర్ వెనుకకూ, ముందుకూ కదులుతోంది. డ్రైవర్ వెనుకవైపునకు తిరిగి రోలింగ్ చేస్తుండగా ముందుభాగంలో రాళ్లు విసరడానికి వచ్చిన మహేష్ ప్రమాదవశాత్తు రోలర్చక్రం కిందపడి అక్కడికక్కడే మతి చెందాడు. విద్యార్థి మతదేహం పక్కనే పలక, పుస్తకం, ప్లేటు చెల్లాచెదురయ్యాయి. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. చిన్నారి మతితో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రూరల్ సీఐ మురళీ కష్ణ, ఎస్ఐ నాగశేఖర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, మతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పతికి తరలించారు. -
నాడు తండ్రి, నేడు కుమారుడు..
జంబూ సవారీని విజయవంతంగా నడిపించిన మావటి మహేష్ నాడు తండ్రి జంబూ సవారీని విజయవంతంగా నడిపించగా నేడు కుమారుడు అదే బాధ్యతను తన భుజనపై వేసుకుని 2016 జంబూ సవారీని మావటి మహేష్ విజయవంతంగా నడిపించాడు. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోస్తున్న అర్జున తొలి అడుగు వేసే ముందు తన తండ్రి దొడ్డమాస్తిని గుర్తుకు చేసుకుని ధైర్యంగా అర్జునను నడిపించానని మహేష్ అన్నారు. మావటిగా తొలి అనుభవాన్ని ఆయన మీడియాతో మాట్లాడారు. జంబూ సవారీలో పాల్గొనే ముందు అర్జున గుణ గణాలను తన తండ్రి ద్వారా తెలుసుకుని, ఏడాదిగా అర్జునను గమనిస్తున్నట్లు చెప్పారు. కొన్నేళ్లుగా తన తండ్రి సంరక్షణలో అర్జున నడిచిందని, జంబు సవారీలో తొలి అనుభవాన్ని తాను మరిచిపోలేనని మహేష్ అన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
► నలుగురు ఆడపిల్లలు సంతానం ► భార్య మళ్లీ నిండు గర్భిణి ► ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ యజమాని బలవన్మరణం ► వీధినపడ్డ కుటుంబం ► మహమ్మదాబాద్లో విషాదం –––––––––––––––––––––– తలకొరివి పెట్టేవాడు కొడుకు మాత్రమేనని బలంగా నమ్మాడు. ఒకటి కాదు.. రెండు కాదు..వరుసగా నాలుగు కాన్పుల్లోనూ ఆడపిల్లలే పుట్టినా వంశోద్ధారకుడు కావాలన్న కోరిక అతనిలో తగ్గలేదు. భార్య ఐదోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అటు బతుకు భారం కాగా, ఈసారైనా కొడుకు పుడతాడో, లేదోనన్న బెంగతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అందరినీ అనాథలను చేసి అతను ఒంటరిగా వెళ్లిపోయాడు. ––––––––––––––––––––––––––––––––––––– అమడగూరు మండలం మహమ్మదాబాద్కు చెందిన కమటం మహేశ్(34) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి గుళికల మందు తాగి ఇంట్లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి దాటాక గురకలు రావడాన్ని భార్య, కుటుంబ సభ్యులు గుర్తించారు. భయంతో వెంటనే అతన్ని కదిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి.. ముదిగుబ్బ పాతవీధికి చెందిన మీనమ్మతో ఎనిమిదేళ్ల కిందట మహేశ్ వివాహమైంది. వారికి వరుసగా నలుగురు ఆడపిల్లలలు సంతానం. కొడుకు కావాలన్న కోరికతో మళ్లీ ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం ఎనిమిది నెలల నిండు గర్భిణి. మహేశ్ తండ్రి వారపు సంతలకు వెళ్లి కూరగాయలు అమ్మేవారు. కొడుకు ఆటో నడుపుతూ కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే ఆటో మరమ్మతులకు గురి కావడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. గర్భవతిగా ఉన్న భార్యను ఆస్పత్రికి పిల్చుకెళ్లి చూపించే స్థోమత కూడా లేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక చివరకు మహేశ్ తనువు చాలించాడు. రంగంలోకి పోలీసులు విషయం తెలిసిన వెంటనే అమడగూరు ఎస్ఐ రఫీ తమ సిబ్బందితో శుక్రవారం మహమ్మదాబాద్ చేరుకున్నారు. ఆత్మహత్యపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, మతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ––––––––––––––––––––––––––––– ఎంత పని చేశావయ్యా.. జీవితాంతం తోడూనీడగా ఉంటావనుకుంటినే. నలుగురు ఆడపిల్లలకు తండ్రయ్యావు. ఇప్పుడు నేను మళ్లీ గర్భవతిని. ఈ సమయంలో అండగా ఉంటావనుకుంటే మమ్మల్నందర్నీ అనాథలను చేసి ఎల్లిపోతివి కదయ్యా.. ఇక మేం ఎవరి కోసం బతకాలి? ఈ పిల్లలను ఎలా సాకాలి? ముసలోళ్లైన మీ అమ్మానాన్నను ఇక ఎవరు చూసుకుంటారు? నాపై ఇంత భారం మోపి వెళ్లిపోతే నేనెలా భరించగలననుకున్నావ్..అంటూ మహేశ్ మతదేహం వద్ద భార్య మీనమ్మ ప్రశ్నిస్తూ ఏడ్వడం అందరి హదయాలను బరువెక్కించింది. నాన్న ఎందుకు పలకడం లేదో, అందరూ ఏడుస్తున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో, అసలు నాన్నకేమైందో కూడా తెలియక అతని నలుగురు ఆడబిడ్డలు అమాయక చూపులతో దిక్కులు చూస్తుండడం కఠిన హదయాలను సైతం కరిగించింది. పిల్లలకు ఇక ఏమని సమాధానం చెప్పాలో తెలియక మీనమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. ––––––––––––––––––––––––––––––––––