master plan
-
అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్న కూటమి సర్కారు
-
‘ప్లాన్’ ప్రకారం నిర్లక్ష్యం
వరంగల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) ఆధ్వర్యంలో కొత్త, పాత పురపాలక సంఘాలకు కొత్త బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ల అమలు పథకం అటకెక్కింది. గత ప్రభుత్వ హయాంలో నగరాలు, పట్టణాల స్థితిగతులు అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్న డీటీసీపీ ఆదేశాల మేరకు.. మున్సిపాలిటీలలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అన్నీ సిద్ధం చేసినా ఆమోదానికి నోచుకోలేదు. – సాక్షి ప్రతినిధి, వరంగల్2022లో ప్రణాళికలు సిద్ధమైనా..2022లో పురపాలకశాఖ ఆదేశాల మేరకు ఆ ఏడాది జూన్ నెలాఖరు వరకు ప్రణాళికలు సిద్ధమైతే.. 2023 నుంచి పలు మున్సిపాలిటీలు, పట్టణాల మాస్టర్ప్లాన్కు మోక్షం కలుగుతుందని భావించినా కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘అర్బన్ తెలంగాణ.. అభివృద్ధి నమూనా’పేరిట ‘మాస్టర్ప్లాన్–2050’తయారు చేయాలని నిర్ణయించి ఆదేశించినా ఇంకా పట్టాలు ఎక్కడం లేదు. జనగామ పురపాలిక 1953లో ఏర్పడింది. 1987లో దీని పరిధిలో మాస్టర్ప్లాన్ అమలుకు అడుగులు పడగా, 1990లో అమల్లోకి వచి్చంది. డీటీసీపీ ఆదేశాలతో 2015లో కౌన్సిల్ తీర్మానం, ప్రభుత్వ ఆదేశాలతో 2017లో రివైజ్డ్ మాస్టర్ప్లాన్ రూపొందించాలని కోరుతూ వినతి పంపించారు. సుమారు మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా, మాస్టర్ప్లాన్ను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో కొత్త మాస్టర్ప్లాన్ ఆవశ్యంగా మారింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ప్లాన్ మూలన పడింది. ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏయూడీఏ)ని తెరపైకి తెచ్చినా.. భవిష్యత్ అభివృద్ధి, ప్రయోజనాలకు కీలకమైన మాస్టర్ప్లాన్ అమలుకు నోచడం లేదు. పూర్వ జిల్లాలోని కొత్త మున్సిపాలిటీల్లో మాస్టర్ప్లాన్ అమలుకు.. లక్సెట్టిపేట్ మున్సిపాలిటీ మాస్టర్ప్లాన్పై కసరత్తు జరిగినా పూర్తి దశకు చేరలేదు. మాస్టర్ప్లాన్ అమలైతే ప్రయోజనాలివీ.. మాస్టర్ప్లాన్ ఆమోదం పొందితే అందులో దాదాపు 40 విభాగాలు ఉంటాయి. వాణిజ్య, నివాసాలకు ప్రత్యేకంగా జోన్లు కేటాయిస్తారు. చెరువులు, కుంటలు, తాగునీటి పైపులైన్లు, మురుగు, వర్షపు నీటి కాలువలు, రహదారుల వెడల్పు వంటి వాటిని ప్రత్యేకంగా కేటగిరీలుగా విభజిస్తారు. కొత్త ఇళ్లు, వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులు మాస్టర్ప్లాన్ ప్రకారమే ఇస్తారు. రహదారుల వెడల్పు ఎంత ఉండాలనేది ఖరారు చేస్తారు. మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారు. ఒకసారి ఆమోదించాక 20 – 40 ఏళ్ల పాటు పట్టణ ప్రణాళిక కార్యాచరణ మొత్తం దానికి అనుగుణంగానే సాగుతుంది. జీఐఎస్ ద్వారా ఇళ్లకు అనుమతులు, రహదారుల వెడల్పు వంటి సమాచారం ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఆస్తిపన్ను, వాణిజ్య లైసెన్సు జారీ, పచ్చదనం, మౌలిక సదుపాయాలకు ఇదే ఆధారం.వరంగల్ ఆర్డీడీ పరిధిలో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 46 మున్సిపాలిటీలు, 21 పట్టణాలకు 2023లో కొత్త మాస్టర్ప్లాన్ల రూపకల్పన జరిగింది. ఇందులో 17 పట్టణాలకు మాస్టర్ప్లాన్ను రివిజన్ చేశారు. ఎలాంటి ప్లాన్ లేని 21 పట్టణాలకు కొత్తగా ప్లాన్ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ప్లాన్ – 2041 ఇటీవలే ప్రభుత్వ ఆమోదానికి నోచుకుంది. కానీ పూర్తి స్థాయిలో డీపీఆర్ కాలేదు. కాగా మందమర్రి, మంచిర్యాల, కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ, వైరా, కొత్తపల్లి మాస్టర్ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు 2012, 2013, 2019లలో ఆమోదం పొందాయి. వైరా ఖమ్మం (సుడా)లో, కొత్తపల్లి కరీంనగర్ (సుడా)లో కలిశాయి. ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్ (సుడా), ఖమ్మం (సుడా) 2018 నుంచి కేంద్ర అమృత్ పథకంలో ఉన్నాయి. రామగుండం అమృత్ స్కీం మాస్టర్ప్లాన్ రివిజన్ కూడా జరిగింది. జనగామ, జగిత్యాల, సిరిసిల్ల, కాగజ్నగర్, నిర్మల్, భైంసా, పాల్వంచ, కొత్తగూడెంలలో పాత మాస్టర్ప్లాన్ను రివిజన్ చేశారు. ఎలాంటి ప్లాన్ లేని సత్తుపల్లి, మణుగూరు, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, ఇల్లందు, బెల్లంపల్లి జమ్మికుంట, వర్ధన్నపేట, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, మంధని, సుల్తానాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట్, క్యాతనపెల్లి, చొప్పదండి, రాయకల్, ధర్మపురి, ఖానాపూర్ పట్టణాలు కొత్త మాస్టర్ ప్లాన్కు నోచుకోలేదు. -
HMDA Master Plan: అంతులేని పొర‘పాట్లు’
సాక్షి, హైదరాబాద్: 👉‘నాగోల్ నుంచి కుంట్లూర్ వరకు రెండువందల అడుగుల వెడల్పుతో రోడ్డు ఉన్నట్లు మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. చుట్టుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. రోడ్డు వస్తుందో, రాదో తెలియదు కానీ మా స్థలం రోడ్డు మధ్యలో ఉన్నట్లు చెప్పి ఎల్ఆర్ఎస్ నిరాకరించారు. ఏళ్లు గడిచాయి. అక్కడ రోడ్డు నిర్మించలేదు. అలాగని మాస్టర్ప్లాన్ సవరించలేదు. నాతో పాటు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయాను’ నాగోల్కు చెందిన రాంరెడ్డి ఆందోళన ఇది. తప్పుల తడకలాంటి హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ కారణంగా ఆ స్థలాన్ని అమ్ముకోలేక, ఎలాంటి నిర్మాణం చేపట్టలేక మానసికంగా ఎంతో ఆవేదన గురవుతున్నారాయన. 👉‘తుర్కయంజాల్ సమీపంలో ఒక వ్యక్తి గతంలో 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో 150 ఫీట్ల రోడ్డు పోతున్నట్లుగా మాస్టర్ప్లాన్లో ఉందన్నారు. కానీ.. ఆ ప్లాట్ పక్కనే ఉన్న మరో ప్లాట్కు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఇదే అంశంపై సదరు బాధితుడు హెచ్ఎండీఏ అధికారులను సంప్రదించగా ‘మాస్టర్ప్లాన్ ఒక్కటే తమకు ప్రామాణికం’ అని సెలవిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఎలాంటి పరిష్కారం లభించలేదు.వేలాది తప్పులు.. హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 2031 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2013 బృహత్ ప్రణాళికను రూపొందించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ, ఎంసీహెచ్, ఎయిర్పోర్ట్ అథారిటీ, సైబరాబాద్ అథారిటీ, హెచ్ఎండీఏ ప్రణాళాకలన్నింటినీ కలిపి బృహత్ ప్రణాళికను తయారు చేశారు. కానీ.. అప్పట్లో దీనిపై ఎలాంటి శాస్త్రీయమైన అధ్యయనం చేయకపోవడంతో అంతులేని తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు లేని చోట ఉన్నట్లు, ఉన్న చోట లేనట్లు మాస్టర్ ప్లాన్లో నమోదైంది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని వందలాది గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లు, ఊళ్లు మాయమైనట్లుగా కూడా గుర్తించారు. అయిదు మాస్టర్ప్లాన్లను సమన్వయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సుమారు 3000కు పైగా తప్పులు ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. దీంతో 50 వేల మందికి పైగా బాధితులు ఎల్ఆర్ఎస్ను తీసుకొనే అవకాశం కోల్పోయారు. ఆ తప్పులు ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉన్నాయని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలింది నిరాశే.. సమగ్ర మాస్టర్ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ మాస్టర్ప్లాన్లో తప్పుల కారణంగా నష్టపోయిన బాధితులకు ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ‘ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని, మాస్టర్ప్లాన్లో తప్పులను సవరిస్తారని అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ నిరాశా నిస్పృహలే మిగులుతున్నాయి’అని బీఎన్రెడ్డి నగర్కు చెందిన చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు 2031 మాస్టర్ ప్లాన్ను సవరించి కొత్తది రూపొందించేందుకు అయిదారేళ్లుగా ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు. మాస్టర్ప్లాన్–2041 రానుందన్నారు. ఆ తర్వాత ట్రిపుల్ వన్ జీఓలోని ప్రాంతాలన్నింటినీ కలిసి హెచ్ఎండీఏ పరిధిలోని 7,200 చ.కి.మీలకు వర్తించేలా మహా మెగా మాస్టర్ప్లాన్ అన్నారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రిపుల్ ఆర్ వరకు వర్తించేలా సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని భావిస్తోంది. మాస్టర్ప్లాన్– 31 కారణంగా నష్టపోయిన బాధితులు దశాబ్ద కాలంగా ఎలాంటి పరిష్కారం లభించక పడిగాపులు కాస్తూనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం 2050 బృహత్ ప్రణాళిక.. తెలంగాణ మూడు భాగాలుగా విభజించి 2050 వరకు దశలవారీగా చేపట్టాల్సిన అభివృద్ధిపై బృహత్ ప్రణాళికను రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని అర్బన్గా, ఔటర్రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు ఉన్న భూభాగాన్ని సబర్బన్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రీజినల్ రింగ్రోడ్డు నుంచి ఉండే మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్గా పరిగణిస్తారు. ఇందుకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ పరిధి ప్రస్తుతం ఉన్న 7,200 చ.కి.మీ నుంచి సుమారు 10 వేల చదరపు కి.మీ వరకు పెరగనుంది. ఈ మొత్తం భూభాగానికి వర్తించేవిధంగా ‘మెగా మాస్టర్ ప్లాన్ –2050’ని రూపొందిస్తారు. ఇందులో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సమగ్ర ప్రజా రవాణా సదుపాయాల ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్) ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక, బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు ఉంటాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెగా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకుండాపోయింది. -
హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్.. రూ.17,212 కోట్ల అంచనా వ్యయం!
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా మురుగు నీరు చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.17,212.69 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ ‘సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్’కు రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం 2.0 కింద మాస్టర్ ప్లాన్ను చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఆర్థిక చేయూత అందించాలని ప్రతిపాదించింది. చారిత్రక హైదరాబాద్ నగరంలో ఏళ్లనాటి మురుగు నీటి పైపులైన్ వ్యవస్థ కొనసాగుతోంది. శివారుతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో సైతం సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేకుండాపోయింది. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన మురుగు కాల్వలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుతం 9,769 కిలో మీటర్లు మాత్రమే పైపులైన్ నెట్వర్క్ విస్తరించి ఉంది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 2,656 కి.మీ, ఓఆర్ఆర్ పరిధిలో 4,378 కి.మీ మేర విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నా.. పెండింగ్లోనే మగ్గుతున్నాయి. దీంతో సమగ్ర కార్యాచరణలో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. 80 శాతం మురుగు.. మహా నగరంలోని 80 శాతం మురుగు మూసీలో చేరుతోంది. మిగిలిన 20 శాతం స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. దానికి ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల పొడవునా మురుగు కలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 2,815 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్డీలు ఉండగా, మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మురుగు నీరు మూసీలో చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. అందులో భాగంగానే పైపులైన్ నెట్వర్క్ వ్యవస్థ విస్తరణతో పాటు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచినట్లు తెలుస్తోంది.7,034 కి.మీ సీవరేజీ నెట్వర్క్.. హైదరాబాద్తో పాటు శివారు, అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన స్థానిక సంస్ధల (యూఎల్బీ) పరిధిలో సుమారు 7,034 కి.మీ పొడవున మురుగునీటి పైపులైన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. మొత్తమ్మీద ఓఆర్ఆర్ యూఎల్బీల పరిధిలో 27 పురపాలక సంఘాలను కలుపు కొని సుమారు 4,378 కి.మీ, జీహెచ్ఎంసీ పరిధి లోని శివారు, కోర్ సిటీ పరిధిని కలుపుకొని దాదా పు 2,656 కి.మీ పొడవున సీవరేజీ నెట్వర్క్ పైపులైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీలోని శివారు పరిధిలో మూడు ప్యాకేజీల్లో తొమ్మిది సర్కిల్స్ కలుపుకొని 2,232 కి.మీ, కోర్సిటీ పరిధిలోని 4 జోన్లలో 424 కి.మీ పైపులైన్ నెట్వర్క్ను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రూ.4 వేల కోట్లతో సీవరేజీ ప్లాంట్లు.. మరోవైపు మూసీపై మురుగు నీటిశుద్ధి కోసం సుమారు 62 సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలకు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర సర్కారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రాజెక్టును సైతం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇప్పటికే మూడు ప్యాకేజీల్లో మొత్తం 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మాణాల ద్వారా సుమారు 1259.50 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి చేయాలని నిర్ణయించింది. ఇటీవల అమృత్ పథకం కింద 39 ఎస్టీపీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా మూసీలో పూర్తిగా శుద్ధి చేసిన జలాలనే వదిలేలా మరికొన్ని ఎస్టీపీల నిర్మాణాలకు ప్రతిపాదించింది. చదవండి: హైదరాబాద్లో మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి? -
60 రోడ్లు.. 1,712 కిలోమీటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే.. రీజనల్ రింగ్ రోడ్డులో భాగంగా 1,712 కిలోమీటర్ల పొడవునా మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి, రెండో దశలో 1,281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, మూడో దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. 200 అడుగుల వెడల్పుతో.. రేడియల్ రోడ్లు 200 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్ వంద అడుగులు కాగా.. భవిష్యత్తు అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్గా ఉంచుతారు. ఉత్తర భాగంలో తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్లను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో చౌటుప్పల్–షాద్నగర్–సంగారెడ్డిలను కలుపుతూ 194 కిలోమీటర్ల మేర రీజనల్ రోడ్డు ఉండనుంది. లీ అసోసియేట్స్కు 10 రేడియల్ రోడ్లు ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవల బాధ్యతలను కెనడాకు చెందిన లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా సంస్థకు అప్పగించింది. ఉత్తర భాగంలో ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను ఈ సంస్థకు అప్పగించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఆర్డీసీ, ఓఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. మూడు దశల్లో రేడియల్ రోడ్ల స్వరూపమిదీ: ఫేజ్–1: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 748 కి.మీ. » 5 రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్రోడ్డుకు అనుసంధానమై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ గుండా సాగుతాయి. » ఓఆర్ఆర్తో అనుసంధానమయ్యే రోడ్లలో.. యాద్గార్పల్లి నుంచి ఇటిక్యాల వరకు, కీసర నుంచి దత్తాయిపల్లి, నాగులపల్లి నుంచి మందాపూర్, నార్సింగి నుంచి చీమలదరి, రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు–17 నుంచి కంకాల్ వరకు నిర్మించనున్నారు. అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్లే మెదక్, నాగ్పూర్, ముంబై, వికారాబాద్, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, మందాపురం, వరంగల్ జాతీయ రహదారులను, నాగార్జునసాగర్, కరీంనగర్ రాష్ట్ర రహదారులను కలుపుతూ ట్రిపుల్ ఆర్ సాగుతుంది.ఫేజ్–2: రేడియల్ రోడ్ల సంఖ్య: 16; రోడ్ల పొడవు: 533 కి.మీ. » ఇందులో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు అవసరాల నిమిత్తం రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల వెడల్పుతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ ఉంటుంది. ళీ ఇక ఆదిబట్ల నుంచి తుర్కాలకుంట వరకు.. కోహెడ నుంచి కోతులాపురం.. పెద్ద అంబర్పేట నుంచి మందోళ్లగూడెం.. కొర్రెముల నుంచి ఎర్రంబెల్లి.. పడమట సాయిగూడ నుంచి దాతర్పల్లి.. ధర్మవరం నుంచి చేబర్తి.. మునీరాబాద్ నుంచి రంగంపేట.. ఓఆర్ఆర్ ఇంద్రజీత్ మెహతా నుంచి తియల్పూర్.. ఎగ్జిట్ నంబర్–4ఏ నుంచి కాసాల.. ఎగ్జిట్ నంబర్–4 నుంచి శివంపేట.. కర్దనూరు నుంచి గోపులారం.. వెలిమల నుంచి తేలుపోల్.. జన్వాడ ఎస్ఆర్ఆర్సీ క్రికెట్ గ్రౌండ్ నుంచి అక్నాపూర్.. ఎగ్జిట్ నంబర్–15 నుంచి మధురాపూర్.. ఎగ్జిట్ నంబరు–15 నుంచి కేశంపేట వరకు రేడియల్ రోడ్లు ఉంటాయి.ఫేజ్–3: లింక్ రోడ్ల సంఖ్య: 28; రోడ్ల పొడవు: 431 కి.మీ. » ఫేజ్–1 లేదా ఫేజ్–2లను కలుపుతూ ట్రిపుల్ ఆర్ వరకు ఉంటాయి. » ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్లను కలుపుతూ 18 లింక్ రోడ్లు. అలాగే ఓఆర్ఆర్, గ్రీన్ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులను అను సంధానం చేస్తూ 10 లింక్ రోడ్లు ఉంటాయి. » రావిర్యాల నుంచి గుమ్మడవల్లి.. మాల్ నుంచి వట్టిపల్లి.. గున్గల్ నుంచి కొత్తాల.. ఇబ్రహీంపట్నం నుంచి జనగాం.. కొత్తూరు నుంచి చౌలపల్లి.. తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా తలకొండపల్లి.. నేదునూరు క్రాస్రోడ్ నుంచి చీపునుంతల.. కడ్తాల్ నుంచి చుక్కాపూర్.. రూప్సింగ్ తండా నుంచిపాంబండ.. ఇలా లింక్ రోడ్లు నిర్మిస్తారు. -
ప్రత్యామ్నాయ నేతాన్ని తయారుచేస్తున్న బీఆర్ఎస్
-
వైఎస్ వివేకా కేసు..బయటపడ్డ కుట్ర..పుత్రిక డ్రామా
-
మూసీ సుందరీకరణకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాలా రూ.60 వేల కోట్లు. దశల వారీగా మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన సర్కారు.. నది సుందరీకరణ, నిర్వహణ కోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. 2050 మాస్టర్ప్లాన్కు అనుగుణంగా నది పరిసరాలను జోన్ల వారీగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా మూసీ వెంట రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నదీ గర్భం నుంచి ఇరువైపులా కిలోమీటరు మేర ఇంపాక్ట్ ఏరియాగా ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు యంత్రాంగం.. ఇప్పటికే నది హద్దులు, ఆక్రమణలపై ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా జీఐఎస్ మ్యాపింగ్ను చేసింది. ఆక్రమణలే అడ్డంకి.. మూసీ రివర్ ఫ్రంట్ను పునరాభివృద్ధి చేయాలనే ఆలోచన తొలుత 1908లోనే వచ్చింది. 1990లో కాస్త ముందుకు కదిలినా.. పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు. మురుగునీరు, ఆక్రమణలే మూసీ పునరుజ్జీవానికి ప్రధాన అడ్డకుంలుగా నిలిచాయి. 55 కి.మీ మేర నదీ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వానికి కష్టతరమైన పనే అని అంటున్నారు. నది పునరుజ్జీవం కావడానికి 15–20 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణలు సుమారు 2వేల మేర ఉంటాయని అంచనా వేసిన యంత్రాంగం.. వీటిని తొలగించేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేనప్పటికీ, కొన్నిచోట్ల పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇలాంటి కట్టడాలు 10వేల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. భూ సేకరణ చట్టం కింద వీరికి పరిహారం చెల్లించడమా? ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమా? ఇతర మార్గాలేమిటనే కోణంలో అధ్యయనం చేస్తోంది. పాతబస్తీలో మూసీ కుచించుపోయిందున ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించే ఆలోచన కూడా చేస్తోంది. జంట జలాశయాల నుంచి రోజూ నీరు గుజరాత్లో నర్మదా నది నీటిని సబర్మతికి తీసుకెళ్లిన మాదిరే గోదావరిని ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు అనుసంధానం చేయాలనేది ప్రణాళిక. మురుగునీటితో నిండి ఉన్న మూసీ నదికి ఈ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా రోజుకు 1–2 టీఎంసీల జలాల విడుదలతో మురుగు శుద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు, మురుగు నీరు కూడా నదిలో కలుస్తున్నందున మూసీ కలుషితం అవుతుందని తేలడంతో అమృత్ పథకం కింద 39 మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తోంది. వీటిద్వారా వందశాతం శుద్ధి చేసిన నీటిని నదిలోకి విడుదల చేస్తారు. వీటికి అనుబంధంగా ప్రతి రోజు జంట జలాశయాల నుంచి నీటిని వదలడం ద్వారా నదీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా.. సందర్శకులను ఆకర్షించేలా రూపొందిస్తారు. మార్గమధ్యంలో పార్కులు, బోటింగ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సబర్మతి.. మూసీ కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో పుట్టి.. నార్సింగి ఔటర్ రింగ్రోడ్డు నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ వరకు 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దేశంలోనే నది పునరాభివృద్ధి ప్రాజెక్ట్ల్లో మూసీ రివర్ ఫ్రంట్ అత్యంత ప్రతిష్టాత్మకం. నీటి నిర్వహణ, ప్రణాళిక, రవాణా, పునరావాసం, పట్టణ పునరుజ్జీవం తదితరాల కోసం రూ.60 వేల కోట్ల వ్యయం, సుమారు 36 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్లోని సబర్మతి నది పునరాభివృద్ధికి మూసీకి దగ్గరి పోలికలున్నాయి, కాకపోతే సబర్మతి అహ్మదాబాద్ నగరంలో 11 కి.మీ. మేర మాత్రమే విస్తరించి ఉండగా.. మూసీ నది హైదరాబాద్లో 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. అదీగాక సబర్మతి కంటే మూసీ పరీవాహక ప్రాంతాలు ఎక్కువ ఆక్రమణకు గురవడంతోపాటు జనసాంద్రత కలిగిన ప్రాంతాలు కావడం గమనార్హం. ప్రాజెక్టు తొలి దశ అంచనా వ్యయమిలా వెస్ట్ కారిడార్– ఈస్ట్ కారిడార్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15,000 కోట్లు ట్రంక్ లైన్కు రూ.3,000 కోట్లు రివర్ లింకేజీకి రూ.3,000 కోట్లు మూసీ మొత్తం పరీవాహక ప్రాంతం: 110 చ.కి.మీ. ఆక్రమణలున్న ప్రాంతం: 55 చ.కి.మీ. -
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ప్లాన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి పట్టణానికి ప్రతిపాదించిన మాస్టర్ప్లాన్ను వెంటనే రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కామారెడ్డి రైతు జేఏసీ నాయకులు శనివారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతమున్న పాత మాస్టర్ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. మాస్టర్ప్లాన్ రద్దు చేయాలని ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ పాలకమండలి తీర్మానించిందని, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటామని చెప్పారు. మాస్టర్ప్లాన్ రద్దు కోసం జరిగిన ఆందోళనలలో రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కేసుల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. మాస్టర్ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ చేసిన ప్రకటనపై కామారెడ్డి రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
జైల్లో బాబు మాస్టర్ ప్లాన్..
-
శాంతంగా మాట్లాడిన కేసీఆర్...కారణం ఇదేనా
-
మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కేటీఆర్ సమీక్ష
-
పుంగనూరు ఘటనాస్థలిలో ఆ రెండు వేల మంది ఎవరనే దానిపై దర్యాప్తు
-
జీవో కాపీలను వీసీ రాజారెడ్డికి ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్
-
ఈటల, కిషన్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్ర కసరత్తు చేస్తోన్న కాంగ్రెస్
-
తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్స్
-
GO 111: మాస్టర్ప్లాన్ ఇప్పట్లో లేనట్టే!
హైదరాబాద్: జీఓ 111 పరిధిలో ఎలాంటి మాస్టర్ప్లాన్ లేకుండానే భూ వినియోగ మార్పిడికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగానే అనుమతులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 111 జీఓ పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించే అవకాశం లేదు. ప్రస్తుతం బయో కన్జర్వేషన్ జోన్లోని భూములను చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్యూ) కింద వివిధ రకాలుగా వినియోగంలోకి అనుమతులను ఇస్తారు. ప్రభుత్వ అనుమతితో భూ యజమానులు తమ భూమిని పారిశ్రామిక, నివాస, వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం మార్చుకోవచ్చు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూములను, నాలా భూములను ప్రత్యేక కమిటీ ద్వారా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ద్వారా నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేస్తున్నట్లుగానే జీఓ 111 పరిధిలోని బయో కన్జర్వేషన్ భూములను కూడా మార్చుకొనేందుకు సదుపాయం ఉంటుందని ఒక అధికారి వివరించారు. ప్రస్తుతం జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను అనుమతించడం లేదు. బఫర్ జోన్ పరిధిని ఎంత వరకు అనుమతించాలనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ఎన్నికలు.. ► మాస్టర్ప్లాన్ రూపకల్పనకు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానించడం మొదలుకొని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేవరకు కనీసం18 నెలల సమ యం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం జాప్యం జరిగినా 2 సంవత్సరాలు కూడా దాటవచ్చు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు తరుముకొస్తున్న దృష్ట్యా ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండానే భూముల బదలాయింపునకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్కు సంబంధించిన జీఓ 168 ప్రకారం సీఎల్యూ అందజేయనున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హెచ్ఎండీఏ కమిషనర్ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఆమోదంతో భూమిని మార్పు చేస్తారు. ► మరోవైపు జీఓ 111 పరిధిలోని శంషాబాద్, మెయినాబాద్, గండిపేట, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, కొత్తూరు మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.32 లక్షల ఎకరాల భూములలో ఇప్పటికే సుమారు 70 శాతం భూములు సినీ, రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆయా వర్గా లకు చెందిన భూయజమానులు తమ అవసరాలకు అనుగుణంగా సీఎల్యూ తీసుకొనే అవ కాశం ఉంది. భూ వినియోగ మార్పిడికి అనుమ తిచ్చే క్రమంలో జల వనరులు, అడవులు, కొండలు, గుట్టలు, నాలాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వెసులుబాటు కల్పించనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల తర్వాతే ఒకే నగరం–ఒకే ప్రణాళిక.. ● ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం మొత్తం 5 మాస్టర్ప్లాన్లతో కూడి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్), సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), హైదరాబాద్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఏడీఏ), ఓఆర్ఆర్ మాస్టర్ప్లాన్లతో పాటు 2013లో హెచ్ఎండీఏ రూపొందించిన 2030–31 మాస్టర్ ప్లాన్ కూడా అమల్లో ఉంది. ఈ అయిదు ప్రణాళికల మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక రకాలుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ● అన్నింటిని కలిసి ఒకే బృహత్తర ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వం గతంలోనే కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలోనే గతేడాది జీఓ 111 తొలగించనున్నట్లు ప్రకటించిన అనంతరం ‘ఒకే నగరం–ఒకే ప్రణాళిక’ లక్ష్యంతో బృహత్తర ప్రణాళిక కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఒకసారి సమావేశమైంది. కానీ ముందుకు వెళ్లలేదు. ఒకే నగరం – ఒకే ప్రణాళిక లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మాస్టర్ప్లాన్ రూపకల్పన కోసం చర్యలు చేపట్టింది. ఎన్నికల తర్వాత ఈ ప్రతిపాదనను తిరిగి ముందుకు తెచ్చే అవకాశం ఉంది. -
పట్టణ మాస్టర్ ప్లాన్లకు ఏకరూప మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ తయారీ, అమలు ఏకరీతిన ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకీకృత విధానం పాటించేలా పలు సూచనలతో ప్రభుత్వం జీవో నంబర్ 66 జారీ చేసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో రాష్ట్రంలో పట్టణీకరణను పెంపొందించేలా ఈ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచింది. వాస్తవానికి డెవలప్మెంట్ అథారిటీలు పరిమిత సాంకేతిక నైపుణ్యంతో మాస్టర్ ప్లాన్లను తయారు చేస్తుండటంతో ప్రాదేశిక ప్రణాళిక నాణ్యత సరిగా ఉండడంలేదు. పైగా డెవలప్మెంట్ అథారిటీల మాస్టర్ ప్లాన్ల తయారీలో మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అనుసరించడంలేదు. రిపోర్టింగ్ ఫార్మాట్స్, శాటిలైట్ ఇమేజ్ క్వాలిటీ, ఆర్ఎఫ్పీ ప్రిపరేషన్, కన్సల్టెన్సీ చార్జీల ఫిక్సింగ్, కన్సల్టెంట్లు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ పాత్ర, బాధ్యతలతో కూడిన మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకరూపత ఉండడంలేదు. దాంతో రాష్ట్రంలోని 123 పట్టణ ప్రాంతాలు (యూఎల్బీలు), 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)ల్లో ఏకీకృత మాస్టర్ ప్లాన్ ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ప్రస్తుతం ఆయా విభాగాల్లోని మాస్టర్ ప్లాన్లు ఏ దశలో ఉన్నాయో అవన్నీ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూపొందించాలని యూడీఏ, యూఎల్బీలను ఆదేశించింది. అభ్యర్థనలు, మ్యాప్ తయారీ, సర్వే, ఫీల్డ్ డేటా సేకరణ, మాస్టర్ ప్లాన్ నివేదిక, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కోసం సాంకేతిక ఆమోదం, మాస్టర్ప్లాన్ ప్రచురణ, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల స్వీకరణ, తుది మాస్టర్ ప్లాన్, మ్యాప్ తయారీకి ప్రభుత్వం నుంచి సాంకేతిక ఆమోదం, మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పణ వంటి అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వచ్చే నెల 13లోపు నిర్ణయం చెప్పండి
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కొనసాగుతుందా? రద్దయిందా? ఫిబ్రవరి 13వ తేదీలోగా నిర్ణయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతులను సంప్రదించకుండానే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రూపొందించారని, ఇది చట్టవిరుద్ధ మని పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మాస్టర్ప్లాన్ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్ పార్టీ ఇన్ పర్సన్గా హాజరై వాదనలు వినిపించారు. మాస్టర్ప్లాన్ను రద్దు చేసినట్లు మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింద న్నారు. కౌన్సిల్కు ఆ అధికారం లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. -
మెప్పించి.. ఒప్పించేలా!.. మాస్టర్ప్లాన్లపై మళ్లీ అధ్యయనం
సాక్షి, వరంగల్: మాస్టర్ ప్లాన్ల విషయంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలకు అనుగుణంగా వాటి అభివృద్ధికి మాస్టర్ప్లాన్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని సుమారు 91 నగరాలు, పట్టణాలకు బృహత్తర ప్రణాళికల రూపకల్పన తక్షణ కర్తవ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మాస్టర్ప్లాన్లను కొలిక్కి తేవడంతోపాటు కొత్త మున్సిపాలిటీలలో అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్ – 2041 రూపకల్పన జరుగుతుంటే కొన్నిచోట్ల వీటిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూములు, పంట స్థలాలు కోల్పోతున్నవారు ఆందోళనలకు దిగుతున్నారు. కామారెడ్డి, జగిత్యాలలో పెల్లుబుకిన నిరసనలతో ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు మాస్టర్ప్లాన్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపడంతో అవి రద్దయ్యాయి. నిర్మల్లో కూడా ఉపసంహరించుకున్నట్లు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికీ పాతవే.. కొత్తవాటికి కలగని మోక్షం.. రాజధాని హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన వరంగల్లో 1972 నాటి మాస్టర్ప్లానే ఇప్పటికీ అమల్లో ఉండగా, నిజామాబాద్కు 1974 నాటి ప్రణాళికే ఉంది. పదికిపైగా మున్సిపాలిటీల్లో 1990 కంటే ముందునాటి మాస్టర్ప్లాన్లే అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు కొత్త మాస్టర్ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 142 నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలకు గాను 97 తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిలో 32 పురపాలికలకు బృహత్తర ప్రణాళిక (మాస్టర్ప్లాన్)ల రూపకల్పనకు అనుమతి లభించగా.. ఇందులో ఎనిమిదింటికి ముసాయిదాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించగా పెద్దపల్లి మాస్టర్ప్లాన్ను మాత్రం ఆమోదించారు. అలాగే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 45 పురపాలికలు ఉండగా.. మాస్టర్ప్లాన్ల రూపకల్పన చేపట్టినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. మొత్తం మీద వీటిల్లో కొత్తగా ఏర్పాటైన 59 మున్సిపాలిటీలకు నాలుగేళ్లు పూర్తయినా అసలు మాస్టర్ప్లాన్ రూపకల్పన దిశగా అడుగులే పడలేదు. వరంగల్ ‘కుడా’ మాస్టర్ప్లాన్ నమూనా ప్రత్యామ్నాయాల పరిశీలన.. మొత్తం మీద మాస్టర్ప్లాన్లు అవసరమైన 91 నగరాలు, పట్టణాలలో 68 కొత్తవాటికి మాస్టర్ప్లాన్ సిద్ధం చేశారు. మహబూబాబాద్, ఆంధోల్–జోగిపేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ మాస్టర్ప్లాన్లు ఆమోదం కోసం సిద్ధంగా ఉండగా, మరో 15 ప్రభుత్వ ఆమోదం కోసం పంపించేందుకు కసరత్తు పూర్తయింది. తాజాగా రద్దయిన కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ పట్టణాలకు ప్రత్యామ్నాయ మాస్టర్ప్లాన్లు రూపొందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పట్టణాలతో పాటు, మిగతా వాటికి కొత్తగా రూపొందించే మాస్టర్ప్లాన్లలో నివాస ప్రాంతం, వాణిజ్య ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం, మిశ్రమ వినియోగం వంటి వాటితో పాటు ప్రభుత్వ వినియోగం, గ్రీన్ కవర్లో భాగంగా అడవులు, బఫర్జోన్, పర్యావరణ/ప్రత్యేక భూ వినియోగ జోన్, రోడ్లు, రవాణా వ్యవస్థలు.. వాటికి ప్రతిపాదించిన భూమి విస్తీర్ణం, భూ వినియోగ విధానం తదితర అంశాలపై మరోసారి అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. సీఎం పేషీలో వరంగల్ ఫైల్.. 34 నెలలుగా పెండింగ్.. వరంగల్ మాస్టర్ప్లాన్–2041 సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 34 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా ఇంకా 50 ఏళ్ల కిందటి ప్లాన్నే అమలు చేస్తున్నారు. వాస్తవానికి 2041 వరకు సిటీ అవసరాలకు సరిపోయేలా 2013 లోనే అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దాన్ని 2020 మార్చిలో ఆమోదించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. సీఎం ఆమోదం కోసం పంపారు. 10.50 లక్షలకు మించిన జనాభా ఉన్న వరంగల్ స్మార్ట్ సిటీ కావాలన్నా.. కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలన్నా కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం ఆమోదమే తరువాయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా వరంగల్ మాస్టర్ప్లాన్కు రూపకల్పన జరిగింది. దానికి అనుగుణంగా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అనుమతులు ఇస్తారు. మాస్టర్ ప్లాన్ సీఎం పేషీలో పెండింగ్లో వుంది. ఆమోదం పొందితేనే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. – ఎ.అజిత్రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, కుడా, వరంగల్ ఓఆర్ఆర్కు అవతల ఇండస్ట్రియల్ జోన్ ఉండాలి వరంగల్ మాస్టర్ప్లాన్లో ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఇండస్ట్రియల్ జోన్ నిర్ణయించాలి. రహదారుల కనెక్టివిటీకి అనుగుణంగా అభివృద్ధి ఉండాలి. రెండో పెద్ద నగరం చుట్టూరా భవిష్యత్లో ఐటీ, వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. మాస్టర్ప్లాన్పై అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించి, సవరించి వెంటనే ఆమోదించాలి. – బొమ్మినేని రవీందర్ రెడ్డి, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్, వరంగల్ మిశ్రమ వినియోగం కింద తీసుకోవాలి మాస్టర్ప్లాన్లు ఎక్కడ అమలు చేసినా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. చాలాచోట్ల రాజకీయ జోక్యంతో విలీన గ్రామాల్లోని వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లోకి తీసుకుంటున్నారు. ప్రతిపాదిత వరంగల్ మాస్టర్ ప్లాన్లో రైతులు, ఇతరుల నుంచి 3 వేల ఫిర్యాదులు అందాయి. పంట భూములను మిక్స్డ్ ల్యాండ్ యూజ్ (మిశ్రమ భూ వినియోగం)గా తీసుకుంటే వ్యతిరేకత రాదు. – పుల్లూరి సుధాకర్, అధ్యక్షులు, ఫోరం ఫర్ బెటర్ తెలంగాణ -
అన్నదాతకు అండగా.. ‘సాక్షి’ అక్షర సమరం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగించిన ఉద్యమానికి ‘సాక్షి’ అండగా నిలిచింది. భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ ‘కథనోత్సాహం’తో అక్షర పోరు సాగించింది. ‘చిక్కుముడుల మాస్టర్ ప్లాన్’ అంటూ డిసెంబర్ 2న ప్రచురితమైన కథనంతో ముసాయిదాలోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్లో ఏముందో అంటూ ముసాయిదాలో పేర్కొన్న చాలా అంశాలను ప్రముఖంగా ప్రచురించడంతో బాధి త రైతులు జాగృతమయ్యారు. సుమారు యాభై రోజులు అలుపెరుగని పోరు సలిపారు. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలకు ప్రాధాన్యతనిస్తూ, రైతుల ఆవేదనకు ‘సాక్షి’గా నిలిచింది. ఉద్యమంలో పాల్గొన్న అన్నివర్గాలు, పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి మనన్నలు అందుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. భూమికోసం సాగించిన సమరంలో తమకు దన్నుగా నిలిచిన ‘సాక్షి’కి రైతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. -
రైతుల ఉద్యమస్ఫూర్తిని కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: రైతుల ఉద్యమాలతో కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్లు రద్దు అయ్యాయని, బీఆర్ఎస్ సర్కార్ను తరిమికొట్టే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది రైతన్నల విజయమని, వారి ఉద్యమస్ఫూర్తికి అభినందనలు అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ప్లాన్ రద్దు పోరులో నేను కూడా పాల్గొన్నాను. నాతోపాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారు. పోలీసులు మాపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు’ అని సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పులపాల్జేసి సామాన్యులు బతకలేని దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. -
కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ప్లాన్ రద్దుకు తీర్మానం
-
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం
-
జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ల రద్దు! కౌన్సిళ్ల కీలక నిర్ణయం
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ జగిత్యాల: తమ పంట భూములను కాపాడుకునేందుకు రైతులు చేసిన పోరాటం ఫలించింది. కామారెడ్డి, జగిత్యాల పట్టణాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలంటూ వారు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియలను నిలిపివేస్తూ మున్సిపల్ పాలకవర్గాలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. రైతుల భూములు ఎక్కడికీ పోవని, ఆవేదన చెందవద్దని ప్రకటించాయి. రైతుల భూములకు నష్టం కలగకుండా ప్రణాళికలను రూపొందిస్తామని అధికారులు తెలిపారు. రైతుల ఉధృత ఉద్యమంతో.. కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్కు సంబంధించి డీటీసీపీ, ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ సంస్థలు కలిసి ముసాయిదా రూపొందించడం, అందులో పంట భూములను పారిశ్రా మిక, వాణిజ్య జోన్లుగా చూపడాన్ని తప్పుపడుతూ రైతులు ఆందోళనకు దిగడం తెలిసిందే. జెడ్పీ మాజీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి దిగారు. దీనికి వివిధ రాజ కీయ పక్షాలు మద్దతుగా నిలి చాయి. అయితే అడ్లూర్ ఎల్లా రెడ్డికి చెందిన రైతు పయ్యవుల రాములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో పోరాటం ఉధృతమైంది. చివరికి మాస్టర్ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్కుమార్ కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్లతో సమీక్షించారు. అనంతరం ముసా యిదా ప్రక్రియను నిలిపివేస్తున్నామని అరవింద్కుమార్ ప్రక టించారు. విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసు కుని కొత్త మాస్టర్ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. రైతుల భూమిని సేకరించే ఉద్దేశంతో మాస్టర్ప్లాన్ తయారు చేయ లేదని, రైతుల భూములు ఎక్కడికీ పోవని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో టపాసులు కాల్చారు. ఉద్యమానికి అండగా నిలిచారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డిని అభినందించారు. జగిత్యాల మున్సిపాలిటీలోనూ.. జగిత్యాల మున్సిపాలిటీలోనూ ముసాయిదా మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తూ పాలకవర్గం శుక్రవారం తీర్మానించింది. జగిత్యాల మున్సిపాలిటీలో పట్టణ శివార్లలోని హుస్నాబాద్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్, ధరూర్, నర్సింగాపూర్ గ్రామాలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. పలుగ్రామాల్లోని వ్యవసాయ భూములను రిక్రియేషన్, ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల పరిధిలో చేర్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజ లు, రైతులు ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారో కోలు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, వంటావార్పుతో నిరసనలు తెలిపారు. గురువారం జగిత్యాల మున్సిపాలిటీ ముట్టడి, పట్టణ దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పాలకవర్గం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. -
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వెనక్కి తగ్గిన పాలక వర్గం
-
ఆగని ‘మాస్టర్ప్లాన్’ మంటలు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాకేంద్రంలో మాస్టర్ప్లాన్ – 2041 మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పట్టణ సమీప గ్రామాల్లోని తమ వ్యవసాయభూములను రిక్రి యేషన్, ఇండస్ట్రియల్, సెమీ పబ్లిక్జోన్లలో చే ర్చుతూ ముసాయిదా మాస్టర్ప్లాన్ ప్రకటించారని రైతులు భగ్గుమంటున్నారు. వారంరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కూడా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి జగిత్యాల నలువైపులా రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైన వంటావార్పు నిర్వ హించారు. తాము పండించిన మక్కకంకులను విక్రయిస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలిపారు. హుస్నాబాద్ శివారులోని జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు మహిళారైతులు పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకున్నారు. మాస్టర్ప్లాన్ నుంచి తమ భూములను తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను హెచ్చరిస్తూ. మందు తాగేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు పురుగుమందు డబ్బాలను లాక్కున్నా రు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అన్నిచోట్ల ధర్నాలను ఉపసంహరించుకున్నారు. -
కామారెడ్డి ‘మాస్టర్ప్లాన్’ వెనక్కి!
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: ‘భూమిని మింగే మాస్టర్ ప్లాన్ మాకొద్దు’అంటూ నెలన్నర కాలంగా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్ప్లాన్ రద్దుకు ముందుకు వచ్చింది. ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి గురువారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గడచిన నెలన్నర రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పడనుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్లు నిర్వహించింది. విలీన గ్రామాల కౌన్సిలర్లు తొమ్మిది మంది రాజీనామా చేయాలని గురువారం సాయంత్రం వరకు డెడ్లైన్ విధించింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను మున్సిపల్ కమషనర్కు అందించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా వారి పరిస్థితి తయారైంది. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చర్చించి ఈ నెల 20న మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా రద్దు కోరుతూ తీర్మానించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు రైతుల పోరాటాల ఫలితంగా బల్దియా పాలకవర్గం మాస్టర్ప్లాన్ ముసాయిదా రద్దుకు సిద్ధమైంది. -
జగిత్యాలలో టెన్షన్ టెన్షన్
-
జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్ను నిరసిస్తూ అష్టదిగ్భందనం
సాక్షి, జగిత్యాల: మాస్టర్ ప్లాన్ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్భందనానికి గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాలలో నలువైపులా రహదారుల దిగ్బంధం చేయనున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలకు రైతుల ప్రణాళికలు సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ వద్దంటూ రైతులకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తమ గ్రామాన్ని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తీర్మాన ప్రతిని జగిత్యాల మున్సిపల్ కమిషనర్కు ప్రజలు అందజేశారు. తిమ్మాపూర్ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్పై నిరసనలు ఉదృతం చేసేందుకు రైతు జేఏసీ ఏర్పాటుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. జగిత్యాల బల్దియా జారీ చేసిన ముసాయిదా మాస్టర్ప్లాన్పై బుధవా రం కూడా ఆందోళనలు కొనసాగాయి. జగిత్యా ల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ రైతులు పంచాయతీ కార్యాలయం ఎదుట సమావేశమై ఆందోళన నిర్వహించారు. మరోవైపు.. మోతె, ధరూర్, తిప్పన్నపేట, నర్సింగాపూర్, హస్నాబాద్, అంబారిపేట, తిమ్మాపూర్ గ్రామాలను మాస్టర్ప్లాన్ నుంచి తొలగించాలని కోరుతూ మోతె సర్పంచ్ భర్త సురకంటి రాజేశ్వర్రెడ్డి ట్విట్టర్ ద్వారా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు పోస్టు చేశారు. -
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
మరో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, కామారెడ్డి: తన భూమిని రిక్రియేషన్ జోన్లో కలిపారన్న ఆవేదనతో మంగళవారం ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కామారెడ్డి కొత్త మాస్టర్ప్లాన్లో పంట భూములను ఇండస్ట్రియల్, గ్రీన్, రిక్రియేషన్ జోన్ల కింద పేర్కొనడంపై రైతాంగం నెలన్నర రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రామేశ్వర్పల్లికి చెందిన రైతు మర్రిపల్లి బాలక్రిష్ణ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. తనకున్న ఎకరం భూమి రిక్రియేషన్ జోన్లోపోతే పిల్లలను ఎలా పెంచాలి, పెళ్లిళ్లు ఎలా చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, మాస్టర్ప్లాన్ను రద్దు చేయాలంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 8గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ముట్టడి, కుటుంబ సభ్యులతో ర్యాలీ వంటి నిరసన వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయా గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు ఈనెల 19లోపు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డెడ్లైన్ విధించింది. దీంతో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రాజీనామా లేఖలను రైతు జేఏసీకి అందించారు. -
ఆగని మాస్టర్ ప్లాన్ మంటలు
జగిత్యాల: జిల్లాలో మాస్టర్ ప్లాన్ మంటలు మంగళవారం మరింత ఉధృతరూపం దాల్చాయి. పట్టణ సమీపంలోని మోతె, తిమ్మాపూర్, అంబారిపేట, నర్సింగాపూర్, ధరూర్, లింగంపేట, హస్నాబాద్ గ్రామాల్లో రైతులు, నాయకులు, ప్రజలు బల్దియా తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లోంచి ర్యాలీగా బయలు దేరి జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు చేరుకుని నిరసన తెలిపారు. తమ గ్రామాలను మాస్టర్ ప్లాన్ పరిధి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబారిపేట గ్రామపంచాయతీ కార్యాలయ భవనం ఎక్కిన మహిళలు.. నిరసన తెలిపారు. కాగా, ప్రతిపక్షాలు మాస్టర్ప్లాన్పై చేస్తున్న అసత్య, అర్థసత్య ప్రచారాలు నమ్మొద్దని, రైతులు, ప్రజలకు తాను వెన్నంటి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ భరోసానిచ్చారు. అయితే, మాస్టర్ ప్లాన్ను కేవలం జగిత్యాల పట్టణం వరకే పరిమితం చేస్తే ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. -
జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ మంటలు
-
పొలిటికల్ కారిడార్: సీటు కాపాడుకునేందుకు ప్రభాకర్ చౌదరి ప్లాన్
-
జగిత్యాల జిల్లాలోనూ మాస్టర్ ప్లాన్ రగడ
-
మాస్టర్ ప్లాన్ కేసు విచారణ 11కు వాయిదా
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ప్లాన్ను వ్యతిరేకిస్తూ 2వ వార్డు రామేశ్వరపల్లి చెందిన 40 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమను సంప్రదించకుండానే తమ భూములున్న ప్రాంతాన్ని రిక్రియేషన్ జోన్ గా ప్రకటించారని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి విచారణ చేపట్టగా, పిటిషనర్ల పక్షాన న్యాయ వాది సృజన్రెడ్డి మాస్టర్ప్లాన్ మ్యాప్ను కోర్టుకు సమర్పించి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను న్యాయమూర్తి వివరణ కోరగా, ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఏజీ విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి తదుపరి విచారణ బుధవారానికి (ఈ నెల 11) వాయిదా వేశారు. కాగా, విచారణ సందర్భంగా హైకోర్టుకు హాజరైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే న్యాయమూర్తి ఆయన వాదనలను తోసిపుచ్చారు. ఇప్పటికే మాస్టర్ప్లాన్ రద్దు చేయాలని రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11న అభ్యంతరాల గడువు ముగియనుంది. తర్వాత కౌన్సిల్లో చర్చించనున్నారు. కోర్టు పరిధిలో మాస్టర్ప్లాన్ అంశం ఉండటంతో బుధవారం కోర్టులో వాదనలు, తీర్పు తర్వాతే కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. -
‘మాస్టర్ ప్లాన్’పై కౌన్సిల్లో తీర్మానం చేయండి
కామారెడ్డి టౌన్: మునిసిపల్ మాస్టర్ ప్లాన్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతు న్నామని రైతు జేఏసీ ఆధ్వర్యంలో సోమ వారం కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ వినతి పత్రాలను అందజేశారు. చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియలతో పాటు 49 మంది కౌన్సిల్ సభ్యులకు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలను అందజేశారు. చైర్పర్సన్ అందుబాటులో లేకపో వడంతో ఆమె తండ్రి నిట్టు వేణుగోపాల్ రావుకు విన్నవించుకున్నారు. తమకు న్యాయం జరిగేలా కౌన్సిల్లో చర్చించి తీర్మానం చేయాలని రైతులు కోరారు. ఈనెల 11న అభ్యంతరాలకు గడువు ముగుస్తుందని, 12న అత్యవ సర సమావేశం పెట్టుకుని తమకు న్యాయం చేయాలని వేడుకు న్నారు. ప్రభుత్వ విప్, కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం తమకు న్యాయం జరుగుతుందని భావించి ఉద్యమానికి తాత్కాలి కంగా విరామం ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్య క్రమంలో ఇల్చిపూర్, దేవునిపల్లి, టేక్రియాల్, అడ్లూర్, రామేశ్వరపల్లి, అడ్లూర్ఎల్లారెడ్డి గ్రామాల రైతులు, రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
కామారెడ్డి మాస్టర్ప్లాన్.. ఏజీకి హైకోర్టు కీలక ఆదేశాలు!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మాస్టర్ప్లాన్పై రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రిట్ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. రైతుల తరఫున న్యాయవాది సృజన్ రెడ్డి.. మాస్టర్ ప్లాన్ను కోర్టుకు సమర్పించారు. రైతులను పక్కనపెట్టి రీక్రియేషన్ జోన్గా ప్రకటించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిపారు. దీంతో, మాస్టర్ ప్లాన్పై ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత పిటిషన్ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది. -
అవసరమైతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం : రైతు జేఏసీ
-
అందుకే గందరగోళం.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ఎమ్మెల్యే క్లారిటీ..
కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ప్లాన్పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్ను మారుస్తామని చెప్పారు. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూముల్లోకి మారస్తామని పేర్కొన్నారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను, ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగిస్తామని తెలిపారు. డీటీసీపీ, కన్సల్టెన్సీ అధికారుల తప్పిదంతోనే గందరళగోళం నెలకొందని గంప వివరణ ఇచ్చారు. రైతులకు చెందిన గుంట భూమి కూడా పోదని హామీ ఇచ్చారు. కౌన్సిల్ సమావేశం తర్వాత మాస్టర్ప్లాన్ ఫైనల్ చేస్తామన్నారు. కామారెడ్డి మాస్టర్ప్లాన్పై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థానిక రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ భూమి పోతోందని పెద్దఎత్తున్న ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. ప్రతిపాదిత ప్లాన్పై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు గడువు ఉందని గుర్తు చేశారు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్
-
మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి కలెక్టర్ వివరణ
-
పొలాలను లాక్కోరు.. కేవలం ప్రతిపాదన మాత్రమే: కామారెడ్డి కలెక్టర్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ముసాయిదా వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భూమి కోసం.. మాస్టర్ ప్లాన్ నుంచి విముక్తి కోసం రైతుల ఆందోళనలు నెలరోజులుగా కొనసాగుతున్నాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై కలెక్టర్ జితేష్ పాటిల్ మరోసారి వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని.. ఎవరి భూములు తీసుకోవడం లేదని వెల్లడించారు. అందరి అభిప్రాయాలను సేకరిస్తామని, ఇంకా 60 రోజులు పూర్తి కాలేదని తెలిపారు. జనవరి 11 వరకు అభిప్రాయాలు చెప్పొచ్చని కలెక్టర్ తెలిపారు. 2000 సంవత్సరం పాత మాస్టర్ ప్లాన్లో రోడ్లను కూడా చూపించారు. వారి భూములు పోయాయా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారిపేరు మీదే భూములు ఉన్నాయని, రైతు బంధు వస్తోందని గుర్తు చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్తో ఎవరి భూములు పోవని స్పష్టం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్పై ఇప్పటి వరకు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని,అభ్యంతరాలు చెప్పడానికి రైతులకు పూర్తి హక్కు ఉందని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూ సేకరణ కాదు. అభ్యంతరాలను పరిశీలించి అధికారులు రిమార్క్స్ రాస్తారు. మార్పులు చేర్పులు చేయడానికే డ్రాఫ్ట్. ఇది ప్రతిపాదన మాత్రమే.. మొదటి స్టేజ్లోనే ఉంది. ఇండస్ట్రీయల్ జోన్ ప్రకటించిన మాత్రాన పంట పొలాలను లాక్కోరు.’ అని కలెక్టర్ పేర్కొన్నారు. చదవండి: ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? కావాలనే చేశారా? -
కామారెడ్డిలో రైతుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్
-
కేసీఆర్ చాణుక్యమే గెలిపించింది
-
పొలిటికల్ కారిడార్ : ఉపఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్లాన్
-
పోలీసుల మాస్టర్ప్లాన్: మొబైల్ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్
సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో మొబైల్ దొంగల హవా తీవ్రతరమైంది. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు సిటీ పోలీసులు మాస్టర్ప్లాన్ రూపొందించారు. ఇకపై చోరీకి గురైన మొబైల్ను చోరీకి పాల్పడిన దొంగలు వినియోగించకుండా లాక్ చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను ఢిల్లీ, ముంబై పోలీసులు అమలు చేశారు. ప్రస్తుతం బెంగళూరు నగర పోలీసులు ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చి వీటి సాదక బాదకాలపై అధ్యయనం చేస్తున్నారు. నిత్యం 30 మొబైల్స్ చోరీ సిలికాన్ సిటీలో నిత్యం 25 నుంచి 30 మొబైల్స్ చోరీకి గురవుతున్నాయి. రోడ్డుపై నిలబడి మాట్లాడుతున్నవారి నుంచి లాక్కుపోవడం, సిటీ బస్సులు, రద్దీ ప్రదేశాల్లో కొట్టేయడం, లేదా సొంతదారే పోగొట్టుకోవడం జరుగుతోంది. ఐఫోన్, చాలా ఖరీదైన ఫోన్లయితే కంపెనీ సహాయంతో ఆ మొబైల్ని లాక్ చేయవచ్చు. కానీ చాలా మొబైల్స్ను ఏమీ చేయడానికి సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) సహాయంతో మొబైల్ లాక్ చేసే విధానాన్ని పోలీస్శాఖ తీసుకొచ్చింది. మొబైల్ను లాక్ చేస్తే దొంగలు ఉపయోగించలేరు దొంగ మొబైల్స్ కొనొద్దు చోరీకి గురైన మొబైల్స్ను తక్కువ ధరకు వస్తుందని ఎవరైనా కొని ఉపయోగిస్తే అది పోలీసులకు తెలిసిపోతోంది. ఆ మొబైల్లోని సిమ్ నంబరు, ఏ ఊరిలో వాడుతున్నారు అనేది పూర్తిగా పోలీసులకు చేరుతుంది. కాబట్టి చోరీ చేసిన ఫోన్లను కొనడం, ఉపయోగించడం ఎంతమాత్రం తగదని రమణ్గుప్తా తెలిపారు. ఇలా ఫిర్యాదు చేయాలి ►మొబైల్ చోరీలు అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగర పోలీస్ విభాగంలో సీఇఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ రూపొందించారు. ►మొబైల్ చోరీకి గురైన బాధితులు పీఎస్లో కానీ, 112 నంబరుకు లేదా నగర పోలీస్ వెబ్సైట్లోని ఇ– లాస్ట్లో కానీ ఫిర్యాదు చేయాలి. ఐఎంఈఐ నంబరును చెబితే వెంటనే మొబైల్ను బ్లాక్ చేస్తారు. ఆ మొబైల్ ను ఎవరూ ఉపయోగించలేరు. ►తద్వారా మొబైల్ విక్రయించడానికీ వీలు కాకపోవడంతో చోరీలు తగ్గుతాయని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్గుప్తా తెలిపారు. ►ఇందుకుగాను బాధితులు అదే నంబరుతో మరో సిమ్ తీసుకుని ఉండాలి. అప్పుడు ఆ ఫోన్కు ఓటీపీ రాగానే ఎంటర్ చేయాలి. తరువాత బ్లాక్ ప్రక్రియ పూర్తవుతుంది. ►ప్రస్తుతం ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి భయ సందేహాలు వద్దని పోలీసులు తెలిపారు. ఫోన్ మళ్లీ దొరికితే పోలీసుల అనుమతి తీసుకుని యథావిధిగా ఉపయోగించవచ్చని చెప్పారు. -
Madanapalle: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి సంబంధించి కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అమృత్ పథకంలో భాగంగా పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ(పీకేఎం–ఉడా) ఆధ్వర్యంలో స్కై గ్రూప్ కన్సల్టెంట్ సహకారంతో జీఐఎస్(జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఆధారిత మాస్టర్ప్లాన్–2041 రూపకల్పన జరిగింది. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి రూపొందించే మాస్టర్ప్లాన్ను పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, పట్టణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా తయారుచేయించారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్ప్లాన్ను ప్రజల పరిశీలన కోసం 15 రోజుల పాటు పీకేఎం–ఉడా కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు తెలపాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో చేయాల్సిన మార్పులపై సుమారు 25వరకు అర్జీలు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరణ చేసిన ప్లాన్ను డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్(డీటీసీపీ)కు పంపుతామని, అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త మాస్టర్ప్లాన్ ఆధారంగా చేసుకుని నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. మాస్టర్ ప్లాన్కు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం. జిల్లాలో అతిపెద్ద పట్టణం మదనపల్లె. 35వార్డులు, 44 వార్డు సచివాలయాలు, 14.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. సుమారు 2లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పట్టణంలో గృహ, వాణిజ్యసముదాయాల నిర్మాణాలకు సంబంధించి జీఓ.ఎం.ఎస్.నెం.447, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.5.10.2001న ఆమోదించిన మాస్టర్ప్లాన్ను ఆధారంగా చేసుకుని అనుమతులు మంజూరుచేస్తున్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ప్లాన్ను రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలుకు ముందు డ్రాఫ్ట్ప్లాన్ను ప్రజల పరిశీలనకు ఉంచి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీటీసీపీ అనుమతులతో అమలుచేయాల్సి ఉంటుంది. మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించి రానున్న 20 ఏళ్లలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకం కింద అధునాతన సాంకేతికత సహాయంతో జియోగ్రాఫిక్ ఇన్ఫరేషన్ సిస్టమ్(జీఐఎస్) పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రాఫ్ట్ మాస్టర్ప్లాన్–2041ను సిద్ధంచేశారు. రూపకల్పన జరిగిందిలా.. మాస్టర్ప్లాన్ రూపకల్పనలో భాగంగా స్కై గ్రూప్ ఏజెన్సీ వారు మొదట పట్టణాన్ని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. పట్టణ అభివృద్ధి దృష్ట్యా మెయిన్రోడ్లు ఎంత వెడల్పు ఉండాలో అంచనా వేసుకున్నారు. మున్సిపల్ లిమిట్స్లో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ యూజ్, ఇండస్ట్రియల్, పబ్లిక్, సెమీపబ్లిక్, రిక్రియేషన్ జోన్లను గుర్తించారు. గతానికి, ఇప్పటికి చేయాల్సిన మార్పులను గుర్తించి, వాటిని కొత్త మాస్టర్ప్లాన్లో పొందుపరిచారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పరిధి 14.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అలాగే కనపరుస్తూ విస్తరణ చేయాలనుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఏఓఐ(ఏరియా ఆఫ్ ఇంటరెస్ట్) కింద అన్నివైపులా మూడుకిలోమీటర్ల రేడియస్ పెంపుతో 37.26 చదరపుకిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్లో మార్పులు పట్టణంలోని కోమటివానిచెరువు పాతమాస్టర్ప్లాన్లో రిక్రియేషన్ గ్రీన్లో ఉండేది. కొత్తప్లాన్లో చెరువుచుట్టూ ప్రాంతాన్ని బఫర్జోన్గా మార్చారు. గతంలో రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న కదిరిరోడ్డు, చౌడేశ్వరిగుడి పరిసరప్రాంతాలు, గొల్లపల్లెరోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు, సీటీఎంరోడ్డు, బెంగళూరురోడ్డు, పుంగనూరురోడ్డు ప్రాంతాలన్నీ కమర్షియల్లోకి మార్పు జరిగాయి. ఇన్నాళ్లు వీటిలో రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు జరపాలంటే టౌన్ప్లానింగ్ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై ఆ సమస్య ఉండదు. రెడ్డెప్పనాయుడు కాలనీలో కొంతభాగం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేది. ప్రస్తుతం దాన్ని రెసిడెన్షియల్ జోన్లోకి మార్చారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 40–60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్స్గా ఏర్పాటుచేశారు. 60అడుగుల రోడ్లను 80–100 అడుగులుగా, పట్టణం మీదుగా వెళుతున్న స్టేట్ హైవేను 100 అడుగుల రోడ్లు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. (క్లిక్: థ్యాంక్యూ.. సీఎం సార్) సమగ్రంగా పరిశీలించాకే ఫైనల్ ప్లాన్ ఖరారు.. పట్టణ మాస్టర్ప్లాన్–2041కు సంబంధించి ప్రధానంగా పట్టాభూములను రిక్రియేషన్ జోన్లో పెట్టారని, వాటిని డిలీట్ చేయాల్సిందిగా, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అనుమతిలేని లేఔట్లను మార్చమని, రోడ్ల వెడల్పు మార్చాల్సిందిగా, జోనింగ్లకు సంబంధించి, ఎగ్జిస్టింగ్ రోడ్లను మాస్టర్ప్లాన్రోడ్డుగా చేయమని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పీకేఎం–ఉడా అధికారులకు పంపాం. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్నాక సవరణలు చేసి డీటీసీపీ అనుమతులకు పంపి ఫైనల్ మాస్టర్ప్లాన్ను ప్రకటిస్తారు. – కే.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, మదనపల్లె -
‘111’ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. అలాగే నగర అభివృద్ధి ఫలాలు 111 జీవో పరిధిలోని గ్రామస్తులూ కోరుకోవటం న్యాయమైన హక్కే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేక మాస్టర్ను రూపొందిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి? ఏ తరహా నిర్మాణాలు ఉండాలనే అంశంపై తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ∙ 217 చదరపు కిలో మీటర్ల హైదరాబాద్ విస్తీర్ణానికి రెండున్నర రెట్లు అధికంగా 538 చ.కి.మీ మేర 111 జీవో పరిధి విస్తరించి ఉంది. సుమారు 1.32 లక్షల ఎకరాల భూమి అదనంగా అందుబాటులోకి రానుంది. భవిష్యత్తు తరాల కోసం జంట జలాశయాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా 111 జీవో మాస్టర్ ప్లాన్ను రూపొందించాలి. ఆ తర్వాతే పర్యావరణానికి హానీ కలిగించని నిర్మాణాలకు చోటు కల్పించాలి. తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండాలి. వర్షపు నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్లో ఆయా అధ్యయన ఫలితాలకు కూడా అవకాశం కల్పిం చాలి. 111 జీవో మాస్టర్ ప్లాన్లో నెట్ జీరో సీవరేజ్ పాలసీని అవలంభించాలి. అంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఉండాల్సిందే. తద్వారా మురుగు నీరు బయటికి వెళ్లదు. జంట జలాశయాలు కలుషితం కావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్లను అధ్యయనం చేయాలి. అక్కడ స్టీల్, సిమెంట్ వంటి భవన సామగ్రి స్థానంలో ప్రత్యామ్నాయం వినియోగిస్తారు. కలప ఇళ్లు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంటాయి. ఈ తరహా జోన్లను సందర్శించి ఆ ప్రకారం చేయాలి. కాంప్లిమెంటరీ డెవలప్మెంట్.. హైదరాబాద్ అభివృద్ధికి 111 జీవో కాంప్లిమెంటరీగా ఉండాలి. ఆకాశహర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు పోటీగా కాకుండా నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీగా ఉంటే మాత్రం ఇప్పుడున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశాలున్నాయి. ఆయా గ్రామాలలో చాలా వరకు భూములు కొనుగోలు చేసి ఫామ్హౌస్లను నిర్మించడం వల్ల హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంపై పరిమిత స్థాయిలో ప్రభావం ఉంటుంది. ఒకవేళ 111 జీవో పరిధిలో హైరైజ్ భవనాలకు అనుమతి ఇస్తే గనక.. హైదరాబాద్ ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటూ కాలుష్యం పెరుగుతుంది. జంట జలాశయాలు మరో హుస్సేన్సాగర్ లాగా మారే ప్రమాదం ఉంది. స్వయం సమృద్ధితో కూడిన సౌకర్యాలతో పారిశుధ్యం, రోడ్లను మెరుగుపరచాలి. లేకపోతే అవి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లాగా తయారవుతాయి. నగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణాన్ని కల్పించవచ్చు. దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. హెచ్ఎండీఏ ఏరియాలో విలీనం కావటానికి ఇప్పటికే ఉన్న భవనాలను ఒకేసారి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఐదు జోన్లతో అద్భుతం.. ► జంట జలాశయాల నుంచి కొన్ని కి.మీ మేర బఫర్ జోన్. ఇక్కడ రిసార్ట్లకు అనుమతి ఉండాలి. ► రెండోది స్పోర్ట్స్ జోన్. ఇక్కడ ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► స్టీల్, సిమెంట్ వంటి వాటితో కాకుండా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో కూడిన నిర్మాణాలు మూడో జోన్. ఉదాహరణ: విద్యా సంస్థలు. ► ఫోర్త్ జోన్లో తక్కువ సాంద్రత కలిగిన గృహ నిర్మాణాలు, వినోద కేంద్రాలు. ఇవి కూడా ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రితో నిర్మితమైనవై ఉండాలి. ► ఐదో జోన్లో మాత్రమే ఐటీ, బహుళ అంతస్తులకు అనుమతి ఉండాలి. దీంతో అన్ని జోన్లలో కార్యకలాపాలు జరుగుతాయి. ఆయా గ్రామస్తులు పెరిగిన భూముల రేట్ల ప్రయోజనాన్ని పొందుతారు. -
నిజామాబాద్ మాస్టర్ ప్లాన్పై మరో వివాదం
-
73 గ్రామాలు.. 568 కిలో మీటర్లతో ‘నుడా’ మాస్టర్ ప్లాన్..
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) మాస్టర్ ప్లాన్ దాదాపు ఖరారైంది. 73 గ్రామాలను కలుపుకొని మొత్తం 568.32 చదరపు కిలోమీటర్ల మేర నుడా పరిధిలోకి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్లాన్కు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు శనివారం ఆమోదం తెలిపారు. నుడా పరిధిలోకి తీసుకొచ్చిన గ్రామాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. అభ్యంతరాలను నుడా కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించాక నుడా పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మాస్టర్ ప్లాన్తో కలిపే నుడా పరిధిని ఖరారు చేశారు. తొమ్మిది విలీన గ్రామాలను కలిపి 318.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్ మాస్టర్ప్లాన్ను మూడేళ్ల క్రితమే రూపొందించారు. కానీ, ఆ తర్వాత 73 గ్రామాలను కలిపి నుడాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తొలుత రూపొందించిన కార్పొరేషన్ మాస్టర్ప్లాన్ను కలుపుకొని నుడా బృహత్ ప్రణాళికను తయారు చేశారు. కార్పొరేషన్ మాస్టర్ప్లాన్ పరిధి (318.50 చ.కి.మీ.)కి తోడు నగర పాలక సంస్థ వెలువల ఐదు కిలోమీటర్ల రేడియల్ విస్తీర్ణం (249.82 చదరపు కి.మీ.)తో కలిపి నుడా మాస్లర్ప్లాన్ పరిధిని ఖరారు చేశారు. (చదవండి: మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!) నుడా మాస్టర్ ప్లాన్లోకి వచ్చిన గ్రామాలివే.. ► నిజామాబాద్ రూరల్ మండలం(19 గ్రామాలు): ధర్మారం(ఎం), ధర్మారం(టి), గుండారం, రామ్నగర్, శాస్త్రినగర్, శ్రీనగర్, జలాల్పూర్, కేశాపూర్, కొండూరు, లక్ష్మాపూర్, మల్కాపూర్(ఎ), మల్కాపూర్(ఎం), మల్లారం, చక్రధర్నగర్(టి), గాంధీనగర్, ముత్తకుంట, లింగితండా, పాల్దా, తిర్మన్పల్లి ► డిచ్పల్లి మండలం(10 గ్రామాలు): అమృతపూర్, దేవ్నగర్క్యాంపు, ఆరేపల్లి, బర్ధీపూర్, ధర్మారం(బి), మెంట్రాజ్పల్లి, నాక తండాా, వెస్లీనగర్ తండాా, ముల్లంగి(ఐ), నడిపల్లి ► మాక్లూర్ మండలం(13 గ్రామాలు): అమ్రాద్, అమ్రాద్ తండాా, బొంకన్పల్లి, చిన్నాపూర్, మదన్పల్లి, సట్లాపూర్ తండాా, మాక్లూర్ కింద తండా, సింగంపల్లి తండా, మామిడిపల్లి, ముల్లంగి(బి), వడ్డేటిపల్లి, సింగంపల్లి ► మోపాల్ మండలం(11 గ్రామాలు): కంజర, ఒడ్డెర కాలనీ, కులాస్పూర్, కులాస్పూర్ తండా, ముదక్పల్లి, గుడి తండా, శ్రీరామ్నగర్(టి), మోపాల్, న్యాల్కల్, సిర్పూర్, ఠానాకుర్దు ► నవీపేట మండలం(8 గ్రామాలు): అబ్బాపూర్(ఎం), అభంగపట్నం, స్టేషన్ ఏరియా, అనంతగిరి, ధర్మారం(ఏ), మహంతం, మోకన్పల్లి, నారాయణపూర్ ► ఎడపల్లి మండలం(10గ్రామాలు):– జైతాపూర్, జంలం, ఎం.ఎస్.సీ.ఫారం, జానకంపేట, కుర్నాపల్లి, మల్లాపహాడ్, మంగల్పహాడ్, పోచారం, ఠాణాకలాన్, బాపునగర్ ► రెంజల్ మండలం(1): దూపల్లి ► వర్ని మండలం(1): మాలాయిపూర్ నుడాకు సరిహద్దు గ్రామాలు.. ► ఉత్తరం: ధరియాపూర్, నవీపేట, కమలాపూర్, పోతంగల్, జన్నేపల్లి, మెట్పల్లి, గొట్టిముక్కల, వెంకటాపూర్, కల్లెడ, గుత్ప ► దక్షిణం: డిచ్పల్లి, ఘన్పూర్, దూస్గాం, చిన్నాపూర్, బాడ్సి, మంచిప్ప, కాల్పోల్, బాజిదాపూర్, ఫారెస్టు ఏరియా, చింతకుంట ► తూర్పు: మిట్టాపల్లి, బీబీపూర్ తండా, సుద్దపల్లి, యానంపల్లి, పుప్పాలపల్లి, సికింద్రాపూర్, మాదాపూర్, మునిపల్లి ► పడమర: మోస్రా, అమ్దాపూర్, ఇబ్రహీంపూర్, ఎరాజ్పల్లి, ఎడపల్లి, ఏఆర్పీ క్యాంపు, బ్రాహ్మణపల్లి, కల్యాపూర్, రెంజల్ (చదవండి: ఫాంహౌస్లో సీఎం కేసీఆర్తో ప్రకాశ్ రాజ్ భేటీ!) -
Telangana: అర్నెల్లు ముందుగానే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు ముందస్తు ఎన్ని కలు ఉండబోవని కుండబద్దలు కొట్టిన సీఎం కె.చంద్రశేఖర్రావు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహా నికి మాత్రం ఇప్పటినుంచే పదును పెడుతున్నా రు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 6 నెలల ముందే ప్రకటించా లని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అసెం బ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ముందస్తు వ్యూహంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొం దడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీలో అసమ్మతి తమకు కలిసి వస్తుందనే విపక్షాల ఆశలను వమ్ము చేయాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్ ఎస్కు ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలను గెలుస్తామని రెండ్రోజుల క్రితం కేసీఆర్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. కొత్త ముఖాలకు ప్రాధాన్యత? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన కేసీఆర్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 నుంచి 30 మంది కొత్తవారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యేల వారసు లతో పాటు కొన్ని కొత్త ముఖాలకు ప్రత్యేకించి యువతకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కించుకున్న ఎర్రోల్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్ వంటి కొందరు యువనేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు ముఖ్య నేతలు తమ వారసులతో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు. యంత్రాంగంలో జోష్ లక్ష్యంగా.. ఉమ్మడి జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగం సమన్వయం, సంస్థాగత నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలు తదితర బాధ్యతలను పార్టీ జిల్లా అ«ధ్యక్షుల చేతిలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇటీవల జిల్లా అధ్యక్షులుగా నియమితులైన 33 మందిలో 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో ఎక్కువ మంది యువకులే కావడం గమనార్హం. అసెంబ్లీ లోపలా బయటా విపక్షాలపై దూకుడును ప్రదర్శిస్తున్న వీరిని ప్రోత్సహించడం ద్వారా పార్టీ యంత్రాంగంలో ఉత్సాహాన్ని నింపాలని అధినేత భావిస్తున్నారు. బాల్క సుమన్, ఎ.జీవన్రెడ్డి, శంభీపూర్ రాజు, మెతుకు ఆనంద్ వంటి వారికి ఈ కోణంలోనే అధ్యక్ష బాధ్యతలను కేసీఆర్ వ్యూహాత్మకంగా అప్పగించారు. క్షేత్ర స్థాయిలో విపక్షాల ఎత్తుగడలను ఎదుర్కొనేలా కేసీఆర్ ఈ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మెదక్ నుంచే జాతీయ రాజకీయాల్లోకి? వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టీఆర్ఎస్ అధినేత, మరోవైపు జాతీయ రాజకీయాల్లోనూ పార్టీ క్రియాశీల పాత్ర పోషించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్లతో తన ఆలోచనలను పంచుకున్న కేసీఆర్.. రెండు మూడురోజుల్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకునే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్.. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుండడం గమనార్హం. ►అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే వారిపై వచ్చే వ్యతిరేకతను సరి దిద్దే చాన్స్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో టికెట్ ఆశించి భంగపడిన వారు వేసే అడుగులకు అనుగుణంగా ప్రతివ్యూహం ఖరారు చేసేందుకు కావాల్సినంత సమయం ఉంటుందనేది అధినేత ఆలోచన అని చెబుతున్నారు. ►జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ అధినేత రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సాధించిన విజయాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాతో పాటు వివిధ వేదికలు, సదస్సులను ఉపయోగించుకోనున్నారు. టీఎంసీ, ఆప్, ఎంఐఎం తరహాలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. -
ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్ప్లాన్ రూపొందించనున్నారు. వీటిలో మహానంది, కసాపురం, అహోబిలం, యెక్కంటి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇందుకు ఉత్తర భారత దేశంలో, తమిళనాడులో పలు పురాతన, ప్రఖ్యాత ఆలయాలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను రూపొందించిన రెండు ప్రముఖ అర్కిటెక్చర్ సంస్థలను దేవదాయ శాఖ ఎంప్యానల్ చేసింది. ఈ సంస్థల ప్రతినిధులతో వారం క్రితం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్లాల్లు వీడియో సమావేశం నిర్వహించి, ఆలయాల వారీగా మాస్టర్ ప్లాన్ల రూపకల్పనపై చర్చించారు. ఆలయాల్లోని సంప్రదాయాలు, ప్రస్తుతం ఉన్న ప్రధాన గర్భాలయాల రూపం మారకుండా మాస్టర్ ప్లాన్లు ఉంటాయని దేవదాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయం ప్రాంగణంలో, చుట్టుప్రక్కల ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమమైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపడతారని చెప్పారు. సాయంత్రం వేళ ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఇతర ఆరాధన కార్యక్రమాలకు వేదికల నిర్మాణం వంటి వాటికి ప్రాధన్యత ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కుటుంబ సమేతంగా కార్లలో ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలయం పరిసరాలను అవకాశం ఉన్న మేరకు విశాలమైన పార్కింగ్ ఏరియా, ఆహ్లదకరమైన పూల వనాలు వంటి వాటికి మాస్టర్ ప్లాన్లో చోటు కల్పిస్తామన్నారు. -
మూసీ మురిసేలా.. మాస్టర్ ప్లాన్
Musi riverfront development project: గ్రేటర్ భాగ్యరేఖ..చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)తయారీకి చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. (చదవండి: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!) ప్రస్తుతం అక్కడక్కడా చేపట్టిన సుందరీకరణ పనులు మినహా..శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టకపోవడంతో ఈ దిశగా చర్యలు చేపట్టారు. త్వరలో మాస్టర్ప్లాన్ తయారీకి ముందుకొచ్చే సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. మూడునెలల కాలవ్యవధిలోగా ప్రణాళిక సిద్ధం చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ మాస్టర్ప్లాన్ తయారీకి ముందుకొచ్చే అవకాశాలున్నట్లు సంస్థ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పనులు ఇలా... ∙నూతనంగా సిద్ధం చేయనున్న మూసీ మాస్టర్ప్లాన్ ప్రకారం అభివృద్ధి, ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ∙ప్రధానంగా నగరంలో నది ప్రవహించే బాపూఘాట్–నాగోలు(25 కి.మీ) మార్గంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ∙మార్గమధ్యలో నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థజలాలు చేరకుండా ఆయా నీటిని నూతనంగా నిర్మించే ఎస్టీపీల్లో శుద్ధిచేసిన అనంతరమే నదిలోకి చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు. ∙నదికి ఇరువైపులా సుమారు 13 నూతన బ్రిడ్జిలు..14 చోట్ల సుందరమైన ఉద్యానవనాలను తీర్చిదిద్దనున్నారు. ∙ఇప్పటికే సిటీలో మూసీని మూసేస్తూ ఏర్పాటుచేసిన పదివేలకు పైగా ఉన్న ఆక్రమణలను తొలగించడం, పట్టా భూములు, స్థిర ఆస్తులు కోల్పోయే బాధితులకు పరిహారం అందజేయడం వంటి అంశాలను ఈ మాస్టర్ప్లాన్లో పొందుపర్చనున్నారు. ∙ఈ పనులన్నీ వచ్చే ఏడాది జూన్లో మొదలుపెట్టి..2023 జూన్ నాటికి సగం పనులు పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించుకోవడం విశేషం. నిధుల సమీకరణకు యత్నాలు.. మాస్టర్ప్లాన్ అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు యత్నాలు మొదలయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు నిర్మాణ సంస్థలకు బీఓటీ విధానంలో అప్పజెప్పడం లేదా భూములను విక్రయించడం లేదా హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపట్టడం..రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని బడ్జెటరీ నిధుల ద్వారా కేటాయించడం తదితర ఆర్థిక అంశాలపై మున్సిపల్ శాఖ తాజాగా దృష్టిసారించినట్లు సమాచారం. (చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!) -
‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడు..
చారిత్రక ప్రాభవానికి, తెలుగు వారి పౌరుషానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన కొండవీడు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మలిచేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. మహోన్నత చరిత్ర, ప్రాచీన సంపద కలిగిన కొండవీడుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిది. హైదరాబాద్కు వన్నె తెచ్చిన ‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడుకు పూర్వవైభవాన్ని తెచ్చే ఆలోచన చేస్తోంది. ఇందుకు ఆద్యుడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. రాజన్న 2005 జులైలో రూ.5 కోట్ల నిధులిచ్చి కొండవీడు అభివృద్ధికి తొలిబీజం వేశారు. ఆ బీజమే సందర్శకులను ఆకర్షించే ‘ఘాట్రోడ్డు’ అనే మహావృక్షంగా రూపుదాల్చింది. పచ్చని ప్రకృతి.. ఆహ్లాద వాతావరణం సొంతం చేసుకున్న ఈ గిరిదుర్గం నేడు దశల వారీగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యడ్లపాడు: కొండవీడు కోటను అభివృద్ధి చేసే దిశలో భాగంగా నగర వనం నిమిత్తం రూ.13.35 కోట్లు విడుదలయ్యాయి. వీటితో తలపెట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీహెచ్ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే విడదల రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రానున్నారు. చదవండి: ఏడు ఊర్లు కలసి హాల్వి.. దీనికో చరిత్ర ఉంది! అత్యంత ప్రాధాన్యంగా.. నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని ప్రాధాన్యతనిచ్చిన అభివృద్ధి పనుల్లో కొండవీడు పర్యాటకం ఒకటి. శతాబ్దాల ఘన చరిత్రలో భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కొండవీడు ప్రగతికి నడుంబిగించారు. అన్నిశాఖల వారిని సమన్వయం చేసుకు ని బృహత్తర ప్రణాళికలు రూపొందించింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రమంతుల్ని సైతం కొండవీడుకు తీసుకువచ్చి పర్యాటకంగా చేయాల్సిన పనులను గురించి వివరించారు. వారితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి నివేదికలను సమర్పించారు. దీంతో కొండవీడు అభివృద్ధికి సుమారు వంద కోట్ల నిధులు వచ్చేలా మార్గం సుగమం అయ్యింది. చూడముచ్చటైన అందాలు! ఘాట్రోడ్డు ప్రారంభంలో చెక్పోస్టు నిర్మించగా..కొండపై చారిత్రక ప్రాంతం ప్రారంభంలో విభిన్నంగా నిర్మించిన ప్రవేశద్వారం (ఆర్చి) అటవీ అందాలకు ప్రతీకగా దర్శనమిస్తోంది. సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. చిన్నపిల్లల పార్కు, వాహనాల పార్కింగ్, నడకదారుల ఏర్పాటు ఫ్లోరింగ్ టైల్స్తో సుందరీకరణ చేశారు. వాటర్ ఫౌంటెన్, సోలర్ విద్యుత్తు దీపాల ఏర్పాటు తదితర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణం, ఆంజనేయస్వామి గుడి పక్కన 10వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంక్ నిర్మాణం కొనసాగుతోంది. కొండపై ఉన్న చెరువుల గట్లపై నడకదారి..దానికిరువైపులా మొక్కలు..రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం చెట్ల కొమ్మల ఆకారంలో బల్లలు, అక్కడక్కడా చెట్ల చుట్టూ అరుగులు ఏర్పాటు చేసి సుందరీకరణ చేశారు. కొండవీడు రాకపోకలకు అనువుగా రూ.24 కోట్ల వ్యయంతో దింతెనపాడు వయా కొండవీడు, ఫిరంగిపురం రోడ్డు(డీఎస్ రోడ్డు) పనులు కొనసాగుతున్నాయి. చరిత్ర పేజీలో అభివృద్ధి అక్షరాలు లిఖించాలి చారిత్రక, పర్యాటక ప్రాంతాల ప్రగతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కొండవీడు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపే చొరవ.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఇప్పటికే కోటిన్నర నిధులతో ప్రగతి సాధించగా, తాజాగా వచ్చిన కేంద్ర అటవీ అనుమతులతో రూ.11.80 కోట్ల తో రెండోదశ ఘాట్రోడ్డు, రూ.3.5 కోట్లతో విద్యుత్సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నాం. ఇలా కొండవీడు చరిత్ర పుస్తకంలో అభివృద్ధి అక్షరాలతో లిఖించిన పేజీల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్ష. – విడదల రజిని, ఎమ్మెల్యే -
గతిశక్తి ప్లాన్ కింద 101 ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద 101 ప్రాజెక్టులను గుర్తించినట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వినియోగం, ఉత్పత్తి కేంద్రాలను పోర్ట్లతో అనుసంధానించేందుకు గతిశక్తి పథకాన్ని కేంద్రం తీసుకురావడం గమనించాలి. సీఐఐ వర్చువల్గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సోనోవాల్ మాట్లాడారు. 24 రాష్ట్రాల పరిధిలో 11 జలమార్గాలు విస్తరించాయని.. వీటిని జాతీయ జలమార్గాలుగా గుర్తించినట్టు తెలిపారు. ‘‘రవాణా వ్యయాలను తగ్గించడం భారత్కు కీలకం. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దృష్టితో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అనుసంధానం విస్తృతికి 101 ప్రాజెక్టులను మా శాఖ గుర్తించింది’’ అని సోనోవాల్ వివరించారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన సాగర్మాలా, భారత్మాలా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అమలు దశల్లో ఉన్నట్టు చెప్పారు. సాగర్మాలా ప్రాజెక్టు కింద పోర్టుల సదుపాయాల విస్తరణకు, నైపుణ్యాల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ శాఖా తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇతర పోర్ట్లతో అనుసంధానానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దేశంలో రవాణా సదుపాయాల విస్తరణ, రవాణా వ్యయాలు తగ్గించే లక్ష్యాలతో రూ.100 లక్షల కోట్ల నేషనల్ మాస్టర్ప్లాన్ను ప్రధాని మోదీ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రారంభించడం గమనార్హం. మౌలిక, రవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా భవిష్యత్తులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్నది ఇందులోని ఉద్దేశ్యం. దేశ వాణిజ్యం, వృద్ధిలో సముద్రరంగం కీలక పాత్ర పోషిస్తుందని సోనోవాల్ అన్నారు. సరఫరా వ్యవస్థ, రవాణా సామర్థ్యాలు బలోపేతం అయితే 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమవుతుందన్నారు. -
ఈ నెల 13న గతి శక్తి ప్లాన్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కనెక్టివిటీపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన గతి శక్తి–నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఐఎంపీ)ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 13న ఆవిష్కరించనున్నారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇన్ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్ఫాంలో అందుబాటులో ఉంచుతాయి. వీటిలో హై రిజల్యూషన్తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. వివిధ రవాణా సాధనాల మధ్య ప్రస్తుతం సమన్వయం లేదని, వీటిని సమన్వయపర్చే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను గతి శక్తి తొలగించగలదని అధికారులు వివరించారు. -
KTR: ఆక్రమణలపై ‘ట్రిపుల్ ఆర్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ‘ట్రిపుల్ ఆర్’ అస్త్రం ప్రయోగించనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణా భివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడిం చారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యు లు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్గౌడ్, అక్బరుద్దీన్ తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలోని చెరువులు దశాబ్దాలుగా కబ్జాలకు గురవడంతో అవి కుంచించుకుపోయా యని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నవాటిని పరిరక్షిస్తామని, తర్వాత ఆక్రమణలు తొలగించి సుందరీ కరిస్తామని మంత్రి తెలిపారు. చెరువుల పరిరక్షణలో భాగంగా ట్రిపుల్ ‘ఆర్’ విధానాన్ని అమలు చేస్తామని, ఆక్రమణల తొలగింపు(రిమూవ్), పున రావాసం(రిహాబిలిటేషన్), తిరిగి ఆక్రమణ కాకుండా నిలిపివేయడం(రిటైన్) పద్ధతిలో కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి చెరువు పరిరక్షణకు మాస్టర్ ప్లాన్ నగరంలోని ప్రతి చెరువుకూ ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ప్రత్యేక కమిషనర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని కేటీఆర్ పేర్కొ న్నారు. చెరువుల సుందరీకరణలో భాగంగా మురు గునీటి శుద్ధీకరణ కోసం 31 ఎస్టీపీలు రెండేళ్లలో నిర్మిస్తామని, వీటిని ఎఫ్టీఎల్ బయట ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధి లోని 127 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు తయా రు చేశామని, ఇందులో 48 చెరువుల అభివృద్ధి దాదాపు పూర్తయిందని వెల్లడించారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.407.30 కోట్లు మంజూరు కాగా, వీటిలో రూ.218 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. -
పాకిస్థాన్ కుట్ర బట్టబయలు..
-
విశాఖ మాస్టర్ ప్లాన్ పై కొనసాగుతున్న కసరత్తు
-
పని తప్పించుకోవడం కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు..
సాధారణంగా మనం వారంలో ఆరు రోజులు కష్టపడి ఒకరోజు మాత్రం సెలవు తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవడమో లేక సరదాగా ఎంజాయ్ చేయడమో చేస్తుంటాం. కానీ కొందరికి మాత్రం కనీసం ఆ వెసులుబాటు కూడా ఉండదు. ఉదాహరణకు ఒక ఉద్యోగి యజమాని పనిరాక్షసుడు అయితే మాత్రం ఆ ఉద్యోగులకు ఇక చుక్కలే.అయితే రోజులో ఎనిమిది గంటలే పనిచేయాలనే నిబంధనను కొందరు యజమానులు తుంగలో తొక్కి తమ ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుంటారు. ఆ సమయంలో తమకు కడుపునొప్పో.. జ్వరమో అని అబద్ధం చెప్పి పని నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అచ్చం అదే తరహాలో తాజాగా ఒక వ్యక్తి పని నుంచి తప్పించుకోవడానికి పెద్ద మాప్టర్ ప్లాన్ వేశాడు. సదరు వ్యక్తి ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా అతని బాస్ ఎక్కువ పని చేయిస్తుండడంతో ఆ వ్యక్తి లీవ్ అడిగితే ఇవ్వడని.. బాస్ను ఫూల్ చేసి సెలవు దక్కించుకోవాలన్ని చూశాడు. అందుకోసం ఒక కస్టమర్ బిల్లు చెల్లించేందుకు రాగా.. ఆమె బిల్లును రెడీ చేస్తూ తలపట్టుకున్నాడు. కస్టమర్ క్రెడిట్ కార్డు ఇచ్చేలోపే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో షాకైన మహిళ కస్టమర్ ఓనర్ను పిలిచింది. ఓనర్ వచ్చి అతన్ని పక్కన కూర్చోబెట్టి కాసేపటి తర్వాత రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించేశాడు. అలా ఓనర్ను ఫూల్ చేసి సెలవు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా తాను చేసిన పనిని గొప్పగా చెప్పుకుంటూ రాసుకొచ్చాడు. ఒకవేళ మీరు కూడా పనినుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి పని చేయండి.. రిప్లై తొందరగా వస్తుంది. ఇక నా విషయం ఏంటంటే.. పనికి వచ్చే ముందు రోజు నాకు కాస్త మందు ఎక్కువైంది. ఆ హ్యాంగోవర్ పనికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. మా ఓనర్ సెలవు అడిగినా ఇవ్వడని తెలసి.. ఈ ప్లాన్ వేశాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇప్పటివరకు దాదాపు 1 మిలియన్కు పైగా వీడియోనూ వీక్షించారు. చదవండి: గప్చుప్లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే What’s the best way you’ve ever blagged getting off work sick this is mine it was Boxing Day I was hungover and 18 and wanted to go out later so decided to pull this off 😭 made sure the manager was there as well pic.twitter.com/wIBuu2KWGL — elpedro ⭐️⭐️ (@ElpedroThe2nd) June 3, 2021 -
మాస్టర్ ప్లాన్: కేంద్రానికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు మరియు హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ఇంజన్ అయిన రాజధాని హైదరాబాద్ నగరంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. దీర్ఘకాలికంగా హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేశన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంప్రహెన్సివ్ సివరేజ్ మాస్టర్ ప్లానింగ్ దిశగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రక్క ప్రణాళికతో ముందుకు పోతుందని తెలిపారు. (కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కేటీఆర్ లేఖ) ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక,సర్వే, డిజైన్, అంచనాలు నిర్దారణ వంటి కార్యక్రమాలను పూర్తి చేసిందని, ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా మూడు ప్యాకేజీల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా సివరెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లతోపాటు మురికి నీటి ట్రంక్ లైన్ల ఏర్పాటు వంటి వాటితో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొద్ది రోజుల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్ మూసీ నది కాలుష్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ కి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. యస్టిపిలతోపాటు సివరేజ్ కలక్షన్ నెట్వర్క్ ట్రంక్, సివర్ లైన్ల నెట్వర్క్ మొత్తం 2232 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉందని, వీటి కోసం సుమారు 3722 కోట్ల రూపాయలతో 36 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ కాంప్రహెన్సివ్ సివరీజ్ మాస్టర్ ప్లాన్ కి కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులను అంటే సుమారు 750 కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు. దీంతో పాటు తాజాగా హైదరాబాద్ నగరంలో మునుపెన్నడూ లేని విధంగా వచ్చిన వరదల పైన అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, వరదలకు ప్రధాన కారణమైన ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని నాలాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని తీసుకుందని, హైదరాబాద్ నగర పరిధిలోని నాలాలను మరియు వాటర్ డ్రైన్ లను అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పనులు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి 1200 కోట్ల వార్షిక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసిందని ఇందులో కనీసం 20 శాతం అంటే 240 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రులను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అతి పెద్ద పట్టణం అయిన వరంగల్ నగరంలో ప్రస్తుత మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నియో మెట్రో రైల్ ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే నియో మెట్రో కి సంబంధించిన ప్రమాణాలను, ప్రత్యేకతలను కేంద్ర ప్రభుత్వం తుది రూపు ఇచ్చిన నేపథ్యంలో, వరంగల్ నగరానికి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం వరంగల్ జనాభా దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని, 2051 నాటికి 35 లక్షల వరకు వరంగల్ జనాభా పెరిగే అవకాశం ఉందని, ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ పట్టణంలో మహారాష్ట్రలోని నాసిక్ తరహాలో నియో మెట్రో ప్రాజెక్ట్ ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాసిక్ మెట్రో కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సహకారంతో వరంగల్ నియో మెట్రో కి సంబంధించిన డి పి ఆర్ సిద్ధం అయిందన్నారు. సుమారు 15.5 కిలోమీటర్ల ఉండే వరంగల్ మెట్రో కారిడార్ కి 1,050 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, ఇందులో లో 20 శాతం నిధులు అంటే 210 కోట్ల రూపాయలను ఈక్విటీ లేదా గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ తరఫున రాష్ట్రంలోని పురపాలికల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్యక్రమాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని పురపాలికల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం సుమారు 258 కోట్ల రూపాయలతో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ పురపాలికల్లో పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్ టన్నుల లెగసి డంపును (ఇప్పటి వరకు ఉన్న చెత్త) 520 కోట్ల రూపాయల ఖర్చుతో బయో మైనింగ్ మరియు రేమేడియేశన్ చేస్తున్నట్లు తెలిపారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ లకు సంబంధించి ఇప్పటికే 76 పురపాలికల్లో పనులు పూర్తయ్యాయని, ఇందుకోసం సుమారు 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని 57 పురపాలికల్లో సుమారు 13,228 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు కు నిధులు అవసరం అవుతాయని, అయితే అందులో మొదటి దశ కింద 30 పట్టణాల్లో 2828 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇలా దాదాపు 3777 కోట్ల రూపాయలతో రానున్న సంవత్సరం లో వివిధ పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నామని, ఇందులో కనీసం 20 శాతం అంటే 750 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. -
వరద: నిజాంల ‘ప్లాన్’ బెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అంతా అతలాకుతలమైంది. కానీ కుతుబ్షాహీ, ఆసఫ్జాహిల కాలంలో ఏర్పడ్డ బస్తీ లు కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. వరద ముప్పు లేకుండా ఉన్నాయి. పాత బస్తీలోని పలు పాత మొహల్లాల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి నాటి నిజాం పాలకులు, ఇంజినీర్ల కృషే కారణమని అంటున్నారు. చార్మినార్, మొఘల్పురా, ఖిల్వాట్, షా అలీ బండా, ఫతే దర్వాజా, పురాని హవేలి, నూర్ఖాన్ బజార్, హుస్సేనీ ఆలం, దూద్బౌలి, ఇంజిన్ బౌలి, కోట్ల అలీజా, పత్తర్గట్టి, పంజేషా పంచ మొహల్లా, చంచల్గూడ, ఖాజీపురా, కార్వాన్, జియాగుడ, అఫ్జల్గంజ్, ఫీల్ఖానా, జుమేరాత్ బజార్ తదితర ప్రాంతాలు నిన్నమొన్నటి భారీ వరదల్లోనూ ముంపునకు గురికాలేదు. నిజాం కాలం నాటి డ్రైనేజ్ జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ వందేళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట, అరగంటలోపే పాతబస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతోంది. 1908లో మూసీ వరద విపత్తు తర్వాత నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి రక్షించేందుకు..నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని కోరారు. హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో సలహాలు ఇవ్వాలని, వరదల నుంచి నగర భవిష్యత్ రక్షణ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని, నీటిపారుదలకు సంబంధించి సర్వం సిద్ధం చేయాలని కోరారు. 1911లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్ ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య ప్లాన్లోని ముఖ్యాంశాలివీ.. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నిర్మాణం మూసీ వరదల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు పురానాపూల్ నుంచి చాదర్ఘాట్ æవరకు మూసీనది పరీవాహక ప్రాంతంలో రక్షణ గోడలు ఏర్పాటు డ్రైనేజీ మాస్టర్ప్లాన్ పనుల పర్యవేక్షణకు నిపుణుల కమిటీ ఏర్పాటు. సకాలంలో పనులు పూర్తి ఓపెన్ డ్రైనేజీని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థగా మార్చడం ట్రంక్ సీవర్ మొయిన్స్, లేటరల్స్, సబ్మొయిన్స్, మురుగు కాల్వల డిజైన్లు సిద్ధం చేశారు లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు జాయింట్స్, మలుపుల వద్ద పైప్లైన్ వ్యవస్థ ఎలా ఉండాలో డ్రాయింగ్స్ ద్వారా ముందస్తుగా కసరత్తు చేసి నిర్మాణాలు చేపట్టారు నిజాం కాలంలో పకడ్బందీగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీంతో పాటు భూగర్భ అంతర్గత పైప్లైన్ల డిజైన్ వ్యవస్థ నేటికీ ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతోంది. -
విశాఖపట్నం విజన్
విశాఖ నగరం మూడు వైపులా విస్తరిస్తోంది.అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది. వలసలతో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మరోవైపు నగరం ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఎదగాలనే అంశంపైనా మాస్టర్ ప్లాన్కి అనుబంధంగా పర్స్పెక్టివ్ ప్లాన్కి తుదిమెరుగులు దిద్దుతోంది. సాక్షి, విశాఖపట్నం: వీఎంఆర్డీఏ పరిధిలో ప్రస్తుతం 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. మాస్టర్ప్లాన్ రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలతోనూ, శ్రీకాకుళం జిల్లాలోని 32 రెవెన్యూ, 41 మత్స్యకార గ్రామాలు, 9 వార్డులు, రెండు వర్గాల అభిప్రాయాలతో రూపొందించారు. మొత్తం మూడు విభాగాల్లో విజన్ని ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఆర్థిక, ఉపాధి, జనాభా అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. 12.5 మిలియన్ల జనాభాను అంచనా వేస్తూ ప్రణాళిక రూపొందించారు. మొత్తం ఆదాయంలో పారిశ్రామిక రంగం 40 శాతం వాటా, సేవారంగం 50 శాతం, వ్యవసాయ రంగం వాటా 10 శాతంగా ఉండేలా అంచనాలు వేశారు. అదే విధంగా ఉద్యోగ, ఉపాధి కల్పనలో పారిశ్రామిక రంగంలో 28 శాతం, సేవా రంగంలో 45, వ్యవసాయ రంగంలో 27 శాతం ఉండేలా అంచనాలు రూపొందించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 19 లక్షల నుంచి 56 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. మొత్తంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వీఎంఆర్డీఏ విజన్ రూపొందించింది. మూడో మాస్టర్ప్లాన్ ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు గత 35 సంవత్సరాలుగా వుడా మాస్టర్ ప్లాన్స్ రూపొందించింది. మొదటిసారిగా 1989 నుంచి 2001 వరకూ 1721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేసింది. రెండోసారి 2006 నుంచి 2021 వరకూ 1,721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 6,501.65 చ.కి.మీ విస్తీర్ణంలో 2041 వరకూ మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. మొత్తంగా మాస్టర్ ప్లాన్ను 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏఏ ప్రాంతాల్లో.. ఎలాంటి అభివృద్ధి..? మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో అభివృద్ధి చెయ్యాలని మాస్టర్ప్లాన్లో వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. వాటిని ఓసారి పరిశీలిస్తే... ఆరు దశల్లో పెర్స్పెక్టివ్ ప్లాన్ మాస్టర్ ప్లాన్కి అనుబంధంగా పర్స్పెక్టివ్ ప్లాన్ను వీఎంఆర్డీఏ రూపొందిస్తోంది. ఫీల్డ్ సర్వేలు, ట్రాఫిక్ సర్వేలు, బేజ్ మ్యాప్, అందుబాటులో ఉన్న భూ వినియోగం, వ్యూహాత్మక ప్రణాళిక, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు.. ఇలా ఆరు దశల్లో 2051–పెర్స్పెక్టివ్ ప్లాన్పైనా కసరత్తులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాపై ప్రాథమిక సమీక్షను స్టేక్హోల్డర్లతో వీఎంఆర్డీఏ ప్రతినెలా నిర్వహిస్తోంది. 46 మండలాలు.. 1,312 గ్రామాలు.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తరించిన వీఎంఆర్డీఏ.. ఆ మేరకు ప్రణాళిక తయారు చేసింది. 2041 నాటికి జనాభా ఎంత పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి ఎలా ఉండబోతుంది.? ఉద్యోగ కల్పన, ఏ ఏ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలనే విషయాల్ని క్రోడీకరించారు. భోగాపురం విమానాశ్రయం నుంచి అచ్యుతాపురం పారిశ్రామిక కారిడార్ వరకూ ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్–టీఓడీ కారిడార్(రవాణా ఆధారిత అభివృద్ధి వ్యవస్థ) ఏర్పాటు చెయ్యనున్నారు. మెట్రో కారిడార్ వెంబడి ఆర్థిక అభివృద్ధి చెందేలా కారిడార్ ఏర్పాటు విజయనగరం, అనకాపల్లి, నక్కపల్లి, భీమిలి ప్రాంతాలు గణనీయంగా విస్తరించనున్న నేపథ్యంలో శాటిలైట్ టౌన్షిప్లు విస్తరణ. ఈ టౌన్షిప్లను అనుసంధానం చేస్తూ బీఆర్టీఎస్ కారిడార్లు ఏర్పాటు. ఏడు ప్రాంతాల్లో రవాణా స్టేషన్లు నిర్మాణం. అరకులోయ, బుద్ధిస్ట్ సర్క్యూట్, హిందూ దేవాలయాల సర్క్యూట్, బీచ్, కోస్టల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు. సహజ సంపద, వ్యవసాయ భూముల పరిరక్షణ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. జోన్ల వారీగా వ్యూహాత్మక ప్రణాళిక ఎన్ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు.. చివరి వరకూ బీఆర్టీఎస్ కనెక్టివిటీ రహదారుల అభివృద్ధి మేఘాద్రి రిజర్వాయర్ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ప్రాంతాభివృద్ధి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన గాజువాక–స్టీల్ప్లాంట్ పరిసరాలు నగర విస్తరణకు ప్రణాళికలు అంతర్గత రహదారుల విస్తరణ మెట్రో, సిటీ బస్సులతో నగర అంతర్గత రవాణా వ్యవస్థని అచ్యుతాపురం వరకూ మెరుగుపరచడం ఆటోనగర్, దువ్వాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో విభిన్న తరహా అభివృద్ధికి ప్రణాళికలు ఎన్హెచ్–16లో పాదచారుల రక్షణ వ్యవస్థకు ప్రణాళికలు భీమిలి పరిసరాల్లో.. జీవీఎంసీతో కలిసి బీచ్ రోడ్డు అభివృద్ధి హెరిటేజ్ ప్రాంతంతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ విశాఖపట్నం–విజయనగరం–భోగాపురం వరకూ రహదారుల అనుసంధానం భోగాపురం విమానాశ్రయం వరకూ టూరిజం అభివృద్ధి అనకాపల్లి పరిసరాలు నగర విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళికలు విశాఖపట్నం నుంచి అనకాపల్లి, అచ్యుతాపురం ఇండ్రస్టియల్ ప్రాంతం వరకూ బస్ ఆధారిత రవాణా వ్యవస్థ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బైపాస్ రహదారులు అనకాపల్లి టౌన్ ప్రధాన వీధిని పాదచారులకు అనుగుణంగా మార్పు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతాలకు రహదారుల సౌకర్యం విస్తరించడం. మధురవాడ పరిసరాలు నగర విస్తరణకు ప్రణాళికలు మెట్రో రైలు మార్గం ఐటీ హిల్స్ పరిసరాల్ని విభిన్న అవసరాలకు అనుగుణంగా సెజ్గా మార్పు పరిసర ప్రాంతాల్లో సామాజికాభివృద్ధి పోర్టు ఏరియా పరిసరాలు మెట్రో, సిటీ బస్సులతో రవాణా వ్యవస్థ మెరుగు బీఆర్టీఎస్ కారిడార్ అభివృద్ధి యారాడ, సింహాచలం ప్రాంతాల్లో ఆక్రమణలకు చెక్ చెప్పడం పెదవాల్తేరు, చినవాల్తేరు పరిసరాలు ప్రాంతాభివృద్ధికి ప్రణాళికలు మెట్రో, సిటీ బస్సు సౌకర్యాలు స్మార్ట్సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు బీచ్ఫ్రంట్ రీ డెవలప్మెంట్ దసపల్లా హిల్స్ పరిసరాలు ఆయా ప్రాంతాల అభివృద్ధి హెరిటేజ్ ఏరియా సంరక్షణ, పరిసరాల అభివృద్ధి మెట్రో, సిటీ బస్సులతో కనెక్టివిటీ స్మార్ట్సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు మార్చి నాటికి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ వీఎంఆర్డీఏ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరి్ధష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించిన డేటా కలెక్షన్ పూర్తయింది. వచ్చిన వివరాలను పరిశీలన చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ని మార్చి నెలాఖరునాటికి సిద్ధం చేస్తాం. విశాఖ నగరానికి సమాన పోలికలున్న కొచ్చిన్, చెన్నై, సూరత్, ముంబై నగరాల్ని అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఈనెలలో కొచ్చిన్, చెన్నై నగరాలు, వచ్చే నెలలో సూరత్, ముంబై నగరాలకు మా బృందాలు వెళ్తున్నాయి. అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలపై నివేదిక సిద్ధం చేసి.. ఆ తరహా పరిస్థితులు వీఎంఆర్డీఏ పరిధిలోని ప్రజలకు ఎదురవకుండా సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
ఓరుగల్లు సమగ్రాభివృద్ధికి మాస్టర్ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) మాస్టర్ప్లాన్కు తుదిరూపునిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. పట్టణాల సమగ్రాభివృద్ధికి మాస్టర్ప్లాన్లు దిక్సూచిలా పనిచేస్తాయని అన్నారు. వరంగల్ మాస్టర్ప్లాన్ ముసాయిదా(డ్రాప్ట్ మాస్టర్ప్లాన్)పై కుడా పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం హైదరాబాద్లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాల అభివృద్ధికి మాస్టర్ప్లాన్ కీలకమని, భవిష్యత్తు తరాలకు ఉపయోపడేలా, సమగ్ర అభివృద్ధి సాధించేలా ఇవి ఉండాలని సూచించారు. ఈ మాస్టర్ప్లాన్పై వివిధ వర్గాల నుంచి సుమారు నాలుగు వేల వరకు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వీటన్నింటినీ క్రోడీకరించి డ్రాఫ్ట్ను తయారు చేసినట్లు చెప్పారు. 2041 సంవత్సరం వరకు అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ప్లాన్ను రూపొందించామని కేటీఆర్ తెలిపారు. చరిత్ర చెరిగిపోకుండా... వరంగల్ నగర చరిత్ర, పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, చెరువులు, రోడ్లు, కాలనీల అభివృద్ధిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం అనంతరం జీఐఎస్తో అనుసంధానం చేస్తామన్నారు. మాస్టర్ప్లాన్ పొందుపరిచిన అంశాల పరిశీలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికో నోడల్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ నోడల్ అధికారి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చే సలహాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఔటర్ రింగ్రోడ్డును అనుసంధానిస్తూ రేడియల్ రోడ్లను నిర్మిస్తామని, దీంతో ఓరుగల్లు ముఖచిత్రమే మారిపోనుందని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రోత్ కారిడార్లు, ఇండ్రస్టియల్ జోన్లను కూడా పొందుపరిచినట్లు చెప్పారు. పట్టణావసరాలకు అనుగుణంగా కుడా యంత్రాంగం పనితీరును మార్చుకోవాలని, అవసరమైన నిధులను సమీకరించుకునేలా ప్రణాళికలు రచించాలన్నారు. హెచ్ఎండీఏ తరహాలో ల్యాండ్ పూలింగ్, భూహక్కుల బదిలీ విధానం తదితర కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాస్టర్ప్లాన్ విశిష్టత, ఎక్కడెక్కడ ఏయే జోన్లను పొందుపరిచారనే దానిపై మంత్రి కేటీఆర్ వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరి్వంద్ కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, కుడా వైస్ చైర్మన్ ఎన్.రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక శుద్ధ జలధార
అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే... శుద్ధమైన నీటిని సేవించాలి. సంక్షేమ పథకాలతోనే సంతృప్తి చెందని సర్కారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ... వాటర్గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలో ప్రజలకు దశలవారీగా శుభ్రమైన నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతలో జిల్లాలో అమలు చేయనున్న పథకం కోసం జిల్లా అధికారులు రూ. 2600 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నేడో రేపో దానిని మంత్రులకు అందించి ఆమోదింపజేయనున్నారు. జిల్లాలోని తాగునీటి పథకాల సంఖ్య: 1989 ఇందులో సోలార్ పథకాలు : 160 మల్టీ విలేజ్ స్కీంలు : 34 సాక్షి, బొబ్బిలి: ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని ఇంటింటికీ అందించేందుకు నిర్ణయించింది. రెండో దశలో ఈ పథకం మన జిల్లాలో అమలు పరచనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని వర్తింపజేసి తాగునీటి సమస్యను నూరు శాతం పరిష్కరించే చర్యలు తీసుకోనున్నారు. జిల్లాకు పూర్తి స్థాయి వాటర్గ్రిడ్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాలో దీనికి జలధార అనే నామకరణం చేశారు. జిల్లాలోని 34 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మండలాల్లో ఉన్న పథకాలను కూడా వినియోగిస్తారు. ఆయా పథకాలకు శుద్ధి చేసిన జలాన్ని సరఫరా చేసి ఆ నీటిని గ్రామాల్లోని ప్రజలకు ఇంటింటికీ అందజేస్తారు. ఇందుకో సం అన్ని గ్రామాల్లో అదనపు పైప్లైన్లు నిర్మించనున్నారు. రూ.2,600 కోట్లతో మాస్టర్ప్లాన్.. జిల్లాలో పథకం అమలుకు సంబంధించి గ్రామీ ణ నీటి సరఫరా విభాగం అధికారులు రూ. 2,600 కోట్లతో ప్రణాళికలు, మాస్టర్ప్లాన్ను రూపొందించారు. ఈ నిధులతో వాటర్ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓవర్హెడ్ట్యాంకులు, తాగునీటి పైప్లు నిర్మిస్తారు. తద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తారు. విజయవాడ తరహాలో సాగునీటి ప్రాజెక్టుల్లోని మిగులు జలా లు వృధాగా పోకుండా వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించే ప్రణాళికే వాటర్గ్రిడ్. ఈ జలాలను ట్రీట్మెంట్ప్లాంట్ల సహాయంతో శుద్ధ జలాలుగా మారుస్తారు. ఇందుకోసం జిల్లాలోని తోటపల్లి, తాటిపూడి రిజర్వాయర్ల నీటిని తాగునీటి అవసరాలకోసం మారుస్తారు. దీనివల్ల మిగులు జలాలు వృధాగా నదుల్లోకి విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే నిత్యం బోర్లతో భూగర్భ జలాలను తోడేస్తూండటంవల్ల తలెత్తే పర్యావరణ ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చనేది ముఖ్యమంత్రి భావన. మనిషికి వందలీటర్ల నీరు పట్టణాల్లో ఓ వ్యక్తికి రోజుకు135 లీటర్ల నీరు అవసరం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 105 లీటర్ల నీరు అవసరమనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల్లో ఒకటి. వీటి ని అనుసరించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా సగటున ఓ వ్యక్తికి వంద లీటర్ల తాగునీరు ఇవ్వాలని జిల్లా అధి కారులు నిర్ణయించారు. తాగునీరు, వాడుక నీరు అన్న తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ వా టర్గ్రిడ్ను అమలు పరచాలని నిర్ణయించారు. దీనిపై సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవా ణి, ఇన్ఛార్జి మంత్రులకు అధి కారులు అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు వెంటనే ప్రారంభిస్తారు. మనిషికి వంద లీటర్ల నీరు.. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రతీ ఇంటిలోని ఒక్కో వ్యక్తికీ వందలీటర్ల చొప్పున నీటిని అందిస్తాం. ఇందుకోసం రూ.2,600 కోట్లతో మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశాం. త్వరలో ప్రభుత్వ పెద్దలకు అందజేస్తాం. – పప్పు రవి, ఎస్ఈ ఇన్చార్జి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, విజయనగరం -
వరంగల్ మాస్టర్ ప్లాన్@2041
సాక్షి, వరంగల్ : వరంగల్ మహా నగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ను సమగ్రాభివృద్ధి చేస్తూనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కూడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ‘కూడా’ వైస్ చైర్మన్ ఎన్.రవికిరణ్, పీఓ ఇ.అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా చెప్పారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్కు సూచించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా... రాష్ట్రంలో వరంగల్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా మహా నగరాన్ని అభివృద్ధి చేసేలా కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నామని మంత్రి దయాకర్రావు తెలిపారు. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్–1971ను సరిచేస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 తయారైందని చెప్పారు. వరంగల్ సమగ్రాభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించేలా మాస్టర్ ప్లాన్ ఉందని తెలిపారు. మూడు జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్నాయని, మొత్తం 1800 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటుందని చెప్పారు. గత మాస్టర్ ప్లాన్తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉంటుందని వివరించారు. టెక్స్టైల్ పార్క్, టూరిజం హబ్... వంటి అన్ని అంశాలతో వరంగల్ ఎకనామిక్ హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ప్లాన్ తయారు చేశామని, ‘కూడా’ పరిధిలో ఉన్న 2 వేల చెరువులను పరిరక్షించేలా చూస్తున్నామని చెప్పారు. అలాగే, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగు రోడ్లు.. ఇలా ప్రజల అవసరాల ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు అమలవుతాయని మంత్రి తెలిపారు. ప్రజల సూచనలకు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మార్పులతో తుది ప్లాన్ సిద్ధం చేశామని, ఎన్జీవోలు, పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ను ఆమోదం కోసం ఈ ఏడాది జూన్లో ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో త్వరగా ఆమోదం పొందేలా మున్సిపల్ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మునిసిపల్ శాఖ పూర్తిగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ సందర్భంగా బదులిచ్చారు. ఈ సమావేశానికి ముందు మంత్రి దయాకర్రావు ‘కూడా’ చైర్మ న్, అధికారులతో కూడా ఈ విషయమై సమీక్షించారు. -
అన్న కొడుకే సూత్రధారి
సాక్షి, నెల్లూరు (క్రైమ్): ఆస్తి విభేదాలే మహేంద్రసింగ్ రాజ్పురోహిత్ (40) హత్యకు దారి తీశాయి. సొంత అన్న కొడుకే కిరాయి హంతకులతో తుద ముట్టించాడని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సూత్రధారి విక్రమ్సింగ్ను పోలీసులు ఆదివారం రాత్రి తిరుపతిలో అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన కిరాయి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం స్థానిక ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పవర్ టూల్స్ వ్యాపారి మహేంద్రసింగ్ హత్యకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామానికి చెందిన మహేంద్రసింగ్ రాజ్పురోహిత్ తన భార్య ఉషాదేవితో కలిసి 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్పేట రైతుబజారు ఎదురుగా అక్కనవారి వీధిలో నివాసం ఉంటూ అక్కడే కోమల్ పవర్ టూల్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన అన్న మంగిలాల్ కుమారుడు విక్రమ్సింగ్ చిన్నప్పటి నుంచే బాబాయి మహేంద్రసింగ్ వద్ద ఉంటూ వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. విక్రమ్సింగ్కు బాబాయే వివాహం చేశాడు. ఈ క్రమంలో మహేంద్రసింగ్ సంతపేటలో పవర్ టూల్స్ దుకాణం ప్రారంభించి దాని బాధ్యతలను విక్రమసింగ్కు అప్పగించాడు. షాపులో మంచి లాభాలు వచ్చాయి. అయితే విక్రమసింగ్ డబ్బును కాజేసి నష్టాలను చూపించసాగాడు. దీంతో మహేంద్రసింగ్ అతన్ని తిరుపతికి పంపించేశాడు. ఈ క్రమంలో విక్రమ్సింగ్ ఆర్థికంగా చితికిపోయాడు ఆస్తి విషయమే విభేదాలకు కారణం గతంలో మహేంద్రసింగ్ తన స్వగ్రామంలో తనతో పాటు తన అన్నకు కూడా ఇల్లు కట్టిస్తానని విక్రమసింగ్కు మాటిచ్చాడు. అయితే మహేంద్రసింగ్ ఒక్కడే తన భార్య పేరిట ఇంటిని నిర్మించుకున్నాడు. తన తండ్రికి ఎందుకు ఇల్లు కట్టించి ఇవ్వలేదని అప్పట్లోనే మహేంద్రసింగ్తో విక్రమ్సింగ్ గొడవ పడ్డాడు. దీంతో విక్రమ్సింగ్ తన బాబాయిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా బాబాయిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనదే అవుతుందని ఏడాదిగా ఆయన హత్యకు పథక రచన చేశాడు. మూడో సారి.. గురి చూసి.. నిందితులు మహేంద్రసింగ్ కదలికలపై నిఘా ఉంచారు. ఈ ఏడాది వినాయకచవితి సందర్భంగా ఆయన తన స్వగ్రామానికి వెళ్లడంతో అక్కడ ఆయన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. అయితే స్వగ్రామం కావడం అందరూ తెలిసిన వారే కావడంతో దొరికిపోతారని ఆ ప్రయత్నాని విరమించుకున్నారు. ఆ తర్వాత నిందితులు నెల్లూరుకు చేరుకుని రెండు సార్లు మహేంద్రసింగ్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అది వీలు పడలేదు. ఈ నెల 3వ తేదీ రాత్రి మహేంద్రసింగ్ ఇంటికి వెళ్తుండగా నిందితుల్లో ఇద్దరు మోటారు బైక్పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. ఐదు బృందాలతో గాలింపు మహేంద్రసింగ్ హత్య నెల్లూరు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ ఘటనను సవాల్గా తీసుకున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. హతుడి కాల్ డిటైల్స్, ఘటన జరిగిన సమయంలో నగరంలోని సీసీ ఫుటేజ్లు, మృతుడితో బంధువులకున్న విభేదాలు తదితర కోణాల్లో క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. విచారణలో విక్రమ్సింగ్ ఈ దురాఘాతానికి ఒడిగట్టాడన్న సమాచారం అందడంతో నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి తిరుపతిలో విక్రమ్సింగ్ను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన కిరాయి హంతకుల కోసం బృందాలు మహారాష్ట్ర, రాజస్థాన్ల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు విక్రమ్సింగ్ (ఫైల్) సిబ్బందికి అభినందన : మహేంద్రసింగ్ హత్య కేసులో చిన్నపాటి క్లూసైతం సిబ్బందికి దొరకలేదన్నారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో కేసులోని చిక్కుముడి వీడిందని, నిందితుడిని అరెస్ట్ చేయగలిగారన్నారు. త్వరితగతిన కేసును ఛేదించిన నగర డీఎస్పీతో పాటు ప్రత్యేక బృందాల్లోని సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ పి. పరమేశ్వర్రెడ్డి, నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, చిన్నబజారు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సమస్యకు మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వడం లేదని, దీని కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ్ హైకోర్టుకు లేఖ రాశారు. ఏటా రోడ్లపై పెరిగిపోతోన్న వాహనాల సంఖ్యను నియంత్రించేందుకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. లేఖపై స్పందించిన హైకోర్టు దీనిని పిల్గా మలిచింది. దీని పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, పురపాలక ముఖ్య కార్యదర్శి, రవాణా ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఇద్దరు దొంగలు.. 146మంది పోలీసులు
న్యూఢిల్లీ : ఆ ఇద్దరు దొంగలు అటు జనాలకు ఇటు పోలీసులకు తలనొప్పిగా మారారు. చాలా తెలివిగా దొంగతనాలు చేసి తప్పించుకునేవారు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు దొంగల కంటే తెలివిగా ఆలోచించి వారిలో ఒకడ్ని పట్టుకున్నారు. ఆ దొంగని పట్టుకోవటానికి ఏకంగా 146మంది పోలీసులు ఆయుధాలతో రంగంలోకి దిగాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గత కొద్దినెలలుగా దక్షిణ ఢిల్లీకి చెందిన మాళవ్యా నగర్, సాకేత్, నెబ్ సరతి, మెహ్రళి, ఫతేహ్పుర్ బెరి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. పోలీసులు ఆ దొంగలను పట్టుకోవటానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దొంగలు చాలా తెలివిగా పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకునేవారు.ఇక్కడ ఓ కామన్పాయింట్ను పోలీసులు అవకాశంగా మలుచుకున్నారు. నమోదైన అన్ని ఫిర్యాదుల్లోనూ.. ఇద్దరు దొంగలు తెల్ల అపాచీ బైక్ మీద వచ్చి మగవాళ్లు, వృద్ధుల మెడలోని ఆభరణాలను చోరీ చేస్తున్నట్లు తేలింది. అదికూడా జనావాసం ఉన్న కాలనీలలో ఉదయం పూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. దీంతో 146మంది పోలీసులు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. టెక్నాలజీ సహాయంతో ఆయుధాలు ధరించి దొంగలు తరుచుగా చోరీలకు పాల్పడుతున్న ప్రదేశాలలో కాపుకాశారు. ఎట్టకేలకు పోలీసుల ప్రయత్నాలు ఫలించి దొంగల జట్టులో ఒకడిని పట్టుకున్నారు. అతన్ని ఘజియాబాద్కు చెందిన వినీత్ వర్మగా పోలీసులు గుర్తించారు. వినీత్ అతని మిత్రుడు అమిత్ కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వీరిద్దరిపై ఇదివరకే చాలా కేసులు ఉన్నాయని పెరోల్ మీద బయటకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిసింది. అమిత్ వద్ద నుంచి ఓ ఆయుధాన్ని, అపాజీ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రథమ సేవకుడిగా పనిచేస్తా
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చెంత నూతన ఈఓ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రథమ సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు. తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా భీమవరమని చెప్పారు. తాను 20 డిగ్రీ పట్టాలు అందుకుంటున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. ప్రశ్న: భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? జవాబు: శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడూ.. వసతి దొరకాలని, సంతృప్తికరమైన దర్శనం కలగాలని కోరుకుంటాడు. ప్రధాన సేవకుడిగా వారి కోరికలను నెరవేర్చడం నా బాధ్యత. మల్లన్న దర్శనానికి వచ్చే దివ్యాంగులు, గర్భిణిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. వీరి కోసం ప్రత్యేక క్యూను ఏర్పాటు చేస్తాను. ఇంత ముందులా కాకుండా నేరుగా స్వామి అమ్మవార్లను త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. ప్ర: వసతి గదులను ఏమైనా నిర్మిస్తున్నారా? జ: సాధారణ భక్తుల కోసం రింగ్రోడ్డు సమీపంలో 200 వసతి గదులను నిర్మిస్తున్నాం. భక్తులకు అవసరమైన డార్మెంటరీలను నిర్మిస్తాం. అలాగే అతి తక్కువ ధరతో లాకర్ బాత్రూమ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ప్ర: గతంలో ఏ ఆలయంలో ఈఓగా పనిచేశారు? జ: నేను శ్రీకాళహస్తి ఈఓగా 2010 నుంచి 2012 వరకు పనిచేశాను. అక్కడ ఉన్న సమయంలో 50 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. శ్రీశైల దేవస్థానానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా అవసరం ఉంది. ఇక్కడ అన్నదానానికి రూ.43 కోట్ల వరకు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. త్వరలో మరి కొన్నింటిని చేసే దశగా ప్రయత్నం చేస్తాను. ప్ర: పుష్కరిణి సమస్య మీ దృష్టికి వచ్చిందా? జ: వచ్చింది. పుష్కరిణిలోకి కంచిమఠం వారికి సంబంధించిన డ్రైనేజీ నీరు ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. కంచిమఠం నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. ఆలయానికి దగ్గరలో ఉడడంతో భక్తుల ఇక్కడే స్నానాలు చేయాలని చూస్తారు. వారి కోరిక మేరకు త్వరలో పూర్తి స్థాయిలో పుష్కరిణి అందుబాటులోకి తేస్తాను. ప్ర: భక్తులకు మినరల్ వాటర్ అందిస్తారా? జ: కచ్చితంగా.. క్షేత్రంలో శివగంగ జల ప్రసాద పథకం ద్వారా ఎనిమిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో కొన్ని పనిచేయడం లేదని నా దృష్టికి వచ్చింది. త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి భక్తులకు అందుబాటులోకి తెస్తాను. ప్ర: మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయనున్నారు? జ: క్షేత్రాభివృద్ధికి నా వంతుగా మాస్టర్ ప్లాన్లోని పనులను త్వరగతిన అమలు చేస్తాను. ఇందులో ప్రధానంగా వసతి గదులపై దృష్టి సారించాను. నందిసర్కిల్ ప్రాంతంలోని సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్.. ఆలయ ప్రధాన పురవీధిలోని దుకాణాలను తొలగించి షిప్ట్ చేయాలే ఉద్దేశంతో నిర్మించారు. వర్షాలు పడిన సమయంలో లికేజీ కాకుండా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. -
వరంగల్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్: కేటీఆర్
సాక్షి, వరంగల్: వరంగల్ నగర అభివృద్ధి ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఉంటుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్ధ (కుడా) కార్యాలయంలో బుధవారం వరంగల్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 15 కల్లా మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తామని తెలిపారు. నగరం చుట్టూ 500 ఎకరాల్లో టౌన్షిప్ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మమునూరు ఎయిర్పోర్టును త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. కూడా భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా వరంగల్లో సమగ్ర రవాణ సర్వే చేస్తామని కేటీఆర్ తెలిపారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, హరిత, నగర మేయర్ నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం అయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
కాకినాడకు కొత్త మాస్టర్ప్లాన్
కాకినాడ (కాకినాడ సిటీ) : స్మార్ట్ సిటీ కాకినాడలో కొత్త మాస్టర్ప్లాన్కు ఆమోదం లభించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోదావరి అర్బన్ డవలప్మెంట్ అధారిటీ (గుడా)లో పరిధిలోకి కాకినాడ ఇప్పటికే చేరిన విషయం విదితమే. 1975లో 20 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో మాస్టర్ప్లాన్ రూపొందించారు. 1.64 లక్షల జనాభాకు తగ్గట్టుగా రూపుదిద్దుకున్న ఆ మాస్టర్ప్లాన్ను 1995లో సవరించారు. ఆ తరువాత అనేక సవరణలు చేశారు. 2011లో 3.26 లక్షల మంది జనాభాతో కొత్త మాస్టర్ప్లాన్కు రూపకల్పన చేశారు. ఎట్టకేలకు 2016లో కౌన్సిల్ తీర్మానం ద్వారా ఈ మాస్టర్ప్లాన్ను ప్రభుత్వానికి నివేదించారు. కాకినాడ పరిసరాల్లోని సుమారు 32 గ్రామాలను కూడా మాస్టర్ప్లాన్లో కలుపుతూ ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్కు చెందిన ఆర్వీ అసోసియేట్ సంస్థ ఈ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చింది. 2035 నాటికి 10.93 లక్షల మంది జనాభా ఉంటుందన్న అంచనాతో చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొత్త మాస్టర్ప్లాన్ అమలులోకి వస్తే కాకినాడలో ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాంతంగా ఉన్న మెయిన్రోడ్డు కమర్షియల్ జోన్గానూ, ఇండస్ట్రియల్ జోన్, స్కూల్ జోన్, గ్రీన్బెల్ట్ ప్రాంతాలను వేర్వేరుగా కేటాయించనున్నారు. -
యాదాద్రి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు
సాక్షి,యాదాద్రి : యాదాద్రి పరిసరాల్లోని పర్యాటక, పుణ్య క్షేత్రాలను కలుపుకుని యాదాద్రి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులతో కలిసి నిర్వహించిన యాదాద్రి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా టూరిజం, దేవాదాయ, పురావస్తు శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యాదాద్రి నవగిరులను ఆధ్యాత్మిక దర్శనీయ ప్రార్థన మందిరాలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఇప్పటికే మొదయ్యాయి. తాజాగా యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరంలోని భువనగిరి ఖిలాను, 23 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాకను వైటీడీఏ కిందికి చేర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాలను పరిశీలించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు మరో మాస్టర్ప్లాన్ రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హైదారాబాద్కు చేరువలో.. భువనగిరి ఖిలా, యాదగిరిగుట్ట, కొలనుపాక పక్కపక్కనే ఉండడంతో దేశ విదేశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులు ఈ మూడు ప్రాంతాలకు వచ్చిపోతుంటారు. భువనగిరి ఖిలా హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకుల కోసం ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు యాదగిరిగుట్టకు వెళ్లడానికి బస్, ఆటో, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం ఆలేరు మండలంలోని కొలనుపాకకు చేరుకుంటారు. అక్కడ పురావస్తు శాఖ మ్యూజియంతో పాటు, వీరశైవ మతానికి చెందిన చండికాంబ సహిత సోమేశ్వరాలయం, జైన దేవాలయం ఉన్నాయి. దీంతో యాదగిరిగుట్ట, భువనగిరి, కొలనుపాకను వైటీడీఏ గొడుగుకిందికి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాంతాల్లో పరిపాలన పరంగా ఒకే రకమైన చర్యలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టే అవకాశాలున్నాయి. యాదాద్రి టూరిజం సర్క్యూట్కు సీఎం ఆదేశం జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు, టూరిజం సర్క్యూట్కు కావాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో సీఎం కేసీఆర్కు టూరిజం సర్క్యూట్ ప్రణాళికలు సమర్పిస్తాం. – అనితారామచంద్రన్, కలెక్టర్ -
హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ పునస్సమీక్షించాలి
బీజేపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హెచ్ఎం డీఏ మాస్టర్ ప్లాన్ను పునస్సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మాస్టర్ప్లాన్ బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదని ధ్వజమెత్తిం ది. హెచ్ఎండీఏ, స్థానిక సంస్థల మధ్య సమ న్వయం ఉండాలని, హెచ్ఎండీఏ ఆదాయం లో కనీసం సగం స్థానిక సంస్థలకు కేటాయిం చాలని కోరింది. నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్రోడ్డును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసు కోవాలని సూచించింది. ప్రధాన రింగ్రోడ్డు, సర్వీసు రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టా లని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్రోడ్డుపై టోల్ వసూలు పెంపుదల ప్రతి పాదనను ఉపసంహరించుకోవాలన్నారు. అన్ని రేడియల్ రోడ్లను పూర్తిచేయాలని, నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్న జీడిమెట్ల–సారగూడ రేడియల్ రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యం
రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS రూటే.. సెపరేటు మోరంపూడి – స్టేడియం రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని మాస్టర్ప్లా¯ŒSలో ప్రతిపాదనలు ఆ మేరకే కౌన్సిల్ తీర్మానం దాని ప్రకారమే సంతకం చేసిన మేయర్ ఆ తీర్మానాన్ని పట్టించుకోని అధికారులు 80 అడుగులకే పరిమితం చేస్తూ సర్వే.. మార్కింగ్లు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరాభివృద్ధిని 2031వ సంవత్సరం నాటికి ఊహిస్తూ రూపొందించిన మాస్టర్ప్లా¯ŒS అమలులో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మాస్టర్ప్లా¯ŒS రూపొందించే బాధ్యతను నగరపాలక సంస్థ ఆర్వీ అసోసియేట్స్కు అప్పగించింది. మాస్టర్ప్లా¯ŒSలో మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని సూచించింది. అయితే దీనిని 80 అడుగులకు కుదించాలని అనేక వినతులు వచ్చాయి. ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఈమేరకు సిఫారసులు చేశారు. అయితే నగరంలో ఈ రోడ్డు చాలా ప్రధానమైనదని, ముఖ్యమైన పలు లింకు రోడ్లు ఈ రోడ్డులో కలుస్తున్నాయని పేర్కొంటూ అధికార యంత్రాంగం ఈ సిఫారసులను తోసిపుచ్చింది. 1971 మాస్టర్ప్లా¯ŒS ప్రకారమే 80 అడుగులకు విస్తరించాల్సి ఉందని, ఇప్పుడు పెరిగిన రద్దీ దృష్ట్యా 100 అడుగులకు విస్తరించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే మాస్టర్ప్లా¯ŒS ఆమోదించిన రోజున చివరి నిమిషంలో గందరగోళం మధ్య ఐదుగురు కార్పొరేటర్లు ఈ రోడ్డును 80 అడుగులకే విస్తరించాలని నోటిమాట ద్వారా సిఫారసు చేశారు. వాటిని, విపక్ష కార్పొరేటర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ప్లా¯ŒSను ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగకుండానే అంతా 30 నిమిషాల్లోనే ముగించేశారు. నాటకీయ పరిణామాలు మాస్టర్ప్లా¯ŒS ఆమోదం తర్వాత ఐదుగురు కార్పొరేటర్లు తమ సిఫారసుల లేఖలను అధికారులకు అందజేశారు. మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును 80 అడుగుల వరకే విస్తరించాలని కోరారు. దీనిపై రోజుల తరబడి చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అత్యంత రద్దీ కలిగిన ఈ రోడ్డును ఆర్వీ అసోసియేట్స్, అధికార యంత్రాంగం పేర్కొన్నట్లు 100 అడుగులకే విస్తరించాలని మేయర్ స్పష్టం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో సీనియర్ కార్పొరేటర్లు తమ ప్రతిపాదనలను నెగ్గించుకోవాలని పట్టుబట్టడం, మేయర్ వెనక్కు తగ్గకపోవడంతో ఈ తతంగం రెండు నెలలపాటు సాగింది. మాస్టర్ప్లా¯ŒSపై సంతకాల ప్రక్రియ ఆలస్యం కావడానికి ఈ రోడ్డు వ్యవహారం కూడా ఒక కారణమైంది. రెండు నెలలైనా మాస్టర్ప్లా¯ŒS ముందుకు కదలకపోవడంపై గత నెల 30న ‘సిఫారసుల లెక్క తేలలేదు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. పైగా కావాలనే మాస్టర్ప్లా¯ŒSపై సంతకాలు చేయకుండా నాన్చుతున్నారన్న ప్రచారం జరుగుతూండడంతో మేయర్ పంతం రజనీ శేషసాయి రెండు రోజుల క్రితం మాస్టర్ప్లా¯ŒSను ఆమోదిస్తూ సంతకం చేశారు. 80 అడుగులకే విస్తరించేలా జరుగుతున్న సర్వే 1971 మాస్టర్ప్లా¯ŒS ప్రకారం మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డును 80 అడుగులకు విస్తరించాల్సి ఉంది. కానీ అనేక కారణాలవల్ల ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు. పరిహారంపై కూడా అనేక అభ్యంతరాలున్నాయి. ఇదిలా ఉండగా తాజా మాస్టర్ప్లా¯ŒS నేపథ్యంలో 15 రోజుల క్రితం ఈ రోడ్డు విస్తరణ ప్రక్రియ చేపట్టారు. నగరపాలక సంస్థ సర్వే విభాగం సిబ్బంది 80 అడుగుల మేర విస్తరించేలా కొలతలు తీసి, గోడలపై మార్కింగ్(గుర్తు)లు వేశారు. తాడితోట ప్రాంతంలో ఇప్పటికే ఇరువైపులా మార్కింగ్ పూర్తయింది. అత్యంత ప్రధానమైన రోడ్డు నగరంలోని ప్రధానమైన రోడ్లలో మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డు ఒకటి. ఈ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సాగే ఈ రోడ్డులో నగరంలోని ఎనిమిది ముఖ్యమైన లింకు రోడ్లు కలుస్తాయి. వీఎల్ పురం రోడ్డు, తిలక్రోడ్డు, సోమాలమ్మ పుంత రోడ్డు, వెంకటేశ్వర హోల్సేల్ జనరల్ మార్కెట్ రోడ్డు, శీలం నూకరాజు ఫ్యాక్టరీ రోడ్డు, తాడితోట మహాత్మాగాంధీ హోల్సేల్ వస్త్ర దుకాణాల రోడ్డు, తాడితోట బైపాస్ రోడ్డు, తాడితోట ఇండస్ట్రియల్ లింకు రోడ్లు కలుస్తాయి. దాదాపు 60 అడుగుల వెడల్పుతో ఉన్న మోరంపూడి – స్టేడియం రోడ్డులో కలిసే లింకు రోడ్లు కూడా 30 నుంచి 60 అడుగుల వరకూ ఉన్నాయి. రోజూ ఈ రహదారిలో ట్రాఫిక్ జామ్ అవుతూంటుంది. అనేక విద్యా, వ్యాపార సంస్థలున్న ఈ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్, షెల్టాన్ హోటల్, తాడితోట జంక్షన్, స్టేడియం కూడలిలో నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతోంది. స్టేడియం నుంచి షెల్టా¯ŒS హోటల్ వరకూ రెండువైపులా దుకాణాలుండగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ఒకవైపు మాత్రమే ఉన్నాయి. అక్కడినుంచి వీఎల్ పురం సెంటర్ వరకూ ఇరువైపులా అక్కడక్కడ మాత్రమే దుకాణాలున్నాయి. 90 శాతం మేర ఖాళీ స్థలాలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డును 100 అడుగులకు విస్తరించడం సులువే. కానీ, అధికారులు మాత్రం ఏ ఒత్తిళ్లకు లొంగారో కానీ.. కౌన్సిల్ తీర్మానానికి భిన్నంగా 80 అడుగులకే విస్తరించడం వివాదాస్పదమవుతోంది. మాస్టర్ప్లా¯ŒS ప్రకారమే ఆమోదించాం ఆర్వీ అసోసియేట్స్, అధికార యంత్రాంగం మాస్టర్ప్లా¯ŒSలో పేర్కొన్న మేరకు మోరంపూడి సెంటర్ – స్టేడియం రోడ్డు విస్తరణను ఆమోదించాం. 80 అడుగులకు తగ్గించాలన్న సిఫారసులను తోసిపుచ్చాం. ఈ రోడ్డులో రద్దీ ఎక్కువ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డును విస్తరణ చాలా సులువు. చాలావరకూ ఖాళీ స్థలాలున్నాయి. – పంతం రజనీ శేషసాయి, మేయర్, రాజమహేంద్రవరం డీటీసీపీ కార్యాలయానికి పంపాం ఈ రోడ్డు విస్తరణపై వచ్చిన అభ్యంతరాలను డీటీసీపీ కార్యాలయానికి పంపించాం. ఆ అభ్యంతరాలు పరిశీలించి, తుది ముసాయిదా వచ్చిన తర్వాత ఎంతమేరకు విస్తరించాలనేది తెలుస్తుంది. – వి.విజయరామరాజు, కమిషనర్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ -
మాస్టర్ ప్లాన్
మార్చి 4న నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు జూన్ 2న ఔటర్ పనులకు శంకుస్థాపన డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్ నిర్ణయం గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్ష వరంగల్ : వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలను త్వరగా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నగర అభివృద్ధికి కీలకమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు గడువు నిర్ణయించారు. మార్చి 4న వరంగల్ మహానగరం మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణ పనులను వచ్చే జూన్ 2న మొదలుపెట్టాలని నిర్ణయించారు. వరంగల్ మహానగరం అభివృద్ధి కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మున్సిపల్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘వరంగల్ మహానగరం అభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్ను వెంటనే రూపొందించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ 1971లో రూపొంచిందించి. మహానగరం అభివృద్ధికి దోహదపడేలా ఇది లేదు. కొత్త మాస్టర్ప్లాన్పై కసరత్తు చేయాలి. మార్చి 4న మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ను విడుదల చేయాలి. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే వరకు భవన నిర్మాణ అనుమతులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవద్దు. భూగర్భ డ్రెయినేజీ, రేడియల్ రోడ్లు, స్లి్పట్ రోడ్లు, పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్, వినోద కేంద్రాలు ఉండేలా మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఏడాదిలోపు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. వరంగల్ నగర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నా... పనుల్లో జాప్యం జరుగుతోంది. అధికా>రులు ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాలి. వరంగల్ ఔటర్ రింగ్రోడ్డు పనులపై ఏడాదిగా చెబుతున్నా పనులు జరగడం లేదు. ఈ పనులపై వెంటనే షెడ్యూల్ సిద్ధం చేయాలి. జూన్ 2న ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని నిర్ణయించాము. అప్పటిలోపు అవసరమైన భూసేకరణ, డీపీఆర్ పనులు పూర్తి చేయాలి. 2018 నాటికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక ఉండాలి. 72 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి 20 కిలో మీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం, రేడియల్ రోడ్లు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వసతులను ఏర్పాటు చేసేలా ప్రణాళిక ఉండాలి. టెండర్లు పిలిచేలోపే మొత్తం భూసేకరణ జరగాలి. భూసేకరణ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి’ అని అధికారులకు ఇద్దరు మంత్రులు ఆదేశాలు జారీచేశారు. ఔటర్ రింగ్రోడ్డు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్ష కోసం ప్రతి నెలా వరంగల్లో సమావేశం జరగాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష కోసం మార్చి 4న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, అరూరి రమేశ్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎం.యాదవరెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్మిట్టల్, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ రవీందర్రావు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ శృతిఓజా తదితరులు పాల్గొన్నారు. -
సిఫారసుల లెక్క తేలలేదు!
ముందుకు కదలని రాజమహేంద్రవరంమాస్టర్ ప్లాన్ కౌన్సిల్ ఆమోదం పొంది 2 నెలలు అయినా ప్రభుత్వానికి పంపని వైనం ∙ మార్పులు, చేర్పులకు కార్పొరేటర్ల సూచనలు వాటి ‘లెక్క’ అందనందువల్లనే జాప్యమా అన్న అనుమానాలు సాక్షి, రాజమహేంద్రవరం : 2031వ సంవత్సరం నాటికి రాజమహేంద్రవరం నగరాభివృద్ధిని ఊహిస్తూ, చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామ పంచాయతీలను కలుపుతూ రూపొందించిన మాస్లర్ ప్లా¯ŒS ఇంతవరకూ ప్రభుత్వానికి చేరకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 3న జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్షం అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నా.. కేవలం ఐదంటే ఐదే నిమిషాల్లో మాస్టర్ప్లా¯ŒSను ఆమోదించారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే, అప్పటికప్పుడు నోటిమాట ద్వారా కొంతమంది కార్పొరేటర్లు అనేక సిఫారసులు కూడా చేశారు. గందరగోళం మధ్యనే వాటిని ఆమోదిస్తూ మాస్టర్ప్లా¯ŒSకు కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. అంతకుముందు కార్పొరేటర్ల అభ్యంతరాలు, సిఫారసుల పేరుతో అధికార యంత్రాంగం కొంత సమయం ఇచ్చి, మాస్టర్ప్లా¯ŒS ముసాయిదాను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించి ఇచ్చింది. ఆ సమయంలో పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అనేక సిఫార్సులు చేశారు. వీటిలో రోడ్ల వెడల్పు తగ్గించడం నుంచి ల్యాండ్ కన్వర్ష¯ŒS వరకూ అనేకం ఉన్నాయి. కొంతమంది పెద్దల స్థలాలు పోతున్నాయన్న ఉద్దేశంతో కొత్తగా ప్రతిపాదించిన రోడ్లను సైతం ఉపసంహరిస్తూ సిఫారసులు చేశారు. తమతమ బంధువుల స్థలాలకు ధరలు పెరిగేలా, వాటి సమీపంలో అనేక రోడ్లు వేసేందుకు ప్రతిపాదించారు. కొంతమంది అధికార పార్టీ కార్పొరేటర్లు తమ డివిజ¯ŒSలోనివే కాకుండా పక్క డివిజన్లలో స్థలాలు, రోడ్లు తగ్గించడంపై కూడా సిఫారసులు చేశారు. మరికొంతమంది కోలమూరు, పిడింగొయ్యి లాంటి పంచాయతీల్లో భూమి వినియోగ స్థితిపై సిఫారసులు ఇచ్చారు. సిఫారసులపై ఆరోపణలు ఒక్కో సిఫారసుకు లక్షల రూపాయలు చేతులు మారినట్లు అప్పట్లో బలమైన ఆరోపణలు వచ్చాయి. రోడ్ల వెడల్పు తగ్గించడం, ఎన్విరా¯ŒSమెంటల్ బఫర్ జో¯ŒSలో ఉన్న భూములను కమర్షియల్గా మార్చడం, ఇండస్ట్రియల్ జో¯ŒSలో ఉన్న భూములను రెసిడెన్షియల్, మిక్స్డ్ యూజ్గా మార్చడంవంటివి ఈ సిఫారసులలో కొన్ని. వీటి ద్వారా మాస్టర్ ప్లా¯ŒSలో అనేక మార్పులు, చేర్పులు చేశారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోలమూరు, కొంతమూరు, కాతేరు తదితర పంచాయతీల్లో వేసిన వందలాది వెంచర్లకు మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించిన రోడ్ల వల్ల నష్టం జరగకుండా, వాటి విలువ పెరిగేలా రోడ్ల మ్యాప్లనే మార్చేశారు. ఇందుకు ప్రతిఫలంగా భారీగా ‘లెక్క’, ప్లాట్లు బహుమతులుగా ముట్టినట్లు కొందరు కార్పొరేటర్లే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మచ్చుకు కొన్ని.. 8 కొందరు కార్పొరేటర్ల సిఫారసులను మేయర్, అధికారులు తోసిపుచ్చారు. అయినప్పటికీ ‘ముఖ్య’ నేత అండ ఉన్న కొందరు సీనియర్ కార్పొరేటర్లు వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ తమ సిఫారసులు ఆమోదింపజేసుకున్నారు. ఉదాహరణకు మోరంపూడి స్టేడియం రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ రోడ్డు ఐదు డివిజన్ల పరిధిలో ఉంది. మొదట ఇద్దరు కార్పొరేటర్లు ఈ రోడ్డును 80 అడుగులకు తగ్గించాలని సిఫారసు చేశారు. అధికారులు దీనిని తోసిపుచ్చారు. అయితే మాస్టర్ప్లా¯ŒS ఆమోదించే రోజున అప్పటికప్పుడు ఐదుగురు కార్పొరేటర్లు 80 అడుగులకు మద్దతుగా సిఫారసులు చేసి, ‘ముఖ్య’ నేతతో ఒత్తిడి తెచ్చారు. దీంతో వాటిని ఆమోదించక తప్పలేదు. 8 ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, దాట్ల సుభద్రాదేవితోపాటు ఇతరులకు చెందిన ప్లాట్లలో రోడ్డు వెళ్తూండడంతో దానిని మాస్టర్ప్లా¯ŒS నుంచి తొలగించారు. 8 కోలమూరు పంచాయతీలో మూడెకరాలను ఇండస్ట్రియల్ జో¯ŒS నుంచి కమర్షియల్ జో¯ŒSకు మార్చాలని 10వ డివిజ¯ŒS కార్పొరేటర్గా ఉన్న డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు సిఫారసు చేశారు. 8 పిడింగొయ్యి పంచాయతీలో 60 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఉపసంహరించాలని 8వ డివిజ¯ŒS కార్పొరేటర్, టీడీపీ ఫ్లోర్లీడర్ వర్రే శ్రీనివాసరావు సిఫారసు చేశారు. 8 కోలమూరులో ఏడెకరాల భూమిని ఎన్విరా¯ŒSమెంటల్ బఫర్ జో¯ŒS నుంచి నివాసప్రాంత జో¯ŒSగా మార్చాలని 9వ డివిజ¯ŒS కార్పొరేటర్ కోసూరి చండీప్రియ సిఫారసు చేశారు. 8 కోలమూరు, పిడింగొయ్యి పంచాయతీల్లో పరిశ్రమ జో¯ŒSలో ఉన్న భూమిని రెసిడెన్షియల్ జో¯ŒSలోకి మార్చాలని 44, 48, 38 డివిజన్ల కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం, గరగా పార్వతి, నండూరి వెంకటరమణ సిఫారసు చేశారు. 8 వీటితోపాటు చిరునామా లేకుండా, సాధారణ పౌరులకు అర్థం కాని రీతిలో కూడా అనేక సిఫారసులు చేశారు. నగరపాలక సంస్థలో మెజారిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ వారే ఉండడంతో ఈ ప్రతిపాదనలన్నీ ఆమోదం పొందాయి. ‘లెక్క’ తేలనందువల్లనేనా..? తాము చేసిన సిఫారసుల ‘లెక్క’ తేలనందువల్లనే పలువురు కార్పొరేటర్లు, నేతలు మాస్టర్ప్లా¯ŒSను ముందుకు కదలకుండా చేశారని సమాచారం. ‘లెక్క’ తేలకుండా మాస్టర్ప్లా¯ŒSపై ప్రభుత్వం జీవో జారీ చేస్తే తమ ‘లెక్క’ తగ్గిపోతుందన్న ఉద్దేశంతోనే సంతకాల దగ్గర ఆపినట్లు తెలిసింది. మరోవైపు మేయర్ అభిప్రాయానికి భిన్నంగా పలువురు సీనియర్ కార్పొరేటర్లు మాస్టర్ప్లా¯ŒSలో మార్పులు చేర్పులకు సిఫారసులు చేశారని, అందువల్లనే మాస్టర్ప్లా¯ŒSపై ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి పంపాల్సి ఉంది మాస్టర్ప్లా¯ŒS కౌన్సిల్ ఆమోదం పొందింది. సంతకాల అనంతరం దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. అనంతరం దీనిని ఆమోదిస్తూ జీవో జారీ అవుతుంది. మరుక్షణం నుంచి నూతన మాస్టర్ప్లా¯ŒS అమలులోకి వచ్చినట్లే. – వి.విజయరామరాజు, కమిషనర్, నగరపాలక సంస్థ కొందరు కార్పొరేటర్లు ఒప్పుకోవడం లేదు మాస్టర్ప్లా¯ŒSలో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు 100 అడుగులకు విస్తరించాలని ప్రతిపాదించాం. తగ్గించాలన్నా అధికారులు కూడా ఒప్పుకోలేదు. అయితే మాస్టర్ప్లా¯ŒS ఆమోదం రోజున ఐదుగురు కార్పొరేటర్లు 80 అడుగులకు తగ్గించాలని నోటిమాట ద్వారా చెప్పారు. ఈ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంది. 100 అడుగులకు విస్తరించేందుకు 90 శాతం స్థలం ఉంది. కానీ కార్పొరేటర్లు ఒప్పుకోవడం లేదు. అందువల్లనే ఆలస్యమవుతోంది. – పంతం రజనీ శేషసాయి, మేయర్, నగరపాలక సంస్థ