medals
-
పారిశుధ్య కార్మికుడి కూతుళ్లు కరాటేలో క్వీన్స్..!
వారి ఇంటిపేరు ఏమిటో చాలామందికి తెలియదు. ‘కరాటే సిస్టర్ప్’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన విశాఖపట్నంకు చెందిన కృష్ణప్రియ, జ్యోతి, సంగీత కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. కర్రసాము, చెస్లోనూ రాణిస్తున్నారు...జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రామారావు ముగ్గురు కుమార్తెలు సంగీత, కృష్ణప్రియ, జ్యోతి కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విశాఖ మహా నగరంలోని పీ అండ్ టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ (ఎన్ ఎంసీహెచ్)లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఒక వైపు చదువు, మరోవైపు కరాటేలో ప్రావీణ్యం చూపుతున్నారు.కృష్ణప్రియ (16) డబ్లు్యఆర్ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్–2017 పోటీలలో రజతం, ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2018 పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు, నెట్షాడోకాన్ నేషనల్ ఛాంపియన్ షిప్–2019 ఓపెన్ కరాటే పోటీలలో వెండి, కాంస్య పతకాలు, దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్–2020 పోటీల్లో రజత, కాంస్య పతకాలు, 5వ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు, 13వ జాతీయ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే కుంగ్ఫూ ఛాంపియన్ షిప్–2022 పోటీలలో రజత, వెండి పతకాలు, 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్–2025 ΄ోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు....ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పతకాలు సాధించింది.ఈ నెలలో విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన 81వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2025 పోటీలలో ముగ్గురు సోదరీమణులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలలో జ్యోతి బంగారు పతకం, వెండిపతకాలు, కృష్ణప్రియ ఏకంగా రెండు బంగారు పతకాలు, సంగీత వెండి, కాంస్య పతకాలు సాధించింది. విశాఖలో జరిగిన ఈ పోటీలలో విశాఖకు చెందిన ఈ ముగ్గురు సోదరీమణులు ఒకే వేదిక మీద సత్తా చాటి పతకాలు అందుకొని భేష్ అనిపించుకున్నారు.‘రామారావుకు నేనే కరాటేలో శిక్షణ ఇచ్చాను. 1989 నుంచి కరాటే అకాడమీ నిర్వహిస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా రామారావు ముగ్గురు కుమార్తెలకు కూడా కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఈ ముగ్గురు పిల్లలకు కష్టపడే తత్వం ఉంది. మంచి భవిష్యత్ ఉంది’ అంటున్నాడు కరాటే కోచ్ ఎల్లారావు.‘పిల్లలు సరదాగా కరాటే నేర్చుకుంటున్నారు అనుకున్నానుగానీ ఇంత పేరు తెచ్చుకుంటారు అనుకోలేదు. వారి విజయాలకు ఒక తండ్రిగా మురిసిపోతున్నాను. గర్విస్తున్నాను’ అంటున్నాడు రామారావు. కరాటే అంటే నిండైన ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసమే ముగ్గురు సోదరీమణులకు ఆభరణం. వారు కరాటేలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం.– దుక్కా మురళీకృష్ణారెడ్డి, సాక్షి, సీతమ్మధార, విశాఖపట్నం (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
భారత బాక్సర్లకు 17 పతకాలు
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు ఏకంగా 17 పతకాలు కొల్లగొట్టారు. ముఖ్యంగా టీనేజ్ మహిళా బాక్సర్లు పార్థవి, వన్షిక స్వర్ణాలు సాధించారు. మహిళల 65 కేజీల ఫైనల్లో పార్థవి 5–0తో ఆలియా హోపెమా (నెదర్లాండ్స్)ను కంగుతినిపించింది. ప్లస్ 80 కేజీల కేటగిరీలో వన్షిక గోస్వామి ముష్టిఘాతాలకు జర్మనీ బాక్సర్ విక్టోరియా గాట్ విలవిల్లాడింది. దీంతో రిఫరీ నిమిషం 37 సెకన్లకు ముందే బౌట్ను నిలిపేసి వన్షికను విజేతగా ప్రకటించాడు. మిగతా మహిళల్లో క్రిషా వర్మ (75 కేజీలు) బంగారు పతకం నెగ్గగా, నిషా (51 కేజీలు), సుప్రియా (54 కేజీలు), కృతిక (80 కేజీలు), చంచల్ (48 కేజీలు), అంజలి (57 కేజీలు), వినీ (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) రజతాలతో సంతృప్తి చెందారు. పురుషుల్లో ఏకైక పసిడి పతకాన్ని హేమంత్ తెచ్చి పెట్టాడు. రాహుల్ కుందు (75 కేజీలు) రజతం నెగ్గగా, రిషి సింగ్ (50 కేజీలు), క్రిష్ పాల్ (55 కేజీలు), సుమిత్ (70 కేజీలు), ఆర్యన్ (85 కేజీలు), లక్షయ్ రాఠి (ప్లస్ 90 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
బరువైపోయిందా ?
రెండు దశాబ్దాల క్రితం ఆమదాలవలస పేరు చెబితే జాతీయ స్థాయిలో ఠక్కున గుర్తుకొచ్చేది వెయిట్ లిఫ్టింగ్. ఒకరా ఇద్దరా.. పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటేవారు. విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్లోనూ ఆమదాలవలస వైభవాన్ని చాటిచెప్పారు. కానీ నేడు ఆ వైభవమంతా గతకాలపు స్మృతిగా మిగిలిపోయింది. కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి దిగ్గజ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసిన ఆమదాలవలస వెయిట్లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం నేడు ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకుంది. ప్రోత్సాహం కరువై క్రీడాకారులు ఇటువైపు చూడటమే మానుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశంలో ఒలింపిక్ పతకంతో పాటు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షణా కేంద్రానికి నేడు నిర్లక్ష్యపు గ్రహణం కమ్మేసింది. పట్టించుకునే నాథుడు లేక దయనీయ స్థితికి చేరుకుంది. వెయిట్ లిఫ్టింగ్లో ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పేరు మారుమ్రోగింది. ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమదాలవలస ప్రాంతం నుంచి వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారులు ఎక్కువగా వస్తుండటంతో 1987లో ప్రభుత్వం ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసింది.మెరిసిన ఆణిముత్యాలు.. ఈ ప్రాంతం నుంచి తొలిసారిగా ఊసవానిపేటకు చెందిన నీలం శెట్టి గురువునాయుడు సీనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఆ తరువాత నీలంశెట్టి సూర్యనారాయణ, కరణం నరసమ్మలు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే సీతమ్మ అనే క్రీడాకారిణి స్టేట్ చాంపియన్గా నిలిచింది. అనంతరం కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించి నీలంశెట్టి లక్ష్మి సిక్కోలు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్ధాయిలో నిలిపింది. ఇక 2000 సంవత్సరంలో ఆ్రస్టేలియాలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకంతో కరణం మల్లీశ్వరి సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్గా నిలిచిన పూజారి శైలజ ప్రతిభ చెప్పనవసరంలేదు. వీరితోపాటు యామిని, కరణం కల్యాణి, కరణం కృష్ణవేణి, గౌరి, నీలంశెట్టి ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి, చీర రాజేశ్వరి, ఎన్ని శ్రీదేవి ఇలా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆదరణ లేకే.. ఆమదాలవలసలో తొలుత కొత్తకోట అమ్మినాయుడు అనే వ్యక్తి మారుతి వ్యాయామ మండలిని ఏర్పాటు చేశారు. అనంతరం 1983లో అప్పటి ప్రభుత్వం చిన్న శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది శిధిలావస్థకు చేరడంతో అమ్మినాయుడు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించుకున్నారు. 1987లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. వాటితో నూతన భవనాన్ని నిర్మించారు. నీలంశెట్టి అప్పన్న అనే వ్యక్తి కోచ్గా ఉండేవారు. ఆయన రిటైరయ్యాక కోచ్ను నియమించలేదు. దీంతో సీనియర్ క్రీడాకారులే శిక్షకులుగా వ్యవహరిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, ఔత్సాహికులు కూడా ముందుకు రాకపోవడంతో శిక్షణా కేంద్రం దయనీయ స్థితికి చేరుకుంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. సామగ్రి లేకపోవడంతో క్రీడాకారులు వెళ్లడం మానేశారు. దీంతో పూర్తిగా మూతపడిపోయింది. ఇటీవల ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి చిగురుపల్లి రాజ్యలక్ష్మి తన సొంత డబ్బులతో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ సామగ్రి ఏర్పాటు చేశారు. అక్కడే తన కుమార్తె చిగురుపల్లి హారికరాజ్కు శిక్షణ ఇస్తున్నారు. ఆ బాలిక ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండటంతో మరో 8 మంది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఆ వైభవం గతమే.. ఆమదాలవలసలో వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జాతీయ ,అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సుమారు 60నుంచి 80మంది వరకు ఉండేవారు. ఇప్పుడు పది విభాగాల్లో పాల్గొనేందుకు క్రీడాకారులే కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమదాలవలస వెయిట్లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం శిధిలావస్థకు చేరిపోవడం బాధగాఉంది. 2001లో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్నాను. ప్రస్తుతం సరైన ప్రోత్సాహం, వసతులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావడంలేదు. ఈ ప్రాంతంలో ఈ క్రీడ కనుమరుగైపోకుండా చూడాలనే ఉద్దేశ్యంతో నా సొంత డబ్బుతో సామగ్రి కొనుగోలు చేసి నాకున్న సామర్థ్యం మేరకు శిక్షణ ఇస్తున్నాను. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఇటీవల రూ.50వేలు ఇచ్చి ప్రోత్సహించారు. నా కుమార్తెకు కూడా ఆయనే స్పాన్సర్ చేసి పోటీలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా శిక్షణా కేంద్రంలో సామగ్రి ఏర్పాటు చేసి, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఆదుకోవాలి. కోచ్ను ఏర్పాటు చేయాలి. – చిగురుపల్లి రాజ్యలక్ష్మి, వెయిట్ లిప్టర్, ఆమదాలవలసక్రీడాకారులు కరువు వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ క్రీడాంశాన్ని ఎంచుకుంటుంటారు. ఆరి్థక పరిస్థితులు అంతగా సహకరించక రాణించలేకపోతున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో రాణించినవారికి కనీసం హోంగార్డు పోస్టులో అయినా ప్రాధాన్యత ఇస్తే ఉత్సాహంగా ముందుకువచ్చేవారు. పతకం తెచ్చిన క్రీడాకారుడిని నాయకులు ఆరోజు అభినందించడం తప్ప తరువాత పట్టించుకోవడంలేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం 30 నుంచి 40 మంది మాత్రమే పాల్గొంటున్నారు. – బలివాడ తిరుపతిరావు, వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా మాజీ కార్యదర్శి, వెయిట్లిఫ్టర్ -
‘యువతరానికి బ్రాండ్ అంబాసిడర్లు’
న్యూఢిల్లీ: చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేకంగా అభినందించారు. బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో చాంపియన్లుగా నిలిచి భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ప్లేయర్లను మన్సుఖ్తోపాటు కేంద్ర క్రీడా సహాయ మంత్రి రక్షా ఖాడ్సే గురువారం న్యూఢిల్లీలో సన్మానించారు. ‘అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం ద్వారా దేశ ప్రజలను గర్వపడేలా చేశారు. దీంతో పాటు వారసత్వ క్రీడలో మన సత్తా ఏంటో నిరూపించారు. ఏ ఆటలోనైనా నైపుణ్యాన్ని గుర్తించి వారికి అండగా నిలవడంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్న క్రమంలో క్రీడారంగంలో మన అథ్లెట్లు సాధించే విజయాలు దేశానికి మరింత గుర్తింపు తెచ్చిపెడతాయి. ఒలింపియాడ్లో పతకాలు నెగ్గిన ప్లేయర్లు దేశంలో యువతరానికి బ్రాండ్ అంబాసిడర్ల వంటి వాళ్లు’ అని మాండవీయ తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి కాగా.. ఈ ప్రదర్శనతో దేశంలో చిన్నారులు, యువతలో ఆటల పట్ల ఆకర్శణ మరింత పెరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దొమ్మరాజు గుకేశ్, ద్రోణవల్లి హారికలతో మాండవీయ సరదాగా చెస్ ఆడారు. స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్ల సభ్యులకు కేంద్ర క్రీడా శాఖ రూ. 20 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని చెక్ల రూపంలో అందించింది. -
సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై పాకశాస్త్రంలో తెలంగాణ అమ్మాయి అశ్విత పోలీస్ సత్తా చాటింది. ఫ్రాన్స్లోని లియాన్లో జరుగుతున్న వరల్డ్ స్కిల్స్–2024లో అశ్విత బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును గెలుచుకుంది. భారతదేశం స్కిల్ సెట్లలో 4 కాంస్య పతకాలు, 12 మెడలియన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులతో కలిపి మొత్తం 16 పతకాలు సొంతం చేసుకుంది. ‘పాటిస్సేరీ–కన్ఫెక్షనరీ’లో అశ్విత పోలీస్, ‘ఇండస్ట్రీ 4.0’లో గుజరాత్కు చెందిన ధ్రుమిల్కుమార్ ధీరేంద్రకుమార్ గాంధీ, సత్యజిత్ బాలకృష్ణన్, ‘హోటల్ రిసెప్షన్’లో ఢిల్లీకి చెందిన జోతిర్ ఆదిత్య కృష్ణప్రియ రవికుమార్, ‘రెన్యూవబుల్ ఎనర్జీ’లో ఒడిశాకు చెందిన అమరేష్ కుమార్ సాహు కాంస్యపతకాలు గెలుచుకున్నారు. వీటితోపాటు భారతీయ బృందం 12 మెడలియన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను సంపాదించింది. ‘పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ’లో పోటీ చేసిన అశ్విత టీమ్ ఇండియా నుంచి అత్యుత్తమ పోటీదారుగా బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును కూడా గెలుచుకుంది.అశ్విత చిన్నప్పటి నుంచి స్వీట్స్ తయారుచేయడం, టీవీ షోల ద్వారా పాకశాస్త్రంలో నైపుణ్యాన్ని పెంచుకుంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యారి్థని అయిన అశ్విత.. చెఫ్ వినేష్ జానీ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. అశ్విత విజయం ప్రపంచ వేదికపై భారతీయ పాకశాస్త్ర ప్రతిభ పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటుతోంది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఔత్సాహిక చెఫ్లను ప్రేరేపిస్తుందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ మంత్రిత్వ శాఖ కొనియాడింది. పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ విభాగంలో 21 దేశాలతో పోటీపడి కాంస్యం సాధించిన అశ్విత పోలీస్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం సవాలుతో కూడుకున్నది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలనే కల నిజమైంది. కానీ నమ్మశక్యంగా లేదు’అని అన్నారు. వరల్డ్ స్కిల్స్ 2024లో 70కి పైగా దేశాల నుంచి 1,400 మందికి పైగా పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత్ 52 నైపుణ్య విభాగాల్లో పోటీపడింది. -
‘టోక్యో’ను దాటేసి...
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి. దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్పుట్లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్లో భారత్కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. హర్విందర్ ‘పసిడి’ గురి పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. సత్తా చాటిన సచిన్... పురుషుల షాట్పుట్ ఎఫ్46 ఈవెంట్లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు. పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్పుట్కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్లో 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్వాల్ క్వాలిఫయింగ్లోనే విఫలమైన ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. -
26 మందికి శౌర్య, సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన 26 మంది శౌర్య, సేవా పతకాలకు ఎంపికయ్యారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన మొత్తం 1,037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురికి పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 19 మందికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకాలు లభించాయి. అగ్నిమాపక సర్వీస్కు చెందిన ఒకరికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకం వరించింది. ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్ట్ చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి పతకాలకు ఎంపికైన వారి వివరాలివీ.ప్రతిభాపూర్వక సేవా పతకాలువిష్ణు నర్ణిది (అడిషనల్ ఎస్పీ), లక్ష్మీ ఎన్ఎస్జే (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్), గోపాలకృష్ణ సోమసాని (డీఎస్పీ), మురళీకృష్ణ తక్కెలపాటి (డీఎస్పీ), రామచంద్రమూర్తి కొండుమహంతి (అడిషనల్ ఎస్పీ), ఉదయభాస్కర్ దేశబత్తిన (గ్రూప్ కమాండర్), శ్రీనివాసులు పేదరాశి (డీఎస్పీ), కృష్ణమూర్తిరాజు కనుమూరి (ఇన్స్పెక్టర్), లక్ష్మీ నరసింహారావు సిరికి (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రమేష్బాబు కాట్రగడ్డ (కానిస్టేబుల్), శ్రీనివాసరావు గడ్డం (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వీరవెంకట సత్యసాంబశివరావు తోటకూర (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వెంకట సుబ్బారాయుడు జింకా (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రామచంద్ర శేఖరరావు మంద (హెడ్ కానిస్టేబుల్), జయచంద్రరెడ్డి వద్దిరెడ్డి హెడ్ కానిస్టేబుల్), డి.భక్తవత్సలరాజు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), చిన్న సైదా షేక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), కె.గోవిందరాజులు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), షరీఫ్ మహబూబ్ (సబ్ ఇన్స్పెక్టర్), చిన్నం మార్టిన్ లూథర్కింగ్ (అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు» ఎం.రవిప్రకాష్ (ఐజీ)» డి.డి.గంగరాజు (ఇన్స్పెక్టర్) శౌర్య పతకాలు» షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్)» సవ్వన అరుణ్కుమార్ (సబ్ ఇన్స్పెక్టర్)» మైలపల్లి వెంకట రామ పరదేశీనాయుడు (రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్)» రాజన గౌరీశంకర్ (హెడ్ కానిస్టేబుల్) -
పారిస్ ఒలింపిక్స్ 2024 : ఈసారి పతకాలు తగ్గాయి..! (ఫొటోలు)
-
పతకాల సంఖ్య ప్రామాణికం కాదు
పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను. నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది. అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు. -నీరజ్ చోప్రా -
Paris Olympics 2024: ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం (ఫోటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్: నీతా అంబానీ సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్లో భారత ఒలింపిక్ షూటింగ్ బృందాన్ని సత్కరించారు. ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్పీలకు ఫోజులిచ్చి సందడి చేశారు. భారతీయులందర్నీ గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు! గో ఇండియా.. గో’ అంటూ వారిని ఉత్సాహ పరిచారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు విశ్వ క్రీడావేదికపై మనదేశాన్ని సగర్వంగా నిలిపిన కృషికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే రెండు పతకాలతో, మన షూటర్లు పారిస్లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేసిన సంగతి తెలిసిందే. భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్, ఇండియా హౌస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్లోనూ మను కాంస్య పతకాన్నిసాధించి స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్గా చరిత్రకెక్కింది.Indian star shooter Sarabjot Singh gets heroic reception in India house 😍😍Manu Bhaker and Sarabjot Singh win Bronze 🥉 in the 10m air pistol mixed team event. #Sarabjot #Shooting #ManuBhaker #ParisOlympics2024 #Paris2024 #Paris2024Olympic #ParisOlympics pic.twitter.com/8oUs2x7PoK— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024 -
ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు.. మనుభాకర్ సరికొత్త రికార్డు
-
ఒలింపిక్స్లో నేటి (జులై 30) భారత షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్లో మూడో రోజు భారత్కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్య సేన్, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత జోడీ కాంస్య పతక రేసులో నిలిచింది.నాలుగో రోజు (జులై 30) భారత షెడ్యూల్ ఇలా..షూటింగ్- పృథ్వీరాజ్ తొండైమాన్ (ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుశ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (ట్రాప్ వుమెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుకాంస్య పతక పోరు: మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ వర్సెస్ కొరియా టీమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్)- మధ్యాహ్నం ఒంటి గంటకురోయింగ్- బల్రాజ్ పన్వర్ (మెన్స్ సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్)- మధ్యాహ్నం 1:40 గంటలకుహాకీ- ఇండియా వర్సెస్ ఐర్లాండ్ (మెన్స్ పూల్-బి)- సాయంత్రం 4:45 గంటలకుఆర్చరీ- అంకిత భకత్ వర్సెస్ వియోలెట మిస్జోర్ (పోలాండ్)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:14 గంటలకుభజన్ కౌర్ వర్సెస్ సైఫా నూరాఫిఫా కమల్ (ఇండొనేషియా)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:27 గంటలకుబ్యాడ్మింటన్- సాత్విక్సాయిరాజ్/చిరాగ్ షెట్టి వర్సెస్ అల్ఫియాన్ ఫజర్/ముహహ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండొనేషియా)- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజీ- సాయంత్రం 5:30 గంటలకుఅశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్ సెత్యానా మపాసా/ఏంజెలా యు (ఆస్ట్రేలియా)- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్- సాయంత్రం 6:20 గంటలకుబాక్సింగ్- జాస్మిన్ లంబోరియా వర్సెస్ నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్)- మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32- రాత్రి 9:24 గంటలకుఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర వర్సెస్ ఆడమ్ లి (చెకియా) మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగం 1/32 ఎలిమినేషన్ రౌండ్- రాత్రి 10:46 గంటలకుబాక్సింగ్- ప్రీతి పవార్ వర్సెస్ యెని మార్సెలా అరియాస్ (కొలంలియా)- మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16- మధ్య రాత్రి 1:20 గంటలకు -
Olympics: చేరువై... దూరమై!
చిక్కినట్లే చిక్కి చేజారితే కలిగే బాధ వర్ణణాతీతం! ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై పతకం పట్టాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు. ఏళ్ల తరబడి కఠోర సాధన, అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటారు. మరి అలాంటిది... మెడల్కు అత్యంత చేరువైన తర్వాత అందినట్లే అంది ఆ విజయం దూరమైతే కలిగే బాధ అంతా ఇంతా కాదు! ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బబుతాకు ఇలాంటి మనసు వికలమయ్యే అనుభవం ఎదురైంది. అయితే త్రుటిలో పతకాలు చేజార్చుకున్న భారత ప్లేయర్లలో అర్జున్ బబూతా మొదటి క్రీడాకారుడేమీ కాదు... గతంలోనూ పలుమార్లు విశ్వ క్రీడల్లో భారత్కు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పరిశీలిస్తే... ఫుట్బాల్తో మొదలు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో భారత ఫుట్బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ శిక్షణలో రాటుదేలిన మన జట్టు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్వార్టర్ ఫైనల్కు చేరింది. క్వార్టర్స్లో ఆతిథ్య ఆ్రస్టేలియాపై నెవిల్లె డిసౌజా హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో సెమీస్లో అడుగుపెట్టి పతకం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే యుగోస్లో వియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 1–4తో పరాజయం పాలైంది. కాంస్య పతక పోరులోనూ తడబడ్డ భారత్ 0–3తో బల్గేరియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో నిరాశగా వెనుదిరిగింది. మిల్కా సింగ్ వెంట్రుకవాసిలో... 1960 రోమ్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో సమీప ప్రత్యరి్థని చూసే క్రమంలో క్షణకాలాన్ని వృథా చేసుకున్న మిల్కా.. దానికి జీవితకాల మూల్యం చెల్లించుకున్నాడు. రోమ్ ఒలింపిక్స్ అనుభవంతో అథ్లెటిక్స్కే వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అతి బలవంతంగా అతడిని తిరిగి ట్రాక్ ఎక్కించగా.. 1962 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటాడు. మహిళల హాకీలో ఇలా.. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్పై ఆతిథ్య సోవియట్ యూనియన్ దాడి చేసిన నేపథ్యంలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాస్కో క్రీడలను బహిష్కరించాయి. దీంతో మన జట్టు పోడియంపై నిలవడం ఖాయమే అనిపించింది. ఆ్రస్టియా, పోలాండ్పై ఘనవిజయాలు సాధించిన మన మహిళల జట్టు పతకంపై ఆశలు రేపింది. అయితే ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచ్ ‘డ్రా’ కాగా.. చెకోస్లోవియా, సోవియట్ యూనియన్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పరుగుల రాణికి తీరని వ్యథ! 1984 లాస్ఏంజెలిస్ క్రీడల్లో పరుగుల రాణి పీటీ ఉషకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో సెకనులో వందో వంతు తేడాతో పీటీ ఉష నాలుగో స్థానానికి పరిమితమైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలోనైనా ఒక భారత అథ్లెట్ పతకం కోల్పోయిన అత్యల్ప తేడా ఇదే. ఫైనల్లో ఉష 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. జాయ్దీప్కు నిరాశ 2012 లండన్ ఒలింపిక్స్లో జాయ్దీప్ కర్మాకర్కు అర్జున్లాంటి అనుభవమే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన కర్మాకర్ క్వాలిఫికేషన్ రౌండ్లో చక్కటి ప్రదర్శన కనబర్చి ఏడో స్థానంతో ఫైనల్కు అర్హత సాధించాడు. అయితే తుదిపోరులో కాంస్యం గెలిచిన షూటర్ కంటే.. 1.9 పాయింట్లు వెనుకబడిన కర్మాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీపా కర్మాకర్ త్రుటిలో... 2016 రియో ఒలింపిక్స్లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్యం గెలిచిన జిమ్నాస్ట్కు దీపా కర్మాకర్కు మధ్య 0.150 పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఇదే క్రీడల్లో భారత షూటర్ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజార్చుకున్నాడు. మహిళల హాకీ జట్టు మరోసారి 2020 టోక్యో ఒలింపిక్స్లో మరోసారి భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ తప్పలేదు. 1980 మాస్కో క్రీడల్లో త్రుటిలో కాంస్యం చేజార్చుకున్న మహిళల జట్టు.. టోక్యోలోనూ అదే బాటలో నడిచింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆ్రస్టేలియాను మట్టికరిపించి ఆశలు రేపిన మన అమ్మాయిలు.. సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలయ్యారు. కాంస్య పతక పోరులోనైనా అద్భుతం చేస్తారనుకుంటే.. ఇంగ్లండ్తో పోరులో ఆరంభంలో ఆధిక్యం సాధించినా.. చివర్లో పట్టు విడిచి 3–4తో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే క్రీడల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోల్ఫర్ అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈసారి ఇద్దరు.. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్లో లియాండర్ పేస్–మహేశ్ భూపతి జంట నాలుగో స్థానంలో నిలిచింది. భారత అత్యుత్తమ ద్వయంగా విశ్వక్రీడల బరిలోకి దిగిన పేస్–భూపతి హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో 6–7, 6–4, 14–16తో అన్సిచ్–లుబిసిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Paris Olympics 2024: విశ్వ క్రీడల్లో భారత్.. హాకీలో అత్యధికంగా..!
విశ్వ క్రీడల్లో (ఒలింపిక్స్) భారత ప్రస్తానం 1900వ సంవత్సరంలో మొదలైంది. ఆ ఎడిషన్లో భారత్ కేవలం ఒకే ఒక అథ్లెట్తో పాల్గొంది. భారత్ తరఫున బ్రిటిష్ అథ్లెట్ (అప్పటికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది) నార్మన్ ప్రిచార్డ్ పురుషుల 200 మీటర్ల రన్నింగ్ రేస్, 200 మీటర్ల హర్డిల్స్లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు.భారత్ 1920లో తొలిసారి స్వదేశీ ఆథ్లెట్లతో ఒలింపిక్స్లో పాల్గొంది. బెల్జియంలో జరిగిన ఆ ఎడిషన్లో భారత్ తరఫున ఐదుగురు అథ్లెట్లు రెండు క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఆ ఎడిషన్లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది.అనంతరం 1924 పారిస్ ఒలింపిక్స్లో కూడా భారత్కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఎడిషన్లో భారత్ 12 మంది అథ్టెట్లను బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది.భారత్ తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ పతకాన్ని 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో సాధించింది. ఆ ఎడిషన్లో భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా గోల్డ్ మెడల్నే సాధించి చరిత్ర సృష్టించింది.ఆ ఎడిషన్ (1928) నుంచి భారత్ వరుసగా ఐదు ఒలింపిక్స్లో (1932, 1936, 1948, 1952, 1956) స్వర్ణ పతకాలకు సాధించి పురుషుల హాకీలో మకుటం లేని మహారాజులా కొనసాగింది.1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్లో భారత్ తొలిసారి రెజ్లింగ్లో పతకం సాధించింది. ఆ ఎడిషన్లో పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో ఖషాబా జాదవ్ కాంస్య పతకాన్ని సాధించి, భారత్ తరఫున తొలి పతకం సాధించిన భారతీయ అథ్లెట్గా చరిత్రపుటల్లోకెక్కాడు.1960 రోమ్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఎడిషన్లో భారత్కు లభించిన ఏకైక పతకం ఇదే.1964 టోక్యో ఒలింపిక్స్లో భారత్ తిరిగి పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది.1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్కు వచ్చే సరికి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.1976 మాంట్రియాల్ ఒలింపిక్స్లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆ ఎడిషన్లో 26 మంది క్రీడాకారులు 5 విభాగాల్లో పోటీపడినా ఒక్క పతకం కూడా దక్కలేదు.1980 మాస్కో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు తిరిగి మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో భారత్ ఖాతా తెరవలేకపోయింది.మూడు ఎడిషన్ల తర్వాత భారత్ మరోసారి ఓ పతకం సాధించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించాడు.2000 సిడ్నీ ఒలింపిక్స్లో భారత్ తరఫున తొలిసారి ఓ మహిళ పతకం సాధించింది. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో భారత్ షూటింగ్లో రజత పతకం సాధించింది. పురుషుల డబుల్స్ ట్రాప్లో రాజ్యవర్దన్సింగ్ రాథోడ్ భారత్కు ఆ ఎడిషన్లో ఏకైక పతకాన్ని అందించాడు.2008 బీజింగ్ ఒలింపిక్స్లో భారత్ తొలిసారి రెండిటి కంటే ఎక్కవ పతకాలు సాధించి. ఆ ఎడిషన్లో భారత్ ఓ గోల్డ్ మెడల్తో పాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. పురుషుల షూటింగ్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని.. పురుషుల రెజ్లింగ్లో సుశీల్ కుమార్, పురుషుల బాక్సింగ్లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.2012 లండన్ ఒలింపిక్స్లో 83 మంది క్రీడాకారులతో 13 విభాగాల్లో పాల్గొన్న భారత్.. రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. పురుషుల షూటింగ్లో విజయ్కుమార్, పురుషుల రెజ్లింగ్లో సుశీల్ కుమార్ రజత పతకాలు సాధించగా.. పురుషుల షూటింగ్లో గగన్ నారంగ్, మహిళల బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సింగ్లో మేరీ కోమ్, పురుషుల రెజ్లింగ్లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు.2012 ఒలింపిక్స్లో ఆరు పతకాలు గెలిచిన భారత్ 2016 రియో ఒలింపిక్స్లో మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఎడిషన్లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. మహిళల బ్యాడ్మింటన్లో పీవీ సింధు రజతం, మహిళల రెజ్లింగ్లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు.120 ఏళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలను 2020 టోక్యో ఒలింపిక్స్లో సాధించింది. ఈ ఎడిషన్లో భారత్ ఏకంగా ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో ఓ గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా.. మహిళల వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయ్ చాను.. పురుషుల రెజ్లింగ్లో రవికుమార్ దాహియా రజత పతకాలను.. మహిళల బ్యాడ్మింటన్లో పీవీ సింధు, మహిళల బాక్సింగ్లో లవ్లీనా బోర్గోహెయిన్, పురుషుల రెజ్లింగ్లో భజరంగ్ పూనియా, పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలను సాధించాయి.జులై 26 నుంచి ప్రారంభంకాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 113 మంది క్రీడాకారులతో 16 విభాగాల్లో పాల్గొంటుంది. మరి ఈసారి భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. ఓవరాల్గా భారత్ ఇప్పటివరకు 35 ఒలింపిక్స్ పతకాలు సాధించగా.. ఒక్క పురుషుల హాకీలోనే 11 పతకాలు రావడం విశేషం. -
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్జర్గాల్ డొల్గొర్జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
భారత రెజ్లర్లకు మూడు పతకాలు
బిష్క్క్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఉదిత్ (57 కేజీలు) రజతం నెగ్గగా... అభిమన్యు (70 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఉదిత్ 4–5తో కెంటో యుమియా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. బౌట్ చివరి సెకన్లలో ఉదిత్ ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయాడు. 2020 నుంచి 2023 వరకు ఈ విభాగంలో భారత్కు స్వర్ణ పతకాలు లభించాయి. రవి కుమార్ దహియా వరుసగా మూడేళ్లు (2020, 2021, 2022)... గత ఏడాది అమన్ ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గారు. మరోవైపు కాంస్య పతకాల బౌట్లలో అభిమన్యు 6–5తో కుల్దాòÙవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విక్కీ 10–1తో అరోనోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. -
ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో). పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి. -
ఓవరాల్ చాంపియన్ తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు. శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్కుమార్, వి.కిరణ్కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆయా విభాగాల వారీగా చూస్తే.. ► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం ► యాంటీ స్టాబేజ్ చెక్లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు ► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి. ►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. -
‘పారిస్’ పతకాల్లో ఈఫిల్ టవర్!
పారిస్: ఈ ఒలింపిక్స్ పతకాలు మిగతా పతకాలకంటే అతి భిన్నమైనవి... అమూల్యమైనవి! ఎందుకంటే ఈ పతకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు అంతకుమించి అపురూపమైంది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్కే తలమానికమైన ‘ఈఫిల్ టవర్’ ప్రతి పతకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే... ఈ వివరాల్లోకి వెళ్దాం! ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక విజేతలకు బహూకరించే పతకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పతకం బరువు 18 గ్రాములైతే... ప్రతి పతకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్ను కళ్లారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్కు పోటెత్తుతారు. ఇనుముతో తయారైన ఈ టవర్ను నవీకరణ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అప్పుడు టవర్లో అక్కడక్కడ తీసివేసిన తుక్కు ఇనుప ముక్కల్ని ఓ రహస్య గదిలో జాగ్రత్త పరిచారు. ఈసారి ఒలింపిక్స్ పారిస్లో జరుగనున్నాయి. కాబట్టి తమ పతకాలతో మరో విశిష్టత కల్పించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ, ఫ్రాన్స్ ప్రభుత్వం భావించాయి. అందుకే పతకాల తయారీలో అసలైన ఈఫిల్ టవర్ అవశేషాల్ని (భద్రపరిచిన ఇనుప ముక్కలు) వినియోగించారు. ఈసారి విజేతలంతా అదృష్టవంతులే! ఎందుకంటే వాళ్లంతా పతకాల్నే కాదు... ‘సింబల్ ఆఫ్ పారిస్’ గుర్తుల్ని తమతమ దేశాలకు మోసుకెళ్తారు. దీనిపై పారిస్ ఒలింపిక్స్ క్రియేటివ్ డైరెక్టర్ థీయెరి రిబోల్ మాట్లాడుతూ ‘కచ్చితంగా అథ్లెట్లకు ఇది సువర్ణావకాశం. పారిస్ జగది్వఖ్యాత చిహ్నం అవశేషాల్ని ఒలింపిక్స్ విజేతలు తమతో తీసుకెళ్లొచ్చు’ అని అన్నారు. విశ్వక్రీడల చరిత్రలోనే చెరగని ముద్ర వేసేందుకు విశేషమైన వినూత్నమైన ఆలోచనతో ఈ పతకాల్ని డిజైన్ చేశామని చెప్పారు. విజేతలకు అందించేందుకు మొత్తం 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలు తయారు చేశారు. -
అఖిల్ పసిడి గురి
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్ఫాఫుమ్ (థాయ్లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత షూటర్లకు ఐదు పతకాలు
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో మూడో రోజూ భారత షూటర్లు ఐదు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నాన్సీ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఇలవేనిల్ వలారివన్ రజత పతకం దక్కించుకుంది. నాన్సీ, ఇలవేనిల్, మెహులీ ఘోష్లతో కూడిన భారత జట్టు 1897.2 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. వ్యక్తిగత ఫైనల్లో నాన్సీ 252.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇలవేనిల్ 252.7 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందింది. చైనా షూటర్ షెన్ యుఫాన్ 231.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం సాధించగా... రుద్రాంక్ష్ , అర్జున్ బబూటా, శ్రీకార్తీక్లతో కూడిన భారత బృందానికి కాంస్య పతకం దక్కింది. వ్యక్తిగత ఫైనల్లో రుద్రాం„Š 228.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. టీమ్ విభాగంలో రుద్రాం„Š , అర్జున్, శ్రీకార్తీక్ బృందం 1885.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
సాక్షి, హైదరాబాద్: విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ఈ పతకాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 89 మందికి ఉత్తమ సేవా, 42 మందికి కఠిన సేవా, 435 మందికి సేవా పతకాలు లభించాయి. 9 మందికి మహోన్నత సేవా పతకాలు లభించాయి. ఏసీబీలో ఐదుగురికి ఉత్తమ సేవా, ముగ్గురికి సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ముగ్గురికి ఉత్తమ సేవా, ఏడుగురికి సేవా పతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో ఆరుగురికి శౌర్య పతకాలు, ముగ్గురు ఉత్తమ సేవా, 13 మంది సేవా పతకాలు పొందారు. ఎస్పీఎఫ్లో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఉపేందర్కు శౌర్య పతకం లభించింది. -
జాతీయ స్కూల్ గేమ్స్లో ఏపీకి పతకాలు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్న నేషనల్ స్కూల్ గేమ్స్ షూటింగ్ పోటీల్లో బాలికల బృందం బంగారు పతకం సాధించింది. షూటర్లు తమన్యు సిరంగి (412.9), గొంటు లక్ష్మీ సమన్విత (410.4), ఆహాన రాఠీ (406.6) బృందం 1229.9 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. బాక్సింగ్లో ఆరు పతకాలు శుక్రవారం మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బాలుర బాక్సింగ్ అండర్–14, 17, 19 విభాగాల్లో ఏపీ విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. బోండా లక్ష్మణ్ (ఎస్వీఎల్ఎన్ఎస్ విద్యాపీఠ్ జూనియర్ కాలేజీ) రజతం, దాసరి ప్రవీణ్ కుమార్ (జీవీఎంసీ హైస్కూల్ , మాధవధార) కాంస్యం, జన్ని వసంతరావు (శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల, భీమసింగి) కాంస్యం, ఆకుల అశోక్ కుమార్ (సోఫియా జూనియర్ కళాశాల, జ్ఞానపురం) కాంస్యం, ఆయుష్ (ఎంఏబీ పీ జూనియర్ కళాశాల, గాజువాక) కాంస్యం, దొంతల దేవస్వరూప్ (జేఎన్పురం, విజయనగరం జిల్లా) కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు అభినందించినట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ కార్యదర్శి భానుమూర్తిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్ను ప్రకటించింది. 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హోంశాఖ 2018లో ఆపరేషన్స్ మెడల్స్ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్కేడర్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్కేడర్ ఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఎంపికైన వారు రాజేష్ కుమార్ (ఐజీపీ), నరేందర్ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్.చైతన్య కుమార్ (నాన్కేడర్ ఎస్పీ), డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్ రెడ్డి, మహమూద్ యూసఫ్, హెడ్ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్.ప్రసాద్, కే.సి.విజయ్కుమార్, పీసీలు మహమూద్ ఖాజా మొయిద్దీన్, మోహముంద్ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్కుమార్, ఎస్.ప్రేమ్కుమార్, ఎండీ షబ్బీర్ పాషా, ఇంతియాజ్ పాషా షేక్, ఏ.శ్రీనివాస్. ఏపీ నుంచి ఎంపికైన వారు వినీత్ బ్రిజ్ లాల్ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్కుమార్ (ఎస్పీ, నాన్కేడర్), షేక్ సర్దార్ ఘని (ఇన్స్పెక్టర్), సవ్వన అనిల్కుమార్(ఎస్ఐ), ఎంవీఆర్పీ నాయుడు (ఆర్ఎస్ఐ), రాజన్న గౌరీ శంకర్ (హెడ్కానిస్టేబుల్), అనంతకుమార్ నంద (హెడ్కానిస్టేబుల్), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు. -
111 పతకాలు... ఐదో స్థానం
హాంగ్జౌ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు. చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది. నీరజ్ స్వర్ణంతో... ఆఖరి రోజు శనివారం పోటీల్లో నీరాజ్ యాదవ్ జావెలిన్ త్రో (ఎఫ్55)లో 33.69 మీటర్లతో రికార్డు దూరం విసిరి బంగారం నిలబెట్టుకున్నాడు. 39 ఏళ్ల నీరజ్ గత 2018 పారా ఈవెంట్లోనూ పసిడి పట్టాడు. ఈ క్రీడల్లో సహచరుడు టెక్ చంద్ (30.36 మీ.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. తర్వాత దిలిప్ మహాదు పురుషుల 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ కాంస్యం నెగ్గింది. వ్యక్తిగత ర్యాపిడ్–6 బి1 ఈవెంట్లో సతీశ్ ఇనాని, ప్రధాన్ కుమార్, అశ్విన్భాయ్ కంచన్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో క్లీన్స్వీప్ చేశారు. బి2/బి3 ఈవెంట్లో కిషన్ కాంస్యం, ఇదే టీమ్ ఈవెంట్లో కిషన్, ఆర్యన్, సోమేంద్రలతో కూడిన బృందం కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్లో వృతి జైన్, హిమాన్షి, సంస్కృతి కాంస్యం నెగ్గారు. టాప్–5 పట్టికలో... ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది. -
భారత్ కొత్త చరిత్ర
హంగ్జౌ: వరుసగా నాలుగో రోజు తమ పతకాల వేటను కొనసాగిస్తూ ఆసియా పారా క్రీడల్లో భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలను సొంతం చేసుకుంది. 2018 జకార్తా ఆసియా పారా క్రీడల్లో భారత్ అత్యధికంగా 72 పతకాలను దక్కించుకోగా... హాంగ్జౌలో నాలుగో రోజు పోటీలు ముగిసేసరికి భారత బృందం 18 స్వర్ణాలు, 23 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 82 పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. మరో రెండు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ఈసారి భారత్ పతకాల్లో ‘సెంచరీ’ని దాటే అవకాశముంది. గురువారం భారత్కు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలు వచ్చాయి. అథ్లెటిక్స్లో పురుషుల ఎఫ్46 కేటగిరీ షాట్పుట్ ఈవెంట్లో సచిన్ సర్జేరావు ఖిలారి ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అనంతరం ఆర్6 మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్హెచ్1 విభాగంలో భారత షూటర్ సిద్ధార్థ బాబు 247.7 పాయింట్లు స్కోరు పసిడి పతకాన్ని సాధించాడు. ఆర్చరీలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జోడీ కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో 151–149తో లిన్ యుషాన్–అయ్ జిన్లియాంగ్ (చైనా) జంటపై నెగ్గి బంగారు పతకాన్ని దక్కించుకుంది. -
పతకాల పంట
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్ ఖాతాలో 30 పతకాలు చేరాయి. ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ అంటిల్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్ జావెలిన్ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో భారత్కే చెందిన సుందర్ సింగ్ గుర్జర్ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్ జావెలిన్ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్ దినేశ్ ముదియన్సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్37/38 జావెలిన్ త్రో ఈవెంట్లో హనే... మహిళల టి47 లాంగ్జంప్ ఈవెంట్లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు. కాంస్య పతకాలు నెగ్గిన గురు నాయుడు, ప్రియదర్శిని పనాజీ: జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్. గురు నాయుడు ఓవరాల్గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. -
జయహో భారత్ 107
‘వంద’ పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్ అన్నీ ముగిశాయి. చివరిరోజు భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి ‘పతకాల సెంచరీ’ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత్కిదే గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను భారత్ అధిగమించింది. శనివారం భారత్కు ఆర్చరీలో రెండు స్వర్ణాలు.. కబడ్డీల్లో రెండు పసిడి పతకాలు... పురుషుల టి20 క్రికెట్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఒక్కో బంగారు పతకం లభించాయి. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ ఈవెంట్స్ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడుతుంది. హాంగ్జౌ: చైనా గడ్డపై భారత్ తమ పతకాల వేటను దిగ్విజయంగా ముగించింది. ఆసియా క్రీడల్లో ఎవరూ ఊహించని విధంగా 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. తమ పోటీల చివరిరోజు భారత్ 12 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో కలిపి 70 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సురేఖ, ఓజస్ ‘స్వర్ణ’ చరిత్ర శనివారం ముందుగా ఆర్చరీలో భారత్ బాణం ‘బంగారు’ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ 149–145తో చేవన్ సో (దక్షిణ కొరియా)ను ఓడించింది. జ్యోతి సురేఖ 15 బాణాలు సంధించగా అందులో 14 పది పాయింట్ల లక్ష్యంలో... ఒకటి 9 పాయింట్ల లక్ష్యంలో దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్గా జ్యోతి సురేఖకు ఈ ఆసియా క్రీడలు చిరస్మరణీయమయ్యాయి. ఈ క్రీడల్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 3 స్వర్ణాలు సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్తోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ సురేఖ బంగారు పతకాలు గెలిచంది. తద్వారా దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష (1986 సియోల్ గేమ్స్; 4 స్వర్ణాలు, 1 రజతం) తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో కనీసం 3 స్వర్ణ పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతకం కూడా భారత్ ఖాతాలోనే చేరింది. ప్రపంచ చాంపియన్ అదితి స్వామి (భారత్) 146–140తో ఫాదిలి జిలిజాటి (ఇండోనేసియా)పై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్కే లభించాయి. ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్తలే 149–147తో అభిషేక్ వర్మ (భారత్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో ఓజస్కిది మూడో స్వర్ణం. పురుషుల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ విభాగంలో ఓజస్ పసిడి పతకాలు గెలిచాడు. సాత్విక్–చిరాగ్ జోడీ అద్భుతం ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్కు ‘పసిడి’ కల నెరవేరింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ చాంపియన్గా అవతరించి ఈ క్రీడల చరిత్రలో భారత్కు తొలిసారి బంగారు పతకాన్ని అందించింది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. సెమీస్లో మలేసియాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ జోడీని బోల్తా కొట్టించిన భారత జంట తుది పోరులోనూ దూకుడుగా ఆడింది. కళ్లు చెదిరే స్మాష్లతో, చక్కటి డిఫెన్స్తో కొరియా జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని దక్కించుకుంది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్–ప్రదీప్ గాంధే భారత్కు పురుషుల డబుల్స్లో కాంస్య పతకాన్ని అందించారు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలవడంతో వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జోడీ నంబర్వన్ ర్యాంక్ను అందుకోనుంది. దీపక్ ‘రజత’ పట్టు ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్ను భారత్ రజత పతకంతో ముగించింది. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా భారత్కు రజత పతకాన్ని అందించాడు. ఇరాన్ దిగ్గజ రెజ్లర్ హసన్ యజ్దానితో జరిగిన ఫైనల్లో దీపక్ 3 నిమిషాల 31 సెకన్లలో 0–10తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓడిపోయాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం బౌట్లో పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు దీపక్ తొలి రౌండ్లో 3–2తో షరిపోవ్ (ఖతర్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–0తో రియాన్డెస్టా (ఇండోనేసియా)పై, క్వార్టర్ ఫైనల్లో 7–3తో షోటా సిరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 4–3తో షపియెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. భారత్కే చెందిన యశ్ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) ఆరంభ రౌండ్లలోనే ఓడిపోయారు. భారత జట్ల ‘పసిడి’ కూత గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను చేజార్చుకున్న భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు ఈసారి తమ ఖాతాలోకి వేసుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్లో భారత పురుషుల జట్టు 33–29తో డిఫెండింగ్ చాంపియన్ ఇరాన్ జట్టును ఓడించగా... భారత మహిళల జట్టు 26–25తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల కబడ్డీ ఈవెంట్లో భారత పురుషుల జట్టు ఎనిమిదోసారి స్వర్ణ పతకం నెగ్గగా... మహిళల జట్టు మూడోసారి పసిడి పతకం సాధించింది. చెస్లో డబుల్ ధమాకా వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాలు కోల్పోయిన భారత చెస్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్లో సత్తా చాటుకొని రజత పతకాలు నెగ్గారు. పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్లతో కూడిన భారత పురుషుల జట్టు నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్తో జరిగిన చివరి రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు కూడా 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 4–0తో దక్షిణ కొరియాను ఓడించింది. క్రికెట్లో కనకం... తొలిసారి ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్లో పోటీపడ్డ భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో శనివారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అఫ్గానిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసిన దశలో వచ్చిన వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. మెరుగైన ర్యాంక్ కారణంగా భారత్ను విజేతగా ప్రకటించి స్వర్ణ పతకాన్ని అందించగా... అఫ్గానిస్తాన్ జట్టుకు రజతం లభించింది. స్వర్ణం నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. -
ఏషియన్ గేమ్స్ 2023లో ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో 107 పతకాలు
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జైత్రయాత్ర ముగిసింది. ఇవాల్టితో (అక్టోబర్ 7) ఆసియా క్రీడల్లో భారత్ ఈవెంట్స్ అన్ని పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించింది. ఈ ఎడిషన్కు ముందు భారత్ అత్యధిక పతకాలను 2018 జకార్తా ఆసియా క్రీడల్లో (70) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ జకార్తా గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. పతకాల పట్టికలో చైనా 376 పతకాలతో (197 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్యాలు) అగ్రస్థానంలో ఉంది. ఆతర్వాత జపాన్ (181; 50 స్వర్ణాలు, 63 రజతాలు, 68 కాంస్యాలు), రిపబ్లిక్ ఆఫ్ కొరియా (188; 40 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు) ఉన్నాయి. భారత్ పతకాల వివరాలు.. ఆర్చరీ (కాంపౌండ్ మెన్స్): ఓజాస్ దియోతలే (గోల్డ్) ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): జ్యోతి సురేఖ (గోల్డ్) ఆర్చరీ (మెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (వుమెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మిక్సడ్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మెన్స్ సింగిల్స్): అభిషేక్ వర్మ (సిల్వర్) ఆర్చరీ (రికర్వ్ మెన్స్ టీమ్): సిల్వర్ ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): అదితి స్వామి (బ్రాంజ్) ఆర్చరీ (రికర్వ్ వుమెన్స్ టీమ్): బ్రాంజ్ అథ్లెటిక్స్ (మెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): అవినాశ్ సాబ్లే (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 4X400మీ రిలే): గోల్డ్ అథ్లెటిక్స్ (జావెలిన్ త్రో): నీరజ్ చోప్రా (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ షాట్పుట్): తజిందర్పాల్ సింగ్ తూర్ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 5000): పారుల్ చౌదరీ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ జావెలిన్ త్రో): అన్నూ రాణి (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 10000): కార్తీక్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): అజయ్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 5000 ): అవినాశ్ సాబ్లే (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 800): మోహమ్మద్ అఫ్సల్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ డెకత్లాన్): తేజస్విన్ శంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ జావెలిన్ త్రో): కిషోర్ జెనా (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ లాంగ్ జంప్): శ్రీశంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 100 మీ హర్డిల్స్): జ్యోతి యర్రాజీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 1500): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): పారుల్ చౌదరీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 4X400మీ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (వుమెన్స్ 800): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ లాంగ్జంప్): అంచీ సోజన్ (సిల్వర్) అథ్లెటిక్స్ (4X400మీ మిక్సడ్ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (మెన్స్ 10000): గుల్వీర్ సింగ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): జిన్సన్ జాన్సన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ ట్రిపుల్ జంప్): ప్రవీణ్ చిత్రవేల్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): ప్రీతి లాంబా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 400 హర్డిల్స్): విత్య రామ్రాజ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ డిస్కస్ త్రో): సీమా పూనియా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ హెప్టాత్లాన్): నందిని అగసర (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ షాట్పుట్): కిరణ్ బలియాన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (35కిమీ రేస్వాక్ మిక్సడ్ టీమ్): బ్రాంజ్ బ్యాడ్మింటన్ (మెన్స్ డబుల్స్): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి (గోల్డ్) బ్యాడ్మింటన్ (మెన్స్ టీమ్): సిల్వర్ బ్యాడ్మింటన్ (మెన్స్ సింగిల్స్): ప్రణయ్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 75 కేజీ): లవ్లీనా (బ్రాంజ్) బాక్సింగ్ (మెన్స్ 92 కేజీ): నరేందర్ (బ్రాంజ్)ఔ బాక్సింగ్ (వుమెన్స్ 45-50 కేజీ): నిఖత్ జరీన్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 50-54 కేజీ): ప్రీతి (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 54-57 కేజీ): పర్వీన్ (బ్రాంజ్) బ్రిడ్జ్ (మెన్స్ టీమ్): సిల్వర్ కనోయ్ స్ప్రింట్ ఝ(మెన్స్ డబుల్స్ 1000మీ): బ్రాంజ్ చెస్ (మెన్స్ టీమ్): సిల్వర్ చెస్ (వుమెన్స్ టీమ్): సిల్వర్ క్రికెట్ (మెన్స్): గోల్డ్ క్రికెట్ (వుమెన్స్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్ టీమ్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్): అనూష అగర్వల్లా (బ్రాంజ్) గోల్ఫ్ (వుమెన్స్): అదితి అశోక్ (సిల్వర్) హాకీ (మెన్స్): గోల్డ్ హాకీ (వుమెన్స్): బ్రాంజ్ కబడ్డీ (మెన్స్): గోల్డ్ కబడ్డీ (వుమెన్స్): గోల్డ్ రోలర్ స్కేటింగ్ (వుమెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోలర్ స్కేటింగ్ (మెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ డబుల్స్): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 8): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 4): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ పెయిర్): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ క్వాడ్రపుల్): బ్రాంజ్ సెయిలింగ్ (గర్ల్స్ ILCA4): నేహా ఠాకూర్ (సిల్వర్) సెయిలింగ్ (మెన్స్ ILCA7): విష్ణు శరవనన్ (బ్రాంజ్) సెయిలింగ్ (మెన్స్ విండ్సర్ఫర్ RS-X): ఎబద్ అలీ (బ్రాంజ్) సెపకతక్రా (వుమెన్స్ రేగు): బ్రాంజ్ షూటింగ్ (10మీ ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (ట్రాప్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ వుమెన్): పలక్ (గోల్డ్) షూటింగ్ (25మీ పిస్టల్ టీమ్ వుమెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ వుమెన్): సిఫ్త్ కౌర్ సమ్రా (గోల్డ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ మెన్: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (స్కీట్ మెన్): అనంత్జీత్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (25మీ పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (ట్రాప్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ మిక్సడ్ టీమ్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ మెన్): ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (25మీ రాపిడ్ఫైర్ పిస్టల్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (స్కీట్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (ట్రాప్ మెన్): చెనై కేడీ (బ్రాంజ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్): అషి చౌక్సీ (బ్రాంజ్) స్క్వాష్ పురుషుల జట్టు- స్వర్ణం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- స్వర్ణం స్క్వాష్ పురుషుల సింగిల్స్ సౌరవ్ ఘోశల్ - రజతం స్క్వాష్ మహిళల జట్టు- కాంస్యం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- కాంస్యం టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్- కాంస్యం టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్- గోల్డ్ టెన్నిస్ పురుషుల డబుల్స్- రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీ దీపక్ పునియా - రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల అమన్ - కాంస్యం రెజ్లింగ్ పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీ సునీల్ కుమార్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల ఆంటిమ్ పంఘల్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 62 కేజీల విభాగంలో సోనమ్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీ కిరణ్ - కాంస్యం ఉషు మహిళల 60 కిలోల రోషిబినా దేవి - రజతం -
ఆసియా క్రిడల్లో సెంచరీ కొట్టిన భారత్
-
అసాధారణం.. మన అద్భుత విజయం: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇవాళ వంద పతకాల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు సృష్టించిన వేళ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశారాయన. అంతేకాదు వాళ్లను కలుసుకుని ముచ్చటించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత్కు దక్కిన అద్భుత విజయం!. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అబ్బుర పరిచే వాళ్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించి.. మన హృదయాలను గర్వంతో నింపింది. 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. A momentous achievement for India at the Asian Games! The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals. I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA — Narendra Modi (@narendramodi) October 7, 2023 మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వంద పతకాలు వచ్చాయి. అందులో స్వర్ణం 25 ఉండగా.. ఇవాళ ఒకే రోజు 3 దక్కాయి. ఇక.. మిగిలిన పతకాల్లో రజతం 35, కాంస్యం 40 ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది భారత్. రేపటితో ఆసియా గేమ్స్ 2023 ముగియనున్నాయి. -
41 ఏళ్ల నిరీక్షణకు తెర
ఈ సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ... 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.... భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఆసియా క్రీడల్లో పతకాలను ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో చివరిసారి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత్కు పతకాలు లభించాయి. 1982 ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్లో దివంగత సయ్యద్ మోడీ... పురుషుల డబుల్స్లో లెరాయ్ ఫ్రాన్సిస్–ప్రదీప్ గాంధె సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత తొమ్మిదిసార్లు ఆసియా క్రీడలు జరిగినా పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయారు. చైనా గడ్డపై ఎట్టకేలకు ఈ నిరీక్షణకు ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముగింపు పలికారు. సింగిల్స్లో ప్రణయ్... డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–23, 22–20తో లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. 78 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో కేరళకు చెందిన 31 ఏళ్ల ప్రణయ్ రెండో గేమ్లోనే గెలవాల్సింది. తొలి గేమ్ను సొంతం చేసుకొని, రెండో గేమ్లో 20–18తో ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకున్నాడు. స్కోరును సమం చేసిన లీ జి జియా అదే జోరులో రెండో గేమ్ను నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరకు ప్రణయ్ 18–20తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 3–0తో లీ షి ఫెంగ్పై ఆధిక్యంలో ఉన్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–9తో ఎన్జీ జూ జియి–జాన్ ప్రజోగో (సింగపూర్) జంటపై గెలిచి సెమీఫైనల్ చేరింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆరోన్ చియా–సూ వుయ్ యిక్ (మలేసియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. సింధుకు నిరాశ మరోవైపు మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్లో ఓడి రజత పతకం సాధించిన సింధు ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 12–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. -
భళా భారత్...
పతకాల్లో తొలిసారి ‘సెంచరీ’ దాటాలనే లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడా బృందం ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడలు ముగియడానికి మరో నాలుగు రోజులు ఉండగా... ఇప్పటికే భారత్ ఖాతాలో 81 పతకాలు చేరాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. పోటీల 11వ రోజు భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 12 పతకాలు సొంతం చేసుకుంది. మారథాన్ రేసుతో నేడు అథ్లెటిక్స్ ఈవెంట్స్కు తెరపడనున్న నేపథ్యంలో... ఆర్చరీ, క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్క్వా‹ష్, బ్రిడ్జ్, చెస్ క్రీడాంశాల్లో భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. హాంగ్జౌ: భారత అథ్లెటిక్స్ ‘పోస్టర్ బాయ్’ నీరజ్ చోప్రా ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిశాడు. సహచరుడు కిశోర్ కుమార్ జేనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో నీరజ్ చోప్రా నుంచి ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలోకి వెళ్లాయి. డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కిశోర్ కుమార్ జేనా జావెలిన్ను తన మూడోప్రయత్నంలో 86.77 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి వచ్చాడు. అయితే నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో నమోదు చేశాడు. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కిశోర్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందినా నీరజ్ దూరాన్ని దాటలేకపోయాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో కిశోర్ ఫౌల్ చేసి పాల్గొన్న తొలి ఆసియా క్రీడల్లోనే రజత పతకం గెలిచి సంబరపడ్డాడు. మరోవైపు ఈ ప్రదర్శనతో నీరజ్ వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన రెండో జావెలిన్ త్రోయర్గా గుర్తింపు పొందాడు. గతంలో పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ నవాజ్ (1951, 1954) ఈ ఘనత సాధించాడు. రజత పతకం నెగ్గిన ఒడిశా ప్లేయర్ కిశోర్ కుమార్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. ఒక కోటీ 50 లక్షలు నజరానా ప్రకటించారు. 61 ఏళ్ల తర్వాత రిలేలో స్వర్ణం పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్లో మొహమ్మద్ అనస్, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3ని:01.58 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ విభాగంలో 61 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ పసిడి పతకాన్ని అందించింది. 1962 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్, మఖన్ సింగ్, దల్జీత్ సింగ్, జగదీశ్ సింగ్ బృందం చివరిసారి 4్ఠ400 మీటర్ల రిలేలో భారత్కు బంగారు పతకాన్ని అందించింది. మరోవైపు ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్రాజ్లతో కూడిన భారత మహిళల జట్టు 4్ఠ400 మీటర్ల రిలేలో రజత పతకంతో (3ని:27.85 సెకన్లు) సరిపెట్టుకుంది. పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్ రేసును భారత అథ్లెట్ హర్మిలన్ బైన్స్ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్డ్ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. సురేఖ–ఓజస్ జోడీకి స్వర్ణం ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ దేవ్తలే (భారత్) జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలిచింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. మరోవైపు బ్రిడ్జ్ క్రీడాంశంలో పురుషుల టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా... చెస్లో భారత పురుషుల, మహిళల జట్లు రెండో స్థానంలో కొనసాగుతూ పతకాల రేసులో ఉన్నాయి. -
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట.. ఇదే తొలి సారి
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023 భారత్ హవా కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ డియోటలే గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. ఇదే తొలిసారి.. ఈ విజయంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 71 చేరింది. తద్వారా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ అత్యధిక పతకాలు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2018 ఆసియాక్రీడల్లో 70 పతకాలను ఇండియా సాధించింది. కాగా ప్రస్తుతం భారత ఖాతాలో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: Asian Games 2023: కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు గోల్డ్ మెడల్ ✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨ With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅 Our athletes' dedication and hard work have made this moment possible🔥 Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV — SAI Media (@Media_SAI) October 4, 2023 -
ఏషియన్ గేమ్స్లో ఇవాళ టీమిండియాకు పతకాల పంట.. ఆల్టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) భారత్కు పతకాల పంట పండింది. ఈ రోజు టీమిండియా ఏకంగా 15 పతకాలు (3 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. ఏషియన్ గేమ్స్ హిస్టరీలో భారత్ ఒకే రోజు ఇన్ని పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2010 గ్వాంగ్ఝౌ క్రీడల్లో 14వ రోజు భారత్ సాధించిన 11 పతకాలే ఇవాల్టి వరకు ఓ రోజులో భారత్ సాధించిన అత్యధిక పతకాలుగా ఉన్నాయి. దీని తర్వాత 2014 ఆసియా క్రీడల్లో 8వ రోజు భారత్ 10 పతాకలు సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ 10వ రోజు 9 పతకాలు సాధించింది. 2010 గ్వాంగ్ఝౌ క్రీడల్లో 9వ రోజు భారత్ 9 పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే, ఇవాళే భారత్ పతకాల సంఖ్య కూడా 50 దాటింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 53 పతకాలు ఉన్నాయి. 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్య పతకాలను భారత్ ఇప్పటిదాకా సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 243 పతకాలతో చైనా (132 గోల్డ్, 72 సిల్వర్, 39 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 125 పతకాలతో (30, 35, 60) కొరియా రెండో స్థానంలో, 112 పతకాలతో (29, 41, 42) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా, 2018 క్రీడల్లో గెలిచిన 69 పతాకలే ఇప్పటివరకు భారత్ అత్యధిక పతకాల సంఖ్యగా కొనసాగుతుండగా.. ఈసారి క్రీడల్లో భారత్ ఈ రికార్డును సునాయాసంగా దాటి 100 పతకాల మార్కును తాకుందని అంచనా. ఈ ఎడిషన్లో ఇంకా వారం రోజులు మిగిలి ఉన్నాయి. ఇవాళ భారత్ సాధించిన స్వర్ణ పతకాలు.. పురుషుల ట్రాప్ టీమ్ షూటింగ్ (కైనన్ డేరియస్, జొరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమాన్) అవినాశ్ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్) తజిందర్పాల్ సింగ్ తూర్ (మెన్స్ షాట్పుట్) -
‘ఐదు’తో అదరగొట్టారు
ఈసారి పతకాల వేటలో ‘సెంచరీ’ దాటాలని చైనాలో అడుగుపెట్టిన భారత క్రీడాకారులు తొలిరోజే పతకాల ఖాతా తెరిచారు. 19వ ఆసియా క్రీడల్లో మొదటి రోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. స్వర్ణ పతకం అందకపోయినా మూడు రజతాలు, రెండు కాంస్యాలతో శుభారంభం చేశారు. అంచలను అందుకుంటూ షూటర్లు తమ గురిని పతకాలపై పెట్టగా... రోయింగ్లోనూ భారత క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. మహిళల బాక్సింగ్, పురుషుల హాకీ, టెన్నిస్ క్రీడాంశాల్లోనూ మనోళ్లు రాణించారు. టేబుల్ టెన్నిస్, వాలీబాల్, మహిళల ఫుట్బాల్లో భారత్ పతకాల రేసు నుంచి ని్రష్కమించారు. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత క్రీడాకారులు మెరిపించారు. షూటింగ్లో రెండు, రోయింగ్లో మూడు పతకాలతో రాణించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం టీమ్ ఈవెంట్లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్వాలిఫయింగ్లో భారత బృందం 1886 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. హాన్ జియావు, యుటింగ్ హువాంగ్, జిలిన్ వాంగ్లతో కూడిన చైనా జట్టు 1896.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. గాన్హుయగ్, యసుజెన్, నరన్తుయాలతో కూడిన మంగోలియా జట్టు 1880 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. క్వాలిఫయింగ్లో రమిత 631.9 పాయింట్లతో రెండో స్థానంలో, మెహులీ 630.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్లో టాప్–8లో నిలిచిన వారి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్ను నిర్వహిస్తారు. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... మెహులీ 208.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. యుటింగ్ హువాంగ్ (252.7 పాయింట్లు) స్వర్ణం, హాన్ జియావు (251.3 పాయింట్లు) రజతం గెల్చుకున్నారు. రోయింగ్లో పురుషుల లైట్వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో అర్జున్ లాల్ జాట్–అరవింద్ సింగ్ ద్వయం రజత పతకంతో బోణీ కొట్టింది. భారత జోడీ 6ని:28.18 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. జున్జీ ఫాన్–మన్ సున్ (చైనా; 6ని:23.42 సెకన్లు) జంట స్వర్ణ పతకం సాధించింది. పురుషుల పెయిర్ విభాగంలో బాబూలాల్ యాదవ్–లేఖ్ రామ్ జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్ రేసులో బాబూలాల్–లేఖ్ రామ్ జంట 6ని:50.41 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం పురుషుల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో భారత జట్టు రజతం గెల్చుకుంది. నీరజ్, నరేశ్ కల్వానియా, నితీశ్ కుమార్, చరణ్జీత్ సింగ్, జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్లతో కూడిన భారత జట్టు 5ని:43.01 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందింది. వాలీబాల్లో భారత పురుషుల జట్టు పతకం రేసు నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 16–25, 18–25, 17–25తో జపాన్ చేతిలో ఓడిపోయింది. పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్కుమార్ (భారత్) 6–2, 6–3తో అభిషేక్–ప్రదీప్ (నేపాల్)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 6–0, 6–0తో మార్కో టిన్ (మకావు)పై ఘనవిజయం సాధించాడు. ఏషియాడ్లో నేటి భారతీయంమెడల్ ఈవెంట్స్ షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగం: రుద్రాం„Š పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దివ్యాంశ్ (ఉదయం గం. 6:30 నుంచి 9 వరకు). మహిళల క్రికెట్ ఫైనల్: భారత్గీశ్రీలంక (ఉదయం గం. 11:30 నుంచి). రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ (బల్రాజ్ పన్వర్; ఉదయం గం. 7 నుంచి); పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ (ఉదయం గం. 8:30 నుంచి); మహిళల ఎయిట్ (ఉదయం గం. 8:50 నుంచి). -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్
హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. ఇందులో 3 సిల్వర్ (2 రోయింగ్, ఒకటి షూటింగ్), 2 బ్రాంజ్ మెడల్స్ (షూటింగ్లో ఒకటి, రోయింగ్లో ఒకటి) ఉన్నాయి. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అషి చౌక్సీ, మేహుల్ ఘోష్, రమిత త్రయం రజత పతకం సాధించగా.. ఫురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ రోయింగ్లో భారత జోడీ అర్జున్ లాల్ ఝట్, అరవింద్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. రోయింగ్ మెన్స్ పెయిర్ ఈవెంట్లో బాబు లాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం సాధించగా.. రోయింగ్ మెన్స్ 8 ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత స్టార్ షూటర్ రమిత కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఐదు పతకాలతో ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 10 పతకాలతో (9 స్వర్ణాలు, ఓ రజతం) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది. కాగా, ఈసారి ఏషియన్ గేమ్స్లో భారత్ 655 సభ్యుల బృందంతో బరిలోకి దిగింది. క్రితం సారి (2018, జకార్తా) క్రీడల్లో భారత్ 570 సభ్యుల బృందంతో బరిలోకి దిగి 70 మెడల్స్ (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) సాధించింది. 2023 ఆసియా క్రీడలు నిన్నటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
పోలీసు సేవలకు సలాం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఏపీ పోలీసులకు మంగళవారం విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినో త్సవంలో సీఎం జగన్ పతకాలు అందజేశారు. 2021, 2022, 2023కు సంబంధించి 65 మంది పో లీసులు కేంద్రం పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పో లీస్ మెడల్(పీపీఎం), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్విస్(పీఎం), పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీ ఎంజీ), అసాధారణ్ ఆసూచన కుశ లత పదక్తో పా టు ముఖ్యమంత్రి శౌర్య పతకాలను అందుకున్నారు. పీపీఎం 2021–22: భావనాసక్సేనా (జాయింట్ సె క్రటరీ, విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ), వెంకటరామిరెడ్డి, (ఐజీపీ–శిక్షణ), పి.సీతారాం(గ్రేహౌండ్స్ క మాండెంట్), ఎన్.సుధాకర్రెడ్డి (ఎస్డీపీఓ, పలమనేరు) పీఎం 2021–22: ఎస్వీ రాజశేఖరబాబు (డీఐజీ, లా అండ్ ఆర్డర్), ఎం.రవీంద్రనాథ్బాబు(ఏఐజీ, లా అండ్ ఆర్డర్), కె.రఘువీర్రెడ్డి(ఎస్పీ, నంద్యాల), కేఎస్వీ సుబ్బారెడ్డి(కమాండెంట్, 6 బెటాలియన్), కె.నవీన్కుమార్(ఏఎస్పీ, గ్రేహౌండ్స్), కె.సుబ్రహ్మ ణ్యం (ఏడీసీపీ, విశాఖ), వి.వి.నాయుడు(ఏసీపీ దిశ, విజయవాడ), సీహెచ్.రవికాంత్ (ఏసీపీ, ఎస్బీ విజ యవాడ), జి.రవికుమార్(డీఎస్పీ, సీఐడీ), కె.వి.రా జారావు, (డీఎస్పీ పీటీఓ), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్ డీపీఓ, నెల్లూరు), వి.శ్రీరాంబాబు(డీఎస్పీ, సీఐడీ), కె.విజయపాల్ (ఎస్డీపీఓ, రాజమండ్రి), సి.శ్రీనివాసరావు (డీఎస్పీ దిశ, ప్రకాశం), జి.వీరరాఘవరెడ్డి (ఎస్డీపీఓ, మార్కాపురం), వై.రవీంద్రరెడ్డి (ఏఆర్ డీఎస్పీ, తిరుపతి), పి.వి.హనుమంతు(అసిస్టెంట్ క మాండెంట్, 6వ బెటాలియన్), బి.విజయ్కుమార్ (అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్), బి.గుణరా ము (సీఐ, విజయవాడ), ఎం.కోటేశ్వరరావు (ఎస్ఐ, శ్రీకాకుళం), జి.కృష్ణారావు(ఎస్ఐ, విజయవాడ), ఆర్.రామనాథం, (ఆర్ఎస్ఐ, విజయవాడ), ఇ.శివశంకర్రెడ్డి (ఆర్ఎస్ఐ, 2వ బెటాలియన్), ఎం.వెంకటేశ్వర్లు(ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), ఎస్.సింహాచలం (ఏఆర్ఎస్ఐ, 3వ బెటాలియన్), టి.నరేంద్రకుమార్ (ఏఎస్ఐ, గుంటూరు), పి.భాస్కర్(ఏఎస్ఐ, కడప), ఎన్.శ్రీనివాస్(ఏఎస్ఐ, కొవ్వూరు), ఎస్.వీరాంజనేయులు(ఏఎస్ఐ, విజయవాడ). పీఎంజీ 2021: ఆర్.రాజశేఖర్ (డీఏసీ), సీహెచ్.సాయిగణేశ్ (డీఏసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ, అనకాపల్లి), డి.మబాషా (ఏఏసీ), టి.కేశవరావు(హెచ్సీ, ఎస్ఐబీ), ఎం.మునేశ్వరరావు (గ్రేహౌండ్స్ ఎస్సీ), గ్రేహౌండ్స్ జేసీల్లో ఎస్.బుచ్చిరాజు, జి.హరిబాబు, బి.చక్రధర్, ఎం.నాని, పి.అనిల్ కుమార్. అసాధారణ్ ఆసూచన కుశలత పదక్ 2022: సి.శ్రీకాంత్ (ఐజీపీ, సీఐడీ), ఎ.బాబ్జీ (ఎస్ఐబీ, ఎస్పీ), ఇ.జి.అశోక్ కుమార్(ఏఎస్పీ, ఎస్ఐబీ), ఎ.వెంకటరావు(డీఎస్పీ, తీవ్రవాద విభాగం, విశాఖ), కె.నిరీక్షణరావు(ఎస్ఐ, ఎస్ఐబీ). ముఖ్యమంత్రి శౌర్య పతకం(2023): బి.సుధాకర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్), కె.విజయశేఖర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐబీ), కె.హరీష్ (ఆర్ఎస్ఐ), పి. రమేశ్(ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ), టి.రవికుమార్(ఎస్ఐ, గ్రేహౌండ్స్), గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐలు టి.సత్యనారా యణ, పి.సతీశ్కుమార్, సీహెచ్.శివ, గ్రేహౌండ్స్ ఎ స్పీలు షామలరావు, రవి, నాగరాజు, గ్రేహౌండ్స్ జే సీలు ఎస్కే కరీం బాషా, బి.వాసుదేవ రెడ్డి, సయ్యద్ హబీబుల్లా, ఎస్.సిద్దయ్య, ఎం.గౌరునాయుడు. -
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సీఎం వైస్ జగన్ పోలీస్ అధికారులకు పతకాలు అందజేశారు
-
అడిషనల్ డీజీ విజయ్కుమార్కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్పై ఇంటెలిజెన్స్లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్స్టేషన్కు చెందిన లీడింగ్ ఫైర్మ్యాన్ శ్రీనివాస్కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
10 మంది తెలుగు పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్
న్యూఢిల్లీ: 2023 సంవత్సారానికి గానూ దేశవ్యాప్తంగా 140 మంది పోలీసు అధికారులు కేంద్ర హోంశాఖ అందించే ఇన్వెస్టిగేషన్లో ఎక్సలెన్స్ మెడల్స్కు ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు పొందిన వారి జాబితాను కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటించింది. ఇక ఈ ఏడాది అవార్డులు అందుకున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్ఐ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడు నుంచి 8, మధ్యప్రదేశ్ నుంచి ఏడుగురు, గుజరాత్ నుంచి ఆరుగురితోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు ఉన్నారు. కాగా వీరిలో 22 మంది మహిళా పోలీసులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది పోలీసులకు మెడల్స్ లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదుగురు, తెలంగాణ నుంచి అయిదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్ దక్కాయి. ఏపీ నుంచి.. ► గుంట్రెడ్డి అశోక్ కుమార్, ఇన్స్పెక్టర్ ►షేక్ మన్సూరుద్దిన్, ఇన్స్పెక్టర్ ►ధనుంజయుడు మల్లెల, డీఎస్పీ ►కొర్లకుంట సుప్రజ, డీఎస్పీ ►ఉప్పుటూరి రవిచంద్ర, డీఎస్పీ తెలంగాణ నుంచి.. ►మేకల తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ ►రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ ►మూల జితేందర్ రెడ్డి, ఏసీపీ ►కమ్మాపల్లి మల్లిఖార్జున కిరణ్కుమార్, డీఎస్పీ ►భూపతి శ్రీనివాసరావు, ఏసీపీ కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ అందించే ఈ పతకాన్ని 2018లో ఇవ్వడం ప్రారంభించగా.. ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీనా ప్రకటిస్తారు. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, విచారణలో వారి ప్రతిభను గుర్తించి గుర్తించి ఈ అవార్డు అందిస్తారు. -
ఉత్తమ పోలీసులకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. నూతన సంవత్సరంగా సందర్భంగా ఇవ్వాల్సిన ఈ పతకాలను దక్కించుకున్న పోలీసు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల అధికారుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర శౌర్యపతకం, మహోన్నత సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, కఠిన సేవాపతకం, సేవాపతకం.. మొత్తం ఐదు కేటగిరీల్లో పతకాల విజేతల జాబితాను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ విడుదల చేశారు. శౌర్య పతకాలు ఎవరికంటే... పోలీస్శాఖ నుంచి శౌర్య పతకాన్ని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ పి.సతీశ్ దక్కించుకున్నారు. ఇంటెలి జెన్స్ విభాగం(కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్)కు చెందిన ఎస్సై ఎస్ఎ కరీం, ఏఎస్సై శివ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ఖాజా మొయినుద్దీన్, ఎస్.రాజవర్ధన్రెడ్డి, ఏ. బాలాజీరావు, కానిస్టేబుళ్లు పి మోహన్, కె కిరణ్కుమార్, బి.లక్ష్మీ నారాయణ, బి.వీరస్వామి, ఎండీ అలీముద్దీన్లకు తెలంగాణ అగ్నిమాపకశాఖ నుంచి శౌర్య పతకం అందుకున్న వారిలో అసెంబ్లీ ఫైర్ స్టేషన్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి.ధనుంజయ్రెడ్డి, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్లో ఎస్ఎఫ్ఓ( స్టేషన్ ఫైర్ ఆఫీసర్)గా పనిచేస్తున్న డి. మోహన్రావు, గౌలిగూడ ఫైర్ స్టేషన్ ఎస్ఎఫ్ఓ ఎన్ ప్రవీణ్కుమార్, మొఘల్పుర ఫైర్ స్టేషన్ ఫైర్మన్ బి.వెంకటేశ్వర రాజు, గౌలిగూడ ఫైర్స్టేషన్ ఫైర్మెన్ మహ్మద్ అస్గర్, అసెంబ్లీ ఫైర్స్టేషన్ ఫైర్మన్ టి. హరికృష్ణ, సికింద్రాబాద్ ఫైర్స్టేషన్ ఫైర్మన్ ఎం.హరికృష్ణలకు దక్కాయి. పోలీస్ శాఖ నుంచి మహోన్నత సేవా పతకాలు 16 మందికి, ఉత్తమ సేవా పతకాలు 94 మందికి, కఠిన సేవాపతకాలు 51 మందికి, సేవా పతకాలు 473 మందికి దక్కాయి. ఇల్లెందు ఫైర్స్టేషన్ డ్రైవర్కుమహోన్నత సేవా పతకం మహోన్నత సేవా పతకం ఖమ్మం జిల్లా ఇల్లెందు ఫైర్స్టేషన్ డ్రైవర్ ఆపరేటర్ కే వెంకటేశ్వర్లుకు దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవా పతకాలు 14 మందికి దక్కాయి. ఏసీబీలో,,, ఏసీబీలో ఉత్తమ సేవాపతకాలు వరంగల్ రేంజ్ కానిస్టేబుల్ ఏ. నర్సయ్య, నిజామాబాద్ రేంజ్ కానిస్టేబుల్ జి సురేశ్, ఖమ్మం రేంజ్ హెడ్కాని స్టేబుల్ టి.క్రిష్ణ సూరిలకు దక్కించుకున్నారు. సేవాపతకాలు 22 మందికి దక్కాయి. విజిలెన్స్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ ఎం.హుస్సేని నా యుడు, కానిస్టేబుల్ ఎంఏ మసూద్లకు దక్క గా, సేవాపతకాలు ఇన్స్పెక్టర్ దండిక మహేశ్, కానిస్టేబుల్ డి.రాజేశ్కుమార్ దక్కించుకున్నారు. ఎస్పీఎఫ్లో.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన వారిలో సబ్ ఇన్స్పెక్టర్ డి. తిరుపతిరెడ్డికి మహోన్నత సేవా పతకం దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవాపతకాలు 15 మందికి దక్కాయి. కాగా, పతకాల జాబితా ఆరు నెలలు ఆలస్యం కావడంపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే, ఆలస్యంగానైనా పతకాలు దక్కినందుకు ఒకింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
అదీ.. వాళ్ల వైఖరి: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తామని, ఆఫ్ట్రాల్ మెడల్స్ ఎంతని చెబుతూ.. తమ ఘనతలను గంగలో నిమజ్జనం చేసేందుకు భారత రెజ్లర్లు సిద్ధపడ్డారు. అయితే హరిద్వార్ వద్ద చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు కదా! అని రెజ్లర్లకు గుర్తు చేశారాయన. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు చేసిన ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందని తేలితే.. అప్పుడు అరెస్ట్ జరుగుతుంది కదా పేర్కొన్నారాయన. ఇక గంగలో మెడల్స్ను విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించడంపైనా ఆయన స్పందిస్తూ.. ‘‘హరిద్వార్కు వెళ్లారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. కానీ, తర్వాత వాటిని తికాయత్కు(రైతు సంఘాల నేత) అప్పగించారు. ఇదేనా వాళ్ల వైఖరి.. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటూ పెదవి విరిచారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆవైపుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను మంగళవారం సాయంత్రం హరిద్వార్లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్చలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు. ఈ క్రమంలో గంగలో మెడల్స్ను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్ తికాయత్ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు. -
పతకాలు ‘గంగ’పాలు కాలేదు!
హరిద్వార్: న్యాయం కోసం పోరాడుతూ వారంతా నెల రోజులకు పైగా నిరసన ప్రదర్శించారు...కానీ ఫలితం దక్కలేదు. పైగా పోలీసులు నిర్దయగా, అగౌరవంగా వారిని లాక్కెళ్లారు...ఆపై ప్రభుత్వంనుంచి కనీస స్పందన కూడా కనిపించలేదు. దాంతో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆ అగ్రశ్రేణి రెజ్లర్లు తమ కష్టానికి ప్రతిఫలమైన పతకాలను కూడా వద్దనుకున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి గంగా నదిలో పడేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ చివరకు అది జరగలేదు. సన్నిహితుల సముదాయింపుతో చివరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. హరిద్వార్లో సుదీర్ఘ సమయం పాటు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం వందల సంఖ్యలో వచ్చిన మద్దతుదారులతో కలిసి చేతిలో పతకాలతో వీరంతా హరిద్వార్ చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా... ప్రపంచ చాంపియన్షి ప్లో పతకం సాధించిన వినేశ్ ఫొగాట్, సంగీత, వీరి బంధుమిత్రులు, అభిమానులు హర్ కి పౌరి వద్దకు చేరుకున్నారు. బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాల్సిందేనని నిరసన చేపట్టారు. రెజ్లర్లు పతకాలను చేత పట్టుకొని గంగపాలు చేయాలనుకున్నారు. పలువురు బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని పవిత్రమైన గంగానదిలో ఇలాంటి చర్యలను అనుమతించమని వాదించారు. గంటా 45 నిమిషాల పాటు ఈ హైడ్రామా నడిచింది. రెజ్లర్ల సన్నిహితులు తీవ్రమైన నిర్ణయం వద్దని వారించడంతో చివరకు వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఐదు రోజుల్లోగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. -
Wrestlers Protest: రైతు నేతల విజ్ఞప్తి.. పతకాలు గంగానదిలో వేయడం వాయిదా..
న్యూఢిల్లీ: హరిద్వార్ వద్ద గంగానదిలో పతకాలను విసిరేస్తామన్న రెజ్లర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. రైతు నేతల విజ్ఞప్తితో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి అయిదు రోజుల గడువిస్తూ అల్టీమేటం జారీ చేశారు. అయిదు రోజుల్లో బ్రిజ్ భూషన్ సింగ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ తిరిగి వస్తామని తెలిపారు. రెజ్లర్ల పతకాలను రైతు నేత నరేష్ తన వెంట తీసుకెళ్లారు. కాగా బీజేపీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరు నెలల నుంచి ఢిల్లీలో నిరసన చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తాము కష్టపడి గెలుచుకున్న మెడల్స్ను పవిత్ర గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు విసిరేస్తామని ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేస్తామని తెలిపారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు.కాబట్టి ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో నిరసనగా తమ పతకాలను నదిలో వేయడానికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని గంగా నది తీరానికి చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు అక్కడే ధర్నాకు దిగారు. అయితే రెజ్లర్లు పతకాలను గంగా నదిలోకి విసిరేందుకు సిద్ధమవుతున్న వేళ రైతు నాయకుడు నరేష్ టికాయత్ హరిద్వార్ హర్ కి పౌరీకి చేరుకున్నారు. ఆయన జోక్యం చేసుకొని పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయొద్దని నిరసన తెలుపుతున్న మల్లయోధులను కోరారు. దీంతో తమ నిర్ణయాన్ని రెజ్లర్లు వాయిదా వేసుకున్నారు. హరిద్వార్లోని హర్ కీ పౌరి నుంచి వెనక్కి బయల్దేరారు. కాగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. చదవండి: మణిపూర్లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
మెడల్స్ ను గంగ లో విసరనున్న రేస్లర్స్ ..
-
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్సింగ్పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
భారత్ తీన్మార్ పంచ్...
విశ్వ వేదికపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ను చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా మూడు పతకాలతో తిరిగి రానున్నారు. పతక వర్ణాలు (స్వర్ణ, రజత, కాంస్య) ఇంకా ఖరారు కాకపోయినా పతకాలు మాత్రం ఖాయమయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా బాక్సర్లు దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించి సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్లో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజతాల కోసం పోటీపడతారు. ఓడితే మాత్రం కాంస్య పతకాలతో తమ పోరాటాన్ని ముగిస్తారు. తాస్కాంట్: ప్రత్యర్థి ఎవరైనా తమ పంచ్లతో అదరగొడుతున్న భారత బాక్సర్లు ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపక్ 5–0తో నుర్జిగిత్ దిషిబయేవ్ (కిర్గిస్తాన్)పై, హుసాముద్దీన్ 4–3తో దియాజ్ ఇబానెజ్ (బల్గేరియా)పై, నిశాంత్ దేవ్ 5–0తో జార్జి టెరీ క్యూలార్ (క్యూబా)పై గెలుపొందారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; అస్లాన్బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. ప్రపంచ పురుషుల బాక్సింగ్లో పవర్ హౌస్గా పేరున్న క్యూబా దేశ బాక్సర్పై భారత బాక్సర్ విజయం సాధిస్తాడని ఊహకందని విషయం. కానీ పట్టుదలతో పోరాడితే క్యూబా బాక్సర్ను కూడా ఓడించే సత్తా భారత బాక్సర్లలో ఉందని బుధవారం నిశాంత్ దేవ్ నిరూపించాడు. జార్జి క్యూలార్తో జరిగిన బౌట్లో నిశాంత్ ఆద్యంతం దూకుడుగా ఆడి పైచేయి సాధించాడు. గత ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన నిశాంత్ ఈసారి సెమీఫైనల్కు చేరి భారత్కు మూడో పతకాన్ని ఖాయం చేశాడు. 10 ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాలు. అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించగా... విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ (2017), మనీశ్ కౌశిక్ (2019), ఆకాశ్ (2021) కాంస్య పతకాలు గెలిచారు. తాజా ఈవెంట్లో హుసాముద్దీన్, దీపక్, నిశాంత్ దేవ్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. -
పట్టాభిషేకం వేడుకకు గుర్తుగా..రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు
లండన్లోని వెస్ట్మినిస్టర్లో శనివారం కింగ్ చార్లెస్ 3కి పట్టాభిషేకం అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్ రాజు దాదాపు రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ బహుమతులను పట్టాభిషేక పతకాల రూపంలో అందించనున్నారు. వీటిని యూకే ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ పట్టాభిషేకంలో సహకరించి, విజయవంతంగా పూర్తి అయ్యేలా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నట్లు బ్రిటన్ పేర్కొంది. తమ దేశంలో అత్యవసర సమయంలో సేవలందించే.. ఆర్మీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి అందజేయనున్నట్లు భారత మూలాలు ఉన్న యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ అన్నారు. తమ కొత్త రాజు పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా..తమ దేశంలోని అత్యవసర సేవలందించే సిబ్బంది పాత్రను గుర్తించడమే గాక ఆ వేడుకకు గుర్తుగా ఈ కృతజ్ఞతా పతకాలను అందజేస్తున్నట్లు బ్రేవర్మాన్ అన్నారు. ఈ మేరకు బ్రేవర్మాన్ మాట్లాడుతూ..సాయుధ దళాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, నిస్వార్థ సేవ లేకుండా ఈ పట్టాభిషేకం విజయవంతం కాదని అన్నారు. ఈ పతకం వారి సేవకు, కృషికి గుర్తింపుగా దేశం తరుఫున కృతజ్ఞతా బహుమతి అని అన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి అందజేస్తారని చెప్పారు. ఈ పతకం ముందు భాగంలో రాజు, రాణి డబుల్ పోర్ట్రెయిట్ ఉంటుంది. దీన్ని మార్టిన్ జెన్నింగ్స్ రూపొందించారు. ఈ పతకాలను బర్మింగ్హామ్లోని వోర్సెస్టర్షైర్ మెడల్ సర్వీస్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ పతకం మా సాయుధ దళాలు, చక్రవర్తి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి అద్దంపడుతుందన్నారు బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్. పట్టాభిషేకమహోత్సవ పతకాల సంప్రదాయం 1603 లో కింగ్జేమ్స్ హయాం నాటిదని చెప్పారు. ఈ వేడుకలో మొత్తం 4 లక్షల మందికి ఈ పట్టాభిషేక పతకాలు అందుకుంటారని బెన్ వాలెస్ చెప్పారు. ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల నుంచి అతిరథమహారథులకే గాక నిస్వార్థపూరితంగా పనిచేసి ఆయా విభాగాల్లో పేరుగాంచిన ప్రముఖులకు సైతం బ్రిటన్ ఆహ్వానం పలికింది. (చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ) -
Vinesh Phogat: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. మేము నేరస్తులం కాదు.. ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. Watch | "Did We Win Medals To See Such Days?" Wrestler Vinesh Phogat Breaks Down pic.twitter.com/NXOrAZwfPA — NDTV (@ndtv) May 3, 2023 ఆప్ నేత అరెస్టు! ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: కోపంలో నోరు జారిన పోలీసు..సెకనులో టెర్రరిస్టుగా మారుస్తా! అని బెదిరింపులు) #WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU — ANI (@ANI) May 3, 2023 -
‘పరుగుల అవ్వ’.. వయసు 95.. పోలాండ్లో పరుగుకు రెడీ
భగవాని దేవిని అందరూ ‘పరుగుల అవ్వ’ అంటారు. వయసు 95కు చేరినా ఆమె ఉత్సాహంగా పరుగు తీస్తోంది.. మెడల్స్ సాధిస్తోంది. 35 ఏళ్లు దాటిన వారి కోసం నిర్వహించే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్’ కోసం ఇప్పుడు ఆమె పోలాండ్లో ఉంది. ‘గోల్డ్ మెడల్ తెస్తాను ఉండండి’ అంటోంది. వంద మీటర్ల దూరాన్ని మీరు ఎన్ని సెకన్లలో పరిగెడతారు? హుసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో పరిగెత్తాడు. టీనేజ్ పిల్లలు చురుగ్గా ఉంటే పదిహేను సెకన్లలో పరిగెడతారు. ఇరవై ఏళ్లు దాటిన వారు ఇరవై సెకన్లు తీసుకోక తప్పదు. మరి 90 దాటిన వారు? ఫిన్లాండ్లో గత ఏడాది జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో భగవాని దేవి (94) వంద మీటర్లను కేవలం 24.74 సెకన్లలో పరిగెత్తింది. అది మన నేషనల్ రికార్డ్. ఆ రికార్డ్తో గోల్డ్ మెడల్ సాధించింది భగవాని దేవి. ఇప్పుడు ఆమెకు తొంభై ఐదు ఏళ్లు. మార్చి 25 నుంచి 31 వరకు పోలాండ్లోని టోరౌలో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు విమానంలో బయలుదేరింది. పోయిన సంవత్సరం ఫిన్లాండ్కు పది గంటలు ప్రయాణించడం ఆమెకు కష్టమైంది. అందుకే ఈసారి స్పాన్సరర్లు ఆమెకు బిజినెస్ క్లాస్ బుక్ చేసి మరీ పంపించారు. ఆమె మెడల్ కొట్టకుండా వెనక్కు రాదని వాళ్ల గట్టి నమ్మకం. హర్యానా దాదీ భగవాని దేవిది హర్యానాలోని ఖేడ్కా అనే గ్రామం. పన్నెండు ఏళ్లకు పెళ్లయితే ముప్పై ఏళ్లు వచ్చేసరికల్లా వితంతువు అయ్యింది. పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన ఒక్క కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా సేద్యం చేసి కొడుకును పెంచింది భగవాని దేవి. చదువుకున్న కొడుకు ఢిల్లి మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా మారడంతో ఢిల్లీ చేరుకుంది. ఆ తర్వాత నానమ్మ (దాదీ) అయ్యింది. ముగ్గురు మనవల్లో వికాస్ డాగర్ క్రీడల్లో గుర్తింపు సంపాదించాడు. అతడే తన దాదీలో ఆటగత్తె ఉందని గ్రహించాడు. ‘ఒకరోజు నేను షాట్ పుట్ ఇంటికి తెచ్చాను. నువ్వు విసురుతావా నానమ్మా అని అడిగితే మొహమాట పడింది. కాని మరుసటి రోజు ఉదయం ఆమె దానిని విసరిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని తెలిపాడు వికాస్. ఆ తర్వాత అతడే తన దాదీకి కోచ్గా మారి ఆమెను అథ్లెట్ను చేశాడు. ‘చిన్నప్పుడు కబడ్డీ ఆడటం తప్ప నాకు వేరే ఏం గుర్తు లేదు’ అని నవ్వుతుంది భగవాని దేవి. బైపాస్ ఆపరేషన్ జరిగినా భగవాని దేవికి 2007లో బైపాస్ ఆపరేషన్ జరిగింది. అయినా సరే ఆమె పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంది. పరిగెడితే అలసిపోదు. వేరే ఏ ఇబ్బందులు లేవు. అందువల్ల త్వరలోనే ఆమె వయోజనులకు పెట్టే పోటీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. కాని గత ఏడాది ఫిన్లాండ్లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది. ‘నాకు ఏదైనా అవుతుందని భయపడవద్దు. దేశం కోసం పరుగెట్టి ప్రాణం విడిచినా నాకు సంతోషమే’ అని చెప్పి బయలుదేరిందామె పోయినసారి. ఈసారి కూడా ఆ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సెంచరీ వయసులోనూ పరిగెడతాను’ అంటుంది భగవాని దేవి. -
జాతీయ స్కూల్స్ చెస్లో తెలంగాణకు ఏడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. అండర్–15 బాలుర విభాగంలో వేముల అద్వైత్ విఘ్నేశ్ (7.5 పాయింట్లు)... అండర్–15 బాలికల విభాగంలో యశ్వి జైన్ (7 పాయింట్లు)... అండర్–13 బాలుర విభాగంలో చల్లా సహర్ష (8 పాయింట్లు)... అండర్–11 బాలికల విభాగంలో మోదిపల్లి దీక్షిత (7.5 పాయింట్లు)... అండర్–9 బాలికల విభాగంలో పుంగవనం సంహిత (8 పాయింట్లు) పసిడి పతకాలు గెలిచారు. అండర్–7 బాలుర విభాగంలో ఆదుళ్ల దివిత్ రెడ్డి (7.5 పాయింట్లు) కాంస్యం, అండర్–7 బాలికల విభాగంలో బోగా వంశిక (7 పాయింట్లు) రజతం సాధించారు. పతకాలు సాధించిన వారికి నెలనెలా భారత గ్రాండ్మాస్టర్ ఎం.శ్యామ్సుందర్తో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ ప్రకటించారు. -
భారత బాక్సర్లకు మరో నాలుగు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాలపైనే పంచ్ విసురుతున్నారు. స్పెయిన్లో జరుగుతున్న ఈ ఈవెంట్ లో నలుగురు మహిళా బాక్సర్లు ముస్కాన్ (75 కేజీలు), తమన్నా (50 కేజీలు), కీర్తి (ప్లస్ 81 కేజీలు), దేవిక (52 కేజీలు) పతకాలు ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో తమన్నా 5–0తో జుని తొనెగవా (జపాన్)పై, దేవిక 5–0తో అస్యా (జర్మనీ)పై... అజింబై (మంగోలియా)పై ముస్కా న్, బొటికా (రొమేనియా)పై కీర్తి గెలిచారు. చదవండి: భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి! అద్భుతాలు చేస్తాడు -
Commonwealth Games 2022: విజేతలకు ఐఓఏ నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్హామ్లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది. -
పతకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే..!
బర్మింగ్హామ్లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవం సోమవారంతో ముగిసింది. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి 66 పతకాలు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. అయితే గోల్డ్కోస్ట్ గేమ్స్లో షూటింగ్ క్రీడాంశంలో భారత్ ఏకంగా 16 పతకాలు సొంతం చేసుకుంది. బర్మింగ్హామ్లో షూటింగ్ క్రీడాంశాన్ని నిర్వహించలేదు. ఫలితంగా భారత్ పతకాల ర్యాంక్లో ఒక స్థానం పడిపోయింది. ఒకవేళ షూటింగ్ కూడా బర్మింగ్హామ్ గేమ్స్లో ఉండి ఉంటే భారత్ పతకాల సంఖ్యలోనూ, తుది ర్యాంక్లోనూ మరింత మెరుగయ్యేది. -
CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ ఖాతాలో 14 పతకాలు చేరగా, మరో 3 పతకాలు జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల ఆరో రోజు లవ్ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్), లవ్ప్రీత్ సింగ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మిగతా ఐదు పతకాల్లో జూడోలో 2 (సుశీలా దేవీ సిల్వర్, విజయ్ కుమార్ యాదవ్ బ్రాంజ్), లాన్స్ బౌల్స్లో ఒకటి (గోల్డ్), టేబుల్ టెన్నిస్లో ఒకటి (గోల్డ్), బ్యాడ్మింటన్లో ఒకటి (సిల్వర్) గెలిచారు. ఇక పతకాల పట్టిక విషయానికొస్తే.. 5 స్వర్ణాలు , 5 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 106 పతకాలతో (42 గోల్డ్, 32 సిల్వర్, 32 బ్రాంజ్) ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 86 (31 గోల్డ్, 34 సిల్వర్, 21 బ్రాంజ్), న్యూజిలాండ్ 26 (13 గోల్డ్, 7 సిల్వర్, 6 బ్రాంజ్), కెనడా 46 (11 గోల్డ్, 16 సిల్వర్, 19 బ్రాంజ్), సౌతాఫ్రికా 16 (6 గోల్డ్, 5 సిల్వర్, 5 బ్రాంజ్) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. చదవండి: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం -
తెలంగాణ అథ్లెట్లకు 8 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు మెరిశారు. గుజరాత్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో దివ్య బొల్లారెడ్డి 400, 800 మీటర్ల కేటగిరీల్లో రజత పతకాలు గెలిచింది. దివ్య 400 మీటర్ల దూరాన్ని 1ని:14.91 సెకన్లలో... 800 మీటర్ల దూరాన్ని 3ని:02.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల ప్లస్ 35 వయో విభాగంలో అష్లి గోపీ 110 మీటర్ల హర్డిల్స్లో రజతం, ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 110 మీటర్ల హర్డిల్స్ రేసును గోపీ 21.02 సెకన్లలో ముగించి రెండో స్థానంలో... ట్రిపుల్ జంప్లో 9.88 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో కృతి కడాకియా 1500 మీటర్ల రేసును 6ని:51.56 సెకన్లలో ముగించి కాంస్యం గెల్చుకుంది. పురుషుల ప్లస్ 60 వయో విభా గం పోల్వాల్ట్లో బండారి భాస్కర్ రావు 1.60 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్యం... హైజంప్లో 1.05 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజతం నెగ్గాడు. పురుషుల ప్లస్ 60 వయో విభాగం హ్యామర్ త్రోలో మనోహర్ రావు (27.58 మీటర్లు) స్వర్ణం గెలిచాడు. -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏపీ క్రీడాకారుల సత్తా
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 15వ స్థానంలో నిలిచింది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హరియాణాలోని పంచ్కులలో అండర్–18 బాలబాలికల ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు. చివరిరోజు సోమవారం బాక్సర్ అంజనీకుమార్ (63.5–67 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో) రజత పతకంతో మెరిశాడు. ఫైనల్ పోరులో చండీగఢ్ క్రీడాకారుడు అచల్వీర్తో పోటీపడి 2–3తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రాష్ట్రం తరఫున మొత్తం 161 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్లో 6 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషం. ఈ సందర్భంగా క్రీడాకారులను పర్యాటక, సాంస్కృతిక, క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి అభినందించారు. విజేతలు వీరే.. వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఎస్.పల్లవి (స్వర్ణం), సీహెచ్.శ్రీలక్ష్మి (స్వర్ణం), ఎస్కే లాల్ భషీర్ (రజతం), పి.ధాత్రి (రజతం), డీజీ వీరేష్ (రజతం), ఆర్.గాయత్రి (కాంస్యం), అథ్లెటిక్స్ విభాగాల్లో కుంజా రజిత (స్వర్ణం), ఎం.శిరీష (కాంస్యం), కబడ్డీలో మహిళల జట్టు కాంస్యం, ఆర్చరీలో కుండేరు వెంకటాద్రి (స్వర్ణం), మాదాల సూర్యహంస (కాంస్యం), ఘాట్కాలో బాలురు జట్టు కాంస్యం, బాక్సింగ్లో అంజనీకుమార్ (రజతం). -
భారత ఆర్చర్లకు ఆరు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత ఆర్చర్లకు రెండు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు ఖాయమయ్యాయి. ఇరాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే టీమ్ విభాగంలో భారత్కు ఆరు పతకాలు లభించాయి. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత్కు చెందిన ప్రథమేశ్, రిషభ్ యాదవ్ ఫైనల్ చేరగా... సమాధాన్ జావ్కర్ కాంస్యం కోసం పోటీపడనున్నాడు. సమాధాన్ గెలిస్తే భారత్ ఈ విభాగంలో క్లీన్స్వీప్ చేస్తుంది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు పర్ణీత్ కౌర్, సాక్షి చౌదరీ ఫైనల్లోకి ప్రవేశించారు. -
2022 Thomas-Uber Cup: ఈసారైనా పతకం వచ్చేనా!
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పతకాలే లక్ష్యంగా భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్ల్లో జర్మనీతో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మెగా ఈవెంట్లో అందరి కళ్లు థామస్ కప్లో పోటీపడనున్న భారత పురుషుల జట్టుపైనే ఉన్నాయి. థామస్ కప్ చరిత్రలో భారత్కు ఇప్పటివరకు ఒక్కసారీ పతకం రాలేదు. మరోవైపు మహిళల ఈవెంట్ ఉబెర్ కప్లో భారత్ రెండుసార్లు (2014, 2016) సెమీఫైనల్ చేరి కాంస్య పతకాలు సాధించింది. లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్... సాత్విక్–చిరాగ్ శెట్టిలతో భారత పురుషుల జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో జర్మనీ, చైనీస్ తైపీ, కెనడా జట్లతో భారత్ పోటీపడనుంది. ఈసారి భారత మహిళల జట్టులో పీవీ సింధు మినహా మిగతా వారందరూ అంతర్జాతీయస్థాయిలో అంతగా అనుభవంలేని వారే ఉన్నారు. గ్రూప్ ‘డి’లో భారత్తోపాటు కొరియా, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. భారత్కు విజయం దక్కా లంటే సింధుతోపాటు ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ సింగిల్స్లో రాణించాల్సి ఉంటుంది. -
చేయందిస్తే..చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: శరీరం సహకరించకున్నా... అలుపెరుగకుండా విజయాలు సాధిస్తూనే ఉన్న ఆ క్రీడాకారిణి... ఆర్థిక పరిస్థితి సహకరించక చేయూత కోసం ఎదురు చూస్తోంది. కాస్తంత చేయి అందిస్తే...పారా అథ్లెట్గా చరిత్ర తిరగరాస్తానంటోంది. నగరంలోని సరూర్నగర్కు చెందిన కుడుముల లోకేశ్వరి (26) పారా క్రీడాకారిణి. 10 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కుడి వైపు శరీరం పనిచేయడం మానేసింది. అయినా చిన్నప్పటి నుంచి క్రీడల పైన తనకున్న మక్కువే ఆమెను పారా క్రీడాకారిణిగా మార్చింది. 2019 నుంచి నిరంతర సాధన చేస్తున్న లోకేశ్వరి ఈ ఏడాది మార్చి 27న భువనేశ్వర్ కళింగా స్టేడియంలో జరిగిన 20వ నేషనల్ పారా ఆథ్లెటిక్ చాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. గత ఏడాది మార్చిలో బెంగళూర్ కంఠీరవా స్టేడియంలో జరిగిన 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్లో షాట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు సాధించింది. డిసెంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూర్లో జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ పారా ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ షాట్ ఫుట్లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది. 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. త్వరలో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్ కోసం సాధన చేస్తుంది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే జూన్ నెలలో తునిషియా (నార్త్ ఆఫ్రికా) వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలి. అయితే ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని లోకేశ్వరి తెలిపింది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం అనుకూలించడం లేదు. పదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్గా పని చేసే తల్లి జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపింది. అప్పులు చేస్తూ సాధన కొనసాగిస్తున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. దాతలు సహకరిస్తే దేశానికి పతకాలు సాధించగలననే ఆత్మ విశ్వాసం తనకుందని అంటోంది. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం 6304394851 లో సంప్రదించవచ్చు. (చదవండి: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు) -
డబుల్ ధమాకా..భారత్ ఖాతాలో రెండు పతకాలు..!
న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు ప్రపంచ జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. తొలి రోజు మహిళల 45 కేజీల విభాగంలో హర్షద శరద్ గరుడ్ స్వర్ణ పతకం నెగ్గగా... రెండో రోజు మహిళల 49 కేజీల విభాగంలోజ్ఞానేశ్వరి యాదవ్ రజతం... వి.రితిక కాంస్య పతకం సాధించారు. గ్రీస్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో చత్తీస్గఢ్కు చెందిన 19 ఏళ్ల జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్లో 73+క్లీన్ అండ్ జెర్క్లో 83) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. 18 ఏళ్ల రితిక 150 కేజీలు (స్నాచ్లో 69+క్లీన్ అండ్ జెర్క్లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఇండోనేసియాకు చెందిన విండీ కంతిక ఐసా 185 కేజీలు (స్నాచ్లో 83+క్లీన్ అండ్ జెర్క్లో 102) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. చైనా, ఉత్తర కొరియా, థాయ్లాండ్, రొమేనియా, బల్గేరియా తదితర దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉండగా... ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాను, రష్యాకు సహచరిస్తున్న బెలారస్ను ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగకుండా అంతర్జా తీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య నిషేధం విధించింది. గత జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో రష్యా ఏకంగా తొమ్మిది పతకాలు సాధించింది. -
విశిష్ట సేవలకు..రాష్ట్రపతి పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి అమరావతి/నెట్వర్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్రప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఏపీకి ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం, పలు రాష్ట్రపతి పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం లభించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి కూడా పలు పతకాలు లభించాయి. పోలీసు ప్రతిభా పతకాలు 1. ఎస్.వి.రాజశేఖర్బాబు, డీఐజీ (లా అండ్ ఆర్డర్) 2. ఎం.రవీంద్రనాథ్బాబు, ఎస్పీ తూర్పు గోదావరి జిల్లా 3. శ్రీరాంబాబు వాక, డీఎస్పీ, సీఐడీ, నెల్లూరు 4. విజయపాల్ కైలే, ఏసీపీ, ఈస్ట్ జోన్, విజయవాడ 5. విజయ్కుమార్ బుల, అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్, విశాఖపట్టణం 6. సుబ్రహ్మణ్యం కొలగాని, అదనపు డీసీపీ, విశాఖపట్టణం 7. శ్రీనివాసరావు చుండూరు, డీఎస్పీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు 8. వీరరాఘవరెడ్డి, డీఎస్పీ, అనంతపురం 9. రవీందర్రెడ్డి ఎర్రమోరుసు, డీఎస్పీ, కర్నూలు 10. కృష్ణారావు గొల్ల, ఎస్ఐ, సీసీఎస్, విజయవాడ 11. సత్తారు సింహాచలం, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ, కాకినాడ 12. నరేంద్రకుమార్ తుమాటి, ఏఎస్ఐ, గుంటూరు అర్బన్ 13. పేరూరు భాస్కర్, ఏఎస్ఐ, కడప 14. నాగశ్రీనివాస్, ఏఎస్ఐ, కొవ్వూరు రూరల్ 15. వీర ఆంజనేయులు సింగంశెట్టి, ఏఎస్ఐ, ఏసీబీ, విజయవాడ రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం భావనా సక్సేనా, రెసిడెంట్ కమిషనర్, ఏపీ భవన్, న్యూఢిల్లీ కేంద్ర జీఎస్టీ విభాగంలో.. 1. డబ్లు్య.డి.చంద్రశేఖర్, అదనపు సహాయ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం, విశాఖపట్నం 2. కర్రి వెంకటమోహన్, అదనపు సహాయ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సీబీఐలో.. 1. సుబ్రహ్మణ్యం దేవేంద్రన్, అదనపు న్యాయసలహాదారు 2. కె.వి.జగన్నాథరెడ్డి, హెడ్ కానిస్టేబుల్, ఏసీబీ రైల్వే పోలీసుల్లో.. మస్తాన్వలి షేక్, ఏఎస్ఐ, ఆర్పీఎఫ్, తాడేపల్లి జైళ్లశాఖలో 1. అయినపర్తి సత్యనారాయణ, హెడ్ వార్డర్, ఆంధ్రప్రదేశ్ 2. పోచ వరుణారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ 3. పెదపూడి శ్రీరామచంద్రరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, విశాఖపట్నం కేంద్రకారాగారం 4. మహ్మద్ షఫీ ఉర్ రెహమాన్, డిప్యూటీ సూపరింటెండెంట్ 5. సముడు చంద్రమోహన్, హెడ్ వార్డర్ 6. హంసపాల్, సూపరింటెండెంట్, కృష్ణాజిల్లా జైలు జీవన్ రక్షాపథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్–2021 1. జి.సంజయ్కుమార్ 2. టి.వెంకటసుబ్బయ్య 3. నిర్జోగి గణేశ్కుమార్ -
ఇద్దరు పోలీస్ అధికారులకు రాష్ట్రపతి సేవా పతకాలు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రతి ఏటా పోలీస్ శాఖలో పనితీరు ఆధారంగా కేంద్రం ప్రకటించే పతకాలలో రాష్ట్రానికి చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్తో పాటు మెరిటోరియస్ సేవా పతకాలు లభించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ పతకాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు అధికారులకు పీపీఎమ్ (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్) దక్కగా, మరో 11 మంది అధికారులు, సిబ్బందికి మెరిటోరియస్ సర్వీస్ పోలీస్ మెడల్ దక్కాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కేంద్ర సాయుధ బలగాలు, ఇతర విభాగాల్లోని అధికారులు సిబ్బందికి కూడా పలు పతకాలు దక్కాయి. రాష్ట్ర పోలీస్ శాఖలోని స్పెషల్ పోలీస్ బెటాలియన్లో ఇబ్రహీంపట్నం కమాండెంట్గా పనిచేస్తున్న చాకో సన్నీతో పాటు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ జి.శ్రీనివాసరాజు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ను దక్కించుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కింద సీనియర్ ఐపీఎస్, ఐజీ హోదాలో మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న షానావాజ్ ఖాసీంతో పాటు సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీగా పనిచేస్తున్న సంక్రాంతి రవికుమార్, ములుగు ఓఎస్డీ పుల్ల శోభన్కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ రాయప్పగారి సుదర్శన్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ పోలగాని శ్రీనివాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీఎస్పీ జి.శ్రీనివాసులు, వనపర్తి డీఎస్పీ కేఎమ్ కిరణ్కుమార్, ఇంటెలిజెన్స్ ఆర్ఎస్ఐ మహ్మద్ యాకుబ్ ఖాన్, డిచ్పల్లి బెటాలియన్ ఏఆర్ఎస్ఐ బండి సత్యం, గ్రేహౌండ్స్ ఏఆర్ఎస్ఐ మెట్టు వెంకటరమణరెడ్డి, కొండాపూర్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ఇలపంద కోటేశ్వర్రావుకు పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ కింద పోలీస్ పతకా>లు దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, ఏపీకి చెందిన భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. వివిధ విభాగాల్లో వీరికి కూడా.. ఇక మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న ఉడుగు నరసింహ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమాండెంట్ భూపేంద్ర కుమార్, బసుమాతరీ అజయ్కి పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. జాతీయ పరిశ్రమల భద్రతా అకాడమీ (సీఐఎస్ఎఫ్)హైదరాబాద్లో కమాండెంట్గా పనిచేస్తున్న అనూప్ కుమార్, రంగారెడ్డి ఏఎస్జీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ కూచిభొట్ల శారద, రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గుండప్పకు పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. సీఆర్పీఎఫ్ వరంగల్ బెటాలియన్ సబ్ఇన్స్పెక్టర్ బాబులాల్ కూడా పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ కోటాలో పతకం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ళ శాఖలో పనిచేస్తున్న పంత్ (చీఫ్ హెడ్ వార్డర్), సీఎన్ గంట రత్నారావు(హెడ్ వార్డర్), బి.నర్సింగ్ రావు(హెడ్ వార్డర్) ఖైదీల ప్రవర్తన దిద్దుబాటుకుగాను రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. అగ్నిమాపక దళంలో కాళహస్తి వెంకట కృష్ణ కుమార్ (జిల్లా ఫైర్ ఆఫీసర్)కు రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ విశిష్ట సేవా మెడల్ దక్కింది. తాడేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మస్తాన్ వలీ షేక్కు పోలీసు ప్రతిభా పురస్కారం దక్కింది. -
సాయి సందీప్ పరుగు తీస్తే పతకమే!
సబ్బవరం (పెందుర్తి ): మండలంలోని సబ్బవరానికి చెందిన యువ క్రీడాకారుడు సాయి సందీప్ అథ్లెటిక్స్లో విశేషంగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్లో రాణించాలని కలలుగన్నాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు పరుగులు తీస్తున్నాడు. సరైన వసతులు, శిక్షణ అందించే కోచ్లు లేకపోయినా ఏకలవ్యుడి మాదిరిగా పరుగులో మేటిగా నిలుస్తున్నాడు సాయి సందీప్. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్లో 400 మీటర్ల రిలేలో స్వర్ణం, 400 మీటర్ల పరుగు పందెం వ్యక్తిగత విభాగంలోనూ వెండి పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు సాయి సందీప్ ఎంపికయ్యాడు. ఈ పోటీలను ఈ నెల 10,11,12వ తేదీలలో ఏయూ బోర్డు ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 57 అనుబంధ కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఏయూలో నిర్వహించిన పోటీలో వెండి పతకం అందుకున్న సాయి సందీప్ కుటుంబ నేపథ్యం.. వాండ్రాసి సాయి సంందీప్ తల్లి సంపత వెంకటలక్ష్మి సచివాలయ ఆరోగ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి శ్రీనివాసరావు మార్కెటింగ్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. తమ్ముడు రోహిత్ విశాఖలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు 4వ తరగతి నుంచి... 4వ తరగతి నుంచి కడప జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. ఈ స్కూల్లో ప్రవేశానికి నిర్వహించిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభతో తన స్పోర్ట్స్ కెరియర్కు గట్టి పునాది వేసుకున్నాడు. పరుగు పందెం, దాంతో పాటు హర్డిల్స్లో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అక్కడున్నవారు ఆ దిశగా సాయి సందీప్ను ప్రోత్సహించారు. ► 4వ తరగతి నుంచి పదో తరగతి వరకూ స్పోర్ట్స్ స్కూల్లో చదివి మొత్తం రెండు జాతీయ స్థాయిలో వెండి, రజిత పతకాలతో పాటు 18 రాష్ట్రస్థాయి బంగారు పతకాలను సాధించాడు. ► ప్రస్తుతం విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నాటి టీడీపీ నగదు ప్రోత్సాహం ఇంకా అందలేదు ప్రభుత్వం, స్పాన్సర్స్ నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే మరింత రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా నాలో ఉందని సాయి సందీప్ చెబుతున్నాడు. ప్రభుత్వంలో గుంటూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించానని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ క్రీడా పురస్కారం అందజేశారన్నారు. దీంతో ప్రోత్సాహకంగా ప్రశంసాపత్రం, మెడల్తో పాటు ట్యాబ్, రూ.30 నగదు ప్రకటించారన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి లభించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతా సబ్బవరంలో తగిన క్రీడా సౌకర్యాలు, వసతులు లేవు. 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, అనుభవం ఉన్న కోచ్ దగ్గర శిక్షణ పొందినట్లయితే మరిన్ని పతకాలు సాధించి, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించి మరిన్ని పతకాలు సాధిస్తా. కోవిడ్ నేపథ్యంలో జాతీయ స్థాయి క్రీడలకు అంతరాయం ఏర్పడిందని, వచ్చే ఏడాది నిర్వహించనున్న పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తానని సందీప్ చెబుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో డైట్, పౌష్టి కాహరం తీసుకోవడం, స్పోర్ట్స్ కిట్ తదితర వాటి కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాడు. సాధించిన వివిధ పతకాలతో సాయి సందీప్ కోర్టులో పరుగు తీస్తూ... పరుగు పందెంలో సాయి సందీప్ -
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ ఓ ట్వీట్ చేశారు. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. మాధవన్, వేదాంత్లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ ‘గుడ్ జాబ్ వేదాంత్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ఈ పోటీలో వేదాంత్ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు ఇదిలా ఉంటే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. Good job Vedant. We are proud of you and your upbringing. 🙏 pic.twitter.com/6SNVJI51w1 — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2021 -
పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు పథకాలు
-
భారత్ ఖాతాలో మరో బంగారు పతకం..
-
5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తాం..
న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరగనున్న పారా ఒలింపిక్స్లో భారత్ బృందం 5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తుందని భారత పారా ఒలింపిక్స్ కమిటీ సెక్రటరీ జనరల్ గరుశరణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత భారత అథ్లెట్ల బృందం అత్యుత్తమమైందని, పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఎన్నడూ సాధించని పతకాలు ఈ పారా ఒలింపిక్స్లో సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో పారా ఒలింపిక్స్ తర్వాత అథ్లెట్లంతా అంతర్జాతీయ టోర్నీల్లో రాణించారని, త్వరలో ప్రారంభంకాబోయే పారా ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు వారంతా ఉవ్విళ్లూరుతున్నారని, ఇదే తమ ధీమాకు కారణమని వెల్లడించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత్ కచ్చితంగా పతకాలు సాధిస్తుందని, పారా హైజంప్లో భారత పతాకధారి మరియప్పన్ తంగవేలు మరోసారి పసిడి ముద్దాడుతాడని గురుశరణ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, టోక్యో పారా ఒలింపిక్స్లో భారత్ 54 మందితో కూడిన జంబో బృందాన్ని బరిలోకి దించుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కెనోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో తదితర క్రీడల్లో వీరంతా పోటీ పడనున్నారు. భారత్ ఇప్పటి వరకు 11 పారా ఒలింపిక్స్ క్రీడల్లో కేవలం 12 పతకాలే సాధించగా, గడిచిన 2016 రియో పారా ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు, ఓ రజతం, మరో కాంస్యం సహా మొత్తం నాలుగు పతకాలు గెలవడం గమనార్హం. చదవండి: కివీస్ క్రికెటర్లను భయపెడుతున్న తాలిబన్లు.. పాక్ పర్యటనపై నీలినీడలు -
27 మందికి పోలీస్ పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సేవా పతకాలు తెలంగాణకు చెందిన 27 మంది పోలీసు అధికారులకు దక్కాయి. మరో ముగ్గురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను అందించనుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాలు (పీపీఎంజీ), 628 మందికి పోలీస్ శౌర్య పతకాలు (పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ పతకాలు అందుకోనున్నారు. కాగా, పతకాలను అందుకోనున్న పోలీసులకు డీజీపీ మహేందర్రెడ్డి అభినందనలు తెలిపారు. పోలీస్ సేవా పతకాలు... ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్, వరంగల్ ఏసీపీ ఎం.జితేందర్రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, పీటీసీ డీఎస్పీ ఎం.పిచ్చయ్య, టీఎస్ఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ కె. సంపత్కుమార్ రెడ్డి, ఎస్ఐబీ ఏఎస్ఐలు ఆనంద్కుమార్, డి. చంద్రశేఖర్ రావు, గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ ఆరిఫ్ అలీ, కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ ఎం. అనిల్గౌడ్కు సేవా పతకాలకు ఎంపికయ్యారు. పీఎంజీ విభాగంలో... గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తూ ఛత్తీస్గఢ్, గడ్చిరోలి జిల్లాల్లో 2016, 2017, 2018లలో జరిగిన ఎన్కౌంటర్లలో పాల్గొని ధైర్యసాహసాలు ప్రదర్శించిన 14 మందికి పోలీస్ శౌర్య పతకాలను ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఐ, కానిస్టేబుళ్లతో పాటు ఓ ఎస్ఐ కూడా ఉన్నారు. శౌర్యపతకాలు పొందిన వారిలో ఆర్ఎస్ఐ పి.కె.ఎస్. రమేష్, కానిస్టేబుళ్లు ఎన్.లయ, ఎం.పాపారావు, ఎం. భాస్కర్రావు, జి. ప్రతాప్సింగ్, కె. వెంకన్న, మాలోత్ రాములు, బి. మరియాదాస్, కె. పరుశురాం, అబ్దుల్ అజీమ్, కె.తిరుపతయ్య, పి.సత్యనారాయణ, వి.రమేష్తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ ఉన్నారు. జైళ్ల విభాగంలో ముగ్గురికి... జైళ్ల విభాగంలో దేశ వ్యాప్తంగా 41 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురికి పతకాలు దక్కాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మ హేంద్ర కృష్ణమూర్తి, చీఫ్ హెడ్వార్డర్ బి.నారాయణ, హెడ్ వార్డర్ వేముల జంగయ్య పతకాలను అందుకోనున్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. కాగా సైనిక, పోలీస్ అధికారులకు కేంద్రహోంశాఖ వివిధ పతకాలు ప్రకటించింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకం(పీపీఎంజీ), 628 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు(పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 662 మందికి విశిష్ట సేవా పతకాలను కేంద్రం హోంశాఖ ప్రకటించింది. ఇక వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు గ్యాలంటరీ పోలీసు పతకాలు, మరో 11 మందికి ఉత్తమ సేవా పోలీసు పతకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సేఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు. -
Olympics: ఒకరు పాతాళానికి.. మరొకరు అత్యున్నత శిఖరానికి
సాక్షి, వెబ్డెస్క్: బ్యాడ్మింటన్ స్టార్.. తెలుగుతేజం పీవీ సింధు.. రెజ్లర్ సుశీల్ కుమార్.. ఇద్దరు పేరున్నవారే. ఈ ఇద్దరు ఒలింపిక్స్లో రెండేసీసార్లు పతకాలు అందుకున్నవారే. ఇద్దరికి తమ క్రీడాంశాల్లో ఘనమైన చరిత్రే ఉంది. కానీ కాలచక్రంలో రెజ్లర్ సుశీల్ కుమార్ పేరు పాతాళానికి పడిపోతే.. పీవీ సింధు పేరు భారత చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన పీవీ సింధు.. ఐదేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచి దేశం గర్వపడేలా చేసింది. సరిగ్గా ఇలాంటి ఫీట్నే రెజ్లర్ సుశీల్ కుమార్ నమోదు చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం ఒడిపిపట్టిన సుశీల్ 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. స్వాతంత్యం తర్వాత భారత్ నుంచి వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన వ్యక్తి సుశీల్కుమార్ మాత్రమే. ఇప్పడు ఆ ఘనతను పీవీ సింధు కూడా సాధించింది. ఇక ఈ ఇద్దరి జీవితాలు ఒకసారి పరిశీలించి చూడగా.. సింధు తన ప్రతిభతో మరింత పేరు సంపాదించగా.. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత సుశీల్ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో సుశీల్ రజతం నెగ్గిన తర్వాత దేశంలో అతను ఎందరికో ఆదర్శమయ్యాడు. భారత రెజ్లింగ్లో ఒక్క వెలుగు వెలిగిన సుశీల్ ఇప్పుడు వివాదాల నీడలో ఉన్నాడు. అతని అహం, మిగతా రెజర్ల పట్ల చిన్నచూపు ఇలా పలు అంశాలు అతన్ని కిందికి తొక్కేశాయి. విచిత్రంగా సింధు టోక్యో ఒలింపిక్స్లో పతకం ముద్దాడిన మరుసటిరోజే సుశీల్కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చార్జీషీటులోకి ఎక్కాడు. ఇక పీవీ సింధు విషయానికి వస్తే.. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె క్రేజ్ మరింత రెట్టింపైంది. ఎంతలా అంటే భారత్లో క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ సింధు సాధించడం విశేషం. ప్రపంచచాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు ఇలా ఏ టోర్నీ చూసుకున్నా ఆమె సాధించని పతకాలు లేవు. 2004 నుంచి బ్యాడ్మింటన్లో కఠోర సాధన చేస్తున్న సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన తర్వాత ఇంకా సాధించాల్సి ఏముందని అనుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సింధు అలా అనుకోలేదు. ఈ ఐదేళ్లలో ఆమె మరింత రాటుదేలింది. ఎంతలా అంటే 2019లో ఏకంగా మహిళల బాడ్మింటన్ విభాగంలో ప్రపంచచాంపియన్గా నిలిచింది. ఒలింపిక్స్లో రెండుసార్లు పతకాలు సాధించిన సింధుకూ ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే ఆల్ ఇంగ్లండ్ బ్మాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీ. ఇటీవలే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇక త్వరలో జరగబోయే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఏదైతేనేం... విశ్వక్రీడల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు దేశం కోసం కష్టపడ్డారు.. పతకం కోసం శ్రమించారు.. దేశం కీర్తిని రెపరెపలాడించారు. కానీ ఒకరి తప్పిదం తన క్రీడా జీవితాన్ని నాశనం చేస్తే.. ఒకరి పట్టుదల యావత్ దేశ కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.- -
పీవీ సింధు ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2020లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో సెమీస్కు దూసుకువచ్చిన భారత షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సింధు చైనాకు చెందిన తైజుయింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత బంగారు పతకం ఆశలకు తెరపడింది. అయితే కాంస్య పతకం ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీని కోసం సింధు చైనా షట్లర్ పింగ్ జియావోతో తలపడనుంది. సింధు క్యాంస్య పతకం తీసుకురానుందనే ఆశలు భారీగానే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పూర్తి ఫిట్గా కనిపించే ఆమె తన బరువును, ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రొటీన్డ్ ఫుడ్ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఆమె బరువు, హైడ్రేషన్ , ప్రోటీన్ ఆహారంతో సింధు ఫుడ్ ఆధారపడి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్: బ్రేక్ ఫాస్ట్ పాలు, గుడ్లు, ఇతర ప్రొటీన్లతో నిండి ఉంటుంది. పండ్లు కూడా తీసుకుంటారు. ఇక శిక్షణా సమయంలో సెషన్ల మధ్య మరింత యాక్టివ్గా, బలంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు. లంచ్ అండ్ డిన్నర్: సింధు రోజూ రెండుపూటలా భోజనంలో రైస్ ఉండేలా చూసుకుంటారు. దీంతోపాటు కూరగాయలు కూడా తీసుకుంటారు. అలాగే టోర్నమెంట్ల సమయంలో అన్నం, చికెన్ తీసుకుంటారు. అలాగే ఆరోగ్యాన్నినియంత్రించుకునే చర్యల్లో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. ఈ ఫలితాల కనుగుణంగా తన డైట్ను ఆమె ఎడ్జస్ట్ చేసుకుంటారు. ఇక చివరగా మ్యాచ్ గెలిచిన తరువాత ఫాస్ట్ ఫుడ్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారట. కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్, చాక్లెట్లను ఎంచక్కా ఎంజాయ్ చేస్తారట. అయితే సాధారణంగా సింధు తల్లి స్వయంగా ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటారట. ఇంకా అరటిపండ్లు, ప్రోటీన్ షేక్ స్నాక్ బార్లు ఈ మూడు తీసుకుంటానని సింధు జాతీయ మీడియాతో చెప్పారు. అలగే భారీ ట్రైనింగ్ సెషన్ తర్వాత ఎనర్జీ కోసం స్నాక్ బార్లపైనే ఆధారపడతానని చెప్పారు. సాధారణంగా మ్యాచ్ తర్వాత అరగంటలోపు ఏదో ఒకటి తినాలి, ఆ తర్వాత స్ట్రెచ్స్ చేసి, రెస్ట్ తీసుకుంటానని సింధు వెల్లడించారు. ఇక చీట్ మీల్లో భాగంగా హైదరాబాదీ బిర్యానీ తన మెనూలో టాప్లో ఉంటుందని ఆమె చెప్పారు. అలాగే ప్రొఫెషనల్ అథ్లెట్లు తక్కువ నూనె, కూరగాయలతో చేసిన నూడుల్స్, స్పఘెట్టి, పాస్తా లాంటివి కూడా తీసుకుంటారని కూడా సింధు చెప్పారు. కోచ్ శ్రీకాంత్ వర్మ ఏమన్నారంటే.. ఆమె కోసం ప్రత్యేకంగా హై-పెర్ఫార్మెన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ను కస్టమైజ్ చేశామని సింధు కోచ్ శ్రీకాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యంగా సింధు ఆట, బాడీ తీరు, ఆమె బలాబలాలు వీటన్నింటినీ దృష్టి ఉంచుకుని ఇదంతా రూపొందిస్తామని చెప్పారు. పతకాల బరిలో నిలిచే క్రీడాకారులు హైఇంటెన్సిటీ షెడ్యూల్కు సిద్ధంగా ఉంటారన్నారు. ముఖ్యంగా వారంలో ఆరు రోజులు, రెండున్నర గంటలు కఠినమైన శిక్షణా విధానాన్ని సింధు అవలంబిస్తోందని శ్రీకాంత్ వెల్లడించారు. అలాగే సింధు ట్రైనింగ్కు ఎపుడూ నో చెప్పదు..అదే ఆమెలోని గొప్పతనం..శిక్షణ ఎంత కఠినంగా ఉన్నా, తాను ఎంత బిజీగా ఉన్నా ఎపుడూ నవ్వుముఖంతో సిద్ధంగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఒలింపిక్స్లో ప్రతీ రౌండ్ ఫైనల్ లాంటిదే. అత్యుత్తమ ఫామ్ని అందుకోవడమే లక్క్ష్యమని ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో హెడ్ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్గా ఉన్నారు శ్రీకాంత్ వర్మ. -
టోక్యో ఒలింపిక్స్: మెడల్స్ తయారీ వెనుక ఆసక్తికర విషయాలు
టోక్యో: 1964 తర్వాత ఒలింపిక్స్ క్రీడల నిర్వహణను జపాన్ ప్రభుత్వం దక్కించుకోవడం మళ్లీ ఇదే. ఈ ఒలింపిక్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రభుత్వం నిర్వహణలోనూ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి పతకాల తయారీ వరకు వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని జోడించి పతకాలను తయారు చేసింది. అయితే ఒలింపిక్స్ మెడల్స్ను వినూత్న రీతిలో తయారు చేయాలని జపాన్ ప్రభుత్వం ముందే నిర్ణయించింది. అందుకోసం మూడేళ్ల క్రితం ఆ దేశ వాసుల నుంచి పాత మొబైల్ ఫోన్లను సేకరించింది. అందులోని లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి మెడల్స్ను తయారు చేశారు. ఆధునాతన కంప్యూటర్ డిజైన్లతో అత్యంత అద్భుతంగా పతకాలను రూపొందించారు. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ చెత్తను ఒక మంచి పనికి ఉపయోగించారు. అంతేకాదు ఒలింపిక్స్ మెడల్ ట్యాగ్లను కూడా సంప్రదాయపద్దతిలోనే తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్లను నేయించింది. దీంతో పాటు పతకాలను ఉంచేందుకు... కలపతో ప్రత్యేక డబ్బాలను కూడా రూపొందించింది. జపాన్ సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ మెడల్స్ ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. అయితే కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు తాము గెలుచుకున్న పతకాలు ఎవరికి వారే మెడలో వేసుకోవాలని జపాన్ ప్రభుత్వంతో పాటు ఐవోసీ(ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) నిర్ణయించింది. -
ఏపీ: ట్రాఫిక్ ఆర్ఎస్ఐకు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: మహిళ ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అర్జున్రావుకు అరుదైన గౌరవం దక్కింది. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శౌర్య పతకం" ప్రభుత్వం ప్రకటించింది. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన "దిశ"పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. "దిశ"పై మహిళా పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి మహిళల ఫోన్లలో దిశయాప్ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు ఏపీ మరో కీలక నిర్ణయం: వారిక మహిళా పోలీసులు -
రజతం స్వర్ణంగా మారింది...
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల జాబితాలో మరొకటి అదనంగా చేరింది. నాడు లభించిన రజతమే ఇప్పుడు స్వర్ణంగా మారింది. 4గీ400 మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత బృందం రెండో స్థానంలో (3 నిమిషాల 15.71 సెకన్లు) నిలిచింది. బహ్రెయిన్ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్ టీమ్ (3 నిమిషాల 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది. అయితే బహ్రెయిన్ జట్టులో సభ్యుడైన కెమీ అడికోయా డోపింగ్లో పట్టుబడ్డాడు. అతనిపై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్ను డిస్క్వాలిఫై చేస్తూ భారత్కు బంగారు పతకాన్ని ప్రకటించారు. ఈ స్వర్ణం గెలుచుకున్న బృందంలో మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్, హిమ దాస్, పూవమ్మ సభ్యులుగా ఉన్నారు. మరో కాంస్యం కూడా... మరో భారత అథ్లెట్ అను రాఘవన్ ఖాతాలో కూడా ఇదే తరహాలో కాంస్య పతకం చేరింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో అను 4వ స్థానంలో నిలిచింది. ఈ రేస్ గెలిచిన అడెకోయాపై కూడా నిషేధం పడటంతో అనుకు కాంస్య పతకం లభించింది. -
గ‘ఘన్’ విజయం
‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారు 80 శాతం మంది ఆటగాళ్లు తమ తొలి ఒలింపిక్స్లోనే పతకాలు గెలుచుకుంటారు’... షూటర్ గగన్ నారంగ్తో అతని కోచ్ చెప్పిన మాట ఇది. ఈ వ్యాఖ్య గగన్ ఆత్మ స్థైర్యాన్ని కొంత దెబ్బ తీసింది. ఎందుకంటే అప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నా అతనికి పతకం దక్కలేదు. దీనికి తోడు 2008 బీజింగ్ ఒలింపిక్స్లో తన కేటగిరీనే అయిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అభినవ్ బింద్రా సాధించిన స్వర్ణంతో అంచనాలు, ఒత్తిడి కూడా పెరిగాయి. ఇలాంటి స్థితి నుంచి అతను మరో ఒలింపిక్స్ కోసం తుపాకీ ఎక్కుపెట్టాడు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో గగన్ సాధించిన కాంస్యంతోనే భారత్ పతకాల బోణీ కొట్టింది. గగన్ నారంగ్కు అంతర్జాతీయ విజయాలు కొత్త కాదు. అప్పటికే ప్రపంచ కప్, ప్రపంచ చాంపియన్షిప్లతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన ఎన్నో పతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ఏదో వెలితి...! ప్రతీ క్రీడాకారుడు కలలుగనే ఒలింపిక్ మెడల్ మాత్రం అతని దరి చేరలేదు. సుదీర్ఘ కెరీర్లో పలు ఘనతల తర్వాత కూడా అది మాత్రం సాధించలేకపోయాననే భావం అతడిని వెంటాడుతూనే ఉంది. ఏథెన్స్లో త్రుటిలో ఆ అవకాశం పోయింది, బీజింగ్కు వచ్చేసరికి క్వాలిఫయింగ్లోనే ఆట ముగిసింది. కానీ లండన్లో మాత్రం ఈ హైదరాబాద్ షూటర్ గన్ గురి తప్పలేదు. అంచనాలు లేకుండా... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో పాల్గొనే నాటికి గగన్ నారంగ్ చెప్పుకోదగ్గ విజయాలేమీ సాధించలేదు. సొంత నగరంలో హైదరాబాద్లోనే జరిగిన ఆఫ్రో ఏషియన్ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నా... వాస్తవంగా ఆ పతకానికి అంత విలువేమీ లేదు. అందుకే 21 ఏళ్ల వయసులో ఒలింపిక్స్కు వెళ్లిన గగన్పై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే గగన్ గట్టిగానే పోరాడాడు. 47 మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్లో 593 పాయింట్లతో 12వ స్థానంతో అతను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పదును పెరిగినా... ఏథెన్స్ వైఫల్యం గగన్ను పెద్దగా కుంగదీయలేదు. మరింత పట్టుదలతో తన సత్తా చాటేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వరుసగా పాల్గొన్న ప్రతీ ఈవెంట్లోనూ పతకం సాధిస్తూ వచ్చాడు. 2005 కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్షిప్లో 2 స్వర్ణాలు, ఒక కాంస్యంతో ఇది మొదలై ఆ తర్వాత 2006లో గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్ కప్లో స్వర్ణం వరకు సాగింది. ఆ తర్వాత మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు వచ్చాయి. ఇక్కడ ఏకంగా 4 స్వర్ణాలతో తన జోరు కొనసాగించిన గగన్ ఏడాది చివర్లో జరిగిన దోహా ఆసియా క్రీడల్లో 3 కాంస్యాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ఫామ్ చూస్తే 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పతకం ఖాయమనిపించింది. కానీ చివరకు అసలు వేదికపై అతను చేతులెత్తేశాడు. ఈసారి క్వాలిఫయింగ్లో 9వ స్థానంలో నిలిచి ఫైనల్కు త్రుటిలో అర్హత కోల్పోయాడు. 600కుగాను ఐదుగురు షూటర్లు 595 పాయింట్లు స్కోర్ చేయగా... కౌంట్బ్యాక్లో దురదృష్టవశాత్తూ గగన్ 0.1 పాయింట్ తేడాతో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్నాడు. తన 42వ షాట్లో అతను 8.9 పాయింట్లు సాధించగా, మరో షూటర్ 9 పాయింట్లు స్కోరు చేసి ముందంజ వేశాడు. పతక సమయం... బీజింగ్ పరాజయం షాక్ నుంచి కోలుకునేందుకు గగన్కు చాలా సమయం పట్టింది. కొద్ది రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదు. పడుకున్నా నిద్రలోనూ అవే పీడ కలలు. దాంతో కొంత కాలం గన్ను పక్కన పడేశాడు. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారంతో మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కొన్నాళ్లకి జరిగిన ప్రపంచకప్లో 703.5 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం అతనికి కావాల్సిన స్ఫూర్తిని అందించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ చాంపియన్షిప్లో తన ప్రధాన ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్తో పాటు వేర్వేరు ఈవెంట్లలో కలిపి ఏకంగా 6 స్వర్ణాలు, 2 రజతాలు సాధించాడు. ఆపై ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 4 స్వర్ణాలు, గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో 2 రజతాలు అతనికి మళ్లీ జోష్ను అందించాయి. దీనికి తోడు ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్షిప్లో సాధించిన కాంస్యంతో గగన్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరకు ఇదే లండన్ ఒలింపిక్స్లో కనిపించింది. ఈసారి వచ్చిన అవకాశాన్ని అతను వదిలి పెట్టలేదు. పాత చేదు అనుభవాలను పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. క్వాలిఫయింగ్లోనే మెరుగైన ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఫైనల్లో సరైన దిశలో అతని గన్ పేలింది. ఓవరాల్గా 701.1 పాయింట్లతో కాంస్యం సొంతమైంది. బహుమతి ప్రదానోత్సవ సమయంలో ఎగురుతున్న భారత జెండాను చూసిన నారంగ్ హృదయం ఆనందంతో ఉప్పొంగింది. -
మహాబలిని మట్టికరిపించిన వేళ...
అది 2000 సంవత్సరం... కొత్త మిలీనియం మొదలైన ఏడాది! సిడ్నీలో విశ్వక్రీడలు జరుగుతున్నాయి. 130 కేజీల విభాగంలో ఓ అమెరికా అనామక రెజ్లర్ రూలన్ గార్డెనర్ స్వర్ణం గెలిచాడు. ఒలింపిక్స్ అన్నాక కొత్త చాంపియన్లు అవతరించడం... పతకాలు గెలవడం సాధారణం. కానీ సిడ్నీ వేదికపై ఎవ్వరూ ఊహించని ఫలితం వచ్చింది. ప్రపంచ రెజ్లింగ్లో ఆల్టైమ్ గ్రేటెస్ట్గా పేరొందిన రష్యా మహాబలి, దిగ్గజ రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్ను గార్డెనర్ ఎంతో నేర్పుగా ఓడించాడు. ఈ శతాబ్దం విస్తుపోయే ఫలితాన్నిచ్చాడు. కరెలిన్తో తలపడుతున్నపుడు ప్రత్యర్థి ఒక్క పాయింట్ సాధిస్తేనే గొప్ప అనుకుంటారు. కానీ గార్డెనర్ ఏకంగా కరెలిన్ను ఓడించాడు. పసిడి పతకం కూడా గెలిచాడు. కనకంతో కెరీర్ను దిగ్విజయంగా ముగించాలని కలలు కన్న కరెలిన్కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. స్వదేశంలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రానికి చెందిన రీడ్, వర్జినియా దంపతులకు పుట్టిన తొమ్మిది మంది సంతానంలో ఆఖరివాడు రూలన్ గార్డెనర్. కుటుంబానికి సొంతంగా డెయిరీ ఫామ్ ఉండటంతో గార్డెనర్ పాలు అమ్మేవాడు. ఆ తర్వాత రెజ్లింగ్లో రంగప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన అతను సిడ్నీ ఒలింపిక్స్లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. చరిత్రలో భాగమయ్యాడు. కనీవినీ క్రేజ్ను ఒక్క రాత్రే సంపాదించాడు. ప్రపంచ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాడు. ఇంకేం ఆ తర్వాత ఓ వెలుగు వెలిగిన ఇతన్ని దురదృష్టం ప్రమాదాల పాలు చేస్తే.... అదృష్టమేమో ప్రాణాలతో బయటపడేలా చేసింది. కానీ కాలమైతే ఆగదు. దాంతో క్రేజ్తో వచ్చిన క్యాష్ నిలువలేదు. తోడుగా వచ్చిన కష్టాలు వదిలేయలేదు. ఆర్థిక నష్టాల నుంచి బయటపడలేదు. చివరకు దివాళా తప్పలేదు. (స్టేడియాలు తెరుచుకోవచ్చు ) ఏకులా వచ్చి... సిడ్నీ ఒలింపిక్స్ మొదలయ్యే సమయానికి గార్డెనర్ అనామక రెజ్లరైతే... అలెగ్జాండర్ కరెలిన్ మాత్రం దిగ్గజ రెజ్లర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఒక్క బౌట్లోనూ ఓడిపోలేదు. 9 సార్లు విశ్వవిజేతగా... 13 సార్లు యూరోపియన్ చాంపియన్గా... వరుసగా మూడు ఒలింపిక్స్లలో చాంపియన్గా నిలిచిన కరెలిన్ సిడ్నీ ఒలింపిక్స్లో ఏ ప్రత్యర్థికీ కనీసం ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా ఫైనల్ చేరాడు. 1997లో ఓ టోర్నీలో రూలన్ ఎదురైతే కరెలిన్ ఓ పట్టుపట్టి అలవోకగా 5–0తో మట్టికరిపించాడు. అంతేకాదు ఈసారీ స్వర్ణం గెలిస్తే ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు ఒలింపిక్ పసిడి పతకాలు నెగ్గిన మూడో క్రీడాకారుడిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించేవాడు. కానీ అప్పటి 33 ఏళ్ల కరెలిన్ కలల్ని అమెరికాకు చెందిన నాటి 29 ఏళ్ల పాలబ్బాయి రూలన్ గార్డెనర్ భగ్నం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిగల తొలి రౌండ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ ఇద్దరూ ఖాతా తెరువలేకపోయారు. అయితే రెండో రౌండ్ మొదలైన 23 సెకన్లకు గార్డెనర్ ఒక పాయింట్ సంపాదించాడు. ఇక మూడో రౌండ్లోనూ తన శక్తినంతా కూడదీసుకొని కరెలిన్ను నిలువరించిన గార్డెనర్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. తుదకు 1–0తో కరెలిన్ను ఓడించి గార్డెనర్ అద్భుతం చేశాడు. దీంతో ఈ ఫలితం ‘అప్సెట్ ఆఫ్ ద సెంచరీ’ (శతాబ్ది విస్తుపోయే ఓటమి)గా పుటల్లోకెక్కింది. కరెలిన్ బంగారు యాత్ర ముగియడంతో అతని తన కెరీర్నూ ముగించాడు. ఆటకు టాటా చెప్పేశాడు. ‘అతనికి మరణం లేదు’ అనే టైటిల్తో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అసాధారణ చాంపియన్లను చరిత్రలో నిక్షిప్తం చేసే పనిలో పడింది. అందుకే మేటి అథ్లెట్లను ‘తెర’మీదకు తెస్తోంది. ఈ ఉద్దండ పిండాల జాబితాలో గార్డెనర్ కూడా ఉన్నాడు. ఫైవ్ రింగ్స్ ఫిలిమ్స్ బ్యానర్పై ఐఓసీ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ పేరు ‘రూలన్ గార్డెనర్ వోంట్ డై’. జూన్ 3న విడుదలయ్యే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ఇప్పటికే వచ్చేసింది. ఇందులో చరిత్ర కెక్కిన సువర్ణ విజయంతో పాటు జీవితంలో అతనికి ఎదురైన ఆటుపోట్లు, ప్రాణాలమీదికి తెచ్చిన ప్రమాదాలు క్లుప్తంగా చూపించారు. మృత్యుంజయుడు... సిడ్నీ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచాక 2001లో ప్రపంచ చాంపియన్షిప్లోనూ గార్డెనర్ పసిడి పతకం నెగ్గి జగజ్జేత అయ్యాడు. అయితే ఆ తర్వాతి ఏడాదే గార్డెనర్కు స్నో డ్రైవ్ ప్రమాదంలో ప్రాణం పోయినంత పనైంది. 2002 ఫిబ్రవరిలో మంచు సరస్సు వద్ద అతను నడుపుతున్న స్నో మొబైల్ ప్రమాదానికి గురైంది. దీంతో కన్నీటి చుక్క కూడా గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏకంగా 17 గంటలు అచేతనంగా పడిపోయాడు. తీవ్రంగా గాయమైన గార్డెనర్ కుడి కాలి వేళ్లను తొలగించాల్సి వచ్చింది. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్లో పోటీపడ్డ గార్డెనర్ 130 కేజీల విభాగంలోనే కాంస్య పతకం గెలిచి కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2007 ఫిబ్రవరిలో మళ్లీ గార్డెనర్ మరో ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ఓ నదిలో కూలిపోయింది. అప్పుడు కూడా అతను మృత్యుంజయుడుగా నిలిచాడు. గంటకుపైగా ఈదుతూ ప్రాణాలతో ఒడ్డుకు చేరాడు. తదనంతరం గార్డెనర్ వ్యక్తిగత జీవితం కూడా కుదుపునకు లోనైంది. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ రెండూ విడాకులకు దారి తీశాయి. మరోవైపు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టాలు రావడం... వాటి నుంచి ఎంతకి బయటపడలేక గార్డెనర్ చివరకు దివాళా తీశాడు. చివరకు తాను సాధించిన సిడ్నీ ఒలింపిక్స్ స్వర్ణాన్ని, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని, ఇతర విలువైన వస్తువులను అమ్ముకొని అప్పులు తీర్చాడు. అనంతరం మూడేళ్లపాటు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేశాక మళ్లీ రెజ్లింగ్వైపు వచ్చాడు. ప్రస్తుతం 48 ఏళ్ల గార్డెనర్ సాల్ట్లేక్ సిటీలోని ఓ హైస్కూల్లో రెజ్లింగ్ కోచ్గా చిన్నారులకు కుస్తీ పాఠాలు చెబుతున్నాడు. -
‘నా ప్రపంచకప్ పతకం కనిపించడంలేదు’
లండన్: లాక్డౌన్ సమయంలో ఇతర క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చాలెంజ్లు విసురుకుంటుంటే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం కనిపించకుండా పోయిన వన్డే ప్రపంచకప్ పతకాన్ని వెతికే పనిలో పడ్డాడు. వారం రోజులుగా ఇంట్లో అణువణువూ వెతికానని అయినా తన ప్రపంచకప్ పతకం దొరకలేదని అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఆర్చర్ తన పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి చేరాడు. తాను పాత ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిత్రపటానికి పతకాన్ని వేలాడదీశానని... అయితే కొత్త ఇంటిలో ఆ చిత్ర పటం ఉంది కానీ తన మెడల్ మాత్రం లేదన్నాడు.