medals
-
పారిశుధ్య కార్మికుడి కూతుళ్లు కరాటేలో క్వీన్స్..!
వారి ఇంటిపేరు ఏమిటో చాలామందికి తెలియదు. ‘కరాటే సిస్టర్ప్’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన విశాఖపట్నంకు చెందిన కృష్ణప్రియ, జ్యోతి, సంగీత కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. కర్రసాము, చెస్లోనూ రాణిస్తున్నారు...జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రామారావు ముగ్గురు కుమార్తెలు సంగీత, కృష్ణప్రియ, జ్యోతి కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విశాఖ మహా నగరంలోని పీ అండ్ టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ (ఎన్ ఎంసీహెచ్)లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఒక వైపు చదువు, మరోవైపు కరాటేలో ప్రావీణ్యం చూపుతున్నారు.కృష్ణప్రియ (16) డబ్లు్యఆర్ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్–2017 పోటీలలో రజతం, ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2018 పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు, నెట్షాడోకాన్ నేషనల్ ఛాంపియన్ షిప్–2019 ఓపెన్ కరాటే పోటీలలో వెండి, కాంస్య పతకాలు, దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్–2020 పోటీల్లో రజత, కాంస్య పతకాలు, 5వ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు, 13వ జాతీయ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే కుంగ్ఫూ ఛాంపియన్ షిప్–2022 పోటీలలో రజత, వెండి పతకాలు, 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్–2025 ΄ోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు....ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పతకాలు సాధించింది.ఈ నెలలో విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన 81వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2025 పోటీలలో ముగ్గురు సోదరీమణులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలలో జ్యోతి బంగారు పతకం, వెండిపతకాలు, కృష్ణప్రియ ఏకంగా రెండు బంగారు పతకాలు, సంగీత వెండి, కాంస్య పతకాలు సాధించింది. విశాఖలో జరిగిన ఈ పోటీలలో విశాఖకు చెందిన ఈ ముగ్గురు సోదరీమణులు ఒకే వేదిక మీద సత్తా చాటి పతకాలు అందుకొని భేష్ అనిపించుకున్నారు.‘రామారావుకు నేనే కరాటేలో శిక్షణ ఇచ్చాను. 1989 నుంచి కరాటే అకాడమీ నిర్వహిస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా రామారావు ముగ్గురు కుమార్తెలకు కూడా కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఈ ముగ్గురు పిల్లలకు కష్టపడే తత్వం ఉంది. మంచి భవిష్యత్ ఉంది’ అంటున్నాడు కరాటే కోచ్ ఎల్లారావు.‘పిల్లలు సరదాగా కరాటే నేర్చుకుంటున్నారు అనుకున్నానుగానీ ఇంత పేరు తెచ్చుకుంటారు అనుకోలేదు. వారి విజయాలకు ఒక తండ్రిగా మురిసిపోతున్నాను. గర్విస్తున్నాను’ అంటున్నాడు రామారావు. కరాటే అంటే నిండైన ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసమే ముగ్గురు సోదరీమణులకు ఆభరణం. వారు కరాటేలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం.– దుక్కా మురళీకృష్ణారెడ్డి, సాక్షి, సీతమ్మధార, విశాఖపట్నం (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
భారత బాక్సర్లకు 17 పతకాలు
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు ఏకంగా 17 పతకాలు కొల్లగొట్టారు. ముఖ్యంగా టీనేజ్ మహిళా బాక్సర్లు పార్థవి, వన్షిక స్వర్ణాలు సాధించారు. మహిళల 65 కేజీల ఫైనల్లో పార్థవి 5–0తో ఆలియా హోపెమా (నెదర్లాండ్స్)ను కంగుతినిపించింది. ప్లస్ 80 కేజీల కేటగిరీలో వన్షిక గోస్వామి ముష్టిఘాతాలకు జర్మనీ బాక్సర్ విక్టోరియా గాట్ విలవిల్లాడింది. దీంతో రిఫరీ నిమిషం 37 సెకన్లకు ముందే బౌట్ను నిలిపేసి వన్షికను విజేతగా ప్రకటించాడు. మిగతా మహిళల్లో క్రిషా వర్మ (75 కేజీలు) బంగారు పతకం నెగ్గగా, నిషా (51 కేజీలు), సుప్రియా (54 కేజీలు), కృతిక (80 కేజీలు), చంచల్ (48 కేజీలు), అంజలి (57 కేజీలు), వినీ (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) రజతాలతో సంతృప్తి చెందారు. పురుషుల్లో ఏకైక పసిడి పతకాన్ని హేమంత్ తెచ్చి పెట్టాడు. రాహుల్ కుందు (75 కేజీలు) రజతం నెగ్గగా, రిషి సింగ్ (50 కేజీలు), క్రిష్ పాల్ (55 కేజీలు), సుమిత్ (70 కేజీలు), ఆర్యన్ (85 కేజీలు), లక్షయ్ రాఠి (ప్లస్ 90 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
బరువైపోయిందా ?
రెండు దశాబ్దాల క్రితం ఆమదాలవలస పేరు చెబితే జాతీయ స్థాయిలో ఠక్కున గుర్తుకొచ్చేది వెయిట్ లిఫ్టింగ్. ఒకరా ఇద్దరా.. పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటేవారు. విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్లోనూ ఆమదాలవలస వైభవాన్ని చాటిచెప్పారు. కానీ నేడు ఆ వైభవమంతా గతకాలపు స్మృతిగా మిగిలిపోయింది. కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి దిగ్గజ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసిన ఆమదాలవలస వెయిట్లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం నేడు ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకుంది. ప్రోత్సాహం కరువై క్రీడాకారులు ఇటువైపు చూడటమే మానుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశంలో ఒలింపిక్ పతకంతో పాటు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షణా కేంద్రానికి నేడు నిర్లక్ష్యపు గ్రహణం కమ్మేసింది. పట్టించుకునే నాథుడు లేక దయనీయ స్థితికి చేరుకుంది. వెయిట్ లిఫ్టింగ్లో ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పేరు మారుమ్రోగింది. ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమదాలవలస ప్రాంతం నుంచి వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారులు ఎక్కువగా వస్తుండటంతో 1987లో ప్రభుత్వం ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటుచేసింది.మెరిసిన ఆణిముత్యాలు.. ఈ ప్రాంతం నుంచి తొలిసారిగా ఊసవానిపేటకు చెందిన నీలం శెట్టి గురువునాయుడు సీనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఆ తరువాత నీలంశెట్టి సూర్యనారాయణ, కరణం నరసమ్మలు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అలాగే సీతమ్మ అనే క్రీడాకారిణి స్టేట్ చాంపియన్గా నిలిచింది. అనంతరం కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించి నీలంశెట్టి లక్ష్మి సిక్కోలు కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్ధాయిలో నిలిపింది. ఇక 2000 సంవత్సరంలో ఆ్రస్టేలియాలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకంతో కరణం మల్లీశ్వరి సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్గా నిలిచిన పూజారి శైలజ ప్రతిభ చెప్పనవసరంలేదు. వీరితోపాటు యామిని, కరణం కల్యాణి, కరణం కృష్ణవేణి, గౌరి, నీలంశెట్టి ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, బొడ్డేపల్లి రాజ్యలక్ష్మి, చీర రాజేశ్వరి, ఎన్ని శ్రీదేవి ఇలా ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆదరణ లేకే.. ఆమదాలవలసలో తొలుత కొత్తకోట అమ్మినాయుడు అనే వ్యక్తి మారుతి వ్యాయామ మండలిని ఏర్పాటు చేశారు. అనంతరం 1983లో అప్పటి ప్రభుత్వం చిన్న శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది శిధిలావస్థకు చేరడంతో అమ్మినాయుడు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించుకున్నారు. 1987లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. వాటితో నూతన భవనాన్ని నిర్మించారు. నీలంశెట్టి అప్పన్న అనే వ్యక్తి కోచ్గా ఉండేవారు. ఆయన రిటైరయ్యాక కోచ్ను నియమించలేదు. దీంతో సీనియర్ క్రీడాకారులే శిక్షకులుగా వ్యవహరిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకపోవడం, ఔత్సాహికులు కూడా ముందుకు రాకపోవడంతో శిక్షణా కేంద్రం దయనీయ స్థితికి చేరుకుంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. సామగ్రి లేకపోవడంతో క్రీడాకారులు వెళ్లడం మానేశారు. దీంతో పూర్తిగా మూతపడిపోయింది. ఇటీవల ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి చిగురుపల్లి రాజ్యలక్ష్మి తన సొంత డబ్బులతో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ సామగ్రి ఏర్పాటు చేశారు. అక్కడే తన కుమార్తె చిగురుపల్లి హారికరాజ్కు శిక్షణ ఇస్తున్నారు. ఆ బాలిక ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండటంతో మరో 8 మంది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఆ వైభవం గతమే.. ఆమదాలవలసలో వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారులు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో జాతీయ ,అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సుమారు 60నుంచి 80మంది వరకు ఉండేవారు. ఇప్పుడు పది విభాగాల్లో పాల్గొనేందుకు క్రీడాకారులే కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమదాలవలస వెయిట్లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం శిధిలావస్థకు చేరిపోవడం బాధగాఉంది. 2001లో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్నాను. ప్రస్తుతం సరైన ప్రోత్సాహం, వసతులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావడంలేదు. ఈ ప్రాంతంలో ఈ క్రీడ కనుమరుగైపోకుండా చూడాలనే ఉద్దేశ్యంతో నా సొంత డబ్బుతో సామగ్రి కొనుగోలు చేసి నాకున్న సామర్థ్యం మేరకు శిక్షణ ఇస్తున్నాను. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఇటీవల రూ.50వేలు ఇచ్చి ప్రోత్సహించారు. నా కుమార్తెకు కూడా ఆయనే స్పాన్సర్ చేసి పోటీలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా శిక్షణా కేంద్రంలో సామగ్రి ఏర్పాటు చేసి, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను ఆదుకోవాలి. కోచ్ను ఏర్పాటు చేయాలి. – చిగురుపల్లి రాజ్యలక్ష్మి, వెయిట్ లిప్టర్, ఆమదాలవలసక్రీడాకారులు కరువు వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ క్రీడాంశాన్ని ఎంచుకుంటుంటారు. ఆరి్థక పరిస్థితులు అంతగా సహకరించక రాణించలేకపోతున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో రాణించినవారికి కనీసం హోంగార్డు పోస్టులో అయినా ప్రాధాన్యత ఇస్తే ఉత్సాహంగా ముందుకువచ్చేవారు. పతకం తెచ్చిన క్రీడాకారుడిని నాయకులు ఆరోజు అభినందించడం తప్ప తరువాత పట్టించుకోవడంలేదు. గతంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం 30 నుంచి 40 మంది మాత్రమే పాల్గొంటున్నారు. – బలివాడ తిరుపతిరావు, వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా మాజీ కార్యదర్శి, వెయిట్లిఫ్టర్ -
‘యువతరానికి బ్రాండ్ అంబాసిడర్లు’
న్యూఢిల్లీ: చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రత్యేకంగా అభినందించారు. బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో చాంపియన్లుగా నిలిచి భారత చదరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ప్లేయర్లను మన్సుఖ్తోపాటు కేంద్ర క్రీడా సహాయ మంత్రి రక్షా ఖాడ్సే గురువారం న్యూఢిల్లీలో సన్మానించారు. ‘అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం ద్వారా దేశ ప్రజలను గర్వపడేలా చేశారు. దీంతో పాటు వారసత్వ క్రీడలో మన సత్తా ఏంటో నిరూపించారు. ఏ ఆటలోనైనా నైపుణ్యాన్ని గుర్తించి వారికి అండగా నిలవడంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్న క్రమంలో క్రీడారంగంలో మన అథ్లెట్లు సాధించే విజయాలు దేశానికి మరింత గుర్తింపు తెచ్చిపెడతాయి. ఒలింపియాడ్లో పతకాలు నెగ్గిన ప్లేయర్లు దేశంలో యువతరానికి బ్రాండ్ అంబాసిడర్ల వంటి వాళ్లు’ అని మాండవీయ తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి కాగా.. ఈ ప్రదర్శనతో దేశంలో చిన్నారులు, యువతలో ఆటల పట్ల ఆకర్శణ మరింత పెరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దొమ్మరాజు గుకేశ్, ద్రోణవల్లి హారికలతో మాండవీయ సరదాగా చెస్ ఆడారు. స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్ల సభ్యులకు కేంద్ర క్రీడా శాఖ రూ. 20 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని చెక్ల రూపంలో అందించింది. -
సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై పాకశాస్త్రంలో తెలంగాణ అమ్మాయి అశ్విత పోలీస్ సత్తా చాటింది. ఫ్రాన్స్లోని లియాన్లో జరుగుతున్న వరల్డ్ స్కిల్స్–2024లో అశ్విత బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును గెలుచుకుంది. భారతదేశం స్కిల్ సెట్లలో 4 కాంస్య పతకాలు, 12 మెడలియన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులతో కలిపి మొత్తం 16 పతకాలు సొంతం చేసుకుంది. ‘పాటిస్సేరీ–కన్ఫెక్షనరీ’లో అశ్విత పోలీస్, ‘ఇండస్ట్రీ 4.0’లో గుజరాత్కు చెందిన ధ్రుమిల్కుమార్ ధీరేంద్రకుమార్ గాంధీ, సత్యజిత్ బాలకృష్ణన్, ‘హోటల్ రిసెప్షన్’లో ఢిల్లీకి చెందిన జోతిర్ ఆదిత్య కృష్ణప్రియ రవికుమార్, ‘రెన్యూవబుల్ ఎనర్జీ’లో ఒడిశాకు చెందిన అమరేష్ కుమార్ సాహు కాంస్యపతకాలు గెలుచుకున్నారు. వీటితోపాటు భారతీయ బృందం 12 మెడలియన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను సంపాదించింది. ‘పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ’లో పోటీ చేసిన అశ్విత టీమ్ ఇండియా నుంచి అత్యుత్తమ పోటీదారుగా బెస్ట్ ఆఫ్ నేషన్ అవార్డును కూడా గెలుచుకుంది.అశ్విత చిన్నప్పటి నుంచి స్వీట్స్ తయారుచేయడం, టీవీ షోల ద్వారా పాకశాస్త్రంలో నైపుణ్యాన్ని పెంచుకుంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యారి్థని అయిన అశ్విత.. చెఫ్ వినేష్ జానీ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. అశ్విత విజయం ప్రపంచ వేదికపై భారతీయ పాకశాస్త్ర ప్రతిభ పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటుతోంది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఔత్సాహిక చెఫ్లను ప్రేరేపిస్తుందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ మంత్రిత్వ శాఖ కొనియాడింది. పాటిస్సేరీ అండ్ కన్ఫెక్షనరీ విభాగంలో 21 దేశాలతో పోటీపడి కాంస్యం సాధించిన అశ్విత పోలీస్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం సవాలుతో కూడుకున్నది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలనే కల నిజమైంది. కానీ నమ్మశక్యంగా లేదు’అని అన్నారు. వరల్డ్ స్కిల్స్ 2024లో 70కి పైగా దేశాల నుంచి 1,400 మందికి పైగా పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత్ 52 నైపుణ్య విభాగాల్లో పోటీపడింది. -
‘టోక్యో’ను దాటేసి...
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి. దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్పుట్లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్లో భారత్కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. హర్విందర్ ‘పసిడి’ గురి పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. సత్తా చాటిన సచిన్... పురుషుల షాట్పుట్ ఎఫ్46 ఈవెంట్లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు. పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్పుట్కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్లో 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్వాల్ క్వాలిఫయింగ్లోనే విఫలమైన ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. -
26 మందికి శౌర్య, సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన 26 మంది శౌర్య, సేవా పతకాలకు ఎంపికయ్యారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన మొత్తం 1,037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురికి పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 19 మందికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకాలు లభించాయి. అగ్నిమాపక సర్వీస్కు చెందిన ఒకరికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకం వరించింది. ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్ట్ చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి పతకాలకు ఎంపికైన వారి వివరాలివీ.ప్రతిభాపూర్వక సేవా పతకాలువిష్ణు నర్ణిది (అడిషనల్ ఎస్పీ), లక్ష్మీ ఎన్ఎస్జే (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్), గోపాలకృష్ణ సోమసాని (డీఎస్పీ), మురళీకృష్ణ తక్కెలపాటి (డీఎస్పీ), రామచంద్రమూర్తి కొండుమహంతి (అడిషనల్ ఎస్పీ), ఉదయభాస్కర్ దేశబత్తిన (గ్రూప్ కమాండర్), శ్రీనివాసులు పేదరాశి (డీఎస్పీ), కృష్ణమూర్తిరాజు కనుమూరి (ఇన్స్పెక్టర్), లక్ష్మీ నరసింహారావు సిరికి (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రమేష్బాబు కాట్రగడ్డ (కానిస్టేబుల్), శ్రీనివాసరావు గడ్డం (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వీరవెంకట సత్యసాంబశివరావు తోటకూర (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వెంకట సుబ్బారాయుడు జింకా (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రామచంద్ర శేఖరరావు మంద (హెడ్ కానిస్టేబుల్), జయచంద్రరెడ్డి వద్దిరెడ్డి హెడ్ కానిస్టేబుల్), డి.భక్తవత్సలరాజు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), చిన్న సైదా షేక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), కె.గోవిందరాజులు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), షరీఫ్ మహబూబ్ (సబ్ ఇన్స్పెక్టర్), చిన్నం మార్టిన్ లూథర్కింగ్ (అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు» ఎం.రవిప్రకాష్ (ఐజీ)» డి.డి.గంగరాజు (ఇన్స్పెక్టర్) శౌర్య పతకాలు» షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్)» సవ్వన అరుణ్కుమార్ (సబ్ ఇన్స్పెక్టర్)» మైలపల్లి వెంకట రామ పరదేశీనాయుడు (రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్)» రాజన గౌరీశంకర్ (హెడ్ కానిస్టేబుల్) -
పారిస్ ఒలింపిక్స్ 2024 : ఈసారి పతకాలు తగ్గాయి..! (ఫొటోలు)
-
పతకాల సంఖ్య ప్రామాణికం కాదు
పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను. నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది. అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు. -నీరజ్ చోప్రా -
Paris Olympics 2024: ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం (ఫోటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్: నీతా అంబానీ సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్లో భారత ఒలింపిక్ షూటింగ్ బృందాన్ని సత్కరించారు. ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్పీలకు ఫోజులిచ్చి సందడి చేశారు. భారతీయులందర్నీ గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు! గో ఇండియా.. గో’ అంటూ వారిని ఉత్సాహ పరిచారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు విశ్వ క్రీడావేదికపై మనదేశాన్ని సగర్వంగా నిలిపిన కృషికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే రెండు పతకాలతో, మన షూటర్లు పారిస్లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేసిన సంగతి తెలిసిందే. భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్, ఇండియా హౌస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్లోనూ మను కాంస్య పతకాన్నిసాధించి స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్గా చరిత్రకెక్కింది.Indian star shooter Sarabjot Singh gets heroic reception in India house 😍😍Manu Bhaker and Sarabjot Singh win Bronze 🥉 in the 10m air pistol mixed team event. #Sarabjot #Shooting #ManuBhaker #ParisOlympics2024 #Paris2024 #Paris2024Olympic #ParisOlympics pic.twitter.com/8oUs2x7PoK— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024 -
ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు.. మనుభాకర్ సరికొత్త రికార్డు
-
ఒలింపిక్స్లో నేటి (జులై 30) భారత షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్లో మూడో రోజు భారత్కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్య సేన్, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత జోడీ కాంస్య పతక రేసులో నిలిచింది.నాలుగో రోజు (జులై 30) భారత షెడ్యూల్ ఇలా..షూటింగ్- పృథ్వీరాజ్ తొండైమాన్ (ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుశ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (ట్రాప్ వుమెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుకాంస్య పతక పోరు: మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ వర్సెస్ కొరియా టీమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్)- మధ్యాహ్నం ఒంటి గంటకురోయింగ్- బల్రాజ్ పన్వర్ (మెన్స్ సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్)- మధ్యాహ్నం 1:40 గంటలకుహాకీ- ఇండియా వర్సెస్ ఐర్లాండ్ (మెన్స్ పూల్-బి)- సాయంత్రం 4:45 గంటలకుఆర్చరీ- అంకిత భకత్ వర్సెస్ వియోలెట మిస్జోర్ (పోలాండ్)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:14 గంటలకుభజన్ కౌర్ వర్సెస్ సైఫా నూరాఫిఫా కమల్ (ఇండొనేషియా)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:27 గంటలకుబ్యాడ్మింటన్- సాత్విక్సాయిరాజ్/చిరాగ్ షెట్టి వర్సెస్ అల్ఫియాన్ ఫజర్/ముహహ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండొనేషియా)- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజీ- సాయంత్రం 5:30 గంటలకుఅశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్ సెత్యానా మపాసా/ఏంజెలా యు (ఆస్ట్రేలియా)- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్- సాయంత్రం 6:20 గంటలకుబాక్సింగ్- జాస్మిన్ లంబోరియా వర్సెస్ నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్)- మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32- రాత్రి 9:24 గంటలకుఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర వర్సెస్ ఆడమ్ లి (చెకియా) మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగం 1/32 ఎలిమినేషన్ రౌండ్- రాత్రి 10:46 గంటలకుబాక్సింగ్- ప్రీతి పవార్ వర్సెస్ యెని మార్సెలా అరియాస్ (కొలంలియా)- మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16- మధ్య రాత్రి 1:20 గంటలకు -
Olympics: చేరువై... దూరమై!
చిక్కినట్లే చిక్కి చేజారితే కలిగే బాధ వర్ణణాతీతం! ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై పతకం పట్టాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు. ఏళ్ల తరబడి కఠోర సాధన, అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటారు. మరి అలాంటిది... మెడల్కు అత్యంత చేరువైన తర్వాత అందినట్లే అంది ఆ విజయం దూరమైతే కలిగే బాధ అంతా ఇంతా కాదు! ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బబుతాకు ఇలాంటి మనసు వికలమయ్యే అనుభవం ఎదురైంది. అయితే త్రుటిలో పతకాలు చేజార్చుకున్న భారత ప్లేయర్లలో అర్జున్ బబూతా మొదటి క్రీడాకారుడేమీ కాదు... గతంలోనూ పలుమార్లు విశ్వ క్రీడల్లో భారత్కు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పరిశీలిస్తే... ఫుట్బాల్తో మొదలు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో భారత ఫుట్బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ శిక్షణలో రాటుదేలిన మన జట్టు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్వార్టర్ ఫైనల్కు చేరింది. క్వార్టర్స్లో ఆతిథ్య ఆ్రస్టేలియాపై నెవిల్లె డిసౌజా హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో సెమీస్లో అడుగుపెట్టి పతకం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే యుగోస్లో వియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 1–4తో పరాజయం పాలైంది. కాంస్య పతక పోరులోనూ తడబడ్డ భారత్ 0–3తో బల్గేరియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో నిరాశగా వెనుదిరిగింది. మిల్కా సింగ్ వెంట్రుకవాసిలో... 1960 రోమ్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో సమీప ప్రత్యరి్థని చూసే క్రమంలో క్షణకాలాన్ని వృథా చేసుకున్న మిల్కా.. దానికి జీవితకాల మూల్యం చెల్లించుకున్నాడు. రోమ్ ఒలింపిక్స్ అనుభవంతో అథ్లెటిక్స్కే వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అతి బలవంతంగా అతడిని తిరిగి ట్రాక్ ఎక్కించగా.. 1962 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటాడు. మహిళల హాకీలో ఇలా.. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్పై ఆతిథ్య సోవియట్ యూనియన్ దాడి చేసిన నేపథ్యంలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాస్కో క్రీడలను బహిష్కరించాయి. దీంతో మన జట్టు పోడియంపై నిలవడం ఖాయమే అనిపించింది. ఆ్రస్టియా, పోలాండ్పై ఘనవిజయాలు సాధించిన మన మహిళల జట్టు పతకంపై ఆశలు రేపింది. అయితే ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచ్ ‘డ్రా’ కాగా.. చెకోస్లోవియా, సోవియట్ యూనియన్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పరుగుల రాణికి తీరని వ్యథ! 1984 లాస్ఏంజెలిస్ క్రీడల్లో పరుగుల రాణి పీటీ ఉషకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో సెకనులో వందో వంతు తేడాతో పీటీ ఉష నాలుగో స్థానానికి పరిమితమైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలోనైనా ఒక భారత అథ్లెట్ పతకం కోల్పోయిన అత్యల్ప తేడా ఇదే. ఫైనల్లో ఉష 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. జాయ్దీప్కు నిరాశ 2012 లండన్ ఒలింపిక్స్లో జాయ్దీప్ కర్మాకర్కు అర్జున్లాంటి అనుభవమే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన కర్మాకర్ క్వాలిఫికేషన్ రౌండ్లో చక్కటి ప్రదర్శన కనబర్చి ఏడో స్థానంతో ఫైనల్కు అర్హత సాధించాడు. అయితే తుదిపోరులో కాంస్యం గెలిచిన షూటర్ కంటే.. 1.9 పాయింట్లు వెనుకబడిన కర్మాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీపా కర్మాకర్ త్రుటిలో... 2016 రియో ఒలింపిక్స్లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్యం గెలిచిన జిమ్నాస్ట్కు దీపా కర్మాకర్కు మధ్య 0.150 పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఇదే క్రీడల్లో భారత షూటర్ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజార్చుకున్నాడు. మహిళల హాకీ జట్టు మరోసారి 2020 టోక్యో ఒలింపిక్స్లో మరోసారి భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ తప్పలేదు. 1980 మాస్కో క్రీడల్లో త్రుటిలో కాంస్యం చేజార్చుకున్న మహిళల జట్టు.. టోక్యోలోనూ అదే బాటలో నడిచింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆ్రస్టేలియాను మట్టికరిపించి ఆశలు రేపిన మన అమ్మాయిలు.. సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలయ్యారు. కాంస్య పతక పోరులోనైనా అద్భుతం చేస్తారనుకుంటే.. ఇంగ్లండ్తో పోరులో ఆరంభంలో ఆధిక్యం సాధించినా.. చివర్లో పట్టు విడిచి 3–4తో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే క్రీడల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోల్ఫర్ అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈసారి ఇద్దరు.. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్లో లియాండర్ పేస్–మహేశ్ భూపతి జంట నాలుగో స్థానంలో నిలిచింది. భారత అత్యుత్తమ ద్వయంగా విశ్వక్రీడల బరిలోకి దిగిన పేస్–భూపతి హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో 6–7, 6–4, 14–16తో అన్సిచ్–లుబిసిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Paris Olympics 2024: విశ్వ క్రీడల్లో భారత్.. హాకీలో అత్యధికంగా..!
విశ్వ క్రీడల్లో (ఒలింపిక్స్) భారత ప్రస్తానం 1900వ సంవత్సరంలో మొదలైంది. ఆ ఎడిషన్లో భారత్ కేవలం ఒకే ఒక అథ్లెట్తో పాల్గొంది. భారత్ తరఫున బ్రిటిష్ అథ్లెట్ (అప్పటికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది) నార్మన్ ప్రిచార్డ్ పురుషుల 200 మీటర్ల రన్నింగ్ రేస్, 200 మీటర్ల హర్డిల్స్లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు.భారత్ 1920లో తొలిసారి స్వదేశీ ఆథ్లెట్లతో ఒలింపిక్స్లో పాల్గొంది. బెల్జియంలో జరిగిన ఆ ఎడిషన్లో భారత్ తరఫున ఐదుగురు అథ్లెట్లు రెండు క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఆ ఎడిషన్లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది.అనంతరం 1924 పారిస్ ఒలింపిక్స్లో కూడా భారత్కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఎడిషన్లో భారత్ 12 మంది అథ్టెట్లను బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది.భారత్ తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ పతకాన్ని 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో సాధించింది. ఆ ఎడిషన్లో భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా గోల్డ్ మెడల్నే సాధించి చరిత్ర సృష్టించింది.ఆ ఎడిషన్ (1928) నుంచి భారత్ వరుసగా ఐదు ఒలింపిక్స్లో (1932, 1936, 1948, 1952, 1956) స్వర్ణ పతకాలకు సాధించి పురుషుల హాకీలో మకుటం లేని మహారాజులా కొనసాగింది.1952 ఫిన్లాండ్ ఒలింపిక్స్లో భారత్ తొలిసారి రెజ్లింగ్లో పతకం సాధించింది. ఆ ఎడిషన్లో పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో ఖషాబా జాదవ్ కాంస్య పతకాన్ని సాధించి, భారత్ తరఫున తొలి పతకం సాధించిన భారతీయ అథ్లెట్గా చరిత్రపుటల్లోకెక్కాడు.1960 రోమ్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఎడిషన్లో భారత్కు లభించిన ఏకైక పతకం ఇదే.1964 టోక్యో ఒలింపిక్స్లో భారత్ తిరిగి పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది.1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్కు వచ్చే సరికి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.1976 మాంట్రియాల్ ఒలింపిక్స్లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆ ఎడిషన్లో 26 మంది క్రీడాకారులు 5 విభాగాల్లో పోటీపడినా ఒక్క పతకం కూడా దక్కలేదు.1980 మాస్కో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు తిరిగి మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో భారత్ ఖాతా తెరవలేకపోయింది.మూడు ఎడిషన్ల తర్వాత భారత్ మరోసారి ఓ పతకం సాధించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించాడు.2000 సిడ్నీ ఒలింపిక్స్లో భారత్ తరఫున తొలిసారి ఓ మహిళ పతకం సాధించింది. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో భారత్ షూటింగ్లో రజత పతకం సాధించింది. పురుషుల డబుల్స్ ట్రాప్లో రాజ్యవర్దన్సింగ్ రాథోడ్ భారత్కు ఆ ఎడిషన్లో ఏకైక పతకాన్ని అందించాడు.2008 బీజింగ్ ఒలింపిక్స్లో భారత్ తొలిసారి రెండిటి కంటే ఎక్కవ పతకాలు సాధించి. ఆ ఎడిషన్లో భారత్ ఓ గోల్డ్ మెడల్తో పాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. పురుషుల షూటింగ్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని.. పురుషుల రెజ్లింగ్లో సుశీల్ కుమార్, పురుషుల బాక్సింగ్లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.2012 లండన్ ఒలింపిక్స్లో 83 మంది క్రీడాకారులతో 13 విభాగాల్లో పాల్గొన్న భారత్.. రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. పురుషుల షూటింగ్లో విజయ్కుమార్, పురుషుల రెజ్లింగ్లో సుశీల్ కుమార్ రజత పతకాలు సాధించగా.. పురుషుల షూటింగ్లో గగన్ నారంగ్, మహిళల బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సింగ్లో మేరీ కోమ్, పురుషుల రెజ్లింగ్లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు.2012 ఒలింపిక్స్లో ఆరు పతకాలు గెలిచిన భారత్ 2016 రియో ఒలింపిక్స్లో మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఎడిషన్లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. మహిళల బ్యాడ్మింటన్లో పీవీ సింధు రజతం, మహిళల రెజ్లింగ్లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు.120 ఏళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలను 2020 టోక్యో ఒలింపిక్స్లో సాధించింది. ఈ ఎడిషన్లో భారత్ ఏకంగా ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో ఓ గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా.. మహిళల వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయ్ చాను.. పురుషుల రెజ్లింగ్లో రవికుమార్ దాహియా రజత పతకాలను.. మహిళల బ్యాడ్మింటన్లో పీవీ సింధు, మహిళల బాక్సింగ్లో లవ్లీనా బోర్గోహెయిన్, పురుషుల రెజ్లింగ్లో భజరంగ్ పూనియా, పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలను సాధించాయి.జులై 26 నుంచి ప్రారంభంకాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 113 మంది క్రీడాకారులతో 16 విభాగాల్లో పాల్గొంటుంది. మరి ఈసారి భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. ఓవరాల్గా భారత్ ఇప్పటివరకు 35 ఒలింపిక్స్ పతకాలు సాధించగా.. ఒక్క పురుషుల హాకీలోనే 11 పతకాలు రావడం విశేషం. -
రజతం నెగ్గిన రాధిక
బిషె్కక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు మూడు పతకాలు లభించాయి. రాధిక (68 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా... శివాని పవార్ (50 కేజీలు), ప్రియా (76 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 68 కేజీల విభాగం ఫైనల్లో రాధిక 2–15తో నొనోకా ఒజాకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. కాంస్య పతకాల బౌట్లలో శివాని 9–7తో ఒట్గాన్జర్గాల్ డొల్గొర్జవ్ (మంగోలియా)పై, ప్రియా 4–2తో ఎల్మీరా సిద్జికోవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. 59 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ పుష్పా యాదవ్ 8–11తో డయానా కయుమోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
భారత రెజ్లర్లకు మూడు పతకాలు
బిష్క్క్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఉదిత్ (57 కేజీలు) రజతం నెగ్గగా... అభిమన్యు (70 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఉదిత్ 4–5తో కెంటో యుమియా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. బౌట్ చివరి సెకన్లలో ఉదిత్ ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయాడు. 2020 నుంచి 2023 వరకు ఈ విభాగంలో భారత్కు స్వర్ణ పతకాలు లభించాయి. రవి కుమార్ దహియా వరుసగా మూడేళ్లు (2020, 2021, 2022)... గత ఏడాది అమన్ ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గారు. మరోవైపు కాంస్య పతకాల బౌట్లలో అభిమన్యు 6–5తో కుల్దాòÙవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విక్కీ 10–1తో అరోనోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. -
ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో). పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి. -
ఓవరాల్ చాంపియన్ తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు. శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్కుమార్, వి.కిరణ్కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఆయా విభాగాల వారీగా చూస్తే.. ► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం ► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం ► యాంటీ స్టాబేజ్ చెక్లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు ► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి. ►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. -
‘పారిస్’ పతకాల్లో ఈఫిల్ టవర్!
పారిస్: ఈ ఒలింపిక్స్ పతకాలు మిగతా పతకాలకంటే అతి భిన్నమైనవి... అమూల్యమైనవి! ఎందుకంటే ఈ పతకాల్లో బంగారం, వెండి, ఇత్తడి లోహాలే కాదు అంతకుమించి అపురూపమైంది ఇందులో ఇమిడి ఉంది. ఫ్రాన్స్కే తలమానికమైన ‘ఈఫిల్ టవర్’ ప్రతి పతకంలోనూ దాగి ఉంది. అదేలా అంటే... ఈ వివరాల్లోకి వెళ్దాం! ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ నగరంలో విశ్వక్రీడలు జరుగుతాయి. ఈ పోటీల్లో పతక విజేతలకు బహూకరించే పతకాల్ని గురువారం అధికారికంగా ఆవిష్కరించారు. ప్రతి పతకం బరువు 18 గ్రాములైతే... ప్రతి పతకంలోనూ ఈఫిల్ టవర్ లోహం నిక్షిప్తమై ఉంది. పూర్తిగా ఇనుముతో నిర్మించిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈఫిల్ టవర్ను కళ్లారా చూసేందుకు యావత్ ప్రపంచ పర్యాటకులు పారిస్కు పోటెత్తుతారు. ఇనుముతో తయారైన ఈ టవర్ను నవీకరణ చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అప్పుడు టవర్లో అక్కడక్కడ తీసివేసిన తుక్కు ఇనుప ముక్కల్ని ఓ రహస్య గదిలో జాగ్రత్త పరిచారు. ఈసారి ఒలింపిక్స్ పారిస్లో జరుగనున్నాయి. కాబట్టి తమ పతకాలతో మరో విశిష్టత కల్పించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ, ఫ్రాన్స్ ప్రభుత్వం భావించాయి. అందుకే పతకాల తయారీలో అసలైన ఈఫిల్ టవర్ అవశేషాల్ని (భద్రపరిచిన ఇనుప ముక్కలు) వినియోగించారు. ఈసారి విజేతలంతా అదృష్టవంతులే! ఎందుకంటే వాళ్లంతా పతకాల్నే కాదు... ‘సింబల్ ఆఫ్ పారిస్’ గుర్తుల్ని తమతమ దేశాలకు మోసుకెళ్తారు. దీనిపై పారిస్ ఒలింపిక్స్ క్రియేటివ్ డైరెక్టర్ థీయెరి రిబోల్ మాట్లాడుతూ ‘కచ్చితంగా అథ్లెట్లకు ఇది సువర్ణావకాశం. పారిస్ జగది్వఖ్యాత చిహ్నం అవశేషాల్ని ఒలింపిక్స్ విజేతలు తమతో తీసుకెళ్లొచ్చు’ అని అన్నారు. విశ్వక్రీడల చరిత్రలోనే చెరగని ముద్ర వేసేందుకు విశేషమైన వినూత్నమైన ఆలోచనతో ఈ పతకాల్ని డిజైన్ చేశామని చెప్పారు. విజేతలకు అందించేందుకు మొత్తం 5,084 స్వర్ణ, రజత, కాంస్య పతకాలు తయారు చేశారు. -
అఖిల్ పసిడి గురి
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్ఫాఫుమ్ (థాయ్లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
భారత షూటర్లకు ఐదు పతకాలు
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో మూడో రోజూ భారత షూటర్లు ఐదు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నాన్సీ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఇలవేనిల్ వలారివన్ రజత పతకం దక్కించుకుంది. నాన్సీ, ఇలవేనిల్, మెహులీ ఘోష్లతో కూడిన భారత జట్టు 1897.2 పాయింట్లతో టీమ్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. వ్యక్తిగత ఫైనల్లో నాన్సీ 252.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇలవేనిల్ 252.7 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందింది. చైనా షూటర్ షెన్ యుఫాన్ 231.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం సాధించగా... రుద్రాంక్ష్ , అర్జున్ బబూటా, శ్రీకార్తీక్లతో కూడిన భారత బృందానికి కాంస్య పతకం దక్కింది. వ్యక్తిగత ఫైనల్లో రుద్రాం„Š 228.7 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. టీమ్ విభాగంలో రుద్రాం„Š , అర్జున్, శ్రీకార్తీక్ బృందం 1885.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
సాక్షి, హైదరాబాద్: విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ఈ పతకాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 89 మందికి ఉత్తమ సేవా, 42 మందికి కఠిన సేవా, 435 మందికి సేవా పతకాలు లభించాయి. 9 మందికి మహోన్నత సేవా పతకాలు లభించాయి. ఏసీబీలో ఐదుగురికి ఉత్తమ సేవా, ముగ్గురికి సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ముగ్గురికి ఉత్తమ సేవా, ఏడుగురికి సేవా పతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో ఆరుగురికి శౌర్య పతకాలు, ముగ్గురు ఉత్తమ సేవా, 13 మంది సేవా పతకాలు పొందారు. ఎస్పీఎఫ్లో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఉపేందర్కు శౌర్య పతకం లభించింది. -
జాతీయ స్కూల్ గేమ్స్లో ఏపీకి పతకాలు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్న నేషనల్ స్కూల్ గేమ్స్ షూటింగ్ పోటీల్లో బాలికల బృందం బంగారు పతకం సాధించింది. షూటర్లు తమన్యు సిరంగి (412.9), గొంటు లక్ష్మీ సమన్విత (410.4), ఆహాన రాఠీ (406.6) బృందం 1229.9 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. బాక్సింగ్లో ఆరు పతకాలు శుక్రవారం మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బాలుర బాక్సింగ్ అండర్–14, 17, 19 విభాగాల్లో ఏపీ విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. బోండా లక్ష్మణ్ (ఎస్వీఎల్ఎన్ఎస్ విద్యాపీఠ్ జూనియర్ కాలేజీ) రజతం, దాసరి ప్రవీణ్ కుమార్ (జీవీఎంసీ హైస్కూల్ , మాధవధార) కాంస్యం, జన్ని వసంతరావు (శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల, భీమసింగి) కాంస్యం, ఆకుల అశోక్ కుమార్ (సోఫియా జూనియర్ కళాశాల, జ్ఞానపురం) కాంస్యం, ఆయుష్ (ఎంఏబీ పీ జూనియర్ కళాశాల, గాజువాక) కాంస్యం, దొంతల దేవస్వరూప్ (జేఎన్పురం, విజయనగరం జిల్లా) కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు అభినందించినట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ కార్యదర్శి భానుమూర్తిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్ను ప్రకటించింది. 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హోంశాఖ 2018లో ఆపరేషన్స్ మెడల్స్ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్కేడర్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్కేడర్ ఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఎంపికైన వారు రాజేష్ కుమార్ (ఐజీపీ), నరేందర్ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్.చైతన్య కుమార్ (నాన్కేడర్ ఎస్పీ), డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్ రెడ్డి, మహమూద్ యూసఫ్, హెడ్ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్.ప్రసాద్, కే.సి.విజయ్కుమార్, పీసీలు మహమూద్ ఖాజా మొయిద్దీన్, మోహముంద్ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్కుమార్, ఎస్.ప్రేమ్కుమార్, ఎండీ షబ్బీర్ పాషా, ఇంతియాజ్ పాషా షేక్, ఏ.శ్రీనివాస్. ఏపీ నుంచి ఎంపికైన వారు వినీత్ బ్రిజ్ లాల్ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్కుమార్ (ఎస్పీ, నాన్కేడర్), షేక్ సర్దార్ ఘని (ఇన్స్పెక్టర్), సవ్వన అనిల్కుమార్(ఎస్ఐ), ఎంవీఆర్పీ నాయుడు (ఆర్ఎస్ఐ), రాజన్న గౌరీ శంకర్ (హెడ్కానిస్టేబుల్), అనంతకుమార్ నంద (హెడ్కానిస్టేబుల్), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు. -
111 పతకాలు... ఐదో స్థానం
హాంగ్జౌ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు. చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది. నీరజ్ స్వర్ణంతో... ఆఖరి రోజు శనివారం పోటీల్లో నీరాజ్ యాదవ్ జావెలిన్ త్రో (ఎఫ్55)లో 33.69 మీటర్లతో రికార్డు దూరం విసిరి బంగారం నిలబెట్టుకున్నాడు. 39 ఏళ్ల నీరజ్ గత 2018 పారా ఈవెంట్లోనూ పసిడి పట్టాడు. ఈ క్రీడల్లో సహచరుడు టెక్ చంద్ (30.36 మీ.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. తర్వాత దిలిప్ మహాదు పురుషుల 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ కాంస్యం నెగ్గింది. వ్యక్తిగత ర్యాపిడ్–6 బి1 ఈవెంట్లో సతీశ్ ఇనాని, ప్రధాన్ కుమార్, అశ్విన్భాయ్ కంచన్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో క్లీన్స్వీప్ చేశారు. బి2/బి3 ఈవెంట్లో కిషన్ కాంస్యం, ఇదే టీమ్ ఈవెంట్లో కిషన్, ఆర్యన్, సోమేంద్రలతో కూడిన బృందం కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్లో వృతి జైన్, హిమాన్షి, సంస్కృతి కాంస్యం నెగ్గారు. టాప్–5 పట్టికలో... ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది. -
భారత్ కొత్త చరిత్ర
హంగ్జౌ: వరుసగా నాలుగో రోజు తమ పతకాల వేటను కొనసాగిస్తూ ఆసియా పారా క్రీడల్లో భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలను సొంతం చేసుకుంది. 2018 జకార్తా ఆసియా పారా క్రీడల్లో భారత్ అత్యధికంగా 72 పతకాలను దక్కించుకోగా... హాంగ్జౌలో నాలుగో రోజు పోటీలు ముగిసేసరికి భారత బృందం 18 స్వర్ణాలు, 23 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 82 పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. మరో రెండు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ఈసారి భారత్ పతకాల్లో ‘సెంచరీ’ని దాటే అవకాశముంది. గురువారం భారత్కు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలు వచ్చాయి. అథ్లెటిక్స్లో పురుషుల ఎఫ్46 కేటగిరీ షాట్పుట్ ఈవెంట్లో సచిన్ సర్జేరావు ఖిలారి ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అనంతరం ఆర్6 మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్హెచ్1 విభాగంలో భారత షూటర్ సిద్ధార్థ బాబు 247.7 పాయింట్లు స్కోరు పసిడి పతకాన్ని సాధించాడు. ఆర్చరీలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జోడీ కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో 151–149తో లిన్ యుషాన్–అయ్ జిన్లియాంగ్ (చైనా) జంటపై నెగ్గి బంగారు పతకాన్ని దక్కించుకుంది. -
పతకాల పంట
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్ ఖాతాలో 30 పతకాలు చేరాయి. ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ అంటిల్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్ జావెలిన్ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో భారత్కే చెందిన సుందర్ సింగ్ గుర్జర్ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్ జావెలిన్ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్ దినేశ్ ముదియన్సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్37/38 జావెలిన్ త్రో ఈవెంట్లో హనే... మహిళల టి47 లాంగ్జంప్ ఈవెంట్లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు. కాంస్య పతకాలు నెగ్గిన గురు నాయుడు, ప్రియదర్శిని పనాజీ: జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్. గురు నాయుడు ఓవరాల్గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. -
జయహో భారత్ 107
‘వంద’ పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్ అన్నీ ముగిశాయి. చివరిరోజు భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి ‘పతకాల సెంచరీ’ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత్కిదే గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను భారత్ అధిగమించింది. శనివారం భారత్కు ఆర్చరీలో రెండు స్వర్ణాలు.. కబడ్డీల్లో రెండు పసిడి పతకాలు... పురుషుల టి20 క్రికెట్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఒక్కో బంగారు పతకం లభించాయి. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ ఈవెంట్స్ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడుతుంది. హాంగ్జౌ: చైనా గడ్డపై భారత్ తమ పతకాల వేటను దిగ్విజయంగా ముగించింది. ఆసియా క్రీడల్లో ఎవరూ ఊహించని విధంగా 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. తమ పోటీల చివరిరోజు భారత్ 12 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో కలిపి 70 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సురేఖ, ఓజస్ ‘స్వర్ణ’ చరిత్ర శనివారం ముందుగా ఆర్చరీలో భారత్ బాణం ‘బంగారు’ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ 149–145తో చేవన్ సో (దక్షిణ కొరియా)ను ఓడించింది. జ్యోతి సురేఖ 15 బాణాలు సంధించగా అందులో 14 పది పాయింట్ల లక్ష్యంలో... ఒకటి 9 పాయింట్ల లక్ష్యంలో దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్గా జ్యోతి సురేఖకు ఈ ఆసియా క్రీడలు చిరస్మరణీయమయ్యాయి. ఈ క్రీడల్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 3 స్వర్ణాలు సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్తోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ సురేఖ బంగారు పతకాలు గెలిచంది. తద్వారా దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష (1986 సియోల్ గేమ్స్; 4 స్వర్ణాలు, 1 రజతం) తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో కనీసం 3 స్వర్ణ పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతకం కూడా భారత్ ఖాతాలోనే చేరింది. ప్రపంచ చాంపియన్ అదితి స్వామి (భారత్) 146–140తో ఫాదిలి జిలిజాటి (ఇండోనేసియా)పై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్కే లభించాయి. ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్తలే 149–147తో అభిషేక్ వర్మ (భారత్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో ఓజస్కిది మూడో స్వర్ణం. పురుషుల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ విభాగంలో ఓజస్ పసిడి పతకాలు గెలిచాడు. సాత్విక్–చిరాగ్ జోడీ అద్భుతం ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్కు ‘పసిడి’ కల నెరవేరింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ చాంపియన్గా అవతరించి ఈ క్రీడల చరిత్రలో భారత్కు తొలిసారి బంగారు పతకాన్ని అందించింది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. సెమీస్లో మలేసియాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ జోడీని బోల్తా కొట్టించిన భారత జంట తుది పోరులోనూ దూకుడుగా ఆడింది. కళ్లు చెదిరే స్మాష్లతో, చక్కటి డిఫెన్స్తో కొరియా జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని దక్కించుకుంది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్–ప్రదీప్ గాంధే భారత్కు పురుషుల డబుల్స్లో కాంస్య పతకాన్ని అందించారు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలవడంతో వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జోడీ నంబర్వన్ ర్యాంక్ను అందుకోనుంది. దీపక్ ‘రజత’ పట్టు ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్ను భారత్ రజత పతకంతో ముగించింది. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా భారత్కు రజత పతకాన్ని అందించాడు. ఇరాన్ దిగ్గజ రెజ్లర్ హసన్ యజ్దానితో జరిగిన ఫైనల్లో దీపక్ 3 నిమిషాల 31 సెకన్లలో 0–10తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓడిపోయాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం బౌట్లో పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు దీపక్ తొలి రౌండ్లో 3–2తో షరిపోవ్ (ఖతర్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–0తో రియాన్డెస్టా (ఇండోనేసియా)పై, క్వార్టర్ ఫైనల్లో 7–3తో షోటా సిరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 4–3తో షపియెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. భారత్కే చెందిన యశ్ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) ఆరంభ రౌండ్లలోనే ఓడిపోయారు. భారత జట్ల ‘పసిడి’ కూత గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను చేజార్చుకున్న భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు ఈసారి తమ ఖాతాలోకి వేసుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్లో భారత పురుషుల జట్టు 33–29తో డిఫెండింగ్ చాంపియన్ ఇరాన్ జట్టును ఓడించగా... భారత మహిళల జట్టు 26–25తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల కబడ్డీ ఈవెంట్లో భారత పురుషుల జట్టు ఎనిమిదోసారి స్వర్ణ పతకం నెగ్గగా... మహిళల జట్టు మూడోసారి పసిడి పతకం సాధించింది. చెస్లో డబుల్ ధమాకా వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాలు కోల్పోయిన భారత చెస్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్లో సత్తా చాటుకొని రజత పతకాలు నెగ్గారు. పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్లతో కూడిన భారత పురుషుల జట్టు నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్తో జరిగిన చివరి రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు కూడా 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 4–0తో దక్షిణ కొరియాను ఓడించింది. క్రికెట్లో కనకం... తొలిసారి ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్లో పోటీపడ్డ భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో శనివారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అఫ్గానిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసిన దశలో వచ్చిన వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. మెరుగైన ర్యాంక్ కారణంగా భారత్ను విజేతగా ప్రకటించి స్వర్ణ పతకాన్ని అందించగా... అఫ్గానిస్తాన్ జట్టుకు రజతం లభించింది. స్వర్ణం నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. -
ఏషియన్ గేమ్స్ 2023లో ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో 107 పతకాలు
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జైత్రయాత్ర ముగిసింది. ఇవాల్టితో (అక్టోబర్ 7) ఆసియా క్రీడల్లో భారత్ ఈవెంట్స్ అన్ని పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించింది. ఈ ఎడిషన్కు ముందు భారత్ అత్యధిక పతకాలను 2018 జకార్తా ఆసియా క్రీడల్లో (70) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ జకార్తా గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. పతకాల పట్టికలో చైనా 376 పతకాలతో (197 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్యాలు) అగ్రస్థానంలో ఉంది. ఆతర్వాత జపాన్ (181; 50 స్వర్ణాలు, 63 రజతాలు, 68 కాంస్యాలు), రిపబ్లిక్ ఆఫ్ కొరియా (188; 40 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు) ఉన్నాయి. భారత్ పతకాల వివరాలు.. ఆర్చరీ (కాంపౌండ్ మెన్స్): ఓజాస్ దియోతలే (గోల్డ్) ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): జ్యోతి సురేఖ (గోల్డ్) ఆర్చరీ (మెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (వుమెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మిక్సడ్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మెన్స్ సింగిల్స్): అభిషేక్ వర్మ (సిల్వర్) ఆర్చరీ (రికర్వ్ మెన్స్ టీమ్): సిల్వర్ ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): అదితి స్వామి (బ్రాంజ్) ఆర్చరీ (రికర్వ్ వుమెన్స్ టీమ్): బ్రాంజ్ అథ్లెటిక్స్ (మెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): అవినాశ్ సాబ్లే (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 4X400మీ రిలే): గోల్డ్ అథ్లెటిక్స్ (జావెలిన్ త్రో): నీరజ్ చోప్రా (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ షాట్పుట్): తజిందర్పాల్ సింగ్ తూర్ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 5000): పారుల్ చౌదరీ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ జావెలిన్ త్రో): అన్నూ రాణి (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 10000): కార్తీక్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): అజయ్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 5000 ): అవినాశ్ సాబ్లే (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 800): మోహమ్మద్ అఫ్సల్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ డెకత్లాన్): తేజస్విన్ శంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ జావెలిన్ త్రో): కిషోర్ జెనా (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ లాంగ్ జంప్): శ్రీశంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 100 మీ హర్డిల్స్): జ్యోతి యర్రాజీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 1500): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): పారుల్ చౌదరీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 4X400మీ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (వుమెన్స్ 800): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ లాంగ్జంప్): అంచీ సోజన్ (సిల్వర్) అథ్లెటిక్స్ (4X400మీ మిక్సడ్ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (మెన్స్ 10000): గుల్వీర్ సింగ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): జిన్సన్ జాన్సన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ ట్రిపుల్ జంప్): ప్రవీణ్ చిత్రవేల్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్ఛేజ్): ప్రీతి లాంబా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 400 హర్డిల్స్): విత్య రామ్రాజ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ డిస్కస్ త్రో): సీమా పూనియా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ హెప్టాత్లాన్): నందిని అగసర (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ షాట్పుట్): కిరణ్ బలియాన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (35కిమీ రేస్వాక్ మిక్సడ్ టీమ్): బ్రాంజ్ బ్యాడ్మింటన్ (మెన్స్ డబుల్స్): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి (గోల్డ్) బ్యాడ్మింటన్ (మెన్స్ టీమ్): సిల్వర్ బ్యాడ్మింటన్ (మెన్స్ సింగిల్స్): ప్రణయ్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 75 కేజీ): లవ్లీనా (బ్రాంజ్) బాక్సింగ్ (మెన్స్ 92 కేజీ): నరేందర్ (బ్రాంజ్)ఔ బాక్సింగ్ (వుమెన్స్ 45-50 కేజీ): నిఖత్ జరీన్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 50-54 కేజీ): ప్రీతి (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 54-57 కేజీ): పర్వీన్ (బ్రాంజ్) బ్రిడ్జ్ (మెన్స్ టీమ్): సిల్వర్ కనోయ్ స్ప్రింట్ ఝ(మెన్స్ డబుల్స్ 1000మీ): బ్రాంజ్ చెస్ (మెన్స్ టీమ్): సిల్వర్ చెస్ (వుమెన్స్ టీమ్): సిల్వర్ క్రికెట్ (మెన్స్): గోల్డ్ క్రికెట్ (వుమెన్స్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్ టీమ్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్): అనూష అగర్వల్లా (బ్రాంజ్) గోల్ఫ్ (వుమెన్స్): అదితి అశోక్ (సిల్వర్) హాకీ (మెన్స్): గోల్డ్ హాకీ (వుమెన్స్): బ్రాంజ్ కబడ్డీ (మెన్స్): గోల్డ్ కబడ్డీ (వుమెన్స్): గోల్డ్ రోలర్ స్కేటింగ్ (వుమెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోలర్ స్కేటింగ్ (మెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ డబుల్స్): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 8): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 4): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ పెయిర్): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ క్వాడ్రపుల్): బ్రాంజ్ సెయిలింగ్ (గర్ల్స్ ILCA4): నేహా ఠాకూర్ (సిల్వర్) సెయిలింగ్ (మెన్స్ ILCA7): విష్ణు శరవనన్ (బ్రాంజ్) సెయిలింగ్ (మెన్స్ విండ్సర్ఫర్ RS-X): ఎబద్ అలీ (బ్రాంజ్) సెపకతక్రా (వుమెన్స్ రేగు): బ్రాంజ్ షూటింగ్ (10మీ ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (ట్రాప్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ వుమెన్): పలక్ (గోల్డ్) షూటింగ్ (25మీ పిస్టల్ టీమ్ వుమెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ వుమెన్): సిఫ్త్ కౌర్ సమ్రా (గోల్డ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ మెన్: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (స్కీట్ మెన్): అనంత్జీత్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (25మీ పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (ట్రాప్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్పిస్టల్ మిక్సడ్ టీమ్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ మెన్): ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (25మీ రాపిడ్ఫైర్ పిస్టల్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (స్కీట్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (ట్రాప్ మెన్): చెనై కేడీ (బ్రాంజ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్): అషి చౌక్సీ (బ్రాంజ్) స్క్వాష్ పురుషుల జట్టు- స్వర్ణం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- స్వర్ణం స్క్వాష్ పురుషుల సింగిల్స్ సౌరవ్ ఘోశల్ - రజతం స్క్వాష్ మహిళల జట్టు- కాంస్యం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- కాంస్యం టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్- కాంస్యం టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్- గోల్డ్ టెన్నిస్ పురుషుల డబుల్స్- రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీ దీపక్ పునియా - రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల అమన్ - కాంస్యం రెజ్లింగ్ పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీ సునీల్ కుమార్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల ఆంటిమ్ పంఘల్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 62 కేజీల విభాగంలో సోనమ్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీ కిరణ్ - కాంస్యం ఉషు మహిళల 60 కిలోల రోషిబినా దేవి - రజతం -
ఆసియా క్రిడల్లో సెంచరీ కొట్టిన భారత్
-
అసాధారణం.. మన అద్భుత విజయం: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇవాళ వంద పతకాల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు సృష్టించిన వేళ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశారాయన. అంతేకాదు వాళ్లను కలుసుకుని ముచ్చటించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత్కు దక్కిన అద్భుత విజయం!. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అబ్బుర పరిచే వాళ్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించి.. మన హృదయాలను గర్వంతో నింపింది. 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. A momentous achievement for India at the Asian Games! The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals. I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA — Narendra Modi (@narendramodi) October 7, 2023 మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వంద పతకాలు వచ్చాయి. అందులో స్వర్ణం 25 ఉండగా.. ఇవాళ ఒకే రోజు 3 దక్కాయి. ఇక.. మిగిలిన పతకాల్లో రజతం 35, కాంస్యం 40 ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది భారత్. రేపటితో ఆసియా గేమ్స్ 2023 ముగియనున్నాయి. -
41 ఏళ్ల నిరీక్షణకు తెర
ఈ సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ... 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.... భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఆసియా క్రీడల్లో పతకాలను ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో చివరిసారి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత్కు పతకాలు లభించాయి. 1982 ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్లో దివంగత సయ్యద్ మోడీ... పురుషుల డబుల్స్లో లెరాయ్ ఫ్రాన్సిస్–ప్రదీప్ గాంధె సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత తొమ్మిదిసార్లు ఆసియా క్రీడలు జరిగినా పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయారు. చైనా గడ్డపై ఎట్టకేలకు ఈ నిరీక్షణకు ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముగింపు పలికారు. సింగిల్స్లో ప్రణయ్... డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–23, 22–20తో లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. 78 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో కేరళకు చెందిన 31 ఏళ్ల ప్రణయ్ రెండో గేమ్లోనే గెలవాల్సింది. తొలి గేమ్ను సొంతం చేసుకొని, రెండో గేమ్లో 20–18తో ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకున్నాడు. స్కోరును సమం చేసిన లీ జి జియా అదే జోరులో రెండో గేమ్ను నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరకు ప్రణయ్ 18–20తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 3–0తో లీ షి ఫెంగ్పై ఆధిక్యంలో ఉన్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–9తో ఎన్జీ జూ జియి–జాన్ ప్రజోగో (సింగపూర్) జంటపై గెలిచి సెమీఫైనల్ చేరింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆరోన్ చియా–సూ వుయ్ యిక్ (మలేసియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. సింధుకు నిరాశ మరోవైపు మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్లో ఓడి రజత పతకం సాధించిన సింధు ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 12–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. -
భళా భారత్...
పతకాల్లో తొలిసారి ‘సెంచరీ’ దాటాలనే లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడా బృందం ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడలు ముగియడానికి మరో నాలుగు రోజులు ఉండగా... ఇప్పటికే భారత్ ఖాతాలో 81 పతకాలు చేరాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. పోటీల 11వ రోజు భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 12 పతకాలు సొంతం చేసుకుంది. మారథాన్ రేసుతో నేడు అథ్లెటిక్స్ ఈవెంట్స్కు తెరపడనున్న నేపథ్యంలో... ఆర్చరీ, క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్క్వా‹ష్, బ్రిడ్జ్, చెస్ క్రీడాంశాల్లో భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. హాంగ్జౌ: భారత అథ్లెటిక్స్ ‘పోస్టర్ బాయ్’ నీరజ్ చోప్రా ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిశాడు. సహచరుడు కిశోర్ కుమార్ జేనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో నీరజ్ చోప్రా నుంచి ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలోకి వెళ్లాయి. డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కిశోర్ కుమార్ జేనా జావెలిన్ను తన మూడోప్రయత్నంలో 86.77 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి వచ్చాడు. అయితే నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 88.88 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో నమోదు చేశాడు. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కిశోర్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందినా నీరజ్ దూరాన్ని దాటలేకపోయాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో కిశోర్ ఫౌల్ చేసి పాల్గొన్న తొలి ఆసియా క్రీడల్లోనే రజత పతకం గెలిచి సంబరపడ్డాడు. మరోవైపు ఈ ప్రదర్శనతో నీరజ్ వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన రెండో జావెలిన్ త్రోయర్గా గుర్తింపు పొందాడు. గతంలో పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ నవాజ్ (1951, 1954) ఈ ఘనత సాధించాడు. రజత పతకం నెగ్గిన ఒడిశా ప్లేయర్ కిశోర్ కుమార్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. ఒక కోటీ 50 లక్షలు నజరానా ప్రకటించారు. 61 ఏళ్ల తర్వాత రిలేలో స్వర్ణం పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్లో మొహమ్మద్ అనస్, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3ని:01.58 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ విభాగంలో 61 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ పసిడి పతకాన్ని అందించింది. 1962 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్, మఖన్ సింగ్, దల్జీత్ సింగ్, జగదీశ్ సింగ్ బృందం చివరిసారి 4్ఠ400 మీటర్ల రిలేలో భారత్కు బంగారు పతకాన్ని అందించింది. మరోవైపు ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్రాజ్లతో కూడిన భారత మహిళల జట్టు 4్ఠ400 మీటర్ల రిలేలో రజత పతకంతో (3ని:27.85 సెకన్లు) సరిపెట్టుకుంది. పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్ రేసును భారత అథ్లెట్ హర్మిలన్ బైన్స్ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్డ్ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. సురేఖ–ఓజస్ జోడీకి స్వర్ణం ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ దేవ్తలే (భారత్) జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలిచింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. మరోవైపు బ్రిడ్జ్ క్రీడాంశంలో పురుషుల టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా... చెస్లో భారత పురుషుల, మహిళల జట్లు రెండో స్థానంలో కొనసాగుతూ పతకాల రేసులో ఉన్నాయి. -
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట.. ఇదే తొలి సారి
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023 భారత్ హవా కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ డియోటలే గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. ఇదే తొలిసారి.. ఈ విజయంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 71 చేరింది. తద్వారా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ అత్యధిక పతకాలు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2018 ఆసియాక్రీడల్లో 70 పతకాలను ఇండియా సాధించింది. కాగా ప్రస్తుతం భారత ఖాతాలో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: Asian Games 2023: కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు గోల్డ్ మెడల్ ✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨ With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅 Our athletes' dedication and hard work have made this moment possible🔥 Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV — SAI Media (@Media_SAI) October 4, 2023 -
ఏషియన్ గేమ్స్లో ఇవాళ టీమిండియాకు పతకాల పంట.. ఆల్టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) భారత్కు పతకాల పంట పండింది. ఈ రోజు టీమిండియా ఏకంగా 15 పతకాలు (3 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. ఏషియన్ గేమ్స్ హిస్టరీలో భారత్ ఒకే రోజు ఇన్ని పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2010 గ్వాంగ్ఝౌ క్రీడల్లో 14వ రోజు భారత్ సాధించిన 11 పతకాలే ఇవాల్టి వరకు ఓ రోజులో భారత్ సాధించిన అత్యధిక పతకాలుగా ఉన్నాయి. దీని తర్వాత 2014 ఆసియా క్రీడల్లో 8వ రోజు భారత్ 10 పతాకలు సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ 10వ రోజు 9 పతకాలు సాధించింది. 2010 గ్వాంగ్ఝౌ క్రీడల్లో 9వ రోజు భారత్ 9 పతకాలు సాధించింది. ఇదిలా ఉంటే, ఇవాళే భారత్ పతకాల సంఖ్య కూడా 50 దాటింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 53 పతకాలు ఉన్నాయి. 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్య పతకాలను భారత్ ఇప్పటిదాకా సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 243 పతకాలతో చైనా (132 గోల్డ్, 72 సిల్వర్, 39 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 125 పతకాలతో (30, 35, 60) కొరియా రెండో స్థానంలో, 112 పతకాలతో (29, 41, 42) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా, 2018 క్రీడల్లో గెలిచిన 69 పతాకలే ఇప్పటివరకు భారత్ అత్యధిక పతకాల సంఖ్యగా కొనసాగుతుండగా.. ఈసారి క్రీడల్లో భారత్ ఈ రికార్డును సునాయాసంగా దాటి 100 పతకాల మార్కును తాకుందని అంచనా. ఈ ఎడిషన్లో ఇంకా వారం రోజులు మిగిలి ఉన్నాయి. ఇవాళ భారత్ సాధించిన స్వర్ణ పతకాలు.. పురుషుల ట్రాప్ టీమ్ షూటింగ్ (కైనన్ డేరియస్, జొరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమాన్) అవినాశ్ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్) తజిందర్పాల్ సింగ్ తూర్ (మెన్స్ షాట్పుట్) -
‘ఐదు’తో అదరగొట్టారు
ఈసారి పతకాల వేటలో ‘సెంచరీ’ దాటాలని చైనాలో అడుగుపెట్టిన భారత క్రీడాకారులు తొలిరోజే పతకాల ఖాతా తెరిచారు. 19వ ఆసియా క్రీడల్లో మొదటి రోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. స్వర్ణ పతకం అందకపోయినా మూడు రజతాలు, రెండు కాంస్యాలతో శుభారంభం చేశారు. అంచలను అందుకుంటూ షూటర్లు తమ గురిని పతకాలపై పెట్టగా... రోయింగ్లోనూ భారత క్రీడాకారులు తమ సత్తా చాటుకున్నారు. మహిళల బాక్సింగ్, పురుషుల హాకీ, టెన్నిస్ క్రీడాంశాల్లోనూ మనోళ్లు రాణించారు. టేబుల్ టెన్నిస్, వాలీబాల్, మహిళల ఫుట్బాల్లో భారత్ పతకాల రేసు నుంచి ని్రష్కమించారు. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత క్రీడాకారులు మెరిపించారు. షూటింగ్లో రెండు, రోయింగ్లో మూడు పతకాలతో రాణించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం టీమ్ ఈవెంట్లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్వాలిఫయింగ్లో భారత బృందం 1886 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. హాన్ జియావు, యుటింగ్ హువాంగ్, జిలిన్ వాంగ్లతో కూడిన చైనా జట్టు 1896.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. గాన్హుయగ్, యసుజెన్, నరన్తుయాలతో కూడిన మంగోలియా జట్టు 1880 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. క్వాలిఫయింగ్లో రమిత 631.9 పాయింట్లతో రెండో స్థానంలో, మెహులీ 630.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్లో టాప్–8లో నిలిచిన వారి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్ను నిర్వహిస్తారు. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... మెహులీ 208.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. యుటింగ్ హువాంగ్ (252.7 పాయింట్లు) స్వర్ణం, హాన్ జియావు (251.3 పాయింట్లు) రజతం గెల్చుకున్నారు. రోయింగ్లో పురుషుల లైట్వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో అర్జున్ లాల్ జాట్–అరవింద్ సింగ్ ద్వయం రజత పతకంతో బోణీ కొట్టింది. భారత జోడీ 6ని:28.18 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. జున్జీ ఫాన్–మన్ సున్ (చైనా; 6ని:23.42 సెకన్లు) జంట స్వర్ణ పతకం సాధించింది. పురుషుల పెయిర్ విభాగంలో బాబూలాల్ యాదవ్–లేఖ్ రామ్ జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్ రేసులో బాబూలాల్–లేఖ్ రామ్ జంట 6ని:50.41 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం పురుషుల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో భారత జట్టు రజతం గెల్చుకుంది. నీరజ్, నరేశ్ కల్వానియా, నితీశ్ కుమార్, చరణ్జీత్ సింగ్, జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్లతో కూడిన భారత జట్టు 5ని:43.01 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందింది. వాలీబాల్లో భారత పురుషుల జట్టు పతకం రేసు నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 16–25, 18–25, 17–25తో జపాన్ చేతిలో ఓడిపోయింది. పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్కుమార్ (భారత్) 6–2, 6–3తో అభిషేక్–ప్రదీప్ (నేపాల్)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 6–0, 6–0తో మార్కో టిన్ (మకావు)పై ఘనవిజయం సాధించాడు. ఏషియాడ్లో నేటి భారతీయంమెడల్ ఈవెంట్స్ షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగం: రుద్రాం„Š పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దివ్యాంశ్ (ఉదయం గం. 6:30 నుంచి 9 వరకు). మహిళల క్రికెట్ ఫైనల్: భారత్గీశ్రీలంక (ఉదయం గం. 11:30 నుంచి). రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ (బల్రాజ్ పన్వర్; ఉదయం గం. 7 నుంచి); పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ (ఉదయం గం. 8:30 నుంచి); మహిళల ఎయిట్ (ఉదయం గం. 8:50 నుంచి). -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్
హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. ఇందులో 3 సిల్వర్ (2 రోయింగ్, ఒకటి షూటింగ్), 2 బ్రాంజ్ మెడల్స్ (షూటింగ్లో ఒకటి, రోయింగ్లో ఒకటి) ఉన్నాయి. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అషి చౌక్సీ, మేహుల్ ఘోష్, రమిత త్రయం రజత పతకం సాధించగా.. ఫురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ రోయింగ్లో భారత జోడీ అర్జున్ లాల్ ఝట్, అరవింద్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. రోయింగ్ మెన్స్ పెయిర్ ఈవెంట్లో బాబు లాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం సాధించగా.. రోయింగ్ మెన్స్ 8 ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత స్టార్ షూటర్ రమిత కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఐదు పతకాలతో ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 10 పతకాలతో (9 స్వర్ణాలు, ఓ రజతం) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది. కాగా, ఈసారి ఏషియన్ గేమ్స్లో భారత్ 655 సభ్యుల బృందంతో బరిలోకి దిగింది. క్రితం సారి (2018, జకార్తా) క్రీడల్లో భారత్ 570 సభ్యుల బృందంతో బరిలోకి దిగి 70 మెడల్స్ (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) సాధించింది. 2023 ఆసియా క్రీడలు నిన్నటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
పోలీసు సేవలకు సలాం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఏపీ పోలీసులకు మంగళవారం విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినో త్సవంలో సీఎం జగన్ పతకాలు అందజేశారు. 2021, 2022, 2023కు సంబంధించి 65 మంది పో లీసులు కేంద్రం పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పో లీస్ మెడల్(పీపీఎం), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్విస్(పీఎం), పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీ ఎంజీ), అసాధారణ్ ఆసూచన కుశ లత పదక్తో పా టు ముఖ్యమంత్రి శౌర్య పతకాలను అందుకున్నారు. పీపీఎం 2021–22: భావనాసక్సేనా (జాయింట్ సె క్రటరీ, విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ), వెంకటరామిరెడ్డి, (ఐజీపీ–శిక్షణ), పి.సీతారాం(గ్రేహౌండ్స్ క మాండెంట్), ఎన్.సుధాకర్రెడ్డి (ఎస్డీపీఓ, పలమనేరు) పీఎం 2021–22: ఎస్వీ రాజశేఖరబాబు (డీఐజీ, లా అండ్ ఆర్డర్), ఎం.రవీంద్రనాథ్బాబు(ఏఐజీ, లా అండ్ ఆర్డర్), కె.రఘువీర్రెడ్డి(ఎస్పీ, నంద్యాల), కేఎస్వీ సుబ్బారెడ్డి(కమాండెంట్, 6 బెటాలియన్), కె.నవీన్కుమార్(ఏఎస్పీ, గ్రేహౌండ్స్), కె.సుబ్రహ్మ ణ్యం (ఏడీసీపీ, విశాఖ), వి.వి.నాయుడు(ఏసీపీ దిశ, విజయవాడ), సీహెచ్.రవికాంత్ (ఏసీపీ, ఎస్బీ విజ యవాడ), జి.రవికుమార్(డీఎస్పీ, సీఐడీ), కె.వి.రా జారావు, (డీఎస్పీ పీటీఓ), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్ డీపీఓ, నెల్లూరు), వి.శ్రీరాంబాబు(డీఎస్పీ, సీఐడీ), కె.విజయపాల్ (ఎస్డీపీఓ, రాజమండ్రి), సి.శ్రీనివాసరావు (డీఎస్పీ దిశ, ప్రకాశం), జి.వీరరాఘవరెడ్డి (ఎస్డీపీఓ, మార్కాపురం), వై.రవీంద్రరెడ్డి (ఏఆర్ డీఎస్పీ, తిరుపతి), పి.వి.హనుమంతు(అసిస్టెంట్ క మాండెంట్, 6వ బెటాలియన్), బి.విజయ్కుమార్ (అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్), బి.గుణరా ము (సీఐ, విజయవాడ), ఎం.కోటేశ్వరరావు (ఎస్ఐ, శ్రీకాకుళం), జి.కృష్ణారావు(ఎస్ఐ, విజయవాడ), ఆర్.రామనాథం, (ఆర్ఎస్ఐ, విజయవాడ), ఇ.శివశంకర్రెడ్డి (ఆర్ఎస్ఐ, 2వ బెటాలియన్), ఎం.వెంకటేశ్వర్లు(ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), ఎస్.సింహాచలం (ఏఆర్ఎస్ఐ, 3వ బెటాలియన్), టి.నరేంద్రకుమార్ (ఏఎస్ఐ, గుంటూరు), పి.భాస్కర్(ఏఎస్ఐ, కడప), ఎన్.శ్రీనివాస్(ఏఎస్ఐ, కొవ్వూరు), ఎస్.వీరాంజనేయులు(ఏఎస్ఐ, విజయవాడ). పీఎంజీ 2021: ఆర్.రాజశేఖర్ (డీఏసీ), సీహెచ్.సాయిగణేశ్ (డీఏసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ, అనకాపల్లి), డి.మబాషా (ఏఏసీ), టి.కేశవరావు(హెచ్సీ, ఎస్ఐబీ), ఎం.మునేశ్వరరావు (గ్రేహౌండ్స్ ఎస్సీ), గ్రేహౌండ్స్ జేసీల్లో ఎస్.బుచ్చిరాజు, జి.హరిబాబు, బి.చక్రధర్, ఎం.నాని, పి.అనిల్ కుమార్. అసాధారణ్ ఆసూచన కుశలత పదక్ 2022: సి.శ్రీకాంత్ (ఐజీపీ, సీఐడీ), ఎ.బాబ్జీ (ఎస్ఐబీ, ఎస్పీ), ఇ.జి.అశోక్ కుమార్(ఏఎస్పీ, ఎస్ఐబీ), ఎ.వెంకటరావు(డీఎస్పీ, తీవ్రవాద విభాగం, విశాఖ), కె.నిరీక్షణరావు(ఎస్ఐ, ఎస్ఐబీ). ముఖ్యమంత్రి శౌర్య పతకం(2023): బి.సుధాకర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్), కె.విజయశేఖర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐబీ), కె.హరీష్ (ఆర్ఎస్ఐ), పి. రమేశ్(ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ), టి.రవికుమార్(ఎస్ఐ, గ్రేహౌండ్స్), గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐలు టి.సత్యనారా యణ, పి.సతీశ్కుమార్, సీహెచ్.శివ, గ్రేహౌండ్స్ ఎ స్పీలు షామలరావు, రవి, నాగరాజు, గ్రేహౌండ్స్ జే సీలు ఎస్కే కరీం బాషా, బి.వాసుదేవ రెడ్డి, సయ్యద్ హబీబుల్లా, ఎస్.సిద్దయ్య, ఎం.గౌరునాయుడు. -
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సీఎం వైస్ జగన్ పోలీస్ అధికారులకు పతకాలు అందజేశారు
-
అడిషనల్ డీజీ విజయ్కుమార్కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్పై ఇంటెలిజెన్స్లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్స్టేషన్కు చెందిన లీడింగ్ ఫైర్మ్యాన్ శ్రీనివాస్కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
10 మంది తెలుగు పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్
న్యూఢిల్లీ: 2023 సంవత్సారానికి గానూ దేశవ్యాప్తంగా 140 మంది పోలీసు అధికారులు కేంద్ర హోంశాఖ అందించే ఇన్వెస్టిగేషన్లో ఎక్సలెన్స్ మెడల్స్కు ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు పొందిన వారి జాబితాను కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటించింది. ఇక ఈ ఏడాది అవార్డులు అందుకున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్ఐ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడు నుంచి 8, మధ్యప్రదేశ్ నుంచి ఏడుగురు, గుజరాత్ నుంచి ఆరుగురితోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు ఉన్నారు. కాగా వీరిలో 22 మంది మహిళా పోలీసులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది పోలీసులకు మెడల్స్ లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదుగురు, తెలంగాణ నుంచి అయిదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్ దక్కాయి. ఏపీ నుంచి.. ► గుంట్రెడ్డి అశోక్ కుమార్, ఇన్స్పెక్టర్ ►షేక్ మన్సూరుద్దిన్, ఇన్స్పెక్టర్ ►ధనుంజయుడు మల్లెల, డీఎస్పీ ►కొర్లకుంట సుప్రజ, డీఎస్పీ ►ఉప్పుటూరి రవిచంద్ర, డీఎస్పీ తెలంగాణ నుంచి.. ►మేకల తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ ►రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ ►మూల జితేందర్ రెడ్డి, ఏసీపీ ►కమ్మాపల్లి మల్లిఖార్జున కిరణ్కుమార్, డీఎస్పీ ►భూపతి శ్రీనివాసరావు, ఏసీపీ కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ అందించే ఈ పతకాన్ని 2018లో ఇవ్వడం ప్రారంభించగా.. ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీనా ప్రకటిస్తారు. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, విచారణలో వారి ప్రతిభను గుర్తించి గుర్తించి ఈ అవార్డు అందిస్తారు. -
ఉత్తమ పోలీసులకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. నూతన సంవత్సరంగా సందర్భంగా ఇవ్వాల్సిన ఈ పతకాలను దక్కించుకున్న పోలీసు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల అధికారుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర శౌర్యపతకం, మహోన్నత సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, కఠిన సేవాపతకం, సేవాపతకం.. మొత్తం ఐదు కేటగిరీల్లో పతకాల విజేతల జాబితాను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ విడుదల చేశారు. శౌర్య పతకాలు ఎవరికంటే... పోలీస్శాఖ నుంచి శౌర్య పతకాన్ని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ పి.సతీశ్ దక్కించుకున్నారు. ఇంటెలి జెన్స్ విభాగం(కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్)కు చెందిన ఎస్సై ఎస్ఎ కరీం, ఏఎస్సై శివ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ఖాజా మొయినుద్దీన్, ఎస్.రాజవర్ధన్రెడ్డి, ఏ. బాలాజీరావు, కానిస్టేబుళ్లు పి మోహన్, కె కిరణ్కుమార్, బి.లక్ష్మీ నారాయణ, బి.వీరస్వామి, ఎండీ అలీముద్దీన్లకు తెలంగాణ అగ్నిమాపకశాఖ నుంచి శౌర్య పతకం అందుకున్న వారిలో అసెంబ్లీ ఫైర్ స్టేషన్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి.ధనుంజయ్రెడ్డి, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్లో ఎస్ఎఫ్ఓ( స్టేషన్ ఫైర్ ఆఫీసర్)గా పనిచేస్తున్న డి. మోహన్రావు, గౌలిగూడ ఫైర్ స్టేషన్ ఎస్ఎఫ్ఓ ఎన్ ప్రవీణ్కుమార్, మొఘల్పుర ఫైర్ స్టేషన్ ఫైర్మన్ బి.వెంకటేశ్వర రాజు, గౌలిగూడ ఫైర్స్టేషన్ ఫైర్మెన్ మహ్మద్ అస్గర్, అసెంబ్లీ ఫైర్స్టేషన్ ఫైర్మన్ టి. హరికృష్ణ, సికింద్రాబాద్ ఫైర్స్టేషన్ ఫైర్మన్ ఎం.హరికృష్ణలకు దక్కాయి. పోలీస్ శాఖ నుంచి మహోన్నత సేవా పతకాలు 16 మందికి, ఉత్తమ సేవా పతకాలు 94 మందికి, కఠిన సేవాపతకాలు 51 మందికి, సేవా పతకాలు 473 మందికి దక్కాయి. ఇల్లెందు ఫైర్స్టేషన్ డ్రైవర్కుమహోన్నత సేవా పతకం మహోన్నత సేవా పతకం ఖమ్మం జిల్లా ఇల్లెందు ఫైర్స్టేషన్ డ్రైవర్ ఆపరేటర్ కే వెంకటేశ్వర్లుకు దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవా పతకాలు 14 మందికి దక్కాయి. ఏసీబీలో,,, ఏసీబీలో ఉత్తమ సేవాపతకాలు వరంగల్ రేంజ్ కానిస్టేబుల్ ఏ. నర్సయ్య, నిజామాబాద్ రేంజ్ కానిస్టేబుల్ జి సురేశ్, ఖమ్మం రేంజ్ హెడ్కాని స్టేబుల్ టి.క్రిష్ణ సూరిలకు దక్కించుకున్నారు. సేవాపతకాలు 22 మందికి దక్కాయి. విజిలెన్స్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ ఎం.హుస్సేని నా యుడు, కానిస్టేబుల్ ఎంఏ మసూద్లకు దక్క గా, సేవాపతకాలు ఇన్స్పెక్టర్ దండిక మహేశ్, కానిస్టేబుల్ డి.రాజేశ్కుమార్ దక్కించుకున్నారు. ఎస్పీఎఫ్లో.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన వారిలో సబ్ ఇన్స్పెక్టర్ డి. తిరుపతిరెడ్డికి మహోన్నత సేవా పతకం దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవాపతకాలు 15 మందికి దక్కాయి. కాగా, పతకాల జాబితా ఆరు నెలలు ఆలస్యం కావడంపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే, ఆలస్యంగానైనా పతకాలు దక్కినందుకు ఒకింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
అదీ.. వాళ్ల వైఖరి: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తామని, ఆఫ్ట్రాల్ మెడల్స్ ఎంతని చెబుతూ.. తమ ఘనతలను గంగలో నిమజ్జనం చేసేందుకు భారత రెజ్లర్లు సిద్ధపడ్డారు. అయితే హరిద్వార్ వద్ద చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు కదా! అని రెజ్లర్లకు గుర్తు చేశారాయన. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు చేసిన ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందని తేలితే.. అప్పుడు అరెస్ట్ జరుగుతుంది కదా పేర్కొన్నారాయన. ఇక గంగలో మెడల్స్ను విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించడంపైనా ఆయన స్పందిస్తూ.. ‘‘హరిద్వార్కు వెళ్లారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. కానీ, తర్వాత వాటిని తికాయత్కు(రైతు సంఘాల నేత) అప్పగించారు. ఇదేనా వాళ్ల వైఖరి.. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటూ పెదవి విరిచారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆవైపుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను మంగళవారం సాయంత్రం హరిద్వార్లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్చలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు. ఈ క్రమంలో గంగలో మెడల్స్ను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్ తికాయత్ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు. -
పతకాలు ‘గంగ’పాలు కాలేదు!
హరిద్వార్: న్యాయం కోసం పోరాడుతూ వారంతా నెల రోజులకు పైగా నిరసన ప్రదర్శించారు...కానీ ఫలితం దక్కలేదు. పైగా పోలీసులు నిర్దయగా, అగౌరవంగా వారిని లాక్కెళ్లారు...ఆపై ప్రభుత్వంనుంచి కనీస స్పందన కూడా కనిపించలేదు. దాంతో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆ అగ్రశ్రేణి రెజ్లర్లు తమ కష్టానికి ప్రతిఫలమైన పతకాలను కూడా వద్దనుకున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి గంగా నదిలో పడేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ చివరకు అది జరగలేదు. సన్నిహితుల సముదాయింపుతో చివరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. హరిద్వార్లో సుదీర్ఘ సమయం పాటు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం వందల సంఖ్యలో వచ్చిన మద్దతుదారులతో కలిసి చేతిలో పతకాలతో వీరంతా హరిద్వార్ చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా... ప్రపంచ చాంపియన్షి ప్లో పతకం సాధించిన వినేశ్ ఫొగాట్, సంగీత, వీరి బంధుమిత్రులు, అభిమానులు హర్ కి పౌరి వద్దకు చేరుకున్నారు. బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాల్సిందేనని నిరసన చేపట్టారు. రెజ్లర్లు పతకాలను చేత పట్టుకొని గంగపాలు చేయాలనుకున్నారు. పలువురు బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని పవిత్రమైన గంగానదిలో ఇలాంటి చర్యలను అనుమతించమని వాదించారు. గంటా 45 నిమిషాల పాటు ఈ హైడ్రామా నడిచింది. రెజ్లర్ల సన్నిహితులు తీవ్రమైన నిర్ణయం వద్దని వారించడంతో చివరకు వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఐదు రోజుల్లోగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. -
Wrestlers Protest: రైతు నేతల విజ్ఞప్తి.. పతకాలు గంగానదిలో వేయడం వాయిదా..
న్యూఢిల్లీ: హరిద్వార్ వద్ద గంగానదిలో పతకాలను విసిరేస్తామన్న రెజ్లర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. రైతు నేతల విజ్ఞప్తితో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి అయిదు రోజుల గడువిస్తూ అల్టీమేటం జారీ చేశారు. అయిదు రోజుల్లో బ్రిజ్ భూషన్ సింగ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మళ్లీ తిరిగి వస్తామని తెలిపారు. రెజ్లర్ల పతకాలను రైతు నేత నరేష్ తన వెంట తీసుకెళ్లారు. కాగా బీజేపీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరు నెలల నుంచి ఢిల్లీలో నిరసన చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తాము కష్టపడి గెలుచుకున్న మెడల్స్ను పవిత్ర గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు విసిరేస్తామని ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేస్తామని తెలిపారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు.కాబట్టి ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో నిరసనగా తమ పతకాలను నదిలో వేయడానికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని గంగా నది తీరానికి చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు అక్కడే ధర్నాకు దిగారు. అయితే రెజ్లర్లు పతకాలను గంగా నదిలోకి విసిరేందుకు సిద్ధమవుతున్న వేళ రైతు నాయకుడు నరేష్ టికాయత్ హరిద్వార్ హర్ కి పౌరీకి చేరుకున్నారు. ఆయన జోక్యం చేసుకొని పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయొద్దని నిరసన తెలుపుతున్న మల్లయోధులను కోరారు. దీంతో తమ నిర్ణయాన్ని రెజ్లర్లు వాయిదా వేసుకున్నారు. హరిద్వార్లోని హర్ కీ పౌరి నుంచి వెనక్కి బయల్దేరారు. కాగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. చదవండి: మణిపూర్లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
మెడల్స్ ను గంగ లో విసరనున్న రేస్లర్స్ ..
-
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్సింగ్పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
భారత్ తీన్మార్ పంచ్...
విశ్వ వేదికపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ను చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా మూడు పతకాలతో తిరిగి రానున్నారు. పతక వర్ణాలు (స్వర్ణ, రజత, కాంస్య) ఇంకా ఖరారు కాకపోయినా పతకాలు మాత్రం ఖాయమయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా బాక్సర్లు దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించి సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్లో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజతాల కోసం పోటీపడతారు. ఓడితే మాత్రం కాంస్య పతకాలతో తమ పోరాటాన్ని ముగిస్తారు. తాస్కాంట్: ప్రత్యర్థి ఎవరైనా తమ పంచ్లతో అదరగొడుతున్న భారత బాక్సర్లు ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపక్ 5–0తో నుర్జిగిత్ దిషిబయేవ్ (కిర్గిస్తాన్)పై, హుసాముద్దీన్ 4–3తో దియాజ్ ఇబానెజ్ (బల్గేరియా)పై, నిశాంత్ దేవ్ 5–0తో జార్జి టెరీ క్యూలార్ (క్యూబా)పై గెలుపొందారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; అస్లాన్బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. ప్రపంచ పురుషుల బాక్సింగ్లో పవర్ హౌస్గా పేరున్న క్యూబా దేశ బాక్సర్పై భారత బాక్సర్ విజయం సాధిస్తాడని ఊహకందని విషయం. కానీ పట్టుదలతో పోరాడితే క్యూబా బాక్సర్ను కూడా ఓడించే సత్తా భారత బాక్సర్లలో ఉందని బుధవారం నిశాంత్ దేవ్ నిరూపించాడు. జార్జి క్యూలార్తో జరిగిన బౌట్లో నిశాంత్ ఆద్యంతం దూకుడుగా ఆడి పైచేయి సాధించాడు. గత ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన నిశాంత్ ఈసారి సెమీఫైనల్కు చేరి భారత్కు మూడో పతకాన్ని ఖాయం చేశాడు. 10 ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాలు. అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించగా... విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ (2017), మనీశ్ కౌశిక్ (2019), ఆకాశ్ (2021) కాంస్య పతకాలు గెలిచారు. తాజా ఈవెంట్లో హుసాముద్దీన్, దీపక్, నిశాంత్ దేవ్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. -
పట్టాభిషేకం వేడుకకు గుర్తుగా..రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు
లండన్లోని వెస్ట్మినిస్టర్లో శనివారం కింగ్ చార్లెస్ 3కి పట్టాభిషేకం అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్ రాజు దాదాపు రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ బహుమతులను పట్టాభిషేక పతకాల రూపంలో అందించనున్నారు. వీటిని యూకే ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ పట్టాభిషేకంలో సహకరించి, విజయవంతంగా పూర్తి అయ్యేలా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నట్లు బ్రిటన్ పేర్కొంది. తమ దేశంలో అత్యవసర సమయంలో సేవలందించే.. ఆర్మీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి అందజేయనున్నట్లు భారత మూలాలు ఉన్న యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ అన్నారు. తమ కొత్త రాజు పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా..తమ దేశంలోని అత్యవసర సేవలందించే సిబ్బంది పాత్రను గుర్తించడమే గాక ఆ వేడుకకు గుర్తుగా ఈ కృతజ్ఞతా పతకాలను అందజేస్తున్నట్లు బ్రేవర్మాన్ అన్నారు. ఈ మేరకు బ్రేవర్మాన్ మాట్లాడుతూ..సాయుధ దళాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, నిస్వార్థ సేవ లేకుండా ఈ పట్టాభిషేకం విజయవంతం కాదని అన్నారు. ఈ పతకం వారి సేవకు, కృషికి గుర్తింపుగా దేశం తరుఫున కృతజ్ఞతా బహుమతి అని అన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి అందజేస్తారని చెప్పారు. ఈ పతకం ముందు భాగంలో రాజు, రాణి డబుల్ పోర్ట్రెయిట్ ఉంటుంది. దీన్ని మార్టిన్ జెన్నింగ్స్ రూపొందించారు. ఈ పతకాలను బర్మింగ్హామ్లోని వోర్సెస్టర్షైర్ మెడల్ సర్వీస్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ పతకం మా సాయుధ దళాలు, చక్రవర్తి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి అద్దంపడుతుందన్నారు బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్. పట్టాభిషేకమహోత్సవ పతకాల సంప్రదాయం 1603 లో కింగ్జేమ్స్ హయాం నాటిదని చెప్పారు. ఈ వేడుకలో మొత్తం 4 లక్షల మందికి ఈ పట్టాభిషేక పతకాలు అందుకుంటారని బెన్ వాలెస్ చెప్పారు. ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల నుంచి అతిరథమహారథులకే గాక నిస్వార్థపూరితంగా పనిచేసి ఆయా విభాగాల్లో పేరుగాంచిన ప్రముఖులకు సైతం బ్రిటన్ ఆహ్వానం పలికింది. (చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ) -
Vinesh Phogat: ఇలాంటివి చూసేందుకే పతకాలు సాధించామా?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసను ఆపించి, తరలించేందుకు భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసులు జంతర్మంతర్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో వర్షం కారణంగా వారి పరుపులు తడిచిపోవడంతో బయటనుంచి మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు యత్నించగా అందుకు పోలీసులు అంగీకరించలేదు. మేము నేరస్తులం కాదు.. ఈక్రమంలోనే బృందంలోని కొంతమంది సభ్యులను ఢిల్లీ పోలీసులు దూషించారు. దీంతో పోలీసులు, రెజ్లర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ మేరకు రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇలాంటి రోజులు చూడటానికేనా! తాము పతకాలు సాధించింది? అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా వినేష్ ఉద్వేగంగా మాట్లాడుతూ.. మాపై ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తామేమి నేరస్తులం కాదంటూ మండిపడ్డారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు లేకపోవడంపై నిలదీశారు. ఓ పోలీసు అధికారి తాగిన మద్యం మత్తులో దుర్భాషలాడి, తమపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. Watch | "Did We Win Medals To See Such Days?" Wrestler Vinesh Phogat Breaks Down pic.twitter.com/NXOrAZwfPA — NDTV (@ndtv) May 3, 2023 ఆప్ నేత అరెస్టు! ఈ క్రమంలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో నాలుగు పతకాలు గెలుచుకున్న బజరంగ్ పునియా ఉద్వేగభరితంగా తన పతకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాని అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారతి మంచాలు తీసుకొచ్చేందుకు యత్నించారని, దూకుడుగా ప్రవర్తించారని అందుకే ఆయనతోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జంతర్ మంతర్ ప్రాంతాన్ని సీల్ చేశారు. రెజ్లర్లను పరామర్శించేందుకు వస్తున్న ప్రతిపక్షాల హాజరును నమోదు చేసి మరీ నిరసన ప్రాంతానికి అనుమతించకుండా, రెజ్లర్లను కలవకుండా అడ్డుకున్నారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఏడుగురు మహిళ రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తదనంతరం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: కోపంలో నోరు జారిన పోలీసు..సెకనులో టెర్రరిస్టుగా మారుస్తా! అని బెదిరింపులు) #WATCH | Delhi: A scuffle breaks out between protesting wrestlers and Delhi Police at Jantar Mantar pic.twitter.com/gzPJiPYuUU — ANI (@ANI) May 3, 2023 -
‘పరుగుల అవ్వ’.. వయసు 95.. పోలాండ్లో పరుగుకు రెడీ
భగవాని దేవిని అందరూ ‘పరుగుల అవ్వ’ అంటారు. వయసు 95కు చేరినా ఆమె ఉత్సాహంగా పరుగు తీస్తోంది.. మెడల్స్ సాధిస్తోంది. 35 ఏళ్లు దాటిన వారి కోసం నిర్వహించే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్’ కోసం ఇప్పుడు ఆమె పోలాండ్లో ఉంది. ‘గోల్డ్ మెడల్ తెస్తాను ఉండండి’ అంటోంది. వంద మీటర్ల దూరాన్ని మీరు ఎన్ని సెకన్లలో పరిగెడతారు? హుసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో పరిగెత్తాడు. టీనేజ్ పిల్లలు చురుగ్గా ఉంటే పదిహేను సెకన్లలో పరిగెడతారు. ఇరవై ఏళ్లు దాటిన వారు ఇరవై సెకన్లు తీసుకోక తప్పదు. మరి 90 దాటిన వారు? ఫిన్లాండ్లో గత ఏడాది జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో భగవాని దేవి (94) వంద మీటర్లను కేవలం 24.74 సెకన్లలో పరిగెత్తింది. అది మన నేషనల్ రికార్డ్. ఆ రికార్డ్తో గోల్డ్ మెడల్ సాధించింది భగవాని దేవి. ఇప్పుడు ఆమెకు తొంభై ఐదు ఏళ్లు. మార్చి 25 నుంచి 31 వరకు పోలాండ్లోని టోరౌలో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు విమానంలో బయలుదేరింది. పోయిన సంవత్సరం ఫిన్లాండ్కు పది గంటలు ప్రయాణించడం ఆమెకు కష్టమైంది. అందుకే ఈసారి స్పాన్సరర్లు ఆమెకు బిజినెస్ క్లాస్ బుక్ చేసి మరీ పంపించారు. ఆమె మెడల్ కొట్టకుండా వెనక్కు రాదని వాళ్ల గట్టి నమ్మకం. హర్యానా దాదీ భగవాని దేవిది హర్యానాలోని ఖేడ్కా అనే గ్రామం. పన్నెండు ఏళ్లకు పెళ్లయితే ముప్పై ఏళ్లు వచ్చేసరికల్లా వితంతువు అయ్యింది. పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన ఒక్క కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా సేద్యం చేసి కొడుకును పెంచింది భగవాని దేవి. చదువుకున్న కొడుకు ఢిల్లి మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా మారడంతో ఢిల్లీ చేరుకుంది. ఆ తర్వాత నానమ్మ (దాదీ) అయ్యింది. ముగ్గురు మనవల్లో వికాస్ డాగర్ క్రీడల్లో గుర్తింపు సంపాదించాడు. అతడే తన దాదీలో ఆటగత్తె ఉందని గ్రహించాడు. ‘ఒకరోజు నేను షాట్ పుట్ ఇంటికి తెచ్చాను. నువ్వు విసురుతావా నానమ్మా అని అడిగితే మొహమాట పడింది. కాని మరుసటి రోజు ఉదయం ఆమె దానిని విసరిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని తెలిపాడు వికాస్. ఆ తర్వాత అతడే తన దాదీకి కోచ్గా మారి ఆమెను అథ్లెట్ను చేశాడు. ‘చిన్నప్పుడు కబడ్డీ ఆడటం తప్ప నాకు వేరే ఏం గుర్తు లేదు’ అని నవ్వుతుంది భగవాని దేవి. బైపాస్ ఆపరేషన్ జరిగినా భగవాని దేవికి 2007లో బైపాస్ ఆపరేషన్ జరిగింది. అయినా సరే ఆమె పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంది. పరిగెడితే అలసిపోదు. వేరే ఏ ఇబ్బందులు లేవు. అందువల్ల త్వరలోనే ఆమె వయోజనులకు పెట్టే పోటీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. కాని గత ఏడాది ఫిన్లాండ్లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది. ‘నాకు ఏదైనా అవుతుందని భయపడవద్దు. దేశం కోసం పరుగెట్టి ప్రాణం విడిచినా నాకు సంతోషమే’ అని చెప్పి బయలుదేరిందామె పోయినసారి. ఈసారి కూడా ఆ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సెంచరీ వయసులోనూ పరిగెడతాను’ అంటుంది భగవాని దేవి. -
జాతీయ స్కూల్స్ చెస్లో తెలంగాణకు ఏడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. అండర్–15 బాలుర విభాగంలో వేముల అద్వైత్ విఘ్నేశ్ (7.5 పాయింట్లు)... అండర్–15 బాలికల విభాగంలో యశ్వి జైన్ (7 పాయింట్లు)... అండర్–13 బాలుర విభాగంలో చల్లా సహర్ష (8 పాయింట్లు)... అండర్–11 బాలికల విభాగంలో మోదిపల్లి దీక్షిత (7.5 పాయింట్లు)... అండర్–9 బాలికల విభాగంలో పుంగవనం సంహిత (8 పాయింట్లు) పసిడి పతకాలు గెలిచారు. అండర్–7 బాలుర విభాగంలో ఆదుళ్ల దివిత్ రెడ్డి (7.5 పాయింట్లు) కాంస్యం, అండర్–7 బాలికల విభాగంలో బోగా వంశిక (7 పాయింట్లు) రజతం సాధించారు. పతకాలు సాధించిన వారికి నెలనెలా భారత గ్రాండ్మాస్టర్ ఎం.శ్యామ్సుందర్తో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ ప్రకటించారు. -
భారత బాక్సర్లకు మరో నాలుగు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాలపైనే పంచ్ విసురుతున్నారు. స్పెయిన్లో జరుగుతున్న ఈ ఈవెంట్ లో నలుగురు మహిళా బాక్సర్లు ముస్కాన్ (75 కేజీలు), తమన్నా (50 కేజీలు), కీర్తి (ప్లస్ 81 కేజీలు), దేవిక (52 కేజీలు) పతకాలు ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో తమన్నా 5–0తో జుని తొనెగవా (జపాన్)పై, దేవిక 5–0తో అస్యా (జర్మనీ)పై... అజింబై (మంగోలియా)పై ముస్కా న్, బొటికా (రొమేనియా)పై కీర్తి గెలిచారు. చదవండి: భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి! అద్భుతాలు చేస్తాడు -
Commonwealth Games 2022: విజేతలకు ఐఓఏ నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్హామ్లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది. -
పతకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే..!
బర్మింగ్హామ్లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవం సోమవారంతో ముగిసింది. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి 66 పతకాలు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. అయితే గోల్డ్కోస్ట్ గేమ్స్లో షూటింగ్ క్రీడాంశంలో భారత్ ఏకంగా 16 పతకాలు సొంతం చేసుకుంది. బర్మింగ్హామ్లో షూటింగ్ క్రీడాంశాన్ని నిర్వహించలేదు. ఫలితంగా భారత్ పతకాల ర్యాంక్లో ఒక స్థానం పడిపోయింది. ఒకవేళ షూటింగ్ కూడా బర్మింగ్హామ్ గేమ్స్లో ఉండి ఉంటే భారత్ పతకాల సంఖ్యలోనూ, తుది ర్యాంక్లోనూ మరింత మెరుగయ్యేది. -
CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ ఖాతాలో 14 పతకాలు చేరగా, మరో 3 పతకాలు జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల ఆరో రోజు లవ్ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్), లవ్ప్రీత్ సింగ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మిగతా ఐదు పతకాల్లో జూడోలో 2 (సుశీలా దేవీ సిల్వర్, విజయ్ కుమార్ యాదవ్ బ్రాంజ్), లాన్స్ బౌల్స్లో ఒకటి (గోల్డ్), టేబుల్ టెన్నిస్లో ఒకటి (గోల్డ్), బ్యాడ్మింటన్లో ఒకటి (సిల్వర్) గెలిచారు. ఇక పతకాల పట్టిక విషయానికొస్తే.. 5 స్వర్ణాలు , 5 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 106 పతకాలతో (42 గోల్డ్, 32 సిల్వర్, 32 బ్రాంజ్) ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 86 (31 గోల్డ్, 34 సిల్వర్, 21 బ్రాంజ్), న్యూజిలాండ్ 26 (13 గోల్డ్, 7 సిల్వర్, 6 బ్రాంజ్), కెనడా 46 (11 గోల్డ్, 16 సిల్వర్, 19 బ్రాంజ్), సౌతాఫ్రికా 16 (6 గోల్డ్, 5 సిల్వర్, 5 బ్రాంజ్) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. చదవండి: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం -
తెలంగాణ అథ్లెట్లకు 8 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్లు మెరిశారు. గుజరాత్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో దివ్య బొల్లారెడ్డి 400, 800 మీటర్ల కేటగిరీల్లో రజత పతకాలు గెలిచింది. దివ్య 400 మీటర్ల దూరాన్ని 1ని:14.91 సెకన్లలో... 800 మీటర్ల దూరాన్ని 3ని:02.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల ప్లస్ 35 వయో విభాగంలో అష్లి గోపీ 110 మీటర్ల హర్డిల్స్లో రజతం, ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 110 మీటర్ల హర్డిల్స్ రేసును గోపీ 21.02 సెకన్లలో ముగించి రెండో స్థానంలో... ట్రిపుల్ జంప్లో 9.88 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో కృతి కడాకియా 1500 మీటర్ల రేసును 6ని:51.56 సెకన్లలో ముగించి కాంస్యం గెల్చుకుంది. పురుషుల ప్లస్ 60 వయో విభా గం పోల్వాల్ట్లో బండారి భాస్కర్ రావు 1.60 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్యం... హైజంప్లో 1.05 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజతం నెగ్గాడు. పురుషుల ప్లస్ 60 వయో విభాగం హ్యామర్ త్రోలో మనోహర్ రావు (27.58 మీటర్లు) స్వర్ణం గెలిచాడు. -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏపీ క్రీడాకారుల సత్తా
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 15వ స్థానంలో నిలిచింది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హరియాణాలోని పంచ్కులలో అండర్–18 బాలబాలికల ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు. చివరిరోజు సోమవారం బాక్సర్ అంజనీకుమార్ (63.5–67 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో) రజత పతకంతో మెరిశాడు. ఫైనల్ పోరులో చండీగఢ్ క్రీడాకారుడు అచల్వీర్తో పోటీపడి 2–3తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రాష్ట్రం తరఫున మొత్తం 161 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్లో 6 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషం. ఈ సందర్భంగా క్రీడాకారులను పర్యాటక, సాంస్కృతిక, క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి అభినందించారు. విజేతలు వీరే.. వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఎస్.పల్లవి (స్వర్ణం), సీహెచ్.శ్రీలక్ష్మి (స్వర్ణం), ఎస్కే లాల్ భషీర్ (రజతం), పి.ధాత్రి (రజతం), డీజీ వీరేష్ (రజతం), ఆర్.గాయత్రి (కాంస్యం), అథ్లెటిక్స్ విభాగాల్లో కుంజా రజిత (స్వర్ణం), ఎం.శిరీష (కాంస్యం), కబడ్డీలో మహిళల జట్టు కాంస్యం, ఆర్చరీలో కుండేరు వెంకటాద్రి (స్వర్ణం), మాదాల సూర్యహంస (కాంస్యం), ఘాట్కాలో బాలురు జట్టు కాంస్యం, బాక్సింగ్లో అంజనీకుమార్ (రజతం). -
భారత ఆర్చర్లకు ఆరు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత ఆర్చర్లకు రెండు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు ఖాయమయ్యాయి. ఇరాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే టీమ్ విభాగంలో భారత్కు ఆరు పతకాలు లభించాయి. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత్కు చెందిన ప్రథమేశ్, రిషభ్ యాదవ్ ఫైనల్ చేరగా... సమాధాన్ జావ్కర్ కాంస్యం కోసం పోటీపడనున్నాడు. సమాధాన్ గెలిస్తే భారత్ ఈ విభాగంలో క్లీన్స్వీప్ చేస్తుంది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు పర్ణీత్ కౌర్, సాక్షి చౌదరీ ఫైనల్లోకి ప్రవేశించారు. -
2022 Thomas-Uber Cup: ఈసారైనా పతకం వచ్చేనా!
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పతకాలే లక్ష్యంగా భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్ల్లో జర్మనీతో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మెగా ఈవెంట్లో అందరి కళ్లు థామస్ కప్లో పోటీపడనున్న భారత పురుషుల జట్టుపైనే ఉన్నాయి. థామస్ కప్ చరిత్రలో భారత్కు ఇప్పటివరకు ఒక్కసారీ పతకం రాలేదు. మరోవైపు మహిళల ఈవెంట్ ఉబెర్ కప్లో భారత్ రెండుసార్లు (2014, 2016) సెమీఫైనల్ చేరి కాంస్య పతకాలు సాధించింది. లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్... సాత్విక్–చిరాగ్ శెట్టిలతో భారత పురుషుల జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ ‘సి’లో జర్మనీ, చైనీస్ తైపీ, కెనడా జట్లతో భారత్ పోటీపడనుంది. ఈసారి భారత మహిళల జట్టులో పీవీ సింధు మినహా మిగతా వారందరూ అంతర్జాతీయస్థాయిలో అంతగా అనుభవంలేని వారే ఉన్నారు. గ్రూప్ ‘డి’లో భారత్తోపాటు కొరియా, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. భారత్కు విజయం దక్కా లంటే సింధుతోపాటు ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ సింగిల్స్లో రాణించాల్సి ఉంటుంది. -
చేయందిస్తే..చరిత్ర సృష్టిస్తా..
సాక్షి, హైదరాబాద్: శరీరం సహకరించకున్నా... అలుపెరుగకుండా విజయాలు సాధిస్తూనే ఉన్న ఆ క్రీడాకారిణి... ఆర్థిక పరిస్థితి సహకరించక చేయూత కోసం ఎదురు చూస్తోంది. కాస్తంత చేయి అందిస్తే...పారా అథ్లెట్గా చరిత్ర తిరగరాస్తానంటోంది. నగరంలోని సరూర్నగర్కు చెందిన కుడుముల లోకేశ్వరి (26) పారా క్రీడాకారిణి. 10 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా కుడి వైపు శరీరం పనిచేయడం మానేసింది. అయినా చిన్నప్పటి నుంచి క్రీడల పైన తనకున్న మక్కువే ఆమెను పారా క్రీడాకారిణిగా మార్చింది. 2019 నుంచి నిరంతర సాధన చేస్తున్న లోకేశ్వరి ఈ ఏడాది మార్చి 27న భువనేశ్వర్ కళింగా స్టేడియంలో జరిగిన 20వ నేషనల్ పారా ఆథ్లెటిక్ చాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. గత ఏడాది మార్చిలో బెంగళూర్ కంఠీరవా స్టేడియంలో జరిగిన 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్లో షాట్ ఫుట్, డిస్కస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు సాధించింది. డిసెంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూర్లో జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ పారా ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ షాట్ ఫుట్లో కూడా సిల్వర్ మెడల్ సాధించింది. 3 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. త్వరలో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్ కోసం సాధన చేస్తుంది. ఇందులో పాల్గొనడానికి అర్హత సాధించాలంటే జూన్ నెలలో తునిషియా (నార్త్ ఆఫ్రికా) వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలి. అయితే ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని లోకేశ్వరి తెలిపింది. అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం అనుకూలించడం లేదు. పదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వీపర్గా పని చేసే తల్లి జీతంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలిపింది. అప్పులు చేస్తూ సాధన కొనసాగిస్తున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. దాతలు సహకరిస్తే దేశానికి పతకాలు సాధించగలననే ఆత్మ విశ్వాసం తనకుందని అంటోంది. సహాయం చేయాలనుకునే వారు ఫోన్ నెం 6304394851 లో సంప్రదించవచ్చు. (చదవండి: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు) -
డబుల్ ధమాకా..భారత్ ఖాతాలో రెండు పతకాలు..!
న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు ప్రపంచ జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. తొలి రోజు మహిళల 45 కేజీల విభాగంలో హర్షద శరద్ గరుడ్ స్వర్ణ పతకం నెగ్గగా... రెండో రోజు మహిళల 49 కేజీల విభాగంలోజ్ఞానేశ్వరి యాదవ్ రజతం... వి.రితిక కాంస్య పతకం సాధించారు. గ్రీస్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో చత్తీస్గఢ్కు చెందిన 19 ఏళ్ల జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్లో 73+క్లీన్ అండ్ జెర్క్లో 83) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. 18 ఏళ్ల రితిక 150 కేజీలు (స్నాచ్లో 69+క్లీన్ అండ్ జెర్క్లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఇండోనేసియాకు చెందిన విండీ కంతిక ఐసా 185 కేజీలు (స్నాచ్లో 83+క్లీన్ అండ్ జెర్క్లో 102) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. చైనా, ఉత్తర కొరియా, థాయ్లాండ్, రొమేనియా, బల్గేరియా తదితర దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉండగా... ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాను, రష్యాకు సహచరిస్తున్న బెలారస్ను ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగకుండా అంతర్జా తీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య నిషేధం విధించింది. గత జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో రష్యా ఏకంగా తొమ్మిది పతకాలు సాధించింది. -
విశిష్ట సేవలకు..రాష్ట్రపతి పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి అమరావతి/నెట్వర్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్రప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఏపీకి ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం, పలు రాష్ట్రపతి పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం లభించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి కూడా పలు పతకాలు లభించాయి. పోలీసు ప్రతిభా పతకాలు 1. ఎస్.వి.రాజశేఖర్బాబు, డీఐజీ (లా అండ్ ఆర్డర్) 2. ఎం.రవీంద్రనాథ్బాబు, ఎస్పీ తూర్పు గోదావరి జిల్లా 3. శ్రీరాంబాబు వాక, డీఎస్పీ, సీఐడీ, నెల్లూరు 4. విజయపాల్ కైలే, ఏసీపీ, ఈస్ట్ జోన్, విజయవాడ 5. విజయ్కుమార్ బుల, అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్, విశాఖపట్టణం 6. సుబ్రహ్మణ్యం కొలగాని, అదనపు డీసీపీ, విశాఖపట్టణం 7. శ్రీనివాసరావు చుండూరు, డీఎస్పీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు 8. వీరరాఘవరెడ్డి, డీఎస్పీ, అనంతపురం 9. రవీందర్రెడ్డి ఎర్రమోరుసు, డీఎస్పీ, కర్నూలు 10. కృష్ణారావు గొల్ల, ఎస్ఐ, సీసీఎస్, విజయవాడ 11. సత్తారు సింహాచలం, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ, కాకినాడ 12. నరేంద్రకుమార్ తుమాటి, ఏఎస్ఐ, గుంటూరు అర్బన్ 13. పేరూరు భాస్కర్, ఏఎస్ఐ, కడప 14. నాగశ్రీనివాస్, ఏఎస్ఐ, కొవ్వూరు రూరల్ 15. వీర ఆంజనేయులు సింగంశెట్టి, ఏఎస్ఐ, ఏసీబీ, విజయవాడ రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం భావనా సక్సేనా, రెసిడెంట్ కమిషనర్, ఏపీ భవన్, న్యూఢిల్లీ కేంద్ర జీఎస్టీ విభాగంలో.. 1. డబ్లు్య.డి.చంద్రశేఖర్, అదనపు సహాయ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం, విశాఖపట్నం 2. కర్రి వెంకటమోహన్, అదనపు సహాయ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సీబీఐలో.. 1. సుబ్రహ్మణ్యం దేవేంద్రన్, అదనపు న్యాయసలహాదారు 2. కె.వి.జగన్నాథరెడ్డి, హెడ్ కానిస్టేబుల్, ఏసీబీ రైల్వే పోలీసుల్లో.. మస్తాన్వలి షేక్, ఏఎస్ఐ, ఆర్పీఎఫ్, తాడేపల్లి జైళ్లశాఖలో 1. అయినపర్తి సత్యనారాయణ, హెడ్ వార్డర్, ఆంధ్రప్రదేశ్ 2. పోచ వరుణారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ 3. పెదపూడి శ్రీరామచంద్రరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, విశాఖపట్నం కేంద్రకారాగారం 4. మహ్మద్ షఫీ ఉర్ రెహమాన్, డిప్యూటీ సూపరింటెండెంట్ 5. సముడు చంద్రమోహన్, హెడ్ వార్డర్ 6. హంసపాల్, సూపరింటెండెంట్, కృష్ణాజిల్లా జైలు జీవన్ రక్షాపథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్–2021 1. జి.సంజయ్కుమార్ 2. టి.వెంకటసుబ్బయ్య 3. నిర్జోగి గణేశ్కుమార్ -
ఇద్దరు పోలీస్ అధికారులకు రాష్ట్రపతి సేవా పతకాలు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రతి ఏటా పోలీస్ శాఖలో పనితీరు ఆధారంగా కేంద్రం ప్రకటించే పతకాలలో రాష్ట్రానికి చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్తో పాటు మెరిటోరియస్ సేవా పతకాలు లభించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ పతకాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు అధికారులకు పీపీఎమ్ (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్) దక్కగా, మరో 11 మంది అధికారులు, సిబ్బందికి మెరిటోరియస్ సర్వీస్ పోలీస్ మెడల్ దక్కాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కేంద్ర సాయుధ బలగాలు, ఇతర విభాగాల్లోని అధికారులు సిబ్బందికి కూడా పలు పతకాలు దక్కాయి. రాష్ట్ర పోలీస్ శాఖలోని స్పెషల్ పోలీస్ బెటాలియన్లో ఇబ్రహీంపట్నం కమాండెంట్గా పనిచేస్తున్న చాకో సన్నీతో పాటు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ జి.శ్రీనివాసరాజు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ను దక్కించుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కింద సీనియర్ ఐపీఎస్, ఐజీ హోదాలో మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న షానావాజ్ ఖాసీంతో పాటు సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీగా పనిచేస్తున్న సంక్రాంతి రవికుమార్, ములుగు ఓఎస్డీ పుల్ల శోభన్కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ రాయప్పగారి సుదర్శన్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ పోలగాని శ్రీనివాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీఎస్పీ జి.శ్రీనివాసులు, వనపర్తి డీఎస్పీ కేఎమ్ కిరణ్కుమార్, ఇంటెలిజెన్స్ ఆర్ఎస్ఐ మహ్మద్ యాకుబ్ ఖాన్, డిచ్పల్లి బెటాలియన్ ఏఆర్ఎస్ఐ బండి సత్యం, గ్రేహౌండ్స్ ఏఆర్ఎస్ఐ మెట్టు వెంకటరమణరెడ్డి, కొండాపూర్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ఇలపంద కోటేశ్వర్రావుకు పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ కింద పోలీస్ పతకా>లు దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, ఏపీకి చెందిన భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. వివిధ విభాగాల్లో వీరికి కూడా.. ఇక మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న ఉడుగు నరసింహ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమాండెంట్ భూపేంద్ర కుమార్, బసుమాతరీ అజయ్కి పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. జాతీయ పరిశ్రమల భద్రతా అకాడమీ (సీఐఎస్ఎఫ్)హైదరాబాద్లో కమాండెంట్గా పనిచేస్తున్న అనూప్ కుమార్, రంగారెడ్డి ఏఎస్జీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ కూచిభొట్ల శారద, రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గుండప్పకు పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. సీఆర్పీఎఫ్ వరంగల్ బెటాలియన్ సబ్ఇన్స్పెక్టర్ బాబులాల్ కూడా పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ కోటాలో పతకం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ళ శాఖలో పనిచేస్తున్న పంత్ (చీఫ్ హెడ్ వార్డర్), సీఎన్ గంట రత్నారావు(హెడ్ వార్డర్), బి.నర్సింగ్ రావు(హెడ్ వార్డర్) ఖైదీల ప్రవర్తన దిద్దుబాటుకుగాను రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. అగ్నిమాపక దళంలో కాళహస్తి వెంకట కృష్ణ కుమార్ (జిల్లా ఫైర్ ఆఫీసర్)కు రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ విశిష్ట సేవా మెడల్ దక్కింది. తాడేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మస్తాన్ వలీ షేక్కు పోలీసు ప్రతిభా పురస్కారం దక్కింది. -
సాయి సందీప్ పరుగు తీస్తే పతకమే!
సబ్బవరం (పెందుర్తి ): మండలంలోని సబ్బవరానికి చెందిన యువ క్రీడాకారుడు సాయి సందీప్ అథ్లెటిక్స్లో విశేషంగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్లో రాణించాలని కలలుగన్నాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు పరుగులు తీస్తున్నాడు. సరైన వసతులు, శిక్షణ అందించే కోచ్లు లేకపోయినా ఏకలవ్యుడి మాదిరిగా పరుగులో మేటిగా నిలుస్తున్నాడు సాయి సందీప్. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్లో 400 మీటర్ల రిలేలో స్వర్ణం, 400 మీటర్ల పరుగు పందెం వ్యక్తిగత విభాగంలోనూ వెండి పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు సాయి సందీప్ ఎంపికయ్యాడు. ఈ పోటీలను ఈ నెల 10,11,12వ తేదీలలో ఏయూ బోర్డు ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 57 అనుబంధ కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఏయూలో నిర్వహించిన పోటీలో వెండి పతకం అందుకున్న సాయి సందీప్ కుటుంబ నేపథ్యం.. వాండ్రాసి సాయి సంందీప్ తల్లి సంపత వెంకటలక్ష్మి సచివాలయ ఆరోగ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి శ్రీనివాసరావు మార్కెటింగ్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. తమ్ముడు రోహిత్ విశాఖలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు 4వ తరగతి నుంచి... 4వ తరగతి నుంచి కడప జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. ఈ స్కూల్లో ప్రవేశానికి నిర్వహించిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభతో తన స్పోర్ట్స్ కెరియర్కు గట్టి పునాది వేసుకున్నాడు. పరుగు పందెం, దాంతో పాటు హర్డిల్స్లో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అక్కడున్నవారు ఆ దిశగా సాయి సందీప్ను ప్రోత్సహించారు. ► 4వ తరగతి నుంచి పదో తరగతి వరకూ స్పోర్ట్స్ స్కూల్లో చదివి మొత్తం రెండు జాతీయ స్థాయిలో వెండి, రజిత పతకాలతో పాటు 18 రాష్ట్రస్థాయి బంగారు పతకాలను సాధించాడు. ► ప్రస్తుతం విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నాటి టీడీపీ నగదు ప్రోత్సాహం ఇంకా అందలేదు ప్రభుత్వం, స్పాన్సర్స్ నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే మరింత రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా నాలో ఉందని సాయి సందీప్ చెబుతున్నాడు. ప్రభుత్వంలో గుంటూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించానని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ క్రీడా పురస్కారం అందజేశారన్నారు. దీంతో ప్రోత్సాహకంగా ప్రశంసాపత్రం, మెడల్తో పాటు ట్యాబ్, రూ.30 నగదు ప్రకటించారన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి లభించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతా సబ్బవరంలో తగిన క్రీడా సౌకర్యాలు, వసతులు లేవు. 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, అనుభవం ఉన్న కోచ్ దగ్గర శిక్షణ పొందినట్లయితే మరిన్ని పతకాలు సాధించి, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించి మరిన్ని పతకాలు సాధిస్తా. కోవిడ్ నేపథ్యంలో జాతీయ స్థాయి క్రీడలకు అంతరాయం ఏర్పడిందని, వచ్చే ఏడాది నిర్వహించనున్న పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తానని సందీప్ చెబుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో డైట్, పౌష్టి కాహరం తీసుకోవడం, స్పోర్ట్స్ కిట్ తదితర వాటి కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాడు. సాధించిన వివిధ పతకాలతో సాయి సందీప్ కోర్టులో పరుగు తీస్తూ... పరుగు పందెంలో సాయి సందీప్ -
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ ఓ ట్వీట్ చేశారు. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. మాధవన్, వేదాంత్లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ ‘గుడ్ జాబ్ వేదాంత్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ఈ పోటీలో వేదాంత్ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు ఇదిలా ఉంటే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. Good job Vedant. We are proud of you and your upbringing. 🙏 pic.twitter.com/6SNVJI51w1 — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2021 -
పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు పథకాలు
-
భారత్ ఖాతాలో మరో బంగారు పతకం..
-
5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తాం..
న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరగనున్న పారా ఒలింపిక్స్లో భారత్ బృందం 5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తుందని భారత పారా ఒలింపిక్స్ కమిటీ సెక్రటరీ జనరల్ గరుశరణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత భారత అథ్లెట్ల బృందం అత్యుత్తమమైందని, పారా ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఎన్నడూ సాధించని పతకాలు ఈ పారా ఒలింపిక్స్లో సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో పారా ఒలింపిక్స్ తర్వాత అథ్లెట్లంతా అంతర్జాతీయ టోర్నీల్లో రాణించారని, త్వరలో ప్రారంభంకాబోయే పారా ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు వారంతా ఉవ్విళ్లూరుతున్నారని, ఇదే తమ ధీమాకు కారణమని వెల్లడించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత్ కచ్చితంగా పతకాలు సాధిస్తుందని, పారా హైజంప్లో భారత పతాకధారి మరియప్పన్ తంగవేలు మరోసారి పసిడి ముద్దాడుతాడని గురుశరణ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, టోక్యో పారా ఒలింపిక్స్లో భారత్ 54 మందితో కూడిన జంబో బృందాన్ని బరిలోకి దించుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కెనోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో తదితర క్రీడల్లో వీరంతా పోటీ పడనున్నారు. భారత్ ఇప్పటి వరకు 11 పారా ఒలింపిక్స్ క్రీడల్లో కేవలం 12 పతకాలే సాధించగా, గడిచిన 2016 రియో పారా ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు, ఓ రజతం, మరో కాంస్యం సహా మొత్తం నాలుగు పతకాలు గెలవడం గమనార్హం. చదవండి: కివీస్ క్రికెటర్లను భయపెడుతున్న తాలిబన్లు.. పాక్ పర్యటనపై నీలినీడలు -
27 మందికి పోలీస్ పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సేవా పతకాలు తెలంగాణకు చెందిన 27 మంది పోలీసు అధికారులకు దక్కాయి. మరో ముగ్గురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను అందించనుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాలు (పీపీఎంజీ), 628 మందికి పోలీస్ శౌర్య పతకాలు (పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ పతకాలు అందుకోనున్నారు. కాగా, పతకాలను అందుకోనున్న పోలీసులకు డీజీపీ మహేందర్రెడ్డి అభినందనలు తెలిపారు. పోలీస్ సేవా పతకాలు... ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్, వరంగల్ ఏసీపీ ఎం.జితేందర్రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, పీటీసీ డీఎస్పీ ఎం.పిచ్చయ్య, టీఎస్ఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ కె. సంపత్కుమార్ రెడ్డి, ఎస్ఐబీ ఏఎస్ఐలు ఆనంద్కుమార్, డి. చంద్రశేఖర్ రావు, గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ ఆరిఫ్ అలీ, కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ ఎం. అనిల్గౌడ్కు సేవా పతకాలకు ఎంపికయ్యారు. పీఎంజీ విభాగంలో... గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తూ ఛత్తీస్గఢ్, గడ్చిరోలి జిల్లాల్లో 2016, 2017, 2018లలో జరిగిన ఎన్కౌంటర్లలో పాల్గొని ధైర్యసాహసాలు ప్రదర్శించిన 14 మందికి పోలీస్ శౌర్య పతకాలను ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఐ, కానిస్టేబుళ్లతో పాటు ఓ ఎస్ఐ కూడా ఉన్నారు. శౌర్యపతకాలు పొందిన వారిలో ఆర్ఎస్ఐ పి.కె.ఎస్. రమేష్, కానిస్టేబుళ్లు ఎన్.లయ, ఎం.పాపారావు, ఎం. భాస్కర్రావు, జి. ప్రతాప్సింగ్, కె. వెంకన్న, మాలోత్ రాములు, బి. మరియాదాస్, కె. పరుశురాం, అబ్దుల్ అజీమ్, కె.తిరుపతయ్య, పి.సత్యనారాయణ, వి.రమేష్తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ ఉన్నారు. జైళ్ల విభాగంలో ముగ్గురికి... జైళ్ల విభాగంలో దేశ వ్యాప్తంగా 41 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురికి పతకాలు దక్కాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మ హేంద్ర కృష్ణమూర్తి, చీఫ్ హెడ్వార్డర్ బి.నారాయణ, హెడ్ వార్డర్ వేముల జంగయ్య పతకాలను అందుకోనున్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. కాగా సైనిక, పోలీస్ అధికారులకు కేంద్రహోంశాఖ వివిధ పతకాలు ప్రకటించింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకం(పీపీఎంజీ), 628 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు(పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 662 మందికి విశిష్ట సేవా పతకాలను కేంద్రం హోంశాఖ ప్రకటించింది. ఇక వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు గ్యాలంటరీ పోలీసు పతకాలు, మరో 11 మందికి ఉత్తమ సేవా పోలీసు పతకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సేఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు. -
Olympics: ఒకరు పాతాళానికి.. మరొకరు అత్యున్నత శిఖరానికి
సాక్షి, వెబ్డెస్క్: బ్యాడ్మింటన్ స్టార్.. తెలుగుతేజం పీవీ సింధు.. రెజ్లర్ సుశీల్ కుమార్.. ఇద్దరు పేరున్నవారే. ఈ ఇద్దరు ఒలింపిక్స్లో రెండేసీసార్లు పతకాలు అందుకున్నవారే. ఇద్దరికి తమ క్రీడాంశాల్లో ఘనమైన చరిత్రే ఉంది. కానీ కాలచక్రంలో రెజ్లర్ సుశీల్ కుమార్ పేరు పాతాళానికి పడిపోతే.. పీవీ సింధు పేరు భారత చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన పీవీ సింధు.. ఐదేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచి దేశం గర్వపడేలా చేసింది. సరిగ్గా ఇలాంటి ఫీట్నే రెజ్లర్ సుశీల్ కుమార్ నమోదు చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం ఒడిపిపట్టిన సుశీల్ 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. స్వాతంత్యం తర్వాత భారత్ నుంచి వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన వ్యక్తి సుశీల్కుమార్ మాత్రమే. ఇప్పడు ఆ ఘనతను పీవీ సింధు కూడా సాధించింది. ఇక ఈ ఇద్దరి జీవితాలు ఒకసారి పరిశీలించి చూడగా.. సింధు తన ప్రతిభతో మరింత పేరు సంపాదించగా.. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత సుశీల్ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో సుశీల్ రజతం నెగ్గిన తర్వాత దేశంలో అతను ఎందరికో ఆదర్శమయ్యాడు. భారత రెజ్లింగ్లో ఒక్క వెలుగు వెలిగిన సుశీల్ ఇప్పుడు వివాదాల నీడలో ఉన్నాడు. అతని అహం, మిగతా రెజర్ల పట్ల చిన్నచూపు ఇలా పలు అంశాలు అతన్ని కిందికి తొక్కేశాయి. విచిత్రంగా సింధు టోక్యో ఒలింపిక్స్లో పతకం ముద్దాడిన మరుసటిరోజే సుశీల్కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చార్జీషీటులోకి ఎక్కాడు. ఇక పీవీ సింధు విషయానికి వస్తే.. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె క్రేజ్ మరింత రెట్టింపైంది. ఎంతలా అంటే భారత్లో క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ సింధు సాధించడం విశేషం. ప్రపంచచాంపియన్షిప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు ఇలా ఏ టోర్నీ చూసుకున్నా ఆమె సాధించని పతకాలు లేవు. 2004 నుంచి బ్యాడ్మింటన్లో కఠోర సాధన చేస్తున్న సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన తర్వాత ఇంకా సాధించాల్సి ఏముందని అనుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సింధు అలా అనుకోలేదు. ఈ ఐదేళ్లలో ఆమె మరింత రాటుదేలింది. ఎంతలా అంటే 2019లో ఏకంగా మహిళల బాడ్మింటన్ విభాగంలో ప్రపంచచాంపియన్గా నిలిచింది. ఒలింపిక్స్లో రెండుసార్లు పతకాలు సాధించిన సింధుకూ ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే ఆల్ ఇంగ్లండ్ బ్మాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీ. ఇటీవలే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇక త్వరలో జరగబోయే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఏదైతేనేం... విశ్వక్రీడల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు దేశం కోసం కష్టపడ్డారు.. పతకం కోసం శ్రమించారు.. దేశం కీర్తిని రెపరెపలాడించారు. కానీ ఒకరి తప్పిదం తన క్రీడా జీవితాన్ని నాశనం చేస్తే.. ఒకరి పట్టుదల యావత్ దేశ కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.- -
పీవీ సింధు ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2020లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో సెమీస్కు దూసుకువచ్చిన భారత షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సింధు చైనాకు చెందిన తైజుయింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత బంగారు పతకం ఆశలకు తెరపడింది. అయితే కాంస్య పతకం ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీని కోసం సింధు చైనా షట్లర్ పింగ్ జియావోతో తలపడనుంది. సింధు క్యాంస్య పతకం తీసుకురానుందనే ఆశలు భారీగానే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పూర్తి ఫిట్గా కనిపించే ఆమె తన బరువును, ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రొటీన్డ్ ఫుడ్ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఆమె బరువు, హైడ్రేషన్ , ప్రోటీన్ ఆహారంతో సింధు ఫుడ్ ఆధారపడి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్: బ్రేక్ ఫాస్ట్ పాలు, గుడ్లు, ఇతర ప్రొటీన్లతో నిండి ఉంటుంది. పండ్లు కూడా తీసుకుంటారు. ఇక శిక్షణా సమయంలో సెషన్ల మధ్య మరింత యాక్టివ్గా, బలంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు. లంచ్ అండ్ డిన్నర్: సింధు రోజూ రెండుపూటలా భోజనంలో రైస్ ఉండేలా చూసుకుంటారు. దీంతోపాటు కూరగాయలు కూడా తీసుకుంటారు. అలాగే టోర్నమెంట్ల సమయంలో అన్నం, చికెన్ తీసుకుంటారు. అలాగే ఆరోగ్యాన్నినియంత్రించుకునే చర్యల్లో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. ఈ ఫలితాల కనుగుణంగా తన డైట్ను ఆమె ఎడ్జస్ట్ చేసుకుంటారు. ఇక చివరగా మ్యాచ్ గెలిచిన తరువాత ఫాస్ట్ ఫుడ్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారట. కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్, చాక్లెట్లను ఎంచక్కా ఎంజాయ్ చేస్తారట. అయితే సాధారణంగా సింధు తల్లి స్వయంగా ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటారట. ఇంకా అరటిపండ్లు, ప్రోటీన్ షేక్ స్నాక్ బార్లు ఈ మూడు తీసుకుంటానని సింధు జాతీయ మీడియాతో చెప్పారు. అలగే భారీ ట్రైనింగ్ సెషన్ తర్వాత ఎనర్జీ కోసం స్నాక్ బార్లపైనే ఆధారపడతానని చెప్పారు. సాధారణంగా మ్యాచ్ తర్వాత అరగంటలోపు ఏదో ఒకటి తినాలి, ఆ తర్వాత స్ట్రెచ్స్ చేసి, రెస్ట్ తీసుకుంటానని సింధు వెల్లడించారు. ఇక చీట్ మీల్లో భాగంగా హైదరాబాదీ బిర్యానీ తన మెనూలో టాప్లో ఉంటుందని ఆమె చెప్పారు. అలాగే ప్రొఫెషనల్ అథ్లెట్లు తక్కువ నూనె, కూరగాయలతో చేసిన నూడుల్స్, స్పఘెట్టి, పాస్తా లాంటివి కూడా తీసుకుంటారని కూడా సింధు చెప్పారు. కోచ్ శ్రీకాంత్ వర్మ ఏమన్నారంటే.. ఆమె కోసం ప్రత్యేకంగా హై-పెర్ఫార్మెన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ను కస్టమైజ్ చేశామని సింధు కోచ్ శ్రీకాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యంగా సింధు ఆట, బాడీ తీరు, ఆమె బలాబలాలు వీటన్నింటినీ దృష్టి ఉంచుకుని ఇదంతా రూపొందిస్తామని చెప్పారు. పతకాల బరిలో నిలిచే క్రీడాకారులు హైఇంటెన్సిటీ షెడ్యూల్కు సిద్ధంగా ఉంటారన్నారు. ముఖ్యంగా వారంలో ఆరు రోజులు, రెండున్నర గంటలు కఠినమైన శిక్షణా విధానాన్ని సింధు అవలంబిస్తోందని శ్రీకాంత్ వెల్లడించారు. అలాగే సింధు ట్రైనింగ్కు ఎపుడూ నో చెప్పదు..అదే ఆమెలోని గొప్పతనం..శిక్షణ ఎంత కఠినంగా ఉన్నా, తాను ఎంత బిజీగా ఉన్నా ఎపుడూ నవ్వుముఖంతో సిద్ధంగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఒలింపిక్స్లో ప్రతీ రౌండ్ ఫైనల్ లాంటిదే. అత్యుత్తమ ఫామ్ని అందుకోవడమే లక్క్ష్యమని ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో హెడ్ స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్గా ఉన్నారు శ్రీకాంత్ వర్మ. -
టోక్యో ఒలింపిక్స్: మెడల్స్ తయారీ వెనుక ఆసక్తికర విషయాలు
టోక్యో: 1964 తర్వాత ఒలింపిక్స్ క్రీడల నిర్వహణను జపాన్ ప్రభుత్వం దక్కించుకోవడం మళ్లీ ఇదే. ఈ ఒలింపిక్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రభుత్వం నిర్వహణలోనూ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి పతకాల తయారీ వరకు వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని జోడించి పతకాలను తయారు చేసింది. అయితే ఒలింపిక్స్ మెడల్స్ను వినూత్న రీతిలో తయారు చేయాలని జపాన్ ప్రభుత్వం ముందే నిర్ణయించింది. అందుకోసం మూడేళ్ల క్రితం ఆ దేశ వాసుల నుంచి పాత మొబైల్ ఫోన్లను సేకరించింది. అందులోని లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి మెడల్స్ను తయారు చేశారు. ఆధునాతన కంప్యూటర్ డిజైన్లతో అత్యంత అద్భుతంగా పతకాలను రూపొందించారు. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ చెత్తను ఒక మంచి పనికి ఉపయోగించారు. అంతేకాదు ఒలింపిక్స్ మెడల్ ట్యాగ్లను కూడా సంప్రదాయపద్దతిలోనే తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్లను నేయించింది. దీంతో పాటు పతకాలను ఉంచేందుకు... కలపతో ప్రత్యేక డబ్బాలను కూడా రూపొందించింది. జపాన్ సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ మెడల్స్ ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. అయితే కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు తాము గెలుచుకున్న పతకాలు ఎవరికి వారే మెడలో వేసుకోవాలని జపాన్ ప్రభుత్వంతో పాటు ఐవోసీ(ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) నిర్ణయించింది. -
ఏపీ: ట్రాఫిక్ ఆర్ఎస్ఐకు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: మహిళ ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అర్జున్రావుకు అరుదైన గౌరవం దక్కింది. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శౌర్య పతకం" ప్రభుత్వం ప్రకటించింది. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన "దిశ"పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. "దిశ"పై మహిళా పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి మహిళల ఫోన్లలో దిశయాప్ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు ఏపీ మరో కీలక నిర్ణయం: వారిక మహిళా పోలీసులు -
రజతం స్వర్ణంగా మారింది...
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల జాబితాలో మరొకటి అదనంగా చేరింది. నాడు లభించిన రజతమే ఇప్పుడు స్వర్ణంగా మారింది. 4గీ400 మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత బృందం రెండో స్థానంలో (3 నిమిషాల 15.71 సెకన్లు) నిలిచింది. బహ్రెయిన్ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్ టీమ్ (3 నిమిషాల 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది. అయితే బహ్రెయిన్ జట్టులో సభ్యుడైన కెమీ అడికోయా డోపింగ్లో పట్టుబడ్డాడు. అతనిపై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్ను డిస్క్వాలిఫై చేస్తూ భారత్కు బంగారు పతకాన్ని ప్రకటించారు. ఈ స్వర్ణం గెలుచుకున్న బృందంలో మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్, హిమ దాస్, పూవమ్మ సభ్యులుగా ఉన్నారు. మరో కాంస్యం కూడా... మరో భారత అథ్లెట్ అను రాఘవన్ ఖాతాలో కూడా ఇదే తరహాలో కాంస్య పతకం చేరింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో అను 4వ స్థానంలో నిలిచింది. ఈ రేస్ గెలిచిన అడెకోయాపై కూడా నిషేధం పడటంతో అనుకు కాంస్య పతకం లభించింది. -
గ‘ఘన్’ విజయం
‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారు 80 శాతం మంది ఆటగాళ్లు తమ తొలి ఒలింపిక్స్లోనే పతకాలు గెలుచుకుంటారు’... షూటర్ గగన్ నారంగ్తో అతని కోచ్ చెప్పిన మాట ఇది. ఈ వ్యాఖ్య గగన్ ఆత్మ స్థైర్యాన్ని కొంత దెబ్బ తీసింది. ఎందుకంటే అప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నా అతనికి పతకం దక్కలేదు. దీనికి తోడు 2008 బీజింగ్ ఒలింపిక్స్లో తన కేటగిరీనే అయిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అభినవ్ బింద్రా సాధించిన స్వర్ణంతో అంచనాలు, ఒత్తిడి కూడా పెరిగాయి. ఇలాంటి స్థితి నుంచి అతను మరో ఒలింపిక్స్ కోసం తుపాకీ ఎక్కుపెట్టాడు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో గగన్ సాధించిన కాంస్యంతోనే భారత్ పతకాల బోణీ కొట్టింది. గగన్ నారంగ్కు అంతర్జాతీయ విజయాలు కొత్త కాదు. అప్పటికే ప్రపంచ కప్, ప్రపంచ చాంపియన్షిప్లతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన ఎన్నో పతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ఏదో వెలితి...! ప్రతీ క్రీడాకారుడు కలలుగనే ఒలింపిక్ మెడల్ మాత్రం అతని దరి చేరలేదు. సుదీర్ఘ కెరీర్లో పలు ఘనతల తర్వాత కూడా అది మాత్రం సాధించలేకపోయాననే భావం అతడిని వెంటాడుతూనే ఉంది. ఏథెన్స్లో త్రుటిలో ఆ అవకాశం పోయింది, బీజింగ్కు వచ్చేసరికి క్వాలిఫయింగ్లోనే ఆట ముగిసింది. కానీ లండన్లో మాత్రం ఈ హైదరాబాద్ షూటర్ గన్ గురి తప్పలేదు. అంచనాలు లేకుండా... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో పాల్గొనే నాటికి గగన్ నారంగ్ చెప్పుకోదగ్గ విజయాలేమీ సాధించలేదు. సొంత నగరంలో హైదరాబాద్లోనే జరిగిన ఆఫ్రో ఏషియన్ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నా... వాస్తవంగా ఆ పతకానికి అంత విలువేమీ లేదు. అందుకే 21 ఏళ్ల వయసులో ఒలింపిక్స్కు వెళ్లిన గగన్పై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే గగన్ గట్టిగానే పోరాడాడు. 47 మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్లో 593 పాయింట్లతో 12వ స్థానంతో అతను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పదును పెరిగినా... ఏథెన్స్ వైఫల్యం గగన్ను పెద్దగా కుంగదీయలేదు. మరింత పట్టుదలతో తన సత్తా చాటేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వరుసగా పాల్గొన్న ప్రతీ ఈవెంట్లోనూ పతకం సాధిస్తూ వచ్చాడు. 2005 కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్షిప్లో 2 స్వర్ణాలు, ఒక కాంస్యంతో ఇది మొదలై ఆ తర్వాత 2006లో గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్ కప్లో స్వర్ణం వరకు సాగింది. ఆ తర్వాత మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు వచ్చాయి. ఇక్కడ ఏకంగా 4 స్వర్ణాలతో తన జోరు కొనసాగించిన గగన్ ఏడాది చివర్లో జరిగిన దోహా ఆసియా క్రీడల్లో 3 కాంస్యాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ఫామ్ చూస్తే 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పతకం ఖాయమనిపించింది. కానీ చివరకు అసలు వేదికపై అతను చేతులెత్తేశాడు. ఈసారి క్వాలిఫయింగ్లో 9వ స్థానంలో నిలిచి ఫైనల్కు త్రుటిలో అర్హత కోల్పోయాడు. 600కుగాను ఐదుగురు షూటర్లు 595 పాయింట్లు స్కోర్ చేయగా... కౌంట్బ్యాక్లో దురదృష్టవశాత్తూ గగన్ 0.1 పాయింట్ తేడాతో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్నాడు. తన 42వ షాట్లో అతను 8.9 పాయింట్లు సాధించగా, మరో షూటర్ 9 పాయింట్లు స్కోరు చేసి ముందంజ వేశాడు. పతక సమయం... బీజింగ్ పరాజయం షాక్ నుంచి కోలుకునేందుకు గగన్కు చాలా సమయం పట్టింది. కొద్ది రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదు. పడుకున్నా నిద్రలోనూ అవే పీడ కలలు. దాంతో కొంత కాలం గన్ను పక్కన పడేశాడు. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారంతో మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కొన్నాళ్లకి జరిగిన ప్రపంచకప్లో 703.5 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం అతనికి కావాల్సిన స్ఫూర్తిని అందించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ చాంపియన్షిప్లో తన ప్రధాన ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్తో పాటు వేర్వేరు ఈవెంట్లలో కలిపి ఏకంగా 6 స్వర్ణాలు, 2 రజతాలు సాధించాడు. ఆపై ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 4 స్వర్ణాలు, గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో 2 రజతాలు అతనికి మళ్లీ జోష్ను అందించాయి. దీనికి తోడు ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్షిప్లో సాధించిన కాంస్యంతో గగన్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరకు ఇదే లండన్ ఒలింపిక్స్లో కనిపించింది. ఈసారి వచ్చిన అవకాశాన్ని అతను వదిలి పెట్టలేదు. పాత చేదు అనుభవాలను పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. క్వాలిఫయింగ్లోనే మెరుగైన ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఫైనల్లో సరైన దిశలో అతని గన్ పేలింది. ఓవరాల్గా 701.1 పాయింట్లతో కాంస్యం సొంతమైంది. బహుమతి ప్రదానోత్సవ సమయంలో ఎగురుతున్న భారత జెండాను చూసిన నారంగ్ హృదయం ఆనందంతో ఉప్పొంగింది. -
మహాబలిని మట్టికరిపించిన వేళ...
అది 2000 సంవత్సరం... కొత్త మిలీనియం మొదలైన ఏడాది! సిడ్నీలో విశ్వక్రీడలు జరుగుతున్నాయి. 130 కేజీల విభాగంలో ఓ అమెరికా అనామక రెజ్లర్ రూలన్ గార్డెనర్ స్వర్ణం గెలిచాడు. ఒలింపిక్స్ అన్నాక కొత్త చాంపియన్లు అవతరించడం... పతకాలు గెలవడం సాధారణం. కానీ సిడ్నీ వేదికపై ఎవ్వరూ ఊహించని ఫలితం వచ్చింది. ప్రపంచ రెజ్లింగ్లో ఆల్టైమ్ గ్రేటెస్ట్గా పేరొందిన రష్యా మహాబలి, దిగ్గజ రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్ను గార్డెనర్ ఎంతో నేర్పుగా ఓడించాడు. ఈ శతాబ్దం విస్తుపోయే ఫలితాన్నిచ్చాడు. కరెలిన్తో తలపడుతున్నపుడు ప్రత్యర్థి ఒక్క పాయింట్ సాధిస్తేనే గొప్ప అనుకుంటారు. కానీ గార్డెనర్ ఏకంగా కరెలిన్ను ఓడించాడు. పసిడి పతకం కూడా గెలిచాడు. కనకంతో కెరీర్ను దిగ్విజయంగా ముగించాలని కలలు కన్న కరెలిన్కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. స్వదేశంలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రానికి చెందిన రీడ్, వర్జినియా దంపతులకు పుట్టిన తొమ్మిది మంది సంతానంలో ఆఖరివాడు రూలన్ గార్డెనర్. కుటుంబానికి సొంతంగా డెయిరీ ఫామ్ ఉండటంతో గార్డెనర్ పాలు అమ్మేవాడు. ఆ తర్వాత రెజ్లింగ్లో రంగప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన అతను సిడ్నీ ఒలింపిక్స్లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. చరిత్రలో భాగమయ్యాడు. కనీవినీ క్రేజ్ను ఒక్క రాత్రే సంపాదించాడు. ప్రపంచ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాడు. ఇంకేం ఆ తర్వాత ఓ వెలుగు వెలిగిన ఇతన్ని దురదృష్టం ప్రమాదాల పాలు చేస్తే.... అదృష్టమేమో ప్రాణాలతో బయటపడేలా చేసింది. కానీ కాలమైతే ఆగదు. దాంతో క్రేజ్తో వచ్చిన క్యాష్ నిలువలేదు. తోడుగా వచ్చిన కష్టాలు వదిలేయలేదు. ఆర్థిక నష్టాల నుంచి బయటపడలేదు. చివరకు దివాళా తప్పలేదు. (స్టేడియాలు తెరుచుకోవచ్చు ) ఏకులా వచ్చి... సిడ్నీ ఒలింపిక్స్ మొదలయ్యే సమయానికి గార్డెనర్ అనామక రెజ్లరైతే... అలెగ్జాండర్ కరెలిన్ మాత్రం దిగ్గజ రెజ్లర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఒక్క బౌట్లోనూ ఓడిపోలేదు. 9 సార్లు విశ్వవిజేతగా... 13 సార్లు యూరోపియన్ చాంపియన్గా... వరుసగా మూడు ఒలింపిక్స్లలో చాంపియన్గా నిలిచిన కరెలిన్ సిడ్నీ ఒలింపిక్స్లో ఏ ప్రత్యర్థికీ కనీసం ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా ఫైనల్ చేరాడు. 1997లో ఓ టోర్నీలో రూలన్ ఎదురైతే కరెలిన్ ఓ పట్టుపట్టి అలవోకగా 5–0తో మట్టికరిపించాడు. అంతేకాదు ఈసారీ స్వర్ణం గెలిస్తే ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు ఒలింపిక్ పసిడి పతకాలు నెగ్గిన మూడో క్రీడాకారుడిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించేవాడు. కానీ అప్పటి 33 ఏళ్ల కరెలిన్ కలల్ని అమెరికాకు చెందిన నాటి 29 ఏళ్ల పాలబ్బాయి రూలన్ గార్డెనర్ భగ్నం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిగల తొలి రౌండ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ ఇద్దరూ ఖాతా తెరువలేకపోయారు. అయితే రెండో రౌండ్ మొదలైన 23 సెకన్లకు గార్డెనర్ ఒక పాయింట్ సంపాదించాడు. ఇక మూడో రౌండ్లోనూ తన శక్తినంతా కూడదీసుకొని కరెలిన్ను నిలువరించిన గార్డెనర్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. తుదకు 1–0తో కరెలిన్ను ఓడించి గార్డెనర్ అద్భుతం చేశాడు. దీంతో ఈ ఫలితం ‘అప్సెట్ ఆఫ్ ద సెంచరీ’ (శతాబ్ది విస్తుపోయే ఓటమి)గా పుటల్లోకెక్కింది. కరెలిన్ బంగారు యాత్ర ముగియడంతో అతని తన కెరీర్నూ ముగించాడు. ఆటకు టాటా చెప్పేశాడు. ‘అతనికి మరణం లేదు’ అనే టైటిల్తో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అసాధారణ చాంపియన్లను చరిత్రలో నిక్షిప్తం చేసే పనిలో పడింది. అందుకే మేటి అథ్లెట్లను ‘తెర’మీదకు తెస్తోంది. ఈ ఉద్దండ పిండాల జాబితాలో గార్డెనర్ కూడా ఉన్నాడు. ఫైవ్ రింగ్స్ ఫిలిమ్స్ బ్యానర్పై ఐఓసీ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ పేరు ‘రూలన్ గార్డెనర్ వోంట్ డై’. జూన్ 3న విడుదలయ్యే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ఇప్పటికే వచ్చేసింది. ఇందులో చరిత్ర కెక్కిన సువర్ణ విజయంతో పాటు జీవితంలో అతనికి ఎదురైన ఆటుపోట్లు, ప్రాణాలమీదికి తెచ్చిన ప్రమాదాలు క్లుప్తంగా చూపించారు. మృత్యుంజయుడు... సిడ్నీ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచాక 2001లో ప్రపంచ చాంపియన్షిప్లోనూ గార్డెనర్ పసిడి పతకం నెగ్గి జగజ్జేత అయ్యాడు. అయితే ఆ తర్వాతి ఏడాదే గార్డెనర్కు స్నో డ్రైవ్ ప్రమాదంలో ప్రాణం పోయినంత పనైంది. 2002 ఫిబ్రవరిలో మంచు సరస్సు వద్ద అతను నడుపుతున్న స్నో మొబైల్ ప్రమాదానికి గురైంది. దీంతో కన్నీటి చుక్క కూడా గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏకంగా 17 గంటలు అచేతనంగా పడిపోయాడు. తీవ్రంగా గాయమైన గార్డెనర్ కుడి కాలి వేళ్లను తొలగించాల్సి వచ్చింది. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్లో పోటీపడ్డ గార్డెనర్ 130 కేజీల విభాగంలోనే కాంస్య పతకం గెలిచి కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2007 ఫిబ్రవరిలో మళ్లీ గార్డెనర్ మరో ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ఓ నదిలో కూలిపోయింది. అప్పుడు కూడా అతను మృత్యుంజయుడుగా నిలిచాడు. గంటకుపైగా ఈదుతూ ప్రాణాలతో ఒడ్డుకు చేరాడు. తదనంతరం గార్డెనర్ వ్యక్తిగత జీవితం కూడా కుదుపునకు లోనైంది. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ రెండూ విడాకులకు దారి తీశాయి. మరోవైపు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టాలు రావడం... వాటి నుంచి ఎంతకి బయటపడలేక గార్డెనర్ చివరకు దివాళా తీశాడు. చివరకు తాను సాధించిన సిడ్నీ ఒలింపిక్స్ స్వర్ణాన్ని, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని, ఇతర విలువైన వస్తువులను అమ్ముకొని అప్పులు తీర్చాడు. అనంతరం మూడేళ్లపాటు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేశాక మళ్లీ రెజ్లింగ్వైపు వచ్చాడు. ప్రస్తుతం 48 ఏళ్ల గార్డెనర్ సాల్ట్లేక్ సిటీలోని ఓ హైస్కూల్లో రెజ్లింగ్ కోచ్గా చిన్నారులకు కుస్తీ పాఠాలు చెబుతున్నాడు. -
‘నా ప్రపంచకప్ పతకం కనిపించడంలేదు’
లండన్: లాక్డౌన్ సమయంలో ఇతర క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చాలెంజ్లు విసురుకుంటుంటే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం కనిపించకుండా పోయిన వన్డే ప్రపంచకప్ పతకాన్ని వెతికే పనిలో పడ్డాడు. వారం రోజులుగా ఇంట్లో అణువణువూ వెతికానని అయినా తన ప్రపంచకప్ పతకం దొరకలేదని అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఆర్చర్ తన పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి చేరాడు. తాను పాత ఇంటిలో ఉన్నప్పుడు ఒక చిత్రపటానికి పతకాన్ని వేలాడదీశానని... అయితే కొత్త ఇంటిలో ఆ చిత్ర పటం ఉంది కానీ తన మెడల్ మాత్రం లేదన్నాడు. -
మనం మరచిన మల్లయోధుడు
ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్... ఈ తరంలో చాలామందికి తెలియని పేరు! గడిచిపోయిన గతానికి... మరచిపోయిన మల్లయోధుడే జాదవ్! స్వాతంత్య్రం రాకముందే కుస్తీ క్రీడలో ఆరితేరాడు. రాటుదేలాక ఒలింపిక్స్లో పోటీపడ్డాడు. దీనికంటే ముందు ఆర్థిక సమస్యలతోనూ తలపడ్డాడు. అయినా సరే చివరకు విశ్వ క్రీడల్లో సత్తా చాటాడు. తన రెండో ఒలింపిక్స్ ప్రయత్నంలో కాంస్యం సాధించాడు. స్వతంత్ర భారతావని తరఫున వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చేరాడు. ఇప్పుడైతే దేశంలో ఏ మూలనో ఉన్నా కూడా ప్రతిభ ఉన్నవారు నిమిషాల నిడివి వీడియోలతోనే వైరల్ అవుతున్నారు. తర్వాత్తర్వాత ‘రియల్ హీరో’లూ అవుతున్నారు. కానీ దేశానికి స్వేచ్ఛావాయువులొచ్చిన తొలి నాళ్లలో రియల్ హీరో అయినా... ఖాషాబా వైరల్ మాత్రం కాలేకపోయాడు. ఇది అలనాటి కాలమహిమ! అందుకే రోజులో గంటల తరబడి మట్టిలో కసరత్తు చేసి ఒలింపిక్స్ లాంటి విశ్వక్రీడలకు 1948లోనే అర్హత సాధించగలిగాడు. ఇప్పుడెన్నో వసతులు... ‘టాప్’లాంటి పథకాలున్నాయి. అప్పుడేవీ లేవు. కాబట్టే అర్హత సాధించినా... ఒలింపిక్స్ బరిలోకంటే ముందు ఆర్థిక సవాళ్లతోనే జాదవ్ పట్టు పట్టాల్సి వచ్చింది. విలేజ్లో విజేయుడు... మహారాష్ట్రలోని అప్పటి కొల్హాపూర్ సంస్థానంలోని గోలేశ్వర్ అనే మారుమూల పల్లెకు చెందిన ఖాషాబా మల్లయుద్ధంలో సింహబలుడు. బాల్యంలోనే ప్రత్యర్థుల్ని ‘మట్టి’కరిపించే క్రీడలో తెగ కుస్తీ పట్టేవాడు. ఇలా ఊరు–వాడా గెలిచాక ఓ రోజు జాతీయ చాంపియన్నే ఓడించడంతో విశ్వక్రీడలకు అర్హత పొందాడు. 1948లో బెంగాల్కు చెందిన జాతీయ ఫ్లయ్ వెయిట్ చాంపియన్ నిరంజన్ దాస్ను కంగుతినిపించి అదే ఏడాది లండన్ ఒలింపిక్స్కు సై అన్నాడు. కానీ అణాలతో, నాణేలతో గడిచే ఆ రోజుల్లో రూపాయలు, వేలు వెచ్చించి వెళ్లేదెట్లా? కొల్హాపూర్ సంస్థానాధీశుడు దయతలచడంతో జాదవ్ లండన్ పయనమయ్యాడు. పాల్గొన్న తొలి విశ్వక్రీడల్లో ఆరో స్థానంతో ఖాషాబా టాప్–10లో నిలిచాడు. మరో నాలుగేళ్లకు హెల్సింకి (1952) ఒలింపిక్స్కు అర్హత సాధించినా... మళ్లీ కాసుల కష్టాలు ‘హాయ్’, హలో అని పల కరించాయి. విరాళాలతో, తెలిసిన వారి చేయూతతో కిట్ కొనుక్కునే పైసలే పోగయ్యాయి. మరి పయనానికి డబ్బులెక్కడ్నించి తేవాలి. జాదవ్ ప్రతిభా, పాటవం తెలిసినా కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్. ఖర్దీకర్ తన ఇంటిని తాకట్టు పెట్టి రూ. 7000 జాదవ్ చేతుల్లో పెడితే అతను... కాంస్య పతకం పట్టుకొచ్చాడు. నిజానికి ఆ మెగా ఈవెంట్లో అతనికి స్వర్ణం కాకపోయినా... రజతమైనా దక్కేది. కానీ వెంటవెంటనే బౌట్లోకి దిగాల్సి రావడం, ఇదేంటనీ దన్నుగా నిలిచి అడిగే భారత అధికారి ఎవరూ లేకపోవడంతో ఏకబికిన వరుసగా బౌట్లు ఆడేయడంతో అలసిసొలసి కాంస్యానికి పరిమితమయ్యాడు. ఖాషాబా నెగ్గిన ఒలింపిక్ పతకం రుణపడి... తలపడి... పతకం గెలిచాక ఖాషాబా కష్టాలు కొంత తీరాయి. కానీ లక్షల్లో నజరానాలొచ్చాయనుకుంటే పొరపాటే. ఇటు రాష్ట్రం నుంచీ, అటు కేంద్రం నుంచీ ప్రోత్సాహకంగా నజరానా కాదు కదా నయాపైసా రాలేదు. ఘనస్వాగతం కూడా లభించలేదు. కానీ ఊర్లో మాత్రం ఈ విజేయుడి పతక ఆగమనానికి 151 ఎడ్లబండ్లతో స్వాగతం పలకడం అప్పట్లో గొప్ప విశేషం. ఇక ఆ తర్వాత టోర్నీలు ఆడగా వచ్చిన డబ్బులు, బతుకుదెరువు కోసం చేసిన కొలువుతోనే తన ప్రిన్సిపాల్ ఇంటిపై ఉన్న రుణాన్ని జాదవ్ తీర్చేశాడు. తర్వాత మహారాష్ట్ర పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఏళ్లకు ఏళ్లు ఎదుగుబొదుగు (పదోన్నతి) లేని ఉద్యోగం చేశాడు. 1984లో 58 ఏళ్ల ప్రాయంలో ఆగస్టు 14న మోటర్ సైకిల్ ప్రమాదంలో ఖాషాబా జాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. జాతికి తెలియదు సరేకానీ... ఈ జాతి రత్నం గురించి భారతీయులెవరికీ అంతగా తెలియకపోవడం వింతేమీ కాదు. కానీ తొలి వ్యక్తిగత పతకం అందించిన చాంపియన్ గురించి భారత ప్రభుత్వంగానీ, మహారాష్ట్ర ప్రభుత్వంగానీ పట్టించుకోకపోవడమే విడ్డూరం. అందుకేనే మో అతను బతికుండగా ఏ గుర్తింపూ దక్కలేదు. ఏ పురస్కారం అతని చేతికి అందలేదు. చివరకు చనిపోయాక కూడా అలసత్వమే చేశారు పాలకులు. జాదవ్ కన్నుమూసిన దశాబ్దం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం 2004లో ‘శివ్ ఛత్రపతి’ అవార్డును అతని కుటుంబసభ్యులకు అందజేయగా... తీరిగ్గా కేంద్రం అర్జున అవార్డును (2000)లో ప్రదానం చేసింది. జాతి క్షోభించే తప్పును ఇప్పటికీ భారత ప్రభుత్వం సవరిం చుకోనేలేదు. అందుకే ఒలింపిక్ పతకం గెలిచినా... ‘పద్మశ్రీ’ వరించని ఏకైక భారత క్రీడాకారుడిగా ఇప్పటికీ మిగిలిపోయాడు. -
చిన్న లక్ష్యాలు పెట్టుకోను
న్యూఢిల్లీ: అనూహ్య పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం కారణంగా మేలు పొందిన వారిలో భారత దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒకడు. వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలుపొందిన ఏకైక భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన సుశీల్... ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. తాను బరిలో దిగే 74 కేజీల వెయిట్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, తన పనైపోయిందంటూ పలువురు విమర్శలు చేస్తున్నప్పటికీ అవేమీ తనను ప్రభావితం చేయలేవంటున్నాడు. టోక్యో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నానన్న సుశీల్ మనోగతం అతని మాటల్లోనే... వారికి అలవాటే... చాలా కాలం నుంచి నా గురించి ఎవరికి తోచింది వారు రాయడం అందరికి అలవాటైపోయింది. కానీ వారి రాతలు, అభిప్రాయాలు నాపై ప్రభావం చూపలేవు. 2011లోనే సుశీల్ పనైపోయిందని అన్నారు. కానీ 2008 బీజింగ్లో గెల్చిన కాంస్య పతకాన్ని లండన్ 2012 ఒలింపిక్స్లో రజతంగా మార్చాను. ఈ వ్యాఖ్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఇది నాకు రోజువారీ కార్యక్రమం అయిపోయింది. సన్నద్ధతకు ఇదే సమయం... మరో నెల రోజుల్లో నేను 37వ పడిలో అడుగుపెడతా. అయితేనేం... నేను రెజ్లింగ్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఒలింపిక్ బెర్తు సంపాదించేందుకు ప్రస్తుతం నాకు మంచి సమయం లభించింది. దీన్ని నేను టోక్యో సన్నద్ధత కోసం వినియోగించుకుంటా. గాయాల బారిన పడకూడదు... రెజ్లింగ్ క్రీడలో గాయాల బారిన పడకుండా, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలు. మనం అనుకున్నది సాధించవచ్చు. నేను ఇప్పటికీ రోజులో రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తున్నా. మ్యాచ్ ఫిట్నెస్తో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. దేవుని దయతో టోక్యో ఒలింపిక్స్కు కూడా అర్హత సాధిస్తాననే నమ్మకముంది. నర్సింగ్కు అభినందనలు... డోపింగ్లో పట్టుబడి నాలుగేళ్ల నిషేధం తర్వాత తిరిగి జూలైలో బరిలో దిగనున్న నర్సింగ్ యాదవ్కు అభినందనలు. పునరాగమనం అతనికి అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. నర్సింగ్తో పోటీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను. సమయం వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. రియో ఒలింపిక్స్కు నర్సింగ్ కారణంగానే సుశీల్ దూరమైన సంగతి తెలిసిందే. విదేశీ రెజ్లర్లే నా ప్రత్యర్థులు... చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే మనం ఏదీ సాధించలేం. జితేందర్ కుమార్, నర్సింగ్ యాదవ్లు కాదు... ఉజ్బెకిస్తాన్ రెజ్లర్, ఆసియా క్రీడల స్వర్ణపతక విజేత బెక్జోడ్ అబ్దురఖ్మోనోవ్లాంటి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై దృష్టి సారించా. నా సన్నాహాలు మేటి రెజ్లర్లను ఎదుర్కొనేలా సాగుతున్నాయి. -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
భువనేశ్వర్: తొలిసారి నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) జట్టుకు మొదటి స్వర్ణ పతకం లభించింది. టెన్నిస్ ఈవెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు చాంపియన్గా అవతరించింది. గుజరాత్ యూనివర్సిటీతో జరిగిన ఫైనల్లో చిలకలపూడి శ్రావ్య శివాని, కొండవీటి అనూష, నిధిత్రలతో కూడిన ఓయూ జట్టు 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్లో అనూష 4–6, 6–7 (3/7)తో దీప్షిక షా చేతిలో ఓడింది. రెండో మ్యాచ్లో శ్రావ్య 6–0, 7–6 (9/7)తో ఈశ్వరి గౌతమ్ సేథ్ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్లో శ్రావ్య–అనూష 6–4, 6–2తో దీప్షిక–ఈశ్వరిలను ఓడించి ఓయూ జట్టుకు స్వర్ణాన్ని అందించారు. స్నేహకు కాంస్యం అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్లలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్) అథ్లెట్ ఎస్.ఎస్.స్నేహ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. స్నేహ 12.08 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఒడిశాకు చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ద్యుతీ చంద్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ) స్వర్ణం గెలిచింది. ద్యుతీ చంద్ 11.49 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. ఎస్.ధనలక్ష్మి (11.99 సెకన్లు–మంగళూరు యూనివర్సిటీ) రజత పతకాన్ని దక్కించుకుంది. -
రజతంతో సరిపెట్టుకున్న సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది. గురువారం మూడు పసిడి, ఒక రజత పతకాలను గెల్చుకున్న భారత్... శుక్రవారం ఒక రజతం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. మహిళల 65 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ తుది మెట్టుపై బోల్తా పడి రజతంతో సరిపెట్టుకుంది. ఆమె ఫైనల్ బౌట్లో 0–2తో నయోమి రుకే (జపాన్) చేతిలో ఓడింది. ఇక కాంస్య పతక పోరుల్లో వినేశ్ ఫోగట్ (53 కేజీలు) 10–0తో తి లై కియు (వియత్నాం)పై, అన్షు మాలిక్ (57 కేజీలు) 4–1తో సెవర ఇష్మురతోవ (ఉజ్బెకిస్తాన్)పై, గుర్శరణ్ ప్రీత్ కౌర్ (72 కేజీలు) 5–2తో త్సెవెగ్మెడ్ ఎంక్బయార్ (మంగోలియా)పై గెలుపొందగా... సోనమ్ మాలిక్ (62 కేజీలు) 11–0తో ఐసులూ తైన్బెకోవ (కిర్గిస్తాన్) చేతిలో ఓడింది. -
సునీల్ ‘పసిడి’ పట్టు
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామానికి తెరపడింది. 27 ఏళ్ల తర్వాత ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ గ్రీకో రోమన్ శైలిలో భారత్కు మళ్లీ స్వర్ణం లభించింది. మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు గ్రీకో రోమన్ శైలిలో భారత్కు ఒక స్వర్ణం, ఒక కాంస్యం లభించాయి. పురుషుల 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ పసిడి పతకం నెగ్గగా... 55 కేజీల విభాగంలో అర్జున్ హలకుర్కి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సునీల్ 5–0తో అజత్ సలిదినోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. తద్వారా పప్పూ యాదవ్ (1993లో; 48 కేజీలు) తర్వాత ఆసియా రెజ్లింగ్ పోటీల్లో గ్రీకో రోమన్ శైలిలో భారత్కు స్వర్ణాన్ని అందించిన రెజ్లర్గా సునీల్ గుర్తింపు పొందాడు. సెమీఫైనల్లో సునీల్ 12–8తో అజామత్ కుస్తుబయేవ్ (కజకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 8–2తో తకహిరో సురుడా (జపాన్)పై నెగ్గాడు. మరోవైపు 55 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కర్ణాటక రెజ్లర్ అర్జున్ 7–4తో డాంగ్హైక్ వన్ (దక్షిణ కొరియా)పై నెగ్గాడు. ఇతర విభాగాల్లో సచిన్ రాణా (63 కేజీలు), సజన్ భన్వాల్ (77 కేజీలు) విఫలమయ్యారు. 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మెహర్ సింగ్ (భారత్) 2–3తో రోమన్ కిమ్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
ఇంధన పొదుపులో ఆర్టీసీకి రెండు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో చురుగ్గా వ్యవహరించిన ఆర్టీసీలోని రెండు డిపోలకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టి.ఎస్.రెడ్కో) అవార్డులు దక్కాయి. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ అధీనంలోని బ్యూరో ఆఫ్ ఎఫిషియెన్సీతో కలసి టి.ఎస్.రెడ్కో శుక్రవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఆర్టీసీ అధికారులు బంగారు, వెండి పురస్కారాలు అందుకున్నారు. 2018–19కి గానూ నల్లగొండ డిపో 106 బస్సులు, 171.51లక్షల కిలోమీటర్ల ఆపరేషన్తో 1.65లక్షల లీటర్ల ఇంధనం ఆదా చేసింది. తద్వారా రూ.1.09 కోట్ల ఖర్చు తగ్గింది. దీంతో ఇంధన పొదుపులో నల్లగొండ డిపో టాప్గా నిలిచి బంగారు పతకం దక్కించుకుంది. కల్వకుర్తి డిపోలో 77 బస్సులతో 98.71లక్షల కిలోమీటర్లు ఆపరేట్ చేసి, 1.37లక్షల లీటర్ల ఇంధనం ఆదాతో రూ.91.45 లక్షల ఖర్చు తగ్గింది. ఆ డిపో వెండి పతకం సాధించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) సి.వినోద్ కుమార్, సీఎంఈ టి.రఘునాథరావు, నల్లగొండ రీజినల్ మేనేజర్ వెంకన్న, నల్లగొండ, కల్వకుర్తి డిపో మేనేజర్లు సురేశ్, సుధాకర్ పురస్కార స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘స్వర్ణ’ సాత్విక
కఠ్మాండు (నేపాల్): తమ పతకాల వేటను కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత్ ‘ట్రిపుల్ సెంచరీ’కి చేరువైంది. పోటీల తొమ్మిదో రోజు సోమవారం భారత్ ఏకంగా 42 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 27 స్వర్ణాలు, 12 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 159 స్వర్ణాలు, 91 రజతాలు, 44 కాంస్యాలతో కలిపి మొత్తం 294 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 195 పతకాలతో (49 స్వర్ణాలు+54 రజతాలు+92 కాంస్యాలు) నేపాల్ రెండో స్థానంలో ఉంది. నేడు క్రీడలకు చివరి రోజు కావడం... ఇంకొన్ని ఈవెంట్స్లో భారత్ బరిలో ఉండటంతో మన పతకాల సంఖ్య 300 దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. సోమవారం టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్స్లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మహిళల సింగిల్స్లో ఇద్దరు తెలుగమ్మాయిలు సామ సాత్విక, బవిశెట్టి సౌజన్య మధ్య ఫైనల్ జరిగింది. సాత్విక 4–6, 6–2, 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో మోచేతి గాయం కారణంగా సౌజన్య వైదొలిగింది. దాంతో సాత్వికకు స్వర్ణం ఖాయమైంది. మిక్స్డ్ డబుల్స్లో పసిడి నెగ్గిన సౌజన్య రజతంతో సంతృప్తి పడింది. పురుషుల సింగిల్స్లో మనీష్ సురేశ్ కుమార్ (భారత్) 6–4, 7–6 (8/6)తో భారత్కే చెందిన డేవిస్ కప్ జట్టు సభ్యుడు, విశాఖపట్నం ప్లేయర్ సాకేత్ మైనేనిపై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. బాక్సింగ్లో భారత్కు ఆరు స్వర్ణాలు, ఒక రజతం లభించింది. అంకిత్ ఖటానా (75 కేజీలు), వినోద్ తన్వర్ (49 కేజీలు), సచిన్ సివాచ్ (56 కేజీలు), గౌరవ్ చౌహాన్ (91 కేజీలు), కలైవాని శ్రీనివాసన్ (మహిళల 48 కేజీలు), పర్వీన్ (మహిళల 60 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. మనీశ్ కౌశిక్ (పురుషుల 64 కేజీలు) రజతం గెలిచాడు. మంగళవారం రెజ్లింగ్లో గౌరవ్ బలియాన్ (పురుషుల 74 కేజీలు), అనితా షెరోన్ (మహిళల 68 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లకే స్వర్ణాలు లభించాయి. పురుషుల ఫైనల్లో భారత్ 51–18తో శ్రీలంకపై, మహిళల జట్టు 50–13తో నేపాల్పై గెలిచాయి. భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఫైనల్లో 2–0తో నేపాల్పై నెగ్గి వరుసగా మూడోసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. -
బ్యాడ్మింటన్లో డబుల్ ధమాకా
పొఖార (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో తొలి రోజు భారత్కు ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్లో భారత పురుషుల, మహిళల జట్లు టీమ్ విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 3–1తో శ్రీలంకపై... మహిళల టీమ్ ఫైనల్లో భారత్ 3–0తో శ్రీలంకపై నెగ్గాయి. భారత్ తరఫున రెండు సింగిల్స్లో శ్రీకాంత్, సిరిల్ వర్మ గెలిచారు. డబుల్స్ మ్యాచ్లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జంట ఓడిపోగా... మరో డబుల్స్ మ్యాచ్లో గారగ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంట నెగ్గడంతో భారత్కు స్వర్ణం ఖాయమైంది. భారత మహిళల జట్టు తరఫున రెండు సింగిల్స్లలో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, పుల్లెల గాయత్రి గెలుపొందగా... డబుల్స్ మ్యాచ్లో సిక్కి రెడ్డి–మేఘన జంట నెగ్గి పసిడి పతకాన్ని అందించారు. మరోవైపు పురుషుల ట్రయాథ్లాన్ వ్యక్తిగత విభాగంలో ఆదర్శ సినిమోల్ స్వర్ణం సాధించాడు. తైక్వాండోలో పురుషుల అండర్–29 పోమ్సె పెయిర్ ఈవెంట్లో, అండర్–23 పోమ్సె టీమ్ ఈవెంట్లో భారత్కు స్వర్ణాలు లభించాయి. -
మన బాక్సర్ల పసిడి పంచ్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 12 పతకాలు సాధించి తమ సత్తా చాటుకుంది. ఆదివారం మహిళల విభాగంలో బరిలో నిలిచిన ఐదుగురు బాక్సర్లు పసిడి పంచ్లతో సత్తా చాటగా... పురుషుల విభాగంలో ఇద్దరు బాక్సర్లు తుది పోరులో ఓడి రజతాలతో సంతృప్తి చెందారు. మహిళల ఫైనల్స్లో పూనమ్ (54 కేజీలు) వికి కాయ్ (చైనా)పై, సుష్మా (81 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బకీత్జాన్కిజీపై, నోరెమ్ చాను (51 కేజీలు) అనెల్ బార్కీపై (కజకిస్తాన్)పై, వింకా (64 కేజీలు) హైని నులాతైయాలి (చైనా)పై, సనమచ చాను (75 కేజీలు) నవ్బఖోర్ ఖమిదోవ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు. పురుషుల ఫైనల్స్లో సెలాయ్ సోయ్ (49 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బజార్బే ఉల్లూ ముఖమెద్సైఫీ చేతిలో, అంకిత్ నర్వాల్ (60 కేజీలు) జపాన్ బాక్సర్ రెటో త్సుత్సుమె చేతిలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. వీరితో పాటు అరుంధతీ చౌదరి (69 కేజీలు), కోమల్ప్రీత్ కౌర్ ( ప్లస్ 81 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సతేందర్ సింగ్ (91 కేజీలు), అమన్ (91+ కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
జూనియర్ల పంచ్కు డజను పతకాలు
న్యూఢిల్లీ: సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో భారత్ 12 పతకాలు సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. దీంతో భారత బాక్సింగ్ జట్టు రన్నరప్గా నిలిచింది. తమన్నా (48 కేజీలు), అంబేశొరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఫైనల్లో తమన్నా 5–0తో అలెనా ట్రెమసొవా (రష్యా)పై ఏకపక్ష విజయం సాధించడంతో ‘ఉత్తమ విదేశీ బాక్సర్’ కేటగిరీలో కూడా అవార్డు పొందింది. మిగతా ఫైనల్ బౌట్లలో అంబేశొరి 3–2తో డ్యునా సిపెల్ (స్వీడన్)పై, ప్రీతి దహియా 3–2తో క్రిస్టినా కర్టత్సెవా (ఉక్రెయిన్)పై నెగ్గారు. ప్రియాంక 5–0తో ఓల్గా పెట్రష్కొ (రష్యా)ను కంగుతినిపించింది. అంజూ దేవి (50 కేజీలు), సిమ్రన్ వర్మ (52 కేజీలు), మాన్సి దలాల్ (75 కేజీలు), తనిశ్బిర్ కౌర్ సంధు (80 కేజీలు) రజతాలు నెగ్గగా, ఆశ్రేయ (63 కేజీలు), నేహా (54 కేజీలు), ఖుషి (70 కేజీలు), అల్ఫియా (ప్లస్ 80 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. 20 దేశాలకు చెందిన 160 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో 13 మంది సభ్యులతో కూడిన భారత బృందం 12 పతకాలు గెలుపొందడం విశేషం. -
‘టాప్’గా ముగించారు
బీజింగ్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ మూడు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. భారత్కంటే ఎక్కువగా చైనా (2 స్వర్ణాలు, 2 రజతాలు, కాంస్యం), రష్యా (స్వర్ణం, 3 రజతాలు, 3 కాంస్యాలు), కొరియా (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు గెల్చుకున్నాయి. అయితే ‘టాప్’ ర్యాంక్ను సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు కాబట్టి భారత్కు అగ్రస్థానం లభించింది. చివరి రోజు మాత్రం భారత షూటర్లకు నిరాశ ఎదురైంది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫయింగ్లో మను, రాహీ, చింకీ యాదవ్ ఫైనల్కు అర్హత సాధించలేదు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్లో గాయత్రి, సునిధి, కాజల్ విఫలమయ్యారు. -
పతకాలను ఛేదించింది
అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి గురి చూస్తే, అతడికి పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించేది కాదు. అందుకే గొప్ప విలుకాడయ్యాడు. రామాయమ్మ విల్లు ఎక్కిపెట్టి గురి చూసినా అంతే.. బాణం లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. అందుకే రామాయమ్మ చేతిలో బాణాన్ని రామబాణం అంటారు ఆమె గురించి తెలిసిన వాళ్లు. విలువిద్య మగవాళ్లకే పరిమితం అని ఎవరూ నిర్దేశించలేదు, కానీ మహిళలు ఆసక్తి చూపకపోవడంతో ఆ కళకు మగవాళ్ల విద్య అనే ముద్ర పడింది. ఆ ముద్రను కూడా బాణంతో ఛేదించింది రామాయమ్మ. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. కడబాల రామాయమ్మది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం. ఆదివాసీ మహిళ. ప్రస్తుతం ఆమె దేవీపట్నం మండలం ముసినికుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా అమ్మాయిలకు విలువిద్యలో శిక్షణనిస్తున్నారు. నాన్న నేర్పించాడు ‘‘చిన్నప్పుడు నాన్న నాకు ఆడుకోవడానికి విల్లంబులు తయారు చేసిచ్చాడు. అలా బాణాలు వేయడం అలవాటైంది. మాది గంగవరం మండలం మోహనాపురం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే. హైస్కూల్కి అడ్డతీగలకు వెళ్లాను. ఆ స్కూల్లో పీఈటీ రాజయ్య సార్ నేను బాణాలు వేయగలనని గుర్తించి మరిన్ని మెళకువలు నేర్పించారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు కూడా తీసుకెళ్లారు. జాతీయ స్థాయిలో, రూరల్ విలువిద్య పోటీల్లో బంగారు పతకాలు వచ్చాయి. ఆ తర్వాత పంజాబ్, ఒడిషా, కేరళ, మధ్యప్రదేశ్లలో జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో కూడా పతకాలందుకున్నాను. న్యూఢిల్లీలో 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించడం నాకు ఇప్పటికీ సంతోషాన్నిచ్చే విషయం. రంపచోడవరం ఏజెన్సీలో పుట్టిన నేను రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించగలనని కలలో కూడా ఊహించలేదు’’ అన్నారు రామాయమ్మ. స్వతహాగా అబ్బుతోంది ఏజెన్సీ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్లకు విలువిద్యలో రాణించే లక్షణం పుట్టుకతోనే అబ్బుతోందని చెప్పారు రామాయమ్మ. ‘‘తూర్పు ఏజెన్సీలో అనేక మంది విద్యార్థుల్లో విలువిద్యలో రాణించే సత్తా ఉంది. జాతీయ స్థాయి మహిళల విలువిద్య పోటీల్లో ఎర్రపాలెం పాఠశాల విద్యార్థినులు ద్వితీయస్థానం సాధించారు. నేను ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులకు విలువిద్యలో ఉత్తమ శిక్షణ ఇచ్చాను. రంపచోడవరం కేంద్రంగా ఆర్చరీ క్లబ్ ఏర్పాటు చేస్తే వీరిని నైపుణ్యం కలిగిన క్రీడాకారులగా తీర్చిదిద్దవచ్చు. ఒలింపిక్స్ ఆర్చరీ పోటీలకు ఏజెన్సీ ప్రాంతం నుంచి విలువిద్య క్రీడాకారులను పంపించాలనేది నా కోరిక’’ అన్నారామె. సాక్షి ప్రతినిధి, రంపచోడవరం -
లలితా ప్రసాద్కు రజతం
న్యూఢిల్లీ: ఇరాన్లో జరుగుతున్న మక్రన్ కప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. ఇరాన్లోని చబహర్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్ ఒక స్వర్ణంతో పాటు ఐదు రజతాల్ని గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ యువ బాక్సర్ పోలేపల్లి లలితా ప్రసాద్ (52 కేజీలు) రజతం సాధించాడు. జాతీయ చాంపియన్ దీపక్ సింగ్ 49 కేజీల కేటగిరీలో బంగారం గెలుపొందాడు. ఫైనల్లో అతను... జాఫర్ నసెరిపై నెగ్గాడు. మరో ఐదుగురు భారత బాక్సర్లు మాత్రం తుదిపోరులో కంగుతిన్నారు. ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ రజత విజేతలైన మనీశ్ కౌషిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), దుర్యోధన్ సింగ్ నెగి (69 కేజీలు), సంజీత్ (91 కేజీలు), లలితా ప్రసాద్ (52 కేజీలు) ఓడిపోవడంతో రజత పతకాలు లభించాయి. ప్రసాద్... ఒమిద్ సఫా అహ్మద్ చేతిలో, దుర్యోధన్... సజ్జద్ జాదే కెజిమ్ చేతిలో, మనీశ్... డానియెల్ షా బ„Š చేతిలో, సతీశ్... మొహమ్మద్ చేతిలో, సంజీత్... ఎల్డిన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇదివరకే ఈ టోర్నీలో రోహిత్ టొకస్ (64 కేజీలు), మన్జీత్ సింగ్ (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. -
జీవితంలో కష్టాలు.. మైదానంలో బంగారాలు
నిన్నటితో ‘దంగల్’ ముగిసింది. దంగల్ అంటే.. తెలిసిందే, కుస్తీ! పతకం కోసం కుస్తీ.. పరువు కోసం కుస్తీ.ఊరికే కుస్తీ పడితే పతకం వస్తుందా? పరువు పతాకమై ఎగురుతుందా?! ప్రత్యర్థిని పడగొట్టాలి.. విజేతగా.. నిలబడాలి! ఈసారి ఏషియన్ గేమ్స్లో.. అమ్మాయిలదే దంగల్ అంతా! అది కాదు విషయం.. జీవితంతో కుస్తీ పడి వచ్చినవాళ్లే అంతా! లేమి లోంచి మెరిసిన ఈ మేలిమి బంగారాలు ఇప్పుడు మన దేశానికి.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్లను మించిన త్రివర్ణ ‘పతకాలు’!! 2018, జకార్తా ఏషియన్ గేమ్స్.. మన అమ్మాయిల దమ్ము చూపించింది. దుమ్ము రేపింది! ఈ ఆటల్లో మెడల్స్ సాధించిన చాలామంది అమ్మాయిలు కలిమిలోంచి వచ్చినవాళ్లు కాదు. మధ్యతరగతి, ఇంకా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. ఆర్థిక బాధ్యతలను పంచుకుంటూ ఇంటి పరువునే కాదు, దేశ కీర్తినీ మోస్తున్న క్రీడాబలులు. జీవితంలోని హార్డిల్స్నూ అదే స్పిరిట్తో దాటుతున్న ఆ చిరుతలు తమ గెలుపుతో ప్రభుత్వ కర్తవ్యాన్నీ గుర్తుచేస్తున్నారు. మైదానంలో మాణిక్యాలు వినేశ్ ఫోగత్, చిత్రా ఉన్నికృష్ణన్, స్వప్నా బర్మన్, ద్యుతి చంద్, మలప్రభ జాధవ్, దివ్యా కక్రన్, హిమాదాస్, సరితాబెన్ లక్ష్మణ్ గైక్వాడ్, హర్షితా తోమర్, పింకీ బల్హారా.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం! వినేశ్ ఫోగత్.. ఈ గేమ్స్లో మనదేశ మహిళా రెజ్లర్ల బలం చూపించింది.. 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించి! ఆమె మహావీర్ సింగ్ ఫోగత్కు స్వయానా తమ్ముడి బిడ్డ. మహావీర్ కూతుళ్లు గీత, బబితాలతో సమానమైన కుస్తీ మెళకువలున్నా గ్లాస్గో, స్కాట్లాండ్ కామన్వెల్త్ గేమ్స్లో విజయం సాధించినా పెద్దనాన్న పంచన నీడగానే ఉండిపోయింది. ఈసారే ఫోగత్ అనే ఇంటిపేరుతోనే కాక వినేశ్ అనే బంగారం కాంతితో మీడియాలో బ్యానర్ అయింది. వినేశ్ ఫోగత్కు అయిదేళ్లున్నప్పుడే తండ్రి రాజ్పాల్ ఫోగత్ చనిపోయాడు. ఫోగత్కు ఒక చెల్లి, తమ్ముడు. తల్లే ఆ ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. తర్వాత వినేశ్ను మహావీర్ ఫోగత్ దత్తత తీసుకున్నాడు. తన బిడ్డలతోపాటుగా వినేశ్కూ కుస్తీ నేర్పాడు. పెళ్లి చేసి పంపకుండా ఆడపిల్లలకు కుస్తీపట్టడం నేర్పిస్తున్నాడు అంటే అత్తింట్లో జుట్టుపట్టుకొని పోట్లాడమనా అంటూ ఊరి (భివాణి, హర్యానా) పెద్దలు, కులస్థులు హేళన చేశారు, వెలివేశారు. అయినా ఫోగత్ పట్టుబట్టి ఆడపిల్లలను కుస్తీ వీరులుగా తయారు చేశాడు. అలా బతుకు యుద్ధాన్నీ నేర్చుకుంది వినేశ్. వాటిన్నిటినీ రింగ్లో ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రయోగిస్తోంది వినేశ్! చిత్రా ఉన్నికృష్ణన్ స్టోరీ సింపులేం కాదు.. కేరళలోని పాలక్కాడ్ జిల్లా, మందూరు ఆమె స్వస్థలం. చిత్రకు ఊహ తెలిసేటప్పటికే ఆకలి కడుపుతోనే ఆడుకోవడం అలవాటైంది. ఆమె తల్లిదండ్రులు కూలీలు. ఇద్దరూ కష్టడితేనే ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబానికి రెండు పూటలా తిండి దొరికేది. అర్ధాకలితో నిద్ర పోయిన రోజులే ఎక్కువ. పొట్టలో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకొని రాత్రంతా కంటికి మీద కునుకుకు దూరం చేసినా పొద్దున్నే అయిదున్నరకల్లా తను చదువుకునే సర్కారు బడిలోని గ్రౌండ్కు పరుగెత్తేది. ఆ పట్టుదలే మొన్నటి ఏషియన్ గేమ్స్లో బ్రౌంజ్ మెడల్ వచ్చేలా చేసింది. ఆకలిని జయించింది. ఆత్మవిశ్వాసంతో విధిరాతను మార్చుకుంది. ఇప్పుడు ఒలింపిక్స్లో జయమే ధ్యేయంగా ప్రాక్టీస్ను ట్రాక్లో పెడుతోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన స్వప్న బర్మన్.. హెపథ్లాన్లో బంగారు పథకం సాధించింది. ఈ అమ్మాయి కూడా పేదరికం ఫ్రెండ్షిప్తోనే పెరిగింది. తండ్రి పంచన్ బర్మన్ ఆటోడ్రైవర్. తల్లి బసనా టీ జల్పాయ్గురిలోని టీ ఎస్టేట్లో కూలీ. స్వప్నకు గోల్డ్మెడల్ వచ్చిందని తెలియగానే ఒక విషయాన్ని తలుచుకొని ఆ అమ్మ కంటతడి పెట్టింది. ‘‘అథ్లెట్స్కి బలమైన తిండి పెట్టాలి. పౌష్టికాహారం కాదు కదా నా బిడ్డకు కడుపునిండా కూడా తిండిపెట్టలేదు నేను’’ అంటూ! అయినా ఆ అమ్మాయి అమ్మ మీద అలగలేదు. నాకీ పరిస్థితి ఏంటీ అని కాళ్లు నేలకేసి కొట్టలేదు. ఆకలితో పరుగుపందెం పెట్టుకుంది. దానికి ఎప్పటికీ దొరకనంత దూరానికి వచ్చేసింది. ఒడిషా అమ్మాయి ద్యుతి చంద్కు హండ్రెడ్ మీటర్స్ రేస్లో సిల్వర్ మెడల్ వచ్చింది. మెడల్స్కన్నా టఫ్గేమ్ అయిన ఆత్మబలాన్ని దెబ్బతీసే సమస్యతో పోరాడి గెలిచింది ఆమె ఆ సక్సెస్ ముందు ఈ పథకాలు చిన్నవే. కాని ఆడడానికే ఆ పోరు నెగ్గింది కాబట్టి ఈ విజయం ద్యుతికి అమూల్యమైనదే. చేనేత కార్మికుల ఇంట ఏడుగురు సంతానంలో మూడో అమ్మాయిగా పుట్టింది ద్యుతి. ఆమె బాల్యమూ గొప్పగా ఏమీ గడవలేదు. అక్క సరస్వతి.. నేషనల్ లెవెల్ అథ్లెట్. ఆమె స్ఫూర్తితోనే ద్యుతి కూడా అథ్లెట్ అయింది. పదిహేడేళ్లకే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. విజయపరంపరతో దూసుకెళ్తున్న ద్యుతి లండన్ ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉండింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్యుతి మీద వైద్య పరీక్షలు మొదలుపెట్టింది కారణం ఆమెకు చెప్పకుండానే. చివరకు ‘జెండర్ టెస్ట్’లో ఫెయిల్ అయినందుకు ఒలిపింక్స్లో పాల్గొనే చాన్స్ లేదని, నేషనల్ ఛాంపియన్షిప్ కూడా వదులుకోవాలని చెప్పారు ఆమెతో. ఆ మాట ఆమెను అచేతనం చేసింది. జెండర్టెస్ట్లో ఫెయిలవడానికి దారితీసిన ఆమె శారీరక పరిస్థితిని హైపర్ఆండ్రోనిజమ్ అంటారు. సాధారణ మహిళల్లో ఉండే కంటే ఎక్కువ పాళ్లలో ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హర్మోన్లు ఆమె శరీరంలో ఉన్నాయి. ఈ స్థితిలో ఆమె స్త్రీలకు సంబంధించిన అథ్లెట్స్లో పాల్గొనే అవకాశం లేదు. ఆమెకు రెండే దారులు. ఒకటి.. ఆటలకు శాశ్వతంగా దూరం కావడం, రెండు.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్లి ఆండ్రోజెన్ హర్మోన్ లెవెల్స్ను తగ్గించుకోవడం. అయితే ద్యుతి మూడో ఆప్షన్ను ఎన్నుకుంది. అలాంటి టెస్ట్కు వ్యతిరేకంగా పోరాడాలని. తనకు ఎదురైంది ఇంకే అమ్మాయికి ఎదురు కావద్దని. గెలిచింది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఆమెది గెలుపు దారే! మలప్రభా జాధవ్.. రైతు బిడ్డ. కర్ణాటకలోని తుర్మూరు ఆమె జన్మస్థలం. జూడో కేటగిరీ కురాష్లో కాంస్య పథకం సాధించింది. ‘‘కురాష్ అనే ఒక ఆట ఉంటుందని కూడా నాకు తెలియదు. అమ్మాయిలకు ఈ ఆట వస్తే చాలా మంచిది. మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉంది. నేర్పించండి అని కోచ్ చెబితే సర్లే స్కూల్లోనే కదా నేర్పిస్తున్నారు అని చేర్పించా’’ అన్నాడు మలప్రభ తండ్రి యెల్లప్ప జాధవ్. ఇప్పుడు కూతురు మెడల్ కొట్టిందని తెలియగానే ఆయన ఆనందానికి అంతులేదు. అన్నట్టు మలప్రభ తుర్మూరు పక్కనుంచే పారే ఒక నది. ఆ పేరే కూతురికి పెట్టుకున్నాడు యెల్లప్ప. తగ్గట్టుగానే ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది మలప్రభ. దివ్యాకక్రన్.. మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల రెజ్లింగ్ పోటీల్లో బ్రౌంజ్ మెడల్ తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టిపెరిగిన దివ్యా దిగివ మధ్యతరగతి కుటుంబం. నాయి సామాజికవర్గం. తల్లి లంగోటాలు కుడితే.. తండ్రి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర వసతులతో అడ్జస్ట్ అవుతూ స్పోర్ట్స్లో సత్తా చూపుతోంది దివ్యా. స్పోర్ట్స్కోటాలోనే నోయిడా కాలేజ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచలర్స్ డిగ్రీ చేస్తోంది. హిమాదాస్.. జకార్తా ఏషియన్ గేమ్స్ కన్నా ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన అథ్లెట్. అస్సాంలోని నాగోన్ జిల్లా, కంధులిమరి అనే ఊళ్లో పుట్టింది. తండ్రి రొంజిత్ దాస్, జొనాలి దాస్ తల్లిదండ్రులు. రైతులు. అయిదుగురు పిల్లల్లో ఆఖరు సంతానం హిమాదాస్. ఈశాన్య రాష్ట్రాలంటే మిగతా దేశానికి ఉన్న చిన్నచూపు, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొంది హిమా. ముందు ఫుట్బాల్ అంటే ఆసక్తి చూపింది. బాగా ఆడేది కూడా. కాని మన దగ్గర ఫుట్బాల్ పట్ల అనాదరణ, అసలు మహిళా టీమ్ అన్న జాడే లేకపోవడంతో అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది. విజయాల ట్రాక్ మీద ఉరుకుతూ మొన్నటి ఏషియన్ గేమ్స్లో మహిళల 400 మీటర్స్ డెస్టినేషన్లో సిల్వర్ సాధించింది. సరితాబెన్ లక్ష్మణ్భాయి గాయక్వాడ్.. గుజరాత్కు చెందిన ట్రైబల్ గర్ల్. దుగా జిల్లాలోని ఖరాది అంబ స్వగ్రామం. పేదింటి పిల్ల. ఏషియన్గేమ్స్లో పాల్గొనేందుకు అరకొర డబ్బుల్తోనే జకార్తా వచ్చింది. డబ్బు సరిపోవట్లేదని గుజరాత్లో తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్లు డబ్బు పంపారు. ఈ గేమ్స్లో 4 ఇంటూ 400 రిలేలో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. పింకీ బల్హారా... ఢిల్లీ అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. జూడో అంటే ఇష్టం. ఈ ఏషియన్ గేమ్స్లో కురాష్లో రజత పథకం సాధించింది. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచీ హార్డిల్సే. ఉమ్మడి కుటుంబంలో కజిన్ చనిపోయాడు. ఆ తర్వాత హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. ఆ విషాదాన్ని పిడికిలిలో బిగించి రింగ్లోకి వచ్చింది. కొడుకు పోయాడన్న దిగులుతో పింకీ తాత (తండ్రి తండ్రి) చనిపోయాడు. ఈ విషయాన్ని పింకీకి చెప్పకుండా దాచారు ఇంట్లోవాళ్లు. ఆమె పోటీలో నెగ్గాక విషయం చెప్పారు. పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువన పెట్టి పథకం తెచ్చింది. కూతురికి తోడుగా జకార్తా వెళ్లాలనుకున్నాడు పింకీ వాళ్ల నాన్న. ఆమె గెలుపు చూడకుండానే వెళ్లిపోయాడు. కండబలంతో మైదానాన్ని ఓడిస్తూ .. గుండెబలంతో జీవితాన్ని విన్ అవుతున్నారు వీళ్లంతా! బతుకు పోడియం ఎక్కి సమాజం సృష్టించిన తారతమ్యాలు తలదించుకునేలా చేస్తున్నారు. ఈ సామర్థ్యాన్ని ఇంకా పరీక్షించొద్దు. ఈ ప్రతిభకు ఇంకా పోటీలు పెట్టొద్దు. ఎన్ని అడ్డంకులున్నా దీక్షకు అడ్డురావని చూపారు. ఆటలు అనగానే ఒక సానియా, ఒక సైనా.. ఒకే ఒక సింధు కాదు.. ఏషియన్ గేమ్స్లో ఇండియా జెండా ఎగరేసిన చాలామంది క్రీడాకారిణులున్నారు. స్పాన్సర్షిప్స్కు ఒక టెన్నిస్.. ఇక స్వా్కషే కాదు.. అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. ఆటలను గ్లామర్ హంగులతో కాదు... స్పోర్టివ్ స్పిరిట్తో చూద్దాం! వీళ్ల జీవితాలను ట్రాక్ మీదకు తెద్దాం! – సరస్వతి రమ -
ఏషియాడ్: జయహో భారత్
-
కరాటేలో ‘యూనివర్సల్’కు పతకాలు
తల్లాడ ఖమ్మం : వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6న జరిగిన రాష్ట్ర స్థాయి షోటోకాన్ కరాటే చాంపియన్ షిఫ్లో స్థానిక యూనివర్సల్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుపొందారు. గురు షోటోకాన్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీల్లో స్పారింగ్ విభాగంలో జే.విజయ్, డి.నవీణ్, ఎన్.తరుణ్, బి.అయ్యప్ప, డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను గెలుపొందారు. నాగ చైతన్య, బి.కల్యాణి, డి.వరుణ్, కిషోర్, ప్రజ్ఞాన్, ఆదిత్య ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. కటాస్ విభాగంలో డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. కె.మణికంఠ, జే.ముఖేష్, ఎన్.రామ్చరణ్, డి.త్రినాగ్రెడ్డి, ప్రజ్ఞాన్ ఆదిత్య, బి.రేవంత్, జే.ఉపేందర్ ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను సాధించారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ టీ.కే.ప్రసన్నన్, డైరెక్టర్ టీ.కే.మేరిసోఫియా, ప్రిన్సిపాల్ జి.రవికాంత్, రాము, ప్రసాద్, యోహాన్, యాకోబు అభినందించారు. -
కామన్వెల్త్ క్రీడా విజేతలకు ఘనస్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్ను ఓడించడం విశేషం. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
పసిడి వెలుగులు కొనసాగాలి
పన్నెండేళ్ల తరవాత మళ్లీ తాను ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 2006లో మెల్బోర్న్లోను, తాజాగా గోల్డ్కోస్ట్లో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యాలు– మొత్తం 198 పతకాలు మెడలో వేసుకుంది. బ్రిటన్ వలస దేశాల మధ్య నాలు గేళ్లకోసారి జరిగే ఈ క్రీడల్లో 71 దేశాలు పాల్గొనగా 36 దేశాలు కనీసం కాంస్యమైనా సాధించి పతకాల జాబితాలో తమ పేరును చూసుకున్నాయి. మన జట్టు విషయానికొస్తే– పతకాల సంఖ్య దాదాపుగా అంతే. కానీ ప్రతిభ మెరుగుపడింది. నాలుగేళ్ల కిందట 15 స్వర్ణాలకు పరిమితమైన భారత క్రీడాకారులు ఈ సారి 26 పసిడి పతకాలు సాధించి సత్తా చూపించారు. 2014లో యూకేలోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో 64 పతకాలకే పరిమితం కాగా, ఈసారి 26– 20– 20 చొప్పున మొత్తం 66 పత కాలతో మూడో స్థానంలో నిలిచారు. ఇక గ్లాస్గోలో నిర్వహణ దేశంగా టాప్ ర్యాంక్లో నిలిచిన ఇంగ్లండ్ ఈసారి 45 స్వర్ణాలు, 45 రజతాలు, 46 కాంస్యాలతో 136 పతకాలు గెలిచి రెండో స్థానానికి పరిమితమయింది. ప్రపంచమంతా పాల్గొనే ఒలింపిక్స్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, కజకిస్థాన్ వంటి దేశాల దిగ్గజాలు పాల్గొనే ఆసియా గేమ్స్తో పోలిస్తే కామన్వెల్త్ క్రీడల స్థాయి తక్కువే. అయినా ఈసారి భారత క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 1930 నుంచీ పాల్గొంటున్న భారత్కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఎనిమిదేళ్ల కిందట సొంతగడ్డపై జరిగిన ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలు కలిపి 101 పతకాలు గెలిచి రెండో స్థానం సాధించింది. ఆ తరవాత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీమ్ విభాగాలతో పాటుగా వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు మెరిపించి పతకాలతో మురిపించారు. అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా, షూటింగ్లో మను భాకర్, అనీశ్ భన్వాలా, బాక్సింగ్లో గౌరవ్ సోలంకి, వెయిట్ లిఫ్టింగ్లో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్, టేబుల్ టెన్నిస్లో మనిక బాత్రా, బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయి రాజ్, మహిళల రెజ్లింగ్లో వినేశ్ ఫొగాట్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో భారత క్రీడా భవితకు భరోసానిచ్చారు. బాక్సింగ్లో మేరీకోమ్, షూటింగ్లో తేజస్విని సావంత్, సంజీవ్ రాజ్పుత్, టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్, రెజ్లింగ్లో సుశీల్ కుమార్ తదితరులు మూడు పదుల వయసు దాటిపోయినా యువ క్రీడాకారులకు దీటుగా రాణిస్తూ, పట్టుదల ఉంటే అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించడం సాధ్యమేనని నిరూపించారు. గోల్డ్కోస్ట్ క్రీడల్లో భారత్కు తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలూ ఎదు రయ్యాయి. క్రీడల ప్రారంభానికి ముందే క్రీడా గ్రామంలో భారత బాక్సర్లు బస చేసిన చోట సిరంజ్లు దొరకడం కలకలం రేపింది. వెంటనే బాక్సర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అందరికీ క్లీన్చిట్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. క్రీడా గ్రామంలో ‘నో నీడిల్స్’ నిబంధనపై అవగాహన లేకపోవటం వల్లే ఈ పొరపాటు జరిగిందని భారత బృందం ఇచ్చిన వివరణతో నిర్వాహకులు సంతృప్తి చెంది హెచ్చరికతో వదిలేశారు. కానీ పోటీల చివర్లో అథ్లెట్స్ ఇర్ఫాన్, రాకేశ్బాబు గదిలో సిరంజ్లు దొరకడంతో వారిద్దరినీ క్రీడా గ్రామం నుంచి బహి ష్కరించారు. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపిస్తామని, దోషులుగా తేలితే వారిద్దరిపై చర్యలు తీసుకుంటామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించింది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన తండ్రికి క్రీడా గ్రామంలో ప్రవేశం పొందేలా అక్రెడిటేషన్ జారీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడల నుంచి వైదొ లుగుతానని సైనా హెచ్చరించడంపై విమర్శలు రేగాయి. భారత ఒలింపిక్ సంఘం అధికారులు సైనా సమస్యను పరిష్కరించటంతో వివాదం సద్దుమణిగింది. ఇక జాతీయ క్రీడ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతో తిరిగి రావటం, బాస్కెట్బాల్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించటం, లాన్ బాల్స్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్లలో మనోళ్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటం... ఇవన్నీ నాణేనికి మరోవైపు. నిజానికి కామన్వెల్త్ క్రీడల్లో కొన్నేళ్లుగా భారత్ టాప్–10లో ఉంటోంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ఒలింపిక్స్, ఆసియా క్రీడలంత స్థాయి లేదు. అక్కడా ఇలాంటి ప్రదర్శన సాధ్యం కావాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలి. స్కూల్ స్థాయి నుంచే క్రీడలను పిల్లల రోజువారీ జీవితంలో భాగం చేయాలి. అంతర్జాతీయ వేదికలపై పతకాలు గెలిచి వచ్చాక వారిపై కోట్ల వర్షం కురిపించడం రివాజైపోయింది. మరింతమంది క్రీడాకారులు తయారయ్యేందుకు, భవిష్యత్తులో విజయాలు సాధించేందుకు ఇలాంటి నజరా నాలు ఔషధంలా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. కానీ మొక్కకు నీరుపోస్తేనే కదా చెటై్ట ఫలాలిస్తుంది! చెటై్ట పళ్లు ఇచ్చాకే చుట్టూ కోట కడతామంటే ఎలా? అద్భుతమైన క్రీడాకారులుగా ఎదిగేందుకు క్షేత్రస్థాయి నుంచే క్రీడా మౌలిక వసతులు కల్పించాలి. గెలిచిన వారికి కోట్లు కాకుండా సత్తా ఉన్నవారిని గుర్తించేందుకు, వారిని గెలిచేలా తీర్చి దిద్దేందుకు కోట్లు ఖర్చుపెట్టాలి. మట్టిలో మాణిక్యాలను వెదికే క్రీడా ప్రతిభాన్వేషణ ప్రక్రియ నిరంతర ప్రక్రియగా మారాలి. స్కూల్ స్థాయిలో ప్రతిభను గుర్తించే సదుద్దేశంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవలే ‘ఖేలో ఇండియా జాతీయ స్కూల్ గేమ్స్’కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ క్రీడల్లో 12 మంది యువ క్రీడాకారులు డోపింగ్లో పట్టుబడటం కలవరపరిచే అంశం. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో రజత పతకం గెలిచిన షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ క్రీడల మంత్రిగా ఉన్నారు. క్రీడలపై క్రీడాకారుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటే క్రీడాభివృద్ధికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ‘గోల్డ్ కోస్ట్’ ప్రదర్శన గాలివాటం కాదని, భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోందనే విష యంలో నిజం ఉందని తేలాలంటే ఆగస్టు–సెప్టెంబర్లో జకార్తాలో జరగబోయే ఆసియా క్రీడల్లో మన ప్రతిభ మెరుగుపడాలి! -
కామన్వెల్త్ ప్రస్థానం
-
ఆఖరి రోజూ భారత్ పతకాల జోరు
గోల్డ్కోస్ట్, క్వీన్స్లాండ్ : 21వ కామన్వెల్త్ గేమ్స్ ఆఖరి రోజు భారత్ పతకాల పంట పండింది. 11వ రోజు మహిళల బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ బంగారు పతకం సాధించగా, పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో శ్రీకాంత్ రజత పతకం సాధించారు. మలేసియా షట్లర్ లీ చోంగ్ వీతో జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి చవి చూశారు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో ఇంగ్లండ్తో తలపడిన భారత్ వరుస సెట్లలో ఓడిపోయి రజత పతకానికి పరిమితమైంది. టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్, ఇంగ్లండ్ ఆటగాడిని వరుస సెట్లలో మట్టికరిపించి భారత్కు కాంస్య పతకం అందించారు. స్క్వాష్ మహిళల డబుల్స్ ఫైనల్లో భారత్ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్లు న్యూజిలాండ్ జంట చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో భారత్ రజత పతకానికి పరిమితం కావాల్సివచ్చింది. పసిడి 26, రజతం 20, కాంస్యం 20 కలిపి మొత్తం 66 పతకాలతో భారత్ పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
పోటీలు మొదలవకముందే పతకం ఖాయం
గోల్డ్కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ గేమ్స్లో ఇంకా పోటీలే మొదలవలేదు. కానీ ఆతిథ్య మహిళా బాక్సర్ టేలా రాబర్ట్సన్కు పతకం ఖాయమైంది. ఆశ్చర్యమే కానీ ఇది నిజం! బుధవారం ఆరంభోత్సవం జరగ్గా, నేటి నుంచి పోటీలకు తెరలేవనుంది. అయితే మహిళల 51 కేజీల విభాగంలో పోటీదారులు లేక ఈ ఈవెంట్లో ‘డ్రా’ కుదించుకుపోయింది. ఇందులో 19 ఏళ్ల టేలాకు ‘బై’ లభించడంతో ఏకంగా సెమీస్లోకి ప్రవేశించింది. బాక్సింగ్ పోటీల్లో సెమీస్లో ఓడినా... కనీసం కాంస్యం దక్కుతుంది. కానీ తను మాత్రం కాంస్యంతోనే సరిపెట్టుకోనని... స్వర్ణం కోసమే పోరాడతానని ఆమె చెప్పుకొచ్చింది. -
లక్ష్యరేఖ
చాలా సందర్భాల్లో లక్ష్యానికి, విజయానికి మధ్య విభజన రేఖ చిన్నదిగా కనిపిస్తుంది. వింటిని గట్టిగా లాగి సూటిగా వదిలిన బాణంలా అలుపెరగక దూసుకుపోతే లక్ష్యం చిన్నదవుతుంది. ఆ సన్నని గీత చెరిగిపోయి విజయరేఖగా మారుతుంది. చివరకు తనపేరులోని రేఖను విజయ రేఖగా మార్చుకున్న జ్యోతి సురేఖలా ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. అవమానాలకు కళ్లెంవేస్తూ అవాంతరాలపై స్వారీ చేస్తూ ప్రపంచ ఆర్చరీ పటంలో తానొక పుటగా ఆవిష్కృతమవుతుంది. ప్రతిభను వెతుక్కుంటూ వచ్చే పద్మశ్రీ అవార్డులకు, ఆదర్శ పాఠాలు నేర్చుకునే వర్ధమాన క్రీడాకారులకు అర్జున అవార్డు గ్రహీత జ్యోతిసురేఖ చిరునామాగా మారుతుంది. ♦ అప్పుడు ఆ చిన్నారి పాప వయస్సు నాలుగేళ్ల 11 నెలలు. ఆ వయసులో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిని చూడటానికే భయపడతారు. అలాంటిది నదిలో 5 కిలోమీటర్ల దూరాన్ని చేపపిల్లలా మూడుసార్లు అటూ ఇటూ 3 గంటల 6 నిమిషాల వ్యవధిలో ఈదేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించేసింది. ♦ ఇప్పుడు ఆమె వయస్సు 23 సంవత్సరాలు. విలువిద్యలో ఏకలవ్యుడి శిష్యురాలిలా దూసుకుపోతోంది. విల్లు చేతబూని విలువిద్యలో తనకు సాటిలేరని నిరూపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. దేశంలోనే కాంపౌండ్ ఆర్చరీలో తొలిసారిగా, జిల్లాలో తొలి అమ్మాయిగా అర్జున అవార్డు సాధించి వర్ధమాన క్రీడాకారులకు లక్ష్యరేఖగా మారింది. ఆమె పేరే జ్యోతి సురేఖ. విజయవాడ స్పోర్ట్స్: జ్యోతి సురేఖ 1996, జూలై 3వ తేదీన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో వెన్నం సురేంద్రకుమార్, శ్రీదుర్గకు జన్మించారు. కేవలం క్రీడల్లోనే కాదు.. చదువులోనూ టాపే. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) పాసై అదే యూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. తొలుత పిన్నవయసులోనే స్విమ్మింగ్లో రాణించి.. అనంతరం ఆర్చరీని ఎంచుకుంది. అయితే, ఆర్చరీ ప్రాక్టీస్కు అవకాశం కుదరలేదు. స్థానికంగా ప్రోత్సాహం లభించలేదు. అయినా కుంగిపోకుండా, పట్టువిడవక తల్లిదండ్రులు, స్నేహితులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో ప్రాక్టీస్ చేసి ఏషియన్ గేమ్స్లో పతకం సాధించింది. ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి రాష్ట్ర, దేశఖ్యాతిని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది. ఘనత ♦ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో ప్రపంచ స్థాయిలో 14వ ర్యాంకులో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా 30 పోటీల్లో పాల్గొంటే, 8 స్వర్ణ, 8 రజత, 5 కాంస్య పతకాలు కైవసం ♦ 2015ఆర్చరీ చాంపియన్షిప్లో 80కి 80 పాయింట్లు సాధించి వరల్డ్ రికార్డు సమం. ♦ 2017లో 20వ ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో 720 పాయింట్లకు 703 పాయింట్లు సాధించిన తొలి ఇండియన్ కాంపౌండ్ ఆర్చరర్గా ఘనత. ♦ ఒకే ఏడాది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో చాంపియన్. అవార్డులు ♦ 2017లో అర్జున అవార్డు, 2014లో అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ అవార్డు, 2013లో వరల్డ్ ఆర్చరీ ఫిటా గోల్డెన్ టార్గెట్ అవార్డు, 2002లో భారత ప్రభుత్వం నుంచి ఎక్స్సెప్షనల్ అచీవ్మెంట్ అవార్డు. 2016 సాక్షి ఎక్స్లెన్సీ అవార్డు ♦ 2017 ఢాకాలో 20వ ఏషియన్ ఆర్చరీ చాంపిన్షిప్ వ్యక్తిగత విభాగంలో కాంస్య, టీమ్ విభాగంలో స్వర్ణ, మిక్స్డ్ విభాగంలో రజత పతకాలు సాధించింది. కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంది చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఆర్చరీ అంటే ఇష్టపడటంతో చేర్పించాం. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం ఆనందంగా ఉంది. – వెన్నం సురేంద్రకుమార్, జ్యోతి సురేఖ తండ్రి -
795 మందికి పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 795 మంది పోలీసు అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. ఇందులో 107 మంది అధికారులకు శౌర్య పతకాలు, 75 మందికి రాష్ట్రపతి పతకాలు, 613 మంది అధికారులకు విశిష్ట సేవా పతకాలు దక్కాయి. రాష్ట్రం నుంచి ఆరుగురికి శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు, 13 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. రాష్ట్రపతి పతకాలు.. 1. జితేందర్–ఏడీజీపీ ఆర్బీవీఆర్ఆర్ హైదరాబాద్, 2.నారాయణరావు చుంగి–డీఎస్పీ హైదరాబాద్. విశిష్ట సేవా పతకం.. 1. మస్తిపురం రమేశ్, గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్. 2. డి.శివప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్, టీఎస్ఎస్పీ. 3. పి.వీరాస్వామి, అసిస్టెంట్ కమాండెంట్, హైదరాబాద్. 4.ఎస్.రంగారావు, ఏసీపీ, హైదరాబాద్. 5.తుల్జారామ్ నరేందర్ సింగ్, డీఎస్పీ, హైదరాబాద్. 6.చెట్లూరు శ్రీనివాస శాంతి, ఇన్స్పెక్టర్, హైదరాబాద్. 7.గెడ్డిపల్లి రణవీర్రెడ్డి, ఇన్స్పెక్టర్, హైదరాబాద్. 8.పల్లె శంకర్రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్. 9.ఎండీ ఫయాజ్ అహ్మద్ షరీఫ్, ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్. 10. వేమూరి శివానందరావు, హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్. 11. రాథోడ్ రోహిదాస్ నాయక్, ఏఏసీ హెచ్సీ, హైదరాబాద్. 12.పి.శ్రీనివాస్, జూనియర్ కమాండో, హైదరాబాద్. 13. ఎం.సిద్ధయ్య, హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్. పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ జి.సురేశ్–జేసీ, ఎం.మురళి – జేసీ, బి.శ్రీరాములు–ఏఏసీ, వెంకట శ్రీనివాస్ రెడ్డి–ఏఏసీ, పి.లక్ష్మణుడు–జేసీ, హరీశ్–జేసీ -
పదిలో ప్రతిభకు పతకాలు
కర్నూలు(అగ్రికల్చర్): పదో తరగతి పరీక్షల్లో పదికి పదిపాయింట్లు సాధించిన జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఆ శాఖ డీడీ శనివారం బంగారు పతకాలు బహూకరించారు. ఎం.హారిక, పి.గౌతమ్, షేక్ అక్షాతంజిలా, పి.రేఖప్రియ, కే.సాయితేజ, షేక్గౌషియాకు డీడీ గోల్డ్ మెడల్స్ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలని, అపుడే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలవుతుందన్నారు. మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులు ఇస్తే మరింత ప్రోత్సహించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీ సుబ్రమణ్యం, ఏటీఓలు శ్రీనివాసులు, రవికుమార్, ఎస్టీఓలు రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒలింపిక్ మెడల్స్ ఎలా తయారుచేస్తున్నారంటే..
వాషింగ్టన్ : ఈసారి టోక్యోలో జరుగబోతున్న 2020 ఒలింపిక్స్ నేచర్ ఫ్రెండ్లీగా ఎప్పటికీ అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. ఒలింపిక్స్లో విజయ కెరటం ఎగురవేసిన వారికి ఇచ్చే మెడల్స్ను వినూత్న పద్ధతిలో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. పాతబడి వాడుకలో లేకుండా మనం పక్కన పడేసిన మొబైల్ ఫోన్లను రీసైక్లింగ్ చేసి పతకాలను రూపొందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సంప్రదాయంగా ఒలింపిక్, పారాలింపిక్స్ గేమ్స్లో అందించే పతకాలను బంగారం, వెండి, కాంస్యంతో తయారుచేసేవారు. కానీ ఈ కొత్త డెవలప్మెంట్తో అవసరం, వాడుకలో లేని మొబైల్ ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తమకు అందించాలని జపనీస్ ప్రజలను నిర్వాహకులు కోరుతున్నారు. వాటితో 5000 మెడల్స్ రూపొందిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ నుంచి స్థానిక ఆఫీసులు, టెలికాం స్టోర్ల ద్వారా సేకరిస్తున్న బాక్స్లో ఎనిమిది టన్నుల మెటల్ను సేకరించినట్టు అంచనావేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రీసైక్లింగ్ చేసిన మెటీరియల్స్తో ఒలింపిక్ మెడల్స్ను రూపొందించడం ముందటి క్రీడల్లో కూడా జరిగిందని చెబుతున్నారు. గతేడాది వేసవిలో జరిగిన రియో ఒలింపిక్స్లో 30 శాతం వెండి, కాంస్య పతకాలను రీసైక్లింగ్ మెటీరియల్స్తోనే రూపొందించినట్టు వివరించారు. -
30 ఏళ్ల తరువాత వరల్డ్ కప్ పతకాలు..
సిడ్నీ:ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్కు సంబంధించిన పతకాలను ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆదివారం అందుకోనున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆరంభమయ్యాక నాల్గో ఎడిషన్ టైటిల్ను ఆసీస్ తొలిసారి సాధించింది. 1987లో వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను ఆసీస్ అందుకున్నా.. విజయంలో పాలు పంచుకున్న క్రికెటర్లకు పతకాలు అందలేదు. అప్పట్లో వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చే దేశ క్రికెట్ బోర్డుపైనే అంతా ఆధారపడేది. అప్పట్లో మెగా క్రికెట్ ఈవెంట్లలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఆ క్రమంలోనే ఆనాటి వరల్డ్ కప్ సాధించిన ఆసీస్ జట్టులో భాగస్వామ్యమైన క్రికెటర్లకు పతకాలు అందలేదు. 1987 వన్డే వరల్డ్ కప్ను భారత్-పాకిస్తాన్ జట్లు సంయుక్తంగా నిర్వహించాయి. అయితే వరల్డ్ కప్ విజయంలో భాగస్వామ్యమైన అప్పటి ఆసీస్ ఆటగాళ్లకు పతకాలను ఇవ్వాలని గతేడాది జూన్లో ఐసీసీ నిర్ణయించింది. ఆసీస్ ఆటగాళ్లతో పాటు, సహాయక సిబ్బందికి కూడా పతకాలను ఇచ్చేందుకు ఐసీసీ మొగ్గు చూపింది. ఈ మేరకు రేపు సిడ్నీలో పాకిస్తాన్ తో జరిగే నాల్గో వన్డే విరామ సమయంలో ఆసీస్ వెటరన్లు పతకాలను అందుకోనున్నారు. ఇలా ఐసీసీ ముందుకు రావడంపై ఆనాటి వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ అలెన్ బోర్డర్ హర్షం వ్యక్తం చేశాడు. చాలా ఏళ్ల తరువాత తమకు ఈ తరహాలో గౌరవం అందడం ఎంతో గర్వంగా ఉందని బోర్డర్ పేర్కొన్నాడు. -
భారత్కు మరో రెండు స్వర్ణాలు
ప్రపంచ క్యారమ్ చాంపియన్షిప్ హైదరాబాద్: ప్రపంచ క్యారమ్ చాంపియన్షిప్లో భారత్కు మరో రెండు పసిడి పతకాలు లభించారుు. టీమ్ విభాగంలో మహిళల జట్టు, డబుల్స్ విభాగంలో పురుషుల జట్టు విజేతలుగా నిలిచారుు. బర్మింగ్హమ్లో గురువారం జరిగిన మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్లో అపూర్వ, కాజోల్ కుమారి, పరిమళా దేవి, టుబాసేహర్లతో కూడిన భారత జట్టు 3-0తో శ్రీలంక జట్టును ఓడించి టైటిల్ను గెలుచుకోగా..పురుషుల జట్టు 1-2 తో శ్రీలంక చేతిలో ఓడిపోరుుంది. మరోవైపు డబుల్స్ విభాగంలో భారత పురుషుల జట్టు స్వర్ణం, రజతంతో రాణించింది. ఫైనల్లో సందీప్- రియాజ్ (భారత్) జంట 13-25, 23-13, 25-12తో భారత్కే చెందిన శంకర- ప్రశాంత్ జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత్కు స్వర్ణం లభించింది. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో అనంత క్రీడాకారుల ప్రతిభ
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో అనంత క్రీడాకారులు ప్రతిభ కనబరిచారని పీఈటీ మంజుల, కోచ్ సంజీవరాయుడు తెలిపారు. ఈనెల 4 నుంచి 6 వరకు విశాఖపట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో పతకాల పంట పండించారని వారు చెప్పారు. వీరు ఈ విజయాలతో ఈ నెల 11 నుంచి 15 కొయంబత్తూరులో జరిగే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని వారు తెలిపారు. పరుగు పోటీలు అండర్–16 విభాగంలో యశ్వంత్–మొదటి స్థానం అండర్–18 విభాగంలో రాఘవేంద్ర– రెండవ స్థానం మహేశ్వరరెడ్డి–100 మీటర్లు–మూడవ స్థానం అండర్–20 విభాగంలో స్వాతి–5 కీ.మీ–రెండవ స్థానం (బాలికలు) కిరణ్కుమార్–5కీ.మీ–మూడవస్థానం (బాలుర విభాగం) స్వాతి–3కీ.మీ–రెండవస్థానం నడక పోటీలు శ్రీనివాసులు–10కీ.మీ–మొదటì స్థానం(బాలుర విభాగం) కృష్ణవేణి–10 కీ.మీ– రెండవ స్థానం (బాలికల విభాగం) బండిశ్రీకృష్ణ–డిస్కస్త్రో–మూడవ స్థానం(బాలుర విభాగం) -
పట్టుదలతోనే పతకాల సాధన
గుంటూరు స్పోర్ట్స్: పట్టుదల, క్రమశిక్షణతో రాణిస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చని ఆర్వీఆర్ కాలేజీ ఆధ్యాపకులు కొల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఏసీ కళాశాల ఎదురు గల ఉల్ఫ్ హాలులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల చిన్నారులకు టెన్నిస్ సెంటర్లో శనివారం టాలెంట్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీనివాసరావు విజేతలకు పతకాలు బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ టోర్నమెంట్లు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతాయన్నారు. టెన్నిస్ సెంటర్ కోచ్ ఎం.ఇజ్రాయిల్ మాట్లాడుతూ క్రీడలపై చిన్నారుల్లో ఆసక్తి కల్గించేందుకు టోర్నమెంట్లు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై.షేక్, సీనియర్ క్రీడాకారుడు జోయల్, అస్టింట్ కోచ్లు జయకర్, గోపి, సురేంద్ర, క్రీడాకారులు మనోహర్, చేతన్, రామ్చరణ్, చేతన్ ప్రాఖ్యత్ రెడ్డి, షేక్ చిష్టి, కొల్లా గోష్ప«ద్నాథ్, విహర్, జితేంద్ర నాగసాయి, తదితరులు పాల్గొన్నారు. -
యోగాలో ఏఎంజీ విద్యార్థుల ప్రతిభ
దక్షిణ భారత స్థాయిలో పతకాల సాధన చిలకలూరిపేట టౌన్: యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్ణాటకలోని ఉడిపిలో ఈనెల 14 నుంచి 16 తేదీ వరకు నిర్వహించిన దక్షణ భారత యోగా పోటీల్లో స్థానిక ఏఎంజీ స్కూల్కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని ఎన్.దేవి 8 నుంచి 11 సంవత్సరాల లోపు విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. బాలుర విభాగంలో ఆరోతరగతి విద్యార్థి బి.నాగుల్మీరా ద్వితీయ స్థానంలో నిలిచి రజిత పతకం సాధించాడు. ఈ సందర్భంగా బుధవారం ఏఎంజీ ప్రాంగణంలో వారిని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్కుమార్ మహంతి, వైస్ ప్రెసిడెంట్ కె.జాకబ్, సీఏవో విజయ్కుమార్, సీపీవో కృపారావు, ఏవో రవికుమార్, హెచ్ఎంలు పి.మేరి, కె.కృపాదానం, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. -
రైఫిల్ షూటింగ్లో ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 రైఫిల్ షూటింగ్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి 3 కాంస్య పతకాలు సాధించారు. యక్కలూరి శ్రీనిత్య బాలికల పిప్ సైట్ ఈవెంట్లో, ఎం.రిషిత ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో , బాలుర ఎయిర్ రైఫిల్ విభాగంలో హర్షవర్ధన్ రెడ్డి కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని మంగళవారం స్కూల్ గేమ్స్ కార్యదర్శి ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ ఎం.సంజీవరెడ్డి, డీబీఈఓ రామకృష్ణ పరమహంస అభినందించారు. -
వెయిట్ లిఫ్టింగ్లో సత్తా
ఏలూరు రూరల్: జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏలూరు విద్యార్థినులు సత్తాచాటారు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన జాతీయస్థాయి స్కూల్గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్థానిక ఈదర సుబ్బమ్మదేవి పాఠశాల బాలికలు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 44 కిలోల విభాగంలో కె.సత్యవతి, 48 కిలోల విభాగంలో ఎన్.సత్యవతి కాంస్య పతకాలు సాధించారు. దీపానయోమి ఐదో స్థానంలో నిలిచింది. వీరిని గురువారం పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కె.మాధవీలత, ఉపాద్యాయులు వి.దుర్గారావు, వీవీ సుబ్రహ్మణ్యం, పీఈటీ పి.గోపాల్ అభినందించారు. -
ఖాజీపాలెం విద్యార్థినుల ప్రతిభ
ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలలో ఖాజీపాలెం డాక్టర్ డీఎస్ రాజు జూనియర్ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ భేతాళం సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9 వరకు ఆంధ్రప్రదేశ్ స్కూలు గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ (అండర్–19) పోటీలు గుంటూరు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో జరిగాయన్నారు. 1500, 800 మీటర్ల పరుగు పందెంలో కళాశాలకు చెందిన కె.వరలక్ష్మి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, వై.సంధ్యారాణి 3 కి.మీ పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించారన్నారు. రిలే పరుగు పందెంలో ౖÐð..సంధ్యారాణి, కె.వరలక్ష్మి, ఎం.ప్రసన్న, ఐ.దేవి వైష్ణవి కాంస్య పతకం సాధించారన్నారు. -
జాతీయ స్థాయికి ఎంపిక
సిరికొండ : మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి జీ కావ్య జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ బాశెట్టి లింబాద్రి తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 జూనియర్ కళాశాలల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు కళాశాల విద్యార్థినులు జీ కావ్య, టీ లత, ఎం దేవిక ఎంపికై గతనెల 30న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. కావ్వ గోల్డ్మెడల్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాగా, లత, దేవికలు సిల్వర్ మెడల్స్ సాధించారు. క్రీడాకారిణులను బుధవారం జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల నిర్వహణ కార్యదర్శి మహ్మద్ షకీల్, కోచ్ పీఈటీ ఈశ్వర్ తదితరులు కళాశాలలో అభినందించారు. -
కిక్బాక్సింగ్లో జిల్లాకు పతకాలు
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్–19 స్కూల్గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి కిక్బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారు. ఎస్జీఎఫ్ పోటీల్లో తొలిసారిగా జిల్లా క్రీడాకారులు ఏడు పతకాలు పొందడం విశేషం. 48 వెయిట్ విభాగంలో ఎస్.వరుణ్కుమార్(వనపర్తి) బంగారు పతకం సాధించగా, 44వెయిట్ విభాగంలో శ్రీకాంత్ (గంగాపూర్), 52 వెయిట్లో ఎం.నవీన్కుమార్ (కొత్తకోట), 60 వెయిట్లో మహిపాల్( గంగాపూర్) రజతం, 65 వెయిట్లో జె.శ్రీధర్ (మిడ్జిల్), 44 వెయిట్ బాలికల విభాగంలో జె.సురేఖ (కొత్తకోట), 50 వెయిట్లో నందిని (లింగంపేట) కాంస్య పతకాలు పొందారు. టోర్నీలో బంగారు పతకం సాధించిన వరుణ్కుమార్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అండర్–19 కిక్బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. పతకాలు సాధించిన క్రీడాకారులను శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డీవీఈఓ హన్మంతరావు అభినందించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. ఎస్జీఎఫ్ సర్టిఫికెట్లకు విద్యా, ఉద్యోగాలలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి రాంచందర్, పీడీ పాపిరెడ్డి, సత్యనారాయణ, జిల్లా కిక్బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శేఖర్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ నబీ, కార్యనిర్వాహక కార్యదర్శి కేశవ్గౌడ్, శివకుమార్ యాదవ్, నరేష్ పాల్గొన్నారు. -
పవర్లిఫ్టింగ్లో జిల్లాకు పతకాలు
మంగళగిరి: జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్లో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన జాతీయస్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలలో జిల్లా యువకులు కాంస్యపతాకాలు సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరావు తెలిపారు. స్థానిక జిమ్సెంటర్లో ఆదివారం యువకులను ఘనంగా సన్మానించారు. మంగళగిరికి చెందిన షేక్ మహ్మద్గౌస్ 105 కేజీల విభాగంలో, సత్తెనపల్లికి చెందిన పసుపులేటి సురేష్ 160 కేజీల విభాగంలో కాంస్య పతకాలు సాధించగా సత్తెనపల్లికి చెందిన గడ్డం రమేష్ 105 కేజీల విభాగంలో, మంగళగిరికి చెందిన జొన్నాదుల ఈశ్వరకుమార్ 120 కేజీల విభాగంలో ఐదవస్థానం సాధించారు. వారిని అసోషియేషన్ అధ్యక్షుడు మహ్మద్రఫీ, సభ్యులు ఎండీ ఖమురుద్దీన్, కె.విజయభాస్కర్,ఎస్కె.సంధాని, ఎన్.శేషగిరిరావు తదితరులు అభినందించారు. -
పతకాల వెనుక పథకాలు
డేట్లైన్ హైదరాబాద్ రొహతక్కు చెందిన సాక్షి మలిక్కి కానీ, హైదరాబాద్కు చెందిన సింధుకు కానీ - ఇలాంటి విజయాలు ఎవరు సాధించి వచ్చినా ప్రభుత్వాలూ ఇతర సంస్థలూ పోటాపోటీగా కానుకలు ఇవ్వడం కొత్తేమీ కాదు కూడా. గతంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇంకా అనేకమంది దేశవ్యాప్తంగా ఇటువంటి సత్కారాలు అందుకున్నారు. ప్రశ్న ఒక్కటే. మొత్తంగా మన దేశం అంతర్జాతీయ క్రీడారంగంలో రాణించడానికి ఇది చాలా? చాలదని చెప్పడానికి అనేక అంశాలను ప్రస్తావించవచ్చు. సింధుకు జననీరాజనం(ఇన్ సెట్: కొలిపాక ఉమ) రెండురోజులుగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో సాగిన అత్యంత అనాగరిక రాజకీయ క్రీడను మనం వీక్షించాం. ఈ ఆట ఆడింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వాటి అధినేతలే. ప్రపంచ క్రీడాభిమానులు ఎవ్వరూ హర్షించని రాజకీయ క్రీడ అది. రియో ఒలింపిక్స్ క్రీడోత్సవంలో మొట్టమొ దటిసారి యువ క్రీడాకారిణి పి.వి. సింధు ఆడిన ఆట చూసి గత శుక్రవారం ప్రపంచం అబ్బురపడింది, జేజేలు పలికింది. చివరి మ్యాచ్ ఓడినా అత్యంత క్రీడాస్పూర్తిని ప్రదర్శించి తన మీద గెలిచిన స్పెరుున్ క్రీడాకారిణిని తానే పల కరించి, అభినందించింది. ఆమె పుట్టి పెరిగిన సికింద్రాబాద్, హైదరాబాద్ లలో గానీ, ఆమె బంధుకోటి ఉన్న విజయవాడలో కానీ ఆ క్రీడాస్ఫూర్తి ఎందుకు కనిపించలేదు? ఫైనల్స్లో ఓడిపోతూ కూడా అద్భుతంగా ఆడిన సింధును ఆనందంగా చూసిన వాళ్లే; హైదరాబాద్, విజయవాడ వీధుల్లో ఆమె పాల్గొన్న సర్కారీ ఊరేగింపులు చూసీ, పోటీలు పడి ప్రకటించిన నజరానాలతో ఏలినవారు ఆమెను తమ సొంతం చేసుకునే ప్రయత్నాలు చూసీ అసహ్యించుకుంటూ టీవీలు కట్టేసిన మాట నిజం. ఇంతకూ సింధు ఎవరు? ఆంధ్రప్రదేశ్ అమ్మాయా, తెలంగాణ బిడ్డా, భారతీయురాలా? క్రీడా కారులకు దేశం, ప్రాంతం, కులం, మతం ఉంటాయా? ఉంటే అవి క్రీడలెట్లా అవుతారుు? ఆమె అంతర్జాతీయ మహిళ. తన పుట్టుక రీత్యా, చదువు సంధ్యల రీత్యా, వృత్తి వ్యాపకాల రీత్యా ఏ విజయవాడకో, హైదరాబాద్కో చెంది ఉండొచ్చు. కానీ క్రీడారంగానికీ, అందునా ఆమె ఆడి నిలిచిన బాడ్మిం టన్ క్రీడకూ సింధు అంతర్జాతీయ మహిళే. అటు ఆంధ్రప్రదేశ్కు కానీ, ఇటు తెలంగాణ కు కానీ, ఆమాటకొస్తే యావద్భారతానికి గానీ - ఇది నిజంగా సంతోషించవలసిన సమయమే. అదే సమయంలో మనమేమిటో సమీక్షించు కోవలసిన సమయం కూడా. ఒక్కసారి రియో ఒలింపిక్స్ దృశ్యాన్ని రివైండ్ చేసి చూడండి. ఇంత జనాభా ఉన్న దేశానికి ఒక రజతం మరో కాంస్యమేనా అనిపించకమానదు. 119 మంది క్రీడాకారులు వెళ్లి తెచ్చిన పతకాలు రెండు. రాజకీయ క్రీడ క్రీడాకారులు స్వశక్తితో పోరాడి పతకాలు సాధించుకొస్తే, అప్పుడు మాత్రం వారిని గుర్తించి పోటీలు పడి నగదు బహుమానాలు ప్రకటించి, క్రీడలను మేమే ప్రోత్సహిస్తున్నామని చెప్పుకోవడం మినహా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నారుు? మనకు సరైన క్రీడా విధానం లేదు కాబట్టే అంతర్జాతీయ క్రీడా వీధుల్లో నగుబాటు తప్పడం లేదు. 2020 ఒలింపిక్స్లో సింధు స్వర్ణం సాధిం చాలని మనందరం కోరుకోవాల్సిందే, అందుకోసం దేశం మొత్తం ఆమెను ప్రోత్సహించవలసిందే. ఆ విజయం సాధించడం కోసం సింధు కృషి చేసే క్రమంలో ఆమెకు ఎటువంటి అడ్డంకులూ, ఇబ్బందులూ ఉండకూడదు. దానికి అవసరమైన వాతావరణం, పరిస్థితులు ఉండాలి. వాటిని కల్పించా ల్సిన విధి ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఆ పని చేస్తే వందమంది సింధులు తయారవుతారు రాష్ట్రంలో, దేశంలో. రొహతక్కు చెందిన సాక్షి మలిక్కి కానీ, హైదరాబాద్కు చెందిన సింధుకు కానీ- ఇలాంటి విజయాలు ఎవరు సాధించి వచ్చినా ప్రభుత్వాలూ ఇతర సంస్థలూ పోటాపోటీగా కానుకలు ఇవ్వడం కొత్తేమీ కాదు కూడా. గతంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇంకా అనేకమంది దేశ వ్యాప్తంగా ఇటువంటి సత్కారాలు అందుకున్నారు. ప్రశ్న ఒక్కటే. మొత్తంగా మన దేశం అంతర్జాతీయ క్రీడారంగంలో రాణించడానికి ఇది చాలా? చాలదని చెప్ప డానికి అనేక అంశాలను ప్రస్తావించవచ్చు. మరుగున పడిన మాణిక్యాలను పట్టించుకోకుండా, తమ గొప్ప కోసం రాజకీయ నాయకులు విజేతలకు నజరానాలు ప్రకటించి, వారే విమర్శల పాలవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక చర్చకు అవకాశం కలిగినందుకు సంతోషించవలసిందే. ‘సాక్షి’ (23-8-16) సంపాదకీయ పేజీలో లేఖల కాలమ్లో నీలం వెంకన్న పడ్డ ఆవేదన చూడండి! ఆయన మాటల్లోనే ‘పేదరికంలో పుట్టి కాయ కష్టం చేస్తూ, కనీస సదుపాయాలు లేని స్కూళ్లల్లోనే అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న గ్రామీణ సింధువులెందరో కన్నీటి బిందువులుగా మారిపోతు న్నారు’ అంటున్న ఆయన వరంగల్ జిల్లా కేసముద్రంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కొలిపాక ఉమ దైన్యాన్ని గురించి లోకానికి చాటారు. క్రీడారంగంలో ప్రతిభను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పారు. ఖోఖోలో ఉమ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎనిమిదిసార్లు జిల్లాకు బంగారు పతకాలు సాధించిపెట్టింది. రెండుసార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయి కూడా ఆర్థిక సాయం లేక వెళ్లలేక పోయింది. తండ్రి అకాల మరణంతో క్రీడలకు దూరమై ఇస్త్రీ పెట్టెను పట్టి బ్రతుకుతో పోరాడుతున్నది. కొలిపాక ఉమ లాంటి వాళ్లు వేల సంఖ్యలో ఉంటారు, వీళ్ళందరికీ గోపీచంద్ అకాడమి లాంటి చోట శిక్షణ పొందే అవకాశం జీవితంలో లభిస్తుందా? లభించినప్పుడే కదా, మన పతకాల సంఖ్య గౌరవప్రదంగా కనిపిస్తుంది. నాణేనికి మరోవైపు క్రీడల పట్ల, వాటి అభివృద్ధి పట్లా నిజాయితీ, చిత్తశుద్ధీ లేని పరిస్థితి దేశమంతా ఉంది. కొలిపాక ఉమలు దేశమంతటా ఉన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన సీతా సాహు ఒలింపిక్స్లో రెండుసార్లు భారతదేశానికి కాంస్య పతకాలు తెచ్చిపెట్టింది. 2011లో ఏథెన్స్ లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్లో తన పదిహేనవ ఏటనే సీతా సాహు 200 ,1600 మీటర్ల పరుగు పందెంలో గెలిచి రెండు కాంస్యాలు సాధించి పెట్టింది. బ్రతకడం కోసం చిన్న కొట్టు పెట్టుకుని కాలం గడుపుతున్నది. ఇప్పుడు ఆమెను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవు. కొలిపాక ఉమలు, సీతా సాహూలు అనేకమంది. వీరి పరిస్థితి ఇట్లా ఉంటే, ప్రభుత్వాలు మాత్రం ఈ వాస్తవాల జోలికి పోకుండా తాజా విజేత లకు పోటీ పడి నజరానాల వర్షం కురిపించాయి. ఒక పక్క నేతలు కొత్త విజేత లను సత్కరిస్తూ ఉండగానే పంజాబ్కు చెందిన జాతీయ స్థారుు హ్యాండ్బాల్ క్రీడాకారిణి పూజ తన 20వ ఏటనే ఉరేసుకుని తనువు చాలించింది. కాలేజీలో చదువుకీ, హాస్టల్ ఫీజులు చెల్లించే స్తోమత లేక ఆత్మహత్య చేసుకున్న పూజ తన వంటి పేద ఆడపిల్లలకు ఉచిత విద్య ఏర్పాటు చెయ్యాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసి పోయిది. పూజ తండ్రి కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఏమయింది మన బేటీ బచావో, బేటీ పడావో? క్రీడల పట్ల ఆసక్తి ఉండి, ప్రతిభ ఉండి అవకాశాలు లేక, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాణించలేక పోతున్న క్రీడాకారులు మన దేశంలో లక్షల్లో ఉంటారు. ఆ ప్రతిభను గుర్తించి వారికి సరైన వనరులు, వసతులు కల్పించే క్రీడా విధానం మనకెక్కడిది? అది లేదు కాబట్టే రియో ఒలింపిక్స్లో ఒకరికి రజతం, ఒకరికి కాంస్యం. వాటితోనే రాజకీయ పబ్బం గడుపుకోవాలని మన నేతలు రాజకీయ క్రీడను ఆరంభించారు. క్రీడలకు ఏదీ ప్రోత్సాహం? ముగిసిన రియో ఒలింపిక్స్లో అమెరికాకు 30 పైగా స్వర్ణ పతకాలోచ్చాయి, మొత్తం మీద ఎక్కువ పతకాలు గెలుచుకుని ప్రథమ స్థానంలో నిలిచింది ఆ దేశమే. ఎందుకు? అది సంపన్న దేశం కాబట్టా? కాదు. అక్కడి ప్రభుత్వా లకు, ప్రజలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంత కంటే ముఖ్యం కాబట్టి. మురళీ చల్లా చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. ఇద్దరు పిల్లలు ఆయనకు. స్కూల్కు పోతున్నారు. అమెరికా వదిలేసి భారతదేశం వచ్చి స్థిరపడాలనుకున్నారు మురళీ, ఆయన సతీమణి కల్పన. దాదాపుగా నిర్ణయం అయిపోయింది. నెల్లూరు వాస్తవ్యులయినా చిన్నప్పటి నుండి హైద రాబాద్లో పెరిగారు కాబట్టి, రాజధాని కూడా కాబట్టి హైదరాబాద్కే రావాలనుకున్న మురళీ కుటుంబం ఆ నిర్ణయాన్ని మార్చుకుని అమెరికాలోనే ఉండి పోవాల్సివచ్చింది. కారణం ఏమిటంటే ఆయన ఇద్దరు పిల్లలూ అమె రికాలో టెన్నిస్ నేర్చుకుంటున్నారు. దాన్ని హైదరాబాద్లో కొనసాగించడా నికి సరైన వసతులు, శిక్షణ సంస్థలు లేకపోవడం ఒక కారణం కాగా, అసలు స్కూళ్లలో క్రీడల ఊసే లేకపోవడం రెండో కారణం. అమెరికాలో ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక ఆట నేర్చుకోవడం, అందులో ప్రావీణ్యం సంపా దించడం తప్పనిసరి. అది ప్రభుత్వ విధానం. అందుకే అమెరికాకు మెడల్స్ వస్తాయి, మనకు రావు. ఉన్న మైదానాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామా, షాపింగ్ కాంప్లెక్స్లు ఎప్పుడు కట్టేద్దామా అని మనం ఉబలాట పడిపోతుంటామాయే. మొన్న సింధు రియోలో సెమీ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు నాతో పాటు ఆట చూస్తున్న సంజు, రాజు చెపుతు న్నారు, ‘‘ వారంలో ఒక పీటీ క్లాస్ ఉంటే, దాన్ని కూడా రద్దు చేసి పోర్షన్ పూర్తికాలేదని వేరే సబ్జెక్టులు చెపుతుంటే ఇండియాకు మెడల్స్ ఎట్లా వస్తాయి, ఒక్కపూట అన్నా ఆడనిస్తున్నారా మమ్మల్ని?’’అని. మన విద్యా విధానం ఎన్ని వెర్రితలలు వేస్తున్నదో చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకడు హైస్కూల్ విద్యార్థి, మరొకడు కాలేజీ విద్యార్థి. ఒక ప్రభుత్వ స్కూల్లో పీటీ సార్ ఒక టెన్నిస్ రాకెట్, బాల్ కొనుక్కొచ్చి 50 రూపాయలు బిల్లు పెడితే ఆ డబ్బు మంజూరు చెయ్యడానికి వందసార్లు తిరగాలి. స్కూళ్లలో ఆటస్థలాల మాటే లేదు. అసలు చదువు తప్ప ఇంకో ముచ్చటే లేదు. మనం స్కూళ్లలో బ్రాయిలర్ కోళ్లను తయారు చేస్తున్నాం తప్ప మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులరుున పౌరులను ఎక్కడ ఎదగనిస్తున్నాం? విద్యా, క్రీడా విధానాల పట్ల మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారి ఒక పటిష్టమయిన విధానం వస్తే తప్ప లాభం లేదు. లేదంటే మళ్లీ ఒకటి రెండు పతకాలకే పరిమితమై, వాటిని చూసి మురిసిపోవలసిందే. ఇంకా-గోపీచంద్ అకాడమికి నేను భూమి ఇచ్చాను, కాబట్టి సింధు రియోలో పతకం సాధించగలిగింది, అది కూడా నా ఘనతే అంటూ నేతలు పలికే డంబాలు మళ్లీ వినకతప్పదు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తైక్వాండో పోటీల్లో ప్రతిభ
మారీసుపేట: జిల్లా తైక్వాండో పోటీలలో తెనాలి సీఎంసీ ఫిటెనెస్ జోన్ తైక్వాండో అకాడమీకి చెందిన ఏడుగురు క్రీడాకారులు ఆరుగురు పతకాలు సాధించారని మేనేజింగ్ డైరెక్టర్ కొక్కిలగడ్డ ప్రసాదబాబు మంగళవారం తెలిపారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రేపల్లెలో పోటీలు జరిగాయని చెప్పారు. ఎస్.దేవకీనందన్, ఎస్.దేవిక్షకర్ బంగారు పతకాలు, ఎం నూతన్ సాయినాథ్, సిహెచ్ కిరణ్ కుమార్ వెండి పతకాలు, బి.గోపినాథ్, ఎం జోశ్రీత కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. వీరిని చంద్స్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ చందు వెంకటేశ్వరరావు, కొక్కిలగడ్డ ప్రసాదబాబు, తైక్వాండో మాస్టర్ ఎం బాజీ అభినందించారు. -
పతకాలు సరే.. డబ్బేది?
ముంబై: ఒలింపిక్స్ తరహా మెగా ఈవెంట్లలో పతకాలు సాధించడం గొప్ప విషయమైనా, ఆయా క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన అవసరం చాలా ముఖ్యమని బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమర్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులు సాధించిన పతకాలు ఒక ఎత్తైతే, వారికి నజరానాలను అందజేయడం అంతకంటే ముఖ్యమన్నాడు. 'ఒక పతకాన్ని కానీ, సర్టిఫికెట్ను కానీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అవి సాధించిన క్రీడాకారులను ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పతకం కంటే డబ్బే ప్రధానం. నేను చాలా మంది బీద క్రీడాకారుల్ని చూశాను. పలు సందర్భాల్లో ఆర్థికపరిస్థితి బాలేక వారు పతకాలను కూడా అమ్మేసి పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. ఇదంతా వారికి డబ్బు లేకపోవడం వల్లే కదా. అమెరికా, చైనా క్రీడాకారులు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండటానికి, భారత్ లాంటి దేశం సింగిల్ డిజిట్ పతకానికే పరిమితం కావడం కూడా ఆయా క్రీడాకారులు ఆర్థిక పరిస్థితే కారణం' అని 'రుస్తుమ్' సక్సెట్ మీట్ సందర్భంగా అక్షయ్ పేర్కొన్నాడు. -
పతకాల కోసం పతాకాలతో ర్యాలీ
చిలకలూరిపేటటౌన్: విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు చెప్పారు. ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రియో ఒలంపిక్స్లో అత్యధిక పతకాలు సాధించాలని కోరుతూ శుక్రవారం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు పతాకాలు చేపట్టి భారత్ గెలవాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీని మున్సిపల్ కమిషనర్ కనకరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రై వేటు స్కూల్స్ అసోసియేషన్ స్థానిక శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి చేబ్రోలు మస్తాన్రావు, జిల్లా కార్యదర్శి ఈదర గిరీష్బాబు, సూదా రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
టీటీ క్రీడాకారులకు పతకాల పంట
విజయవాడ స్పోర్ట్స్ : గుంటూరులో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీలో పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం క్రీడాకారులు పతకాల పంట పండించారు. క్యాడెట్ బాలుర విభాగంలో కార్తికేయ రజిత, సబ్జూనియర్ బాలికల విభాగంలో ఎస్.మహితాచౌదరి రజిత, నజీరబీ నూర్బాషా కాంస్య, జూనియర్ బాలికల విభాగంలో శైలూ నూర్బాషా, ఇ.అనూష క్యాంస, సబ్జూనియర్ బాలుర విభాగంలో అకాశ్వర్దన్ రజిత, జె.ఆదర్శవర్దన్ కాంస్య, జూనియర్ బాలుర విభాగంలో జె.ఆదర్శవర్దన్, యూత్ బాలికల విభాగంలో శైలు స్వర్ణ, ఉమన్ విభాగంలో శైలు స్వర్ణ, ఇ.అనూషరెడ్డి కాంస్య, మెన్ విభాగంలో వివేకవర్దన్ కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను, కోచ్ దామోదర్రెడ్డిని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్, ఉపా««దl్యక్షుడు విశ్వనాథ్, జిల్లా టీటీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాష్, కరణం బలరామ్ అభినందించారు. -
ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాలేదు!
కొందరు పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు మారాం చేస్తారు. మరికొందరు ఆటలు పోతాయన్న బాధతో, చదువంటే భయంతో ఏడుస్తారు. కొందరు మాత్రం స్కూలంటే ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తారు. ఇప్పుడు దుబాయ్లోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విద్యార్థి.. ఆ మూడో కోవకు చెందినవాడే. ఐదేళ్ళపాటు ఒక్కరోజు కూడా స్కూలుకు ఆలస్యంగా వెళ్లకపోగా.. ఏరోజూ స్కూలు మానకుండా నూరు శాతం హాజరుతో ఏకంగా ఐదు మెడల్స్ సంపాదించి అందర్నీ అబ్బురపరిచాడు. చిన్నవయసు నుంచే పాఠశాలపై మక్కువ ఉండటంతో పాటు.. వందశాతం హాజరు ఉండాలన్న ఆశయంతో స్కూలుకు వెళ్లిన గల్ఫ్ విద్యార్థి... ఐదేళ్లకు గాను ఐదు మెడల్స్, ఐదు సర్టిఫికెట్లు సంపాదించి ఏ విద్యార్థికీ సాధ్యం కాని ప్రత్యేకతను సాధించాడు. ఇప్పుడు తనకు వచ్చిన సర్టిఫికెట్లు, మెడల్సే తన కచ్చితత్వానికి నిదర్శనమని, ఇది ఏ ఇతర విద్యార్థులనూ కించపరిచే విషయం కాదని అతడు ఆనందంగా చెప్తున్నాడు. ఒక విద్యార్థి ప్రతిరోజూ పది నిమిషాలు స్కూలుకు ఆలస్యమైతే ఏడాదిలో 30 గంటల పాఠాలను కోల్పోతాడన్న విషయాన్ని చిన్నతనంలో ఎక్కడో చదివానని, అప్పట్నుంచీ తాను చదువులో ముందున్నా లేకున్నా స్కూలుకు మాత్రం ఆలస్యంగా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నానని చెప్తున్నాడు. అనుకున్నది సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అయితేనేం మెడల్స్ సాధించగలగడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నాడు. తన కష్టానికి ఈ మెడల్సే నిదర్శనమంటున్నాడు. ఐదు అంకె తన లక్కీ నెంబర్ అని చెప్తున్న సదరు విద్యార్థి, ఐదో తరగతి నుంచి ప్రారంభించిన తన దీక్షను విజయవంతంగా కొనసాగించి ఐదు మెడల్స్ సాధించగలగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటున్నాడు. తన కష్టాన్ని, కచ్చితత్వాన్ని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ గుర్తించిందని, అదే తన ఆనందానికి ప్రధాన కారణమైందని చెబుతున్నాడు. -
ఏపీ, తెలంగాణ పోలీసు అధికారులకు పతకాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మక పతకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ కేటగిరీలలో మొత్తం 34 మంది పోలీసు అధికారులను ఎంపిక చేశారు. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీపీఎమ్జీ), పోలీస్ మెడల్ గ్యాలంటరీ (పీఎమ్జీ), ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ (పీపీఎమ్డీఎస్), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్వీసు (పీఎమ్ఎమ్ఎస్) లలో పతకాలను ప్రధానం చేయనున్నారు. ఈ నెల 26న 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానోత్సవం జరగనుంది. పీపీఎమ్డీఎస్: (ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్) తెలంగాణ నుంచి ముగ్గురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. వారి వివరాలు.. 1. అంజనీ కుమార్, అడిషనల్ సీపీ లాండ్ ఆర్డర్, హైదరాబాద్ 2. ఎన్. సూర్యనారాయణ, డీఐజీ, హైదరాబాద్ 3. ఎమ్. శివ ప్రసాద్, జాయింట్ పోలిస్ కమిషనర్, హైదరాబాద్ పీపీఎమ్డీఎస్: (ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్) ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అధికారులు ఎంపికయ్యారు. 1. కె.ఆర్.ఎమ్ కిషోర్ కుమార్, అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఎడిజీఓపీ), రైల్వే పోలీస్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ 2. జి. రాజకిషోర్ బాబు, ఎస్పీ(ఎన్సీ), ఇంటిలిజెన్స్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ పీపీఎమ్జీ: (ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ) తెలంగాణ నుంచి ఇద్దరు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. 1. కోటగిరి శ్రీధర్, ఎస్ఐ 2. నలువుల రవీందర్, ఎస్ఐ పీఎమ్ఎమ్ఎస్: (పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్వీసు) ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి 15 మంది ఎంపికయ్యారు. 1. పొచినేని రమేశయ్య, ఎస్పీ, రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్, నెల్లూరు 2. బి. శ్రీనివాస్, ఎడిషినల్ ఎస్పీ, ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ 3. ఎస్. రాజశేఖర రావు, అడిషనల్ ఎస్పీ, రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ 4. వి. విజయ భాస్కర్, డిప్యూటీ ఎస్పీ, ఇంటిలిజెన్స్, హైదరాబాద్ 5. నున్నబొడి సత్యనాదం, డిప్యూటీ ఎస్పీ, రీజినల్ ఆఫీస్, సీఐడీ, విజయవాడ సిటీ 6. చింతాడ లక్ష్మీపతి, డిప్యూటీ ఎస్పీ, అవినీతి నిరోదక శాఖ, విజయనగరం 7. ఎన్ సుబ్బారావు, డిప్యూటీ ఎస్పీ, అనంతపురం జిల్లా 8. కింజరపు ప్రభాకర్, ఏసీపీ, ట్రాఫిక్, విశాఖపట్నం 9. రాజాపు రమణ, ఏసీపీ, తూర్పు సబ్ డివిజన్, విశాఖపట్నం 10. సుధాబాతుల రమేశ్ బాబు, ఎస్ఐ, పశ్చిమగోదావరి జిల్లా 11. షేక్ షఫీ అహ్మద్, ఎస్ఐ, జిల్లా స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు జిల్లా 12. బి. లక్ష్మయ్య, ఆర్మ్డ్ రిజర్వు ఎస్ఐ, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ, తిరుపతి 13. సుబ్బసాని రంగారెడ్డి, హెడ్ కానిస్టేబుల్, 6వ బిన్ ఏపీ స్టేట్ పోలీస్, మంగళగిరి, గుంటూరు జిల్లా 14. అగ్రహారం శ్రీనివాస శర్మ, హెడ్ కానిస్టేబుల్, కడప, టూ టౌన్ పోలీస్ స్టేషన్ 15. జె. నాగేశ్వరరావు, ఆర్మ్డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్, సీఏఆర్, విజయవాడ పీఎమ్ఎమ్ఎస్: (పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్వీసు) తెలంగాణ రాష్ట్రం నుంచి 12 మంది ఎంపికయ్యారు. 1. ఎమ్. స్టిఫెన్ రవీంద్ర, డీఐజీ, గ్రేహౌండ్స్, అడిషినల్ డిజీపీ హైదరాబాద్, తెలంగాణ 2. పళ్ల రవీందర్ రెడ్డి, అడిషినల్, ఎస్పీ (అడ్మిన్), మెదక్, సంగారెడ్డి 3. ఎమ్. భీమ్ రావు, డీప్యూటీ ఎస్పీ, కరీంనగర్ 4. కొట్టం శ్యాం సుందర్, డీస్పీ, స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ పోలీస్, హైదరాబాద్, టి.ఎస్-5 5. కటకం మురళీధర్, డీస్పీ, సీఐ సెల్ హైదరాబాద్ 6. కొమ్మెర శ్రీనివాసరావు, ఎస్పీ, స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ హైదరాబాద్, టి.ఎస్ 7. పోలు రవీందర్, ఎస్ఐ, జిల్లా స్పెషల్ బ్రాంచ్, నిజామాబాద్, తెలంగాణ 8. వై. వల్లీబాబా, ఎస్ఐ, జీడీకే-2(టీ), కరీంనగర్ 9. నెతికార్ మూర్తిరావు, ఎస్ఐ, సౌత్ ఈస్ట్ సెల్, హైదరాబాద్ 10. మహమ్మద్ జాఫర్, రిజర్వు ఎస్ఐ, సీఐ సెల్ హైదరాబాద్, తెలంగాణ 11. దబ్బికార్ కిసాంజె, రిజర్వు ఎస్ఐ, సీఐ సెల్, హైదరాబాద్, తెలంగాణ 12. ఎ. వెంకటేశ్వర రెడ్డి, రిజర్వు ఎస్ఐ, మహబూబ్నగర్, తెలంగాణ -
భారత్కు పతకాల పంట
కామన్వెల్త్ టీటీ చాంపియన్షిప్ సూరత్: సొంతగడ్డపై భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారులు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ టీటీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 15 పతకాలను సొంతం చేసుకొని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. రెండేళ్ల క్రితం న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో భారత్ అత్యుత్తమంగా తొమ్మిది పతకాలు సాధించింది. సోమవారం ముగిసిన ఈ ఈవెంట్లో భారత్కు మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంథోనీ అమల్రాజ్, మహిళల సింగిల్స్ విభాగంలో మౌమా దాస్ రన్నరప్లుగా నిలిచి రజత పతకాలను దక్కించుకున్నారు. ఫైనల్స్లో ఆంథోనీ అమల్రాజ్ 5-11, 5-11, 11-9, 11-6, 12-14, 7-11తో చెన్ ఫెంగ్ (సింగపూర్) చేతిలో; మౌమా దాస్ 7-11, 5-11, 11-7, 2-11, 3-11తో జౌ యిహాన్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ విభాగంలో సౌమ్యజిత్ ఘోష్-హర్మీత్ దేశాయ్ (భారత్) జంట 5-11, 11-8, 10-12, 11-9, 11-3తో సత్యన్-దేవేశ్ (భారత్) జోడీపై నెగ్గి స్వర్ణం దక్కించుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో మణిక బాత్రా-అంకిత దాస్ (భారత్) జంట 6-11, 9-11, 9-11తో లిన్ యె-జౌ యిహాన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. -
బాక్సర్లకు అభినందన
ఎల్బీ స్టేడియం: మహారాష్ట్రలోని అకోలాలో ఇటీవల జరిగిన వన్డే బాక్సింగ్ చాంపియన్షిప్లో పతకాలు గెలిచిన తెలంగాణ బాక్సర్లను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి లవ్ అగర్వాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, అంతర్జాతీయ మాజీ బాక్సర్ ఆర్పీకే సింగ్, రాష్ట్ర బాక్సింగ్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఐదు స్వర్ణాలు, 8 రజత పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ను దక్కించుకుంది. జి.నరేష్ గౌడ్, పి.మహేందర్, సంతోష్, మనోజ్ రెడ్డి, ఎం.డి.మోసిన్ పసిడి పతకాలు గెలువగా, టి.శ్రీకాంత్, ఎస్.సాయి, ఎం.డి. ఇమ్రాన్, జాహెద్, క్లింటన్, ఎన్.రాజ్, ఎన్.శ్రీనివాస్, సి.హెచ్.ధీరజ్ రజత పతకాలు నెగ్గారు. -
టెన్నిస్లో ఐదు పతకాలు ఖాయం
టెన్నిస్: ఆసియాగేమ్స్ టెన్నిస్లో భారత్కు కనీసం ఐదు పతకాలు వచ్చినట్లే. ఈ ఈవెంట్లో సెమీస్లో ఓడినా కాంస్యం వస్తుంది. హైదరాబాద్ క్రీడాకారులు సానియా, సాకేత్ రెండు విభాగాల్లో సెమీస్కు చేరి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 6-3, 6-2 తేడాతో దనాయ్ ఉడోమ్చోక్ (థాయ్లాండ్)పై సునాయాసంగా నెగ్గి సెమీస్కు చేరాడు. మరో సింగిల్స్లో సనమ్ సింగ్ 6-7 (3/7), 4-6తో సున్ యెన్ లు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాకేత్ మైనేని, సనమ్ సింగ్ జోడి 6-2, 7-6 (12/10) తేడాతో టి చెన్, సీన్ యిన్ పెంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి సెమీస్కు చేరింది. మరో డబుల్స్లో యూకీ బాంబ్రీ, దివిజ్ శరణ్ జోడి 7-5, 7-6 (7/1)తేడాతో సిన్ హాన్ లీ, యు జూ వాంగ్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి సెమీస్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో సానియా మీర్జా, సాకేత్ మైనేని 6-3, 7-6 (7/4)తేడాతో కొరియాకు చెందిన నలే హాన్, చియోంగీ కిమ్ను వరుస సెట్లలో మట్టికరిపించి సెమీస్లో అడుగుపెట్టారు. మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా మీర్జా, ప్రార్థన తొంబారే జంట 6-1, 7-6 (7/4)తో పియాంగ్టర్న్, నిచాపై నెగ్గి సెమీస్లో ప్రవేశించింది. టేబుల్ టెన్నిస్: పురుషుల, మహిళల జట్లు తమ ప్రిలిమినరీ రౌండ్లలో విజయాలు సాధించి సత్తా చాటుకున్నాయి. -
పతకాల పంట
ఎనిమిదో రోజు భారత్ ఖాతాలో 11 పతకాలు వారం రోజుల నిరీక్షణ ఫలించింది. తొలి రోజు ఏకైక స్వర్ణం తర్వాత ఆరు రోజుల పాటు కంచు మోతలో వినిపించకుండా పోయిన ‘కనకం'... ఎట్టకేలకు ఘనంగా మోగింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత అథ్లెట్లు ఆసియా క్రీడల్లో శనివారం పసిడి వెలుగులు నింపారు. పురుషుల కాంపౌండ్ ఆర్చరీ, స్క్వాష్ జట్లు స్వర్ణాలు సాధించి భారత శిబిరంలో ఉత్సాహాన్ని పెంచాయి. క్రీడాకారుల నిలకడకు ఈ రెండు ఈవెంట్లలో రెండు రజతాలు కూడా తోడయ్యాయి. అథ్లెటిక్స్ తొలి రోజు భారత్ ఖాతాలో ఓ రజతం ఓ కాంస్యం చేరాయి. వీటితో పాటు అన్ని క్రీడల్లో కలిపి మరో ఐదు కాంస్యాలు సాధించడంతో... ఇంచియాన్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్క్వాష్ గతంతో ఎన్నడూ లేనన్ని పతకాలు సాధించి భారత ఆటగాళ్లు కొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల టీమ్ స్వర్ణం గెలుచుకోగా, మహిళల జట్టు రజతం సాధించి ఔరా అనిపించింది. అంతకుముందు వ్యక్తిగత విభాగంలో సౌరవ్ ఘోషాల్ రజతం, దీపికా పల్లికల్ కాంస్యం సాధించారు. ఓవరాల్గా భారత స్క్వాష్ చరిత్రలో నాలుగు పతకాలు (1 స్వర్ణం+2 రజతాలు+1 కాంస్యం) లభించడం ఇదే మొదటిసారి. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 2-0తో మలేసియాపై గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి సింగిల్స్లో హరీందర్ పాల్ సంధూ 3-1తో మహ్మద్ ఇస్కందర్పై; రెండో సింగిల్స్లో సౌరవ్ ఘోషాల్ 3-2తో ఆంగ్ బెంగ్ హీపై నెగ్గారు. వరుసగా రెండు సింగిల్స్ గెలవడంతో మహేశ్ మంగోన్కర్కు మూడో సింగిల్స్ ఆడాల్సిన అవసరం లేదు. మహిళల ఫైనల్లో భారత్ 0-2తో మలేసియా చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడింది. తొలి సింగిల్స్లో అనక అలంకమోని 0-3తో ఆర్నాల్డ్ డెలియా చేతిలో; రెండో సింగిల్స్లో దీపికా పల్లికల్ 0-3తో నికోల్ డేవిడ్ చేతిలో ఓడారు. దీంతో రెండు మ్యాచ్ల ఫలితాలు మలేసియాకు అనుకూలంగా రావడంతో జోష్న చిన్నప్ప మూడో సింగిల్స్ ఆడలేదు. షూటింగ్ రోజురోజుకూ షూటర్ల బుల్లెట్ పదును పెరుగుతోంది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో చైన్ సింగ్ 441.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. క్వాలిఫయింగ్లో సంజీవ్ రాజ్పుత్ (1159), గగన్ నారంగ్ (1157) వరుసగా 12, 15వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ టీమ్ విభాగంలో భారత్కు ఒక్క పాయింట్ తేడాతో కాంస్యం చేజారింది. భారత్ 3480 పాయింట్లు చేయగా, కాంస్యం నెగ్గిన జపాన్ 3481 పాయింట్లు స్కోరు చేసింది. ఆర్చరీ భారత విలుకాండ్ల గురి అదిరింది. ఒక్క రోజే ఓ స్వర్ణంతో కలిపి మూడు పతకాలు గెలిచి సత్తా చాటారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, సందీప్ కుమార్ల త్రయం 227-225తో కొరియాపై నెగ్గి ‘పసిడి’ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టిన తొలిసారే భారత్ స్వర్ణం గెలవడం విశేషం. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ రజతంతో సంతృప్తిపడ్డాడు. ఫైనల్లో అభిషేక్ 141-145తో ఇస్మాయిల్ బాది (ఇరాన్) చేతిలో ఓడాడు. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో త్రిషా దేబ్, పూర్వాషా షిండే, జ్యోతి సురేఖల బృందం 224-217తో ఇరాన్పై నెగ్గి కాంస్యం కైవసం చేసుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో త్రిషా దేబ్ 138-134తో హుయాంగ్ జో (దక్షిణ కొరియా)పై నెగ్గి కాంస్యాన్ని గెలుచుకుంది. చివరి బాణం వరకు భారత ఆర్చర్ వెనుకబడి ఉన్నా.. ఐదో, ఫైనల్ రౌండ్లో హుయాంగ్ నిరాశపర్చడం త్రిషకు కలిసొచ్చింది. అథ్లెటిక్స్ తొలి రోజు భారత అథ్లెట్లు జోరు కనబర్చారు. ఓ రజతం, కాంస్యంతో మహిళలు మెరిశారు. మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో లలిత శివాజీ బబర్ 9:35.37 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. సుధా సింగ్ 9:35.64 సెకన్లతో మూడో స్థానంతో కాంస్యం చేజిక్కించుకుంది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఈ పోటీలో మొదట లలితకు కాంస్యం లభించగా, సుధా సింగ్ నాలుగో స్థానంతో సంతృప్తిపడింది. అయితే స్వర్ణం సాధించిన రూత్ జిబెట్ (బహ్రెయిన్) ఆఖరి ల్యాప్లో పొరపాటుగా ట్రాక్ లోపల స్టెప్ వేసింది. దీనిపై భారత్ ఫిర్యాదు చేయగా ఆమెపై అనర్హత వేటు పడింది. పతకం అందుకోవడానికి సమాయత్తం అవుతున్న సమయంలో రూత్పై వేటు వేసిన సంగతిని స్టేడియంలోని పబ్లిక్ సిస్టమ్లో ప్రకటించారు. దీంతో లలిత రెండు, సుధా మూడో స్థానంలో నిలిచి పతకాలు అందుకున్నారు. మహిళల 10 వేల మీటర్ల ఫైనల్లో గత ఏడాది స్వర్ణం సాధించిన ప్రీజా శ్రీధరన్ ఈసారి ఏడో స్థానంలో నిలిచి నిరాశపర్చింది. రెజ్లింగ్ భారత మహిళా రెజ్లర్ల పట్టు అదిరింది. ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగం కాంస్య పతక పోరులో వినేష్ 4-0 తేడాతో నరంగెరెల్ ఎర్డెనెసుఖ్ (మంగోలియా)పై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో వినేష్ 1-3 తేడాతో ఎరి టొసాకా (జపాన్) చేతిలో ఓడింది. {ఫీస్టయిల్ 63 కేజీల విభాగం కాంస్య పోరులో గీతిక జఖార్ 5-0తో తీ హియాన్ లీ (వియత్నాం)పై నెగ్గింది. సెమీఫైనల్లో గీతిక 0-5తో జువోమా జిలూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. బాక్సింగ్ మహిళల ఫ్లయ్ వెయిట్ (48-51 కేజీ) విభాగంలో మేరీ కోమ్ క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్స్లో తను 3-0 తేడాతో యేజి కిమ్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. లైట్ వెయిట్ (57-60 కేజీ) ప్రిక్వార్టర్స్లో సరితా దేవి 3-0తో చుంగ్సన్ రి (ఉ.కొరియా)ని ఓడించి క్వార్టర్స్కు చేరింది. మిడిల్ వెయిట్ (69-75 కేజీ) ప్రిక్వార్టర్స్లో పూజా రాణి 3-0తో ఉండ్రామ్ ఎర్డెనెసోయోల్ (మంగోలియా)ను ఓడించింది. పురుషుల ఫ్లయ్ వెయిట్ (52 కేజీ)లో గౌరవ్ బిధురి 3-0తో ప్రేమ్ చౌధరి (నేపాల్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు. పురుషుల వెల్టర్ వెయిట్ (69 కేజీ) మన్దీప్ జాంగ్రా 2-1 తేడాతో వీ లియూ (చైనా)పై నెగ్గి క్వార్టర్స్ చేరాడు. -
హరికృష్ణ అదుర్స్
యూరోపియన్ క్లబ్ చెస్లో స్వర్ణ, రజత పతకాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ అరుదైన ఘనత సాధించాడు. స్పెయిన్లోని బిల్బావో నగరంలో జరిగిన యూరోపియన్ క్లబ్ కప్లో స్వర్ణ, రజత పతకాలను గెల్చుకున్నాడు. ఈ టోర్నమెంట్లో ఓ భారతీయ క్రీడాకారుడు వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. యూరోప్లోని 52 క్లబ్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ చెక్ రిపబ్లిక్కు చెందిన జీ-టీమ్ నోవీ బోర్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. మూడో బోర్డుపై బరిలోకి దిగిన హరికృష్ణ ఏడు రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో నోవీ బోర్ రన్నరప్గా నిలిచింది. -
బీజం వేసింది మనమే!
ఒలింపిక్స్... నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా పండుగ... పేరుకు ప్రపంచ క్రీడలే అయినా ఒకప్పుడు ఒలింపిక్స్లో పతకాల సాధనలోనూ, ప్రాతినిధ్యంలోనూ పాశ్చాత్య దేశాలదే పైచేయి. ఏడు ఖండాల్లో ఆసియా పెద్దదైనప్పటికీ పాశ్చాత్య దేశాల ముందు దిగదుడుపే. ఒకటో అరో మినహాయిస్తే ఆసియా దేశాలు అప్పట్లో ఒలింపిక్స్లో పెద్దగా సాధించిందేమీ లేదు.. పేదరికం... క్రీడలపై అనాసక్తి... అరకొర వసతులు... ప్రపంచ క్రీడల్లో ఆసియాను వెనక్కినెట్టేశాయి. ఓటమే విజయానికి తొలిమెట్టు అన్నట్లు... ఒలింపిక్స్లో పతకాల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలవడం ఆసియా క్రీడలకు బాటలు వేసింది. తమకూ ఒలింపిక్స్లా క్రీడలు ఉండాలన్న ఆలోచన ఏషియాడ్కు నాంది పలికేలా చేసింది. ఇంచియాన్లో క్రీడలు ఘనంగా ప్రారంభమైన నేపథ్యంలో ఏషియా గత చరిత్రపై ‘మైదానం’ స్పెషల్. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ‘గురుదత్ సోంధి’ పరిచయం లేని పేరు.. 66 ఏళ్ల కిందట లండన్లో గురుదత్ మెదడులో మెదిలిన ఆలోచన క్రీడల్లో ఆసియా జాతకాన్నే మార్చేసింది. ఒలింపిక్స్లో పాశ్చాత్య దేశాల జోరు కొనసాగుతున్న రోజుల్లో మనకంటూ ఓ క్రీడ ఉండాలని.. ఆసియా దేశాల ప్రతిభ చాటేందుకు అవి ఉపయోగపడాలని భావించారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే ‘ఆసియా క్రీడలు’.. ఇంతింతై అన్నట్లు ఆ ఏషియాడే ఇప్పుడు ఒలింపిక్స్తో పాటు అంతర్జాతీయ పోటీల్లో ఆసియా దేశాల హవా కొనసాగేలా చేస్తోంది. లండన్లో పునాది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియాకు చెందిన చాలా దేశాలు స్వాతంత్య్రం సాధించాయి. ఈ సమయంలోనే ఆసియా క్రీడలకు పునాది పడింది. లండన్ ఆతిథ్యమిచ్చిన 1948 సమ్మర్ ఒలింపిక్స్ సందర్భంగా చైనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన క్రీడాకారులు ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ను పునరుద్ధరిస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. అయితే భారత్కు చెందిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి గురుదత్ సోంధి మాత్రం ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావించారు. ఈ గేమ్స్ స్థానంలో కొత్తగా పోటీలను నిర్వహించాలని ఆసియా ప్రతినిధులకు సలహా ఇచ్చారు. ఈ సలహానే ఆసియా క్రీడలకు నాంది పలికినట్లయింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఏడాదికి ఆసియా గేమ్స్ సమాఖ్య ఏర్పాటైంది. అలా తొలి ఆసియా క్రీడలను నిర్వహించే అవకాశం న్యూఢిల్లీ దక్కించుకుంది. 1951లో తొలిసారిగా ఏషియాడ్ను నిర్వహించారు. ఒలింపిక్స్ తరహాలో నాలుగేళ్లకోసారి ఆసియా క్రీడలను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే రెండో ఆసియా గేమ్స్ మాత్రం మూడేళ్లకే అంటే 1954లో జరిగాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నాలుగేళ్లకోసారి ఆసియా పోటీలను జరుపుతున్నారు. ఏషియాడ్కు ముందు... ఆసియా క్రీడలు 1951లో మొదలైనప్పటికీ అంతకంటే ముందే ఒలింపిక్స్ తరహాలో మెగా టోర్నీ నిర్వహించేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ పేరుతో జపాన్, ఫిలిప్పీన్స్, చైనా దేశాలు 1912లో పోటీలకు శ్రీకారం చుట్టాయి. ఆ తర్వాతి ఏడాది (1913లో) మనీలాలో తొలిసారిగా ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ జరిగాయి. రెండేళ్లకోసారి 1934 వరకు మరో పదిసార్లు ఈ పోటీలను నిర్వహించారు. అయితే కొన్ని కారణాలతో చైనా తప్పుకోవడంతో 1938లో ‘ఫార్ ఈస్టర్న్ గేమ్స్’ రద్దయ్యాయి. భవిష్యత్తులో మార్పులు... 1954 నుంచి సరిసంఖ్య ఏడాదిలో ఆసియా క్రీడల్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అయితే త్వరలోనే ఇది బేసి సంఖ్య ఏడాదిలో నిర్వహించేందుకు ఓసీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఒలింపిక్స్కు రెండేళ్ల ముందు పోటీలను నిర్వహిస్తుండగా.. ఏడాది ముందే ఏషియాడ్ను నిర్వహించాలని ఆసియా ఒలింపిక్ మండలి నిర్ణయించింది. దీంతో వచ్చే ఆసియా క్రీడలు 2019లో జరగాల్సి ఉన్నప్పటికీ ఇండోనేషియాలో ఎన్నికల కారణంగా.. 2018లోనే ఏషియాడ్ జరిగే అవకాశాలున్నాయి. నిజానికి ఈ క్రీడల్ని వియత్నాం నిర్వహించాల్సి ఉంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ దేశం నిర్వహణపై గతంలోనే చేతులెత్తేసింది. దీంతో ఇండోనేషియా పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఇక 19వ ఆసియా క్రీడలను 2022కు బదులుగా 2023లో నిర్వహిస్తారు. ఒలింపిక్స్ కంటే ఏడాది ముందే ఈ పోటీలు జరిగేలా షెడ్యూల్లో మార్పులు చేశారు. సూపర్ పవర్ చైనా... ఆసియా క్రీడల్లో ఒకప్పుడు జపాన్ ఆధిపత్యం ప్రదర్శించినా... ప్రస్తుతం పతకాలు కొల్లగొడుతోంది చైనానే. ఎప్పుడు ఆసియా క్రీడలు జరిగినా పైచేయి ఆ దేశానిదే. మిగతా దేశాలవి ఆ తర్వాతి స్థానాలే. ఆసియా క్రీడల్లో ఇప్పుడు చైనాది రారాజు పాత్ర. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల నుంచి ఆ దేశం ఆధిపత్యం చాటుతూ వస్తోంది. మొత్తంగా చైనా ఏషియాడ్లో 1191 బంగారు పతకాలతో అగ్రస్థానంలో ఉంది. ఇక ఆసియా క్రీడల చరిత్రలో ఏ దేశం కూడా ఇప్పటిదాకా కనీసం వెయ్యి స్వర్ణాలు గెలవలేకపోయింది. క్రీడల్లో తమ దేశానికి ఉన్న ఆసక్తికి ఈ పతకాలే నిదర్శనమని చైనా క్రీడాకారులు గర్వంగా చెబుతారు. జపాన్ 910 బంగారు పతకాలతో చైనా తర్వాతి స్థానంలో ఉంది. ఏషియాడ్లో అవీ ఇవీ 1951, 54, 58 ఆసియా క్రీడలు పెద్దగా వివాదాలేమీ లేకుండా జరిగినా... ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన 1962 ఏషియాడ్ను మాత్రం వివాదాలు చుట్టుముట్టాయి. రాజకీయ, మతపరమైన కారణాలతో ఇజ్రాయెల్, చైనా దేశాలను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా ఇండోనేసియా అడ్డుకుంది. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏషియాడ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడమే కాకుండా ఇండోనేసియాపై నిషేధం విధించింది. 1970లో దక్షిణ కొరియా ఆర్థిక ఇబ్బందులు, ఉత్తర కొరియా నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా ఆసియా క్రీడలను నిర్వహించలేకపోయింది. దీంతో థాయ్లాండ్ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. ఇక 1970 నుంచే ఆసియా క్రీడలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమవుతున్నాయి. 1974లో ఇరాన్లోని టెహ్రాన్లో జరిగిన ఆసియా క్రీడల్లో చైనా, ఉత్తరకొరియా, మంగోలియా, ఇజ్రాయెల్ దేశాలు పాల్గొన్నాయి. అరబ్ దేశాలు వ్యతిరేకించినప్పటికీ ఇజ్రాయెల్కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. 1978లో తొలుత సింగపూర్, ఆతర్వాత పాకిస్థాన్కు ఆసియా క్రీడల్ని నిర్వహించే అవకాశం వచ్చింది. కానీ ఇవి చేతులెత్తేయడంతో మరోసారి ఆసియా క్రీడలు బ్యాంకాక్లో జరిగాయి. తైవాన్, ఇజ్రాయెల్లను ఈ పోటీల్లో పాల్గొనకుండా గేమ్స్ ఫెడరేషన్ అడ్డుకుంది. మరోవైపు కొన్ని దేశాలు పోటీలకు ముందు క్రీడల నుంచి తప్పుకున్నాయి. 1981లో ఆసియా గేమ్స్ సమాఖ్య స్థానంలో ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) ఏర్పాటైంది. ఓసీఏ ఆధ్వర్యంలోనే 1982లో ఢిల్లీలో ఆసియా క్రీడలు జరిగాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కజకిస్థాన్, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్కెమినిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు 1994 ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కింది. పోటీలకు మహిళలు దూరం సౌదీ అరేబియా మహిళల ప్రాతినిధ్యం లేకుండానే ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతోంది. 199 మంది సభ్యుల బృందంలో ఒక్క క్రీడాకారిణికి కూడా చోటు దక్కలేదు. అయితే క్రీడల్లో పోటీపడే సత్తా తమ క్రీడాకారిణుల్లో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అరేబియా అధికారులు చెప్పారు. కానీ అధికారులు కావాలనే మహిళల్ని ఎంపిక చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత పరమైన అడ్డంకుల వల్లే మహిళల్ని పోటీలకు దూరంగా ఉంచారని మానవ హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రెండేళ్ల కిందట లండన్లో జరిగిన ఒలింపిక్స్లో సౌదీ అరేబియా తరఫున ఇద్దరు మహిళలు బరిలోకి దిగారు. ఒలింపిక్స్ ముగిసిన రెండేళ్లకే మళ్లీ క్రీడాకారిణుల్ని దూరంగా ఉంచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాంతి వివాదం 2006 దోహా ఆసియా క్రీడల సందర్భంగా భారత అథ్లెట్ శాంతి సౌందరాజన్ వివాదాల్లో నిలిచింది. మహిళల 800 మీటర్ల పరుగులో శాంతి.. రజత పతకం సాధించింది. అయితే శాంతి సౌందరాజన్ మహిళ కాదనే వాదనలు మొదలయ్యాయి. దీంతో శాంతికి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఆ పరీక్షలో శాంతి విఫలం కావడంతో నిర్వాహకులు అనర్హురాలిగా ప్రకటించి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన దగ్గరి నుంచి శాంతికి కష్టాలు మొదలయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం రెండేళ్ల కిందట ఆమె సాధించిన విజయాలు గుర్తించింది. ఫలితంగా శాంతి ఇప్పుడు అథ్లెటిక్స్ కోచ్గా సేవలందించగలుగుతోంది. సాక్స్లో సెన్సర్ గ్వాంగ్జౌ ఏషియాడ్లో తైవాన్ క్రీడాకారిణి యాంగ్ షు చన్ తైక్వాండో పోటీల సందర్భంగా ఆమె వేసుకున్న సాక్స్లో అదనపు సెన్సర్ ఉన్నట్లు గ్రహించారు. దీంతో షు చన్పై మూడు నెలల నిషేధం విధిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజానికి తైక్వాండోలో క్రీడాకారులు వేసుకునే సాక్సుల్లో సెన్సర్లను ఉంచుతారు. ప్రత్యర్థిపై దాడి చేసినప్పుడు వారు సాధించిన పాయింట్ల కోసం వీటిని ఉపయోగిస్తారు. అయితే షు చన్ మాత్రం అదనపు సెన్సర్లను వినియోగించినట్లు తొలి రౌండ్ పోటీ సందర్భంగా బయటపడింది. అప్పటికే ఆమె 9-0తో ఆధిక్యంలో ఉంది. దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. గుర్రంపై నుంచి కిందపడి... ఆసియా క్రీడల్లో విషాదకర ఘటన 2006 దోహా పోటీల సందర్భంగా చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ఈక్వెస్ట్రియన్ క్రీడాకారుడు కిమ్ హ్యుంగ్ చిల్ క్రాస్ కంట్రీ కోర్స్ సందర్భంగా ఎనిమిదో జంప్లో హఠాత్తుగా గుర్రంపై నుంచి కిందపడి పోయాడు. ఆ సమయంలో అతనిపై గుర్రం కూడా పడిపోయింది. స్పృహ కోల్పోయిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆసియా క్రీడల్లో ఒక క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. -
క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వ నజరానా రూ. 29.6 కోట్లు
- నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు - సైనా, సింధుల పాత బకాయిలు కూడా చెల్లింపు సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్లుగా వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించిన క్రీడాకారుల ఎదురు చూపులు ఫలించాయి. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన వారితో పాటు... గతంలో పతకాలు సాధించిన వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం నజారానా ప్రకటించింది. వీళ్లందరికీ చెల్లించేందుకు గాను రూ. 29.6 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2012లో లండన్ ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరిన కశ్యప్కు రూ. 25 లక్షలు, 2013లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకానికిగాను సింధుకు రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్కు రూ. 20 లక్షలు ఇస్తారు. ఆగస్టు 15వ తేదీన చెల్లింపునకు వీలుగా నిధులను విడుదల చేస్తూ యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘నన్నూ గుర్తించండి’
వికలాంగ క్రీడాకారుడు అంజనారెడ్డి ఆవేదన సాక్షి, హైదరాబాద్: వికలాంగ బ్యాడ్మింటన్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినప్పటికీ తననెవరూ గుర్తించడం లేదని కరీంనగర్కు చెందిన వన్నెల అంజనారెడ్డి ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తనను గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడినా 2003 నుంచి 2010 వరకు పలు పోటీల్లో పాల్గొన్నానని గుర్తు చేశాడు. అయితే ముఖ్యమంత్రిని కలిసేందుకు శనివారం సచివాల యానికి వచ్చిన అంజనకు చేదు అనుభవం ఎదురైంది. అపాయింట్మెంట్ లేని కారణంగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. సోమవారం సీఎంను కలిసే వెళతానని చెప్పాడు. అయితే తన కుటుంబం పేదరికంలో లేదని, తగిన గుర్తింపు కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపాడు. 2003లో ఇజ్రాయెల్ ఓపెన్ చాంపియన్షిప్లో రెండోస్థానం, 2006లో తొమ్మిదో పసిఫిక్ గేమ్స్లో కాంస్య పతకం, 2008 రెండో ఆసియా కప్లో కాంస్యం, 2009 ఐడబ్ల్యూఏఎస్ గేమ్స్లో రెండు స్వర్ణాలు సాధించినట్టు అంజన చెప్పాడు. -
ఈతకొలనులో బంగారు చేప
అంగవైకల్యాన్ని జయించిన నటాలీ నూడుల్ అని ముద్దుగా పిలుచుకునే 30 ఏళ్ల దక్షిణాఫ్రికా స్విమ్మర్ నటాలీ డూ టాయ్ట్ ఈతకొలనులో బంగారు చేప. అంతర్జాతీయంగా 21 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించింది. అయితే ఈమె అంగవైకల్యాన్ని జయించి మరీ ఈ పతకాలు సాధించడం విశేషం. 14 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో ఎడమ కాలిని కోల్పోయినా తన లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అంతర్జాతీయ స్విమ్మర్గా రాణించాలన్న కసితో స్విమ్మింగ్లో సాధన చేసింది. ఫలితంగా 2002 కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. 2002, 06, 10 కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం ఏడు బంగారు పతకాలు కైవసం చేసుకుంది. పారా ఒలింపిక్స్లోనైతే నటాలీకి తిరుగే లేదు. 2004లో ఏథెన్స్లో 5.. 2008లో బీజింగ్లో 5.. 2012లో లండన్లో 3 బంగారు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. అంతేకాదు.. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఇద్దరు పారా ఒలింపియన్లలో నటాలీ ఒకరు. బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టయిల్, బ్రెస్ట్ స్ట్రోక్ విభాగాల్లో రాణించగల సత్తా ఆమె సొంతం. చిన్ననాటి నుంచే... దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జన్మించిన నటాలీకి చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అంటే ఆసక్తి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉండటంతో అనతికాలంలోనే ఈతకొలనులో బంగారు చేపలా తయారైంది. 14 ఏళ్లకే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నటాలీ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి స్కూలుకు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. స్కూటర్పై వెళ్తున్న నటాలీని వెనక నుంచి వచ్చిన కారు గట్టిగా ఢీకొట్టింది. 2001లో జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆమె ఎడమకాలిని దాదాపుగా మోకాలి వరకు తీసేశారు. అయితే కాలు పోయిందన్న బాధను దిగమింగి.. తన స్విమ్మింగ్ భవిష్యత్తుపై దృష్టిపెట్టింది. 2002 కామన్వెల్త్ గేమ్సే లక్ష్యంగా సాధన చేసింది. మాంచెస్టర్లో జరిగిన కామన్వెల్త్గేమ్స్తో తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న నటాలీ ఇక వెనుదిరిగి చూడలేదు. -
భారత్కు ఐదో స్థానం
గ్లాస్గో గేమ్స్కు వీడ్కోలు గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. పన్నెండు రోజులపాటు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన క్రీడాకారుల విన్యాసాలకు తాత్కాలికంగా తెర పడింది. గత పోటీల స్థాయిలో కాకపోయినా... ఈసారి కూడా భారత క్రీడాకారులు పలు క్రీడాంశాల్లో పతకాల పంట పండించారు. జూలై 23న ప్రారంభమైన ఈ క్రీడల్లో తొలిరోజే వెయిట్లిఫ్టర్ సుఖేన్ డే భారత్కు తొలి స్వర్ణాన్నందించగా... చివరి రోజు బ్యాడ్మింటన్లో పారుపల్లి కశ్యప్ సాధించిన స్వర్ణం దాకా భారత్ పసిడి వేట కొనసాగింది. షూటింగ్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్లలో మనవాళ్లు అంచనాలకు అనుగుణంగానే రాణించినా... బాక్సర్లు మాత్రం ఒక్క స్వర్ణమూ సాధించకుండా రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. టేబుల్ టెన్నిస్లో ఒకే ఒక్క పతకంతో నిరాశపరిచారు. స్క్వాష్లో తొలిసారి పతకాన్ని... అదీ స్వర్ణాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టిం చారు. పసిడి పతకాల్లో కాస్త వెనకబడినా... మొత్తంగా 64 పతకాలతో భారత్ ఐదో స్థానంతో పోటీలను సంతృప్తికరంగా ముగించింది. ఇంగ్లండ్ 174 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక వచ్చే కామన్వెల్త్ గేమ్స్ 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ నగరంలో జరగనున్నాయి. -
పేదరికంపై పవర్ పంచ్
లక్ష్యం వారి కుటుంబాల నేపథ్యం సాధారణం.. అమ్మానాన్నలది కాయకష్టం.. కుటుంబ పోషణ కూడా వారికి కనాకష్టం... అయినా ఆ ఇద్దరమ్మాయిలు కష్టాలనే ఇష్టాలుగా మలుచుకుని పవర్ లిఫ్టింగ్లో ప్రతిభ చూపిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే బీజం పడ్డ వారి ఉన్నత లక్ష్యాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తమకు చేతనైనంతగా ప్రోత్సాహం అందించారు అమ్మానాన్నలు. పవర్ లిఫ్టింగ్లో శిక్షణ పొందేందుకు నడుంకట్టిన ఈ అమ్మాయిలు ఎనిమిదేళ్లుగా కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆ అమ్మాయిలే మంగళగిరికి చెందిన నగీనా, సలోమీలు. స్నేహితులైన ఈ ఇద్దరూ పవర్ లిఫ్టింగ్వైపు ఎలా అడుగులు వేశారంటే... నగీనా తండ్రి సుభాని మెకానిక్. అమ్మ అమీరున్నీసా గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి నగీనా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నగీనాకు పవర్ లిఫ్టింగ్పై ఆసక్తి ఎలా కలిగిందో ఆమె మాటల్లోనే... సీకే గరల్స్ హైస్కూల్లో నా సీనియర్ మట్టుకొయ్య సలోమి, మరికొందరు... అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వారిని చూసి నాకు కూడా వెళ్లాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్పా! అమ్మ ప్రోత్సహించడంతో ఎనిమిదో తరగతి (2006)లో ఉండగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్కు వెళ్లడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యలో కొన్నాళ్లు మానుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో బీకాం (2010-13) చదువుతూ శిక్షణను కొనసాగించాను. ఏమి సాధించిందంటే... కృష్ణా యూనివర్సిటీ తరపున గుడివాడలో, విజయవాడ లయోల కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల కేటగిరీలో స్వర్ణపతకం, వర్సిటీ స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు; గత జనవరిలో నిమ్రా కాలేజ్లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్మెడల్; సౌత్ ఇండియా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సీనియర్స్ విభాగం 63 కేజీల కేటగిరీలో గోల్డ్మెడల్. ఇక మట్టుకొయ్య సలోమీది మంగళగిరి మండలం మక్కెవారిపేట. తండ్రి చిన్నవెంకయ్య రాడ్ బెడ్డింగ్ పనిచేస్తారు. అమ్మ వరదానం గృహిణి. ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సలోమి సీకే గరల్స్ హైస్కూల్లో చదివేటప్పుడు పీఈటీ ప్రోత్సాహంతో కోచ్ సందాని వద్ద చేరింది. అక్కడ తీసుకున్న శిక్షణతో 2008లో మిజోరాంలో జరిగిన జాతీయస్థాయి గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్పై ఆసక్తి కలగడంతో ఆ దిశగా సాధన చేస్తోంది. సలోమీ ఏమి సాధించిందంటే... ఏఎన్యూ అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లలో 72 కేజీల కేటగిరీలో మూడేళ్లు వరుసగా బంగారు పతకాలు; సౌత్ ఇండియా స్థాయిలో కోయంబత్తూరు (2011)లో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, హైదరాబాద్ (2012), కేరళ రాష్ట్రం (2013)లలో జరిగిన టోర్నమెంట్స్లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్, సీనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్. గత జనవరిలో నిమ్రా కాలేజ్లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో గోల్డ్మెడల్. ఇటువంటి మట్టిలో మాణిక్యాలు రాష్ర్టంలో మరెందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్దల సహాయసహకారాలు లభిస్తే, ఎన్నో సంచలనాలు సృష్టించి, రాష్ట్రానికి వన్నె తెస్తారనడంలో సందేహం లేదు. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు - ఫొటో: నందం బుజ్జి, మంగళగిరి -
భారత్ పరువు కాపాడింది ఆ 'రెండే'
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఆశించిన ఫలితాలు సాధిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రస్తుతం టాప్-5లో నిలిచింది. తొలి నాలుగు రోజుల్లో మొత్తం 22 పతకాలు సొంతం చేసుకుని ఐదో స్థానంలో నిలిచింది. అయితే భారత్ గౌరవం కాపాడింది మాత్రం రెండు క్రీడాంశాలే. అవే షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్. కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటి వరకు భారత క్రీడాకారుల ఓవరాల్ ప్రదర్శనను పరిశీలిస్తే షూటర్లే ముందంజలో నిలిచారు. పతకాలన్నీ కేవలం మూడు క్రీడాంశాల్లోనే రాగా.. అందులోనూ సింహ భాగం షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలల్లోనే సాధించడం గమనార్హం. ఈ రెండింటిలో తొమ్మిది చొప్పున పతకాలు రావడం విశేషం. గ్లాస్గోలో భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. భారత్కు ఆదివారం నాటికి ఆరు బంగారు పతకాలు రాగా షూటింగ్లో మూడు, వెయిట్ లిఫ్టింగ్లో మూడు పతకాలు వచ్చాయి. ఇక భారత షూటర్లు మరో ఐదు రజతాలు, ఓ కాంస్య పతకం కైవసం చేసుకోగా, లిఫ్టర్లు మరో రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు నెగ్గారు. జూడోలో రెండేసి రజతాలు, కాంస్యాలు లభించాయి. కాగా భారత్ ఆశలు పెట్టుకున్న రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో ఇంకా ఫైనల్స్ జరగాల్సివుంది. ఈ రెండింటిలోనూ మనోళ్లు పతకాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు నిరాశపరిచారు. తొలి నాలుగు రోజుల్లో భారత్ సాధించిన పతకాలు వివరాలు క్రీడాంశాల వారీగా.. భారత్ సాధించిన పతకాలు 22 షూటింగ్ 9-3 స్వర్ణాలు-5 రజతాలు-1 కాంస్యం వెయిట్ లిఫ్టింగ్ 9-3 స్వర్ణాలు-2 రజతాలు-4 కాంస్యాలు జూడో 4-2 రజతాలు-2 కాంస్యాలు -
ఇల్లే బడి... అమ్మానాన్నలే గురువులు
‘ఆ అమ్మాయి టేబుల్ టెన్నిస్ బాగా అడుతుంది’ అంటే... దేశానికి పతకాలు సాధించిపెట్టే ఓ క్రీడాకారిణి ఉంది అని సంతోషిస్తారు. ‘ఆ అమ్మాయి వేగంగా టైప్ చేస్తుంది’ అంటే... మంచి సాధన అని ఊరుకుంటారు. ‘ఆ అమ్మాయి రెండు చేతులతో రాస్తుంది’ అంటే... మల్టీటాస్కింగ్ అని ప్రశంసిస్తారు. ‘ఆ అమ్మాయి చక్కగా పాడుతుంది, పియానో వాయిస్తుంది’ అంటే... సంగీత జ్ఞానమున్న కుటుంబం కావచ్చంటారు. ‘ఆ అమ్మాయి అరగంటలో హైదరాబాద్ బిర్యానీ వండి వడ్డిస్తుంది’ అంటే... ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు అని ఇప్పుడే కితాబిస్తారు. ‘ఆ అమ్మాయి ఎనిమిదేళ్లకే పదవ తరగతి పరీక్ష పాసయింది’ అంటే మాత్రం... ‘అవునా’ అంటూ కళ్లు విప్పార్చి మరీ ఆశ్చర్యపోతారు. ఇక... ఇవన్నీ ఒకే అమ్మాయి సాధించిన రికార్డులని తెలిస్తే...? ఆ అమ్మాయి నైనా జైస్వాల్ అని మెరిసే కళ్లతో చూడడమే మిగులుతుంది. పద్నాలుగేళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సాధించడం, ఇంతటి సాధన ఎలా సాధ్యమైందంటే అంతా మా అమ్మానాన్నల శ్రమ ఫలితమే అంటోంది నైనా. నిజమే.. నైనా జైస్వాల్ తండ్రి అశ్విని కుమార్ న్యాయశాస్త్రం చదువుకున్నారు. అంతకంటే ముందు ఆయన దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడు. ఇప్పటికీ ఇంటర్, డిగ్రీ, లా విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. ‘‘తల్లిదండ్రులు కొంత శ్రద్ధ చూపిస్తే పిల్లల్లో ఉన్న ఐక్యూకు పదును పెట్టవచ్చు. అందుకు నిదర్శనం మేము, మా పిల్లలే. నా ఆలోచనకు మా ఆవిడ భాగ్యలక్ష్మి కూడా సహకరించడంతో పిల్లలను బాలమేధావులుగా తీర్చిదిద్దడం సాధ్యమైంది’’ అంటారాయన. అక్క బాటలోనే తమ్ముడు! నైనా తమ్ముడు అగస్త్య ఎనిమిదేళ్ల కుర్రాడు. రామాయణం, భగవద్గీతల్లోని శ్లోకాలు కంఠస్థం చేశాడు. భావంతో సహా ఆ శ్లోకాలనూ వల్లిస్తాడు. వంద ఎక్కాలు గుక్క తిప్పుకోకుండా చెబుతాడు. తండ్రి తయారు చేసిన మూడు వేల ప్రశ్నల జనరల్ నాలెడ్జ్ బుక్లెట్ నుంచి ఏ ప్రశ్నకైనా ఠక్కున జవాబులు చెప్పగలడు. తాజాగా పదవ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ‘‘తెలివితేటలు, మేధాసంపత్తి అనేవి పెంచుకుంటూ పోతే పెరుగుతాయి తప్ప, ఏ ప్రయత్నమూ చేయకుండా కాలం గడిపేస్తే పెరగవు. మా పిల్లల విషయంలో నేను చేసింది అదే’’ అంటారు అశ్విని కుమార్. ‘‘నాకు సంస్కృతం రాదు, బాబుతో రామాయణం, భగవద్గీత శ్లోకాలు పలికించడం, అర్థం చెప్పడం వంటివన్నీ వాళ్లమ్మ నిర్వహిస్తున్న శాఖ. మేమిద్దరం మా పిల్లల్ని ‘ఇల్లే బడి’ అనే పద్ధతిలో తీర్చిదిద్దాలనుకున్నాం. అదే చేశాం’’ అంటారు. లండన్ నుంచి ప్రత్యేక అనుమతి పిల్లల్లో ఎనిమిదేళ్లకే పదో తరగతి పరీక్ష రాయగల సామర్థ్యం ఉందని తల్లిదండ్రులు గ్రహించడం ఒక ఎత్తు. అయితే ఆ పిల్లల చేత పరీక్ష రాయించడానికి అనుమతి పొందడం మరో ఎత్తు. అది చిన్న విషయం కాదు. అందుకు విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ‘‘మా పాప నైనా చేత పరీక్ష రాయించడానికి అప్పటి విద్యాశాఖ మంత్రిని అనుమతి కోరాను. అప్పటికి ఆ మంత్రికి అలా పరీక్ష రాయవచ్చని కూడా తెలియదట. ఆశ్చర్యపోయారు కానీ అనుమతి మాత్రం ఇవ్వలేదు. జిల్లా విద్యా శాఖాధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. దాంతో ఐజిసిఎస్ఈ (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానంలో పరీక్ష రాయించడానికి లండన్కి ఉత్తరం రాశాను. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశానికి ఢిల్లీకి వచ్చిన కేంబ్రిడ్జి ప్రతినిధి అలీసా రిచర్డ్సన్ను కోరాను. అప్పుడామె చెన్నైలోని ‘సౌత్ ఏషియా’విభాగాధిపతిని కలవమని రిఫరెన్స్ ఇచ్చారు. అక్కడ పాప ఐక్యూ టెస్ట్ చేసిన తర్వాత అనుమతినిచ్చారు’’ అని చిన్న వయసులోనే నైనా జైస్వాల్ పదో తరగతి పరీక్ష రాయడానికి మార్గం సుగమం చేసుకున్న వైనాన్ని వివరించారు అశ్విని కుమార్. సర్దుబాటు సంతోషమే! స్కూలుకెళ్లి చదువుకోవడం అనే సాధారణ పద్ధతి నుంచి ఇంట్లోనే చదువుకునే విధానాన్ని చేపట్టడానికి దారి తీసిన పరిస్థితులను తల్లి భాగ్యలక్ష్మి. వివరించారు. ‘‘పెళ్లికి ముందు నుంచే ఆయన బోధనారంగంలో ఉన్నారు. కొంతమంది చురుకైన పిల్లలకు క్లాసు సిలబస్ కంటే ఎక్కువ విషయాలను చెప్పాలని తపన పడేవారు. అయితే, ఆ పిల్లల తల్లిదండ్రుల నుంచి పెద్దగా స్పందన వచ్చేది కాదు. అప్పుడే మేమిద్దరం ‘ఇతరుల పిల్లల విషయంలో మనం నిర్ణయం తీసుకోకూడదు, మన పిల్లలనైతే మనకు నచ్చినట్లు పెంచుకోవచ్చు’ అని అప్పుడే అనుకున్నాం’’ అంటారామె. ఈ తల్లిదండ్రుల కృషితో ఆ ఇంట్లో ఇద్దరు బాలమేధావులు తయారయ్యారు. పిల్లలను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడం కోసం ఎంత వరకైనా శ్రమిస్తాననే తండ్రి, పిల్లల అవసరాల కోసం మా ఖర్చులు తగ్గించుకోవడం మాకేమీ బాధ అనిపించడంలేదనే తల్లి ఈ పిల్లలకు సొంతం. అక్క కంటే నేనే ముందు! నైనాకు రెండు చేతులతో రాయడం నేర్పించడానికి కారణం - మెదడును చురుగ్గా ఉంచడానికేనంటారు తల్లిదండ్రులు. మెదడులోని రెండు పార్శ్వాలూ చురుగ్గా ఉండాలంటే రెండు చేతులతో రాస్తే చాలంటారు. నైనా జాతీయ స్థాయి విజేత అయిన సంఘటన తమకు అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారా దంపతులు. అందరూ భావిస్తున్నట్లు ఇన్ని రంగాల్లో రాణించడం వల్ల తమ పిల్లలు ఒత్తిడికి లోను కావడం లేదని, ఇప్పుడు ఏ ఒక్కటి ఆపేయమన్నా ఏడుస్తారనీ వారు చెప్పారు. ఇంతలో అగస్త్య కలగ జేసుకుంటూ ‘‘అక్క అన్నింట్లో ఫస్ట్, కానీ నేను అక్క కంటే ఫస్టే పేపర్లో, టీవీలో వచ్చేశా’’ అంటూ ‘అవును కదమ్మా’ అంటూ తల్లి వైపు చూశాడు. నైనా తాజాగా పద్నాలుగేళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇటీవలే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. త్వరలోనే పి.జి చేయనుంది. ఇక, సివిల్స్ పరీక్ష రాయడానికి 21 ఏళ్ల వయఃపరిమితి కాబట్టి, ఆ అర్హత వచ్చే లోపు పిహెచ్డి కూడా చేస్తానంటోంది. ‘‘ఒక మంచి పని చేయాలన్నా, ఒకరికి సహాయం చేయాలన్నా చేతిలో అధికారం ఉండాలి. అందుకే మా అమ్మాయిని ఐఎఎస్ అధికారిని చేయాలనుకున్నా’’నంటారామె తండ్రి. ఎంఎస్సి మైక్రో బయాలజీ చదివి పిల్లల కోసం పై చదువులకు, ఉద్యోగానికి దూరంగా ఉన్న భాగ్యలక్ష్మి ‘‘మా అమ్మాయితోపాటు నేను కూడా పిహెచ్డి చేస్తా’’ అన్నారు. ఇంతలో ‘‘టీటీ టోర్నమెంట్కు అక్కకు తోడుగా నాన్న వెళ్తున్నాడు, నేను కూడా టీటీ ఆడి నాతోపాటు అమ్మను చైనాకు తీసుకెళ్తా’’ అంటూ తల్లిని చుట్టుకున్నాడు అగస్త్య. రత్నాల్లాంటి పిల్లలను ఇవ్వడం వరకే దేవుడి వంతు. ఆ రత్నాలకు మెరుగులు దిద్దడం తల్లిదండ్రుల బాధ్యత అనడానికి అశ్వినికుమార్, భాగ్యలక్ష్మి దంపతులే నిదర్శనం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అమ్మానాన్నకు అన్నీ నేనే అవుతా! ఇలాంటి అమ్మానాన్నలు ఉండడం మా అదృష్టం. వాళ్ల సమయం, జీవితం మా కోసమే అన్నట్లు ఉంటారు. నేను సివిల్స్ రాసి మంచి ఉద్యోగం సాధించిన తర్వాత మా అమ్మానాన్నలకు పూర్తి విశ్రాంతినిచ్చి వాళ్లకు అన్నీ నేనే చూసుకుంటాను. - నైనా జైస్వాల్, 14 ఏళ్లకే డిగ్రీ పాసైన బాల మేధావి పుట్టింది: 2000 మార్చి 22వ తేదీన, హైదరాబాద్లో పదవ తరగతి పరీక్ష పాసయింది: 2008లో 12వ తరగతి పాసయింది : 2010లో డిగ్రీ పాసయింది: ఇటీవలే ఉస్మానియా యూనివర్శిటీ నుంచి (బి.ఎ, మాస్ కమ్యూనికేషన్స్) జాతీయ స్థాయి పతకాలు: టేబుల్ టెన్నిస్లో 2010- 2011లలో అండర్ 12 కేటగిరీలో స్వర్ణ, అండర్ 14 కేటగిరీలో కాంస్య పతకాలు, అండర్ 12, అండర్ 14 టీమ్ ఈవెంట్లలో స్వర్ణపతకాలు, {పస్తుత స్థాయి: జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, అంతర్జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకు. -
పరుగు పోరాటం!
అభివృద్ధిలో వెనుక ఉన్నా... ఆదాయం అంతంత మాత్రమైనా... ఆకలితో అలమటిస్తున్నా... ఆహార్యం ఆకట్టుకునేలా లేకపోయినా... ఇవేమీ వారు పట్టించుకోరు. బరిలో దిగితే విజయమే లక్ష్యంగా గమ్యంవైపు సాగిపోతారు. పతకాలు, పైసలు అందించే తొలి మూడు స్థానాలు సొంతం చేసుకోవాలని ఆరాటపడతారు. అమెరికాలో అయితేనేం... యూరోప్లో అయితేనేం... భారత్లో అయితేనేం... ప్రపంచంలో వేదిక ఏదైనా మధ్య, సుదూరపు లక్ష్యం (మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్) పరుగు రేసులు జరుగుతున్నాయంటే ఆఫ్రికా దేశాలు కెన్యా, ఇథియోపియా అథ్లెట్స్ లేకుండా విజేతల జాబితా కనిపించదు. - కరణం నారాయణ ప్రపంచ జనాభాలో ఒక శాతం కూడా లేని కెన్యా, ఇథియోపియా తదితర జాతీయులు ప్రపంచ అథ్లెటిక్స్ను శాసించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. మధ్య, సుదూరపు రేసుల్లో పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ఆధిపత్యం వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు పలు పరిశోధనలు గతంలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. అయితే కచ్చితంగా ఫలానా కారణంతోనే వారు విజేతలుగా నిలుస్తున్నారనే విషయం తేలడంలేదు. సహజసిద్ధ జన్యుపరమైన శరీర నిర్మాణం అని ఒకరంటే... వారి జీవనశైలి నేపథ్యమని మరికొందరంటారు. ఇంటి నుంచి స్కూల్కు వెళ్లేటపుడు... మళ్లీ ఇంటికి వచ్చేటపుడు పరుగెడుతూ వెళ్తారని... ఈ విధంగా వారికి పరుగు జీవనంలో భాగమైపోతుందని... ఈ తరహా జీవనం అలవాటుపడిన వారికి పరుగు పందెం సమయాల్లో అనుకూలిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. గణాంకాలు కూడా ఆఫ్రికా అథ్లెట్స్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పర్వతప్రాంతాల నుంచి వచ్చే అథ్లెట్స్ మాత్రమే గొప్ప విజయాలు సాధిస్తున్నారని మరికొందరి వాదన. శ్రేష్టమైన వాతావరణానికితోడు భీకరమైన సాధన, లక్ష్యంపై పట్టుసడలని ఏకాగ్రత తదితర అంశాలే వారిని విజయవంతం చేస్తున్నాయని కెన్యా అథ్లెట్స్పై పరిశోధన చేసిన మాల్కమ్ గ్లాడ్వెల్ వివరిస్తున్నారు. ‘ఈ ప్రపంచంలో కష్టపడనిదే ఏదీ లభించదు. పరుగు కూడా మానసిక ప్రవృత్తితో కూడుకున్నది’ అని 1968 మెక్సికో ఒలింపిక్స్లో 1500 మీటర్ల విభాగంలో... 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో స్వర్ణ పతకాలు నెగ్గిన కెన్యా విఖ్యాత అథ్లెట్ కిప్చోజ్ కీనో అభిప్రాయం. ఇతర క్రీడల మాదిరిగానే రన్నింగ్లోనూ శారీరక శ్రమ ఉంటుంది. లారీ బర్డ్, మైకేల్ జోర్డాన్ పొడుగ్గా ఉన్నందుకే బాస్కెట్బాల్లో దిగ్గజ హోదా సంపాదించలేదు. అలాగే అనుకూల వాతావరణం ఉన్నందుకే కెన్యా అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారనడం భావ్యం కాదు. శరీరంలోని జన్యువులు మనలో మేటి అథ్లెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవో నిర్ణయిస్తాయి. ఆ తర్వాత విజ్ఞత, అంకితభావం, ప్రణాళికతో కూడిన సాధన తదితర అంశాలే గెలుపోటములను శాసిస్తాయి. కెన్యా, ఇథియోపియాలతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల అథ్లెట్స్లో ఈ లక్షణాలన్నీ మెండుగా ఉన్నాయి. కెన్యా టాప్ - ఇథియోఫియా రన్నరప్ 1983లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మొదలయ్యాక ఇప్పటివరకూ ఓవరాల్గా కెన్యా 43 స్వర్ణాలు, 37 రజతాలు, 32 కాంస్యాలతో కలిపి 112 పతకాలు సాధించింది. ఓవరాల్గా పతకాల జాబితాలో కెన్యాది మూడో స్థానం. అలాగే ఇథియోపియా 22 స్వర్ణాలు, 19 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 64 పతకాలతో ఏడో స్థానంలో ఉండటం విశేషం. ప్రపంచంలో ప్రతిష్టాత్మక మారథాన్లుగా పేరొందిన న్యూయార్క్, బోస్టన్, లండన్, చికాగో, బెర్లిన్, టోక్యో రేసుల్లోనూ కెన్యా, ఇథియోపియా అథ్లెట్స్ పలుమార్లు విజేతలుగా నిలిచారు. 1956లో తొలిసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగిన కెన్యా ఇప్పటివరకు 25 స్వర్ణాలు, 32 రజతాలు, 29 కాంస్యాలు సాధించింది. ఇందులో అథ్లెట్స్ మాత్రమే 24 స్వర్ణాలు, 31 రజతాలు, 24 కాంస్యాలు అందించడం విశేషం. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కెన్యా అథ్లెట్స్ పురుషుల విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్లు, 3000 మీటర్ల స్టీపుల్చేజ్, మారథాన్లో... మహిళల విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి సంచలనం సృష్టించారు. 1956లోనే ఒలింపిక్స్లో తొలిసారి అడుగుపెట్టిన ఇథియోపియా ఇప్పటివరకు 21 స్వర్ణాలు, ఏడు రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలు సాధించింది. ఈ పతకాలన్నీ అథ్లెటిక్స్లోనే రావడం విశేషం. ఇథియోపియా విఖ్యాత అథ్లెట్స్ అబీబి బికిలా: బూట్లు లేకుండా పరుగెత్తి 1960 రోమ్ ఒలింపిక్స్ మారథాన్ రేసులో స్వర్ణం సాధించాడు. 1964 టోక్యో ఒలింపిక్స్లోనూ బికిలా మారథాన్లో పసిడి పతకం గెలిచాడు. హెయిలీ గెబ్రెసెలాసీ: వరుసగా రెండు ఒలింపిక్స్లలో (1996 అట్లాంటా, 2000 సిడ్నీ) 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు సాధించాడు. వరుసగా నాలుగు ప్రపంచ చాంపియన్షిప్లలో (1993, 1995, 1997, 1999) 10,000 మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు. కెనెనిసా బెకెలె: వరుసగా నాలుగు ప్రపంచ చాంపియన్షిప్లలో (2003, 2005, 2007, 2009) 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గాడు. ఏథెన్స్ ఒలింపిక్స్లో 10,000 మీటర్ల రేసులో... బీజింగ్ ఒలింపిక్స్లో 10,000 మీటర్లు, 5000 మీటర్ల రేసులో పసిడి పతకాలు సాధించాడు. తిరునెష్ దిబాబా: బీజింగ్ ఒలింపిక్స్లో 10,000, 5000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గింది. లండన్ ఒలింపిక్స్లో 10,000 మీటర్ల రేసులో పసిడి పతకం. ప్రపంచ చాంపియన్షిప్లో ఐదు స్వర్ణాలు. కెన్యా మేటి అథ్లెట్స్ కెంబోయ్ ఎజికిల్: రెండు ఒలింపిక్స్లో (ఏథెన్స్, లండన్) 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో స్వర్ణాలు నెగ్గాడు. వరుసగా మూడు ప్రపంచ చాంపియన్షిప్లలోనూ (2009, 2011, 2013) పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. వివియన్ చెరుయోట్: రెండు ప్రపంచ చాంపియన్షిప్లలో (2009, 2011) మూడు స్వర్ణాలు సాధించిన చెరుయోట్ లండన్ ఒలింపిక్స్లో రజతం, కాంస్యం నెగ్గింది. నాన్సీ లాంగత్: ఐదు అడుగుల ఎత్తు ఉన్న నాన్సీ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 1500 మీటర్ల రేసులో స్వర్ణం సాధించింది. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో 800, 1500 మీటర్లలో పసిడి పతకాలు నెగ్గింది. డేవిడ్ రుదిషా: లండన్ ఒలింపిక్స్లో 800 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు సమయంతో స్వర్ణం నెగ్గిన 25 ఏళ్ల రుదిషా... 2011 ప్రపంచ చాంపియన్షిప్లోనూ పసిడి సాధించాడు. పమేలా జెలిమో: బీజింగ్ ఒలింపిక్స్లో 18 ఏళ్ల ప్రాయంలోనే 800 మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గి కెన్యా తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా అథ్లెట్గా గుర్తింపు పొందింది. -
అమ్మ మాట.. పతకాల బాట..
సహనం, ప్రేమ స్త్రీమూర్తి సహజ లక్షణాలు. అవే ఆమెను విజయ తీరాలకు నడిపించే వాహనాలు కూడాను. విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే పోలీస్ అధికారి భార్యగా ఆయన మనసెరిగి నడచుకుంటారామె. ఇంటి బాధ్యతను తన భుజంపై వేసుకుని గృహిణిగా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారు. అన్నిటికంటే ప్రధానంగా తల్లిగా కొడుకును అంతర్జాతీయ క్రీడాకారుడిగా తీర్చిదిద్దారు. ఆమే ఐపీఎస్ అధికారి నవీన్చంద్ సతీమణి అపర్ణ. ఉన్నత చదువులు చదువుకున్న అపర్ణ ఉద్యోగం ద్వారా వచ్చే పదవుల కంటే ‘అమ్మ’ స్థానమే తనకు ముఖ్యమని నిర్ణయించుకున్నారు. మానసిక ఎదుగుదల లేని కొడుకు వరుణ్చంద్(23)ను ఉన్నతంగా తీర్చిదిద్ది తల్లి పాత్రను సుసంపన్నం చేశారు. బిడ్డ చిన్ననాటి నుంచి మానసిన వికాసం కోసం స్విమ్మిం గ్లో శిక్షణ ఇప్పించారు. ఆమె ర(శి)క్షణలో జాతీయ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించి 2015లో కాలిఫోర్నియాలో జరగనున్న పోటీలకు ఎంపికయ్యాడు. అపర్ణ మాట్లాడుతూ.. తన బిడ్డ ఆరోగ్యం బాగుపడితే చాలనుకున్నానని, ఇప్పుడు పతకాలు సాధించి తనను ‘విజేత’ను చేశాడన్నారు. -
ఉత్తమ సేవలకు పతకాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 766 మందికి గుర్తింపురాష్ట్రంలో 43 మంది పతకాలకు ఎంపిక సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత 65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొత్తం 766 మంది సిబ్బందికి కేంద్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. వీటికి రాష్ట్రపతి శనివారం ఆమోదముద్ర వేశారు. నలుగురికి రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం, 44 మందికి పోలీసు శౌర్య పతకం, 94 మందికి రాష్ట్రపతి విశిష్ట పోలీసు సేవాపతకం, 624 మందికి విశిష్ట పోలీసు సేవా పతకాలను ప్రదానం చేయనున్నారు. ఇక సంస్కరణ సేవ (కరెక్షనల్ సర్వీసు)లో మొత్తం 41 మందికి విశిష్ట సేవా పతకాలు లభించాయి. దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ బలగమైన సీఆర్పీఎఫ్ సిబ్బందికి మొత్తం 33 మందికి ఈ పతకాలు లభించగా, వాటిలో 15 పోలీసు శౌర్య పతకాలు ఉన్నాయి. ఇక సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు 51 పతకాలు లభించాయి. మన రాష్ట్రంవారు 43 మంది... ఈ గణతంత్ర పతకాల విజేతల్లో మన రాష్ట్రానికి చెందినవారు మొత్తం 43 మంది ఉన్నారు. ఐదుగురికి రాష్ట్రపతి విశిష్ట శౌర్య పతకం, 37 మందికి పోలీసు విశిష్ట శౌర్యపతకం లభించగా, ఒకరికి కరెక్షనల్ సర్వీసులో పతకం లభించింది. ఠ రాష్ట్రపతి విశిష్ట శౌర్య పతకం: జె.పూర్ణచందర్రావు, ఏడీజీపీ (ఎస్ఎల్పీఆర్బీ చైర్మన్, హైదరాబాద్), పి.ఉమాపతి, డీఐజీ (వైజాగ్ రేంజ్), టి.యోగానంద్, డీఐజీ (సీఐడీ, హైదరాబాద్), టి.మురళీకృష్ణ, డీఐజీ (కర్నూలు రేంజ్), అనిల్కుమార్, ఐజీ (ఎన్ఐఎస్ఏ, హైదరాబాద్, సీఐఎస్ఎఫ్) ఠ పోలీసు విశిష్ట సేవాపతకం: విక్రంసింగ్ మాన్, డీఐజీ (ఏలూరు రేంజ్), ఎన్.శివశంకర్రెడ్డి, ఎస్పీ (తూర్పు గోదావరి), జి.శ్రీనివాస్, ఎస్పీ (ఇంటెలిజెన్స్, హైదరాబాద్), డి.నాగేంద్రకుమార్, ఎస్పీ (మహబూబ్నగర్), ఎ.సత్యనారాయణ, జేడీ (ఏసీబీ, హైదరాబాద్), విశ్వనాథ్ రవీందర్, ఎస్పీ (కరీంనగర్), పి.రాజేంద్రప్రసాద్, ఏఎస్పీ (హైదరాబాద్), ఎం.చక్రధర్రావు, అదనపు కమాండెంట్ (ఏపీఎస్పీ, 8వ బెటాలియన్, కొండాపుర్), పి.సీతారాం, అదనపు కమాండెంట్ (గ్రేహౌండ్స్, హైదరాబాద్), పి.వెంకట్రామిరెడ్డి, డీఎస్పీ (గుంటూరు రూరల్), ఎం.దయానందరెడ్డి, ఎస్డీపీవో (అనంతపురం), కేవీ రాఘవరెడ్డి, డీఎస్పీ (మదనపల్లి), సీహెచ్ భద్రయ్య, డీఎస్పీ (విద్యుత్సౌధ, ఖైరతాబాద్), దేవెందర్సింగ్, డీఎస్పీ (సీఐ సెల్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్), ఎం.మునిరామయ్య, డీఎస్పీ (హైదరాబాద్ రూరల్), బి.రామకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ (గ్రేహౌండ్స్, హైదరాబాద్), పి.వీరాంజనేయరెడ్డి, ఇన్స్పెక్టర్ (సీసీఎస్, నెల్లూరు), షేక్ బురాన్ షరీఫ్, ఎస్సై, ఇ.మనోహర్, ఎస్సై (కల్యానిధం, తిరుపతి), ఎం.మంతయ్య, ఎస్సై (సైబరాబాద్), బి.వెంకటరామిరెడ్డి, కమాండెంట్ (సికింద్రాబాద్), సి.హనుమంతరెడ్డి, ఏఎస్సై (ఎస్వోటీ, సైబరాబాద్), ఎన్.శివకుమార్, ఏఆర్ ఎస్సై (ఏపీఎస్పీ, వరంగల్), ఎం.శ్రీనివాసరావు, ఏఆర్ ఎస్సై (విజయవాడ), గణేష్ ప్రసాద్, ఎస్సై (ఇంటెలిజన్స్, హైదరాబాద్) ఎం.ఇక్బాల్ హుస్సేన్, హెడ్కానిస్టేబుల్ (విజయవాడ), రావు బొడ్డేడ శంకర్, ఇన్స్పెక్టర్ (ఏసీబీ, హైదరాబాద్), మంగళ్ లక్రా, కమాండెంట్ (సీఐఎస్ఎఫ్, ఖమ్మం జిల్లా), శాంత్ రక్సిత్, అసిస్టెంట్ కమాండెంట్ (జాతీయ పోలీసు అకాడమీ, హైదరాబాద్), పీవీ వర్గీస్, ఎస్సై ఎగ్జిక్యూటివ్ (సీఐఎస్ఎఫ్, వైజాగ్), టి.సెల్వరాజు, హెడ్కానిస్టేబుల్ (సీఐఎస్ఎఫ్, వైజాగ్), ఎ.మనోహరన్, హెడ్కానిస్టేబుల్, జీడీ (సీఐఎస్ఎఫ్, హైదరాబాద్), గోపీచంద్, హెడ్కానిస్టేబుల్, ఎన్ఐఎస్ఏ (సీఐఎస్ఎఫ్, హైదరాబాద్), సీహెచ్ సత్యసింహ వెంకటరమణ, డీసీఐవో (హోం వ్యవహారాల శాఖ, హైదరాబాద్), రణ్ధీర్సింగ్, ఇన్స్పెక్టర్, జాతీయ పోలీసు అకాడమీ (హైదరాబాద్), ఆదిత్యనారాయణ సింగ్, హెడ్కానిస్టేబుల్, జాతీయ పోలీసు అకాడమీ (హైదరాబాద్), పి.సత్యనారాయణ, ఏఎస్సై (ఆర్పీఎస్ఎఫ్, సికింద్రాబాద్ రైల్వేస్). కరెక్షనల్ సర్వీసులో విశిష్ట సేవా పతకం: గడ్డం ప్రసాదరావు, హెడ్వార్డర్, సబ్జైలు (గిద్దలూరు). -
శోభాయమానం
కడప కల్చరల్, న్యూస్లైన్ : కడప నగరంలో గురువారం కాషాయ పతాకాలు రెపరెపలాడాయి. నగర వీధులు గీతా సంకీర్తనలతో ప్రతిధ్వనించాయి. దాదాపు 250 మందికిపైగా సాధువులు, ఆధ్యాత్మిక పీఠాల ప్రతినిధులకు వందలాది మంది కళాకారులు స్వాగతం చెబుతూ ఊరేగింపు నిర్వహించారు. కోలాటాలు, చెక్కభజన బృందాలు సందడి చేస్తుండగా శ్రీసీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు అడుగడుగునా నగర భక్తుల కర్పూర హారతులందుకున్నారు. నగరమంతటా ఊరేగింపు సాగడంతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. అఖిలాంధ్ర సాధు పరిషత్ 49వ మహాసభలు కడప నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాధువుల నగర శోభా యాత్ర నిర్వహించారు. శ్రీసీతారాముల ఉత్సవ మూర్తులకు శ్రీ పూజ్యపాద ఆచార్య శంకరానందగిరి స్వామి తొలిపూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. దాదాపు 250 మంది సాధువులు, స్వామిజీలు, సాధు మాతలు నాలుగు వాహనాల్లో ఆసీనులై నగర వాసులను ఆశీర్వదించారు. ఆధ్యాత్మిక సందడి: చెక్కభజనలు, కోలాటాల బృందాలు సందడి చేయగా గంగిరెద్దుల బృందాలు అడుగడుగునా తమ కళా ప్రతిభను కనబరిచారు. పలు పాఠశాలల విద్యార్థులు దేవతామూర్తుల వేషాలలో శోభాయాత్రలో పాల్గొన్నారు. మహాసభల కడప విభాగం అధ్యక్షులు బెరైడ్డి రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వెంకట్రెడ్డి యాత్రను పర్యవేక్షించారు. అడుగడుగునా గీతాపారాయణం నిర్వహించారు. కోటిరెడ్డి కూడలి, శ్రీకృష్ణరాయ సర్కిల్లలో స్వామిజీలకు తేనేటి విందు, మధ్యాహ్నం అపూర్వ కళ్యాణమండపంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30గంటల వరకు శోభాయాత్ర తిరిగి నాగార్జున మిహ ళా డిగ్రీ కళాశాలను చేరుకుంది. యాత్రలో కడప నగరానికి చెందిన పలు దేవాలయాల కమిటీల ప్రతినిధులు, ఆధ్యాత్మిక సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సాధువుల ప్రవచనాలు ఉంటాయి. రాత్రి 8నుంచి 10గంటల వరకు ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
సత్తా చాటిన గచ్చిబౌలి కేవీ అథ్లెట్లు
రాయదుర్గం, న్యూస్లైన్: జాతీయ స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటి పతకాలు సాధించిన గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ క్రీడాకారులను సన్మానించారు. గత నెల 19 నుంచి 23 వరకు గౌహతిలో బాలికలకు, 24 నుంచి 28 వరకు చండీగఢ్, చెన్నైలో బాలుర పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తలపడిన కేవీ ఆటగాళ్లు వివిధ విభాగాల్లో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. విజేతలు అక్షయ, నూతన్ (తైక్వాండో), ఎస్.శుభం (అథ్లెట్), నమ్రత చంద్ర (బ్యాడ్మింటన్), ఆశిష్ (చెస్), కావ్య శ్రేయ (స్విమ్మింగ్), జీపీఆర్ఏ క్వార్టర్స్లోని కేంద్రీయ విద్యాలయలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వీణయ్య, పీఈటీ విజయభాస్కర్రెడ్డి, కోచ్ రాంబాబు, సత్యమహేశ్, అరుణ్లు పాల్గొన్నారు.