mulugu
-
ములుగులో ముస్తాబైన కొత్త ఐలాండ్
-
మాయలేడి.. జగత్ కిలాడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘావర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీశ్ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు.. ఎదుటివారికి దిమ్మతిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని, ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కొటిగా విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లయింట్ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్నగర్లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీశ్? కొద్దిరోజులుగా ఇన్స్ట్రాగామ్ ద్వారా చిట్చాట్ చేసిన ఎస్ఐ హరీశ్.. ఆమె గురించి పలు విషయాలు తెలిశాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీశ్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవల హరీశ్కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈనెల 14న నిశి్చతార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈనెల 1న నేరుగా వాజేడు పోలీసుస్టేషన్కే చేరుకున్న ఆమె.. హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీశ్ పసిగట్టాడు. ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగంలో చిక్కుకుని విలవిల్లాడిన హరీశ్.. ప్రాణంకంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలచి వేసింది. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీశ్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీశ్ సోదరుడు, సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. -
ములుగు ఎన్కౌంటర్: మధు మృతదేహం అప్పగింతకు ఆదేశం
హైదరాబాద్, సాక్షి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కూడా భార్య ఐలమ్మకు అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం(నవంబర్ 6) మధ్యాహ్నాంలోగా అప్పగింత పూర్తి చేయాలని.. మృతదేహంపై గాయాలుంటే గనుక ఫొటోలు, వీడియోలు తీయాలని స్పష్టం చేసింది. ఏటూరునాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గత విచారణలో.. ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల్లో ఈగోలాపు మల్లయ్య అలియాస్ మధు తప్ప మిగిలిన ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. మల్లయ్య మృతదేహం అప్పగించకపోవడంతో.. భార్య ఐలమ్మ అలియాస్ మీనా హైకోర్టును ఆశ్రయించారు.గత విచారణలో.. ‘‘ఈ ఎన్కౌంటర్ బూటకమని, మావోయిస్టులు తినే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి చిత్రహింసలు పెట్టి చంపారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ కుమార్. అలాగే.. శవ పంచనామాలో కుటుంబసభ్యులను అనుమతించలేదని, పోస్ట్మార్టం ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జరగలేదని పేర్కొన్నారు. మల్లయ్య మృతదేహాన్ని చూడటానికి ఐలమ్మను కేవలం 10 నిమిషాలే అనుమతించారని, ఈ కొద్ది సమయంలోనే ఆమె తన భర్త మృతదేహంపై దాదాపు 11 గాయాలను గుర్తించారని తెలిపారు. శవ పంచనామాకు పిటిషనర్ను అనుమతించలేదన్నారు. ఎన్హెచ్చార్సీ మార్గదర్శకాల ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శవ పంచనామా జరిపించేలా ఆదేశించాలని కోరారు. ఇది ఎన్కౌంటర్ కాదని.. కస్టోడియల్ డెత్ అని ఆరోపించారు. వాదనలు నమోదు చేసుకున్న విజయ్సేన్రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె భర్త మల్లయ్య మృతదేహం తప్ప మిగితావాళ్లవి వారి బంధువులు అడిగితే అప్పగించాలని స్పష్టం చేసింది. పోస్ట్మార్టం ఎగ్జామినేషన్, శవపంచనామా నిర్వహణలో అనుసరించిన విధానంపై సంక్షిప్త వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఇవాళ.. మృతదేహం అప్పగింతపై ఆదేశాలిచ్చింది.చల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు మరణించిన ఘటనపై కలెక్టర్ దివాకర ఇదివరకే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ములుగు ఆర్డీవో వెంకటేశ్ను నియమించారు. -
రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపుల కారణంగానే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుమారుడి మృతికి సదరు యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల కిందట హరీష్కు కాల్ చేసింది. మాటామాటా కలిసి.. ఇన్స్టాగ్రామ్లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఎస్ఐ హరీష్ ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి.ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్.. ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకలేదు. అంతేకాకుండా తమ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ నెల ఆరో తేదీన హరీష్కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. -
ములుగు ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా
సాక్షి,హైదరాబాద్ : ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6.15 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్గఢ్కు చెందిన వారని ఆయన తెలిపారు.అయితే, చెల్పాక ఎన్కౌంటర్పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పౌరహక్కుల సంఘం పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి ప్రాణలు తీసినట్లు తెలిపారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది..ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే, అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని,ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్ర పర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ భద్రపరిచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
సాక్షి,వరంగల్: ములుగు జిల్లాలో ఆదివారం(డిసెంబర్1) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏటూరునాగారం చల్పాక సమీపంలో కూంబింగ్ చేస్తుండగా గ్రేహౌండ్స్ బలగాలకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నారు.ఎన్కౌంటర్లో మృతిచెందింది వీళ్లే..1. కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, టీఎస్సీఎమ్ కార్యదర్శి ఇల్లందు-నర్సంపేట 2. ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్పూర్ 3. ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్4. ముస్సాకి జమున 5. జైసింగ్, మావోయిస్టు పార్టీ సభ్యుడు6.కిషోర్, మావోయిస్టు పార్టీ సభ్యుడు7.కామేష్, మావోయిస్టు పార్టీ సభ్యుడు -
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
సాక్షి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగావించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు శనివారం సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలోనే వచ్చే భక్తులు ప్రస్తుతం ఏడాది పొడవునా తమకు అనుకూలమైన సమయంలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
వాయుగుండాలు.. పెనుగాలులు.. క్లౌడ్ బరస్ట్!
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్), ఎ¯న్జీఆర్ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక.. పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
కోడి పందేల స్థావరంపై దాడి.. 14 మందిని అరెస్ట్
వాజేడు: లక్షీపురం, గెర్రగూడెం గ్రామాల శివారులోని ఊర చెరువు వద్ద కోడి పందేల స్థావరంపై వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు.పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది కోడి పందేలు ఆడుతూ పోలీసులను చూసి పారిపోయారు. పారి పోతున్న వారిని వెంబడించి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ దాడిలో 14 మందిని అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి 5 కోడి పుంజులు, 4 కోడి కత్తులు, రూ.28,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరీశ్ తెలిపారు. -
బైరి నరేష్ అడ్డగింత.. తీవ్ర ఉద్రిక్తత
ములుగు, సాక్షి: ఏటూరు నాగారంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. నాస్తికుడు బైరి నరేష్పై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. అందుకు కారణం.. బైరి నరేష్ వాహనం కారణంగా ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలు కావడమే. సోమవారం.. కోరేగావ్ సమావేశం కోసం బైరి నరేష్ ఏటూరు నాగారం వెళ్లాడు. అది తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప మీద చేసిన వ్యాఖ్యలు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బైరి నరేష్తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నరేష్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే నరేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అయ్యప్ప స్వాములు వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో.. నరేష్ వాహనం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. బాధితుడ్ని పోగు నర్సింహారావుగా గుర్తించారు. దీంతో నరేష్ను అరెస్ట్ చేయాలంటూ స్వాములు అందోళన చేపట్టారు. గతంలో.. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క!
వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ములుగు జిల్లా ప్రారంభమయ్యే తొలి గ్రామం మహ్మద్గౌస్పల్లి నుంచి విజయోత్సవ ర్యాలీ మొదలైంది. ఇక్కడ కార్యకర్తలు మంత్రిని గజమాలతో సన్మానించారు. ర్యాలీ మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, జవహర్నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, పస్రా మీదుగా మేడారం వరకు కొనసాగింది. మహ్మద్గౌస్పల్లిలో గజమాలతో స్వాగతం గట్టమ్మకు చీర సారె.. గట్టమ్మ ఆలయం వద్ద మంత్రికి మహిళలు కోలాటాలు, బంజార, ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గట్టమ్మ తల్లికి చీరసారె, పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంలో ములుగు వరకు ర్యాలీగా వచ్చారు. మంత్రి పర్యటనకు ఎస్పీ గాష్ఆలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కూచన రవళిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్గౌడ్, బానోత్ రవిచందర్, వంగ రవియాదవ్తోపాటు అధికార ప్రతినిధి అహ్మద్పాషా, సీనియర్ నాయకుడు బాధం ప్రవీణ్ కుమార్, ఒజ్జల కుమార్, ఇమ్మడి రాజుయాదవ్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, రేవంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. ర్యాలీ సందర్భంగా మల్లంపల్లి, ములుగులో సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం నా ఇల్లు.. ప్రజలే నా కుటుంబ సభ్యులు.. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా ఉండలేదని, అధికారం ఉందనే భావనను మరిచి ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా ములుగు ఆడబిడ్డగా, ఆత్మీయ సోదరిగానే ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకుసాగుతానన్నారు. సమ్మక్కకు మొక్కుతున్న మంత్రి సీతక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ, ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమక్క–సారలమ్మలను దర్శించుకున్న తర్వాత ఐటీడీఏ అతిథి గృహంలో మేడారం జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవి కూడా చదవండి: పాలనలో మార్పు చూపిస్తాం! : దుద్దిళ్ల శ్రీధర్బాబు -
కాంగ్రెస్కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్ఎస్లో చేరతారు: అమిత్ షా
ములుగు: కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్ఎస్లో చేరుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేక.. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య బీఆర్ఎస్ వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణమని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క పండుగలను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించామని చెప్పారు. నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ కూడా ఇక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తూప్రాన్లో జరిగిన సభలో మాట్లాడారు. అటు.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్ -
ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకండి: కేసీఆర్
-
ఒక ఆదివాసీ బిడ్డగా కేసీఆర్ కు ఎందుకు నచ్చడం లేదు ?
-
సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణభవన్లో ములుగుకు చెందిన బీజేపీ నేత రాములు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు హరీశ్రావు కండువా కప్పి ఆహ్వానించారు. చేరికల సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘ నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ములుగులో ఈసారి ఆమెను గెలిపించాలని కోరుతున్న. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో సీతక్క ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం. 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. వంద అబద్ధాలు ఆడైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వడం కాంగ్రెస్కు చేతకాలేదు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం పక్కా. కేసీఆర్ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మేం తిట్టలేమా’ అని హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి..
సాక్షి, మహబూబాబాద్: పాము కాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన గుంజె స్వాతి, రాజు దంపతులు తమ కుమారుడు నిఖిల్(12)తో కలిసి ఇంట్లో కింద నిద్రించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బాలుడి నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. కాగా, ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మృతి చెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: సినిమాల్లో అవకాశాలు రాలేదని.. -
కవిత మీద సీతక్క ఫైర్
-
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ బస్సు యాత్ర.. ములుగు బహిరంగ సభ లైవ్ అప్డేట్స్ 06:55PM ములుగు సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ►రామప్ప ఆలయం అద్భుతంగా ఉంది ►ఇంత అందమైన ఆలయాన్ని ఎప్పుడు చూడలేదు ►దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి ►కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చింది ►రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోవు ►కానీ, కాంగ్రెస్ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ గౌరవించింది ►కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారు ►అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మోసం చేశారు ►ధరణి పోర్టల్లో అవినీతి జరిగింది ►రూ.లక్ష రుణమాపీ అన్నారు.. గుర్తుందా? చేశారా? ►కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తన జేబులో వేసుకున్నారు ►దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు ►బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే ►తెలంగాణ కోసం మరికొన్ని గ్యారెంటీలను ప్రకటిస్తున్నాం ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ.2,500 ►రూ.500కే గ్యాస్ సిలిండర్ ►ఇళ్లకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితం ►తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములకు 250 గజాల జాగా ►నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారు ►సీఎం ఇస్తామన్న మూడెకరాల భూమి వచ్చిందా? ►కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చెప్పామో.. అదే చేశాం ►రాజస్థాన్లో ఉచిత వైద్యం అన్నాం .. ఇస్తున్నాం, అదీ దేశంలోనే అత్యుత్తమ సేవలతో! ►ఛత్తీస్గడ్లో రైతులకు రుణమాఫీ చేశాం ►రూ.2,500 మద్దతు ధరతో వరి కొనుగోలు చేస్తున్నాం ►కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం ►ప్రతీనెలా మహిళలు, రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నాం ►జల్, జమీన్, జంగల్ హామీలను కాంగ్రెస్ నెరవేర్చింది ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►పోడు భూములు, అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తాం ►అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ►తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 06:26PM ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం ►రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు ►ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు ►మీ కలలు సాకారం అవుతాయని నమ్మి బీఆర్ఎస్కి ఓటేశారు ►పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని.. భవిష్యత్తు మారుతాయని అనుకున్నారు ►బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ►తెలంగాణ కలను బీఆర్ఎస్ నాశనం చేసింది ►తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదు ►మీ కలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది ►సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం ►కాంగ్రెస్ హయాంలోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి ►తెలంగాణ కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ►తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోనియాగాంధీకి తెలుసు ►అయినా సోనియా గాంధీ మీ కోసం నిర్ణయం తీసుకున్నారు ►దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు ►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు ►మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం తీసుకున్నారు ►తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ► లక్ష ఉద్యోగాల్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది ►నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు ►కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ►తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ►వరి రూ. 2,500, మొక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర ఇస్తాం ►రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ► ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి కుటుంబానికే ప్రాధాన్యత దక్కింది ►అమరులను కాంగ్రెస్ గౌరవిస్తుంది.. శ్రీకాంత్ చారికి నా నివాళి ►బీఆర్ఎస్ కేబినెట్లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు ►గల్ఫ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం ►ఆదివాసీల హక్కుల్ని బీఆర్ఎస్ పెద్దలు లాక్కుంటున్నారు ►మీ భూముల నుంచి మిమ్మల్ని వెళ్లగొడుతున్నారు ►మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్ను మళ్లిస్తున్నారు ►ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గిరిజనులకు ఇళ్లు ►గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది ►18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం ►ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భర్తీపై దృష్టి పెట్టలేదు ►రకరకాల మాఫియాలను ప్రొత్సహించింది ►మీ కోసం ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ తెచ్చింది ►గ్యారెంటీలు ఇస్తామన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం 06:10PM ములుగు సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు ►అందుకే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు ►ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం తెస్తాం ►ప్రతీ నెల 1వ తేదీన రూ. 2,500 ఆడబిడ్డల ఖాతాలో జమ చేస్తాం ►అధికారంలోకి వస్తే రూ.500 కే సిలిండర్ఇస్తాం ►రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.15వేలు జమ చేస్తాం ►ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఫ్రీ ►మన బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ►కళ్యాణ లక్ష్మి పేరుతో ఆడబిడ్డలకు తులం బంగారం ►ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కరీంనగర్ గడ్డ నుంచి సోనియా గాంధీ ప్రకటించారు ►ఇచ్చిన మాటకు సోనియా తెలంగాణ ప్రకటించారు ►తెలంగాణలో ఎక్కడ చూసిన అరాచకం, అవినీతి అధిపత్యం రాజ్యమేలుతోంది ►అవినీతి పాలనను పాతాలంలోకి తొక్కాలి ►తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని గాంధీ కుటుంబం వచ్చింది ►ఆరు గ్యారంటీ స్కీమ్ లతో ప్రజల ముందుకు వచ్చారు ►మహాలక్ష్మి గ్యారంటీ స్కీమ్ మహిళల కోసం సోనియా గాంధీ తెచ్చారు ►ప్రతినెల మహిళలకు 2500 ఇచ్చేందుకు సోనియా ముందుకు వచ్చారు ►500 రూ.లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే భాద్యత సోనియా గాంధీ తీసుకున్నారు ►రైతులకు మద్దతు ధర తో పాటు క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►నిరుద్యోగ యువతకు యువ వికాస్ పథకం క్రింద 5 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►షాదీముబారక్ కళ్యాణ లక్ష్మీ సహాయంతో పాటు తులం బంగారం ఇవ్వాలని నిర్ణయించాం 06:05PM ►రాష్ట్ర సంపదను ప్రజలకు పంచాలనే ఆరు గ్యారెంటీలను ప్రకటించాం: భట్టి ►ప్రతీ గ్యారెంటీని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి: భట్టి ►గిరిజనులకు పోడు భూములు పంచాలన్న చట్టాన్ని నిర్వీర్యం చేశారు.. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: భట్టి ►ఆరు గ్యారంటీ స్కీమ్ లను తప్పకుండా అమలు చేస్తాం: భట్టి 06:00PM ►ములుగు బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక ►మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంక ►తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ రాహుల్ ఫేస్బుక్ రీల్ ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►ఈ విజయయాత్ర రాబోయే మార్పుకి సంకేతమంటూ పోస్ట్ ►రాహుల్ మాటిస్తే కట్టుబడి ఉంటారు: ఎమ్మెల్యే సీతక్క ►కాంగ్రెస్ వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తాం ►అధికారంలోకి వచ్చాక ఆరుగ్యారంటీలు అమలు చేస్తాం 05:20PM ►రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్, ప్రియాంక ►ములుగు రామానుజాపురం బహిరంగ సభా స్థలికి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నేతలు ►కాసేపట్లో బహిరంగ సభ ►బహిరంగ సభ నుంచే మహిళా డిక్లరేషన్ ప్రకటన 05:10PM ►ప్రత్యేక పూజల అనంతరం.. రామప్ప ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంకలు ►ఆలయ చరిత్రను వివరిస్తున్న అధికారులు 04:52PM ►రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ కీలక నేతల ప్రత్యేక పూజలు ►కాసేపట్లో కాంగ్రెస్ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం 04:42PM ►ములుగు జిల్లా రామప్ప కు చేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ►స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు. 04:30PM ►మరి కాసేపట్లో రామప్పకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. ►రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ►అనంతరం విజయభేరి బస్సు యాత్ర ప్రారంభం ►ఆదివాసీ గిరిజన సంప్రదాయ పద్ధతిలో రాహుల్, ప్రియాంక గాంధీ లకు స్వాగతం ►కోయ కళాకారులు లంబాడీలు డప్పు నృత్యాలతో స్వాగతం 04:15PM ►రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ►రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క ►కాసేపట్లో రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంకలు ► రామప్ప ఆలయం నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ► బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు బయల్దేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ►బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ► ములుగు జిల్లా నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం భారీ బందోబస్తు ఏర్పాటు నేటి నుంచి కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్ర. ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అనంతరం సాయంత్రం జరిగే రామానుజాపురంలో బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంకలు. మూడు రోజులపాటు బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ. బస్సు యాత్రతో పాటు పాదయాత్రలో కూడా పాల్గొనున్న రాహుల్. -
డెంగీ జ్వరమే కదా.. అని తేలికగా తీసుకున్నారో.. ఇక అంతే!!
మహబూబాబాద్: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఐదుగురు చనిపోయారు. బుధవారం ఇద్దరు చనిపోగా, గురువారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాప ఉండడం గమనార్హం. ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగూడెం గ్రామానికి చెందిన కుర్సం రజని(35) విషజ్వరంతో బుధవారం రాత్రి చనిపోయింది. రజని వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీల వద్ద నాలుగు రోజులు వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో ఏటూరునాగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ పరీక్షలు చేసి టైఫాయిడ్గా తేల్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ములుగు వెళ్లాలని సూచించడంతో ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. రజిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఉంటున్న మనీష(30) రాఖీ పండుగ సందర్భంగా వాజేడు మండల పరిధిలోని మొరుమూరు కాలనీ గ్రామానికి వచ్చింది. ఆమె ఇక్కడికి జ్వరంతోనే వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ తీసుకెళ్లినట్లు సమాచారం. ఆరు నెలల పాప.. వాజేడు మండల పరిధిలోని దేవాదుల గ్రామానికి చెందిన ఆరు నెలల పాప డెంగీ జ్వరంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎస్కే.గౌస్– సహర దంపతుల కుమార్తె మినహ(6నెలలు) డెంగీ జ్వరంతో బాధపడుతూ వారంరోజుల నుంచి ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించగా గురువారం చనిపోయినట్లు తండ్రి గౌస్ తెలిపారు. -
అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క
సాక్షి, ములుగు జిల్లా: ప్రజాసేవ, డబ్బు సంచుల మధ్య యుద్ధం మొదలవుతుందని, ప్రశ్నించే గొంతు నొక్కేందుకే కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మిడతల దండులాగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని, తనను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడ ఉంటుంది. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నన్ను టార్గెట్ చేస్తున్నారు. సీతక్క బాగా పని చేస్తుందని అసెంబ్లీలో పొగుడుతున్నారు. ఇక్కడ కొచ్చి ఓడించమంటున్నారు. ములుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని డబ్బు సంచులతో ముడి పెడుతున్నారు. ప్రజలే నా కుటుంబం.. నియోజకవర్గం ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు. బీఆర్ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగును భయాందోళన గురిచేస్తున్నారు’’ అంటూ సీతక్క నిప్పులు చెరిగారు. చదవండి: అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! -
రసవత్తరంగా ములుగు రాజకీయం!
నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న మహిళ దళ నేత ములుగు ఎమ్మెల్యే( సీతక్క)కావడం గనార్హం. తిరుగులేని నాయకురాలుగా నాడు టీడీపీ నేడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్న వ్యక్తి సీతక్క. మావోయిస్టు కుటుంబం నేపథ్యం ఉన్న జడ్పీ చైర్ పర్సన్ బడా నాగజ్యతికి బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కంది. దాంతో ములుగు రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ పోటీ హోరాహోరీగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క, బడా నాగజ్యోతీలు నువ్వా-నేనా అన్నట్టుగా బరిలోకి దిగనున్నారు. దాంతో ములుగు రాజకీయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పోడు భూముల అంశం, తలాపునే గోదావరి ఉన్నా త్రాగు సాగు నీటి సమస్య ఎదుర్కోవడం. ఆదివాసి గిరిజన గూడాలకు ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం. గోదారి పరివాహక ముంపు ప్రాంతానికి కరకట్ట నిర్మాణం చేయకపోవడం. ఏటూరునాగారం డివిజన్ కేంద్రం, మల్లంపల్లి మండలం చేయాలనే డిమాండ్. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : మారుమూల ఏజన్సీ ఆటవీ ప్రాంతం. నక్సల్స్ ప్రభావితం గల నియోజకవర్గం, పర్యాటక ప్రాంతం. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం ప్రధాన పార్టీల అభ్యర్థులు: కాంగ్రెస్ సీతక్క (సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ బడే నాగజ్యోతి (కన్ఫాం) బీజేపీ తాటి కృష్ణ (ఆశావాహులు) భూక్య జవహార్ లాల్ రాజు నాయక్ (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు : వ్యవసాయంపై ఆదారపడ్డ ఆదివాసిగిరిజన ఓటర్లు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్టీ లంబాడా ఓటర్లు 34400 ఎస్టీ కోయ నాయకపోడు ఎరుకల గుత్తి కోయ 48250 ఓసి బిసి కలిపి మొత్తం ఓటర్లు 125525 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజన్సీ ప్రాంత.. గోదావరి నది తీరంలో ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ఏరియా, తెలంగాణ రాష్ట్రంలోనే 80 శాతం అడవులు ఉన్న నియోజకవర్గం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు కొలువైన ప్రాంతం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వైష్ణవాలయం , పర్యాటక కేంద్రాలు లక్నవరం సరస్సు .రామప్ప సరస్సు రామప్ప దేవాలయం. -
లారీ బీభత్సం..! ఆటోను 30 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో..
వరంగల్: వలస జీవులను లారీ మింగేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయా కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన సుమారు పది కుటుంబాలు తేనే సేకరణ కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చి ఓసిటీ మైదానంలో డేరాలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. నెల రోజుల క్రితం వచ్చిన ఈ వలసజీవులు నిత్యం ఉదయమే ఇక్కడ నుంచి ఆటోల్లో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి తేనె సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రోజుమాదిరిగానే బుధవారం ఉదయం రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక ఆటోలో వర్ధన్నపేట, తొర్రూరు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద లారీ రాంగ్రూట్లో వచ్చి ఆటోను ఢీకొంది. అలాగే కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో ఒకే కుటుంబానికి చెందిన కురేరి సురేష్ (43), అతడి కుమారులు అమిత్ కురేరి (23), నితీష్ కుమార్ కురేరి (11), సురేష్ సోదరి కుమారులు (మేనల్లుళ్లు) రూప్చంద్ దామి(33), జలావత్ దామి అలియాస్ జాబీర్ (19)తోపాటు ఆటోడ్రైవర్ నగరంలోని కరీమాబాద్ ఏసీరెడ్డి నగర్కు చెందిన బట్టు శ్రీనివాస్ (42)మృతి చెందారు. మృతుడి కురేరి సురేష్ మరో కుమారుడు అమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు ప్రీతి, పూజ తెలిపారు. ఆకలి తీర్చిన వ్యాపారులు.. రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారని తెలుసుకున్న లక్ష్మీపురం కూరగాయల మార్కెట్కు చెందిన పలువురు వ్యాపారులు చలించారు. తమ కుటుంబ సభ్యులు మృతి చెందారని, అందుకే ఉదయం నుంచి ఏమి తినలేదని చెప్పడంతో భోజనం తయారు చేయించి వారి ఆకలి తీర్చినట్లు వ్యాపారులు బిట్ల కృష్ణ, పాపాని భాస్కర్, బూర ప్రకాశ్ తెలిపారు. అమ్మా వస్తున్నా.. అంతలోనే దుర్మరణం ఖిలా వరంగల్: అమ్మా వస్తున్నా...కలిసి భోజనం చేద్దాం అంటివి.. అంతలోనే మాయమైనవా.. రెండు రోజులాయే నా చేతి కూడు తినక కొడుకా...తినకుండానే వెళ్లిపోయినావా .. అంటూ ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ తల్లి రాజమ్మ రోదిస్తుంటే అక్కడున్న వాళ్లంతా కంటితడి పెట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్కు పదేళ్ల క్రితం వివాహం జరగగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల క్రితం భార్య కల్పన తన పిల్లలను వెంటబెట్టుకుని నర్సంపేట ద్వారక పేటలోని పుట్టింటికి వెళ్లిపోగా.. శ్రీనివాస్ మాత్రం పుప్పాలగుట్ట ఏసీరెడ్డినగర్లోని తన పెద్దన్న నివాసం ఉండే తల్లి రాజమ్మ ఇంటికి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం నాగమయ్య టెంపుల్ సమీప కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని అద్దె ఆటో నడిపిస్తున్నాడు. బుధవారం ఉదమే యజమానికి ఆటో ఇచ్చేసి ఇంటికి వస్తాననుకున్నాడు. ఈ లోపు ఓసిటీలో డేరాలు ఏర్పాటు చేసుకున్న జైపూర్కు చెందిన వలస జీవులు అండర్ బ్రిడ్జి వద్ద బట్టు శ్రీనివాస్ ఆటో ఎక్కి తొర్రూరులో దించాలని కోరారు. దీంతో వారిని ఎక్కించుకుని బయలుదేరగా ఇల్లంద వద్ద లారీ ఢీకొంది. దీంతో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో శ్రీనివాస్ సోదరుడు బట్టు కిషన్, వదిన మాలతీ, మృతుడి తల్లి రాజమ్మ, నర్సంపేట నుంచి చేరుకున్న భార్య కల్పన, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వరంగల్ పుప్పాలగుట్ట ఏసిరెడ్డినగర్లో విషాదం నెలకొంది. -
ఉపాధ్యాయుని సమయస్పూర్తితో దక్కిన 40 మంది పిల్లల ప్రాణాలు
-
ములుగు NDRF రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
సాక్షి, ములుగు: ఉత్కంఠకు తెర దించుతూ పర్యాటకులందరినీ ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. ములుగు అడవుల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. వీరభద్రం అడవుల్లో చిక్కుకున్న మొత్తం పర్యాటకులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. వర్షాకాలం సీజన్ కావడంతో వీరభద్రం గ్రామం సమీపంలోని ముత్యంధార Muthyaladhara Waterfall జలపాతం చూసేందుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహం పెరగడంతో కొందరు పర్యాటకులు అడవుల్లో చిక్కుకుపోయారు. దీంతో వీలైనంత త్వరగా వాళ్లను రక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ తరుణంలో పోలీసులతో పాటు రెస్క్యూ టీం వాళ్లను రక్షించే యత్నం చేశారు. కానీ, వీలుకాలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్లను రక్షించారు. బాధితులను అంకన్నగూడెంకు చేర్చగా.. అక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీ వాళ్లను రిసీవ్ చేసుకున్నారు. ముత్యంధార జలపాతం దేశంలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటిగా పేరుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం సీజన్లో దీనిని చూసేందుకు జనం ఎక్కువగా వస్తుంటారు. వీరభద్రం గ్రామం నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతానికి చేరుకుంటారు పర్యాటకులు. -
భారీగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్..
వరంగల్: పోలీసుశాఖలో బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి అనధికారికంగా ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ స్థాయి అధికారి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అధికారి వరకు ఎన్నికల ఎఫెక్ట్లో భాగంగా బదిలీలు జరుగుతున్నాయి. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల నిబంధనలు వర్తించే పోలీస్ అధికారులను ఆయా నియోజకవర్గాలకు సాగనంపుతున్నారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు ఏమేరకు ఎన్నికల విధుల్లో ఉపయోగపడుతారనే కోణంలో క్షుణంగా పరిశీలించిన తర్వాతనే పోస్టింగ్లకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల బదిలీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఇద్దరు డీసీపీలు పుల్లా కరుణాకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, కర్రి పుష్పారెడ్డి తెలంగాణ కమాండ్ కంట్రోల్ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పరకాల, కాజీపేట, మామునూరు, క్రైం, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇన్స్పెక్టర్లు.. పరకాల, గీసుకొండతో పాటు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. దీంతోపాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న హసన్పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు కేటాయించారు. కోడ్ ఎఫెక్ట్లో భాగంగా సుబేదారిలోని రూరల్ మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్, భరోసా ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. గత నాలుగైదు రోజుల్లో వరుసగా సబ్ ఇన్స్పెక్టర్లను వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనా«థ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు! ఎన్నికల ముందు ప్రశాంతత కోసం కొంత మంది అధికారులు లూపులైన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొంత మంది ఎన్నికల కోడ్ వర్తించని చాలామంది అధికారులు సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏమేరకు ఉపయోగపడతారని వారి అనుచర గణంతో లెక్కలు వేసుకుంటున్నారు. అధికారి పనితీరుతో పాటు సామాజిక అంశాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూ కట్టడం విశేషం. ఏసీపీ పోస్టుల కోసం కూడా అధికారులు ఒక్కో ప్రజాప్రతినిధిని పలుమార్లు కలుస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొంత మంది అధికారులు వారి పీరియడ్ పూర్తి కాకపోయినప్పటికీ పోస్టింగ్ ఉంటుందో? ఉడుతుందో.. తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు. వరంగల్ సబ్ డివిజన్లో మిల్స్కాలనీ, ఇంతేజార్గంజ్ వర్ధన్నపేట, ధర్మసాగర్, కమలాపూర్, నర్సంపేట, రఘునా«థపల్లి, నర్సంపేట రూరల్, నర్మెట్ట పోలీస్స్టేషన్లకు కొత్త అధికారులు రానున్నారు. ఈపోస్టింగ్ల కోసం ఇప్పటికే చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి లెటర్లు పోలీస్బాస్కు అందించినట్లు సమాచారం. ఇందులో కొంత మందికి ఎలక్షన్ ఎఫెక్ట్ ఉండగా.. మరికొంత మంది ప్రవర్తన సరిగ్గా లేక మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్లకు రంగం సిద్ధం! పోలీసు అధికారుల లెక్కల ప్రకారం వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సుమారు 180 మంది నిందితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎస్హెచ్ఓలకు నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపనున్నారు. దీంతో పాటు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా మాజీలతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇబ్బదులు సృష్టించిన వ్యక్తుల జాబితాలు కూడా ఆయా పోలీస్స్టేషన్లలో సిద్ధంగా ఉన్నాయి. తుపాకుల జాబితా రెడీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తుపాకుల లైసెన్స్లు 230 ఉన్నాయి. ప్రస్తుతం తుపాకుల లైసెన్స్ కలిగిన వ్యక్తులు వివిధ గొడవల్లో చిక్కుకున్న, కేసులు నమోదైన వారి లైసెన్స్లు రద్దు చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలో 180 వరకు లైసెన్స్ తుపాకులున్నాయి. ఎన్నికల ముందు వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తుపాకుల లెక్కలను సైతం పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 31 వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 31వ తేదీ వరకు ఎన్నికల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాం. సొంత జిల్లా, సొంత నియోజవర్గం ఉన్న అధికారులతో పాటు చివరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే అధికారులను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తాం. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పని చేస్తున్న అధికారులను రెవెన్యూ జిల్లాను ప్రతిపాదికన బదిలీలు చేపడుతున్నాం. ఏసీబీ, క్రిమినల్ కేసులు ఉన్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. – ఏవీ. రంగన్నాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ హఠాన్మరణం
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని తన నివాసంలో జగదీష్ గుండెపోటుకు గురికాగా, వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే జగదీష్ తుదిశ్వాస విడిచారు. జగదీష్.. ఏప్రిల్ 1న తొలిసారి గుండెపొటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల అప్పుడు ప్రాణాపాయం తప్పినా సరిగ్గా 51 రోజుల వ్యవధిలోనే మరోసారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. జగదీష్ ఇకలేరనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లికి తరలించారు. మల్లంపల్లికి చెందిన జగదీష్ ఏటూరునాగారం నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను సైతం పార్టీ అధినేత కేసిఆర్ జగదీష్కు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో జగదీష్ చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ అధ్యక్షులుగా ములుగు జిల్లాలో జగదీష్ చేసిన సేవలు స్మరిస్తూ అభిమానులు పార్టీ నేతలు నివాళులర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జగదీష్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ ఇక్కడి నుంచేనా..?
తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. ఆదివాసీలతో మమేకమై వారి కోసమే శ్రమిస్తారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడామె తన వారసుడి కోసం నియోజకవర్గాన్ని రెడీ చేస్తున్నారు. పార్టీ పెద్దల మద్దతుతో పక్క జిల్లా నుంచి కొడుకుని ఎన్నికల బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో సీతక్క చెరగని ముద్ర వేసుకున్న ఆమె మావోయిస్టు ఉద్యమం నుంచి తెలుగుదేశం ద్వారా బహిరంగ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ములుగు నుంచి గెలిచాక ఒక వెనుదిరిగి చూడలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజల తలలో నాలుకలా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే సీతక్క కాంగ్రెస్ అగ్ర నేతలతో కూడా సాన్నిహిత్యం పెంచుకున్నారు. తన రాజకీయ జీవితం సక్సెస్ఫుల్గా సాగుతున్న దశలోనే తన కుమారుడు సూర్యను కూడా ఎమ్మెల్యే చేయాలని అనుకుంటున్నారు. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకను ఎంచుకున్నారు. అక్కడి నుంచి కుమారుడిని పోటీ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. పినపాక నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు గులాబీ గూటికి చేరడంతో అతనికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ దశలో సీతక్క కొడుకు సూర్య గత రెండేళ్లుగా పినపాక నియోజకవర్గంలోనే మకాం పెట్టారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులతో సీతక్కకు ఉన్న సత్సంబధాలతో ఎమ్మెల్యే పార్టీ మారినా కేడర్ దూరం కాకుండా కాపాడుకుంటు వచ్చారు. ఈ నేపథ్యంలో సూర్య పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్కు దగ్గరయ్యారు. సీతక్క సైతం తరచుగా పినపాకకు వెళ్లి వస్తున్నారు. ఒకదశలో సీతక్క పినపాక నుంచి పోటి చేస్తుందనే ప్రచారం జరిగింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావుకు చెక్ పట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా సూర్యను బరిలో దించే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినబడుతోంది. రేగా కాంతారావు బీఆర్ఎస్ లోకి రావటంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గులాబీ గూటిలో ఇమడలేక పోతున్నారు. ఆయననే కాంగ్రెస్ నుంచి బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి సూర్యకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించే బాధ్యత కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల్లో సీతక్క ప్రభావం పెరుగుతుండటంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. కనీసం పది, పదిహేను స్థానాల్లో సీతక్క ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యూహాత్మకంగా ములుగుకే సీతక్కను పరిమితం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ అయితే ములుగులో సీతక్కను ఢీ కొట్టగల సరైన అభ్యర్థి బీఆర్ఎస్కు కానరావడం లేదు. దీంతో ములుగు నుంచి రెండు సార్లు గెలిచి ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసింది. పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడితో వీరయ్య వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వీరయ్య బీఆర్ఎస్లోకి రాకపోతే మంత్రి సత్యవతి రాథోడ్ను ములుగు బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అంతేకాకుండా మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పేరు కూడా వినిపిస్తోంది. ఏజెన్సీ ఏరియాలో సీతక్క ప్రభావం పెరుగుతుండటం.. ఆమె వారసుడు రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చదవండి: సిద్దిపేట: టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ.. -
సెలవులపై ఇంటికొచ్చి మృత్యు ఒడికి.. విద్యుత్ షాక్తో జవాన్ మృతి..
సాక్షి, ములుగు: సెలవుపై ఇంటికి వచ్చిన ఐటీబీపీ జవాన్ విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని శ్రీరామ్నగర్లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తాటి మహేంద్ర కుమార్ (29) ఐటీబీపీ 53 బెటాలియన్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఛత్తీ›స్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా సోంపూర్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది హనుమకొండ జిల్లాకు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. ఈ మధ్యనే వారికి పాప పుట్టింది. భార్యాబిడ్డలతో గడపాలని నెల రోజులపాటు సెలవు పెట్టి మార్చి 30న సొంత ఊరైన శ్రీరామ్నగర్ వచ్చాడు. శనివారం కూలర్లోని నీటిపంపు పనిచేయకపోవడంతో దానిని పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్ షాక్కుగురై మహేంద్ర కింద పడి పోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు మహేంద్రను మొదట వాజేడు, అక్కడినుంచి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర కుమార్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిననట్లు తెలిపారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: తండ్రిని చంపిన కిరాతకుడు -
‘వెంటపడి వేధించిండు.. అందుకే చంపేసిన’
సాక్షి, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. తనను వేధిస్తున్న దగ్గరి బంధువును.. కత్తితో పొడిచి చంపింది ఓ యువతి. హత్య అనంతరం సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె. ఏర్రలవాడలో నివసించే రామటెంకి శ్రీనివాస్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న జాడి సంగీతను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. వీళ్లిద్దరూ దగ్గరి బంధువులు. ఇరు కుటుంబాలు కూలీ పనితో జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే.. సంగీతపై శీను వేధింపులు శ్రుతి మించిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. శీనుపై కేసు పెట్టింది. దీంతో శీనును అరెస్ట్ చేశారు పోలీసులు. జైలుకు వెళ్లొచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. వెంటపడి పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం పెంచాడు. ఈసారి మద్యం మత్తులో వేధించడం మొదలుపెట్టాడు. భరించలేకపోయిన సంగీత.. శీనును చేతులు కట్టేసి మరీ కత్తితో పొడిచి చంపేసింది. ఆపై నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. -
‘తండ్రి, కొడుకులిద్దరూ అబద్దాల కోరులు’
భూపాలపల్లి రూరల్: సింగరేణిని కేంద్రం ప్రైవేట్పరం చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని.. అబద్దాలను నమ్మించే శక్తి తండ్రి కొడుకులకు ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాత్రి భూపాలపల్లి పట్ణణంలో 6వ వార్డు ఇన్చార్జ్ ఎరుకల గణపతి ఆధ్వర్యంలో ప్రజాగోస– బీజేపీ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఒకప్పుడు లక్షా 24వేల మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణి సంస్థలో ఇప్పుడు 43వేలకు కుదించబడ్డారని చెప్పారు. సంస్థలోని కాంట్రాక్టు కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తక్కువ వాటా ఉన్న కేంద్రం సింగరేణిని ఎలా ప్రైవేట్పరం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సింగరేణి అభివృద్ధికి రూ.1650 కోట్ల నిధులు కేటాయించడం నిజంకాదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే పలు పనులు చేపడుతూ.. తమ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
ఎంఎస్ఎం యూనిట్లపై సమీక్ష సమావేశం
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలో కొత్తగా మంజూరైన 14 ఎంఎస్ఎం యూనిట్లపై శనివారం పీఓ అంకిత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటిడీఏ పరిధిలో మంజూరైన కన్స్ట్రక్షన్స్ నాలుగు, ఫిషరీస్ నాలుగు, దల్మిల్ రెండు, టైలరింగ్, లాండ్రి, మొవ్వ ప్లవర్, హార్టికల్చర్, వెజిటబుల్ యూనిట్లపై డిటేల్ రిపోర్టు తయారు చేసి వచ్చే వారంలోపు అందజేయాలని అధికారులను కోరారు. గతంలో మంజూరైన కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ యూనిట్స్ గ్రౌండింగ్ వచ్చే గురువారం లోపు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
2నుంచి కోటంచ బ్రహ్మోత్సవాలు
టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మార్చి రెండు నుంచి కొనసాగనున్న బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కోటంచలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో 24గంటలు నిరంతరం విద్యుత్ను అందించాలని.. అఽధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. భక్తులకు నీటిసౌకర్యాన్ని కల్పించి, నిరంతరం నీటిట్యాంకులను పర్యవేక్షించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జాతరలో అవాంతరాలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బందిని, 108 అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. జాతరకు వచ్చే రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పీఆర్ అధికారులను ఆదేశించారు. ములుగు, భూపాలపల్లి, పరకాల, టేకుమట్ల నుంచి భక్తుల కోసం ఎక్కువగా బస్సులను కల్పించి రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పరకాల, భూపాలపల్లి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఫైరింజన్ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రత్యేక పూలతో అలంకరణ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించి ముస్తాబు చేయాలని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు నూతన అనుభూతి కలిగేలా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక నిధులను కేటాయించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను పండుగగా జరుపాలని చెప్పారు. అనంతరం జాతర వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్ఓ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, ఆలయ చైర్మన్ మాదాడి అనితకరుణాకర్రెడ్డి, ఈఓ బిల్ల శ్రీనివాస్, ఎంపీపీ పున్నం లక్ష్మీ, జెడ్పీటీసీ సాయిని విజయ, మండల ప్రత్యేకాధికారి శామ్యూల్, తహసీల్దారు షరీఫ్ మొహినోద్దీన్, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రాంప్రసాద్రావు, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్రావు, ఆలయ కమిటీ సభ్యులు పోగు సుమన్ పాల్గొన్నారు. అధికారులు సమష్టిగా పనిచేయాలి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
రామప్ప దేవాలయం అద్భుతం
ఆలయ విశిష్టతను వివరిస్తున్న సూర్యకిరణ్, రామప్ప ఆలయంలో బెల్జియం దేశస్తులువెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని బెల్జియం, అమెరికాకు చెందిన పలువురు కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శనివారం 30మంది బెల్జియం దేశస్తులు సందర్శించారు. వారు రామలింగేశ్వర స్వామిని దర్శించుకోగా పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, గైడ్ విజయ్కుమార్లు ఆలయ విశిష్టత గురించి విదేశీయులకు వివరించారు. ఈ సందర్భంగా బెల్జియం దేశస్తులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే తమకు ఇష్టమని తెలిపారు. వరంగల్లో జరిగే పెళ్లి వేడుకలకు హాజరై రామప్ప ఆలయ సందర్శనకు వచ్చినట్లు వివరించారు. రామప్ప దేవాలయం మరుపురానిదని తెలిపారు. అనంతరం ఆలయం ఎదుట చిరు దుకాణాల్లో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేశారు. అదే విధంగా గాజులు కొనుగోలు చేసి చేతులకు ధరించారు. ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం రామప్ప ఆలయ కట్టడం, శిల్పాలు ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనమని అమెరికాకు చెందిన షు ఉరే, జోనథన్ ఓల్సాన్లు అన్నారు. రామప్ప ఆలయాన్ని శనివారం ఉదయం వారు సందర్శించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ ద్వారా తెలుసుకున్నారు. రామప్ప ఆలయ శిల్పాలను తమ కెమెరాల్లో బంధించుకున్నారు. -
కేయూపై ఆదాయ పన్ను శాఖ కొరడా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీపై ఆదాయ పన్నుశాఖ కొరడా ఝుళిపించింది. పలుసార్లు డిమాండ్ నోటీసులు ఇచ్చినా యూనివర్సిటీ అఽధికారులు (2016–2017, 2017–2018, 2018–2019 అంచనా సంవత్సరాలు) ఆదాయ వ్యయాలను ఆడిట్ రిటర్స్ దాఖలు చేయలేదు. దీంతో రూ.200 కోట్లకు డిమాండ్ నోటీస్ ఇచ్చిన ఆదాయపన్నుశాఖ, అందులో 20శాతం చొప్పున రూ.40కోట్లు ట్యాక్స్ చెల్లించాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ అకౌంట్స్ సీజ్ చేస్తామని ఇటీవల హెచ్చరిస్తూ డిమాండ్ నోటీసును కూడా జారీ చేసినట్లు సమాచారం. దీంతో యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాస్రావులు హైదరాబాద్కు వెళ్లి ఆదాయపన్నుశాఖ అధికారులను కలిసినట్లు తెలిసింది. యూనివర్సిటీకి ఆదాయ పన్నునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అందుకు ఆ శాఖ అధికారులు నిరాకరించారని, డిమాండ్ నోటీస్ ఇచ్చినట్లుగా అందులో కొంత మొత్తం చెల్లించాల్సిందేనని చెప్పినట్లు సమాచారం. ఆ తరువాత స్టే కోరుతూ ఒక విజ్ఞాపనను రాష్ట్ర ఆదాయపన్నుశాఖకు యూనివర్సిటీ అధికారులు సమర్పించారు. దీంతో ఈ నెల 23న స్టేను మంజూరు చేస్తూనే మార్చి 7వ తేదీ లోపు రూ.25 కోట్లు (12.5శాతం)టాక్స్ చెల్లించాలని రెండో డిమాండ్ నోటీస్ ఇచ్చారు. రూ.25కోట్లు పన్నును చెల్లిస్తేనే సెప్టెంబర్ 30 వరకు స్టే కొనసాగింపు వర్తిస్తుంది. ఫీజు మీరే చెల్లించుకోండి : వీసీ కాకతీయ యూనివర్సిటీలోని వివిధ కార్యాలయాలు విభాగాల్లో, కళాశాలల్లోని ప్రిన్సిపాల్స్, డ్రాయింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో గత శుక్రవారం సెనేట్హాల్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. మీ పరిధిలోని ఆదాయవ్యయాలను, ఖాతాలను చార్టడ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయిచుకోవాలని 28 వరకు పూర్తిచేసుకోవాలని ఆదేశించారు. పారదర్శకంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత రూ.25 కోట్లు చెల్లించాలని అల్టిమేటం మార్చి 7వ తేదీ వరకు డెడ్లైన్ వర్సిటీ వీసీ నిర్లక్ష్యం వల్లేనని చర్చ -
బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలి
ములుగు రూరల్: సమస్యల పరిష్కారానికి బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డెపల్లి రఘుపతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్లో నిరుపేదలు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 5,700 మంది దరఖాస్తులు చేసుకొని రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34శాతం నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. బీసీలకు రాజకీయాల్లో 58 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈబీఎస్ నిధుల కోటను పెంచాలన్నారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన కన్వీనర్గా బట్టు మురళీకృష్ణను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య నియమించగా నియామక పత్రాన్ని రఘుపతి అందజేసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య, జాతీయ కన్వీనర్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోల జనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. -
పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం
ములుగు రూరల్: పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పందికుంట గ్రామంలో ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమం మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్యాదవ్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. అంత్యోదయ పథకంతో ప్రతీ పేదవాడికి ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త సురేందర్, రాయకంటి పరమేశ్వర్, బైకాని మహేందర్, గొర్రె మహేందర్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్
కాటారం: తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం రాబందుల్లా దోచుకుతింటూ సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంథని గోస బీజేపీ భరోసా పేరిట బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి కాటారం సబ్ డివిజన్ పరిధిలో చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సభ శుక్రవారం కాటారం మండలకేంద్రంలోని ఎల్జీ గార్డెన్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి సంజయ్ హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, కుంభకోణాలతో కూడిన పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో కేసీఆర్కు ప్రయోజనం తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతి పైసలతో కేసీఆర్, ఆయన కుటుంబం లుచ్చా, లఫంగి దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేసీఆర్ మొగ్గుచూపుతూ ఆ అపవాదును కేంద్రంపై రుద్దాలని కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడిచర్ల ఓపెన్కాస్ట్ను ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టుబెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డబుల్ బెడ్రూంతో పాటు ఏ ఇతర హామీని నెరవేర్చని అసమర్ధుడు కేసీఆర్ అన్నారు. కేంద్రం రైతుల మోటార్ల కు మీటర్లు పెడుతుందని కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. మీటర్ల బిగింపునకు లోన్ ఇవ్వాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసింది నిజమా కాదా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్కు తనను విమర్శించే అర్హత లేదన్నారు. అయ్య కేసీఆర్ మందుకు, కొడుకు కేటీఆర్ డ్రగ్స్కు బానిసలని ఆరోపించారు. మంథనిలో గతంలో జరిగిన లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసును ప్రభుత్వం మూసివేయాలని చూస్తుందన్నారు. రానున్నది బీజేపీ ప్రభుత్వం అని ప్రతిదానిపై పూర్తిస్థాయి విచారణ జరిపి ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను బొందపెట్టి బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు కార్యకర్తలు సంజయ్కి కత్తి, టోపి బహుకరించగా కత్తి చేతబూని ప్రదర్శించారు. బండి సంజయ్కి ఘన స్వాగతం.. రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్కి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి బండి సంజ య్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ప్రధాన కూడలి నుంచి ఎల్జీ గార్డెన్స్ వరకు బండి సంజయ్ పాదయాత్రగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి, రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, నాయకులు పాపయ్య, దుర్గం తిరుపతి, ఉదయప్రతాప్, రావుల రాంనాథ్, బండం వసంతరెడ్డి, ఉడుముల విజయారెడ్డి, ఆకుల శ్రీధర్, బొమ్మన భాస్కర్రెడ్డి, పాగె రంజిత్కుమార్, పూసాల రాజేంద్రప్రసాద్, గంట అంకన్న పాల్గొన్నారు. ఎటు చూసినా అవినీతి కుంభకోణాలే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీ బీఆర్ఎస్ను బొందపెట్టి, బీజేపీకి పట్టంకట్టాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ -
తీరుమారేనా..?
ఏటూరునాగారం: జిల్లాలో వేగంగా అభివృద్ధి ప్రాంతాల్లో ఏటూరునాగారం ఒకటి. కానీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది.. ఏటూరునా గారం పరిస్థితి. ఇంత పెద్ద ఏటూరునాగారంలో చెత్తాచెదారం పేరుకుపోయి కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గత నెలలో ఏటూరునాగారం వచ్చిన సందర్భంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. దీంతో ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మంత్రికి తెలిపారు. అయితే ఏమిటి.. మన పార్టీ వేరే పా ర్టీ కాదు.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజ ల కోసం పనిచేయాలి. చెత్తాచెదారం లేకుండా చూ డాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక మంత్రి చెప్పినప్పటికీ ఎక్కడిచెత్తా అక్కడే దర్శమివ్వడం గమనార్హం. అంతేకాకుండా వార్డు సభ్యులకు చెత్తాచెదారం తొలగించే కాంట్రాక్టులు అప్పగించి వేలాది రూపాయలను డ్రా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవేకాకుండా ఇటీవల దసరా ఉత్సవాల్లో ప్రజల నుంచి చందాలు వసూలు చేసిన పనులకు కూడా గ్రామ పంచాయతీ నుంచి బిల్లులు పెట్టినట్లుగా సమాచారం. జీపీ పరిధిలోని 16 వార్డుల్లో చెత్తాచెదారం ఎత్తిపారేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ప్రజాప్రతినిధులు, సభ్యులు సంబుర పడుతున్నారే తప్ప ఎలాంటి మార్పు లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఫేక్ బిల్స్తో రూ.10లక్షలు డ్రా? మేజర్ గ్రామ పంచాయతీలో పనులు జరగకుండానే జరిగినట్లుగా ఫేక్ బిల్లులు సృష్టించి, రూ.10లక్షలు డ్రా చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు కలిసి ఈ ఫేక్ బిల్స్ సృష్టించినట్లు వినికిడి. దీనిపై పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. మంత్రి మందలించినా నిష్ప్రయోజనమే.. ఫేక్ బిల్స్తో గ్రామ పంచాయతీలో రూ.10లక్షలు డ్రా బదిలీ అయిన కార్యదర్శిపై ఆరోపణలు´ë™èl ¼Ë$Ï-Ë$ Ð]l*{™èlÐól$ {yé ^ólÔ>… గతంలో పంచాయతీ కార్యదర్శిగా ఉన్న క్రమంలో జీపీ మెయింటనెన్స్ కోసం ఖర్చు చేసిన వాటికి మాత్రమే బిల్స్ పెట్టి డ్రా చేయడం జరిగింది. ఎలాంటి ఫేక్ బిల్స్ పెట్టలేదు. సభ్యులకు తెలిసే ఖర్చులు చేశాం. దసరా ఉత్సవాలకు కూడా జీపీ నుంచి ఖర్చు చేసిన వాటికి మాత్రమే ఎంబీ రికార్డు చేయిస్తున్నాం. ఎలాంటి తప్పుడు లెక్కలు లేవు. – ఈసం రామ్మూర్తి, సర్పంచ్, ఏటూరునాగారం -
పట్టాల పంపిణీ పూర్తి చేయాలి
ములుగు: జీఓ నంబర్ 58, 59 ఆధారంగా భూమి రుసుమును విడతల వారీగా వసూలు చేసి ప్రొఫార్మా– 1 ప్రకారం వివరాలను మరోసారి పరిశీలించి మార్చి చివరి కల్లా అర్హులైన వారికి పట్టాలు పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కంటి వెలుగు, భూముల క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ పామ్ సాగుపై మున్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్తో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. అవసరం అయిన వారికి అద్దాలు అందించాలని చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్క్రూటీని మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పోడు భూముల పంపిణీ విషయంలో జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అన్నారు. ఆమోదించబడిన పట్టాలను డౌన్లోడ్ చేసి మరోసారి చూసుకోవాలని తెలిపారు. పట్టాల పంపిణీకి కార్యచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. నిర్ణయించిన లక్ష్యం మేరకు అయిల్ పామ్ సాగు జరిగేలా చూడాలని, ఎంపిక చేసిన భూముల్లో అధికారులు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటేందుకు నర్సరీలను సిద్ధం చేసి మొక్కలు పెంచాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్, డీఎఫ్ఓ కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) వైవీ గణేశ్, డీఆర్వో రమాదేవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, డీఏఓ గౌస్ హైదర్, ఉద్యానశాఖ అధికారి బీవీ రమణ, పవన్కుమార్, సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి -
దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి
భూపాలపల్లి: స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముమ్మాటికీ భూకబ్జాదారుడే అని, తాము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణరావు సవాల్ విసిరారు. డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్రెడ్డితో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సత్యనారాయణరావు మాట్లాడారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యే గండ్ర కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారన్నారు. నిన్న జరిగిన మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో కాంగ్రెస్ నినాదాలు వినపడలేదా అని ప్రశ్నించారు. సభలో తమ భూములను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని పలువురు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంతర్రెడ్డిని విమర్శించే అర్హత మంత్రి కేటీఆర్కు లేదన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, నాయకులు ఇస్లావత్ దేవన్, దాట్ల శ్రీనివాస్, భువనసుందర్, బట్టు కర్ణాకర్, పుప్పాల రాజేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర భూకబ్జాదారుడే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణరావు -
రాష్ట్ర అథ్లెటిక్స్కు మండల విద్యార్థినులు
ఏటూరునాగారం: రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ కోచ్ పర్వతాల కుమారస్వామి శుక్రవారం తెలిపారు. ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జాకారంలో నిర్వహించిన జిల్లా యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు పి.సాయికీర్తన, ఎం.మన్విత ఉత్తమ ప్రతిభ కనబర్చి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ క్రీడాకారులు ఈనెల 25, 26వ తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కుమారస్వామి తెలిపారు. -
డీసీసీ అధ్యక్షుడు నల్లెల కన్నుమూత
ములుగు: రెండేళ్లుగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి(61) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు, బంధుమిత్రులు ములుగు జిల్లాతో పాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, మంథని నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చారు. నివాళి అర్పించిన ఎమ్మెల్యే సీతక్క మృతదేహంపై పడి బోరున విలపించారు. అశ్రునయనాల మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మూడు గంటల పాటు సాగింది. సీతక్క పాడెమోశారు. శోభాయాత్రలో ప్రజలు భారీగా హాజరయ్యారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జిల్లాకేంద్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. బోరున విలపించిన సీతక్క నల్లెల మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క హుటాహుటిన ములుగుకు చేరుకున్నారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నల్లెల మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి అన్నీ తానై దగ్గరుండి ఏర్పాట్లు చూశారు. పలువురు నివాళి.. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ నివాళ్లర్పించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్తో కలిసి స్వరాష్ట్ర ఉద్యమంలో చేసిన అలుపెరగని పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, కాంగ్రెస్ నేతలు గండ్ర సత్యనారాయణరావు, వేం నరేందర్రెడ్డి, జంగా రాఘవరెడ్డి, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళ్లర్పించారు. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన రేవంత్రెడ్డి నల్లెల కుమారస్వామి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నల్లెల మరణవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆవేదన వ్యక్తంచేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. నల్లెల రాజకీయ ప్రస్థానం నల్లెల కుమారస్వామి 1986లో టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 1988లో తొలిసారిగా సర్పంచ్గా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 1994లో తెలుగుదేశం తరఫున తొలిసారి సర్పంచ్గా గెలిచారు. 2001లో టీఆర్ఎస్ పార్టీలోకి చేరి ములుగు మండలం పందికుంట ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2010లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ములుగు జిల్లా ఏర్పాటు సమయంలో అలుపెరగని ఉద్యమం చేశారు. 2017లో ములుగు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. బోరున విలపించిన ఎమ్మెల్యే సీతక్క భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక -
గట్టమ్మ తల్లికి మంత్రి పూజలు
ములుగు రూరల్: మండలంలోని జాకారం గ్రామ పంచాయతీ పరిధి గట్టమ్మ తల్లికి రాష్ట్ర గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనకు బయలుదేరిన మంత్రి గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జెడ్పీటీసీ సకినాల భవాని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, సర్పంచ్ దాసరి రమేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రాంనాయక్, తదితరులు పాల్గొన్నారు. జీవాలకు నట్టల నివారణ మందు వేసుకోవాలి ములుగు రూరల్: గొర్లు, మేకలకు మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నట్టల నివారణ మందులు వేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్భాస్కర్ సూచించారు. గురువారం మండలంలోని బరిగలానిపల్లిలో గొర్రెల పెంపకందారులకు నట్టల మందు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాలకు నట్టల నివారణ మందులు తాగించడం వల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో పెంపకందారులకు లాభసాటిగా ఉంటుందని అన్నారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిగె లతనర్సింగరావు, అసిస్టెంట్ డైరెక్టర్ కర్ణాకర్, వైద్యులు నర్సింహ, నవత, శ్రీధర్రెడ్డి, సిబ్బంది జవహర్, లక్ష్మీబాయి, రైతులు పాల్గొన్నారు. గోదావరిలో పారిశుద్ధ్య పనులు కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో బ్యాక్వాటర్ నీరు తగ్గుతుండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి బయటికి తేలుతుంది. దీంతో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కార్మికులు చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ దుర్వాసన రాకుండా సర్పంచ్ వసంత, కార్యదర్శి సత్యనారాయణ బ్లీచింగ్ చల్లిస్తున్నారు. మంత్రి కేటీఆర్కు వినతి భూపాలపల్లి రూరల్: డిగ్రీ, పీజీ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కాకతీయ యూనివర్శిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అధ్యక్షుడు గుర్రపు రవీందర్ గురువారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు జిల్లాకేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రవీందర్ తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో చైతన్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాంమూర్తి, జిల్లా జూనియర్ కళాశాలల అధ్యక్షుడు బిల్లా రాజిరెడ్డి, తేజస్వినీ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. దామెరకుంట ఇన్చార్జ్ సర్పంచ్గా చంద్రశేఖర్ కాటారం: కాటారం మండలం దామెరకుంట ఇన్చార్జ్ సర్పంచ్గా ఉపసర్పంచ్ చంద్రశేఖర్కు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ భవేశ్మిశ్రా ఉత్తర్వులు జారీచేశారు. సర్పంచ్ రఘువీర్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల కలెక్టర్ తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. -
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి ఐటీడీఏ పీఓ అంకిత్ వెంకటాపురం(ఎం): విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్ బ్యాగులు, యూనిఫాంలపై ఆరాతీశారు, మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మార్గ దర్శకాల ప్రకారం మెనూ అమలుచేయాలని చెప్పారు. సిలబస్ టైం టేబుల్ను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. పీహెచ్సీ తనిఖీ.. వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ల్యాబొరేటరీని తనిఖీ చేసి, సెల్ కౌంటర్ పనితీరు, పరీక్ష నిర్వహణ, డెంగ్యూ, మలేరియా టెస్టింగ్ కిట్ల లభ్యత మొదలైన వాటిపై ఆరాతీశారు. మందుల లభ్యత, ఆవాసాలు, పాఠశాలల్లో వైద్య శిబిరాలు, ఏఎన్ఎం, ఆశకార్యకర్తల పనిపై ఆరాతీశారు. 108 వాహనాల్లో కాల్స్ స్వీకరించడం, సకాలంలో స్పందించడం, వాహనంతో అందుబాటులో ఉన్న అత్యవసర మందులు మొదలైన వాటిపై ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్స్, మొబైల్ అంబులెన్స్ పైలట్ను విచారించి, ప్రతి కాల్కు అందుబాటులో ఉండి ప్రతిస్పందించి ఉత్తమ వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. నేడు రాజగోపురం ప్రారంభోత్సవం గీసుకొండ: సుప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఆలయాభివృద్ధికి ఎందరో దాతలు ముందుకొచ్చి సహకారం అందించగా.. గత ఏడాది అక్టోబర్లో పలువురు దాతలు రాజగోపుర నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేనప్పటికీ కేవలం దాతలు ముందుకొచ్చి ఇంత పెద్ద గోపురం నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. శుక్రవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్స్వామి రాజగోపురాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే రంగులు వేసి పనులన్నీ పూర్తి చేశారు. రాజగోపురం ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. -
అవకాశం ఇస్తే సేవకుడిలా పనిచేస్తా..
కాటారం: ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే సేవకుడిలా పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి అన్నారు. మంథని గోస బీజేపీ భరోసా పేరిట చంద్రుపట్ల సునీల్రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర గురువారం కాటారం మండలం గారెపల్లి, ప్రతాపగిరి, బయ్యారం, నస్తూర్పల్లి, మేడిపల్లి గ్రామాల్లో కొనసాగింది. సునీల్రెడ్డి ఇంటింటా తిరిగి ప్రజలను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు అని వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. మంథని ప్రజలను చైతన్యం చేయడం కోసమే ఈ యాత్ర చేపడుతున్నట్లు సునీల్రెడ్డి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాత్రికేయుడు మెండ మల్లేశ్ను సునీల్రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మన భాస్కర్రెడ్డి, దుర్గం తిరుపతి, ఉడుముల విజయారెడ్డి, పూసాల రాజేంద్రప్రసాద్, పాగె రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు బండి సంజయ్ రాక.. కాటారం మండల కేంద్రానికి నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రానున్నారు. సునీల్రెడ్డి చేపట్టిన పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ముఖ్య కార్యకర్తల, బూత్ లెవల్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జి. వివేక్ హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
వరంగల్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. 'హాత్ సే హాత్ జోడో' అభియాన్ లో భాగంగా రేవంత్ ఈ యాత్ర చేపడుతున్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైఎస్ఆర్ స్ఫూర్తితో తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో వైఎస్ఆర్ చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 2004లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాకతీయ రాజులపై వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం కోసమే తన పాదయాత్రను మేడారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇలా.. సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలుదేరుతారు వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు 12 గంటలకు పాదయాత్ర ప్రారంభం మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్లో భోజన విరామం ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి పాదయాత్ర సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం పస్రా జంక్షన్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి మళ్లీ పాదయాత్ర రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకోనున్న రేవంత్ పాదయాత్ర రాత్రికి రామప్ప గ్రామంలోనే బస రేవంత్ మొదటి విడత పాదయాత్రలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఫిబ్రవరి 22 వరకు ఈ యాత్ర సాగుతుంది. ఆ తర్వాత రెండు రోజులు విరామం తీసుకుని చత్తీస్గఢ్ రాయ్పూర్లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి హాజరవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24 పాదయాత్ర రెండో విడత ప్రారంభమవుతుంది. 'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో భాగంగా తెలంగాణలోని అన్ని గ్రామాలను కవర్ చేసి ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేడయమే ఈ యాత్ర లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్రావు థాక్రే చెప్పారు. చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..? -
గుండెపోటుతో డ్రైవర్ మృతి.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
-
పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం : ఎమ్మెల్యే సీతక్క
-
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్.. హరీశ్రావు ప్రశంసలు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేశారు. ఇలా త్రిపాఠి మగ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు 3కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ను అందరూ ప్రశంసిస్తున్నారు. హరిశ్రావు ట్వీట్ తెలంగాణ ఆరోగ్యమంత్రి హరీశ్రావు కూడా ఈ విషయంపై స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్కు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు చాలా మెరగుపడ్డాయని, అందరికీ మొదటి ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇది ఎంతో గర్వించాల్సిన సమయం అని ట్వీట్ చేశారు. Congratulations to @Collector_JSK & Addl Collector Mulugu on delivering baby boy at district Area hospital. It is a matter of immense pride that health infrastructure in the state under able leadership of #CMKCR Garu, became first choice of people. pic.twitter.com/XNJRepCCoZ — Harish Rao Thanneeru (@trsharish) October 4, 2022 చదవండి: రాహుల్ యాత్ర విచ్ఛిన్నం కోసమే ఈడీ, ఐటీ దాడులు -
MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం
ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు. ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసి కార్యకర్తలతో కలసి తిరిగి వస్తున్న క్రమంలో పెట్రోల్ అయిపోయి వాగుమధ్యలో పడవ ఇంజిన్ ఆగిపోయింది. వరద ఉధృతికి పడవ వాగు ఒడ్డుకు కొట్టుకువచ్చి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఆమె వెంట ఉన్న నాయకులు చెట్టు కొమ్మల సాయంతో సీతక్కను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పడవ ఆగిపోయిన సమయంలో సీతక్క ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉన్నారని, వరద ఉధృతికి పడవ చెట్టును ఢీకొట్టి ఆగిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆమె వెంట ఉన్న వారు తెలిపారు. -
మనవడి బారసాల.. ఇళ్లంతా సందడి.. కానీ చూస్తుండగానే..!
నల్లబెల్లి: మనవడి బారసాల కనుల పండువలా చేయాలనుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మనవడి వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు బారసాలకు సిద్ధపడుతూ సంబరాల్లో మునిగితేలారు. ఇంతలోనే అగ్ని ప్రమాదం వారి సంబరాలను బుగ్గి చేసింది. దీంతో కట్టుబట్టలతోపాటు సర్వస్వం కోల్పోయారు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ శివారు మురళీనగర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఎవరూ ఇళ్ల వద్ద లేనప్పటికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా అగ్ని ప్రమాదాన్ని అరికట్టారు. ఈ ప్రమాదంలో రూ.4లక్షల నగదుతోపాటు రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గౌరబోయిన మొండయ్యతోపాటు తన ఇద్దరు కొడుకులు సాంబరాజు, ముకేష్లు మురళీనగర్లో 10 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మొండయ్య చిన్న కుమారుడు ముకేష్ కుమారుడి బారసాల కోసం బుధవారం రాత్రి చెన్నారావుపేటలో ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో మొండయ్య తన కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి చెన్నారావుపేటకు వెళ్లారు. బారసాల పనుల్లో నిమగ్నమై సంబురంగా గడుపుతున్నారు. అయితే సింగం నర్సయ్య సమీపంలోని వ్యవసాయ పనులకు వెళ్లగా.. బానోత్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి తన సోదరి వద్దకు అప్పు తెచ్చేందుకు వెళ్లాడు. ముందుగా మొండయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. సమీపంలోని సంగం నర్సయ్య, బానోత్ శంకర్ ఇళ్లకు మంటలు వ్యాపించాయి. మరో మూడిళ్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శి రజిత మంచినీటి ట్యాంక్ నుంచి గ్రామానికి నీటిని విడుదల చేసింది. గ్రామస్తులంతా కలిసికట్టుగా నల్లాల ద్వారా వచ్చిన నీటిని ఇళ్లపై చల్లి మంటలను అదుపు చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు నర్సంపేట అగ్నిమాపక కేంద్రం ఎస్ఎఫ్ఓ వి.సుధాకర్తోపాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. బాధిత కుటుంబాలకు పరామర్శ విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హుటాహుటిన మురళీనగర్ గ్రామానికి చేరుకున్నారు. కాయకష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బు, తిండి గింజలు సైతం కాలిబూడిదయ్యాయని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని, తాము ఇప్పుడెలా బతికేదని బాధితులు ఎమ్మెల్యేపై పడి బోరున విలపించారు. ధైర్యం కోల్పోవద్దని బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తనవంతుగా రూ.40వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు సింగిరికొండ మాధవశంకర్, పట్టణ అధ్యక్షుడు వంగేటి గోవర్ధన్లు బాధిత కుటుబ సభ్యులకు రూ.19వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంట కొండాపూర్ సర్పంచ్ గూబ తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి రజిత, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ దళ నాయకుడు సూర్యం తదితరులు ఉన్నారు. కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు ఈ ప్రమాదంలో ఇళ్లు దగ్ధమైన మూడు కుటుంబాల సభ్యులు కట్టుబట్టలతో రోడ్డునపట్టారు. ఖరీఫ్ సీజన్ కావడంతో పెట్టుబడి కోసం డబ్బులు, ఎరువులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుకున్నారు. ఈ ప్రమాదంలో గౌరబోయిన మొండయ్య ఇంట్లో రూ.3లక్షల నగదు, సింగం నర్సయ్య ఇంట్లో రూ.లక్ష నగదుతోపాటు బానోత్ శంకర్ సర్వం కోల్పోయారు. చదవండి: Siddipet Crime: మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా.. -
అరచేతిలో ఆరోగ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరుల ఆరోగ్యవంతమైన జీవనానికి ముందడుగు పడింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని పరిశీలించి ఆ వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఈ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాలో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితా లను ప్రత్యేక పోర్టల్లో నిక్షిప్తం చేయనుంది. ఆ వ్యక్తికి మాన్యువల్ రిపోర్టులు ఇవ్వడం, ఫలితాల్లో తేడాలను గుర్తిస్తే మందులను ఉచితంగా పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు అవసరమైతే పెద్దాసుపత్రికి రిఫర్ చేయడం జరిగిపోనుంది. కార్యక్రమాన్ని అతి త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కీలక పరీక్షలతో ప్రొఫైల్.. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు నిండిన వారికే పరిమితం చేశారు. రోగాలు, ఇతర అనారోగ్య సమస్యలు 18 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ 30 రకాల పరీక్షలు చేయనుంది. ప్రధానంగా బ్లడ్ గ్రూపింగ్, మూత్రపిండాల పనితీరు, కాలేయం పనితీరుతో పాటు కొలెస్టరాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా తదితరాలు పరిశీలించనుంది. పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేయనుంది. ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ ప్రొఫైల్ పోర్టల్లో వివరాలను నిక్షిప్తం చేస్తుంది. పోర్టల్ రూపకల్పనలో హైదరాబాద్ ఐఐటీ సహకారం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఇలా.. ‘హెల్త్ ప్రొఫైల్’అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రే కీలకం. కార్యక్రమంలో భాగంగా హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారు. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు ముందుగా కుటుంబానికి చేరుకుని అర్హుల వివరాలు సేకరిస్తారు. వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జనరేట్ చేసిన తర్వాత శాంపిల్స్ (నమూనాలు) తీసుకుంటారు. వాటిని ప్యాక్ చేసి బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ కోసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. మిగతా పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నస్టిక్స్కు చేరవేస్తారు. అక్కడ పరీక్షలు ముగిశాక ఉన్నతాధికారు లు, వైద్యనిపుణుల ఆమోదం తర్వాత విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు యూనిక్ డిజిటల్ హెల్త్ కార్డుతో పాటు పరీక్షల ఫలితాల ప్రతులను ఇస్తారు. పరీక్షల్లో లోపాలు గుర్తించిన వారికి మెడిసిన్ కిట్, ఆరోగ్యశాఖ మంత్రి సందేశాన్ని ఇస్తారు. ఇతర జబ్బులున్నట్టు తెలిస్తే జిల్లా ఆస్పత్రి, నగరంలోని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు రిఫర్ చేసి ప్రత్యేక చికిత్సను అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం కృషి చేస్తుంది. -
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం
-
మేడారం సమ్మక్మ-సారలమ్మ గద్దెల వద్ద బంగారం తొలగింపు సబబేనా..?
పున్నమి వెలుగున గద్దెనెక్కిన వనదేవతలు.. భక్త‘కోటి’ ఆరాధ్య దైవాలు.. ఇంటి ఇలవేల్పులు. వరాలిచ్చే దేవరలు.. చెంతకొచ్చినా.. మదిలో తలచినా నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే కల్పవల్లులు. రెండేళ్లకోసారి దర్శనభాగ్యం కల్పించేందుకు కళ్లెదుటే సాక్షాత్కరించగా.. జై సమ్మక్క.. జై సారలమ్మ తల్లీ అంటూ మొక్కుల చెల్లింపునకు అశేష భక్తజనం పోటెత్తింది. ఎత్తు బెల్లం(బంగారం), పసుపు, కుంకుమ, చీర సారె సమర్పిస్తూ తల్లుల సేవలో తరించారు. చల్లని చూపులను ప్రసాదిస్తూ.. కోరిన కోర్కెలు తీర్చేందుకు అభయమిచ్చితిరి ఆ అమ్మలు. సాక్షి, మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): తల్లుల గద్దెలపై ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలను పూజారులు తప్పుబడుతున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ కొలువుదీరిన గద్దెలపై బెల్లం(బంగారం), ఒడిబియ్యం, కొబ్బరి కుడుకలు, పోక, ఖర్జూర, చీర సారె భక్తులు సమర్పించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఇవన్నీ చుట్టూరా ఉంటేనే అమ్మవార్లు అక్కడ ఉన్నట్లు భావిస్తారు. అయితే.. జాతర పూర్తి కాకముందే ఎప్పటికప్పుడు కానుకలు తొలగించడం సంప్రదాయానికి విరుద్ధమని పలువురు పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూజారిని అడగగా.. బంగారం తొలగించడాన్ని తాము తప్పుబడుతున్నామని, అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన నాటి నుంచి వనప్రవేశం చేసే వరకు రాశిగా ఉంటేనే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. చదవండి: మేడారం జాతర: గట్టి మంత్రి.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. కాగా.. వనప్రవేశం ముందు ఆచారంగా ఆదివాసీలు, మేడారం ఆడబిడ్డలు, స్థానికులు గద్దెలపై ఉన్న బెల్లం, చీర సారెలను ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడంతా తొలగించడంతో ఈసారి ప్రసాదం స్థానిక ఆదివాసీలకు అందే పరిస్థితి లేకుండా పోయిందని పూజారులు వాపోయారు. జాతరకు ముందు జరిగిన సమీక్షలో సైతం గద్దెలపై కేవలం ప్లాస్టిక్ కవర్లు మాత్రమే తొలగించాలని పూజారులు సూచించారు. దీనిపై డీపీఓ వెంకయ్యను వివరణ కోరగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి జాతరలో ఇలానే తొలగిస్తామని, ఈసారి కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన టైర్ ముక్క.. బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి..
సాక్షి, ములుగు(గజ్వేల్): టైర్ ముక్కను తాకి బైక్ అదుపుతప్పడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన లక్ష్మక్కపల్లి రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్ఐ రంగకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన మంకి సుధాకర్–స్వరూప (34) దంపతులు ములుగు మండలం వంటిమామిడి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. వీరికి యశ్వంత్ (14), సాత్విక (12) ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున వంటిమామిడిలో కూరగాయలను కొనేందుకు దంపతులు బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్ష్మక్కపల్లి వద్ద రోడ్డుపై టైర్ ముక్క పడి ఉండటం వీరికి కనిపించలేదు. దీంతో దాని మీదుగా వెళ్లిన బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వరూప అక్కడిక్కడే మృతి చెందగా, సుధాకర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంగకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించామని పేర్కొన్నారు. చదవండి: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. గురుకులంలో 48 మందికి పాజిటివ్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ రంగ కృష్ణ రెడిమిక్స్ వాహనం ఢీకొని మరొకరు.. గజ్వేల్రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఎదురుగా వచ్చిన రెడిమిక్స్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ (పల్లెపహడ్)లో నివాసముంటున్న గుగులోత్ లక్ష్మి (52) తన కొడుకు మహేందర్, కూతురు శాంతి బెజుగామకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో సంగాపూర్లో గల మజీద్ వద్దకు రాగానే గజ్వేల్ నుంచి వర్గల్ వైపు వెళ్తున్న రెడిమిక్స్ వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేందర్, భుక్య శాంతికి తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మి తలపై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క
సాక్షి, ములుగు: దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న సీతక్క నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అక్కడ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని తహసీల్దార్కు మెమోరండం ఇచ్చిన అనంతరం అస్వస్థకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో పాటు సీతక్క అభిమానులు, కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అబద్దాలు ఆడడం లో సీఎం కేసిఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
-
Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..!
ఎస్ఎస్తాడ్వాయి/ములుగు: కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచం గజగజలాడుతోంది. కోవిడ్ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. కానీ, ఈ గ్రామప్రజలు మాత్రం గుట్టలు, చెట్ల మధ్య ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఆ ఊరే మండలంలోని లింగాల గ్రామపంచాయతీ పరిధిలోని లవ్వాల. ఇక్కడ ఏడాదిన్నర క్రితం నుంచి ప్రపంచ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కల్లోకలం సృష్టిస్తున్న కరోనా.. ఈ ఊరికి మాత్రం చేరలేదు. గ్రామంలో 30 కుటుంబాలకు గాను వందమంది జనాభా ఉంది. గ్రామంలోని ఆదివాసీలు వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులకు వెళ్తుంటారు. లవ్వాల గ్రామం తాడ్వాయి మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని అటవీ ప్రాంతంలోని చెట్లు, గుట్టల మధ్య ఆదివాసీ కుగ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారు ఇక్కడి జనం. గ్రామంలోని ఆదివాసీలు అవసరం ఉంటేనే తప్పా ఇతర ప్రాంతాలకు వెళ్లడంలేదు. ప్రతీ వారం గోవిందరావుపేట మండలంలోని పస్రాలో జరిగే సంతకు వెళ్లి వారానికి సరిపడా సరుకులు కొనుగోలు చేసుకొని వస్తారు. వివాహాలు, శుభకార్యాలకు బంధువులు గ్రామానికి వస్తారే తప్పా మిగతా రోజులల్లో దాదాపు అక్కడికి ఎవరూ రారని ఆగ్రామ ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామంలోని ఆదివాసీలకు కూడా ఇతర ప్రాంతాల వారితో అంతగా సంబంధాలను కొనసాగించరు. బయటికి వెళ్లే సమయంలో మొఖానికి టవళ్లను అడ్డుపెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తామని చెప్పుకొచ్చారు. పట్టణ ప్రాంతాలకు వెళ్లరు.. ఈ గ్రామంలోని ఆదివాసీలు ఇతర ప్రాంతాలకు తక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా పట్టణాలకు అసలు వెళ్లరనే చెప్పాలి. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లనందున గ్రామంలో ఎవరికీ కరోనా సోకలేదని చెప్పవచ్చు. అధికారుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణకు ర్యాపిడ్ టెస్టులు చేసుకున్నప్పటికీ అందరికీ నెగిటివ్గానే తేలింది. గ్రామంలోని వంద మందిలో సుమారు 30 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. పాత కాలం నాటి ఆహార అలవాట్లను నేటికీ కొనసాగించడంతోపాటు పచ్చని చెట్ల మధ్య మా గ్రామం ఉండడంతో ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పవచ్చు. పట్టణాల్లో వలె ఫ్రిజ్ వాటర్ కాకుండా మట్టికుండలోని నీటిని మాత్రమే తాగుతూ.. కరోనా మహమ్మారికి దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు అటవీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం కూడా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు ఉపకరిస్తుందని ఆదివాసీలు వివరిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం.. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా బారిన పడకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు లవ్వాల గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం హర్షనీయం.లవ్వాల ప్రజలు ఇతర ప్రాంతాలవారితో కలవడకపోవడమే కరోనా నియంత్రణకు అసలు కారణం. ప్రతీ ఒక్కరు ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – సత్యాంజనేయప్రసాద్, ఎంపీడీఓ, తాడ్వాయి అత్యవసరం అయితేనే బయటకు.. పచ్చని చెట్ల మధ్య ఉండడంతోపాటు, ఇక్కడి ప్రజలు అత్యవసరం అయితేనే ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అదికూడా కేవలం ఇంటినుంచి ఒక్కరు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లి సరుకులు తీసకొస్తారు. గ్రామంలోని ప్రజలు ఎప్పుడు గుంపులుగా చేరరు. అధికారులు చెబుతున్న జాగ్రత్తలు పాటిస్తున్నందునే మా ఊరికి కరోనా రాలేదు. – కాయం బుచ్చయ్య, లవ్వాల చదవండి: తండాలో నో కరోనా..! -
తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత
ములుగు: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. కొంతకాలం కిందట కిడ్నీలు విఫలమవగా, మార్పిడి చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటి నుంచి డయాలసిస్పైనే ఆధారపడుతున్నారు. పది రోజుల కిందట వరకు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందారు. ప్రస్తుత ములుగు జిల్లా జగ్గన్నపేటలో 17 ఆగస్టు 1954న జన్మించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుమార్లు గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు నిర్వర్తించారు. చందూలాల్కు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సర్పంచ్గా మొదలైన ప్రస్థానం జగ్గన్నపేటకు చెందిన చందూలాల్ తొలుత 1981లో సర్పంచ్గా గెలిచారు. 1982లో టీడీపీలో చేరిన ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1985లో ఎమ్మెల్యేగా గెలిచి.. అప్పటి ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో ఓటమి పాలై, 1994 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో టీడీపీని వీడి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన చందూలాల్కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, 1996 మధ్యంతర లోక్సభ ఎన్నికల్లో, 1998 లోక్సభ ఎన్నికల్లో ఆయన వరంగల్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. కాగా చందూలాల్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సంతాపం మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారని, రెండుసార్లు మంత్రిపదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన చందూలాల్ నూతన తెలంగాణ రాష్ట్రంలో తన మంత్రివర్గంలో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. మాజీ మంత్రి చందూలాల్ మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/gndjgMVQS3 — Eatala Rajender (@Eatala_Rajender) April 15, 2021 -
ఐలాపురం అడవుల్లో పెద్దపులి
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం రేంజ్ ఐలాపురం అటవీ ప్రాంతంలో సోమవారం పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎఫ్ఆర్ఓ ఆసిఫ్ పులి అడుగు జాడలపై డీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టికి సమాచారం ఇచ్చారు. పులి జాడను కనిపెట్టేందుకు కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని డీఎఫ్వో ఆదేశించడంతో పులి సంచరించే నీటి వసతి ఉన్న ప్రాంతాలు, వాగులు, చెలిమలు, కుంటల వద్ద కెమెరాలతో అన్వేషిస్తున్నారు. చదవండి: కే–4 ఆడ పులి.. దాని జాడేది? -
అరుదైన దృశ్యం: రోడ్డుపై అడవి దున్న
వాజేడు(ములుగు) : సాధారణంగా అడవి దున్నలు జనారణ్యంలోకి రావు. కానీ మంగళవారం ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు వద్ద ఓ అడవి దున్న(కారు బర్రె) రోడ్డుపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు అడవి దున్న ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, ఈ బర్రె ధర్మవరం అటవీ ప్రాంతం వైపు నుంచి చెరుకూరు సమీపంలో జాతీయ రహదారి మీదుగా ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న గుట్టల వైపు వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఇది రహదారి దాటుతున్నప్పుడు వాహనదారులు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
రక్తపు వాంతులు.. అంతుపట్టని వ్యాధి
సాక్షి, ములుగు : ఓ వింతవ్యాధి ఆ గ్రామాన్ని కబలిస్తోంది. వరుస మరణాలు ఆ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆరుగురు బలయ్యారు. దీంతో తమ గ్రామానికి ఎవరో చేతబడి చేశారని ఆందోళన చెందుతున్న అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతున్నారు. ప్రాణ భయంతో ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. వారిని బలి తీసుకుంటున్న ఆ వ్యాదేంటో వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇది ములుగు కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామం. వరంగల్కు 145 కి.మీ దూరంలో, ములుగు జిల్లా కేంద్రానికి 95కి.మీ దూరంలో వుండే ఏటూరునాగారం ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం ఇది. ఈ కుగ్రామం గత 20 రోజులుగా మృత్యు భయంతో బెంబేలెత్తిపోతోంది. (20 రోజుల్లో ఆరుగురు మృతి.. కారణం?) ఎవరిని పలుకరించినా మృత్యు భయమే గ్రామంలో ఏ ఒక్కరికి కంటిమీద కునుకు లేదు. ఏ ఇంట్లో అలికిడి అయినా ఏదో జరిగి పోతుందనే ఆందోళన వెంటాడుతుంది. కడుపునొప్పి జ్వరంవస్తే చాలు.. ఇక చావు తప్పదని ఆందోళన. అందుకు కారణం గత 20 రోజుల్లో ఈ గ్రామానికి చెందిన ఆరుగురు చనిపోవడమే. వాళ్లకు కడుపునొప్పి వచ్చిన కొద్దిసేపటికే కడుపంతా ఉబ్బి రక్తంతో వాంతులు చేసుకొని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఎర్రయ్య, లక్ష్మీనారాయణ, కుమారి, దుర్గమ్మ, రమేష్, రాధిక అనే ఆరుగురు ఒకే రకమైన వింతవ్యాధితో చనిపోయారు. అంతా కడుపు ఉబ్బి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో ఎవరికైనా కడుపునొప్పి వచ్చిందంటేచాలు చావు తప్పదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముప్పునపల్లిలో ఎటు చూసినా విషాద వాతావరణమే అలముకొని ఉంది. మరణించిన వారి ఫ్లెక్సీలు, ఇళ్లకు తాళాలే వేలాడుతున్నాయి. ఎవరిని పలుకరించినా మృత్యు భయమే కనిపిస్తుంది. ఇప్పటివరకు మరణించిన వారంతా అంతా ఒకే విధంగా వింత వ్యాధితో మృతి చెందడంతో ఊరికి ఎవరో చేతబడి చేశారని, ఏదో శక్తి ఈ ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులకూ అంతు చిక్కని రోగం ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అంతుచిక్కని వింత వ్యాధి వారి ప్రాణాలు మింగేస్తుండడంతో ఊరంతా ప్రాణభయంతో ఊరి విడిచి వలసబాట పట్టారు. ఇప్పటికే 40కి పైగా కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ళు, ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో ఏ ఇంటికి చూసినా ఇలా తాళాలు వేలాడుతున్నాయి. ఏదో శక్తి ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్న ఇక్కడి ప్రజలు ఇక్కడ ఉంటే ప్రాణాలు మిగలవనే ఆందోళనతోనే ఊరువిడిచి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. వింతవ్యాధితో ఊరంతా మృత్యువాత పడుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు. చనిపోయిన వారితోపాటు ప్రస్తుతం బ్రతికి ఉన్నవారి కుటుంబ సభ్యులకు మలేరియా, కరోనా, డెంగ్యూ టైపాయిడ్ టెస్టులు నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితంలేదు. నెగిటివ్ గానే వస్తుంది. ఈ చావులకు కారణమేమిటో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అంతు చిక్కడం లేదు. మూఢనమ్మకాల వైపు అడుగులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే మకాంవేసి మరోచావు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వరుస మరణాల నేపథ్యంలో మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తున్నారు. కచ్చితంగా ఏదో శక్తి ఆవహించిందని, చేతబడి చేశారని గ్రామమంతా ఆందోళన చెందుతుండడంతో స్థానిక సర్పంచ్ కూడా అయోమయంలో చిక్కుకున్నారు. వైద్యులకు కూడా ఈ వ్యాధి అంతుచిక్కకపోవడం వల్ల మూఢ నమ్మకాలవైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఊళ్ళో మిగిలిన15 కుటుంబాలు చీకటి పడితేచాలు ఒక్కచోట చేరి మృత్యువును జయించేందుకు మానవ ప్రయత్నాలు చేస్తూ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారి మరణాలకు కారణాలు తెలియదు... ఎప్పుడు ఎవరు బలవుతారో అర్థంకాక వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతిల్లుతున్నారు. -
ఆవును చంపిన పులి..?
ములుగు: ములుగు జిల్లా సరిహద్దు అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు 20 రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి కొద్ది దూరంలో దేవునిగుట్ట ప్రాంతంలోని పొదల్లో ఆవు కళేబరం కనిపించడంతో స్థానికుల అనుమానాలకు బలం చేకూరుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన రైతు తమ ఆవును రోజూ మేతకోసం అడవికి పంపేవాడు. కాగా, గత నెల 25వ తేదీన అడవిలోకి మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం వరంగల్ రూరల్ జిల్లా పరిధి అడ్డబోలు లొద్దిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో అడవిలోకి వెళ్లిన పశువుల కాపరులు పరిశీలించగా పొదల్లో ఆవు కళేబరం కనిపించింది. దీని గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ములుగు అటవీ శాఖ సెక్షన్ అధికారి రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పరిసరాల్లో చౌడు నేల ఉండడంతో పులి జాడను నిర్ధారించలేక పోయామని ఆయన తెలిపారు. ఆవు కళేబరం దొరికిన స్థలం నర్సంపేట సరిహద్దులో ఉండడంతో అక్కడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, ఆదివారం ఉమ్మడిగా నమూనాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. -
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
-
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
సాక్షి, ములుగు : దీపావళి పండుగ రోజున ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగరాయపురం గ్రామానికి చెందిన16మంది గోదావరి స్నానానికి వెళ్లగా.. నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. వారిలో శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్ ఉన్నారు. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మరికాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పదేళ్ల తర్వాత జిల్లాలో పులుల సంచారం!
సాక్షి, ములుగు: పదేళ్ల తర్వాత ములుగు జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించాయి. దాదాపు రెండు నెలల క్రితం భూపాలపల్లి, మహాముత్తారం, కాటారం అడవుల్లో పులులు సంచరించాయి. అదే సమయంలో జిల్లాలో పులి సంచరించినట్లు పుకార్లు వినిపించారు. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది. సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోని అభయారణ్యాల్లోకి పులులు ప్రవేశించాయానే సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత 10 సంవత్సరాల క్రితం జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్లైఫ్ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. గత 25 రోజులుగా కెమెరాలను పరిశీలిస్తున్నా అధికారులకు పులి సంచారం విషయంలో స్పష్టత రావడంలేదని తెలిసింది. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి ఐదు నెలల కాలంలో ఆరు పులులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారులు స్ప ష్టతనివ్వడం లేదు. ప్రతీ 10 రోజుల సమయంలో పులులు ఆయా జిల్లాల అభయారణ్యంలో కన్పించడంతో స్పష్టమైన వివరాలు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ.. పులి సంచారం విషయంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రజలు తీవ్ర బయాందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఏటూరునాగారం ఆభయారాణ్యాన్ని టైగర్ జోన్గా మార్పు విషయంలో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టేందుకు ముందుకు సాగుతుండటంతో ఏజెన్సీ అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్
ములుగు: ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మంగపేట మండలం నరసింహసాగర్ సమీపంలో ఉన్న ముసలమ్మగుట్ట, తిమ్మాపూర్ పరిధి కొప్పుగుట్ట మధ్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు పక్షాలమధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. వారిని మణుగూరు ఏరియా దళ సభ్యులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో దళకమాండర్ సుధీర్ అలియాస్ రాము ఉన్నాడు. ఈ ఘటనతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా శనివారం ఏటూరునాగారం సబ్డివిజన్ పోలీసులు వెంకటాపురం(కె) మండలంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మిలీషియా సభ్యుడు మిడియం చిన్న లక్ష్మయ్యను అరెస్టు చేశారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి దాడి చేసినట్లు తెలుస్తోంది. -
మావోయిస్టు మిలీషియా సభ్యుడు అరెస్ట్
సాక్షి, ములుగు : సిపిఐ మావోయిస్టు మిలీషియా సభ్యుడు లక్ష్మయ్య శనివారం అరెస్ట్ అయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక, కొండాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా మావోయిస్టు మిలీషియన్ సభ్యుడైన లక్ష్మయ్యగా గుర్తించారు. లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కార్డేక్స్ వైర్,జిలిటెన్ స్టిక్స్ లు 2, 2 టిఫిన్ బాక్సులు 2 డిటోనేటర్,1 తూటలు స్వాధీనం చేసుకన్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. -
పోలీస్స్టేషన్కు ప్రొఫెసర్ కాశిం
సాక్షి, సిద్దిపేట: ప్రొఫెసర్ కాశిం ఆదివారం ములుగు పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. విప్లవ సాహిత్యం కలిగి ఉండటం, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనపై గతంలో ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కండీషనల్ బెయిల్ పొందిన ప్రొఫెసర్ కాశిం నిబంధనల మేరకు ములుగు పోలీస్స్టేషన్కు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన అరెస్టును నిరసిస్తూ విడుదలకు సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు కాశిం కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: విద్యార్థుల్ని మావోలుగా మార్చే యత్నం) -
ములుగు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
సాక్షి, ములుగు: అటవీ జిల్లా ములుగులో కొద్ది రోజుల కురుస్తున్న వర్షాల వల్ల మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అక్కడి బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో ఆస్పత్రిలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవని మంత్రితో తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో మంత్రి సదరు మహిళకు కొడుకు వెంటనే మంచి వైద్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడమే కాకుండా వ్యక్తగతం కూడా 10 వేల రూపాయలను అందించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పర్యటించారు. -
కరెంటు లేకుండానే బోరు నుంచి పైకి వస్తున్న నీరు
సాక్షి, ములుగు: జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బోరు నుంచి కరెంటు లేకుండానే గంగమ్మ పైకి ఉబిగి వస్తోన్న దృశ్యం ములుగు మండలంలోని శివ తండాలో మంగళవారం వెలుగు చూసింది. తండాకు చెందిన ధరవత్ అనే రైతు పోలంలోకి వెళ్లేసరికి బోరు నుంచి నీరు బయటకు రావడం గమనించాడు. అక్కడకు వెళ్లి చూడగా కరెంటు లేకుండాను బోరు నుంచి నీరు పైకి రావడం చూసి రైతు ధరవత్ హర్షం వ్యక్తం చేశాడు. అలాగే ఈ సంఘటన గురించి తోటి రైతులకు తెలిపాడు. అయితే గత రోజులుగా ఏకాదాటిగా కురిసిన వర్షాలకు భుగర్భ జాలాల నీరు పెరగడంతో ఇలా నీరు పైకి వచ్చినట్లు అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
మావోయిస్టులను గట్టి దెబ్బ కొడతాం: డీజీపీ
సాక్షి, ఏటూరు నాగారం: మావోయిస్టులు అభివృద్ది నిరోధకులని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏటూరు నాగారం సబ్ డివిజన్లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ములుగు, భూపాలపల్లికి చెందిన పోలీసు అధికారులతో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్, ఐజీ నాగిరెడ్డి ఐపీఎస్, ఐజీ ప్రభాకర్ రావు ఐపీఎస్, ఐజీ నవీన్ చంద్ ఐపీఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్, ఓఎస్డీకే సురేష్ కుమార్, శోభన్ కుమార్, ఏఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, సాయి చైతన్య ఐపీఎస్, గౌస్ ఆలం ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను తెలంగాణ గడ్డ మీద జరగనివ్వబోదని రాష్ట్ర ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయినటువంటి హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారన్నారన్నారు. మావోయిస్టులకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని డాక్టర్లలను, ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేందుకు పథక రచనతో మావోయస్టులు తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల కోపాగ్నికి గురై ఇక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయిన మావోయిస్టులు తిరిగి మళ్ళీ తెలంగాణ ప్రజల కోపానికి గురి కాకూడదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య, వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్న ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న రోజుల్లో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ కొడుతుందని హెచ్చరించారు. నక్సలిజం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతుందని తెలియజేశారు. -
తిట్టాడని జేసీబీతో దాడి
-
కరోనా వస్తుందేమోనని కోడిగుడ్లు పూడ్చేశారు
సాక్షి, ఏటూరు నాగారం : కరోనా అనుమానం ప్రజల్లో భయాందోళనను కలిగిస్తుంది. ఎంతలా అంటే ఒక వ్యక్తికి కరోనా సోకితే అతను వాడిన వస్తువులు దగ్గర నుంచి ఏదైనా సరే కాల్చేయడమో లేక పాతిపెట్టేడమో చేస్తున్నారు. తాజాగా మండల కేంద్రానికి చెందిన కిరాణం షాపు యజమానికి కరోనా పాజిటివ్ రాగా.. ఆయన షాపులో నిల్వ ఉన్న కోడిగుడ్లను గురువారం ట్రాక్టర్లో తీసుకెళ్లి పాతిపెట్టారు. సదరు వ్యక్తికి 19 రోజుల చికిత్స తర్వాత నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన షాపులో నిల్వ ఉన్న గుడ్లు వాడితే ఇబ్బంది అవుతుందనే భావనతో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం రూ.85వేల విలువైన గుడ్లను తీసుకెళ్లి ఊరి బయట పూడ్చివేశామని చెప్పారు. సర్పంచ్ ఈసం రామ్మూర్తి, సీఐ నాగబాబు, తహసీల్దార్ సర్వర్పాషా, డాక్టర్ వైశాలి, పంచాయతీ కార్యదర్శి రవి, బిల్ కలెక్టర్ వెంకయ్య పాల్గొన్నారు. (పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా) -
లాక్డౌన్: మహిళా ఎక్సైజ్ ఎస్ఐ అత్యుత్సాహం
సాక్షి, ములుగు : లాక్డౌన్ ముసుగులో కొందరు ఎక్సైజ్ అధికారులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మహిళా ఎస్ఐ భారతి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్సైజ్ ఎస్ఐ భారతి... వెంకటేశ్ అనే వ్యక్తి మద్యం బాటిళ్లు దొంగ చాటుగా సరఫరా చేస్తున్నాడని సమాచారం అందడంతో అతని ఇంటికి చేరుకొని నానా బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో వెంకటేశ్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి తాళాలు పగులుగొట్టి వస్తువులన్ని చిందరవందరగా పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే ఇంటికి చేరుకున్న బాధితుడు కక్ష సాధింపు చర్యలతోనే తన ఇంటిపై దాడి చేశారంటూ భారతిపై ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ములుగు పోలీసులు ఎస్ఐ భారతిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చంపేస్తే అప్పు తప్పుతుందని..
గోవిందరావుపేట: అప్పు తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇవ్వాలంటూ కూర్చున్న దేవేందర్రెడ్డిని హత్య చేస్తే మిగతా చిన్నచిన్న అప్పులను తీర్చేయవచ్చని.. ఇదేక్రమంలో హత్య చేశాక మృతదేహాన్ని రాత్రి మాయం చేయాలని భావించాడు.. ఇదే ఆలోచనతో బేకరీ లోపలికి తీసుకెళ్లిన దేవేందర్రెడ్డిని తీవ్రంగా కొట్టాక చనిపోయాడనుకుని బయటకు వచ్చాక సునీల్రెడ్డి కనిపించాడు.. అంతసేపటి వరకు ఒకటే హత్య చేయాలని అనుకున్న నిందితుడు.. రెండో హత్యకు కూడా సిద్ధమయ్యాడు. దీంతోనే సునీల్ను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఇదీ ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు, బేకరీ యజమాని దయానంద్ అలియాస్ దయ పన్నాగంగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. రూ.6లక్షల అప్పు.. కర్ణాటకకు చెందిన దయానంద్ తన మామ ప్రభుతో కలిసి పస్రాలో కొన్నేళ్ల క్రితం బేకరీ ప్రారంభించారు. అయితే, అప్పులు ఎక్కువ కావడంతో కొద్దికాలం క్రితం ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరునెలల క్రితం వచ్చిన వారు పస్రాలోనే కొత్తగా బేకరీ తెరిచారు. అప్పటికే ఉన్న అప్పులకు తోడు మరికొన్ని అప్పులు చేశారు. ఈ క్రమంలో దయకు రూ.6లక్షలు అప్పు ఇచ్చిన దేవేందర్రెడ్డి నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం కూడా దేవేందర్రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్ సునీల్రెడ్డితో కలిసి పస్రా వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంతనాలు సాగించినా డబ్బు తిరిగి ఇవ్వడంలో ఎలాంటి పురోగతి కానరాలేదు. తనకు స్థానిక వ్యాపారి ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉందని చెప్పగా.. దేవేందర్, సునీల్ ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే, దయకు తాను డబ్బు పెద్దగా ఇచ్చేది లేదని.. కొంతమొత్తమే ఉన్నా తనకు కుమార్తె వివాహం ముగిశాక ఇస్తానని చెప్పాడు. (ఫొటో జర్నలిస్ట్ దారుణ హత్య) ఇస్తావా.. ఇవ్వవా? వ్యాపారి మొండిచేయి చూపడంతో దేవేందర్, సునీల్ మళ్లీ దయ బేకరీ వద్దకు వచ్చారు. దేవేందర్రెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.6లక్షల విషయమై మళ్లీ ప్రశ్నించాడు. ఉదయం నుంచి నచ్చచెప్పినా వినడం లేదని భావించిన దయ.. తొలుత దేవేందర్రెడ్డిని హత్య చేసి అప్పు వదిలించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే భావనతో పక్కనే ఉన్న మామ ప్రభుకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7–30 గంటలకు బేకరీకి వచ్చిన దేవేందర్రెడ్డిని బేకరీలో వెనక ఉన్న బట్టీ వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో చనిపోయాడని భావించి శవాన్ని రాత్రికి మాయం చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాగానే సునీల్రెడ్డి కనిపించడంతో దయా తన ఆలోచన మార్చుకున్నాడని సమాచారం. ‘ఇంటికి పోయి మాట్లాడుకుందాం.. అక్కడ నీకు అన్ని విషయాలు, నా ఇబ్బందులు చెబుతా’ అంటూ సునీల్రెడ్డిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దయ మామ, భార్య బేకరీలో ఉన్నారు. ఈ మేరకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సునీల్రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రక్తపు మడుగులో దేవేందర్.. దయ, సునీల్రెడ్డి ఇంటికి వెళ్లాక పనిపై ప్రభు బేకరీలోని బట్టీ వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో దేవేందర్రెడ్డి కనిపించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన స్థానికుల సాయంతో 108లో ములుగు ఆస్పత్రికి చేర్చాడు. ఇంతలోనే దయ భార్య బేకరీ నుంచి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గొడవ వినిపించినట్లు సమాచారం. ఉదయం నుంచి అప్పు విషయమై జరుగుతున్న గొడవగానే ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దయ రక్తపు మరకలు కడుక్కుంటూ ఇంటి నుంచి బయటకు రావడాన్ని చూసిన ఆమె ఏదో జరిగిందని ఊహించినట్లు సమాచారం. ఆ తర్వాత దయా రోడ్డుపైకి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇంతలోనే దయ నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
ప్రాణం తీసిన సెల్ఫోన్
అవసరాల కోసం ఉపయోగపడే సెల్ఫోన్ ఇప్పుడు ఒకరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి పంచాయతీ పరిధిలోని కొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాగే శంకరయ్య, కావిరి నారాయణ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. నారాయణ అన్న సమ్మయ్య పిల్లలైన నగేష్, మధుకర్.. నారాయణ ఇంట్లోనే ఉంటున్నారు. శివరాత్రి కావడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ఇవ్వగా.. నగేష్ సెల్ఫోన్లో మధుకర్, శంకరయ్య కుమార్తె, మరో విద్యార్థిని కలసి సినిమా పాటల వీడియోలు చూస్తున్నారు. ఇదే క్రమంలో శంకరయ్య ఇంటికి రాగానే పిల్లలు వెళ్లిపోయారు. అయితే, తన కుమార్తె, మరో విద్యార్థిని శంకరయ్య మందలించి వదిలేశాడు. ఆ తర్వాత నారాయణ ఇంటికి వెళ్లిన శంకరయ్య.. నగేష్ను కర్రతో కొడుతుండగా.. అడ్డొచ్చిన మధుకర్ తలపై కూడా బలంగా కొట్టాడు. దీంతో అతని తల బాగా వాయగా.. వాంతులు అయ్యాయి. మధుకర్ను వెంటనే ఏటూరునాగారం ఆస్పత్రికి.. ఆపై వరంగల్, హైదరాబాద్కు తరలించారు. అంతలోగానే మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మధుకర్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని ఏటూరునాగారం సీఐ నాగబాబు, ఎస్సై సురేష్ తెలిపారు. – ఏటూరునాగారం/కన్నాయిగూడెం -
మేడారానికి భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క–సారలమ్మ జాతరకు తెలంగాణ పోలీసుశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ వనమహోత్సవం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలవనున్న నేపథ్యంలో భద్రతాపరంగా పలు ప్రణాళికలు రూపొందించింది. భద్రత, రవాణా, పార్కింగ్, వాహనాల మళ్లింపు, సీసీకెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్జామ్ల నివారణకు అవలంబించాల్సిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసింది. వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మేడారానికి వచ్చే వారంతా కాటారం రహదారిని రాకపోకలకు వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్తోపాటు, హైదరాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేభక్తులంతా ములుగు మీదుగా పస్రా, అక్కడ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి మీదుగా వరంగల్ వైపునకు రావాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాల్లోనూ వన్వే విధానం సాగుతుంది. ట్రాఫిక్ జామ్లు ఏర్పడినా క్లియర్ చేయడానికి ప్రత్యేక బైకులపై పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. జాతర ముగిసేవరకు ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రైవేటు వాహనాలు, ఇసుక లారీలు, ట్రాక్టర్లను వేరేవైపు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. వరంగల్ మీదుగా మేడారం చేరుకునే భక్తులు జాకారం –జంగాలపల్లి గ్రామాల మధ్య కొలువైన ఘట్టమ్మ తల్లి వద్ద ఆగుతారు. ఇక్కడ భక్తులు, వాహనాల రద్దీ నియంత్రణకు సైతం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం చేరుకున్న అన్ని వాహనాలకు ‘ఊరటం’వద్ద విశాల మైదానంలో వేలాది వాహనాల పార్కింగ్కు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జాతర జరగనుంది. రక్షణ ఇలా: గతంలో ములుగు నుంచి మేడారం వరకు రహదారి వెంట 10 కి.మీ.లకు ఒక పోలీస్ చెక్పోస్టు పెట్టగా.. ఈసారి 4 కి.మీ.లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకోనున్నారు. దాదాపు 380 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. సమ్మక్క–సారక్క గద్దెలను దర్శించుకునే మార్గాల సంఖ్యను నాలుగుకు పెంచాలని యోచిస్తున్నారు. మేడారం జాతరకు ప్రధానిని ఆహ్వానిస్తాం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షాలను ఆహా ్వనించనున్నట్టు బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్రావు తెలిపారు. మంగళవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. -
ములుగు జాతీయ రహదారిపై సీతక్క రాస్తారోకో
-
అడవి బిడ్డలకు అండగా..
సాక్షి, వెంకటాపురం(ఎం): పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ములుగు జిల్లా ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో గొత్తికోయలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.. ఎలాంటి ఆధారం లేని వారి కుటుంబాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ ఆదేశానుసారం ములుగు సీఐ కొత్త దేవేందర్రెడ్డి, వెంకటాపురం ఎస్సై భూక్యా నరహరి ఎప్పటికపుడు గొత్తికోయగూడెల్లో ఇంటింటి సోదాలు చేపడుతూ సంఘ విద్రోహశక్తులకు సహకరించకుండా అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామ సమీప అటవీప్రాంతంలో బోడరామయ్యగడ్డ వద్ద 12 గొత్తికోయ కుటుంబాలు ఉంటుండగా, అత్యధికంగా వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని అటవీప్రాంతంలో బండ్లపహాడ్, తొర్ర చింతలపాడు, ఊట్ల తోగు, రోలుబండ, నందిపాడు, మద్దిమడుగు వద్ద ఆవాసాలు ఏర్పాటు చేసుకుని 120 గొత్తికోయ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గొత్తికోయలు సమీప గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అవగాహన.. అప్రమత్తం ములుగు, వెంకటాపురం మండలాల పరిధిలో నివాసముంటున్న గొత్తికోయలు సంఘవిద్రోహశక్తులకు, మావోయిస్టులకు సహకరించకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్డెన్సెర్చ్ పేరుతో ఇంటింటికి తనిఖీలు నిర్వహిస్తూ గొత్తికోయలకు అవగాహన కల్పిస్తున్నారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దని, కొత్త వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలతో కలిసిపోయేలా కృషి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అటవీప్రాంతంలో నివాసముంటూ జీవనం కొనసాగిస్తున్న గొత్తికోయలను ప్రజలతో మమేకం చేసేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. నాటువైద్యం చేసుకొని ప్రాణాలు కోల్పోకుండా వారికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదేక్రమంలో శనివారం వెంకటాపురం(ఎం)మండల కేంద్రంలోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో పోలీసులు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి 132 గొత్తికోయ కుటుంబాలకు 8మంది వైద్యులతో పరీక్షలు చేయించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మావోయిస్టులకు సహకరించొద్దు ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో నివాసముంటున్న గొత్తికోయలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరించవద్దు. గొత్తికోయల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మావోయిస్టులు లొంగదీసుకునే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు తనీఖీలు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నాం. అపరిచిత వ్యక్తులెవరికి ఆశ్రయం కల్పించవద్దని, కొత్త వ్యక్తులు సంచరిస్తే మాకు సమాచారం అందించాలని సూచించాం. – కొత్త దేవేందర్రెడ్డి, ములుగు సీఐ పోలీసుల సేవలు మరువలేనివి అడవిలో ఉంటున్న మమ్మల్ని గుర్తించి చలికాలంలో పడుతున్న బాధలు గుర్తించి మాకు పోలీసులు సాయం చేయడం ఆనందంగా ఉంది. ఒక్కో కుటుంబానికి రెండు దుప్పట్లు, దోమతెరతో పాటు ప్రతీ ఒక్కరికి చెప్పులు కూడ పోలీసు సార్లు ఇవ్వడం మరిచిపోలేము. మేము నివాసముంటున్న గుంపు(గూడెంలు)లకు పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తారే తప్ప ఎప్పుడూ మమ్ముల్ని ఇబ్బంది పెట్టలేదు. – చోడె పాండు, రోలుబండా, వెంకటాపురం -
మైనర్ బాలికపై ఆర్ఎంపీ అఘాయిత్యం
సాక్షి, వరంగల్: మైనర్ బాలిక పట్ల ఓ ఆర్ఎంపీ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. అక్కడే పాఠశాలకు దగ్గరలో ఉన్న ఎస్టీ హాస్టల్లో ఉంటోంది. గతనెల 28న బాధిత విద్యార్థినికి కంటిపై కురుపు రావడంతో చికిత్స కోసం ఆర్ఎంపీ రాజు వద్దకు వచ్చింది. ఈ క్రమంలో రాజు బాలికకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న వస్త్రాలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు, హాస్టల్కు మధ్య ఉన్న యశ్వంత్ క్లినిక్లో ఆర్ఎంపీ రాజు మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బాధిత బాలిక తల్లి శనివారం రాత్రి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు రాజుపై ఐపీసీ 354, 509 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కలవరపెడుతున్న కరపత్రాలు
సాక్షి, ములుగు : జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వరుసగా జరుగుతున్న మావోయిస్టు కరపత్రాల విడుదల జిల్లా యంత్రాంగానికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఈ నెల 17న, 24న వేర్వేరుగా రెండు కరపత్రాలు విడుదల కావడంతో కలకలాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ, బీజేపి నాయకులు, ఆదివాసీ సంఘాలు, అధికారులను టార్గెట్ చేస్తూ విడుదల కావడంతో ఆందోళనకు గురి చేస్తుంది. జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం(కె), మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని అధికార పార్టీ నాయకులు, అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తిప్పి కొట్టిన ప్రజాప్రతినిధులు.. గడచిన వారం రోజుల్లో జిల్లాలో నాలుగు సార్లు కరపత్రాలు విడుదల కావడంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, అధికారుల్లో గుబులు మొదలయ్యింది. తాము చేయని తప్పుకు తలదించాల్సిన అవసరం లేదని కొంతమంది ధైర్యంగా మావోయిస్టుల హెచ్చరికలను తప్పికొట్టారు. మరికొంత మంది ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలపై ఈ నెల 18న జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఘాటుగా స్పందించారు. భూ ఆక్రమణలకు, అవినీతి అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేటతెల్లం చేశారు. అలాగే ఈ విషయంపై స్పందించిన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య ములుగులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు కరపత్రాల విషయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు కరపత్రాల్లో పేర్కొన్న ప్రధాన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా గత మూడు రోజుల క్రితం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, అధికారులను ఏటూరునాగారం స్టేషన్కి పిలిపించి తగిన వివరాలను సేకరించారు. స్థానికంగా ఉండకుండా పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. దీంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధుల కదలికలపై ఆరా తీస్తున్నారు. మొదటి కరపత్రంలో ఇలా.. లంచగొండి అధికారులు, రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ నెల 17న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో విడుదలైంది. ఇందులో ఏటూరునాగారంలోని కొంత మంది నాయకులు ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్, ఉమ్మడి భూపాలపల్లి, ములుగు జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ దందాలు, భూ ఆక్రమాలు, గుండాయిజం, అవినీతి అక్రమాలు, పైరవీల పెత్తనాలు చేస్తూ 34 ఎకరాల భూమిని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అందులో ఆరోపించారు. అలాగే ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వైద్యుల కారణంగానే సామాన్య గిరిజనులు వైద్యసేవలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేటును ఆశ్రయించి వేలాది రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాది రూపాయలను వెచ్చించినా వాటిని గిరిజనుల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేయలేదని ఐటీడీఏ పీఓ, ఏపీఓల వైఖరిని తప్పుబట్టారు. రెండో కరపత్రంలో.. జిల్లాలోని వెంకటాపురం(కె) మండలంలోని టీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూ దందాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడి ప్రశ్నించిన వారిని పోలీసుల ప్రోత్భలంతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భారత కమ్యునిస్టు పార్టీ (మావోయిస్టు) వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఈ నెల 24న ఓ కరపత్రంలో పేర్కొన్నారు. మండలంలోని సుడిబాక గ్రామానికి చెందిన 56 మంది రైతుల 150 ఎకరాల భూములను కొంత మంది నాయకులు కబ్జా చేశారని కరపత్రంలో తెలిపారు. జీఎస్పీ, ఏవీఎస్పీ సంఘాలకు చెందిన వారు కూడా వత్తాసు పలుకుతూ లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. లక్ష్మీనగరం, దానవాయిపేట గ్రామాల ఆదివాసీలకు చెందిన 27 ఎకరాల భూమిని ఆక్రమించి పట్టాలు చేసుకున్నారని, అమాయక ఆదివాసీలు నిత్యం అధికారులు, కోర్టుల చుట్టూ న్యాయం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారన్నారు. రైతుల నుంచి ఆక్రమించిన భూమిని వెంటనే వారికి అప్పగించాలని, లేనిపక్షంలో ప్రజల చేతుల్లో శిక్షతప్పదని కరపత్రంలో హెచ్చరించారు. -
ఔరా అనిపిస్తున్న ఆడబిడ్డ
ఆకాశంలో సగమంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతర్జాతీయంగా విమానాలు, దేశీయంగా మెట్రో రైళ్లు నడుపుతూ మగవాళ్లకు దీటుగా నిలుస్తున్నారు. మెట్రో నగరాల్లో పురుషులతో పోటీ పడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల మూలంగా బయటికి రాలేక తమలోని ప్రతిభను మరుగున పడేస్తున్నారు. కానీ ఇలాంటి కట్టుబాట్లను తెంచుకుని ఆచారాలను పాటిస్తునే స్వంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న స్వాతిపై ‘సాక్షి’ కథనం. – ఎస్ఎస్తాడ్వాయి నీటి సరఫరా కోసం డ్రైవింగ్ సాక్షి, ములుగు : తన వ్యాపారాన్ని విస్తరించుకునే బాధ్యతను తనే మీద వేసుకుంది స్వాతి. దీని కోసం ఏకంగా ఆటోడ్రైవింగ్ నేర్చుకుంది. ఉదయం వేళ హోటల్ నిర్వాహణకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆటోలో క్యాన్లు వేసుకుని మేడారం చుట్టు పక్కల ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, నార్లపల్లి, వెంగళరావునగర్, ప్రాజెక్టు నగర్, తాడ్వాయి, కామారం వరకు ఉన్న పల్లెలకు వెళుతూ నీటిని సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం సమయానికల్లా మేడారం చేరుకుని హోటల్ పనుల్లో నిమగ్నమవుతోంది. సాయంత్రం వేళ తిరిగి వాటర్ ప్లాంట్ మెయింటనెన్స్ను చేపడుతోంది. మహిళా సాధికరత, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శంగా నిలిచే సమ్మక్క సారలమ్మ చెంత స్వాతి ఆటో నడిపిస్తున్న తీరు చూసి ఇక్కడకు వచ్చే భక్తులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలు ఔరా అనుకుంటున్నారు. సమస్యలు వస్తే తమ వైపు చూడకుంటా తన కాళ్లపై తాను నిలబడుతూ తన పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు స్వాతి పడుతున్న తపన చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ అంశంపై స్వాతిని ’సాక్షి‘ పలకరించగా ఒకరిపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్ నేర్చుకున్నాని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని చెబుతుంది. ఆడవాళ్లు ఏ అంశంలో తక్కువ కాదని, ఏ రంగంలోనైనా రాణించగలరని అంటుంది. అడవుల గుండా ఆటో నడిస్తున్నప్పుడు భయంగా ఉండదా అని ప్రశ్నిస్తే సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఉంటూ భయమెందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ మాటతీరు చూస్తేనే తెలుస్తుంది స్వాతి ఎంత ధైర్యంగా ముందుకెళ్తుందో.. తాగునీటి సరఫరా.. ఉపాధి మేడారం వంటి ఏజెన్సీ ఏరియాల్లో తాగునీటి కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు గమినించింది. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు తనకు ఉపాధి దొరుకుతుందనే అంచనాతో ధైర్యం చేసి దట్టమైన అడవుల మధ్య ఉన్న మేడారంలో వాటర్ ప్లాంటు నెలకొల్పింది. ప్లాంటు నెలకొల్పిన తర్వా త మేడారంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో వారికి కూడా నీటిని అందించాల ని అనుకుంది కానీ సరఫరా చేయడం కష్టంగా మారింది. ఆదివారం, సెలవు రోజులు తప్పితే మేడారం వైపు వచ్చే ఆటోలు తక్కువ. దీంతో మినరల్ వాటర్ను కావాల్సిన వాళ్ల కు సరఫరా చేయడం తలకు మించిన భారమైంది. స్థానికంగా ఉన్న ఆటో వాళ్లను సర్వీస్ అడిగితే రానన్నారు. ఏజెన్సీ పల్లెల్లో తాగునీటికి డిమాండ్ ఉంది, తన దగ్గర వాటర్ ఉం ది, సమస్యల్లా సరఫరా చేయడం. రోజుల తరబడి ఎదు రు చూసినా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రా లేదు. సమస్య ఉన్న చోటనే అవకాశం ఉంటుందనే నానుడిని అనుసరిస్తూ తానే ఆటో డ్రైవింగ్ చేసేందుకు స్వాతి ముందుకొచ్చింది. పది రోజుల వ్యవధిలో డ్రైవింగ్ నేర్చుకుంది. -
అదృశ్యం.. ఆపై అస్తిపంజరంగా..
సాక్షి, ములుగు: భర్త మరణించిన అనంతరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఏర్పడిన వ్యక్తిగత సంబంధం మహిళ ప్రాణాలను బలికొంది. నమ్మిన వ్యక్తితో వెళ్లిన మహిళ అదే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన ములుగు మండలంలోని జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయ పరిసర అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు సీఐ కొత్త దేవేందర్రెడ్డి పోలీస్స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో గురువారం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపల్లి జీపీ పరిధిలోని కొడిశలకుంట గ్రామానికి నూనావత్ రాధ(45) భర్త సారయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు రాజుతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రాధతో అదే గ్రామానికి చెందిన జాటోతు భోజ్యానాయక్ సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. గత నెల 18వ తేదీన రాధ భోజ్యనాయక్తో గట్టమ్మకు మొక్కులు చెల్లించడానికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆలయానికి కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వెంట తెచ్చిన స్కార్ప్తో రాధను హతమార్చాడు. ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భోజ్యానాయక్ స్కార్ప్తో చెట్టుకు ఉరి వేసుకొని రాధ మృతి చెందినట్లుగా కట్టిపడేశాడు. అందరూ ఆత్మహత్యగా భావిస్తారని గుట్టుచప్పుడు కాకుండా స్వగ్రామానికి వెళ్లాడు. ఫిర్యాదుతో.. తల్లి కనిపించకపోవడంతో కుమారుడు నూనవత్ రాజు గత నెల 28న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు రెండో ఎస్సై డీవీ ఫణీ నేతృత్వంలో పోలీసులు మృతురాలి కాల్ డేటాను సేకరించారు. చివరి రెండు రోజుల్లో భోజ్యానాయక్తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు రాధను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భోజ్యానాయక్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన వెళ్లి చూడగా రాధ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించారు. నిందితుడిపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ దేవేందర్రెడ్డి వివరించారు. సమావేశంలో ఎస్సైలు బండారి రాజు, డీవీ ఫణీ పాల్గొన్నారు. రోధనలతో మిన్నంటిన గట్టమ్మ గుట్ట రాధ మృతదేహం కుళ్లిపోయి అస్థిపంజరంగా దర్శనమివ్వడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. రోధలనతో గట్టమ్మ గుట్ట పరిసర ప్రాంతాలు మిన్నంటాయి. అస్థిపంజరం మాత్రమే ఉండడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. -
'కూలి'న బతుకుకు సాయం
ములుగు: భూపాలపల్లి, ములుగు ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శనివారం దినసరి కూలీ అవతారం ఎత్తారు. సెలవు రోజు కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రాపురం వెళ్లారు. కౌలు రైతు రాఘవరెడ్డి–నీలమ్మ దంపతులకు చెందిన పొలంలో ఉదయం నుంచి కూలీలతో కలసి వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్లపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. కూలీలు భోజనంలో తీసుకవచ్చే ఆవకాయ పచ్చడితో తిన్నారు. సాయంత్రానికి మధ్య మధ్యలో బురద జంబు తోలారు. పని ముగించుకున్న అనంతరం రైతు రాఘవరెడ్డి నుంచి రూ.250 కూలిగా తీసుకున్నారు. కూలీ డబ్బుకు మరింత కలిపి ఆర్థిక సాయం గ్రామానికి చెందిన చాకలి సారమ్మ వృద్ధాప్యంలోనూ మరుగుజ్జుగా ఉన్న తన ముగ్గురు పిల్లలను కష్టపడి పోషిస్తోంది. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తనకు వచ్చిన కూలీ డబ్బులకు మరికొంత కలిపి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, గడిచిన ఐదేళ్లలో ఏడాదిలో ఒకరోజు గ్రామాలకు వెళ్లిన సందర్భంగా రైతులతో కలసి వరి నాటు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తస్లీమా తనలో ఉన్న మరో కోణంతో ఆదర్శంగా నిలిచారు. -
తప్పు చేస్తే ఎవరినీ వదలం: ఎర్రబెల్లి
సాక్షి, ములుగు: తప్పు చేస్తే సర్పంచ్ అయినా ఊరుకునేది లేదని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. బుధవారం ములుగు జిల్లా పరిషత్ చైర్మన్గా కుసుమ జగదీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడానికి గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో జిల్లాపాలక వర్గాలకు అధికారం, నిధులు ఏవీ లేకుండా పోయాయని, దీనివల్ల గ్రామీణ పాలన దెబ్బతిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కమిటీ, జిల్లా పరిషత్లకు అధికారాలు ఇచ్చిందని ఎర్రబెల్లి గుర్తు చేశారు. అదే విధంగా సర్పంచ్కు, ఎంపీపీకి కూడా నిధులివ్వటం ద్వారా స్థానిక సంస్థల ప్రతినిధుల చేతిలోకి పాలన వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. సర్పంచ్లను ఉద్దేశిస్తూ.. అధికారాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, ఇంకా చెక్పవర్పై రాద్దాంతం చేయవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు ఎవరు తప్పు చేసినా సహించేది లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు
సాక్షి, వరంగల్ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మేడారంలోని జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ములుగు జిల్లాలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. కాగా లో లెవల్ కాజేవే పై నుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏటూరు నాగారంతో పాటు మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపు నీటితో వాగులు వంకలు పోంగిపోర్లుతున్నాయి . -
పరవళ్లు తొక్కుతున్న బొగతా జలపాతం
-
ఉప్పొంగుతున్న బొగత; కాస్త జాగ్రత్త!
సాక్షి, ములుగు : జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పొంగి పొర్లుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతంలోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది. దీంతో బొగతా అందాలను వీక్షించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగుతూ 5 అడుగుల పై నుంచి దూకుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరద నీరు చేరడంతో పర్యాటకులు స్నానాలు చేయకుండా అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నీటిలోకి దిగేందుకు కూడా అనుమతి నిలిపివేశారు. పర్యాటకుల రక్షణ కోసం రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యాటకులను అప్రమత్తం చేస్తున్నారు. -
మహిళ కడుపులో ఐదు కిలోల కణితి
సాక్షి, గజ్వేల్: కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో నుంచి వైద్యుల బృందం 5కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. గురువారం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో దాదాపు 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిపి కణితిని తొలగించారు. ఆర్వీఎం వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్ జిల్లా మండల కేంద్రమైన ఏదులాబాద్ గ్రామానికి చెందిన మండీ లక్ష్మయ్య భార్య సువర్ణ గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇటీవల చికిత్స నిమిత్తం ఆమె ఆర్వీఎం ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆర్వీఎం ఆసుపత్రి వైద్యనిపుణులు ఆమె కడుపులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వైద్య నిపుణులు డాక్టర్.మంజుల, డాక్టర్.స్వాతి, డాక్టర్.కవితలతో పాటు మత్తు డాక్టర్లు రవీందర్, విజయ్, వంశీ ఇతర వైద్య సిబ్బందితో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేశారు. మూడు గంటల పాటు శ్రమించి ఆ మహిళ కడుపులోనుంచి 5 కిలోలకు పైగా బరువుగల పెద్ద కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబీకులు, గ్రామస్తులు ఆర్వీఎం ఆసుపత్రి బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. శస్త్రచికిత్స సఫలం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. రోగి పూర్తిగా కోలుకుంటుందని వైద్యుల బృందం పేర్కొంది. -
హామీలను సీఎం నిలబెట్టుకోవాలి
సాక్షి, మహబూబాబాద్(వరంగల్) : నిజాం కాలంలో నిర్బంధాన్ని చూసిన ప్రజలు అదే తీరును ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మహబూబాబాద్లోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొత్తపోడు కొట్టేదిలేదని, పాతపోడును వదిలేది లేదని స్పష్టంచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల తరువాత విస్మరించడం సరికాదన్నారు. హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న హైదరాబాద్లోని ఇందిరాపార్కులో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అటవీశాఖ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి దాడులకు పాల్పడడం, కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల పాటు సాగులో ఉన్న భూములకు పట్టాలిచ్చి రైతు బంధును వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. పోడు రైతులను అడవి విధ్వంసులుగా చిత్రీకరించడం బాధాకరమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏడు వేల ఎకరాల్లో ఉన్న అటవీని నరికివేశారని, ఆ సమయంలో పర్యావరణ పరిరక్షణ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ హక్కు చట్టం, పలు చట్టాలకు తూట్లు పొడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న బయ్యారం ఎఫ్ఆర్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఎంతో సక్రమంగా జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం ఆర్డినెన్స్ కోసం, తక్షణ అవసరాల కోసం మాత్రమే కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం కలెక్టరేట్లో జేసీ ఎం.డేవిడ్కు సీతక్క వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ భూక్యా మురళీనాయక్, రామగోని రాజుగౌడ్, భద్రునాయక్, ఖలీల్, బానోతు ప్రసాద్, చుక్కల ఉదయ్చందర్, చీమల వెంకటేశ్వర్లు, వి.సారయ్య, ముసలయ్య, కత్తి స్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఒరిగిన బస్సు.. తప్పిన ముప్పు
సాక్షి, కొత్తగూడ(వరంగల్) : డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ నడపడం వల్ల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన సంఘటన మండలంలోని కొత్తపల్లి వాగు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట నుంచి కోనాపూర్ వెళ్లే బస్సు 45 మంది ప్రయాణికులతో వెళ్తోంది. కొత్తపల్లి పెద్దచెరువుకు వెళ్లే వాగు సమీపంలో డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపుతున్నాడు. రోడ్డు నుంచి సరిగా కల్వర్ట్ ఎక్కే సమయంలో బస్సు అదుపుతప్పి ఒక వైపు మొత్తం కల్వర్ కిందకు ఒరిగింది. బస్సు హౌసింగ్, ఒకటైర్ పై బస్సు మొత్తం ఆగింది. బస్సును అదుపు చేసే క్రమంలో హఠాత్తుగా బ్రేక్ వేయడం, బస్సు ఒక వైపు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో పలువురు ప్రమాణికులతోపాటు కండక్టర్ భూక్యా రమకు గాయాలయ్యాయి. ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు తక్కువ వేగంతో వస్తుండడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిని తీరును తెలుసుకున్నారు. కాగా బస్సు కండీషన్ సరిగా లేదని తెలుస్తోంది. ఇదే బస్సు 2016లో వరంగల్ జిల్లా ధర్మారం వద్ద డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఎడమవైపు లాగి ముందు వెళ్లే మోటార్ సైకిల్పైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మరోసారి కొత్తగూడ మండలకేంద్రంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ముందు టైర్ ఊడిపోయింది. ప్రస్తుతం మంగళవారం కొత్తపల్లి వద్ద కూడా బ్రేక్ వేయడంతో ఎడమ వైపునకు లాక్కుపోయింది. దీంతో డ్రైవర్ నిర్లక్ష్యమా, లేక ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో భద్రత తగ్గుతోందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పాత బస్సుల కండీషన్పై, డ్రైవర్ల పనితీరుపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు. చచ్చిపోతామనుకున్నా.. బస్సు ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లింది. ఇక మా పనైపోయింది అనుకున్నాం. ఒకరిపై ఒకరు పడిపోయారు. తేరుకునేసరికి ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయి. డ్రైవర్ చాలా సేపటి నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బస్సు నడిపాడు. సెల్ఫోన్పై ఉన్న సోయి పనిపై లేకపోవడమే ప్రమాదానికి కారణం అయింది. డ్రైవర్లకు డ్యూటీ సమయంలో ఫోన్ ఇవ్వొద్దు. వందలాది మంది ప్రాణాలు ఒక్కడి చేతిలో ఉంటాయి. – విజయ, ప్రయాణికురాలు -
రెవెన్యూ కార్యాలయంలో మహిళా రైతు హల్చల్
సాక్షి, ములుగు: ములుగు మండలం పత్తిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపల్లికి చెందిన మహిళా రైతు కాశిరాజు రమ శనివారం ములుగు రెవెన్యూ కార్యాలయ ఆవరణలో హల్చల్ చేసింది. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బంధువులతో కలిసి చేతిలో కర్ర పట్టుకుని రెవెన్యూ అధికారులను ఉద్దేషిస్తూ అసభ్య పదజాలంతో దుర్భషలాడింది. నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నా తనకు చెందిన భూమికి పట్టా ఇవ్వడం లేదని మండిపడింది. అనంతరం కర్రతో వీఆర్వో తిరుపతితో పాటు ఇతరుల ద్విచక్రవాహనాలను ధ్వంసం చేసింది, గమనించిన రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రెవెన్యూ కార్యాలయాలనికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆమెను బంధువులు తీసుకెళ్లారు. కాగా, ఈ విషయమై పత్తిపల్లి వీఆర్వో తిరుపతిని వివరణ కోరగా మహిళా రైతు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆమె చెబుతున్న సర్వే నెంబర్లో ఆ పేరుతో సెంటుభూమి లేదని, ఆమె తండ్రికి ఎకరం భూమి ఉన్నా అమ్ముకున్నారని పేర్కొన్నారు. -
సిద్దిపేట జిల్లాలో బాలికల కిడ్నాప్కు యత్నం
ములుగు (గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు మండలం మాసాన్పల్లిలో ఇద్దరి బాలికల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మంగళవారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న బాలికలకు చాకెట్లు ఆశ చూపి ఎత్తుకుని పారిపోతున్న కిడ్నాపర్లను గ్రామస్తులు గమనించి దేహశుద్ధి చేసి బాలికలను కాపాడారు. మాసాన్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో మధ్యప్రదేశ్కు చెందిన సందీప్నిహార్, జగదీశ్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న ఒకటవ, రెండవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్లు ఆశ చూపి దగ్గరకు పిలు చుకుని ఎత్తుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో మిగతా పిల్లల అరుపులను గమనించిన గ్రామస్తులు వారిని అడ్డుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం గ్రామస్తులు కిడ్నాపర్లను స్థానిక పోలీసులకు అప్పగించారు. -
‘శ్రీహిత చట్టం’ తీసుకురావాలి
వరంగల్ అర్బన్ : తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జరిగిన హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మహిళాలోకం గళమెత్తింది. ఈ ఘటన నేపథ్యంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు నిరసిస్తూ.. వరంగల్ ప్రెస్క్లబ్లో మహిళా అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మహిళలు, చిన్నారులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఈ సమావేశంలో మహిళా నేతలు డిమాండ్ చేశారు. శ్రీహిత పేరుతో చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘శ్రీహిత చట్టం’ తేవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని పేర్కొన్నారు. వరంగల్ ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నా.. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. షీ టీంలతో యువతులకు ఎక్కడ న్యాయం జరిగిందో చెప్పాలన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకునేందుకు సమయం ఉంటుంది. కానీ వరంగల్ వంటి ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించదని దుయ్యబట్టారు. వరంగల్ వంటి ఘటన ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎక్కడైనా పునరావృతం అయితే నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ర్యాలీ తీసి.. వరంగల్ జిల్లాలో బంద్కు పిలునిస్తామన్నారు. ఇటీవల హన్మకొండలో 9నెలల చిన్నారి శ్రీహితపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం నిఘా ఏర్పాట్లు చేయాలని.. లేకపోక దశల వారిగా ఉద్యమిస్తామని వక్తలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీహిత తల్లిదండ్రులు, కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు ప్రజా సంఘాల మహిళా నేతలు పాల్గున్నారు. -
మన్యంలో ముందే క్లోజ్
సాక్షి,ములుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 11వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికలను సాయంత్రం 4గంటల వరకు మాత్రమే నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. గత అసంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే విధానాన్ని అమలు చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం 64 సమస్యాత్మక, 112 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. దీంతో పాటు జిల్లా సువిశాలంగా ఉండడం, మారుమూల ప్రాంతాలు మండల కేంద్రాలకు సుదూరంగా ఉండడం, అటవీ ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాలు ఉండడంతో ఎక్కడా ఎలాం టి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. గోదావరి తీర ప్రాంతాల్లో.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదా వరి తీర ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ సమయంలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోవాల్సి ఉంటుంది. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గా ల్లో పూర్తిగా, మంథని, భద్రాచలం నియోజకవర్గాల నుంచి పునర్విభజనలో జిల్లాలో కలిసిన కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో నిబంధన అమలు కానుంది. భద్రత, రక్షణ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని అధికారులు, పోలీసు బలగాలను అవసరం ఉన్నంత మేర అందుబాటులో ఉండేలా రాష్ట్ర ఉన్నత అధికారులకు నివేదికను అందించింది. వాటితో అప్రమత్తం .. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని వెంకటాపురం(కె), ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం) మండలాల్లో మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు కలకలం సృష్టించాయి. లోకసభ భూటకపు ఎన్నికలను బహిష్కరించాలని, కేంద్ర పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని కరపత్రాల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం రహదారులు, బ్రిడ్జిలు అందుబాటులోకి రావడంతో ఏ సమయంలోనూ నిర్లక్ష్యం వహించకుండా చీకటిపడే లోపే పోలింగ్ సామగ్రి, ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. భద్రత కట్టుదిట్టం ములుగు జిల్లాలో 302 , భూపాలపల్లిలో 317 పోలింగ్ బూత్లలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. 8 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలలతో పాటు సుమారు 2వేల మంది స్థానిక పోలీసులతో భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే నాలుగు కంపెనీల భద్రత బలగాలు జిల్లాకు చేరాయి. ఒక్కో కంపెనీలో 120 మంది సీఆర్పీఎఫ్ అధికారులు ఉంటారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి పోలీసులు ఉన్నత అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం గ్రామాలకు చేరుకొని కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు కలగకుండా భద్రత ఏర్పాటు.. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తాం. ఇప్పటికే శాఖ తరఫునన తగిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు ఆయా మండలాల పోలీసులు గ్రామాలకు వెళ్లి కార్డెన్ సెర్చ్తో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గత శాసనసభ ఎన్నికల్లో పాటించిన భద్రతా విధానాన్ని అమలు చేస్తాం. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంతంగా ఇంటికి చేరుకునేలా చూస్తాం. – సురేశ్కుమార్, ఓఎస్డీ, ములుగు -
జిల్లాలు.. 33
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భౌగోళిక స్వరూపం మళ్లీ మారుతోంది. మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుపై నెల రోజులుగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించే ప్రక్రియ జరిగింది. బుధవారంతో ఇది ముగిసింది. ప్రాథమిక నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు లేకుండానే ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు పూర్తి కానుంది. ఒకట్రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఈ రెండు జిల్లాలు మనుగడలోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది. 2016, అక్టోబర్ 11న కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటయ్యాయి. తాజాగా రెండు జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుపై డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ భూపాలపల్లి, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రాథమిక నోటిఫికేషన్పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్లు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్పై అభ్యంతరాలు, సూచనలు ఇచ్చే గడువు పూర్తయ్యింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రానట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ కానున్నాయి. మరో నాలుగు మండలాలు... రెండు కొత్త జిల్లాలతోపాటు నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ నెల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో చండూరు, మోప్రా, మేడ్చల్ జిల్లాలో మూడుచింతలపల్లి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేలా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపైనా ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 585 మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం కొత్తగా 125 మండలాలను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు మండలాలతో కలిపి రాష్ట్రంలోని మొత్తం మండలాల సంఖ్య 589కి పెరగనుంది. అలాగే రాష్ట్రంలో మొదట 38 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. జిల్లాల పునర్విభజన సమయంలో వీటి సంఖ్య 69కి పెరిగింది. ఇదిలా ఉండగా... కొత్తగా కోరుట్ల, జోగిపేట, కొల్లాపూర్, ఖానాపూర్ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ములుగు జిల్లా: ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు మండలాలు. ప్రస్తుతం ఇవి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా: దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, కృష్ణ, మద్దూరు, మాగనూరు, మక్తల్, మరికల్, నారాయణపేట, నర్వ, ఊట్కూరు, కోయిల్కొండ మండలాలు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. -
ములుగు, నారాయణపేట జిల్లాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజిస్తూ ఒక రెవెన్యూ డివిజన్, 9 మండలాలతో ములుగు జిల్లా.. మహబూబ్నగర్ జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్, 12 మండలాలు కలుపుతూ నారాయణపేట జిల్లా ఏర్పాటు చేసేలా డిసెంబర్ 31న ఈ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ములుగు, నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనం తరం ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా రెవెన్యూ శాఖతో జరిగిన సమీక్ష సందర్భంగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేటను ఏర్పాటు చేసేలా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ములుగు, వెంకటాపూర్, గోవిందరావ్పేట్, తడ్వాల్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట్, వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో చేర్చారు. నారాయణపేట్ జిల్లాలో ఉన్న మండలాల విషయమై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. జిల్లాల ఏర్పాటు విషయమై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామాల ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి నెలరోజుల్లో భూపాలపల్లి, మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్లకు ఎలాంటి సలహా లు, అభ్యంతరాలైనా తెలియజేయవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే కొత్త జిల్లా ఏర్పాటును గెజిట్లో చేరుస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. అప్పటినుంచి కొత్త జి ల్లాలు ఉనికిలోకి వస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయి తే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి పెరగనుంది. కొత్తగా 4 మండలాలు..: రాష్ట్రంలో కొత్తగా మరో 4 మండలాలు ఏర్పాటయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలాన్ని విభజించి మోస్రా, చందూరు మండలాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటే సిధ్దిపేట రూరల్ మండలాన్ని విభజించి నారాయణరావుపేట మండలం.. మేడ్చల్ జిల్లా పరిధిలో చిన్న మఠంపల్లిని మరో మండలంగా ఏర్పాటు చేసింది. ఇక జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేరుస్తూ ఉత్తర్వులిచ్చింది. -
కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో..
భూపాలపల్లి జిల్లా: తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగాన్ని ప్రజలు ఊడగొడితే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సమ్మక్క సారలమ్మలపై ఓట్టేసి వాగ్దానం చేస్తున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు నియోజకవర్గానికి వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధాటిగా ప్రసంగించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ములుగు నియోజకవర్గంలో మేడారం జాతరపై చిన్న చూపు చూసిన కేసీఆర్కు ఓట్ల కోసం ములుగులో అడుగు పెట్టేందుకు మాత్రం సమయం దొరుకుతుందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం సీతక్క అడవుల నుంచి ప్రజల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రజా తెలంగాణ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గిరిజనులకు, ఇతర బలహీనవర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని అన్నారు. పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో వందల మంది చావుకు కారణమైన టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎంత మందికి న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టి తమాషా చూస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు, మైనార్టీలకు12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మాట తప్పిన కేసీఆర్కు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీలో మోదీ పాలన తెలంగాణ కేడీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజనులపై టీఆర్ఎస్ నాయకులు చేసిన అఘాయిత్యాలను రేవంత్ రెడ్డి వివరిస్తుండగా పక్కనే కాంగ్రెస్ ములుగు అభ్యర్థి సీతక్క కంటతడి పెట్టారు. -
తీవ్ర ఉద్రిక్తత.. భద్రత నడుమ మంత్రి ప్రచారం!
సాక్షి, భూపాలపల్లి : ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా టీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతల బెదడ వీడటం లేదు. ఇప్పటికే పలు నియోజవకవర్గాల్లో టీఆర్ఎస్ తాజా మాజా ఎమ్మెల్యేకు అసమ్మతి నేతల నిరసనలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజవర్గంలో మంత్రి అజ్మీరా చందులాల్కు అసమ్మతి నేతల నుంచి షాక్ ఎదురైంది. ములుగులో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తిరుగుబాటు నేతలు చందులాల్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తన తండ్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కోపంతో చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ తన అనుచరులతో కలిసి అసమ్మతి నేతల వాహానాలను ఆదివారం నాడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడి తీరుకు వ్యతిరేకంగా ప్రచారానికి వచ్చిన చందులాల్కు తిరుగుబాటు నేతల నుంచి అస్మమతి ఎదురైంది. దీంతో ములుగులో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసమ్మతి వర్గం, చందులాల్ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ములుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. పోలీసుల భద్రత నడుమ చందులాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చదవండి : రెచ్చిపోయిన చందూలాల్ వర్గీయులు -
ఫ్యూజ్ మారుస్తుండగా ప్రాణాలే పోయాయ్
సాక్షి, ములుగు రూరల్: ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మార్చుతూ విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. మల్లంపల్లికి చెందిన మోత్కూరి సుధాకర్(43) తన వ్యవసాయ భూమిలో అరటి తోట సాగు నిమిత్తం చేను తడిపేందుకు శుక్రవారం నీరు పారిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ కొట్టేయడంతో మోటార్ ఆగిపోయింది. దీంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ములుగు మొదటి ఎమ్మెల్యే మృతి
సాక్షి, భూపాలపల్లి : ములుగు నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే సూర్యనేని రాజేశ్వర్ రావు మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (ఆదివారం) కన్నుమూశారు. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) పార్టీ తరఫున ములుగు మొట్ట మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 62 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు స్వస్థలం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామం. -
టీడీపీ మరో వికెట్ డౌన్ : రేవంత్ వెంటే సీతక్క
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ములుగు నియోజకవర్గ ఇన్చార్జి సీతక్క ఊహించిన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధులయ్యారు. పార్టీ పదవులు, సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు సీతక్క లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఫ్యాక్స్లో లేఖను బాబుకు పంపారు. అనంతరం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేటి సాయంత్రం రాహుల్ సమక్షంలో : పలువురు టీడీపీ జిల్లా అధ్యక్షలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరతారు. మంగళవారం ఉదయం హుటాహుటిన బయలుదేరిన సీతక్క.. రేవంత్ బృందంతో కలుసుకునే అవకాశంఉంది. ఇంకొందరు ప్రముఖులు! : గిరిజన వర్గానికి చెందిన సీతక్క(ధనసరి అనసూయ) ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీకి ముఖ్యనాయకురాలిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఓడినా, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. తనతోపాటే ఎదిగిన ఎర్రబెల్లి లాంటి నేతలు సైతం గుడ్బై చెప్పి వెళ్లినా ఆమె మాత్రం నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. అయితే, తెలంగాణలో టీడీపీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబోతున్నారన్న వార్తల నడుమ ఆమె ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోక తప్పని పరిస్థితి. ఇంకొందరు ప్రముఖులు కూడా తమతమ దారులు వెతుక్కునే పనిలో ఉన్నట్లు తెలిసింది. జాబితో సీతక్క పేరు లేకున్నా..: రేవంత్ తిరుగుబావుటా అనంతరం అతని వెంట వెళ్లే నాయకుల జాబితాలో సీతక్క పేరు ప్రధానంగా వినిపించింది. కానీ రాహుల్ గాంధీకి రేవంత్ ఇచ్చినట్లుగా పేర్కొంటున్న జాబితాలో సీతక్క పేరులేకపోవడం గమనార్హం. 2014లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీతక్క.. అజ్మీరా చందూలాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత పర్యాటక మంత్రి చందూలాల్ కూడా ఒకప్పటి టీడీపీ నేతే! -
మహిళా రైతు ఆత్మహత్య
ములుగు: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మెరుగు అచాల ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త మూడేళ్ల క్రితమే మృతిచెందడంతో కుటుంబ పోషణ ఈమెపై పడింది. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. -
పైసా వచ్చింది లేదు!
వేల ఎకరాల్లో ఎర్రమట్టి క్వారీలు గ్రామ పంచాయతీలకు దక్కని ప్రయోజనం మైనర్ మినరల్స్గా గుర్తిస్తే ఆదాయం సమకూరే అవకాశం సర్కారు స్పందిస్తే ఉపాధికి ఊతం కోట్లాది రూపాయల విలువైన సహజ సంపదను తన భూగర్భంలో దాచుకున్న గ్రామాల పరిస్థితి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా మారింది. ఉన్న వనరులతో ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన ఆ పంచాయతీలు.. పైసా రాకట లేక కనీస మౌలిక సదుపాయాల్లో అట్టడుగున ఉన్నాయి. ములుగు : ములుగు మండలం మల్లంపల్లి, శ్రీనగర్, రామచంద్రాపురం, కొడిశలకుంట ప్రాంతాలలో వేలాది ఎకరాలలో ఎర్రమట్టి క్వారీలు విస్తరించి ఉన్నాయి. అధికారికంగా 739 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మరో వందలాది హెక్టార్లలో అతి విలువైన విలువైన ఖనిజ సంపద అందుబాటులో ఉంది. సుమారు 31 ఎర్రమట్టి క్వారీలు నడుస్తున్నా యి. ఇక్కడి నుంచి డోలమైట్, బాక్సైట్, లాటరైట్, ఐరన్ ఓర్ వంటి ముడి సరుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర్టతో పాటు ఇతర ప్రాంతాలకు చేరుతోంది. ఇతర రాష్ట్రాల పరిశ్రమలకు ఆదా యం సమకూర్చి పెడుతున్న ఎర్రమట్టి నిల్వలు స్థానికంగా మాత్రం ఎలాంటి లాభాలు ఇవ్వడం లేదు. మల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పలు రకాల పన్నులతో సంవత్సరానికి వచ్చే ఆదాయం వేగంగా పెరుగుతున్నా పట్టణాభివృద్ధికి నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఈ సమయంలో ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మేర అంది నా పట్టణ పురోగతికి దోహదపడుతుందని ప్రజలు సూచిస్తున్నారు. పైగా మైనర్ మినరల్స్గా గుర్తింపు రావడం వల్ల మం డల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ, రాష్ట్రానికీ ఆదాయం వచ్చి చేరుతుంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి ఇక్కడ దొరికే ముడి సరుకు ప్రధానంగా సిమెంట్ తయారీలో ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి స్థానికంగా సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. సిమెంట్ పరిశ్రమల ఏర్పాటు కావలసిన ప్రభుత్వ భూములు జాకారం ప్రాంతంలో ఉన్నాయి. బొగ్గు భూపాలపల్లి సింగరేణిలో అందుబాటులో ఉంది. ప్రధానమైన నీటి వనరు తలాపున ఉన్న గోదావరిపై నిర్మించిన దేవాదుల పైప్లైన్ ద్వారా అందుకోవచ్చు. ఇక సిమెంట్ తరలింపుకు జాతీయ రహదారి 365, 369లకు మల్లంపల్లి కేంద్రంగా ఉంది. ఇటీవల పూర్తయిన ముల్లకట్ట బ్రిడ్జి ద్వారా ఛత్తీస్గఢ్కు రాకపోకలు పెరిగాయి. ప్రభుత్వం చొరవ చూపితేనే.. ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ఈ క్రమంలో ములుగు అభివృద్ధికి పాటుపడి ఉంటామని, ములుగు ఏజెన్సీని అభివృద్ధి చేస్తామని పరోక్షంగా సూచనలు ఇచ్చింది. అయితే మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలను మైనర్ ఇరిగేషన్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తేగలిగితే తద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గ్రామపంచాయతీకి ఉపయోగపడుతుంది. ఇదే విషయమై స్థానిక అధికారులు, గ్రామస్తులు పలు మార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జౌత్సాహికులను ప్రొత్సహించాలి సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలోని ఔత్సాహిక వ్యాపారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టే వ్యాపారులకు ఆశించిన రాయితీలు అందించి ఆహ్వానించాలి. అన్ని సౌకర్యాలు కల్పించి వ్యాపార పరంగా ములుగుకు ప్రత్యేక స్థానం కల్పించాలని యువత కోరుతున్నది. ములుగు అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. మైనర్ మినరల్స్గా గుర్తించాలి మల్లంపల్లితో పాటు రాంచంద్రాపురం, శ్రీనగర్ గ్రామపంచాయతీల పరిధిలో ఎర్రమట్టి క్వారీలు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వం మైనర్ మినలర్స్గా గుర్తించినట్లయితే మూడు గ్రామపంచాయతీలకు తగిన ఆదాయం చేకూరుతుంది. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి మార్గం సుగమం అవుతుంది. – గోల్కొండ రవి, సర్పంచ్ -
ప్రేమ వేధింపులకు డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ములుగు: జయశంకర్ జిల్లా ములుగులో దారుణం చోటు చేసుకుంది. వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమ్య(19) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కాగా.. గత కొన్ని రోజులుగా అమర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అమర్కు ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అమర్ వేధింపులు ఎక్కువకావడంతో రమ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు అంబులెన్స్ సాయంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కదంతొక్కిన ములుగు
ములుగు జిల్లా కోసం ఆందోళనలు అఖిలపక్షం నాయకుల ధర్నా, రాస్తారోకో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జెడ్పీటీసీ సభ్యులు ములుగు : ములుగును జిల్లాగా చేయాల్సిందేనని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ములుగులో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో నియోజకవర్గంలో పలు పార్టీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో పాటు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. మొదట డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి నృత్యాలు, కోలాటాల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సమీపంలో రాస్తారోకోకు దిగారు. బొందల గడ్డ వద్దురా..ములుగు జిల్లా ముద్దురా అంటూ నినాదాలు చేశారు. వేలాది మంది నాయకులు తరలిరావడంతో జాతీయ రహదారి అంతా కిటకిటలాడగా వాహనాలు మళ్లించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్నాయక్ మాట్లాడుతూ తనతో పాటు టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్లీడర్ సకినాల శోభన్, ఏటూరునాగారం, మంగపేట జెడ్పీటీసీ సభ్యులు వలియాబీ, సిద్ధంశెట్టి వైకుంఠం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాకు సిద్ధం ఉన్నారని.. అందరూ రాజీనామా పత్రాలు ఎంపీడీఓకు అందించి ఆమోదించుకోవాలని కోరారు. అక్కడి నుంచి డప్పు కళాకారులు ప్రదర్శనలు, మహిళల కోలాటం నడుమ జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సకినాల శోభన్ మాట్లాడుతూ ములుగు జిల్లా కోసం పార్టీ ప్రజాప్రతనిధులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ప్రాంతం బాగుపడుతుందని మంత్రి చందూలాల్ సీఎం కేసీఆర్ను పలుమార్లు కోరుతూ వచ్చారని అన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వినర్ చింతలపూడి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగు జిల్లాగా ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డు తాత్కాలిక చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ రమణారెడ్డి, రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి,తో పాటు సీపీఐ. టీడీపీ, బీజేపీ వివిధ మండలాల అధ్యక్షులు జంపాల రవీందర్, పల్లె జయపాల్రెడ్డి, బాణాల రాజ్కుమార్, గట్టు మహేందర్, పోరిక హర్జీనాయక్, సూడి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు గుగ్గిళ్ల సాగర్, దొంతి ప్రతాప్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఆడెపు రాజు, గజ్జి నగేష్, లాల్పాషా, యాకుబ్, ఓరుగంటి మొగిలి, కేశెట్టి కుటుంబరావు, అనుముల సురేశ్, చీకుర్తి మధు, కోటేశ్వర్రావు పాల్గొన్నారు. -
ములుగు జాతీయ రహదారిపై ఉద్రిక్తత
వరంగల్: వరంగల్ లోని ములుగు జాతీయ రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ప్రజులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జాతీయరహదారి దిగ్బంధంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టినా వినకపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. లాఠీచార్జ్ లో 100 మందికి పైగా గాయాలు అయినట్టు సమాచారం. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా
ములుగు(వరంగల్): ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం మదనపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఈత కొట్టడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈక్రమంలో నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సాయంతో చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉపాధ్యాయ విధుల్లో చేరిన ‘దేశపతి’
ములుగు: తెలంగాణను సాధించడం తనకు అత్యంత సంతోషానిచ్చిందని ముఖ్యమంత్రి ఓఎస్డీ, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్గా గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలివిడత తెలంగాణ ఉద్యమంలో తాను భాగస్వామినై ప్రజలను విద్యార్థులను చైతన్య పరిచేందుకు ఎంతగానో శ్రమించానన్నారు. పీడిత పాలన అంతమై స్వరాష్ట్రం సిద్దించడం ఆనందంగా ఉందన్నారు. తాను ఎన్నో సభలు సమావేశాలలో మాట్లాడినా, ఎన్నిపదవులు చేపట్టినా ఉపాధ్యాయుడిగా పనిచేయడాన్ని గర్వంగా స్వీకరిస్తానన్నారు. గ్రామాలనుంచి వచ్చిన పిల్లలే ఉస్మానియా యూనివర్సిటిలో ఉద్యమం చేసి తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించారన్నారు. సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం రాష్ట్రం సిద్ధించాక పాఠ్యంశాల తయారీలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. కాగా విధుల్లో చేరేందుకు పాఠశాలకు చేరుకున్న దేశపతి శ్రీనివాస్కు నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొన్యాల బాల్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబితతో పాటు ఉపాధ్యాయులు దేశపతికి స్వీట్లు తినిపించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల కోరిక మేరకు జయశంకర్ పేరిట పాట పాడి అందరిని ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అనిత, నాగేశ్వర్రావు, సోమయ్య, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తరలుతున్న ‘సమాచార’ కార్యాలయం
ములుగు : డివిజన్ కేంద్రంలోని ఒక్కో కార్యాలయం జయశంకర్ జిల్లా కేంద్రం (భూపాలపల్లి)కి తరలుతున్నాయి. మొన్నటివరకు పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఐబీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ డివిజన్ కార్యాలయాల తరలింపునకు అధికారులు పనులు మొదలుపెట్టారు. తాజాగా మండలకేంద్రంలోని డివిజనల్ సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం సైతం తరలిపోనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ములుగు డివిజన్ కేంద్రమైన తర్వాత ఇక్కడి నుంచి డివిజన్కు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సైతం జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి కేటాయించనున్నట్లు తెలిసింది. -
ములుగు జిల్లా చేయాలని టవరెక్కి నిరసన
ములుగు : ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మకంటి రమేశ్, బహుజన సమాజ్వాదీ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బొట్ల ప్రశాంత్ బుధవారం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో గంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్డీఓ వచ్చి సమస్య పరిష్కరించే వరకు దిగేది లేదని పట్టుబడడంతో ఆయన ఫోన్లో మాట్లాడారు. జిల్లాల విషయంలో పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్కు అందించామని, నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత వారు కలెక్టర్తో మాట్లాడేంత వరకు దిగేది లేదని చెప్పడంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఎస్సై దగ్గు మల్లేశ్యాదవ్ అక్కడకి చేరుకుని వారిని కిందికి దిగాలని కోరారు. డిమాండ్లను ఉన్నతాధికారుల ముందు ఉంచుతానని ఎస్సై హామీ ఇవ్వడంతో కిందికి దిగారు. అనంతరం వారిని ఎస్సై స్టేషన్కు తరలించారు. కాగా , టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
కాలేజీ నిర్మాణానికి నిధులు
నిధులు మంజూరు.. త్వరలో అందుబాటులోకి భవనం హర్షం వ్యక్తంచేస్తున్న విద్యార్థులు ములుగు: సుదీర్ఘ కాలం నుంచి రేకుల షెడ్డులకే పరిమితమైన ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇక సొంత భవనం సమకూరనుంది. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 లక్షలు మంజూరు చేసింది. 2001లో ములుగు ఉన్నత పాఠశాలలో షిఫ్ట్ పద్ధతిన కళాశాలను ఏర్పాటుచేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్డుల్లోకి మార్చారు. ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి, ద్వితీయ సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కలుపుకుని మొత్తం 170 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే అరకొర వసతుల మధ్య చదువులు కొనసాగక విద్యార్థులు నానా ఇబ్బందులుపడుతున్నారు. వీరి ఇబ్బందిని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. భవనం తర్వలో అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణంతోపాటు కళాశాల ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మాణాలకు మరో రూ.17 లక్షలు మంజూరయ్యాయి. వసతులు మెరుగుపడుతాయి కళాశాల నూతన భవనంతో విద్యార్థులకు వసతులు మెరుగుపడతాయి. ఇన్నాళ్లు గదుల కొరతతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్లో కళాశాలలో మరిన్ని వసతులు సమకూరుస్తాం. - వెంకటాచారి, కళాశాల ప్రిన్సిపాల్ రేకుల షెడ్డులతో తప్పని ఇబ్బందులు ఇరుకైన రేకుల షెడ్డులతో ఇబ్బందులు పడుతున్నాం. దీనికితోడు ఎండకు ఉక్కపోత, విషపురుగుల సంచారంతో భయంగా ఉంది. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాం. కళాశాల నూతన భవనం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. - రాజు, విద్యార్థి రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం కళాశాల భవన నిర్మాణ పనులు మరో రెండు నెలల్లో పూర్తిచేస్తాం. కాంట్రాక్టర్కు ఇప్పటి వరకు పూర్తిచేసిన పనులకు సంబందించిన బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందకు చర్యలు తీసుకున్నాం. - రామచంద్రం, ఈడబ్ల్యుఐడీసీ ఏఈ -
ములుగును జిల్లా చేయాలని ధర్నా, రాస్తారోకో
ములుగు : ములుగును జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం జా తీయ రహదారిపై వినాయక విగ్రహాలు, ట్రాక్టర్స్, టాటా ఏసీలతో ధర్నా, రాస్తారోకో నిర్వహిం చారు. దీంతో కిలోమీటర్ల మేరా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై సూర్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్బంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్ మాట్లాడుతూ ములుగును జిల్లాగా సాధిం చుకునేంత వరకు ఉద్యమాలను విరమించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏబీ వీపీ నాయకులు నాగపూరి రమేశ్, ఇమ్మడి రాకేశ్, కిష న్, రమేశ్, రఘు,నూనె శ్రీనివాస్లు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ ఆధ్వర్యంలో జాకారం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పల్లె జయపాల్రెడ్డి మాట్లాడుతూ ములుగును జి ల్లా చేయాలని రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టిం చుకోకపోవడం బాధకరమన్నారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ.లాల్పాషా, ముదాం వేణు, నాయకులు వెంకటేశ్వర్లు, తిరుపతి, రఘుపతి, రాజు, రాణాప్రతాప్, పాప య్య, కనకయ్య, శంకర్, రమేశ్, రవిలు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రభు త్వ జూనియర్ కళాశాల ఎదుట సుమారు 500 మంది విద్యార్థులతో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రమేశ్, కిషన్, నరేశ్, రాకేశ్, సాయి, శేశి, దేవేందర్, కిరణ్, మితున్, రవి, ఇంద్రసేనారెడ్డిలు పాల్గొన్నారు. -
‘ములుగు’ కోసం అఖిలపక్షం ధర్నా
మంత్రి, ఎంపీ రాజీనామా చేయాలి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క ములుగు : ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు కాకుంటే మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గత ఎన్నికల ముందు ఓట్లు దండుకునేందుకు ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం బొందలగడ్డ భూపాలపల్లిని జిల్లా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. ఏ అర్హత లేని భూపాలపల్లికి ములుగు ప్రాంతంలో ఉన్న జిల్లా కార్యాలయాలను తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో భాగమై ఉన్న హన్మకొండను జిల్లా చేయడం కూడా రాజకీయ లబ్ధికోసమేనని అన్నారు. ధర్నా, రాస్తారోకోకు కళాశాల విద్యార్థులు మద్దతు తెలిపారు. మానవహారంగా ఏర్పడి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై ముప్పిడి సూర్యనారాయణ అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్కుమార్, అఖిలపక్షం అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకుడు గూబ రాజు, నాయకులు ముసినేపల్లి కుమార్, చింతనిప్పుల బిక్షపతి, కోయిల రాంబాబు, బొమ్మకంటి రమేశ్, అచ్చునూరి కిషన్, యూనుస్, దూడబోయిన శ్రీనివాస్, మహేందర్, రాజునాయక్, ఉమాచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ములుగు బంద్ సంపూర్ణం
ములుగు : ములుగులోని డివిజన్ కార్యాలయాలను భూపాలపల్లికి తరలించే ప్రయత్నాలు మానుకోవాలని, సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులతోపాటు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. అఖిలపక్ష నాయకులు జాతీయరహదారిపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. అనంతరం గేదెకు వినతిపత్రం అందించారు. రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచాయి. ఎస్సై మల్లేశ్యాదవ్ సిబ్బందితో చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం అధ్యక్షుడు నల్లెల్ల కుమార్, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్ మాట్లాడారు. ఓవైపు ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సేకరణ కొనసాగుతుండగానే కొన్నేళ్లుగా ములుగులో ఉన్న డివిజన్ కార్యాలయాలను భూపాలపల్లికి తరలించడం సరికాదన్నారు. ములుగు ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేని మంత్రి చందూలాల్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిత్యం పలు రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో వెంకటాపురం జడ్పీటీసీ సభ్యురాలు బానోతు విజయ, ఎంపీపీ దేవరనేని స్వామిరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్కుమార్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి భాస్కర్రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అ««దl్యక్షుడు వేముల బిక్షపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు బాణాల రాజు, జిల్లా సాధన సమితి ప్రధానకార్యదర్శి నూనె శ్రీనివాస్, నాయకులు ఎండి.యూనుస్, కోగిల రాంబాబు, దూడబోయిన శ్రీనివాస్, మహేందర్, సిరికొండ బలరాం, రవీంద్రాచారి పాల్గొన్నారు. -
ములుగులో గిరిజన వర్సిటీ
మూడు ప్రదేశాలపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి వరంగల్ అధికారుల నివేదిక సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ ఏడాది జనవరిలో వరంగల్ జిల్లా పర్యటకు వచ్చినప్పుడు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేశారు. వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని సైతం ఈ జిల్లాలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం అనువైన ప్రదేశంపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ వరంగల్ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు పలు స్థలాలను గుర్తించారు. గిరిజన సంక్షేమ మంత్రి ఆజ్మీరా చందులాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని ములుగు మండలంలో మూడు ప్రదేశాలు అనువైనవిగా అధికారులు ప్రతిపాదించారు. వరంగల్ జిల్లా కేంద్రానికి 50 కిలో మీటర్ల పరిధిలోనే ఈ మూడు స్థలాలు ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు మండలం మాధవరావుపల్లిలో 160 ఎకరాల ప్రభుత్వ భూమిని, రాంచంద్రపురం శివారులో అటవీ శాఖకు చెందిన 550 ఎకరాలు, జాకారం పరిధిలోని అటవీ శాఖకు చెందిన 150 ఎకరాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. మూడు ప్రదేశాల వివరాలు పంపాం సీహెచ్.మహేందర్జీ, ములుగు ఆర్డీవో గిరిజన విశ్వవిద్యాలం ఏర్పాటు కోసం మూడు చోట్ల స్థలాలను పరిశీలించాము. ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ఎక్కడ ఏర్పాటు చేసే విషయంపై ప్రభుత్వం నిర్ణయిస్తుంది. -
10 లక్షల మొక్కలు నాటుతాం
రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ములుగు: హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మార్కెట్, సబ్ మార్కెట్ యార్డుల్లో 10 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి అన్నారు. ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ యార్డులో శనివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వంటిమామిడిలో రూ.8.5 కోట్లతో కోల్డ్స్టోరేజ్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 330 గోదాముల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని, వీటి నిర్మాణాలకు రూ. వెయ్యి 24 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉధ్యానవన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ శాఖ జేడీ రవికుమార్, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, డైరెక్టర్లు కరుణాకర్రెడ్డి, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం సామాజిక కార్యక్రమం
అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ములుగు : హరితహారం అనేది కేవలం ప్రభు త్వ కార్యక్రమమే కాదని, ప్రజలు మెచ్చిన సామాజిక ఉద్యమమని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ములుగులో రూ.80 లక్షలతో నిర్మించిన బీసీ సంక్షేమ హాస్టల్ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గమనించిన సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో రూపొందించారని అన్నారు. మంగళవారం వరకు రాష్ట్రంలో 11.40 కోట్ల మొక్కలు నాటామని, రాష్ట్ర వ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటి తీరుతామని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ నాటిన మొక్క ల్లో 50 శాతానికి పైగా కాపాడుకుంటే ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ చార్జీలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అటవీశాఖ ఫ్లయిం గ్ స్క్వాడ్ డీఎఫ్ఓ కేశరాం, జనెటిస్ట్ డీఎఫ్ఓ ముకుందరావు, ఎఫ్ఆర్వో నాగేశ్వర్రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.వి. ప్రసాదరావు, ఎంపీపీ భూక్య మంజుల, ఎంపీడీఓ విజయ్స్వరూప్, బీసీ సంక్షేమ శాఖ డీడీ నర్సింహరావు పాల్గొన్నారు. కేసీఆర్ మానసపుత్రిక .. వెంకటాపురం : హారితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆయన వెంకటాపురం మండల కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రి చందూలాల్తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని, ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు, నియోజకవర్గ పరిధిలో 40లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ భీమానాయక్, ము లుగు రేంజ్ ఆఫీసర్ నాగేశ్వర్రావు, డీఆర్ఓ నరేందర్, తహసీల్దార్ హన్మంతరావు, ఎంపీడీఓ బాలకృష్ణ పాల్గొన్నారు. -
వరంగల్లో రాజకీయ పక్షాల ర్యాలీ... ఉద్రిక్తత
వరంగల్: ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో వివిధ రాజకీయ పక్షాలు చేపట్టిన ర్యాలీ గురువారం ఉద్రిక్తతకు దారితీసింది. ములుగు నుంచి వివిధ రాజకీయపక్షాల నాయకులు కలసి వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. వారి ర్యాలీని వరంగల్ ఏకశిలా పార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ క్రమంలో రాజకీయ పక్షాల నేతలు, పోలీసుల వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. -
రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
-
రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
ములుగు (మెదక్ జిల్లా) : ములుగు స్టేజి సమీపంలో రాజీవ్ రహదారిపై ముందు వెళ్తున్న ఆటోను క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో శంకర్ గౌడ్(38), రేణుక(30) అనే దంపతులతో పాటు మధు(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ములుగులో పోస్టర్ కలకలం
ములుగు: వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపూర్లో మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపింది. కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో బుధవారం రాత్రి ఈ పోస్టర్ వెలిసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బిల్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో మంత్రి చందూలాల్, టీఆర్ఎస్ నేత రమేష్రెడ్డి విఫలమయ్యారని అందులో ప్రధానంగా ఆరోపించారు. బతుకులు బాగు పడతాయని ఆశపడిన గిరిజనులకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. శృతి, విద్యాసాగర్ల ఎన్కౌంటర్ బూటకమని తెలిపారు. వారిని పోలీసులే పట్టుకుని చంపేశారని ఆరోపించారు. నక్సలైట్ల ఎజెండా తమదంటున్న ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. ప్రజల చేతుల్లో ప్రభుత్వానికి శిక్ష తప్పదని అన్నారు. కాగా, ఎన్కౌంటర్ జరిగిన మూడు నెలలకు ఈ విధంగా పోస్టర్ రావటంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం విషయం తెలిసిన పోలీసులు పోస్టర్ను తొలగించారని సమాచారం. -
తృటిలో తప్పించుకున్న మావోయిస్టులు
వరంగల్: వరంగల్ జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అప్రమత్తమన మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే ...పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల్లో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలు ఇన్నోవాను అటకాయించారు. దీంతో వాహనాన్ని వదిలేసిన మావోయిస్టులు, అక్కడినుంచి తప్పించుకుని పారిపోయారు. ఏటూరు నాగారం వైపు వారు పారిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. -
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు
ములుగు: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ములుగు మండలం నర్సాపూర్ మీదుగా సికింద్రాబాద్కు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును బుధవారం మంత్రి ఈటెల, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందూ ప్రజలకిచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తప్పకుండా నెరవేరుస్తారన్నారు. దసరా పండుగ నుంచి సీఎం కొత్త పథకాలకు శ్రీకారం చుడతారన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సీఎం, మంత్రుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జెడ్పీటీసీ సత్తయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూంరెడ్డి, మున్సిపల్ చెర్మైన్ భాస్కర్, రాష్ట్ర నాయకులు ఎలక్షన్రెడ్డి, సర్పంచ్ మల్లేష్యాదవ్, సహకార సంఘం చెర్మైన్ పోషిరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు జహంగీర్, ఉపాధ్యక్షుడు అర్జున్గౌడ్, అయిలయ్య, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాస్ శ్రీనివాస్,నాయకులు దేవేందర్రెడ్డి, బాపురెడ్డి, భాస్కర్రెడ్డి, గణేష్, భూపాల్రెడ్డి, కాంతారెడ్డి పాల్గొన్నారు. -
రుణమాఫీ వర్తించదు
ములుగు: రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాక అయోమయం చెందుతున్న రైతులకు బ్యాంకర్లు విడుగులాంటి వార్త చెవిన వేశారు. కేవలం పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడంతో రైతులంతా బ్యాంకర్లతో వాగ్వాదానికి దిగారు. బుధవారం ములుగు మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ములుగు గ్రామ పంచాయతీ వద్ద స్థానిక భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ వందన, నెట్ వర్క్-1 జనరల్ మేనేజర్ కన్సల్తో కలిసి రుణాలు తీసుకున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్సల్ మాట్లాడుతూ, పంట రుణాలు తీసుకున్న రైతులు రెన్యువల్ చేసుకుంటేనే రుణ మాఫీ వర్తిస్తోందని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందారు. మాఫీ వర్తించదంటూ అధికారి చేసిన వ్యాఖ్యపై మండిపడ్డారు. రెన్యువల్ చేసిన తర్వాత రుణాలు ఎలా మాఫీ అవుతాయంటూ బ్యాంక్ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను చుట్టుముట్టి నిరసనకు దిగారు. ఇంతలో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు అంజిరెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని గొడవకు దారితీసిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంటుండగా, రైతులు రుణాలు ఎందుకు రెన్యువల్ చేస్తారంటూ వారు బ్యాంకు జీఎంను ప్రశ్నించారు. రైతులు పంట రుణాలు రెన్యువల్ చేయబోరంటూ బ్యాంకు అధికారితో స్పష్టం చేశారు. దీంతో బ్యాంకు అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. రికవరీ క్యాంపును అడ్డుకున్న గ్రామస్తులు కౌడిపల్లి: రికవరీ క్యాంపుల ద్వారావ్యవసాయ రుణాలను వసూలు చేసేందుకు మండలంలోని వెల్మకన్న గ్రామానికి వెళ్లిన బ్యాంక్ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. స్థానిక ఎస్బీఐ అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ బాబు, బిజినెస్ కరస్పాండెంట్ విఠల్, ఆంజనేయులు బుధవారం వెల్మకన్నల్లో గ్రామస్తులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రికవరీ చేపట్టాలని భావించారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు బ్యాంకర్లు సమావేశం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఓవైపు రుణమాఫీ చేస్తుండగా, రికవరీ పేరుతో గ్రామాల్లోకి ఎందుకువచ్చారంటూ అధికారులను నిలదీశారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుదిరిగి వెళ్లారు. -
హిమాచల్ విషాదాన్ని ముందే ఊహించారా..?
-
గ్రహం.. ఆగ్రహం..
-
పలకరించేందుకు వెళ్లి.. పరలోకానికి
చిన్నకోడూరు/సిద్దిపేట రూరల్, న్యూస్లైన్: రాజీవ్ రహదారిపై ములుగు సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, అందులో ముగ్గురు జిల్లా వాసులున్నారు. దీంతో మృతుల స్వగ్రామాలైన చిన్నకోడూరు మండలం రామంచ, గంగాపూర్, సిద్దిపేట మండలం పెద్దలింగారెడ్డిపల్లిల్లో విషాదం నెలకొంది. మూడు కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. ఆస్పత్రిలో ఉన్న రక్త సంబంధీకురాలిని పరామర్శించి ఆమెను మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్కు తరలిస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో వీరంతా మృత్యువాతపడ్డారు. మృతుల్లో రామంచ గ్రామానికి చెందిన రాధారం లక్ష్మి(45), గంగాపూర్వాసి దరిపల్లి స్వామి(22), పెద్దలింగారెడ్డిపల్లి వాస్తవ్యుడైన కారు డ్రైవర్ పడిగె శ్రీనివాస్(25)లు ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు ... పెద్దమ్మను పరామర్శించేందుకు వెళ్లు బిడ్డా అని సాగనంపిన తల్లి...తన ఒక్కగానొక్క కుమారుడి మరణ వార్త విని గుండెలవిసేలా రోదించింది. నాగవ్వ, నారాయణలకు కుమారుడు దరిపల్లి స్వామి, సిద్దిపేటలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బుధవారం అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్దమ్మను పలకరించేందుకు వెళ్లి అర్ధాంతరంగా తనువు చాలించాడు. చేతికంది వచ్చిన కుమారుడు ఇక లేడనే నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు . దేవుడా ఎంత పన్జేస్తివి.. అక్కను చూసి వస్తానని చెప్పిన సిద్దిపేట వెళ్లిన రాధారం లక్ష్మిని రోడ్డుప్రమాదం కబలించడంతో ఆమె భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు, కూతురు బోరున విలపించారు. తల్లి ఇక శాశ్వతంగా రాదనే తెలియడంతో పిల్లలిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో..దేవుడా ఎంత పన్జేస్తివి..అంటూ వాళ్లు విలపిస్తున్న సన్నివేశాలు చూపరులను సైతం కంటతడి పెట్టించాయి. కూలీ కుటుంబానికి షాక్.. పడిగె బాగవ్వ, సత్తయ్య దంపతులకు కుమారుడు శ్రీనివాస్. టెన్త్ వరకు చదివిన అతడు కూలీలైన తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలన్న తపనతో కారు డ్రైవరుగా పని చేస్తుండేవాడు. సిద్దిపేట నుంచి హైదరాబాద్కు కిరాయి రావడంతో ఇంట్లో చెప్పి బయల్దేరాడు. మరో గంటైతే గాంధీ ఆస్పత్రికి చేరే లోగానే కారు ప్రమాదానికి గురైంది. దీంతో శ్రీనివాస్ సంఘటనా స్థలంలోనే ఊపిరి విడిచాడు. చెట్టంత కుమారుడు అకాల మరణం చెందడంతో కన్నవారు, తోబుట్టువుల రోదనలు మిన్నంటాయి. వారని సముదాయించడం ఎవరి తరమూ కాలేదు.