raghunandan rao
-
ఇదేం వివక్ష?.. తిరుమలకే వచ్చి తాడో పేడో తేల్చుకుంటాం
తిరుపతి, సాక్షి: సిఫార్సు లేఖల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఆయన.. లెటర్ల అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో టీటీడీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులందరి సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించేవాళ్లు. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వివక్ష బాధాకరం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలక మండలి కూడా అందుకు అంగీకరించింది. అయితే.. స్వయంగా సీఎం ఆదేశించినా.. అధికారులు మాత్రం అమలు చేయడం లేదు.. ఎందుకు?. తెలంగాణ ప్రజాపతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, గదుల సౌకర్యం కల్పించాలి. ఈ వివక్షపై టీటీడీ పునరాలోచించాలి. ఈ విషయమై పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించాలి. వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం. అనుమతించకపోతే ఎమ్మెల్యేలంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం. పార్టీలకతీతంగా నేను ఇది చెబుతున్నా’’ అని హెచ్చరించారాయన. -
ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎప్ఐఆర్ నమోదైంది. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. రఘునందన్ రావు ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
SLBC దగ్గరకు వెళ్లేందుకు సీఎంకు సమయం లేదా : రఘునందన్ రావు
-
‘SLBC దగ్గరకు వెళ్లేందుకు సీఎంకు టైం లేదు’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడకు వెళ్లే టైం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రఘునందన్ రావు.. గత ఎనిమిది రోజులుగా సీఎం రేవంత్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సందర్భించే తీరిక లేదన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.. రేవంత్ ఒకవేళ కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు. పేరుకే పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు. సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ గా ఉన్న మహేస్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నా. జీహెచ్ఎంసీలో ఒక అధికారికి ఐదేళ్లుగా డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారు. ఇక మున్సిపల్ పాలనపై సీఎం రేవంత్ కు పట్టులేదు. మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు. గద్వాల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో తన ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కిషన్ రెడ్డి సౌమ్యుడు.. ఆయన గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేసుకోలేని పరిస్థితి రేవంత్ది‘త్రిభాషా సిద్ధాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారు. 90 శాతం జనాలకు ఉర్దూ రాకపోయినా ఎందుకు బోర్డులపై రాస్తున్నారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ అనుమతి తీసుకొని రేవంత్ తెలుగులో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ లో ఏ భాషలో మాట్లాడతారు. వ్యక్తిగత విమర్శలపై మేం మాట్లాడగలం . సిద్ధాంతం మీద, ప్రజా సమస్యలపై చర్చకు సిద్దం. వేదిక, సమయం చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నా. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది.. ఇక్కడ కేంద్రానికి ఏం సంబంధం.. రేవంత్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం మరిచిపోయినట్లున్నారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నారు’ అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు. -
కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. ఉచితాలతో అధికారం రాదు
-
జీహెచ్ఎంసీకి ఎంపీ వార్నింగ్..కారణమిదే..
సాక్షి,సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాను మరో జవహర్నగర్గా మార్చాలని చూస్తున్నారని,శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్లో రోజుకు వంద లారీల చెత్త పోసేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. ఈ మేరకు రఘునందన్రావు బుధవారం(ఫిబ్రవరి5) మీడియాతో మాట్లాడారు.‘చెత్త పోసే వ్యవహారాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. పటాన్ చెరువు ప్రాంతం ఇప్పటికే కంపెనీలతో కలుషితం అయింది.2015లో అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నలవల్లిలో చెత్త శుద్ధి పనులు ఆపకపోతే అధికారులకు భౌతిక దాడులు తప్పవు.పట్నం చెత్తను పల్లెలో వేస్తామంటే ఊరుకోం. అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలి. పచ్చని అడవుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదు. దీన్ని ఉపసంహరించుకోకుంటే ప్రత్యక్ష నిరసనకు దిగుతాం.పోలీసులతో ప్రజలను భయపెట్టి పనులు చేపట్టడం సరికాదు.చెత్తకు హైదరాబాద్,రంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డి మీద పడ్డారా’అని రఘునందన్రావు నిలదీశారు. -
మధ్యవర్తిత్వంతో తక్కువ ఖర్చు.. సత్వర న్యాయం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): న్యాయవాదులు మధ్యవర్తిత్వ పద్ధతులపై మెళకువలు పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు. మధ్యవర్తిత్వం మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యాయవాదులు ఎక్కువ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీ న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యాన గుంటూరు మెడికల్ కళాశాలలో శనివారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సును ప్రారంభించిన జస్టిస్ రవినాథ్ తిల్హరి మాట్లాడుతూ పెరిగిపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి అవకాశమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు. వ్యాపార, కుటుంబ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇరుపక్షాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. మధ్యవర్తిత్వంపై నెలకొన్న అపోహలు వీడాలని, ఈ విధానాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళితే న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం: జస్టిస్ రావు రఘునందన్రావు సదస్సు ముగింపు సెషన్లో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్ జస్టిస్ రావు రఘునందన్రావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ప్రత్యేక చట్టం చేశారని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం నిర్వహించే వెసులుబాటు ఉందని చెప్పారు. ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ఇటీవల వస్తున్న మార్పులు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.ఇప్పటి వరకు అన్ని బార్ అసోసియేషన్లలో, జిల్లా, మండల, హైకోర్టు స్థాయిల్లో నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్.అమర రంగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి, సీనియర్ ట్రైనర్స్ రత్నతార, అరుణాచలం పాల్గొన్నారు. -
కవితకు ఎంపీ రఘునందన్ కౌంటర్
సాక్షి, సంగారెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న కవిత వ్యాఖ్యలకు కౌంటిరచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను డాక్టర్కు చూపించాలి అంటూ కామెంట్స్ చేశారు.సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్కి రైతులు గుర్తుకు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. చెల్లె ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. మంచి డాక్టర్కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంబేద్కర్కి అవమానం జరిగింది. కాంగ్రెస్ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్ని గౌరవించలేదు. కేవలం అంబేద్కర్ జయంతి, వర్థంతి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 1950లో నామినేటెడ్ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. గాంధీ, నెహ్రూ కుటుంబాల్లో ఐదు తరాలు రాజ్యాంగాన్ని అవమానించారు. ఆనాడు ప్రధాని మన్మోహన్ను కాదని యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుని రాజ్యాంగాన్ని లెక్కచేయలేదు.ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వస్తారు. ఆనాడు అధికారంలో ఉన్న బీసీలను, పార్టీ అధ్యక్షులుగా ఉన్న దళితులను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే. హస్తం పార్టీకి అధికారం ఉంటే ఒకలా ఉంటుంది.. లేకపోతే మరోలా మాట్లాడతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
‘అల్లు అర్జున్ను ఆరోజు ఎందుకు అడ్డుకోలేదు?’
హైదరాబాద్, సాక్షి: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్(Allu Arjun) విచారణ వేళ.. మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారాయన. సాక్షితో ఆయన మాట్లాడుతూ..‘‘రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా.. పెద్దలైనా వారికి మేం అండగా ఉంటాం. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ చేసేది ముమ్మాటికీ రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్తుతో(ఎంఐఎం అక్బరుద్దీన్ను ఉద్దేశించి..) ప్రశ్న అడిగించుకోని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అలాంటప్పుడు.. మొదటి రోజే ఎందుకు కాంగ్రెస్ (Congress party) నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు?..ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటన జరిగింది. అసలు అనుమతి లేదన్నప్పుడు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి ఎందుకు బయటకు రానిచ్చారు. ఇంటి వద్దే ఆయన్ని బారికేడ్లు వేసి ఎందుకు అడ్డుకోలేదు?. థియేటర్ వద్ద యూనిఫాం లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా!. సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి హీరో వెహికిల్ ను టోయింగ్ ఎందుకు చేయలేదు?. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్తో వచ్చిన బద్నాంను తప్పించుకునేందుకే ఇంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కక్ష గట్టి సాధిస్తోంది ’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే బీజేపీ అల్లు అర్జున్కు అండగా ఉంటుందని ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇంతకు ముందే ప్రకటించారు. అంబేద్కర్ ఇష్యూపై..కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును తీసే అర్హత లేదని రఘునందన్ చెబుతున్నారు. ‘‘తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి కనీసం దండ వేయలేదు రేవంత్ ప్రభుత్వం. అంతపెద్ద విగ్రహానికి గేటుకు తాళం వేసిన రోజే కాంగ్రెస్ చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వలేదు కాంగ్రెస్. అంబేద్కర్ ను అన్ని రకాలుగా కాంగ్రెస్సే అవమానించింది. హాస్టళ్లలో ఫుడ్ తిని విద్యార్థులు చనిపోతున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు అని రఘునందన్ మండిపడ్డారు. -
మిగతా కేసులతో పోలిస్తే ఈ కేసు చాలా చిన్నది
-
ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదయిన సందర్భంలో అన్ని వర్గాల్లోనూ చర్చ చాలా లోతుగానే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ ఆకాంక్ష లకు అనుగుణంగా లేదని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. తెలంగాణ కోసమే ఒక రాజకీయ పార్టీ స్థాపించి, తెలంగాణ పేరుతో ప్రతినిత్యం తన రాజకీయం నడిపించిన కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు శాశ్వతంగా పట్టం కట్టలేదనీ, కట్టరనీ ఏడాది క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్కు పట్టం కట్టిన ప్రజలు 2019 ఎన్నికలలోపే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వచ్చారు. ఇది కనిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలతో (2019) పాటు అసెంబ్లీ ఎన్ని కలు జరిగితే మోదీ సునామీలో అధికారం కోల్పోవడం ఖాయం అని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అందుకే ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తనదైన టక్కు టమార విద్యలతో 2018 లోనే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే అదే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది. రెండవ దఫా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళనుంచి తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తెలంగాణలో అనుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఈ వ్యతిరేకత చూపించడానికి తొలి వేదిక అయ్యింది. సొంత జిల్లా సిద్దిపేటలో అటు గజ్వేల్, ఇటు సిరిసిల్లకు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తరఫున నిల బడిన నన్ను గెలిపించడం దీనికి నిదర్శనం.ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు... ఏడాది కాలంగా సరిగ్గా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నది. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన మేనిఫెస్టోలో 42 పేజీలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి ఏడాది కూడా గడవక ముందే తెలంగాణలో కొత్త సర్కారుపై తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతలు మొదలయ్యాయి.కేసీఆర్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో అలవి కాని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కి... ఇప్పుడు ప్రజలపై స్వారీ చేస్తోంది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలలో నెర వేర్చినవి కూడా అరకొరగా మాత్రమే ఉండటం గమ నార్హం. ప్రజలకు అవసరం లేని... పేర్లలో మార్పు, విగ్రహాలలో మార్పు చేయడం మాత్రమే ప్రజా పాలనకు నిదర్శనమా? తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల మన సుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం మార్పు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? నిజానికి తల్లి... దేవతతో సమానం. అట్లాంటి తెలంగాణ తల్లిని దేవత రూపంలో ఉండకూడదని కాంగ్రెస్ సర్కార్ అనుకోవడమే వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్పు చేసిన విగ్రహం కూడా తెలంగాణలో బలిదానాలకు మూల కారణమైన సోనియా గాంధీ పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం తెలంగాణ ఆత్మగౌరవ వంచనగా భావించాల్సిందే. ‘అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం’ అని ప్రమాణ పత్రంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ... కేవలం ‘పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు’ల్లో మాత్రమే ఆడపడుచులు ప్రయాణించడానికి అర్హులని అవమా నిస్తోంది. ఇలా ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.చదవండి: వ్యవసాయాన్ని పండుగ చేశాం!అత్తాకోడళ్ళతో సహా కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తానన్న నెలకు రూ. 2,500 ఎక్కడకు పోయినాయి? వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని... ఇప్పుడు కేవలం కొన్ని రకాల సన్న ధాన్యాలకు ఇస్తా మని చెప్పడం మోసం చేయడం కాదా? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి, తర్వాత ‘షరతులు వర్తిస్తాయ’ని కార్పొరేట్ తరహా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ‘రైతు భరోసా’ పెంచి కౌలు రైతులకు కూడా 15 వేల రూపా యలు ఇస్తామని ముఖం చాటేసిన గొప్ప సర్కారు ఇది. అందుకే మేనిఫెస్టోలో ఉన్న 42 పేజీలపై ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. వారు అమలు చేశామని చెప్పుకుంటున్న హామీలపై కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరన్న విషయాన్ని రుజువు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఎన్నికల వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేయకుండా నిలిచే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. తిరుగుబాటు సహజ గుణంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది కొత్త కూడా కాకపోవచ్చు.- రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు -
జన్వాడ మందు పార్టీ సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: ఎంపీ రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ బీఆర్ఎస్ను నమ్మరు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. అలాగే, దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ ఎంపీ రఘునందన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని అంటున్నారు. ఆయన తప్పుకుంటే వద్దు అనే వాళ్లు ఎవరూ లేరు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు?. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరు. కేసీఆర్ పది నెలలుగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఏమైనా నష్టం జరిగిందా?. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం మాత్రమే. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు.కేటీఆర్కు ఎవరి మీదా నమ్మకం లేదు. చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేదు. జన్వాడ ఫామ్హౌస్ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ను బయటపెట్టాలి. అప్పుడే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా?. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ మంత్రి పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు’ అంటూ సెటైర్లు వేశారు. -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
పొంగులేటికి రఘునందన్ స్ట్రాంగ్ కౌంటర్
-
నిధులు కేంద్రానివి.. పేరు ఇందిరమ్మదా?: రఘునందన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేసీఅర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. అలాగే, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. బీఆర్ఎస్కు ప్రజలు సీఆర్ఎస్ (రిటైర్ మెంట్)ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తాం. ఆరు నెలల కింద కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12వందల కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.సొమ్ము కేంద్రానిది అయితే ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇందిరమ్మ కమిటీలు ఇళ్ళ లబ్దిదారులను ఎంపిక చేస్తే అడ్డుకుంటాం. ఇందిరమ్మ కమిటీలకు ఒక విధానం లేదు. గతంలో సిరిసిల్ల, సిద్దిపేటను సుడా చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ను కుడా చేసుకున్నారు. గ్రామ సభలు పెట్టీ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలి తప్పితే.. ఇందిరమ్మ కమిటీల ద్వారా కాదు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ భాగస్వామ్యం లేదు. ఇందిరమ్మ కమిటీలు చెల్లుబాటు కాదు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
కొండా సురేఖ,రఘునందన్ ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వివాదాస్పద ఫొటోలను మార్పింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా కోనాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న,జగిత్యాల రాయకల్కు చెందిన వ్యాపారవేత్త మహేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కొండా సురేఖపై ట్రోలింగ్.. రఘునందన్ సీరియస్
మెదక్, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీఆర్ఎస్కు మొదటి నుంచి మహిళల మీద గౌరవం లేదు. అందుకే.. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. తల్లీ, అక్కాచెల్లి మధ్య ఉండే సంబంధం గురించి సోషల్ మీడియాలో సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. ఇంతకు ముందు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నూలు పోగు దండను వేశా. .. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కూడా కప్పారు. కానీ, ఆ పార్టీకి చెందిన వాళ్లు ఇంత సంస్కారహీనంగా.. సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు... అసలు బీఆర్ఎస్కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా?. పోస్టు పెట్టిన అకౌంట్లో డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావులు ఈ వ్యవహారంపై స్పందించి క్షమాపణలు చెప్పాలి. తమ సోషల్ మీడియా విభాగాలను కంట్రోల్ చేసుకోవాలి. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే తీవ్రంగా పరిగణించండి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు కదా.. అలాగైనా పోలీసు కంప్లయింట్ ఇవ్వండి... నా వల్ల మా అక్కకు(కొండా సురేఖ) కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా’’ అని రఘునందన్ హెచ్చరించారు. -
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. కొండా సురేఖ కంటతడి
హైదరాబాద్, సాక్షి: మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ దండ వ్యవహారంపై నడుస్తున్న ట్రోలింగ్పై ఎంపీ రఘునందన్రావు తనకు క్షమాపణలు చెప్పారని కొండా రేఖ అన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోంది బీఆర్ఎస్సేనని ఆమె మండిపడ్డారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు.‘‘ఇంచార్జీ మినిస్టర్గా మెదక్ పర్యటనకు వెళ్లా. అక్కడి ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి.. గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది. కానీ, కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అంటూ కేటీఆర్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారామె.రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్లో భారీ మార్పులు వచ్చాయి. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు.‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..ఈ విషయం తెలిసి.. రఘునందన్ ఫోన్ చేశారు. అక్కా.. క్షమించు కాళ్లు మొక్కుతా అన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా నన్ను అక్కా అని.. నా భర్తను బావా అని పిలుస్తారు.అలాంటిది మానసిక వేదనతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏదో ఒకరోజు ప్రజలూ తిరగబడుతారు అని కొండా సురేఖ హెచ్చరించారు.ఇక.. సహచర మంత్రి కొండా సురేఖకు మరో మంత్రి సీతక్క బాసటగా నిలిచారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆమె హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని వ్యాఖ్యానించిన దుర్మార్గులున్న పార్టీ బీఆర్ఎస్. నా సోదరమైన మంత్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.‘‘మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. సీఎం కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీలకంగా పనిచేసే వాళ్లను లక్క్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారు. వాళ్లేం చేశారో.. దేశం మొత్తానికి తెలుసు. అయినా సభ్యత కాదనే మేం నోళ్లు విప్పడం లేదు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు. మల్లి దోరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మేయర్ విజయ లక్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకుని బుద్ది తెచ్చుకోండి.తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ సోషల్ మీడియా విభాగాలను కట్టడి చేయాలి అని సీతక్క హెచ్చరించారు. -
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
ఫస్ట్ KTR ని అరెస్ట్ చేయాలి..
-
సోనియా నివాసానికి రఘునందన్.. కారణం ఇదే..
సాక్షి, ఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనియా గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేరుకుని బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్లిట్జ్ పత్రిక ఇచ్చిన కథనాలను సోనియా ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీకి చూపించి లోపలికి వెళ్లారు. అనంతరం.. సోనియా, రాహుల్ బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. -
పార్టీలే వేరు.. ఆలోచనా విధానం ఒక్కటే
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్ఎస్ లు.. పార్టీలే వేరు కానీ, నేతల ఆలోచనా విధానం మాత్రం ఒక్కటే అని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. రాష్ట్రంలో జెండాలు మారాయి తప్ప విధానాలు మార లేదంటూ సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ల తీరుపై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్పై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లా డారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26 వేల కోట్లు, గ్రాంట్స్ కింద రూ.21 వేల కోట్లపైన చూపించారన్నారు. ఈ రెండు కలిపితే రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తుండగా.. మరి రాష్ట్రానికి ఏమిచ్చారని ఎలా ప్రశ్ని స్తున్నారని రఘునందన్ నిలదీశారు. ‘నిధులు వచ్చుడో.. ఇద్దరం చచ్చుడో’అన్న వారు.. కేంద్రం తెలంగాణకు నిధులు ఇచ్చిందని తేలితే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ముక్కు నేలకు రాస్తారా? అంటూ సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదన్న సీఎం, కేంద్రానికి డీపీఆర్ ఇచ్చారా? డీపీఆర్ ఇవ్వకుండా నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్లో కొండగల్కు రూ.5 వేల కోట్లు ఇచ్చుకున్న వారు కేంద్ర బడ్జెట్పై మాట్లాడే హక్కు లేదన్నారు. -
రేవంత్, కేటీఆర్.. ధర్నా చేసే దమ్ముందా?: బీజేపీ ఎంపీ రఘునందన్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేనని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రెండు పార్టీలు బడ్జెట్ కేటాయింపులపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ జంతర్మంతర్ వద్ద ధర్నా చేయాలి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయాలి అంటూ ఘాలు వ్యాఖ్యలు చేశారు.కాగా, ఢిల్లీలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయి. గత పదేళ్లుగా ఎన్డీయే నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే. జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైఖరి ఒకటే ఏం మారలేదు. మార్పు ఏదైనా ఉందా అంటే.. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారారు. మార్పు ఇంకేదైనా ఉందంటే.. కుర్చీలు మాత్రం మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో చెప్పారు.ప్రతీ మహిళకు రూ.2,500 ఇస్తామన్నారు. ఏడాదికి రూ.30వేలు అవుతుంది.. ఇది ఇచ్చారా? బడ్జెట్లో కేటాయింపులు ఏవి?. వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్లో కేటాయింపులు ఏవి మరి?. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 35,500 కోట్లు రుణం తెచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.9లక్షలపైనే ఉంది. వికారాబాద్ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.1 లక్షపైన ఉంది. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంది. దేశవ్యాప్తంగా చూసినా సరే ఇదే తరహా అంతరాలు ఉంటాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.26వేల కోట్లుగా చూపించారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.21వేల కోట్లపైన చూపించారు. ఈ రెండు కలిపితే దాదాపు రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తున్నాయి. మరి తెలంగాణకు ఏమిచ్చారు అని ఎలా ప్రశ్నిస్తున్నారు.రేవంత్ రెడ్డి, కేటీఆర్ జంతర్ మంతర్ల ధర్నా చేయాలి. నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా. ఢిల్లీ జంతర్ మంతర్ రండి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారా లేదా?. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షలకు కేంద్రం పెంచింది. దీన్నే ఆరోగ్యశ్రీ కింద మీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారు. మైనారిటీల పండుగల కోసం రూ.33 కోట్లు కేటాయించారు. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా?. సెక్యులరిజం అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు. -
35 మందిని ఒకేసారి విలీనం చేసుకోండి
గజ్వేల్రూరల్/ప్రశాంత్నగర్: ‘బావ, బామ్మర్ది, మామ (హరీశ్, కేటీఆర్, కేసీఆర్).. ముగ్గురిని వదిలేసి, 35 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఒకేసారి విలీనం చేసుకోవాలి’అని మెదక్ ఎంపీ రఘునందన్రావు వ్యంగ్యంగా అన్నా రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆయన అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. సంతలో పశువులను కొన్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పార్లమెంట్లో రాజ్యాంగ విలువల గురించి మట్లాడుతూ, ఇక్కడ రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడాన్ని ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక సీఎం వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కండువా కప్పిన మరుక్షణం ఆ ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలనపై దృష్టిపెట్టాలి..:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై సీఎం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్రావు హితవు పలికారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో నంబర్ టూగా చెలామణి అవుతున్న మంత్రి, బీఆర్ఎస్ బెదిరింపులు ఆపేదాక ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉంటాయనడం సరికాదన్నారు. -
‘పంచాయతీ ఎన్నికల వాయిదా కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమీ మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.కాగా, నేడు హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం, రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశాం. రైతులకు రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రూప్-1 పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు 30 రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటు.కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు. డీఎస్సీ ఒక నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. మేము వారికి మద్దతు ఇస్తున్నాము. నెలకు నాలుగు లక్షల నెల జీతం ఏడు మాసాలుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. అధికారులను అరెస్ట్ చేస్తున్నారు.. పనులు చేయించిన అప్పటి మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. ఒక్కో మంత్రి ఒక్కో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.ధరణి పరిస్థితి ఏంటి?. ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవులు భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజులుగా వెళ్లున్నారు. పంచాయతీల కాల పరిమితి ముగిసింది. వెంటనే ఎన్నికలు జరపాలి. కులగణన త్వరితగతిన పూర్తి చేయాలి. ఎన్నికలు వాయిదా వేసేందుకు డ్రామాలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నెలకు 1200 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇ చ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయా అంశాలపై కమిషన్ల నియామకాలతోనే కాలయాపన చేస్తోందని బీజేపీ మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైంపాస్ చేస్తున్నారు. గుంపు మేస్త్రీ సరిగా ఉంటేనే ఇతర మేస్త్రీలు కూడా పనిచేస్తారన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు, వరి ధాన్యానికి మద్దతు ధర, రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణం హామీ ఏమైందని ఆయన ప్రశ్నలు సంధించారు. లక్ష్మీనరసింహస్వామి మీద, ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ ఒట్లు వేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ, దానిని ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశా రు. రైతు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకూ రైతు భరోసా ఇవ్వా లని సూచించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటామని మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నారు కదా అని ఓ విలేకరి స్పందించగా.. అసెంబ్లీ సమావేశాలు ప్రా రంభం అయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కాపాడుకోలేని పరిస్థితి తలెత్తు తుందని వ్యాఖ్యానించారు. మరో 15 నెలలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనేది కూడా అనుమానమేనని, అలాంటిది మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు ఉంటామంటే ఎట్లా అని బదులిచ్చారు. -
బీఆర్ఎస్ టైటానిక్లా మునిగిపోతుంది
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాక తప్పదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అందరూ కేసీఆర్ పేరే చెబుతున్నా రన్నారు. రాబోయేరోజుల్లో బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్ఎస్) ఖాయమన్నారు. టైటానిక్షిప్ మాదిరిగా బీఆర్ఎస్ నావ మునిగి పోతుందని అన్నారు. బీజేపీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, అలాగే నక్సలైట్లు, మరెవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.శనివారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రఘునందన్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే తాను క్షీరసాగర్ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములను తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.మీడియా ప్రతి నిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు రఘునందన్రావు సమాధానాలిస్తూ.. నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారు’అని అన్నారు. జర్నలిస్ట్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధానకార్యదర్శి బింగిస్వామి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అన్నీ వర్గాల ప్రజల్ని ప్రజలను అణిచి వేయాలని చూసింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. తన గెలుపును మల్లన్న సాగర్లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్న రఘనందన్ .. నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారని అన్నారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకున్నట్లు నేడు మెదక్లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారుబీఆర్ఎస్ నేత వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దానిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. -
"టార్గెట్ కేసీఆర్"..పొలిటికల్ హీట్ రేపుతున్న రఘునందన్ వ్యాఖ్యలు
-
KCRపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్ పై ఈడి కేసు నమోదు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్పై ఈడీ కేసు?
సాక్షి, మెదక్: మాజీ సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారంటూ మెదక్ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన సన్మాన సభలో మాట్లాడుతూ.. కాసేపటి క్రితం కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసింది. కేసీఆర్, హరీశ్రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ. గొర్రెల స్కాంలో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది’’ అంటూ వ్యాఖ్యానించారు.‘‘రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీకి వినిపిస్తుందని చాలా మంది కష్టపడ్డారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటా. ర్యాక్ పాయింట్ ఏర్పాటుకు కృషి చేస్తా. మీ గొంతుకగా పార్లమెంట్లో కొట్లాడతా. రఘునందన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి. మీరు ఏ ఆపదలో ఉన్న రఘునందన్ ఉంటాడు’’ అని ఆయన చెప్పారు.వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచాం. మాజీ సీఎం కేసీఆర్ మీద కొద్దిసేపటి క్రితం ఈడి వచ్చింది. దుబ్బాకలో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరిశ్ ఎగిరిండు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్ ముందుకు సాగాలి. జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచాం. చాయ్ అమ్మిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు’’ అని రఘునందన్ అన్నారు. -
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
మెదక్ అభివృద్ధి కోసం పని చేస్తా: ఎంపీ రఘునందన్ రావు
-
గెలుపు పై మాటల యుద్ధం
-
మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం
మెదక్: మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు. -
రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్లు కొనుగోలు చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారికి బీజేపీ నేత రఘునందన్రావు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అక్రమాలకు పాల్పడిందని ఆరో ³ంచారు. మంగళవారం ఈ మేరకు సీఈఓను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు పత్రం అంద జేశా రు. ఈ సందర్భంగా రఘునందన్రావు మీడియా తో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ ద్వారా డబ్బు పంపించిన అకౌంట్, పాన్ కార్డు వివరాలు అందజేసినట్టు తెలిపారు.వాటి ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరినట్టు తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఆదాయపన్ను మినహాయింపు పొందిన బీఆర్ఎస్ బ్యాంక్ ఖాతా ద్వారా రూ.30 కోట్లు పలువురు నాయకులకు బదిలీ చేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందన్నారు. డబ్బు పంచి ఓట్ల కొనుగోలుతో ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎమ్మె ల్యేలపై చర్యలతోపాటు బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ తరఫున కోరినట్టు తెలిపారు. ఏ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించారో, తిరిగి ఓట్లు కొనుగోలుకు ప్రయత్నించారో ఆ అకౌంట్ వివరాలు సీఈఓకు అందజేశామ న్నారు. తాను అందజేసిన వివరాలు, సమాచారాని కి అనుగుణంగా చర్యలు తీసుకోక పోతే ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిసి బీఆర్ఎస్ అకౌంట్ డిటైల్స్, ఆదాయపు పన్ను మినహాయింపు పొందిన ఆ పార్టీ పాన్ కార్డు వివరాలు అందజేస్తామన్నారు. -
బీఆర్ఎస్పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్ రావు అన్నారు.రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్రెడ్డి (భారాస), ప్రేమేందర్రెడ్డి (భాజపా) ఉన్నారు. -
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ది నయవంచన: రఘునందన్రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
బీజేపీ నేత రఘునందన్రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మోదీ ఫొటోలతో ముద్రించిన శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచుతున్నారంటూ బీజేపీ నేత రఘునందన్రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్రావును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కాంగ్రెస్ నేతలు కోరారు. కాగా, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్కు గత నెల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పరుష పదజాలంతో మాట్లాడి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
2014 నుంచి ట్యాపింగ్లపై విచారణ జరిపించాలి: రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయిన 2014 జూన్ 2 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై విచారణ జరిపించి.. తప్పు చేసిన వారిని శిక్షించాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు డిమాండ్ చేశారు. తాను ఫోన్ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమాజం ఎదుట ఇన్ని ఆధారాలు పెట్టినా కూడా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని, అన్ని తెలిసి కూడా సీఎం సగం మాత్రం బయటపెట్టడం కూడా సరికాదన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రఘునందన్రావు మీడియాతో మాట్లాడారు. 2015లో జరిగిన ఓటుకు కోట్లు కేసులో జరిగిన రేవంత్రెడ్డి ఫోన్ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టి 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై విచారణ అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్రెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు. రేవంత్రెడ్డి ఓటుకు కోట్ల కేసుపై కూడా విచారణ జరిపితేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. 2015లో జరిగిన తన టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ‘రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి డీజీపీ అనురాగ్శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, ఎస్ఐబీలో ఉన్నది ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్... రేవంత్రెడ్డి ఇవ్వన్ని ఎందుకు దాచిపెడుతున్నారో సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బయటపడిన ఫోన్ట్యాపింగ్ కేసులో అప్పటి సీఎం, అప్పటి డీజీపీలను ఎందుకు ముద్దాయిలుగా చేర్చడం లేదని ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ పేరును ఎందుకు ఇందులో చేర్చడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్దాయిగా కేసీఆర్, ఆ తర్వాత హరీశ్రావు, వెంకట్రాంరెడ్డి, కేటీఆర్, నవీన్రావు, సందీప్రావుల పేర్లు వరుసగా చేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అవగాహనతోనే విచారణ ప్రస్తుతం ఈ కేసు విచారణ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య కుదిరిన అవగాహనతోనే జరుగుతోందని రఘునందన్రావు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రూ.3.5 కోట్లు పట్టుకున్నా, ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అయినా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు అని ప్రశ్నించారు. మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడకు పోయాయని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ పరిశీలిస్తే ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో సెలెక్టివ్ విచారణ జరుగుతున్నదనే అనుమానం కలుగుతోందన్నారు. ‘దుబ్బాక ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ జరిగిందని డీజీపీకి చెప్పాను. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావును ముద్దాయిగా చేయాలని చెప్పిన. ఎందుకు చేర్చుతలేరో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంగారు దుకాణాల ఓనర్లను బెదిరించి వాళ్ల దగ్గర తెచ్చిన బంగారంతో యాదగిరి టెంపుల్ కట్టారా అని ప్రశ్నించారు. రఘునందన్రావుపై కేసు నమోదు సంగారెడ్డి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ ఎద్దేవా? బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్సైట్లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు. ఇవి చదవండి: కాంగ్రెస్కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్కుమార్ -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ముగ్గురిపై కేసులు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు అప్పటి కలెక్టర్ వెంకటరామి రెడ్డిని ముద్దాయిలుగా చేర్చి కేసులు పెట్టాలని డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి, ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి త్వరితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, చీఫ్ జస్టిస్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దుబ్బా క ఉపఎన్నికతో పాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతోపాటు, తన కుటుంబసభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసు కోవాలని కోరుతూ బుధవారం డీజీపీ ఆఫీసులో రవిగుప్తాకు వినతిపత్రం సమర్పించాక రఘునందన్రావు మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరానని, ఆవిధంగా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన ప్రణీత్రావు చెప్పినట్టు మీడియాలో వచ్చిందని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కొందరు ట్యాపింగ్ చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్ సంభాషణలు విన్నారని కూడా తెలుస్తోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు వస్తున్నందున ఆయనకు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడి న్యాయమూర్తులు తెలియజేయాలని కోరారు. -
ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడు రేవంత్: రఘునందన్ రావు
-
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్ తమ ఆఫీసులో పనిచేసిన నేతలు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. 2019లో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుంటే తమ కార్యాలయ సిబ్బందిని బంధించారని తెలిపారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి తమ వాళ్లను బంధించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిసిందన్నారు కిషన్ రెడ్డి. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో మాత్రమే అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందన్నారు. అవినీతి, అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. రాజకీయ నేతలవే కాకుండా వ్యాపారస్తుల ఫోన్ల ద్వారా వ్యక్తిగత విషయాలు ట్యాపింగ్ చేశారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు కవిత పాత్ర లేకపోతే బహిరంగ చర్చకు రావాలి ‘కవిత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా?. కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలి. షెల్ కంపెనీలు పెట్టీ బినామీ వ్యక్తుల్ని పెట్టరా లేదా..? ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరిపారా లేదా? రూ. వందల కోట్లు చేతులు మారాయా లేదా? అని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాంపై కేసీఆర్ స్పందించాలి.క విత లిక్కర్ వ్యాపారానికి, అరెస్టుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్కు సవాల్ కవితది అక్రమ కేసు అనుకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా..?. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ఆడటంలో అగ్రగాములు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని కవిత అన్నారు. ఎందులో కడిగించుకొని వస్తారో చెప్పాలి. సికింద్రాబాద్కు కేంద్రమంత్రిగా ఎం చేశానో ప్రజలకు తెలుసు. కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్లో నేనూ బాధితుడినే: రఘునందన్ రావు 2 జూన్ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ , 2015 ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ రెండో బాధితుడు రఘునందన్ రావు. బీజేపీ నేత BL సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరుపుతారా? మీకు చిత్త శుద్ధి ఉందా సీఎం రేవంత్?. మీ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద బయటికి వచ్చారు. మీరు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీఏపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? కేసీఆర్@ A1 అమెరికాకి ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పంపారు తెలియాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఏంతకు కొన్నారు తెలియాలి. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మీకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్కు తెలియదా? ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్ను పెట్టాలి. రెండో ముద్దాయి హరీష్ రావుని పెట్టాలి. మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లు. మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన కేసీఆర్ను ముద్దాయిగా చేర్చాలి. కుటుంబ సభ్యుల ఫోన్లు వినే అధికారం ఎవరికి లేదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. ఓ టీవీ ఛానెల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా?. నేను బాధితుడిగా మాట్లాడుతున్నకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. రేవంత్తో హరీష్రావు విమాన ప్రయాణం? నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్య సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావు కాంగ్రెస్లోకి వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 19 మార్చి రాత్రి 10.15కి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి. సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా?. 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లోకి వస్తాను అన్నావా?. మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి తోసుకోకుమని చెప్పావా?. అసలేం మాట్లాడారో తెలియాలి. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్లను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకి పారిపోయారు అంటున్నారు. వీళ్ళని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా?. 2015లో డీజీపీ ఎవరో అతన్ని విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక సంస్థ నుంచి ఎత్తుకు వచ్చారు. ఈ కేసులో అందరిని ముద్దాయిలుగా చేర్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం.. ఈ కేసులో కొందరిని ఇరికించి కొందరిని కాపాడే కుట్ర జరుగుతుంది. సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు నోటీస్లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం చెప్పాలి. ట్యాపింగ్ జరగపోతే కేసీఆర్కు ఎలా తెలుస్తాయి? బీఎల్ సంతోష్ను అనవసరంగా కేసులో ఇరికించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతాం అంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. బీఎల్ సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్కు ఎలా తెలుస్తాయి? హైకోర్టు చీఫ్ జస్టిస్తో ఈకేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలి’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. -
కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి.. రఘునందన్రావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్రెడ్డి, రంజిత్రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు. -
బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం గురువారం విడుదల చేసింది. ఇటీవల హర్యానా సీఎం పదవికి అనూహ్య రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది, రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1) ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20),, త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు.. మహబూబ్నగర్: డీకే అరుణ మెదక్: రఘునందన్ రావు ఆదిలాబాద్: నగేష్ మహబూబాబాద్ : సీతారాం నాయక్ నల్గొండ : శానం సైదిరెడ్డి పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ రెండో జాబితాలో ప్రముఖులు బీజేపీ రెండో జాబితాలో పలువురు కేంద్ర మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, కేంద్ర సమాచారం బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు అవకాశం ఇచ్చింది. వీరితోపాటు కర్ణాటక మాజీ సీఎం, షిగ్గావ్ ఎమ్మెల్యే బసవరాజ్ బొమ్మెకు ఈసారి ఎంపీగా చాన్స్ ఇచ్చింది. హవేరి నుంచి ఆయన లోక్సభ బరిలో దిగుతున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్రావత్ బరిలో నిలిపింది. నితిన్ గడ్కరీ- నాగ్పూర్(మహారాష్ట్ర) పీయూష్ గోయల్- ముంబై నార్త్(మహారాష్ట్ర) ప్రహ్లాద్ జోషి, ధార్వాడ్(కర్ణాటక) అనురాగ్ ఠాగూర్- హమిర్పూర్( హిమాచల్ ప్రదేశ్) మనోహర్లాల్ ఖట్టర్- కర్నాల్( హర్యానా) లోక్సభ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. -
కడియంను బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కి బడుగులు, దళితులు గుర్తుకు రాలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్.రఘునందన్రావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా సీనియర్ నాయకుడు, దళితనేత కడియం శ్రీహరిని ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూచించారు. ‘కేసీఆర్కు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్గా దళితుడిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీని చేయాలని సూచించారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు ఇప్పుడు జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. కవిత ఉన్నా లేకపోయినా పూలే గుర్తుంటారని, ఇందుకోసం వారు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కవితకు, ఆమె ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే అంత పిచ్చి ఎందుకని అన్నారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ కనపడాలని, తెలంగాణ భవన్లో కేసీఆర్, మండలి లో కవిత కనపడాలంటే ఎలా అని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు జరుగుతోంది: రఘునందన్ రావు
-
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు జరుగుతోంది: రఘునందన్ రావు
-
‘BRS ఎమ్మెల్యేలది బలవంతపు ప్రెస్మీట్’
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యేలు మీడియా ద్వారా వివరణ ఇచ్చిన వేళ.. బీజేపీ నేత రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఇవాళ బలవంతంగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేంతా బీఆర్ఎస్ను వీడడం ఖాయమని అన్నారాయన. తాజా పరిణామలపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు రగిలింది. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబట్టుతోంది. అందుకే హరీష్ రావు బ్లాక్మెయిలింగ్కు దిగారు. హరీష్రావుకు తెలియకుండానే ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిశారా?. ఆయన అనుమతితోనే వాళ్లు కలిశారు. ఇవాళ బలవంతంగా వాళ్లతో ప్రెస్మీట్ పెట్టించారు. కానీ, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ కావడం ఖాయం’’ అని అన్నారాయన. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతోందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని రఘునందన్ అన్నారు. ప్రోటోకాల్ కోసం సీఎం రేవంత్రెడ్డిని కలిశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించారా? అని నిలదీశారాయన. హిస్టరీ రిపీట్ అవుతది ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 26 మంది అయిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. గతంలో గులాబీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఎలా లాక్కుందో.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అలాగే గుంజుకుంటుంది అని రఘనందన్ జోస్యం పలికారు. -
కేటీఆర్, హరీశ్రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావుపై ఫైరయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నేతల మాటల ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లడారు. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నాగా మిగులుతుందని అన్నారు. బీజేపీపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి -
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కల్వ కుంట్ల కుటుంబంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్, ఎంపీ సంతోష్ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు సవాల్ విసిరారు. వీరంతా పోటీచేసినా ఓటమి చెందుతారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోవడం ఖాయమన్నారు. శనివారం రఘునందన్రావు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఉందా.. అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలకు పార్టీ సత్తా ఏంటో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడ తామన్నారు. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్కు అలవాటు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా రూ.వందల కోట్లు సమర్పించుకున్న వారికే టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్ అధినా యకులకు అలవాటని రఘునందన్ ఆరోపించారు. పార్టీనే నమ్ము కున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరని వ్యాఖ్యా నించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న ప్పుడే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్టేనన్నారు. ఆ విషయంపై హరీశ్ సమాధానం చెప్పాలి కేఆర్ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందంటూ, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదంటూ మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడడం సరికాదని రఘునందన్ అన్నారు. 2014–2019 మధ్య నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమ క్షంలో... కృష్ణానదీ జలాల పంపకాల సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చా లని సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? అని నిలదీశారు. ఈ విషయమై హరీశ్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్కు ఈ విషయాలు తెలియవా అని నిలదీశారు. -
కేసీఆర్ పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక: రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ, నేతలపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే(1999) మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్.. అయిదుగురు పోటీ చేయాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. వీరెవరు పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్ కేసీఆర్ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవిలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులి కాదు, పిల్లి అంతకన్నా కాదు. ఎలుక అంటూ ఎద్దేవా చేశారు. బయటకు వచ్చేది పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అంటూ కేసీఆర్ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు రఘునందన్రావు. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను ఆ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్ల ఇవ్వరు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు లోక్ సభ సీటు ఇవ్వగలరా?. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని గుర్తుచేశారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణ వస్తే అప్పటి సీఎం కేసీఆర్ మొహం చాటేశారు’ అని గుర్తుచేశారు. -
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎంకున్న అభ్యంతరాలేమిటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. అందుకు సీఎంకి ఉన్న అభ్యంతరాలేమిటి? సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు... మేడిగడ్డ అందులో చిన్న భాగం మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వరకే పరిమితం చేయా లని కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కేసును పక్కదారి పట్టించడమే అవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్లో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో టీపీసీ సీ అధ్యక్షుడిగా రేవంత్ కేంద్రానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారని గుర్తుచేశారు. తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి రేవంత్ లేఖ కూడా రాశారని చెప్పారు. ఇప్పుడు సీఎం హోదా లో తన దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐకు, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కథ కంచికి చేర్చాలనే కుట్ర కాంగ్రెస్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కథ కంచికి చేర్చాలని చూస్తోందని రఘునందన్ ఆరోపించారు. ఈ ప్రాజె క్టు అవినీతి విషయంలో గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ పలు దఫాలుగా ఉత్తరాలు రాసిందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 20న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని లేఖ వచ్చిందన్నారు. ఈ లేఖకు ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా.. తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ వరకే విషయా న్ని పరిమితం చేస్తున్నారని, ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థపైకి మాత్రమే నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. -
'పెన్షన్లు కాదు.. నౌకర్లు కావాలి' : ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు
సాక్షి, మెదక్: చదువుకున్న బిడ్డలకు నౌకర్లు కావాలే గాని.. పెన్షన్లు కాదని .. ఇంట్లో పిల్లలకు కొలువులు వస్తే పెన్షన్లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచించాలని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు కోరారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు. అలాగే దౌల్తాబాద్, తొగుట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు ఆర్థికంగా బాగుపడుతాయి తప్పా ప్రభుత్వాలు ఇచ్చే స్వార్థపూరిత కానుకలతో కాదన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పకుండా సాగనంపుతారన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు! రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కల్లబొల్లి మాటలు, కథలు చెబుతున్నాడని.. వాటిని ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని రఘునందన్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మరోసారి ఆశీర్వదించండి.. పేదలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల తరఫున పోరాడుతున్న తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని రఘునందన్రావు కోరారు. నిరుద్యోగులు, అంగన్వాడీలు, వీఆర్ఏ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నానని, వారితో కలిసి ధర్నాలు, ఆందోళనలు ప్రత్యక్షంగా చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో సైతం పేదలు, నిరుద్యోగులతో పాటు చాలా సమస్యలపై గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. ప్రశ్నించే గొంతుకను.. కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మళ్లీ అసెంబ్లీకి పంపిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసమే నా తపన.. ‘దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా తపన, ఆవేదన, ఆకాంక్ష’ అని రఘునందన్రావు అన్నారు. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి న్యాయపరంగా దక్కాల్సిన నిధులు వచ్చేలా పోరాడుతున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. తాను గెలిచిన 3 ఏళ్లలో నియోజకవర్గంలో ఎంతో మార్పు వచ్చిందో.. అభివృద్ధి ఎలా పరుగెత్తింతో గమనించి మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సారి దుబ్బాకను రాష్ట్రంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతానన్నారు. బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే ఆగమవుతాం! దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేసి ఆగం కావద్దని మాధవనేని రఘునందన్రావు కోరారు. సోమవారం మాచిన్పల్లి, చెట్లనర్సంపల్లి, అప్పాయిపల్లి గ్రామాలతో పాటు తొగుట మండలంలోని వర్ధరాజుపల్లి, కాన్గల్, గుడికందుల గ్రామాల్లో రఘునందన్రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. ఇంటింటి ప్రచారం! చేగుంటతో పాటు రుక్మాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా ఉపసర్పంచ్ రాంచంద్రం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మ్యాకల రమేశ్, బాలరాజు, నవీన్, స్వామి, ముత్యం, సిద్దిరాములు, శ్రీరాం సిద్దిరాంలు, గణేష్, లావణ్య పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: 'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్రెడ్డి -
దుబ్బాకలో నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది..!
దుబ్బాకటౌన్: సీఎం కేసీఆర్కు వైన్స్ టెండర్లపై ఉన్న ప్రేమ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు లేదని.. ఇంతటి దుర్మార్గమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు బీజేపీలో చేరారు. అలాగే నియోజకవర్గంలోని భూంపల్లి–అక్భర్పేట, రాయపోల్ మండలాల్లో ఎమ్మెల్యే రఘునందన్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబపాలనకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడటం ఖాయమైందన్నారు. రాష్ట్రంలో ఏం మిగులకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాగుబోతుల రాష్ట్రంగా మర్చారని, మళ్లీ గెలిస్తే పేదల భూములు సైతం ఏం మిగుల్చరన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడ వేయలేదని, పెట్టిన పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించకుండా పేపర్లు లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి ఐదు మంత్రి పదవులా..? కేసీఆర్ కేబినెట్లో కేవలం ఒక్క శాతం ఉన్న తన కులానికి ఐదు మంత్రి పదవులు ఇచ్చి.. 23 శాతం ఉన్న ఎస్సీలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చాడని.. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల బాగు కోసమే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది మాధవనేని రఘునందన్రావు అన్నారు. 2020 ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్తో సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులందరూ కలిసి నన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారని.. కానీ చైతన్యవంతమైన దుబ్బాక గడ్డ మీద పుట్టిన ప్రజలు నన్ను గెలిపించి తమ పౌరుషాన్ని చూపారన్నారు. మూడేళ్లు తనకు అధికారం ఇస్తే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తెచ్చానని తెలిపారు. రాష్ట్ర ఖజానా అంతా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకే ఖర్చుపెట్టి మిగతా నియోజకవర్గాలకు చాలా అన్యాయం చేశారన్నారు. హరీశ్ను దుబ్బాక ప్రజలు నమ్మరు హరీశ్రావును దుబ్బాక ప్రజలు నమ్మరని.. ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకునే ఆయనకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని.. మళ్లీ ఓటమి రుచి చూపుతామని రఘునందన్రావు అన్నారు. ఉన్న నిధులన్నీ సిద్దిపేటకే తీసుకుపోయి దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేస్తుంది హరీశ్రావే అన్నారు. నన్ను ఓడగొట్టేందుకు ఆయన చేస్తున్న కుట్రలు చాలా ఉన్నాయని, ఎన్ని చేసినా ప్రజల మద్దతుతో తిప్పిగొట్టి భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు. ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేసిండు రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్న ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండో ప్రజలు గమనించాలని రఘునందన్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి జరిగితే తామే చేశామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభాకర్రెడ్డికి ఓట్లేస్తే పరాయి పెత్తనం సాగుతుందని, దుబ్బాక కోసం బరిగీసి కొట్లాడే నన్ను గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తా.. దుబ్బాకరూరల్: ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రఘునందన్రావు అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్భర్పేట మండలంలోని చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. విచ్చలవిడిగా బెల్ట్షాపులు ఏర్పాటు చేయడం చూస్తేనే బీఆర్ఎస్ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలన్నారు. రాయపోల్ మండలంలో..| రాయపోల్ః తన స్వగ్రామం బోప్పాపూర్, రాయపోల్ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో రఘునందన్రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరీశ్ దుబ్బాకపై పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులన్నీ సిద్దిపేటకే తరలించుకుపోయి తీరని అన్యాయం చేశాడన్నారు. పొలంపల్లిలో ఇంటింటి ప్రచారం చేగుంట(తూప్రాన్): మండలంలోని పొలంపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు రఘునందన్రావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్లు, వరి క్వింటాలుకు రూ.3100 మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా మాభూమి పోర్టల్ వస్తుందని ప్రచారంలో వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, వేణు, శ్రీకాంత్, రమశ్, ఎల్లం, గణేష్, భూపాల్, కుమ్మరి నర్సింలు, బాలకృష్ణ, స్వామి పాల్గొన్నారు. అనంతరం చేగుంట, మాసాయిపేట మండలాలకు చెందిన 200మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. ఏరులై పారుతున్న మద్యం మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పాలనలో వేసిన శిలాఫలకాలకే దిక్కుమొక్కు లేదని రఘునందన్రావు విమర్శించారు. అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మద్యం ఏరులై పారితే తప్ప పాలన ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాకలో ఎక్కడ కూడా దళిత బంధు అమలు కాని పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లన్నగారి శాంతవ్వ, భిక్షపతి పాల్గొన్నారు. -
దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: రఘునందన్
-
ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు
పాలమూరు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్రావు అన్నారు. సోమవారం మహబూబ్నగర్ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్రావు చెప్పారు. రాజు ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. -
ఎంపీ ప్రభాకర్రెడ్డిపై దాడి.. రఘునందన్ రావు ఏమన్నారంటే..
సాక్షి, సిద్ధిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘునందన్రావు స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో నిజానిజాలు ఎంత బురద చల్లేందుకు ప్రయత్నించినా.. అదే బురద నుంచి కమలం వికసిస్తుందని తెలిపారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ దాడికి పాల్పడితే తనే స్వయంగా అలాంటి వాడిని పోలీసులకు అప్పచెబుతానని అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్ రిపోర్టర్ అని, దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చిందని తెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభాకర్రెడ్డి మిత్రుడు, ఆయన్ను పరామర్శిస్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అనంతరం ఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా పరిగణించారు. ఈ హింసాత్మక ఘటనలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి నిరసనలకు ఎవరు అనుమతి ఇచ్చారో సిద్దిపేట కమిషనర్ వెల్లడించాలని అన్నారు. ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని ఆసుపత్రికి వెళ్లి అతని పరామర్శిస్తానని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు. -
ఒకేరోజు 1,603 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆశావహుల నుంచి వెల్లువలా దరఖాస్తుల సమర్పణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శనివారం ఒక్కరోజే 1,603 మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో గత ఆరు రోజుల్లో మొత్తం అందిన అప్లికేషన్ల సంఖ్య 3,223కు చేరుకుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆదివారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. శనివారం దరఖాస్తులిచ్చిన వారిలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు (తమ ఆఫీసు ప్రతినిధి ద్వారా అందజేత), శేరిలింగంపల్లికి గజ్జల యోగానంద్, రాజేంద్రనగర్ నుంచి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, షాద్నగర్కు మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి కుమారుడు మిథున్రెడ్డి, సనత్నగర్ సీటుకు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, జనగామ నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు బేజాది బీరప్ప, పాలకుర్తి టికెట్ కోసం సీనియర్ జర్నలిస్ట్ యెడ్ల సతీష్ కుమార్ తదితరులున్నారు. ఆదివారంతో దరఖాస్తుల స్వీకారం ముగుస్తున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతల చేరిక, బీజేపీ నుంచి ముఖ్యనేతల పోటీకి సంబంధించి కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు ఇంకా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అందువల్ల ఇతర పార్టీల నుంచి బలమైన నేతలొచ్చే కొన్ని నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని పార్టీ కీలక నేతలకు సంబంధించి దరఖాస్తులు లేకుండానే ఆయా స్థానాలకు వారి అభ్యర్థిత్వాలను పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా వలస నేతలతోపాటు పార్టీ ముఖ్య నేతలకు కొంత వెసులుబాటు ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ వంటివి ఎన్నికల దాకా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగనుందని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ను ఎంపిక చేయాలని కోరుతూ ఆ పార్టీ గజ్వేల్ నేతలు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం సమరి్పంచారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్చేసి టాస్క్పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్గా స్పందించారు. శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్రావు. -
బీజేపీలోనే ఉంటా.. పోటీ చేసేది అక్కడి నుంచే: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక, మరికొందరు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, రఘునందన్ ఈ వార్తలపై స్పందించారు. పార్టీ మార్పు వార్తపై తాజాగా రఘునందన్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్లో ఏం అభివృద్ధి చేశారో చూద్దామని పిలుపునిస్తే ముందురోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. ఇక, ఏదోఒక రోజు సమయం చూసుకుని, డేట్ చెప్పకుండా గజ్వేల్కు వస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదు. ఈ విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రేవంత్ Vs కవిత.. మాటల వార్తో దద్దరిల్లిన ట్విట్టర్ -
బీజేపీ ‘చలో గజ్వేల్’ భగ్నం
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరిగిన వనరుల విధ్వంసాన్ని ప్రజలకు చూపించడం కోసం బీజేపీ చేపట్టిన ‘చలో గజ్వేల్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరమణారెడ్డిని ఒకరోజు ముందుగానే గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీస్స్టేషన్కు తరలించారు. శుక్రవారం ఉదయం నుంచి భారీసంఖ్యలో బీజేపీ శ్రేణులు వెంకటరమణారెడ్డి ఇంటికి తరలిరాగా, వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. దీంతో జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. వెంకటరమణారెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ బిచ్కుంద పోలీస్స్టేషన్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆందోళన చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు కారులో హైదరాబాద్ నుంచి బిచ్కుంద పోలీసుస్టేషన్కు బయలుదేరగా పెద్దకొడప్గల్ మండలకేంద్రం శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడుచుకుంటూ పెద్దకొడప్ గల్కు చేరుకుని రెండుగంటలపాటు నిరీక్షించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, మాజీమంత్రి ఈటల రాజేందర్కు ఆయన ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. పోలీసులు సాయంత్రం వెంకట రమణా రెడ్డిని విడిచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ గజ్వేల్లో అక్రమాలు వెలుగులోకి వస్తాయని, సీఎం చెబుతున్న అభివృద్ధికి సంబంధించిన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. -
అసెంబ్లీలో డీకే అరుణకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: గద్వాల నియోజకవర్గంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా కృష్ణమోహన్రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన కోర్టు.. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కాపీ అందించి.. తనను ఎమ్యెల్యేగా గుర్తించాలని కోరేందుకు శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లారు. గద్వాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శి కి అందించడానికి వెళ్లారామె. అయితే ఆ సమయంలో కార్యదర్శితో పాటు అసెంబ్లీ స్పీకర్ కూడా అందుబాటులో లేరు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ‘‘ 24న ఈ తీర్పు వచ్చింది, ఆర్డర్ కాపీ తో స్పీకర్ ను కలవడానికి వస్తే.. స్పీకర్, కార్యదర్శి ఇద్దరూ లేరు. నిన్న సాయంత్రం ఫోన్ చేశాను. మెసేజ్ కూడా పెట్టాను. రోజూ అసెంబ్లీకి వచ్చే కార్యదర్శి ఇవాళ మాత్రం ఎందుకనో రాలేదు.కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం ఉంది స్పీకర్ దగ్గర సమావేశం ఉందని కార్యదర్శి వెళ్లారట. ముందు సమాచారం ఇచ్చిన వీరిద్దరూ లేకపోవడం బాధాకరం. అందుకే కోర్టు ఆర్డర్ కాపీని స్పీకర్ పేషీలో ఇచ్చాం. అసెంబ్లీ స్పీకర్కు ఉన్న అధికారాలను ఉపయోగించి తీర్పును అమలు చేయాలి. ఈ తీర్పు నాలుగేళ్ల కింద వస్తె నా గద్వాల ను అభివృద్ది చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ చాలా ఆలస్యంగా ఈ తీర్పు వచ్చింది ఎన్నికల సంఘాన్ని కలుస్తాం ‘‘గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే గా డీకే అరుణ తీర్పు వచ్చింది. దీనిపై సోమవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి ని కలుస్తాం. డీ కే అరుణ విషయంలో వచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది’’అని ఎమ్మెల్యే రఘునందన్రావు వెల్లడించారు. -
లెక్క మారిన రఘునందన్
-
దుబ్బాక నియోజకవర్గం పాలకవర్గం ఎవరిది..?
దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధి రఘునందన్రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను 1079 ఓట్ల తేడాతో ఓడిరచి సంచలనం సృష్టించాడు. ఎమ్. రఘునందన్రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐ అభ్యర్థి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డికి 22196 మాత్రమే ఓట్లు వచ్చి డిపాజిట్ కొల్పోయాడు. 2018లో రామలింగారెడ్డి 66421 ఓట్ల మెజార్టీ తెచ్చుకోగా ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ 1079 ఓట్ల తేడాతో బిజేపి చేతిలో ఓటమి చెందడం విశేషం. ఎం.రఘునందన్రావు రెండుసార్లు అసెబ్లీకి పోటిచేసి ఓటమిచెంది మూడోవ సారి ఉప ఎన్నికల్లో నెగ్గారు. మాజీ జర్నలిస్టు అయిన దివంగత రామలింగారెడ్డి 2004, 2008 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికలలో గెలిచారు. మొదట దొమ్మాటగా ఉన్న ఈ నియోజకవర్గం, 2009 నుంచి దుబ్బాక కేంద్రంగా నియోజకవర్గం అయింది. 2018లో సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది నాగేశ్వరరెడ్డిపై 66421 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయన తెలంగాణ ఉద్యమంలో మొదట నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో ఒకరుగా ఉన్నారు. సోలిపేటకు 89112 ఓట్లు రాగా, నాగేశ్వరరెడ్డికి 26691 ఓట్లు వచ్చాయి. 2018లో ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి నేత ఎమ్. రఘునందన్ రావుకు 22 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. రెండువేల నాలుగులో మొదటిసారి టిఆర్ఎస్ పక్షాన గెలిచిన రామలింగారెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం లో భాగంగా తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. తదుపరి 2009సాధారణ ఎన్నికలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేతిలో ఓడిపోయారు. ముత్యం రెడ్డి అంతకుముందు టిడిపిలో ఉండేవారు. ఆయన కాంగ్రెస్ ఐలోకి వచ్చి గెలుపొందడం విశేషం. కాని 2014లో మాత్రం నెగ్గ లేకపోయారు. ఆ తర్వాత కాలంలో ముత్యంరెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయారు. ముత్యంరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. 1972లో దొమ్మాటలో గెలిచిన సోలిపేట రామచంద్రారెడ్డి ఒకసారి రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే మెట్రో విస్తరణ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయనే 270 కి.మీ. మెట్రో రైలు నిర్మాణం చేస్తామంటూ బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఈ మెట్రో విస్తరణ అని అందరూ అనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. తొమ్మిదేళ్లలో కనీసం పాతబస్తీలో 5.5 కి.మీ మైట్రోరైలు సదుపాయం కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఒకేసారి రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తామనడం పలు అనుమానా లకు తావిస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాల యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరదలో మునిగిపోయి ప్రజ లు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటించకుండా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం మహారాష్ట్ర వెళ్లారన్నారు. -
కేసీఆర్ ఎవరి శిష్యుడు? రఘునందన్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా సీఎంల పేర్లతో మరోసారి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందరావు విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కిరణ్కుమార్రెడ్డి శిష్యుడంటూ చేస్తున్న ప్రచారంపైనా రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సంజయ్ గాంధీ శిష్యుడు కదా?.. నేర్చుకునేటప్పుడు ఎవరు ఎవరికైన శిష్యుడిగా ఉండొచ్చు. ఆంధ్ర సీఎంల పేర్లతో కేసిఆర్ మరోసారి పబ్భం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే పని చేయన్నోల్లు మహారాష్ట్రలో ఏమీ చేస్తారు ?. మహారాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాలు ఎన్ని? అంటూ సెటైర్లు సంధించారు రఘునందన్. నగర కమిషన్ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అసలు చిన్న వానకే ట్రాఫిక్ ఎందుకు అవుతుందని సమీక్ష చేసారా?. ఇదేనా భాగ్యనగర్ ఎదుగుదల?. మున్సిపల్ మీటింగ్లకు ఆ శాఖ మంత్రే హాజరు కావడం లేదు. అందుకే.. సభలో వరదల మీద చర్చ జరపాలి. రైతు రుణ మాఫీ అనేది బ్యాంకులు చేయవు. ప్రభుత్వం చేస్తుంది. రుణ మాఫీ చేయకుంటే సెక్రటేరియట్ ముందు లేదా ఆ శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఇది కాంగ్రెస్ కు తెలీదు. ఎందుకంటే.. ఇదంతా ఎన్నికల ముందు కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా కాబట్టి. కార్మికులు, ఉద్యోగుల సమస్యపైనా.. తెలంగాణ వస్తే.. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని చెప్పారు కదా?. మరి మీ సొంత జిల్లాలో ఎంత మంది కాంట్రాక్ట్ కార్మికులు సంఖ్య ఎంత? పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య ఎంత? చర్చకు సిద్ధమా?. కాళేశ్వరం రుణాలపై చర్చ సభలో పెట్టండి. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు మీదా సభలో మాట్లాడాలి. ప్రతి మండలంలో పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. వాటి మీద చర్చిద్దాం. హైదరాబాద్లో అమ్మిన భూములు ఎంత? దాని విలువ ఎంత? ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ?. మైనారిటీ బంధు ఇస్తామంటున్నారు. రాష్ట్రంలో అధిక జనాభా బీసీ బందు ఎందుకు ఇవ్వరు?.. సర్కార్ కొలువున్నా.. హుజూరాబాద్ లో దళిత బంధు ఇచ్చారు. అదే విధంగా అన్ని నియోజకర్గాల్లోనూ ఇవ్వాలి. గృహలక్ష్మి అంటున్నరు.. అందులో కేంద్రం వాటా చెప్పరు. కట్టిన ఇళ్ళ రంగులు పోతున్నాయి..పేదలకు మాత్రం ఇవ్వట్లేదు. Ghmc లో ఎన్ని డబుల్ ఇళ్లు కావాలనే అంచనా మీకుందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారాయన. నాతో చెప్పించుకోవడం సిగ్గు చేటు మేము నిర్ణయించిన రోజులే శాసన సభ జరగాలి అనేది మూర్ఖపు ఆలోచన. ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతుక. ఎన్నికలు ఎప్పుడొస్తాయో మీకు తెలుసు. ఇవే చివరి సమావేశాలు కాబట్టి.. రోజుకో అజెండాతో శాసన సభ 30 రోజులు నడపాలి. ప్రతిపక్ష సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలు చర్చించే శాసన సభను నెల రోజులు నడపకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో కేంద్రాన్ని చూసి నేర్చుకోవాలి. సంప్రదాయాలు పాటించరు! బీఎస్సీ మీటింగ్కు పిలవురు. ఈ విధంగా సభ నిర్వహించడం బాధాకరం. ఉన్న ముగ్గురికి సభలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు భయమెందుకు? బలం మీదే అని అంటున్నప్పుడు.. నెలపాటు సభ నడపడానికి అభ్యంతరం ఏంటి?. నాలాంటి కొత్త సభ్యులతో ఇలాంటి సూచన చెప్పించుకోడం సిగ్గు చేటు. 30రోజులు సభ నడపాలని బీజేపీ తరపున సీఎం కేసీఆర్కు లేఖ రాస్తున్నాం. నేరుగా లేఖ ఇచ్చే అవకాశం మాకు లేదు కాబట్టి మీడియా ముఖంగా ఈ లేఖ రాస్తున్నాం. కేంద్ర నిధుల మీద అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి. చర్చించేందుకు మేము సిద్ధం అని ఎమ్మెల్యే రఘునందర్ స్పష్టం చేశారు. -
తెలంగాణ బీజేపీ.. రఘునందన్, అర్వింద్కు కీలక బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 29వ తేదీన తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అమిత్ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల పార్టీ నేతల్లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితిని చక్కదిద్దేపనిలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి బిజీగా ఉన్నారు. ఇక, అమిత్ షా పర్యటన సందర్భంగా డాక్టర్స్, లాయర్స్, ఇంజినీర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వార్ రూమ్ ఇన్చార్జ్గా ఎవరిని పెడతారనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. స్ట్రాటజీ టీమ్ ఇన్చార్జ్గా శ్వేతా శాలిని, సోషల్ మీడియా బాధ్యతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్, కో ఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతలకు అప్పగించారు. కాగా, దీనిపై రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే బీజేపీ హైకమాండ్పై రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేతలు! -
కిషన్రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా?: తలసాని ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతల బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పర్యటన ఉద్రిక్తరంగా మారిన విషయం తెలిసిందే. పర్యటన సందర్బంగా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం.. బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద దింపేశారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తలసాని మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూడవచ్చు. కిషన్రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా?. కిషన్రెడ్డి వస్తానంటే నేనే కొల్లూరు తీసుకునిపోయి చూపిస్తాను. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తోంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసింది?. మేము కట్టిన ఇళ్ల దగ్గర బీజేపీ నేతల తాపత్రయం ఎందుకు?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిందా?. ఈరోజు ఉదయం నుంచి కిషన్రెడ్డి డ్రామా చేస్తున్నారు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాలకు కిషన్ రెడ్డి, నేను కలిసి వెళ్లాం. కిషన్ రెడ్డి చాలా సార్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాగున్నాయని అన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది: కిషన్ రెడ్డి ఫైర్ -
కిషన్ రెడ్డి, రఘునందన్ అరెస్ట్
-
ఢిల్లీలోనే బండి సంజయ్.. రఘునందన్రావుపై చర్యలు?
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా స్వీకరించేందుకు అయిష్టత చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోపాటు ఇతర పెద్దలకు వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. సంజయ్తో సునీల్ బన్సల్ భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని అంటున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు నేతల అంశాన్ని బన్సల్ వద్ద ప్రస్తావించారని.. తనతోపాటు అధిష్టానం పెద్దలపై ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యల విషయాన్ని వివరించారని చెప్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్రావుపై చర్యలు తీసుకునే విషయంపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సంజయ్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్తో అపాయింట్మెంట్ ఉన్న కారణంగా బుధవారం ఢిల్లీలోనే ఆగి.. గురువారం హైదరాబాద్ వెళుతున్నట్టు వివరించారు. -
బండికి 100 కోట్లు ఎక్కడివి?
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రఘునందన్రావు..సోమవారం పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పత్రికల్లో రూ.100 కోట్ల విలువైన యాడ్లు ఇచ్చారని, అసలు భార్య పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడివని నిలదీశారు. రెండు, మూడేళ్లయినా పార్టీలో పదవులను భర్తీ చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై వస్తున్న కథనాలు వాస్తవమేనని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఏయే పదవులు ఖాళీగా ఉన్నాయో కూడా తెలియదని విమర్శించారు. పార్టీకి ఎల్పీ నేత లేరన్న విషయమూ నడ్డాకు తెలియదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో తనను చూసి ఓట్లేశారు తప్పితే.. పార్టీ గుర్తును చూశో, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్ను చూశో కాదని స్పష్టం చేశారు. తాను కోరిన పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుంటే తన దారి తనదేనని అల్టిమేటమ్ ఇచ్చారు. కిషన్రెడ్డిని కలిసిన కొద్ది సేపట్లోనే .. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీలో మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెంచిన నేపథ్యంలో పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు రఘునందన్రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. 3 గంటల సమయంలో కిషన్రెడ్డి నిర్వహించిన ప్రెస్మీట్లోనూ ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అక్కడే ఉన్న మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. అధ్యక్షుడి మార్పు విషయంలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనని, సంజయ్ను మార్చేందుకే అధిస్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో సంజయ్ది స్వయంకృతాపరాధం అన్నారు. ‘పార్టీల ఇన్చార్జిలు తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్ల ఫొటోలు పెట్టి రూ.100 కోట్లతో పత్రికల్లో యాడ్లు వేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నా ఫోటోనో, ఈటల రాజేందర్ ఫొటోనో వేయలేదు. తరుణ్ఛుగ్నో, బన్సల్ను చూసి ప్రజలు ఓట్లేయరు కదా..’అని రఘునందన్ ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షుడికే తెలియదంటే ఎలా..? పార్టీ శాసనభా పక్షనేత పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా దానిపై బండి సంజయ్ నిర్ణయం తీసుకోలేక పోయారని, ఈ విషయమై నడ్డాను అడిగితే.. ’అవునా..నిజమా’అంటూ తననే ప్రశ్నించారని రఘునందన్ తెలిపారు. ‘పదవుల నియామకంపై పార్టీ జాతీయ అధ్యక్షుడికే తెలియకుంటే ఎలా? అట్లుంది పార్టీ పరిస్థితి..’అంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్లీడర్ విషయంలోనూ నాన్చుడు ధోరణినే అవలంబించారని, చివరకు ఫ్లోర్ లీడర్ పదవి అడిగిన కార్పొరేటర్ చనిపోయినా, ఇంతవరకు దానిపై నిర్ణయమే లేదని విమర్శించారు. పదేళ్లుగా కష్టపడుతున్నా.. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నానని రఘునందన్ అన్నారు. మధ్యలో వచ్చిన నేతలు పదవులకు పనికొస్తారు కానీ నేను పనికిరానా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను సైతం అర్హుడనేనని అన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి, జాతీయ అధికార ప్రతినిధి పదవి, శాసనసభాపక్ష నేత పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తన దారి తనదేనంటూ వ్యాఖ్యానించారు. కీలక పదవులకు తనకు కులమే శాపంగా పరిణమించిందని ఆవేదన చెందారు. సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేక పోయారు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను పూర్తిగా సొంత బలంతోనే గెలిచానని రఘునందన్ చెప్పారు. ‘దుబ్బాకలో నేను స్వయంశక్తితో గెలిచా. నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఇక్కడ పార్టీ గుర్తు చివరి అంశమే. మళ్లీ నా సొంత బలంతోనే దుబ్బాకలో గెలుస్తా’అని స్పష్టం చేశారు. తన గెలుపు తర్వాతే ఈటల పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి భుజంపై చేయి వేసి మరీ నేను గెలిపిస్తానని అమిత్షా ప్రకటించారని, కానీ గెలిపించలేకపోయారని విమర్శించారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారని అన్నారు. -
Telangana: అసమ్మతి శ్రుతి పెంచుతున్న కమలనాథ స్వరం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర నేతలు చేస్తున్న రచ్చ, పార్టీలో ఇటీవలి పరిణామాలతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఏర్పడి 43 ఏళ్లు గడుస్తున్నా గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదనే అభిప్రాయం కొందరు సీనియర్లలో వ్యక్తమౌతోంది. నేతల మధ్య అభిప్రాయభేదాల వంటివి ఉన్నా ఇప్పటిలా ముఖ్యనేతలు గ్రూపులుగా, వర్గాలుగా ఏర్పడటం వంటివి చోటు చేసుకోలేదు. బహిరంగ విమర్శలు, ఆరోపణలకు దిగిన సందర్భాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యులు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సైతం బహిరంగంగా, ట్విట్టర్ లేదా ఏదో ఒక పరోక్ష రూపాల్లో అసంతృప్తి గళం విన్పించడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. చల్లార్చలేదు..చక్కదిద్దలేదు..: వాస్తవానికి పలువురు ముఖ్యనేతల్లో అసంతృప్తి, సఖ్యత కొరవడడం, పాత–కొత్త నాయకుల మధ్య సమన్వయం లేమి, గ్రూపులు లేదా వర్గాలను ప్రోత్సహించే విధంగా కొందరు వ్యవహరించడం, రాష్ట్ర రాజకీయాల్లో తామే ఫోకస్లో ఉండేలా, మీడియాలో తమకే ప్రచారం లభించేలా కార్యక్రమాల నిర్వహణ వంటివి రాష్ట్ర బీజేపీలో కొన్నినెలలుగా సాగుతున్నాయి. అయినా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అసంతృప్తిని చల్లార్చేందుకు, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర పార్టీలో సమన్వయానికి తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాష్, అరవింద్ మీనన్లను ఇన్చార్జిలుగా నియమించినా, వారెప్పుడూ పార్టీలోని అంతర్గత సమస్యలు, నేతల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పైగా ఒకరిద్దరు ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడల్లా వత్తాసు పలకడం, మద్దతు తెలపడం వంటివి చేయడం వల్ల కూడా పార్టీలో పరిస్థితులు దిగజారాయని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరింత గందరగోళంగా తయారయ్యాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, సరైన విధంగా స్పష్టత ఇవ్వకపోవడం కూడా కేడర్తో పాటు ముఖ్యనేతలను సైతం అయోమయానికి గురి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఈ నెల 8న వరంగల్లో ప్రధాని మోదీ సభకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో..లేదో’ అంటూ ఆదివారం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మాటల మంటలు.. ఇటీవల ఓ దున్నపోతును వెనకనుంచి తన్ని వ్యానెక్కించే వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి.. రాష్ట్ర పార్టీకి ఇదే ట్రీట్మెంట్ అవసరమంటూ వ్యాఖ్యానించడం కలకలం సృష్టించింది. అంతకు కొన్నిరోజుల ముందే.. సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో సంజయ్కు అనుకూలంగా ఉండే వారితో తన నివాసంలో జితేందర్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలకు జాతీయపార్టీ అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడంపై నేతల్లో అసంతృప్తి వ్యక్తం అయినట్టు వార్తలొచ్చాయి. అంతకు ముందు ఓ జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి, ఓ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఇద్దరు మాజీ ఎంపీలు, ఓ ఎమ్మెల్యే విడివిడిగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలగజేశాయనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం, రాష్ట్ర అధ్యక్షుడి వైఫల్యాలు, పార్టీలో చేరికలు లేకపోవడం, ముఖ్య నాయకత్వం ఒంటెద్దు పోకడలు, ఇతర అంశాలపై చేసిన వ్యాఖ్యలు వారిలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయని అంటున్నారు. ఇక ఢిల్లీలో అమిత్షా, జేపీ నడ్డాలతో ఈటల, రాజ్గోపాల్రెడ్డి ప్రత్యేక భేటీల సందర్భంగా, హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నడ్డాతో పలువురు ముఖ్యనేతలు సమావేశమైనప్పుడు కూడా నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నడ్డాతో జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు విడివిడిగా సమావేశమై తమ అసంతృప్తికి గల కారణాలను, పార్టీలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను గురించి విడమరిచి చెప్పినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. తాజాగా ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు ఢిల్లీలో అసంతృప్తి స్వరం తీవ్రస్థాయిలో విన్పించడం బీజేపీలో మరోమారు కలకలం రేపింది. తనకు తగిన ప్రాధ్యానత, గుర్తింపు లభించడం లేదని పేర్కొంటూ ప్రధాని మోదీ మినహా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలపై విమర్శలు గుప్పించడం గమనార్హం. జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అగ్రనేత అమిత్షాల తీరుపై సైతం ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీ కేడర్ను విస్మయానికి గురి చేసింది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో నెలకొన్న పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పలువురు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు: రఘునందన్
ఢిల్లీ: తాను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఖండించారు. తాను పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ నాయకత్వాని ధిక్కారించేవాడిని కాదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటానని తెలిపారు. తాను ఢిల్లీలో అసలు ప్రెస్మీట్ పెట్టలేదని, తనకు కీలకమైన పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. గత రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ఉన్నానని, దుబ్బాక నియోజకవర్గానికి నిధులు కోసం వచ్చానని క్లారిటీ ఇచ్చారు రఘునందన్. అయితే పార్టీలో పదవులు కోరుకోవడం తప్పుకాదన్నారు. చదవండి: ప్రతీ పార్టీ లెక్క చెప్పాల్సిందే.. ఎన్నికల సంఘం కొత్త ఆన్లైన్ పోర్టల్ -
మూడు పదవుల్లో ఏదిస్తారు?: రఘునందన్ అల్టిమేటం
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన వేళ.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఢిల్లీలో తిష్ట వేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఉన్న పదవి ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని పట్టుబట్టుకు కూర్చోన్నారు. ఈ మేరకు మీడియాతో చిట్చాట్ నిర్వహిస్తూ తన ఆసక్తిని తెలియజేశారు రఘునందన్. ‘మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వండి. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు. రెండు నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తది. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా. మునుగోడులో రాజగోపాల్ ను గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారు. దుబ్బాకలో నా కష్టంతోనే గెలిచాను. పార్టీ సింబల్ అనేది చివరి అంశం. నాకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా. రెండేళ్లుగా జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్లను నియమించలేకపోయారు. శాసనసభ పక్ష నాయకుడిని కూడా నియమించలేకపోయారు. పార్టీని నడిపేది ఇలాగేనా?, నేను మూడు పదవులు ఆశిస్తున్నాను. ఒకటి జాతీయ అధికార ప్రతినిధి, రెండు బీజేపీ శాసనసభ పక్ష నేత , మూడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదో ఒకటి ఇస్తారని భావిస్తున్నా. లేదంటే నా దారి నాదే’ అని వ్యాఖ్యానించారు. చదవండి: పాత మిత్రుల కౌంటర్ల ఎపిసోడ్కు శుభం కార్డు.. ‘ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టమంటూ.. -
కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్
-
మమ్మల్నెందుకు పట్టించుకోరు.. బీజేపీలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనేంత స్థాయి వరకు నేతలు గళం విప్పుతున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో అధికమౌతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం ఈ తరహా నేతల జాబితాలో ఉండటం గమనార్హం. వారితో మాట్లాడి.. మమ్మల్ని విస్మరించారు! పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలు అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఇటీవల వారిని ఢిల్లీ పిలిపించి బుజ్జగించింది. ఈ నేపథ్యంలో మరికొందరు ముఖ్యనేతలు.. తమ అసంతృప్తిని తెలుసుకునేందుకు నాయకత్వం ఎందుకు ప్రయత్నించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ద్వారా పార్టీకి పెద్ద ఊపు తెచ్చిన తనను ఎమ్మెల్యేగా, ముఖ్యనేతగా పరిగణించకుండా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ ఫైర్.. రాష్ట్ర అధ్యక్షుడి తీరును, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి పలుమార్లు అమిత్షా, నడ్డాలకు తెలియజేసినా ఓపిక పట్టాలనే సూచన తప్ప సమస్య పరిష్కారానికి ఏ చర్యా తీసుకోలేదనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల, రాజ్గోపాల్రెడ్డిలను ఢిల్లీకి పిలిపించారని, తనను మాత్రం పట్టించుకోలేదనే భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం. బీజేఎల్పీ నేత రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత తనకు శాసన సభాపక్షపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించి తనను విస్మరించడం, పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఆశించినా అవి జరగకపోవడం రఘునందన్లో అసంతృప్తిని మరింత పెంచిందని అంటున్నారు. తన కార్యకర్తలు, అనుయాయులు వెలిబుచ్చుతున్న అసంతృప్తినే తాను బయటకు చెబుతున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి రాష్ట్ర బీజేపీపై వ్యంగ్య ధోరణిలో ఓ ప్రతీకాత్మక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడం పారీ్టలో దుమారాన్నే రేపింది. దున్నపోతును వెనుకనుంచి తన్ని వ్యాన్లోకి ఎక్కించే వీడియో పోస్ట్ చేసి, రాష్ట్ర నాయకత్వానికి ఇలాంటి చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించడంపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేరుగా నడ్డా దృష్టికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగానూ పలువురు నాయకులు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించక పోవడంపై అసంతృప్తిని తెలియజేశారు. జాతీయ కార్యవర్గసభ్యులు డా.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు వేర్వేరుగా నడ్డాను కలుసుకుని వివిధ అంశాలపై తమ అసంతృప్తికి గల కారణాలను తెలియజేశారు. రాష్ట్ర పార్టీలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులతో నాయకులు సమైక్యంగా లేరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం, పార్టీలో సమష్టి నిర్ణయాలు కొరవడడంతో నష్టం జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు. తీవ్ర అసంతృప్తి.. పలు సందర్భాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను సంప్రదించకుండానే ముఖ్య నేతల భేటీలో నిర్ణయమంటూ ప్రకటనలు వెలువడుతున్నాయని నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. తాము జాతీయ కార్యవర్గ సభ్యులుగా, మాజీ ఎంపీలుగా, ఉద్యమకారులుగా ఉన్నా తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వడం లేదని, నష్టం కలుగజేసేలా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి వంటి వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలపై జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: చర్చనీయాంశంగా.. సామేలు రాజీనామా -
అంతర్గత విబేధాలు.. సైలెంట్ మోడ్లోకి ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ జోష్లో ఉన్న బీజేపీ, అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీలోని కీలక నేతల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బండి సంజయ్కు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మధ్య పొసగటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే సైలెండ్ మోడ్లోకి వెళ్లారు. ఆయనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన ఈ మధ్య పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వానికి, రఘునందన్ రావుకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న రఘునందన్ రావు.. ఇదే విషయంపై ఇటీవల జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ బీజేపీపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో పార్టీ నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను అధిష్ఠానం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. బండిని ఆ పదవి నుంచి మార్చేసి.. కేంద్రమంత్రి బాధ్యతలు ఇవ్వనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. బండి సంజయ్ను తప్పిస్తే.. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వనున్నారన్నది ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీలో కోల్డ్వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో అధిష్టానం ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీలో వారికున్న సమస్యలను వివరించినట్టు సమాచారం. మరోవైపు.. నిన్న(ఆదివారం) నాగర్కర్నూలులో బీజేపీ సభ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేపీ నడ్డాతో బీజేపీ నేతలు విజయశాంతి, రఘునందన్ రావు, వివేక్ విడివిడిగా మంతనాలు జరిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ నేతల నుంచి ఫిర్యాదుల చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పార్టీ హాట్ టాపిక్గా మారింది. ఇక, రాబోయే వారం పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం.. పార్టీ కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలకు పదవులు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 600 కార్ల కాన్వాయ్తో.. -
ఓఆర్ఆర్ టెండర్పై రఘునందన్ సంచలన ఆరోపణలు, సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టెండర్ పైన సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు అప్పనంగా ఐఆర్బీ సంస్థకు టెండర్ అప్పగించారని దుయ్యబట్టారు. ఔటర్ రింగు రోడ్డు టెండర్ లో అవినీతి జరిగిందని గతంలోనే ఈడీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుషుల్నే లేకుండా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. (చదవండి: ప్రైవేటుకు ఓఆర్ఆర్!.. 30 ఏళ్లకు లీజుకిచ్చిన కేసీఆర్ సర్కార్) 'ఓఆర్ఆర్ టెండర్ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని ఇటీవల కొందరు విమర్శిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై మా పార్టీ చాలారోజులుగా ప్రశ్నిస్తోంది' అని రఘునందన్ రావు చెప్పారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ అనే సంస్థ ఈ టెండర్ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్లో భారీ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని విమర్శిస్తున్నాయి. మరోవైపు పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. (చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) -
‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది. ఇటీవల రేవంత్, ఈటల మధ్య సవాల్ ముగిసిన వెంటనే మరో సవాల్తో ముందుకొచ్చారు నేతలు. మంత్రి నిరంజన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరంజన్ రెడ్డి చేసిన సవాల్కు సిద్ధమన్నారు రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇక, తాజాగా రఘునందన్ మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్రెడ్డిపై ఈడీ విచారణ జరపాలి. మంత్రి పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాకు కాల్స్ వెళ్లాయి. మంత్రి పాత నెంబర్ ఎందుకు మార్చారు?. మంత్రికి ఉన్న దత్తపుత్రులు ఎవరు?. దత్తపుత్రుడికి కాంట్రాక్ట్లు.. వియ్యంకుడికి వీసీ పదవులు. కొన్న భూములకు మంత్రి లెక్కలు చూపించాలి. గౌడ నాయక్ పేరు మీద మీ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు అన్నీ చేస్తున్నారు. దత్త పుత్రుడు గౌడ నాయక్ పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏయే శాఖల నుంచి తీసుకున్నారు?. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ రానే లేదు. అగ్రికల్చర్ యునివర్సిటీ నుంచి దానికి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్ను దత్త పుత్రుడికే ఇప్పించుకున్నారు. గ్రౌండ్ నట్ రీసెర్చ్ స్టేషన్ ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?. గౌడ నాయక్ కొన్నభూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతకుముందు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌజ్ కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. వీటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలన్నారు. దీంతో, రంగంలోకి దిగిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రఘునందన్కు సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను తాను కబ్జా చేశానని రఘునందన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూసుకోవాలన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మాట్లాడాలన్నారు. రఘునందన్ వస్తే తన భూములు సర్వే చేసి చూపిస్తానన్నారు. -
రఘునందన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రఘునందన్ ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్డిఎస్ భూములను కబ్జా చేశానని రఘునందన్ చెప్తున్నాడు. ఆర్డిఎస్ ఎక్కడుంది ఆయనకు తెలుసా? సర్వే నంబర్ 60 లో శ్రీశైలం ముంపు లో పోయింది. 2020 లో సర్వే చేయించిన తరవాతే మేము వాటిని ఖరీదు చేశాం. ఎవరు అప్లికేషన్ పెట్టినా సర్వే చేస్తారు. న్యాయవాదిగా ఉన్న రఘునందన్ ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు సర్వే చేసినా ఎంత భూమి ఉందో తెలుస్తుంది కదా? నేను విదేశాల్లో ఉన్నప్పుడే రిప్లై పంపించాను. ఆయన ఎప్పుడు వస్తారో చెప్పండి. మేము మళ్ళీ సర్వే చేయిస్తాం. మీరు తప్పు చేసినట్టు రుజువైతే తప్పయింది అని ఒప్పుకోవాలి. (ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్లేనా?) నాకంటే చిన్న వాడివి. అపర మేధావి అని నాకు తెలుసు. పక్క నియోజకవర్గంలో వేలు పెట్టేపెట్టడం మానుకోవాలి. మా దగ్గర ఉన్న భూములకు రికార్డ్స్ ఉన్నాయి. మాకు భూమి అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
రఘునందన్ రావు ఎవరి మెప్పు కోసం నాపై ఆరోపణలు చేశారో తెలియదు
-
బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం
-
ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా: మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారనీ, తాను పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అక్కడే తన పదవికి రాజీనామా చేసి పోవాలని సవాల్ విసిరారు. ‘నాకు మూడు ఫాంహౌస్లు ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రచారం చేయడం అవివేకం...పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం’అని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన స్వగ్రామం పాన్గల్లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నవేనని స్పష్టం చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు రుణాలతో కట్టుకున్న ఇల్లు అని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు అమ్మాయిలు చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుంచి, ఇతరుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నారని వివరించారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారంటూ రఘునందన్ రావు ఆరోపించడం తగదని పేర్కొన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన బాలుడు గౌడనాయక్ ను చేరదీసి ఉన్నత చదువులు చదివించానని, ప్రస్తుతం అతను తన ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిపారు. భూముల రిజి్రస్టేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితుల్లో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి, తర్వాత పిల్లల తమ పేరు మీదకు మార్చుకున్నారని వివరించారు. రఘునందన్పై చట్టపరంగా ముందుకెళ్తాం పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి ఉందని ఆరోపించారనీ, కానీ అది వెల్టూరు గ్రామ పరిధి అని, అక్కడ లండన్లో డాక్టర్ గా పనిచేస్తున్న తన మరదలు కవిత, వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మా త్రమేనని వెల్లడించారు. వారు ఇక్కడ ఉండరనీ, తానే అప్పుడప్పుడు పర్యవేక్షణకు వెళ్తుంటానని మంత్రి వివరించారు. దురుద్దేశపూర్వకంగా రఘునందన్రావు చేస్తున్న అసత్య ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపారు. చదవండి: 165 ఎకరాల్లో ఫామ్హౌస్ ఎలా? -
165 ఎకరాల్లో ఫామ్హౌస్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్రావు విమర్శించారు. ప్రభుత్వ భూములు, ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల మీద కన్నేసి ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కృష్ణా నదిని కబ్జా చేసి, రీ సిల్టింగ్ చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ కట్టుకుంటే తాము కట్టుకోవద్దా అని మంత్రులు కూడా ఫామ్హౌస్లు కట్టుకున్నారన్నారు. రఘునందన్రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూడు ఫామ్హౌస్లు కట్టిన వ్యవసాయ మంత్రి ‘వ్యవసాయ శాఖ మంత్రి మొత్తం మూడు ఫామ్హౌస్లు కట్టారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాల విసీర్ణంలో ఒక ఫామ్హౌస్ నిర్మించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టారు. ఈ భూమిలో మూడున్నర ఎకరాల సీసీ రోడ్డు నిర్మించారు. గిరిజనుల పేరిట రూ.7 కోట్ల సబ్సిడీ రుణం తీసుకున్నారు. మంత్రి 80 ఎకరాలు కొని.. 165 ఎకరాల ఫామ్హౌస్ ఎలా కట్టారు?. నదిలో గోడ కట్టడంతో పాటు, మట్టి నింపి రీ సిల్టింగ్ చేయడం.. ఇవన్నీ నేరాలే. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఓ గిరిజన సోదరి పేరు నుంచి మంత్రి కుటుంబసభ్యుల పేర్లపైకి బదిలీ అయ్యాయి. ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసుకుని కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. మానవపాడు మండల తహశీల్దార్ కార్యాలయం 2021 అక్టోబర్లో తగలబడి ఈ ఫామ్హౌస్ భూములకు సంబంధించిన రికార్డులు కాలి బూడిదయ్యాయి. అధికారులు కేసు పెట్టాక పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా, ఇప్పటివరకు చార్జిషీట్ వేయలేదు. ఇదిలావుండగా పాన్గల్ మండలం కొత్తపేట గ్రామ పంచాయితీలో వంద ఎకరాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి మరో ఫామ్హౌస్ కట్టారు. పెద్ద మందాడి మండలం మోజర్ల సమీపంలో 50 ఎకరాల్లో ఇంకొక ఫామ్హౌస్ కట్టారు. ఇంకా చాలామంది మంత్రుల ఫామ్హౌస్ల చరిత్రలు నా వద్ద ఉన్నాయి..’అని రఘునందన్ చెప్పారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలి ‘గతంలో ఇలాంటి ఆరోపణలపై ఈటల రాజేందర్ను, అంతకుముందు ఓ దళిత మంత్రిని కేబినెట్ నుంచి తొలగించారు. మరి ఇప్పుడు నిరంజన్రెడ్డిపై ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోవడం లేదు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఒక న్యాయం.. అగ్రకులాల వారికి మరో న్యాయమా? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. అవినీతిని ఉపేక్షించకుండా సీఎం కేసీఆర్ మంత్రిపై చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూములను కబ్జా చేస్తున్న వారిని, తహసీల్ ఆఫీస్లను తగులబెట్టి, రికార్డులు లేవు కాబట్టి తమ పేరిట ఆస్తులు మార్చుకోవాలని చూస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి..’అని రఘునందన్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఇతర వేదికలను కూడా ఆశ్రయిస్తామని అన్నారు. -
బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి : రఘునందన్ రావు
-
కవితతో సుఖేష్ వాట్సాప్ చాట్.. ‘ఆ రేంజ్ రోవర్ కారు ఎవరిది?’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎమ్మెల్సీ కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేష్ చంద్ర లిక్కర్ స్కాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కవితతో తాను చేసిన వాట్సాప్ చాటింగ్ను బయటపెట్టాడు. ఈ సందర్బంగా లిక్కర్ వ్యాపారంలో వచ్చిన డబ్బును హైదరాబాద్ నుంచి ఆసియా దేశాలకు హవాలా మార్గాల ద్వారా మళ్లించినట్లు సుఖేష్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు రంగంలోకి దిగారు. దీంతో, రఘనందన్ రావు తాజాగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుఖేష్ చంద్ర లేఖపై ఈడీకి ఫిర్యాదు చేశారు రఘనందన్. ఈ సందర్భంగా రఘనందన్ మాట్లాడుతూ.. కవిత, సుఖేష్ చంద్ర వాట్సాప్ చాటింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరారు. సుఖేష్ వాట్సాప్ చాట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కారులో రూ.15 కోట్లు ఇచ్చినట్టు సంభాషణ ఉంది. నగదు ఉంచిన 6060 నెంబర్ రేంజ్ రోవర్ కారు ఎవరిది? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ పోలీసులు మౌనం వీడాలి. తెలంగాణ భవన్లో మనీలాండరింగ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ !
-
మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రఘునందన్ సవాల్
హైదరాబాద్: మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్చే రఘునందనరావు సవాల్ విసిరారు. తాను సూచించిన రెండు పథకాల్ని దుబ్బాక నియోజకవర్గంలో అమలు చేస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు రఘునందన్.దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు దళితబంధు ఇవ్వడంతో పాటు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి రూ. 7.5 లక్షలు ఇవ్వాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ఈ రెండు పథకాల్ని అమలు చేస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మంత్రి కేటీఆర్కు ఓపెన్ చాలెంజ్ చేశారు రఘునందన్. కాగా, 2020 ఆఖరులో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. కాని ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయంతో పెద్ద సంచలనమే కలిగింది. అప్పటి వరకు కారు స్పీడ్కు ఎక్కడా బ్రేకులు పడలేదు. ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. కాని దుబ్బాకలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కమలం పార్టీకి వదిలేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఊపు తెచ్చింది మాత్రం కచ్చితంగా దుబ్బాక ఎమ్మెల్యే సీటు అనే చెప్పాలి. -
ధరణిని ప్రక్షాళన చేయండి
సాక్షి, హైదరాబాద్: అనేక సమస్యలు సృష్టిస్తున్న ధరణిలో మార్పులు తీసుకురావాలని బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్రావు ప్రభుత్వానికి సూచించారు. ఆయన గురువారం శాసనసభలో మాట్లాడుతూ పాత అసైన్డ్ భూములు, సాదా బైనామా ద్వారా కొన్న భూములు ధరణిలో నమోదు కావడం లేదని వివరించారు. వాటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిషేధిత భూములుగా ధరణి చూపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దులపై ఆయన మాట్లాడుతూ, లక్షల్లో పెరిగిన అనాథ పిల్లల కోసం బడ్జెట్లో నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొన్ని పాఠశాలల ప్రస్తావన తెచ్చిన రఘునందన్.. అవి తమ పార్టీ చేపట్టినవిగా పేర్కొనడం సభలో వివాదం రేపింది. ఇది అప్రస్తుత ప్రసంగమంటూ మండిపడ్డ అధికార పక్ష సభ్యులు, పేరున్న పాఠశాలలకూ మతం రంగు పులమడం సరికాదని సూచించారు. -
డీజీపీని ఏపీకి పంపించాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీ కేడర్కు చెందిన డీజీపీ అంజనీకుమార్ను వెంటనే ఆ రాష్ట్రానికి పంపించి వేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీల్లో తెలంగాణ అధికారు లకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆయన ఆదివారం విలేకరుల తో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిని, తనకు అనుకూల మైన అధికారులను కీలక పోస్టుల్లో నియమించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్ల బదిలీల్లో బిహార్కు చెందిన అంజనీకుమార్ను డీజీపీగా, సంజయ్కుమార్ జైన్ను అదనపు డీజీ లా అండ్ ఆర్డర్గా, షాన వాజ్ ఖాసింను ఐజీ హైదరాబాద్ జోన్గా, స్వాతిలక్రాను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అద నపు డీజీగా నియమించారని వివరించారు. బిహార్కు చెందిన ఐఏఎస్ సోమేశ్కుమార్ను సీఎస్గా, అదే రాష్టానికి చెందిన ఐపీఎస్ను అంజనీకుమార్ను డీజీపీగా నియమించడాన్ని బట్టి కేసీఆర్ మూలాలు కూడా అదే రాష్ట్రంలోనే ఉన్నా యనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. -
దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు?
2020 ఆఖరులో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. కాని ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయంతో పెద్ద సంచలనమే కలిగింది. అప్పటి వరకు కారు స్పీడ్కు ఎక్కడా బ్రేకులు పడలేదు. ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. కాని దుబ్బాకలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కమలం పార్టీకి వదిలేసుకుంది. బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. ఉప ఎన్నికతో మారిన రాజకీయ చిత్రం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. అప్పటివరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న రాష్ట్ర రాజకీయాలు కారు వర్సెస్ కమలంగా రూపాంతరం చెందాయి. 2020లో చివర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును బీజేపీ గెలుచుకుంది. ఈ గెలుపుతో కారు పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకునే అవకాశం లభించింది. అంతకుముందు రెండు సార్లు ఓటమి చెందిన రఘునందనరావు స్వల్ప మెజారిటీతోనే అయినా సంచలన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు చెరకు ముత్యం రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాల చేతిలోనే దుబ్బాక నియోజకవర్గం కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ప్రత్యేక రాష్ట్ర పార్టీగా ఉనికిలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పాగా వేసింది. చెరకు ముత్యం రెడ్డి ప్లేస్లో 2004లో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009లో మళ్ళీ చెరకు ముత్యం రెడ్డి గెలిచినా..ఆ తర్వాత రెండుసార్లు గులాబీ పార్టీ తరపున సోలిపేట గెలిచారు. 2020లో సోలిపేట అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఉపఎన్నిక జరిగి దుబ్బాక రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చింది. జైత్రయాత్రలకు బ్రేక్ చెరకు, సోలిపేట కుటుంబాల జైత్రయాత్రకు బ్రేక్ వేసి.. కాంగ్రెస్, కారు పార్టీలను పక్కకు నెట్టి ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో..మూడు ప్రధాన పార్టీల నేతలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఎవరికి వారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు... రామలింగారెడ్డి సతీమణి పై స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. అందువల్ల చే జారిపోయిన సీటును తిరిగి గులాబీ పార్టీ ఖాతాలో వేసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుండి బరిలో దింపాలని గులాబీ పార్టీ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభాకరరెడ్డి కూడా దుబ్బాక సొంత నియోజకవర్గం కావడంతో..ఎంపీగా కంటే..ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. జనంతోనే జనం వెంటే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు నియోజకవర్గంలోనే క్యాంప్ వేసి పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మమేకమవుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాదులో ఉంటున్నప్పటికీ ఉదయం లేవగానే దుబ్బాకలో కనిపిస్తున్నారు. వారానికి 5 రోజులపాటు ఆయన నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి సైతం ప్రజల మధ్యే ఉంటున్నారు. మొత్తానికి ముగ్గురు నేతలు నియోజకవర్గంలోనే తిరుగుతూ..తమ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి.. ఎమ్మెల్యే రఘునందన్ రావుకి తరుచు డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రోటోకాల్ గొడవ ఎవరికి న్యాయం చేస్తుందో చూడాలి. తండ్రి సీటుపై తనయుడి ఆశ దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సీటుపై ఆశ పడుతున్నట్టు సమాచారం. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బై ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు అమలుకాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సరైన ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పడం.. రైతులకు రెండు ఎడ్లు, నాగలి ఇస్తానంటూ చెప్పిన హామీలేవీ నెరవేరలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయారు. మరి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రచారాయుధంతో ప్రజల ముందుకు వస్తారా అని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి మరో నేత డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆఖ లో మాత్రం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికే దుబ్బాక టికెట్ ఓకే అయినట్లు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే వారంలో ఐదు రోజులపాటు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని చెప్పుకొంటున్నారు. గులాబీ పార్టీలో మరో నేత బీసీ సామాజిక వర్గంకు చెందిన చిందెం రాజకుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..? ఉప ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నెగ్గిన మాటల మాంత్రికుడు కమలం పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కొనసాగుతున్న తమ జైత్ర యాత్రకు బ్రేక్ వేసిన రఘునందన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించి మళ్ళీ సత్తా చాటాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్రిముఖ పోటీలో దుబ్బాకలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
యాదగిరిగుట్ట: రాజ్యాంగంపట్ల, కోర్టుల పట్ల గౌరవం లేకుండా జాతీయ జెండాను అవమా నిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్ట ణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15 ఆగస్టు, 26 జనవరిని గొప్పగా జరుపుకోవాల్సిన సందర్భంలో కరోనా సాకుతో దూరం పెట్టడం బాధాకరమన్నారు. హైకోర్టు చెప్పిన తరువాత కూడా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్కు మనసు రాకపోవడం దారుణమన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమా వేశాల్లో.. రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలు లేవనెత్తుతానని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను అరికట్టలేని సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆత్మహత్యలను అరిక డుతామని, వారికి డబ్బులు ఇచ్చి వస్తున్నారని విమర్శించారు. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని కోరుతూ స్థానిక వీఆర్ఏలు ఎమ్మెల్యే రఘునందన్రావుకు వినతిపత్రం అందజేశారు. -
నిషేధం ఉన్నా రిజిస్ట్రేషన్లు చేశారు: రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేటలోని సర్వే నంబర్ 78కి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 2007లో జీవో నంబర్ 863 జారీ చేయడంతోపాటు 2012లో సర్క్యులర్ జారీ చేసినా రెవెన్యూ అధికారులు వందలాది రిజిస్ట్రేషన్లు చేశారని, ఎన్ఓసీలు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. అలాగే ఆయా భూముల్లో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేశారన్నారు. నిబంధనలున్నవి సామాన్యులు, పేదలకేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి లేఖ రాశారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ లేఖను విడుదల చేశారు. ఓ నగల వ్యాపారి ఎగ్గొట్టిన రూ. 119 కోట్ల రికవరీలో భాగంగా అతను తనఖా పెట్టిన ఆ సర్వే నంబర్లోని 8 ఎకరాలను బ్యాంకులు వేలం వేసేందుకు ప్రయతి్నస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకున్న అధికారులు.. వారికి నచి్చన సంస్థలకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. చదవండి: 'దక్షిణాదిన కేసీఆర్.. ఉత్తరాదిలో కేజ్రీవాల్.. చీల్చే పని వీళ్లదే..' -
క్విడ్ప్రోకోతోనే ఖమ్మం సభ: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావసభ నిర్వహణ వెనుక ‘క్విడ్ప్రోకో’కోణం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు ఆరోపించారు. మియాపూర్ హఫీజ్పేట్లోని సర్వే నంబర్ 78లో ఆదిత్య కంపెనీ పేరిట తోట చంద్రశేఖర్ కొన్న 40 ఎకరాల ప్రభుత్వ భూములను (సుమారు రూ.4వేల కోట్ల విలువ) ఆయనకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇందుకు ప్రతిఫలంగా ‘క్విడ్ప్రోకో’కింద ఖమ్మం సభకు చంద్రశేఖర్తో ఖర్చు పెట్టిస్తున్నారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ భూములను బీఆర్ఎస్ ఏపీ విభాగం అధ్యక్షుడికి ఎలా కట్టబెడుతున్నారో ఖమ్మం సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం నవాబు వారసుడికి అధికారిక అంత్యక్రియలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా తెలంగాణ పోరాట అమరు లను అవమానించినట్ల అయ్యిందన్నారు. -
‘నిజాం వారసులకు అధికారిక అంత్యక్రియల లాంఛనాలను ఖండిస్తున్నాము’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించడాన్ని రఘునందర్ రావు తప్పుబట్టారు. కేసీఆర్ చర్యలు కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఎమ్మెల్యే రఘునందన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ దెబ్బకొడుతున్నారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని ఖండిస్తున్నాము. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ఎవరికి ఊడిగం చేస్తున్నారో ప్రజలు గమనించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ లాంటి వారి ఆత్మలు కేసీఆర్ చర్యలతో ఘోషిస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ దెబ్బకొడుతున్నారు: రఘునందన్
-
వ్యవసాయ శాఖలో అలజడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అలజడి చేలరేగింది. ఈ శాఖలోని ఒక సంఘానికి చెందిన ఉద్యోగులు వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి రఘునందన్రావుపై బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు సంబంధిత శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కార్యదర్శి రఘునందన్ రావును ఆనవాయితీగా ఆహ్వానించాల్సి ఉండగా, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగక పుండు మీద కారం చల్లినట్లుగా ఈ శాఖకు సంబంధం లేని మరో మంత్రి శ్రీనివాస్గౌడ్ను సభకు ఆహ్వానించడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. డైరీ ఆవిష్కరణ సభ వాడీవేడిగా కొనసాగింది. సగానికిపైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ఒక సంఘం ఇలా చేయడంతో ఒక్కసారిగా వ్యవ సాయ శాఖలో కలకలం చెలరేగింది. వివక్ష.. వేధింపుల వల్లే? వ్యవసాయ శాఖలో రెండు సంఘాలున్నాయి. అందులో తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కీలక మైంది. ఈ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభ మంగళవారం హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరయ్యారు. సాధారణంగా ఏటా వ్యవసాయ శాఖ మంత్రిని, కార్యదర్శిని పిలవడం ఆనవాయితీ అయినా, కావాలనే వారిని ఆహ్వానించలేదని, ఈ శాఖ మంత్రిని కాకుండా మరో మంత్రిని పిలిచారని తీవ్ర మైన రచ్చ జరుగుతోంది. తమ సంఘంపై వివక్ష చూపడం, సంఘం సభ్యులను ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాలకు పంపించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఉద్యోగ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేశారు. విజిలెన్స్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు ఈ సభలో అసోసియేషన్ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ, తమ సంఘంపై వివక్ష కొనసాగు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ దాడుల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నార న్నారు. తమ అసోసియేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నందుకే ఈ వివక్ష అని మండి పడ్డారు. తమ సంఘానికి మద్దతు ఇచ్చే వారిని బదిలీ పేరుతో బయటికి పంపిస్తున్నారని ఆరోపించారు. 317 జీవో పేరుతో 15 మందిని బదిలీ చేశా రన్నారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో 2018 తరువాత ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదన్నారు. రెండు సంఘాల మధ్య గొడవలు ఉన్నందునే పదో న్నతులు ఇవ్వలేదని చెప్తున్నారన్నారు. తమ నిరస నను వ్యక్తం చేయడం కోసమే డైరీ ఆవిష్కరణకు మంత్రి నిరంజన్రెడ్డిని, కార్యదర్శి రఘునందన్ రావును ఆహ్వానించలేదన్నారు. తమకు అను కూలంగా ఏమీ చేయకున్నా ఫర్వాలేదని, కానీ ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. శాఖలో ఒకరిద్దరు చీడ పురుగుల్లా తయారయ్యారన్నారు. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వివక్ష తగదు: మంత్రి శ్రీనివాస్గౌడ్ డైరీ ఆవిష్కరణ అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సాటి ఉద్యోగులపై వివక్ష చూపితే ఎలాగని ప్రశ్నించారు. ‘సావిత్రీబాయి పూలే, అంబేడ్కర్ లాంటి వారికే అవమానాలు తప్పలేదు.. ఎవరు, ఎంతగా అవమానపరచినా వారు బాధపడలేదు. వెనక్కు తగ్గలేదు. శరీరం కుంగిపోతున్నా మనసు కుంగిపోలేదు. అలా కుంగిపోతే రాజ్యాంగం, రిజర్వేషన్లు వచ్చేవి కాదు. పట్టుదలను వదలొద్దు. భయం, పిరికితం వద్దు. ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఒకరిద్దరు నాయకులను ఇబ్బంది పెట్టి వేధిస్తే అయ్యేదేమీ లేదు. ప్రమోషన్లు రాకపోతే చస్తమా. ధైర్యంగా ఉండాలి..’అంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ అభయం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అందరిదని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ అంటేనే ఎక్కువగా తెలిసేది కాదని, కానీ సీఎం కేసీఆర్ దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. గువ్వల బాల రాజు మాట్లాడుతూ, తాము ఎప్పుడూ ఉద్యమ స్పూర్తితోనే ఉంటామన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము ఉద్యోగుల వెంట ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.రాములు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
దుబ్బాకలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో శుక్రవారం మంత్రుల పర్యటన సందర్భంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారం రోజులుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్, నిరంజన్రెడ్డి అనుచరగణంతో నియోజకవర్గానికి రావడం, బీజేపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని పోటాపోటీ నినాదాలు, తోపులాటతో పరిస్థితి వేడెక్కింది. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హబ్సీపూర్లో గోదాముల ప్రారంభోత్సవం సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కా సేపు తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు ఇబ్బందికి గురయ్యారు. దీంతో మంత్రి హరీశ్రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి మంత్రుల బృందం దుబ్బాక బస్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లింది. అప్పటికే అక్కడ మోహరించిన బీజేపీ నాయకులు మరో సారి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయి తే అధికారిక కార్యక్రమంలో ఎవరూ నినాదాలు చేయొద్దని ఎమ్మెల్యే రఘునందన్రావు బీజేపీ కార్యకర్తలకు నచ్చజేప్పే ప్రయ త్నం చేసినా వారు వినలేదు. బారికేడ్లను పక్కకు నెట్టేసి కార్యక్రమ ప్రాంగణంలోకి చొచ్చు కొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఉద్రిక్తతల మధ్య మంత్రులు దుబ్బాకలో కొత్తగా నిర్మించిన బస్టాండ్, కొత్త బస్సులను ప్రారంభించారు. ఆపై మంత్రులు అక్కడి నుంచి వెళ్లడంతో బీజేపీ శ్రేణులు సైతం వెళ్లిపోయాయి. -
దుబ్బాకలో టెన్షన్ వాతావరణం
-
దుబ్బాకలో ఉద్రిక్తత.. బస్టాండ్ ప్రారంభోత్సవంపై రగడ..
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక మండలం హబ్సిపూర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోడౌన్ ప్రారంభోవోత్సవలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు సర్దిచెప్పారు. బస్టాండ్ వేదికగా దుబ్బాకలో రాజకీయాలు వేడేక్కాయి. ఉప ఎన్నిక సమయంలో కొత్త బస్టాండ్ నిర్మిస్తామని బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు అప్పట్లో హామీ ఇచ్చాయి. అనుకున్నట్లుగానే సకల హంగులతో రూ. 4కోట్ల వ్యయంతో ఏడాదిన్నర కాలంలోపే నిర్మాణం పూర్తి చేశారు. దుబ్బాక బస్టాండ్ను మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో బస్టాండ్ క్రెడిన్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయి. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. తాను అసెంబ్లీలో ప్రస్తావించడం వల్లే బస్టాండ్ పూర్తైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవంపై రగడ నెలకొంది. ఎమ్మెల్యే రఘునందన్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పొలిటికల్ హీట్ రాజుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నూతన బస్టాండ్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్లోకి బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ప్రవేశం నిషేధించారు. బస్టాండ్ ప్రాంగణంలోకి ఎవ్వరిని అనుమతించలేదు. సిద్ధిపేట సీపీ శ్వేతా దుబ్బాక పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్టాండ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లకు డ్రెస్కోడ్ పెట్టారు పోలీసులు. చదవండి: Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చదవండి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి -
కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు మధ్య సవాళ్ల పర్వం
-
‘అవసరమైతే ఒక కౌన్సిలర్తో రాజీనామా చేయిస్తా.. గెలిచి చూపించు’
మెదక్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరన్రావుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఒక చాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్రావును కౌన్సిలర్గా గెలిచి చూపించాలంటూ సవాల్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రఘునందన్ సిద్ధిపేటలో రఘునందన్ కౌన్సిలర్గా గెలవాలన్నారు. రఘునందన్ కౌన్సిలర్గా పోటీకి దిగుతానంటే ఒక కౌన్సిలర్తో రాజీనామా చేయిస్తానని, సత్తా ఏంటో చూపించాలన్నారు కొత్త ప్రభాకర్రెడ్డి ఈ క్రమంలోనే బీజేపీపై కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. నీ రాజీనామాను ఆమోదింప జేస్కో.. చూస్కుందాం ముందు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ సత్తా ఏంటో చూపించాలని ప్రతి సవాల్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు. ‘నువ్వు రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటే అప్పుడు చూద్దాం మెదక్లో బీజేపీ గెలుస్తుందో.. బీఆర్ఎస్ గెలుస్తుందో’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రఘునందన్రావు. -
నేను రెడీ.. మీరూ సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఆస్తులు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా తమ ఆస్తుల వివరాలు ప్రకటిస్తారా అని బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు సూటిగా ప్రశ్నించారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలన్నీ ప్రకటిస్తారా ? అని నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనది అక్రమ సంపాదన అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అక్రమంగా సంపాదించి ఉంటే గత ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. గతంలో పటాన్చెరు పరిశ్రమల్లో తాను డబ్బు వసూలు చేసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇన్నాళ్లూ దానిపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన తప్పుడు సమాచారంపై రోహిత్రెడ్డి సమాధానం చెప్పాలనీ, అసలు ఆయన డ్రగ్స్ తీసుకున్నారా? లేదా ? బెంగళూరు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా.. అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. వీటన్నింటిపై రోహిత్రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద మాట్లాడితే బాగుండేది. అయ్య ప్పమాలలో ఉండి.. అసభ్యంగా మాట్లాడారు. అయ్యప్పమాల తీశాక అన్నింటికీ సమాధానం చెబుతాను’ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే రోహిత్రెడ్డి భయపడుతున్నారనీ ఈడీ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్రావు నిందించారు. -
అయ్యప్ప మాలలో ఉండి రోహిత్ అసత్యాలు మాట్లాడుతున్నాడు : రఘునందన్ రావు
-
డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్..
సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈమేరకు మాట్లాడారు. రోహిత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్ను దొర అని తిట్టారని, కానీ ఇప్పుడు అదే దొర వద్ద ఆయన పనిచేస్తున్నారని రఘునందన్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను డబ్బులు వసూలు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా.. విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. రూ.100ల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు. చదవండి: TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి -
రఘునందన్కు రూ.వందల కోట్లు ఎలా వచ్చాయి?
దూద్బౌలి: విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివాసం ఉంటున్నారో, రూ.వందల కోట్లను ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పేర్కొన్నారు. ఆ రూ.వందల కోట్లు పఠాన్చెరులో పరిశ్రమలనుంచి వసూలు చేసిన సొమ్ముకాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే శనివారం భాగ్యలక్ష్మీ అమ్మవారిని సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ను తీవ్ర పదజాలంతో విమర్శించిన రోహిత్రెడ్డి ఆదివారం మరోసారి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బండి సంజయ్కు సవాలు విసిరితే ఆయన స్పందించకుండా ఎమ్మెల్యే రఘునందన్రావు సీన్లోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సెప్టెంబర్కు ముందు సింహయాజులును కలిసినట్లు నిరూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని రోహిత్రెడ్డి సవాల్ విసిరారు. ఈడీ నోటీసుల విషయంలో మా న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
ఈడీ నోటీసులకు బండి సంజయ్ కి సంబంధం లేదు : రఘునందన్ రావు
-
చార్మినార్లో గెలిచి చూపిస్తా: రఘునందన్రావు
నల్లగొండ టూటౌన్: సిరిసిల్లలో 2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన మంత్రి కేటీఆర్.. 1500 ఓట్లతో గెలిచిన తనను అవహేళన చేస్తున్నాడని, తాను చార్మినార్లో కూడా గెలిచి చూపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు చెప్పారు. తండ్రి కేసీఆర్ బొమ్మ లేకుండా కేటీఆర్ సిరిసిల్ల వదిలి వేరేచోట గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. నల్లగొండ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సభలో రఘునందన్రావు మాట్లాడారు. ఇదీ చదవండి: కేసీఆర్కు గుడ్బై చెప్పాల్సిన సమయం వచ్చింది: జేపీ నడ్డా -
అయ్యబాబోయ్ దుబ్బాకనా? ఆ పోస్టింగ్ మనకొద్దు.!
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వాధికారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్కడ పనిచేయాలంటేనే జంకుతున్నారు అధికారులు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ, కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యా నలిగిపోతున్నారు అధికారులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? రీడ్ దిస్ స్టోరీ.. పచ్చగడ్డి వేసినా భగ్గే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే మాటల ఈటెలు విసురుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో ఏం చేయాలో తోచక అధికార యంత్రాంగం తల బాదుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికే చెందిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. అలాగే అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రఘునందనరావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వర్గ పోరు సాగుతోంది. ప్రోటోకాల్ వ్యవహారంతో ప్రారంభమై... పరస్పరం దిష్టి బొమ్మల దహనం వరకు నిరంతర ప్రక్రియగా మారింది. చదవండి: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్కు లేఖ పంపిన ఈసీ కార్యక్రమం ఏదైనా సీన్ సితారే నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. దుబ్బాక అభివృద్ధి మా పార్టీయే చేసిందంటూ ఇద్దరూ ప్రజలకు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ..కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే రఘునందనరావు ఉపన్యాసాలిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నియోజకవర్గంలోని అక్బర్ పేట, భూంపల్లి నూతన మండలాల కార్యాలయాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు సమక్షంలో సైతం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి చూస్తుండగానే పరస్పరం తోపులాటకు దిగారు. ఈ ఘర్షణ చూస్తూ..ఎవరికి ఎలా సర్దిచెప్పాలో తోచక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తరుచుగా జరుగుతున్న గొడవలు చూసి ప్రజలు కూడా చికాకు పడుతున్నారు. వీరిద్దరి వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకపడిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఐటీ దాడులనగానే గుండె నొప్పా..
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు, వారి బంధువులకు ఐటీ, ఈడీ సంస్థలు నోటీస్లు ఇవ్వగానే గుండె నొప్పి అంటూ ఆస్పత్రులకు వెళుతున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఐటీ అధికారులు తన కొడుకుపై చేయి చేసుకున్నారని, దొంగల్లాగా దాడి చేశా రని మంత్రి మల్లారెడ్డి ఆరోపించడం బాధ్యతారాహిత్యమన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాలనగానే మల్లారెడ్డి తన సెల్ఫోన్ చెత్తబుట్టలో ఎందుకు దాచారని, బకెట్లలో ఫైళ్లు పెట్టే దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నిన్నటి దాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి... నోటీస్లు ఇవ్వగానే గుండెపోటు ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదన్నారు. దుబ్బాక అభివృద్ధి నిధులు రూ.5 కోట్లు తాను ఖర్చు చేసే వెసులుబాటు కల్పిస్తూ వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ను రఘునందన్ కోరారు. ఇదీ చదవండి: మల్లారెడ్డి తన ఫోన్ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీకి రఘునందన్రావు ఫిర్యాదు
-
ఈడీ ఆఫీస్కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: అధికార పక్ష టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే యత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. కౌంటర్ యాక్షన్లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా.. మరోవైపు యాదాద్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేవుడిపై ప్రమాణంతో ఈ వ్యవహారంతో తమకేం(బీజేపీ) సంబంధం లేదని చాటిచెప్పే యత్నం చేశారు. ఇక ఇప్పుడు.. బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన ‘ఎమ్మెల్యే కొనుగోలు అంశం’పై ఫిర్యాదు కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ హార్స్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన ఈడీని కోరినట్లు సమాచారం. అంతేకాదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన రూ.100 కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని ఆయన ఈడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: దేవుడి మీద ఒట్టు.. నాకేం తెలియదు! -
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన యత్నంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్రావు మీడియాతో మాట్లాడిన వీడి యోను బుధవారం ఆయన ట్యాగ్ చేశారు. ఆ పార్టీ కొనుగోళ్లపై తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ రేవంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్కే.. కేసీఆర్తో ఆ నలుగురు భేటీ -
వేములవాడకు త్వరలో ఉపఎన్నిక.. బీజేపీని నాలుగుసార్లు ఓడించా..
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు, వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పౌరసత్వ వివాదంలో ఇరుక్కున్న రమేశ్బాబుకు పదవీ గండం ఉందని, త్వరలోనే వేములవాడకు ఉప ఎన్నిక వస్తుందని రఘునందన్రావు జోస్యం చెప్పారు. దీనిపై రమేశ్బాబు దీటుగా స్పందించారు. మునుగోడు నుంచి అసెంబ్లీకి మరో ‘ఆర్’ వేములవాడ: ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ తరఫున ట్రిపుల్ ‘ఆర్’ ఉందని, మునుగోడు ఎన్నికతో మరో ‘ఆర్’ అసెంబ్లీలోకి అడుగు పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు, అర్చకుల బృందం స్వామివారి ప్రసాదం అందించి, సత్కరించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం అంశంపై కోర్టు తీర్పు వస్తుందని, త్వరలోనే ఇక్కడ కూడా ఉపఎన్నిక జరుగుతుందని చెప్పారు. వేములవాడలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే రమేశ్బాబు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పేరు మార్చి, ఎంఐఎం అనుమతితో ప్రభుత్వం వేడుకలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సెక్యులరిజమా లేక మతతత్వమా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని మాట తప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని తెలిసి, ఆయనకు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే 8 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేవలం రంగురంగుల బ్రోచర్లు తప్ప నయాపైసా పని చేయలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు సంతోష్బాబు, శ్రీనివాస్, సుదర్శన్యాదవ్, అన్నారం శ్రీనివాస్, కిష్టస్వామి, రమేశ్ తదితరులున్నారు. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) రాజన్న గుడికొచ్చి రాజకీయం చేయొద్దు వేములవాడ: నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నాలుగుసార్లు ఓడించానని, సొంత బాబాయ్, బీజేపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్రావుపై 20 వేల ఓట్లతో గెలిచానని ఎమ్మెల్యే రమేశ్బాబు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పౌరసత్వ వివాదం కోర్టు పరిధిలో ఉందని, దానిపై నో కామెంట్ అన్నారు. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చాలా సార్లు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారని, ఆయన వేసుకునే దుస్తులు ఆయన ఇష్టమని తెలిపారు. మంత్రి సారథ్యంలో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రాజన్న గుడి చెరువులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా చూస్తున్నామని, గుడికొచ్చిన మీకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించామన్నారు. మీరిప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్క పైసానన్న రాజన్న ఆలయానికి తీసుకొచ్చారా అని మండిపడ్డారు. వేములవాడలో ఉపఎన్నిక అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కౌన్సిలర్గా ఓడిపోయారని, ఇదీ వేములవాడలో ఆ పార్టీకి ఉన్న బలం అంటూ ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు) -
లిక్కర్ స్కాం నిందితుడితో కవిత తిరుమల ఎందుకు వెళ్లారు?: రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కాం ఆరోపణల నిందితుడితో ఎమ్మెల్సీ కవిత దిగిన ఫోటో తాజాగా వైరలవుతోంది. సీబీఐ కేసులో ఏ-14 రామచంద్ర పిళ్లై కుటుంబంతో తిరుమలలో కవిత కనిపించారు. బోయినపల్లి అభిషేక్రావుతో సహా ఆమె తిరుపతి టూర్కు వెళ్లారు. అయితే లిక్కర్ స్కాం నిందితుడితో ఎమ్మెల్యే కవిత తిరుమలకు ఎందుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రశ్నించారు. రామచంద్ర పిళ్లైని కలవలేదని గతంలో కవిత చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్తో సంబంధం లేదన్న కవిత.. రామచంద్ర పిళ్లైతో కలిసి తిరుమలకు ఎందుకెళ్లారని నిలదీశారు. మరమనిషి అనేది నిషేధిత పదమా? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. మీరిచ్చే నోటీసులను చట్టబద్దంగా ఎదుర్కొంటామని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు. ఏదో కారణంలో సభ నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారు. బీఏసీ సమావేశానికి తమను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. దర్యాప్తు ముమ్మరం ఢిల్లీ లిక్కర్స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ సమాచారంతో ముడుపులపై ఈడీ కూపీ లాగుతోంది. ఢిల్లీ మద్యం టెండర్స్లో కంపెనీల సిండికేట్కు హైదరాబాద్లో రూపకల్పన జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీంతో హైదరాబాద్లో అయిదుచోట్ల ఢిల్లీ ఈడీ బృందం తనిఖీలు చేపట్టింది. రాబిన్ డిస్టలరీస్, డైరెక్టర్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. సికింద్రాబాద్, కోకాపేట్, నార్సింగ్లో సీబీఐ సోదాలు జరిపింది. కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీలు స్వాధీనం చేసుకుంది. అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, కర్ణాటక, చెన్నై, ఢిల్లీలోని రామ చంద్రన్ పిళ్లై ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు. -
త్రిశూల్ సిమెంట్స్ వ్యాజ్యం ధర్మాసనానికి
సాక్షి, అమరావతి: పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వినందుకు పెనాల్టీ కట్టాలంటూ గనుల శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ త్రిశూల్ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ను సింగిల్ జడ్జి సోమవారం ధర్మాసనానికి నివేదించారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామంలో లైమ్స్టోన్ లీజు పొంది, పరిమితికి మించి ఖనిజాన్ని తవ్వి రవాణా చేసినందుకు గనుల శాఖ రూ.100.24 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ పెనాల్టీ చెల్లించాలంటూ 2020 మే 7న డిమాండ్ నోటీసు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ త్రిశూల్ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రావు రఘునందన్రావు సోమవారం మరోసారి విచారణ జరిపారు. త్రిశూల్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. మనుగడలో లేని కంపెనీ పేరు మీద నోటీసు ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదించాలని కోర్టు భావిస్తే, తమకు కొంత రక్షణ కల్పించాలని కోరారు. త్రిశూల్ సిమెంట్స్ అక్రమాలపై పోరాటం చేస్తున్న తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్రెడ్డి తరఫు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ, తాము దాఖలు చేసిన వ్యాజ్యంతోనే త్రిశూల్ అక్రమాలపై ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యం ధర్మాసనానికి వెళ్లడమే సముచితమన్నారు. ఆ ఆధారాలను చూస్తే కోర్టు వారిని ఉరి తీస్తుంది అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. త్రిశూల్ అక్రమాలపై పెద్ద సంఖ్యలో ఆధారాలున్నాయంటూ ఓ పెద్ద పుస్తకాన్ని చూపారు. ఇందులోని ఆధారాలను పరిశీలిస్తే త్రిశూల్కు చెందిన వారిని ఈ కోర్టు ఉరి తీస్తుందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా మొదలైన కొన్ని అంశాలను వ్యాజ్యంలో లేవనెత్తారని, అందువల్ల ధర్మాసనమే విచారించడం సబబు అని చెప్పారు. ఈ వ్యాజ్యం ఫైళ్లన్నింటినీ త్రిశూల్ సిమెంట్స్పై దాఖలైన వ్యాజ్యాలతో జత చేసే విషయంలో పరిపాలన పరమైన ఆదేశాల నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. త్రిశూల్ సిమెంట్స్పై రెండు వారాలపాటు ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. -
ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత(బీజేఎల్పీ)గా ఎవరిని ఎన్నుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది. బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. రాజాసింగ్తో పాటు ఎం.రఘునందన్రావు, ఈటల రాజేందర్ పార్టీ ఎమ్మెల్యేలు గా ఉన్నారు. పార్టీలో సీనియర్గా ఉన్న రఘునందన్రావుకు ఈ అవకాశం లభిస్తుందా? లేదా మంత్రిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవమున్న ఈటలకు దక్కుతుందా? అని పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడిగా ఈటలకు మంచి ప్రాధాన్యం లభించడం, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించినందున రఘునందన్ వైపు రాష్ట్ర నాయకత్వం మొగ్గుచూపొచ్చుననే వాదన పార్టీలో వినిపిస్తోంది. చదవండి: ‘సిట్టింగులందరికీ సీట్లు’ -
హరీశ్రావు.. దమ్ముంటే దుబ్బాకలో పోటీచెయ్
దుబ్బాక టౌన్: ‘మంత్రి హరీశ్.. నీకు దమ్ముంటే దుబ్బాకలో నాపై పోటీకి రా. నీవు ప్రచారం చేసిన దుబ్బాక, హుజూరా బాద్లో ప్రజలు నీకు ఎలా గుణపాఠం చెప్పిండ్రో మరచిపోయావా’ అంటూ ఎమ్మెల్యే రఘునందన్రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దుబ్బాకలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. అబద్ధాలు ప్రచారం చేయడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే హరీశ్ పనిగా పెట్టుకున్నాడన్నారు. దుబ్బాకలో ఇటీవల జరిగిన పింఛన్ల పంపిణీలో ‘దుబ్బాక నియోజకవర్గంలో 50 వేలకు పైగా పింఛన్లు ఇస్తున్నాం’ అని మంత్రి చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. నియోజక వర్గంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో కూడా మంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. గుడిసెలు, ఇళ్లు అన్ని కలిపినా నియోజకవర్గంలో 56 వేలు లేవని, మరి అంత మందికి ఎట్లా ఇస్తుండ్రో లిస్టు విడుదల చేయాలన్నారు. ‘హరీశ్రావు... దుబ్బాక ఎమ్మెల్యే రిబ్బన్లు కత్తిరించుకుంట తిరుగుతుండంటూ మాట్లాతున్నవు. నేను కత్తిరించకుంటే సిద్దిపేట నుంచి వచ్చి నువ్వు కత్తిరిస్తవ. అవగాహన లేకుండ మాట్లాడకు. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీవు ఒక్కటి అంటే.. నేను నాలుగు అంటా..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలపై అవగాహన లేని ఎంపీ ప్రభాకర్రెడ్డిని వెంటబెట్టుకుని దుబ్బాకలో తిరుగుతూ పిచ్చిపిచ్చిగా వాగడం మానుకోవాలని స్పష్టం చేశారు. చదవండి: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు -
మంత్రి శ్రీనివాస్గౌడ్ను అరెస్టు చేయాలి
సాక్షి, హైదరాబాద్: తన వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్వో) నుంచి తుపాకీ తీసుకొని గాలిలోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్ను వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఏ చట్టం ప్రకారం మహబూబ్నగర్లో మంత్రి కాల్పులు జరిపారో జిల్లా ఎస్పీ, డీజీపీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వేలాది మంది హాజరైన ర్యాలీని ప్రారంభించేందుకు మంత్రి తుపాకీ తీసి కాల్చడమేమిటని రఘునందన్ ప్రశ్నించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్లు అని మంత్రి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భద్రతా సిబ్బంది వద్ద రబ్బర్ బుల్లెట్లు ఉంటే ఎమ్మెల్యేలంతా ఆలోచించుకోవాలని, తమకు భద్రతగా ఉన్న గన్మెన్ల వద్ద ఉన్నవి రబ్బర్ బుల్లెట్లా? అసలు బుల్లెట్లా? తెలియాలని అన్నారు. మంత్రి కాల్పుల ఘటనను పక్కదారి పట్టించేందుకు జిల్లా ఎస్పీ, తానే మంత్రికి తుపాకీ ఇచ్చినట్లు చెపుతున్నారని, ఏ చట్టం ప్రకారం పోలీసు తుపాకీని ఎస్పీ ఇలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎస్పీ సమక్షంలో తుపాకీ పేలిస్తే దాన్ని ఇప్పటి వరకు సీజ్ చేయలేదు. మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశమున్నా కేసు పెట్టలేదు. ఆ తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపలేదు’అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు డీజీపీ కార్యాలయానికి గానీ ఎస్పీ కార్యాలయానికి వెళ్లేందుకు కానీ సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు రమ్మంటారో చెప్పాలన్నారు. -
కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టాలి
-
రేవంత్ ఎవరి ఏజెంటో అందరికీ తెలుసు.. బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి 2017లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఏ వ్యాపారం కోసం, ఎవరి ఏజెంట్గా పనిచేయడం కోసం రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రశ్నించారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడికి రేవంత్రెడ్డి ఏజెంట్ అని, ఆయన వ్యాపారాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్లో చేరారన్న ఆరోపణలు నిజమని ప్రజలు అనుకోవాలా? అని వ్యాఖ్యానించారు. 14 నెలలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి విలువలకు కట్టుబడని రేవంత్రెడ్డి, ఇప్పుడు విలువలు, వ్యాపారాలు, ఇతర శాసనసభ్యుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. బుధవారం ఢిల్లీలో రఘునందన్ మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్రెడ్డి విలువలున్న వ్యక్తి కాబట్టే కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారని తెలిపారు. -
కేసీఆర్ ఊరికి రూ.5 కోట్లిచ్చిన కేంద్రం
వరంగల్ (ఖానాపురం) : కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు ఇప్పటివరకు రూ.5కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.కోటిన్నర మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. మండల వ్యాప్తంగా చేపట్టిన ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం బుధరావుపేట గ్రామంలో ప్రారంభించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘునందన్రావు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తన గ్రామానికి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలుసుకున్న కేసీఆర్ పరువు కాపాడుకునేందుకు ఇంటింటికి రూ.10లక్షలు ఇచ్చాడన్నారు. ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని కాపాడటానికి కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచి్చందని, ఇందులో మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.9వేలు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేలు మాత్రమే కేటాయించిందన్నారు. 2014, జూన్ 2 నుంచి రాష్ట్రంలోని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత మేర నిధులు ఖర్చు చేసిందో సమాచార హక్కు చట్టం ద్వారా యువకులు దరఖాస్తు చేసి తెలుసుకోవచ్చన్నారు. 1978లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని చెప్పగా.. కాంగ్రెస్ పెద్దలకు ఎలా అర్థమైందోగానీ గరీబీ హఠావో అంటే గరీబోళ్లను గ్రామాల అవతల పెట్టారన్నారు. కేసీఆర్ పాలనలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడడం బాధాకరమన్నారు. అభివృద్ధిపై చర్చించడానికి చర్చలు, డిబేట్లకు సిద్ధమని ఆయన కేటీఆర్కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు కేసీఆర్ది అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి, మండల పార్టీ నాయకులు రాజుయాదవ్, జల్లి మధు, యాకస్వామి, సలీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖానాపురంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు రఘునందన్రావు సంఘీభావం తెలిపారు. పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే రఘునందన్రావు సమక్షంలో బీజేపీలో చేరారు. -
వ్యవసాయ వర్సిటీ వీసీగా రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ (వీసీ)గా వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రవీణ్రావు ఈనెల 24న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి వీసీగా రఘునందన్రావు బాధ్యతలు స్వీకరించారు. పూర్తిస్థాయి వీసీ నియామకం జరిగే వరకు రఘునందన్రావు ఈ బాధ్యతల్లో ఉండనున్నారు. పూర్తిస్థాయి వీసీ పదవీ విరమణ చేసినపుడు వ్యవసాయ శాఖకు కమిషనర్గా ఉన్న వారే ఇన్చార్జి వీసీగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్రావు ఈ బాధ్యతలు చేపట్టారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించిన రఘునందన్రావు
దుబ్బాక టౌన్: దుబ్బాకలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జాప్యం అవుతుండటంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు స్వయంగా రంగంలోకి దిగి పలువురు లబ్ధిదారులతో శుక్రవారం గృహప్రవేశాలు చేయించారు. అయితే ఎమ్మెల్యే చర్యపై అధికార టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇంకా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండా... ఇళ్ల వద్ద పనులు పెండింగ్లో ఉండగానే ఎలా గృహప్రవేశాలు చేయిస్తారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఉదయమే వందలాది మందితో కలిసి... శుక్రవారం ఉదయాన్నే డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో చేరుకున్న ఎమ్మెల్యే రఘునందన్రావు కొంద రు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించడం, లబ్ధిదారులతో కలసి గృహప్రవేశాలు చేయించడం తప్పా అని ప్రశ్నించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కలను సాకారం చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని రఘునందన్రావు చెప్పారు. తొలి విడతగా ఎంపిక చేసిన 180 మంది లబ్ధిదారులకు ఇళ్లను ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులంతా శనివారంలోగా గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. శనివారం కూడా కొందరు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తానన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. భారీ పోలీసు బందోబస్తు.. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వస్తే గొడవలు జరిగే ఆస్కారం ఉందని గ్రహించి పట్టణంలోని పలు ప్రధాన చౌరస్తాలలో భారీగా మోహరించారు. -
అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్పై పోటీ
నల్లగొండ టూటౌన్: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్పై పోటీ చేసి గెలుస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు సవాల్ విసిరారు. నల్లగొండ పట్టణంలో సోమవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో, ఆ తర్వాత విలేకరుల సమావేశంలో రఘునందన్రావు మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి ఓటమితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచారని, టీఆర్ఎస్ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నందున బీజేపీ నాయకులు ప్రజల్లోనే ఉండి పోరాడితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు రాజకీయం చేసి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నాయన్నారు. నిరసన తెలియజేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. రైల్వే ఆస్తుల్ని తగులబెడుతుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేశారని, నిఘా వ్యవస్థ ఎక్కడ పోయిందని నిలదీశారు. పోలీసు కాల్పుల్లో ఒక అభ్యర్థి మరణించడం బాధాకరమని, అతని అంతిమయాత్రలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టి ఇతరులను రానీయకుండా అడ్డుకోవడాన్ని శవరాజకీయంగా అభివర్ణించారు. ఆర్మీ అభ్యర్థులు బలిపశువులు కావద్దని, ఒకసారి కేసులు నమోదైతే ఉద్యోగాలు రావడం కష్టమన్నారు. -
రఘునందన్ రావుపై కేసు నమోదుపై బీజేపీ ఆగ్రహం
-
వీడియోలు బయటకు, రఘునందన్పై కేసు.. ఎమ్మెల్యే రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి తనపై కేసులు పెడితే లీగల్గా ఎదుర్కొంటానని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు తెలిపారు. నోటీసులు ఇచ్చినా, పోలీసులు అరెస్ట్ చేసేం దుకు వచ్చినా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పార్టీ కార్యాల యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే దాకా బాధితురాలి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేద న్నారు. అమ్నీషియా పబ్ మైనర్ అమ్మాయి కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు బండి సంజయ్ నేతృత్వంలో పోరాడుతామని పేర్కొన్నారు. సంబంధిత వార్త: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్రావుపై కేసు నమోదు -
రఘునందన్, రాజాసింగ్పై కేసులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్రావు, రాజాసింగ్ లోథా లపై హైదరాబాద్లో కేసులు నమోద య్యాయి. జూబ్లీహిల్స్లో సామూహిక అత్యాచారానికి సంబంధించి ‘కారులో బాలిక’వీడియోలు విడుదల చేశారనే ఆరో పణలకు సంబం ధించి రఘునంద్ రావుపై అబిడ్స్ పోలీసులు, విద్వేషాలు రెచ్చ గొట్టేలా అజ్మీర్ దర్గా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్పై కంచన్ బాగ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రఘునందన్రావు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై ఆరోపణలు చేశారు. అదే సందర్భంలో బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. అయితే ఎమ్మెల్యే ఇలా చేయడం చట్ట ప్రకారం నేరమని, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది కరమ్ కోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబం ధించి రఘునందన్రావుకు నోటీసులు జారీ చేయనున్నారు. రఘునందన్ ఇల్లు ముట్టడికి యత్నం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు బాధిత బాలిక వీడియోలు, ఫొటోలను బయటపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు మంగళవారం ఆయన ఇంటి ముట్టడికి విఫలయత్నం చేశారు. నార్సింగి పోలీసుస్టేష¯పరిధిలోని ఔటర్రింగ్ రింగ్ రోడ్డు పక్కన ఎమ్మెల్యే నివసించే గేటెడ్ కమ్యూనిటీ వద్దకు మంగళవారం పదుల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని గేటు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కొద్ది సేపు అక్కడే కూర్చున్న నిరసనకారులు రఘునందన్రావుకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినవారిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేష¯న్కు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచి అనంతరం విడిచిపెట్టారు. రాజాసింగ్పై...: రాజస్తాన్లోని అజ్మీర్ దర్గాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఓ వర్గం మనోభావాలను దెబ్బతీశారంటూ కంచన్ బాగ్కు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ మహమూద్ అలీ సోమవారంరాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధా రంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజాసింగ్పై చట్టప రంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూఫీ ఆర్గనైజేషన్కు చెందిన ముతై్తదా మజ్లీస్–ఇ–మషై ఆధ్వర్యంలోని మతపెద్దలు సోమవారంరాత్రి దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్యను కలసి వినతిపత్రం అందజేశారు. ఆయన తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటికి సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి చేతులు దులు పుకొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకోవా లని వారు కోరారు. కిషన్బాగ్ కార్పొరేటర్ హుస్సేనీ పాషా సైతం ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై బహదూర్పురా ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్కు ఫిర్యాదు చేశారు. -
Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్రావుపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (అన్యాయం జరిగితే ఆత్మహత్యే.. ఎంపీ కేశినేని నానిని హెచ్చరించిన నాగయ్య) -
అమ్నీషియా పబ్ కేసు: బెంజ్కారులో అత్యాచారం.. ఇన్నోవా కారులోని వారి అరెస్టా?
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని.. కానీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. బెంజ్ కారులో అత్యాచారం జరిగితే.. ఇన్నోవాలో ఉన్న వారిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ కారులో ఉన్న వారినెవరినీ ముద్దాయిలుగా చూపకపోవడం బాధాకరమన్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి తాము సేకరించిన ఫొటోలు, వీడియోలను శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియాకు విడుదల చేశారు. ఎరుపు రంగు బెంజ్ కారులో బాధితురాలిపై ఎమ్మెల్యే కుమారుడు, ఇతరులు లైంగిక దాడి చేశారని నిరూపించడానికి ఈ ఆధారాలు ఉపయోగపడతాయన్నారు. క్లీన్చిట్ ఎలా ఇస్తారు? అత్యాచార ఘటనతో సంబంధమున్న వారి ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించినట్టు.. కొందరిని దుబాయ్ విమానం ఎక్కించినట్టు తనకు సమాచారం ఉందని రఘునందన్రావు తెలిపారు. ఈ కేసు చల్లబడ గానే వారిని తిరిగి హైదరాబాద్కు రప్పించుకునే ప్లాన్లో ఉన్నారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు విచారణ జరపకుండానే ఘటనలో ఎమ్మెల్యే కొడుకు లేడని, హోంమంత్రి మనవడి ప్రమేయం లేదని క్లీన్చిట్ ఎలా ఇస్తా రని నిలదీశారు. పబ్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న, అత్యాచార ఘటనలో పాల్గొనవారి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. హైకోర్టుకు సమర్పించి.. సీబీఐ విచారణ కోరుతామన్నారు. పోలీసులకు ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని.. కానీ పోలీసులు వాటిని ధ్వంసం చేసి అంతా ఉత్తుత్తివేనంటే పరిస్థితి ఏమిటనే అనుమానం ఉందన్నారు. ఎంఐఎం వారిని కాపాడేందుకు.. అత్యాచార ఘటనలో ఎంఐఎం వారిని కాపాడేందుకు టీఆర్ఎస్ వారిని బలిపశువులను చేస్తున్న విషయాన్ని కేటీఆర్ గ్రహించడం లేదని రఘునందన్ అన్నారు. హైదరాబాద్లో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఎంఐఎం నేతలే నడిపిస్తున్నారని.. ఈ కేసులో వాళ్లు చెప్పినట్టే ఎఫ్ఐఆర్లలో పేర్లు, విచారణ జరుగుతోందన్నారు. దోషులకు శిక్షపడే దాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.. ఈ ఘటనపై సీబీఐతోగానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోగానీ విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను రఘు నందన్రావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులను ఎంఐఎం నేతలు కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తున్నారని.. అందుకే సీబీఐ, హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్టు తెలిపారు. -
ఫుటేజీలో ఒక్క సెకను తొలగించినా సుప్రీంకు వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మే 28న జూబ్లీహిల్స్ పబ్లో హోంమంత్రి మనవడు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడని, స్వయంగా మంత్రి పీఏ బుక్ చేశారని ఆరోపించారు. శుక్రవారం రఘునందన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇందులో హోంమంత్రి మనవడు, ఎంఐ ఎం ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ప్రముఖ హిందీ పత్రిక యజమాని కొడుకు ప్రమేయం ఉంది. సీసీటీవీ ఫుటేజీ లో ఒక్క సెకను తొలగించినట్లు తెలిసినా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. దీనిపై ట్విట్టర్ పిట్ట(మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి) ఎందుకు స్పందించలేదు? ఎమ్మెల్సీ కవిత మహిళ అయి ఉండి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు?. రూ.1200 కోట్లు పెట్టి కట్టిన పోలీస్ కమాం డ్ సెంటర్, సీసీ కెమెరాలు పని చేయడం లేదా? ప్రపంచంలో ఎక్కడా లేన న్ని సీసీ కెమెరాలు తెలంగాణలో ఉన్నాయని అంటున్నారు. మరి వాటి ఉపయోగం ఏమి టి? ’అని ప్రశ్నించారు. బీజేఎల్పీనేత రాజాసింగ్ మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ కేసులో అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
-
చైనా మిలటరీ పాలన కోరుకుంటున్నారా..?
సాక్షి, హైదరాబాద్: చైనాలో అమలవుతోన్న మిలటరీ తరహా పాలనను రాష్ట్రంలో అమలు చేయాలని టీఆర్ఎస్ కోరుకుంటోందా అని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘు నందన్రావు ప్రశ్నించారు. కొందరు మంత్రులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, చైనాలో ఉన్నది మిలటరీ పాలన అని ఐటీ మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలని ఎం.రఘునందన్ రావు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే చైనాలో ఊరుకోరని హితవు పలికారు. ఇక్కడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కేటీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రాన్ని విమర్శించడానికే అసెంబ్లీ సమావేశాలను టీఆర్ఎస్ సర్కారు నిర్వహిస్తోందని ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులు విడుదల చేసిన విషయాన్ని మంత్రి హరీశ్రావు తెలుసుకోవాలన్నారు. రెండున్నర లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు రాకపోతే ఏమైందని ప్రశ్నించారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయని తెలిపారు. -
మీటర్లు పెట్టాలని ఆదేశించలేదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ఈఆర్సీ ఆదేశించిందని పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను కచ్చితంగా తెలుసుకోవడానికి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశించామన్నారు. ఈఆర్సీ సభ్యులు ఎండీ మనోహర్రాజు, బండారు కృష్ణయ్యతో కలసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి రఘునందన్రావు ఆరోపణలను ఖండించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు బిగించాలని జారీ చేసిన ఆదేశాలను రఘునందన్రావుకు పంపానని, అయినా మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థ ఈఆర్సీకి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదన్నారు. మహారాష్ట్రలోని ఒక విద్యుత్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి కచ్చితమైన వినియోగంపై అధ్యయనం చేశారని, రూ.36 కోట్ల విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు అదనంగా పొందాయని ఈ అధ్యయనంలో తేలిందన్నారు. తెలంగాణ సైతం ఇలాంటి ప్రయోగం చేయాలన్న ఆలోచన ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. త్వరలో జిల్లాలకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ వినియోగదారులకు హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారి సమస్యలను తెలుసుకోవడానికి విద్యుత్ రెగ్యులేటరీ కమి షన్ అన్ని జిల్లాల్లో పర్యటించనుందని శ్రీరంగారావు వెల్లడించారు. ఈ నెల 19న ఉదయం కామారెడ్డి జిల్లాలో, మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనుందన్నారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా కన్జ్యూమర్ గ్రివెన్స్ రిడ్రస్సల్ ఫోరంకు పంపవచ్చని, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ఈఆర్సీని ఆశ్రయించవచ్చని సూచించారు. -
కమలంలో ‘ప్రొటోకాల్’ కలకలం! పైకి అంతా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీలో ప్రొటోకాల్ కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీలో అంతా బాగానే ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర–2 ప్రారంభానికి ముందే ఇలాంటివి వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తనను వేదికపైకి పిలవకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించారని సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. తమకు గౌరవం, ప్రాధాన్యతనివ్వడం లేదంటూ కొన్నిరోజుల క్రితం వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్ నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహించగా, జాతీయపార్టీ వారిని బుజ్జగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ఉల్లంఘన రూపంలో అసంతృప్తి బట్టబయలైంది. తన ఫిర్యాదును పరిష్కరించకపోతే జాతీయ నాయకత్వాన్ని ఆశ్రయించాలని, వారం రోజుల్లో తగిన స్పందన రాకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రఘునందన్ భావిస్తున్నట్టు తెలిసింది. గతేడాది తొలివిడత ›ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి మొదలు పెడితే ము గింపు సభ హుస్నాబాద్ దాకా, ఆ తర్వాత మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం దాకా పదిసార్లు అవమానాలు ఎదురయ్యాయని ఆయన తన అనుయాయులతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్యనేతలు ఇతర ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరుస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ఒంటెద్దు పోకడపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్టు తెలిసింది. (చదవండి: తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు? ) -
రఘునందన్ Vs టీఆర్ఎస్!
మిరుదొడ్డి (దుబ్బాక)/ బెజ్జంకి (సిద్దిపేట)/సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావును.. పెరుగుతున్న పెట్రో ధరలపై టీఆర్ఎస్ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్కు తరలించడం, అక్కడ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా ఆందోళనలకు దిగడంతో ఉద్రి క్తత ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండ లం గుడికందులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు గురువారం ఆ గ్రామానికి వెళ్లారు. అయితే గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులు.. కేంద్ర ప్రభు త్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వద్ద నిరసన వ్యక్తం చేశారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘు నందన్రావు పోలీస్ స్టేషన్లో నేలపై భైఠాయించారు. ఏసీపీ దేవారెడ్డి, సీఐ కృష్ణ ఆయన్ను శాంతింపజేసేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు స్టేషన్కు తరలివచ్చి ఎమ్మెల్యేకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు ముందుగా బీజేపీ కార్యకర్తలను, ఆ తర్వాత ఎమ్మెల్యే రఘునందన్రావును బలవంతంగా అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్కు తరలించడం తో గొడవ సద్దుమణిగింది. బెజ్జంకి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడిన రఘునందన్రావు.. అధికారం ఎప్పుడూ ఒక్కరికే ఉండదనే విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేను విడుదల చేయండి: బండి సంజయ్ ఎమ్మెల్యే రఘునందన్ రావును వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఫోన్లో ఆయన సిద్దిపేట పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. కొం దరు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. -
17న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి తమ సస్పెన్షన్, సభలోకి అనుమతించే అంశాలపై పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడా న్ని నిరసిస్తూ ఈనెల 17న ఇందిరాపార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. స్పీకర్ హోదాకు విలువనిస్తూ కోర్టు గౌరవ సూచన చేసినా, ఆ స్ఫూర్తిని తుంగలోతొక్కి దురదృష్టకర సంప్రదాయాన్ని లేవనెత్తారని ఈటల విమర్శించారు. స్పీకర్ తన గౌర వాన్ని నిలుపుకోలేకపోవ డం దురదృష్టకరమన్నారు. ఆస్ట్రియా బృందం ఈ రోజు అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలి స్తున్న సందర్భం లో తమ సస్పెన్షన్ ఒక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ఈ విధానాలు చూస్తుంటే ఉత్తర కొరి యా గుర్తు వస్తుందని, అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చప్పట్లు కొట్టలేదు అని ఒక సభ్యున్ని కాల్చి చంపారని ఈటల పేర్కొన్నారు. ఇకపై ఇక్కడా చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక ఉద్యమ నాయకుడినేనని గతంలో ఉద్యమాన్ని తూలనాడిన వారితోనే తమను సస్పెండ్ చేయించడం అవమానకరమన్నారు. ‘హైకోర్టు ఉత్తర్వులు, మీ పిటిషన్ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీ అభ్యర్థన తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ చెప్పారని రఘునందన్ రావు తెలిపారు. తమ అభ్యర్థనను సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినా స్పీకర్ వినలేదన్నారు. ‘ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్డే. స్పీకర్ తనకు వచ్చిన డైరెక్షన్ మేరకే పని చేస్తున్నారు’అని రఘునందన్ విమర్శించారు. -
బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థన తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సస్పెన్షన్కు గురైన ముగ్గురు బీజేపీ శాసనసభ్యులు తమపై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలంటూ మంగళవారం శాసన సభాపతి చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిశారు. అయితే సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని పోచారం స్పష్టం చేయడంతో అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు. ఈ నెల 9న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ సభ తీర్మానించడం తెలిసిందే. దీన్ని సవాల్చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారిని సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్కు సూచించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుమారు 45 నిమిషాలపాటు స్పీకర్ను కలిసేందుకు వేచిచూశారు. చివరకు స్పీకర్ చాంబర్లో కలిసేందుకు వారికి పిలుపు రావడంతో పోచారాన్ని కలిసి కోర్టు ఉత్తర్వులతోపాటు సస్పెన్షన్ను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించారు. సభ జరుగుతున్న సమయంలో తమ స్థానం నుంచి కదలలేదని, సభను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని రఘునం దన్రావు, ఈటల రాజేందర్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. తమను బహిష్కరించడం అన్యాయమని, పార్టీలను పక్కనపెట్టి పక్షపాతరహితంగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ సభ్యులు కోరారు. పోడియంలోకి వచ్చినట్లు భావిస్తే తాను సస్పెన్షన్కు అర్హుడనని, మిగ తా ఇద్దరు సభ్యులను సభకు అనుమతించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్కు విన్నవించారు. ‘సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవంగా తీసుకుందని’స్పీకర్ వ్యాఖ్యానించగా తమ వినతిని సభతోపాటు సభానాయకుడి ముందు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. ఈలోగా శాసనసభ సమావేశం ప్రారంభమైనట్లు గంట మోగడంతో స్పీకర్ సభలోకి వెళ్లగా బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుముఖం పట్టారు. ‘మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ ప్రకటించారని సభ నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో ప్రకటించారు. -
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు
-
బీజేపీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. తమను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా సస్పెండ్ చేశారంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. సభ ముగిసే వరకు సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సస్పెన్షన్పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కాగా తమపై సస్పెన్షన్ను రద్దు చేసి, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానిచ్చేలా ఆదేశించాలని ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చదవండి: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన -
రాజ్యాంగ పరిరక్షకురాలిగా స్పందించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం–కేంద్రం–బీజేపీల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతుండగా అంతరాయం కలిగిస్తున్నారనే పేరుతో ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిందే. కాగా దీనిపై వారు రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు సస్పెన్షన్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేయాలని, ఇతర అన్ని వేదికలు, సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా స్పందిస్తామన్నారు తాము సభలో ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకపోయినా సస్పెండ్ చేశారంటూ గవర్నర్కు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని, తమ హక్కులను కాలరాస్తూ తమను సస్పెండ్ చేసినందున రాజ్యాంగ పరిరక్షకురాలిగా దీనిపై స్పందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిందిగా స్పీకర్కు సూచించాలని కోరారు. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు అసెంబ్లీలో తాము ప్రాతినిధ్యం వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా దీనిపై రాజ్యాంగబద్ధంగా స్పందిస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని ఈటల, రఘునందన్రావు మీడియాకు తెలిపారు. శాసనసభలో పరిణామాలను గవర్నర్కు వివరించామని, గవర్నర్ను ప్రసంగించేందుకు పిలవక పోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పామని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ముఖాలు చూడకూడదని సస్పెండ్ చేశారని చెప్పారు. గవర్నర్ను కలిసిన వారిలో పార్టీ నేతలు డీకే అరుణ, డాక్టర్ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి, డా.జి.మనోహర్రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు నిరసనలు అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ మంగళవారం అన్ని జిల్లాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనేలా చూడాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ఈ మేరకు కార్యాచరణపై సోమవారం ఆర్ధరాత్రి వరకు నేతలు చర్చించారు. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలను ఎదుర్కోలేక, వారు లేవనెత్తే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక, ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో ఆయన ముఖం చూసే ధైర్యం లేకే ఇలాంటి రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ దిగుతున్నాయని బీజేపీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు పాల్గొన్నారు. -
ఏ రాష్ట్రానికి ఇవ్వని లేఖ మీకెందుకివ్వాలి?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అనేక చోట్ల బియ్యం దొంగదారి పడుతోందని, కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమలేదని, ధాన్యం సేకరణ అంశంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి ఇవ్వని లేఖను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వచ్చే ప్రతి గింజను కొంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నప్పటికీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని గొడవ తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చిందన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఇంకా ఏం పని ఉంది? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర మంత్రులకు ఢిల్లీలో ఇంకా ఏం పని ఉందని ప్రశ్నించారు. రాజకీయాన్ని రక్తి కట్టించే పని చేస్తున్నారా? లేక గల్లీలో పనిలేక ఢిల్లీకి వచ్చారా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులకు రైతులపై కంటే రాజకీ యంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని విమర్శించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే పంచాయితీ: అరుణ టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణలోని వరి రాజకీయాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు సేద తీరుతున్నారని, పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు చేసేందుకే వారిని కేసీఆర్ ఢిల్లీకి పంపారని విమర్శించారు. రైతుల విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని అరుణ సూచించారు. -
డబ్బులివ్వలేదని గుడిసెకు నిప్పు
మిరుదొడ్డి(దుబ్బాక): భార్య డబ్బులివ్వలేదన్న కోపంతో నివసిస్తున్న గుడిసెకే నిప్పు పెట్టాడో భర్త. ఈ ఘటనలో గుడిసెలో దాచుకున్న రూ.1.73 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని లక్ష్మీనగర్లో శనివారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. గుండవేణి మమత, బాలయ్య భార్యాభర్తలు. మూడు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గూడెం నుంచి బతుకుదెరువు కోసం లక్ష్మీనగర్కు వలస వచ్చారు. గ్రామంలో ఒక గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలయ్య తరచుగా భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భూమికి సంబంధించిన రూ.1.73 లక్షల నగదు రావడంతో మమత బీరువాలో దాచింది. ఆ డబ్బును తనకివ్వాలని భార్యతో బాలయ్య శుక్రవారం రాత్రి గొడవ పడ్డాడు. డబ్బులివ్వకుంటే గుడిసెకు నిప్పు పెడతానని బెదిరించగా..భార్య ఇవ్వనని చెప్పి అదేరాత్రి భయంతో పొరుగునే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో డబ్బులివ్వలేదని కోపంతో శనివారం తెల్లవారు జామున బాలయ్య గుడిసెకు నిప్పు అంటించి పరారయ్యాడు. ఈ ఘటనలో బీరువాలో ఉంచిన నగదుతో పాటు విలువైన సామగ్రి, దుస్తులు కాలిపోయాయి. బాధితురాలిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నల్లగొండ ఘటనపై గవర్నర్కి బీజేపీ నేతల ఫిర్యాదు
-
నల్లగొండ ఘటనపై గవర్నర్కి బీజేపీ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ వాహనంపై, పలువురు నేతలపై దాడికి సంబంధించి బీజేపీ నేతలు గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మంగళవారం రాజ్భవన్లో కలిశారు. బీజేపీ నేతలు రాజాసింగ్, డీకే అరుణ, రఘునందన్రావు, ఈటల రాజేందర్ తదితరులు గవర్నర్కు వినతి పత్రం ఇచ్చారు. నల్లగొండ ఘటనలో పోలీసుల వైఫల్యంపై గవర్నర్కి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. వరి దాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో వరి ధాన్యాలు కొనుగోలు విషయంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దాడి చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్పై దాడి జరిగిందని ఆరోపించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమీ జీర్ణించుకోలేక కేసీఆర్ బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇదే విషయంపై గవర్నర్కు వినతిపత్రం అందించామని తెలిపారు. కేంద్ర కొనుగోలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. సివిల్ సప్లై కార్పోరేషన్కు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి ఆపుతున్నారని అనుమనం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికి రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు.