SpaceX
-
ఇంకా ముందుగానే సునీతా విలియమ్స్ రాక!
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరింత ముందుగానే భూమ్మీదకు రానున్నారా?. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయిన ఆమెను వెనక్కి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం కానుందా?.. అసలు మేటర్ ఏంటంటే..మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో క్రూ-10 మిషన్ నిర్వహించాలని నాసా భావించింది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్(ISS)కు పంపాలనుకుంది. అయితే ఈ ప్రయోగంలోనే సునీత, విల్మోర్లను తిరిగి భూమ్మీదకు రప్పించేందుకు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ను వినియోగించబోతోంది. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేయగా ఇప్పుడది ముందుకు జరిగింది. మార్చి 12వ తేదీనే ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారని నాసా(NASA) ధృవీకరించింది. ఈ కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. -క్రూ-9లో వెళ్లిన సునీతా విలియమ్స్(Sunita Williams), విల్మోర్లు రిలీవ్ అవుతారు. అలా డ్రాగన్ క్యాప్సూల్ ఎండేవర్ ద్వారా ఇద్దరు భూమ్మీదకు రావడానికి మార్గం సుగమం అవడమే కాకుండా ఐఎస్ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మార్చి 19వ తేదీన సునీత, విల్మోర్లు భూమ్మీద అడుగుపెట్టే అవకాశాలున్నాయి .ఇక క్రూ-10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజుల తర్వాత అంటే ఈ జులైలో స్పేస్ ఎక్స్కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు చేరుకుంటారు. కిందటి ఏడాది జూన్లో బోయింగ్ స్టార్లైనర్ ద్వారా క్రూ-9 మిషన్లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే.. స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్మోర్లు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు. ఇదీ చదవండి: యాక్సియోమ్ మిషన్-4లో భారతీయుడు -
స్టార్లింక్ సేవలను ధ్రువీకరించిన మస్క్
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందిస్తున్న స్టార్ లింక్ తన సర్వీసులు విస్తరించినట్లు పేర్కొంది. తాజాగా భూటాన్లో కంపెనీ సేవలు ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ ఎలాన్మస్క్ ధ్రువీకరించారు. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భూటాన్లో 2024 డిసెంబర్లో ప్రారంభించినట్లు మస్క్ ఫిబ్రవరి 11, 2025న తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా పేర్కొన్నారు. సంప్రదాయ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో నెట్ సేవలందించాలని స్టార్లింక్ లక్ష్యంగా పెట్టుకుంది.ధరలు ఇలా..భూటాన్ సమాచార శాఖ స్టార్లింక్ ప్రణాళికలకు బేస్ ధరను నిర్ణయించింది. రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు సుమారు రూ.3,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 23 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు డేటా స్పీడ్ను అందిస్తుంది. స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్ నెలకు రూ.4,200గా ఉంది. ఇందులో అపరిమిత డేటాను అందిస్తున్నారు. 25 ఎంబీపీఎస్ నుంచి 110 ఎంబీపీఎస్ డేటా స్పీడ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ధరలు స్థానిక టెలికాం ఆపరేటర్లు అందించే రేట్ల కంటే అధికంగా ఉన్నప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో స్టార్లింక్ అందించే కనెక్టివిటీ చాలా కీలకమని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: Infosys ఉద్యోగుల జీతాలు పెంపు.. ఎంతంటే..భారత్లో ఇలా..భారత్లో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఇక్కడ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్లింక్ భారత్లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింక్ అంగీకరించింది. -
డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ పైలట్గా శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) రికార్డుకెక్క బోతు న్నాడు. స్పేస్ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్Dragon spacecraft)కు పైలట్గా వ్యవహరించబోతున్నాడు. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి మంజూరు చేసింది. యాక్సి యోమ్–4 మిషన్లో భాగంగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని కి చేరుకోనున్నారు. 14 రోజుల తర్వాత తిరిగి వస్తారు. ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం భాగస్వా మిగా మారింది. డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ సారథ్యం వహించనున్నా డు. పోలాండ్కు చెందిన ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబో ర్ కపూ సైతం ఇందులో పాలుపంచుకుంటున్నా రు. మొత్తం నలుగురు అస్ట్రోనాట్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్కు చేరుకుంటారు. త్వరలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. శుభాంశు శుక్లా ప్రస్తుతం భార త వైమా నిక దళంలో గ్రూప్ కెప్టెన్గా పనిచేస్తున్నాడు. యా క్సియోమ్–4 మిషన్కు ఎంపికయ్యాడు. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలో శిక్షణ పొందాడు. -
భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యం
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్మస్క్(Elon Musk) భారత్, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయనే సంకేతాలిచ్చారు. ఇటీవల టెక్సాస్లోని స్పేస్ఎక్స్(SpaceX) స్టార్బేస్ ఫెసిలిటీలో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తన మద్దతును వ్యక్తం చేశారు.ఆతిథ్యం(hosting)లో పాల్గొన్న ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) నేతృత్వంలోని ప్రతినిధుల బృందంలో ప్రశాంత్ రుయా (డైరెక్టర్ - ఎస్సార్ క్యాపిటల్), జయ్ కోటక్ (కోహెడ్ - కోటక్ 811), రితేష్ అగర్వాల్ (ఫౌండర్ & గ్రూప్ సీఈఓ-ఓయో), కళ్యాణ్ రామన్ (సీఈఓ - ఫ్లిప్కార్ట్), ఆర్యమన్ బిర్లా (డైరెక్టర్ - ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), నీలేష్ వేద్ (ఛైర్మన్ - అప్పారెల్ గ్రూప్), ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి ఉన్నారు.ఈ ఆతిథ్యంలో భాగంగా భారత పారిశ్రామికవేత్తలు స్పేస్ ఎక్స్ అత్యాధునిక సౌకర్యాలను సందర్శించారు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో అమెరికా, భారత్ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మస్క్ నొక్కి చెప్పారు. ‘పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అడ్డంకులను తగ్గించడానికి నేను అన్ని విధాలా అనుకూలం’ అని మస్క్ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ చిప్లపై అమెరికా ఆంక్షల ప్రభావంఐజీఎఫ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘స్థిరమైన, సాంకేతిక ఆధారిత భవిష్యత్తును రూపొందించడంలో భారత్కు, ప్రపంచ మార్గదర్శకుల మధ్య సహకారం పెరుగుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న తరుణంలో అర్థవంతమైన చర్చలు మరింత ప్రాధాన్యతను ఇస్తాయి’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీజీజీ) కో-ఛైర్మన్గా మస్క్ను ప్రతిపాదించారు. -
స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్... ప్రయోగం విఫలం
టెక్సాస్: అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’కు చేదు అనుభవం ఎదురైంది. స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ పునరి్వనియోగ రాకెట్ ‘స్టార్షిప్’ ప్రయోగం విఫలమైంది. 123 మీటర్ల (400 అడుగులు) పొడవైన ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే పేలిపోయింది. శకలాలు కరీబియన్ సముద్రంలో పడిపోయాయి. రాకెట్ బూస్టర్ మాత్రం క్షేమంగా భూమిపైకి తిరిగివచ్చింది. టెక్సాస్లోని లాంచ్ప్యాడ్ హస్తాలు బూస్టర్ను చక్కగా ఒడిసిపట్టుకున్నాయి. టెక్సాస్లో మెక్సికో సరిహద్దులోని బొకా చికా బీచ్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.37 నిమిషాలకు స్టార్షిప్ రాకెట్ను ప్రయోగించారు. ఇది 10 డమ్మీ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. 8 నిమిషాల తర్వాత రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి. స్పేస్క్రాఫ్ట్లోని ఆరు ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం ఆగిపోయింది. రాకెట్ భూమిపైకి తిరిగివస్తూ గాల్లోనే పేలిపోయింది. శకలాలు నిప్పుల వర్షాన్ని తలపించాయి. కేవలం ప్రయోగాత్మకంగానే స్టార్షిప్ను ప్రయోగించినట్లు స్పేస్ఎక్స్ అధికార ప్రతినిధి డాన్ హౌట్ చెప్పారు. బూస్టర్ క్షేమంగా తిరిగిరావడం సంతోషకరమే అయినప్పటికీ రాకెట్ పేలిపోవడం బాధాకరమని అన్నారు. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్షిప్ విశ్వసనీయతను మరింత పెంచిందని తెలిపారు. ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తవహిస్తామని పేర్కొన్నారు. డమ్మీ శాటిలైట్లను అంతరిక్షంలో ఎలా వదిలిపెట్టాలన్న దానిపై సాధనకోసం స్టార్షిప్ను ప్రయోగించామని వివరించారు. మరోవైపు రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతున్న దృశ్యాలను స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.SpaceX Starship breaking up and re-entering over Turks and Caicos this afternoon. pic.twitter.com/LbpJWewoYB— Molly Ploofkins™ (@Mollyploofkins) January 16, 2025 విజయం సంగతి ఏమోగానీ వినోదం మాత్రం లభించిందని చమత్కరించారు. ఇంధనం లీకేజీ వల్లే రాకెట్ ప్రయోగం విఫలమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దది, శక్తివంతమైనది అయిన స్టార్షిప్ రాకెట్కు సంబంధించి ఇది ఏడో ప్రయోగం కావడం విశేషం. ఈ రాకెట్ సాయంతోనే అంగారక గ్రహంపై అడుగు పెట్టాలని ఎలాన్ మస్క్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రెండు స్టార్షిప్ రాకెట్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది.🚨#BREAKING: Debris was seen over the Caribbean after SpaceX's Starship broke apart during a test flight, creating a spectacular show in the sky.📌#Caicos | #IslandsWatch as multiple footage shows debris lights up the skies as SpaceX successfully launched Starship Flight 7… pic.twitter.com/ZWIUr22USV— R A W S A L E R T S (@rawsalerts) January 16, 2025 -
ఎలాన్ మస్క్ చేతికి టిక్టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్టాక్ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్మస్క్ టిక్టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?
అమెజాన్ ఆధ్వర్యంలోని బ్లూ ఆరిజిన్(Blue Origin) స్పేస్ సర్వీస్ కంపెనీ తన మొదటి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జెఫ్ బెజోస్(Jeff Bezos) నేతృత్వంలోని ఈ సంస్థ ‘న్యూ గ్లెన్’ అనే స్పేస్క్రాఫ్ట్ను జనవరి 8న ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ స్థాపించిన 25 ఏళ్లకు మొదటి రాకెట్ను లాంచ్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ఎక్స్ ప్రైవేట్ స్పేస్ సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ నేపథ్యంలో దానికి పోటీగా అమెజాన్ ఈ ప్రయోగం చేయడం రెండు సంస్థల మధ్య పోటీని తెలియజేస్తుంది. త్వరలో ప్రయోగించబోయే రాకెట్ లాంచ్కు సంబంధించి ‘నెక్ట్స్ స్టాప్ లాంచ్’ అని తెలియజేస్తూ జెఫ్ బెజోస్ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఆరు గంటల ప్రయోగంబ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ రాకెట్(New Glenn rocket)ను లండన్లోని కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేయనున్నట్లు ‘స్పేస్ ఫ్లైట్ నౌ’ తెలిపింది. 2024 డిసెంబర్ 27న రాకెట్ హాట్-ఫైర్ పరీక్ష పూర్తయినట్లు తెలిపింది. రాకెట్ పనితీరును, పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని పరీక్షించే ఈ ప్రయోగం సుమారు ఆరు గంటల పాటు ఉంటుందని భావిస్తున్నారు. న్యూ గ్లెన్ విజయవంతమైతే, బ్లూ ఆరిజిన్ను ప్రైవేట్ రంగ అంతరిక్ష రేసులో ముందంజలో ఉంచుతుందని కంపెనీ విశ్వసిస్తుంది.ఇదీ చదవండి: 130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మాస్పేస్ఎక్స్కు ముప్పు?స్పేస్ఎక్స్ ఇటీవల పునర్వినియోగ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 2024లోనే 132 ప్రయోగాలు చేసి 99 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఈ కంపెనీకు చెందిన స్టార్ లింక్కు పోటీగా బ్లూ ఆరిజిన్ నిలుస్తుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. స్పేస్ఎక్స్తోపాటు లూనార్ ల్యాండర్ తయారీ కంపెనీలు, ప్రైవేట్ స్పేస్ స్టేషన్లు వంటి పోటీదారులతో పోటీ పడటానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. -
హెచ్1బీ వీసాల రక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమే
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్క అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్ను ట్రంప్ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది. -
రివైండ్ 2024: చేదెక్కువ... తీపి తక్కువ!
2024 ఏడాది మన స్మృతి పథం నుంచి మరలిపోతూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు గుర్తులుగా మిగిల్చిపోతోంది. దశాబ్దాల బషర్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు తిరుగుబాటుదారులు స్వేచ్ఛ కల్పిస్తే అగ్రరాజ్యం అమెరికాలో ఓటర్లు దుందుడుకు డొనాల్డ్ ట్రంప్కు మరోసారి పాలనా పగ్గాలు అప్పజెప్పారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థుల చేసిన ఉద్యమం ధాటికి షేక్ హసీనాను అధికార పీఠం నుంచి దిగిపోయి భారత్కు పలాయనం చిత్తగించారు. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం మరకలను భారత్కు పూసేందుకు కెనడా బరితెగించింది. అందుకు దీటుగా దౌత్యవేత్తలను బహిష్కరించి, భారత్ తీవ్ర నిరసన తెలపడంతో బాగా క్షీణించిన ఇరు దేశాల సత్సంబంధాలు వంటి ఎన్నో ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీపికబుర్లనూ 2024 మోసుకొచ్చింది. ప్లాస్టిక్భూతం భూమండలాన్ని చుట్టేస్తున్న వేళ పర్యావరణహిత ప్లాస్టిక్ను జపాన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. సోషల్మీడియా, స్మార్ట్ఫోన్ వలలో చిక్కుకున్న చిన్నారులను దాని నుంచి బయటపడేసేందుకు ఆ్రస్టేలియా వంటి పలు దేశాలు టీనేజర్ల ‘సోషల్’వినియోగంపై ఆంక్షలు విధించాయి. అసాధ్యమనుకున్న రాకెట్ టెక్నాలజీని స్పేస్ఎక్స్ సాధించి చూపింది. ప్రయోగించాక తిరిగొస్తున్న రాకెట్ సూపర్హెవీ బూస్టర్ను ప్రయోగవేదిక భారీ రోబోటిక్ చేతితో తిరిగి ఒడిసిపట్టి ఔరా అనిపించింది. 2024 ప్రపంచపుస్తకంలోని కొన్ని ముఖ్య పేజీలను తరచిచూస్తే...ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఏప్రిల్లో సిరియాలోని తమ దౌత్యకార్యాలయంపైకి ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఇరాన్ వీరావేశంతో ఇజ్రాయెల్తో తాడోపేడో తేల్చుకునేందుకు రంగంలోకి దూకింది. నెలల తరబడి గాజా స్ట్రిప్లో హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్పైకి బాంబులేసి కొత్తగా ఇరాన్ యుద్ధంలో తలదూర్చింది. దీంతో హమాస్ నుంచి ఇజ్రాయెల్ తన దృష్టినంతా ఇరాన్పై నిలిపింది. దాని పర్యవసానాలను ఇరాన్ తీవ్రంగా చవిచూసింది. ఇజ్రాయెల్ భీకర దాడులను తట్టుకోలేక ఇరాన్ దాదాపు చేతులెత్తేసింది. తూర్పు అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతంలో డొక్కు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ చనిపోయారు. కీలక నేత మరణంతో ఇజ్రాయెల్తో పోరులో అంతర్జాతీయంగా సైనికసాయం సాధించడంలోనూ ఇరాన్ విఫలమైంది. పేజర్లు, వాకీటాకీల ఢమాల్ ఢమాల్ యుద్ధవ్యూహాల చరిత్రలో ఎన్నడూలేనంత వినూత్న శైలిలో శత్రువుల పీచమణచడంలో తమది అందవేసిన చేయి అని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించుకున్న సంఘటన ఇది. హమాస్కు మద్దతుపలుకుతున్న హెజ్»ొల్లా ఉగ్రమూలాలను ఇజ్రాయెల్ భారీగా దెబ్బకొట్టింది. తామే సృష్టించిన ఒక డొల్ల కంపెనీ ద్వారా వేలాదిగా పేజర్లు, వాకీటాకీలను హెజ్»ొల్లాతో కొనిపించి, అవి డెలివరీ అయ్యేలోపే వాటిల్లో సూక్ష్మస్థాయిలో ప్లాస్టిక్ బాంబును అమర్చి హెజ్»ొల్లా మిలిటెంట్లను ఇజ్రాయెల్ చావుదెబ్బతీసింది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఏకకాలంలో వేలాది పేజర్లు, వాకీటాకీలను పేల్చేసింది. దీంతో దాదాపు 4,000 మంది రక్తసిక్తమయ్యారు. డజన్ల మంది చనిపోయారు. ఈ దాడి దెబ్బకు లెబనాన్లో సామాన్యులు సైతం ఏసీలు, రేడియోలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడేందుకు వణికిపోయారు.కయ్యానికి కాలుదువ్విన కెనడా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత ప్రమేయం ఉందంటూ అక్కడి భారత హైకమిషన్కే నోటీసులిచ్చి విచారణ జరిపేందుకు కెనడా సాహసించి భారతదేశ ఆగ్రహానికి గురైంది. వెంటనే ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలు, ఎంబసీలు, కాన్సులేట్ల సిబ్బందిని వెనక్కి పంపేసి, సొంత దౌత్యాధికారులను వెనక్కి రప్పించి భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసింది. కెనడా సైతం అలాంటి దుందుడుకు చర్యకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య దౌత్య సత్సంబంధాలు దారుణంగా క్షీణించాయి. బంగ్లాదేశ్లో కూలిన హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ విమోచనోద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు, ప్రవేశాల్లో రిజర్వేషన్లపై విద్యార్థి లోకం కన్నెర్రజేయడంతో ప్రధాని షేక్ హసీనా కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. హుటాహుటిన ఢాకాను వదిలి ఢిల్లీకి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, హిందూ మైనారిటీలపై దాడులతో బంగ్లాదేశ్ ప్రభ అంతర్జాతీయంగా ఒక్కసారిగా మసకబారింది. పరిస్థితిని కాస్తంత చక్కబెడతానంటూ తాత్కాలికంగా పగ్గాలు చేపట్టిన యూనుస్ కూటమి ఇప్పుడేం చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యమాలను అణచేస్తూ వేలమంది మరణాలకు బాధ్యురాలైన హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరడం, భారత్ స్పందించకపోవడం చూస్తుంటే పొరుగుదేశంలో భారత్కు సఖ్యత చెడే విపరిణామాలే కనుచూపుమేరలో కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యంపై రిపబ్లికన్ జెండా రెపరెపలు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో దూసుకొచ్చి అలవోకగా అగ్రరాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్న రిపబ్లికన్ల అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 2025 ఏడాదికి హాట్టాపిక్ వ్యక్తిగా మారారు. ముఖాముఖి చర్చలో బైడెన్ను మట్టికరిపించి తన గెలుపును దాదాపు ఖాయం చేసుకున్న ట్రంప్ ఆతర్వాత రేసులో దిగిన కమలా హారిస్పై వ్యక్తిగత, విధానపర నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసి నెగ్గుకురావడం విశేషం. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపేస్తానన్న ప్రతిజ్ఞను ట్రంప్ ఏమేరకు నెరవేరుస్తారో వేచిచూడాలి. తమపై ఎక్కువ పన్ను వేసే భారత్పై అధిక పన్నులు మోపుతానని, తమకు భారంగా మారిన కెనడాపై అధిక ట్యాక్స్ వేస్తానని ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారులను కట్టకట్టి బయటకు పంపేస్తానన్నారు. నైతిక నిష్టలేని వ్యక్తులను కీలక పదవులకు నామినేట్ చేస్తూ ట్రంప్ తన ఏకపక్ష ధోరణిని ఇప్పటికే బయటపెట్టుకున్నారు. సిరియాలో బషర్కు బైబై తండ్రి నుంచి వారసత్వంగా పాలన మాత్రమే కాదు నిరంకుశ లక్షణాలను పుణికిపుచ్చుకున్న బసర్ అల్ అసద్కు తిరుగుబాటుదారులు ఎట్టకేలకు చరమగీతం పాడారు. తిరుగుబాటుదారుల మెరుపు దాడులతో అసద్ హుటాహుటిన రష్యాకు పారిపోయారు. దీంతో సిరియన్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాసనలు కొట్టే తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఇకపై సిరియా ఏపాటి అభివృద్ధి ఫలాలను అందుకుంటుందోనని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎవరికి వారు కొంత ప్రాంతాలను పాలిస్తున్న వేర్పాటువాదులను ఏకం చేసి ఐక్యంగా దేశాన్ని పాలించాల్సిన బాధ్యత ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్షామ్ అధినేత అబూ మొహమ్మద్ అల్ జులానీ మీద పడింది. రష్యా నేలపైకి ఉక్రెయిన్ సేనలు నెలల తరబడి జరుగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో 2014లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆగస్ట్ ఆరున రష్యాలోని కురస్క్ ఒబ్లాస్ట్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సేనలు ఆక్రమించాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని మరో దేశం ఆక్రమించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ సేనల దూకుడుకు కళ్లెం వేసేందుకు రష్యా భూతల, గగనతల దాడులకు తెగబడింది. మళ్లీ దాదాపు సగంభూభాగాన్ని వశంచేసుకోగల్గింది. ఇంకా అక్కడ రోజూ భీకర పోరు కొనసాగుతోంది. మరోవైపు రష్యా తరఫున పోరాడుతూ ఉత్తరకొరియా సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పశి్చమదేశాల నుంచి అందుతున్న దీర్ఘశ్రేణి మిస్సైళ్లతో ఉక్రెయిన్ వచ్చే ఏడాది యుద్ధాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందోమరి.దక్షిణకొరియాలో ఎమర్జెన్సీ పార్లమెంట్లో మెజారిటీలేక, తెచి్చన బిల్లులు ఆమోదం పొందక తీవ్ర అసహనంలో ఉన్న దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ డిసెంబర్ మూడోతేదీన మార్షల్ లా ప్రకటించారు. దీంతో చిర్రెత్తుకొచి్చన విపక్షపారీ్టల సభ్యులు పార్లమెంట్ గోడలు దూకివచి్చమరీ మెరుపువేగంతో పార్లమెంట్ను సమావేశపరచి మార్షల్ లాను రద్దుచేస్తూ సంబంధిత తీర్మానంపై ఓటింగ్ చేపట్టి నెగ్గించుకున్నారు. దీంతో కేవలం ఆరు గంటల్లోనే ఎమర్జెన్సీని ఎత్తేశారు. మార్షల్ లాను ప్రయోగించి దేశంలో అస్థిరతకు యతి్నంచారంటూ అధ్యక్షుడిపై విపక్షాలు అభిశంసన తీర్మానం తెచ్చాయి. తొలి తీర్మానం అధికార పార్టీ సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. జూలైలో విండోస్కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్స్ట్రయిక్’సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను మైక్రోసాఫ్ట్ పరిష్కరించింది.పర్యావరణహిత ప్లాస్టిక్! మనం వాడే ప్లాస్టిక్ తొలుత మురుగు నీటితో ఆ తర్వాత నదీజలాల్లో చివరకు సముద్రాల్లో కలుస్తోంది. ప్రపంచముప్పుగా మారిన ప్లాస్టిక్కు చెక్ పెట్టేందుకు జపాన్ శాస్త్రజ్ఞులు పర్యావరణహిత ప్లాస్టిక్ను సృష్టించారు. సముద్రజలాలకు చేరగానే కేవలం 10 గంటల్లో నాశనమయ్యే ప్లాస్టిక్ అణువులను వీళ్లు తయారుచేశారు. నేలలో కలిస్తే కేవలం 10 రోజుల్లో ఇది విచి్ఛన్నమవుతుంది. సింగ్ యూజ్ ప్లాస్టిక్ల బదులు ఈ కొత్తతరహా ప్లాస్టిక్ త్వరలోనే వాణిజ్యస్థాయిలో ఉత్పత్తయి ప్రపంచదేశాలకు అందుబాటులోకి రావాలని అంతా ఆశిస్తున్నారు.రోబోటిక్ చేయి అద్భుతం అంతరిక్ష ప్రయోగాలకు వ్యోమనౌకలు, కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు ఉపయోగించే వందల కోట్ల ఖరీదైన రాకెట్ బూస్టర్లను మళ్లీ వినియోగించుకునేలా తయారుచేసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అందర్నీ ఔరా అనిపించింది. ఇటీవల చేసిన ప్రయోగంలో నింగిలోకి దూసుకెళ్లి తిరిగి యథాస్థానానికి చేరుకుంటున్న భారీ రాకెట్బూస్టర్ను ప్రయోగవేదికపై అమర్చిన రోబోటిక్ చేయి జాగ్రత్తగా పట్టుకుని శెభాష్ అనిపించుకుంది. బూస్టర్ల పునరి్వనియోగంతో ఎంతో డబ్బు ఆదాతోపాటు బూస్టర్ తయారీలో వాడే ఖరీదైన అరుదైన ఖనిజ వనరుల వృథాను తగ్గించుకోవచ్చు. కృత్రిమ మేధ హవా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దిగ్గజా లు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్లకు భౌతికశాస్త్ర నోబెల్ను బహూకరించిన నోబెల్ కమిటీ సైతం ఈ ఏడాది కృత్రిమ మేధ ఆవశ్యకతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. ఏఐ చాట్బాట్లు దైనందిన జీవితంలో భాగ మైపోయాయి. లక్షల రెట్ల వేగంతో పనిచేస్తూ పురోగమిస్తున్న ఏఐ రంగం ఇప్పుడు మానవ మేధస్సుకు సవాల్ విసురుతోంది. డిజిటల్ దురి్వనియోగం బారినపడకుండా ఏఐను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రపంచదేశాలు ఇటీవల హెచ్చరించాయి. అత్యుష్ణ ఏడాదిగా దుష్కీర్తి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, పారిశ్రామికీకరణతో భూగోళం ఈ ఏడాది గతంలో ఎన్నడూలేనంతగా వేడెక్కింది. పారిశ్రామికవిప్లవం ముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు మించిపోకుండా కాచుకోవాల్సిన జనం ఈ ఏడాదే అది మించిపోయేలా చేశారు. చరిత్రలో తొలిసారిగా ఒక్క ఏడాదిలోనే భూతాపంలో ఉన్నతి 1.5 డిగ్రీ సెల్సియస్ను దాటింది. ఎల్నినో కన్నా వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల వల్లే అత్యుష్ణ ఏడాదిగా 2024 చెడ్డపేరు తెచ్చుకుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సూర్యుడి ముంగిట పార్కర్ సందడి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’వ్యోమనౌక నూతన చరిత్ర లిఖించింది. భగభగ మండే భానుడికి అత్యంత దగ్గరగా వెళ్లింది. తర్వాత అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు నెలకొల్పింది. పార్కర్ను 2018లో ప్రయోగించారు. అంతరిక్ష వాతావరణం, సౌర తుపానులపై లోతైన అవగాహన కోసం దీనిని తయారుచేశారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన, మళ్లీ జూన్ 19వ తేదీన సైతం భానుడి చేరువగా వెళ్లనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్షిప్ ప్రయోగం పాక్షికంగా విజయవంతం
టెక్సాస్: చంద్రుడితోపాటు అంగారక గ్రహంపై భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘స్టార్షిప్’ రాకెట్కు సంబంధించిన ఆరో ప్రయోగాన్ని మంగళవారం టెక్సాస్లో నిర్వహించారు. ఇందులో ఒక దశ విఫలం కాగా, మరో దశ విజయవంతమైంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తోపాటు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారు. దాదాపు 400 అడుగుల(121 మీటర్లు) పొడవైన స్టార్షిప్ రాకెట్ను స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పేస్ఎక్స్ లాంచ్ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఇందులోని 33 శక్తివంతమైన రాప్టర్ ఇంజన్లను మండించడంతో స్టార్షిప్ స్పేస్క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత స్పేస్క్రాఫ్ట్ నుంచి సూపర్ హెవీ బూస్టర్ విజయవంతంగా విడిపోయింది. భూమివైపు తిరుగు ప్రయాణం ఆరంభించింది. Booster 13 splashdown in the Gulf of Mexico. Tower was go, but booster was not. pic.twitter.com/RwhZDxPaQU— Chris Bergin - NSF (@NASASpaceflight) November 19, 2024షెడ్యూల్ ప్రకారం మళ్లీ లాంచ్సైట్ వద్దకే చేరుకోవాలి. అక్కడున్న మర చేతులు బూస్టర్ను జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. కానీ, ఇంతలో సాంకేతిక సమస్య ఎదురుకావడంతో బూస్టర్ క్యాచింగ్ ప్రక్రియను నిలిపివేశారు. బూస్టర్ను నింగిలోనే దారి మళ్లించారు. దాంతో అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కూలిపోయింది. ఖాళీగా ఉన్న స్టార్షిప్ స్పేస్క్రాఫ్ట్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే 90 నిమిషాలపాటు భూమిచుట్టూ చక్కర్లుకొట్టింది. Starship preparing to splash down in the Indian Ocean pic.twitter.com/EN9jibr07l— SpaceX (@SpaceX) November 19, 2024చివరకు హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. స్టార్షిప్ రాకెట్ప్రయోగ దృశ్యాలను స్పేస్ ఎక్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గత నెలలో చేపట్టిన స్టార్షిప్ ఐదో ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. లాంచ్ సైట్ వద్దకు బూస్టర్ క్షేమంగా తిరిగొచ్చింది. మర చేతులు దాన్ని జాగ్రత్తగా అందుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. -
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి GSAT-20
-
30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్
టెక్ బిలియనీర్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే స్టార్షిప్ రాకెట్ రూపొందించారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.నవంబర్ 6న ఎక్స్ యూజర్ అలెక్స్ పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. స్టార్షిప్ రాకెట్ ప్రయాణించడం చూడవచ్చు. ఇందులో భూమిపైనా ఎక్కడికైనా కేవలం గంటలోపే.. కొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ.. ఇది సాధ్యమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. అయితే స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్ ద్వారా ఈ గమ్యాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని వీడియోలో వెల్లడైంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది రాబోయే రోజుల్లో వినియోగంలోకి కూడా వచ్చేస్తుంది.ఇదీ చదవండి: మీటింగ్కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓస్పేస్ఎక్స్ రూపొందిస్తున్న స్టార్షిప్ రాకెట్ సాధారణ విమానం మాదిరిగా కాకుండా.. రాకెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒక్కసారికి 1,000 మంది ప్రయాణించవచ్చని చెబుతున్నాయి. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో తయారై ఉంటుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులను మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత విమానయాన సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది.This is now possible— Elon Musk (@elonmusk) November 6, 2024 -
ట్రంప్నకు మద్దతు.. మస్క్ కంపెనీలు ఎంత పెరిగాయంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్మస్క్ తన విజయానికి ఎంతో కృషి చేసినట్లు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న మార్కెట్లు గడిచిన రెండు సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అనుకున్న విధంగానే ఆయన గెలుపు ఖరారైంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీల స్టాక్ విలువ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు సెషన్ల్లో దాదాపు రూ.రెండు లక్షల కోట్లు మేర వీటి విలువ పెరిగినట్లు మార్కెట్ అంచనా వేస్తుంది.ప్రభుత్వ ఏజెన్సీల సడలింపులుమస్క్ కంపెనీల్లోకెల్లా ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్తో మస్క్కు ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆయా కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు ఇవే..టెస్లాస్పేస్ఎక్స్న్యూరాలింక్ది బోరింగ్ కంపెనీఎక్స్ కార్పొరేషన్జిప్ 2పేపాల్స్టార్లింక్ఎక్స్ ఏఐ -
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు..
SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది. స్టార్ఫిష్ రాకెట్తో పాటు స్పేస్లోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి వచ్చేలా చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. స్పేస్ రీసెర్చిలో అత్యద్భుతంగా పేర్కొంటున్న ఈ ప్రయోగాన్ని సౌత్ టెక్సాస్లోని స్టార్బేస్ నుంచి స్పేస్ఎక్స్ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ సెంటిస్టుల బృందంలో మనదేశానికి చెందిన సంజీవ్ శర్మ కీలకపాత్ర పోషించారు. ఆయనకు సంబంధించిన లింక్డిన్ ప్రొఫైల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.అంచెలంచెలుగా ఎదిగి..శ్రీసాయి దత్తా అనే యూజర్ సంజీవ్ శర్మకు సంబంధించిన విద్యా, ఉద్యోగ వివరాలు ఎక్స్లో షేర్ చేశారు. ఫ్రం ఇండియన్ రైల్వేస్ టు స్పేస్ఎక్స్’ పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేలో పనిచేసిన ఆయన పస్తుతం స్పేస్ఎక్స్ సంస్థలో ప్రిన్సిపల్ ఇంజనీర్గా పనిచేస్తూ రోదసి ప్రయోగాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి.. అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.అమెరికాలో ఉన్నత విద్యరూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీర్ చదువు పూర్తైన తర్వాత సంజీవ్ శర్మ 1990లో ఇండియన్ రైల్వేలో డివిజినల్ మెకానికల్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించారు. 1994లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా ఆయన ప్రమోషన్ లభించింది. 2001 వరకు ఈ జాబ్లో ఆయన కొనసాగారు. తర్వాత రైల్వే ఉద్యోగం వదిలిపెట్టి అమెరికా వెళ్లి కొలరాడో యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 2003లో సీగేట్ టెక్నాలజీ కంపెనీలో స్టాఫ్ మెకానికల్ ఇంజనీర్గా చేరారు. ఇదే సమయంలో మిన్నెసోటా యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో మరో మాస్టర్ డిగ్రీ చేశారు. 2013లో స్పేస్ఎక్స్ సంస్థలో స్ట్రక్చర్స్ గ్రూప్ డైనమిక్స్ ఇంజినీర్గా జాబ్ సంపాదించారు. అక్కడ ఐదేళ్లు పనిచేసిన తర్వాత 2018లో మ్యాటర్నెట్ కంపెనీకి మారారు. మళ్లీ 2022లో స్పేస్ఎక్స్కు తిరిగొచ్చారు. ‘బూస్టర్’ ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో సంజీవ్ శర్మ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది."From Indian Railways to SpaceX, From Building Trains to building Starships & catching them"Podcast of Sanjeev Sharma- Principal Engineer for #Starship Dynamicshttps://t.co/mzD2QEQTWa pic.twitter.com/fbDXXJf8sx— SRI SAIDATTA (@nssdatta) October 15, 2024ఓపిక అంటే ఇది..ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు సాగిన సంజీవ్ శర్మ విజయ ప్రస్థానంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే సౌలభ్యాలు, సౌకర్యాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. ‘ఓపిక అంటే ఇది. స్పేస్ఎక్స్లో చేరడానికి ముందు సంజీవ్ శర్మకు 20 సంవత్సరాల కెరీర్ ఉంద’ని మరొకరు కామెంట్ చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంజీవ్ శర్మ ప్రమోషన్ సంపాదించారంటే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతోందని మరో నెటిజన్ మెచ్చుకున్నారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి -
మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఇలాన్ మస్క్'కు (Elon Musk) చెందిన స్పేస్ఎక్స్ స్టార్షిప్ విజయవంతంగా దాని లాంచ్ ప్యాడ్కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆ వీడియోను షేర్ చేస్తూ.. నేను నా టికెట్ను ఎక్కడ కొనాలి అంటూ ట్వీట్ చేశారు.ఈ ఆదివారం స్పేస్ఎక్స్ ప్రయోగం జరుగుతున్న సమయంలో టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్ఎక్స్ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం.. అంతరిక్ష ప్రయాణంలోనే కీలకమైన క్షణం కావచ్చని ఆనంద్ మహీంద్రా పేర్కొంటూ మస్క్ను ప్రశంసించారు.And this Sunday, I’m happy to be a couch potato, if it means that I get to watch history being made. This experiment may just be the critical moment when space travel was democratised and made routine. Where can I buy my ticket, @elonmusk ? 👏🏽👏🏽👏🏽pic.twitter.com/yruGSwL2Y4— anand mahindra (@anandmahindra) October 13, 2024మొదటిసారి నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలా తిరిగి వచ్చిన మొదటి బూస్టర్గా.. స్టార్షిప్ రాకెట్ గుర్తింపు పొందింది. సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి అంతరాయాలకు లోనుకాకుండా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్ కిందికి దిగటానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టవర్ రాకెట్ని పట్టుకుంది. ఈ విజయవంతమైన క్యాచ్ పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని మస్క్ పేర్కొన్నారు. -
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
స్పేస్ఎక్స్ మిషన్లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్లో స్టార్లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.బోయింగ్ స్టార్లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్లైనర్లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి కజకిస్తాన్కు చేరుకుంది. ఐఎస్ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్లు 374 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉన్నారు. కాగా, ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు. -
మస్క్ VS టెస్లా ఉద్యోగులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు మస్క్ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహారిస్ వైపు నిలుస్తున్నారు.అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.ఎక్స్, స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా..ఎలాన్ మస్క్కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలహారిస్కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (ట్విటర్) ఉద్యోగులు సైతం హారిస్కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం. -
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్సూట్ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్హిట్ హాలీవుడ్ సినిమా స్టార్వార్స్ థీమ్ సాంగ్కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్మ్యాన్తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ఎక్స్
వాషింగ్టన్: ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఫుట్బాల్ స్టేడియం సైజు ఉన్న ఆకాశ ప్రయోగశాల.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది. 2030 సంవత్సరంకల్లా పాతబడిపోతున్న ఐఎస్ఎస్ అంతరిక్షచెత్తగా మిగిలిపోకుండా, తదుపరి ప్రయోగశాలలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించుకుంది. అందుకే గడువు ముగిసేనాటికి దానిని ప్రస్తుత కక్ష్య నుంచి తప్పించనుంది.ఇప్పటికే రాకెట్ల తయారీతో అంతరిక్ష అనుభవం గడించిన కుబేరుడు ఎలాన్ మస్్కకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు నాసా ఈ బాధ్యతను అప్పగించింది. ఇందుకోసం దాదాపు రూ.7,036 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను స్పేస్ఎక్స్కు ఇచి్చనట్లు నాసా బుధవారం ప్రకటించింది. కాంట్రాక్ట్లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్(యూఎస్డీవీ)ను స్పేస్ఎక్స్ నిర్మించనుంది. అది సముద్రంలో చిన్న పడవలను లాగే/నెట్టే టగ్ బోటులా ఉంటుందని భావిస్తున్నారు.ఐఎస్ఎస్ ప్రస్తుతం భూమికి 400 కి.మీ.ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నుల బరువైన ఐఎస్ఎస్ను యూఎస్డీవీతో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్ష్యలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల ‘పాయింట్ నెమో’ వద్ద కూల్చేయనున్నారు. ఈ ‘పాయింట్ నెమో’ సముద్రప్రాంతం నుంచి దగ్గర్లోని భూభాగానికి వెళ్లాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. పౌరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు.వేల ప్రయోగాలకు వేదిక ఐఎస్ఎస్ నిర్మాణం కోసం తొలి భాగాలను 1998లో రాకెట్లలో తీసుకెళ్లారు. 2000 సంవత్సరందాకా దీని నిర్మాణం సాగింది. శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్ఎస్ సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటున్నాయి. 2028లో చేతులు దులిపేసుకుంటామని రష్యా చెప్పేసింది. -
ఎలాన్ మస్క్ కు 11వ బిడ్డ
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ శివోన్ జిలిస్ ద్వారా ఆయనకు కొన్ని రోజుల క్రితం మూడో బిడ్డ జన్మించినట్లు బ్లూమ్బర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో మస్క్ పిల్లల సంఖ్య ఇప్పటిదాకా 11కు చేరుకున్నట్లు తెలియజేసింది. మస్క్ కు మొదటి భార్య, రచయిత్రి జస్టిన్ మస్క్ ద్వారా ఐదుగురు బిడ్డలు కలిగారు. సంగీత కళాకారిణి గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లులు, శివోన్ జిలిస్ ద్వారా మరో ముగ్గురు పిల్లలు జని్మంచారు. ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్కు 2021లో కవలలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోతుండడంతో జనాభా తగ్గిపోతోందని మస్క్ 2021లో ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జనాభాను పెంచాలని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. పిల్లలను కనకపోతే నాగరికత అంతమైపోతుందని చెప్పారు. అత్యధికంగా తెలివితేటలు, మేధాశక్తి ఉన్న వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కనాలన్నది మస్క్ అభిప్రాయం. ఆయనకు తన సంస్థల్లో పనిచేసే మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. -
జూలైలో జీశాట్–ఎన్2 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత అంతరిక్ష వాణిజ్య విభాగానికి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సహకారంతో జూలై నెలాఖరులో జీశాట్–ఎన్2 (జీశాట్–20) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సుమారు ఐదు టన్నుల బరువు (4,700 కిలోలు) కలిగిన ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ప్రయోగ వేదిక నుంచి పాల్కన్ రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.దేశంలోని మారుమూల రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు బ్రాండ్బ్యాండ్, ఇన్–ఫ్లైట్ సేవలను అందించేందుకు ఇస్రోలోని ఫ్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు. ఈ ఉపగ్రహం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉండి 15 ఏళ్లపాటు సేవలు అందించే విధంగా రూపొందించారు.ఇది పూర్థిస్థాయి కమ్యూనికేషన్ ఉపగ్రహం కావడం విశేషం. ఇప్పటివరకు పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒక ఎత్తయితే ఈ జీశాట్–ఎన్2 ఉపగ్రహం మాత్రమే ఒక ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే ఉపగ్రహాన్ని రూపొందించి క్లీన్రూంలో పరీక్షలు పూర్తిచేశారు. వైబ్రేషన్ పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇస్రోకి ఇది వాణిజ్యపరమైన ప్రయోగం కావడం విశేషం. -
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్వేర్ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్న స్టార్టప్ సంస్థ
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్ తయారుచేస్తున్న ఉపగ్రహాలను 2024 చివరినాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్కు చెందిన రైడ్షేర్ మిషన్లు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)ను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.ఈ సందర్భంగా పిక్సెల్ సీఈఓ అవైస్ అహ్మద్ మాట్లాడుతూ..‘కంపెనీకు స్పేస్ఎక్స్, పీఎస్ఎల్వీ రెండింటిలోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఉపగ్రహాల సంసిద్ధత, ప్రయోగ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుంది. సంస్థ వద్ద ప్రస్తుతం ఏటా 40 పెద్ద ఉపగ్రహాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పరిశోధకుల బృందం ఆరు ఉపగ్రహాలపై పని చేస్తోంది. వీటిని ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోని ప్రవేశపెట్టనున్నాం. 2024లో మరిన్ని ఉపగ్రహాలను తయారుచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ ఏడాది జనవరిలో పిక్సెల్ బెంగుళూరులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మెగాపిక్సెల్’ అనే ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో ఆరు హైపర్స్పెక్ట్రల్ ఇమేజరీ ఉపగ్రహాలను ప్రయోగాలు జరుపుతున్నారు. ఇవి వ్యవసాయం, ఎనర్జీ, అటవీ, పర్యావరణ పర్యవేక్షణతో సహా వివిధ పరిశ్రమలకు ఉపయోగపడుతాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2022లో పిక్సెల్ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ను ఉపయోగించి ‘శకుంతల’ (టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్-2) ఉపగ్రహాన్ని ప్రయోగించింది. -
‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
నేను ఏలియన్ అని చెబుతూనే ఉన్నా కానీ నా మాటల్ని ఎవరూ నమ్మడం లేదని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పారిస్ వేదికగా జరిగిన వివా టెక్ ఈవెంట్లో మస్క్ వెబ్క్యామ్ ద్వారా రిమోట్గా పాల్గొన్నారు. వివా టెక్ ఈవెంట్ ప్రతినిధులు మస్క్తో కొంతమంది మీరు ఏలియన్ అని నమ్ముతున్నారు. మస్క్ నవ్వుతూ ‘అవును, నేను గ్రహాంతరవాసిని అని చెబుతూనే ఉంటాను, కానీ ఎవరూ నన్ను నమ్మడం లేదని అన్నారు.’ అంతేకాదు ఏలియన్స్ గురించి సమాచారం ఏదైనా తెలిస్తే నేను వెంటనే ఎక్స్ వేదికగా ఆ విషయాల్ని వెల్లడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎలోన్ మస్క్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఏఐ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అయితే దాని అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 🚨IS ELON AN ALIEN? Host: "Some people believe that you are an alien."Elon: "I am an alien."Host: "Now you've been uncovered."Elon: "Yes, I keep telling people I'm an alien, but nobody believes me."😂Source: Viva Tech https://t.co/9ie5KFn6GE pic.twitter.com/ZDU4ovA82I— Mario Nawfal (@MarioNawfal) May 23, 2024 -
‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి
డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ స్పందించారు. మాదకద్రవ్యాలను వినియోగించినట్లు ఆయన అంగీకరించారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు డాక్టర్ల సూచన మేరకే ‘కెటమిన్’ అనే డ్రగ్ను తీసుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా తాను డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఏర్పడలేదని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ తనపై ఎలాంటి ప్రభావం చూపాయనే విషయాన్ని పక్కనపెడితే.. టెస్లా కారు గతేడాది ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డు నెలకొల్పిందని మస్క్ చెప్పారు. కొన్నినెలల కొందట తాను మానసిక కంగుబాటుకు గురైనట్లు మస్క్ చెప్పారు. ఆ సమయంలో దాన్నుంచి బయటపడేందుకు కెటమిన్ అనే డ్రగ్ను వినియోగించానన్నారు. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవాడినని తెలిపారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రోజుకు 16 గంటలు పనిచేస్తాను. దాంతో నాపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. నేను ఎక్కువ కాలం డిప్రెషన్లోకి వెళితే దాని ప్రభావం టెస్లా పనితీరుపై పడుతుంది. దాన్ని అధిగమించేందుకు డాక్టర్ సూచనతో తగుమోతాదులోనే కెటమిన్ డ్రగ్ తీసుకున్నాను. అది టెస్లాకు ఎంతో ఉపయోగపడింది. ఒకవేళ ఎవరైనా కెటమిన్ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏ పనీ సక్రమంగా పూర్తి చేయలేరు’ అని మస్క్ చెప్పారు. ఇదిలా ఉండగా, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు మస్క్ చెప్పడం ఇది రెండోసారి. గతంలో ఓసారి డ్రగ్స్ సేవించిన విషయం నిజమేనని మస్క్ అప్పట్లోనే చెప్పారు. ఆ తర్వాత చాలాకాలంపాటు తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. నాసా అభ్యర్థనతో టెస్లా ఆఫీసును డ్రగ్స్ రహితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా తాను వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఈ మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ కానీ, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లూ గుర్తించలేదన్నారు. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? రెండు నెలల క్రితం మస్క్ డ్రగ్స్ వినియోగంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ నిషేధిత డ్రగ్స్ను తీసుకుంటున్నారని దానిలో పేర్కొంది. ఈ విషయంపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. దీని వల్ల మస్క్ ఆరోగ్యంతోపాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు చెప్పినట్లు ఆ కథనంలో ప్రచురించారు. తాజాగా డ్రగ్స్ వినియోగంపై స్వయంగా మస్క్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
శత్రు సైన్యాలకు చెక్ పెట్టేలా.. రంగంలోకి దిగిన మస్క్
అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ అమెరికా మిలటరీ విభాగంలో అత్యంత కీలకంగా మారారు. ఇప్పటికే ప్రపంచంలోనే పలు దేశాలకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్న ఆయన తాజాగా అమెరికా సైన్యానికి స్పేస్ ఎక్స్ స్పై శాటిలైట్లను తయారు చేసే పనిలో పడ్డారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ స్పై శాటిలైట్ కార్యకలాపాలు నిర్వహించే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూఎస్ నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ (ఎన్ఆర్ఓ)తో కలిసి వందలాది స్పై శాటిలైట్లను నిర్మిస్తున్నారు. 2021లో స్పేస్ టెక్ దిగ్గజం , ఎన్ఆర్ఓల మధ్య 1.8 బిలియన్ల భారీ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా స్పేస్ఎక్స్ స్టార్షీల్డ్ బిజినెస్ యూనిట్ ఈ స్పై శాటిలైట్లను తయారు చేస్తోంది. స్ప్పై శాటిలైట్ల వల్ల ఉపయోగం అమెరికా ఇంటెలిజెన్స్, ఆర్మీ నిర్వహించే పలు ప్రాజెక్ట్లలో స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్న స్పై శాటిలైట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధి దేశాలు నిర్వహించే అణు పరీక్షలను గుర్తించడం, సైనికుల పహారా, బాంబుల వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడం, శత్రు సామర్థ్యం గురించి పసిగట్టడంలో ఈ స్పై శాటిలైట్లు పనిచేస్తాయి. ఇలా శత్రు సైన్యాలు ఎత్తుల్ని ముందే పసిగట్టి అమెరికా ఇంటెలిజెన్స్కు సమాచారం అందిస్తాయి. మిలటరీ సామ్రాజ్యాన్ని పటిష్ట పరిచేలా మస్క్ నిర్వహిస్తున్న ఈ కీలక ప్రాజెక్ట్ విజయవంతమైతే అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల సైనికుల కదలికల్ని గుర్తిస్తుంది. తద్వారా మిలటరీ సామ్రాజ్యాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని భావిస్తోంది. -
SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్!
అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ వస్తోంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణమూ నానాటికీ పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతోపాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది... 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలుసా? ఏకంగా 2,917! అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుతి్నక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యే చాలా ఎక్కువట! ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి! ఇవిగాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పని చేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24 వేల పై చిలుకే ఉంటాయట! ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద యాక్టివ్ ఉపగ్రహాలు, వ్యర్థాలూ కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద ‘అంతరిక్ష వస్తువుల’ మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37 వేలు దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి! అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే అయితే లెక్కాపత్రం లేదు. మొత్తమ్మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8 వేల టన్నులు దాటిపోయిందట! వీటితో ప్రమాదాలెన్నో... ► అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్నీ అన్నీ కావు... ► భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. ► 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. ► 1996లో ఫ్రాన్స్కు చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. ► 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్ప్రెస్ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగబోయింది. ► 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారినపడ్డాయి. ► 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్ 2251, 560 కిలోల ఇరీడియం33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి! ► అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు. ఐఎస్ఎస్కూ ముప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పే పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ఐఎస్ఎస్ను 1,400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారినుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ఐఎస్ఎస్లో ఉంది. కానీ ఐఎస్ఎస్ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ! వ్యర్థాలు ఢీకొట్టనున్నాయన్న హెచ్చరికలతో ఐఎస్ఎస్ సిబ్బంది ఇప్పటిదాకా మూడుసార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సూల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచి్చంది! రోజుకొకటి చొప్పున భూమిపైకి... ► ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష్య నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తుంటాయి. ► చిన్నవైతే భూమిదాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. ► పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. ► అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం మూడు వ్యర్థాలు కక్ష్య కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయట. ► వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి! ► ఓజోన్ పొర దెబ్బ తినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. ► పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారినుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్పియర్ కూడా దెబ్బ తింటోందని తాజా అధ్యయనంలో తేలింది. ► ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం గానీ, దేశాల మధ్య ఒప్పందాలు గానీ లేవు. ► అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు రూపొందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Elon Musk: ఇంకా డ్రగ్స్ వాడుతున్నాడా.. వికృత ప్రవర్తనకు కారణం అదేనా?
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ డిప్రెషన్ నుంచి బయటపడటానికి కెటామైన్ వంటి సైకెడెలిక్ డ్రగ్స్ వాడటం గత ఏడాది వార్తల్లో నిలిచింది. అయితే మస్క్ ఇప్పటికీ డ్రగ్స్ వాడుతున్నారని, ఇది ఆయన ఆరోగ్యంతోపాటు మస్క్ పర్యవేక్షిస్తున్న విస్తారమైన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని టెస్లా, స్పేస్ఎక్స్లోని పలువురు బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ సంచలన నివేదిక ప్రచురించింది. ప్రపంచంలోని పలు చోట్ల జరిగిన ప్రైవేట్ పార్టీలలో ఎలాన్ మస్క్ ఎల్ఎస్డీ, కొకైన్, ఎక్స్టాసీ, సైకెడెలిక్ మష్రూమ్లను తీసుకునేవాడని దగ్గర నుంచి గమనించిన కొందరు చెబుతున్నారు. సైకెడెలిక్ లాంటి డ్రగ్ కెటామైన్ కోసం తాను ప్రిస్క్రిప్షన్ కలిగి ఉన్నట్లు గతంలో స్వయంగా చెప్పిన మస్క్.. బహిరంగంగానే గంజాయిని సేవించిన విషయం తెలిసిందే. వరుస సంఘటనలు 2018లో లాస్ ఏంజెల్స్లో జరిగిన పార్టీలో ఎలాన్ మస్క్ చాలా యాసిడ్ టాబ్లెట్లను తీసుకున్నాడు. మరుసటి సంవత్సరం మెక్సికోలో జరిగిన ఒక పార్టీలోనూ మ్యాజిక్ పుట్టగొడుగులను సేవించాడు. ఇక 2021లో మియామిలోని ఆర్ట్ బాసెల్ హౌస్ పార్టీకి హాజరైనప్పుడు ఎలాన్ మస్క్, అతని సోదరుడు కింబాల్ మస్క్ ఇద్దరూ కెటామైన్ సేవిస్తూ కనిపించారు. గతంలో టెస్లా, ప్రస్తుతం స్పేస్ఎక్స్ బోర్డు సభ్యుడిగా ఉన్న స్టీవ్ జుర్వెట్సన్తో కలిసి ఎలాన్ మస్క్ మాదకద్రవ్యాలు సేవించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం, టెస్లాలో మాజీ డైరెక్టర్ అయిన లిండా జాన్సన్ రైస్.. ఎలాన్ మస్క్ వికృత ప్రవర్తన, అతని మాదకద్రవ్యాల వాడకంతో చాలా ఆగ్రహానికి గురైంది. ఆమె 2019లో కంపెనీ బోర్డులోకి మళ్లీ రాకూడదని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మస్క్ అటార్నీ అయిన అలెక్స్ స్పిరో ఖండించారు. స్పేస్ ఎక్స్లో మస్క్ ఎప్పటికప్పుడు డ్రగ్స్ పరీక్షలను ఎదుర్కొంటాడని, వీటిలో ఎప్పుడూ విఫలం కాలేదని చెప్పారు. స్పేస్ఎక్స్ ఈవెంట్లో బూతులు ఇక మరొక సంఘటనలో 2017లో కంపెనీ ఈవెంట్లో కొంతమంది స్పేస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్లు మస్క్ ప్రవర్తనలో మార్పును గమనించారు. కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద మిషన్ కంట్రోల్ చుట్టూ వందలాది మంది ఉద్యోగులు చేరారు. దాదాపు గంట ఆలస్యంగా వచ్చిన మస్క్.. మత్తులో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారు.2018లో జో రోగన్ షోలో గంజాయిని సేవిస్తూ కనిపించిన మస్క్ తర్వాత నాసాతో ఇబ్బందుల్లో పడ్డాడు. ఇది కంపెనీపై ప్రభావం చూపించింది. స్పేస్ఎక్స్లోని సిబ్బంది అంతటికి ఔషధ పరీక్షలకు దారితీసింది. చాలా మంది టెస్లా బోర్డు సభ్యులు మస్క్ మాదకద్రవ్యాల వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మిటింగ్ మినిట్స్ లేదా బోర్డు అధికారిక ఎజెండాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ టెస్లా బోర్డు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న రాబిన్ డెన్హోమ్ వంటి కొంతమంది డైరెక్టర్లు డ్రగ్స్ అనే పదాన్ని ఉపయోగించకుండా మస్క్ ప్రవర్తనపై 2022 ప్రారంభం వరకు టెస్లా, స్పేస్ఎక్స్ రెండింటిలో బోర్డు సభ్యుడైన కింబాల్ మస్క్ని సంప్రదించారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ ఇష్టం లేదట! టెస్లాను ప్రైవేట్గా మార్చే ప్రణాళికల గురించి 2018లో చేసిన ట్వీట్తో సహా మస్క్ అసాధారణ ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుందని ఎగ్జిక్యూటివ్లు తలలు పట్టుకున్నారు. దీనికి మాదకద్రవ్యాల వాడకమే కారణమని కొందరు, దీర్ఘకాలిక నిద్రలేమి మరికొందరు అభిప్రాయపడ్డారు. ఎలాన్ మస్క్ జీవిత చరిత్రపై రచయిత వాల్టర్ ఐజాక్సన్ ఇటీవల ప్రచురించిన పుస్తకంలోనూ మస్క్ "డెమోన్ మోడ్"ని వివరించారు. ఎలాన్ మస్క్ తరచుగా నిగ్రహాన్ని కోల్పోతాడని, ఉద్యోగులపై విరుచుకుపడతాడని పేర్కొన్నారు. అయితే చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వాడటం తనకు ఇష్టం లేదని మస్క్ పేర్కొన్నట్లుగా ఈ పుస్తకంలో ఉండటం గమనార్హం. -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
పేలిపోయిన స్టార్షిప్ రాకెట్
టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది. -
సాధించాం.. పట్టరాని ఆనందంలో ఎలాన్ మస్క్!
ప్రైవేటు రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్(SpaceX)కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్ స్టార్లింక్ (Starlink) నగదు ప్రవాహ బ్రేక్ఈవెన్ (సంతృప్త నగదు నిల్వలు)ను సాధించిందని దాని అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు. ఈ మేరకు తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ట్వీట్ చేశారు. ‘స్పేస్ఎక్స్కు చెందిన స్టార్లింక్ బ్రేక్ఈవెన్ నగదు ప్రవాహాన్ని సాధించిందని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను! అద్భుతమైన బృందం సాధించిన విజయం ఇది’ అని ‘ఎక్స్’ పోస్టులో ఎలాన్ మస్క్ రాసుకొచ్చారు. ‘స్టార్లింక్ ఇప్పుడు అన్ని యాక్టివ్ శాటిలైట్లలోనూ మెజారిటీగా ఉంది. వచ్చే ఏడాది నాటికి అన్ని ఉపగ్రహాలను భూమిపై నుంచి ప్రయోగించనుంది’ అని కూడా పేర్కొన్నారు. స్టార్లింక్ అనేది స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సమూహం. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలకు కవరేజీని అందిస్తోంది. 2019లో స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించిడం ప్రారంభించిన స్పేస్ఎక్స్ 2023 తర్వాత అంతర్జాతీయ మొబైల్ ఫోన్ సేవలను కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యంత విలువైన కంపెనీ ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటైన స్పేస్ఎక్స్ కంపెనీ విలువ సుమారు 150 బిలియన్ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా). స్టార్లింక్ గత సంవత్సరం ఆదాయంలో ఆరు రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. 1.4 బిలియన్ డాలర్లు ఆర్జించింది. అయితే మస్క్ నిర్దేశించిన లక్ష్యాల కంటే ఇది తక్కువే అని వాల్ స్ట్రీట్ జర్నల్ గత సెప్టెంబర్లో నివేదించింది. స్పేస్ఎక్స్ స్టార్షిప్ వంటి మరిన్ని మూలధన-ఇంటెన్సివ్ ప్రాజెక్ట్లకు నిధులు సమకూర్చడానికి స్టార్లింక్ వ్యాపార విభాగాన్ని ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చాలని భావిస్తోంది. స్టార్షిప్ అనేది ఒక పెద్ద పునర్వినియోగ రాకెట్, దీన్ని రాబోయే దశాబ్దంలో నాసా కోసం చంద్రునిపైకి పంపించనున్నారు. 2019 నుంచి ఈ కంపెనీ తక్కువ-భూమి కక్ష్యలో తన నెట్వర్క్ను దాదాపు 5వేల ఉపగ్రహాలకు పెంచింది. యుద్ధ ప్రాంతాలలో స్టార్లింక్ పాత్ర గతేడాది యుద్ధ సమయంలో ఉక్రెయిన్కు శాటిలైట్ కమ్యూనికేషన్స్లో సాయమందించిన స్టార్లింక్.. తాజాగా గాజాలోనూ కమ్యూనికేషన్ సేవలు అందించనున్నట్లు ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు. Excited to announce that @SpaceX @Starlink has achieved breakeven cash flow! Excellent work by a great team. Starlink is also now a majority of all active satellites and will have launched a a majority of all satellites cumulatively from Earth by next year. — Elon Musk (@elonmusk) November 2, 2023 -
Tesla: ఒక్కరోజులోనే రూ.1.30లక్షల కోట్ల సంపద ఆవిరి
ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్(ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ సంపద ఒక్కరోజులోనే భారీగా రూ.1.30లక్షల కోట్లు ఆవిరైంది. 2023-24 రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్కు సంబంధించి టెస్లా సంస్థ బలహీన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో అక్టోబర్ 19న కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనితో ఈ సంస్థలో 13 శాతం వాటాలున్న ఎలాన్ మస్క్ కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. టెస్లా షేర్ విలువ అక్టోబరు 19న ఏకంగా 9 శాతం నష్టపోయింది. దాంతో మస్క్ సంపద కూడా అదే రీతిలో 16.1 బిలియన్ డాలర్లు(రూ.1.30 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఇప్పటికి 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మస్క్ సంపద దాదాపు 70 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని రాణించేందుకు టెస్లా గత కొన్ని నెలలుగా కార్ల ధరలను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీంతో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం మేర క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోనే టెస్లా షేర్లు భారీగా పతనానికి గురయ్యాయి. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని మస్క్ వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే విక్రయాలు నెమ్మదించాయని పేర్కొన్నారు. అయితే సంస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే.. తమ కస్టమర్లకు అందించాల్సిన 18లక్షల కార్లను నిర్ణీత గడువులోగా డెలివరీ చేస్తామని టెస్లా ప్రకటించింది. -
కింగ్ లాంటి మస్క్ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది!
Elon Musk Borrowed: ప్రపంచ కుబేరుడు, అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి పరిచయం అక్కరలేదు. పలు బిజినెస్లతో వేల కోట్లు సంపాదించి అత్యంత సంపన్నడిగా ఎదిగాడు. ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా ఎప్పుడూ ఇబ్బందులు ఎదర్కోలేదు. వాటిని విజయవంతంగా నిర్వహించాడు. కానీ ట్విటర్ (Twitter) (ఇప్పుడు ‘ఎక్స్’) మాత్రం మస్క్ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది! (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) ట్విటర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పేందుకు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్ కొనుగోలు సమయంలో తనకు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ (SpaceX) నుంచి 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,314 కోట్లు) రుణాన్ని తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం వెలువరించింది. ట్విటర్ కోసమేనా.. స్పేస్ఎక్స్ గత అక్టోబర్లో ఎలాన్ మస్క్కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించగా ఆ మొత్తాన్ని మస్క్ అదే నెలలో డ్రా చేశారని కొన్ని పత్రాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా అదే అక్టోబర్ నెలలో మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విటర్ కొనుగోలు మస్క్ ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని, టెస్లాతో సహా తన ఇతర కంపెనీలలో తన షేర్ల మీద రుణం తీసుకోవడానికి బ్యాంకులతో ఏర్పాట్లు చేసుకున్నాడని నివేదిక పేర్కొంది. ఇందుకోసం స్పేస్ఎక్స్ రుణదాతగా వ్యవహరించిందని తెలిపింది. కాగా స్పేస్ఎక్స్లో మస్క్కు అత్యధిక వాటా ఉంది. మార్చి నాటికి ఆయన కంపెనీలో 42 శాతం వాటా, దాదాపు 79 శాతం ఓటింగ్ శక్తి కలిగి ఉన్నట్లు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్లో దాఖలు చేసిన నివేదికను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. -
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం!
అమెరికా స్పేస్ రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 నుంచి 2022 మధ్య కాలంలో బిట్ కాయిన్లలో పెట్టిన పెట్టుబడుల మొత్తాన్ని అమ్మినట్లు తెలుస్తోంది. ఆ మొత్తం విలువ 373 మిలియన్ డాలర్లుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో బిట్కాయిన్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. స్పేస్ఎక్స్ బిట్కాయిన్ పెట్టుబడుల్ని అమ్మిన కేవలం అరగంట వ్యవధిలో బిట్కాయిన్ మార్కెట్ క్రాష్ అయ్యింది. 800 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. స్పేస్ఎక్స్ తన బిట్కాయిన్లోని ఇన్వెస్ట్మెంట్లను అమ్మడం బిట్ కాయిన్ మార్కెట్లో అలజడి సృష్టించింది. అయినప్పటికీ, స్పేస్ ఎక్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. టప్ మని పేలిన బిట్కాయిన్ బుడగ పలు నివేదికల ప్రకారం, బిట్కాయిన్ బుడగ పేలింది. కేవలం రెండు నెలల్లో తొలిసారి $26,000 కంటే తక్కువకు పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 72 శాతం పెరుగుదల తర్వాత మార్చి నెల చివరి నుండి బిట్కాయిన్ 9 శాతం క్షీణించింది. చదవండి👉 : ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే! -
స్పేస్ఎక్స్లో కనిపించిన 'బుల్లి మస్క్' - ఫిదా అవుతున్న నెటిజన్లు!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటూ చాలామందికి సుపరిచయమయ్యాడు. అయితే ఇటీవల మస్క్ తన కొడుకు 'X AE A-Xii'తో స్పేస్ ఎక్స్ కార్యాలయంలో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్లో తెగ వైరల్ అవుతున్నాయి. 2020 మే 04న జన్మించిన X AE A-Xii ఎలాన్ మస్క్ భార్య గ్రిమ్స్ మొదటి కొడుకు. అయితే ఈ పిల్లవాడితో కలిసి స్పేస్ ఎక్స్ కార్యాలయానికి రావడం బహుశా ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు మస్క్ తల్లి మయే మస్క్, "లేట్ ఆన్ ఎ ఫ్రైడే నైట్ @elonmusk X @SpaceX" అనే క్యాప్షన్తో ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. (ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?) Late on a Friday night @elonmusk X @SpaceX ❤️❤️❤️ pic.twitter.com/dhpJqUsflo — Maye Musk (@mayemusk) July 16, 2023 ఈ ఫోటోలు ఇప్పటి వరకు 40 వేల కంటే ఎక్కువ లైకులు పొందాయి. చాలా మంది బిలినీయర్లు పార్టీలు చేసుకుని సరదాగా గడుపుతారు. మస్క్ మాత్రం తన కొడుకుతో ఆఫీసులో గడుపుతున్నాడు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేసాడు. ఈ పిల్లవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసే అనుభవాలను తప్పకుండా పొందుతాడు అంటూ మరో వ్యక్తి.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు. -
ఎలాన్ మస్క్కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు?
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ డిప్రెషన్ వంటి మానసిక సమస్యతో బాధపడుతున్నారంటూ పలు సంచలన నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, రోజూవారీ ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మస్క్ పార్టీలకు వెళ్తుంటారు. ఆ సమయంలో మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కెటామైన్ (డిప్రెషన్ తగ్గించుకునేందుకు వినియోగించుకునే మెడిసిన్) అనే మందును ఎక్కువ డోస్లో తీసుకుంటున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. అంతేకాదు, డిప్రెషన్ నుంచి తాను బయటపడేందుకు తక్కువ మోతాదులో కెటామైన్ను తీసుకుంటున్నట్లు మస్క్ తన స్నేహితులకు చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఆ రిపోర్ట్ను ఊటంకించేలా.. మస్క్ డిప్రెషన్ నుంచి కోలుకునేలా కెటామైన్ ఎలా ఉపయోగపడుతుందనే తదితర అంశాలపై ట్విట్ చేశారు. ఆ ట్విట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Depression is overdiagnosed in the US, but for some people it really is a brain chemistry issue. But zombifying people with SSRIs for sure happens way too much. From what I’ve seen with friends, ketamine taken occasionally is a better option. — Elon Musk (@elonmusk) June 27, 2023 డిప్రెషన్ అనేది బ్రెయిన్ సంబంధిత సమస్య. యుఎస్లో ఈ మానసిక సమస్యతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కెటామైన్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది జాంబిఫైయింగ్ బారిన పడేందుకు అవకాశం ఉన్న సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ (ssri) అనే మెడిసిన్ను తీసుకుంటున్నారని ట్వీట్లో మస్క్ తెలిపారు. వాల్స్ట్రీట్ జర్నల్ (wsj) నివేదికల ప్రకారం.. మస్క్ ఆరోపిస్తున్నట్లుగా మత్తెక్కించే కెటామైన్ అనే డ్రగ్ను తీసుకునే కల్చర్ సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటీవ్లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మార్కెట్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని వ్యాపారంలో పనితీరు మెరుగు పరుచుకోవడంతో పాటు సృజనాత్మకత కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ కంపెనీల్లో సీఈవోలు, ఫౌండర్లు కెటామైన్, మ్యాజిక్ మష్రూమ్లు, లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (ఎల్ఎస్డీ) మత్తు పదార్ధాల్ని తీసుకున్నట్లు డబ్ల్యూఎస్జే ప్రస్తావించింది. వారిలో గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ 'మ్యాజిక్ మష్రూమ్'లను తీసుకున్నట్లు డబ్ల్యూఎస్జే నివేదించింది. ఈ మ్యూజిక్ మష్రూమ్లలో శరీరాన్ని మత్తెక్కించే సైలోసిబిన్ (psilocybin) అనే రసాయనం ఉంటుంది. 2018లో పాడ్కాస్ట్ జరిగే సమయంలో ఇలా సంచలనాత్మక కామెంట్లతో నిత్యం నెటిజన్ల నోళ్లలో నానే ఎలాన్ మస్క్కు తాజా ట్విట్లు కొత్తవేం కావనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. 2018లో జో రోగన్ పోడ్కాస్ట్ ఎపిసోడ్లో గంజాయి తాగి వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. ఈ సంఘటన తర్వాత తనకు, స్పేస్ఎక్స్ ఉద్యోగులకు రెగ్యులర్ డ్రగ్ టెస్ట్లు జరుగుతున్నాయని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. కెటామైన్ వినియోగం.. అమెరికాలో అనుమతి కెటామైన్ డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఉపయోగించే మెడిసిన్. అమెరికాలో దీని వినియోగంపై నియంత్రణ ఉంది. వ్యాధిగ్రస్తులు వైద్య నిపుణులు ఆధ్వర్యంలో పొడిగా, ద్రవ రూపంలో, మాత్రల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. జాంబిఫైయింగ్ అంటే? మస్క్ చెబుతున్నట్లుగా..సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ అనే మెడిసిన్ వినియోగంతో జాంబిఫైయింగ్ అనే వ్యాధి సోకుతుంది. లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్తో బాధపడే వారు ఇష్టం వచ్చినట్లుగా మీద పడి కొరుకుతుంటారని హెల్త్కేర్ నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్ల మధ్య పంతం!,ఎవరి మాట నెగ్గుతుందో? -
14 ఏళ్లకే వేలకోట్ల కంపెనీలో జాబ్.. ఎవరీ కైరాన్ క్వాజీ?
Youngest Engineer Kairan Quazi: తెలివికి వయసుతో సంబంధం లేదని మళ్ళీ నిరూపించాడు 14 ఏళ్ల 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi). త్వరలోనే ఈ చిన్నారి ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరనున్నారు. ఇప్పటికే ఇతడు స్పేస్ఎక్స్ టెక్నాలజీ ఛాలెంజింగ్ ఇంటర్వ్యూను కూడా క్లియర్ చేసాడు. ఇంత గొప్ప విజయం సాధించిన కైరాన్ క్వాజీ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ 11 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదవడం ప్రారంభించాడు. గత మే నెలలో శాంటా క్లారా యూనివర్సిటీ (SCU) నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచి స్పేస్ఎక్స్లో పనిచేయాలని కోరిక ఉన్న క్వాజీ ఆ వైపుగానే అడుగులు వేసాడు. అనుకున్నది సాధించాడు. జాబ్కి సెలెక్ట్ అయిన వెంటనే కైరాన్ క్వాజీ లింక్డ్ఇన్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో నా నెక్స్ట్ స్టాప్ స్పేస్ఎక్స్. నేను త్వరలో ఇంజినీరింగ్ బృందంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరుతాను. కంపెనీ నా వయసుని చూడలేదు.. నా సామర్థ్యం మాత్రమే చూసిందని రాసాడు. సంస్థ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ స్క్రీన్షాట్ కూడా ఇందులో యాడ్ చేశారు. (ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్కే గిఫ్ట్ ఇచ్చేంత కుబేరుడితడు.. భారతదేశపు ఫస్ట్ బిలీనియర్!) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) క్వాజీ తన ఫ్యామిలీతో కలిసి స్పేస్ఎక్స్లో పనిచేయడం ప్రారంభించేందుకు కాలిఫోర్నియాలోని ప్లెసాంటన్ నుంచి వాషింగ్టన్కు వెళ్లాలని యోచిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇతడు తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా ఉద్యోగ ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నట్లు తెలియజేశాడు. ఈ పోస్ట్ చేసిన కొన్ని వారాల తర్వాత, ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు. (ఇదీ చదవండి: ఈ బాలీవుడ్ కపుల్స్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) నిజానికి క్వాజీ తన తొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్షిప్ పొందాడు. ఆ తరువాత 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022 లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్గా నాలుగు నెలలు పనిచేశాడు. కాగా తన తల్లి వాల్ స్ట్రీట్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. కైరాన్ తండ్రి ముస్తాహిద్ క్వాజీ ఒక ఇంజనీర్ కావడం విశేషం. -
స్పేస్ ఎక్స్లో పద్నాలుగేళ్ల ఇంజనీర్
కాలిఫోర్నియా: ఎలన్ మస్క్కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్కి ఇకపై ఒక బుల్లి ఇంజనీర్ సేవలందించనున్నాడు. 14 ఏళ్ల వయసున్న కైరాన్ క్వాజి అనే ఇంజనీర్కి ఉద్యోగమిచ్చింది. స్పేస్ ఎక్స్ నిర్వహించిన సాంకేతిక పరీక్ష, ఇంటర్వ్యూల్లో క్వాజీ ఉత్తీర్ణుడు కావడంతో ఇంజనీర్గా నియమించినట్టు సంస్థ వెల్లడించింది. పదకొండేళ్లకే క్వాజీ ఇంజనీరింగ్లో చేరాడు. కంప్యూటర్ సైన్స్లో పట్టా తీసుకున్న క్వాజీకి వెంటనే స్పేస్ ఎక్స్లో ఉద్యోగం లభించింది. అంగారక గ్రహంపైకి మనుషుల్ని తీసుకువెళ్లే ప్రాజెక్టులో క్వాజీ ఉన్నాడు. చదవండి: ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే.. -
సొంత పట్టణం నిర్మించనున్న ఎలాన్ మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ సొంతంగా ఒక పట్టణాన్నే నిర్మించబోతున్నారు. ఇందుకోసం ఆయన కంపెనీలు, అనుబంధ సంస్థలు టెక్సాస్లో వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆస్టిన్కు సమీపంలోని బస్ట్రోప్ కౌంటీలోసుమారు 3,500 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. స్నెయిల్ బ్రూక్ అనే పేరుతో సొంత పట్టణాన్ని నిర్మించే పనుల్లో ఎలాన్ మస్క్ నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా మస్క్కు చెందిన బోరింగ్ కంపెనీ, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థలకు ఆస్టిన్ సమీపంలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కొత్త పట్టణంలో మార్కెట్ ధర కంటే చౌకగానే ఆఫీసులను ఏర్పాటు చేయనున్నాయి. ఉద్యోగుల నివాసాలు కూడా ఇందులోనే ఉంటాయి. నూతనంగా రూపుదాల్చే స్నెయిల్ బ్రూక్లో 100కు పైగా భవనాలను నిర్మిస్తారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల వంటి ఏర్పాట్లూ ఉంటాయి. టెస్లా ప్రధాన కార్యాలయంతోపాటు తన వ్యక్తిగత నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు మారుస్తానని గతంలోనే మస్క్ ప్రకటించారని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం గుర్తు చేసింది. -
వన్వెబ్ 40 ఉపగ్రహాల ప్రయోగం..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్వెబ్ తాజా స్పేస్ఎక్స్తో కలిసి 40 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని ప్రయోగించినట్లు వివరించింది. దీంతో తాము మొత్తం 582 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లయిందని పేర్కొంది. కనెక్టివిటీ సామర్థ్యాలను పెంచుకోవడంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయని వన్వెబ్ సీఈవో నీల్ మాస్టర్సన్ తెలిపారు. -
అయ్యో.. ఎలన్ మస్క్! సంచలన పతనం
ఎలన్ మస్క్.. వ్యాపార రంగంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఓ ట్రెండ్ సెట్టర్. గత రెండేళ్లుగా ప్రపంచ మీడియా సంస్థల్లో ఆయన పేరు నానని రోజంటూ లేదు. అంతలా సంచలనాలకు తెర లేపాడు ఆయన. పైపెచ్చు 2021 జనవరిలో వ్యక్తిగత సంపదను 200 బిలియన్ల మార్క్ దాటించుకుని.. మానవ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ను దాటేసి.. అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే.. ట్విటర్ కొనుగోలు నేపథ్యంలో ఎలన్ మస్క్కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉంది. 2022 ఎలన్ మస్క్కు ఏరకంగానూ కలిసి రాలేదు. ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఆయన ఖాతాలో పడకపోవడం గమనార్హం. పైగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. ప్రపంచ అపర కుబేరుల జాబితా నుంచి రెండో స్థానానికి పడిపోయారు ఆయన. ఏడాది చివరకల్లా.. 150 బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయింది ఆయన సంపద. ఒకానొక టైంకి 137 బిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా. చరిత్రలో తొలి ట్రిలియన్ బిలియనీర్గా నిలిచిన ఘనత ఎలన్ మస్క్దే. నవంబర్ 4, 2021 నాటికి ఆయన సంపద అక్షరాల 340 బిలియన్ డాలర్లు. కానీ, ఆ మార్క్ను ఆయన ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు!. ఎలన్ మస్క్ సంపద తరుగుతూ వస్తోంది. మరోవైపు ట్విటర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినా.. ఆయన సంపదపై ఆ ప్రభావం పడదని ఆర్థిక విశ్లేషకులు భావించారు. కానీ, అ అంచనా తప్పింది. టెస్లా షేర్లు గణనీయంగా, క్రమం తప్పకుండా పతనం అవుతుండడం(2022లో ఏకంగా 65 శాతం దాకా పతనం అయ్యింది) ఆయన సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే ఎలన్ మస్క్ మాత్రం టెస్లా అద్భుతంగా పని చేస్తోందని, అది అంతకు ముందు కంటే అద్భుతంగా ఉందంటూ డిసెంబర్ 16వ తేదీన ఒక ట్వీట్ చేశాడు. గణాంకాలు మాత్రం విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. మిగతా సొంత కంపెనీలతో(న్యూరాలింక్, ఓపెన్ ఏఐ, స్పేస్ఎక్స్.. దీని అనుబంధ సంస్థ స్టార్లింక్, ది బోరింగ్ కంపెనీలతో ఎలన్ మస్క్కు పెద్దగా ఒరిగింది కూడా ఏం లేకపోవడం గమనార్హం!. ఈ కథనం రాసే సమయానికి ఫోర్బ్స్ లిస్ట్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ & ఫ్యామిలీ 179 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో ఎలన్ మస్క్ 146 బిలియన్ డాలర్లత సంపదతో నిలిచారు. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 200 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారన్నమాట. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఇంతలా ఓ వ్యక్తి సంపదను కోల్పోయిందే లేదు. ఇక.. భారత్కు చెందిన గౌతమ్ అదానీ 127 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: రిలయన్స్ను ముకేశ్ ఎలా ఉరుకులు పెట్టించారో తెలుసా? -
స్పేస్ ఎక్స్ ‘చంద్రయాన్’లో భారత నటుడు దీప్ జోషి
వాషింగ్టన్: ‘డియర్ మూన్’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సాధించిన భారత నటుడు దీప్ జోషి చోటు దక్కించుకున్నారు! చంద్రుని సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్ మ్యుజీషియన్ షొయ్ సెయంగ్ హుయాన్ (టాప్) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టార్షిప్ వెహికిల్లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు. 2000 నవంబర్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో పుట్టారు. పలు గుజరాతీ సినిమాల్లో నటించారు. ‘‘దేవ్ యువోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసుకున్నాం’’ అని మజావా పేర్కొన్నారు. -
అంతరిక్షంలో అడుగు పెట్టనున్న భారతీయ నటుడు..ఎవరంటే?
Indian Actor Dev Joshi:స్పేస్ టూరిజంలో మరో సరికొత్త సంచలనం సృష్టించేందుకు అపరకుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది 8 మందిని అంతరిక్షంలోకి పంపించనున్నారు. తాజాగా నింగిలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆ ఎనిమిది మంది ఎవరనేది జపాన్ బిలియనీర్ యుసాకు మాయఝావా రివిల్ చేశారు. ఎందుకంటే? మూన్ ట్రిప్ కోసం స్పేస్ ఎక్స్కు చెందిన స్పేస్ షిప్ స్పేస్ క్రాఫ్ట్ సీట్లు కొనుగోలు చేసింది ఆయన కాబట్టి. ఇక స్పేస్లోకి వెళ్లే ప్రయాణికుల్లో ఓ భారతీయ నటుడు ఉండటం విశేషం.ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా? జపాన్లో అత్యంత ధనవంతుల జాబితాలో బిజినెస్ టైకూన్ యుసాకు మేజావా (Yusaku Maezawa) ఒకరు. ఎలాన్ మస్క్ తరహాలో ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ట్విటర్లో ట్వీట్లు చేస్తూ అందర్ని ఆకర్షిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ ట్వీట్. 2020 జనవరి 1న మేజావా చేసిన ఓ ట్వీట్ను ఎవరైతే ఎక్కువ సార్లు రీట్వీట్ చేస్తారో..వారిలో 1000 మందిని ఎంపిక చేసి 1 మిలియన్ యెన్ ($7300) చెల్లిస్తానని ప్రకటించారు. ఎందుకు ఇలా ఫ్రీగా ఇస్తున్నారని ప్రశ్నిస్తే ఇదొక సోషల్ ఎక్స్పెరిమెంట్. నేనిచ్చే డబ్బులు వారికి ఆనందాన్ని ఇస్తుందో లేదో చూడాలని ఇలా ప్రకటించినట్లు తెలిపారు. ఉచితంగానే ఇప్పుడు అదే మేజావా ప్రపంచ వ్యాప్తంగా 8 మందిని ఎంపిక చేసి వారిని ఉచితంగా చంద్రుని మీదకు పంపించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ‘డియర్ మూన్ క్రూ’ పేరుతో అంతరిక్ష ప్రయాణం ప్రారంభం కానుంది. నింగిలోకి వెళ్లనున్న ఆ 8 మంది మొత్తం ఆరు రోజుల ప్రయాణం చేయనుండగా .. మూడు రోజులు పాటు చంద్రుడి చుట్టూ తిరిగి భూమి మీదికి రానున్నారు. ఆ 8 మంది ఎవరంటే ఆకాశాన్నీ దాటి అంతరిక్షంలోకి వెళ్లనున్న 8 మందిలో మనదేశానికి చెందిన నటుడు దేవ్ జోషితో పాటు జపనీస్ ఫ్యాషన్.. అమెరికన్ డిజె, నిర్మాత స్టీవ్ అయోకి, Czech artist యెమి ఎడి, అమెరికన్ యూట్యూబర్ టిమ్ డాడ్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ కరీం ఇలియా, ఐరిష్ ఫోటోగ్రాఫర్ రియానన్ ఆడమ్, దక్షిణ కొరియా కె-పాప్ బ్యాండ్ స్టార్ చోయ్ సెయుంగ్-హ్యూన్ (Choi Seung-hyun) అమెరికన్ చిత్రనిర్మాత బ్రెండన్ హాల్ ఉన్నారు. భారత్కు చెందిన ఆ నటుడు ఎవరంటే వారిలో మనదేశంలోని గుజరాత్కు చెందిన దేవ్ జోషి చిన్నప్పట్నుంచి పలు సీరియల్స్, సినిమాల్లో బాలీవుడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇతనికి కేవలం 22 సంవత్సరాలే. పలు నివేదికల ప్రకారం.. భారతీయ నటుడు, గుజరాత్కు చెందిన దేవ్ జోషి 3 ఏళ్ల వయస్సులో బాల నటుడిగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అలా సోనీ (సోనీ సాబ్) టీవీ అక్టోబర్ 8, 2012లో విడుదల చేసిన బాల్ వీర్లో, బాల్ వీర్ రిటర్న్తో సీరియల్స్ తో పాటు 20కి పైగా గుజరాతీ సినిమాలు, ఇతర అడ్వటైజ్మెంట్లలో యాక్ట్ చేశారు. తాజాగా ఉచితంగా అంతరిక్షంలోకి వెళ్లే అదృష్టాన్ని దక్కించుకున్నారు. That's our Flight Path to the Moon and Back! 💙🚀 https://t.co/LtLxGuvNKW — Dev Joshi (@devjoshi10) December 10, 2022 -
ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు, ‘ట్విటర్ దివాలా తీయొచ్చు..నేడో..రేపో’!
సీఈవో ఎలాన్ మస్క్ అనాలోచిత నిర్ణయాల వల్ల ట్విటర్ చిక్కుల్లో పడనుందా? మస్క్ కొనుగోలు తర్వాత ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ పెయిడ్ వెరిఫికేషన్, ట్విటర్లో అడ్వటైజ్మెంట్స్ నిలిపివేసే సంస్థల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం వంటి నిర్ణయాలతో ఆ సంస్థ దివాలా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఉద్యోగులతో మస్క్ చర్చించినట్లు సమాచారం. ఉద్యోగులతో మాట్లాడే సమయంలో ట్విటర్ సంస్థ దివాళా తీసే అవకాశం ఉందనే అంశాన్ని ఎలాన్ మస్క్ సైతం తోసిపుచ్చలేదంటూ బ్లూమ్బెర్గ్ సైతం నివేదించింది. అయితే అందుకు కారణం..మస్క్ 44 బిలియన్ డాలర్ల కొనుగోలు చేసిన రెండు వారాల తర్వాత ట్విటర్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంస్థ ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. బుధవారం ట్విటర్ ఎక్జిగ్యూటీవ్లు యోయెల్ రోత్ , రాబిన్ వీలర్తో నిర్వహించిన ట్విటర్ స్పేస్ చాట్లో మస్క్ ప్రకటనదారుల ఆందోళనలను తగ్గించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ హైలెట్ చేసింది. దీనికి తోడు సంస్థ ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించే ట్విటర్ సీనియర్ ఉద్యోగులు ఒక్కొక్కరిగా వైదొలగడం చర్చాంశనీయంగా మారింది. ట్విటర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ మరియాన్ ఫోగార్టీలు రాజీనామా చేయడంతో ట్విటర్ యాజమాన్యం ఆందోళనకు గురైందని, ఇలా ఉద్యోగుల రాజీనామాలతో ట్విటర్ దివాలా తీయడం ఖాయమంటూ మస్క్ ఉద్యోగులతో హెచ్చరించారు. ట్విటర్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఇటీవల కాలంలో ట్విటర్లో జరుగుతున్న వరుస పరిణామాలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ట్రేడ్ ఏజెన్సీ కమిషన్ (ఎఫ్టీసీ) స్పందించింది. ప్రభుత్వ న్యాయ చట్టాలను ధిక్కరిస్తూ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని’ఎఫ్టీసీ స్పష్టం చేసింది. ట్విటర్లో జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికపప్పుడు ట్రాక్ చేస్తున్నాం.‘ సీఈవోలు లేదా సంస్థలు చట్టానికి అతీతం కాదు. ఎఫ్టీసీ నిబంధనలు లోబడి పనిచేయాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ఎఫ్టీసీ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ డగ్లస్ ఫర్రార్ రాయిటర్స్తో అన్నారు. మస్క్కి బయపడం మే నెలలో ట్విటర్ యూజర్ల ఫోన్నెంబర్లను దుర్వినియోగం చేసింది. భద్రతా కారణాల కోసం మాత్రమే సమాచారాన్ని సేకరించినట్లు వినియోగదారులకు తెలిపింది.అదే అంశంపై ఎఫ్టీసీ ట్విటర్పై తీవ్ర ఆరోపణలు చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ట్విటర్ 150 మిలియన్ డాలర్లను ఎఫ్టీసీకి చెల్లించడానికి అంగీకరించింది. 150 మిలియన్ డాలర్ల చెల్లించేందుకు కొంత సమయం, సంస్థలోని పరిణామాలపై ఎఫ్టీసీ- ట్విటర్ మధ్య జరిగిన ఇంటర్నల్ మెయిల్స్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం.. ఎలాన్ మస్క్ భారీ ఎత్తున నష్టపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ట్విటర్ లీగల్ చీఫ్ అలెక్స్ స్పిరో ఎఫ్టీసీ అటార్నీ జర్నల్ ఆల్డెన్ ఎఫ్ అబాట్ అన్నారు. అందుకు అటార్నీ ఎలాన్ మస్క్ అంతరిక్షంలోకి పంపియొచ్చు. కానీ అతనికి ఎఫ్టీసీ బయపడదు’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. స్పందించని ట్విటర్ గురువారం మధ్యాహ్నం ట్విట్టర్లో ఉద్యోగులందరితో నిర్వహించిన సమావేశంలో.. వచ్చే ఏడాది కంపెనీ బిలియన్ల డాలర్లను కోల్పోవచ్చని మస్క్ హెచ్చరించినట్లు సమాచారం. కాగా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ట్విటర్ దివాలా తీసే అవకాశం, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ హెచ్చరికలు, ఉద్యోగుల రాజీనామాలపై ట్విటర్ స్పందించలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 మాయదారి ట్విటర్..మంచులా కరిగిపోతున్న ఎలాన్ మస్క్ సంపద! -
‘ట్విటర్ ఉద్యోగులారా..ప్లీజ్ నన్ను క్షమించండి’: జాక్ డోర్సే
ట్విటర్ సంస్థలో జరుగుతున్న వరుస పరిణామాలపై ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే స్పందించారు. ఎలన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఈ తరుణంలో మస్క్ నిర్ణయాన్ని డోర్సే తప్పు బట్టారు. ట్విటర్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తనని క్షమించాలని కోరారు. ఉద్యోగులు నాపై కోపంగా ఉన్నారని తెలుసు, వారు ఎదుర్కొంటున్న కఠిమైన సమయానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. సంస్థ వృద్ధి కోసం అతి తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకున్నాను. అందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Folks at Twitter past and present are strong and resilient. They will always find a way no matter how difficult the moment. I realize many are angry with me. I own the responsibility for why everyone is in this situation: I grew the company size too quickly. I apologize for that. — jack (@jack) November 5, 2022 కాగా, 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, విజయ గద్దె వంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని తొలగించారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
ఎలాన్ మస్క్పై టంగ్ స్లిపయ్యాడు.. ఆ వెంటనే ఊహించని షాక్!
ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది. అంతేనా ఆయన ట్వీట్లు కూడా నెట్టింట హల్ చేస్తుంటాయి. తాజాగా మస్క్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ఇటీవల ఆయన చేసిన ట్వీట్ సోషల్మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు మస్క్ను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాయబారి ఆండ్రిజ్ మెల్నిక్ కూడా ఈ విషయంలో కాస్త నోటి దురుసును చూపించారు. అయితే ఈ వ్యాఖ్యలు అనంతరం ఆయన దేశానికి ఫ్రీ ఇంటర్నెట్ లేకుండా చేసిందని అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. అనూహ్య పరిణామాల మధ్య ఉక్రెయిన్పై రష్యా యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఉక్రెయిన్కు ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తూ అండగా నిలిచిన మస్క్పై ఇటీవల దుర్భాషలాడారు ఆండ్రిజ్ మెల్నిక్. దీని తర్వాత పరిణామంలో.. ఇకపై ఉక్రెయిన్కు స్టార్లింక్ ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడంపై మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీగా కొనసాగాలంటే మీరు ఫండింగ్ ఇవ్వండని ఆమెరికా ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించి మస్క్ పెంటాగాన్కి ఓ ట్వీట్ చేశాడు. అందులో స్టార్లింక్ సర్వీస్ కోసం ఇకపై చెల్లింపు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అదే ట్వీట్లో ఇలా కూడా ఉంది. మెల్నిక్ సూచించినదే తాను చేస్తున్నానని చెప్పారు మస్క్. ఖర్చు ఏక్కువైంది.. పేమెంట్ చేయగలరు! ఉక్రెయిన్లో స్టార్లింక్ సేవలు పనిచేయాలంటే ఇప్పుడు దాదాపు $120 మిలియన్లు చెల్లించాలని స్పేస్ఎక్స్ తాజాగా పెంటగాన్ను కోరుతోంది. దీంతో పాటు, వచ్చే ఏడాదికి సంబంధించిన చెల్లింపులను కూడా కంపెనీ ముందుగానే కోరినట్లు సమాచారం. 2023కి పెంటగాన్ $400 మిలియన్లు చెల్లించాల్సి ఉంటుందని తమ అంచనాను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. ఉక్రెయిన్కు ఉచిత సేవలందించేందుకు స్టార్లింక్ టెర్మినల్స్పై స్పేస్ఎక్స్ $80 మిలియన్లు ఖర్చు చేసిందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 100 మిలియన్ డాలర్లకు చేరుతుందని మస్క్ గతంలో ట్విట్టర్లో వెల్లడించారు. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
భారీ కాంట్రాక్ట్, ఎలాన్ మస్క్కు జాక్ పాట్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ జాక్ పాట్ కొట్టారు. నాసా నుంచి 1.4 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ను దక్కించుకున్నారు. ఈ కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా మస్క్ ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఆస్ట్రోనాట్స్ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) కు పంపించనున్నారు. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆస్ట్రోనాట్స్ను తరలించేందుకు మస్క్కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది. తొలిసారి 2014 లో నాసా మస్క్తో ఒప్పందం కుదర్చుకుంది. ఆ ఒప్పందాన్ని తాజాగా సవరించింది. తాజాగా సవరించిన ఒప్పందంలో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, ఫాల్కన్ 9 రాకెట్లు కార్గోను, నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని నాసా తెలిపింది. -
పొద్దున్నే ఆ వాసన భలే ఉంది: ఎలాన్ మస్క్ భారీ ప్లాన్లు!
సాక్షి,న్యూఢిల్లీ: హై స్పీడ్ స్టార్లింక్ శాటిలైట్లను ప్రవేశపెట్టిన బిలియనీర్,స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా రాకెట్ల లాంచింగ్, లాంచ్ ప్యాడ్పై ట్వీట్ చేశారు. రాకెట్ లాంచ్ప్యాడ్కు తరలింపు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ఐ లవ్ దట్ స్మెల్ ఆఫ్ హైడ్రాలిక్ లిక్విడ్ అంటూ ట్వీట్ చేశారు. స్టార్లింక్ ప్రాజెక్ట్లో భాగంలో ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతోందన్న అంచనాలకు ఇంది మరింత బలాన్నిచ్చింది. (Kartikeya Jakhar: ఫోన్ బాధలు పడలేక: పన్నెండేళ్ల బుడతడి అరుదైన రికార్డు!) 2025, ఏప్రిల్లో స్పేస్ఎక్స్ స్పేస్ టెలిస్కోప్తో సోలార్ విండ్ మిషన్ను ప్రారంభించనుందని నాసా తాజాగా ప్రకటించింది. స్పేస్ఎక్స్, నాసా మిషన్లు కలిసి కక్ష్యలోకి ఈ రోడ్ట్రిప్ తీసుకుంటాయని ఏజెన్సీ ప్రకటించింది. దీని ప్రకారం స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఐదు అంతరిక్ష నౌకలు ఉంటాయి, ఒకటి ఖగోళ భౌతిక శాస్త్రానికి ,మిగిలిన నాలుగు సోలార్ సైన్స్కు సేవలను అందించనున్నాయి. (ఇదీ చదవండి: ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో) కాగా అంతరిక్షంలోకి పంపే రాకెట్ల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ లాంచ్ప్యాడ్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించు కుంది. గత నెలలో స్పేస్ వెంచర్ స్పేస్ఎక్స్ 46 స్టార్లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా లో-ఎర్త్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాన్మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ 2021లో ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఒకేసారి 52 స్టార్ లింక్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. 2025 సంవత్సరం నాటికి స్టార్లింక్ శాటిలైట్ల ద్వారా స్పేస్ఎక్స్ కంపెనీ భారీ ఆదాయాన్ని పొందాలని చూస్తోంది. Moving rocket to launch pad pic.twitter.com/nPVq1tyLoy — Elon Musk (@elonmusk) August 6, 2022 I love the smell of hydraulic fluid in the morning — Elon Musk (@elonmusk) August 6, 2022 -
ఎలాన్ మస్క్కు మరో ఎదురు దెబ్బ,పేలిన స్పేస్ ఎక్స్ రాకెట్!
ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టెక్సాస్లో స్పేస్ ఎక్స్కు చెందిన సూపర్ హెవీ బూస్టర్ పేలింది. ఈ పరిణామం మస్క్ను ఆర్ధికంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం..మార్స్పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా ఎలన్ మస్క్ పనిచేస్తున్నాడు. ఇందుకోసం సులభంగా అతి తక్కువ ఖర్చుతో మార్స్, చంద్రమండలంపై మానువుడు అడుగుపెట్టేలా రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నాడు. వాటిని ప్రయోగిస్తున్నాడు. Holy moly. Well, that was unexpected!https://t.co/dUUqw7ojRv pic.twitter.com/7IGztPuE12 — Chris Bergin - NSF (@NASASpaceflight) July 11, 2022 ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చివరి నాటికి భూకక్ష్యలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసిన 394 అడుగుల (120 మీటర్లు) సూపర్ హెవీ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ 7 ప్రోటో టైప్ను టెక్సాస్లో స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాలు జరిపే బోకా చికా ప్రాంతంలో టెస్ట్ నిర్వహించింది. ఈ ప్రయోగం జరిపే సమయంలో స్పేస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ ఒక్కసారిగా పేలి తునాతునకలైంది. Yeah, actually not good. Team is assessing damage. — Elon Musk (@elonmusk) July 11, 2022 పేలుతున్న ఆ దృశ్యాల్ని నాసా అఫిషియల్ వెబ్ సైట్ లైవ్ టెలికాస్ట్ చేయగా..పేలిన 33 రాప్టార్ ఇంజిన్లతో తయారు చేసిన రాకెట్ ఎందుకు పేలిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎలన్ మస్క్ సైతం రాకెట్ పేలుడిపై స్పందించాడు. యా. ఇది మంచిది కాదు. రాకెట్ పేలుడు నష్టాన్ని స్పేస్ ఎక్స్ టీం అంచనా వేస్తుందని ట్వీట్ చేశాడు. -
టెస్లా ఉద్యోగులు: ఎలన్ మస్క్ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం!
టెస్లా మాజీ ఉద్యోగులు ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పట్ల వ్యవహరించే తీరు మార్చుకోవాలని, లేదంటే అది సంస్థకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతుందని ఉద్యోగులు ఇంటర్నల్ చాట్ సిస్టం (ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ)లో మస్క్పై దుమ్మెత్తిపోశారు. బహిరంగంగా ఓపెన్ లెటర్ను విడుదల చేశారు. ఉద్యోగులు విడుదల చేసిన ఓపెన్ లెటర్లో ఎలన్ మస్క్ తీరు ఎలా ఉందో వివరించారు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా తమని ఇబ్బందులకు గురి చేసినట్లు అందులో వాపోయారు. అంతేకాదు మస్క్తో పాటు టెస్లా సంస్థ సైతం తెలివి తక్కువగా నిర్ణయాలు తీసుకుంటూ ట్విట్టర్ ప్రతిష్టను మరింత దిగజార్చే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అందుకే మస్క్ విమర్శల్ని ప్రతి ఘటిస్తూ ట్విట్టర్ యాజమాన్యం సమాధానం చెప్పాలని అన్నారు. అదే సమయంలో "స్పేస్ఎక్స్ స్పోక్ పర్సన్గా ఉన్న ఎలన్ మస్క్ చేసే అసందర్భ వ్యాఖ్యలు తాము చేసే, చేస్తున్న వర్క్పై లేదంటే మా లక్ష్యాలపై, విలువలపై ప్రతిబింబిచవు" అని ఇంటర్నల్ చాట్ సిస్టంలో షేర్ చేసిన ఓపెన్ లెటర్లో ఉద్యోగులు స్పష్టం చేశారు. న్యూయార్స్ టైమ్స్ కథనం న్యూయార్స్ టైమ్స్ కథనం ప్రకారం.. టెస్లా ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ ఓ లెటర్ను విడుదల చేశారు. కానీ ఎంతమంది ఉద్యోగుల్ని బలవంతంగా బయటకు పంపించిందనే విషయం వెలుగులోకి రాలేదు. చదవండి👉 ఎలన్ మస్క్ ఆగమాగం, మంచు పర్వతంలా కరిగిపోతున్న ఆస్తులు! -
మస్క్ చేతికి ట్విటర్.. ట్రంప్ రీఎంట్రీ ఉంటుందా అంటే...?
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ను స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేజిక్కించుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ట్విటర్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకే మస్క్ దానిని కొనుగోలు చేశారని అన్నారు. ఎలన్ మస్క్ మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. అలాగే, ట్విట్టర్లోకి రీఎంట్రీపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ట్విటర్ తన అకౌంట్ను పునరుద్ధరించినా.. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫాంలోకి తిరిగి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. చదవండి👉🏾 ట్విటర్ డీల్.. చైనా ప్రస్తావనతో పొగిడాడా? చరుకలు అంటించాడా? సొంత సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’లోనే కొనసాగుతానని చెప్పారు. మరోవారం రోజుల్లో లాంఛనంగా తన ట్రూత్ సోషల్లో జాయిన్ అవుతానని అన్నారు. 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఖాతాను ట్విట్టర్ నిషేధించింది. అప్పటికే ట్విట్టర్లో ట్రంప్కు 88మిలియన్ల ఫాలోవర్లున్నారు. కాగా, ఫ్రీ స్పీచ్ (వాక్ స్వాతంత్య్రానికి) కోసం ట్విటర్ను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించిన మస్క్ ఎట్టకేలకు సాధించారు. దాదాపు 44 బిలియన్ డాలర్లకు మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్ను సొంతం చేసుకున్నారు. చదవండి👉🏻 కిండర్గార్టెన్లో కాల్పుల కలకలం.. నలుగురి మృతి -
గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది అంతే! ఎలన్ మస్క్ యుద్ధం వచ్చినా ఆగేలా లేడే!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రయోగాలతో ముందుకు సాగుతున్నాడు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పరిణామాలు తన కలల్ని చిన్నాభిన్నం చేస్తున్నా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. చిన్న గ్యాప్ ఇచ్చీ మళ్లీ మొదలు పెట్టాడు. తాజాగా శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఎలన్ మస్క్ 48 స్టార్లింక్ శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్లోకి పంపించారు. గత కొన్నేళ్లుగా అమెరికన్ బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ తక్కువ కనెక్టివిటీలో సైతం ఇంటర్నెట్ను అందించేందుకు శాటిలైట్ ఇంటర్నెట్పై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా చివరి సారిగా ఫిబ్రవరి 3న 49 స్టార్లింక్ శాటిలైట్లను నింగిలోకి పంపారు. అందులో 38రాకెట్లు కూలిపోయాయి. అయినా ప్రయోగాల్ని ఎక్కడా నిలిపేయలేదు.రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో శాటిలైట్ ఇంటర్నెట్ ఏ విధంగా ఉపయోగ పడిదో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు అదే జోరుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమయ్యారు. Liftoff! pic.twitter.com/EGxL5a9tbh — SpaceX (@SpaceX) March 9, 2022 ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని స్పేస్ స్టేషన్ నుంచి టూ స్టేజ్ ఫాల్కన్ 9 రాకెట్తో 48శాటిలైటన్లు ఆర్బిట్లోకి పంపినట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. కాగా, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు ఎలన్ మస్క్ 2019 నుంచి ఇప్పటి వరకు 2వేల స్టార్లింగ్ శాటిలైట్లను నింగిలోకి పంపారు. మరో 12వేల శాటిలైట్లపై ప్రయోగించేందుకు అనుమతి పొందగా.. మరో 30వేల రాకెట్లను ప్రయోగించేందుకు అనుమతి కోసం అప్లయ్ చేసినట్లు సమాచారం. చదవండి: జాక్పాట్!! అమెరికా ప్రెసిడెంట్గా ఎలన్ మస్క్? -
పుతిన్కు ఎలన్ మస్క్ భారీ షాక్!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ రష్యాకు భారీ షాకిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్కీతో మంతనాలు జరిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో జెలస్కీ..,ఎలన్ మస్క్కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రష్యాతో యుద్ధం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో జెలెన్ స్కీ..ఎలన్ మస్క్తో జూమ్ కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ తమదేశానికి రావాలంటూ ఎలన్ మస్క్ను ఆహ్వానించారు. దీంతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరిపారు. ఈ సంభాషణల సమయంలో రష్యా వార్తా వనరులను నిరోధించాలని స్టార్లింక్ను కొన్ని ప్రభుత్వాలు (ఉక్రెయిన్ కాదు) కోరాయని ఎలన్ మస్క్ తెలిపారు. యుద్ధం తర్వాత మాట్లాడుతా! ఉక్రెయిన్ ప్రభుత్వం ఎలన్ అందిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగిస్తుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే రష్యా దాడిలో ధ్వంసమైన ప్రాంతాల్లో స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రధాని మస్క్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అంతేకాదు స్పేస్ ప్రాజెక్ట్ల గురించి ఎలన్ మస్క్తో చర్చించాను. ఆ చర్చలపై యుద్ధం తర్వాత మాట్లాడతానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Talked to @elonmusk. I’m grateful to him for supporting Ukraine with words and deeds. Next week we will receive another batch of Starlink systems for destroyed cities. Discussed possible space projects 🚀. But I’ll talk about this after the war. — Володимир Зеленський (@ZelenskyyUa) March 5, 2022 మండిపడుతున్న పుతిన్ మరోవైపు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిని ఎలన్ ఖండించకపోయినా.. ఉక్రెయిన్కు సహకరిస్తున్నారు. ఈ తాజా పరిణామాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్కు మింగుడు పడడం లేదని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు జెలస్కీతో మస్క్ సంప్రదింపులు జరపడాన్ని రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్తో పాటు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లపై నిషేధం విధించింది. చదవండి: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం: 'పుతిన్ను ఎలిమినేట్ చేయండి సార్'! -
ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం, ఎలన్ మస్క్ కొంపముంచింది!!
ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య తలెత్తిన సంక్షోభం స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కొంప ముంచింది. ఆ రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో టెస్లా షేర్ల ధరలు సెప్టెంబర్ నాటి కనిష్ట స్థాయికి పడిపోయాయి. బ్లూమ్బెర్గ్ యొక్క బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ సంపద బుధవారం నాడు $13.3 బిలియన్లు తగ్గింది. ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న కాల్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు క్షీణించాయి.టెస్లా షేర్లు సైతం వరుసగా నాలుగు రోజుల పాటు నష్టపోయాయి. టెస్లా షేర్లు నష్టపోవడంతో మస్క్ నికర విలువ 198.6 బిలియన్లకు పడిపోయింది. సెప్టెంబర్ తర్వాత మొదటిసారిగా ఎలన్ మస్క్ ఆస్తి 200 బిలియన్లకు దిగువన ఉంది. బ్లూమ్బెర్గ్ ప్రకారం, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఎల్వీఎంహెచ్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్లు నష్టాలను అధిగమించగా.. మస్క్ మాత్రం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు తన సంపద నుండి 71.7 బిలియన్లను కోల్పోయారు. అయినప్పటికీ మస్క్ బెజోస్ కంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. చదవండి : డిమాండ్లో ఉన్న టెక్ స్కిల్స్!! అత్యధిక జీతం అందించే 'సాఫ్ట్వేర్ ఉద్యోగాలు' ఇవే! -
లాటరీలో లక్కీ చాన్స్! 150 కిలోల బరువు ఉండటంతో టికెట్ ఫ్రెండ్కు ఇచ్చి..
కేప్ కానవెరల్: ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ గతేడాది చేపట్టిన తొలి పౌర అంతరిక్షయానం ‘ఇన్స్పిరేషన్ 4’కు లాటరీలో టికెట్ గెలుచుకున్న వ్యక్తి దాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడని తెలుసా? బరువు ఎక్కువున్నందు వల్ల స్పేస్లో ప్రయాణించే అవకాశాన్ని అతను కోల్పోయాడంటే నమ్ముతారా? అక్షరాలా నిజం. టికెట్ గెలుచుకున్న అసలు వ్యక్తి పేరు కైల్ హిప్చెన్. తన కాలేజీ స్నేహితుడు క్రిస్ సెంబ్రోస్కీకు ఆ టికెట్ను ఇచ్చాడు. అలా స్నేహితుడికి టికెట్ ఇచ్చిన విషయాన్ని హిప్చెన్ ఎప్పుడో తన స్నేహితులు, బంధువులకు చెప్పినా ఇటీవలే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఫ్లోరిడాకు చెందిన ఎండీవర్ ఎయిర్ అనే విమానయాన సంస్థలో హిప్చెన్ కెప్టెన్గా పని చేస్తున్నాడు. 1990ల్లో ఏరోనాటికల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్రిస్ సెంబ్రోస్కీ, హిప్చెన్ కలిసి ఒకే రూమ్లో ఉన్నారు. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది. తర్వాత కాలంలో హిప్చెన్ కెప్టెన్గా ఫ్లోరిడాలో, క్రిస్ డేటా ఇంజనీర్గా వాషింగ్టన్లో ఉంటున్నారు. రూ. 48 వేలు పెట్టి లాటరీలో పాల్గొని.. స్పేస్ ఎక్స్ అంతరిక్షయానానికి సంబంధించిన ఓ సీటును ‘షిఫ్ట్4 పేమెంట్స్’ వ్యవస్థాపకుడు, సీఈవో జారెడ్ ఇసాక్మన్ కొనుగోలు చేశాడు. ఓ పిల్లల రీసెర్చ్ ఆస్పత్రి కోసం డబ్బులు పోగు చేయడానికి దాన్ని లాటరీ ద్వారా అమ్మతున్నట్టు ప్రకటించాడు. అది తెలుసుకున్న హిప్చెన్ రూ. 45 వేలు, క్రిస్ రూ. 3 వేలు కలిపి రూ. 48 వేలతో లాటరీలో పాల్గొన్నారు. 72 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరిలో లాటరీ తీస్తే హిప్చెన్ పేరొచ్చింది. గెలిచిన వ్యక్తి 2 మీటర్ల లోపు పొడవు, 113 కిలోల వరకు బరువుండాలని స్పేస్ ఎక్స్ షరతు విధించింది. కానీ హిప్చెన్ 150 కిలోలున్నాడు. లాంచింగ్కు 6 నెలలుంది. బరువు తగ్గుదామనుకున్నాడు. కానీ ఒకేసారి అంత బరువు తగ్గడం మంచిదికాదని తెలుసుకున్నాడు. దీంతో తన స్నేహితుడు క్రిస్ సెంబ్రొస్కీని హిప్చెన్ ఎంచుకున్నాడు. -
'జాక్ పాట్' అంటే ఇదేనేమో! యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శాలరీ ఎంతంటే!
ప్రముఖ టెక్ కంపెనీల్లో పనిచేసే సీఈఓల శాలరీ ఎంతుంటుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. కొన్ని కంపెనీలు సీఈఓల జీతభత్యాల గురించి బహిరంగంగా చర్చించవు.అందుకు కారణాలు వేరే ఉన్నాయి..ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 'జీరో శాలరీ'తో షేర్ల ద్వారా తన బిలియన్ డాలర్ల దాహం తీర్చుకుంటున్నారు. లిథియమ్ మెటల్ బ్యాటరీలపై పరిశోధనలు నిర్వహించే అమెరికన్ స్టార్టప్ 'క్వాంటమ్స్కేప్ కార్పొరేషన్' సీఈఓగా భారత సంతతికి చెందిన జగ్దీప్ సింగ్ కు కంపెనీ శాలరీ రూపంలో కాకుండా వాటాల రూపంలో షేర్లను కట్టబెట్టినట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. వాటి విలువ అక్షరాల మన కరెన్సీలో 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. మరి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? ►యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏడాదికి రూ.733 కోట్లు తీసుకుంటున్నారని సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. అదనంగా సెక్యూరిటీ, ప్రైవేట్ జెట్ వంటి సౌకర్యాల్ని యాపిల్ కల్పిస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. ►సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ప్రకారం.. కుక్ బేసిక్ శాలరీ సంవత్సరానికి రూ.89.20 కోట్లు ఉండగా.. ఎన్నిరాన్ మెంటల్ సస్టైనబులిటీ గోల్స్ (ఆఫీస్, ఉద్యోగుల కోసం) కింద రూ.10.33 కోట్లు ►ప్రైవేట్ జెట్ కోసం రూ. 5,29,66,072.92 కోట్లు ►సెక్యూరిటీ కోసం రూ.4,68,80,781.95 కోట్లు ►విహార యాత్రల కోసం రూ.17,15,534.95 కోట్లు ►ఎంప్లాయి రిటైర్మెంట్ ప్లాన్ కింద (401(k) plan) రూ.12,93,509.04 కోట్లు ►స్టాక్స్ అవార్డ్ కింద రూ.6,133.02కోట్లు 2021లో యాపిల్ భారీ లాభాల్ని గడించినట్లు ఎస్ఈసీ తెలిపింది. వరల్డ్ వైడ్గా లాక్డౌన్, కోవిడ్ విజృంభించినా యాపిల్ అమ్మకాలు వృద్దుతంగా జరిగినట్లు ఎస్ఈసీ తన నివేదికలో పేర్కొంది. ఆపిల్ సుమారు 33 శాతం ఆదాయ వృద్ధితో పాటు అమ్మకాలలో రూ.27,130.47 కోట్లని నివేదించింది. చదవండి: జాక్పాట్ కొట్టాడు! ఏకంగా 15వేల కోట్ల రూపాయల ప్యాకేజీ -
ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్ మస్క్ అంటే కథ వేరుంటది
టెస్లా సీఈఓ,స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ రోజురోజుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ హద్దుల్ని చెరిపేస్తున్నారు. ఇన్ని రోజులు యాపిల్ సంస్థ మీద, లేదంటే క్రిప్టో కరెన్సీలను ట్రోల్ చేసే ఎలన్ ఈ సారి రూటు మార్చాడు. మస్క్ అమెరికన్ ఆటోమేకర్ 'జనరల్ మోటార్స్' కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలపై ట్రోల్ చేశాడు. గతేడాది 4వ త్రైమాసికంలో జనరల్ మోటార్స్ కు చెందిన ఎలక్ట్రిక వెహికల్ అమ్మకాలపై 'టెస్లా సిలికాన్ వ్యాలీ క్లబ్' అనే ట్విట్టర్ నిర్వాహకులు 'క్యూ4' 2021లో జనరల్ మోటార్స్ 26 ఎలక్ట్రిక్ వాహనాల్ని విక్రయించిందని ట్వీట్ చేస్తూ..ఆ ట్వీట్ను ఎలన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్కు ట్యాగ్ చేశారు. GM sold 26 electric vehicles in Q4’21. 🤯🤯🤯 @elonmusk — Tesla Silicon Valley Club (@teslaownersSV) January 4, 2022 అంతే వెంటనే ఆ ట్యాగ్పై ఎలన్ స్పందించారు. కేవలం 26 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించినందుకు ఎలన్ ప్రత్యర్థి ఆటోమేకర్ను ట్రోల్ చేస్తూ 'రూమ్ టు ఇంప్రూవ్' అని రిప్లయి ఇచ్చాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా,గతేడాది 4వ త్రైమాసికంలో 3,08,600 టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ను విక్రయించింది. ఇక జనరల్ మోటార్స్ 2021 చివరి త్రైమాసికంలో 5 బోల్ట్ ఈవీలను, ఈయూవీలను,ఒక హమ్మర్ ఈవీ పికప్ను విక్రయించినట్లు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా? -
ఎలన్ మస్క్పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..
Chinese Citizens Slam Musk Online After Space Station Near Misses: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ను చైనా పౌరులు ఆన్లైన్లో దుమ్మెతిపోస్తున్నారు. తీవ్ర పదజాలంతో మస్క్పై చైనా దేశస్తులు విరుచుకుపడుతున్నారు. కారణం ఇదే..! ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటెర్నెట్ సేవలను అందించేందుకు స్టార్లింక్ ప్రొగ్రాంను ఎలన్ మస్క్ ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థతో సుమారు 42 వేలకుపైగా స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫాల్కన్ రాకెట్ ద్వారా ఇప్పటికే 18 వందలకు పైగా స్టార్లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపింది. దశలవారీగా స్టార్లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపుతోంది. కాగా ఈ మిషన్లో భాగంగా 2021లో జూలై 1 నుంచి అక్టోబర్ 21 సమయంలో స్టార్లింక్ శాటిలైట్స్ చైనా స్పేస్ స్టేషన్కు ప్రమాదాన్ని గురిచేసే అవకాశం ఏర్పడిందని చైనా అంతరిక్ష సంస్థ సోమవారం డిసెంబర్ 27న యూఎన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అలర్ట్గా ఉండడంతో చైనా స్పేస్ స్టేషన్ కక్ష్యను కాస్త జరపడంతో పెద్ద ముప్పు నుంచి తృటిలో తప్పిందని పేర్కొంది. యూఎన్కు చైనా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పడే వెలుగులోకి వచ్చింది. దీంతో చైనా పౌరులు స్పేస్ ఎక్స్ అధినేతపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో చైనా స్పేస్ స్టేషన్ టియాన్హేలోని మూడు మాడ్యూళ్లలో అతిపెద్దదైన టియాన్హేను ప్రయోగాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించింది. 2022 చివరి నాటికి స్టేషన్ పూర్తవుతుందని చైనా ప్రకటించింది. అమెరికన్ స్పేస్ వార్ఫేర్..! చైనా చేసిన వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ స్పందించలేదు. సోమవారం చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ విబోలో చైనా పౌరులు ఎలన్ మస్క్ ప్రయోగిస్తోన్న స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్ష వ్యర్థాల కుప్పతో పోల్చుతున్నారు. ఇంకొంతమందైతే..."అమెరికన్ స్పేస్ వార్ఫేర్ ఆయుధాలు" అని అభివర్ణించారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..! -
స్పేస్ ఎక్స్ దివాళా..! ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. స్పేస్ ఎక్స్ ప్రయోగానికి సంబంధించి ఎలన్ మస్క్ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. ఆ మెయిల్లో "ఇటీవల కాలంలో స్టార్షిప్ లాంచ్ వెహికల్కు ఉపయోగించే రాప్టార్ ఇంజిన్ తయారీలో చాలా వెనకబడి పోయాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్పేస్ఎక్స్ సంస్థకు దివాళా తీసే పరిస్థితి తలెత్తుతుంది" అంటూ పేర్కొన్నారు. ఎలన్ మస్క్ మార్స్పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భూమి మీద ఏదైనా ప్రమాదం జరిగి, భూమి మీద మనుగడ అంతరించి పోతే మానవుడు మార్స్ మీద జీవించడానికి తన తన సంపద ఉపయోగ పడాలని ఎలన్ మస్క్ కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యంతోనే ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకు సాగుతుంది. తాను ఊహించినట్లు భవిష్యత్లో మార్స్, చంద్రమండలంపై మానువుని మనుగడ కోసం రీయిజబుల్ స్పేస్ క్రాఫ్ట్తో స్టార్ షిప్ స్పేస్ రాకెట్లను తయారు చేస్తున్నారు. దీని కోసం ప్రస్తుతం ఉన్న అన్నీ ఎర్త్ రాకెట్ల కంటే 1000 రెట్లు ఎక్కువ ఉన్న స్టార్ షిప్ రాకెట్ ను మోయాల్సి ఉంటుంది. ఆ స్టార్ షిప్ రాకెట్ను మోసేందుకు స్పేస్ఎక్స్ రాఫ్టర్ ఇంజిన్లు ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ఈ రాప్టర్ ఇంజిన్ తయారీలో స్పేస్ఎక్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆ సమస్యని అధిగమించేందుకు స్పేస్ ఎక్స్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ మెయిల్ పెట్టారు. ఉద్యోగులు వారాంతాల్లో పనిచేయాలని, స్పేస్ ఎక్స్ ప్రయోగం సంక్షోభంలో ఉందని, దానిని త్వరగా పరిష్కరించకపోతే స్పేస్ ఎక్స్ దివాలా తీసే ప్రమాదం ఉందని ఉద్యోగులకు చేసిన మెయిల్స్లో ఎలన్ మస్క్ హెచ్చరించినట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా! -
అయ్యో ఎలన్ మస్క్.. ఎంత కష్టం వచ్చే!
Elon Musk Loses 50 Billion Dollars: ప్రపంచదిగ్గజ పారిశ్రామికవేత్తలలో బిలియనీర్ ఎలన్ మస్క్ ఒకరు. తాను స్థాపించిన టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. అయితే, కొద్ది రోజుల క్రితం.. "నా దగ్గర డబ్బులు లేవు. షేర్లు అమ్మేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు" అంటూ ట్వీట్లో నెటిజన్ల అభిప్రాయాన్ని కోరారు. ఆ తర్వాత అతని ఆస్తి భారీగా తగ్గిపోయింది. టెస్లా ఇంక్ షేర్లు వరుసగా రెండవ రోజు పడిపోయాయి. దీంతో ఎలన్ మస్క్ ఈ వారంలో ఇప్పటివరకు 50 బిలియన్ డాలర్లు(రూ.3.71 లక్షల కోట్లు) నష్టపోయారు. ఇటీవల వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి నేను నా టెస్లా స్టాక్లో 10శాతం విక్రయించాలని అనుకుంటున్నాను. దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా?అని ఎలన్ నవంబర్ 7న ట్వీట్ చేశారు. అలాగే, అతని సోదరుడు కింబాల్ ఈ పోల్ పెట్టడానికి ముందే వాటాలను విక్రయించాడనే వార్తలు రావడంతో పెట్టుబడుదారులు తమ డబ్బును వెనక్కి తీసుకున్నారు. దీంతో రెండు రోజుల నుంచి టెస్లా షేర్ ధరలు పడిపోతున్నాయి. నవంబర్ 9న 1,173.60 డాలర్లు ఉన్న టెస్లా షేర్ ధర, నేడు 1,023.50 డాలర్లుగా ఉంది. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) -
భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..!
భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది.అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్ మస్క్ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు అతితక్కువ ధరకే లభించనున్నాయి. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో ఎలన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా.. స్టార్ లింక్ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్ ఇంటర్నెట్ను సబ్సిడీకి అందివ్వనున్నట్లు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మనదేశంలో స్టార్లింక్ తన సబ్స్క్రిప్షన్ ప్లాన్లను సబ్సిడీ రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్లు స్టార్లింక్కి ఇండియా హెడ్ సంజయ్ భార్గవ తెలిపారు. భారత్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ లింక్ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయల్ని కల్పించడం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు స్పేస్ఎక్స్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం బుకింగ్లను ప్రారంభించింది. బుకింగ్లో భాగంగా కొనుగోలుదారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి.అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా, స్టార్లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్ స్పీడ్ 100-150ఎంబీపీఎస్ పరిధిలో ఉంటుంది. అయితే, తక్కువ భూ కక్ష్యలో మరిన్ని స్టార్లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్ వేగం జీబీపీఎస్కి చేరుకోవచ్చని స్టార్లింక్ ప్రతినిధులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలోఉండగా..వచ్చే ఏడాది జూన్ జులై నాటికి కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. 100 స్కూళ్లకు ఉచితం నివేదికలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సెటప్ను స్టార్లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్లు ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు స్టార్లింక్ ఇండియా బాస్ సంజయ్ భార్గవ స్పష్టం చేశారు. -
ఆస్ట్రోనాట్స్..ఇంకేం చేస్తాం..డైపర్లు ధరిస్తాం..!
భూమి నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో స్పేస్ స్టేషన్. 197 రోజులుగా అక్కడే గడుపుతున్న అస్ట్రోనాట్స్. మరికొద్ది సేపట్లో భూమికి తిరుగు ప్రయాణానికి షెడ్యూల్ ఖరారయ్యింది. కానీ ఆఖరి నిమిషంలో వారికి ఊహించని సమస్య ఎదురైంది. ఓవైపు షెడ్యూల్ మరోవైపు సాంకేతిక సమస్య. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే అస్ట్రోనాట్స్ ప్రాణాలకు ప్రమాదంతో పాటు ఎంతో విలువైన స్పేస్ ఎక్వీప్మెంట్ను సైతం నష్టపోవాల్సి ఉంటుంది. అయితే అస్ట్రోనాట్స్ చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి నష్టం లేకుండా ఆ స్పేస్ క్యాప్యూల్స్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటీ ? దాన్ని ఎలా పరిష్కరించారు. ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు తెలుసుకోవాలంటే... ఏప్రిల్ నెలలో అంతరిక్ష కేంద్రానికి పయనం ప్రయోగాల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 23న స్పేస్ఎక్స్ చెందిన క్యాప్యూల్స్ ద్వారా నాసాకు చెందిన ఆస్ట్రోనాట్స్ షేన్ కింబ్రో,ఫ్రాన్స్కు చెందిన థామస్ పెస్కెట్, జపాన్కు చెందిన అకిహికో హోషిడే, మహిళా వ్యోమగామి మెక్ ఆర్థర్లు స్పేస్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లారు. అలా స్పేస్లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ గరిష్టంగా 210 రోజుల పాటు స్పేస్లో ప్రయోగాలు చేయాల్సి ఉండగా శుక్రవారంతో 197 రోజులు పూర్తి చేసుకొని తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. అయితే ప్రయోగాలు పూర్తి చేసుకొని కిందికి వచ్చే సమయంలో క్యాప్యూల్స్లో ఉన్న యురినల్ మూత ఊడిపోవడంతో ఆ యూరిన్ క్యాప్యూల్స్ అడుగుకు చేరింది. దీంతో స్పేస్ స్టేషన్ నుంచి సుమారు 20 గంటల సమయం పట్టనుంది. అయితే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసినా..ఆలస్యం అయితే అబ్జారెంట్ అండర్గార్మెంట్స్ (డైపర్లు) ధరించి భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహిళా వ్యోమగామి మెక్ ఆర్థర్ వర్చువల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భయపడేది లేదు క్యూప్యూల్స్ అంతరాయంపై మహిళా ఆస్ట్రోనాట్స్ మెక్ ఆర్థర్ స్పందించారు. క్యాప్యూల్స్లోని యురినల్ విభాగంలో అంతరాయం ఏర్పడిందని మెక్ ఆర్థర్ తెలిపింది. స్పేస్ ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకుందని, అన్నింటిని అధిగమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యురినల్ విభాగంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. టాయిలెట్ విభాగంలోని సమస్యతో అంతరిక్షం నుంచి భూమి మీదకు 20గంటల ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ నెలలోనే క్యూప్యూల్లో యురినల్ విభాగంలో టాయిలెట్ లీకైంది. ఆ విషయాన్ని సెప్టెంబర్లోనే గుర్తించినట్లు తెలుస్తోంది. స్పేస్ఎక్స్ క్యాప్సూల్లోని ప్యానెల్లను పైకి లాగడం వల్ల లీకేజీ జరుగుతున్నట్లు ఆస్ట్రోనాట్స్ గుర్తించి, ఆ సమస్యను పరిష్కరించారు. తాజాగా ఆ తరహా సమస్య మరోసారి పునరావృతం కావడంతో భూమి మీదకు వచ్చేందుకు ఆస్ట్రోనాట్స్ అబ్జారెంట్ అండర్ గార్మెంట్స్ను ధరించి ఆదివారం ఉదయం 10గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి భయలు దేరి సోమవారం ఉదయం 4గంటలకు ఫ్లోరిడాలో దిగనున్నారు. చదవండి: చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
అంతరిక్ష యుద్ధం.. జెఫ్ బేజోస్కి మరోసారి ఝలక్ ఇచ్చిన ఎలన్మస్క్!
Jeff Bezos Vs Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి రెండో స్థానాల్లో ఉన్న టెస్లా ఎలన్మస్క్, అమెజాన్ జెఫ్బేజోస్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భూమిపై వ్యాపారం విషయంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తాజాగా అంతరిక్ష ప్రాజెక్టులకు సంబందించిన పనులు దక్కించుకునే విషయంలోనూ వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా వీరిద్దరికి చెందిన స్పేస్ఎక్స్, బ్లూఆరిజిన్ సంస్థల మధ్య వివాదం చెలరేగగా.. చివరకు ఎలన్మస్క్ పైచేయి సాధించారు. నాసా ప్రాజెక్ట్ నార్త్ అమెరికా స్పేస్ ఏజెన్సీ (నాసా) చంద్రుడిపై వ్యోమగాము (అస్ట్రోనాట్స్)లను పంపే విషయంలో రెగ్యులర్గా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా అస్ట్రోనాట్స్ని మరోసారి చంద్రుడి మీదకు పంపాలని నిర్ణయించింది. అందులో భాగంగా అస్ట్రోనాట్స్ క్షేమంగా చంద్రుడు, భూమిపై దిగేందుకు వీలుగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్టును చేపట్టింది. స్పేస్ ఎక్స్కి పనులు ఆర్టెమిస్ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్షిప్లో సాగుతోంది. ఇందులో లూనార్ ల్యాండర్ను తయారు చేయాల్సిన బాధ్యతలను ఎలన్మస్క్కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థకి నాసా అప్పగించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2.9 బిలియిన్ డాలర్లుగా ఉంది. బ్లూ ఆరిజిన్ అభ్యంతరం టెక్నాలజీ పరంగా అనేక లోపాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్పేస్ఎక్స్ సంస్థకి లూనార్ల్యాండర్ పనులు కట్టబెట్టారంటూ జెఫ్బేజోస్కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా మనుషులను ల్యాండింగ్ సంబంధించి ఈ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ కాంట్రాక్టు రద్దు చేయాలని కోరింది. Not the decision we wanted, but we respect the court’s judgment, and wish full success for NASA and SpaceX on the contract. pic.twitter.com/BeXc4A8YaW — Jeff Bezos (@JeffBezos) November 4, 2021 ఫెడరల్ కోర్టులో మరోవైపు జెఫ్బేజోస్కి చెందిన బ్లూ ఆరిజిన్ చెబుతున్న అభ్యంతరాలపై త్వరగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని, ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం అవుతుందంటూ నాసా సైతం న్యాయస్థానాన్ని కోరింది. ఇరువైపులా వాదనలు విన్న ఫెడరల్ కోర్టు చివరకు బ్లూఆరిజిన్ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టి పడేసింది. ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్లవచ్చంటూ నాసాకు అనుమతులు జారీ చేసింది. pic.twitter.com/deqktTvS3U — Elon Musk (@elonmusk) November 4, 2021 ట్వీట్వార్ ఫెడరల్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ జెఫ్బేజోస్ ట్వీట్ చేశారు. ఈ తరహా తీర్పును తాము ఊహించలేదని, ఐనప్పటికీ న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామన్నారు. మరోవైపు ఎలన్మస్క్ కూడా ట్విట్టర్ వేదికగా ఓ మీమ్తో స్పందించారు. చదవండి: రూటు మార్చిన ఎలన్ మస్క్.. ఇండియా మార్కెట్ కోసం సరికొత్త వ్యూహం -
రూటు మార్చిన ఎలన్ మస్క్.. ఇండియా మార్కెట్ కోసం సరికొత్త వ్యూహం
న్యూఢిల్లీ: ఇండియాలో తన వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రపంచ కుబేరుడు ఎలన్మస్క్ సరికొత్త వ్యూహం ఎంచుకున్నారు. ఇప్పటి వరకు టెస్లా కార్ల అమ్మకాల ద్వారా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అయితే ఈ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. దీంతో వ్యూహం మార్చి ఇంటర్నెట్ సేవలను తెర మీదకు తెచ్చారు. బ్రాడ్బ్యాండ్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ తాజాగా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు వేగవంతం చేసింది. స్థానికంగా బ్రాడ్బ్యాండ్ సేవలను అందించేందుకు భారత్లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎస్సీపీఎల్) పేరిట దీన్ని నెలకొల్పినట్లు స్టార్లింక్ కంట్రీ డైరెక్టర్ (ఇండియా) సంజయ్ భార్గవ తెలిపారు. ఇక తాము లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు, బ్యాంక్ ఖాతాలు తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్మిషన్ల పనిలో ప్రభుత్వ అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్ టెర్మినల్స్తో డిసెంబర్ 2022 నుంచి భారత్లో బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి 5,000 ప్రీ–ఆర్డర్లు వచ్చాయని కంపెనీ చెబుతోంది. ఒకో కస్టమర్ నుంచి 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్ వసూలు చేస్తోంది. సెకనుకు 50–150 మెగాబిట్స్ స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తామని చెబుతోంది. దేశీయంగా రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు భారతి గ్రూప్నకు చెందిన వన్వెబ్తో స్టార్లింక్ పోటీపడాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తరించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. -
ఆ దమ్ము ఒక్క ఎలన్మస్క్కే ఉంది, కానీ..
అపర కుబేరుడు ఎలన్ మస్క్కి ఫ్యాన్ పాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ధనవంతుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్న తర్వాత ఆయన మీద ఫోకస్ విపరీతంగా పెరుగుతోంది. అంతెందుకు భారత్ నుంచి ఆనంద్ మహీంద్రా, హార్ష్ గోయెంకా లాంటి బిజినెస్ టైకూన్లు సైతం మస్క్ సక్సెస్ను సమీక్షిస్తుండడం విశేషం. తాజాగా ఆయన ఖాతాలో మరో ‘ఊహించని’ పొగడ్త పడింది. అమెరికా బ్యాకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లే, ఎలన్ మస్క్ సంపాదన మీద తాజాగా ఓ ఆసక్తికర కథనం విడుదల చేసింది. టెస్లాతో కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మస్క్.. ఈవీ కంపెనీ టెస్లా కంటే సొంత సంస్థ స్పేస్ఎక్స్తోనే ఖ్యాతిని, సంపదను మరింత పెంచుకునే ఆస్కారం ఉందని మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఓ అనలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. "SpaceX Escape Velocity ... Who Can Catch Them?" పేరుతో మంగళవారం మోర్గాన్ స్టాన్లేకు చెందిన ఆడమ్ జోన్స్ ఒక కథనం రాశారు. బ్లూమరాంగ్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ మొత్తం 241.4 బిలియన్ డాలర్ల సంపాదనలో స్పేస్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ 17 శాతం వాటా కలిగి ఉంది. ఒకవేళ మస్క్ గనుక స్పేస్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మీద ఫుల్ ఫోకస్ పెడితే మాత్రం కేవలం స్పేస్ఎక్స్ ద్వారానే 200 బిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ భూమ్మీద తొలి ట్రిలియనీర్గా ఎలన్ మస్క్ ఎదిగే అవకాశం ఉందని, దరిదాపుల్లో ఎవరూ నిలిచే అవకాశమే లేదని జోన్స్ ఆ కథనంలో అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏంటంటే.. ఎలన్ మస్క్కు, మోర్గాన్ స్టాన్లేకు మధ్య మంచి సంబంధాలు లేకపోవడం. చదవండి: బాప్రే చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
Starlink: డబ్బులు కట్టి నెలలు అవుతున్నా..ఇంత వరకు పత్తాలేదు..!
ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా..ఇప్పటికే ప్రీ ఆర్డర్లు బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటర్నెట్ను అందించడంలో ఎలన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని నెలలు కావొస్తున్నా ఇంటర్నెట్ సేవలు అందడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్,10 యూరోపియన్ కంట్రీస్ కలిపి మొత్తం 14దేశాల్లో పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కానీ 90శాతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న యూఎస్లో..కొందరికి శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే విషయంలో ఎలన్ మస్క్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. జాన్ డ్యూరాన్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో 100 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7,503.50) డిపాజిట్ చెల్లించాడు. డిపాజిట్ చెల్లించిన తరువాత స్టార్ లింక్ కిట్ అందుతుంది. కానీ జాన్ ప్రీ ఆర్డర్ బుక్ చేసుకొని 9నెలలు అవుతున్నా స్టార్లింక్ నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. కాంటాక్ట్ చేసినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సెప్టెంబర్లో స్టార్లింక్ ప్రీ ఆర్డర్ను రద్దు చేసుకున్నట్లు జాన్ తెలిపారు. నేను పిచ్చివాడిని కాదు,స్టార్ లింక్ సర్వీస్ విషయంలో చాలా అసంతృప్తికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం జాన్ ఇంటర్ నెట్ కోసం ఫోన్ నుండి మొబైల్ హాట్స్పాట్ను ఉపయోగిస్తున్నాడు. ఒక జానే కాదు మరి కొంతమంది వినియోగదారులు సైతం ప్రీ ఆర్డర్ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆర్డర్ను క్యాన్సిల్ చేయడంతో కట్టిన మనీ తిరిగి ఇచ్చేశారని,మరి ఇంటర్నెట్ సేవల్ని ఎప్పుడు అందిస్తారో చెప్పాలని అంటున్నారు.ఇప్పటికే ఎలన్ మస్క్ వరల్డ్ వైడ్గా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ను అందించేందుకు 1600 శాటిలైట్లను స్పేస్లోకి పంపారు. మొత్తంగా 42వేల శాటిలైట్లను పంపే పనిలో పడ్డారు. త్వరలో వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ను అందిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఎలన్ వినియోగదారుల నుంచి వస్తున్న విమర్శలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి: అన్న కుక్కను దువ్వుతుంటే.. తమ్ముడి ఆస్తులు పెరుగుతున్నాయ్ -
చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పుణ్యమా అంటూ ప్రస్తుతం స్పేస్, మార్స్, శాటిలైట్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వార్త ఇలాగే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 2002 నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ 'నాసా'లో జరిగిన ఓ సంఘటన తాజాగా జరిగినట్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడం ఆసక్తికరంగా మారింది. అమెరికాకు చెందిన థాడ్ రాబర్ట్స్ చంద్ర మండలంపై కాలు మోపి, అక్కడ ప్రయోగాలు చేయాలనే కోరిక ఉండేది. కోరికకు తగ్గట్లు అదృష్టం వరించింది. నాసా లూనార్ ల్యాబ్లో శిక్షణ పొందే అవకాశం లభించింది. అక్కడ వ్యోమగాములుగా శిక్షణ పొందితే ఏదో ఒకరోజు స్పేస్లో అడుగపెట్టే అవకాశం లభిస్తుంది. కానీ థాడ్లోని సె**కోరికలు ఆ అవకాశాన్ని దూరం చేశాయి. నాసాలో ట్రైనింగ్ తీసుకుంటుండగా.. అదే ల్యాబ్లో పనిచేసే ప్రియురాలు 'టిఫనీ ఫౌలర్'తో ఏకంగా చంద్రుడి మీద తన 'కోరిక' తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అందుకు నాసా అంగీకరించదు? మరేం ఏం చేయాలి? అని అనుకున్నాడు. అప్పుడే థాడ్లో దుర్భుద్ది పుట్టింది. 101 గ్రాముల రాళ్లు, దూళిపై.. ఆ దుర్భుద్ది మనసును తొలిచేస్తున్నా నాసా ఇచ్చే ట్రైనింగ్లో పాల్గొనేవాడు. అదే సమయంలో నాసా చంద్ర మండలం నుంచి 101 గ్రాముల రాళ్లు, దూళిని కిందకు తెచ్చిందని, వాటిని అమ్మితే కోటీశ్వరులు కావొచ్చని తెలుసుకున్నాడు. అంతే చంద్రమండలంలో తన కోరికను తీర్చుకోలేడు కాబట్టి.. నాసా కేంద్రంలో ఉన్న రాళ్లు, దూళిని దొంగిలించి వాటిపై శృంగారం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన ప్లాన్ను తన ప్రియురాలికి చెప్పడంతో ఆమెకూడా అందుకు అంగీకరించింది. పనిలో పనిగా రాళ్లను, దూళిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు బెల్జియంకు చెందిన సైంటిస్ట్తో తనని తాను ఆర్బ్ రాబిన్సన్గా పరిచయం చేసుకున్నాడు. చంద్రుడి రాళ్లను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రాముకు రూ.5 వేల డాలర్లు భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3.70 లక్షలు చెల్లించేందుకు ఆ శాస్త్రవేత్త అంగీకరించాడు. ‘సె** ఆన్ ది మూన్’.. తన ప్లాన్లో భాగంగా చంద్రుడి రాళ్లను నాసా కేంద్రంలో ఎక్కడ భద్రపరిచారో తెలుసుకున్నాడు. వాటిని దొంగిలించేందుకు తన స్నేహితులు సాయం తీసుకున్నాడు. అనుకున్న ప్రకారం సేఫ్టీ లాకర్ను బద్దలు కొట్టి అందులో ఉన్న రాళ్లను, దూళిని దొంగిలించాడు. చివరికి ‘సె** ఆన్ ది మూన్’ పేరుతో ఓ హోటల్లో తన ప్రియురాలితో కోరిక తీర్చుకున్నాడు. అనంతరం రాళ్లు, దూళి బరువు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. వాటిని కల్తీ చేశాడు. నాసాకు కోట్లలో నష్టం.. అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సైంటిస్ట్కు అమ్మేందుకు ఓ ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే థాడ్ రాబర్ట్స్ చేసిన దొంగతనం గురించి సమాచారం అందుకున్న ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. థాడ్ రాబర్ట్స్ చేసిన చెత్త పనివల్ల నాసా రూ.157 కోట్లు విలువ చేసే చంద్రుడి దూళిని కోల్పోయింది. ఈ దొంగతనంపై విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి 8ఏళ్లు జైలు శిక్ష విధించడంతో చివరికి కటకటాల పాలయ్యాడు. చదవండి: Moon Rover Motorcycle: చంద్రుడిపై నడిచే బైక్...! ఓ లుక్కేయండి...! -
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం
ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్టెల్ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు. అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్ కేంద్రంగా 2012లో జార్జివేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే?) ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. -
స్పేస్ఎక్స్ ఓ సంచలనం..! 75 లక్షల కోట్లతో..!
ఎలన్ మస్క్ గురించి తెలియని వారెవరుండరు బహుశా...! నిజజీవితంలో ప్రజలు ఎలన్మస్క్ను మార్వెల్ సూపర్ హీరో క్యారెక్టర్ ది ఐరన్ మ్యాన్తో పోలుస్తుంటారు. టెస్లా రాకతో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గణనీయమైన మార్పులకు కారణమయ్యాడు ఎలన్ మస్క్. సుమారు 100 మిలియన్ డాలర్లతో 2002లో స్పేస్ఎక్స్ స్థాపించి అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయనాలను లిఖించాడు. చదవండి: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్వీర్సింగ్..! 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి... తాజాగా ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ విలువ సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో అత్యంత విలువైన రెండో ప్రైవేట్ కంపెనీగా స్పేస్ఎక్స్ నిలిచింది. స్పేస్ ఎక్స్ షేర్ విలువ ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే గణనీయంగా 33 శాతం మేర పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన మొదటి కంపెనీగా టిక్టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ 140 బిలియన్ డాలర్లతో నిలిచింది. స్పేస్ ఎక్స్ ఓ సంచలనం..! స్పేస్ ఎక్స్ను స్థాపించి తొలి ప్రయోగంలో విఫలమైన ఎలన్ మస్క్ పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి వెనుకడుగు వేయకుండా తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అంతరిక్ష రంగంలో స్పేస్ఎక్స్ ఓ సంచలనం. అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలను చేయడంలో స్పేస్ ఎక్స్ పాత్ర ఎంతగానో ఉంది. చదవండి: నాలుగు రోజుల్లో సుమారు రూ.20 వేల కోట్లు..! -
అంతరిక్ష రంగంలో మరో సంచలనం..! సరికొత్త ఒరవడికి శ్రీకారం..ఎలన్ మస్క్..!
Elon Musk Inspiration 4 Is Streaming On Netflix: అంతరిక్ష రంగంలో తనదైన మార్క్ను చూపించడంలో ఎలన్ మస్క్ ఎప్పుడు ముందుంటాడు. ఒకానొక సమయంలో రాకెట్లకు వాడే బూస్టర్లను తిరిగి వాడేలా చేయవచ్చునని ఫాల్కన్ రాకెట్ను ఉపయోగించి విజయవంతంగా నిరూపించాడు. రాకెట్ బూస్టర్లను తిరిగి వాడడంతో రాకెట్ ప్రయోగాలకు అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించగలిగాడు ఎలన్మస్క్. అంతరిక్ష రంగంలో వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్షయాత్రలను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. లేట్గా ఐనా అంతరిక్ష యాత్ర అంటే ఇది అన్నట్లుగా స్పేస్ఎక్స్ ఇన్సిపిరేషన్4 రాకెట్ ద్వారా నలుగురు ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షరంగంలోకి పంపిన విషయం తెలిసిందే. ఇన్సిపిరేషన్4 ప్రయోగంలోని వ్యక్తులను రెండు రోజులపాటు అంతరిక్షంలో ఉండేలా చేసి, ప్రయోగాన్ని స్పేస్ఎక్స్ ద్విగ్విజయంగా పూర్తి చేసింది. తాజాగా ఎలన్మస్క్ అంతరిక్ష రంగంలో మరో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాడు. నెట్ఫ్లిక్స్ లో సందడి.. ఇన్సిపిరేషన్4 లాంచ్ ప్రయోగాన్ని నెట్ఫ్లిక్ ఓటీటీలో స్ట్రీమ్ చేశారు. ఇన్పిపిరేషన్4కు సంబంధించిన పూర్తి ప్రయోగాన్ని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యే ఏర్పాట్లను ఎలన్మస్క్ చేశాడు. ఇన్సిపిరేషన్4 సిబ్బంది ట్రైనింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఆరు ఎపిసోడ్లను నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతోంది. ఈ విధంగా చేయడంతో అంతరిక్షయాత్రల పట్ల మరింత అవగాహన వస్తోందని ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. Amazing show about @Inspiration4x mission! https://t.co/0nQua4jGiz — Elon Musk (@elonmusk) October 2, 2021 చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్జున్వాలా..అతని తర్వాతే..! -
‘నీ అబ్బ సొత్తేం కాదు’, నువ్వేం తక్కువ కాదుగా !
Elon Musk Jeff Bezo Rival: పోటీ ప్రపంచంలో పోటాపోటీ విమర్శలూ సహజమే. కానీ, అవి విపరీతానికి చేరితేనే వెగటు పుడుతుంది. బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ జెజోస్ల మధ్య మాటల వైరం రోజురోజుకీ శ్రుతి మించుతోంది. వీలు దొరికినప్పుడల్లా బెజోస్పై పరోక్షంగా విరుచుకుపడుతున్న మస్క్.. తాజాగా మరోసారి దురుసు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అవతలి నుంచి కూడా కౌంటర్ పడడం విశేషం. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్) న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని స్పేస్ఎక్స్ ప్రయోగాలను నెమ్మదించేలా చేస్తున్నాయని ఆరోపించాడు ఎలన్ మస్క్. 2021 కోడ్ కాన్ఫరెన్స్లో బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశాడాయాన. ‘‘నీ తరపు లాయర్లు ఎంత గొప్పవాళ్లైనా కావొచ్చు. చంద్రుడి చేరాలనే మా ప్రయత్నాన్ని ఎన్ని దావాలేసినా ఆపలేరు. అంతరిక్ష యానం నీ అబ్బసొత్తు కాదు’’ అంటూ ఒకానొక దశలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మస్క్. ఇదిలా ఉంటే స్పేస్ఎక్స్, స్టార్లింక్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బ్లూ ఆరిజిన్ వరుసగా దావాలు వేస్తోందన్నది ఎలన్ మస్క్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అమెజాన్ కౌంటర్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే అమెజాన్ నుంచి కౌంటర్ పడింది. ఎలన్ మస్క్ తాను బెజోస్ లాంటోడేనని గుర్తించ లేకపోతున్నాడంటూ సెటైర్ వేసింది. గతంలో స్పేస్ఎక్స్ వేసిన దావాలకు సంబంధించిన చిట్టాను బయటపెట్టింది అమెజాన్. ఈ మేరకు అమెరికన్ టెక్నాలజీ బ్లాగ్ ది వర్జ్కు సంబంధిత డాక్యుమెంట్లను పంపించింది. స్పేస్ఎక్స్ ఇప్పటిదాకా వివిధ కోర్టుల్లో వేసిన 13 దావాలు, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన స్టేట్మెంట్ల తాలుకా వివరాలను వెల్లడించింది. 2004 నుంచి అమెరికా ప్రభుత్వం, నాసా, యూఎస్ ఎయిర్ఫోర్స్లకు వ్యతిరేకంగా స్పేస్ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్లు ఇందులో ఉన్నాయి. This is hilarious. Amazon sent us a 13-page PDF to prove Elon Musk is as litigious as Jeff Bezos https://t.co/Kh10AehEgB via @Verge — Eric Berger (@SciGuySpace) September 29, 2021 అమెజాన్ శాటిలైట్ డివిజన్ ప్రతినిధి ప్రాజెక్ట్ కుయిపర్ పేరు మీద ఈ డాక్యుమెంట్లు వర్జ్కు వచ్చాయి. ‘‘ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పని చేసిన స్పేస్ఎక్స్.. గతంలో చేసింది ఇదే కదా. ఏకంగా ప్రభుత్వంపైనే బ్లాక్మెయిలింగ్కు దిగింది’’ అని కుయిపర్ పేరు మీద స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. మొత్తం 39 డాక్యుమెంట్లు ఉండగా, వాటిని 13 పేజీల(పీడీఎఫ్ ఫైల్రూపంలో) కుదించి పంపించారు. SpaceX has sued to be *allowed* to compete, BO is suing to stop competition — Elon Musk (@elonmusk) September 29, 2021 సెటైర్ అయితే తమ దావాల వ్యవహారాన్ని స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ సమర్థించుకున్నాడు. ‘‘మేం పోటీప్రపంచంలోకి అనుమతించాలని స్పేస్ఎక్స్ తరపున దావాలు వేశాం. కానీ, బీవో(బ్లూఆరిజిన్ను ఉద్దేశించి) అసలు పోటీయే ఉండకూడదని దావాలు వేస్తోంది’’ అని వ్యంగ్యం ప్రదర్శించాడు. ఇక న్యాయపరమైన చర్యలతో బ్లూ ఆరిజిన్ కంపెనీ తనకు మోకాలు అడ్డుపెట్టడంపై ఎలన్ మస్క్ ఘాటుగానే స్పందిస్తున్నాడు. బహుశా తమపై కేసులు వేయడానికే బ్లూ ఆరిజిన్ బాస్ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటాడంటూ గతంలో సెటైర్లు సైతం పేల్చాడు. చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం -
స్పేస్ఎక్స్ టూరిజంలా త్వరలో మూన్ టూరిజం
ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’.. చరిత్ర సృష్టించిన సంగతి తెలిసింది. ఆ సంఘటన మరువక ముందే నాసా చంద్రుని పై మనుష్యులను తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా సరికొత్త రోవర్ టెక్నాలజీతో సమగ్ర పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు చంద్రుని పై మానువుడి నివశించడానికీ యోగ్యమైనదేనా కాదా అనేదాని గురించి పరిశోధనలు చేసే క్రమంలో కొన్ని ఆసక్తి రేకెత్తించే పరిశోధనలు గురించి నాసా వివరిస్తోంది. అవేంటో చూద్దాం. వాషింగ్టన్: చంద్రుని దక్షిణ ధృవంగా పిలచే పురాతన బిలం పైకి మంచు జాడను అన్వేషించే రోవర్ను 2023 కల్లా ల్యాండింగ్ చేయనున్నట్లు నాసా సోమవారం ప్రకటించింది. ఈ పురాతన బిలం దక్షిణ ధృవం వద్ద రెండు భారీ ఖగోళ శకలాలు ఢీ కొనడంతో ఏర్పడిందని నాసా ప్లానేటరీ డివిజన్ డైరక్టర్ లోరీ గ్లేజ్ వెల్లడించారు. (చదవండి: బైడెన్ కునికి పాట్లు!) సౌర వ్యవస్థలో ఇది అత్యంత శీతల ప్రాంతం కాబట్టి ఇక్కడ మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని అన్నారు. పైగా అక్కడ వాతవారణ పరిస్థితులు అస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇంతవరకు చంద్రుని కక్ష్యలో పరిభ్రమించే సెన్సర్ ఉపగ్రహం సాయంతో దూరం నుంచే పరిశోధనలు చేసినట్లు పేర్కొంది. ఇక పై చంద్రుని ఉపరితలంపై నేరుగా ఈ సరికొత్త టెక్కాలజీతో రూపొందించిన రోవర్ సాయంతో పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఈ రోవర్ చంద్రుని భూభాగంపై అనేక అడుగులు దిగువ వరకు రంధ్రలు చేసి మరింత సమగ్రంగా పరిశోధనలు చేస్తుందని గ్లేజర్ పేర్కొన్నారు. ఈ రోవర్ చంద్రుని ఉపరితలం పై మంచు నీరు జాడును నిర్థారించడమే కాక దీన్ని రాకెట్ ఇంధనంగా మార్చి అరుణ గ్రహంపై వెళ్లడానికి ఉపకరించే సమగ్ర సమన్వయ వ్యవస్థలా పనిచేయగలదని నాసా బావిస్తుందని అన్నారు. అరుణ గ్రహం భూమికి అతి చేరువలో రెండు లక్షల మైళ్లు లేదా 1.3 సెకన్ల కాంతి దూరంలో ఉందిని చెప్పారు. అంతేకాదు ఈ రోవర్ను ధృవ అస్థిర స్వయం పరిశోధన రోవర్ లేదా వైపర్గా పిలుస్తారని చెప్పారు. ఇది 50 గంటల వరకు పనచేయగలిగే బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందని పైగా అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా రూపోందించినట్లు వెల్లడించారు. చార్జింగ్ కోసం సౌలార్ వ్యవస్థపై ఆధారపడుతుందని, పైగా సూర్యుడు ఎటువైపు ఉంటే అటూవైపుగా బ్యాటరీ ప్యానెల్ని మార్చుకుంటుందని పేర్కొన్నారు. ఈ రోవర్ సాయంతో చంద్రుని ఉపరితలంపై ఏఏ ప్రాంతాల్లో మంచు నీరు లభిస్తోంది ? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది? ఎలా ఆవిరవుతోంది ? ఎటు వెళ్లుతోంది? తదితర పరోశోధనలు చేస్తున్నట్లు వివరించారు. సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’ ప్రయోగం విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాసా మానవులను చంద్రుని పైకి తీసుకు వచ్చే ప్రణాళికలో భాగాంగా ఈ పరిశోధనలు చేపట్టిందని లోరీ గ్లేజ్ పేర్కోన్నారు. (చదవండి: స్పెయిన్లో అగ్నిపర్వతం విస్పోటనం) -
అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది
గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో... గంధర్వగోళ తతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు.. తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. గత కొన్నేళ్లుగా పోటాపోటీ అంతరిక్ష పరిశోధనలతో అగ్రపథాన దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’.. చరిత్ర సృష్టించింది. నలుగురు.. అదీ వ్యోమగాములు కానీ వాళ్లు, ఎలాంటి శిక్షణ లేనివాళ్లతో అంతరిక్ష యానం పూర్తి చేయించి.. సురక్షితంగా భూమికి చేర్చడం ద్వారా అంతరిక్షయానంలో కొత్త అధ్యయం లిఖించింది. క్లిక్: బ్రాన్సన్, బెజోస్లది ఉత్తుత్తి ఫీట్.. మస్క్ దమ్మున్నోడు! సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన SpaceX Inspiration ప్రయోగం విజవంతంగా పూర్తైంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా బుధవారం రాత్రి 8గం.2ని. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన #Inspiration4 బృందం.. మూడు రోజులపాటు అంతరిక్షంలోనే గడిపింది. తిరిగి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడా సముద్ర భాగాన ల్యాండ్ అయ్యింది క్రూ. బృందంలోని నలుగురు ఆరోగ్యవంతంగా ఉండగా.. వాళ్లను మరికొన్ని గంటలు అబ్జర్వేషన్లోనే ఉంచనున్నారు. అయితే ఏమాత్రం శిక్షణ లేని ఈ నలుగురిని అంతరిక్షంలోకి పంపి.. తద్వారా స్పేస్ టూరిజానికి కొత్త తోవ చూపించాడు ఎలన్ మస్క్. Liftoff of @Inspiration4X! Go Falcon 9! Go Dragon! pic.twitter.com/NhRXkD4IWg — SpaceX (@SpaceX) September 16, 2021 There's the #Inspiration4 crew getting their first taste of natural air after spending about 71 hours in orbit pic.twitter.com/unJXs5TT1A — Joey Roulette (@joroulette) September 18, 2021 Splashdown! Welcome back to planet Earth, @Inspiration4x! pic.twitter.com/94yLjMBqWt — SpaceX (@SpaceX) September 18, 2021 200 మిలియన్ల డాలర్లు.. స్పేస్ఎక్స్ ఇన్స్పిరేషన్4కి ఎంత ఖర్చు అయ్యిందనేది స్పష్టత లేదు. కానీ, ఈ ప్రయోగ ముఖ్యోద్దేశం.. సెయింట్ జూడ్ ఆస్పత్రి క్యాన్సర్ పరిశోధనల కోసం 200 మిలియన్ డాలర్ల సేకరణ. ఫండ్ రైజింగ్ ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టాలన్నది ఎలన్మస్క్, ఆ నలుగురు స్పేస్ టూరిస్టుల ఉద్దేశం. ప్రస్తుతం అది 154 మిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. బిలియనీర్, షిఫ్ట్ పేమెంట్స్ వ్యవస్థాపకుడు జేర్డ్ ఐసాక్మాన్ నేతృత్వంలోని క్రిస్ సెంబ్రోస్కి(యూఎస్ ఎయిర్ఫోర్స్ వెటరన్), సియాన్ ప్రోక్టర్(జియోసైంటిస్ట్), హాయిలే ఆర్కేనాక్స్(అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్)లతో కూడిన టీం 71గంటల అంతరిక్ష యానం పూర్తి చేసుకుంది. వీళ్లంతా స్ఫూర్తిదాయకమైన నేపథ్యం ఉన్నవాళ్లే. అందుకే ఈ ప్రయోగానికి ఇన్స్పిరేషన్ అనే పేరు పెట్టాడు ఎలన్ మస్క్. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా భూమికి చేరుకున్న బృందం.. రెండు సెట్ల పారాషూట్స్తో సురక్షితంగా సముద్ర భాగంలో ల్యాండ్ అయ్యింది. పాటలు వింటూ.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్షిప్లో గడిపారు. అంతరిక్షంలో ఉన్నంతసేపు.. సైంటిఫిక్ చేసింది ఇన్స్పిరేషన్4 టీం. స్పేస్లో మనిషి శరీరం ఎలా ఉంటుదనే అంశంపై ఫోకస్ చేస్తూ పరిశోధనలు చేశారు వాళ్లు. మధ్యమధ్యలో సంగీతం వింటూ.. కుపోలా(క్యాప్సూల్స్లోని స్పెషల్ విండో) ద్వారా కుటుంబ సభ్యులతో ఛాటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. ప్రోక్టర్ ఏకంగా మెటాలిక్ మార్కర్స్తో ఆర్ట్ వర్క్ వేయడం విశేషం. ఇక సెంబ్రోస్కి ఏకంగా గిటార్ వాయించారు. వీటిని ఫండ్ రైజ్లో భాగంగా వేలం వేయనున్నారు కూడా. The Inspiration4 crew were all smiles as they gave a tour of the Dragon capsule and zoomed with patients from St. Jude. The mission is raising funds for the children’s hospital and cancer research.@LesterHoltNBC shares this story. pic.twitter.com/LoZF3vgDlx — NBC Nightly News with Lester Holt (@NBCNightlyNews) September 18, 2021 స్పేస్ టూరిజంలో కొత్త ఒరవడి సృష్టించిన స్పేస్ఎక్స్.. ఇన్స్పిరేషన్4 ప్రయోగంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా మరో ఐదు ప్రైవేట్ మిషన్ల కోసం కాంట్రాక్ట్ చేసుకుంది. వీటితో పాటు నాసాకు సంబంధించిన మిషన్స్ సైతం ఉండగా.. ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్తో కలిసి పని చేయాల్సి వస్తుండడం విశేషం. చదవండి: జెఫ్బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
SpaceX: ఇన్స్పిరేషన్ 4.. ఎలన్ మస్క్ దమ్మున్నోడు
SpaceX Inspiration4: తన ఇష్ట సామ్రాజ్యం స్పేస్ఎక్స్ ద్వారా అరుదైన ఘనతలు సాధించాలన్న కలలను సాకారం చేసుకుంటూ పోతున్నాడు అపరకుబేరుడు ఎలన్ మస్క్. మిగతా బిలియనీర్స్లా ఆకాశం హద్దు దాటొచ్చి అంతరిక్ష ప్రయాణం చేశానని గప్పాలు కొట్టుకోవడం లేదు. సరికదా నలుగురు స్ఫూర్తిదాయక వ్యక్తులను తన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి.. స్పేస్టూరిజంలో సంచలనానికి తెర లేపాడు. #Inspiration4 ప్రయోగం ద్వారా ఆసక్తికర చర్చకు దారితీశాడు. ఇన్స్పిరేషన్ 4.. ఎలన్ మస్క్ తన స్పేస్ఎక్స్ తాజా అంతరిక్షయానానికి పెట్టిన పేరు. నలుగురు పౌరులను అంతరిక్షంలోకి పంపడం స్పేస్ఎక్స్ ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8గం.2ని. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఈ నలుగురు స్పేస్ టూరిస్టులను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 12 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి డ్రాగన్ క్యాప్సూల్ విడిపోయింది. దీంతో ఆ క్రూ ఆర్బిట్లోకి ప్రవేశించడంతో స్పేస్ఎక్స్ బృందం ఆనందంలో మునిగింది. విశేషం ఏంటంటే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్షిప్లో తిరుగాడుతుండడం. 🚀Congratulations, #Inspiration4! Proud to provide the launchpad from @NASAKennedy for the first orbital spaceflight with an all-private crew. Today's launch represents a significant milestone in the quest to make space for everybody. https://t.co/8a37VzN3Xl — NASA (@NASA) September 16, 2021 మూడురోజుల తర్వాత స్పేస్ఎక్స్ ఇన్స్పిరేషన్4లో పాల్గొంటున్న ఈ బృందం.. ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. ఇదిలా ఉంటే ఇన్స్పిరేషన్ 4 ఖర్చు ఎంత అయ్యిందనే విషయాల్ని స్పేస్ఎక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్ వివరించకపోయినా.. బిలయన్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. హైస్కూల్ డ్రాప్ అవుట్ అయిన జేర్డ్ ఐసాక్మాన్(38).. షిఫ్ట్4 పేమెంట్స్ ద్వారా బిలియనీర్గా ఎదిగాడు. ఈ ఇసాక్మాన్తో పాటు మరో ముగ్గురు ఇన్స్పిరేషన్లో పాల్గొన్నారు. ఈ నలుగురి ఆసక్తికరమైన ప్రస్థానం గురించి నెట్ఫ్లిక్స్ ఇప్పటికే ఓ డాక్యుమెంటరీ రూపొందించింది కూడా. క్రిస్ సెంబ్రోస్కి, సియాన్ ప్రోక్టర్, జేర్డ్ ఐసాక్మాన్, హాయిలే ఆర్కేనాక్స్(ఎడమ నుంచి.. ) క్రిస్ సెంబ్రోస్కి(42) యూఎస్ ఎయిర్ఫోర్స్ వెటరన్. ప్రస్తుతం ఈయన ఎయిరోస్పేస్లో డాటా ఇంజినీర్గా పని చేస్తున్నారు. సియాన్ ప్రోక్టర్(51) జియోసైంటిస్ట్. అంతరిక్షంలోకి వెళ్లిన నాలుగో ఆఫ్రో-అమెరికన్గా రికార్డు సృష్టించారు. తొలి ఫస్ట్ స్పేస్క్రాఫ్ట్ పైలట్గా రికార్డు సృష్టించారు. The crew of #Inspiration4 is go for launch. pic.twitter.com/xou4rJJnjp — Inspiration4 (@inspiration4x) September 15, 2021 హాయిలే ఆర్కేనాక్స్(29).. క్యాన్సర్ను జయించిన యువతి, ఫిజీషియన్ అసిస్టెంట్ కూడా. అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్. అంతేకాదు ప్రొస్తెసిస్(తొడ ఎముక భాగం)తో ఆర్బిట్లోకి వెళ్లిన వ్యక్తిగా ఘనత సాధించింది కూడా. ఇక స్పేస్ ఎక్స్ సాధించిన ఈ ఘనతపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో పాటు అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్లీ ఒబామా కూడా హర్షం వ్యక్తం చేశారు. చదవండి: మంచి కోసమే ఇన్స్పిరేషన్ 4.. తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు! -
జెఫ్బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..!
వాషింగ్టన్: జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ నాసా మూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ విషయంలో యూఎస్ ప్రభుత్వంపై దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాసాపై పోరాడేందుకు కూడా బ్లూ ఆరిజిన్ సిద్ధమైంది. బ్లూ ఆరిజిన్ యూఎస్ కోర్టులో దావాలను దాఖలు చేయడంతో నాసా ఏకపక్ష నిర్ణయాలపై వెనకడుగు వేసింది. బ్లూ ఆరిజిన్ దెబ్బకు నాసా చంద్రుడిపై ప్రయోగించనున్న మూన్ ల్యాండింగ్ మిషన్ డిజైన్ కాంట్రాక్ట్ను ఒకే సంస్థకు ఇవ్వకుండా పలు కంపెనీలకు నాసా అందజేసింది. బ్లూ ఆరిజిన్ సంస్థ నాసాపై దావాలను దాఖలు చేయడంతో పలు కంపెనీలకు ల్యాండింగ్ మిషన్ డిజైన్ కాంట్రాక్టులను అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! డిజైన్ కాంట్రాక్టు పలు కంపెనీలకు... మానవసహిత మూన్ ల్యాండర్ మిషన్ కోసం 2024లో నాసా ఆర్టిమిస్ ప్రోగ్రాం చేపట్టనుంది. మానవ సహిత మూన్ ల్యాండర్ను చంద్రుడిపై దించాలనే లక్ష్యంతో మూన్ ల్యాండింగ్ డిజైన్కు సంబంధించిన ఒప్పందాలను ఐదు కంపెనీలకు నాసా అందజేసింది. ఐదు కంపెనీల్లో బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు కూడా ఉన్నాయి. ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సుమారు 9.4 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ దక్కగా..జెఫ్బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ సుమారు 25.6 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఈ కంపెనీలు స్థిరమైన ల్యాండింగ్ డిజైన్లను రూపోందించనున్నాయి. ఆర్టిమిస్ మిషన్లో భాగంగా మొత్తంగా 146 మిలియన్ డాలర్లను మూన్ ల్యాండింగ్ డిజైన్లను అభివృద్ధి చేయడం కోసం డైనటిక్స్ సంస్ధకు 40.8 మిలియన్ డాలర్లు, లాక్హీడ్మార్టిన్ సంస్థకు 35.2 మిలియన్ డాలర్లు, నార్త్రోప్ గ్రుమ్మన్ సంస్థకు 34.8 మిలియన్ డాలర్ల ఒప్పందాలను అందజేసింది. ఈ ప్రాజెక్టు సుమారు 15 నెలల పాటు కొనసాగనుంది. విచారణ అక్టోబర్ 14 న... నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ కోర్టు మెట్లను ఎక్కింది. నాసా చంద్రుడిపై హ్యూమన్ ల్యాండింగ్ మిషన్లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని బ్లూ ఆరిజిన్ సంస్థ కోర్టుకు వెళ్లగా, దీనిపై యూఎస్ ఫెడరల్ కోర్టు అక్టోబర్ 14న విచారించనుంది. చదవండి: Elon Musk : ఫోటో షేర్ చేశాడో లేదో...! ఒక్కసారిగా పెరిగిన కరెన్సీ విలువ...!