US Federal Reserve System
-
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు మరోసారి 4.25–4.5 శాతంవద్దే కొనసాగనున్నాయి. ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) గత సమీక్షలోనూ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేసిన సంగతి తెలిసిందే.వివిధ దేశాలపై ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్ల విధింపు, వీటి కారణంగా యూఎస్లో స్టాగ్ఫ్లేషన్ పరిస్థితులు తలెత్తనున్నట్లు ఆర్థికవేత్తల అంచనాల నడుమ ఎఫ్వోఎంసీ ఆచితూచి అడుగేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఫెడ్ నిర్ణయాల తదుపరి చైర్మన్ పావెల్ ప్రసంగంపై ప్రపంచ కేంద్ర బ్యాంకులు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. అయితే ఆర్థికవేత్తలు ఊహిస్తున్నట్లు 2025లో వడ్డీ రేట్ల కోతలపై ఫెడ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: అక్కడ సంపాదించి ఇక్కడకు పంపిస్తున్నారు!భారతదేశంలో ఆర్బీఐ గత మానిటరీ పాలసీ సమావేశంలో ఐదేళ్లలో మొదటిసారి రేటు తగ్గింపును అమలు చేసింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని ఆర్థిక వృద్ధితో సమతుల్యం చేయడమే ఈ చర్య లక్ష్యంగా తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య విధానాలు తరచూ భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నా స్థానికంగా ఆర్బీఐ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఏప్రిల్ 7-9 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఏమేరకు వడ్డీరేట్లపై చర్యలు తీసుకొంటారో మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది. -
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్ఫ్లై గంధిమతి, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్(ఫస్ట్క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్వేస్లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నాలుగేళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయంతో ఇప్పటివరకు 5.25-5.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లు 4.75-5 శాతానికి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రానున్న ద్రవ్యపరపతి సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తన అభిప్రాయాన్ని తెలిపారు.ఇటీవల సింగపూర్లో జరిగిన ఓ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నామని చెప్పారు. వరుసగా జులై, ఆగస్టు నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా మార్కెట్ వర్గాలు వడ్డీరేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి ఈ సూచీనే ప్రామాణికంగా ఉండనుంది.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున సాయంరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడిచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
ఫెడ్ అర శాతం వడ్డీ కట్
న్యూయార్క్: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటులో ఏకంగా 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఇప్పటివరకూ 5.25–5.5 శాతంగా అమలవుతున్నాయి. 32 నెలల తదుపరి ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేట్ల పెంపు నుంచి యూటర్న్ తీసుకుంది. ఆగస్ట్లో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాలకంటే తక్కువగా 1,42,000కు పరిమితంకాగా.. రిటైల్ ధరలు 0.3 శాతం బలపడి 3.2 శాతాన్ని తాకాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు అందినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం కోవిడ్–19 కారణంగా 2000 మార్చిలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వచి్చన ఫెడ్ 2023 జూలై తదుపరి నిలకడను కొనసాగిస్తూ వచి్చన సంగతి తెలిసిందే. 2000 డిసెంబర్లో 6.5 శాతానికి ఎగసిన ఫెడ్ ఫండ్స్ రేట్లు గతేడాది తిరిగి 5.5 శాతానికి చేరడంతో గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి! వడ్డీ రేట్ల తగ్గింపుతో యూఎస్ మార్కెట్లు 1% పైగా ఎగసి ట్రేడవుతున్నాయి. పసిడి ఔన్స్ ధర 24 డా లర్లు పెరిగి 2,618 డాలర్ల ఆల్టైమ్ హైని చేరింది. -
ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లు సార్వత్రిక ఎన్నికల పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలింవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ‘‘స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్ టెస్ట్ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్, రక్షణాత్మక షేర్ల పట్ల ఆసక్తి చూపొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ బలహీనంగా ఉంది. నిర్ణయాత్మక తక్షణ మద్దతు 21,850 స్థాయిని కోల్పోతే దిగువ స్థాయిలో 21,450 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఇంధన, రియలీ్ట, ఫైనాన్స్ రంగాలకు చెందిన చిన్న, మధ్య స్థాయిలకు షేర్లలో భారీ ఎత్తున అమ్మకాలు జరగడంతో సూచీలు గతవారంలో 2% మేర నష్టపోయాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1476 పాయింట్లు, నిఫ్టీ 470 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2,641 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1602 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. అలాగే చైనా ఐదేళ్ల రుణ పరపతి రేటు ప్రకటించనుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవచ్చు. బ్రిటన్ ప్రొడక్టర్ ప్రైస్ ఇండెక్స్, తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. యూరోజోన్ ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, చైనా రిటైల్ సేల్స్, నిరుద్యోగ డేటాలు ఇదే వారంలో వెల్లడి కానున్నాయి. మార్చి ప్రథమార్థంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి ప్రథమార్థంలో రూ.40,710 కోట్ల భారత ఈక్విటీలు కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, దేశీయ స్థూల ఆర్థిక వృద్ధి సానుకూల అంచనాలు ఇందుకు ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు తెలిపారు. అమెరికా బాండ్లపై రాబడులకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. తాజాగా ద్రవ్యోల్బణ పెరగడంతో బాండ్లపై రాబడులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర విక్రయదారులుగా మారే అవకాశం ఉంది. -
ఫెడ్ పాలసీ, బడ్జెట్పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్అండ్గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు తాజాగా నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ).. గత 18 నెలల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపునకు విముఖత చూపింది. ప్రస్తుత రేట్లు గత రెండు దశాబ్దాలలోనే అత్యధికంకాగా.. 2022 మార్చి నుంచి దశలవారీగా ఫెడ్.. 5.25 శాతంమేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీలు భారంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ధరలు ఫెడ్ లక్ష్యాన్ని మించుతున్నప్పటికీ లేబర్ మార్కెట్, హౌసింగ్ రంగం మందగించడంతో భవిష్యత్లోనూ ఎఫ్వోఎంసీ రేట్ల పెంపునకు ఆసక్తి చూపకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) -
20 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు(4%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి (బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించి 66,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 20 వేల స్థాయి దిగువన 19,901 వద్ద నిలిచింది. వెరసి గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 868 పాయింట్లు నష్టపోయి 66,728 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించి 19,879 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,111 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. సెన్సెక్స్ రెండు రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.320 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయి (83.32) నుంచి కోలుకుంది. డాలర్ మారకంలో 21 పైసలు బలపడి 83.11 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు చోటు చేసుకున్న అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ నెలకొని ఉంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► ఆర్ ఆర్ కేబుల్ షేరు లిస్టింగ్ పర్లేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.1,035)తో పోలిస్తే 14% ప్రీమియంతో రూ.1,179 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 17% ఎగసి రూ.1,213 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 16% లాభంతో 1,197 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,500 కోట్లుగా నమోదైంది. పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండురోజుల్లోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యి టీ+2 టైంలైన్ విధానంలో లిస్టయిన తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. ► చివరి రోజు నాటికి యాత్రా ఆన్లైన్ ఐపీఓకు 1.61 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 3.09 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 4.98 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.11 రెట్లు సబ్్రస్కిప్షన్ సాధించింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. అలాగే నోమురా బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రేటింగ్ను ‘బై’ నుంచి ‘న్యూట్రల్’కి డౌన్గ్రేడ్ చేసింది. దీంతో ఈ బ్యాంకు షేరు 4% నష్టపోయి రూ.1564 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ► ఎంఅండ్ఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ఎస్యూవీ విభాగం, ట్రాక్టర్లకు బలమైన ఆర్డర్లు లభించడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1634 వద్ద ముగిసింది. -
ద్రవ్యోల్బణం, ఫెడ్ మినిట్స్పై ఫోకస్
ముంబై: దేశీయ ద్రవ్యోల్బణం డేటా, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) ఈ వారం మార్కెట్కు దారిచూపొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తుది దశకు చేరిన కార్పొరేట్ క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (రేపు) ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే కావడంతో మార్కెట్ వర్గాల పారి్టసిపేషన్ (భాగస్వామ్యం) స్వల్పంగా ఉంటుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ క్రూడాయిల్ ధరలపై దృష్టి సారించే వీలుందంటున్నారు. దేశీయంగా ట్రేడింగ్ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా సూచీలు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. అయితే ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువు స్థాయిలో 19,300–19,100 శ్రేణిలో కీలక మద్దతు స్థాయిని ఉంది. కొనుగోళ్ల మద్దతు లభిస్తే ఎగువ స్థాయిలో 19,650–19,700 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యల్బోణ అంచనాలను 30 బేసిస్ పాయింట్లు పెంచడం, అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి)ను పదిశాతం పెంపు చర్యలతో గతవారంలో మార్కెట్ నష్టాలను చవిచూసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్ల పతనంతో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి ద్రవ్యోల్బణ ఆందోళనలు అధికమతున్న వేళ నేడు(సోమవారం) రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఈ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనునున్నారు. టమోటాతో పాటు ఇతర కాయగూరల ధరలు పెరగడంతో ఈ జూలై సీపీఐ ద్రవ్యోల్బణం అర్బీఐ లక్షిత పరిధి ఆరు శాతాన్ని మించి 6.3%గా నమోదుకావచ్చని ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ తన సమీక్ష సమావేశంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి గానూ ద్రవ్యోల్బణ అంచనాను 5.1% నుంచి 5.4 శాతానికి పెంచింది. ఇదే రోజున టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలూ వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ సమావేశ వివరాలపై కన్ను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో మరోసారి వడ్డీరేట్ల పెంపు సంకేతాలిచి్చన ఫెడ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. చివరి దశకు కార్పొరేట్ ఆరి్థక ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ1 ఫలితాల అంకం తుది దశకు చేరింది. ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, వోడాఫోన్ ఐడియాలు నేడు (సోమవారం) తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే వారంలో కేరియర్ పాయింట్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఫ్యూచర్ కన్జూమర్, గ్లోబల్ స్పిరిట్స్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్, హిందుస్థాన్ కాపర్, జాగరణ్ ప్రాకాశన్, మేఘ్మణి ఆర్గానిక్స్, పీసీ జ్యూవెలరీ, వోకార్డ్ కంపెనీలు ఫలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. మారుతున్న ఎఫ్ఐఐల వైఖరి ఈ ఆగస్టు తొలివారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన వారంలో రూ.3,200 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మొత్తంగా దేశీయ మార్కెట్లో ఈ ఆగస్టు 11 తేదీ నాటికి రూ.3,272 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశి్చతి, చైనా ఆరి్థక వ్యవస్థ మందగమన పరిస్థితులు మన మార్కెట్లో పెట్టుబడులకు ఉతమిస్తున్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం కలిసొస్తుంది’’ అని మారి్నంగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. అంచనాలకు మించి నమోదైన జూన్ క్వార్టర్ ఫలితాలూ విదేశీ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయనన్నారు. -
గ్లోబల్ ట్రెండ్, ఆర్బీఐ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. బుధవారం(28) నుంచి మూడు రోజులపాటు సమావేశంకానున్న పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) శుక్రవారం(30న) నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ అధ్యక్షతన ఎంపీసీ ధరల అదుపునకే ప్రాధాన్యతనిస్తూ గత మూడు సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 1.4 శాతం హెచ్చించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈసారి సమీక్షలోనూ మరోసారి 0.5 శాతం రేటును పెంచే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి రెపో రేటు మూడేళ్ల గరిష్టం 5.9 శాతానికి ఎగసే వీలుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పరపతి నిర్ణయాలపై కన్నేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలరు జోరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్సహా పలు కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఫండ్స్ రేట్లను ఈ ఏడాది మరింత పెంచే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ప్రభావం ఆర్బీఐపైనా పడనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా.. ఫెడ్ అండతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 111కు చేరింది. ట్రెజరీ ఈల్డ్స్ సైతం 3.5 శాతాన్ని దాటాయి. దీంతో దేశీ కరెన్సీ ఏకంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 81కు పడిపోయింది. వడ్డీ రేట్లు, రూపాయి మారకం వంటి అంశాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సిరీస్ షురూ సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారం(29) ముగియనుంది. వారాంతం నుంచీ అక్టోబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను కొత్త సిరీస్కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. ఇది మార్కెట్లలో ఆటుపోట్లకు దారితీయవచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలు కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీస్తున్న విషయం విదితమే. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. పలు అంశాలు.. ఆర్బీఐ, ఎఫ్అండ్వో ముగింపు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్తోపాటు.. ఈ వారం ఇన్వెస్టర్లు మరిన్ని అంశాలపై దృష్టి సారించనున్నారు. యూఎస్ ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు, ముడిచమురు ధరలపై రష్యా యుద్ధ భయాల ప్రభావం, ఎఫ్పీఐల పెట్టుబడులు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు తదితరాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు వివరించారు. ఎఫ్పీఐలు ఓకే పలు ఆటుపోట్ల మధ్య ఈ నెల(సెప్టెంబర్)లోనూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్నారు. 1–23 మధ్య మూడు వారాల్లో రూ. 8,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్పీఐలు ఇటీవల కాస్త వెనకడుగు వేస్తున్నారు. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఎఫ్పీఐలు రూ. 2,500 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో ఇకపై పెట్టుబడులు మందగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే 9 నెలల వరుస అమ్మకాల తదుపరి జులైలో తిరిగి ఎఫ్పీఐలు నికర ఇన్వెస్టర్లుగా నిలుస్తూ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీలను సొంతం చేసుకున్నారు! కాగా.. గతేడాది అక్టోబర్ మొదలు ఈ ఏడాది జూన్ వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్య ఆందోళనలు, డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు ఎఫ్పీఐలను వెనక్కి లాగుతున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ నిపుణులు శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. -
మార్కెట్లకు ఫెడ్ దెబ్బ
ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 111ను దాటింది. ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్సెషన్కల్లా సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్ కవరింగ్కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం! మీడియా అప్ ఫెడ్ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్లో పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి. చిన్న షేర్లు ఓకే.. తాజాగా చిన్న షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్క్యాప్స్ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్చేసి రూ. 53,225 వద్ద ముగిసింది. ► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్సాఫ్ట్ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది. ► ప్రమోటర్ సంస్థ విల్మర్ తాజాగా వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది. ఆల్టైమ్ కనిష్టానికి రూపాయి ► ఒకేరోజు 83 పైసలు డౌన్ ► 80.79 వద్ద ముగింపు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. బుధవారం రూపాయి ముగింపు 79.96. ట్రేడింగ్ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్టైమ్ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్ ఇండెక్స్ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది. -
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు నుంచి రూ.12,000 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–16 వరకు దేశీ ఈక్విటీల్లోకి నికరంగా రూ.12,084 కోట్ల పెట్టుబడులను జోప్పించారు. యూఎస్ ఫెడ్ సహా అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో దూకుడు తగ్గించుకుంటాయన్న అంచనాలే నికర పెట్టుబడులకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ నెలలోనూ ఎఫ్పీఐల నికర పెట్టుబడులు రూ.51,200 కోట్లుగా ఉండగా, జూలైలో రూ.5,000 కోట్లు కావడం గమనార్హం. వరుసగా తొమ్మిది నెలల పాటు భారత ఈక్విటీల్లో నికర విక్రయాల తర్వాత జూలై నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడుల బాట పట్టడం తెలిసిందే. అయితే, వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల సమీప కాలంలో ఎఫ్పీఐ పెట్టుబడుల్లో ఆటుపోట్లు ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. అనుకూలం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిదానంగా వెళ్లొచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ హెడ్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కాస్త శాంతించడంతో భారత ఈక్విటీలు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోవడం కంటే కొనసాగడమే మంచిదన్న అభిప్రాయంతో వారున్నట్టు తెలిపారు. ఇక ఈ నెలలో 16వ తేదీ వరకు ఎఫ్పీఐలు డెట్ మార్కెట్లో నికరంగా రూ.1,777 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
ఫెడ్ రేట్ల నిర్ణయంపై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా నిర్ణయాలపై ఆధారపడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం(20) నుంచి రెండు రోజులపాటు సమావేశంకానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం, ఉపాధి తదితర అంశాలపై సమీక్షను చేపట్టనుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం తదితరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ధరల అదుపుపైనే దృష్టి పెట్టిన ఎఫ్వోఎంసీ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను భారీగా పెంచే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో యూరోపియన్ కేంద్ర బ్యాంకు, బ్యాంక్ ఆప్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితరాలు సైతం ఇదే బాటలో సాగనున్నట్లు భావిస్తున్నారు. పెట్టుబడుల ప్రభావం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో బలపడుతున్న డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ వంటి అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ద్రవ్యోల్బణంతోపాటు, 110కు చేరిన డాలరు ఇండెక్స్పట్ల గ్లోబల్ మార్కెట్లు ఆందోళనగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ప్రభావిత దేశీ అంశాలు కొరవడటంతో యూఎస్ ఫెడ్పైనే మార్కెట్లు కన్నేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ నిపుణులు అజిత్ మిశ్రా, శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ సేథ్ అభిప్రాయపడ్డారు. గత వారం వెనకడుగు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో దేశీ ఈక్విటీ మార్కెట్లు గత వారం(12–16) భారీగా వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 952 పాయింట్లు పతనమై 58,841 వద్ద నిలవగా.. 303 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 17,531 వద్ద స్థిరపడింది. అన్నివైపులా అమ్మకాలు పెరగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 1.25 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ డాలరుసహా బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రభావంతో బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఎఫ్పీఐల దన్ను తొమ్మిది నెలల అమ్మకాల తదుపరి ఈ ఏడాది జులైలో పెట్టుబడుల బాట పట్టిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–16) దేశీ స్టాక్స్లో రూ. 12,084 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆగస్ట్లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పంప్చేయగా.. జులైలోనూ రూ. 5,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ నెలలో రుణ సెక్యూరిటీలలోనూ రూ. 1,777 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. కాగా.. గతేడాది చివర్లో అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించిన ఎఫ్పీఐలు 2021 అక్టోబర్– 2022 జూన్ మధ్య కాలంలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వడ్డీ పెంపు అంచనాల నడుమ ఇకపై ఎఫ్పీఐలు ఊగిసలాట ధోరణి ప్రదర్శించవచ్చని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. -
బలహీనంగా సెంటిమెంట్
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ బలహీన సెంటిమెంట్ కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు తెలిపారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్వహించిన జాక్సన్ హోల్ 45వ వార్షిక సమావేశంలో ఫెడ్ చైర్మన్ పావెల్ చేసిన ‘‘కఠినతర ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు’’ వ్యాఖ్యలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందంటున్నారు. దేశీయంగా రిలయన్స్ ఏజీఎం, జూన్ క్వార్టర్ జీడీపీ, స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో అమ్మకాలు తదితర కీలక పరిణామాల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందుకోవచ్చు. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, రూపాయి కదలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. నష్టాలతో ప్రారంభానికి చాన్స్..? ద్రవ్యోల్బణ కట్టడే తమ తొలి కర్తవ్యమని, ఇందుకు కోసం వచ్చే కొద్ది నెలల్లో మరింత దూకుడుగా వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ శుక్రవారం జాక్సన్ హోల్లో జరిగిన వార్షిక సమావేశంలో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. ఫెడ్ చీఫ్ ‘‘కఠినతర ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు’’ వ్యాఖ్యలతో శుక్రవారం యూఎస్ నాస్డాక్ ఇండెక్స్ 4%, ఎస్అండ్పీ500 సూచీ మూడున్నర శాతం నష్టపోయాయి. ఆర్థిక అగ్రరాజ్యపు మార్కెట్ భారీ పతనం నుంచి దేశీయ మార్కెట్కు ప్రతికూల సంకేతాలు అందుకొని నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంకేతంగా ఎస్జీఎక్స్ నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 17,444 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఏజీఎం సమావేశం దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సమావేశం సోమవారం(నేడు) మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. ఏజీఎం వేదికగా కంపెనీ సీఎండీ ముఖేశ్ అంబానీ ప్రసంగాన్ని దలాల్ స్ట్రీట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ముఖ్యంగా 5జీ సేవల ప్రారంభం, రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ ప్రణాళికలతో పాటు టెలికాం(జియో), రిటైల్ వ్యాపారాల పబ్లిక్ ఇష్యూలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న వెల్లడి కానున్నాయి. మరసటి రోజు ఆగస్టు నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ ఆగస్టు 26 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 12వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే.. వినాయక చవితి సందర్భంగా బుధవారం (ఆగస్టు 31) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కె ట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటి స్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి గురువారం యధావిధిగా ప్రారంభమవుతాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పాటు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో గతవారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలక పరిణాలేవీ లేకపోవడం కూడా సెంటిమెంట్పై ప్రభావాన్ని చూపింది. ఐటీ, ఫార్మా, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 812 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లను కోల్పోయాయి. ‘‘జూన్ కనిష్ట స్థాయిల నుంచి భారీ ర్యాలీ తర్వాత బుల్స్ కాస్త నెమ్మదించాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 108 స్థాయిపై, బ్రెంట్ క్రూడాయిల్ ధర 100 డాలర్లపైకి చేరుకున్నాయి. ఇటీవల వెల్లడైన ప్రపంచ స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరిచిన తరుణంలో సూచీలు మరికొంత స్థిరీకరణకు లోనుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,300 వద్ద తొలి మద్దతుని, ఈ స్థాయిని కోల్పోయితే 17,000 వద్ద మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) బుల్లిష్ వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ ఆగస్టులో ఇప్పటి వరకు(1–26 తేదీల మధ్య) రూ.49,250 కోట్లను భారత మార్కెట్లోకి మళ్లించారు. ప్రస్తుత ఏడాదిలో ఎఫ్పీఐలు పెట్టిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. కంపెనీల జూన్ త్రైమాసికపు ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడంతో ఎఫ్పీఐలు భారత మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపడుతున్నారని నిపుణులు తెలిపారు. ఆర్థిక, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపుతున్నారు. ‘‘ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రకటన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సవాలుగా మారింది. రానున్న నెలల్లో కమోడిటీ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు, కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వైఖరి తదితర అంశాలకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించవచ్చు’’ అని ఫిన్టెక్ ప్లాట్ఫామ్ గోల్టెల్లర్ వ్యవస్థాపక సభ్యుడు వివేక్ బంకా వెల్లడించారు. -
కొనసాగుతున్న ఎఫ్పీఐ విక్రయాలు
న్యూఢిల్లీ: డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. మే నెలలో ఇప్పటివరకూ రూ. 39,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యపరపతి విధానాలు అమలు కానుండటంతో భారత్లోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు రావడంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్–రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ‘ఇటీవలి కాలంలో ఎఫ్పీఐల విక్రయాలు ఒక స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ), రిటైల్ ఇన్వెస్టర్లు దీటుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇకపైనా గరిష్ట స్థాయుల్లో ఎఫ్పీఐలు అమ్మకాలు కొనసాగించవచ్చు. అయితే, డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆ ప్రభావం కొంత తగ్గగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. భారత్తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర వర్ధమాన దేశాల్లో కూడా ఎఫ్పీఐలు విక్రయాలు కొనసాగించారు. ఇప్పటివరకూ రూ. 1.66 లక్షల కోట్లు వెనక్కి.. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఈ ఏడాది (2022)లో ఇప్పటివరకు రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. మార్కెట్ కరెక్షన్కి లోను కావడంతో ఏప్రిల్ తొలి వారంలో ఎఫ్పీఐలు కాస్త కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. రూ. 7,707 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ మళ్లీ ఆ తర్వాత వారాల్లో భారీగా అమ్మకాలకు దిగారు. మే 2–27 మధ్య కాలంలో రూ. 39,137 కోట్ల మేర విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి ఎఫ్పీఐలు రూ. 6,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. మే నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలి ఉన్నాయి. ‘భారత్లో వేల్యుయేషన్లు అధిక స్థాయిలో ఉండటం, అమెరికాలో బాండ్ ఈల్డ్లు .. డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అక్కడ మాంద్యం భయాలతో వడ్డీ రేట్లను పెంచుతుండటం వంటి అంశాలే ఎఫ్పీఐ అమ్మకాలకు కారణం‘ అని విజయ్ కుమార్ వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల కార్పొరేట్ల లాభాలు తగ్గొచ్చని, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించవచ్చన్న ఆందోళన కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పుతోందని మార్నింగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్ట్ర హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. వీటితో పాటు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగనుండటం కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగాను ద్రవ్యోల్బణం.. దాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుండటం, ఆర్థిక వృద్ధిపై దాని ప్రభావాలు మొదలైన వాటిపై కొంత ఆందోళన నెలకొందని తెలిపారు. -
అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్ష, వడ్డీ రేటును!
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేటును మరోసారి పెంచింది. ధరల కట్టడి లక్ష్యంగా 0.5 శాతం హెచ్చించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0.75–1 శాతానికి చేరాయి. గత సమీక్షలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 0.25 శాతమే పెంచినప్పటికీ.. ఈసారి మరింత కఠినంగా వ్యవహరించింది. కరోనా మహమ్మారి సంక్షోభం తదుపరి ఆర్థిక వ్యవస్థ గాడిన పడటంతో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) సరళతర విధానాలకు స్వస్తి పలుకుతూ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపుతోంది. నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం(సీపీఐ), ఉపాధి ఊపందుకోవడం వంటి అంశాల మద్దతుతో 9 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల పోర్ట్ఫోలియోను జూన్ నుంచి తగ్గించుకోనుంది. -
ఫెడ్ వడ్డీ రేటు 0.25% పెంపు
వాషింగ్టన్: ముందస్తు సంకేతాలను నిజం చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేటును 0.25 శాతంమేర పెంచుతున్నట్లు ప్రకటించింది. వెరసి ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల ఫెడ్.. 2018 తదుపరి మళ్లీ రేట్ల పెంపు బాట పట్టింది. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశంలో చివరికి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) కఠిన విధానాలకే మొగ్గు చూపింది. కోవిడ్–19 ప్రభావం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఫెడ్ పాలసీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయంతో ఫండ్స్ రేట్లు 0.25–0.5 శాతానికి చేరాయి. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణ వార్షిక రేటు 40 ఏళ్ల గరిష్టం 7.9 శాతానికి చేరడం ప్రతికూల అంశంకాగా.. నిరుద్యోగిత భారీగా తగ్గి 3.8 శాతానికి పరిమితం కావడంతో రేట్ల పెంపునకు అనువైన పరిస్థితులు ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో 2.18 శాతానికి చేరిన 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతీ నెలా బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా విడుదల చేస్తున్న నిధులను మార్చి నుంచి ఫెడ్ పూర్తిగా నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడనుండగా.. పసిడి, స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేసే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సహా అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో సమావేశంలో మంత్రి చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి అనంతరం ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయని, భారత్ ఈసారి అవకాశాలను జారవిడుచుకోకుండా పారిశ్రామిక రంగం చూడాలని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీలోకి ఏటీఎఫ్పై చర్చ.. కాగా, విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు అసోచాం సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, బ్యాంకింగ్పరంగా సహకారం లభించేలా ఏవియేషన్కు పరిశ్రమ హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిపై బ్యాంకులతో మాట్లాడతామని ఆమె చెప్పారు. పెట్టుబడులకు ఆహ్వానం... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సీతారామన్ సూచించారు. వృద్ధి వేగం పుంజుకునేలా సత్వరం పెట్టుబడులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. -
మార్కెట్కు ‘ఫెడ్’ పోటు
ముంబై: కీలక వడ్డీరేట్ల పెంపు మార్చిలో ఉంటుందనే అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో గురువారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం దేశీయ మార్కెట్పై మరింత ఒత్తిడిని పెంచాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు నెలకొని ఎనిమిదేళ్ల తర్వాత బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్లను తాకింది. డాలర్ విలువ ఐదు వారాల గరిష్టానికి చేరింది. ఈ అంశాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్లను కోల్పోయి 17,110 వద్ద నిలిచింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. ద్వితీయార్థంలో బ్యాంకింగ్ షేర్లు భారీగా రాణించాయి. ఆటో, మీడియా షేర్లలో చెప్పుకోదగిన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ సూచీలో తొమ్మిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,267 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2,881 కోట్ల షేర్లను కొన్నారు. సూచీలు ఒకశాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒకరోజులో రూ.2.81 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. తద్వారా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2,59 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలను పరిమితం చేసిన బ్యాంకింగ్ సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 57,317 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పతనమై 17,062 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1419 పాయింట్లు కోల్పోయి 56,439 వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయి 16,867 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్ సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లకు అనూహ్య కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ నష్టాలు (–)1,419 పాయింట్ల నుంచి (–)581కు, నిఫ్టీ (–) నష్టాలు 411 పాయింట్ల నుంచి (–)167 పరిమితయ్యాయి. కాగా డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలహీనపడి 75.09 వద్ద ముగిసింది. ఐపీవో బాటలో బోట్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
కార్పొరేట్ ఫలితాలు, ఫెడ్ పాలసీలే కీలకం
ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిమాణాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి తదితర అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనున్న నేపథ్యంలో సూచీలు తడబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కేసుల అనూహ్య పెరుగుదల, ఆర్థిక వృద్ధి ఆందోళనలతో గతవారం నాలుగురోజుల ట్రేడింగ్లో దేశీయ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెన్సెక్స్ 164 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయాయి. అయితే అదేవారంలో విడుదలైన కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో సూచీల నష్టాలు పరిమితమయ్యాయి. ‘‘యూఎస్, యూరప్ మార్కెట్లు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ బెంచ్మార్క్ సూచీలు సైతం ఆల్టైం హైకి చేరువలో కదలాడుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు రాణిస్తే సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చు. తర్వాత గరిష్ట స్థాయిల్లో కొంత స్థిరీకరణ జరగవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది. దిగువస్థాయిలో 15,800 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా అభిప్రాయపడ్డారు. అందరి చూపు ఫెడ్ సమావేశం వైపే... అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జూన్ 27న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఎఫ్అండ్ఓ ముగింపునకు ముందు అప్రమత్తత ఈ గురువారం జూలై సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్ల ముగింపు జరగనుంది. ఆగస్ట్ సిరీస్కు ట్రేడర్లు తమ పొజిషన్లను స్కోర్ ఆఫ్ చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో మార్కెట్ కొంత ఒడిదుడకులకు లోనుకావచ్చు. గురువారం తత్వ చింతన్ ఫార్మా లిస్టింగ్ ... స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ తత్వ చింతన్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ఈ జూలై 16–20 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 1,073–1,083 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 32,61,882 షేర్లను విక్రయానికి ఉంచగా.., 58.83 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. 180 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.1,083తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.1,000 ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు 92% లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. ఇదే వారంలో రెండు ఐపీఓలు రెండు కంపెనీలు ఇదే వారంలో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓ జూన్ 27 ప్రారంభమై, ఇదే నెల 29న ముగుస్తుంది. షేరుకి ధరల శ్రేణి రూ.695–720గా నిర్ణయించి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 1,513.6 కోట్లను సమకూర్చుకోనుంది. మరో కంపెనీ రోలాక్స్ రింగ్స్ ఇష్యూ 28–30 తేదీల మధ్య జరనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.56 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో 75 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టింది. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ ముందుగా రిలయన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతీ, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, బ్రిటానియా, యూపీఎల్, ఐఓసీలతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్లోని కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై 1–23 తేదీల మధ్య రూ.5,689 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల వ్యాల్యూయేషన్లు, యూఎస్ కరెన్సీ డాలర్ విలువ, క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో స్వల్పకాలిక రిస్క్ దృష్ట్యా మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. -
మార్కెట్కు ‘ఫెడ్’ పోటు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించిన విధాన పరపతి నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిరాశపరిచాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76 పైసల పతనం నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఫెడ్ విధాన కమిటీ బుధవారం రాత్రి పాలసీ నిర్ణయాలు ప్రకటించింది. అందరూ ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అయితే 2024 తొలినాళ్లలో పెంచుతారని భావించిన వడ్డీరేట్లను 2023లోనే పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొంటామని తెలిపింది. ఫెడ్ అనూహ్య నిర్ణయాలతో డాలర్, బాండ్ ఈల్డ్స్ పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 380 పాయింట్లు నష్టంతో 52,122 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 15,648 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకోగలింది. యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చివర అరగంటలో అమ్మకాలు మరోసారి వెల్లువెత్తడంతో సూచీల నష్టాల ముగింపు ఖరారైంది. ఒక్క ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు జరిగాయి. రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అత్యధికంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.880 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 45 కోట్ల షేర్లను కొన్నారు. చదవండి: వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన -
మార్కెట్కు ఫెడ్ జోష్..!
ముంబై: కీలక వడ్డీరేట్లపై సరళతర ధోరణికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు రాణించడం మన మార్కెట్కు కలిసొచ్చింది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు వరుసగా ఐదురోజూ లాభాల్లో ముగిశాయి. అలాగే కొత్త రికార్డుల నమోదును కొనసాగించాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభంతో 46,890 వద్ద సిర్థపడింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద నిలిచింది. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు కనిపించడం, పలు దేశాల్లో కోవిడ్–19 వ్యాక్సిన్కు అనుమతినివ్వడం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. ఆర్థిక, ప్రైవేట్ రంగ బ్యాంక్, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెనెక్స్ ఇంట్రాడేలో 326 పాయింట్లు లాభపడి 46,992 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 90 పాయింట్లు ర్యాలీ చేసి 13,773 వద్ద నూతన ఆల్టైం హైని నమోదు చేసింది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా షేర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీలు కొత్త రికార్డు సృష్టిస్తున్నప్పటికీ.., ఇటీవల మధ్య, చిన్న తరహా షేర్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. గురువారం రికార్డు ర్యాలీలో ఈ షేర్ల వాటా అత్యంత స్వల్పంగా ఉంది. ఈ తరుణంలో అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్ అవసరమని వారు సూచించారు. ప్రపంచ ఈక్విటీలకు ఫెడ్ రిజర్వ్ బూస్టింగ్... అమెరికా ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు బుధవారం రాత్రి వెలువడ్డాయి. కరోనాతో పూర్తిగా కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలిచే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మార్చలేదు. నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ, ఉద్యోగ కల్పన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు సరళతరమైన విధానాలకే కట్టుబడి ఉంటామని ఫెడ్ తెలిపింది. వ్యవస్థలో ద్రవ్యతను పెంచేందుకు 12 బిలియన్ డాలర్ల విలువైన నెల బాండ్ల కొంటామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫెడ్ సులభతరమైన ద్రవ్య పరపతి విధాన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు మరింత దూసుకెళ్లాయి. ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇందులో జపాన్కు చెందిన నికాయ్ సూచీ 29 ఏళ్ల గరిష్ట స్థాయి చేరువలో ముగిసింది. యూరప్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ ర్యాలీ చేశాయి. అమెరికా సూచీల్లో నాస్డాక్ ఇండెక్స్ బుధవారం సరికొత్త గరిష్టం వద్ద నిలిచింది. ఉద్దీపన ప్యాకేజీ ఆమోదం లభించవచ్చనే ఆశలతో అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ హాంఫట్ 198 రెట్ల బిడ్లు బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 198 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 176.85 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 620.86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 29.28 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు ధర రూ.220గా పలుకుతోంది. ఐపీఓ ద్వారా రూ.540 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. -
పడేసిన ఫెడ్ !
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదనపు తాయిలాలను ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 73.66కు చేరడం, రిలయన్స్, టీసీఎస్ వంటి ఇండెక్స్ షేర్లలో అమ్మకాలు జరగడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడి 38,980 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 11,516 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో మూడేళ్లు సున్నా స్థాయిలోనే.... కీలకమైన వడ్డీరేట్లు మరో మూడేళ్లపాటు సున్నా స్థాయిలోనే కొనసాగుతాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. అదనపు ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వకపోవడం, పైగా భవిష్యత్తు ఆర్థిక స్థితిగతుల అంచనాలపై తీవ్రమైన అనిశ్చితి నెలకొందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ ప్రతికూల వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం మేర నష్టపోగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రోజంతా నష్టాలే.... ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో అమ్మకాలు మరింత జోరుగా పెరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► బజాజ్ ఫిన్సర్వ్ షేర్ 2 శాతం నష్టంతో రూ.6,006 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్ఆర్ఎఫ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మార్కెట్ నష్టపోయినా, 288 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రామ్కో సిస్టమ్స్, గంధిమతి అప్లయెన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.817ను తాకిన ఈ షేర్ చివరకు 2.3 శాతం లాభంతో రూ.808 వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 13 శాతం లాభపడింది. ► డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.4,845ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.4,826 వద్ద ముగిసింది. ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు ఆవిరి నష్టాల కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.1,03,248 కోట్ల మేర తగ్గిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ గురువారం ముగింపు నాటికి రూ.159,04,785 కోట్లుగా ఉంది. ‘‘మార్కెట్లు బుధవారం గడించిన లాభాలన్నింటినీ కోల్పోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా రోజులో కనిష్టాల వద్ద ముగిశాయి. ఆర్థిక రికవరీ విషయమై యూఎస్ ఫెడ్ ఆందోళన వ్యక్తం చేయడం మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యేందుకు దారి చూపింది. బెంచ్ మార్క్ సూచీలు రోజులో పలు విడతలు రికవరీకి ప్రయత్నించినప్పటికీ ఎగువ స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా కనిష్టానికి చేరాయి’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆర్థిక రికవరీపై అనిశ్చితిని యూఎస్ ఫెడ్ వ్యక్తీకరించడం సెంటిమెంట్పై ప్రభావం చూపించినట్టు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా సైతం తెలిపారు. -
మార్కెట్కు ‘ఫెడ్’ జోష్!
వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీనికి మన దగ్గర షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, వేల్యూ బయింగ్ కూడా జత కావడంతో మన మార్కెట్ కూడా గురువారం భారీగా లాభపడింది. గత మూడు రోజులుగా అంతంత మాత్రం లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలు సాధించాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, రానున్న బడ్జెట్లో వ్యాపార వర్గాలకు అనుకూలమైన చర్యలు ఉంటాయనే అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 11,832 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా... అమెరికాకు చెందిన డ్రోన్ను ఇరాన్ కూల్చేసిందన్న వార్తల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లుతాయనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 3% పెరిగి 63.37 డాలర్లకు చేరింది. సాధారణంగా చమురు ధరలు పెరిగితే మన మార్కెట్ పడిపోతుంది. ఈసారి దీనికి భిన్నంగా జరిగింది. ముడిచమురు 3% పెరిగినా, డాలర్తో రూపాయి మారకం 23 పైసలు లాభపడటం కలసివచ్చింది. 703 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. బ్యాంక్, ఫార్మా, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలూ సానుకూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న వార్తలు సెంటిమెంట్కు జోష్నిచ్చాయి. ఇటీవల నష్టాలతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో వేల్యూబయింగ్ చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లూ జరిగాయి. ఒక దశలో 179 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 524 పాయింట్లు పెరిగింది. రోజంతా 703 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జెట్ ఎయిర్వేస్ షేరు డబుల్... జెట్ ఎయిర్వేస్ భారీ లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో ఏ షేరూ ఏ రోజూ పెరగనంత స్థాయిలో జెట్ ఎయిర్వేస్ షేర్ పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ 18 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.27కు పడిపోయింది. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతోఈ ఈ షేర్ పుంజుకుంది. ఇంట్రాడేలో 134 శాతం లాభంతో రూ.77కు ఎగసిన జెట్ ఎయిర్వేస్ షేర్ చివరకు 93 శాతం లాభంతో రూ.64 వద్ద ముగిసింది. గత 13 సెషన్లలో ఈ షేర్ దాదాపు 78 శాతం పతనమైంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎల్టీలో ఎస్బీఐ కేసు వేయడం తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్ 8% ఎగసింది. ► యస్ బ్యాంక్ 11 శాతం లాభపడి రూ. 115 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభంలో ఈ షేర్ రెండంకెల స్థాయి, రూ.98.75కి పడిపోయింది. ఈ షేర్ రెండంకెల స్థాయికి పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల కారణంగా ఈ నష్టాల నుంచి ఈ షేర్ కోలుకుంది. రూ.1.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.75 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.1,61,30,671 కోట్లకు పెరిగింది. ఫెడ్... రేట్ల తగ్గింపు సంకేతాలు! అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వివిధ పరిణామాల కారణంగా మందగమనం చోటు చేసుకోవడంతో అవసరమైతే, వచ్చే నెలలోనే రేట్లను అర శాతం మేర తగ్గించగలమని సంకేతాలు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఫెడ్ నిర్ణయాన్ని ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లూ అనుసరించే అవకాశాలుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడ్ రేట్లను తగ్గిస్తే, వృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్కు విదేశీ నిధులు వెల్లువలా వస్తాయి. అందుకని ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్ భారీగా లాభపడింది. ఐదేళ్ల గరిష్టానికి పసిడి పరుగు న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీ య ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ధర గురువారం పరుగులు పెట్టింది. ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, 45 డాలర్ల లాభంతో 1,395 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. పసిడికి ఇది ఐదు సంవత్సరాల్లో గరిష్టస్థాయి. గతంలో పలు సార్లు పసిడి 1,360 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ స్థాయి దాటడంతో ఒక్కసారిగా 1,400 డాలర్ల వైపు పరుగుపెట్టింది. ఈ స్థాయి దాటితే మరో 50 డాలర్లకు పసిడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. పరుగుకు కారణం..: అమెరికాలో వృద్ధి రేటు మందగమనం, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు (ప్రస్తుతం 2.25–2.50 శాతం) పసిడి పరుగుకు కారణంగా నిలిచాయి. అమెరికా వృద్ధి మందగమనం వార్తలతో డాలర్ ఇండెక్స్ స్పీడ్ తగ్గడం కూడా గమనార్హం. ఇక వాణిజ్యయుద్ధం వంటి అంశాలు ప్రపంచ వృద్ధి తీరును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆయా అంశాలు పసిడికి తక్షణ బలాన్ని ఇస్తున్నాయి. దేశంలో రూ. 1,000 అప్..: ఇక దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ చూస్తే, ఈ వార్త రాసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 లాభంతో రూ. 34,058 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 69.44 వద్ద ఉన్న రూపాయి మరింత బలహీనపడితే, దేశంలో పసిడి పరుగు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా. -
ఫెడ్ నిర్ణయం, క్యూ4పై మార్కెట్ దృష్టి
ముంబై: లోక్సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మూడు దశలు పూర్తవగా.. నేడు జరిగే పోలింగ్...ఎన్నికల చివరి అంకానికి దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ఉత్కంఠ మార్కెట్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు ఒడిదుడుకులు కూడా మరింత పెరుగుతాయి’ అని అన్నారయన. కొనసాగుతున్న పోలింగ్, కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు ఈవారంలో మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇకపై వెల్లడికానున్న కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. ఇదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రం సమీపకాలంలోనే మన మార్కెట్లు అవుట్పెర్ఫార్మ్ చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి అంబుజా సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెన్ ఫిన్ హోమ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్ (గురు), హిందూస్తాన్ యూనిలివర్ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ట్రెండ్కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్ వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపె¯Œ మార్కెట్ కమిటీ ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించనున్నారు. భారీ ఒడిదుడుకుల మధ్య క్రూడాయిల్ గతవారంలో 75 డాలర్లకు సమీపించి మార్కెట్కు ప్రతికూలంగా మారిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. వారాంతాన దిగొచ్చింది. శుక్రవారం 71.63 డాలర్ల వద్ద ముగిసింది. ఈ అంశం ఆధారంగా డాలరుతో రూపాయి మారకం విలువ 69.50–70.30 శ్రేణిలో ఉండేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. ఈ వారంలో ట్రేడింగ్ 3 రోజులే.. ముంబైలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ఉన్న కారణంగా సోమవారం(29న) స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. ఆ తరువాత రోజైన మంగళవారం యథావిధిగా మార్కెట్ కొనసాగనుంది. అయితే, మళ్లీ బుధవారం(1న) మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఈ, ఎ¯Œ ఎస్ఈలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఈ వారంలో మార్కెట్లో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!
వాషింగ్టన్: ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించిన ఫెడరల్ రిజర్వ్ ఫండ్స్ రేటును ప్రస్తుత స్థాయిల్లోనే (2.25 శాతం నుంచి 2.50 శాతం) కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మొత్తం దాదాపు ఇదే రేటు కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు క్వాంటిటేటివ్ ఈజింగ్(ఉద్దీపన ప్యాకేజీ–క్యూఈ)ని కూడా పూర్తిగా నిలిపేయనున్నది. ఈ విధానంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలు(బాండ్లు), ఇతర సెక్యూరిటీలను ఫెడరల్ రిజర్వ్ కొనుగోలు చేస్తుంది. తద్వారా వ్యవస్థలోకి నిధులు పంపిస్తూ వడ్డీరేట్లను తక్కువ స్థాయిల్లో ఉండేట్లు చేస్తుంది. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ నెలకు 3,000 కోట్ల డాలర్ల మేర సెక్యూరిటీలను కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి దీనిని నెలకు 1,500 కోట్ల డాలర్లకు తగ్గించనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయనున్నది. కాగా 2020లో మాత్రం ఫండ్స్ రేట్ 2.6 శాతానికి పెరగవచ్చని అంచనా. మరింత స్పష్టత... ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందని, అప్పుడు పాలసీ మార్పుపై కూడా స్పష్టత వస్తుందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించారు. రేట్ల పెంపు విషయమై నిర్ణయం తీసుకోవడానికి మరింత ఓపికతో ఎదురుచూస్తామని ఆయన మరోసారి పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మంచి స్థాయిలో ఉందని, ఆర్థిక వ్యవస్థ అంచనాలు సానుకూలంగానే ఉన్నాయని పావెల్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, అమెరికా–చైనాల మధ్య చర్చలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ తదితర అంశాలు సమస్యాత్మకంగానే ఉన్నాయని, వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నామని వివరించారు. 2018లో భారీగా పన్నులు తగ్గించడం, ప్రభుత్వ వ్యయం పెంచడం వల్ల వృద్ధి పుంజుకుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో కుటుంబాల వ్యయాలు తగ్గడం, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుందేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ ఏడాది రేట్లను పెంచకూడదని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించిందని నిపుణులు అంటున్నారు. గతేడాది 3 శాతంగా ఉన్న అమెరికా వృద్ధి ఈ ఏడాది 2.1 శాతానికే పరిమితం కావచ్చని ఫెడరల్ రిజర్వ్ అంచనా వేస్తోంది. నిరుద్యోగ రేటు 3.7 శాతంగా, ద్రవ్యోల్బణం 1.8 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను వెలువరించింది. మార్కెట్లకు బూస్ట్.... ఫెడ్ ప్రకటన వెలువడగానే బుధవారం అమెరికా స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. కానీ చివరకు ఆ లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్గా ముగిశాయి. గురువారం హాంగ్సెంగ్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు, డ్యాక్స్ మినహా మిగిలిన యూరప్ మార్కెట్లు కూడా మంచి లాభాల్లో ట్రేడయ్యాయి. గురువారం అమెరికా మార్కెట్లు కూడా మళ్లీ పుంజుకుని భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఊ ఫెడ్ తాజా నిర్ణయాలు మన మార్కెట్లపై బాగానే ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాల ప్రకారం... శుక్రవారం భారత్ స్టాక్ సూచీలు భారీగా లాభపడే అవకాశాలున్నాయి. ► ఫెడ్ నిర్ణయంతో డాలర్ ఇప్పటికే పడిపోయింది. దీంతో రూపాయి మరింతగా పుంజుకోవచ్చు. ► ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండగలదన్న ఫెడ్ అంచనాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. బంగారం ధరలు పెరుగుతాయి. -
మార్కెట్లో కొనుగోళ్ల హుషారు
వడ్డీరేట్ల పెంపు విషయంలో గతంలో మాదిరి దూకుడుగా వ్యవహరించబోమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసిన వ్యాఖ్యలు మన స్టాక్ మార్కెట్లలో లాభాల వర్షాన్ని కురిపించాయి. సాధారణంగా డెరివేటివ్స్ సిరీస్ ముగింపు రోజు స్టాక్సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. లేదా పరిమిత శ్రేణిలో కదలాడి నష్టాల్లోనో, ఫ్లాట్గానూ ముగుస్తాయి. కానీ ఈ నవంబర్ సిరీస్ దీనికి భిన్నంగా జరిగింది. వడ్డీరేట్ల విషయంలో భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఊరటనిచ్చే వ్యాఖ్యలను ఫెడ్ చైర్మన్ పావెల్ చేశారు. మరోవైపు నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. వీటన్నిటికీ తోడు డాలర్తో రూపాయి మారకం ఇంట్రాడేలో 74 పైసలు బలపడి 70కు దిగువన (69.88) రావడం సానుకూల ప్రభావాన్ని చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 36వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ ముందుకే దూసుకుపోయాయి. సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 36,170 పాయింట్ల వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 10,859 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలకు ఇది దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయి. ఐటీ షేర్లు నష్టపోగా, బ్యాంక్, వాహన, వినియోగ, లోహ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఆరంభమే అదిరింది.... స్టాక్ మార్కెట్ ఆరంభమే అదిరిపోయింది. వడ్డీరేట్ల విషయమై పావెల్ చేసిన సానుకూల వ్యాఖ్యలతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ జోష్తో ఆసియా మార్కెట్లు మంచి లాభాలతో మొదలయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా దూకుడుగా ఆరంభమైంది. సెన్సెక్స్ 280 పాయింట్ల లాభంతో శుభారంభం చేయగా. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 10,800 పాయింట్ల ఎగువన ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 537 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల వరకూ పెరిగాయి. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో ఈక్విటీ మార్కెట్ జోరుగా పెరిగిందని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ జోసెఫ్ థామస్ చెప్పారు. వడ్డీరేట్ల విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసిన వ్యాఖ్యలు కొనుగోళ్లకు ఊపునిచ్చాయని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. నవంబర్లోనే భారీ లాభాలు... ఈ ఏడాది మొత్తం మీద ఈ నెలలోనే స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. నవంబర్ సిరీస్లో నిఫ్టీ 7 శాతం ఎగసింది. 10,100 పాయింట్ల నుంచి 10,859 పాయింట్ల వరకూ పెరిగింది. మార్కెట్ మరింత ముందుకేనా? రేపు (శనివారం) జరిగే జీ–20 సమావేశంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే ఒప్పందం ఏదైనా కుదిరితే మార్కెట్ మరింత ముం దుకు దూసుకుపోతుందని నిపుణులు చెబు తున్నారు. సూచీలు మరో 12– 15 శాతం వరకూ పెరగడానికి అవకాశముందని బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జని అంచనా వేశారు. ఎన్నికల కారణంగా ఒకింత ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని, మార్కెట్ పతనమైనప్పుడల్లా కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. గత 3–4 రోజుల్లో వాల్యూమ్స్ పెరిగాయని, ఇది ర్యాలీ మరింత కొనసాగడానికి సూచిక అని ఇదే సంస్థకు చెందిన విశ్లేషకులు, గౌరవ్ రత్నపర్కి పేర్కొన్నారు. నిఫ్టీ 11,000–11,140 స్థాయికి పెరగవచ్చని అంచనాలున్నాయన్నారు. మరోవైపు గత నాలుగు రోజుల్లో మార్కెట్ పెరిగినందున లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా స్టాక్ మార్కెట్లో ఈ జోరు కొనసాగే అవకాశాల్లేవని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మార్కెట్లో జోరు ఉండకపోవచ్చని, మార్కెట్ నుంచి బైటకు రావడానికి ఈ ర్యాలీ మంచి అవకాశమని మరికొందరు విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం. ► ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు–బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీలు 1–3% రేంజ్లో పెరిగాయి. ► రానున్న సంవత్సరాల్లో వృద్ధి జోరుగా ఉండగలదన్న అంచనాల కారణంగా హోటల్ షేర్లు ఇంట్రాడేలో 20% వరకూ పెరిగాయి. హోటల్ లీలా, కామత్, తాజ్ జీవీకే, ఓరియంటల్ హోటల్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► మార్కెట్ భారీ లాభాల్లో ఉన్నా కొన్ని బ్లూ చిప్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, యస్ బ్యాంక్ వంటి షేర్లు ఇందులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో రూ. 2 లక్షల కోట్లు గత 4 రోజుల్లో సెన్సెక్స్ మంచి లాభాలు సాధించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2.03 లక్షల కోట్లు పెరిగి రూ.1,42,49,327 కోట్లకు పెరిగింది. ఒక్క గురువారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.88,000 కోట్లు ఎగసింది. లాభాలు ఎందుకంటే... ► ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో జోరు.... ఫెడరల్ రిజర్వ్ రేట్లు తటస్థ స్థాయి కంటే దిగువనే ఉన్నాయని ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్ల విధానంలో మార్పులు.. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కానీ, అడ్డుకునేలా కానీ లేవని పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది రేట్లను ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా పెంచబోదని ఆయన సంకేతాలిచ్చారని నిపుణులు అంటున్నారు. పావెల్ వ్యాఖ్యల కారణంగా డాలర్ పతనం కాగా, బాండ్ల రేట్లు దిగివచ్చాయి. ఫెడ్ రేట్లను పెంచకపోతే, భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉండవు. విదేశీ పెట్టుబడులు కొనసాగుతాయని, ఇది మార్కెట్లకు మంచి చేస్తుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► రూపాయి 70 దిగువకు... ఎగుమతి దారులు డాలర్లను విక్రయించడం కొనసాగింది. దీనికి ముడి చమురు ధరలు దిగిరావడం తోడయింది. ఫలితంగా రూపా యి మరింత బలపడింది. ► విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. అక్టోబర్లో ఈక్విటీలను తెగ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లో రూ.9,000 కోట్ల వరకూ కొనుగోలు చేశారు. ఈ వారంలో 4 రోజులూ నికర కొనుగోళ్లు జరిపారు. ► చల్లబడ్డ చమురు ధరలు.... ముడి చమురు నిల్వలు ఏడాది గరిష్ట స్థాయికి చేరడంతో ముడి చమురు ధరలు తగ్గాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర 1 శాతం వరకూ తగ్గి 58 డాలర్లకు దిగివచ్చింది. ► సాంకేతిక కారణాలు... నిఫ్టీ 200 రోజుల చలన సగటు.. 10,774 పాయింట్లపైకి ఎగబాకడంతో సెంటిమెంట్ పాజిటివ్గా మారిందని ఎనలిస్ట్లు అంటు న్నారు. నిఫ్టీ కీలక 10,850 పాయింట్లపైన ముగియడంతో 11,000 దిశగా కదలనున్నదని, రానున్న నెల రోజుల్లో 11,400 స్థాయికి వెళ్లవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా. -
పసిడికి ఫెడ్ దెబ్బ
సాక్షి, ముంబై: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో బంగారం ధర క్షీణించింది. పావు శాతం వడ్డీరేటు పెంచుతూ బుదవారం ఫెడ్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు మరో రెండు సార్లు పెంపు వుంటుందనే అంచనాలతో పసిడి బలహీనపడింది. గ్లోబల్మార్కెట్లో పసిడి 0.1 శాతం తగ్గి ఔన్స్ బంగారం ధర 1298.61 వద్ద ఉంది. 1292 వద్ద ఒక వారం కనిష్టాన్ని తాకింది. కాగా దేశీయంగా బంగారం బుధవారం 150 రూపాయలు లాభపడింది. ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా పసిడి 13 రూపాయిలు నష్టంతో 31,143 వద్ద ఉంది. -
ఫెడ్ వడ్డన: రూపాయి జంప్
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి గురువారం సానుకూలంగా ప్రారంభమైంది. ఫెడ్ వడ్డీ రేటు పెంపు నిర్ణయంతో అమెరికా కరెన్సీ డాలర్ బలహీన పడిన నేపథ్యంలో రూపాయి పుంజుకుంది. నిన్నటి ముగింపు నుంచి కోలుకుంది. డాలరు మారకంలో రూపాయి 8పైసలు ఎగిసి 67.57 వద్ద మొదలైంది. బుధవారం 16పైసలు క్షీణించిన రూపాయి 67.65 వద్ద ఒకవారం కనిష్టాన్ని నమోదు చేసింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలరులో అమ్మకాలకు దిగినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. అంచనాలకు అనుగుణంగా ఫెడ్ 0.25 శాతం వడ్డీ రేటును పెంచడంతోపాటు ఈ ఏడాది మరో రెండుసార్లు పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా అమెరికా ఫెడ్ తన ఫండ్స్ రేటును 25శాతం పెంచింది. దీంతోపాటు 2018 మరోరెండుసార్లు, 2019లోనాలుగుసార్లువడ్డీ రేట్ల వడ్డన ఉంటుందనే సంకేతాలిచ్చింది. దీంతో అటు ఆసియా మార్కెట్లు దేశీయ స్టాక్మార్కెట్లు కూడా ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. -
ఫెడ్ ఎఫెక్ట్: నష్టాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: ఫెడ్ వడ్డీరేటు పెంపుతో, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయస్టాక్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనాయి. వరుస లాభాలకు చెక్ పెట్టిన కీలక సూచీ సెన్సెక్స్ 105 పాయింట్లు కోల్పోయి 35,633వద్ద, నిప్టీ 35 పాయింట్ల నష్టంతో 10,822వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా నిష్టీ 10850 స్తాయిని కోల్పోయింది. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఐటీ షేర్లు నష్టపోతున్నాయి. ఫార్మ లాభపడుతోంది. ఇన్ఫోసిస్కు టాప్ ఎగ్జిక్యూటివ్లు గుడ్బై చెప్పడంతో ఇన్ఫీ నష్టపోతుండగా, ఎస్బీఐ, ఐసీఐసీఐ, జీ, ఎస్బ్యాంకు , బజాజ్ నష్టపోతున్నాయి. ఐటీసీ, టాటా గ్లోబల్ తదితరాలు లాభపడుతున్నాయి. -
ఫెడ్ వడ్డీ రేటు పెంపు
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లనుమళ్లీ పెంచింది. ప్రామాణిక ఫెడరల్ ఫండ్స్ రేటును 25శాతం పెంచింది. తాజా పెంపుతో ఫెడ్ ఫండ్ రేటు 1.75 శాతం నుంచి 2.0 శాతానికి చేరింది. ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోం హెచ్. పోవెల్ మాట్లాడుతూ, 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా బలపడిందని, తిరిగి సాధారణ పరిస్తితికి చేరుకుంటోందని పేర్కొన్నారు. 2018లో నిరుద్యోగిత రేటు అంచనాలను 3.6 శాతానికి తగ్గించింది. 2019లో మూడు సార్లు, 2020లో మరో ఒక దఫా రేట్ల పెంపు ఉండనుంది. కాగా ఈ ఏడాది ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి కాగా ఈ సంవత్సరం చివరికల్లా మరో రెండు సార్లు పెంపు ఉంటుందని యూఎస్ ఫెడ్ అధికారుల అంచనా. చివరిసారి గత మార్చిలో వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన ఫెడ్ 2015నుంచి ఏడుసార్లు వడ్డీరేట్లను పెంచినట్లయింది. అలాగే, 2019, 2020 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 2 శాతం పైనే ఉంటుందని కూడా అంచనా వేసింది. -
‘కూచిభొట్ల’ దోషికి జీవితఖైదు
వాషింగ్టన్: అమెరికాలోని కన్సాస్ సిటీలో భారతీయ ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడికి యూఎస్ ఫెడరల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది ఫిబ్రవరిన 22న కన్సాస్లోని ఒక బార్లో కూచిభొట్ల, అతని స్నేహితుడు ఉన్నపుడు నిందితుడు ఆడం ప్యూరింటన్(52) కాల్పులు జరిపాడు. ‘మా దేశం విడిచి వెళ్లండి’ అని అరుస్తూ కాల్పులు జరిపి అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ప్యూరింటన్ దాదాపు 78 ఏళ్లు జైల్లో గడపాలని ఫెడరల్ న్యాయమూర్తి శనివారం తీర్పునిచ్చారు. అతనికి 100 ఏళ్లు పూర్తయినా బెయిలు లభించకుండా కోర్టు కఠిన శిక్ష విధించింది. కూచిభొట్ల హత్య కేసుతో పాటు అతని స్నేహితుడు అలోక్ మేడసానిపై, అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిపై కాల్పులు జరిపినందుకు ప్యూరింటన్పై అభియోగాలు మోపారు. అమెరికా అటార్నీ కార్యాలయం సైతం గత ఏడాది జూన్లో జాతి విద్వేష నేరం కింద మరో కేసు దాఖలు చేసింది. కోర్టు తీర్పును శ్రీనివాస్ భార్య సునయన స్వాగతించారు. ‘విద్వేషం ఎన్నటికి అంగీకారయోగ్యం కాదనే గట్టి సందేశం ఇచ్చింది. ఈ కేసులో పూర్తిగా సాయపడిన జిల్లా అటార్నీ ఆఫీసుకు, ఒలేథ్ పోలీసులకు నా కృతజ్ఞతలు’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన కూచిభొట్ల జీపీఎస్ తయారీ సంస్థ ‘గర్మిన్’లో ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజనీర్, ప్రోగ్సామ్స్ మేనేజర్గా పనిచేసేవారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాక యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ నుంచి ఎలక్ట్రికల్, అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. -
పసిడి మళ్లీ పైకే!
♦ గతవారం 1.5 శాతం పెరుగుదల ♦ దేశీయంగా మళ్లీ రూ.29వేల ఎగువకు వడ్డీ రేట్ల పెంపు విషయంలో రాబోయే రోజుల్లో కొంత ఉదార విధానాలు పాటించే అవకాశాలున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపటంతో పసిడి మళ్లీ కోలుకుంటోంది. దాదాపు ఐదు వారాల పాటు కొనసాగిన నష్టాల పరంపరకు బ్రేక్ వేస్తూ.. గత వారం లాభాలు నమోదు చేసింది. ఔన్సు బంగారం ఆగస్టు ఫ్యూచర్స్ రేటు అంతక్రితం వారంతో పోలిస్తే సుమారు 1.5 శాతం పెరిగి 1,227.8 డాలర్ల దగ్గర క్లోజయింది. వెండి కూడా అదే ధోరణిలో కోలుకుంటోంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్... 3 శాతం దాకా పెరిగి 15.90 డాలర్ల దగ్గర క్లోజయ్యాయి. రిటైల్ అమ్మకాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దానికన్నా బలహీనంగా ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాలపై మార్కెట్ వర్గాల్లో సందేహాలు నెలకొన్నాయి. రిటైల్ అమ్మకాలు మందగించడం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని, దీంతో పసిడి పార్టీ మళ్లీ మొదలైనట్లే భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, పసిడికి 1,237– 1,260 డాలర్ల మధ్య గట్టి నిరోధం ఎదురు కావచ్చు కనక ఇన్వెస్టర్లు ఈ స్థాయిల దగ్గర కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెబుతున్నారు. పెరిగితే 1,240 డాలర్ల వద్ద కీలకమైన రెసిస్టెన్స్, తగ్గితే 1,204 డాలర్ల వద్ద మద్దతు లభించగలదన్నది వారి విశ్లేషణ. రూ.29 వేల పైకి చేరిన పుత్తడి.. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, స్థానిక జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో దేశీ బులియన్ మార్కెట్లలో పుత్తడి గతవారం మరోసారి రూ.29 వేల ఎగువకి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదార్ల డిమాండ్తో వెండి ధర కూడా రూ. 38,000 పైకి చేరింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో అంతక్రిత వారంతో పోలిస్తే ఒకింత తక్కువగా రూ. 28,780 వద్ద ప్రారంభమైన మేలిమి బంగారం రేటు వారాంతానికి రూ. 29,050 వద్ద క్లోజయ్యింది. -
రూపాయి 28 పైసలు డౌన్
ముంబై: గత మూడు ట్రేడింగ్ సెషన్ల రూపాయి లాభాలకు సోమవారం బ్రేక్ పడింది. డాలర్తో రూపాయి మారకం 28 పైసలు క్షీణించి 64.56 వద్ద ముగిసింది. మూడు నెలల కాలంలో రూపాయి ఒక్క రోజులో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొదటిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందనే అంచనాలు, సిరియాపై అమెరికా క్షిపణుల దాడి నేపథ్యంలో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగడంతో అంతర్జాతీయ కరెన్సీ అయిన డాలర్... విదేశాల్లో బలపడింది. దీంతో మన దేశంలో కూడా డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయికి నష్టాలొచ్చాయి. ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, మార్చి నెల ద్రవ్యల్బోణ గణాంకాలు రేపు(బుధవారం) వెలువడనుండడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషణ. రోజంతా నష్టాలే..: డాలర్తో రూపాయి మారకం శుక్రవారం నాటి ముగింపు(64.28)తో పోల్చితే 64.30 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి మరింతగా నష్టపోయింది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది. ఇంట్రాడేలో 64.58 కనిష్ట స్థాయిని తాకిన రూపాయి చివరకు 28 పైసల నష్టంతో 64.56 వద్ద ముగిసింది. -
మార్కెట్ అప్రమత్తం
98 పాయింట్ల నష్టంతో 28,902కు సెన్సెక్స్ 23 పాయింట్ల నష్టంతో 8,924కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను కొనసాగించడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దీనికి బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్98 పాయింట్లు నష్టపోయి 28,902 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 8,924 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, రియల్టీ, ఆయిల్, గ్యాస్, పీఎస్యూ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 184 పాయింట్ల నష్టం ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేడు సాయంత్రం వస్తాయి. తుది ఫలితాలు శనివారం(ఈ నెల 11న) వెలువడతాయి. వరుసగా రెండు రోజుల పాటు అమెరికా స్టాక్ సూచీలు నష్టపోవడం, చైనా వాణిజ్య లోటు గణాంకాలు అంతర్జాతీయ వృద్ధిపై తాజాగా ఆందోళనలు రేకెత్తించడం... తదితర బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఫెడ్ రేట్ల పెంపు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపధ్యంలో మార్కెట్లో అప్రమత్తత పెరుగుతోందని జియజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. శుక్రవారం వెలువడే ఉద్యోగ గణాంకాలతో రేట్ల పెంపుపై మరింత స్పష్టత వస్తుందని వివరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 184 పాయింట్లు నష్టపోయింది. కొనసాగిన లోష షేర్ల నష్టాలు... లోహ షేర్ల నష్టాలు కొనసాగాయి. టాటా స్టీల్, నాల్కో, ఎన్ఎండీసీ, వేదాంత, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 2–4 శాతం రేంజ్లో పడిపోయాయి. -
వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాల్ అదే
అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడం వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగిస్తున్న జైట్లీ, ఎన్ని అడ్డంకులున్నా భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా వద్ధి చెందుతోందని పేర్కొన్నారు. చమురు ధరల్లో నెలకొన్న అనిశ్చితి కూడా వర్థమాన దేశాలకు రెండో అతిపెద్ద సవాల్గా నిలవబోతుందని ఉద్ఘాటించారు. వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్టంగా ఉన్న విధానాలకు స్వస్తి పలికామన్నారు. ఈ క్రమంలోనే బ్లాక్మనీ హోల్డర్స్ భరతం పట్టడానికి నోట్లను రద్దు చేసినట్టు చెప్పారు. భారత్ ప్రపంచంలో ఆరవ అతిపెద్ద తయారీదేశంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉందన్నారు. సీపీఐ ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంకు నిర్దేశించిన 2 శాతం నుంచి 6 శాతానికి మధ్యలోనే ఉందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. '' ఎఫ్ఐఐలు రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్ ఖాతా లోటు 1 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. 2016లో 3.2 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు, 2017లో 3.4 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేస్తోంది. వర్థమాన దేశాల వద్ధి రేటు 4.1 శాతం-4.5 శాతం పెరుగుతున్నాయి'' అని జైట్లీ పేర్కొన్నారు. -
బంగారం భారీ పతనం
• అంతర్జాతీయ మార్కెట్లో 36 డాలర్లు క్షీణత • దేశీయంగా రూ.600కు పైగా డౌన్ న్యూయార్క్/ ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావుశాతం వడ్డీరేటు పెంపు (0.25–0.50 శాతం శ్రేణి) ప్రభావం పసిడిపై సుస్పష్టమవుతోంది. పసిడి నుంచి పెట్టుబడులు వేగంగా బయటకు వెళుతున్నాయి. గురువారం ఒక్కరోజు కడపటి సమాచారం అందే సరికి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) ధర 36 డాలర్లు (3%) పడిపోయి రూ.1,127 డాలర్లకు తగ్గింది. ఇక వెండి కూడా ఇక్కడ 1% పైగా పడిపోయి, 16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా... ఇదే ధోరణి దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో కూడా కనిపించింది. పసిడి 10 గ్రాముల ధర కడపటి సమాచారం అందే సరికి రూ.653 పడిపోయి (2 శాతం) రూ.26,934 వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం భారీగా 6 శాతం పడిపోయింది. కేజీకి రూ.2,378 నష్టంతో రూ.39,350 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే, శుక్రవారం స్పాట్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులుఅంచనా వేస్తున్నారు. గురువారం ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి ధర రూ.550 పడిపోయింది. 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ.27,500, రూ.27,350 వద్ద ముగిశాయి. ఇక వెండి కూడా కేజీకి రూ.1,410పడిపోయి రూ.40,200కు దిగింది. -
ఫెడ్ ఆందోళనతో నష్టాలు...
• ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఒడిదుడుకులు • 95 పాయింట్ల నష్టంతో 26,603కు సెన్సెక్స్ • 39 పాయింట్ల నష్టంతో 8,182కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నేపథ్యంలో బుధవారం ఇతర ప్రపంచ మార్కెట్లలానే మన భారత స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. చివరకు మన మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 95 పాయింట్లు నష్టపోయి 26,603 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 8,182 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, పీఎస్యూ, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరగ్గా, ఐటీ, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ద్రవ్యోల్బణం తగ్గినా...: క్యూ2లో కోల్ ఇండియా నికర లాభం భారీగా తగ్గడంతో ఈ షేర్ 4 శాతం కుదేలవడం ప్రతికూల ప్రభావం చూపింది. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో తగ్గినప్పటికీ, అది ఎలాంటి సానుకూల ప్రభావం చూపించలేదు. ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనను ఇది ఏ మాత్రం తగ్గించలేకపోయింది. ఫెడ్ కోత 25 బేసిస్ పాయింట్లు ! ఫెడ్ పాలసీ నేపథ్యంలో ఇతర వర్థమాన మార్కెట్లలానే మన మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురైందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో నిఫ్టీ 8,200 పాయింట్ల దిగువన ముగిసిందని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. -
ఫెడ్ భయంలో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఫెడ్ భయంతో ఆసియా మార్కెట్లు ట్రెండ్ బలహీనంగా ఉంది. దీంతో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడటంతో ప్రస్తుతం సెన్సెక్స్ 29 పాయింట్లు తగ్గి 26,673 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 8207వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడ్ నుంచి వడ్డీ పెంపు అంచనాలతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు నష్టాలలోకి జారుకుంటున్నాయి. ఐటీ, రియల్టీ కూడా 0.4 శాతం పుంజుకోగా, మెటల్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 0.8-0.2 శాతం మధ్య నీరసించాయి. కోల్ ఇండియా టాటా మోటార్స్, అల్ట్రాటెక్, ఐషర్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫ్రాటెల్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు రెండు రోజుల ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు(బుధవారం) ముగిమనున్నాయి. ఈ రోజు రాత్రికి నిర్ణయాలు వెలువడే అవకాశముంది. ఈ అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు రికార్డు స్తాయిలను నమోదు చేస్తున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.05 పైసల నష్టంతో 67.47 వద్ద, ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పసిడి రూ.135 నష్టంతో రూ. 27,531 వద్ద ఉంది. -
అమెరికా ఫెడ్ నిర్ణయం కీలకం
• 25 బేసిస్ పాయింట్ల ఫెడ్ పెంపు అంచనాలు • అంతకు మించితే అమ్మకాల ఒత్తిడి • ద్రవ్యోల్బణ గణాంకాలూ కీలకమే • ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే చర్యలు.. ఈ వారం స్టాక్ మార్కెట్కు కీలకమని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. దీంతోపాటు దేశీయంగా నవంబర్ నెల వినియోగదారుల, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు, వివిధ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ల పోకడలు ఈ వారం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. పెద్ద నోట్ల కరెన్సీ రద్దు కారణంగా పార్లమెంట్లో ఏర్పడిన ప్రతిష్టంభన, జీఎస్టీ సంబంధిత అంశాలపై నెలకొన్న స్తబ్దతను తొలగించే ప్రభుత్వ చర్యలు తదతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అమ్మకాల ఒత్తిడి రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈ మంగళవారం(ఈ నెల 13న)మొదలవుతుంది. ఈ సమావేశంపై ప్రపంచమంతా ఆసక్తి నెలకొన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే, భారత్ వంటి వర్ధమాన దేశాల నుంచి భారీగా విదేశీ పెట్టుబడులు తరలిపోతాయనే అంచనాలున్నాయి. ఫెడ్ రిజర్వ్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. అంతకంటే ఎక్కువ కోత ఉంటే మాత్రం అమ్మకాల ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ రేట్ల కోతకు సంబంధించి ఫెడ్ అందించే సంకేతాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని కొటక్ సెక్యూరిటీస్కు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ప్రకటిస్తే, డాలర్తో రూపాయి మారకం తిరిగి 68 స్థాయికి పతనమవుతుందని కొటక్ సెక్యూరిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్(కరెన్సీ డెరివేటివ్) అనింద్య బెనర్జీ చెప్పారు. ఇక దేశీయంగా చూస్తే మంగళవారం(ఈ నెల13న) నవంబర్ నెల వినియోగదారుల ద్రవ్యోల్బ ణం, బుధవారం (ఈ నెల 14న) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు ఈ వారం ప్రారంభంలో స్టాక్ సూచీలు స్పందిస్తాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ చెప్పారు. తరలిపోతున్న విదేశీ నిధులు ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్ నుంచి రూ. 17,392 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో రూ.138 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.28,881 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్నుంచి రూ.42,101 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు -
నష్టాల బాటలోనే పసిడి
ముంబై: అంతర్జాతీయంగా బేరిష్ ధోరణి, దేశీయంగా పెద్ద నోట్ల రద్దుతో ఆభరణాలకు డిమాండ్ తగ్గడం తదితర అంశాలతో పసిడి వరుసగా అయిదో వారమూ నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో పుత్తడి ధరలపై ఒత్తిడి మరింతగా పెరిగింది. ముంబై బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం పది గ్రాముల ధర అంత క్రితం వారం ముగింపు రూ. 28,530తో పోలిస్తే రూ. 345 నష్టంతో రూ. 28,185 వద్ద ముగిసింది. ఆభరణాల బంగారం కూడా అంతే నష్టంతో రూ. 28,380 నుంచి తగ్గి రూ. 28,035 వద్ద ముగిసింది. వెండి కిలో ధర మాత్రం రూ. 41,815–40,790 మధ్య కదిలి చివరికి రూ. 775 లాభంతో రూ. 41,565 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం రేటు ఫిబ్రవరి అనంతరం కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఈటీఎఫ్ల అమ్మకాలు మందకొడిగా ఉండటం తదితర అంశాల కారణంగా 2017లో పసిడి ధరల అంచనాలను ఔన్సుకు (31.1 గ్రాములు) 1,438 డాలర్ల నుంచి 1,338 డాలర్లకు తగ్గిస్తున్నట్లు క్రెడిట్ సూసీ గ్రూప్ వెల్లడించింది. -
రుపీకి మరింత పతనం తప్పదట!
-
రుపీకి మరింత పతనం తప్పదట!
ముంబై: ఫెడ్ అంచనాలతో విలవిల్లాడుతున్న దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలహీన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ డ్యుయిష్ బ్యాంక్ అభిప్రాయపడుతోంది. గత శుక్రవారం రికార్డు స్థాయి పతనంతో 37 నెలల కనిష్టాన్ని నమోదు చేసిన రూపాయి .ఇకముందు మరింత బలహీన పడే అవకాశాలున్నాయని చెప్పింది. 2017 చివరి నాటికి డాలర్ మారకపు విలువలో 72.5 స్తాయికి దిగజార వచ్చని అంచనావేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు భారీగా పెంచనుందన్న బలమైన అంచానాలతో కరెన్సీ మార్కెట్ల మరింత బలహీనం కానున్నాయని చెప్పింది. ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలోపేతం దేశీయ కరెన్సీ పతనానికి ప్రధాన కారణమని పేర్కొంది. అలాగే రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూపాయి విలువను స్థిరీకరించేందుకు మార్కెట్లో జోక్యం చేసుకున్నప్పటికీ , డాలర్ పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో నామమాత్రపు చర్యలు సరిపోవని డ్యుయిష్ బ్యాంక్ విశ్లేషకులు తెలిపారు. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి పడిపోవడం బలహీన సంకేతమేని డ్యుయిష్ బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన నోట్ లో హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం అనంతరం అమెరికా బాండ్ వ్యాపారం 10 సం.రాల గరిష్టానికి ఎగబాకడం, డీమానిటైజేషన్ తరువాత భారత బాండ్ మార్కెట్ గణనీయం పడిపోయిందని వ్యాఖ్యానించింది. కాగా రూపాయి గురువారం బుధవారం ట్రేడింగ్ లో 68,86 రికార్డు స్థాయికి దిగజారింది. రూపాయి మద్దతునిచ్చేందకు ఆర్ బీఐ చర్యలతో 68,47 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 17,262.32 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించిన సంగతి తెలిసిందే. -
గతవారం బిజినెస్
కింగ్ఫిషర్ మూసివేతకు ఆదేశం ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు విజయ్మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ యన నియంత్రణలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స లిమిటెడ్ అధికారిక మూసివేతకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బ్రిటన్కు చెందిన ఎయిర్లైన్ కంపెనీ ఎయిరోట్రన్కు రూ.35 కోట్ల బకాయిల చెల్లింపు వైఫల్యం కేసులో హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థ కింగ్ఫిషర్ సంస్థకు ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాలను సరఫరా చేసింది. ఫారెక్స్ నిల్వలు డౌన్ దేశీ విదేశీ మారక నిల్వలు నవంబర్ 11తో ముగిసిన వారంలో 1.19 బిలియన్ డాలర్ల క్షీణతతో 367.04 బిలియన్ డాలర్లకు పడ్డాయి. విదేశీ కరెన్సీ అసెట్స్లో తగ్గుదలే ఫారెక్స్ నిల్వల క్షీణతకు కారణమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల క్షీణతతో 342.77 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక బంగారు నిల్వలు స్థిరంగా 20.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 368.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు సమయం దగ్గరపడుతోందని ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జన్నెత్ యెలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 0.25-0.50 శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు వడ్డీరేట్ల పెరుగుదలకు దోహద పడతాయని వివరించారు. రేట్ల పెంపునకు మరీ సమయం తీసుకుంటే అది ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. త్వరలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ టెలికం రంగ సంస్థ భారతి ఎయిర్టెల్ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తోంది. డిసెంబర్లోనే ఈ సర్వీసులను మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి జూలై-సెప్టెంబర్లో ఆరంభించాలని అనుకున్నప్పటికీ ప్రారంభ తేదీ వాయిదా పడుతూ వస్తోంది. పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎయిర్టెల్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్తో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్క్లూజన్, ఈపేమెంట్స్, ఈఅగ్రికల్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని అప్లికేషన్సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రాధాన్యమిస్తాం’ అని బిల్గేట్స్ వివరించారు. ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాల్లో కోత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ తాజాగా 2016-17 ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను తగ్గించింది. వీటిని 8-10 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ వంటి అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా నాస్కామ్ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ సాఫ్ట్వేర్ సర్వీసుల్లో 10-12 శాతం వృద్ధిని అంచనా వేసింది. బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటి పలు అంశాలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. ఏసీసీ, అంబుజాల్లో లఫార్జే వాటా అప్ లఫార్జే హోల్సిమ్ కంపెనీ ఏసీసీ, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో తన వాటాలను మరింతగా పెంచుకుంది. లఫార్జే హోల్సిమ్ అనుబంధ కంపెనీ హోల్డర్ ఇండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 3.91 కోట్ల అంబుజా సిమెంట్స్ షేర్లను, 78.7 లక్షల ఏసీసీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ షేర్ల కొనుగోళ్ల విలువ రూ.1,832 కోట్లు. ఈ షేర్ల కొనుగోళ్లతో హోల్డర్ఇండ్ ఇన్వెస్ట్మెంట్ వాటాలు అంబుజా సిమెంట్స్లో 61.62 శాతం నుంచి 63.11 శాతానికి, ఏసీసీలో 0.29 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగారుు. టోకు ధరలు ’కూల్’ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్లో కొంత శాంతించింది. సెప్టెంబర్లో 3.57 శాతంగా ఉన్న ఈ రేటు అక్టోబర్లో 3.39 శాతానికి దిగివచ్చింది. అంటే సెప్టెంబర్లో ఉన్న ఆహార ధరల పెరుగుదల వేగం (గత ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) అక్టోబర్లో తగ్గిందన్నమాట. ఆహార ధరలు అదుపులో ఉండడం దీనికి ఒక కారణం. గత ఏడాది ఇదే నెలలో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరుగుదలలో లేకపోగా 3.70 శాతం క్షీణతలో ఉంది. వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్లో 14 నెలల కనిష్ట స్థారుు 4.20 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. రెండవ నెలా పెరిగిన ఎగుమతులు భారత్ ఎగుమతులు వరుసగా రెండవ నెలలోనూ సానుకూల ఫలితాన్ని అందించాయి. వార్షికంగా చూస్తే... అక్టోబర్లో 9.59 శాతం వృద్ధి నమోదయిది. విలువ 23.51 బిలియన్ డాలర్లు. ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం మొత్తం గణాంకాల మెరుగుకు కారణమయియంది. ఇవే రంగాల దన్నుతో సెప్టెంబర్లో ఎగుమతుల వృద్ధి 4.62 శాతం (22.9 బిలియన్ డాలర్లు)గా నమోదయిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్లో దేశం దిగుమతులను చూస్తే... 8.11 శాతం వృద్ధి నమోదయియంది. విలువ రూపంలో ఇది 33.67 బిలియన్ డాలర్లు. వాహన రంగంలో 6.5 కోట్ల ఉద్యోగాలు! దేశీ వాహన పరిశ్రమలో వచ్చే దశాబ్ద (పదేళ్లు) కాలంలో 6.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మారుతీ సుజుకీ అంచనా వేసింది. ఇదే సమయంలో దేశ జీడీపీలో వాహన పరిశ్రమ వాటా 12 శాతానికి చేరుతుందని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కెనిచి అయుకవ అభిప్రాయపడ్డారు. డీల్స్.. అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్ఎల్సీ (డబ్ల్యూఎఫ్టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనుంది. ఫేషియల్ రికగ్నిషన్ స్టార్టప్ ‘ఫేషియోమెట్రిక్స్’ను సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్బుక్’ కొనుగోలు చేసింది. అరుుతే ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఫేస్బుక్ వెల్లడించలేదు. రిలయన్స ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు సంయుక్తంగా ఆరుుల్, గ్యాస్, ఎరువులు, విద్యుత్తు, ఫార్మా, టెలికం వంటి పలు ఇతర పరిశ్రమల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్స అందిస్తాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ హర్మన్ను కొనుగోలు చేయనుంది. ఇందుకు 8 బిలియన్ డాలర్లు (రూ.53,400 కోట్లు సుమారు) వెచ్చించనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. డీల్లో భాగంగా హర్మన్కు చెందిన ఒక్కో షేరుకు 112 డాలర్లను శాంసంగ్ చెల్లించనుంది. -
అక్కడ ఫెడ్ భయం... ఇక్కడ నోట్ల రద్దు నీరసం!
ముంబై/న్యూయార్క్: సమీప కాలంలో పసిడి అడుగులు తడబాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణి) పెంపు భయాలు ఒకవైపు... దేశీయంగా రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం పసిడి బలహీనతకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి . డిసెంబర్ 13-14 తేదీల్లో వాషింగ్టన్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు వినబడుతున్నాయి ఈ పరిణామం పసిడి గమనానికి ఒక దిశా నిర్దేశం చేస్తుందన్న వాదనలు ఉన్నాయిఇక దేశీయంగా చూస్తే... పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా డిమాండ్ ఉన్నప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయిపలు ఆంక్షలు, ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వారంలో అసలు ఢిల్లీ, ముంబైలలో బంగారం షాపులు అసలు తెరవకపోవడం గమనార్హం. ధరల జారుడు...: శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధరలు భారీగా పడిపోయాయిఅంతర్జాతీయంగా ఔన్స (31.1గ్రా) ధర దాదాపు 17 డాలర్లు పడిపోకయి 1,207 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగానూ ఇదే పరిస్థితి. ముంబై స్పాట్ మార్కెట్లో ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.1,205 తగ్గి రూ.29,310కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిపడిపోయి.29,160 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.3,655 పడిపోయి.41,765 వద్దకు చేరింది. -
రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది: ఫెడ్
వాషింగ్టన్: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు సమయం దగ్గరపడుతోందని చైర్పర్సన్ జన్నెత్ యెలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 0.25-0.50 శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు వడ్డీరేట్ల పెరుగుదలకు దోహద పడేవిగా వివరించారు. కాంగ్రెస్ జారుుంట్ ఎకనమిక్ కమిటీకి ఆర్థిక వ్యవస్థ గురించి ఆమె వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రమంగా రేటు పెంపు సంకేతాలను ఇచ్చారు. రేట్ల పెంపునకు మరీ సమయం తీసుకుంటే అది ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కూడా ఆమె అన్నారు. డిసెంబర్ 13,14 తేదీల్లో వాషింగ్టన్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలకు తాజా యెలెన్ వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నారుు. -
బంగారం.. రెండు వారాలు ఆగండి!
-
బంగారం.. రెండు వారాలు ఆగండి!
కొంత వెనక్కు తగ్గవచ్చంటున్న నిపుణులు ముంబై/న్యూయార్క్: పసిడికి సంబంధించి వచ్చే రెండు వారాలూ వేచిచూసే ధోరణి అవలంబించడం మంచిదన్నది నిపుణుల సూచన. అమెరికా ఫెడ్ ఫండ్ రేటును (ప్రస్తుత శ్రేణి 0.25-0.50 శాతం) పెంచే విషయంలో నెలకొన్న సందిగ్ధత... పసిడిపైనా పడుతుందన్నది వారి వాదన. మొత్తంమీద పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,340 డాలర్ల దిగువకు పడిపోవడం వెనకడుగును సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది మద్దతు స్థాయి కావటం వల్ల ఇక్కడి నుంచి పసిడి పెరుగుతుందా? లేక మరింత కిందకు జారుతుందా? అన్నది ఫెడ్ ఫండ్ రేటుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 0.25 శాతం నుంచి ఫెడ్ ఫండ్ రేటు పెరిగితే... క్రమంగా ఔన్స్ బంగారం 1,000 డాలర్ల దిగువకు జారిపోతుందన్న విశ్లేషణలకు భిన్నంగా ఈ ఏడాది ప్రారంభం నుంచీ భారీగా పెరిగి ఒక దశలో 1,370 డాలర్లకు చేరిన సంగతి గమనార్హం. వారంలో పసిడి కదలికలు... కాగా శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధర భారీగానే పడింది. అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్లో పసిడి ధర ఔన్స్కు వారం వారీగా చూస్తే 21 డాలర్లు పడి 1,324 డాలర్ల వద్ద ముగిసింది. వెండి కూడా నష్టాలతో 18.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారం వారీగా రూ.335 తగ్గి రూ.31,385 వద్ద ముగిసింది. 99.5 స్వఛ్చత ధర సైతం అంతే స్థాయిలో తగ్గి రూ.31,235కు దిగింది. (డాలర్ మారకంలో రూపాయి విలువ 67.06) ఒత్తిడి ఉంటుంది... సెప్టెంబర్లో ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయం, ఆర్థిక వ్యవస్థ అందుకు తగిన విధంగా ఉందని ఫెడ్ చైర్మన్ ప్రకటన పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు 1,285-1,300 శ్రేణికి పడిపోయే అవకాశాలూ లేకపోలేదు. - ఫృద్వీరాజ్ కొఠారీ, ఎండీ, రిద్దిసిద్ధి బులియన్స్ దేశంలో రూ.30 వేల పైనే... డాలర్ ఇండెక్స్ పెరగవచ్చు. ఇది పసిడిపై ఒత్తిడిని పెంచే అంశమే. అయితే రానున్న పెళ్లిళ్ల సీజన్ పసిడికి దేశీయంగా కొంత పటిష్టతను చేకూర్చే అంశం. భారత్లో పసిడి ట్రేడింగ్ సమీప కాలంలో రూ.30,000-రూ.30,500 శ్రేణిలో ఉండవచ్చు. - నవీన్ మాథూర్, ఏంజిల్ బ్రోకింగ్ -
ఫెడ్ నిర్ణయంతో పుత్తడి జోరు
ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో పుత్తడి ధరలు పుంజుకుంటున్నాయి. వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలనే నిర్ణయంతో బులియన్ మార్కెట్ లో పసిడి ధరల జోరు పెంచాయి. నిన్నటి ధరలతో పోలిస్తే గురువారం స్థిరంగా ఉన్నాయి. మరోవైపు ఫెడ్ ప్రకటనతో అమెరికా కరెన్సీ డాలర్ బలహీనపడింది. ఈ పరిణామాలతో పుంజుకున్న పసిడి ధరలు రెండు వారాల గరిష్టాన్ని తాకాయి. ప్రస్తుతం ఫెడ్ రేటు 0.25- 0.50 శాతం శ్రేణిలో నిలపడంతో ఫ్యూచర్స్ మార్కెట్ లో బంగార ధర 1.52శాతం లాభపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కూడా పాజిటివ్ ట్రెండ్ నెలకొంది. పది గ్రా. బంగారం 249 రూ. పైగా లాభపడి రూ. 31,235 దగ్గర ఉంది. అమెరికాలో బుధవారం నాటి మార్కెట్ లో ఔన్స్ బంగారం ధరం 1,338.7 డాలర్లుగా నమోదైంది. -
లాభాల స్వీకరణ..119 పాయింట్లు డౌన్
♦ అమెరికా ఫెడ్ మీటింగ్పై ముందు జాగ్రత్త ♦ 28,000 స్థాయి దిగువకు సెన్సెక్స్ ♦ 8,600 స్థాయి కిందకు నిఫ్టీ ముంబై : అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకుల నుంచి కీలక నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో లాభాల స్వీకరణతో మంగళవారం స్టాక్ సూచీలు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 28,121 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన సెన్సెక్స్ తదుపరి 28,000 పాయింట్ల దిగువకు జారిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 119 పాయింట్ల క్షీణతతో 27,977 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 45 పాయింట్ల తగ్గుదలతో 8,591 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం మంగళ , బుధవారాల్లో జరుగుతోంది. వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయం పట్ల ప్రపంచ మార్కెట్లో జాగురూకత నెలకొన్నదని, ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా లాభాల స్వీకరణ జరిగినట్లు జియోజిత్ బీఎన్ఫీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది. ఫలితాల ప్రభావం... తాజాగా క్యూ1 ఫలితాలు ప్రకటించిన మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ షేర్లు క్షీణించాయి. మారుతి నికరలాభం 23 శాతం పెరిగినా, ఈ షేరు 1.44 శాతం తగ్గుదలతో రూ. 4,485 వద్ద ముగిసింది. నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ షేరు 4.37 శాతం క్షీణించి రూ.3,323 వద్ద క్లోజయ్యింది. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్ ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, జీఎస్టీ బిల్లు ఆమోదానికి అడ్డంకులు ఏర్పడే అవకాశాలుండటంతో మార్కెట్ గరిష్టస్థాయిలో స్థిరపడలేకపోయిందని ఆనంద్ జేమ్స్ వివరించారు. -
అమెరికా ఫెడ్ వైపు పసిడి చూపు!
వడ్డీరేట్ల పెంపు అంచనాలు తగ్గితే... పరుగే: నిపుణులు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయం వైపు పసిడి చూస్తుంది. ప్రస్తుతం 0.50 శాతంగా ఉన్న ఫండ్ రేటును మరింత పెంచడంపై ఈ నెల 14-15 తేదీల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోనుంది. రేటు పెంపు అవకాశాలు లేకపోతే... రానున్న కొద్ది రోజుల్లో నెమైక్స్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో పసిడి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) తిరిగి 1,300 డాలర్లకు చేరుతుందని కొందరు నిపుణుల వాదన. నెల రోజుల క్రితం ఈ స్థాయికి చేరిన పసిడి... అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుదల అంచనాల వార్తలకు లోబడి తిరిగి 1,200 డాలర్ల దిగువ స్థాయికి పడిపోయింది. అయితే శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్ ట్రేడింగ్లో ఒక్కసారిగా 2 శాతంపైగా పెరిగింది. మూడు నెలల్లో ఒకేరోజు ఈ స్థాయిలో పసిడి ధర పెరగడం ఇదే తొలిసారి. మేలో ఉపాధి అవకాశాలు తగ్గడం, నాన్-మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పడిపోవడంసహా... అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి తాజాగా వెలువడిన ‘మందగమన’ వార్తలు, దీనితో ఇప్పట్లో ఫెడ్ రేటు పెరగదన్న ఊహాగానాలు, డాలర్ బలహీనత వంటి అంశాలు పసిడి ఒక్కసారిగా పుంజుకోడానికి కారణం. ఆయా అంశాలు డాలర్ ను సైతం ప్రధాన కరెన్సీల బాస్కెట్లో మూడు వారాల కనిష్ట స్థాయికి బలహీనపరిచాయి. మే 12 కనిష్ట స్థాయి 93.86కు డాలర్ విలువ పడిపోయింది. ఇవన్నీ పసిడికి శుక్రవారం కలిసి వచ్చాయి. ఒక్కరోజే 2.5 శాతం (దాదాపు 30 డాలర్లు) ఎగసింది. 1,243 డాలర్ల వద్ద ముగిసింది. మొత్తంమీద వారంలో 26 డాలర్లు పెరిగింది. వెండి ఔన్స్ ధర సైతం స్వల్పంగా పెరిగి 16 డాలర్లు దాటింది. భారత్ను చూస్తే... శనివారం ముంబై బులియన్ మార్కెట్కు సెలవు. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పెరుగుదల ప్రభావం ఇక్కడలేకపోయినా, ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత ధర ఒక్కసారిగా శనివారం భారీగా 10 గ్రాములకు రూ.550 ఎగసి రూ. 29,225కు పెరిగింది. ఇక వారం వారీగా శుక్రవారంనాటికి ముంబై ప్రధాన బులియన్ మార్కెట్ను చూస్తే.. పసిడి వరుసగా మూడవవారమూ నష్టపోయింది. 10 గ్రాములు 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు స్వల్పంగా రూ.100 చొప్పన తగ్గి వరుసగా రూ.28,805, రూ.28,655 వద్ద ముగిశాయి. వెండి ధర కేజీకి రూ.410 తగ్గి రూ.38,945కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావానికి అనుగుణంగా సోమవారం ముంబైలో బులియన్ ధర పెరిగే అవకాశం ఉంది. -
7,750 దిగువకు నిఫ్టీ
♦ నాలుగో రోజూ నష్టాలే ♦ వెంటాడుతున్న ఫెడ్ భయాలు ♦ 72 పాయింట్ల నష్టంతో 25,230కు సెన్సెక్స్ ♦ 19 పాయింట్లు నష్టపోయి 7,731కు నిఫ్టీ ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే భయాలకు తోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు క్షీణించడం ఇది వరుసగా నాలుగోసారి. బీఎస్ఈ సెన్సెక్స్ రెండు వారాల కనిష్ట స్థాయికి పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,750 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్లో చివరకు సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి 25,230 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 7,731 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్లు, ఫార్మా, రియల్టీ, వాహన, లోహ, టెక్నాలజీ, ఆయిల్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు లాభపడ్డాయి. మరింతగా ఒడిదుడుకులు..: బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఒక దశలో 180 పాయింట్లు లాభపడింది. పై స్థాయలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఈ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 549 పాయింట్లు నష్టపోయింది. మే నెల డెరివేటివ్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనున్నందున ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. ముడి చమురు ధరల పతనం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీసీ 5% అప్..: అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలు, బోనస్ షేర్ల ప్రకటన అంశాల నేపథ్యంలో ఐటీసీ షేర్ దూసుకుపోయింది. ఇంట్రాడేలో రూ.355 గరిష్టాన్ని తాకిన ఈ షేర్ చివరకు 5% లాభంతో రూ.347 వద్ద ముగిసింది. ఐటీసీ షేర్ను రూ.385 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని క్రెడిట్ సూసీ, రూ.390 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సిటి సంస్థలు అప్గ్రేడ్ చేయడం ఈ షేర్ జోరును మరింతగా పెంచింది. -
ఫెడ్ ప్రభావం.. 305 పాయింట్ల పతనం
♦ 25,400 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ♦ రెండు వారాల కనిష్టస్థాయి ఇది ♦ అంతర్జాతీయ ట్రెండ్తో పాటే... ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఊపందుకోవడంతో అంతర్జాతీయ ట్రెండ్ను అనుసరిస్తూ గురువారం భారత్ సూచీలు రెండు వారాల కనిష్టానికి పతనమయ్యాయి. 305 పాయింట్లు నష్టంతో బీఎస్ఈ సెన్సెక్స్ 25,400 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంతభారీ క్షీణత మూడు వారాల్లో ఇదే మొదటిసారి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్ల తగ్గుదలతో 7,783 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.ప్రపంచ ట్రెండ్కు తోడు పీ-నోట్స్పై ఇన్వెస్టర్లలో తాజా ఆందోళనలు తలెత్తడం కూడా సెంటిమెంట్ను బలహీనపర్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బీజేపీ విజయాన్ని పక్కనపెట్టిన ఇన్వెస్టర్లు... వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల్ని తాజా ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు విస్మరించారని విశ్లేషకులు చెప్పారు. ఫెడ్, పీ-నోట్స్ ఆంశాలపైనే మార్కెట్ దృష్టినిలపడంతో ఈక్విటీలు పతనమయ్యాయని వివరించారు. జూన్లో వడ్డీ రేట్లను పెంచాలన్న అభిప్రాయాన్ని అధికశాతం ఫెడ్ కమిటీ సభ్యులు వ్యక్తంచేసినట్లు ఇటీవలి సమావేశపు మినిట్స్ వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారని బీఎన్పీ పారిబాస్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు. పతనమైన సన్టీవీ, ఆదానీ పోర్ట్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోకపోవడంతో సన్టీవీ షేరు 13 శాతంపైగా పతనమై రూ. 371 వద్ద ముగిసింది. సన్టీవీ అధినేత కళానిధి మారన్...డీఎంకే చీఫ్ కరుణానిధికి సమీప బంధువు, సన్నిహితుడుకావడంతో ఆ పార్టీ అధికారంలోకి వస్తే సన్టీవీ నెట్వర్క్ మరింత విస్తరించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొనుగోలు చేయడంతో రెండు రోజుల క్రితం ఈ షేరు 10% పెరగడం తెలిసిందే. ఇక సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా ఆదాని పోర్ట్స్ 6.14% క్షీణించి రూ. 172 వద్ద క్లోజయ్యింది. ప్రపంచ మార్కెట్లదీ ఇదే బాట.... ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు కూడా క్షీణబాట పట్టాయి. ఆసియాలోని చైనా, హాంకాంగ్, తైవాన్, కొరియా సూచీలు 0.2-1.3% మధ్య తగ్గాయి. యూరప్లోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇండెక్స్లు 0.8-1.8% మధ్య పతనమయ్యాయి. అమెరికా మార్కెట్ కూడా కడపటి సమాచారం అందేసరికి 1% క్షీణతతో ట్రేడవుతోంది. -
దేశంలో పసిడికి సీజనల్ డిమాండ్: నిపుణులు
ముంబై: దేశీయంగా ఉన్న డిమాండ్ సమీప కాలంలో పసిడి ధరలకు పటిష్టత చేకూర్చుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు.. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి అమెరికా ఫెడ్ రిజర్వ్ ఇప్పట్లో నిర్ణయం తీసుకోబోదన్న అంచనా సైతం పసిడికి సమీప కాలం లో బలం చేకూర్చుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నా... సమీప కాలంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,150 డాలర్ల దిగువకు మాత్రం పడిపోయే పరిస్థితి లేదన్నది వారి వాదన. కాగా దేశీయంగా పసిడి వరుసగా రెండవ వారమూ లాభాల బాటన పయనించింది. ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర వారీ వారీగా రూ.325 లాభపడి రూ.29,060 వద్ద ముగిసింది. 99.9 ప్యూరి టీ ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,210 వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే... కేజీకి భారీగా రూ. 1,755 లాభపడి రూ.38,375 వద్దకు పెరిగింది. ఇక నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ జూన్ డెలివరీ ధర వారంవారీగా 9 డాలర్లు తగ్గి 1,234 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 15 డాలర్లు-16 డాలర్ల శ్రేణిలో తిరుగుతోంది. -
టీసీఎస్కు భారీ ఫైన్..
న్యూయార్క్\ముంబై: భారతదేశం నుంచి సర్వీసెస్ సెక్టార్లో ప్రథమంగా చెప్పుకునే కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్). ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలకు సర్వీసెస్ను అందించే టీసీఎస్కు యూఎస్ ఫెడరల్ కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. హెల్త్ కేర్కు సంబంధించిన సాఫ్ట్వేర్ను అనుమతి లేకుండా తీసుకున్నందుకు అమెరికాలో టాటాకు చెందిన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ను వెస్టర్న్ అమెరికాలోని విస్కన్సిన్ జిల్లాలో ఉన్న ఫెడరల్ కోర్టు ఎపిక్ సిస్టమ్స్కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. ఈ సాఫ్ట్వేర్ తయారీ ప్రక్రియను 2012లో ఇరు కంపెనీలు ప్రారంభించాయి. ఒరేగాన్ కైసర్ పర్మనెంట్లోని కన్సల్టెంట్లను క్లయింట్లుగా ఎరిక్ సిస్టమ్స్ నియమించుకుంది. వీరు సాఫ్ట్వేర్కు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను ( వీటిలో 1,687 డాక్యుమెంట్లు ఎరిక్ సిస్టమ్స్కు చెందినవి) తీసుకున్నారు. ఈ కేసును రెండు వారాల పాటు విచారించిన ఫెడరల్ జడ్జి విలియం ఎమ్.కాన్లీ ఎరిక్ అనుమతి లేకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించుకున్నందుకు శిక్షగా 700 మిలియన్ డాలర్లు, నష్ట పరిహారంగా 240 మిలియన్ డాలర్లను టాటా ఇంటర్నేషనల్ ఎరిక్ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చారు. తమ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుని ప్రత్యర్ధి కంపెనీ మెడ్ మంత్ర అనే హెల్త్కేర్ సాఫ్ట్వేర్ను తయారుచేసుకున్నాయని ఎపిక్ ఆరోపిస్తోందని తెలిపారు. ఎపిక్కు చెందిన సమాచారాన్ని కైసర్ పర్మనెంటే కంపెనీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు టీసీఎస్కు చెందిన ఉద్యోగి ఆ సమాచారాన్ని మరో ఇద్దరు ఉద్యోగులతో పంచుకున్నారని కోర్టుకు తెలిపింది. కొన్నేళ్లుగా కష్టపడి తయారుచేసుకున్న సమాచారాన్ని టాటా కంపెనీయే ఉద్యోగుల నుంచి తస్కరించిందని ఎరిక్ ఆరోపిస్తోంది. దీనివల్ల మార్కెట్లో ఎపిక్ను నష్టపోయేలా చేయడం టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుందని తన 39 పేజీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన ముంబై టీసీఎస్ అధికారి ఒకరు తమ ముందున్న ప్రశ్నలన్నింటికి కంపెనీ త్వరలో సమాధానం చెబుతుందని తెలిపారు. -
హెచ్చుతగ్గుల బాటలో పసిడి
నిపుణుల అంచనా... ముంబై: అనిశ్చితి ఆర్థిక పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్మార్క్ వడ్డీరేట్లలో మార్పులు, డాలర్ మారకంతో రూపాయి కదలికలు వంటి అంశాలు సమీప భవిష్యత్తులో పసిడి ధరను ప్రభావితం చేస్తాయని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా అంశాల నేపథ్యంలో పసిడి ధర సమీప భవిష్యత్తులో కొంత హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకూ పెరుగుతూ వచ్చిన పసిడి నుంచి లాభాల స్వీకరణ సైతం పసిడి కదలికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే కారణంగా గత వారంలో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ కాంట్రాక్ట్ పసిడి ధర వారం వారీగా ఔన్స్ (31.1గ్రా)కు దాదాపు 6 డాలర్లు తగ్గి, 1,254 డాలర్ల వద్ద ముగిసింది. వెండి సైతం స్వల్ప నష్టంతో ముగిసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచీ పసిడి ధర పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా పటిష్ట అంచనాలు... కాగా దేశీయంగా పసిడి సమీపకాలంలో పటిష్టంగా కొనసాగే అవకాశాలే ఉన్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్సహా 18 రోజులుగా జరుగుతున్న ఆభరణాల వర్తకుల సమ్మె ముగియడంతో పసిడి డిమాండ్కు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే గడచిన వారం మాత్రం పసిడి కొంత నష్టాలతో ముగిసింది. భారీగా పెరిగిన పసిడి ధర నుంచి ట్రేడర్లు, స్టాకిస్టులు లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణం. దీనితోపాటు డాలర్పై రూపాయి విలువ రెండున్నర నెలల గరిష్ట స్థాయికి చేరడం కూడా పసిడి ధర తగ్గడానికి కారణం. వారం వారీగా చూస్తే... 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.485 తగ్గి రూ. 28,760 వద్ద ముగిసింది. 99.9 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ. 28,910 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.485 లాభపడి రూ.38,335 వద్ద ముగిసింది. -
ప్లస్ 265 నుంచి మైనస్ 5కు సెన్సెక్స్
♦ చివర్లో లాభాల స్వీకరణ ♦ ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాలు ♦ 5 పాయింట్ల నష్టంతో 24,677కు సెన్సెక్స్ ♦ 14 పాయింట్ల లాభంతో 7,513కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంతో గురువారం మధ్యాహ్నం వరకూ ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్ చివర్లో లాభాల స్వీకరణ కారణంగా ఫ్లాట్గా ముగిసింది. ఇంట్రాడేలో 265 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ చివర్లో ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాల కారణంగా 5 పాయింట్ల నష్టంతో 24,677 పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన 7,500 పాయింట్లను దాటిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,513 పాయింట్లకు చేరింది. చివర్లో ఫార్మా, లోహ, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. లుపిన్ గోవా ప్లాంట్పై యూఎస్ ఎఫ్డీఏ అసంతృప్తి ఆ స్టాక్పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫెడ్ నిర్ణయ ప్రభావం...: అంతర్జాతీయ వృద్ధి అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది రేట్ల పెంపు రెండు సార్లు మాత్రమే ఉండగలదని అమెరికా ఫెడ్ బుధవారంనాటి సమావేశం సందర్భంగా సూచించడంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. నాలుగు సార్లు రేట్ల పెంపు ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా ఫెడ్ నిర్ణయం ఉండటం, ప్రస్తుతం రేట్లను పెంచకపోవడంతో స్టాక్ మార్కెట్లు పెరిగాయి. ఫెడ్ నిర్ణయం వల్ల భారత్ వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధులు వస్తాయని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఫెడ్ నిర్ణయంతో లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 24,948 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. బుధవారం నాటి ముగింపుతో పోల్చితే 265 పాయింట్లు లాభపడింది. బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా 24,577 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద సెన్సెక్స్ 371 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చివరకు 5 పాయింట్ల నష్టంతో 24,677 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల్లో ప్రారంభమైన యూరప్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. -
ఆర్థిక అనిశ్చితే పసిడికి దన్ను!
పసిడి.. న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరగదన్న అంచనాలు, పలు దేశాల్లో ఈక్విటీ మార్కెట్ల బలహీనతలు, క్రూడ్ ధరల పతనం వెరసి ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కొనసాగే అవకాశాలు పసిడిని మరింత మెరిసేట్లు చేస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే ఏర్పడిన ఈ తరహా సంకేతాలతో బంగారం ధర అనూహ్యంగా పెరిగిన సంగతిని వీరు ఉదహరిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు అంతర్జాతీయంగా పసిడిని ఇన్వెస్టర్కు ఆకర్షణీయం చేస్తాయన్నది ఈ రంగంలో నిపుణుల అంచనా. ఫెడ్ ఫండ్ రేటు మొదటి దఫా పెంపు అనంతరం పసిడి క్రమంగా నెమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందని గత డిసెంబర్లో నిపుణులు అంచనావేసినా... ‘ఆర్థిక అనిశ్చితి అంచనాల తీవ్రత వల్ల’ దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. గడచిన వారంలో నెమైక్స్లో ఔన్స్ ధర అంతక్రితం వారంతో ధర 1,158 డాలర్లతో పోల్చితే అనూహ్యంగా 81 డాలర్ల లాభంతో 1,239 డాలర్లకు ఎగసింది. నెమైక్స్లో వరుసగా నాలుగువారాల నుంచీ పసిడి బలపడుతోంది. దేశీయంగా ఒకేవారం రూ.1,680 అప్... అంతర్జాతీయ ధోరణిని కొనసాగడంతోపాటు రూపాయి బలహీనత, పెళ్లిళ్ల సీజన్ వంటికి అంశాలు దేశీయంగా పసిడిని బలోపేతం చేస్తున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గత శుక్రవారం అంతక్రితం వారం ఇదే రోజుతో పోలిస్తే భారీగా రూ.1,680 పెరిగి రూ.29,260కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో ఎగసి రూ.29,110కి చేరింది. -
గ్లోబుల్ ర్యాలీ
తొలగిన ఫెడ్ అనిశ్చితి జోరుగా కొనుగోళ్లు వరుసగా నాలుగో రోజూ లాభాలే 309 పాయింట్ల లాభంతో 25,804కు సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 7,844కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై అనిశ్చితి తొలగిపోవడంతో స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. వరుసగా నాలుగో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల మార్క్ను దాటేసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 309 పాయింట్లు లాభపడి 25,804 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 7,844 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు చెరో 1.21 శాతం చొప్పున ఎగిశాయి. ఇది సెన్సెక్స్కు రెండు వారాల గరిష్ట స్థాయి. సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడడం గడిచిన నెలరోజుల్లో ఇదే మొదటిసారి. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయమే.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును బుధవారం రాత్రి పావు శాతం పెంచింది. దాదాపు పదేళ్ల కాలంలో వడ్డీరేట్లను పెంచడం ఇదే మొదటిసారి. ఫెడ్ వడ్డీరేటు పెంచితే విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటారని, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తక్షణం ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. ఫెడ్ వడ్డీరేటును పెంచడం ఆర్థిక వ్యవస్థ బలపడటాన్ని సూచిస్తోందని నిపుణులంటున్నారు. అంతేకాకుండా పావు శాతం వడ్డీరేట్లు పెంచడం ఖాయమేనని గత నెల రోజుల్లో ఫెడ్ నుంచి సంకేతాలందుతున్నాయని, రేట్ల పెంపునకు తగ్గట్టుగా మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు అయ్యాయని వారంటున్నారు. రేట్ల పెంపుపై అనిశ్చితి తొలగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ర్యాలీ జరిపాయని, ఆ ప్రభావంతోనే మన మార్కెట్ కూడా లాభాల బాట పట్టిందనేది వారి అభిప్రాయం. దిగువ స్థాయిల్లో కొనుగోళ్లు జరగడం, గత కొన్ని సెషన్లలో బాగా క్షీణించిన మహీంద్రా అండ్ మహీంద్రా వంటి షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం, డాలర్తో రూపాయి బలపడడం కూడా కలసివచ్చాయి. వడ్డీరేట్ల పెంపు ప్రభావం భారత్పై కూడా ఉంటుందని, అయితే వృద్ధి అంచనాలు అనుకూలంగా ఉండడం వల్ల భారత్ విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమని ఫిచ్ రేటింగ్స్ వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి. భవిష్యత్ రేట్ల పెంపు దశలవారీగానే ఉంటుందని ఫెడ్ సంకేతాలివ్వడం, భారత్ వంటి వర్థమాన దేశాలకు ఊరటనిచ్చే విషయమని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. పడి.. లేచిన.. సెన్సెక్స్... మొదట అరగంట ట్రేడింగ్లో సెన్సెక్స్ లాభాల్లో దూసుకుపోయింది. జీఎస్టీ బిల్లుపై అనిశ్చితితో నష్టాల్లోకి జారిపోయింది. యూరోప్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడంతో చివరి రెండు గంటల్లో మన మార్కెట్ కూడా దూసుకెళ్లింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకూ లాభపడింది. కాగా సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్ అధికంగా 4.7 శాతం లాభపడింది. 30 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, లుపిన్, గెయిల్, కోల్ ఇండియా- ఈ ఐదు సెన్సెక్స్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. హిందాల్కో, వేదాంత షేర్లు 3-5 శాతం రేంజ్లో ఎగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్లు లాభపడ్డాయి. 1,946 షేర్లు నష్టాల్లో, 743 షేర్లు లాభాల్లో ముగిశాయి. -
మన మార్కెట్లు కంచుకోటలు!
ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా ఉంది... ► ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం తక్కువే ఉంటుంది ► కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా... ► ప్రభావం ఉన్నా.. తక్కువేనంటున్న నిపుణులు న్యూఢిల్లీ: ఎంత భారీ ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడేలా భారత మార్కెట్లు కంచుకోటల్లా తయారయ్యాయని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం వాటిపై తక్కువే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వల్ల భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ నిధులు తరలిపోతాయనేది సరికాదని పేర్కొంది. సుదీర్ఘకాలం పాటు సున్నా స్థాయిలోనే ఉంచిన వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెంచడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం దేశీ మార్కెట్లు అందుకు భిన్నంగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం సస్పెన్స్ తొలగిపోవడంతో కొత్త పరిణామాలకు మార్కెట్లు సర్దుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్లను మరింతగా పెంచే తీరును పరిశీలించాల్సి ఉంటుందని, అయితే దీని వల్ల ఎటువంటి సంక్షోభం ఎదురైనా తట్టుకునేందుకు భారత మార్కెట్లు సిద్ధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మరోవైపు, రేట్ల పెంపు భారత్పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, రూపాయి సహా వర్ధమాన మార్కెట్ల కరెన్సీలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ. దీదార్ సింగ్ చెప్పారు. రూపాయి మరింత బలహీనపడటం, ఫలితంగా దేశీ యంగా ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాలను పరిశీలించాల్సి ఉంటుందని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అనిశ్చితి తొలగింది.. భారత్ సర్వసన్నద్ధంగా ఉండటంతో దేశీ మార్కెట్లలో ఫెడ్ రేట్ల పెంపు ప్రభావం చాలా తక్కువకే పరిమితం అయిందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆస్తులు, అప్పుల ఖాతాలు పటిష్టంగా ఉన్నాయి. ద్రవ్య నిర్వహణ మెరుగ్గా ఉంది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కూడా బాగుంది. వడ్డీ రేట్ల మార్పుల విషయంలో కరెన్సీ మార్కెట్లు అత్యంత వేగంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక శాఖ వాటిని నిరంతరం పరిశీలిస్తోంది’’ అని చెప్పారాయన. రాబోయే మరికొన్ని రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదురుకాకపోవచ్చని స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సీఈవో ఆశీష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఫెడ్ సరళ ద్రవ్యపరపతి విధానం.. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు మేలు చేసేదేనని, భారత్లో విదేశీ ఫండ్స్ భారీ అమ్మకాలు జరపకపోవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అనిశ్చితి తొలగడంతో వ ర్ధమాన దేశాలు తగు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని ఆయన మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో పేర్కొన్నారు. కొంత నిధులు తరలిపోవచ్చు: రంగరాజన్ ఫెడ్ రేట్ల పెంపుతో దేశీ స్టాక్స్ కొంత బలహీనపడొచ్చని, అమెరికాలో మంచి రాబడులు రావొచ్చన్న అంచనాలతో భారత్ నుంచి కొంత పెట్టుబడులు తరలిపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ చెప్పారు. అలాగే, పెట్టుబడుల రాక గతంలో కన్నా కొంత తగ్గొచ్చన్నారు. ఫెడ్ ప్రభావం మరీ తీవ్రంగా ఉండక పోవచ్చన్నారు. ‘‘భారత్ పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. గతంలో మాదిరి చెల్లింపుల సంక్షోభం వంటి సందర్భాలు రావు. ఎగుమతులు తగ్గినా దానికి తగ్గట్లు చమురు రేట్ల పతనంతో దిగుమతులు కూడా తగ్గాయి. ఫలితంగా కరెంటు ఖాతా లోటు 2% కన్నా తక్కువే ఉంది. దీనర్థం అదుపులో ఉన్నట్లే’’ అని వివరించారు. ఫెడ్ ప్రభావాలకు భారత్ అతీతం కాదు: ఫిచ్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల మార్కెట్లలో తలెత్తే హెచ్చుతగ్గుల ప్రభావాలకు భారత్ అతీతం కాదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. అయితే, సానుకూల ఆర్థిక వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయంగానే ఉండగలదని పేర్కొంది. ఎగుమతులపై తక్కువగా ఆధారపడి ఉండటం, విదేశీ మారక నిల్వలు మెరుగుపడటం తదితర అంశాల కారణంగా మిగతా పోటీ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని ఫిచ్ వివరించింది. సమీప భవిష్యత్లో రూపాయి మారకం విలువ మెరుగుపడగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తున్నదానికి సంకేతమని, ఇది దేశీ ఫారెక్స్.. బాండ్స్ మార్కెట్లకు సానుకూల అంశమని సంస్థ అనలిస్టు బన్సీ మధ్వానీ పేర్కొన్నారు. -
మళ్లీ బంగారం వెలవెల!
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, దేశీయంగా జ్యుయలర్లు..రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం తదితర పరిణామాలతో పసిడి ధరలు గురువారం క్షీణించాయి. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 35 తగ్గి రూ. 25,300 వద్ద, ఆభరణాల బంగారం కూడా అంతే తగ్గుదలతో రూ. 25,185 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలరు సూచీ ఏకంగా మూడు వారాల గరిష్టానికి ఎగియడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరి కాంట్రాక్టుకు సంబంధించి ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 25.80 డాలర్లు క్షీణించి 1,051 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. దీనికి అనుగుణంగా దేశీయంగా ఎంసీఎక్స్లో ఫిబ్రవరి కాంట్రాక్టు ఒక దశలో సుమారు రెండున్నర శాతం పైగా క్షీణించి రూ. 24,740 స్థాయిలో ట్రేడయ్యింది. అటు మార్చి కాంట్రాక్టుకు సంబంధించి కిలో వెండి ధర కూడా 4 శాతం పైగా క్షీణించి రూ. 33,030 దగ్గర ట్రేడయ్యింది. ఈ పతనం ఇలాగే కొనసాగితే శుక్రవారం బులియన్ స్పాట్ మార్కెట్లోనూ రేట్లు దిగజారే అవకాశం ఉంది. -
జైట్లీతో రాజన్ భేటీ
డిసెంబర్ 1 పాలసీ సమీక్ష నేపథ్యం... న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీన ఆర్బీఐ ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పలు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక కీలక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా వడ్డీరేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయంపై ప్రధాన చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. చర్చల అనంతరం రాజన్ మాట్లాడుతూ, ‘చర్చలు ఎప్పుడూ చక్కగా, సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయి’ అని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 5 శాతానికి చేరడం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో... డిసెంబర్ 1వ తేదీన ఆర్బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే ఇప్పటికే తగ్గించిన రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా తగిన స్థాయిలో కస్టమర్లకు బదలాయించలేదన్న అభిప్రాయమూ ఉంది. ఆర్బీఐ నుంచి తాము తీసుకునే స్వల్పకాలిక రుణంపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు రెపో ప్రస్తుతం నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 6.75 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రేటు కోత: బీఓఎఫ్ఏ మంగళవారం ఆర్బీఐ రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, అయితే ఫిబ్రవరిలో జరిగే సమీక్ష సందర్భంగా పావుశాతం తగ్గించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ -
గ్లోబల్ ట్రెండ్-మార్కెట్ ర్యాలీ
359 పాయింట్ల లాభంతో 25,842కు సెన్సెక్స్ 111 పాయింట్ల లాభంతో 7,843కు నిఫ్టీ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో భారత్ స్టాక్ మార్కెట్ కూడా గురువారం లాభాల్లో ముగిసింది. వడ్డీరేట్లను క్రమక్రమంగా పెంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ యోచిస్తోందని ఫెడ్ మినట్స్ వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు లాభాలను తెచ్చిపెట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 359 పాయింట్లు (1.41 శాతం)లాభపడి 25,842 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు(1.43 శాతం) లాభపడి 7,843 పాయింట్ల వద్ద ముగిశాయి. ఏడువారాల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో ఇంత లాభపడడం ఇదే మొదటిసారి. ఫార్మా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ, ఐటీ, బ్యాంక్, ఆర్థిక సేవలు, ఆయిల్, ఎఫ్ఎంసీసీ, వాహన షేర్లు ర్యాలీ జరిపాయి. దశలవారీగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచడం వల్ల విదేశీ నిధులు ఒక్కసారిగా బయటకు తరలివెళ్లబోవనే అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మరోవైపు రూపాయి బలపడడం, ఎగుమతులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ స్కీమ్ను కేంద్రం బుధవారం ప్రకటించడం సెంటిమెంట్కు ఊపునిచ్చాయి. స్వల్ప కాలిక ఊరటే.. అయితే ఇది షార్ట్కవరింగ్ ర్యాలీ అని, ఇది స్వల్పకాలమే ఉంటుందని కొంతమంది నిపుణులంటున్నారు. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగిసిన తర్వాత కరెక్షన్ తప్పదని వారంటున్నారు. ఏడవ వేతన సంఘం తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తున్న నేపథ్యంలో వాహన, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు జోరందుకున్నాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటోలు 3 శాతం వరకూ పెరిగాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ కంపెనీలు 1-3% రేంజ్లో పెరిగాయి. మరిన్ని ముఖ్యాంశాలు... రైలు రవాణాకు సంబంధించి 3 రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రైల్వే స్టాక్ట్స్ లాభపడ్డాయి. మౌలిక రంగానికి ఉత్తేజాన్నిచ్చే చర్యలు తీసుకోవడంతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా, గాయత్రి ప్రాజెక్ట్స్ వంటి నిర్మాణ, ఇంజినీరింగ్ షేర్లు 13 శాతం వరకూ పెరిగాయి. అమెరికా చట్టాల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్కు నష్టాలు కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో షేర్ ఇంట్రాడేలో 7 శాతం పతనమై చివరకు 2.6 శాతం నష్టంతో రూ.3,287 వద్ద ముగిసింది. మార్కెట్ డేటా... టర్నోవర్ (రూ.కోట్లలో) బీఎస్ఈ 2,554 ఎన్ఎస్ఈ (ఈక్విటీ విభాగం) 15,316 ఎన్ఎస్ఈ(డెరివేటివ్స్) 2,82,254 నికర అమ్మకాలు/కొనుగోళ్లు (రూ.కోట్లలో) ఎఫ్ఐఐ -343 డీఐఐ 234 -
నాలుగో రోజూ నష్టాలే
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను డిసెంబర్లోనే పెంచే అవకాశాలున్నాయన్న సంకేతాలు గురువారం స్టాక్మార్కెట్ను పడగొట్టాయి. దీనికి అక్టోబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి26,838 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 8,112పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఈ నెల 14 తర్వాత ఇదే కనిష్ట ముగింపు. నిఫ్టీకి ఇది ఒక నెల కనిష్ట స్థాయి. సెన్సెక్స్ 27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. నిఫ్టీ ఇంట్రాడేలో 8,100 పాయింట్ల దిగువకు పతనమైంది. డాలర్తో రూపాయి మారకం 27 పైసలు క్షీణించడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం...తదితర అంశాలు ప్రభావం చూపాయి. బ్యాంక్, విద్యుత్తు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, లోహ, రిఫైనరీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 633 పాయింట్లు నష్టపోయింది. కాగా ఐడీఎఫ్సీ బ్యాంక్ వచ్చే నెల 6న స్టాక్ మార్కెట్లో లిస్ట్కానున్నట్లు సమాచారం. -
ఫెడ్ మీటింగ్తో ఇన్వెస్టర్ల జాగ్రత్త
109 పాయింట్ల నష్టంతో 27,253కు సెన్సెక్స్ * 24 పాయింట్ల నష్టంతో 8,233కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభించడంతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 27,253 పాయింట్ల వద్ద. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 8,233 పాయింట్ల వద్ద ముగిశాయి. సోమవారం కూడా సెన్సెక్స్ 109 పాయింట్లే నష్టపోవడం విశేషం. లుపిన్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశకు గురిచేయడం, అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండడం.. ఈ అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. క్యాపిటల్ గూడ్స్, లోహ, ఆయిల్ షేర్లు నష్టపోయాయి. రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం ప్రారంభమైన నేపథ్యంలో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగానే ట్రేడయ్యాయి. ఈ సమావేశాల్లో వడ్డీరేట్ల పెంపు విషయమై ఏమైనా సంకేతాలు అందుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారన్నది నిపుణుల అభిప్రాయం. మంగళవారం సెన్సెక్స్ 27,291 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది. లుపిన్ 5 శాతం డౌన్ కన్సాలిడేటెడ్ నికర లాభం 35 శాతం క్షీణించడంతో లుపిన్ షేర్ 5.2 శాతం నష్టపోయి రూ.1,946 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. -
ఫెడ్ జోష్తో లాభాలు
230 పాయింట్ల లాభంతో 27,010కు సెన్సెక్స్ నిఫ్టీకి 72 పాయింట్ల లాభం ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరింతగా ఆలస్యమవుతుందన్న అంచనాలతో ప్రపంచమార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా గురువారం లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 27,010 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 8,179 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. వాహన, రిఫైనరీ, లోహ, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. రిటైల్ విక్రయాలు సెప్టెంబర్లో 0.1 శాతమే పెరిగాయని అమెరికా వాణిజ్య విభాగం వెల్లడించింది. దీంతో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మరింత ఆలశ్యమవుతుందన్న అంచనాలతో ఆసియా, యూరోప్ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. సెన్సెక్స్ 26,842 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. కొనుగోళ్ల కారణంగా 27,036 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 230 పాయింట్ల లాభంతో 27,010 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల్లో వాహన షేర్లు సెప్టెంబర్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 55 శాతం పెరగడం, అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వెరీ రూ.640 టార్గెట్ ధరగా ఈ షేర్ను కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేయడంతో టాటా మోటార్స్ దూసుకుపోయింది. 8 శాతం వృద్ధితో రూ. 381 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకుంటాయనే అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. -
ఐదో రోజూ లాభాలే
కొనసాగిన ఫెడ్ లాభాలు 147 పాయింట్ల లాభంతో 26,933కు సెన్సెక్స్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలతో లాభాలు మంగళవారం కూడా కొనసాగాయి. స్టాక్ మార్కెట్ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లోనే సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 26,938 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 8,153 పాయింట్ల వద్ద ముగిశాయి. ముందుగా అనుకున్న విధంగానే 2016 నుంచే వస్తువుల, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం, కమోడిటీ ధరలు పెరుగుతుండడం, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు.. ఈ అంశాలన్నీ సెంటిమెంట్కు మరింత ఊతమిచ్చాయని విశ్లేషకులంటున్నారు. ఆయిల్, ఫార్మా షేర్లు బాగా లాభపడ్డాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,316 పాయింట్లు లాభపడింది. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 5%, నిఫ్టీ 4.6% చొప్పున పెరిగిపోయాయి. తగ్గిన లాభాలు..:వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు ఆర్థిక వ్యవస్థకు భారీగా ఉండేలా ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించడం కూడా ప్రభావం చూపింది. గత నెలలో సేవల రంగం కార్యకలాపాలు తగ్గాయన్న నికాయ్ ఇండియా కాంపొజిట్ పీఎంఐ సర్వే వెల్లడించడంతో ఐటీ, టెక్నాలజీ, బ్యాంకింగ్, విద్యుత్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో సెన్సెక్స్ లాభాలు తగ్గాయి. కొనసాగిన టాటా మోటార్స్ జోరు... టాటా మోటార్స్ జోరు మంగళవారం కూడా కొనసాగింది. చైనా ప్రభుత్వం వాహన విక్రయాల జోరు పెంచడం కోసం ప్యాకేజీని ఇవ్వనున్నదన్న వార్తలతో టాటా మోటార్స్ షేర్ 5.8 శాతం లాభపడి 333 వద్దముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,589 షేర్లు లాభాల్లో, 1,151 షేర్లు నష్టాల్లో ముగిశాయి. -
బంగారం ధరల్లో స్వల్ప వృద్ధి
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వు వడీ ్డరే ట్లను యథాస్థితిలో కొనసాగించడం, దేశీ డిమాండ్ పెరుగుదల వంటి కారణాల వల్ల గతవారం బంగారం ధరల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. గతవారంలో పండుగ సీజన్ వల్ల డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర రూ.26,000 మార్క్ను అధిగమించింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర అంతక్రితం వారంతో పోలిస్తే 34 డాలర్ల మేర బలపడి ఔన్స్కు 1,137 డాలర్ల వద్ద స్థిరపడింది. దేశీయంగా చూస్తే.. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,110తో పోలిస్తే రూ.380 పెరిగి రూ.26,490 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా అంతక్రితం వారం ముగింపు ధర రూ.25,960తో పోలిస్తే రూ.380 పెరిగి రూ.26,340 వద్ద స్థిరపడింది. -
ఫెడ్ వాయిదాతో లాభాలు
255 పాయింట్ల లాభంతో 26,219కు సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 7,982కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును వాయిదా వేయడం మన స్టాక్మార్కెట్ను లాభాల్లో నడిపించింది. ఫెడ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం తగ్గుతుండడం వంటి కారణాల వల్ల రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో బ్యాంక్, రియల్టీ షేర్లు పెరిగాయి. రూపాయి 79 పైసలు పెరగడం కూడా ప్రభావం చూపింది. బీఎస్ఈ సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 26,219 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 7,982 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 500 పాయింట్లు. నిఫ్టీ 150 పాయింట్లు వరకూ లాభపడ్డాయి. అయితే ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, యూరోప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో లాభాలకు కళ్లెం పడింది. బ్యాంక్, రియల్టీ షేర్లతో పాటు ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లలో కూడా కొనుగోళ్లు జరిగాయి. ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 609 పాయింట్లు(2.4 శాతం), నిఫ్టీ 193 పాయింట్లు(2.5 శాతం) చొప్పున పెరిగాయి. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం ఇది వరుసగారెండో వారం. యాక్సిస్ బ్యాంక్ 4.7 శాతం అప్: రేట్ల పెంపు నిర్ణయాన్ని ఈ ఏడాదిచివరకు ఫెడ్ వాయిదా వేయడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒకింత రిలీఫ్ను ఇచ్చిందని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభాల్లో, 13 షేర్లు నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్ 4.7 శాతం, ఓఎన్జీసీ 3.4 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3 శాతం, లుపిన్ 2.7 శాతం, రిలయన్స్ 2.6 శాతం, ఎస్బీఐ 2.4 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.3 శాతం, హీరో మోటొకార్ప్ 2.2 శాతం, సన్ ఫార్మా 2 శాతం, విప్రో 1.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.8 శాతం చొప్పున పెరిగాయి. టాటా మోటార్స్ 2.8 శాతం, బజాజ్ ఆటో 2.2 శాతం, గెయిల్ 1.7 శాతం, హిందాల్కో 1.4 శాతం, సిప్లా 1 శాతం, హిందూస్తాన్ యూనిలివర్ 1 శాతం, ఐటీసీ 0.8 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.8 శాతం, చొప్పున నష్టపోయాయి. 1,712 షేర్లు లాభాల్లో 917 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,594 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.23,031 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,54,978 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.644 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.415 కోట్లు నికర కొనుగోళ్లు జరిపారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. -
అధిక స్థాయిలోనే ధరలు
ఆర్బీఐ గవర్నర్ రాజన్ అభిప్రాయం ♦ ఇటీవలి ద్రవ్యోల్బణం తగ్గుదల ♦ బేస్ ఎఫెక్ట్ ప్రభావమని విశ్లేషణ ♦ అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి అని వ్యాఖ్య న్యూఢిల్లీ : అమెరికా ఫెడ్ రేట్ల పెంపును వాయిదావేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు కోత సెప్టెంబర్ 29న ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో, దీనికి భిన్నమైన ధోరణిలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు చేశారు. రేటు కోత నిర్ణయం ‘ద్రవ్యోల్బణం అదుపు’పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు నెల చరిత్రాత్మక కనిష్ట స్థాయి 3.6 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం పడిపోవడం- బేస్ ఎఫెక్ట్గా కూడా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ వ్యాఖ్య సెప్టెంబర్ 29 రెపో రేటు కోతపై పలువురి అంచనాలపై నీళ్లు జల్లుతోంది. గత ఏడాదే ధరల పెరుగుదల శాతం అధికంగా వుండటం వల్ల... అప్పటితో పోల్చితే (క్రితం ఏడాది ప్రాతిపదిక) ఈ ఆగస్టు నెలలో పెరుగుదల శాతం తక్కువవుండటమే బేస్ ఎఫెక్ట్. కానీ మొత్తం మీద ఈ ఏడాదీ ధరలు పెరిగాయ్. బేస్ ఎఫెక్ట్ను తొలగిస్తే... వాస్తవ ద్రవ్యోల్బణం 5% వరకూ ఉం టుందని కూడా రాజన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన సీకే ప్రహ్లాద్ నాల్గవ స్మారక కార్యక్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ద్రవ్యోల్బణం అదుపులో ఉండడమే కీలకం. అయితే ఇది కేవలం ఇప్పుటికే సంబంధించిన అంశం కాదు. భవిష్యత్తుకూ ఇది అవసరమే.’ అని ఆయన అన్నారు. ‘ఇప్పుడు మీ కెమెరాలు అన్నీ దేనికోసం చూస్తున్నాయో నాకు తెలుసు. నా స్పందన యథాతథమే. మీరు రానున్న విధాన ప్రకటన వరకూ వేచి చూడాల్సి ఉంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ►అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి. పలు దేశాలు వృద్ధికి ఇబ్బందులు పడుతుంటే... భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం మంచి పనితీరును కనబరుస్తోంది. ►వృద్ధి దిశలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ మనం బ్రెజిల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వేగంగా అభివృద్ధి చెందాలనుకున్న దేశం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ రుణ భారం, అవినీతి, కంపెనీల నష్టాలు, మొండిబకాయిల సమస్యల్లో బ్రెజిల్ కూరుకుంది. ►వృద్ధి ప్రగతిలో పటిష్ట వ్యవస్థల పాత్రా కీలకం. అధిక విలువ నోట్లు అందుకే ముద్రించడం లేదు పొరుగు దేశాలతో సంక్లిష్టమైన సంబంధాల కారణంగా నకిలీ నోట్లు వెల్లువెత్తవచ్చన్న ఆందోళన వల్లే అధిక విలువ గల నోట్ల ముద్రణ ఆర్బీఐకి కష్టంగా ఉంటోందని రాజన్ చెప్పారు. సిసలైనవిగా కనిపించే రూ. 500 నకిలీ నోట్లను తాను అనేకం చూశానని, ఇలాంటివి అరికట్టేందుకు ఎప్పటికప్పుడు అదనపు భద్రతా ఫీచర్లను జోడి స్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. -
ఫెడ్ ఆశలతో మార్కెట్ పైకి..
సెన్సెక్స్ 258 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు అప్ చైనా ఆర్థిక సంక్షోభం దరిమిలా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న ఆశలతో బుధవారం స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో తదితర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్ 258 పాయింట్లు ఎగిసి 25,964 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ మరోసారి కీలకమైన 7,900 పాయింట్ల స్థాయిని అధిగమించే ప్రయత్నం చేసింది. చివరికి 70 పాయింట్ల లాభంతో 7,899 వద్ద ముగిసింది. ఆగస్టు 31 తర్వాత రెండు సూచీలు ఇంత అధిక స్థాయిలో క్లోజవడం ఇదే ప్రథమం. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నెల 29న జరిగే పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటు సానుకూలంగా ఉండేలా చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. విద్యుత్, బ్యాంకింగ్ షేర్లు వెలుగులో.. బ్యాంకింగ్, విద్యుత్, హెల్త్కేర్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఐటీ రంగాల షేర్లు లాభపడగా.. కన్జూమర్ డ్యూరబుల్, రిఫైనరీ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు నష్టపోయాయి. సెన్సెక్స్లోని 30 షేర్లలో 26 స్క్రిప్స్ లాభాల్లో ముగిశాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 26,007 పాయింట్లకు ఎగిసింది. కానీ గరిష్ట స్థాయుల్లో లాభాల స్వీకరణ జరగడంతో 25,816 స్థాయికి తగ్గింది. -
సెన్సెక్స్ 151 పాయింట్లు డౌన్
చైనా షాంఘై స్టాక్ సూచీ షాక్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దీనికి చైనా షాంఘై స్టాక్ సూచీ 3,000 కీలక పాయింట్లకు పడిపోవడం కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు క్షీణించి 25,706 పాయింట్లకు, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 7,829 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, వాహన, బ్యాంక్ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సోమవారం లాభపడిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం కూడా ప్రభావం చూపించింది. ఫెడ్ అనిశ్చితి.. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు విషయమై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావంతో మంగళవారం ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. యూరోప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మార్కెట్ జోరుపై సందేహాలు నెలకొనడంతో ఇన్వెస్టర్లు పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిపారు. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించారు. లోహ షేర్లు విలవిల...: లోహ షేర్లు విలవిలలాడాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 5 శాతం, వేదాంత 4 శాతం, టాటా మోటార్స్ 3.6 శాతం, హిందాల్కో 3 శాతం, ఎల్ అండ్ టీ 2.9 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.6 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.8 శాతం, హీరో మోటొకార్ప్ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.1 శాతం చొప్పున తగ్గాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,241 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.13,534 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,58,824 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.911 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.481 నికర కొనుగోళ్లు జరిపారు. -
టిక్.. టిక్..ఫెడ్ !
ప్రపంచం చూపు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైపు... రేట్ల పెంపుపై రేపు సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం అదే జరిగితే ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు అంచనాలు... అటు-ఇటూ! ప్రభావాన్ని ఎదుర్కొంటామంటున్న భారత్ ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘సెప్టెంబర్ 17’వ తేదీ వచ్చేస్తోంది. ఆ రోజున అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పస్తుతం 0-0.25 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటును పెంచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలే దీనికి కారణం. ఇదే జరిగితే 9 సంవత్సరాల తర్వాత అమెరికా ఈ రేటు పెంచినట్లవుతుంది. అవకాశాలు తక్కువే: బాండ్ మార్కెట్ అమెరికాలోని బాండ్ మార్కెట్ మాత్రం రేటు పెంపు అవకాశాలు తక్కువేనని భావిస్తోంది. ఇందుకు కేవలం 20 శాతం అవకాశాలే ఉన్నాయని అంచనా వేస్తోంది. ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది బాండ్ మార్కెట్ అంచనా. ప్రపంచ అస్పష్ట మార్కెట్ పరిస్థితులు దీనికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతోంది. అయితే ఏదైనా ఆశ్చర్యకరమైన నిర్ణయం చోటుచేసుకుంటే మాత్రం మార్కెట్లో భారీ కదలికలు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. కఠినమా... సరళమా..? ఒక్క అమెరికా సానుకూల పరిస్థితులను పరిగణించి ఫెడ్ కఠిన విధానం అవలంబిస్తుందా? లేక మొత్తం ప్రపంచ అనిశ్చితి పరిస్థితులను అనుసరించి సరళతర విధానం అవలంబిస్తుందా? అన్న అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. వాటిని క్లుప్తంగా చూస్తే... ఇప్పటికి ఇప్పుడు పెంపు ఉండదు. అయితే అక్టోబర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని ఫెడ్ కమిటీ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నిర్ణయం తక్షణం అమెరికా బాండ్ మార్కెట్కు, డాలర్కు కలిసి వచ్చేదే. స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అనిశ్చితి కొనసాగుతుంది. 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంపును అమెరికా ఆర్థిక ఫండమెంటల్స్ అనుమతినిస్తున్నాయి. చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల మందగమనం సమస్యలు ఫెడ్కు తెలుసు. అయితే ఇవేమీ ప్రస్తుత రేటు పెంపునకు భారీ అడ్డంకి కాకపోవచ్చు. మున్ముందు పరిస్థితి మరింత బాగుంటే డిసెంబర్లో మరో 25 బేసిస్ పాయింట్ల రుణ రేటు పెంపు అవకాశమూ ఉంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడితే 25 బేసిస్ పాయింట్లు రేటు పెంపు ఉంటుందని ఫెడ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. ఇలా జరిగితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ పరిణామాలు ఎంతకాలం ఎలా ఉంటాయన్నది పరిశీలించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా రేట్ల పెంపు ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది చివరికి ఈ నిర్ణయం వాయిదా పడవచ్చు. అనిశ్చితి కొనసాగడం ప్రతికూలంశమే. ఫెడ్ తీరు పూర్తి సరళమే. ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు పెంచితే తీవ్ర ప్రతికూల ఫలితాలు అంతర్జాతీయంగా తలెత్తవచ్చు. ఈ కారణాల వల్ల 2015లో రేట్ల పెంపు వుండకపోవచ్చు. ఇదే జరిగితే ఈక్విటీ మార్కెట్లో భారీ ర్యాలీ చోటుచేసుకుంటుంది. ఎందుకింత ఉత్కంఠ..! 2008 ఆర్థిక సంక్షోభాన్నుంచి గట్టెక్కి, వృద్ధికి ఊపును అందించడానికి ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధుల్ని కుమ్మరించడం. రెండవది తక్కువ వడ్డీరేటుకు రుణాలను అందించడం కోసం ఫండ్స్ రేటు జీరో స్థాయికి తగ్గించడం. ఫండ్స్ రేటు తగ్గడాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే- అతి తక్కువ రేటుకు బ్యాంకులకు రుణాలు లభిస్తాయన్నమాట. ఇలా లభించిన చౌక మొత్తాలను మార్కెట్లో చౌకగా బ్యాంకులు రుణాలిచ్చాయి. అమెరికా ఇన్వెస్టర్లు ప్రపంచ వ్యాప్తంగా షేర్లు, కమోడిటీలు తదితరాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థ కుదుటపడిన తర్వాత ఫెడ్ ఈ ఉద్దీపన ఎప్పటికైనా వెనక్కు తీసుకోక తప్పదు. ఇందులో భాగంగా ప్రతీ నెలా బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపించే నిధుల్ని గతంలోనే ఫెడ్ నిలుపుచేసింది. అయితే అమెరికా ఆర్థిక పరిస్థితుల క్లిష్టత దృష్ట్యా ఎప్పటికప్పుడు ‘రేట్ల పెంపు’ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 0.6 శాతం అమెరికా ఆర్థికాభివృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రేట్ల పెంపు పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం 0-0.25 శాతంగా ఉన్న ఈ రేటు ఏ మాత్రం పెరిగినా... అమెరికా ఇన్వెస్టర్లపై వడ్డీ వ్యయ భారం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వారు వివిధ దేశాల్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కు తీసుకువెళ్లి... రుణ పునః చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే జరిగితే పలు ప్రపంచ దేశాలు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) కొరత పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. వెరసి తిరిగి పలు దేశాలు ఆర్థిక మందగమనంలోకి జారుకునే అవకాశం ఉంది. భారత్ పరిస్థితి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భారత్సహా పలు దేశాలు అమెరికాకు సూచిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే- ఫెడ్ జాగరూకతతో నిర్ణయం తీసుకుంటుందని ఒకపక్క పేర్కొంటూనే... మరోపక్క ఒకవేళ ఫెడ్ రేటు పెరిగితే ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధమై ఉన్నామని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. స్వయంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ లాంటి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఇదే విధమైన ప్రకటనలు చేశారు. కాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచితే భారత్కు సానుకూలమేనని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ పేర్కొంటోంది. ఫెడ్ నిర్ణయం ఆలస్యం అయిన కొద్దీ దేశంలోకి పెట్టుబడుల ప్రవాహంలో అనిశ్చితి నెలకొంటుందని, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడతాయని పేర్కొంది. త్వరగా ఈ అంశం తేలిపోతే చక్కటి ఇన్వెస్ట్మెంట్కు తగిన దేశంగా భారత్కు భారీ పెట్టుబడులు ఖాయమన్నది ఆ సంస్థ విశ్లేషించింది. -
బంగారం ధరలో స్వల్ప వృద్ధి
సీజనల్ డిమాండ్ కారణంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకోవడం వల్ల గతవారం బంగారం ధర మళ్లీ స్పల్పంగా పెరిగాయి. అమెరికా నిరుద్యోగిత ఏడేళ్ల కనిష్ట స్థాయికి చేరడం, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందనే ఊహాగానాలు కూడా బంగారం ధర పెరుగుదలకు కార ణాలుగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు 1,115 డాలర్లుగా ఉంది. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.70 పెరిగి రూ.26,545గా, అలాగే 99.5 స్వచ్ఛత గల బంగారం ధర కూడా అదే మొత్తంలో పెరిగి రూ.26,395గా ఉంది. -
అమెరికా వృద్ధి పటిష్టత
క్యూ2లో 3.7 శాతం అప్ వాషింగ్టన్: అమెరికా వృద్ధి పటిష్టంగా మారుతోందనటానికి తాజా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు అద్దం పడుతున్నాయి. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. ఇది తొలి అంచనాలకన్నా (2.3 శాతం) అధికం కావడం దేశ ఆర్థిక వేత్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. వ్యక్తిగత వినియోగ విభాగంలో పెరుగుదలే ఈ వృద్ధికి కారణమని ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశం తొలి త్రైమాసికంలో 0.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదే వడ్డీరేటు 0.25 శాతం స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందని కొన్ని వర్గాల అభిప్రాయం. -
రూ. 20 వేల స్థాయికి బంగారం ధరల పతనం?
బంగారం నేలచూపులు చూస్తోంది. ఐదేళ్ల క్రితం ఉన్న రేటుకు ఇది పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే, పది గ్రాముల బంగారం ధర రూ. 20,500 వరకు రావచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. ఈ సంవత్సరం చివర్లో ఫెడరల్ రిజర్వ్ రేటు పెంచితేనే ఇదంతా సాధ్యమవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. అమెరికా రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే పది గ్రాముల బంగారం ధర తప్పకుండా రూ. 20,500 స్థాయికి చేరొచ్చని రేటింగ్ సంస్థ చెబుతోంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర ఔన్సుకు 900-1500 డాలర్ల మధ్య స్థాయికి పడిపోతాయని అంటున్నారు. అంతర్జాతీయ వృద్ధిలో అనిశ్చితి తగ్గేవరకు ఈ పతనం తప్పదని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద బంగారానికి ఉన్న డిమాండులో దాదాపు సగం వరకు భారత్, చైనాలలోనే ఉంది. 2011-12 స్థాయికి మళ్లీ ఈ దేశాల్లో కొనుగోళ్లు వెళ్తాయని అంచనా వేస్తున్నారు. -
బంగారుకొండ కరుగుతోంది..
అంతర్జాతీయంగా ఐదేళ్ల కనిష్టానికి క్షీణత - అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలు - చైనాలో కమోడిటీ మార్కెట్లో అమ్మకాల వెల్లువ - ముంబైలో పది గ్రాముల రేటు రూ. 520 డౌన్ - రెండేళ్ల కనిష్టం... రూ. 25,400 లండన్/ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో పసిడి రేట్లు అంతకంతకూ పతనమవుతున్నాయి. తాజాగా సోమవారం.. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం రేటు 1.7 శాతం పైగా తగ్గి అయిదేళ్ల కనిష్ట స్థాయి 1,115.14 డాలర్లకు పడిపోయింది. ఒక దశలో ఏకంగా 4.2 శాతం క్షీణతతో 1,086.18 డాలర్ల స్థాయినీ తాకింది. రాబోయే రోజుల్లో పసిడి రేటు 1,000 డాలర్ల కన్నా కూడా తక్కువకి పతనం కావొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్ వర్గాలు ఊహించుకుంటున్నంత స్థాయిలో చైనా బంగారం నిల్వలు పెంచుకోవడం లేదన్న వార్తలు పుత్తడి ధరలు క్షీణించడానికి మరో కారణం. తాజా పరిణామాలతో చైనాలో పసిడి అమ్మకాలు వెల్లువెత్తాయి. షాంఘై స్పాట్ మార్కెట్లో ఇన్వెస్టర్లు సోమవారం 33 టన్నుల పసిడిని విక్రయించారని అంచనా. బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) సైతం భారీగా అమ్మకాలు జరిపాయి. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్టు నెల కాంట్రాక్టు 10గ్రాముల రేటు సుమారు రెండు శాతం తగ్గి ఒక దశలో రూ. 24,904కి క్షీణించింది. దాదాపు దశాబ్ద కాలంలో అమెరికా తొలిసారిగా వడ్డీ రేట్లు పెంచితే డాలరు విలువ మరింతగా బలపడుతుందన్న అంచనాలతో పసిడి నుంచి వైదొలిగి.. ఇతర లాభదాయక పెట్టుబడి సాధనాల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. దేశీయంగా రెండేళ్ల కనిష్టానికి... అంతర్జాతీయంగా పసిడి పతన ప్రభావం భారత్లోనూ కనిపించింది. దేశీయంగా వివిధ బులియన్ మార్కెట్లలో బంగారం రేట్లు గణనీయంగా తగ్గాయి. ముంైబె లో మేలిమి బంగారం రేటు ఏకంగా రూ. 520 క్షీణించి రూ. 25,400కి పడిపోయింది. ఆభరణాల బంగారం కూడా అంతే తగ్గి రూ. 25,250 వద్ద ముగిసింది. 2013 జూన్ 28 తర్వాత పసిడి ధర ఈ స్థాయికి పడటం ఇదే తొలిసారి. అటు న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 300 తగ్గి రూ. 25,700కి క్షీణించింది. బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కఠిన చర్యలు తీసుకుంటుండటం, ఈక్విటీల్లో ర్యాలీతో పసిడిలో పెట్టుబడులకు డిమాండ్ తగ్గుతుండటం వంటి అంశాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. దేశీయంగా జ్యువెలర్స్ నుంచి డిమాండ్ అంతగా లేకపోవడం కూడా దీనికి కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా నేలచూపులు చూస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడితో ముంబైలో వెండి ధర కిలోకి రూ. 340 క్షీణించి రూ. 34,650 వద్ద క్లోజయ్యింది. ఇప్పుడు కొనొచ్చా? ఇలాంటి అంశాలన్నీ కలగలిసి పసిడి రేట్లను పడేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రేట్లు మరింత తగ్గిపోతాయేమోనన్న భయాలతో అంతా పుత్తడి నుంచి వైదొలుగుతున్న తరుణంలోనే కొనుగోళ్లకు మంచి అవకాశాలు ఉంటాయన్నది వారి వాదన. అమెరికా వడ్డీ రేట్ల పెంపు భయాల కారణంగా పసిడి రేట్లు ఎల్లకాలం తగ్గుతూనే ఉండవని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. 1985 నుంచి 1987 దాకా ఒకవైపు వడ్డీ రేట్లు పెరుగుతున్నా .. వాటితో పాటు బంగారం రేట్లు కూడా పెరిగాయని, అలాగే 2003 అక్టోబర్ నుంచి 2006 అక్టోబర్ దాకా కూడా అలాంటి పరిస్థితే పునరావృతం అయిందన్నది వారి విశ్లేషణ. పతనానికి పలు కారణాలు.. పసిడికి 1998 నుంచి 2011 దాకా బుల్ మార్కెట్లా గడిచింది. అయితే, ఎంత ఎత్తుకి పెరిగిందో.. అదే స్థాయిల్లో కరెక్షన్లు కూడా చవిచూసింది. ఈ నేపథ్యంలో పుత్తడి భారీ పతనానికి ప్రస్తుతం పలు కారణాలను విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. వీటిలో కొన్ని.. 1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక పాలసీ రేట్లను పెంచనుండటం (దీని వల్ల అక్కడ వడ్డీ రేట్లూ పెరుగుతాయ్) 2. వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ డాలరు మారకం విలువ కూడా పెరగనుండటం 3. తాత్కాలికంగానైనా గ్రీస్, ఇరాన్, చైనా తదితర దేశాల ఆర్థికాంశాలపై రిస్కు భయాలు తగ్గుతుండటం. 4. అంతా ఊహించినంత స్థాయిలో చైనా బంగారం నిల్వలను భారీ స్థాయిలో పెంచుకోవడం లేదన్న వార్తలు. -
స్టాక్ మార్కెట్కు ఫెడ్ జోష్
♦ వడ్డీరేట్లను పెంచని అమెరికా ఫెడ్ ♦ విదేశీ నిధుల తరులుతాయన్న ఆందోళన తగ్గుముఖం ♦ కలసి వచ్చిన రూపాయి బలం ♦ 27,000 దాటిన సెన్సెక్స్... 8000 దాటిన నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలపాలైనా, వడ్డీరేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఫెడ్ నిర్ణయం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ను లాభాట బాట పట్టించింది. సాధారణం కన్నా అధికంగానే వర్షాలు కురుస్తుండడం, రూపాయి బలపడడం కూడా కలసి రావడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 27,000 పాయింట్లను, నిఫ్టీ 8,100 పాయింట్లను దాటాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య సంరక్షణ, వాహన, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లు కళకళలాడాయి. సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 27,116 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 8,175 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్ సూచీలకు ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. లోహ, రియల్టీ సూచీలు మినహా, మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. గత అయిదు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 745 పాయింట్లు లాభపడింది. మద్దతు ధర ప్రభావం... వడ్డీరేట్లు దశలవారీగా పెంచాలని యోచిస్తున్నట్లు ఫెడ్ ప్రకటించడంతో భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెళ్లిపోతాయనే ఆందోళనకు తెరపడినట్లేనని నిపుణులంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం కూడా ప్రభావం చూపింది. రిలయన్స్.. వారంలో 11 శాతం అప్ ఈ ఏడాది చివరికల్లా 4జీ సర్వీసులందిస్తామని వెల్లడించిన నేపథ్యంలో రిలయన్స్ షేర్ వారంలో 11 శాతం పెరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ 2 శాతం, మారుతీ సుజుకీ 1 శాతం, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హిందాల్కో భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, షేర్లు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ. 2,999 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,262 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,77,226 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.785 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,110 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ టార్గెట్లో కోత 33,000 నుంచి 31,000కు తగ్గించిన డాయిష్ ఈ ఏడాది చివరకు సెన్సెక్స్ చేరే టార్గెట్ను జర్మనీకి చెందిన బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ 33,000 పాయింట్ల నుంచి 31,000 పాయింట్లకు తగ్గించింది. వచ్చే రెండు క్వార్టర్లలోనూ కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉంటుందని, విదేశీ నిధుల ప్రవాహం మందకొడిగా ఉంటుందని ఈ బ్యాంక్ అంచనా వేస్తోంది. కాగా ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు సెన్సెక్స్ చేరే అంచనాలను తగ్గించాయి. సిటీ సంస్థ 33,000 నుంచి 32,200కు, హెచ్ఎస్బీసీ 30,100 నుంచి 26,900కు తగ్గించగా, మోర్గాన్ స్టాన్లీ మాత్రం తన అంచనాల్లో(32,500 పాయింట్లు) ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ఇక యూబీఎస్ సంస్థ నిఫ్టీ టార్గెట్ను 9,200 నుంచి 8,600కు తగ్గించింది. కాగా గురువారం సెన్సెక్స్ 27,116పాయింట్ల వద్ద, నిఫ్టీ 8,175 పాయింట్ల వద్ద ముగిశాయి. -
20 వేల దిశగా పుత్తడి!
-
20 వేల దిశగా పుత్తడి!
ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గనున్న రేట్లు ఇండియా రేటింగ్స్ అంచనా ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ గానీ అక్కడి వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో (2015-16) బంగారం రేట్లు భారీగా క్షీణించవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది. దీని వల్ల అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) పసిడి ధర 900-1,050 డాలర్లకు పడిపోవచ్చని పేర్కొంది. దీంతో దేశీయంగా పది గ్రాముల బంగారం రేటు రూ. 20,500- రూ. 24,000 స్థాయికి దిగి రావొచ్చని ఇండ్-రా తెలిపింది. ప్రస్తుతం పసిడి ధర రూ. 27,000 స్థాయిలో ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించిన దానికంటే ఎక్కువగా పెంచిన పక్షంలో బంగారం ధర 10-25 శాతం క్షీణించవచ్చని వివరించింది. అయితే, పెంపు విషయంలో జాప్యం చేసిన పక్షంలో అంతర్జాతీయంగా పుత్తడి రేటు ఇంకా పెరిగి ఔన్సుకు 1,300-1,350 డాలర్ల శ్రేణిలో ఉండగలదని ఇండ్-రా తెలిపింది. దీనికి తగ్గట్లుగా దేశీయంగా కూడా రేటు ప్రస్తుత స్థాయి నుంచి పెరిగి రూ. 29,500-30,500 శ్రేణిలో ఉండగలవని పేర్కొంది. డాలర్ మినహా ఇతర ప్రధాన కరెన్సీలు బలహీనపడినా కూడా ఇటు బంగార ం ధర, అటు డాలర్ విలువ మధ్యమధ్యలో బలపడుతూ ఉండే అవకాశాలున్నాయని ఇండ్-రా తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా అత్యధికం శాతం మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇండ్-రా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సెన్సెక్స్ 24 వేలకు వస్తుంది..!
⇒ అమెరికాలో మరోవిడత సహాయ ప్యాకేజీకి ఆస్కారం ఉంది... ⇒ ఈ ఏడాది యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చు... ⇒ మోదీ చర్యలు బాగున్నా.. ఫలితాలు నిరాశే... ⇒ ఇన్వెస్ట్మెంట్ గురు మార్క్ ఫేబర్ వ్యాఖ్యలు... న్యూఢిల్లీ: భారత్ స్టాక్ మార్కెట్లు రానున్న రోజుల్లో మరింత కుదుపులకు గురయ్యే అవకాశం ఉందని ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ గురు మార్క్ ఫేబర్ పేర్కొన్నారు. ఇప్పటికే అధిక స్థాయిలకు చేరినందున అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రధాన సూచీలు పెద్దగా రాబడులను అందించకపోవచ్చని కూడా చెప్పారు. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 24,000 పాయింట్ల స్థాయికి దిగజారే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ‘ద గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ రిపోర్ట్’ అనే ఇన్వెస్ట్మెంట్ న్యూస్లెటర్కు ఎడిటర్గా వ్యవహరిస్తున్న ఫేబర్ తన తాజా నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. ‘భారత్ మార్కెట్ల పనితీరు గ్లోబల్ మార్కెట్లపైన కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 30,000 పాయింట్ల పైస్థాయి వరకూ జరిగిన భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు గరిష్టస్థాయిల నుంచి 30% మేర కరెక్షన్కు ఆస్కారం ఉంది. ఇప్పటికే కొన్ని స్టాక్స్ ధరలు భారీగా దిగొచ్చాయి. దీన్నిబట్టి చూస్తే 24,000 పాయింట్ల స్థాయికి తగ్గితే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అయితే, కొన్ని షేర్లు మంచి లాభాలను అందించగలవు. ప్రస్తుతం దీన్ని ‘స్టాక్-పికర్స్ మార్కెట్గా పేర్కొనవచ్చు’ అని ఫేబర్ అభిప్రాయపడ్డారు. విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధింపు, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో ఇటీవల భారత్ స్టాక్ సూచీలు పతనబాటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్ 27,000-28,000 మధ్యలో తీవ్ర హెచ్చుతగ్గులతో కదలాడుతోంది. ఇంకా పలు అంశాలపై ఆయన ఏమన్నారంటే... మోదీ పాలన: భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరణల బాట పట్టించేందుకు ప్రధాన మంత్రి మోదీ చూపుతున్న చొరవ అభినందనీయం. అయితే, దీనికి తగ్గ ఫలితం మాత్రం కనబడటం లేదు. ఇది అసంతృప్తి కలిగిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాదిరిగా మోదీకి పూర్తి నిర్ణయాధికారం లేదు. ప్రజాస్వామ్య దేశం కావడంతో ప్రతిపక్షంతో సయోధ్య అవసరం. అమెరికా వడ్డీరేట్ల పెంపు: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవు(సెప్టెంబర్లో రేట్ల పెంపు మొదలు కావచ్చని భారీగా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే). అంతేకాదు ఆర్థిక వ్యవస్థ ఇంకా మందకొడిగానే ఉంది. గత ఆర్నెల్లలో వృద్ధి తగ్గుముఖం పట్టింది. రేట్ల పెంపునకు ఇదే ప్రధాన అడ్డంకి. ఈ నేపథ్యంలో నాలుగో విడత సహాయ ప్యాకేజీ(క్యూఈ4)ని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్బీఐ వడ్డీరేట్ల కోత: పారిశ్రామికోత్పత్తి మందగమనం చూస్తుంటే ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగవచ్చు. అయితే, ఈ ప్రక్రియ నిదానంగా ఉండొచ్చు. గ్రీస్ సంక్షోభం: ఇప్పటికే దివాళా తీసిన గ్రీస్.. అప్పులు ఎప్పటికీ తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. 300 బిలియన్ డాలర్ల రుణ భారాన్ని మోసే సామర్థ్యం గ్రీస్ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం లేదు. మరోపక్క, యూరో జోన్ నుంచి గ్రీస్ వైదొలగడం కూడా అసంభవం. ఎందుకంటే.. ఒకవేళ గ్రీస్ వైదొలిగితే అది రాజకీయ రంగు పులుముకుంటుంది. చైనా, రష్యాలు గ్రీస్ను మచ్చికచేసుకునే అవకాశం ఉంది. యూరోజోన్తో సన్నిహిత సంబంధాలున్న అమెరికా ఇలా జరగాలని ఎన్నడూ కోరుకోదు. -
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు..
ఏడాది మధ్యలోనా.. చివర్లోనా! వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయం అయినప్పటికీ అది ఈ ఏడాది మధ్యలోనా లేక చివర్లో ఉండొచ్చునా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాలతో పాటు అటు సంపన్న దేశాలపైనే ప్రభావం చూపే విధంగా అమెరికా ఫెడ్ ఈ ఏడాది మధ్యలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే, పరిస్థితిని బట్టి పెంపుపై నిర్ణయాన్ని ఈ ఏడాది ఆఖరు దాకా వాయిదా వేసే అవకాశాలూ ఉన్నాయంటూ పాలసీ సమీక్ష సమావేశం తర్వాత ప్రకటనలో పేర్కొంది. దీంతో పెంపు ఎప్పుడు ఉండొచ్చన్న దానిపై ఆసక్తి నెలకొంది. రేట్ల పెంపు నిర్ణయానికి నియామకాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధితో పాటు డాలర్ మారకం విలువపైనా ఫెడ్ నిశితంగా దృష్టిపెట్టనుంది. కాగా, బుధవారం నాటి పాలసీ సమీక్ష సమావేశంలో 0.25 శాతం స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను ఫెడ్ రిజర్వ్ యథాతథంగానే ఉంచినప్పటికీ విధాన ప్రకటనలో ‘ఓపిక’ పదాన్ని తొలగించింది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇన్నాళ్లూ ‘ఓపిక’గా వ్యవహరిస్తున్నామంటూ ఫెడ్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పదం తొలగించడం వల్ల పరిస్థితిని బట్టి వడ్డీ రేట్లను ఎప్పుడైనా పెంచేందుకు వెసులుబాటు లభించగలదని ఫెడ్ చైర్పర్సన్ జేనెట్ యెలెన్ పేర్కొన్నారు. అంతే తప్ప ‘ఓపిక’ పదాన్ని తొలగించినంత మాత్రాన తాము వడ్డీ రేట్లను ఎప్పుడెపుడు పెంచుదామా అన్నంత ‘అసహనం’గా లేమని ఆమె స్పష్టం చేశారు. ఏప్రిల్లో జరిగే తదుపరి సమావేశంలో పెంచే అవకాశాలు లేవని పేర్కొన్నారు. -
మహీంద్రా విమానాలు వస్తున్నాయ్...
మెల్బోర్న్: మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేసే విమానాలను భారత్లో విక్రయించడానికి ఆమోదం లభించింది. నిబంధనల్లో మార్పు కారణంగా తమ విమానాలకు ఆమోదం లభించిందని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా చెప్పారు. మహీంద్రా జిప్స్ పేరుతో 5 నుంచి 10 సీట్లు ఉన్న ఈ విమానాలను మహీంద్రా గ్రూప్ ఆస్ట్రేలియాలో తయారు చేస్తోంది. భారత్లో నలుగురు ప్రయాణించే విమానాలకు మాత్రమే ప్రభుత్వ ఆమోదం ఉంది. దీంతో ఈ విమానాల విక్రయానికి ఆమోదం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. తాజాగా అంతర్జాతీయ ధ్రువీకరణ ప్రమాణాలకనుగుణంగా నిబంధనలను మార్చామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో మహీంద్రా విమానాలను భారత్లో విక్రయించడానికి ఆమోదం లభించింది. ప్రధాని పనితీరు భేష్ 2009లో మహీంద్రా కంపెనీ రెండు ఆస్ట్రేలియా విమాన సంస్థల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కోసం విమానాలు, సంబంధిత విడి భాగాలు తయారు చేసి విక్రయించే యోచనలో భాగంగా మహీంద్రా కంపెనీ ఈ రెండు సంస్థల్లో ఒక్కో దాంట్లో 75 శాతం వాటాను రూ.175 కోట్లకు కొనుగోలు చేసింది. వీటి ద్వారా విమానాలు తయారు చేసి కాలిఫోర్నియాలో విక్రయిస్తున్నామని ఆనంద్ మహీంద్రా చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారానికి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా సందర్శిస్తున్న సీఈఓ ప్రతినిధి బృందంలో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. నరేంద్ర మోదీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, అడ్డంకులు తొలగిస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమైతే, భారీ స్థాయిలో ముడి పదార్ధాలు అవసరమవుతాయని ఆస్ట్రేలియాతో వ్యాపార అవకాశాలు అపారంగా పెరుగుతాయని పేర్కొన్నారు. -
భారత్పై ఎఫ్ఐఐల గురి..!
భారత్ స్టాక్ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు మునుపెన్నడూ లేనంత ఆమితాసక్తితో ఉన్నారా? డాలర్ల సునామీని సృష్టించనున్నారా? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)తో నిర్వహించిన సమావేశాల్లో భారత్పై అత్యంత బులిష్ ధోరణి వ్యక్తమైంది. జపాన్, సింగపూర్, అమెరికా, యూరప్లలో నిర్వహించిన రోడ్ షోలలో సుమారు 300కు పైగా ఇన్వెస్టర్లతో 85 సమావేశాలను నిర్వహించినట్లు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అందరినోటా భారత్ స్టాక్ మార్కెట్పై అత్యంత ఆశావహ దృక్పథం... రానున్న కాలంలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్న వ్యాఖ్యలే వినిపించినట్లు వెల్లడించింది. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రిధమ్ దేశాయ్ సహ రూపకల్పనలో ఈ నివేదిక విడుదలైంది. చాలావరకూ ఎఫ్ఐఐలు మార్కెట్లో ఏదైనా కరెక్షన్(దిద్దుబాటు) చోటుచేసుకుంటే కొనుగోళ్లు జరిపేందుకు రెడీగా నిధులను పక్కనబెట్టినట్లు నివేదికలో పేర్కొంది. హెడ్జ్ ఫండ్స్ అయితే, తాము కొనుగోళ్లతో ముందుకెళ్తున్నట్లు చెప్పడం విశేషం. మొత్తంమీద చూస్తే ఇప్పటికే రోజుకో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్న దేశీ మార్కెట్లు ఎఫ్ఐఐల నిధుల జోరుతో ఇంకెంత ఉన్నత శిఖరాలను అందుకుంటాయో వేచి చూడాల్సిందే. నిధుల వరద... దేశీ మార్కెట్లోకి ఎఫ్ఐఐలు భారీగా డాలర్ల వరదను పారిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ(ఆగస్టు 1 నాటికి) భారత్ స్టాక్స్లో నికరంగా 11.9 బిలియన్ డాలర్లను(దాదాపు రూ.71,500 కోట్లు) కుమ్మరించినట్లు సెబీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక డెట్ మార్కెట్లో(బాండ్లలో) మరింత దూకుడుగా 14.25 బిలియన్ డాలర్లను(సుమారు రూ.85,900 కోట్లు) నికరంగా వెచ్చించారు. ఒక్క జూలైలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా స్టాక్స్లో 2.18 బిలియన్ డాలర్లు(రూ.13,200 కోట్లు), డెట్ మార్కెట్లో 3.83 బిలియన్ డాలర్ల(రూ.23,000 కోట్లు) చొప్పున పెట్టుబడి పెట్టడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ, కంపెనీల రాబడులు.. గడచిన రెండు నెలలుగా వృద్ధి, ద్రవ్యోల్బణం రెండూ సరైన దిశలోనే వెళ్తున్నాయి. తక్షణ ప్రాతిపదికన కాకుండా.. రానున్న కాలంలో ఈ ధోరణి ఇలాగే కొనసాగితే గనుక ఇన్వెస్టర్లకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వచ్చే 4-8 త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిలో స్థిరమైన రికవరీకి చాన్స్ ఉంది. కంపెనీల రాబడులు క్రమేపీ పుంజుకునే అవకాశాలున్నాయి. వచ్చే మూ డేళ్లూ కంపెనీల లాభాలు చక్రీయగతిన(సీఏజీఆర్) సగటున 18% పైనే వృద్దిని సాధించవచ్చని అంచనా. ద్రవ్యోల్బణం రిస్క్లు.. ద్రవ్యోల్బణానికి వర్షాలు, అంతర్జాతీయ ముడిచమురు ధరలే ప్రధాన రిస్కులుగా నిలవనున్నాయి(ఇప్పటికే వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆహార ధరలకు రెక్కలొస్తాయన్న భయం నెలకొంది. దీనికితోడు, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ, ఇరాక్ అంతర్యుద్ధం క్రూడ్ రేట్లను ఎగదోయొచ్చనే ఆందోళనలూ ఎక్కువవుతున్నాయి). రిటైల్ ద్రవ్యోల్బణం తమ లక్ష్యాలకు అనుగుణంగా దిగొస్తే వడ్డీరేట్లను తగ్గిస్తామని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టం చేసింది. ద్రవ్యలోటు కట్టడి ఇతరత్రా చర్యలు కొనసాగితే.. ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం ముందే సాకారం కావచ్చు. తాజా పాలసీ సమీక్షలో ఆర్బీఐ ధరల కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా వదిలేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎల్ఆర్ను మాత్రం అర శాతం తగ్గించింది. సంస్కరణలపై.. మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు నిర్మాణాత్మక సంస్కరణల దిశగా మంచి ఆరంభమే చేసింది. ప్రతిపాదిత కార్మిక సంస్కరణలు.. రక్షణ, బీమా, రైల్వే ఇన్ఫ్రాలోకి ఎఫ్డీఐల అనుమతి, పరిమితుల పెంపు, ప్రాజెక్టులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్యలు ఇందులో చాలా ప్రధానమైనవి. ప్రభుత్వ వ్యయం, సబ్సిడీల భారాన్ని తగ్గించుకునేదిశగా ఇంకా చర్యలు జోరందుకోవాల్సి ఉంది. అయితే, వర్షపాతం కొరత, అల్పాదాయ వర్గాలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత వంటి పరిమితులు కేంద్రానికి ఉన్నాయి. కేంద్ర బడ్జెట్.. 2014-15 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ధేశించిన ద్రవ్యలోటు లక్ష్యం(ఈ ఏడాది జీడీపీలో 4.1 శాతం) చాలా ప్రతిష్టాత్మకమైనదే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు, సబ్సిడీల కోత, డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ(ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయం)పై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టిసారిస్తారు. అయితే, మొత్తంమీద బడ్జెట్లో ప్రకటించిన కొన్ని చర్యలపై ఎఫ్ఐఐలు చాలా సానుకూలంగా ఉన్నారు. -
ఫోర్బ్స్ శక్తివంత మహిళల జాబితా..
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్లకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. భట్టాచార్యకు 36వ ర్యాంకు, కొచర్కు 43వ ర్యాంకు లభించాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్షా 92వ స్థానంలో నిలిచారు. పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో ఉన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎల్లెన్ (రెండో స్థానం), మానవతావాది మెలిండా గేట్స్ (3), హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బారా (7), అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్బెర్గ్(9) తొలి పది స్థానాలో ఉన్నారు. దాదాపు 38 వేల కోట్ల డాలర్ల ఆస్తులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథిగా భట్టాచార్య ఆసియా ఉపఖండంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారని ఫోర్బ్స్ ప్రశంసించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో ఆమె విశేష సేవలందించారని తెలి పింది. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 12,500 కోట్ల డాలర్ల ఆస్తులను చందా కొచర్ పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇక్కట్లను ఎదుర్కొన్న ఐసీఐసీఐ బ్యాంకును ఆమె గాడిన పెట్టారని తెలిపింది. -
ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచుతాం: రాజన్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని కిందకు దింపడం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా తమ విధానం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. లోక్సభ ఎన్నికల తరువాత స్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రస్తుత సంస్కరణలు కొనసాగుతాయని, వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అమెరికా ఫెడ్ ట్యాపరింగ్ ప్రభావం పడని దేశంగా భారత్ నిలబడిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకుల మొండిబకాయిలు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
మందకొడిగా నిఫ్టీ రోలోవర్స్...
ఫిబ్రవరి నెల బుల్లిష్గా వుంటుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో కొరవడినట్లు తాజా డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. కొద్ది నెలలుగా ఎన్నడూ లేనేంత నిస్తేజంగా ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్కు నిఫ్టీ రోలోవర్స్ సాగాయి. జనవరి సిరీస్ గురువారం ముగియనుండగా, బుధవారం నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్ కాంట్రాక్టులో 18.62 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.42 కోట్ల షేర్లకు చేరింది. జనవరి సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు (డిసెంబర్ 24న) జనవరి ఫ్యూచర్లో ఓఐ 1.59 కోట్ల షేర్ల వరకూ వుంది. అప్పుడు స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 70 పాయింట్లు వుండగా, ఇప్పుడు ఫిబ్రవరి ఫ్యూచర్ ప్రీమియం 34 పాయింట్లకు పరిమితమై వుంది. ఇక ఫిబ్రవరి ఆప్షన్లకు సంబంధించి 6,000 స్ట్రయిక్ వద్ద అధికంగా 39.46 లక్షల షేర్ల పుట్ బిల్డప్, 6,300 స్ట్రయిక్ వద్ద ఎక్కువగా 26.11 లక్షల షేర్ల కాల్ బిల్డప్ వుంది. ఈ ఆప్షన్ బిల్డప్ ప్రకారం సమీప భవిష్యత్తులో నిఫ్టీకి ఈ రెండు స్థాయిలూ మద్దతు, నిరోధాలుగా పరిగణించవచ్చు. -
దిగొస్తున్న బంగారం,వెండి ధరలు
-
ఈ ఏడాది భారత్ వృద్ధి 4.8 శాతం:ఐరాస
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు 2013లో 4.8 శాతమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనాలను సమితి 6.1 శాతంగా పేర్కొంది. 2014 వృద్ధి రేటును కూడా 1.2 శాతం తగ్గించి 5.3 శాతానికి కుదించింది. 2015లో వృద్ధి రేటును 5.7 శాతంగా అంచనావేసింది. అమెరికా సహాయక ప్యాకేజీల ఉపసంహరణల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధం కావాలని కూడా ఐక్యరాజ్యసమితి ఆర్థిక విశ్లేషణా నివేదిక సూచించింది. 2014లో ప్రపంచ వృద్ధి రేటు 3 శాతం ఉంటుందన్నది సమితి అంచనా. రూపాయిపై ‘ఫెడ్’ ప్రభావం: బీఆఫ్ఏ: కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం స్వల్పకాలంలో భారత రూపాయి మారకపు విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఆఫ్ఏ మిరిల్ లించ్) పేర్కొంది. -
భారీగా పడిన బంగారం
న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్ కామెక్స్లో బంగారం ధర గురువారం భారీగా పడింది. కడపటి సమాచారం మేరకు క్రితం ముగింపుతో పోల్చితే ఔన్స్ (31.1గ్రా) ధర 3%(దాదాపు 40 డాలర్లు) వరకూ నష్టపోయి 1,195 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం దీనికి ప్రధాన కారణంగా కనబడుతోంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లోనూ పతనం కొనసాగుతోంది. కడపటి సమాచారం అందే సరికి (రాత్రి 10 గంటలు) ఇక్కడ 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.487 వరకూ నష్టపోయి రూ.28,380 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీకి ఏకంగా 3 శాతంపైగా (రూ.1,467) నష్టపోయి రూ.43.880 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ధర ఇదే నష్టాల బాటన కొనసాగి (రూపాయి కదలికలకు లోబడి) నష్టాల్లో ముగిస్తే- శుక్రవారం స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. -
ఫెడ్ ట్యాపరింగ్ను దీటుగా ఎదుర్కొంటాం
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం భారత్పై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామం వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసానిచ్చారు. ఫెడ్ చర్యల ప్రభావంతో దేశీ స్టాక్, కరెన్సీ మార్కెట్లు కొద్దిగా కుదుపునకు గురయ్యాయి. పాలసీ చర్యలకూ వెనుకాడం... ప్రస్తుతానికైతే ఫెడ్ చర్యల ప్రభావంపైనే తాము దృష్టిసారించామని... అవసరమైతే విధానపరమైన చర్యలకూ సిద్ధమేనని చిదంబరం స్పష్టం చేశారు. ‘ఫెడ్ నిర్ణయాల ప్రభావాన్ని మార్కెట్లు ఇప్పటికే చవిచూశాయి(ఫ్యాక్టర్ చేసుకున్నాయి). అందువల్ల ఫెడ్ స్వల్ప మార్పులు పెద్దగా ఆశ్చర్యపరచలేదనే భావిస్తున్నా. దీని ప్రభావం మనపై పెద్దగా ఉండకపోవచ్చు కూడా. అయితే, కొన్ని ప్రతికూలతలకు అవకాశం ఉన్నప్పటికీ... ఈ ఏడాది మేతో పోలిస్తే ట్యాపరింగ్ పరిణామాన్ని ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధంగా ఉన్నాం’ అని విత్తమంత్రి చెప్పారు. ఫెడ్ ప్యాకేజీల కోత ప్రకటన నేపథ్యంలో గురువారం ఉదయం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్తో దీనిపై చర్చించినట్లు కూడా చిదంబరం వెల్లడించారు. వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఏంచేస్తుందనేది వేచిచూడాల్సి ఉందని చెప్పారు. పాలసీ వడ్డీ రేట్లను ఇప్పుడున్న కనిష్టస్థాయి(పావు శాతం)లోనే కొనసాగిస్తామని తాజా సమీక్షలో ఫెడ్ తెలిపింది. రూపాయి స్థిరపడుతోంది... జపాన్తో ద్వైపాక్షిక కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని 15 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెంచుకున్నామని... దీంతో రూపాయి మారకం విలువ స్థిరీకరణకు దోహదం చేస్తున్నట్లు చిదంబరం చెప్పారు. కాగా, ప్రతి గంటకూ రూపాయి విలువను సమీక్షించడం కుదరదని.. ఇప్పటికే కొంత స్థిరీకరణ జరిగిందన్నారు. ఇదేపరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బాండ్ల కొనుగోలులో ఫెడ్ కోత చాలా తక్కువేనని, అంతేకాకుండా... దీనికి కొనసాగింపు వంటిదేమీ ప్రకటించని విషయాన్ని చిదంబరం గుర్తు చేశారు. అమెరికాలో ఉద్యోగాలు భారీగా పుంజుకునేంతవరకూ ప్రస్తుత సహాయ ప్యాకేజీలు కొనసాగుతాయని.. ఇతరత్రా పాలసీ అస్త్రాలను ఫెడరల్ రిజర్వ్ తగిన విధంగా ఉపయోగిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయదు: కార్పొరేట్లు ఫెడ్ ప్యాకేజీల కోత... భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశాల్లేవని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు కావలసినంత పరిమాణంలో స్థిరంగానే ఉన్నాయని... అదేవిధంగా కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనలు కూడా తగ్గుముఖం పడుతుండటమే దీనికి కారణమని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. 10 బిలియన్ డాలర్ల కోత 2008లో కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్(ఫెడ్)... బాండ్ల కొనుగోలు రూపంలో సహాయ ప్యాకేజీలను ప్రకటించడం తెలిసిందే. అయితే, అక్కడి ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతున్న బలమైన సంకేతాల నేపథ్యంలో ట్యాపరింగ్ను మొదలుపెడుతున్నట్లు 2 రోజుల పాలసీ సమీక్ష అనంతరం బుధవారం పొద్దుపోయాక ఫెడ్ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగిస్తున్న నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలులో 10 బిలియన్ డాలర్ల కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి బాండ్ల కొనుగోలు 75 బిలియన్ డాలర్లకు తగ్గించనున్నట్లు ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ తన ఆఖరి పాలసీ సమీక్ష అనంతరం వెల్లడించారు. జనవరి 31తో ఆయన పదవీకాలం ముగియనుంది. కొత్త ఫైడ్ చైర్మన్గా జేనెట్ ఎలెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ప్యాకేజీలలో కోత విధించనున్నట్లు తొలిసారిగా ఈ ఏడాది మే లో ఫెడ్ ప్రకటించింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన స్టాక్, కరెన్సీ మార్కెట్లు కుప్పకూలాయి కూడా. ఆతర్వాత ట్యాపరింగ్ను వాయిదావేస్తూ వచ్చిన ఫెడ్.. ఇప్పుడు ఎట్టకేలకు మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. -
సోనియాగాంధీకి యూఎస్ కోర్టు మందలింపు
1984 సిక్కుల ఊచకోతకు సంబంధించిన కేసులో యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ జనవరి 2 తేదిలోగా స్పందించాలని యూఎస్ ఫెడరల్ కోర్టు సూచించింది. ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన మారణకాండకు బాధ్యులైన వారికి అండగా నిలిచారని, ఆదుకున్నారని, పదవులు కట్టబెట్టారని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జే) అనే సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు, పోలీసు అధికారులుకు ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. గత సెప్టెంబర్ మాసంలో చికిత్స కోసం న్యూయార్క్ లోని స్లోయాన్ కెట్టెరింగ్ హస్పిటల్ లో ఈ కేసుకు సంబంధించిన సమన్లు అందచేశారని ఎస్ ఎఫ్ జే తెలిపింది. అయితే తమకు ఎలాంటి సమన్లు అందలేదని సోనియా గాంధీ, ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. ఈ దుర్ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా ఎస్ ఎఫ్ జే తరపు న్యాయవాది గురుప్రిత్ సింగ్ పానున్ సోనియాగాంధీపై కేసు నమోదు చేశారు. -
ఆహార ధరలే గుదిబండ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్థికమంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఒక వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. మిగిలిన స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయన కొంత సానుకూల వాతావరణ పరిస్థితి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ- క్యాడ్), ద్రవ్యలోటు తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రజలు వినియోగ సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ధోరణి పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వివిధ అంశాలపై ఆయన వివరణలు క్లుప్తంగా... క్యాడ్కు కళ్లెం వేస్తాం... క్యాడ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత అంచనావేశాం. అయితే ఇప్పుడు ఇది 60 బిలియన్ డాలర్ల వరకూ తగ్గుతుందని భావిస్తున్నాం. బంగారం దిగుమతులు భారీగా తగ్గుతుండడం దీనికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. సెప్టెంబర్లో ఈ దిగుమతుల పరిమాణం 11.16 టన్నులయితే ఇది అక్టోబర్లో 23.5 టన్నులకు చేరింది. అయినా ఈ విషయంలో ఏమీ భయపడ్డం లేదు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గుతాయనే అంచనాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ( క్యాపిటల్ ఇన్ఫ్లోస్-ఎఫ్ఐఐ, ఎఫ్డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి -జీడీపీలో ఇది 4.8 శాతం -88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య క్యాడ్ జీడీపీలో 4.9 శాతంగా ఉంది. లక్ష్యం దాటని ద్రవ్యలోటు ద్రవ్య క్రమశిక్షణ, ద్రవ్యలోటు వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే ఆయా అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవలు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాం. ఇవి స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదపడతాయి. జీడీపీలో 4.8 శాతానికి ద్రవ్యలోటు కట్టడి జరుగుతుందని భావిస్తున్నాం. అదే విధంగా రూ.40,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధిస్తాం. క్యాపిటల్ ఇన్ఫ్లోస్... రూపాయిపై... దేశానికి క్యాపిటల్ ఇన్ఫ్లోస్ పరిస్థితి బాగుంది. గడచిన 78 వారాల్లో భారత్ విదేశీ మారకపు నిధులకు 9 బిలియన్ల డాలర్ల అదనపు తోడయ్యాయి. దేశీయ కరెన్సీ డాలర్ల మారకంలో గడచిన కొన్ని వారాలుగా 61 నుంచి 62 వద్ద ట్రేడవుతోంది. మరిన్ని క్యాపిటల్ ఇన్ఫ్లోస్ వస్తాయని భావిస్తున్నాం. ఇదే జరిగితే రూపాయి మరింత బలపడుతుంది. ఇది 60-61 శ్రేణికి వస్తుంది. అది మంచి సంకేతం. ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం విస్తరించదు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఇతర ఎక్స్ఛేంజ్లకు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈఎల్) చెల్లింపుల సంక్షోభం విస్తరించదు. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని సెబీ పర్యవేక్షిస్తోంది, అదేవిధంగా ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్(ఎఫ్ఎంసీ) నియంత్రణ కింద మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) పనిచేస్తోంది. ఆయా అంశాల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎన్ఎస్ఈఎల్ బిజినెస్ సరైన నియంత్రణ సంస్థ పరిధిలో పనిచేయకపోవడం సమస్యకు కారణమయ్యింది. ఫెడ్ నిర్ణయాలను ఎదుర్కొనగలం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రకటించిన సహాయక చర్యలను అమెరికా సెంట్రల్ బ్యాంక్... ఫెడరల్ రిజర్వ్ క్రమంగా ఉపసంహరించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో ఇది జరగవచ్చని మనం భావించాం. మార్చిలో జరగవచ్చని వారు (ఫెడ్) తాజాగా పేర్కొంటున్నారు. అయితే అదే జరిగితే దీనిని ఎదుర్కొనడానికి అటు మార్కెట్లు, ఇటు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. ఈ కోణంలో మనం ఆర్థిక ఫండమెంటల్స్ను మరింత పటిష్టం చేసుకోవాలి. క్యాడ్, ద్రవ్యలోటు కట్టడి, ఆదాయాలు మెరుగుపరచుకోవడం, కరెన్సీపై స్పెక్యులేషన్కు తావులేని చర్యలు తీసుకోవడం వంటివి ఇక్కడ దోహదపడతాయి. ఫెడ్ ఉపసంహరణల వల్ల ఏదైనా ప్రభావం ఉన్నా.... అది కేవలం నామమాత్రంగానే ఉంటుంది. నేనే సీఎంనైతే.. అధిక ద్రవ్యోల్బణంతో చాలా ఇక్కట్లు ఎదుర్కోవాల్సివస్తోంది. ఆహారోత్పత్తుల ధరల తీవ్రత పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు ఇతరత్రా ఆహార, నిత్యావసర ఉత్పత్తులు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి. ఇక ఉల్లిపాయల ధర వార్షిక ప్రాతిపదికన 300 శాతం పైగా పెరిగింది. కూరగాయలు, పండ్లు ధరలూ ఎగబాకాయి. ట్రేడర్లు అంటే హోల్సేలర్లు, రిటైలర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా చేసేదేమీ ఉండబోదు. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఆయా అంశాలు ఉంటాయి. నేనే గనుక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండిఉంటే, నిత్యావసర వస్తువుల చట్టం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి ఉండేవాడిని. ఉల్లిపాయల అక్రమ నిల్వలకు పాల్పడే వారి భరతం పట్టేవాడ్ని. -
బ్యాంకింగ్ అవగాహన
1. Periodically Reserve Bank of India (RBI) reviews a few SLR norms. SLR stands for? a) Statutory Liquidity Ratio b) Statutory Liquidity Rate c) Statutory Liquidity Return d) Statutory Liquidity Repo e) None of the above 2. In the recent months, Indian Rupee depreciated heavily against US Dollar. Rupee depreciation means? a) Value of Rupee decreasing against a basket of currencies b) Less number of Rupees per US Dollar c) More number of Rupees per US Dollar d) Less number of Dollars per Rupee e) None of the above 3. In India, Commodities Market is regulated by? a) Forward Market Commission b) Forward Market Committee c) Forward Market Corporation d) Forward Market Council e) None of the above 4. Food Security Bill is recently passed by Parliament. What does the Food Security Bill intend to achieve? a) At least 3kg of food grains per person per month to be given to general category households, at prices not exceeding 50% of Minimum Support Price. b) Up to 75% of the rural population and up to 50% of urban population are to be covered under Targeted Public Distribution System. c) Children aged six months to 14 years would get take-home ration or hot cooked food. d) The oldest adult woman in each house would be considered the head of that household when issuing the ration card. e) All of the above 5. FIPB stands for? a) Foreign Investment and Production Board b) Foreign Investment and Promotion Board c) Foreign Investment and Promotion Bureau d) Foreign Investment and Protection Board e) None of the above 6. In India, Capital Markets are regulated by? a) Securities and Exchange Board of India b) Reserve Bank of India c) State Bank of India d) International Monetary Fund e) None of the above 7. RAND is the currency of ? a) China b) Japan c) North Korea d) South Africa e) None of the above 8. Recently RBI took several steps to control Rupee depreciation. Due to Rupee depreciation? a) Exports become costlier b) Imports become costlier c) Imports become cheaper d) Both (a)&(c) e) None of the above 9. India's GDP growth is slowing down. GDP means? a) Gross Domestic Product b) Gross Domestic Poverty c) Gross Demand Production d) Gross Demand Product e) None of the above 10. Chakravarthy Rangarajan is? a) Governor of Reserve Bank of India b) Director of Securities and Exchange Board of India c) Chairman of Prime Minister Economic Advisory Council d) Chairman of State Bank of India e) None of the above 11. International Monetary Fund (IMF) works to foster global monetary cooperation, promote high employment and sustainable economic growth. Who is the current managing director of IMF? a) Kaushik Basu b) Dr. Y V Reddy c) Jim Yong Kim d) Christine Lagarde e) None of the above 12. Air-Asia India is the new proposed Airline in India. It tied up with the following Industrial group for its launch in India? a) TATAs b) Reliance group c) Aditya Birla group d) Infosys e) None of the above 13. Raghuram Rajan became the 23rd RBI Governor on 5th September 2013. Whom did he succeed? a) Dr Y V Reddy b) D Subba Rao c) Bimal Jalan d) Dr Rangarajan e) None 14. IRDA headquarters located in which City? a) Mumbai b) Bangalore c) Hyderabad d) Chennai e) None of the above 15. Arundathi Battacharya was recently in the news. She is? a) Managing Director of SBI b) Chairman of Punjab National Bank c) CEO of ICICI Bank d) CEO of Axis Bank e) None of the above 16. India's CAD was 4.8% of GDP in 2012-13. CAD means? a) Current Amount Deficit b) Current Account Deficit c) Current Asst Debt d) Common Account Deficit e) None of the above 17. Which of the following is NOT matched? a) C B Bhave - SEBI b) Rangarajan - Planning Commission c) Raghuram Rajan - RBI d) T S Vijayan - IRDA e) Yogesh Agarwal - PFRDA 18. Who is the Chairman of the Planning Commission? a) P. Chidambaram b) Monteksingh Ahluwalia c) Raghuram Rajan d) Manmohan Singh e) None of the above 19. As per findings of the recent Raghuram Rajan Committee report which State is the most developed? a) Kerala b) Goa c) Gujarat d) Tamilnadu e) None of the above 20. As per the insurance bill, 2013, Foreign Investors can hold up to? a) 51% of the capital in an Indian insurance company b) 39% of the capital in an Indian insurance company c) 49% of the capital in an Indian insurance company d) 29% of the capital in an Indian insurance company e) None of the above 21. Statutory liquidity ratio(SLR) refers to the amount that the commercial banks require to maintain with RBI. What are the permitted SLR investments? a) Only Gold b) Gold or Govt approved Securities c) Only Govt approved Securities d) Only Cash e) None of the above 22. Direct Taxes Code (DTC) is intended to be introduced in the monsoon session of Parliament. DTC seeks to replace? a) Indian Contract Act b) Indirect Tax Act c) Income-Tax Act d) Banking Regulation Act e) None of the above 23. In July 2013, RBI notified that Non-CTS Cheques are valid till the end of year 2013. CTS means? a) Cheque Truncation System b) Cheque Transaction System c) Cheque Transmission Service d) Cheque Transport Service e) None of the above 24. In July 2013, SEBI Act was amended to curb Ponzi schemes. Ponzi Scheme means? a) Name of a Mutual Fund Scheme to earn higher returns b) Collective investment Schemes floated by fly by night operators c) Name of a Bank Deposit Product d) Name of a Health Insurance scheme e) None of the above 25. The minimum rate of Interest charged by a Bank from Customers on the loans is? a) Base Rate b) Bank Rate c) Prime Rate d) Prime Lending Rate e) None of the above 26. Which of the following is NOT true with regard to FCNR Accounts? a) NRIs can open the Account b) Can be opened in 'Permitted Currency' only c) Minimum Term is 1 year d) Maximum Term 5 years e) None of the above 27. REPO rate means? a) Rate at which the RBI will borrow from the banks b) Rate at which banks will borrow from other banks c) Rate at which the RBI lends to banks d) Rate at which banks lend to customers e) None of the above 28. Fiscal Deficit Refers to? a) The difference between the government's total expenditure and its total receipts (including borrowing) b) The difference between the government's total expenditure and its total receipts (excluding borrowing) c) The difference between the government's Tax collections and Salary payments d) The difference between the government's Tax collections and government's Borrowings e) None of the above 29. "DAX" is the stock market in? a) Germany b) USA c) France d) Hongkong e) None of the above 30. After retirement, Ratan Tata was made the Chairman Emeritus of Tata Sons. Who succeeded Ratan Tata as Chairman of Tata Sons? a) Cyrus Mistry b) Niira Radia c) Mukesh Ambani d) Nandan Nilekani e) None of the above 31. Yellow Metal refers to? a) Copper b) Silver c) Platinum d) Gold e) None of the above 32. Who is the Chairman of the committee set up to scrutinize applications for new Bank licenses? a) Usha Thorat b) Bimal Jalan c) C B Bhave d) S Damodaran e) None of the above 33. Who is the World Bank President? a) Christine Legrade b) Jim Yong Kim c) Raghuram Rajan d) Monteksingh Ahluwalia e) None of the above 34. Ben Bernanke is the Chairman of Federal Reserve. What is Federal Reserve? a) Central Bank of UK b) Financial wing of the World Bank c) Central Bank of USA d) European Union Central Bank e) None of the above Answers: 1) a; 2) c; 3) a; 4) e; 5) b; 6) a; 7) d; 8) b; 9) a; 10) c; 11) d; 12) a; 13) b; 14) c; 15) a; 16) b; 17) b; 18) d; 19) b; 20) c; 21) b; 22) c; 23) a; 24) b; 25) a; 26) e; 27) c; 28) b; 29) a; 30) a; 31) d; 32) b; 33) b; 34) c -
బంగారం, వెండి ధరల వెనకడుగు
ముంబై/న్యూయార్క్: అటు అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్లో ఇటు దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం చురుగ్గా ట్రేడవుతున్న బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. కడపటి సమాచారం అందేసరికి నెమైక్స్లో ఔన్స్ (31.1గ్రా) బంగారం ధర 36 డాలర్ల నష్టంతో 1,333 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధర కూడా 6 శాతం వరకూ నష్టంతో 22 డాలర్ల వద్ద ఉంది. ఇందుకు అనుగుణంగా ఎంసీఎక్స్లో కూడా బంగారం 10గ్రాముల ధర 2% నష్టంతో (రూ.613) రూ.29,931 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర రూ.2,421 (4.7%) నష్టంతో రూ.49,329 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతానికి అమెరికా ఫెడ్ సహాయ చర్యలను ఉపసంహరించనప్పటికీ, అక్టోబర్లో కోత ఉండవచ్చని ఫెడరల్ రిజర్వ్ అధికారి ఒకరు చేసిన కామెంట్ ఫ్యూచర్స్లో ధరల పతనానికి కారణమని విశ్లేషకులు చెప్పారు. -
బలపడిన రూపాయి, సెన్సెక్స్ జెట్ స్పీడ్!
ఉద్దీపన కార్యక్రమంపై యూఎస్ ఫెడరల్ రిజర్వు అనూహ్యమైన నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ప్రభావం, రూపాయి నెలరోజుల గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్న వార్తల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం జెట్ స్పీట్ తో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లు ముందుండి సూచీలను పరిగెత్తించాయి. గురువారం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 20354 పాయింట్ల వద్ద ఆరంభమై.. 20739 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరికి 684 పాయింట్ల లాభంతో 20646 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6044 పాయింట్ల ప్రారంభమై.. ఓ దశలో 6142 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. చివరికి నిన్నటి ముగింపుకు 216 పాయింట్ల వృద్ధితో 6115 పాయింట్ల వద్ద క్లోజైంది. ఇండెక్స్ ఆధారిత కంపెనీ షేర్లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా 9.36 శాతం, జయప్రకాశ్ అసోసియేట్స్ 8.86 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.81 శాతం, ఎస్ బీఐ 8.01 శాతం, కొటాక్ మహేంద్ర 7.95 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ ను పోల్చితే రూపాయి 156 పైసలు లాభపడి 61.82 వద్ద ట్రేడ్ అవుతోంది. -
యూఎస్ ఫెడ్, ఆర్ బీఐ నిర్ణయాలే మార్కెట్ కు కీలకం!
హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధానం, యూఎస్ ఫెడరల్ రిజర్వు సమావేశాలే మార్కెట్ కదలికలకు కీలకంగా మారే అవకాశం ఉందని ఆర్ధిక రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ ఫెడ్ సమావేశం సెప్టెంబర్ 17-18 తేదిన, రిజర్వుబ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష సెప్టెంబర్ 20 తేదిన జరుగనున్నాయి. ట్రెజరీలలో నెలసరి కోనుగోళ్లను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తగ్గించవచ్చని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటున్నందున్న నిధులు తరలివెళ్లే అవకాశం ఉన్నందున భారత్ తోపాటు ఇతర మార్కెట్లపై స్వల్పకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాక అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి క్షీణిస్తున్నందున మార్కెట్ లోకి నిధుల ప్రవాహంపై ఒత్తిడి పెరిగే సూచనలున్నాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఫెడ్ రిజర్వు తీసుకోబోయే కీలక నిర్ణయాలపై రిజర్వు బ్యాంక్ నూతన గవర్నర్ రఘురాం రాజన్ దృష్టి సారించారు. ఫెడ్ రిజర్వు సమావేశం ఉన్నందున ద్రవ్య సమీక్ష సెప్టెంబర్ 18 తేది నుంచి సెప్టెంబర్ 20 తేదికి మార్చారు. అంతేకాక గవర్నర్ గా ఎన్నికైన తర్వాత రఘురాజన్ తొలి సమీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అందర్ని దృష్టి ఆయనే మీదే ఉంది.