varun dhawan
-
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
సమంత వెబ్ సిరీస్కు ప్రతిష్టాత్మక అవార్డ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruthprabhu) నటించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ (Citadel: Honey Bunny). ఈ సిరీస్లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్లో సత్తా చాటింది. బెస్ట్ వెబ్ సిరీస్గా అవార్ట్ను దక్కించుకుంది. ఈ సందర్భంగా హనీ బన్నీ డైరెక్టర్ డీకే సంతోషం వ్యక్తం చేశారు. ఈ వెబ్సిరీస్ తీయడం వెనుక చాలా మంది కష్టముందని.. అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి మంచి టాక్ అయితే వచ్చింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్కు ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డేటింగ్ రూమర్స్..కాగా.. సమంత ఇటీవల పికిల్ బాల్ లీగ్లో మెరిసింది. చెన్నైలో జరిగిన ఈవెంట్కు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఇద్దరూ కలిసి పికిల్ బాల్ కోర్టులో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. -
ఓటీటీలో సెడెన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 'బేబీ జాన్'
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది.బేబీ జాన్ చిత్రం సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది.బేబీ జాన్ కోసం గ్లామర్ డోస్ పెంచిన కీర్తిబేబీ జాన్ మూవీ సాంగ్లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు నెట్టింట వైరల్ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్లో అక్క పేరుతో ఓ వెబ్సిరీస్లో కీర్తి సురేష్ నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సీరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
హై-ఎండ్ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కొన్న హీరో వరుణ్ ధావన్ : ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ ‘బేబీజాన్’ ఫ్లాప్ గురించి ఎంతమాత్రం కాదు. ముంబైలోని ఖరీదైన జుహూ ఏరియాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్స్ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరి కోసం ఆ ఫ్లాట్లు కొన్నాడు. తెలుసుకుందాం ఈ కథనంలో..ముంబైలోనిముంబైలోని అత్యంత ప్రీమియం జుహు ఏరియాలో ట్వంటీ అనే హై-ఎండ్ ప్రాజెక్ట్లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. వీటి ధర ఏకంగా రూ.86.92 కోట్లు. ఫ్యామిలీతో కలిసి ఒకటి భార్య నటాషా దలాల్ కోసం , మరోకటి తల్లి కరుణ్ ధావన్కోసం వీటిని సొంతం చేసుకున్నాడు.ఈ ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్ను నటాషా దలాల్తో కలిసి కొన్నాడు. దీని విస్తీరం 5112 చదరపు అడుగులు. ధర రూ.44.52 కోట్లు. ఇందులో నాలుగు కారు పార్కింగ్ స్థలాలున్నాయట. ఇక తల్లి కోసం ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్తో కలిసి వరుణ్ మరో 4617 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంటుంది.విలాసవంతమైన ప్రాజెక్ట్ గురించి మరింత చెప్పాలంటే, ఇది ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల్లో పెద్ద డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ప్రాజెక్ట్లో ప్రీమియం సౌకర్యాలతో 3BHK , 4BHK నివాసాలు ఉన్నాయి. అలాగే ముంబైలోని జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందా తదితర హీరోలకు కూడా ఇక్కడ ఇళ్లున్నాయి. ఇక బాంద్రాలో బాలీవుడ్ స్టార్హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటివాళ్ల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. (ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం)వరుణ్ ధావన్ తన చిన్నప్పటి నుంచి తన తండ్రి, నిర్మాత డేవిడ్ ధావన్ ద్వారా బాలీవుడ్తో దగ్గరి సంబంధాలతో పెరిగాడు. అయితే ధావన్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపింది. 1990లలో డేవిడ్ అనేక విజయాలను అందించినప్పటికీ. నిర్మాత జీవితం దర్శకుడి జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి పెద్దగా సంపాదించలేదన్నారు. అలా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నుంచి ముంబైలోని ఎలైట్ సెలబ్రిటీ హాట్స్పాట్లో రెండు లగ్జరీ రియల్ ఎస్టేట్లను కొనుగోలు దాకా వరుణ్ ఎదగడం విశేషమే మరి.ఇదీ చదవండి : రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూవీ రీమేక్గా దీన్ని తీసుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్కాలేకపోయింది. కొత్త పెళ్లికూతురుగా పసుపుతాడుతో కీర్తి సురేష్ ప్రమోషన్స్లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ‘బేబీ జాన్’ డిజాస్టర్ గా మిగిలి పోయింది. -
బేబీ జాన్ పై బాలీవుడ్ ఆడియెన్స్ కు అంత కోపం ఎందుకు?
-
ఓటీటీలో కీర్తీ సురేష్ భారీ డిజాస్టర్ సినిమా
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. వాస్తవంగా సినిమా విడుదలైన సమయం నుంచి సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని మొదట అనుకున్నారట. అయితే, సినిమా ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జనవరి చివరి వారంలో బేబీ జాన్ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఓటీటీలో తెలుగు, తమిళ్ భాషలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
సౌత్ సినిమాల మధ్య నలిగిపోతున్న బేబీ జాన్..
-
చాలా మంది హీరోల నుంచి కీర్తి సురేష్ ని నేను కాపాడాను..
-
పుష్ప-2 చూద్దామని థియేటర్కు వెళ్లారు.. తీరా పోస్టర్ చూస్తే!
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.సినిమా రిలీజైన రోజు నుంచి నార్త్లో పుష్ప-2 ఓ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. దక్షిణాది కంటే హిందీలోనే భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో పుష్పరాజ్ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ముందుగానే పుష్ప-2 ప్రదర్శించే థియేటర్లలో టికెట్స్ ముందుగానే బుక్ అవుతున్నాయి.పుష్ప-2కు బదులు బేబీ జాన్..తాజాగా పుష్ప-2 మూవీ చూడాలని టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. షో టైమ్కు థియేటర్కు వెళ్తే అక్కడా పుష్ప-2 బదులుగా బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రదర్శించారు. దీంతో థియేటర్ యాజమాన్యంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం చేశారు. థియేటర్ ముందే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.కాగా.. వరుణ్ ధావన్ నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అట్లీ కథను అందించగా.. కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ సినిమా తేరీ రీమేక్గా తెరకెక్కించారు.Many theatres are forcing people to watch film #BabyJohn while they bought tickets for film #Pushpa2! Distributor Anil Thadani should take strict action against such theatres. While Ppl should file case against fraud @bookmyshow in consumer court. pic.twitter.com/yMRsrPm52k— KRK (@kamaalrkhan) December 25, 2024 -
కీర్తి సురేశ్ 'బేబీ జాన్' ట్విటర్ రివ్యూ
హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) తొలి హిందీ సినిమా 'బేబీ జాన్' (Baby John Movie) చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'తెరి' సినిమాకు ఇది రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించాడు. కీర్తితో పాటు వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. ట్రైలర్తోనే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మూవీని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇంతకీ మూవీ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది గానీ మరీ సూపర్ బంపర్ అనట్లేదు. తొలి 40 నిమిషాలు డీసెంట్గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల మాత్రం హార్డ్ హిట్టింగ్ సీన్స్తో చూపించారని అంటున్నారు. సెకండాఫ్ని యాక్షన్ సన్నివేశాలతో నింపేశారని, క్లైమాక్స్ సాలిడ్గా ఉందని అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటున్నారు.యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ, కాస్త రొమాన్స్.. ఇలా అన్ని అంశాల మిక్స్ చేసి తీసిన మాస్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్'కి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హీరోగా చేసిన వరుణ్ ధావన్, గెస్ట్రోల్ చేసిన సల్మాన్ ఖాన్ (Salman Khan) అదిరిపోయే ఫెర్మార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!)#BabyJohnReview : ⭐⭐⭐1/2.#BabyJohn is a massy hilarious ride crafted to captivate large audiences. The perfect mix of action, emotions, drama, & humor, coupled with lead actors outstanding performance, delivers an incredibly entertaining & enjoyable cinematic experience.👍 pic.twitter.com/8DMSxR1RKB— Always Bollywood (@AlwaysBollywood) December 25, 2024#BabyJohn Received Extraordinary Response From The Audience.Everyone Appreciate The Performance Of #VarunDhawan & #SalmanKhan's Cameo And Loudly Praise Him.Blockbuster Loading 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #BabyJohnReview pic.twitter.com/6h8LwgdgKx— Filmy_Duniya (@FMovie82325) December 25, 2024@Varun_dvn Is back with a BANG 🔥 #BabyJohn is the perfect blend of action, drama, romance, comedy & a killer music album! The punchlines and punches, both land so well that it will leave you speechless. The twists, the sound effects, everything make it a MUST WATCH. (1/2) pic.twitter.com/PJONKGkmO1— ekta | VD stan ✨ (@crazyvaruniac_) December 24, 2024Round 1 #BabyJohn Mass 🔥 pic.twitter.com/peivaAjeSf— sahil. (@shutupsahill) December 25, 2024Agree or die Best Title Card ever in the Bollywood cinema 🔥#VarunDhawan #BabyJohn pic.twitter.com/MeYu6kB0Oa— BUNNY (@BabyJohnDec25) December 24, 2024THIS MANNNN!!!! 🔥🤯ONE OF THE BEST ENTRY SCENE FOR SALMAN KHAN!! THE CENIMA WILL TURN INTO STADIUM !! 🥶GET READY FOR "AGENT BHAIJAAN" 🔥🌋🥵#BabyJohn #SalmanKhan #Christmas #MerryChristmas #BabyJohnreview #Sikandar #SikandarTeaser pic.twitter.com/DLmAmdMkab— it's cinema (@its_cinema__) December 24, 2024Only south Directors know how to present superstar like Salman Khan#BabyJohn #SalmanKhan pic.twitter.com/FJuFncJHtz— 𝙳𝚛 𝙼𝚞𝚓𝚓𝚞 𝙺𝚑𝚊𝚗 (@MajesticMujju) December 24, 2024#BabyJohnReview ~ ENTERTAINER!👌Rating: ⭐️⭐️⭐️½#BabyJohn offers GREAT ACTION, GOOD DIALOGUES, THRILLING BGM, and SOLID PERFORMANCEs by the lead and Supporting Actors🔥👌The first 40 minutes are just about decent, but 20 mins before the INTERVAL really HIT HARD! Thanks to… pic.twitter.com/VAAblSJ9Qb— CineHub (@Its_CineHub) December 25, 2024 -
ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్
బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. బుధవారం (డిసెంబర్ 25)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లయిన రెండు రోజులకే పర్సనల్ లైఫ్ను పక్కనపెట్టేసి సినిమా ప్రమోషన్స్లో మునిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్ (Baby John Movie) హీరో వరుణ్ ధావన్తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఎప్పుడూ పెళ్లి టాపికే..ఈ సందర్భంగా వరుణ్ ధావన్ (Varun Dhawan) మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ పెళ్లి గురించే మాట్లాడుకునేవాళ్లం. నాకేమో పెళ్లయిపోయింది. తనేమో పెళ్లికి రెడీ అవుతోంది.. కాబట్టి ఈ హడావుడి గురించే ఎప్పుడూ కబుర్లాడుకునేవాళ్లం. వివాహమయ్యాక నేను మంచి ఇల్లాలుగా ఉంటాననేది. సినిమాలో తను ఎలాంటి భార్యగా నటించిందో చూడండి.. తనకు వైఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయాలంటారు. నిజానికి కీర్తి ఎంతోమంది మనసులను ముక్కలు చేసింది. (చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్)అదే బెటర్ అనిపించింది!తను ప్రేమలో ఉన్న విషయం ఏళ్ల తరబడి ఎవరికీ తెలియదు అన్నాడు. ఇంతలో కీర్తి మధ్యలో కలుగజేసుకుంటూ నాకు బాగా దగ్గరైనవాళ్లకు తెలుసు. అట్లీ, అతడి భార్య, అలాగే వరుణ్తో సినిమా చేస్తున్నప్పటి నుంచి తనకూ తెలుసు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్కు కూడా తెలుసు. ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకపోడమే బెటర్ అనిపించింది అని చెప్పుకొచ్చింది.చాలామంది హీరోలు తన నెంబర్ అడిగారువరుణ్ మాట్లాడుతూ.. మేము ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది తన ఫోన్ నెంబర్ పంపించమని మెసేజ్ చేశారు. ఎంతో మంది హీరోలు తన నెంబర్ అడిగారు. తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఎవరికీ నెంబర్ ఇవ్వకుండా తనను కాపాడాను. చివరకు నా బేబీ.. నాకే వదినగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు.చదవండి: Pushpa 2 Movie: దమ్ముంటే పట్టుకోరా.. -
ఎలాగైనా ఒక ప్రాణం నిలబెట్టాలనుకున్నా.. కానీ నా చేతుల్లోనే.. హీరో ఎమోషనల్
కొన్ని సంఘటనలు మనసును పట్టి కుదిపేస్తాయి. రోజులు గడుస్తున్నా ఆ ఘటనల నుంచి కోలుకోలేం. రెండేళ్లక్రితం తన జీవితంలోనూ అలాంటి విషాద సంఘటన చోటు చేసుకుందంటున్నాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. చాలాకాలం నేను ఏదో భ్రమలో బతికాను. జీవితమంటే ఏంటనేది మా డ్రైవర్ చనిపోయినప్పుడే తెలిసొచ్చింది.సీపీఆర్ చేసినా..2022 జనవరి 18న నా కారు డ్రైవర్ మనోజ్ సాహు మరణించాడు. ఆరోజు అతడిని ఎలాగైనా బతికించుకోవాలని ప్రయత్నించాం. తనకు సీపీఆర్ కూడా చేశాను. ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాం. ఒక ప్రాణాన్ని కాపాడాలనుకున్నాం. కానీ ఆస్పత్రికి వెళ్తే అప్పటికే అతడి ఊపిరి ఆగిపోయిందన్నారు. నా చేతుల్లోనే అతడు మరణించాడు. ఈ సంఘటన నన్ను ఎంతో డిస్టర్బ్ చేసింది. మునుపటిలా లేనుఅలా అని అక్కడే ఆగిపోలేం కదా.. జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ ఘటనకు ముందు వరుణ్ వేరు, ఇప్పుడున్న వరుణ్ వేరు. నా మెదడులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉండేవి. అప్పటినుంచి భగవద్గీత, మహాభారతం చదవడం ప్రారంభించాను అని చెప్పుకొచ్చాడు. కాగా వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన -
అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన మొదటి హీరో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్పై బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ స్పందించారు. ఇలాంటి ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు కదా?అని ప్రశ్నించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేయడం సరికాదని వరుణ్ ధావన్ మద్దతుగా నిలిచారు.(ఇది చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్)ప్రస్తుతం బేబీ జాన్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వరుణ్ ధావన్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. జైపూర్లో నిర్వహించిన ఈవెంట్లో వరుణ్ ధావన్ మాట్లాడారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి#VarunDhawan On #AlluArjun Arrest:'Actor Can't Take Everything On Himself. This Is Unfortunate'#BabyJohn #AlluArjunArrest pic.twitter.com/ofik8BhdNH— Ashwani kumar (@BorntobeAshwani) December 13, 2024 -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
పబ్లో వాళ్లతో కలిసి పార్టీ చేసుకున్న సమంత (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. ట్రెండింగ్ లో 'బేబీ జాన్' సాంగ్ (ఫొటోలు)
-
'బేబీ జాన్' కోసం కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. పూర్తి సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్ సాంగ్ విడుదలైంది. కోలీవుడ్లో సూపర్ హిట్ సినిమా 'తెరి'కి రీమేక్గా బేబీ జాన్ రానుంది. కీర్తీ సురేశ్, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.బేబీ జాన్ నుంచి విడుదలైన తాజా సాంగ్లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్లాక్ సీన్లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేనని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
సమంత కష్టాలు చిన్నవి కావు.. ఒకరోజు ఆక్సిజన్ ట్యాంక్..
బాలీవుడ్ హీరో వరుణ్ధావన్, టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ. ఈ థ్రిల్లర్ షోకి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.సమంత కోసం ఆక్సిజన్ ట్యాంక్అతడు మాట్లాడుతూ.. సమంతతో కలిసి నటిస్తున్నప్పుడు కొంచెం టెన్షన్పడేవాడిని. ఎందుకంటే ఒక రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కళ్లు మూసుకుని ఇది మళ్లీ అలాంటి రోజే అని చెప్పింది. అప్పటికే మేము రెండు గంటలుగా షూట్ చేస్తున్నాం. తర్వాత కాస్త బ్రేక్ చెప్పారు. వెంటనే ఒక ఆక్సిజన్ ట్యాంక్ వచ్చింది. అది సమంత కోసమే! తన పరిస్థితి చూసి భయమేసింది.ఉన్నట్లుండి పడిపోయిందిఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి లీవ్ తీసుకోవచ్చు.. కానీ ఆమె అలా చేయలేదు. పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మరోసారి ఏమైందంటే.. సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్లో షూటింగ్.. తను నా వెనక పరిగెత్తాలి. నేను పరిగెత్తుతున్నా.. తనూ నా వెనకే వేగంగా వస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి కుప్పకూలింది. నేను వెంటనే తనను పట్టుకుని ప్యాకప్ చెప్పాను.తనొక ఇన్స్పిరేషన్అయితే రాజ్ అండ్ డీకే టెన్షన్ పడొద్దన్నారు. కాసేపటికి తనే మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అలాంటి కండీషన్లోనూ తను సత్తువ కూడదీసుకుని యాక్ట్ చేస్తుందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. సమంత కష్టాల ముందు నావి చాలా చిన్నవి. ఆమె నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు.మయోసైటిస్కాగా మయోసైటిస్ వ్యాధివల్ల సిటాడెల్ సిరీస్ చేయడానికి మొదట సమంత ఒప్పుకోలేదు. తనకు బదులుగా వేరే హీరోయిన్లను సంప్రదించమని అడిగింది. అయినా దర్శకులు సమంతే కావాలని పట్టుపట్టడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు.చదవండి: నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య -
నా కూతురి జోలికొస్తే చంపేస్తా: బాలీవుడ్ హీరో
కూతురి కంటే తండ్రికి ఏదీ ఎక్కువ కాదు. తన గారాలపట్టి కోసం ఆకాశంలోని చందమామను తీసుకురావడానికైనా వెనుకాడడు. తండ్రీకూతుళ్ల అనుబంధం అలాంటిది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఇలాంటి ప్రేమబంధంలోనే మునిగితేలుతున్నాడు. వరుణ్-నటాషా దలాల్ జంటకు ఈ ఏడాది జూన్లో పండంటి కూతురు పుట్టింది. ఆమెకు లారా అని నామకరణం చేశారు.చంపేయాలన్నంత కోపంకూతురు పుట్టాక తనలో వచ్చిన మార్పు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ఏ మనిషైనా పేరెంట్ అయ్యాక కచ్చితంగా మారతాడు. అలా మగవాడు తండ్రయ్యాక.. కూతురికి ఏమీ కానివ్వకుండా ఎక్కువ రక్షణ కల్పిస్తాడు. ఎవరైనా తనను కాస్త బాధపెట్టినా, చేయి చేసుకున్నా సరే వాళ్లను చంపేయాలన్నంత కోపం వస్తుంది. సీరియస్గా చెప్తున్నా.. నిజంగానే వాళ్లను చంపేయాలనిపిస్తుంది.ఈయన బాధేంటి? అనుకున్నాతండ్రయ్యాకే మా నాన్నను మరింత అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎంత పనున్నా సరే సమయానికి ఇంటికి వచ్చేవాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. అప్పుడు నాకస్సలు అర్థమయ్యేది కాదు. ఈయన బాధేంటి? అనుకునేవాడిని. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు.. ఎందుకు ఎప్పుడూ అతడితో ఉండాలంటాడు? అని విసుక్కునేవాడిని. ఇప్పుడు నాకు కూతురు పుట్టాక అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: గంగవ్వ ఎలిమినేట్.. ఆ కోరిక నెరవేరకుండానే.. -
సమంత కిల్లింగ్ లుక్స్.. ఘాటు పోజులిస్తూ ఆ హీరోతో ఫొటోషూట్ (ఫొటోలు)
-
నేను ఇప్పుడే వచ్చాను!
వరుణ్ ధావన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది. తాజాగా ‘బేబీ జాన్’ టెస్టర్ కట్ పేరుతో ఈ సినిమా కొత్త వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బేబీ వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పొచ్చుగా..’, ‘నాలాంటివాళ్లు గతంలో చాలామంది వచ్చి ఉండొచ్చు.. కానీ నేను తొలిసారిగా ఇప్పుడే వచ్చాను’ వంటి డైలాగ్స్తో పాటు ‘హో.. బేబీజాన్’ సాంగ్ వీడియోలో ఉంది. -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్న గొప్ప నటుడు. ఇప్పటికీ పలు టీవి షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఆయన్ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన టీవీ షో "కౌన్ బనేగా కరోడ్పతి"గా చెప్పొచ్చు. ఆ కార్యక్రమం ఆయనకు ఎంతో పేరునే గాక లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్పతి (KBC) 16లో, క్రికెటర్ వరుణ్ ధావన్తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆ కార్యక్రమంలో అమితాబ్ కాబోయే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలను గురించి కూడా చెప్పారు. ఈ గోల్డెన్ రూల్స్ని పాటిస్తే మంచి తల్లిదండ్రులుగా పిల్లల మనుసును గెలుచుకోగలరని అన్నారు. ఇంతకీ అవేంటి?. 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్' అంటే..ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్పతి (KBC) 16లో అమితాబ్ క్రికెటర్ వరణ్ ధావన్ తండ్రిగా నీ కొత్త జర్నీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవలే వరుణ ధావన్ నటాషా దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ధావన్ తన కుమార్తెతో కనెక్ట్ అవుతున్నానని, ఆమె వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడు అమితాబ్ ఈ దీపావళి నీకెంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ పండుగకి నీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేసిందని అన్నారు. దానికి ప్రతిస్పందనగా ధావన్ "ఆమె రాకతో ప్రతిదీ మారిపోవడం మొదలైంది. ఇప్పటికీ తనకు ఎలా దగ్గర అవ్వాలా అనే విషయం గురించి నేర్చకుంటూనే ఉంటున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు." ధావన్. ఆ తర్వాత అమితాబ్తో నాన్న విధులు గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో రాత్రిపూట మీ నిద్రకు ఇబ్బంది ఏర్పడేదా అని ధావన్ ప్రశ్నించగా..అందుకు అమితాబ్ బదులిస్తూ.. "తాను రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాడినని, కాకపోతే కాస్త ఆందోళనగా ఉండేదని అన్నారు. అంతేగాదు అప్పటికి ఒక కొత్త గాడ్జెట్ వచ్చిందని దాన్ని శిశువు బెడ్ పక్కన పెడితే వారి చిన్న శబ్దం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుందంటూ.. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు." అమితాబ్. ఇక వరుణ్ తన పాప పడుకునే సమయం గురించి మాట్లాడుతూ..తన కూతురు కోసం లాలి పాట కూడా పాడుతున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ పాటను కూడా ఆ షోలో పాడి వినిపించారు ధావన్. ఆ కార్యక్రమంలో చివరగా ధావన్ అమితాబ్ని నటుడిగా కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అని అడిగారు. అందుకు ఆయన ఒక సలహ సూచించారు. అది అత్యంత అమూల్యమైన రూల్ అని కూడా చెప్పారు. "ఎప్పుడూ మీ భార్యను సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఆమె సంతృప్తిగా ఉంటే అన్ని బాధ్యతలు సునాయాసంగా నెరవేరిపోతాయి. ఆమె సంతోషంగా ఉంటే కుమార్తె కూడా హ్యాపీగా ఉంటుంది. దీన్ని సదా గుర్తించుకోండి. కుటుంబానికి మూల స్థంభం భార్యే. ఆమె సంతోషంగా ఉంటే అన్ని పనులు వాటంతట అవే సులభంగా అయిపోతాయి. దీన్ని పాటిస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే గాక పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలుగుతారని అన్నారు." అమితాబ్.(చదవండి: విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!) -
'సిటాడెల్' రెండో ట్రైలర్.. 'సమంత' కోసమే అనేలా ఉందే
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సమంత భారీ యాక్షన్ సిన్స్తో దుమ్మురేపిందని చెప్పవచ్చు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ పేరుతో నవంబర్ 7న రానుంది.చాలారోజుల తర్వాత సమంత ఒక యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సిటాడెల్ ట్రైలర్లో సమంత యాక్షన్ సీక్వెన్స్ లో స్టంట్స్ చేసింది. ఇందులో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ అదరగొట్టేశారు. ముఖ్యంగా రెండో ట్రైలర్లో ప్రధానంగా సమంతను హైలైట్ చేస్తూ చూపించారు. సిటడెల్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఇండియన్ వెర్షన్ భారీగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 7న హిందీ, తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. -
శ్రీలీల తప్పుకొంది.. పూజా హెగ్డేకి ఛాన్స్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేస్తున్న మూవీ 'హే జవానీతో ఇష్క్ హోనా హై'. రమేష్ తురానీ దర్శకుడు. మెయిన్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ చేస్తోంది. మరో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. కానీ శ్రీలీల ప్లేస్లో పూజా హెగ్డే నటించనున్నారనే టాక్ బీటౌన్లో తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఇతర సినిమాలతో బిజీగా ఉంటూ ఈ సినిమా షూటింగ్కు కాల్షీట్స్ కేటాయించలేని కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా మొదలవడంతో శ్రీలీల ఎగ్జిట్ అయ్యారని బాలీవుడ్ భోగట్టా. దాంతో పూజా హెగ్డే ఎంట్రీ అయ్యారట. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఓ సీక్రెట్ చెప్పనా..!
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను రూపొందించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్ చెప్పనా.. నేనొక ఏజెంట్’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సిరీస్లో సినీ నటి హనీగా సమంత, స్టంట్ కొరియోగ్రాఫర్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్. ఈ ఇద్దరూ ఓ మిషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
సమంత గ్లామరస్ లుక్.. 'సిటాడెల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత
సమంత సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా యాక్టింగ్ కొన్నాళ్లు పక్కనబెట్టేసింది. కొత్త మూవీస్ కూడా పెద్దగా ఒప్పుకోలేదు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకులు.. 'సిటాడెల్: హనీ-బన్నీ' పేరుతో ఓ సిరీస్ తీస్తున్నారు. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్)ట్రైలర్ చూస్తే సిరీస్ అంతా ఫుల్ యాక్షన్ ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. ఇందులో సమంత ఓ సీక్రెట్ ఏజెంట్. ఈమెకు ఓ కూతురు కూడా ఉంటుంది. మరోవైపు వరుణ్ కూడా సీక్రెట్ ఏజెంట్. వీళ్లిద్దరూ ఎలా కలిశారు? ఏ మిషన్స్ పూర్తి చేశారు అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ట్రైలర్లోనే ఫుల్ యాక్షన్ దట్టించారు. గన్ ఫైరింగ్, ఫైటింగ్.. ఇలా సమంత అదరగొట్టేసింది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ట్రైలర్తోనే బజ్ వచ్చిందంటే మాత్రం సిరీస్పై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. సమంత కొత్త ట్రైలర్పై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
బేబీ జాన్లో అతిథిగా సల్మాన్ ఖాన్
‘బేబీ జాన్’కు అతిథి అయ్యారు సల్మాన్ ఖాన్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’. హిందీలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ తొలి చిత్రంలో నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ అతిథిపాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సల్మాన్–వరుణ్ ధావన్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.అంతేకాదు... సల్మాన్ ఖాన్–వరుణ్ ధావన్లపై వచ్చే యాక్షన్ సీన్స్ని మాత్రం ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అట్లీ తీస్తున్నారట. ఇక తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘తేరీ’కి హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రం వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
తారలు మెరిసే... ఫ్యాన్స్ మురిసే...
ప్రియాంకా చో్ప్రా, సమంత ఒకే వేదికపై మెరిశారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, చిరు నవ్వులు చిందిస్తూ వీరు ఫొటోలకు ΄ోజులివ్వగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారి ఫ్యాన్స్ ఆనందంతో మురిసి΄ోతున్నారు. ఇంతకీ సమంత, ప్రియాంకా చో్ప్రా ఎక్కడ కలిశారనే విషయానికి వస్తే... వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో రూ΄÷ందిన స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మాధ్యమంలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ ప్రీమియర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచవ్యాప్త సినీ తారలతో ΄ాటు సమంత, ప్రియాంకా చో్ప్రాలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఇక రిచర్డ్ మాడెన్, ప్రియాంకా చో్ప్రా లీడ్ రోల్స్లో దర్శక ద్వయం న్యూటన్ థామస్– జెస్సికా రూ΄÷ందించిన అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రూ΄÷ందింది. అమెరికన్ ‘సిటాడెల్’ తొలి సీజన్ 2023 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘సిటాడెల్’కు సెకండ్ సీజన్ కూడా రూ΄÷ందుతోందని, ఈ సీజన్లో కూడా ప్రియాంకా చో్ప్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. -
బన్నీ... హనీ... భారీ ఫైట్
పేరు హనీ... అంత మాత్రాన స్వీట్ గాళ్ అనుకుంటే పొరపాటే. శత్రువులను రఫ్ఫాడించేటప్పుడు గరమ్ గాళ్ అయిపోతుంది. ఈ పవర్ఫుల్ రోల్లో సమంత కనిపించనున్న సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ. బన్నీగా వరుణ్, హనీ పాత్రలో సమంత కనిపిస్తారు. గురువారం ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. ఒకవైపు వరుణ్ ధావన్... మరోవైపు సమంత.... ఇద్దరూ పోటాపోటీగా విలన్లను రఫ్ఫాడిన దృశ్యాలు ఈ టీజర్లో కనిపించాయి.ఈ భారీ ఫైట్ని సమంత అవలీలగా చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. హాలీవుడ్ టీవీ సిరీస్ ‘సిటాడెల్’కి ఇండియన్ వెర్షన్ ఇది. సమంత ఓ లీడ్ రోల్లో ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్కి దర్శకత్వం వహించిన రాజ్– డీకే ‘సిటాడెల్’కి దర్శకులు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. -
సమంత ‘సిటాడెల్: హనీ-బన్నీ’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
సమంత ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. 'సిటాడెల్' రిలీజ్పై ప్రకటన
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్తో రుస్సో బ్రదర్స్ దీనిని నిర్మిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఇందులో సమంతతో పాటుగా వరుణ్ధావన్ నటిస్తున్నారు. తాజాగా సిటాడెల్ స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రేమ్ ప్రకటించింది.స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. ఈమేరకు టీజర్ను కూడా విడుదల చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత నటించిన బాలీవుడ్ వెబ్సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ సిరీస్లో సమంత స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్లలో సమంత దుమ్మురేపిందని టాక్. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ సిటాడెల్ వెబ్సిరీస్లో నటించారు. ఇప్పుడు బాలీవుడ్లో సమంత, వరుణ్ ధావన్లతో తెరకెక్కించారు. అయితే, ఈ సిరీస్ కోసం ఎలాంటి డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్లలో సమంత నటించినట్లు తెలుస్తోంది. -
హీరో ఇంటిని రెంట్కు తీసుకోనున్న స్టార్ జంట!
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, నటాషా దలాల్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన భార్య నటాషా దలాల్ ఈ ఏడాది జూన్ 3న బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వీరికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. త్వరలోనే ఈ జంట కొత్త బంగ్లాకు మారుతున్నట్లు తెలుస్తోంది.ముంబయిలోని జుహులో హృతిక్ రోషన్కు చెందిన విలాసవంతమైన ఫ్లాట్కు షిఫ్ట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హృతిక్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. కానీ ప్రస్తుతం ఆయన రూ.100 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్కు మారిపోయారు.దీంతో వరుణ్ ధావన్ ఆ ఇంటిని రెంట్కు తీసుకోబోతున్నట్లు సమాచారం. సముద్రం పక్కనే ఉండే ఇల్లు అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల ఇళ్ల పక్కనే ఈ ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం వరుణ్ తన కుటుంబంతో కలిసి 2017లో కొనుగోలు చేసిన జుహు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. సినిమాల విషయానికొస్తే వరుణ్ ధావన్ అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్లో కనిపించనున్నారు. -
తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష్మి పుట్టిందని వీడియో పోస్ట్
మరో హీరో తండ్రయ్యాడు. తాజాగా తమిళ హీరో శివకార్తికేయన్ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వగా, ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా తండ్రి హోదాలోకి వచ్చేశాడు. ఇతడి భార్య నటాషా.. సోమవారం రాత్రి ఆడపిల్లని ప్రసవించింది. ప్రస్తుతం తల్లిబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్)తండ్రి డేవిడ్ ధావన్ 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత బద్లాపూర్, అక్టోబర్, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ, బేడియా తదితర చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'బేబీ జాన్', 'సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారి' అనే మూవీస్ చేస్తున్నాడు.వరుణ్ ఫ్యామిలీ విషయానికొస్తే 2021లో నటాషా దలాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వరుణ్కి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ప్రేమకథ ఆరంభం
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ల కొత్త ప్రేమకథ మొదలైంది. ‘బవాల్’ సినిమా తర్వాత వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే ప్రేమకథా చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. సన్నీ పాత్రలో వరుణ్, తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని ఊహించవచ్చు.శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారం మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరుణ్ ధావన్తో పాటు ఈ సినిమా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది. -
బాలీవుడ్ ఎంట్రీ.. రెచ్చిపోతున్న కీర్తిసురేశ్!
ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్. కెరీర్ ప్రారంభం నుంచే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ రజనీమురుగన్, రెమో, భైరవా, సామి 2 చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో చేరారు. ఈ మధ్య నటించిన మామన్నన్, సైరన్ చిత్రాల వరకూ గ్లామర్కు దూరంగానే ఉంటూ వచ్చారు.బాలీవుడ్లో ఎంట్రీతెలుగులో మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో గ్లామర్గా కనిపించినా శ్రుతిమించి పోలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్లోకి అడుగు పెట్టారో పూర్తిగా గ్లామర్కు ఓటేస్తున్నారు. హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది కీర్తీసురేష్ను చూస్తుంటే! తెలుగు, తమిళంలో సక్సెస్లు ఉన్నా, అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.వరుణ్ ధావన్ బర్త్డేబేబీజాన్ చిత్రం ద్వారా కీర్తి బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తేరి చిత్రానికి రీమేక్. ఈ మూవీని తమిళ టాప్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. బేబీజాన్ షూటింగ్ దశలో ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ బర్త్డే సెలబ్రేషన్స్ చిత్ర యూనిట్ మధ్య జరిగాయి. ఇందులో కీర్తీసురేష్ డీప్ నెక్ ఉన్న లెహంగాలో కనిపించింది. వరుణ్ ధావన్కు కేక్ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #KeerthySuresh from the sets of #Babyjohn ( Hindi remake of THERI) 🎬⭐️😎#VarunDhawan | #Atleepic.twitter.com/u3IkBELUtW— Tharani ᖇᵗк (@iam_Tharani) April 24, 2024 చదవండి: వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ కావొద్దు -
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో
యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా రంజాన్కు రిలీజ్ కానుంది. ఇకపోతే టైగర్ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 25 ఏళ్ల వయసులో లవ్.. ఈ మూవీ థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్పై జోకులు పేల్చాడు హీరో వరుణ్ ధావన్. ముందుగా యాక్షన్ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పాడు. ఫస్ట్ లవ్.. ఆమె కాదా? అయితే వరుణ్ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోకండి అని చెప్పాడు. దిశాతో డేటింగ్- బ్రేకప్ కాగా టైగర్ ష్రాఫ్- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Tiger talks about Disha and that she is his first gf and how he met her Varun: Kriti Sanon 😒🤣#KritiSanon pic.twitter.com/JSVtwZ3Dg1 — kariti_arab (@aaryan_koki) March 19, 2024 చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్పై ధనుష్ కామెంట్ -
జాన్వీ కపూర్- వరుణ్ ధావన్ జోడీ రిపీట్
బాలీవుడ్ మూవీ ‘బవాల్’ లో(2023) జోడీగా కనపించి ఆడియన్స్ను మెప్పించారు హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ జాన్వీ కపూర్. తాజాగా ఈ జోడీ రిపీట్ అవుతోంది. బాలీవుడ్లో ‘ధడక్’, ‘బద్రీనాథ్ హీ దుల్హనియా’ సినిమాలను తెరకెక్కించిన శశాంక్ కేతన్ తాజాగా ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తారు. కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ కేతన్ ఈ మూవీ నిర్మించనున్నారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. 2025 ఏప్రిల్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు జాన్వీ కపూర్. -
నా కుటుంబమే నా బలం
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఓ శుభవార్తను షేర్ చేశారు. తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘మేం తల్లిదండ్రులయ్యాం. మీ ఆశీర్వాదాలు కావాలి. మై ఫ్యామిలీ మై స్ట్రెన్త్ (నా కుటుంబమే నా బలం)’’ అంటూ తన భార్య నటషాదలాల్ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫోటోను షేర్ చేశారు వరుణ్ధావన్. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ నటషా దలాల్ను 2021 జనవరిలో వరుణ్ వివాహం చేసుకున్నారు. హిందీలో ప్రస్తుతం ‘బేబీ జాన్’ సినిమా చేస్తున్నారు వరుణ్ ధావన్. అలాగే ఆయన నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్సిరీస్ ఈ ఏడాది వేసవిలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేశారు. -
స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత!
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
పవన్ ఫ్యాన్స్కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. బయటకు చెప్పకుండా గుక్కపెట్టి ఏడుస్తున్నారు! ఇదంతా కూడా ఓ హిందీ సినిమా వల్లే? ఏంటి నిజమా అని మీరనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే పవన్ మొదలుపెట్టిన ఓ రీమేక్ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ మరో భాషలో మాత్రం అదే సినిమాకు రీమేక్గా తీస్తున్న మూవీ.. నెలల వ్యవధిలో విడుదలకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) పవన్ కల్యాణ్ మాట తప్పడంలో స్పెషలిస్ట్. 2019లో ఎన్నికల ముందు తను ఇక ప్రజలకే అంకితమైపోతానని అన్నాడు. తీరా ఎలక్షన్స్ అయిపోగానే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయేసరికి యూటర్న్ తీసుకున్నాడు. సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. పోనీ అవి అయినా సరిగా చేశాడా అంటే లేదు. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' అని రీమేక్ మూవీస్ చేశాడు. ఇవి అతడి ఫ్యాన్స్కి తప్పితే సగటు ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు! పైన చెప్పన మూడు సినిమాలతో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ'.. ఇలా రెమ్యునరేషన్ వస్తుంది కదా అని చెప్పి చాలా సినిమాల్ని ఒప్పేసుకున్నాడు. వాటిని పూర్తి చేయడంలో మాత్రం నాన్చుడు ధోరణి పాటించాడు. పైకి చెప్పట్లేదు గానీ కక్కలేక మింగలేక ఆయా చిత్రాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. (ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?) పవన్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడేళ్ల క్రితం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ప్రకటించారు. ఏమైందో ఏమో గానీ అది అలా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చి కొంత షూటింగ్ చేశారు. కానీ ఇప్పడది హోల్ట్లో పడిపోయింది. ఇది తమిళంలో వచ్చిన 'తెరి'(పోలీసోడు) చిత్రానికి రీమేక్. బయటకు చెప్పనప్పటికీ ఈ విషయం అందరికీ తెలుసు. అయితే 'తెరి' తెలుగు రీమేక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. కానీ హిందీలో మాత్రం వరుణ్ ధావన్ హీరోగా ఇదే మూవీని రీమేక్ చేస్తున్నారు. 'బేబీ జాన్' పేరుతో తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. 'తెరి' హిందీ రీమేక్ రిలీజ్ తేదీని కూడా ప్రకటించేసరికి.. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ తెగ గింజుకుంటున్నారు. పాపం వీళ్లకు ఏడుపు ఒకటే తక్కువైందని.. మిగతా హీరోల ఫ్యాన్స్ సైటెర్లు వేస్తున్నారు. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) -
భార్యకు స్పెషల్గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ఆలియా అవుట్..జాన్వీ ఇన్?
హిందీలో ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ చిత్రాల్లో వరుణ్ ధావన్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాలకు శశాంక్ కేతన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కేతన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్ సమాచారం. వరుణ్ ధావన్, ఆలియా భట్లను కూడా సంప్రదించారట. అయితే వరుణ్ ధావన్ సుముఖంగానే ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా మాత్రం ఈ సినిమాలో నటించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చాన్స్ జాన్వీ కపూర్కు వెళ్లిందట. ఈ సినిమాకు జాన్వీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయని టాక్. వేసవిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
బాలీవుడ్లోకి కీర్తీ సురేష్.. దర్శకుడిగా అట్లీ
వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలిస్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా హీరోయిన్స్గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ అక్టోబరు రెండో వారం వరకూ సాగుతుందట. వరుణ్, కీర్తీ కాంబోలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు, వరుణ్తో ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారట కాలిస్. కీర్తీసురేష్కు బాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్ ‘తేరీ’ హిందీ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కూడా బాలీవుడ్లో విని పిస్తోంది. -
స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!
బాలీవుడ్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్లపై మనసు పారేసుకుంటున్నారు! ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. షారుక్తో 'జవాన్' తీసిన తమిళ దర్శకుడు అట్లీ.. వరుణ్ ధావన్ సినిమాని మాత్రం నిర్మిస్తున్నాడు. కలీస్ దర్శకుడు. ఇదంతా పక్కనబెడితే షూటింగ్ మొదలైన రోజే హీరో గాయపడ్డాడనే వార్త అభిమానుల్ని కంగారు పెట్టింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'బవాల్' సినిమాతో ఈ మధ్య ప్రేక్షకుల్ని పలకరించిన వరుణ్ ధావన్.. 'VD18' వర్కింగ్ టైటిల్తో తీస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ప్రోమో కోసం కీలక ఎపిసోడ్స్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఓ యాక్షన్ సీన్లో భాగంగా పట్టుతప్పి కిందపడిపోయిన వరుణ్ మోచేతికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఇతడు.. 'నో పెయిన్ నో గెయిన్' (ఫలితం కావాలంటే నొప్పిని భరించాలి) అని రాసుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. వామిక గబ్బి మరో హీరోయిన్. ఇదిలా ఉండగా గతేడాది 'భేడియా' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్.. మొన్నీ మధ్య 'బవాల్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే పెట్టుకుని, గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) -
మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది. హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్ నుంచి తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్ డీన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ సోషల్ యాక్షన్ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్ చేశారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్ ప్రశ్నించారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) -
ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్న భామ ఇటీవల వరుణ్ ధావన్ సరసన నటించిన బవాల్ చిత్రం రిలీజైంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేశారు. జూలై 21 నుంచి ఆమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. కొన్ని సీన్స్పై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆష్విట్జ్తో ఉన్న సంబంధాలను తెరపై చూపించడంపై ఈ సినిమాపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఆష్విట్జ్ క్యాంపులను చూపించడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించారు. (ఇది చదవండి: కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) వివాదంపై జాన్వీకపూర్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్ దేశస్థుడైన వ్యక్తి నాకు తెలుసు. అతను ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. అతడి పూర్వీకులు దురదృష్టవశాత్తు నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అతను ఈ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. సన్నివేశాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా బాధించేలా చూపించలేదు. కాబట్టి ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది. మా ఉద్దేశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూపించడమే. మీరు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు. నా పాత్ర చూశాక వాళ్లకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు. అది నాకెంతో గర్వంగా అనిపించింది.' అని అన్నారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారని సమాచారం. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..బవాల్లో వరుణ్, జాన్వీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాస్ ఆడియన్స్కు బాగా నచ్చింది. (ఇది చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన టాలీవుడ్ నటి) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
జాన్వీ కొత్త మూవీ బవాల్ స్క్రీనింగ్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ప్యారిస్లో హనీమూన్..
వరుణ్ ధావన్ , జాన్వీ కపూర్ జంటగా నటించిన హిందీ చిత్రం ‘బవాల్’. ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక దుబాయ్లో జరిగింది. ఈ చిత్రంలో హిస్టరీ టీచర్ అజయ్గా వరుణ్ ధావన్ , నిషాగా జాన్వీ నటించారు. అజయ్, నిషాలు వివాహం చేసుకుని హనీమూన్ కోసం ప్యారిస్కు వెళతారు. అక్కడ వీరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా మేజర్ షూటింగ్ కూడా ప్యారిస్లోనే జరిగింది. అయితే ఈ మూవీలో రెండో ప్రపంచ యుద్ధానికి, వరుణ్–జాన్వీల ప్రేమకథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ చిత్ర యూనిట్ పేర్కొంది. ‘ప్రతి ప్రేమ కథకు, ఆ ప్రేమ తాలూకు యుద్ధం ఉంటుంది’ అన్న విజువల్స్ ట్రైలర్లో కనిపిస్తాయి. -
మాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్న రానా
టాలీవుడ్ హీరో రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్ ధావన్ హీరోలుగా నటించడం లేదట. వరుణ్ ధావన్ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్ నారంగ్ కూడా భాగస్వామ్యులు అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. ప్రస్తుతం హీరోగా రానా చేతిలో ఉన్న చిత్రాల్లో ‘రాక్షసరాజు’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ–రానా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో? ట్వీట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ ధావన్ భార్య నటాషాతో విడిపోనున్నట్లు ఓ ట్వీట్ వైరల్గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను వరున్ 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఏ పార్టీ, ఫంక్షన్స్ జరిగినా ఇద్దరూ కలిసే హాజరవుతుంటారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే సినీ సెలబ్రిటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్తో వార్తల్లో నిలిచే ఉమైర్సంధు ఇప్పుడు కూడా ప్రబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నాడని, ఇందులో నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. Everything is not “ Ok ” between #VarunDhawan & his wife #NatashaDalal. Separation is on the way !! pic.twitter.com/J5sCXpYnNX — Umair Sandhu (@UmairSandu) May 24, 2023 -
ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. (ఇది చదవండి: ‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’) అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈనెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి నటించింది. (ఇది చదవండి: మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్) కథేంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లలో సినిమా చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్
-
ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!
సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో అభిమానులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ ధావన్తో సిటాడెల్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో నటించింది. ఈ సిరీస్ ఈనెల 28న రిలీజ్ కానుండడంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల లండన్లో నిర్వహించిన ప్రీమియర్ కార్యక్రమంలో సమంత సరికొత్త లుక్లో కనిపించారు. బ్లాక్ డ్రెస్, ఖరీదైన డైమండ్ నగలతో వేదికపై మెరిసింది. అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు నెగెటివ్గా పోస్టులు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్లో తాను భాగం కావడం పట్ల సామ్ తన కాస్తా ఎక్కువగానే ఎగ్జైట్ మెంట్ ప్రదర్శించింది. కానీ కొత్తగా ఈ ఫేక్ యాక్సెంట్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన యాస మారుతుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. Warra Fake Accent 🤡🤡🤡 pic.twitter.com/WGJmElk2WC — 🐋 (@Bhaag_Saale) April 23, 2023 -
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్ -
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న మాస్ మహారాజ రవితేజ
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తుంటే, మన హీరోలు బాలీవుడ్ బాట పడుతున్నారు. సౌత్ సినిమాలు పాన్ఇండియా స్థాయిలో సత్తాచాటుతుండటంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పడింది. దీంతో తమ సినిమాల్లో సౌత్ స్టార్స్ ఉండేలా మేకింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లో వెంకటేశ్, వార్-2లో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్లో మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది. బీటౌన్ టాక్ ప్రకారం.. యంగ్ హీరో వరుణ్ ధావణ్తో కలిసి రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను రానా, కరణ్ జోహార్, ఏషియన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రానుందట. -
మోడల్ను ఎత్తుకుని ముద్దుపెట్టిన హీరో, సిగ్గు లేదంటూ ట్రోలింగ్!
రిలయన్స్ అధినేత ముఖేవ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)ని ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే! ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలే కాకుండా సినీ, క్రీడా ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవ రెండో రోజు కూడా పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్లతో స్టేజీని హోరెత్తించారు. ఈ క్రమంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ హాలీవుడ్ మోడల్ గిగి హ్యాడిడ్ను ఎత్తుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా చాలామంది హీరో వైఖరిని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. 'గిగి చాలా అసౌకర్యంగా ఫీలైంది', 'అతను అలా చేసి ఉండాల్సింది కాదు', 'బాలీవుడ్కు సిగ్గులేకుండా పోతోంది' అంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్పై వరుణ్ ధావన్ స్పందించాడు. 'మిమ్మల్ని మేల్కొపాలనుకుంటున్నాను. గిగిని స్టేజీపై ఎత్తుకుని ముద్దుపెట్టడం అనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఇక మామీద రచ్చ చేయడం ఆపి మీ పని చూసుకోండి' అని స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. దీనిపై వరుణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. అనవసరంగా మా హీరో మీద పడి ఏడ్చారు కదరా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఎన్ఎంఏసీసీ లాంఛింగ్ కార్యక్రమంలో ప్రియాంక - రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీని దద్దరిల్లిపోయేలా చేశారు. రష్మిక మందన్నా, ఆలియా భట్ అయితే నాటునాటు స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హాలీవుడ్ సెలబ్రిటీలు లా రోచ్, టామ్ హాలాండ్, జెండాయా సహా పలువురు తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I guess today you woke up and decided to be woke. So lemme burst ur bubble and tell u it was planned for her to be on stage so find a new Twitter cause to vent about rather then going out and doing something about things . Good morning 🙏 https://t.co/9O7Hg43y0S — VarunDhawan (@Varun_dvn) April 2, 2023 Yes exactly Gigi Hadid 🥰 THAT would have been my reaction too if Varun lifted me up and danced with him for 5 secs. pic.twitter.com/ExfCE3CaJK — Annesha (@ApnaaVarun) April 2, 2023 -
సమంత ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పిన ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్
సమంత ఫ్యాన్స్కు గుడ్న్యూస్. ఇటీవల మయోసైటిస్ బారిన పడిన సామ్ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. కాలు కూడా కదపలేని స్థితిలో ఉన్న సామ్ క్రమంగా కోలుకున్నారు. ఇక రీసెంట్గా శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన ఆమె తన చిత్రాల షూటింగ్స్ను మొదలు పెట్టేసింది. తాజాగా సామ్ తన వెబ్ సిరీస్ షూటింగ్ సెట్ అడుగుపెట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. చదవండి: అప్పుడే ఓటీటీకి వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! కాగా విడాకుల అనంతరం సమంత వరుసగా పలు భారీ ప్రాజెక్ట్స్కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. అందులో ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ ఒకటి. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సిరీస్ షూటింగ్లో తాజాగా సమంత పాల్గొన్నట్లు డైరెక్టర్స్ రాజ్-డీకే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత కొత్త లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో సామ్, మోడరన్ లుక్లో స్టైలిష్ కాప్లా కనిపిస్తోంది. చదవండి: సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ‘‘సామ్ ఈజ్ బ్యాక్’ అంటూ కొందరు.. ‘ఇంతవరకు సమంత ఇలా ఎప్పుడూ చూడలేదు’, ‘ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ‘రుస్సో బ్రదర్స్’ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ను సీటాడెల్ అనే ఫ్రాంచైజ్లో భాగంగా ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్గా రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తుండగా సమంత కీ రోల్ పోషించనుంది. Super excited to team up with this powerhouse once again! Welcome @Samanthaprabhu2 to the world of Citadel! Now filming 🎬@Varun_dvn #RussoBrothers @MenonSita @d2r_films @agbo_films @PrimeVideoIN @AmazonStudios pic.twitter.com/yuoigSDiTd — Raj & DK (@rajndk) February 1, 2023 -
హాలీవుడ్ వెబ్... బాలీవుడ్ హబ్!
హాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కావడం కొత్తేం కాదు. అయితే కరోనా తర్వాత మొదలైన వెబ్ సిరీస్ల హవా వల్ల ఇప్పుడు బాలీవుడ్ హబ్గా పలు హాలీవుడ్ సిరీస్లు కూడా రీమేక్ అవుతున్నాయి. విదేశీ కథలతో దేశీ తారలు చేస్తున్న ఈ వెబ్ సిరీస్ల గురించి తెలుసుకుందాం. దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డొనవన్’కు రీమేక్గా ‘రానా నాయుడు’ రూపొందింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలో ఓ స్పష్టత వస్తుంది. నేర ప్రపంచంలో సెటిల్మెంట్స్ చేసి డబ్బు సంపాదిస్తుంటాడు ఓ వ్యక్తి. అయితే అతని తండ్రి విడుదలైన తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ తండ్రీ కొడుకుల కథ ఏంటి? అన్నదే ‘రానా నాయుడు’ ప్రధాన కథాంశం. 2013లో మొదలైన ‘రే డొనవన్’ సిరీస్ ఏడుసీజన్లుగా 19 జనవరి 2020 వరకూ సాగింది. మరోవైపు నైట్ మేనేజర్గా వెబ్ వీక్షకుల ముందుకు వస్తున్నారు యువ హీరో ఆదిత్యారాయ్ కపూర్. అనిల్ కపూర్, శోభితా ధూళ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్కు సందీప్ మోది దర్శకుడు. బ్రిటిష్ క్రైమ్ డ్రామా ‘ది నైట్ మేనేజర్’కు రీమేక్గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈ నెలలో స్ట్రీమింగ్ కానుంది. ఓ స్టార్ హోటల్లో పని చేసే ఓ నైట్ మేనేజర్ అదే హోటల్కు గెస్ట్గా వచ్చిన ఓ యువతిని ఇష్టపడతాడు. అయితే అనుకోకుండా అతను ఆయుధాలను అక్రమ రవాణా చేసే ఓ ముఠా నాయకుడి చేతిలో చిక్కుకుంటాడు. అప్పుడు ఆ నైట్ మేనేజర్ ఏం చేశాడు? అన్నదే కథ. ఇక అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రివెంజ్’ సిరీస్ హిందీలో రీమేక్ కానుంది. ఇందులో లీడ్ రోల్ను రవీనా టాండన్ చేయనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానుంది. ‘రివెంజ్’ కథ విషయానికి వస్తే... తన తండ్రి మరణానికి కారకులైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఒక సాధారణ యువతి ఏ విధంగా పగ తీర్చుకుంది? అన్నదే కథాంశం. ఇంకోవైపు మరో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘సిటా డెల్’ హిందీలో రీమేక్ అవుతోంది. హిట్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శకులు రాజ్ అండ్ డీకే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్ చేస్తున్నారు. దేశరక్షణ కోసం ఓ గూఢచారి ఎలాంటి సాహసాలు చేయాల్సి వస్తుంది? అనే నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. కాగా మరికొన్ని ఫారిన్ సిరీస్ లకు దేశీ వెర్షన్ రానుంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ప్రస్తుతం కొన్ని ఫారిన్ వెబ్ సిరీస్లు హిందీలో రీమేక్ అవుతుండగా ఆల్రెడీ కొన్ని సిరీస్లు ఇండియాలో రీమేక్ అయ్యాయి. జర్నలిజం నేపథ్యంలో రూపొందిన బ్రిటిష్ సిరీస్ ‘ప్రెస్’ హిందీ రీమేక్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీ బింద్రే ఓ లీడ్ రోల్ చేశారు. ఇజ్రాయెల్ సిరీస్ ‘హోస్టేజెస్’ అదే పేరుతో హిందీలో రీమేక్ కాగా ఇందులో రోనిత్ రాయ్, టిస్కా చోప్రా లీడ్ రోల్స్ చేశారు. అలాగే బ్రిటిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘లూథర్’ హిందీ రీమేక్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’లో అజయ్ దేవగన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు చేశారు. ఇదే కోవలో డచ్ (నెదర్లాండ్) డ్రామా సిరీస్ ‘పెనోజా’ ఆధారంగా ‘ఆర్య’ హిందీలో రాగా, ఇందులో సుష్మితా సేన్ ప్రధాన ΄ాత్రధారి. అలాగే అమెరికన్ సిరీస్లు ‘క్రిమినల్ జస్టిస్’ (మూడు సీజన్లు), ‘ది ఆఫీస్’(రెండు సీజన్లు) నెట్టింటి వీక్షకుల ముందుకు వచ్చాయి. -
వదినతో మాట్లాడుతున్నా.. ఆ తర్వాతే ప్లాన్ చేద్దాం: వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ బాలీవుడ్లో ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కృతిసనన్తో కలిసి ఆయన నటించిన బేఢియా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఆలియా భట్తో కలిసి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు యంగ్ హీరో. ఈ సందర్బంగా ఆలియా భట్తో పాటు పాల్గొన్న వరుణ్ ధావన్కు ఉహించని ప్రశ్న ఎదురైంది. ఆలియా భట్ ఇటీవలే తల్లి అయ్యారు కదా.. మీరెప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారంటూ వరుణ్ ధావన్ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ..'నేను కూడా ప్లాన్ చేయాల్సిందే. ఈ విషయంపై వదినతో మాట్లాడుతున్నా.. ఈరోజు నుంచే ప్లాన్ షురూ చేద్దాం.' నవ్వుతూ సమాధామిచ్చారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అలియా తల్లి అయినందుకు అభినందనలు తెలిపారు. కాగా.. ఇటీవల అలియా, రణబీర్ కపూర్ జంటకు నవంబర్ 2022లో ఆడపిల్లను జన్మించిన సంగతి తెలిసిందే. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను జనవరి 24, 2021న అలీబాగ్లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా.. కరణ్ జోహార్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీలతో నటించనుంది. మరోవైపు వరుణ్ చివరిగా భేదియాలో కృతి సనన్తో కనిపించాడు. తర్వాత జాన్వీ కపూర్తో కలిసి బవాల్లో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
ఆలియా భట్ సినిమాతో రూ.20 కోట్లు నష్టపోయా: కరణ్ జోహార్
బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత కరణ్ జోహార్ గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆలియా భట్, రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆ సినిమాతో దాదాపు రూ.20 కోట్లు నష్టపోయామని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కరణ్ దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ్లతో మరో 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్రనిర్మాత వెల్లడించాడు. సిద్ధార్థ్ 'హసీతో ఫసీ'లో నటించగా, అలియా, వరుణ్ 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు. కరణ్ నిర్మించిన '2 స్టేట్స్'లో ఆలియా కథానాయికగా నటించిందని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రాజెక్ట్లు కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్, అలియా నటిస్తోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అవతార్ 2’పై అక్షయ్ కుమార్ రివ్యూ
అవతార్ 2.. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాది సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే కొంతమంది సీనీ ప్రముఖుల కోసం ఇప్పటికే స్పెషల్ షో వేసింది చిత్రబృందం. ఈ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. Watched #AvatarTheWayOfWater last night and Oh boy!!MAGNIFICENT is the word. Am still spellbound. Want to bow down before your genius craft, @JimCameron. Live on! — Akshay Kumar (@akshaykumar) December 14, 2022 అక్షయ్ కూమార్ కూడా ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నిన్న రాత్రి అవతార్ 2 సినిమా చూశాను. ఈ చిత్రం గురించి చెప్పడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదేమో. ఇప్పటికీ ఆ సినిమా నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. జేమ్స్ కామెరూన్ ప్రతిభకు తలవంచాలని ఉంది’ అని అక్షయ్ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘అవతార్ 2లోని విజువల్స్, ఎమోషన్స్ చూసి ఆశ్చర్యపోయాను. మళ్లీ ఈ చిత్రాన్ని త్రీడీలో చూడాలనుకుంటున్నాను’అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. భారత్లో హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. #AvatarTheWayOfWater is by far the most important film for the future of cinema. Was blown away by the visuals and the emotions. It’s amazing when the biggest filmmaker of the world chooses his film to give an important message. I wanna see it again in imax 3d @Disney — VarunDhawan (@Varun_dvn) December 14, 2022 -
ప్రభాస్తో కృతి ప్రేమలో ఉందా? లీక్ చేసిన బాలీవుడ్ హీరో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతిసనన్ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం ఈ రూమర్స్కి మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ప్రభాస్-కృతిసనన్ల రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బేఢియా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ రియాలిటీ షోకు వరుణ్, కృతిసనన్ గెస్టులుగా వెళ్లారు. ఈ క్రమంలో కృతి మనసులో ఎవరున్నారు అన్న ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానమిస్తూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పదుకోణెతో షూటింగ్లో ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చేశాడు. ఇతడి మాటలకు కృతి కూడా సిగ్గుపుడతూ నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో ఓ షోలో కృతి ప్రభాస్కు కాల్ చేయడం, ఆదిపరుష్ టీజర్ ప్రమోషన్స్లో ప్రభాస్తో క్లోజ్గా ఉండటం వంటివి చూసి వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్లో జోరుగా టాక్ వినిపిస్తుంది. Whaaaaaaattt 😯😁🥰💖...... Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe — Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022 -
Thodelu Review: ‘తోడేలు’ మూవీ రివ్యూ
టైటిల్: తోడేలు నటీనటులు: వరుణ్ ధావన్, కృతిసనన్, దీపక్ దొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరబ్ శుక్లా తదితరులు నిర్మాత: దినేష్ విజన్ దర్శకుడు: అమర్ కౌశిక్ సంగీతం: సచిన్ జిగార్ సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జి ఎడిటర్: సంయుక్త కాజా విడుదల తేది: నవంబర్ 25, 2022 కథేటంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నించిన దుష్ట శక్తులను జంతువుల రూపంలో దేవుడు అడ్డుకుంటాడనేది చాలా సినిమాల్లో చూశాం. తోడేలు సినిమా లైన్ కూడా అదే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. కథను విస్తరించిన తీరు బాగుంది. అయితే ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం మైనస్. క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా మలిచాడు. సీరియస్ అంశాలను కూడా బోర్ కొట్టించకుండా కామెడీ వేలో చూపించారు. విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగున్నాయి. అరుణాచల్ అడవి అందాలు, తోడేలు విన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం వరుణ్ ధావన్ అనే చెప్పాలి. తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తోడేలుగా మారుతున్న సమయంలో ఆశ్చర్యపోయేలా అతని నటన ఉంటుంది. ఈ సినిమా కోసం వరుణ్ ధావన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. డాక్టర్ అనైకగా కృతిసనన్ మెప్పించింది. హీరో స్నేహితులుగా దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్ చేసే కామెడీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సచిన్ జిగార్ సంగీతం బాగుంది. తంకేశ్వరి పాట ఆకట్టుకుంటుంది. జిష్ణు కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది. అరుణాల్ ప్రదేశ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది: వరుణ్ ధావన్
‘హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా ఉంది. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది’అని బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ అన్నారు. వరుణ్ ధావన్, కృతిససన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం భేదియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్తో ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ..‘ హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లా ఉంది. ఒక దర్శకుడు కొడుకుగా సినిమా నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం. ఓన్లీ హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం.ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ముంబై , హైదరాబాద్ కి చెందిన వాళ్ళే. మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేసాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రమోట్ చెయ్యడానికి చిరంజీవి గారు వస్తాను అన్నారు కానీ ఆయనకు ఒక కాంబినేషన్ లో షూటింగ్ ఉండడంతో రాలేకపోయారు. ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను’ అన్నారు. ‘నా కెరియర్ టాలీవుడ్ నుంచే స్టార్ట్ చేశాను. నా మొదటి సినిమాకే మంచి లవ్ ఇచ్చారు. అలానే తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది మరోసారి మీ ప్రేమను అందివ్వండి ’అని కృతి సనన్ అన్నారు. -
మహేశ్ బాబు పాటకు కృతీసనన్ డ్యాన్స్.. వీడియో వైరల్
మహేశ్ బాబు ‘వన్- నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతీ సనన్. ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్’లో తన ప్రతిభ చాటింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. కృతీ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘భేదియా’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరుతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. నవంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘తోడేలు’ టీమ్ హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతీసనన్ మహేశ్ బాబు పాటకు స్టెప్పులేసి అలరించింది. మహేశ్ బాబు ‘వన్-నేనొక్కడినే’ చిత్రంలోని ‘హల్లో రాక్స్టార్.. ఐ ఎం యువర్ ఏంజెల్..’ పాటకు ఈ బ్యూటీ డ్యాన్స్ చేసింది. సినిమా విడైదలై చాలా రోజులు అయినప్పటికీ.. స్టెప్పులు మర్చిపోకుండా వేయడంతో కృతీపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తెలుగులో తనకు బాగా నచ్చిన హీరో ప్రభాస్ అని, నచ్చిన సినిమా ‘పుష్ప’,‘ఆర్ఆర్ఆర్’అని చెప్పుకొచ్చింది. Every Body says Aww Tuzo Mogh Kortha after watching her dance Performance😍 Gorgeous beauty @kritisanon shakes legs on stage @ #Thodelu Pre-Release Press Meet💖#Thodelu🐺 #Bhediya #varundhawan #Kritisanon #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/zBk8bYDYg5 — Shreyas Media (@shreyasgroup) November 19, 2022 -
త్వరలో తండ్రి కాబోతున్న హీరో, హింటిచ్చిన సల్మాన్!
ఇటీవలే రణ్బీర్- ఆలియా, కరణ్ సింగ్ గ్రోవర్- బిపాసా బసు దంపతులు తమ ఇంట్లో చిన్ని పాపాయికి స్వాగతం పలుకుతూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే! తాజాగా మరో హీరో కూడా త్వరలో తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. భేదియా సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ కృతీ సనన్ను వెంటపెట్టుకుని బిగ్బాస్ 16 సీజన్కు వెళ్లాడు హీరో వరుణ్ ధావన్. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లతో సరదా గేమ్స్ ఆడించాడు సల్లూ భాయ్. ఈ క్రమంలో ఓ బొమ్మను వరుణ్ చేతిలో పెట్టి ఇది నీ పిల్లాడి కోసమేనని చెప్పాడు. దీంతో సిగ్గుపడిపోయిన యంగ్ హీరో.. కానీ నాకింకా ఎవరూ పుట్టనే లేదు అని చెప్పాడు. దీనికి సల్మాన్.. ఆ బొమ్మను నువ్వు ఇంటికి తీసుకెళ్లావంటే త్వరలోనే నీ ఇంట్లోకి నిజమైన బేబీ వస్తుంది అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు సల్మాన్ సరదాగా అలా మాట్లాడాడా? లేదంటే వరుణ్ దంపతులు నిజంగానే త్వరలో పేరెంట్స్ కాబోతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సల్మాన్ ఇటీవలే బిగ్బాస్ హౌస్లో థాంక్ గాడ్ ప్రమోషన్స్ కోసం వచ్చిన సిద్దార్థ్ను ఉద్దేశించి త్వరలో అతడి పెళ్లి జరగబోతుందని హింటిచ్చాడు. దీంతో వరుణ్ విషయంలో కూడా అది జోక్ కాదని, ఇది కూడా ఒక హింటే అంటున్నారు. కాగా వరుణ్, నటాషా 2021 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వరుణ్ నటించిన భేదియా నవంబర్ 25న విడుదల కానుంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి దుర్మరణం రెమ్యునరేషన్ ఇవ్వమంటే ముఖం చాటేశాడు: నటి -
వరుణ్ ధావన్, కృతి సనన్ల రొమాంటిక్ సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భేదియా’. దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఈ నెల 25న విడుదలకానుంది. నిర్మాత అల్లు అరవింద్ ‘భేదియా’ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సచిన్ జిగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చిలిపి వరాలే ఇవ్వు..’ అంటూ సాగే వీడియో సాంగ్ను విడుదల చేశారు. అమితాబ్ భట్టాచార్య–యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించిన ఈ పాటని కార్తీక్ పాడారు. ‘‘హారర్, కామెడీ చిత్రమిది. ‘చిలిపి వరాలే ఇవ్వు..’ పాట చాలా బాగుంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
హీరోయిన్ను చిలిపి వరాలే ఇవ్వమని అడుగుతున్న హీరో!
ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" సంస్థ ఇటీవలే కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న "భేదియా" చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతోంది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా "భేదియా". ఈ చిత్రం నుంచి 'తుమ్కేశ్వరి' అనే మొదటి పాట ఇటీవల విడుదలవగా దీనికి విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్ను అధికారికంగా లాంచ్ చేశారు. భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపి వరాలే ఇవ్వు పాటను కార్తీక్ ఆలపించారు. ఈ చిత్రానికి అమితాబ్ భట్టాచార్య, యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన భేదియా హిందీ, తమిళం, తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా "భేదియా"ను 'తోడేలు' పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు. చదవండి: కారు ప్రమాదం తర్వాత రంభ ఫ్యామిలీ ఎలా ఉందో చూశారా? కన్నడ ప్రేక్షకులకు లేఖ రాసిన పునీత్ భార్య -
అరుదైన వ్యాధితో పోరాడుతున్న యంగ్ హీరో
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం భేదియా. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 25న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు వరుణ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తాను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాధి వల్ల బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు తెలిపాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేక కఠిన పరిస్థితుల్లోనూ తనను తాను పుష్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. 'ఈ భూమిపై మనం రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నాం. ఈ పరుగు ఎందుకని ఎవరూ అడగరు. కానీ మనం ఇలా పరిగెత్తుతున్నందుకు ఏదో ఒక గొప్ప కారణం ఉండే ఉంటుంది. నన్ను నేను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నా, అలాగే ఇతరులు కూడా వారిని వారు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబంధించిన వ్యాధి. చెవి లోపలి భాగం సరిగా పనిచేయకపోవడంతో మెదడుకు సందేశాలు అందడంలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా రోజూవారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగే ఆస్కారం ఉంది. కొందరిలో తల ఒకవైపు, మరికొందరిలో రెండు వైపులా ప్రభావితం చేస్తుంది. దీనిబారినడ్డవారు బ్యాలెన్స్ అదుపుతప్పి ఆకస్మాత్తుగా పడిపోయే ఛాన్స్ ఉంది. చదవండి: బాలాదిత్య అన్న ఒక్కమాటతో గుండె పగిలింది: గీతూ ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త -
లవ్.. హారర్.. కామెడీ
ఇటీవల హిట్ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్–హారర్–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్ పాత్రలో వరుణ్, డాక్టర్ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. -
ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి రూమ్లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి: విరాట్ హోటల్ రూమ్ వీడియో లీక్పై అనుష్క తీవ్ర ఆగ్రహం) ఈ ఘటనపై కింగ్ కోహ్లీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రూమ్ వీడియోను హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ ఖండించారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అనైతికమైన చర్య అని బాలీవుడ్ ప్రముఖులు మండిపడ్డారు. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, ఊర్వశి రౌతేలా, కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఫైరయ్యారు. దీనికి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బాలీవుడ్ నటులు డిమాండ్ చేస్తున్నారు. -
మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. తాజాగా చిత్రబృందం ఇవాళ ట్రైలర్ విడుదల చేసింది.. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా'. ట్రైలర్ చూస్తే.. 'తోడేలుగా మారిన వరుణ్ ధావన్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. తోడేలుగా మారాక అతని జీవితం తలకిందులవుతుంది పగలు సాధారణ మనిషిలా కనిపిస్తూ రాత్రి వేళల్లో తోడేలుగా మారడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో అతని స్నేహితులు డాక్టర్ కృతి సనన్ వద్దకు తీసుకొస్తారు. అతడు మళ్లీ సాధారణమైన మనిషిగా మారాడా? లేదా? సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వరుణ్ తదుపరి చిత్రం ఎక్కిస్, సాజిద్ నడియాడ్వాలా సాంకిలో కనిపించనున్నాడు. అతను రాజ్,డీకే దర్శకులుగా తెరకెక్కుతున్న రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్లో కనిపించనున్నారు. కృతి సనన్ ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్లతో కలిసి ఆదిపురుష్లో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో పాటు విమర్శలకు కూడా గురైంది. అయితే ఈ సినిమాలో కృతి లుక్ని అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. -
'ది ఫ్యామిలీ మ్యాన్' తరహాలో.. మరోసారి డేర్ చేస్తున్న సామ్
యువతలో సమంత క్రేజ్ వేరు. పెళ్లికి ముందు, పెళ్లి అయిన తరువాత, భర్త నుంచి విడిపోయిన తరువాత కూడా ఏమాత్రం జోరు తగ్గని నటి ఎవరైనా ఉన్నారంటే అది సమంతనే అవుతుంది. నటిగా టాలీవుడ్, కోలీవుడ్లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ది ఫ్యామిలీ మెన్ – 2 హింది వెబ్ సిరీస్తో బాలీవుడ్ రంగప్రవేశం చేయడంతో పాటు, ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు తనదైన శైలిలో విలనిజాన్ని ప్రదర్శంచడంతో పాటు గ్లామరస్గానూ నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. అయితే విమర్శలు వచ్చినా, నటిగా అంతకంటే మంచి పేరును ఈ వెబ్ సిరీస్ తెచ్చి పెట్టింది. దీంతో మరోసారి సంచలనం సృష్టించడానికి సమంత రెడీ అవుతోంది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ను రూపొందించిన రాజ్, డీకే తాజాగా దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్న వెబ్ సిరీస్లో సమంత నటించనున్నారన్నది తాజా సమాచారం. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిట్టాల్ అనే అమెరికా వెబ్ సిరీస్ను ఇండియన్ భాషల్లో రీమేక్ చేయనున్నారు. నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్న ఇందులో యాక్షన్ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉండటంతో ఇప్పుడు వారిద్దరూ ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. వీరికి అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుందని సమాచారం. చిత్రంలో మామూలు యాక్షన్ సన్నివేశాలు కాకుండా ఒళ్లు జలదరించే విధంగా చోటు చేసుకోవడంతో శిక్షణ కాలం అధికంగా ఉంటుందని తెలిసింది. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషీ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో శాకుంతలం, యశోద చిత్రాలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు కావడం విశేషం. -
శిఖర్ ధావన్ను భరించడమే కష్టం; మరో ధావన్ జతకలిస్తే..
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్.. బాలీవుడ్ స్టార్ శిఖర్ ధావన్తో కలిసి ఫోటో దిగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాములుగానే శిఖర్ ధావన్ అల్లరిని తట్టుకోవడం కష్టం.. అలాంటిది అతనికి మరో ధావన్ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పింది కేవలం సరదా కోసమే. వాస్తవానికి శిఖర్ ధావన్ సహా టీమిండియా సభ్యులు ఇవాళ ఉదయమే జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఉదయం నాలుగు గంటల సమయంలో వరుణ్ ధావన్ టీమిండియా సభ్యులతో కలిసి ఫోటోకు ఫోజిచ్చాడు. ఈ సందర్భంగా ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో నేను చిన్నపిల్లాడిలా మారిపోయి క్యాండీ షాపులో తిరుగుతున్నా. ఆ సమయంలో టీమిండియా బృందం ఎయిర్పోర్ట్లో ఎదురుపడింది. అంతే ఒక్కసారిగా సంతోషంతో వారి దగ్గరికి వెళ్లిపోయాను. జింబాబ్వే టూర్ విజయవంతగా ముగించుకొని తిరిగి రావాలని కోరుకున్నా. ఈ సందర్భంగా ధావన్ భయ్యాతో ఫోటో దిగడం ఆనందంగా అనిపించింది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు విమానంలో బయల్దేరారు. వీరితో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్ ధావన్ను తొలుతు జింబాబ్వే టూర్కు కెప్టెన్గా ఎంపిక చేశారు.అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. At 4 in the morning I was like a boy in a candy shop. Got very excited to meet and chat with our men in blue About their upcoming tour. Also @SDhawan25 asked me a couple of riddles 😂 pic.twitter.com/DbknESJB0k — VarunDhawan (@Varun_dvn) August 13, 2022 చదవండి: వచ్చే ఏడాది వరల్డ్కప్లో ఆడడమే నా టార్గెట్: ధావన్ -
హీరోయిన్కు సడెన్గా ముద్దు పెట్టిన హీరో.. వీడియో వైరల్
Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls: తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వరుసగా ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వరుణ్ ధావన్ నటించిన చిత్రం 'జుగ్ జుగ్ జీయో'. జూన్ 24న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ కపూర్, నీతూ కపూర్ సైతం కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో వరుణ్కు జోడీగా కియారా అద్వాణీ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక మేగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. ఈ ఫొటో షూట్లో వరుణ్, కియారా ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్ ముద్దు పెడతాడు. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయి వరుణ్ను పక్కకు నెడుతుంది కియారా. ఈ ఫొటో షూట్ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి' అని రాసుకొచ్చాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. 'ఇలా అయితే కష్టం గురూ' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? Jab Aadmi shoot Karte Huwe Mood Main Aa Jata Hai Toh Kuch Aisa Ho Jata Hai. pic.twitter.com/3SzXU6M5WR — KRKBOXOFFICE (@KRKBoxOffice) August 1, 2022 -
కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్షాట్స్ వైరల్
బీటౌన్ దర్శక నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో ఒకరు కరణ్ జోహార్. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ పేరిట తాజాగా నిర్మించిన చిత్రం 'జుగ్జుగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేందుకు రెడీ అయిన తరుణంలో తాజాగా నిర్మాత కరణ్ జోహార్కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే.. తను పంపించిన పాయింట్స్ను కాపీ కొట్టి 'జుగ్జుగ్ జీయో' సినిమాను నిర్మించారని రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 'బన్నీ రాణీ' అనే టైటిల్తో కొన్ని పాయింట్స్ను ధర్మ ప్రొడక్షన్స్కు పంపించినట్లు ఆయన తెలిపాడు. తర్వాత ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చిందని, అయితే ఆ పాయింట్స్ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని, తీరా చూస్తే ఆయన పాయింట్స్తో ఈ మూవీ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ తర్వాత ఇరువైపులా వాదనలు విని, కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో చెబుతామని వెల్లడించింది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కరణ్ జోహార్ అధికారికంగా స్పందించలేదు. కాగా 'జనవరి 2020లో బన్నీ రాణీ టైటిల్తో కథ రిజిస్టర్ చేసుకున్నా. 2020 ఫిబ్రవరిలో సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం కోసం ధర్మ ప్రొడక్షన్స్కు మెయిల్ చేశా. నాకు రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత వాళ్లు నా స్టోరీ తీసుకున్నారు. జుగ్జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారు. ఇది సరికాదు కరణ్ జోహార్.' అని విశాల్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్తోపాటు విశాల్ పంపించిన పాయింట్స్కు సంబంధించిన స్క్రీన్షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
వరుణ్, కియారాలపై నెటిజన్ల ఫైర్.. ‘వారిపై చర్యలు తీసుకోండి’
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అద్వానీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వీరి తీరుపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా వరుణ్-కియార జంటగా నటించిన తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా మూవీ టీం ముంబై మెట్రో రైలులో సందడి చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్, కియారా మెట్రో రైల్లో వడ పావ్ తింటూ కనిపించారు. చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్ ఈ వీడియోను ప్రముఖ మీడియా పర్సన్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక మెట్రోలో నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించిన కియార, వరుణ్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?’, ‘వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్, మూవీ యూనిట్ కూడా ఉన్నారు. కాగా కియారలో తెలుగులో రామ్ చరణ్ ఆర్సీ 15 మూవీతో పాటు ఇటీవల కోలీవుడ్లో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)