-
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..
-
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
మాస్కో: భారత అంతర్గత వ్యవహారాలు, సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా దురుద్దేశంతో కలగజేసుకుంటోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను అమెరికాలో చంపేందుకు భారతీయ పౌరులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించిందిగానీ నమ్మదగ్గ సాక్ష్యాలను బయటపెట్టలేదని రష్యా గుర్తుచేసింది. రష్యా, సౌదీ అరేబియా తరహా పాలనా విధానాలను దేశంలో అమలుచేయాలని మోదీ సర్కార్ భావిస్తోందని అమెరికా ఒక నివేదిక వెల్లడించడంపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా గురువారం మాట్లాడారు. ‘‘ పన్నూను అంతమొందించేందుకు భారత ‘రా’ అధికారి, మరో భారతీయుడు నిఖిల్ గుప్తాతో కలిసి కుట్ర పన్నారని అమెరికా ఆరోపించింది. కానీ అందుకు బలమైన సాక్ష్యాలు ఒక్కదాని కూడా బయటపెట్టలేదు. సాక్ష్యాలు చూపకుండా ఊహాగానాలను వ్యాప్తిచేయడం తగదు. భారత విధానాలు, దేశ చరిత్రను అవగాహన చేసుకునే స్థాయి అమెరికాకు లేదు. అందుకే భారత్లో మత స్వేచ్ఛపై ఆరోపణలను అమెరికా నిరంతరం గుప్పిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా ప్రయతి్నస్తోంది. అందుకే రాష్ట్రాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, మత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని నివేదికలు ఇస్తోంది’’ అని మారియా చెప్పినట్లు రష్యా అధికారిక ‘ఆర్టీ న్యూస్’ ఛానల్ ఒక వార్తను ప్రసారంచేసింది. గత ఏడాది అమెరికాలో పన్నూను భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) అధికారి చంపాలనుకున్న కుట్రను అమెరికా అధికారులు విజయవంతంగా భగ్నంచేశారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం వెలువరిచింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇలాంటి నిరాధార ఆరోపణలు తగవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆనాడే ఢిల్లీలో ఆక్షేపించారు. -
కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: మహిళ కిడ్నాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీ (ఎస్) సీనియర్ నేత, పార్టీ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను సిట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన పెట్టుకున్న ముందస్తు బె యిల్ను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ని రాకరించిన వెంటనే సిట్ రేవణ్ణను అదుపులో కి తీసుకోవడం గమనార్హం. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలిని రేవణ్ణ అనుచరుడు సతీశ్ బాబన్న కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుమారుడు గురువారం రాత్రి మైసూరులో ఫిర్యాదుచేయ డంతో పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం బెంగళూరులోని పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో ఉన్న రేవణ్ణను అక్కడే అరెస్ట్చేశారు. తర్వాత ఆయనను బౌరింగ్ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ కేసులో రేవణ్ణ సహచరుడు సతీశ్ను ఇప్పటికే అరెస్ట్చేశారు. ఈ కే సులో నిర్బంధంలో ఉన్న మహిళను మైసూ రు జిల్లాలోని కలెనహళ్లి గ్రామంలోని ఫామ్హౌజ్లో పోలీసులు శనివారం కాపాడారు. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీస్!: లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్పై నమోదైన కేసులో విచారణను సిట్ వేగవంతంచేసింది. ఇందులోభాగంగా ప్రజ్వల్కు సీబీఐ బ్లూ కార్నల్ నోటీసును జారీచేసే వీలుందని తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిట్ అధికారులతో ముఖ్యమైన సమావేశం ఏర్పాటుచేశారు. ప్రజ్వల్ను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేలా కేసు దర్యాప్తును ముమ్మరంచేయాలని ఆదేశించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే కబ్జాలు సాధ్యం కాదని.. కుట్రకు తెరలేపిన భూబకాసురులు..
-
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
-
Trump: ఇది కుట్రే.. ఎన్నికల మోసానికి పాల్పడ్డారు!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చొబోతున్న డొనాల్డ్ ట్రంప్నకు గడ్డు పరిస్థితులు తప్పడం లేదు. గతంలోని తన రాసలీలల బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆయన ఓ మాజీ శృంగార తారకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వ్యవహారంతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా మోసానికి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదిస్తోంది. 2016 ఎన్నికల ప్రచారం సమయంలో.. స్టార్మీ డేనియల్స్కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం(నాన్డిజ్క్లోజర్ అగ్రిమెంట్) చేసుకున్నాడనే ఆరోపణలు ట్రంప్పై ఉన్నాయి. ఈ తరుణంలో.. సదరు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత ఆ పో*స్టార్ కోర్టును ఆశ్రయించింది. అటుపై ఆయన అధ్యక్ష పదవిలో ఉండడంతో హైప్రొఫైల్ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. చివరికి.. న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు చేసింది. తద్వారా అమెరికాలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ పేరు చరిత్రకెక్కింది. అయితే తొలిరోజు విచారణ సందర్భంగా.. న్యూయార్క్ కోర్టులో వాడీవేడి వాదనలే జరిగాయి. ప్రాసిక్యూటర్ మాథ్యూ కోలాంగెలో వాదనలు వినిపిస్తూ.. 2016 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోసానికి పాల్పడ్డారు. తన పరువు పోకుండా ఉండేందుకు శతవిధాల యత్నించారు. ఇందుకోసం సె* స్కాండల్ను కప్పి పుచ్చేలా వ్యవహరించారు. ట్రంప్ టవర్ ఇందుకు వేదిక అయ్యింది. ఇది దీర్ఘకాలికంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర. తన గురించి చెడుగా మాట్లాడకుండా కొందరి నోళ్లు మూయించడానికి ఆయన డబ్బు ఖర్చు చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఆ ఖర్చు ఎన్నికలను ప్రభావితం చేసే అంశమే. కచ్చితంగా ఇది ఎన్నికల మోసం కిందకే వస్తుంది’’ అయితే ట్రంప్ తరఫు న్యాయవాది టాడ్ బ్లాంచె మాత్రం ఆ అభియోగాలను ఖండించారు. ట్రంప్ అమాయకుడని, ఎలాంటి నేరం చేయలేదని, అసలు మాన్హట్టన్ అటార్నీ ఆఫీస్ ఈ కేసును ఏనాడూ ప్రస్తావించలేదని వాదించారు. ఇక ఈ కేసులో ఇంకా వాదనలు కొనసాగాల్సి ఉంది. ట్రంప్ గతంలో అధ్యక్ష పదవిలో రెండుసార్లు అభిశంసన తీర్మానం ఎదుర్కొని నెగ్గారు. యూఎస్ కాపిటల్ మీద దాడి ఘటన, అధ్యక్ష భవనం వైట్హౌజ్లో ఉన్నప్పుడు కీలకమైన పత్రాల మిస్సింగ్(వాటిని నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి).. తదితర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సె* స్కాండల్ కుంభకోణంలో గనుక ట్రంప్ కోర్టు విచారణ ద్వారా ఆయన జీవిత పుస్తకంలో మాయని మచ్చ ఏర్పడినట్లయ్యింది. -
పచ్చవన్నె మేధావులు
ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు నిత్యం సీఎం వైఎస్ జగన్ పైనా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా కక్ష పూరితమైన ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య భక్షకులుగా మారడం మేధావులను నివ్వెరపరుస్తోంది. వీళ్లు నిజంగా సివిల్ సర్వీసుల్లో పనిచేసిన అధికారులేనా అని అనుమానం వచ్చేలా వారి వ్యవహారశైలి ఉంటోంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా, వైఎస్ జగన్పై మితిమీరిన అక్కసుతో వారు చేస్తున్న ఆరోపణలు సమాజాన్నే తప్పుదోవ పట్టించడానికేనన్నది స్పష్టమవుతోంది. రాజకీయ నాయకులు, గల్లీ లీడర్ల మాదిరిగా ఎల్లో మీడియాలో వారు చేస్తున్న రచ్చను చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకాలం తాము కలిసి పనిచేసింది ఇంతలా దిగజారిన మనుషులతోనా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతున్న వీరి నిజస్వరూపం తెలుసుకోండి. – సాక్షి, అమరావతి నిమ్మగడ్డ రమేష్కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్కుమార్ 2021 వరకు మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు సిఫార్స్ చేశారు. అప్పట్లో పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ.. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనని నిమ్మగడ్డ అప్పట్లో వాటిని నిర్వహించలేదు. ఇక 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఒకే విడతలో నిర్వహించాలని 2020 ఫిబ్రవరి–మార్చి నెలల్లో నోటిఫికేషన్ జారీచేయగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి అధికారిక వైఎస్సార్సీపీకే దాదాపు సగం స్థానాలు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వానికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కరోనా పేరుతో వాటిని అర్ధంతరంగా వాయిదా వేసి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్లు–గ్రామ సచివాలయాల వ్యవస్థల ద్వారా నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకే తీసుకొస్తే.. నిమ్మగడ్డ రమేష్కుమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరున వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులోనూ కేసులు వేశారు. ఈయన ఫిర్యాదు కారణంగా అవ్వాతాతల పింఛన్లను ఇంటివద్దే పంపిణీ చేసే ప్రక్రియకు బేకులు పడ్డాయి. మన్నెం నాగేశ్వరరావు ఈయన అత్యంత అవినీతిపరుడు.. వాదాస్పద రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా చేసిన ఈయన యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. బీహార్లో ఓ ప్రభుత్వ వసతి గృహంలో బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడం ద్వారా నిందితులకు ఈయన కొమ్ముకాశారన్నది తేలింది. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ఈయన దర్యాప్తు అధికారిని బదిలీ చేయడం గమనార్హం. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసెస్, హోంగార్డు విభాగానికి బదిలీ చేసింది. నిజానికి.. ♦ నాగేశ్వరరావు ఎక్కడ ఏ పోస్టులో ఉన్నా యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ♦ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ ‘ద వైర్’తోపాటు జాతీయ మీడియా ఆయన అవినీతి బాగోతాలను ఎన్నోసార్లు బయటపెట్టింది. ♦ అప్పట్లో సీబీఐ డీజీగా ఉన్న అలోక్ శర్మ, ప్రత్యేక డైరెక్టర్గా రాకేశ్ ఆస్తానా మధ్య విభేదాలు ఏర్పడటంతో మధ్యేమార్గంగా ఎం.నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్గా నియమించారు. అప్పట్లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ఉన్న కేవీ చౌదరి అండదండలతోనే ఈయనకు ఆ పదవి దక్కిందని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. ♦ ఇక ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పటి నుంచే ఈయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. పీవీ రమేష్ తాను ఆశించిన విధంగా సర్వీసు పొడిగింపు ఇవ్వలేదని అక్కసుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సీఎం జగన్పై కక్ష పెంచుకుని నిమ్మగడ్డ బృందంతో చేతులు కలిపారు. తనను తాను మేధావిగా ఊహించుకునే ఈయన రిటైరైన వెంటనే సిగ్గూఎగ్గూ లేకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే ఒక కార్పొరేట్ కంపెనీలో చేరాడు. తన పలుకుబడిని ఆ కంపెనీ కోసం ఉపయోగిస్తానని చెప్పి ఉద్యోగం దక్కించుకున్న ఈయన ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి చిలక పలుకులు చెబుతున్నారు. ♦ అలాగే, 2018లో సీబీఐ చెన్నై జోన్ డైరెక్టర్గా ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న 70మంది ఐఆర్ఎస్ అధికారుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరించారనే తీవ్రమైన ఆరోపణలు ఈయనపై వచ్చాయి. దీంతో ఆయన్ని అప్పట్లోనే హఠాత్తుగా బదిలీచేశారు. ♦ ఇక నాగేశ్వరరావు తన భార్య పేరుతో ఏకంగా ఓ షెల్ కంపెనీలో భాగస్వామిగా భారీగా అక్రమ నిధులు తరలించారు. వాటితో ఆమె గుంటూరు జిల్లాలో భూములు కొనుగోలు చేశారన్నది వెలుగులోకి రావడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆమె ఆ షెల్ కంపెనీలోని 100 షేర్లను కేవలం రూ.వెయ్యికి కొనుగోలు చేసి వాటిని వెంటనే భారీ విలువకు విక్రయించడం గమనార్హం. ఆ షెల్ కంపెనీ షేర్ల ముసుగులోనే భారీ అవినీతికి పాల్పడినట్టు వెల్లడైంది. ♦ అంతేకాదు.. ఒడిశాలోని ఖుర్దాలో ఫోర్జరీ పత్రాలతో ఓ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు చూపించి భూకబ్జాకు తెగబడ్డారు. ♦ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కుంభకోణంలో కూడా నిందితులకు అనుకూలంగా నాగేశ్వరరావు వ్యవహరించడంతోనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ♦ సీబీఐ డైరెక్టర్ పోస్టుకు నాగేశ్వరరావు అనర్హుడని కోర్టు తేల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించింది. ♦ ఇలా తన పదవిని దుర్వినియోగం చేశాడని కోర్టు ఛీవాట్లు పెట్టిన ఆ అధికారి రిటైర్ అయ్యాక ప్రజాస్వామ్య పరిక్షరణ ఉద్ధారకుడి అవతారమెత్తి వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తుండడం, అది కూడా చంద్రబాబుకి మద్దతుగా చేస్తుండడాన్ని ఎలా చూడాలి? వీళ్ల నినాదం సేవ్ ఫర్ డెమోక్రసీ.. కానీ, వీరు సేవ్ ఫర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. -
Viveka case : ఇవిగో ఆధారాలు.. ఇప్పుడేం చెబుతావు సునీత? అవినాష్ ప్రశ్నలు
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను పక్కదోవ పట్టించేలా సునీత ఏ రకంగా ప్రయత్నిస్తుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. ఈ కేసులో మాట్లాడకూడదని భావించినా.. రోజురోజుకి పెరుగుతున్న అబద్దాలను, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వివరణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలు చూద్దాం. పాయింట్ 1 : పన్నింటి రాజశేఖర్ను బయటకెందుకు పంపించారు? వివేకా ఇంట్లో పని చేసే వ్యక్తి పన్నింటి రాజశేఖర్. హత్యకు ఒక రోజు ముందు పన్నింటి రాజశేఖర్కు సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. సిబిఐ విచారణలో పన్నింటి రాజశేఖర్ను సుదీర్ఘంగా విచారించారు. లిఖితపూర్వకంగా పన్నింటి ఇచ్చిన స్టేట్మెంట్ను అవినాష్ చదివి వినిపించారు. పన్నింటి రాజశేఖర్ను సిబిఐ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు.. ప్రశ్న, సమాధానాలు ఇలా ఉన్నాయి సిబిఐ : నీకు సెలవు ఎవరు మంజూరు చేశారు? పన్నింటి రాజశేఖర్ : నాకు సౌభాగ్యమ్మ సెలవు ఇచ్చింది సిబిఐ : నీవు సెలవుపై వెళ్లాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? పన్నింటి రాజశేఖర్ : నాకు రెండు, మూడు సార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేశారు, తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. సరేనని నేను సెలవు తీసుకున్నా.. పన్నింటి రాజశేఖర్ : సునీల్ యాదవ్, ఉమా శంకర్, గంగిరెడ్డి ముగ్గురు కూడా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్. చనిపోక ముందు వివేకాతో కలిసి ప్రయాణాలు చేసేవారు. వాళ్లకు వివేకాతో ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. అంతా కలిసి తరచుగా అంటే రెండు మూడు రోజులకోసారి టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేసేవారు. రెండు రోజుల ముందు కూడా వివేకాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అవినాష్ అభ్యంతరం : ఇంట్లో ఉన్న పన్నింటి రాజశేఖర్ను నర్రెడ్డి రాజశేఖర్, సౌభాగ్యమ్మ (తమ్ముడు, అక్క) ఎందుకు బయటకు పంపించారు? కాణిపాకం వెళ్లమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్, ఉమాశంకర్, గంగిరెడ్డి తెలియదని సునీత ఎందుకు ప్రకటనలు చేస్తోంది? ఇంట్లో కలిసి కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేసే సాన్నిహిత్యం ఉందని పని వాళ్లంతా చెబుతుండగా.. సునీత ఎందుకు మాట మారుస్తోంది? --- పాయింట్ 2 : గుండెపోటు థియరీ ఎక్కడినుంచి వచ్చింది? గుండెపోటు థియరీ గురించి సునీతతో చాలా మాట్లాడుతోంది. అసలు ఈ థియరీ ఎక్కడి నుంచి మొదలయింది. దీని గురించి వివరంగా మాట్లాడుదాం. సిట్కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే..! "మాకు ఉదయం కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, ఇంట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చెప్పాడు. మా నాన్న డెడ్బాడీ బాత్రూంలో పడి ఉంది. మా నాన్న ఒంటిపై గాయాలున్నాయని చెప్పాడు, అయితే మా నాన్నకు గతంలో గుండె సమస్య ఉంది, బహుశా గుండె పోటు వచ్చి బాత్రూంలో కింద పడి మా నాన్నకు గాయాలయ్యాయేమో అని ఊహించి ఆ విధంగా ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డికి మేం సూచించాం" అని నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. సిట్కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్. అంటే కృష్ణారెడ్డితో ఏమేం మాట్లాడారో సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పైగా ఘటన జరిగిన వారంలోపు అంటే.. ఆలస్యం కాకుండా బయటికొచ్చే విషయాలు పక్కగా ఉంటాయని ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పింది సునీత. అవినాష్ పాయింట్ : గుండెపోటు కాదు, శరీరం మీద గాయాలున్నాయన్న విషయం సునీతకు అందరికంటే ముందే.. కృష్ణారెడ్డి ఫోన్ చేయగానే తెలిసింది. అయినా సునీత మధ్యాహ్నం వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, సౌభాగ్యమ్మ.. అంతా బయల్దేరి కలిసి వచ్చారు. అక్కడ లెటర్ ఉందని తెలిసి, దాన్ని దాచి పెట్టమని చెప్పి, వివేక హత్యకు గురయ్యాడన్న విసయాన్ని దాచిపెట్టింది సునీత. అందరికంటే ముందు డెడ్బాడీ ఫోటోలు కూడా తెప్పించుకున్నారు, అయినా పోలీసులకు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా అసలు నిజాలను దాచిపెట్టింది సునీత, ఆమె భర్త. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.. ఏంటంటే.. నన్ను ఇరికించే కుట్ర జరిగిందని. శివప్రకాష్ రెడ్డి..అంటే వివేకా సొంత బావమరింది నేను ఉదయం లేచి రాజకీయ పర్యటన కోసం బయటకు వెళ్తోంటే.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే.. "బావ చనిపోయాడు.. అర్జంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పాడు". అదే విషయం నేను నా వాంగ్మూలంలో చెప్పాను. నేను అదుర్తాతో వివేకానంద ఇంటికి వెళ్లగానే అక్కడ తేడా ఉందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అనుమానం ఉందని చెప్పాను. మరి ఉదయమే హత్య అని తెలిసినా.. సునీత గానీ, నర్రెడ్డి గానీ, శివప్రకాష్ రెడ్డి గానీ.. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పైగా ఏమి తెలియనట్టు నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చెప్పినట్టు? మీరు ఇదే అంశంలో టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూడాలి (వీడియో క్లిప్ ప్లే చేసి వినిపించారు) సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆదినారాయణ ఏమన్నాడంటే... "మార్చి 15 నాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్రెడ్డి ఫోన్ చేసినాడు, గుండెపోటుతో చనిపోయాడని నాకు చెప్పినాడు, ఆ రోజు మా కజిన్, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కూడా నాతో ఉన్నాడు. ఎందుకని నేను అడిగినప్పుడు.. ఎక్కువగా సిగరేట్లు తాగుతాడని, గుండె పోటు వచ్చి స్టంట్ కూడా వేశారని చెప్పాడు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను. నన్ను దర్యాప్తులో నీకు పరమేశ్వర్ రెడ్డి తెలుసా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు." అవినాష్ పాయింట్ : గుండెపోటు అన్న తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందెవరు? ఎక్కడి నుంచి మొదలయ్యిందో ఈ ఆధారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. --- పాయింట్ 3 : ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని తప్పుడు ప్రచారం అటు సునీత, ఇటు షర్మిల.. హఠాత్తుగా రాజకీయాలను తీసుకొచ్చారు. ఏంటంటే.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందట. ఎంపీ టికెట్ మోటివ్ అన్న దాంట్లో నిజమెంత? ఒక్కసారి జరిగిన ఘటనలను మీరే చూడండి. "తాను చనిపోయే చివరి క్షణం వరకు నా కోసం ప్రచారం చేశారు, మూడు గంటల ర్యాలీ సభలో వివేకా మాట్లాడారు. అవినాష్ను గెలిపించమని పది సార్లు చెప్పారు. అంతెందుకు సునీత కూడా ఢిల్లీలో ఏం మాట్లాడారు..? అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశాడని చెప్పింది." మరి.. అప్పటికే ఎంపీ టికెట్ను నాకు కేటాయించారు. 2019 టికెట్ ఒక్కటే కాదు.. 2014లోనూ నేను ఎంపీగా గెలిచాను. నా కోసం వివేకానంద ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని ఎలా చెబుతారు? పైగా అప్పుడు మీ నాన్నకు ప్రత్యర్థి బీటెక్ రవి ఇప్పుడు మీకు సన్నిహితుడు అవుతాడా? మీ నాన్న మీద అక్రమంగా, అనైతికంగా గెలిచిన బీటెక్ రవి కాకుండా.. మా మీద బురద వేస్తున్నారా? కనీసం అవగాహనతో మాట్లాడుతున్నారా? మీ కోసం ఎన్నో ఎన్నికల్లో కష్టపడితే మాపై ఆరోపణలు చేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఏ ఒక్కరినీ సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? సిబిఐ దర్యాప్తులో ఇన్ని లోపాలుంటాయా? ఇక సునీత, సిబిఐ చాలా మందితో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్ష్మీదేవమ్మ, జగదీష్ రెడ్డి, లక్ష్మీ దేవి కొడుకుతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. శశికళ & కోతో కూడా తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు గేటు దగ్గర ఇప్పకుంట్ల వాసి ఒకరు ఉంటే.. ఆయన ఇంటికి సునీత, రాజశేఖర్ వెళ్లారు. "మా నాన్న దగ్గరి వాడివి, సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలి, మేం చెప్పినట్టు మాత్రమే నువ్వు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఏం చెప్పారంటే.. అవినాష్ గుండెపోటు అని చెప్పమన్నాడని నువ్వు చెప్పాలి" అని ఒత్తిడి తెచ్చారు. అవినాష్ పాయింట్ : సునీత లాంటి వాళ్లు దస్తగిరి లాంటి వారిని కూడా అప్రూవర్గా చేయగలరు, ఇందులో చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు కావొచ్చు, అందులో భాగంగానే పస లేని విమర్శలు, కనికట్టు చేసే అబద్దాలు ఉన్నాయి. రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అవినాష్ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంత కుట్ర చేస్తారా? గుండెపోటు అని ప్రచారం మొదలెట్టిన వాళ్లు... దాన్ని నా మీద రుద్దుతారా? పైగా ఇంటింటికి వెళ్లి నేను చెప్పమన్నారంటూ ఒత్తిడి తెస్తారా? ఈ కేసులో కోర్టులమీద నమ్మకం ఉందని, చంద్రబాబు, బీజేపీలోని టిడిపి పెద్దలు దీని వెనక ఉన్నారని విమర్శించారు అవినాష్. చంద్రబాబు చేతిలో పావులుగా మారి నన్ను, మా నాన్నను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్విచ్ మీన్టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా తప్పుడు ప్రకటనలు చేసిన సిబిఐ.. తర్వాత నాలుక కర్చుకుని హైకోర్టులో కౌంటర్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. READ THIS ARTICLE IN ENGLISH : YS Avinash Reddy’s Sensational Comments on Sunitha in YS Viveka’s Murder ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు -
రామ్నవమి వేడుకలపై ‘తృణమూల్’ కుట్ర: ప్రధాని
కలకత్తా:శ్రీరామనవమి వేడుకలను అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుట్ర పన్నిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం(ఏప్రిల్ 16) పశ్చిమబెంగాల్లోని బలూర్ఘాట్లో జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుక ఇది, రామ్నవమి వేడుకలను ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఎన్నో కుట్రలు చేస్తుంది. కానీ చివరికి నిజమే గెలుస్తుంది. ఈసారి రామ్నవమి వేడుకలు జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రామ్నవమి ఊరేగింపు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగి తీరుతుంది. ఇందుకుగాను బెంగాల్ సోదరులు, సోదరీమణులకు నేను అభినందనలు తెలుపుతున్నాను’అని మోదీ అన్నారు. ఇదీ చదవండి.. ఈడీ, సీబీఐల దర్యాప్తు.. శ్వేతపత్రం విడుదల చేయండి: దీదీ -
Rahul Gandhi: వాళ్లది దాడి తంత్రం.. మాది పరిరక్షణ మంత్రం
జగ్దల్పూర్/భండారా: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పాటుపడుతుంటే దానిని నచ్చినట్లు సవరించే కుట్రకు బీజేపీ బరితెగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. లోక్సభ సమరంలో విజయం సాధించి అధికారం చేపట్టగానే దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుడతామని రాహుల్ పునరుద్ఘాటించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని బస్తర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈసారి జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసక సిద్ధాంతాల మధ్య పోరాటం. ఓవైపు కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’కూటమి రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క మోదీ, అదానీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. గిరిజన మహిళ అని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది బీజేపీ ఆలోచనాధోరణికి అద్దంపడుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. షెడ్యూల్ తెగలకు కేటాయించిన బస్తర్ ఎంపీ స్థానంలో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాకు మద్దతుగా రాహుల్ ఈ సభకు వచ్చి మాట్లాడారు. ఆదివాసీ.. వనవాసీ ‘‘ ఆదివాసీ పదాన్నే ప్రధాని వాడుక నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఆదివాసీ అంటే బీజేపీ వాళ్లు వనవాసీ అంటున్నారు. రెండు పదాల అర్ధాల్లో చాలా బేధముంది. ఆదివాసీ అంటే అడవితో మమేకమైన వాళ్లు అని అర్థం. ఆ పదం మీకు జలం, జంగిల్(అడవి), జమీన్(భూమి)పై మీకున్న హక్కులను ఎలుగెత్తి చాటుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనప్రాంతాల్లో స్వయంపాలనకు బాటలువేస్తూ గ్రామసభలకు అనుమతినిస్తూ పంచాయతీ చట్టాన్ని తెచ్చాయి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గిరిజనుల మత విశ్వాసాలు, సిద్ధాంతాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటవీ భూములను అదానీ లాంటి వాళ్లకు బీజేపీ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అడవులు కుచించుకుపోతున్నాయి’’ అని రాహుల్ అన్నారు. మేమొస్తే రైతు రుణమాఫీ మహారాష్ట్రలోని భండారా జిల్లా సకోలీ పట్టణంలో పార్టీ ర్యాలీలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘‘అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీచేస్తాం. నిరుద్యోగం, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ జనం జీఎస్టీ కడుతున్నారు. కోట్లు గడిస్తున్న వాళ్లూ అంతే జీఎస్టీ కడుతున్నారు. మోదీ హయాంలో 22 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద పోగుబడిన సంపద 70 కోట్ల మంది భారతీయుల ఆస్తితో సమానం. ఈ విషయం వదిలేసి మోదీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు’’ అని రాహుల్ అన్నారు. -
షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన అవినాష్రెడ్డి
వైఎస్ఆర్, సాక్షి: కడప లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్రెడ్డి స్పందించారు. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. ‘‘నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. .. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా!’’ అని అవినాష్రెడ్డి అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీరియస్గా స్పందించారు. ఆ ఆరోపణలకు ఖండించిన ఆయన.. లీగల్ యాక్షన్కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే.. లీగల్గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు. Both these Congress fellows (including the minister) will be served legal notices for defamation & slander Either Apologise for this shameful, baseless & nonsensical allegations or face legal consequences Also will be serving legal notices to news outlets who are dishing out… pic.twitter.com/IjHNQ7Yn2T — KTR (@KTRBRS) April 2, 2024 -
శరణ్ చౌదరి ఎవరో తెలియదు: ఎర్రబెల్లి దయాకర్రావు
సాక్షి, హైదరాబాద్: తనపై శరణ్ చౌదరి ఆరోపణలు చేశారని తన దృష్టికి వచ్చిందని.. ఆయన ఎవరో తెలియదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, శరణ్ చౌదరి బీజేపీలో ఉన్నాడని తెలిసింది. శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ఎర్రబెల్లి అన్నారు. ‘‘దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డారు. ఎన్.ఆర్.ఐ.విజయ్కు, శరణ్ చౌదరి రెండు కోట్లు బాకీ వున్నారు శరణ్ చౌదరిపై చాలా కేసులు వున్నాయి. శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ ఎవరో నాకు పరిచయం లేదు. శరణ్ చౌదరి, అతని భార్య పాస్ పోర్టులను పోలీసులు సీజ్ చేశారు. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా.. ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు’’ అని ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ప్రణీత్ రావు వాళ్ల బంధువులు మా ఊర్లో ఉంటారని తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదు. నేను పార్టీ మారను. పార్టీ మారాలని నాపై పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’’ అని దయాకర్రావు తెలిపారు. ‘‘శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ నాకు బంధువు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను అనేక కేసులు ఎదుర్కొన్నాను. గతంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రజల కోసం జైలుకు వెళ్లాను’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
బీజేపీ ఖాతాలోకే మద్యం ముడుపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం తాలూకు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో మద్యం వ్యాపారుల నుంచి నేరుగా బీజేపీకే అందాయని ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదంతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈడీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఆప్ నేతల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ రూపాయి కూడా రికవరీ కాలేదు. మద్యం దుకాణాలు దక్కించుకున్న శరత్చంద్ర రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్ను తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్తో ఏ సంబంధమూ లేదని విచారణలో చెప్పిన మర్నాడే శరత్ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ను కలిసి మద్యం కుంభకోణంపై మాట్లాడానంటూ మాట మార్చగానే బెయిల్ పొందారు!’’ అని ఆరోపించారు. ‘‘శరత్ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.4.5 కోట్లు అందాయి. అరెస్టు అనంతరం బీజేపీకి ఆయన ఏకంగా మరో రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు’’ అంటూ సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు. -
Satya Pal Malik: మాజీ గవర్నర్ ఇంట సీబీఐ సోదాలు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. తాజాగా గురవారం ఆయన ఇంటితో పాటు 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిగాయి. ఆయన జమ్ము గవర్నర్గా ఉన్న సమయంలో.. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అవినీతి జరగడం.. దానిపై కేసు నమోదు కావడమే ఇందుకు కారణం. జమ్ములో రూ. 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏప్రిల్ 2022లో మాలిక్తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 100 మంది అధికారులు పలు నగరాల్లో ఈ సోదాలు ప్రారంభించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలపై సత్యపాల్ మాలిక్ ట్విటర్ ద్వారా స్పందిస్తున్నారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని వెల్లడించారు. మరో ట్వీట్లో.. అవినీతికి పాల్పడిన వారిపై నేను ఫిర్యాదు చేస్తే.. ఆ వ్యక్తుల్ని విచారించకుండా నా నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. ఇంట్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప మరేమీ వాళ్లకు దొరకలేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆ నియంత నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను.. తలవంచను అంటూ పోస్ట్ చేశారాయన. मैंने भ्रष्टाचार में शामिल जिन व्यक्तियों की शिकायत की थी की उन व्यक्तियों की जांच ना करके मेरे आवास पर CBI द्वारा छापेमारी की गई है। मेरे पास 4-5 कुर्ते पायजामे के सिवा कुछ नहीं मिलेगा। तानाशाह सरकारी एजेंसियों का ग़लत दुरुपयोग करके मुझे डराने की कोशिश कर रहा है। मैं किसान का… — Satyapal Malik 🇮🇳 (@SatyapalmalikG) February 22, 2024 మాలిక్.. 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించింది కాగా.. , రెండోది ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించిన ఆరోపణలు. ఇన్సూరెన్స్ ఒప్పందం నేపథ్యం.. 2018లో సదరు కంపెనీ కాంట్రాక్ట్ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ బీమా పథకం ఒప్పందానికి సంబంధించిన అవినీతి కేసులో మాలిక్ను సీబీఐ సాక్షిగా చేర్చింది. గతంలో ఐదు గంటలపాటు విచారించింది కూడా. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే ఆయన్ని ప్రశ్నించినట్లు సీబీఐ ప్రకటించింది. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
విన్ డీజిల్పై లైంగిక వేధింపుల కేసు
లాస్ ఏంజెలిస్: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో సహాయకురాలి పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించారంటూ మాజీ ఉద్యోగిని అస్టా జొనాస్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. అట్లాంటాలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో విన్ డీజిల్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె గురువారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశారు. లైంగిక వాంఛను తీర్చలేదనే కోపంతో వెంటనే విన్ డీజిల్కు చెందిన వన్ రేస్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనను తొలగించినట్లు ఆరోపించారు. -
ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు కుట్ర.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాల్లోని మా భారత పౌరులు చెడు పనులు చేసినట్లు తమకు సమాచారం అందిస్తే.. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపారు. తగిన ఆధారాలు అందిస్తే విచారణ జరిపేందుకు సహకరిస్తామని తెలిపారు. అదే విధంగా భారత్- అమెరికా మధ్య సంబంధాలలో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకమైన అంశమని మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలను ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. భారత్కు వ్యతిరేకంగా విదేశాలలో తీవ్రవాద సంస్థల కార్యకలాపాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. కాగా అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర జరిగిందని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పన్నూన్ హత్యకు కుట్రలో 52 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడి ప్రమేయం ఉందంటూ యూఎస్లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. గుప్తా భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. అతన్ని చెక్ రిపబ్లిక్లో అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే! -
భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసు నమోదైన విషయం వాస్తవమేనని.. తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్పేట్ పోలీస్స్టేషన్లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శామీర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్ పగబట్టి ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండేవారు -
నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్ సంచలన ఆరోపణలు
తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్పై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తనపై భౌతిక దాడి చేయించి గాయపరిచేందుకు కుట్ర పన్నారన్నారు. ఢిల్లీ వెళ్లేందుకుగాను తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న గవర్నర్ వాహనాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తల వాహనాలు ఢీ కొన్నాయి. ఎయిర్పోర్టుకు చేరుకున్న అనంతరం కోపంగా కారు నుంచి బయటికి వచ్చిన గవర్నర్ ఈ ఘటన వెనుక సీఎం విజయన్ కుట్ర ఉందని ఆరోపించడం సంచలనం రేపింది. ‘ఒకవేళ సీఎం కాన్వాయ్ వెళ్తుంటే మధ్యలో వేరే వాళ్ల కార్లు రావడానికైనా అనుమతిస్తారా..? సీఎం కారు సమీపంలోకి మరో కారును రానిస్తారా..? కానీ నా విషయంలో ఏం జరిగింది..? ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నా కాన్వాయ్ వెళ్లే దారిలో కారల్లో వచ్చి నల్ల జెండాలు ప్రదర్శించారు. నా కారును ఇరువైపుల నుంచి వారి కార్లతో ఢీ కొట్టారు. ఇదంతా జరుగుతుండగా పోలీసులు వారిని కార్లలోపలికి నెట్టారు. దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చేయించింది కచ్చితంగా సీఎం విజయనే. గూండాలను పంపి నాపై దాడికి కుట్ర పన్నారు. తిరువనంతపరం రోడ్లు గుండాల ఆధీనంలోకి వెళ్లాయి. ఒకవేళ సీఎం నాతో విభేదించాలనుకుంటే విభేదించవచ్చు.నాపై దాడి చేయాల్సిన అవసరం లేదు. కేరళలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి’ అని గవర్నర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీచదవండి..రాహుల్పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..? -
అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన లోక్సభ లాగిన్ ఐడీ వివరాలు వ్యాపారవేత్త, హీరానందాని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు ఆమె ఆంగీకరించారు. అయితే అతని నుంచి కేవలం చిన్న చిన్న గిఫ్ట్లే అందుకున్నట్లు చెప్పారు. హిరానందని గ్రూప్ సీఈవో నుంచి స్కార్ఫ్, కొన్ని లిప్స్టిక్లు, ఐషాడో వంటి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటులో తాను అడగాల్సిన ప్రశ్నలను పోస్ట్ చేసేందుకు తన లోక్సభ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించేందుకు స్నిహితుడైన దర్శన్ హీరానందానికి అనుమతి ఇచ్చినట్లు ఆమె అంగీకరించారు. అయితే హీరానందని నుంచి డబ్బుల రూపంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలను మహువా ఖండించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్తను ప్రశ్నించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతరులకు కూడా వివరాలు ఇచ్చా! లోక్సభ లాగిన్ వివరాలు ఇచ్చినట్లు అంగీకరించిన మహువా.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుందని, తన ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని తెలిపారు.. ముంబైలో ఉన్నప్పుడు హీరానందానీ కారు వాడాను వ్యాపారవేత్త అయిన హీరానందాని తన స్నేహితుడని, అతని నుంచి పుట్టినరోజు కానుకగా స్కార్ఫ్, లిప్స్టిక్లు, బాబీ బ్రౌన్ నుంచి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు మొయిత్రా పేర్కొన్నారు. తన కోసం దుబాయ్లోని డ్యూటీ ఫ్రీ స్టోర్ నుంచి మేకప్ వస్తువులు తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. తన ఇంటి ఇంటీరియర్లను మార్చడం కోసం తాను అతనిని సంప్రదించానని, అతను ఆమెకు కొత్త ఆర్కిటెక్చరల్ ప్లాన్లు, డ్రాయింగ్లను అందించాడని, అయితే ఖర్చులను ప్రభుత్వం పరిధిలోకి వచ్చే సీపీడబ్ల్యూడీ చేపట్టిందని ఆమె చెప్పారు. అలాగే తాను ముంబయిలో ఉన్నప్పుడల్లా హీరానందానీ స్నేహితుడైనందున అతని కారును ఉపయోగించేదానినని కూడా చెప్పింది. రూ. 2 కోట్ల ప్రస్తావన లేదు దర్శన్ హీరానందని తనకు ఇంకా ఏమైనా ఇచ్చి ఉంటే వెంటనే వచ్చి చెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆరోపణ చేస్తారని, కానీ ఆ ఆరోపణలను నిరూపించే బాధ్యత వారిపై ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. అఫిడవిట్లో తనకు 2 కోట్ల నగదు ఇచ్చిన ప్రస్తావన లేదని, ఒకవేళ ఇచ్చినట్లయితే.. దయచేసి ఎప్పుడు ఇచ్చారో తేదీ చెప్పాలని, అన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలని కోరారు. సొమ్ములు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం ప్రధాని మోదీ, అదానీ గ్రూప్ను,లక్ష్యంగా చేసుకొని ప్రశ్నించినవేనని లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీటికి తోడు మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని నిషికాంత్ దూబే మరో ఆరోపణలు చేయడం దుమారం చెలరేపింది. ఈ ఫిర్యాదుపై లోక్సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31న తమ ముందు విచారణకు హాజరు కావాలని మహువాను కమిటీ తెలిపింది. అయితే తన నియోజకవర్గం కృష్ణానగర్లో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల వల్ల మరికొంత సమయం కావాలని ఎంపీ కోరగా.. ఆమె హాజరుకావాల్సిన తేదీ నవంబర్ రెండుకు మారింది. కొత్త తేదీ ఇచ్చిన ఎథిక్స్ కమిటీ.. ఇంతకు మించి పొడిగింపు ఉండదని వెల్లడించింది. ఇక ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ నైతిక వ్యవహారాల కమిటీ ముందు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. అదే విధంగా మహువాకు వ్యతిరేకంగాపలు సాక్ష్యాలను సమర్పించారు. -
మొయిత్రా ఢిల్లీలో ఉంటే.. దుబాయ్లో ఆమె లాగిన్ ఐడీని వాడారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే పరోక్షంగా మరికొన్ని ఆరోపణలు చేశారు. ఎంపీ మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఎంపీ దుబే శనివారం ‘ఎక్స్’లో‘ ..‘కొంత డబ్బు కోసం ఆమె జాతీయ భద్రతను పణంగా పెట్టారు. ఇదే ఎన్ఐసీని ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, వివిధ కేంద్ర విభాగాలు వాడుతుంటాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్షాలు ఇంకా దీనిపై రాజకీయాలు చేయాలా? దీనిపై ఇక ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’ అని దూబే పేర్కొన్నారు. కానీ, దర్యాప్తు విభాగం పేరును ఆయన పేర్కొనలేదు. అంతేకాకుండా, ఆమె ఎవరి నుంచి లంచం తీసుకున్నారు? వ్యాపారవేత్త దర్శన్ హిరా నందాని తరఫున అదానీ గ్రూప్, ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్సభలో ఆమె ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వంటి విషయాలను దుబే వివరించలేదు. ఎంపీ దుబేకి ఎథిక్స్ కమిటీ పిలుపు అదానీ గ్రూప్ను, ప్రధాని మోదీని లక్ష్యంగా లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఎంపీ దుబే ఇటీవల లోక్సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై లోక్సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఈ నెల 26న తమ ముందు హాజరై మౌఖిక సాక్ష్యం ఇవ్వాలని దుబేను కోరింది. అదానీ గ్రూప్ గుజరాత్లోని తన కంపెనీకి బదులుగా ఒడిశాలోని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన విభాగంలో ఎల్ఎన్జీ నిల్వ చేసుకునేందుకు అనుమతి పొందిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఎంపీ మహువా పార్లమెంటరీ ఐడీని లాగిన్ చేసినట్లు వివరిస్తూ హిరా నందాని స్వయంగా సంతకం చేసిన ఒక సీల్డు కవర్ను ఈ కమిటీకి అందజేశారు. ఈ వివరాలు కూడా బయటకు వెల్లడి కావడం గమనార్హం. ఎంపీ మొయిత్రాపై ఆరోపణల విషయంలో సొంత పార్టీ టీఎంసీ మౌనంగా ఉంటోంది. అయినప్పటికీ మొయిత్రా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్పైనా, ఎంపీ దుబేపైనా ఆరోపణలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను ఎన్ఐసీ వెల్లడించాలి: మొయిత్రా తను ఢిల్లీలో ఉండగా పార్లమెంటరీ లాగిన్ ఐడీని దుబాయ్లో వాడారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన ఆరోపణలపై ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను కూడా ఎన్ఐసీ బహిరంగ పర్చాలని, వారు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకంటే జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరం అదానీ గ్రూపేనని ఆమె ఎదురుదాడికి దిగారు. అదానీ గ్రూప్ కంపెనీ బొగ్గు దిగుమతులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. -
ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. అఫిడవిట్లోని అంశాలు... ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాం«దీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేíÙంచిప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. -
జనాన్ని దోచుకుంటున్న అదానీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని బుధవారం ఆరోపించారు. ఈ మేరకు పలు మీడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై తక్షణం విచారణకు ఆదేశించి తన నిర్దోíÙత్వాన్ని రుజువు చేసుకోవాలని సవాల్ విసిరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నెగ్గి కాంగ్రెస్ అధికారంలోకి ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తుందని ప్రకటించారు. దీనిపై మోదీకి మౌనమెందుకని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించి తన విశ్వసనీయతను నిరూపించుకోవచ్చు కదా అని నిలదీశారు. ‘అదానీ ఇండొనేసియాలో కొనుగోలుచేసిన బొగ్గు ధర భారత్కు వచ్చేసరికి రెట్టింపు అవుతోంది! ఈ అడ్డగోలు పెంపు కారణంగా భారత్లో కరెంట్ చార్జీలు పెరిగాయి. వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సబ్సిడీ భారం పెరిగింది’ అని రాహుల్ ఆరోపించారు. ఇలాంటివి ఇంకే దేశంలో జరిగినా ప్రభుత్వాలే పడిపోయేవని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మన దగ్గర ఇంత జరిగినా కనీస చర్యలు లేదని ఆరోపించారు. ‘ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్న ఈ దారుణ దోపిడీని ప్రధాని చూసీచూడనట్టు పోతున్నారు. ఆయనను పదేపదే కాపాడుతున్నారు’ అని రాహుల్ మండిపడ్డారు. గాందీలది అవినీతి కుటుంబం: బీజేపీ గాం«దీల కుటుంబమే అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ విమర్శించింది. వారిపై అవినీతి కేసులున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ అన్నారు. అదానీ అంశం సుప్రీంకోర్టులో ఉన్నా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనకు కోర్టు మీద గౌరవం లేదని స్పష్టమవుతోందన్నారు. ‘రాహులే నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్నారు. వారిది ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతిమయమైన కుటుంబం’ అంటూ మండిపడ్డారు. -
అగ్నివీర్ అమృత్పాల్ అంత్యక్రియలపై వివాదం.. ఆర్మీ క్లారిటీ
ఢిల్లీ: అగ్నివీర్ సైనికుడు అమృత్పాల్ సింగ్ అంత్యక్రియలపై వివాదం రేగుతోంది. అగ్నివీర్ సైనికుని అంత్యక్రియల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్మీ స్పందించింది. అగ్నిపథ్ పథకానికి ముందు.. ఆ తర్వాత సైనిక లాంఛనాల్లో ఎలాంటి భేదం లేదని స్పష్టం చేసింది. ఆత్మహత్య వంటి స్వీయ అపరాధాలతో మరణిస్తే అంత్యక్రియల్లో సైనిక గౌరవం అందించే సాంప్రాదాయం లేదని వెల్లడించింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో విధులు నిర్వహిస్తుండగా.. అగ్నిపథ్ సైనికుడు అమృత్పాల్ సింగ్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్మీ స్పష్టం చేసింది. అయితే.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోడంపై ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్లో రాజకీయ పార్టీలు సైన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ అంశంపై చొరవ చూపాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను అభ్యర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని అధికార పార్టీ ఆప్ కూడా ప్రశ్నించింది. దీంతో ఆదివారం రాత్రి ఆర్మీ ఓ ప్రకటన వెలువరించింది. అమృత్ పాల్ సింగ్ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అంత్యక్రియల అంశంపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించింది. సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత ఆర్మీ విధానాల ప్రకారమే స్వస్థలానికి చేర్చామని తెలిపింది. 1967 ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఆత్మహత్య వంటి మరణాలకు సైనిక లాంఛనాలు ఉండబోవని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఎలాంటి వివక్ష లేకుండా ఈ విధానాలను పాటిస్తున్నామని పేర్కొంది. 2001 నుంచి ప్రతి ఏడాది సరాసరి 100-140 సైనికులు ఆత్మహత్యలతో మరణిస్తున్నారని తెలిపిన ఆర్మీ.. ఈ కేసుల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని వెల్లడించింది. నియమాల ప్రకారం అంత్యక్రియల ఖర్చులతో పాటు అందాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఆర్మీలో ఎలాంటి వివక్ష ఉండబోదని, ప్రోటోకాల్ ప్రకారమే అంతా జరుగుతుందని ప్రకటనలో వెల్లడించింది. అన్ని వర్గాల మద్దతును ఆర్మీ గౌరవిస్తూ ప్రోటోకాల్స్ను పాటిస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
ఆవేశం తప్ప ఆలోచన లేని పవన్: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
సాక్షి, ఏలూరు: వారాహి యాత్రలో జనసేన పవన్ కల్యాణ్ ఆరోపణలు, విమర్శలకు కైకలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్న పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే నాగేశ్వరావు. అంతేకాదు.. తాను స్వయంగా ఎదిగిన మనిషినని.. అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని పవన్కు సవాల్ విసిరారాయన. చంద్రబాబుకి కొమ్ము కాయడం తప్ప.. పవన్ను ఏదీ చేతకావడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారాయన. గత ప్రభుత్వంలో పవన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసి గెలిపించిన కామినేని శ్రీనివాస్(మాజీ మంత్రి) కైకలూరుకు ఏమి చేశారు?.. రాత్రి ఒక పార్టీతో పగలు మరొక పార్టీతో సహవాసం చేశారు. పార్టీ అంటే కన్నతల్లితో సమానం.కానీ, కామినేని నీతి తప్పి ప్రవర్తించారు. కామినేని హయాంలో పూర్తికాని పెద్దింట్లమ్మ వారధిని.. సీఎం జగన్ రూ. 14 కోట్లతో పూర్తి చేశారు అని తెలిపారాయన. వీటితో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను, అందుకు వెచ్చిస్తున్న నిధుల వివరాలను సైతం మీడియాకు తెలియజేశారు ఎమ్మెల్యే నాగేశ్వర్రావు. ‘‘పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడుతాడు. కానీ ఏమాత్రం ఆలోచన చెయ్యరు. నాకు నా కొడుక్కి కొమ్ములు వచ్చాయి వాటిని విరగ కొడతాను అని పవన్ అన్నారు. అవి కొమ్ములు కాదు ప్రజలు మేము చేస్తున్న సేవకు ఇచ్చిన ఆశీస్సులు. కామినేని ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదివారు. కొల్లేరులో మేం వందలాది ఎకరాల ఆక్రమించామన్నారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆరోపణలు నిరూపిస్తే.. గుండు గీయించుకుని క్షమాపణలు కోరతా. పవన్.. తన స్థాయిని రోజురోజుకీ దిగజార్చుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నారు. కానీ, నువ్వు వారాహి పేరుతో యాత్ర చేస్తూ లేనిపోనివి మాట్లాడుతున్నావ్. కనీసం సర్పంచ్గా అయిన గెలిచి ఉంటే.. మౌలిక వసతుల గురించి నీకు తెలిసి ఉండేది. దమ్ముంటే.. పాదయాత్ర చెయ్యి. కైకలూరు నియోజకవర్గంలో నిజాయితీకి నిలువుటద్దం దూలం నాగేశ్వరరావు(తనను తాను ఉద్దేశిస్తూ..). కేరాఫ్ ఫ్లాట్ఫారమ్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అన్నచాటున తమ్ముడిలా ఎదిగిన వ్యక్తివి నువ్వు. ప్రజా జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంది. పవన్ అది గమనించాలి. దమ్ముంటే.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయండి. అంతేగానీ.. నేరస్తుడైన చంద్రబాబుకి కొమ్ము కాయడం కాదు. అమరావతిలో రైతులు ఇచ్చిన రెండు స్పూన్ల పెరుగు అన్నం తిని.. వెళ్ళిపోయావు. రాజధాని పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించావా?.. అవినీతి లేని చోట ప్రశ్నిస్తే పవన్ నవ్వుల పాలవుతారు అంటూ పవన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరావు హితవు పలికారు. పవన్.. మీ పేరు చెప్పి ఎందరో విద్యార్థులు, యువత తల్లి దండ్రులను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు..వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారాయన. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వ సొమ్మును దోచేస్తేనే ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసిన వ్యక్తికి కొమ్ముకాస్తున్న బాలకృష్ణను అసలు మనిషి అంటారా...? ‘‘మీరంతా రండి.. జైల్లో ఉన్న దొంగను ముఖ్యమంత్రి చేస్తానంటే చంద్రబాబుకు ఎవరూ కొమ్ము కాయరు..?. వంగవీటి రంగానే హత్య చేయించిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం ను చిత్రహింసలు పెట్టిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం భార్యని కొడుకును చిత్రహింసలు పెడితే ఒక్కరోజైనా నువ్వు మాట్లాడవా? అని పవన్ను నిలదీశారాయన.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement