betting
-
బెట్టింగ్ ఆటగాడి ఆట కట్టించిన పోలీసులు
-
బెట్టింగ్ యాప్లో రూ. 13 లక్షలు లాస్
ఆత్మకూరురూరల్: ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు సర్వం పోగొట్టుకుని కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ అనే యువకుడు ఓ ఫైనాన్స్ సంస్థలో చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 13 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఈ మొత్తాన్ని క్రెడిట్ కార్డులు, ప్రైవేట్ చీటీల ద్వారా తీసుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం రాత్రి ఆరు పేజీల లేఖ రాసి ఇంట్లో పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, భార్యను క్షమించమని, ఇక నుంచి ఎవరికీ కనపడనని లేఖలో రాశాడు. నిరంజన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాము తెలిపారు. -
‘లైవ్’ కోడి స్పెషల్!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సంక్రాంతి సంబరాలకు కూటమి సర్కారు కొత్త భాష్యం చెప్పింది. పండుగ సంప్రదాయం ముసుగులో ప్రైవేట్ సైన్యాల పహారాలో యథేచ్ఛగా కోడి పందేలు, లైవ్లో బెట్టింగ్లు, ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో క్యాసినోలను తలదన్నే రీతిలో నిర్వహించిన జూద క్రీడలు, బెల్టు షాపులు పచ్చ ముఠాలకు కాసులు కురిపించాయి. ఇసుక (Sand) నుంచి మద్యం దాకా ప్రజలను పిండేస్తున్న కూటమి నేతలు సంపాదనే లక్ష్యంగా బరి తెగించి వ్యవహరించారు. మునుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందాలు, పేకాట, గుండాటలను (Gundata) యథేచ్ఛగా నిర్వహించారు. పండుగ 3 రోజుల్లో రూ.ఐదు వేల కోట్ల మేర దందా సాగింది. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభించడంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. నిశ్చింతగా వచ్చేయండి... సంక్రాంతికి ముందు కూడా కూటమి నేతల కనుసన్నల్లో, పోలీసుల సహకారంతో బాపట్ల, కృష్ణా, భీమవరం, కోనసీమ (Konaseema) తదితర జిల్లాల్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కోడి పందేలు, జూద శిబిరాలు కొనసాగాయి. కొద్ది నెలల ముందు నుంచే పందేలు కాసేవారికి ఆహ్వానాలు అందాయి. ‘మా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే బరులు ఏర్పాటవుతున్నందున ఇబ్బందులేమీ ఉండవు. 3 రోజులు ఉండేలా మీరు నిశ్చింతగా వచ్చేయండి. హోటళ్లలో గదులు కూడా సిద్ధం చేశాం’ అని ఆహ్వానాలు పంపారు. కొత్త వారికి గేలం.. పందెంరాయుళ్లతో ఉన్న పాత పరిచయాలను బలోపేతం చేసుకుంటూనే కొత్తవారిని రప్పించేందుకు నిర్వాహకులు పలు మార్గాలు అనుసరించారు. సోషల్ మీడియాలో ప్రచారంతో హైప్ సృష్టించారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు హైదరాబాద్ తదితర నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఆకర్షించేందుకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ముందే గెట్ టు గెదర్లు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద బరుల సంఖ్య ఈదఫా పెరిగాయి. 2 నెలల క్రితమే సమాచారమిచ్చి రహస్యంగా గెట్ టు గెదర్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని కూటమి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను రప్పించారు. మందు, విందు భోజనాలతో జరిగిన ఈ పార్టీల్లోనే సంక్రాంతి బరుల్లో కోడి పందేలపై పందెంరాయుళ్లు అవగాహనకు వచ్చారు. బరుల విస్తీర్ణం, పోటీ జోడీలు, తేదీలు, సమయాలు, వ్యయం తదితరాలు అప్పుడే ఖరారైపోయాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల నుంచి ఎవరెవరిని ఆహ్వానించాలనేది నిర్ణయించి ఆ మేరకు అమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రొఫైల్స్ సిద్ధం.. బరులు నిర్వహించిన వారు భవిష్యత్తులో నిర్వహించబోయే ఆటలకు మంచి లాబీయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సంపన్న వర్గాల నుంచి కొత్తగా వచ్చిన పందెంరాయుళ్ల బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని ప్రొఫైల్స్ సిద్ధం చేసుకున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించబోయే జూద కార్యకలాపాలకు ఆహ్వానాలు పంపి జేబులు నింపుకునేలా రూట్మ్యాప్ల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీలంక, థాయ్లాండ్, నేపాల్ తదితర దేశాల్లో జరిగే పేకాట, క్యాసినో శిబిరాలకు కూడా వీరిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. భీమవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారితోపాటు ఆక్వా రంగంలోని పలువురు ప్రముఖులు హైదరాబాద్, విశాఖ, విజయవాడలకు చెందిన వారిని కోళ్ల పందేలకు ఆహ్వానించి పండుగ మూడు రోజులు రాచమర్యాదలు చేసి పంపడం గమనార్హం.లైవ్లో బెట్టింగ్లు...ఈసారి భారీ బరుల వద్ద పందేలను లైవ్ టెలికాస్ట్ చేయడం ద్వారా క్రికెట్ తరహాలో బెట్టింగ్లు నిర్వహించారు. లైవ్ లింక్ ద్వారా దేశ విదేశాల్లోని పందెంరాయుళ్లు కోడిపందేలపై బెట్టింగ్లు కాయడం గమనార్హం. ఇదివరకెన్నడూ లేని విధంగా డేగాపురం, వెంకట్రామన్నగూడెం, సీసలి, ఎస్.యానాం, కొయ్యలగూడెం, వీరవాసరం, మురుముళ్ల తదితర ప్రాంతాల్లో పెద్దపెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా ‘కోడిపందెం లీగ్ (కేపీఎల్)’ పేరిట బరి నిర్వహించడం విశేషం. చదవండి: మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేలబీచ్ ఫెస్టివల్ పేరిట సంగీత విభావరి ముసుగులో విభిన్న రకాల జూదాలను కొనసాగించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు ఇతరచోట్ల బరులు ఏర్పాటు కాకుండా, తమ బరివద్దకే పందెం రాయుళ్లు వచ్చేలా గుత్తాధిపత్యం చలాయించారు. ఇక మహిళా బౌన్సర్లు ఈసారి ప్రత్యేకం. పందెంరాయుళ్లు ఫోన్ పే ద్వారా డబ్బులు బదిలీ చేస్తే అయిదు నుంచి పది శాతం కమీషన్ తీసుకుని నగదు అందించేలా బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. -
పరిగిలో బెట్టింగ్ పావురాల కలకలం
పరిగి: బెట్టింగ్ కోసం తీసుకువచ్చిన రేసింగ్ పావురాలు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హాట్ టాపిక్గా మారాయి. వీటిని గాల్లోకి వదులుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్కు ఇద్దరు వ్యక్తులు గూడ్స్ వాహనంలో వచ్చి రెండు బాక్స్లలో తెచ్చిన పావురాలను బయటకు వదిలారు. ఉదయాన్నే వాకింగ్కు వెళ్లిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని, ఇక్కడ వదిలిన పావురాలు తమతమ యజమానుల వద్దకు వెళ్తాయని చెప్పారు.పావురాల కాళ్లకు కోడ్ నంబర్లు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులే పావురాలు ఉన్న వాహనాన్ని పీఎస్కు తరలించి, పోలీసులకు అప్పగించారు. డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబుజానీలుగా తెలిపారు.పది మంది యజమానులు తమ పావురాలను ఈ పోటీలో పెట్టారని, ఇక్కడ వదిలిన పావురాల్లో ముందుగా చేరుకున్న దాన్ని చిప్ సాయంతో విజేతగా గుర్తిస్తారని చెప్పారు. గోరంట్లకు చెందిన ప్రేంకుమార్ తమను పంపించారని, ఉదయం పావురాలను వదిలితే సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని వివరించారు. మొత్తం 20 బాక్స్లలో 400 పావురాలను తీసుకువచ్చామని, ఇందులో రెండు బాక్స్లలోని పావురాలను వదిలామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రూ. వేలల్లో ధర.. ప్రత్యేక శిక్షణ సాధారణంగా పావురాలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీల్లో వినియోగిస్తారు. ట్రైనింగ్ పొందిన కపోతాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఎక్కడ వదిలినా గమ్య స్థానానికి చేరుకునేలా తరీ్ఫదునిస్తారు. ఉదయం వదిలితే సాయంత్రం వరకు గమ్యాన్ని చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పావురాల బెట్టింగ్లను అధికంగా నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే ఒక్కో పావురాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తారు. అనంతరం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెట్టింగ్లలో పాల్గొంటారు. బెట్టింగ్ కాసిన ప్రదేశం నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి వదులుతారు. వీటిలో ఎవరి పావురం ముందుగా అక్కడకు చేరుకుంటే వారే గెలిచినట్లు ప్రకటించి బహుమతులు అందజేస్తారు. -
బెట్టింగ్ పిచ్చి తగ్గేదెలా?
మా ఆయనకు 35 సంవత్సరాలు. ఫార్మా కంపెనీలో మంచి ఉద్యోగం. కంపెనీలో మంచి పేరుంది. కానీ ఇటీవల ఆన్లైన్లో గుర్రపు పందేలపై బెట్టింగ్ చేసి చాలా డబ్బు నష్టపోయారు. ఇపుడు జీతం మొత్తం బెట్టింగ్కి పెడుతూ, అప్పులు కూడా చాలా చేశారు. నేను అడిగితే, ఏదో ఒక రోజు పెద్దమొత్తంలో గెలిచి, బాకీలన్నీ తీర్చేస్తానని అంటారు. ఎప్పడూ అబద్ధాలు చెప్పని ఆయన ఇప్పుడు తన అప్పులు, బెట్టింగ్ గురించి అబద్ధాలు చెబుతున్నారు. రోజురోజుకు మాకు ఆయన మాటల పైన నమ్మకంపోతోంది. ఆయనను ఎలాగైనా ఈ వ్యసనం నుండి బయటపడేసే మార్గం చెప్పగలరు!– గీత, సికింద్రాబాద్మీ ఆవేదన అర్థమయింది. మద్యానికి, మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లే కొందరు ఇలా ‘బెట్టింగ్’ లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. వీటిని ‘బిహేవియరల్ అడిక్షన్స్ అంటారు. ఇటీవల చాలామంది ఆన్లైన్ జూదం, స్టాక్ మార్కెట్, క్రికెట్ బెట్టింగ్, హార్స్ రేస్ లాంటి వాటికి బానిసలవుతున్నారు. మీ ఆయనకు ఉన్న మానసిక రుగ్మతను ‘గ్యాంబ్లింగ్ డిజార్డర్’ అంటారు. మొదట్లో సరదాగా ప్రారంభమై, చివరకు ఇలా పూర్తిగా బానిసలవుతారు. ఏదో ఒకరోజు గెలుస్తామనే ధీమాతో అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ చేస్తారు. వీరిని మోసగాళ్ళుగా, అబద్ధాల కోరుగా చూడకుండా, ఒక వ్యసనానికి బానిసలైన వారిగా మనం పరిగణించి, మంచి సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ‘డీఅడిక్షన్ సెంటర్’లో అడ్మిట్ చేయించి, తగిన చికిత్స చేయించాలి. కొన్ని మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే మానసిక చికిత్స ద్వారా మీ ఆయనకున్న ఈ బెట్టింగ్ వ్యసనాన్ని మాన్పించవచ్చు. ప్రస్తుతానికి మనీ మేటర్స్ మీ కంట్రోల్లోకి తీసుకోండి. ఆయనను ఏవగించుకోకుండా, సానుభూతితో చూడండి. సమస్య పరిష్కారమయేందుకు మీ తోడ్పాటు చాలా అవసరం. నమ్మకంతో ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: వెయిట్ లాస్ స్టోరీ: ఆరోగ్య సమస్యల భయంతో.. ఏకంగా 40 కిలోలు..) -
మీరు కూడా ఆ ఉచ్చులోనే చిక్కుకున్నారా..?
-
విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా.. చైనాతో లింకులు
సాక్షి,విశాఖపట్నం : భారీ సైబర్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తూ వచ్చిన నిధుల్ని చైనా, తైవాన్లకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ క్రైమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు విశాఖ పోలీసులకు అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారం అందింది. దీంతో రంగంలోకి విశాఖ పోలీసులు సైబర్ నేరస్థుల్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల దందాపై సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాం. చైనాతో సంబంధాలు ఉన్న ఈ ముఠా గుట్టు రట్టు చేశాం. నిందితులు రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ బెట్టింగ్ యాప్ నడుపుతున్నారు. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును చైనా,తైవాన్లకు పంపుతున్నారు. నేరానికి పాల్పడ్డ నిందితుల్ని ఇప్పటి వరకూ ఏడుగురుని అదుపులోకి తీసుకున్నాం. నిందితులు నుంచి పది ల్యాప్టాప్లు, ఎనిమిది పర్సనల్ కంప్యూటర్లు,కార్,బైక్ స్వాధీనం చేసుకున్నాం.వీటితో పాటు 800 అకౌంట్లు, చెక్ బుక్ లు, డెబిట్ కార్డులు, స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. -
పేకాట మొదలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేకాట మళ్లీ మొదలైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేయించిన పేకాట క్లబ్లు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అధికార కూటమి నేతలు క్లబ్లను ప్రారంభించేందుకు వారం రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్లబ్లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ప్రముఖ క్లబ్లో బుధవారం నుంచి పేకాట ప్రారంభమైంది.గత టీడీపీ ప్రభుత్వాల హయాంలో పేకాట క్లబ్బులది ప్రత్యేక చరిత్ర. రిక్రియేషన్ పేరుతో ఈ క్లబ్లలో పేకాటే కాదు.. బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలూ కొనసాగేవి. ఊర్ల శివార్లు, తోటల్లో ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించేవారు. అంతా ఆ పార్టీ నేతల నిర్వహణలో, వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. వీటిని మూసి వేయాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి. అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో అవి నిరాఘాటంగా కొనసాగాయి. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా క్లబ్లను మూసివేయించింది. రిక్రియేషన్ పేరుతో క్లబ్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్లను పూర్తిగా నిషేధించింది. వీటి మూసివేతకు ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. గత ఐదేళ్లలో ఎక్కడా పేకాట క్లబ్లు నడవకుండా చర్యలు తీసుకుంది.టీడీపీ కూటమి అధికారంలోకి రాగానేరాష్ట్రంలో మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ క్లబ్లు, శిబిరాలు తెరిచి పేకాట, బెట్టింగ్, ఇతర కార్యకలాపాలకు రంగం సిధ్ధం చేస్తున్నారు. క్లబ్ల నిర్వాహకులు ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించగా, తాము చూసుకుంటామని, క్లబ్లు ప్రారంభించుకోండని భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎలాంటి అనుమతులు లేకపోయినా 2019కి ముందు మాదిరిగానే మళ్లీ క్లబ్ల వ్యవహారాలు నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో ఆడిన క్లబ్ సభ్యులకు మళ్ళీ పేకాట ప్రారంభిస్తున్నట్టు సమాచారం అందించారు.రోజూ లక్షల్లో వ్యాపారంక్లబ్లో ప్రతి ఆటకు ప్రతి టేబుల్ నుంచి సుమారు రూ.1000 చొప్పున కమీషన్ తీసుకుంటారు. అలా 20కి పైగా టేబుల్స్తో పేకాట, సైడ్ బిజినెస్లతో రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పేకాట కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్లబ్ల బారిన పడి ఉన్నతస్థాయిలో ఉన్న వారు, మధ్యతరగతి వారు అనేక మంది ఆస్తులు పోగొట్టుకొని, అప్పుల పాలైపోయారు. వారిలో కొందరు దిక్కు తోచక ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాగు పడిందల్లా క్లబ్ల నిర్వాహకులు, వాటి నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో లక్షలాది రూపాయలు దండుకొనే కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులే. ఇప్పుడు మళ్లీ ప్రజల జేబులను పీల్చి పిప్పి చేసి, తమ జేబులు నింపుకొనేందుకు అధికార కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఇవి మళ్లీ ప్రారంభమైతే మధ్య తరగతి కుటుంబాల జీవితాలు చీకటిమయం కావడం ఖాయం. అధికార పార్టీ నాయకులకు భయపడి ఇలాంటి క్లబ్లను పోలీసులు చూసీ చూడకుండా వదిలేస్తారా లేక వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
ఫలితాలపై బెట్టింగ్ మార్కెట్ ప్రకంపనలు
2024 లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి దశ ఓటింగ్ జూన్ ఒకటిన జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం తమదేననే నమ్మకంతో ఉంది. ప్రధాని మోదీ కూడా బీజేపీకి 400కు పైగా లోక్సభ స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పారు. అయితే ‘బెట్టింగ్ మార్కెట్’ దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది.ముంబైకి చెందిన టాప్ బుకీ ఒకరు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభంలో అంటే మొదటి దశ ఓటింగ్కు ముందు, బీజేపీకి దక్కే సీట్లు అధికంగా ఉంటాయనే అంచనాలున్నాయన్నారు. అయితే అయితే మూడు దశల ఓటింగ్ తర్వాత బీజేపీకి ఆదరణ తగ్గిందన్నారు. ఇప్పుడు ఆరు దశల ఓటింగ్ తర్వాత బీజేపీ పరిస్థితి తారుమారయ్యిదన్నారు.బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ 295 నుంచి 305 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్కు 55 నుంచి 65 సీట్లు వస్తాయనే అంచానాలున్నాయి. మార్కెట్ ఎప్పుడూ బీజేపీ చెప్పిన 400 లెక్కకు మద్దతునివ్వలేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం బీజేపీకి 350 సీట్లు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ముంబై బుకీ తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్ మార్కెట్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు దక్కే లోక్సభ సీట్లపై వేసిన అంచనాలిలా ఉన్నాయి.ఫలోడి బెట్టింగ్ మార్కెట్ (రాజస్థాన్)🔹కాంగ్రెస్ - 117🔹ఇండియా - 246🔹బీజేపీ - 209🔹ఎన్డీఏ - 253పాలన్పూర్ (గుజరాత్)🔹కాంగ్రెస్ - 112🔹ఇండియా - 225🔹బీజేపీ - 216🔹ఎన్డీఏ - 247కర్నాల్ (హర్యానా)🔹కాంగ్రెస్ - 108🔹ఇండియా - 231🔹బీజేపీ - 235🔹ఎన్డీఏ-263బెల్గాం (కర్నాటక)🔹కాంగ్రెస్ - 120🔹ఇండియా - 230🔹బీజేపీ - 223🔹ఎన్డీఏ-265కోల్కతా 🔹కాంగ్రెస్ - 128🔹భారతదేశం - 228🔹బీజేపీ - 218🔹ఎన్డీఏ - 261విజయవాడ 🔹కాంగ్రెస్ - 121🔹ఇండియా- 237🔹బీజేపీ - 224🔹ఎన్డీఏ - 251ఇండోర్ 🔹కాంగ్రెస్ - 94🔹ఇండియా - 180🔹బీజేపీ - 260🔹ఎన్డీఏ - 283అహ్మదాబాద్ 🔹కాంగ్రెస్ - 104🔹ఇండియా - 193🔹బీజేపీ - 241🔹ఎన్డీఏ-270సూరత్ 🔹కాంగ్రెస్ - 96🔹ఇండియా - 186🔹బీజేపీ - 247🔹ఎన్డీఏ - 282దేశంలోని పలు బెట్టింగ్ మార్కెట్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ జరిగాక, జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ సత్తా ఎంతో తేలిపోనుంది. -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
Lok Sabha Election 2024: ఫలోదీ సట్టా బజార్లో... తగ్గిన బీజేపీ హవా
లోక్సభ ఎన్నికల ఫలితాలపై రాజస్తాన్లోని ఫలోదీ సట్టా బజార్ తాజా అంచనాలు ఎలా ఉన్నాయి? కచి్చతమైన అంచనాలు, బెట్టింగ్లకు దేశమంతటా పేరొందిన ఫలోదీ మార్కెట్ ఇప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని నమ్ముతోంది. అక్కడి పంటర్లు మోదీ సర్కారుపైనే బెట్టింగులు కడుతున్నారు. కానీ నెలక్రితం అంచనాలతో పోలిస్తే బీజేపీ నెగ్గబోయే స్థానాల సంఖ్య బాగా తగ్గడం విశేషం. బీజేపీ 330 నుంచి 333 స్థానాలు నెగ్గుతుందని తొలి విడత పోలింగ్కు ముందు దాకా ఇక్కడ జోరుగా పందేలు సాగాయి. కానీ ఇప్పుడది 296 నుంచి 300 సీట్లకు పరిమితమైంది...! క్రమంగా తగ్గుదల.. ఒక్కో విడత పోలింగ్ జరుగుతున్న కొద్దీ ఫలోదీ బజార్లో బీజేపీకి అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. 307 నుంచి 310 స్థానాలు గెలుస్తుందంటూ మే 13న నాలుగో విడత పోలింగ్కు ముందు పందేలు నడిచాయి. నాలుగో దశ ముగిశాక తాజాగా 296 నుంచి 300కు తగ్గాయి. ఎన్డీఏకు 350 దాటుతాయని తొలుత పేర్కొనగా, 329 నుంచి 332 మధ్య రావచ్చని తాజాగా పందేలు సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. ఇక కాంగ్రెస్కు 41 నుంచి 43 సీట్ల కన్నా రావని నెల క్రితం అంచనా వేసిన ఫలోదీ పందెంరాయుళ్లు కాస్తా, 58 నుంచి 62 స్థానాలు గెలుస్తుందని తాజాగా బెట్లు కడుతున్నారు. 2019లో కాంగ్రెస్కు 52 స్థానాలొచ్చాయి. ఈసారి నాలుగు విడతల్లో పోలింగ్ 2019 ఎన్నికలతో పోలిస్తే కాస్త తగ్గడం తెలిసిందే. తదనుగుణంగా ఫలోదీ మార్కెట్ కూడా బీజేపీ విషయంలో అంచనాలను సవరించుకున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాలవారీగా.. ఫలోదీ సట్టా బజార్ తాజా బెట్టింగ్ల ప్రకారం బీజేపీ గుజరాత్లో క్లీన్స్వీప్ చేస్తుంది. 26 స్థానాలూ గెలుస్తుంది. మధ్యప్రదేశ్లోని 29కి 27–28 రావచ్చు. రాజస్తాన్లో 2019లో 24 గెలవగా ఈసారి 18–20తో సరిపెట్టుకోవచ్చు. ఒడిశాలోని మరో 4 స్థానాలు అదనంగా 11 నుంచి 12 రావచ్చు. పంజాబ్లో 2019లో రెండు గెలవగా ఈసారీ 2 నుంచి 3 రావచ్చు. మొత్తం 10 స్థానాలూ గెలిచిన హరియాణాలో 5 నుంచి 6తో సరిపెట్టుకోవచ్చు. తెలంగాణలో 4 గెలవగా ఈసారి 5 నుంచి 6 రావచ్చు. ఛత్తీస్గఢ్లోని 11, హిమాచల్ప్రదేశ్లోని 4, ఉత్తరాఖండ్లోని 5 స్థానాలనూ బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుంది. జార్ఖండ్లో మళ్లీ 10 నుంచి 11 దాకా రావచ్చు. 2019లో ఒక్క సీటూ నెగ్గని తమిళనాడులో 3 నుంచి 4 స్థానాలు రావచ్చని బెట్టింగులు నడుస్తున్నాయి. కీలకమైన పశి్చమబెంగాల్లో 2019లో 18 చోట్ల గెలవగా ఈసారి 21 నుంచి 22 దాకా రావచ్చు. యూపీలో 63 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి మరో రెండు సీట్లు పెంచుకోవచ్చని సట్టా బజార్ అంచనా. కచ్చితత్వం ఎక్కువ... ఎన్నికల ఫలితాల విషయంలో ఫలోదీ మార్కెట్ ఏం చెబితే అదే జరుగుతుందన్న నమ్మకముంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఫలోదీ బుకర్ల అంచనాలే అక్షరాలా నిజమయ్యాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విషయంలో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులు కాగా సట్టా బజార్ అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్మార్కెట్లు.. కారణం..
సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి ముందు స్టాక్మార్కెట్లు రికార్డు గరిష్ఠాలను చేరాయి. కానీ క్రమంగా సెన్సెక్స్ అస్థిరంగా మారింది. ప్రస్తుత కాలంలో సూచీలు నిత్యం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో కేంద్రంలో అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీల గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలను సర్దుబాటు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ఏం జరుగుబోతుందో పరిశీలిస్తున్నారు.ఎన్నికల అనిశ్చితి వల్ల గత రెండు వారాలుగా స్మాల్ అండ్ మిడ్క్యాప్ స్టాక్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో మరింత అనిశ్చితులు ఏర్పడతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేముందు 3-4 ట్రేడింగ్ సెషన్లు, ఫలితాలు వచ్చాక 3-4 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానంస్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. కొందరికైతే స్టాక్మార్కెట్ గ్యాంబ్లింగ్ అనే అభిప్రాయం ఉంది. స్పష్టమైన వైఖరి, భవిష్యత్తు ప్రణాళిక లేకుండా మార్కెట్లో తాత్కాలికంగా డబ్బు సంపాదించే వారికి ఇది గ్యాంబ్లింగ్గానే కనిపిస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడి మార్కెట్లో కాకుండా బయట ఇతర అవకాశాలు ఉంటే వెంటనే ఆయా మార్గాల్లోకి డబ్బు మళ్లిస్తుంటారు. ఇటీవల జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గెలుపోటములపై ఇప్పటికే బెట్టింగ్ల పర్వం మొదలైంది. దాంతో మార్కెట్లో ఉన్న చాలామంది బెట్టింగ్వైపు మొగ్గు చూపుతున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఎవరుగెలుస్తారనే అంచానాలతో షాడో బెట్టింగ్ ప్లాట్ఫామ్లను పరిశీలిస్తున్నారు. -
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
-
యాప్ల్లో ఎన్నికల పందేలు
సాక్షి, హైదరాబాద్: బంతి బంతికీ.. మ్యాచ్ మ్యాచ్కూ ఎలాగైతే క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నాయో.. అచ్చం అదే తరహాలో దేశంలో జరుగుతున్న ఎన్నికలపై కూడా పందేలు కాస్తున్నారు. క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ, సాకర్, బాక్సింగ్, హార్స్ రైండింగ్ వంటి అన్ని రకాల క్రీడలపై బెట్టింగ్లు నిర్వహిస్తున్న పలు ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్నాయి. పార్టీల వారీగా వచ్చే ఫలితాలు, నియోజకవర్గం, అభ్యర్థుల విజయాలు, మెజారిటీ వారీగా పందేలు కడుతున్నాయి.గత ఎన్నికల్లోనే మొదలు..2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ తరహా బెట్టింగ్లు జరిగినా అది తక్కువ స్థాయిలోనే జరిగాయి. కానీ, ఈసారి ఎన్నికలు అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో పందేలపై ఆసక్తి పెరిగింది. దీంతో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలు వీటిపై దృష్టిసారించాయి. ఫెయిర్ ప్లే, జన్నత్బుక్, ఓం 247, జైబుక్, సాట్స్పోర్ట్, బకార్డీ వంటి సుమారు డజన్ యాప్లు, వెబ్సైట్లు ప్రత్యేకంగా ఎన్నికల్లో బెట్టింగ్లను నిర్వహిస్తున్నాయి. మ్యూల్ ఖాతాల్లోనే లావాదేవీలుబెట్టింగ్ యాప్లు ఇండియా వెలుపలి నుంచి నిర్వహిస్తుంటాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యాప్లను నిర్వహణ చేసే కంపెనీలు సిండికేట్గా మారి ఈ ఎన్నికల పందేలను నిర్వహిస్తుంటాయని, యూపీఐ చెల్లింపులు, బ్యాంక్ లావాదేవీల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్లనే వినియోగిస్తుంటాయని తెలిపారు. పందెం డబ్బు మొత్తం ఆయా అకౌంట్ల నుంచి క్రిప్టో వ్యాలెట్ల ద్వారా ఎలాంటి పన్ను చెల్లింపులు లేకుండా దేశం దాటేస్తుందని పేర్కొన్నారు.ఇదంతా చట్ట విరుద్ధంతెలంగాణ, ఏపీతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్, జూదం చట్టవిరుద్ధం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000, ఇన్మర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021 ప్రకారం ఆన్లైన్లో బెట్టింగ్ అనేది జూదంగా పరిగణిస్తారు. యాప్లను డౌన్లోడ్ చేసేందుకు వీలుగా ఏపీకే ఫైల్స్ను అందుబాటులో ఉంచుతారు. డోన్లోడ్ చేసుకునే క్రమంలో ఫోన్ కాంటాక్ట్లు, ఇతరత్రా పర్మిషన్స్ను అనుమతించాలని కోరతారు. పొరపాటున యాక్సెస్ చేయగానే హానికర సాఫ్ట్వేర్లు మొబైల్లో డౌన్లోడ్ అయిపోతాయి. దీంతో మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూ.100 నుంచి రూ.10 లక్షల వరకూ పందెం..రూ.100 నుంచి రూ.10 లక్షల వరకు పందేం వేయవచ్చు. టెలిగ్రాం, వాట్సాప్ వంటి ఇన్స్టంట్ మెసేజ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోని పలు కీలకమైన రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఫ్యాన్సీ పందేలుగా పేర్కొంటూ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఒంటరిగా ఎన్ని సీట్లు సాధిస్తాయి? రాష్ట్రాల వారీగా ఆయా పార్టీలు కూటమితో కలిసి ఎన్ని సీట్లు గెలుస్తాయి? .. ఇలా విభాగాల వారీగా పందేలు నిర్వహిస్తున్నాయి. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే..
భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఆయా బెట్టింగ్ సంస్థల వల్ల ప్రభుత్వానికి 2.5 బిలియన్ డాలర్లు(రూ.20వేలకోట్లు) నష్టం కలుగుతోందని అఖిల భారత గేమింగ్ సమాఖ్య (ఏఐజీఎఫ్) తెలియజేసింది. విదేశీ కంపెనీలు భారత్లో తమ సంస్థలకు చెందిన ప్లాట్ఫామ్ల్లో చట్టవ్యతిరేక బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్లను అందిస్తున్నాయి. అయితే వాటికి చట్టబద్ధత లేకపోవడంతో చాపకింద నీరులా అవి విస్తరిస్తున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ప్లాట్ఫామ్లు వినియోగిస్తున్న వారు చట్టబద్ధత ఉన్నావాటికి లేని వాటిని మధ్య తేడాను గ్రహించలేకపోతున్నారని ఏఐజీఎఫ్ సీఈఓ రోలండ్ లాండర్స్ తెలిపారు. ఇలా విదేశీ కంపెనీలు భారత్లోని చట్టబద్ధ గేమింగ్ పరిశ్రమకు హాని కలిగించడంతో పాటు వినియోగదార్లకు నష్టం కలిగేంచేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్ ఏటా 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) వరకు యూజర్లు, ప్రకటన కంపెనీల నుంచి డిపాజిట్లను వసూలు చేస్తున్నాయి. అంటే జీఎస్టీ రూపంలో 2.5 బిలియన్ డాలర్ల(రూ.20వేల కోట్లు) మేర కేంద్రానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. చాలా సంస్థలు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వ్యాపార ప్రకటనలు పెంచాయి. తమ ప్లాట్ఫారాలపై జీఎస్టీ/ టీడీఎస్ వర్తించదనీ చెబుతున్నాయన్నారు. దాంతో ఆయా గేమింగ్ ప్లాట్ఫారాల్లో ప్రకటనలకోసం కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: గూగుల్లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. -
ఐపీఎల్ బెట్టింగ్ జోరు..! బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలే అడ్డా..
ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా యువత పెడ దారి పడుతోంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్లు జరిపిన వారే మళ్లీ రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లో జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి బెట్టింగ్ రాయుళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అన్నిరకాల క్రీడల్లో క్రికెట్ అంటే అందరికీ మక్కువ. చిన్నారుల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు క్రికెట్ అంటే అభిమానమే. అదే అభిమానంతో ఐపీఎల్ క్రికెట్పై యువత నుంచి మొదలుకుని మధ్య వయస్సు వారు సైతం ఆన్లైన్ బెట్టింగ్ పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలను అడ్డగా చేసుకుని మందు, విందు పార్టీలు ఏర్పాటు చేసుకుని క్రికెట్ చూసుకుంటూ బాల్ టూ బాల్.. వికెట్ టూ వికెట్ అంటూ బెట్టింగ్లు పెడుతున్నారు. మరికొందరు రహస్య ప్రాంతాల్లో ఒకేచోట గుమిగూడి సెల్ఫోన్లలో క్రికెట్ వీక్షిస్తూ ఆన్లైన్ బెట్టింగ్లు పెడుతున్నారు. ఇంట్లోనే ఉండి టీవీల ముందు కూర్చుని ఆన్లైన్ ద్వారానే బెట్టింగ్ కడుతున్నారు. పల్లెలు మొదలుకుని పట్టణాల వరకు యువత టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ సంస్కృతి కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ పట్టణాలు, పల్లెల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాల్ టూ బాల్.. వికెట్ టూ వికెట్ అంటూ రూ.100 నుంచి బెట్టింగ్ ప్రారంభిస్తారు. రోజూ ఒక్కో మ్యాచ్పై సుమారు రూ.1000 నుంచి ప్రారంభమై రూ.లక్షల్లో బెట్టింగ్ సాగుతోంది. అంతేకాకుండా బార్ అండ్ రెస్టారెంట్లలో పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. యువత పెడదారి.. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన యువకుడు ఉన్నత చదువు నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు పాల్పడి ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా రూ.3లక్షలు అప్పు చేశాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కొడుకును మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయపడి అతను చేసిన అప్పు తిరిగి చెల్లించారు. 2023 నవంబర్ 15న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ నడుస్తుండగా మంచిర్యాలకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి కుమారుడు ఇంట్లో నుంచి రూ.50 వేలు తీసుకెళ్లి బెట్టింగ్కు పాల్పడ్డాడు. విషయం ఇంట్లో తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా కుటుంబ సభ్యులు గమనించి కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లలేదు. ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ గేమ్.. నేడు క్రికెట్ ఆట అంటే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో అభిమానం. దీన్ని ఆసరాగా మల్చుకుని కొందరు వ్యాపారం చేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ బూకీలుగా మారుతున్నారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగులు నడిపిస్తూ రెండు వర్గాల తరుపున మధ్యవర్థిత్వం చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. గూగుల్పే, పేటీఎం ద్వారా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్నందువల్ల ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. మ్యాచ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఆడేది ఎవరైనా సరే తమకు నచ్చిన ఆటగాళ్ల గెలుపు ఓటమిపై తమకున్న ఆలోచన విధానంతో బెట్టింగులు పెడుతున్నారు. పలువురిపై కేసు నమోదు.. నిర్మల్టౌన్: ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన మణికంఠ, చిలమంతుల శివచారి భైంసాకు చెందిన రెహమాన్ ద్వారా ఆన్లైన్లో వెబ్సైట్, ఐడీ క్రియేట్ చేసుకున్నారు. డబ్బులను కై న్లుగా మార్చి యూజర్ ఐడీలో పెట్టి బెట్టింగ్ ఆడుతున్నామని కస్టమర్లకు చెప్పారు. కస్టమర్లకు కూడా ఐడీ క్రియేట్ చేసి ఆడిపిస్తామని తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,170 నగదు, 4 ఫోన్లు, 1 ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ సీఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇవి చదవండి: మొబైల్ రిపేరే.. జాడ చూపింది! -
కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే..
కాయ్ రాజా కాయ్.. వంద పెట్టండి... వెయ్యి పట్టండి వంటి ప్రకటనలతో ఆన్లైన్ జూదం, బెట్టింగ్లు, మనీసర్క్యులేషన్ వంటి చెడు మార్గాలకు యువత బానిసవుతున్నారు. విలాసాలకు అలవాటుపడిన వారు తమ కోరికలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తీరా నేరం రుజువై జైలుపాలవుతున్నారు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తాజాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దాదాపు రూ.180 కోట్లమేర మోసానికి పాల్పడ్డాడు. గ్యాంబ్లింగ్ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి నేరం రుజువై ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమిత్పటేల్ అనే ఉద్యోగి అమెరికాలోని జాక్సన్విల్లే జాగ్వార్ కంపెనీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. కంపెనీ, ఉద్యోగులు తాత్కాలిక ఖర్చుల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ (వీసీసీ)ని ఉపయోగించేలా అతడికి అవకాశం ఉండేది. వీసీసీను చట్టబద్ధమైన వ్యాపార ఖర్చులకోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే అతడు వ్యక్తిగతంగా చేస్తున్న అంతర్జాతీయ ప్రయాణాల కోసం, విమాన ఛార్జీలు, హోటల్ ఛార్జీలు వంటి వాటికి వీసీసీను వినియోగించేవాడు. ఈ లావాదేవీలను కంపెనీ తరఫు ఖర్చులుగా చిత్రీకరించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. చాలాసార్లు ప్రయాణాలు చేయకపోయినా నకిలీ ధ్రువపత్రాల ద్వారా కంపెనీని మోసం చేశాడు. అవి ముందుగా నమ్మదగినవిగానే అనిపించినా క్రమంగా కంపెనీ యాజమాన్యానికి అనుమానం వ్యక్తం అయింది. పటేల్ వీసీసీ ద్వారా అక్షరాల 21.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.180 కోట్లు) ఖర్చు చేశాడు. ఈ డబ్బును ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయడానికి, ఆన్లైన్లో జూదం ఆడటానికి, ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకోవడానికి, స్నేహితుల కోసం లగ్జరీ ట్రిప్ల కోసం ఉపయోగించాడు. ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్లో విల్లా, కొత్త టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ ట్రక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా కంపెనీ విచారణ జరిపి పోలీసులను ఆశ్రయించింది. ఇదీ చదవండి: ‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిన పోలీసులు కేసును కోర్టుకు తరలించారు. పూర్వాపరాలు, ఆధారాలు తెలుసుకున్న కోర్టు మంగళవారం అమిత్పట్ల్కు ఏకంగా ఆరున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ ఏడాది ముందు తానెంతో తెలివిగల వాడినని భావించినట్లు చెప్పాడు. కానీ జూదం, గ్యాంబ్లింగ్ వల్ల చాలా నష్టపోయానని అన్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులపాత్ర లేదని కోర్డు నిర్ధారించింది. చివరకు కంపెనీ పటేల్ను ఉద్యోగం నుంచి తొలగించింది. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి
న్యూఢిల్లీ: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సీసీపీఏ సూచించింది. అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రకటనలు, ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సీసీపీఏ పేర్కొంది. ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్పై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లు, యాప్లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలు ఇస్తున్నాయి‘ అని సీసీపీఏ తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలను బలపర్చడమనే ది ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా యువతపై, తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని సీసీపీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన వాటిని ఏ రకంగా ప్రమోట్ చేసినా ఆయా కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. -
తొలిరోజే పుంజుకున్నాయ్
సాక్షి, అమరావతి/భీమవరం/అమలాపురం: భోగి రోజైన ఆదివారం పందెం కోళ్లు జూలు విదిల్చాయి. బరిలోకి దూకి కత్తులు దూశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోడి పందేలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో భారీఎత్తున పందేలు జరిగాయి. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నిడమర్రు, దెందులూరు మండలాలు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు సందడిగా సాగాయి. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల కోడిపందేలు జోరుగా సాగాయి. కొన్నిచోట్ల బరులకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ కూడా వేశారు. పెద్దాపురం, కరప తదితర మండలాల్లో కోడిపందేలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, కడియం, మండపేట తదితర ప్రాంతాలతోపాటు నల్లజర్ల, నిడదవోలు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. వరి చేలు, కొబ్బరి తోటలు, మైదాన ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ స్థాయిని బట్టి బరులు ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చే వారికి వీవీఐపీ, వీఐపీ, సామాన్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలు నెలకొల్పారు. బరులను ఆనుకుని ప్రత్యేకంగా సిట్టింగ్ (బెంచీలు, కుర్చిలు) ఏర్పాటు చేశారు. బరుల చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్లైట్లు పెట్టారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు మోస్తరుగా కొనసాగాయి. అన్నిచోట్లా పందేల బరులకు ఆనుకుని గుండాట, పేకాట, కోసు ఆటలు నిర్వహించారు. పందేలకు వచి్చన వారి కోసం బిర్యానీ, మాంసం పకోడి, కూల్డ్రింక్స్, సిగరెట్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో జాతరను తలపించింది. గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడి పందేలను తిలకించేందుకు, పందేలు వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు పయనమవడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ కని్పంచింది. పందేలకు వచి్చన వారితో గోదావరి జిల్లాల్లోని లాడ్జిలు, అతిథి గృహాలు సైతం నిండిపోయాయి. ట్యాగ్లు ఉంటేనే అనుమతి పశి్చమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని పెదఅమిరం, సీసలి గ్రామాల్లో కోడి పందేలు వీక్షించడానికి ఎల్ఈడీ డిస్ప్లేను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించడానికి వచ్చే వారి చేతులకు ట్యాగ్లు వేశారు. బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసి ట్యాగ్లు ఉన్నవారిని మాత్రమే బరుల్లోకి ప్రవేశించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం కలగంపూడి, కాపవరం, పూలపల్లి, పాలకొల్లు మండలం, నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం, ఆచంట నియోజకవర్గంలోని కవిటం, తణుకు నియోజకవర్గం అత్తిలి, వేల్పూరు, తేతలి గ్రామాల్లోనూ భారీ స్థాయిలో పందేలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోనూ భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నికల ఏడాది కావడంతో వివిధ పారీ్టల నేతలు బరులకు వెళ్లి నిర్వాహకులను, పందేల రాయుళ్లను పలకరించారు. అక్కడే కొంత సమయం గడిపి స్థానికులతో మమేకమై ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి హైదరాబాద్ నుంచి రాజకీయ నేతల రాక పెద్దగా కనిపించలేదు. బుసకొట్టిన ‘కట్టల’ పాములు కోడి పందేలతో పాటు పేకాట, గుండాట వంటి జూద క్రీడల శిబిరాలు కూడా భారీగానే వెలిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 200 బరుల్లో పందేలు నిర్వహించగా సుమారు రూ.150 కోట్ల వరకు చేతులు మారినట్టు అంచనా. కోనసీమ జిల్లాలోనూ నోట్ల కట్టలు బుసలు కొట్టినట్టుగా చేతులు మారాయి. కోడి పందేలు నిర్వహించే పెద్ద బరుల వద్ద సొమ్ములు లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం విశేషం. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలం మిలట్రీపేట, మండవల్లి మండలం భైరవపట్నం శిబిరాల వద్ద ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లను బహుమతిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జూదాలు విపరీతంగా పెరిగాయి. అక్కడ కూడా రూ.కోట్లు చేతులు మారాయి. -
AP: విశాఖలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లో సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ స్కామ్ వైజాగ్లో కలకలం రేపుతోంది. వైజాగ్లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో వైజాక్కు చెందిన అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్ను ఈడీ తాజాగా అదుపులోకి తీసుకుంది. నితిన్, అమిత్లు టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో వైజాగ్లో కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ ఖాతాలను వినియోగించి వీరిద్దరు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్లోలో వచ్చిన నిధులతో ఆస్తులు కొనుగోలు చేశారు. భార్యల పేరు మీద ఈ ఆస్తులన్నీ ఉంచారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్కు ఈ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసు అక్కడ పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఇదీచదవండి.. పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా -
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
ఆసక్తికరంగా ఛత్తీస్గఢ్ పోరు.. ఎవరి ధీమా వారిదే!
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008 అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది. ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది. 2013 ముఖ్యమంత్రిగా రమణ్సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం! 2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్గఢ్లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది. 2018 సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది. -
22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ల సిండికేట్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్గఢ్లోని ‘మహదేవ్ బుక్’యాప్తో పాటు ఇతర బెట్టింగ్యాప్లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్ఫామ్లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 1 తర్వాత భారత్లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్ కంపెనీలు, జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లలో బెట్టింగ్ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్ట్లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్11, డెల్టా కార్ప్ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్క్రాఫ్ట్ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. -
మహదేవున్నీ వదల్లేదు!
దుర్గ్: దుబాయ్కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్కు ముడుపుల అంశంలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సదరు యాప్తో తనకున్న సంబంధాలేమిటో బఘేల్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యాప్ నిర్వాహకుల నుంచి ఆయనకు ఇప్పటిదాకా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించడం, అది దేశవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్లో శనివారం దుర్గ్ నగరంలో బీజేపీ ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దోపిడీకి ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వదల్లేదు. చివరికి మహదేవుని పేరును కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బెట్టింగ్ కంపెనీకి చెందిన భారీ మొత్తాలను రెండు రోజుల క్రితం రాయ్పూర్లో పట్టుకున్నారు. అదంతా రాష్ట్ర పేదలు, యువత నుంచి దోచిందే. అలాంటి డబ్బుతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందలమెక్కుతున్నారు. పట్టుబడ్డ డబ్బును సీఎం బఘేల్కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. దుబాయ్లోని యాప్ నిర్వాహకులతో తమకున్న బంధమేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం, బఘేల్ బయట పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్న ప్రధాన్మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశంలో అతి పెద్ద కులం పేదరికం మాత్రమేనన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్కు సుతరామూ ఇష్టముండదని ఆరోపించారు. -
ఆన్లైన్ గేమింగ్లపై 28 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు భారత్లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది. -
భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి..
నల్గొండ: వ్యసనాలకు బానిసలైన యువ జంట.. ఓ అమాయకుడిని మోసగించి రూ.30 లక్షలు కాజేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకవీడు మండలం గూడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన సట్టు నారాయణ నేరేడుచర్లకు చెందిన గడ్డం భారతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నారాయణ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతుంటాడు. వీరి అవసరాలకు, ఆన్లైన్ బెట్టింగులకు డబ్బు అవసరం కావడంతో అదే గ్రామానికి చెందిన దొంగల సతీష్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసానికి తెరలేపారు. నారాయణ తన భార్య భారతిని సంధ్య అనే పేరుతో సతీష్కు పరిచయం చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో సతీష్ వద్ద నుంచి డబ్బులు కాజేయడం మొదలు పెట్టారు. సతీష్ను బెదిరించి నాలుగేళ్లుగా సుమారు రూ.30 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన సతీష్ పోలీసులను ఆశ్రయంచాడు. జరిగినదంతా పోలీసులకు వివరించి నారాయణ, భరతిలపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పిట్టిన పోలీసులు బుధవారం వారిని మిర్యాలగూడ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.13వేల నగదు, బైక్ ఇతర సామగ్రి స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ లింగయ్య తెలిపారు. -
కర్ణాటక ఎన్నికల బెట్టింగ్పై ఫన్నీ స్కిట్
-
ఐపీఎల్ 2023లో ఏం జరుగుతోంది..? ఆ రెండు మ్యాచ్లు ఫిక్స్ అయ్యాయి..!
ఐపీఎల్-2023లో ఫస్ట్ ఆఫ్ మ్యాచ్లు అయిపోయాక ఒక్కసారిగా భారీ మార్పులు సంభవిస్తున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్లు ఉన్నట్లుండి బౌలర్లకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయి. బ్యాటర్ల హవా కొనసాగిన మైదానాల్లో బౌలర్లు రాజ్యమేలుతున్నారు. రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆయా జట్లు అతి స్వల్ప స్కోర్లను డిఫెండ్ చేసుకోగలిగాయి. అంతకుముందు వరకు పరిస్థితి వేరేలా ఉండేది. దాదాపు ప్రతి మ్యాచ్లో రెండు జట్లు అలవోకగా 200 స్కోర్ను దాటేవి. ఉన్నట్లుండి ఈ మార్పుకు కారణమేంటని అభిమానులు చర్చింకుంటున్నారు. ఆర్సీబీ-లక్నో, ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్లు ఫిక్స్ అయ్యాయా అని అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మ్యాచ్ల్లో బౌలర్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారన్నది కాదనలేని సత్యమే అయినప్పటికీ, ఇదే వేదికలపై గతంలో పరుగుల వరద పారిన విషయాన్ని మరచిపోకూడదు. బ్యాటర్లకు ఓ రేంజ్లో సహకరించిన పిచ్లు ఒక్కసారిగా స్లో పిచ్లుగా మారి బౌలర్ల పిచ్లుగా మారాయంటే ఏదో జరుగుతుందని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మ్యాచ్లు సాగిన వైనం కూడా అభిమానుల అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని అర్ధం వచ్చేలా టాస్ గెలిచిన జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఆతర్వాత అతి స్వల్ప స్కోర్లను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్నాయి. పైగా ఈ రెండు మ్యాచ్ల్లో ఓడిన జట్లు (లక్నో, గుజరాత్) హాట్ ఫేవరెట్ జట్లు. స్వల్ప లక్ష్య ఛేదనలో విధ్వంసకర బ్యాటర్లు ఉన్న జట్లు ఒక్కో పరుగు చేసేందుకు ఆపసోపాలు పడ్డాయి. ఆర్సీబీ-లక్నో మ్యాచ్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్లో లక్నో ఓటమిని ముందుగానే ఖరారు చేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఐపీఎల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గంభీర్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని కొందరు అభిమానులు అనుకుంటున్నారు. మరికొందరైతే బెట్టింగ్ మాఫియాను ప్రోత్సహించేందుకు తక్కువ అంచనాలు కలిగిన జట్లను ఐపీఎల్ యాజమాన్యమే గెలిపిస్తుందని చర్చించుకుంటున్నారు. క్రికెట్ పరిజ్ఞానం, ఐపీఎల్ ఫాలో అయిన అనుభవం ఉన్న కొందరైతే, ఏ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా లీగ్ సాగబోయే తీరును వారు ముందే పసిగడుతున్నారు. మ్యాచ్లు వన్ సైడెడ్గా సాగితే (బ్యాటర్లకు సహకారం) కూడా జనాలు చూడరని, బెట్టింగ్లు కాసే వారు సులువుగా మ్యాచ్ తీరును అంచనా వేయగలుగుతున్నారని ఐపీఎల్ యాజమాన్యమే ఇలాంటి స్క్రిప్టెడ్ గేమ్స్ను ప్లాన్ చేస్తుందని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. -
విజయ్ శంకర్ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..!
గుజరాత్ ఆల్రౌండర్, త్రీ డీ ప్లేయర్ విజయ్ శంకర్ బెట్టింగ్ రాయుళ్లను నట్టేట ముంచాడు. నిన్న (ఏప్రిల్ 29) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో విధ్వంకర హాఫ్సెంచరీ (24 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదిన శంకర్, బెట్టింగ్ కాసే వాళ్ల కొంపలు కొల్లేరు చేశాడు. గుజరాత్ గెలుపుకు అడపాదడపా అవకాశాలు ఉన్న దశలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శంకర్.. ఎవరూ ఊహించని విధంగా రెచ్చిపోయి ఎడాపెడా సిక్సర్లు బాది, కేకేఆర్ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న బెట్టింగ్ రాయుళ్లకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చాడు. Vijay Shankar's counter-attacking 5️⃣0️⃣ ensures #GujaratTitans keep their perfect away record intact 💯 The defending champions also go 🔝 of the #TATAIPL points table!#KKRvGT #IPLonJioCinema #IPL2023 | @vijayshankar260 pic.twitter.com/uLpd5RYmgW — JioCinema (@JioCinema) April 29, 2023 క్రీజ్లో ఉన్నది విజయ్ శంకరే కదా అని తక్కువ అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడి బెట్టింగ్ కాసే వాళ్లను కేకేఆర్వైపు చూసేలా చేసిన శంకర్.. ఆతర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల సునామీ సృష్టించాడు. దీంట్లో ఈడెన్ గార్డెన్స్ మైదానంతో పాటు బెట్టింగ్ రాయుళ్లు తడిసిముద్ద అయిపోయారు. కేకేఆర్పై పందెం కాసి భారీగా దండుకోవచ్చని అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్ల ఆశలు అడియాశలయ్యాయి. విజయ్ శంకర్పై నమ్మకంతో (ఏం చేయలేడని భావించి) భారీగా బెట్టింగ్ కాసి, అది కాస్త బెడిసికొట్టడంతో లబోదిబోమంటున్నారు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో 14 ఓవర్ల (111/3) వరకు గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని గుజరాత్.. శంకర్, మిల్లర్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆ తర్వాత నాలుగు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్ను ముగించింది. 15వ ఓవర్లో 18, 16లో 13, వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్లో 24, 18వ ఓవర్లో 14 పరుగులు సాధించి, మరో 13 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. గుర్భాజ్ (81), రసెల్ (18) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. గిల్ (49), విజయ్ శంకర్ (51 నాటౌట్), మిల్లర్ (32 నాటౌట్) సత్తా చాటడంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నై vs రాజస్థాన్.. ఎవరు గెలిస్తే ఏంటీ? కిడ్నాప్ కథకు లింకేంటీ?
ఒంగోలు టౌన్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ వివాదం తెలుగు సినిమా తరహాలో అటు తిరిగి ఇటు తిరిగి పోలీసు అరెస్టులతో ఒక కొలిక్కి వచ్చింది ..డీఎస్పీ యు.నాగరాజు తెలిపిన వివరాలు ప్రకారం...నగరంలోని సత్యనారాయణపురం 3వ లైన్లో నివాసం ఉండే గుజ్జుల అయ్యప్ప 9వ తరగతి వరకు చదువుకుని చెడు వ్యసనాలకు బానిసై తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడికి కేశవరాజుకుంటకు చెందిన రియాజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కు అయ్యప్ప చేత బెట్టింగ్ పెట్టించాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ వర్సస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నయ్ సూపర్కింగ్స్ తరఫున రూ.15 వేలను బెట్టింగ్ పెట్టించాడు. అయితే ఆ టీం ఓడిపోయేలా ఉండడంతో అయ్యప్పకు ఫోన్ చేసిన రియాజ్ రాజస్థాన్ మ్యాచ్ వైపు బెట్టింగ్ను మార్చమని చెప్పాడు. అయితే సిగ్నల్ సరిగా లేకపోవడంతో అయ్యప్ప మార్చలేకపోయాడు. ఈ విషయాన్ని రియాజ్కు చెప్పగా అందుకు అతడు అంగీకరించలేదు. నాకు బెట్టింగ్లో వచ్చే రూ.23 వేలతో సహా మొత్తం రూ.38 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని అయ్యప్ప రెండు రోజుల పాటు రియాజ్కు కనిపించకుండా తిరిగాడు. ఈ క్రమంలో పీవీఆర్ స్కూల్లో క్రికెట్ చూస్తున్న అయ్యప్పను ఈ నెల 21న రియాజ్ స్నేహితులు కరీమ్బాషా, నాగార్జున, వినోద్లు కలిసి బలవంతంగా తీసుకెళ్లారు. పాపాకాలనీలోని కరీమ్బాషా ఇంటికి తీసుకెళ్లి బంధించి కొట్టారు. అంతటితో ఊరుకోకుండా అయ్యప్ప తల్లి తిరుపతమ్మకు ఫోన్చేసి మీ అబ్బాయి మాకు డబ్బులు ఇవ్వాలి, అది ఇస్తేనే మీ అబ్బాయిని వదులుతామని బెదిరించారు. ఈ లోగా అయ్యప్ప అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమాచారం తెలిసిన తాలుకా పోలీసులు అతడిని వారి తలిదండ్రులకు అప్పగించి నిందితులు రియాజ్, కరీం బాషా, మౌలాలి, సాల్మన్లను అరెస్టు చేశారు. నాగార్జున, వినోద్లు పరారీలో ఉన్నారు. -
ఇంగ్లండ్ హెడ్ కోచ్కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్!
లండన్: ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ ‘22బెట్ ఇండియా’కు అతను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటనలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్లో రిజిస్టర్ అయిన బెట్22తో గత నవంబర్లో మెకల్లమ్ ఒప్పందం కుదర్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దీనిపై దృష్టి సారించింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ‘ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్లో పాల్గొనడం, పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు’. టీమ్ హెడ్ కోచ్గా మెకల్లమ్కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో ‘22బెట్ ఇండియా’పై ఆ దేశం నిషేధం విధించింది కూడా. ఆ దేశానికి చెందిన ‘ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ ఫౌండేషన్’ సంస్థనే మెకల్లమ్ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్ కోచ్గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్ 10 టెస్టులు గెలిచింది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్రైజర్స్ ఆటగాడిగా -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
-
బెట్టింగ్ బాబులు.. జాగ్రత్త..!
ఐపీఎల్ 16వ ఎడిషన్ రసవత్తరంగా మారుతోంది. మ్యాచ్లు ఉత్కంఠభరితంగా మారుతుండడంతో కొందరు బెట్టింగ్కు తెర లేపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగులు జోరందుకున్నాయి. ఒకప్పుడు మ్యాచ్ విన్నర్లపై బెట్టింగ్ సాగేది. కానీ ఇప్పుడు బాల్ బాల్కు బెట్టింగ్ జరుగుతోంది. ఆన్లైన్ పేమెంట్లు ఊపందుకున్నప్పటి నుంచి బెట్టింగ్ భూతం మరింతగా విజృంభిస్తోంది. వందల నుంచి ప్రారంభమై రూ.వేలు, లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో బెట్టింగ్ పెడుతూ నిండా మునుగుతున్నారు. పలమనేరు: ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి లక్షాధికారులు కావాలనే ఆశతో కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో యువకులు, విద్యార్థులు బెట్టింగుల రొచ్చులోకి దిగుతున్నారు. తీరా నష్టపోయి అప్పులపాలై బికారీలుగా మారుతున్నారు. బెట్టింగుల కారణంగా యువత జీవితా లు నాశనమై ఆ కుటుంబాల్లో పెద్దలకు మనోవ్యధను కలిగిస్తోంది. చాలామంది యువకులు బైక్లను, ఒంటిపై ఉన్న చైన్లు, ఉంగరాలను అమ్ముకోవాల్సి వస్తోంది. అదీ చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలామందికి బెట్టింగులు వ్యసనంలా మారుతోంది. ప్రస్తుతం బెట్టింగులు మూడు రకాలుగా ఉన్నాయి. 1. కొంతమంది కలసి ఆన్లైన్ పేమెంట్ల ద్వారా బెట్టింగులు చేస్తున్నారు. 2. ఇంకొందరు రహస్యప్రదేశాల్లో ఉంటూ మ్యాచ్లు మొదలైనప్పటి నుంచి గ్రూపుల్లోని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ బెట్టింగ్లు చేస్తున్నారు. 3. ఎక్కువ మంది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను వాడుతున్నారు. ప్రస్తుతం ఎలెవన్ బెట్, డ్రీమ్–11, ట్వంటీఫోర్క్లబ్, బీక్రిక్, మోస్ట్బెట్, ఐవిన్, మెల్బెట్, బెట్ 365, పారీమ్యాచ్, ఫెయిర్ప్లే లాంటి యాప్లను ఎక్కువ మంది బెట్టింగుల కోసం వాడుతున్నారు. పడమటి మండలాలను ఆనుకుని ఉన్న కర్ణాటక పరిధిలోని ముళబాగిలు, శ్రీనివాసపురం, కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన క్రికెట్ బుకీలకు చెందిన ముఠాలు జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచినా కీలక వ్యక్తుల జాడ తెలియడం లేదని తెలుస్తోంది. టాస్ నుంచే.. ఐపీఎల్ మే 18 తేదీ వరకు జరుగుతుంది. రోజూ మధ్యాహ్నం మొదటి మ్యాచ్ 3.30, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. మ్యాచ్కు ముందుగానే టాస్ వేస్తారు. టాస్ ఎవరుగెలుస్తార నే దాంతో బెట్టింగులు మొదలవుతున్నాయి. ఆపై బాల్బై బాల్, ఓవర్ టు ఓవర్, ఎక్కువ వికె ట్లు, ఎక్కువ పరుగులు, సిక్స్లు, ఫోర్లతో పాటు మ్యా చ్ గెలుపు వరకు పందేలు సాగుతున్నాయి. మ్యాచ్ కు ముందుగా అయితే 1కి 2, ఓడిపోతే టీమ్పై 1కి 5 రెట్లు ఎక్కువగా బెట్టింగులు ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉండాలి పట్టణంలోని ఆవాస ప్రాంతాల్లో యువకు లు సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్లకు పాల్పడడుతున్నారు. ము ఖ్యంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సైతం బెట్టింగ్లకు అలవాటుపడ్డారు. మద్యం సేవించడం, గంజాలాగడాలు అన్నీ బెట్టింగులు జరిగే చోట సాధారణంగా మారింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. – పుష్పరాజ్, ఎస్సీ టీచర్స్ సంఘ నాయకులు, పలమనేరు ప్రత్యేక నిఘా ఉంచాం ఐపీఎల్ మొదలైయ్యాక సబ్ డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగులు రహస్యంగా సాగుతున్న విషయం తమ దృష్టిలో ఉంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించాం. కేవలం స్మార్ట్ఫోన్లలో సాగే బెట్టింగ్ వ్యవహారాలను కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే బెట్టింగుల్లో బాధితులుగా మారిన వారి ద్వారా కీలక సమాచారాన్ని తెలుసుకొని ముఠాలను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. – సుధాకర్రెడ్డి, డీఎస్పీ, పలమనేరు ● బైరెడ్డిపల్లె మండలానికి చెందిన యువకుడు క్రికెట్ బెట్టింగుల కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ● పలమనేరుకు చెందిన ఓ యువకుడు బెట్టింగుల కారణంగా వ్యాపారాన్ని వదులుకుని బెంగళూరుకు వెళ్లాడు. ● పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ యువకుడు బెట్టింగ్ల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ● మదనపల్లెకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి పలమనేరులోఉంటూ ఆన్లైన్ బెట్టింగుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ● పలమనేరు మండలం సముద్రపల్లెకు చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగుల కారణంగా బైక్ను తనఖా పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో పదుల సంఖ్యలో జరిగాయి. కానీ వెలగుచూడని విషయాలు వందల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. -
‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్
యావత్ సినీ ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంగా బెట్టింగ్ రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఆస్కార్ అందుకునే హీరో ఎవరు? ఏ సినిమాకి ఆస్కార్ వస్తుంది? తదితర అంశాలపై జోరుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. (చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) ఇక ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’పై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై నగరాల్లో తిష్టవేసిన బుకీలు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్లైన్లోనే నడిపిస్తున్నారు. 1:4 నిష్పత్తితో నడుస్తున్న ఈ బెట్టింగ్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. (చదవండి: ఆస్కార్కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!) సామాన్యులతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు నిర్మాతలు..టెక్నీషియన్స్ కూడా బెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ వేడుక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా..ఆర్ఆర్ఆర్.. నాటు నాటు పాట గురించే చర్చిస్తున్నారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో మరో నాలుగు పాటలతో పోటీ పడుతున్న నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. -
చైనా యాప్లపై కేంద్రం కొరడా.. ఈసారి ఏకంగా
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ డ్రాగన్ కంట్రీకి భారీ షాకిచ్చింది. దేశంలో ఒకేసారి 232 చైనా యాప్లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. నిషేధం విధించిన వాటిలో 138 బెట్టింగ్ యాప్లు, 98 లోన్ యాప్లు ఉన్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాల ప్రకారం వీటిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. చైనా లింకులు కలిగి ఉన్నట్లు గుర్తించడంతో ఈ యాప్లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంహెచ్ఏ (MHA).. ఆరు నెలల క్రితం 28 చైనీస్ లోన్ లెండింగ్ యాప్లపై నిఘా పెట్టింది. అయితే, ఈ-స్టోర్లలో 94 యాప్లు అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్ల ద్వారా పనిచేస్తున్నాయని గుర్తించింది. అంతేకాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఈ చైనీస్ యాప్లపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఈ తరహా పలు చైనీస్ యాప్లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 2020 నుంచి టిక్ టాక్, షేర్ఇట్, వీ చాట్, హలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్, ఈఎస్ ఫైల్ ఎక్స్ఫ్లోరర్, ఎంఐ కమ్యూనిటీ వంటి ప్రముఖ అప్లికేషన్లతో సహా 200కి పైగా చైనీస్ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా? -
మునుగోడు రిజల్ట్ పై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్
-
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్
-
భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ లు
-
హైదరాబాద్ అడ్డాగా భారీ ఐపీఎల్ బెట్టింగ్
-
సైబరాబాద్ పరిధి లో భారీ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్
-
ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్
లక్సెట్టిపేట (మంచిర్యాల): మొబైల్లో ఆన్లైన్ గేమ్స్కు ఓ బీటెక్ విద్యార్థి జీవితం బలైంది. చిన్నచిన్న గేమ్స్తో మొదలైన ఆకర్షణ.. బెట్టింగ్వరకూ వెళ్లి అప్పుల పాలు చేసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలవడంతో వారు అప్పులు తీర్చినప్పటికీ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో శనివారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఏఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్ కుమారుడు మధుకర్ (24) హైద రాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్కు బానిసయ్యాడు. తన మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ కాయడంతో తీవ్రంగా నష్టపోయా డు. ఇలా తెలిసినవారి వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విష యం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించి.. అప్పులన్నీ తీర్చా రు. అయితే తాను చేసిన అప్పులకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని ఆవేదనకు గురైన మధుకర్ ఈనెల 7న ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మంచిర్యాలలో క్రిమిసంహారక మందు తాగి తన అక్కకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వారు అక్కడున్న స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వేతో ప్రాణం తీశారు!
-
ప్రాణం తీసిన బెట్టింగ్
-
క్రికెట్ బెట్టింగ్లో టిడీపీ నేతలు అరెస్ట్
-
కాయ్ రాజా కాయ్
♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ల జోరు ♦ లక్షల్లో కాస్తూ సై అంటే సై... ♦ 30వ డివిజన్ ఫలితంపై రెట్టింపు సంఖ్యలు ♦ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ‘పోటీ’దారులు కాకినాడ క్రైం : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగియడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం అధికార టీడీపీ కోట్లాది రూపాయలను తృణప్రాయంగా ఖర్చు చేసింది. ఎన్నడూలేని రీతిలో ఎన్నికలకు రెండు రోజుల ముందే ఓటర్ స్లిప్పులతోపాటు డబ్బులు పంచి ఓటర్లను పలు ప్రలోభాలకు గురిచేశారు. మద్యాన్ని వరదలా పారించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు పార్టీ అధినేత జగన్ పర్యటనతో రెట్టించిన ఉత్సాహంతో విజయం కోసం అహర్నిశలూ శ్రమించారు. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగినా మొత్తంమీద ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులకు తెరదీశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుపై జోరుగా పందేలు కడుతున్నారు. వేల నుంచి లక్షల రూపాయల మేర పందాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ డివిజన్ వైపే చూపంతా... కాకినాడ డివిజన్ పరిధిలోని 30వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాదం బాలకృష్ణల మధ్య ఎన్నికల ఫలితంపై జోరుగా పందేలు సాగుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి బాలకృష్ణ గెలుపు కోసం ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తిష్టవేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వైఎస్పార్సీపీ అభ్యర్థిని తరపున మాజీ ఎమ్మెల్యే, సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అభ్యర్థిని భర్త ప్రూటీకుమార్ విస్త్రుత ప్రచారం నిర్వహించారు. అధినేతలంతా ఇక్కడే... ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పోరాడాయి. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఒకరోజు కాకినాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పలువురు వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్పరిధిలో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా విలీన పంచాయతీలపై కొంత మంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో రెండు డివిజన్లను మినహాయించి 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. గెలుపు అవకాశాలపై లెక్కలు వేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ సరళి, పోలైన ఓట్లు, ఏ వర్గం ఓట్లు తమకు అనుకూలంగా పడ్డాయి, ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయనే విషయంపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. మరో రోజులో తేలే ఎన్నికల ఫలితాల కోసం ఇటు అభ్యర్థులతోపాటు అటు పార్టీశ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఎవరి ధీమా వారిదే!
- ఉప ఎన్నికల ఫలితంపై నేతల్లో టెన్షన్ - గ్రామాల వారీగా లెక్కలు చూస్తున్న వైనం - రూ.కోట్లలో బెట్టింగ్లు నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన ప్రధాన పార్టీల నాయకులు ప్రస్తుతం ఫలితంపై టెన్షన్గా గడుపుతున్నారు. గ్రామాల వారీగా లెక్కలు చూసుకుంటూ విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీ అభ్యర్థుల తరఫున కోట్లాది రూపాయల బెట్టింగ్ కాసిన వారు అభ్యర్థులను మించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. బుధవారం పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించిన అధికారులు సోమవారం కౌంటింగ్కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అంచనాల్లో నిమగ్నమైన నేతలు.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్ధుల్ఖాదర్తోపాటు మరో 13మంది ఎన్నికలో పోటీ చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన మరు నిమిషం నుంచి వీరంతా వార్డులు, పల్లెల వారీగా ఫలితంపై అంచనాలు వేస్తూ గడుపుతున్నారు. పట్టణంలో 1,42,628 ఓటర్లకు 1,05,629 మంది, రూరల్కు సంబంధించి 47,386 ఓటర్లకుగాను 41,514 మంది, గోస్పాడు మండలంలో 28,844 ఓటర్లలో 26,192 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. నియోజకవర్గ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 79.20శాతం పోలింగ్ నమోదైంది. ఫలితం మిగిలి ఉండడంతో నాయకుల దృష్టి అటువైపు పడింది. గ్రామాల వారీగా నాయకులు, ఓటర్లకు పంపిణీ చేసిన నగదు, చీరలు, ముక్కుపుడకలు, దేవాలయాలకు అందజేసిన నగదు, వాటి కారణంగా తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ గడుపుతున్నారు టీడీపీ నాయకులు. ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన... నియోజకవర్గంలోని 2,18,858 ఓటర్లలో 1,73,335 మంది ఓటు వేసి రికార్డు సృష్టించడంతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుందని లోలోన మధనపడుతున్నారు. నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళలుండగా 88,503 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వీరు ఎవరికి ఓటు వేశారనేది అంతు పట్టడం లేదు. గ్రామాల్లో కూడా టీడీపీ నాయకుల అంచనా కన్నా పోలింగ్ శాతం పెరగడం ఆ పార్టీ నాయకుల్లో అలజడి రేపుతోంది. గోస్పాడు, నంద్యాల మండలాల్లోని గ్రామాలు మొదటి నుంచి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటం, వాటిలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరగడం టీడీపీ నాయకుల కలవరపాటుకు కారణంగా మారింది. పందెంరాయుళ్ల ఉత్కంఠ.. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫలితంపై నాయకులు, బెట్టింగ్ రాయళ్లు రూ.కోట్లలో పందాలు కాస్తున్నారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.50కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. స్థానిక నాయకులు సైతం గ్రామాల వారీగా పందె కాస్తున్నట్లు తెలిసింది. -
బెట్టింగ్ల జోరు
►నంద్యాల ఉపఎన్నికపై జోరుగా పందేలు ►జిల్లాలో రూ.కోట్లలో జరుగుతున్న వైనం ►వైఎస్ఆర్సీపీ గెలుపు అంచనాలతో వెనక్కి తగ్గుతున్న టీడీపీ ►ఎక్కడ చూసినా నంద్యాల గురించే చర్చ కడప : జిల్లాలో బెట్టింగ్రాయుళ్లు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఒకసారి ఐపీఎల్, మరోసారి ఇండియా మ్యాచ్లపై బెట్టింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికపైనే జోరుగా బెట్టింగ్లు వేయిస్తున్నారు. ఊహకందని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్లు జరుగుతుండగా.. జిల్లాలో కూడా పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి 40రోజులుగా ప్రచార పర్వం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బెట్టింగ్రాయుళ్లు అప్పటినుంచే భారీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నంద్యాల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బెట్టింగ్కు అన్ని పార్టీల వారు కాలర్ ఎగరేస్తున్నారు. కోట్లలో బెట్టింగ్ జిల్లాలో నంద్యాల ఉపఎన్నికపై భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఎన్నికకు ముందు ఒక రేటు.. పోలింగ్ సరళిని బట్టి అయితే మరొక రేటు అన్నట్లు బెట్టింగ్ జరుగుతోంది. ఎక్కడచూసినా చిన్న, పెద్దా, ఉద్యోగ, కార్మిక ఇలా పార్టీల నాయకులతోపాటు ప్రతి ఒక్కరిలోనూ నంద్యాల ఉప ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. కిందిస్థాయి కార్యకర్తల నుంచి ఓ రకమైన నేతల వరకు నంద్యాల ఉపఎన్నికపై ఆరా తీసి పందేలు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఏదీ ఏమైనా జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈనెల 28వ తేదీన వెలువడనున్నాయి. వెనుకంజ వేస్తున్న టీడీపీ కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముందురోజు వరకు టీడీపీ గెలుపు తమదేనంటూ కాలర్ ఎగరేసినా బుధవారం మాత్రం చతికిలపడ్డారు. పోలింగ్ సరళి బట్టి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఎన్నిక ముందురోజు వరకు లక్షకు రూ.1.50లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నేతలు ప్రస్తుతం లక్షకు లక్ష ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేకపోగా పందేలు కాయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఎన్నికలలో శిల్పా మోహన్రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైందని, ఈ నేపథ్యంలో అనవసరంగా పందేలు పెట్టి నష్టపోవడంకంటే ఊరకుండటమే మంచిదనే నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. -
ఆట.. ఏమైందో వేట
► క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేతలకు మినహాయింపు! ► 25 రోజులుగా అజ్ఞాతంలోనే అధికార పార్టీ బుకీలు ► పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ► కేసును వైఎస్సార్ సీపీ నేతలపై నెడుతూ మైండ్గేమ్ ► పోలీస్ కస్టడీకి కృష్ణసింగ్, మరో నలుగురు ► నేటినుంచి రెండోదఫా విచారణ నెల్లూరు : జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ రాకెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కీలక బుకీలను శనివారం నుంచి పోలీస్ కస్టడీకి తీసుకుని మరోసారి విచారణ జరిపేందుకు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సిద్ధమవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అధికార పార్టీలో మళ్లీ అలజడి మొదలైంది. ఇదిలావుంటే.. 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై అధికార పార్టీ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని.. మంత్రులు, ఎమ్మెల్సీలు స్వయంగా రంగంలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మళ్లీ మొదలు సమర్థవంతమైన అధికారిగా జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు పేరుంది. గతంలో ఆయన పనిచేసినచోట అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెట్టింగ్ రాకెట్పై దృష్టి సారించారు. మూలాలతోసహా రాకెట్ గుట్టును రట్టు చేసి 115 మందిని మొదటి విడతలో అరెస్ట్ చేశారు. వీరిలో కీలక బుకీగా ఉన్న కృష్ణసింగ్తోపాటు మరో 8 మంది ప్రధాన బుకీలు, వారి అనుబంధంగా ఉండే 15 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది బుకీలను, పంటర్లను సైతం అరెస్ట్ చేసి వారి పాత్ర ఏ మేరకు ఉందనేది నిర్ధారించారు. జిల్లాలో సీఐలు, డీఎస్పీలే బెట్టింగ్ రాకెట్ను పెంచి పోషించారనే వాదన బలంగా ఉంది. ఈ క్రమంలో వారి పాత్రను కూడా నిర్ధారించి ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను వీఆర్కు పంపారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఐదు రోజులపాటు స్తబ్దత నెలకొనగా.. తాజాగా కీలక బుకీలను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనుండటంతో రాజకీయ నేతల్లో అలజడి రేగుతోంది. ప్రధాన బుకీ కృష్ణసింగ్, షంషీర్, అనిల్కుమార్రెడ్డితోపాటు మరో ఇద్దరిని విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని శనివారం అధీనంలోకి తీసుకుని పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు సన్నద్ధమయ్యారు. బుకీల నుంచి ఎవరెవరికీ మామూళ్లు అందాయనే దానిపైనే కీలకంగా విచారణ సాగుతోంది. పోలీసు శాఖతోపాటు రాజకీయ మామూళ్లు, బుకీలకు అండదండలు అందిస్తున్న ముఖ్యనేతలకు సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా పరారీలోనే.. ఇదిలా ఉంటే బెట్టింగ్ రాకెట్ విషయంలో మొదటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న పోలీసులు బుకీలుగా ఉన్న ఇద్దరు టీడీపీ నేతలను అరెస్ట్ చేయకపోవడంపై అనేక అనుమానాలకు తెరలేచింది. తెలుగుదేశంపార్టీ మాజీ కౌన్సిలర్ దువ్వూరు శరత్చంద్ర, అతని కుమారుడు కీలక బుకీలుగా ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులతో శరత్చంద్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత నెలలో మంత్రి నివాసంలో జరిగిన విందులో అన్నీ తానే అన్నట్టు కీలకంగా వ్యవహరించాడు. శరత్చంద్ర, అతని కుమారుడు ఇద్దరూ నగరంలో కొన్నేళ్లుగా కీలక బుకీలుగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. టీడీపీలో నామినెటేడ్ పదవి అనుభవిస్తున్న నేతకు ముఖ్య అనుచరుడైన బ్రహ్మనాయుడు కూడా కీలక బుకీగా వ్యవహరిస్తున్నాడు. బ్రహ్మనాయుడు రూ.లక్షల్లో బెట్టింగ్ నిర్వహించడంతోపాటు వందల మంది ద్వారా బెట్టింగ్ రాకెట్ను నడుపుతూ కీలక బుకీగా నగరంలో ఎదిగాడు. వీరంతా 25 రోజుల నుంచి పరారీలోనే ఉన్నారు. పోలీసు బృందాలు వీరి ఆచూకీ కోసం అన్వేషించినా దొరకని పరిస్థితి. పరారీకి అధికార పార్టీ నేతలే పూర్తిస్థాయిలో సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులపై కూడా అధికార పార్టీ నేతలు బలమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరిని తప్పించడం కోసం బెట్టింగ్ రాకెట్ వ్యవహారం మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైకి నెట్టేలా అధికార పార్టీ నేతలు మైండ్ గేమ్కు తెరలేపారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలను కీలకంగా చూస్తున్న ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే బుకీలందరూ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. కృష్ణసింగ్ మొదలుకొని బ్రహ్మనాయుడు వరకు అందరూ పెద్ద మొత్తాలను సదరు ఎమ్మెల్సీకి ముట్టజెప్పడం, వారిపై కేసులు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో బెట్టింగ్ రాకెట్ వేట కొనసాగుతున్న తరుణంలోనూ సదరు ఎమ్మెల్సీ మంత్రుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అరెస్ట్లు అనివార్యమని పోలీసులు పరోక్షంగా చెప్పడంతో వారిద్దరినీ పరారీలోనే కొనసాగేలా చూస్తున్నారు. -
పసుపు దొంగల్ని వదిలేసి వీఆర్వోలపై చర్యలా!
►మార్క్ఫెడ్ కుంభకోణం వ్యవహారంలో కలెక్టర్ తీరుపై కాకాణి ఆక్షేపణ ►ఉదయగిరి ఎమ్మెల్యే రూ.కోట్లు కొల్లగొట్టారని మేకపాటి ఆరోపణ ►బెట్టింగ్ వ్యవహారంలో టీడీపీ నేతల్ని వదిలేశారన్న ప్రతాప్కుమార్రెడ్డి కావలి : ఉదయగిరి నియోకవర్గంలో వెలుగుచూసిన పసుపు కుంభకోణంలో అసలు దొంగలను వదిలేసి.. 19 మంది వీఆర్వోలను బలి పశువుల్ని చేయడం శోచనీయమని వైఎస్సా ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. కావలిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తలొగ్గారని.. ఆయన బలహీనంగా వ్యవహరిస్తే జిల్లాలో పాలక వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు కుంభకోణంలో జిల్లా కలెక్టర్ పక్షపాత వైఖరి అవలంబిస్తూ కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన టీడీపీ నేతలను రక్షించేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. ఈ కుంభకోణంలో నిష్పక్షపాతంగా, లోతుగా దర్యాప్తు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మార్క్ఫెడ్కు నాసిరకం పసుపుతోపాటు మట్టిని సైతం అంటగట్టి నిధులు లూటీ చేసింది ఎవరో తేలిపోయిందన్నారు. ఈ కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికార పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచ్లను విస్మరించారన్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన కలెక్టర్ 19మంది వీఆర్వోలను సస్పెండ్ చేశారని.. అసలు దోషులైన టీడీపీ నాయకులు వదిలేయడం అన్యాయమని పేర్కొన్నారు. అక్రమార్కులు కొల్లగొట్టిన ప్రభుత్వ సొమ్మును ఆర్ ఆర్ యాక్ట్ ప్రకా రం రికవరీ చేసేందుకు కలెక్టర్ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయడం, టీడీపీ సర్పంచ్ల అవకతవకలను నివేదిక రూపంలో తెలియజేసిన కార్యదర్శులను సస్పెండ్ చేయడం కలెక్టర్కు తగదన్నారు. నీరు–చెట్టు పథకం నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంలో అధికారులపై చర్యలు తీసుకున్న కలెక్టర్ ఇందుకు కారణమైన టీడీపీ నేతలను గాలికొదిలేయడం శోచనీయమన్నారు. బెట్టింగ్ల పాపం టీడీపీదే జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలకు బీజం వేసింది టీడీపీ నేతలేనని కాకాణి విమర్శించారు. వారికి నచ్చిన పోలీసు అధికారులకు వివిధచోట్ల పోస్టింగ్లు వేయించుకుని.. అక్రమాలను పెంచి పోషించింది వారేనన్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసిన కొందరు పోలీసులు, వారికి పోస్టింగ్ ఇప్పించిన టీడీపీ నేతలకు అందులో వాటాలు ఇచ్చేవారని అన్నారు. వాస్తవం ఇది కాగా, టీడీపీ నేతలు సిగ్గు లేకుండా బెట్టింగ్ వ్యవహారాన్ని తమ పార్టీకి అంటగట్టే విధంగా మాట్లాడటం శోచనీయమన్నారు. -
టీడీపీలో బెట్టింగ్ బాబులు
►ముగ్గురు నేతల కోసం పోలీసుల అన్వేషణ ►వారిని తప్పించేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు ►రంగంలోకి అమాత్యుని సన్నిహితుడు నెల్లూరు : తెలుగుదేశం పార్టీలో బెట్టింగ్ బాబుల వ్యవహారం కలకలం రేపుతోంది. క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలతోపాటు ఓ మాజీ కార్పొరేటర్ కుమారుడి హస్తం ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు తెరచాటున క్రికెట్ బుకీలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరికీ కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలతోపాటు ఆర్థిక లావాదేవీలు కూడా ఉండటం హాట్టాపిక్గా మారింది. దీంతో మంత్రికి సన్నిహితుడైన ఓ కీలక నాయకుడు రంగంలోకి దిగి వారిద్దర్ని తప్పించేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ నేతల బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించారు. నగర తెలుగు యువత నేతతోపాటు ఆలయ మాజీ చైర్మన్ ఏడాదిగా బెట్టింగ్ కార్యకలాపాలను భారీ ఎత్తున నిర్వహించి నట్టు నిర్ధారించారు. వీరితో పాటు మాజీ కార్పొరేటర్ కుమారుడు సైతం ఈ కార్యకలాపాలు నిర్వహించినట్టు తేల్చారు. ఇతడు కొంతకాలంగా వీటికి దూరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. నగరానికి చెందిన ఒక కుటుంబం మాజీ కార్పొరేటర్ కుమారుడి వద్ద భారీగా బెట్టింగ్ కట్టి అప్పుల పాలయ్యారు. ఆ ఊబినుంచి బయటపడే మార్గం లేక నెల క్రితం ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం విది తమే.ఈ నేపథ్యంలో ముగ్గురి కోసం పోలీసులు అన్వేషణ మొదలైంది. ఇతర ప్రముఖులతోనూ సంబంధాలు పోలీసుల అదుపులో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ బుకీ కృష్ణసింగ్కు టీడీపీ నేతలతోపాటు మరికొందరు ప్రముఖులతోనూ సంబంధాలు, బెట్టింగ్ లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కృష్ణసింగ్ నేరుగా ముంబైలోని కీలక ఏజెంట్ ద్వారా నెల్లూరు జిల్లాతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ దృష్ట్యా జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో పలువురు అతడిని ఆర్థికంగా వినియోగించుకున్నారు. పోలీసులపై ఒత్తిళ్లు 15 రోజుల క్రితం ఒకచోట జూద శిబిరం నిర్వహించగా.. అక్కడ కృష్ణసింగ్ ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. వారు దాడికి వస్తున్నారన్న సమాచారం కృష్ణసింగ్కు పోలీసు వర్గాల ద్వారా ముందుగానే తెలియడంతో అప్రమత్తమైన అతడు రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు. అతడి జాడ కనుక్కునేందుకు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. వారం రోజులపాటు అతడి కోసం జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు వేరే రాష్ట్రంలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు. కృష్ణసింగ్ను అక్కడి నుంచి తీసుకురావడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఈలోగా టీడీపీ నేతల నుంచి సింగ్కు ఒత్తిళ్లు వచ్చాయి. తమ పేర్లు బయట పెట్టవద్దని ఆ నేతలు హడావుడి చేసిన విషయాన్ని పోలీస్ బాస్ నిర్ధారించారు. అధికార పార్టీ నేతలే కాకుండా మరికొందరు ప్రముఖులకూ కృష్ణసింగ్తో బెట్టింగ్ లావాదేవీలు ఉన్నాయి. ఇదిలావుండగా.. కృష్ణసింగ్ను అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ నేతల నుంచి పోలీసులపైనా ఒత్తిళ్లు పెరిగాయి. జిల్లాకు చెందిన ఒక మంత్రి సైతం చర్యలు లేకుండా చూడాలంటూ పోలీసులకు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆయన తన సన్నిహితుడికి అప్పగించినట్టు భోగట్టా. అయితే, పోలీసులు మాత్రం ఒత్తిళ్లను, సిఫార్సులను పట్టించుకోకుండా దర్యాప్తులో వేగం పెంచారు. -
ఆన్లైన్ బెట్టింగ్కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: భారత్లో క్రీడల ప్రోత్సాహానికి నిధుల కొరత ఉండటంతో ఆన్లైన్ బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు డ్రాఫ్ట్ను తయారు చేస్తోంది. వచ్చే రెండెళ్లలో ఆన్లైన్ బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలని ఆ శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే నిధులతో క్రీడలను ప్రోత్సహించాలనుకుంటుంది. ఇప్పటికే భారత్లో చట్ట వ్యతిరేకంగా ఏడాదికి రూ 9.6 లక్షల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. దీంతో దీనిని చట్ట బద్ధం చేస్తే పన్నుల రూపంలో క్రీడాశాఖకు నిధులు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హార్స్ రేసింగ్లపై బెట్టింగ్లు చట్టబద్ధంగా ఉండగా కేంద్రం వీటిపై 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇటీవల ఈ విషయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అధికారులతో సమావేశమై చర్చించారు. క్రీడాశాఖ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడం, ప్రపంచానికి గొప్ప క్రీడాకారులను పరిచయం చేయడం తమ అభిమతం అని క్రీడామంత్రిత్వ శాఖ పేర్కొంది. బెట్టింగ్ అనేది ఓ సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యా అని పేర్కొంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వివాదాలు చెలరేగే అవకాశం ఉండడతో ఆచుతూచి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపింది. గతంలో సుప్రీం కోర్టుకు క్రికెట్ బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలని చాల మంది అభిప్రాయపడినట్లు లోథా కమిటీ తమ నివేదికలో పేర్కొంది. ఇది ఇప్పటికే యూకేలో అమలవుతుందని సూచించింది. -
బెట్టింగ్ను చట్టబద్ధం చేయొచ్చా?
ప్రజాభిప్రాయం కోరిన న్యాయ కమిషన్ న్యూఢిల్లీ: బెట్టింగ్, జూదాలను చట్టబద్ధం చేయొచ్చో లేదో తెలపాలని న్యాయ కమిషన్ ప్రజలను కోరింది. వీటిని చట్టబద్ధం చేస్తే దేశంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో కూడా తెలపాలంది. బెట్టింగ్, జూదాలకు లైసెన్స్ ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందా? లాంటి విషయాలను ప్రజాభిప్రాయం ద్వారా తెలుసుకోవాలనుకుంటోంది. మన దేశంలో జూదం, బెట్టింగ్లను చట్టబద్ధం చేయడం ఎంత వరకు నైతికంగా సరైందని ప్రశ్నించింది. ‘ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనేవారు దివాలాతీయకుండా కాపాడేందుకు ఉన్న మార్గం ఏంటి? ఒకవేళ వీటిని చట్టబద్ధం చేస్తే విదేశీ కంపెనీలను భారత్లోకి అనుమతించాలా?’ అని కమిషన్ అడిగింది. బీసీసీఐ వర్సెస్ బిహార్ క్రికెట్ అసోసియేషన్ కేసును విచారిస్తూ, బెట్టింగ్ను చట్టబద్ధం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని 2016లో సుప్రీంకోర్టు, న్యాయ కమిషన్ను ఆదేశించింది. -
ఐపీఎల్ బెట్టింగ్లే కొంపముంచాయి!
► భార్యాబిడ్డలకు నిద్రమాత్రలు, విషపు ఇంజెక్షన్ ! ►హెడ్ కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్య కేసులో వెల్లడైన నిజం ►హత్య కేసుగా నమోదు యలహంక: ఐపీఎల్ బెట్టింగ్లు కుటుంబాన్ని మింగేశాయి. అతను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విచ్చలవిడిగా బెట్టింగ్ వేశాడు. ఆ కారణంతోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. బెట్టింగ్ ఒక సరదా. హద్దులు దాటి ఆడితే అదే సరదా ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి సంఘటననే నగరంలో సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సీఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుభాష్చంద్ర ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చికిత్స అందిస్తున్న బాప్టిస్ట్ ఆసుపత్తి వైద్యురాలు ఇందిరా మీనన్ తెలిపారు. ఈ ఘోరానికి మూలం ఐపీఎల్ బెట్టింగ్లేనని తెలుస్తోంది. అతని కుటుంబం ‘ఆత్మహత్యాయత్నం’ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మరణించడం తెలిసిందే. మంగళవారం వెలుగు చూసిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నించిన సుభాష్ మొదట భార్య వీణ, పిల్లలు, మణి, పథ్విలకు నిద్రమాత్రలు వేశారు. వారు నిద్రలోకి జారుకోగానే విషపు ఇంజెక్షన్లను ఇచ్చాడని వైద్యపరీక్షలో తేలినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత సుభాష్ కూడా నిద్రమాత్రలు మింగి తాను కూడా విషాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాడు. విషం ధాటికి భార్య పిల్లు మరణించగా, ఇతడు కొనప్రాణంతో ఉండగా బంధువులు గమనించి ఆస్పత్రికి తరలించారు. విచారణలో వెలుగు చూసిన అంశాలతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. విచ్చలవిడిగా ఐపీఎల్ పందేలు తాజాగా ముగిసిన ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో బెట్టింగ్లే హెడ్కానిస్టేబుల్ సుభాష్ కుటుంబంలో ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మ్యాచ్లు మొదలైన రోజు నుంచి బెట్టింగ్లకు పాల్పడుతున్న సుభాష్ చాలా మ్యాచ్ల్లో ఓడిపోవడంతో బాగా నష్టపోయాడు. అతని ఒత్తిడితో భార్య వీణ అప్పుడప్పుడూ ఇంటి నుంచి డబ్బులు తెచ్చేదని వారి బంధువులు చెబుతున్నారు. ఆదివారం పుణే,ముంబయి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో సుభాష్ రూ.15 లక్షలకు పుణె గెలుస్తుందని పందెం కాశాడని తెలిసింది. అయితే పుణె ఓడిపోవడంతో బెట్టింగ్రాయుళ్లు డబ్బుల కోసం ఇతనిపై ఒత్తిడి తెచ్చారు. సుభాష్ బళ్లారిలో ఉన్న స్నేహితులు, బంధువులను అప్పులు అడగగా అంతమొత్తంలో ఇవ్వలేమంటూ సమాధానాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో భార్యా, పిల్లలకు విషమివ్వాలనే భయంకరమైన ఆలోచన తట్టి ఉంటుందని చెబుతున్నారు. ఇతడు తక్కువ మోతాదులో నిద్రమాత్రలు, విషాన్ని ఇంజెక్ట్ చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
ఫైనల్.. కాస్కో !
► నేడే ఐపీఎల్ ఫైనల్ ► భారీగా బెట్టింగ్లు ► రెండు జిల్లాల్లో రూ.100 కోట్లు చేతులుమారే అవకాశం ► అధికార పార్టీ పెద్దలే సూత్రధారులు ► విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లిలో భారీగా ఏర్పాట్లు చేసిన బుకీలు ► పట్టించుకోని పోలీసుయంత్రాంగం సాక్షి, గుంటూరు: నలభై ఐదు రోజులుగా క్రికెట్ బుకీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్–10 చివరి దశకు చేరింది. ముంబయి ఇండియన్స్–పుణే సూపర్ జెయింట్స్ మధ్య ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా రాజధాని జిల్లాల్లో భారీగా బెట్టింగ్లు నిర్వహించేందుకు బుకీలు రంగం సిద్ధం చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో రెండు జిల్లాల్లో కలిపి నాలుగు గంటల్లోనే రూ.100 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని అంచనా. బుకీలు అపార్టుమెంట్లను కేంద్రంగా చేసుకుని యువత, వ్యాపారులే లక్ష్యంగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఆన్లైన్ ద్వారా నడిపిస్తున్నారు. కొందరు బంతిబంతికీ బెట్టింగ్ నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. బుకీలు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసు నిఘా నామమాత్రమే..! ఏప్రిల్ ఐదో తేదీన ఐపీఎల్–10 ప్రారంభమైంది. అప్పటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో మధ్య తరగతి ప్రజలు, కూలీలు సైతం పందేలు కాస్తున్నారు. పోలీసులు పెద్ద బుకీలను వదిలి కేవలం కొద్ది మొత్తంలో పందేలు కాస్తున్నవారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్, గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పరిధిలో 50 వరకు బెట్టింగ్ కేసులు నమోదు చేశారు. అయితే ఎక్కడా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోలేదు. బెట్టింగ్ బోర్డు నిర్వాహకులను అరెస్ట్ చేయలేదు. కొందరు పోలీసులే బుకీల నుంచి మామూళ్లు వసూలు చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బెట్టింగ్ల జోలికి వెళ్లడంలేదని తెలిసింది. మరోవైపు గుంటూరులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, క్విక్ రియాక్షన్ బృందాలు దాడులు నిర్వహించి పట్టాభిపురం, అరండల్పేట, గుంటూరు రూరల్ తదితర స్టేషన్ల పరిధిలో బెట్టింగ్లకు పాల్పడుతున్న ఎనిమిది బృందాలను అరెస్ట్ చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. విజయవాడలో వింత పరిస్థితి... విజయవాడలో ఒకటి, రెండు స్టేషన్లు మినహా టాస్క్ఫోర్స్ పోలీసులు మాత్రమే బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు పెద్ద ఎత్తున డబ్బులు అందడమే ఇందుకు కారణమని సమాచారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కీలకమైన బెట్టింగ్లను వదిలి పోలీసులు ఇప్పుడు నిషేధిత గుట్కా విక్రేతలపై దాడుల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండతోనే... కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అండతోనే బుకీలు యథేచ్ఛగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. కొందరు నేతలు ఏకంగా బుకీలతో సంబంధాలు పెట్టుకుని బెట్టింగ్ల నిర్వహణకు సహకరిస్తున్నారు. విజయవాడ బావాజీపేటలోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయం కేంద్రంగా టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా... పోలీసులు అటువైపు వెళ్లే సాహసం చేయడం లేదు. సత్తెనపల్లి, గుంటూరులో కూడా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల ముఖ్య అనుచరులే బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లిలో బెట్టింగ్ బోర్డు... సత్తెనపల్లి, గుంటూరుల్లో ప్రధాన బెట్టింగ్ బోర్డు నిర్వాహకులు ఉన్నారు. వీరి నుంచి ప్రాంతాల వారీగా అనేక మంది స్థానికంగా బెట్టింగ్లు నిర్వహిస్తుంటారు. బెట్ ఫేర్తోపాటు పలు వెబ్సైట్లలో బంతిబంతికీ బెట్టింగ్ కాస్తుంటారు. ఫైనల్ మ్యాచ్లో ప్రధానంగా ముంబయి హాట్ ఫేవరేట్ కావడంతో ఈ బెట్టింగ్ బోర్డు ఆ జట్టుపై రూ.లక్షకు రూ.70 వేలు ఇస్తే చాలు.. పుణే గెలిస్తే రూ.లక్షకు రూ.1.35 లక్షలు ఇస్తామని ఊరిస్తున్నట్లు సమాచారం. -
ట్రంప్ ఉంటాడా?.. ఊడతాడా?
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాభిశంసన తీర్మానం ద్వారా వైదొలుగుతారా? లేదా?. ఈ ప్రశ్నపై ఆన్లైన్లో అత్యధికంగా బెట్టింగ్లు జరగుతున్నాయి. ఆన్లైన్ పొలిటికల్ స్టాక్ మార్కెట్ ప్రెడిక్ట్ఇట్లో గత రెండు రోజులుగా ఈ ప్రశ్నపై ఎక్కువ మంది బెట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు లక్షకు పైచిలుకు మంది ప్రెడిక్ట్ఇట్లో ట్రంప్ ప్రశ్నపై బెట్ చేశారు. గత వారంలో ట్రంప్ అభిశంసనకు గురవుతారని ప్రెడిక్ట్ఇట్లో 7గా ఉన్న ఓట్ల శాతం.. బుధవారం ఒక్కరోజే 33 శాతానికి వెళ్లింది. సాయంత్రానికి మళ్లీ తగ్గి 24 శాతానికి చేరింది. ప్రెడిక్ట్ఇట్ను వాషింగ్టన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అరిస్టోటిల్, విక్టోరియా యూనివర్సిటీ-వెల్లింగ్టన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో రిజిస్టర్ అయినవారందరూ అమెరికన్లే. ఎక్కువ మంది బెట్టర్లు ట్రంప్ పూర్తి కాలం పదవిలో కొనసాగరని 5 వేల డాలర్లు బెట్ చేసినట్లు బుక్మేకర్ పాడీ పవర్ బెట్ఫెయిర్ చెప్పింది. -
క్రికెట్ బుకీల అరెస్ట్
- అదుపులో ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లు - రూ. 1.13 లక్షలు, ఏడు సెల్ఫోన్లు, చీటీలు స్వాధీనం ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలతో పాటు, బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.13 లక్షలు, ఏడు సెల్ఫోన్లు, చీటీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బార్పేటకు చెందిన రియాజ్బాషా, కునిముల్లాకు చెందిన గరీఫ్ బాషా ఇంటి వద్దనే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడటంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అలాగే పట్టణంలో బెట్టింగ్ ఆడుతున్న వాల్మీకి నగర్కు చెందిన సోను, గోకర్జెండా నవశాద్, కౌడల్పేట నసీర్బాషా, జావిద్, హవన్నపేట మహ్మద్బాషాను త్రీటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ విజయ్కుమార్, ఎస్ఐలు సునిల్ కుమార్, సిబ్బందితో కలిసి వారిపై దాడి చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇంకా కొంతమంది బుకీల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం వారంతా కర్ణాటకకు చెందిన రాయచూరు, బెంగళూరు, శిరుగుప్ప, బళ్లారిలో మకాం పెట్టి ఆదోని పట్టణంంలో సెల్ఫోన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కర్నూలు: కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని ఎస్వీఆర్ లాడ్జి సమీపంలో బహిరంగ ప్రదేశంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న తుపాకుల ఆంజనేయులు, షేక్ ఇర్ఫాన్ను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులోని చింతలముని నగర్కు చెందిన ఆంజనేయులు, పాతబస్తీలోని పెద్దమార్కెట్ ప్రాంతానికి చెందిన షేక్ ఇర్ఫాన్ ముఠాగా ఏర్పడి నెట్ ద్వారా భజరంగ్ అనే యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సన్రైజర్స్ హైదరబాదు ‘ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ జరుపుతుండగా పక్కా సమాచారం మేరకు సీఐ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు చంద్రశేఖర్రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డి, సిబ్బంది మద్దీశ్వర్, సుంకన్న, వరకుమార్, కృష్ణ, అమర్నాథ్రెడ్డి తదితరులు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి బెట్టింగ్ ముఠాను అరెస్టు చేయడమే కాకుండా డబ్బు రికవరీ చేసినందుకు సిబ్బందిని డీఎస్పీ రమణమూర్తి అభినందించారు. -
ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ఇద్దరు బుకీలను పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. పట్టణంలోని అమరావతి నగర్కు చెందిన మంగలి రాజు, కల్లుబావి బీసీ నగర్కు చెందిన శ్రీరాములు సోమవారం ఉదయం 9 గంటలకు ఓవర్ బ్రిడ్జి కింద రవిబార్ సమీపంలో ఐపీఎల్ 20–20 క్రికెట్ మ్యాచ్కు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం రావడంతో వన్టౌన్ సీఐ రామానాయుడు, ఎస్ఐ బాబు సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25 వేలు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 9 బెట్టింగ్ కేసుల్లో రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
కొత్తదారుల్లో కిక్రెట్ బెట్టింగ్!
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రూ.1.60 లక్షలు స్వాధీనం రాజమహేంద్రవరం క్రైం : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం తాడితోట, ఏసీవై కాలనీలోని పళ్ల సత్తిరాజు ఇంట్లో శనివారం జరుగుతున్న 20–20 క్రికెట్ మ్యాచ్ పూనే వర్సెస్ ముంబయి ఇండియ¯Œ్స క్రికెట్ మ్యాచ్కు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ప్రభునాయుడు, కామేశ్వరరావు, పళ్ల సత్తిరాజులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ 1.60 లక్షలు నగదు, 9 సెల్ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్, టీవీ, బ్యాటరీలు, స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రభునాయుడు, కామేశ్వరరావులు 2014 నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన కేసు వన్టౌన్ పరిధిలో ఉందని తెలిపారు. ప్రధాన నిందితుడు వైజాగ్కు చెందిన మున్నిని అరెస్ట్ చేయ్యాల్సి ఉందని తెలిపారు. వీరిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఏజీఎస్ ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు తాతారావు, మణికంఠలను ఎస్పీ అభినందించారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ, వన్టౌన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. -
ఎమ్మిగనూరుకు ‘బెట్టింగ్ ఫివర్’.!
– రూ. లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ – ఎందరో బాధితులు అప్పుల పాలై దివాలా – 17 మంది బెట్టింగ్రాయుళ్ల అరెస్టు - రూ. రూ.1.22 లక్షలు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం ఎమ్మిగనూరు: క్రికెట్ బెట్టింగ్కు వ్యసనానికి బానిసైన వందలాది మంది భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకొంటున్నారు. ఐపీఎల్ పుణ్యమాని క్రికెట్ క్రేజ్ పెరిగిపోయింది. పిల్లల నుంచి ముదసలి వాళ్ల వరకూ ప్రతిరోజు రూ. లక్షల్లో బెట్టింగ్ ఆడుతూ క్రికెట్ క్రీడను జూదక్రీడగా మార్చేశారు. పట్టణాలే కాదు పల్లెలకూ బెట్టింగ్ విస్తరించింది. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో నలుగురు బుకీలు బెట్టింగ్ నిర్వాహణలో కీలకసూత్రధారులుగా ఉన్నట్లు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.200 మందికి పైగా బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం. మ్యాచ్ గెలిస్తే ఓ రేటు..బౌలర్తీ సే వికెట్లను బట్టీరేటు పెరుగుతోంది. బాట్స్మెన్ చేసే స్కోర్పై..కొట్టే ఫోర్, సిక్స్లపై బెట్టింగ్ రేట్లను బుకీలు పెంచేస్తారు. క్రికెట్ బెట్టింగ్ మూలంగా అటు నిద్రహారాలను మానుకొనేవారు..ఆస్తులను అమ్మేవారు..అప్పులు కోసేవారు ఎమ్మిగనూరులో అధికమైంది.ఇక్కడ రూ.3 రూపాయలు సాధారణ వడ్డీగా రూ.15 వరకూ వడ్డీ నడుస్తోంది.కొందరైదే ఏకంగా రోజువారీ వడ్డీ వసూలు చేస్తున్నారు.లక్షకు ప్రతిరోజూ రూ.300నుంచి రూ.600వరకూ వడ్డీ చెల్లించాలి. ఇలా అధిక వడ్డీ వ్యాపారులే 37 మంది వరకు ఉన్నారు. ప్రతి రోజూ బెట్టింగ్ నడుపుతూ ఆడేవాళ్లలో విద్యార్థులు , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, సిమెంట్ షాపు ఓనర్లు, బ్యాంక్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎంటర్ ప్రైజెస్ వ్యాపారం, ఫైనాన్సు వ్యాపారులు, మద్యం వ్యాపారులు, వారి కుటుంబసభ్యులే అధికంగా ఉండటం విశేషం. ప్రతి రోజు జరిగే రెండు మ్యాచ్లకు రూ.30 లక్షల వరకు ఇక్కడ బెట్టింగ్ జరుగుతున్నట్లు క్రీడాభిమానులు పేర్కొంటున్నా అది ఇంకా ఎక్కువగానే ఉంటుందనీ తెలుస్తోంది. ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్ నిరంతర ప్రక్రియగా మారింది.మంచి పోలీసు అధికారులు వచ్చినప్పుడు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేస్తే..ఆమ్యామ్యాలతో పవర్లోకి వచ్చినవారు మ్యాచ్కో రేటు చొప్పున దండుకొంటుని దందాలు నిర్వహించారు. ఏదీ ఎమైనా ఎమ్మిగనూరును బెట్టింగ్ ఫివర్ వణికిస్తోంది.బెట్టింగ్రాయుళ్ల ఆటకట్టించాల్సిన పోలీసు యంత్రాంగం మరింత చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటోంది. బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు.ఎమ్మిగనూరు సీఐ ప్రసాద్తో కలసి ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ భారీ ఎత్తున జరుగుతుందని తెలియటంతో సీఐ జీ.ప్రసాద్ ఆదేశాల మేరకు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్, నందవరం ఎస్ఐ జగన్మోహన్, క్రైంపార్టీ పోలీసులు, సిబ్బంది నిఘా పెంచారు. పకడ్బందీగా పథకం వేసి సోమప్ప నగర్కు చెందిన మీసే రమేష్, ఎంఆర్ ప్రసాద్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి సెల్ ఫోన్స్లో కాల్ డేటా ఆధారంగా మిగతా 15 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ బెట్టింగ్కు మూల సూత్రధారి సోమప్ప నగర్కు చెందిన బోయ రామకృష్ణ కర్నూలులో నివాసముంటు అక్కడ నుంచే ఏజెంట్లు, బుకీలను పెట్టుకొని బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. మేడమ్ నాగేంద్ర, నజీర్ అహమ్మద్ బుకీలుగా, కళ్యాణ్చక్రవర్తి అనే వ్యక్తి కలెక్షన్ ఏజెంట్లుగా ఉంటూ బెట్టింగ్ రాయుళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ వ్యవహరమంతా ఫోన్లలోనే నడిచేది. ఈ బారీ బెట్టింగ్పై పోలీసులు పక్కా సమాచారంతో రెండు వేర్వురు చోట్ల దాలు చేసి పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి బోయ రామకృష్ణ, బుకీలు నజీర్అహమ్మద్, మేడమ్ నాగేంద్రలతో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.22 లక్షల నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ను వెలుగులోకి తెచ్చేందుకు చాకక్యంగా వ్యవహరించిన రూరల్, నందవరం ఎస్ఐలు వేణుగోపాల్, జగన్మోహన్యాదవ్లకు రివార్డులు ఇచ్చేందుకు ఎస్పీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుచనున్నట్లు పేర్కొన్నారు.అయితే బెట్టింగ్లో అరెస్టు అయిన వారిలో ఎక్కువమంది విద్యార్థులే కావటం కొసమెరుపు. వీరంతా బెట్టింగ్ బాధితులు – ఎమ్మిగనూరుకు చెందిన చిరువ్యాపారి ప్రసాద్ బెట్టింగ్కు వ్యసనపరుడు.గత ఐపీఎల్ మ్యాచ్ల్లో అప్పులు చేసి భారీగా బెట్టింగ్లు ఆడాడు.లక్షల్లో అప్పులు మూటగట్టుకొన్నాడు.అప్పులు చెల్లించే స్తోమతలేక 33 ఏళ్లకే ఆత్మహత్య చేసుకొన్నాడు. – పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కుమారుడు శ్రీరామచిట్స్లో పనిచేసేవాడు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో రూ.40 లక్షల వరకు పోగొట్టుకొన్నాడు. అప్పులు తీర్చే శక్తిలేక బెంగళూరుకు పారిపోయాడు. –‘ఓ టీచర్ నెల జీతం 45వేలు.కానీ అతను నెలనెల కట్టే వడ్డీల మొత్తం రూ.60వేల దాకా ఉంటుంది.అంటే రూ.20 లక్షలకు పైగా క్రికెట్ బెట్టింగ్లతో అప్పు చేశాడు.మ్యాచ్లు జరిగేకొద్దీ ఇంకా బెట్టింగ్ ఆడుతూనే ఉన్నాడు..ఏదోరోజు జాక్పాట్ కొడతాననీ..బెట్టింగ్తోపాటు పేకాట, మందు, ధూమపానం వంటి అలవాట్లు అతడికీ బోనస్గా వచ్చాయి. - ఎమ్మిగనూరు మండలం కలుగొట్లకు చెందిన 8వ తరగతి విద్యార్థి బెట్టింగ్ ఆడి రూ.5వేలు దాకా అప్పు చేశాడు.విషయం బయటపడతుందనీ గత ఏడాది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. విషయాన్ని గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. -
జోరుగా క్రికెట్ బెట్టింగ్
- పోలీసుల అదుపులో నిందితులు ఉయ్యాలవాడ: మండల కేంద్రమైన ఉయ్యాలవాడతో పాటు వివిధ గ్రామాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్–10 జరుగుతుండడంతో గెలుపోటములపై జోరుగా పందాలు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉయ్యాలవాడ కేంద్రంగా చేసుకుని గత 15 రోజులుగా బెట్టింగ్ తంతు సాగుతోంది. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 10 మంది యువకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా బెట్టింగ్ జాబితాలో కొందరి వారి పేర్లు తొలగించాలని పోలీసులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే నిందితులు ఎంతటివారైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. -
క్రికెట్ బెట్టింగ్పై ఉక్కుపాదం మోపండి
– క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం కర్నూలు: క్రికెట్ బెట్టింగ్రాయుళ్లపై నిఘా తీవ్రతరం చేసి ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాదర్బార్కు వచ్చే ఫిర్యాదులపై స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్యాయం జరిగే చోట పోలీసులు బాధితులకు అండగా ఉండి, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విధి నిర్వహణలో కర్నూలు పోలీసులు రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసులుగా ఉండాలన్నారు. వీవీఐపీలు వచ్చే ప్రాంతాలకు పూర్తిగా రక్షణ కల్పించాలని ఆదేశించారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో సైబర్ నేరాలపై పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మహిళల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశమున్నందున నిఘాను తీవ్రతరం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధ్యతాయుతంగా పనిచేసి పోలీసు అధికారులు యూనిఫాం గౌరవం కాపాడాలన్నారు. కేబుల్ సమస్యలపై స్పందించాలన్నారు. ఆదోనిలో సీసీ కెమెరాల పనితీరు భేష్: ఆదోనిలో సీసీ కెమెరాల పనితీరు చాలా బాగుందని, కర్నూలు, నంద్యాలలో కూడా ఆదోని తరహాలో మెరుగుపరిచేందుకు మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళల్లో అనుమానితులపై నిఘా ఉంచి బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలి, ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు బాబుప్రసాద్, డి.వి.రమణమూర్తి, కొల్లి శ్రీనివాసులు, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్కుమార్, రాజశేఖర్రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, ఈశ్వర్రెడ్డి, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
చిత్తూరు, సాక్షి: ఐదు రోజల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో రెండు నెలలు 70 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో బెట్టింగ్ జోరందుకుంది. ఆట వారిది, జూదం మాది అంటూ కొందరు బ్రోకర్లు క్రికెట్ టోర్నీ ద్వారా కాసుల పంటకు సిద్ధమయ్యారు. లాడ్జీలు, హోటల్స్, అపార్ట్మెంట్లు, టీ కేఫ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్థావరాలుగా చేసుకుని కొందరు చెన్నై, బెంగళూరు కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు. గంటల వ్యవధిలో భారీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పేదలు, యువకులు ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు. పలు ప్రాంతాల్లో సబ్బుకీలను ఏర్పాటు చేసుకొని రాజకీయ నేతలు, కొందరు పోలీసుల అండదండలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల ప్రధాన దృష్టంతా యువతపైనే ఉంది. కాలేజీ విద్యార్థులు, చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారిని సబ్బుకీలు డబ్బుల ఆశ చూపి బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నారు. బాల్ బాల్కూ రేటు..: తొలి బాల్ నుంచి చివరి బాల్ వరకు బెట్టింగ్ కాస్తున్నారు. ఫోర్, సిక్స్, హాఫ్ సెంచరీ అంటూ బ్యాట్స్మన్పై, వికెట్, పరుగు ఇస్తాడు అంటూ బౌలర్పై బెట్టింగ్ కడుతున్నారు. మ్యాచ్ ముగిసే లోపు ఫలానా బ్యాట్స్మన్ ఇన్ని ఫోర్లు, సిక్స్లు కొడతారని, ఒక్కో ఫోర్కు రూ.2 వేలు, సిక్స్కు రూ.10 వేల వరకు బెట్టింగ్ కాస్తున్నారు. చిత్తూరు నగరానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం జరిగిన కోల్కతా వర్సెస్ గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గంభీర్పై బెట్టింగ్ కాసి దాదాపు రూ.30 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం. పల్లెల్లోనూ..: బెట్టింగ్ జాడ్యం నగరాలు, పట్టణాలు దాటి పల్లెలను కూడా తాకింది. స్మార్ట్ఫోన్ పుణ్య మా స్కోర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పందేలు కాస్తున్నారు. కొన్ని బృందాలు చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాని, జన సంచారం ఎక్కువగా ఉండేచోట ఇళ్లను అద్దెకు తీసుకొని బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. భారీ మొత్తంలో బెట్టింగ్లు జరుగుతున్నా పోలీసులు పట్టిం చుకోకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని కొంతమంది అంటున్నారు. బెట్టింగ్.. సాగుతుందిలా..: జట్టు ప్రాముఖ్యత, మ్యాచ్ స్వరూపం, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లను బట్టి రూ.1000 నుంచి లక్షలు, కోట్ల వరకు పందేలు కాస్తున్నారు. బుకీకి, ఫంటర్కు మధ్య పరిచయం లేకుండానే ఆన్లైన్ ఖాతాల ద్వారా లావాదేవీలు సాగుతున్నాయి. బుకీలు ఎవరికంటే వారికి అవకాశం ఇవ్వ రు. వారి పరిధిలో ఏజెంట్లు, నమ్మకమున్న సభ్యుడు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. బెట్టింగ్కు అర్హత పొందిన వారిని ఫంటర్ అంటారు. బుకీ అకౌంట్లో ఫంటర్ స్థాయిని బట్టి కొంత సొమ్ముæ జమ చేసిన తర్వాత బెట్టింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 40 నుంచి 30 నిమిషాల ముందు ఎంతమంది ఫంటర్లు బెట్టింగ్లో పాల్గొం టారో బుకీలు ఫోన్ చేసి చెబుతారు. గెలుపొందిన తర్వాత బ్యాంక్ టైమ్ నాటికి లేదా ఆన్లైన్ ద్వారా ఫంటర్ ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ఫంటర్ ఓడిపోతే బుకీ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. -
బతుకులన్నీ బౌల్డ్
⇒నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ పోటీలు ⇒జిల్లాలో బెట్టింగ్లకు సిద్ధమవుతున్న యువత ⇒ఆకర్షించేందుకు సిద్ధమైన బుకీలు ⇒చితికిపోతున్న జీవితాలు మదనపల్లెకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. తన సంపాదన సరిపోక అప్పులు చేసి చేతులెత్తేశాడు. బుకీలు ఇంటికి రావడంతో చేసేది ఏమీలేక ఉన్న ఆస్తులు అమ్ముకుని అప్పులు కట్టాడు. తిరుపతికి చెందిన మరో యువకుడు కాలేజీ చదువుల సమయంలోనే బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. అనంతరం బుకీ అవతారం ఎత్తాడు. ఈ సంపాదనతో వ్యసనాలకు బానిసయ్యాడు. రెండుమూడుసార్లు పోలీసులకు పట్టుబడినా తిరిగి అదేపనిలో కొనసాగుతున్నట్టు సమాచారం. ఇలా..ఎందరో బెట్టింగ్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారు. తిరుపతి క్రైం : గతంలో క్రీడాస్ఫూర్తిని నింపిన క్రికెట్ ఆట రాన్రాను జూద క్రీడగా మారిపోయింది. టి–20 మ్యాచ్లు బుక్కీలకు వరంగా, బెట్టింగ్ రాయుళ్లకు వ్యసనంగా మారింది. గురువారం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి పోలీసులు బెట్టింగ్ రాయుడుళ్ల స్థావరాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. దాదాపు రెండు నెలలు సాగే ఐటీఎల్లో పలు జట్లపై ఇప్పటికే ఎవరికి తోచిన అంచనాలతో గెలుపోటములపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది బెట్టింగ్ రాయుళ్లకు మంచి కిక్నిస్తోంది. క్రికెట్ను జూదక్రీడగా మార్చేసిన బుకీలు జిల్లాలో పలు పట్టణాలు, పల్లెల్లో యువకులను టార్గెట్ చేస్తున్నారు. టోర్నీ ముగిసే సరికి ఎంతమంది బతుకులు చిన్నాభిన్నమవుతుందో? ఎంత సొమ్ము చేతులు మా రుతుందోనని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యవహారాలన్నీ సెల్ఫోన్లలోనే బెట్టింగ్ తంతు మొత్తం ఎక్కువ సెల్ఫోన్ ద్వారానే సాగుతుంది. టాస్ పడిన దగ్గర నుంచి బంతి బంతికీ రకరకాల పందాలు కొనసాగుతుంటాయి. ప్రధాన నగరాల్లో ఉండే పెద్ద బుకీలు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వీరి ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎస్...నో.. ఓకే.. డన్ .. ఈటింగ్ వంటి వివిధ రకాల కోడ్లతో బెట్టింగ్ పర్వం కొనసాగుతుంది. పరిజ్ఞానం లేకుండా పందేలు క్రికెట్ ఆటపై పెద్దగా పరిజ్ఞానం లేకున్నా ఆడుతుం ది.. ఓడుతుంది– అన్న సూ త్రాలతో చాలా మంది డబ్బులు పెడుతుంటారు. సాంకేతికంగా కొంత అవగాహన ఉన్న కొందరు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు దండుకుంటున్నారు. 90 శాతం మంది టీవీ చూస్తూనే పందేలు కాస్తారు. కానీ గ్రౌండ్లో జరిగే ఆటకు, టీవీలో వచ్చే ఆటకు మూడు బంతులు తేడా ఉంటుంది. బంతి.. బంతికీ ఆట ఎలా ఉంటుందో ముందే తెలుసుకుని కాసేవారిని మోసగిస్తుంటారు. బుగ్గిపాలవుతున్న బతుకులు ఎక్కువగా విద్యార్థులు ఈ బెట్టింగ్ మాయాజా లంలో చిక్కుకుంటున్నారు. మొదట సరదాగా మొదలై, బెట్టింగ్ అలవాటు క్రమేణా ఓ వ్యసనంగా మారుతుంది. అదృష్టం బాగుంటే వేలు, లక్షలు సంపాదించవచ్చనే ఆశతో ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. అనంతరం ఆస్తులు హ రించుకుపోయి అప్పులపాలవుతున్నారు. పల్లెల్లోనూ కాయ్ రాజా కాయ్ క్రికెట్ బెట్టింగ్లు పట్ట ణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్నాయి. సన్నకారు రైతుల దగ్గర నుంచి కూలీ పనులు చేసుకునేవారు, ఆటో వాలాలు, తోపుడుబండ్ల నిర్వాహకులు, పండ్ల వ్యాపారులు.. ఇలా చాలా మంది క్రికెట్ పందాలు కాస్తూ నష్టపోతున్నారు. ఐపీఎల్ టోర్నీ ముగిసే వరకూ పోలీసు దీనిని సీరియస్గా తీసుకుంటే దీనికి కొంతవరౖకైనా అడ్డుకట్ట వేయొచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు. పందెం ఇలా.. సాధారణంగా క్రికెట్ పందాలు సమాన నగదుతో సాగేది. కానీ టీ–20 రాకతో పందాల స్వరూపమే మారిపోయింది. ఆడే జట్లు ఆధారంగా రూపాయికి 80పైసలు, రూపాయికి 2 రూపాయలు ఇలాంటి ఆఫర్లు ఎన్నో! అటు ఎవరు గెలుస్తారో? అనే పందెం మాత్రమే కాకుండా జట్టు ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తాడు? ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి?.. ఇలా రకరకాల పందేలు నిర్వహిస్తారు. -
కాయ్ రాజా కాయ్.!
మైదుకూరు(చాపాడు): పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఈ నెల 17న జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ సారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ అహంకారం.. అధికార దుర్వినియోగానికి.. వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసం..అభిమానికి మధ్య జరిగినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల బరిలో దిగగా.. ప్రజా నమ్మకం, ఆత్మ విశ్వాససంతో వైఎస్సార్సీపీ బరిలో దిగింది. ఈ రెండింటికి నడుమ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కడపలో సోమవారం ఉదయం 8గంటలకు మొదలవగా, మధ్యాహ్నం 12గంటలకు గెలుపుపై క్లారిటీ రానుంది.. గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు.. ప్రతి మండలంలో లక్షల్లో పందేలు.. ఈ నెల 17న జిల్లాలోని మూడు డివిజన్లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక గెలుపోటములపై 16వ తేదీ నుంచే జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. టీడీపీ నిర్వహించిన పాండిచ్ఛేరి శిబిరంలో ఉన్న ఓటర్ల సంఖ్యా బలం చూసుకుని గెలుస్తామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు పందేలకు సిద్ధమవగా.. సంఖ్యా బలంతో పాటు ప్రజా నమ్మకం, ఆత్మ విశ్వాసం, క్రాస్ ఓటింగ్ నమ్మకంతో వైఎస్సార్సీపీ వర్గీయులు.. ఇలా ఎవరికి వారే గట్టి ధీమాతో బెట్టింగులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రతి మండలంలో రూ.50 లక్షల నుంచి రూ.70లక్షల వరకూ పందేలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండలంలోని ప్రతి గ్రామంలో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ బెట్టింగ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నియోజకవర్గ వ్యాప్తంగా రూ.2.50 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకూ పందేలు జరిగినట్లు సమాచారం. క్రాస్ ఓటింగ్పైనే అందరి దృష్టి.. ప్రతి మండలంలో జరిగిందంటున్న విశ్లేషకులు.. ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ధీమాతో వైఎస్సార్సీపీ వర్గీయులు గెలుస్తామనే విశ్వాసంతో ఉండగా, ఓటింగ్ వరకూ సంఖ్య బలంతో ధీమాగా ఉన్నా రెండు రోజులుగా క్రాస్ ఓటింగ్ ఫీవర్తో తెలుగు తమ్ముళ్లు బేజారవుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నిక జరిగిన తీరు, నియోజకవర్గంలో ఉన్న పార్టీ మెజార్టీ సభ్యుల ఆధారంగా, వైఎస్సార్సీపీని గెలిపించాలనే పట్టుదలతో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చని సీనియర్ రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ 25–35ఓట్ల తేడాతో గెలుస్తుందని నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ సీనియర్ నేత తమ కార్యకర్తలకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మైదుకూరు మున్సిపాలిటీలో 8, మండలంలో 2, దువ్వూరులో 3, చాపాడులో 2, ఖాజీపేటలో 11, బ్రహ్మంగారిమఠంలో 4 చొప్పున టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి క్రాస్ ఓట్లు పడ్డాయని, ఇదే క్రమంలో మైదుకూరులో 2, దువ్వూరులో 2, బ్రహ్మంగారిమఠంలో 1, ఖాజీపేట, చాపాడు మండలాల్లో 2 ఓట్ల చొప్పున టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారనే అంచనాల్లో ఇరు పార్టీల నాయకులు ఉన్నారు. ఏది ఏమైనా గెలుపు ధీమాతో రెండు వర్గాలు భారీ మొత్తంలో పందెం కాయడం గమనార్హం. -
‘బెట్టింగ్’ హీట్
– రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ – గెలుపోటములపై ‘అనంత’తో పాటు కడప, కర్నూలులో జోరుగా బెట్టింగ్ – పట్టభద్రుల కోటాలో గోపాల్రెడ్డి, గేయానంద్, ఉపాధ్యాయ కోటాలో కత్తి, ఒంటేరుపై పందేలు – కడప, కర్నూలు, నెల్లూరు ‘స్థానిక ఎమ్మెల్సీ’ ఫలితాలపైనా జోరుగా బెట్టింగ్ (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ఎమ్మెల్సీ ఎన్నికలలో చివరి అంకానికి రంగం సిద్ధమైంది. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ రేపు (సోమవారం) జరగనుంది. స్ట్రాంగ్రూంలో భద్రంగా ఉన్న ఓటరు తీర్పు రేపు లేదా ఎల్లుండి వెలువడే అవకాశముంది. ఈ ఫలితాలపై ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో జోరుగా పందేలు కాస్తున్నారు. ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలతో పాటు మండలస్థాయి నేతలు కూడా బెట్టింగ్ వేస్తున్నారు. వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా భారీగా బెట్టింగ్ నడుస్తోంది. ఒకవైపు ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతుంటే..మరోవైపు ఫలితాలపై పందేలు కాస్తుండటంతో రాయలసీమలో ‘వేడి’ మొదలైంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 9న జరిగాయి. పట్టభద్రుల కోటాలో 2,49,582 ఓట్లకు గాను 1,55,536 పోలయ్యాయి. పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50శాతం కంటే ఎక్కువగా ఎవరికి వస్తాయో వారు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు 77,768 కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చినా..వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇంతకంటే ఒక్క ఓటు తక్కువగా పోలైనా, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కపెడతారు. ఈ ఓట్ల కౌంటింగ్లో కూడా 50శాతం కంటే ఒక్క ఓటు(మొదటి ప్రాధాన్యత ఓట్లు కలిపి) అధికంగా వచ్చినా విజేతగా నిర్ణయిస్తారు. లేదంటే మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఈ ప్రాతిపదికన కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇదే తరహా జరుగుతుంది. ఉపాధ్యాయ కోటాలో 20,515 ఓట్లకుగాను 18,739 పోలయ్యాయి. ఇందులో 50శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువగా అంటే 9,370 ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారు గెలుపొందుతారు. లేదంటే రెండు, అప్పటికీ రాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుందని ప్రకటించారు. అయితే.. బ్యాలెట్ పేపర్ల విభజన పూర్తయి ఓట్ల లెక్కింపు మొదలవ్వాలంటే మధ్యాహ్నం రెండు గంటలపైన పడుతుంది. కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరగనుండటంతో ఫలితాలు మంగళవారం వెలువడే అవకాశం ఉంది. భారీగా బెట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ‘అనంత’లో భారీగా బెట్టింగ్ నడుస్తోంది. పట్టభద్రుల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్ మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ పార్టీలతో పాటు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వీరిద్దరిపైనే పందేలు కాస్తున్నారు. వీరిపై బెట్టింగ్ చాలా రకాలుగా సాగుతోంది. బరిలోని 25మందిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్రెడ్డికి అధికంగా పోలవుతాయని భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్రాయుళ్లలో దాదాపు 90శాతం ఇదేవిధంగా వేస్తున్నారు. ఈ ఓట్లు అధికంగా వస్తాయనే కారణంతో గెలుపు విషయంలో కూడా గోపాల్రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పందేలు 1ః1(రూపాయికి రూపాయి) లెక్కన కాస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్రెడ్డికి ఎక్కువగా వస్తాయని, అయితే అవి 50 శాతం కంటే మించడం కష్టమని, కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లతో గేయానంద్ కూడా గెలిచే అవకాశాలున్నాయని కొందరు పందెం కాస్తున్నారు. వీరిద్దరిపైనే బెట్టింగ్ జరుగుతుండటంతో రేసులో టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డి లేరని స్పష్టమవుతోంది. అయిన్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్రెడ్డి తర్వాత కేజేరెడ్డికే వస్తాయని కొందరు పందెం వేస్తున్నారు. మొత్తమ్మీద గోపాల్రెడ్డి గెలుస్తారని 1ః1 పందేలు జరుగుతుంటే, గేయానంద్ గెలుస్తారనే వారు 2ః1(రెండు రూపాయలకు ఒక్క రూపాయి) కాస్తున్నారు. ఉపాధ్యాయ కోటాలో కత్తి, ఒంటేరుపై పందేలు ఉపాధ్యాయ కోటాలో కత్తినరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. బరిలోని 10మందిలో కత్తినరసింహారెడ్డి, బచ్చలపుల్లయ్య, ఒంటేరు మధ్య త్రిముఖ పోరు నడిచినట్లు పోలింగ్ సమయంలో చర్చ సాగింది. అయితే.. ఇప్పుడు కత్తి, ఒంటేరుపైనే అధికంగా పందేలు వేస్తుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య రేసులో ఉన్నారా, లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఓసీల మధ్య బీసీకార్డుతో బరిలోకి దిగి విజయం సాధిద్దామని ఆశపడిన పుల్లయ్యను టీడీపీ వ్యతిరేక ఓటు దెబ్బతీసిందని కూడా ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే.. కొందరు కత్తి, పుల్లయ్య మధ్య, ఇంకొందరు ఒంటేరు, పుల్లయ్య మధ్య కూడా పందేలు కాస్తున్నారు. 1ః1 ప్రకారమే పందేలు నడుస్తున్నాయి. అనంతపురంతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఇదే తరహాలో వేస్తున్నారు. ‘స్థానిక’ పోరుపైనా.. వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ‘అనంత’లో పందేలు కాస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వివేకానందరెడ్డికి బీటెక్ రవి గట్టిపోటీ ఇచ్చారని, ఫలితాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం లేదని ఓ వర్గం మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే.. శనివారం నుంచి వివేకా గెలుస్తారని బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందెం వేస్తున్నారు. దీంతో వివేకా విజయంపై రాజకీయ పార్టీల్లోనూ స్పష్టత వచ్చినట్లయింది. కర్నూలులో కూడా గౌరు వెంకటరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. ఇవి రూపాయికి రూపాయి అనే లెక్కన నడుస్తున్నాయి. ఈ పందేలు కాసేవారిలో ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్లు, ద్వితీయశ్రేణి నేతలు కూడా ఉన్నారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకూ ఒక్కొక్కరు పందేం కాస్తున్నారు. ఎమ్మెల్యేలు వారి పీఏలతో వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో పందెం కాయాలనుకునేవారంతా పీఏలను సంప్రదిస్తున్నారు. మొత్తమ్మీద అభ్యర్థులతో పాటు పందెం రాయుళ్లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో, దురదృష్టం వెంటాడుతుందో వేచి ఉండాల్సిందే! -
డేటింగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకుంది!
వాషింగ్టన్:ఇటీవల ట్విట్టర్ వేదికగా డేటింగ్ బెట్టింగ్ వేసి ఓటమి పాలైన కెనడా టెన్నిస్ స్టార్ ఎగునీ బౌచర్డ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. తాను వేసిన బెట్టింగ్ ప్రకారం 20 ఏళ్ల విద్యార్థి జాన్ గోహ్రెక్ తో కలిసి డేటింగ్ వెళ్లినట్లు బౌచర్డ్ తాజాగా స్పష్టం చేసింది.' నా మాట ప్రకారం అతనితో డేటింగ్ కు వెళ్లా. దానిలో భాగంగా ముందుగా అతనితో కలిసి మిల్ వాకీ-ఎన్బీఏ జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ కు హాజరయ్యా. ఆ తరువాత డేటింగ్ కోసం కొన్ని స్విమ్ సూట్లు పరిశీలించా 'అని బౌచర్డ్ తెలిపింది. ఈ మేరకు జాన్ గోహ్రెక్ తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. గత నెల్లో సూపర్ బౌల్ ఈవెంట్ లో భాగంగా అమెరికా ఫుట్బాల్ లీగ్ జట్లైన అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌచర్డ్ బెట్టింగ్ కు పాల్పడి ఓటమి పాలైంది. ఇరు జట్ల మ్యాచ్ లో భాగంగా తొలి క్వార్టర్ అనంతరం అట్లాంటా ఫాల్కోనస్ గెలుస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. అయితే జాన్ గోహ్రెక్ అనే అభిమాని ఆమె నిర్ణయంతో విభేదించాడు. ఒకవేళ పాట్రియట్స్ గెలిస్తే తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమా?అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి బౌచర్డ్ వెంటనే అంగీకారం తెలపడం, ఆపై పరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. ఈ మ్యాచ్లో పాట్రియట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై గెలుపొందింది. కాగా, మ్యాచ్ తొలి అర్థభాగంలో అట్లాంటా 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో బౌచర్డ్ బెట్టింగ్ వేసింది. దాంతో పాట్రియట్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ వేసి చాలా పెద్ద తప్పుచేశానని ఆ తరువాత బౌచర్డ్ తలపట్టుకుంది. ఫిబ్రవరి 25 వ తేదీన 23 ఒడిలోకి అడుగుపెడుతున్న బౌచర్డ్.. తాను జీవితంలో చేసిన పొరపాట్లలో ఇదొక పెద్ద తప్పిదంగా పేర్కొంది. Just met my 'Super Bowl Twitter Date' John -
బెట్టింగ్ గ్యాగ్ అరెస్ట్
నంద్యాల: ఇంగ్లాండ్-భారత్ మధ్య బెంగళూరులో జరిగిన టి20-20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్కు పాల్పడుతూ పవన్ యువసేన టౌన్వైడ్ అధ్యక్షుడు దాసరి రవిశంకర్, అలియాస్ దాసరి రవి, మరో నలుగురు పోలీసులకు దొరికిపోయారు. డీఎస్పీ హరినాథరెడ్డి స్థానిక పోలీస్ అతిథి గృహంలో గురువారం విలేకరులకు వెల్లడించారు. శ్యాంనగర్లోని ఒక ఇంట్లో బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలియడంతో త్రీటౌన్ ఎస్ఐ జయన్న సిబ్బందితో దాడి చేశారు. దాసరి రవిశంకర్, సయ్యద్ ఖాదర్బాషా, షేక్సుభాన్, మొగల్ హారూన్బేగ్, మొగల్సికిందర్బేగ్ అరెస్ట్ చేసి రూ.1.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
కొనసాగిన కోట్లాట
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : ప్రభుత్వ యంత్రాంగం ఓడిపోయింది. కోడి పందేలతోపాటు జూద క్రీడలను ముందుండి మరీ గెలిపించింది. జూదరుల సొమ్ములను కరిగించేసి.. పందేల నిర్వాహకులకు సిరుల వర్షం కురిపించింది. రాజకీయ క్రీడలో.. అధికార పార్టీ నేతలు అండదండలు అందించడంతో ప్రభుత్వం నుంచి ‘చూసీచూడనట్టు వెళ్లండి’ అంటూ మౌఖిక ఆదేశాలు వెలువడటంతో జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టీమ్లు అడ్రస్ లేకుండా పోయాయి. మూడు రోజుల పండగ అయినా బోనస్గా నాలుగో రోజున కూడా పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. దీంతో సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, పేకాట, ఇతర జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారగా.. సందట్లో సడేమియా అన్నట్టుగా రూ.2 వేల నకిలీ నోట్లనూ చలామణి చేయడం కలకలం సృష్టించింది. అకివీడు మండలం ఐ.బీమవరం జూద శిబిరంలో పెద్దఎత్తున రూ.2 వేల నకిలీ నోట్లు చలామణి అయ్యాయి. దీనిని గుర్తించిన నిర్వాహకులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపించి వేశారు. కొన్ని దొంగనోట్లను చించివేశారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. కోడిపందేల మాటున జూద క్రీడలు, పేకాట పెద్దఎత్తున సాగినా ఖాకీలు మిన్నకుండటం విమర్శలకు తావిచ్చింది. అంతా అయిపోయాక పందేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీలు పనిచేయలేదు. ఈ నెపాన్ని కిందిస్థాయి సిబ్బందిపై నెడతారా, వారికి నోటీసులు ఇస్తారా లేక ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తారా అనేది వేచి చూడాల్సిందే. కోర్టుకు చూపడం కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 330 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అన్నిచోట్లా ఆడించారు ప్రధానంగా భీమవరం మండలం వెంప, వీరవాసరం మండలం కొణితివాడ, భీమడోలు మండలం గుండుగొలను, పెదవేగి మండలం కొప్పాకలో భారీస్థాయి పందేలు నిర్వహించగా, భీమవరం మండలం తోకతిప్ప, ఈలంపూడి, దిరుసుమర్రు, చినఅమిరం, రాయలం, యనమదుర్రు, లోసరి, దెయ్యాలతిప్ప, వీరవాసరం, అండలూరు, నందమూరుగరువు, మత్య్సపురి, నవుడూరు, ఉత్తరపాలెం, వడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఒక మోస్తరు పందేలు జరిగాయి. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం కూడా కోడిపందేలు, గుండాట, పేకాట విచ్చలవిడిగా సాగాయి. మొగల్తూరు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో గుండాట, కోడి పందేలను రేయింబవళ్లు నిర్వహించారు. రామన్నపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లోని శిబిరాలపై పోలీసులు సోమవారం పోలీసులు దాడులు చేశారు. లిఖితపూడి, రాజుల్లంక, వేములదీవి, లక్ష్మణేశ్వరం, రుస్తుంబాద, తూర్పుతాళ్లు, మత్స్యపురి, యర్రంశెట్టివారిపాలెం పందేలు యథావిదిగా జరిగాయి. పాలకొల్లు మండలం పూలపల్లి ప్రధాన బరులు కోలాహలంగా మారింది. దగ్గులూరు, తిల్లపూడి, చింతపర్రు, భగ్గేశ్వరం, వడ్లవానిపాలెం, గొల్లవానిచెరువులో జూద క్రీడలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ఎట్టి పరిస్థితితుల్లోను కోడి పందాలను ఆపాలని అధికార పార్టీ నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో సోమవారం ఉదయం పోలీసులు, గ్రామస్తులు మధ్య రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. భీమడోలు మండలం గుండుగొలను, కురెళ్లగూడెం, పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్పేట తదితర గ్రామాల్లో పందేలు భారీ ఎత్తున జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలోని పెద్ద బరితోపాటు రెండు చిన్నబరుల్లోనూ పందెంకోళ్లు కత్తులు దూశాయి. కాళ్ల మండలం సీసలి, జక్కరం, పెదఅమిరం, మాలవానితిప్ప, ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం, కొమడవోలు, జాలిపూడి, శ్రీపర్రు గ్రామాల్లో పందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగాయి. కాట్లంపూడి, మాదేపల్లి శివారు ప్రాంతాల్లోని చేపల చెరువులు, పంటభూముల మధ్య చెట్ల కింద కొత్తగా పేకాట స్థావరాలు నడిచాయి. జంగారెడ్డిగూడెం, సుబ్బంపేట రోడ్డు, శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లి, పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో పందేలు, జూదాలు జోరుగా నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం, బయ్యనగూడెం, దిప్పకాయలపాడు, పరింపూడి గ్రామాల్లోనూ కొనసాగాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు నిర్వహించే బరుల్లో సోమవారం పందేలు వేయగా, మిగిలిన చోట్ల నిలిచిపోయాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ధర్మాజీగూడెం, కలరాయనగూడెం, ములగలంపాడు గ్రామాల్లోని ఆయిల్పామ్, మామిడి తోటల్లో నిర్వహించిన పందేలకు కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి పందెగాళ్లు తరలివచ్చారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు కొనసాగాయి. -
యదేచ్ఛగా కోళ్ల కత్తుల కోలాటం
-
తొలికాంతి.. సంక్రాంతి
ఆరుబయట చలిమంటలు.. వాకిళ్లలో ముగ్గులు.. వాటిపై గొబ్బెమ్మలతో ఆడపిల్లల ఆనందం.. ఆకాశంలో పతంగులతో అబ్బాయిల ఉత్సాహం.. గంగిరెద్దుల ఆటలను చూసి పిల్లల కేకలు.. ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. మరోవైపు వంటింట్లోంచి నోరూరించే వంటల ఘుమఘుమలు.. బోగిపండ్లు.. బొమ్మలు కొలువులు! మొత్తంగా ఇవి సంక్రాంతి తెచ్చే ఆనందాల కాంతులు. నెల్లూరు(సెంట్రల్): తెలుగు వారి పెద్దపండుగైన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త అల్లుళ్ల రాకలు, బంధువుల సందడితో వాతావరణం పేరుకు తగ్గట్లే పెద్ద గానే ఉంటుంది.పల్లెల్లో అయితే చెప్పనక్కర్లే దు. పండుగకు వారం రోజుల ముందే పిండివంటల తయారీ మొదలెట్టి పూర్తిచేశారు. పట్టణాల బాట పట్టినవారు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చేస్తున్నారు. గంగిరెద్దులవారు, బుడబుడకల సందడి..యువత ఆటలు, కేరింతల సవ్వడి.. పల్లె, పట్నం తేడా లేకుండా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇక నెల్లూరు పట్టణంలోని పెన్నా నదిలో గత కొన్ని సంవత్సరాలుగా ఏటి పండుగను నిర్వహిస్తున్నారు. గాలి పటాల పండుగను కూడా చేసుకుంటారు. సంక్రాంతి రోజు జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల లోని దేవతామూర్తుల విగ్రహాలను పెన్నా నది ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడకు వచ్చిన వారికి తీర్థప్రసాదాలు అందచేస్తారు. ఈ వేడుకను చూడటానికి నగరం చట్టుపక్కల వారు కూడా వస్తుంటారు. ఇక పోతే సూళ్ళూరుపేట, నాయుడుపేటలలో మాత్రం కాళంగి నది, స్వర్ణముఖి నదిలో ఏటి పండుగను ప్రజలు జరుపుకుంటారు. కోవూరులో గత 25 సంవత్సరాలుగా వస్తున్న ఎడ్ల పందాలు ప్రత్యేకం. మన జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నుంచి కూడా ఈ పందేలు చూడటానికి వస్తుంటారు. అందుకే తెలుగు లోగిళ్లకు తొలికాంతి అయిన సంబరాల సంక్రాంతిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే.. సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం. అంటే మార్పు చెందడం. సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశిస్తాడు. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. అందుకే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతు లతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు రోజులు చేసుకోవడం ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. భోగిభాగ్యాలు మూడు రోజుల పండగలో మొదటిగా భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈరోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాతవస్తువులు అన్నీ సమకూర్చి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ, బొమ్మల కొలువులతో, చాలా ఇళ్ళలో చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా అడుతూపాడుతూ గడుపుతారు. ఇక భోగిపళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణేలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. సంప్రదాయానికి ప్రతీక మకర సంక్రాంతి రెండవ రోజు. ఈరోజు తెల్లవారగానే పాలు పొంగించి, కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన పిండి వంటలు తింటూ, సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు, మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున ‘హరిలో రంగ హరీ’ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు తొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. అన్నదాతకు కొత్తకళ సంక్రాంతి పండుగ మూడవ రోజు చివరిదైన కనుమ రోజు. ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆడ పిల్లలందరు గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే గోపిబొమ్మ. అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం. వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. -
’కట్టలు’ తెగాయ్
పందెం కోడి గెలిచింది జూదం జూలు విదిల్చింది పనిచేయని కోర్టు ఉత్తర్వులు, పోలీస్ ఆంక్షలు నేడు, రేపు ఇదే జోరు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించిన కలెక్టర్ కనిపించని జాయింట్ యాక్షన్ టీమ్లు మార్టేరులో పొట్టేలు పందేలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : పండగ వేళ పందెం కోడి గెలిచింది. కోర్టులిచ్చిన ఉత్తర్వులు అపహాస్యం పాలయ్యాయి. సంప్రదాయం పేరిట రాజకీయ పార్టీల నేతలు దగ్గరుండి మరీ కోడి పందేలు వేయించారు. ఒకరోజు ముందువరకూ హడావుడి చేసిన జాయింట్ యాక్షన్ టీములు, పోలీసులు పత్తా లేకుండా పోయారు. శుక్రవారం సాయంత్రానికి కోడి పందేలు నిర్వహించే చోట 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించగా, ఎక్కడా దాని ప్రభావం కనపడలేదు. కోడిపందేల ముసుగులో జూదం యథేచ్ఛగా సాగింది. మద్యం ఏరులై పారింది. మీడియాను అనుమతించకుండా పోటీలు జరుపుకోవచ్చని ప్రభుత్వం నుంచి అనధికారికంగా అనుమతులు రావడంతో పందేలరాయుళ్లు చెలరేగిపోయారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్ అనే వ్యక్తి తన లైసెన్స్ రివాల్వర్తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మరీ తన అనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పందేల రాయుళ్ల మధ్య బెట్టింగ్లు జరిగాయి. గాల్లోకి కాల్పులు జరిపిన దయాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరులో పొట్టేలు పందేలు నిర్వహించారు. ఎక్కడ చూసినా పందేలే భీమవరం మండలం వెంపలో ఫ్లడ్ లైట్ల వెలుగుల నడుమ రేయింబవళ్లు పందేలు వేస్తున్నారు. ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామంలో ప్రధాన బరిగా ఉన్న ఎఫ్సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అడ్డుకుంది. ఒక దశలో పందేల రాయుళ్లు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. చివరకు ఉండి ఎమ్మెల్యే కలవూడి శివ వత్తిడితో మధ్యాహ్నం నుంచి అనుమతి ఇచ్చారు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో బీజేపీ నేతలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, శ్రీనివాస వర్మ తిలకించారు. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందేలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరు గరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంతో మహిళలు అడ్డుకున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయిగూడెం, పల్లంట్ల, త్యాజంపూడి, లక్ష్మీపురం గ్రామాల్లో భారీ పందేలు నిర్వహించారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, వెంకటాపాలెం, కొవ్వూరుపాడు, వాదాలకుంట గ్రామాల్లో పందేలు జరిగాయి. నల్లజర్ల మండలం నల్లజర్ల, అనంతపల్లి, చోడవరం, పోతవరం, ద్వారకాతిరుమల మండలంలో రాళ్లకుంట, వెంకటకృష్ణాపురం, దోసన్నపాడు, తిమ్మాపురం గ్రామాల్లో భారీగా పందేలు ప్రారంభించారు. తొలిరోజు పందేలకు ప్రముఖులు ఎవరూ హాజరుకాకపోయినప్పటికీ మండల స్థాయి టీడీపీ నాయకులు బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. దెందులూరులో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి మరీ పందేలను నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం కొప్పాకలో పోటీల వద్దకు పోలీసులు, మీడియా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొగల్తూరులో పందేలు నిర్వహించే బరికి వేలం నిర్వహించారు. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీ పందేలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వీటిని ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఈ బరిని స్థానిక నాయకుడొకరు రూ.32 లక్షలు చెల్లించి వేలంలో దక్కించుకున్నట్టు సమాచారం. జూలు విదిల్చిన జూదం.. ఏరులై పారిన మద్యం కోడి పందేల బరులకు అనుబంధంగా కోతాట, గుండాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడే మద్యం లూజు విక్రయాలు భారీగా సాగుతున్నాయి. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమేశ్వరస్వామి ఆలయం వద్ద పందేలు జరుగుతున్నాయి. బువ్వనపల్లి, తోకలపల్లి గ్రామాల్లో చిన్న బరులు ఏర్పాటు చేఽశారు. ఇక్కడ పందేల కంటే పేకాట, గుండాట వంటి జూదాలకే అధిక ప్రాధాన్యత ఉంది. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాల్లో కోడి పందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో బరులు ఏర్పాటు చేసే ప్రాంతాల వద్ద పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. 11గంటల తరువాత పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనధికారిక అనుమతులు రావడంతో పోలీసు గప్చిప్గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, వడలి, సిద్ధాంతం, దొంగరావిపాలెం, ములపర్రు, ఆచంట, కొడమంచిలి, వల్లూరు గ్రామాలలో కోడి పందేలు, జూదం నిర్వహించారు. ఆచంట మండలం వల్లూరులో పందేల బరిని వేలం వేయగా, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు దక్కించుకున్నట్టు సమాచారం. చింతలపూడి మండలం వెంకటాపురం, సీతానగరం, నాగిరెడ్డిగూడెం, లింగపాలెం మండలంలోని కొణిజర్ల, ములగలంపాడు, కామవరపుకోట మండలం రావికంపాడు, కళ్లచెర్వు, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందేలు నిర్వహించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో ఉదయం 10 గంటలకే కోడి పందేలు, గుండాట, కోతాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. పాలకొల్లు మండలంలో టీడీపీ నేత ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డులో కోడి పందేలు వేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని గుంజవరం, గూటాల, పి.రాజవరం, పి.అంకంపాలెం, కామయ్యపాలెం, రాచన్నగూడెం, ములగలంపల్లి, తాటియాకులగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, బూసరాజుపల్లి, దొరమామిడి, వెలుతురువారిగూడెం, టి.నరసాపురం, బందంచర్ల, రామవరం, తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం, రామానుజపురం, బయ్యనగూడెం, కుక్కునూరు మండలం వీరవల్లి, వేలేరు గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. -
పందేలదే పైచేయి
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు కోర్టు ఉత్తర్వులు బేఖాతర్ గాలిలోకి కాల్పులు జరిపి ప్రారంభించిన వైనం చేతులు మారుతున్న రూ.కోట్లు 144 సెక్షన్ ప్రకటించిన కలెక్టర్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : భోగి రోజున పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా జరిగాయి. అధికార పార్టీ నేతలే ముందుండి నడిపించడంతో గురువారం రాత్రివరకూ హడావుడి చేసిన పోలీసులు శుక్రవారం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు జరిగాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం కోడి పందాల్లో తెలంగాణ పరిధిలోని ఖమ్మం, ఏపీ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాల పందేల రాయుళ్ల మధ్య భారీ పందేలు జరిగాయి. ఇక్కడ ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్ అనే వ్యక్తి పందేల ప్రారంభం సందర్భంగా తన లైసెన్స్ రివాల్వర్తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలిసిన కొన్నిగంటల తరువాత అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఏటా మాదిరిగానే ముందువరకూ ఉత్కంఠ నెలకొన్నా సంక్రాంతి సంబరాల్లో తొలిరోజైన భోగినాడు జిల్లావ్యాప్తంగా పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. హైకోర్టు ఉత్తర్వులు, దానిపై సుప్రీంకోర్టు స్పందనతో చివరి రోజు వరకూ పందేలను అడ్డుకున్నా భోగి రోజున చేతులెత్తేశారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రభుత్వం నుంచి అనధికారిక ఉత్తర్వులు రావడంతో పోలీసులు తప్పుకున్నారు. నిడమర్రు మండలం పత్తేపురంలో, భీమడోలు మండలం గుండుగొలను బరుల్లో పందేలను ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ పందాల్లో పాల్గొన్నారు. పెదవేగి మండలం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ఆధ్వర్యంలో కోడిపందేలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా తరలి వచ్చారు. రూ.లక్షల్లో పందాలు జరిగాయి. పందేల ముసుగులో కోతాట, గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. పోలీసులు కనీసం కన్నెత్తి కూడ చూడలేదు. ఆచంట మండలం వల్లూరులో కోడి పందేల బరిని వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు పాడుకున్నట్టు సమాచారం. అకివీడు మండలం ఐ.భీమవరంలో హైడ్రామా నడిచింది. గ్రామంలోని ప్రధాన బరిగా ఉన్న ఎఫ్సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం తిష్ట వేశాయి. పందెంరాయుళ్లు గొడవకు దిగినా తహసీల్దార్ ఒప్పుకోలేదు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో ప్రారంభించేందుకు నిర్వాహకులు నిర్ణయించి ఎమ్మెల్యే కలవపూడి శివను ఆహ్వానించారు. ఎమ్మెల్యే చెప్పడంతో మధ్యాహ్నం నుంచి ప్రధాన బరిలో కూడా కోడిపందేలు జరిగాయి. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందాలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరుగరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు చిన్నచిన్న గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంలో అక్కడి మహిళలు అడ్డుకున్నారు. తొలిరోజు పందాలకు ప్రముఖులు ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ మండలస్థాయిలోని టీడీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. -
పందేలకు రెఢీ
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి, సంక్రాతి పండుగ సమీపించడంతో పందేల రాయయళ్లు సమరానికి సన్నద్దమవుతున్నారు. ప్రతీ ఏటా సంప్రదాయ ముసుగులో కోడిపందాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో పందాల నిర్వహణకు గ్రామాల్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి, ఈ కోడి పందాల నిర్వహణ పండుగ ఆనవాతీ అని దీన్నిఅడ్డుకోవడం ఎవరి తరంకాదని పందేం రాయుళ్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు పందాలు వేసి తీరుతామనిబరులు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే పందాలకు అవసరమైన కోళ్లును పలువరు నిర్వహకులు సామూహికంగా పెంచి పందాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ’ఓ సామాజిక వర్గం ఆధిపత్య గ్రామాల్లోనే... గణపవరం, నిడమర్రు మండలాల్లో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే కోడి పందాలు నిర్వíßంచేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. గణపవరం మండలంలో అర్ధవరం, నిడమర్రు మండలంలో పత్తేపురంగ్రామాల్లో పెద్ద బరులు సిద్దంచేస్తున్నారు. పత్తేపురంలో ఈ పందేల నిర్వహణకు చేపల చెరువును ఎండగట్టి నట్లు తెలుస్తుంది. దీని కోసం చెరువు యజమానికి సుమారు రూ 3లక్షలు నిర్వహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలానే గుండాటలు, పేకాటలు, కోడిమాసం పకోడి, ఫాస్ట్ ఫుడ్, ఐస్క్రీం, మధ్యం దుకాణాల సముదాయాలకు పాటలు నిర్వహించడం లేదా మూడు రోజులకు కలిపి కొంత మొత్తంలో అద్దె తీసుకోవడం నిర్వహకులు చేస్తుంటారు. అలానే చిన్న బరులు ప్రతీ ఏటా నిడమర్రు మండంలో పెదనిండ్రకొలను, బువ్వనపల్లి, తోకలపల్లి, మందలపర్రుగ్రామాల్లో ఉంటాయి. గణపవరం మండలంలో గణపవరం, సరిపల్లె, కొమ్మర, జగన్నాధపురం, పిప్పిర గ్రామాల్లో ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాదికూడా ఆయా గ్రామాల్లో నిర్వహించేందుకు స్థానిక పందెంరాయుళ్లు అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ’ ప్రతీఏటా చివరి నిముషంలో.. ప్రతీ ఏటా పందాలకు అనధికార అనుమతులవిషయంలో పందెంరాయుళ్లకు చివరి నిముషం వరుకూ టెక్షన్గా ఉంటారు. ప్రతీ ఏటా భోగి రోజు ఉదయం 9 నుండి 11 గంటలకు అనుమతి లభిస్తుంది. ప్రతీ ఏటా 3 రోజులకు మాత్రమే అనధికార అనుమతులు ఉంటాయి, కానీ గతేడాది బోగి, సంక్రాతి, కనుమతోపాటు ముక్కనమ కలుసుకుని 4 రోజులకు అనధికారఅనుమతులతో పందాలు నిర్వహించారు. దీంతో అప్పట్లో పాలకులు,పోలీసుల తీరును అనేమ మంది తప్పు పట్టారు. ’ఆన్లైన్ వద్దు నోట్లే ముద్దు పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందాల నిర్వహణపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తుంది. ఆన్లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మగ్గుచూపడంలేదు. పందాలకు నోట్లు సిద్దం చేసుకోవలని నిర్వహకుల నుండి పందాల్లో పాల్గునేవారిని సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికి కోడిపందాల నిర్వహణ వ్యవహారంలో గతేడాదితో పోల్చితే వెనకబడినట్లూ కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇంకా 3 రోజులు సమయం ఉండటంతో పందాల నిర్వహణలో పోలీసులా, పందెంరాయళ్లా అనే విషయం తేలాల్సి ఉంది. -
కోడి పందాలకు హైకోర్టు బ్రేక్!
-
కోడి పందాలకు హైకోర్టు బ్రేక్!
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. -
జిల్లాలో జడలు విదిలిస్తున్న బెట్టింగ్ భూతం
ఏలూరు అర్బన్ ః జిల్లాలో బెట్టింగ్ భూతం మరోమారు జడలు విప్పి నాట్యం చేస్తుంది. జిల్లా పోలీసులు బెట్టింగ్ నిర్మూలించేందుకు తీసుకున్న చర్యల కారణంగా గత కొద్ది కాలంగా జిల్లాలో స్థబ్డంగా ఉన్న బెట్టింగ్ వ్యాపారం ఇటీవలి కాలంలో తిరిగి హల్చల్ చేస్తున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా ఆ«ద్యక్ష ఎన్నికల సందర్బంగా డొనాల్డ్ ట్రంప్, హిల్లరీల మధ్య జరిగిన ఎన్నికలు, న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన క్రికెట్ పోటీల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ళు పందాల మానియాకు గురికావడం బుకీలకు వరంగా మారింది. ప్రజలకు జూదంపై ఉన్న మక్కువను, బలహీనతలను ఆసరాగాచేసుకుని బెట్టింలను పూర్తిస్థాయి వ్యాపారాంగా మార్చేస్తున్నారు. అక్రమమార్గంలోనైనా సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్మంతో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న అక్రమార్కులు బెట్టింగ్లో సాంకేతికతను జోడిస్తున్నారు. నిత్యం పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణాలతో పాటు పొరుగున ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని బుకీలతో కలుపుకుని నిత్యం లక్షల్లో జరుగుతున్న బెట్టింగ్ వ్యాపారాన్ని జనసంచారం ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో కేవలం ఒక టివి సెల్ఫోన్లతో నడిపించేస్తున్నారు. ఈ వ్యాపారానికి నిరుద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, ఉద్యోగులతో పాటు పారిశ్రామిక వేత్తలను మూల«దనంగా మార్చుకుని బెట్టింగ్ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇందుకు బుకీలకు ఉన్న పరిచయాలే పెట్టుబడి కావడంతో నానాటì కీ పెట్టుబడి, నష్టం అనే మాటే వినపడని బెట్టింగ్ వ్యాపారానికి ప్రధాన ఆకర్షగా మారడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో జల్లాలో పోలీసులు విస్తుతంగా దాడులు చేస్తున్న సందర్భంగా బుకీలు తమ వద్ద నగదు లేకుండా జాగ్రత్త పడడడంతో పోలీసులకు టివి, ల్యాప్టాప్, ఆన్లైన్ బాక్స్, సెల్ఫోన్లు మినహా భారీగా నగదు చిక్కడం లేదు. గడచిన నెలరోజుల కిందట జిల్లాలో జరిగిన బెట్టింగ్లకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి నమోదు చేసిన కేసులు బెట్టింగ్ భూతం విచ్చలవిడి తనానికి సజీవ సాక్ష్మాలుగా నిలుస్తున్నాయి. భీమవరంలో గడచిన అక్టోబర్ , 7వ తేదీన పాలకొల్లు పట్టణం కొత్త కుళాయి గట్టు వెంకటేశ్వరస్వామి కాలనీలోని బివిఆర్ అపార్ట్మెంట్, 501వ నంబర్ ఫ్లాట్లో గుట్టు చప్పుడు కాకుండా భారీగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బుకీలు ముదునూరి ప్రదీప్, పెన్మెత్స సాయి దిలీప్ కుమార్ వర్మ, పెన్మెత్స రామకృష్టంరాజు, కాలినీడు పవన్కుమార్ రాజు, ఇసుకమర్తి సతీష్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 24,020ల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు బెట్టింగ్కు ఉపయోగిస్తున్న 25 సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు, ఒక లైన్బాక్స్ అనే ఆధునికి యంత్రాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెంలో అక్టోబర్, 10న తాడేపల్లిగూడెంలోని సత్యవతి నగర్లో సూర్యచంద్ర అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో బెట్టింగ్ స్థావంరపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న మునగాల సత్యనారాయణ, మునగాల శ్రీనివాస్, కనపర్తి ఇళయరాజా అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1200ల నగదు, టివి, రెండు ల్యాప్టాప్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భీమవరంలో అక్టోబర్, 29న భీమవరం వన్టౌన్ పోలీసులు పట్టణంలో ఒక ఇంటిలో గుట్టుగా జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4,460లు, ఒక ల్యాప్టాప్, ఒక లైన్ బాక్స్, టివి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం దూబచర్లలో ఈ నెల 9న నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో బుకీ కొమ్మన గోపాలకృష్ణను అనంతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 50,000లు, టివి, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలో భారత్ ఇగ్లండ్ దేశాల మధ్య క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లు, బుకీల కదలికలపై పోలీసులు మరింతగా దృష్టి సారించాల్సి ఉంది.