bill
-
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
తిరగని బతుకు మీటర్!
అనంతపురంలో పని చేస్తున్న మీటర్ రీడర్(Meter reader) డేవిడ్కు(పేరు మార్చాం) మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఇలాగైతే కుటుంబ జీవనం సాగించేదెలా? ఇలాగే ఉంటే మరో రెండు నెలలు వేతనాలు కూడా ఇవ్వరు. దీనిపై కాంట్రాక్టర్లతో గట్టిగా మాట్లాడాలి అంటూ వారి వాట్సాప్ గ్రూప్లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు. వేతనాల కోసం గట్టిగా అడిగితే వారి ఖాతా క్లోజ్ చేసి ఇంటికి పంపేస్తామంటూ కాంట్రాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మీటర్ రీడర్స్(Meter readers) ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాంలే.. ఉన్న ఉద్యోగం పోతే అంతే సంగతులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనంతపురం టౌన్: విద్యుత్(Electricity) వినియోగదారులకు ప్రతి నెలా బిల్లును తీసి అందించే మీటర్ రీడర్ల బతుకు మీటర్ మాత్రం తిరగడం లేదు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నెలలు కావొస్తున్నా వేతనాలు మాత్రం అందడం లేదు. కాంట్రాక్టర్లు మాత్రం ప్రతి నెలా తమకు రావాల్సిన బిల్లులను విద్యుత్ సంస్థ నుంచి తీసుకుంటూ మీటర్ రీడర్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. వేతనాలపై జీవనం సాగిస్తున్న దాదాపు 220 మంది మీటర్ రీడర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. వేతనాలు అడిగితే ఉద్యోగం తొలగిస్తారంట.. వేతనాల కోసం అడిగితే తమను ఉద్యోగం నుంచి తొలగిస్తారనే వాయిస్ను కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు పంపారు. దీంతో వారు వేతనాలు ఇవ్వకపోయినా గట్టిగా అడగలేని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 ఏరియాలకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను విద్యుత్ శాఖ అధికారులు పిలిచారు. 250 మందికి పైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు.విద్యుత్ శాఖ(electricity department) అధికారులు ఏక పక్షంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు వ్యక్తులకే స్పాట్ బిల్లింగ్ టెండర్లను ఖరారు చేశారు. టెండర్లలో ఎవరు తక్కువకు కోట్ చేశారనే విషయాలను పరిశీలించకుండానే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇద్దరు వ్యక్తులకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను కట్టబెట్టారని అప్పట్లోనే అప్పటి ఎస్ఈపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్ట్ పొంది ఐదు నెలలు కాగా దాదాపు 3 నెలల వేతనం మీటర్ రీడర్స్కు పెండింగ్ పెట్టారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకునే వారేరీ?.. మీటర్ రీడర్లకు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదనే విషయాలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీటర్ రీడర్ల అధికారికంగా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దాములే అంటూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వేతనాలపై లిఖిత పూర్వకంగా కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేస్తే ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో మీటర్ రీడర్లు ఉన్నారు. దీన్ని అసరాగా చేసుకున్న స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి మీటర్ రీడర్ల వేతనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.రెండు రోజుల్లో వేతనాలు అందేలా చర్యలు మీటర్ రీడర్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై కాంట్రాక్టర్లతో మాట్లాడి రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ప్రతి నెలా వారి ఖాతాల్లో 5వ తేదీలోగా వేతనాలు జమ చేసేలా చూస్తాం – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అనంతపురం -
అడ్వకేట్ బిల్లుపై స్టాలిన్ ఫైర్.. కేంద్రానికి వార్నింగ్
చెన్నై: ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)పై ఫైరవుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా అడ్వకేట్ బిల్లుపై కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తీసుకువస్తున్న అడ్వకేట్ బిల్లు న్యాయవాద వృత్తిపై దాడి అని అన్నారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు,పుదుచ్చేరిని బార్ కౌన్సిల్ ఆఫ్ మద్రాస్గా కేంద్రం మార్చాలనుకుంటోంది. తమిళనాడు అనేది కేవలం పేరు కాదు. మా గుర్తింపు. తమిళులపై బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్జేఏసీని తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మళ్లీ అడ్వకేట్ బిల్లు ద్వారా బార్ కౌన్సిళ్లపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది. అడ్వకేట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’అని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా, బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసకుంది. ముసాయిదాలో సవరణలు చేయనున్నట్లు ప్రకటించింది. -
వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదిక.. రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఈరోజు(గురువారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశలోని చివరి రోజు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో హంగామా నెలకొంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్సభలో ఇదేవిధమైన గందరగోళం నెలకొన్న నేపధ్యంలో సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, ఆపై స్పందించాలని ఆయన కోరారు. ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా జేపీసీ సభ్యులేనని ఆయన అన్నారు.వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఆయన ఛైర్మన్ను అభ్యర్థించారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.జేపీసీ జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ నివేదికను 655 పేజీలలో పొందుపరిచారు. 16 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 11 మంది సభ్యులు వ్యతిరేరించారు. కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(గురువారం) పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టం-1961ని సరళీకరించడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను-1961 కంటే శరళమైనది. అయితే దీనిలో మరిన్ని విభాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి. 622 పేజీల కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్లలో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో 298 విభాగాలు, 14 షెడ్యూల్లు ఉన్నాయి. 880 పేజీలు. కాగా పార్లమెంటులో లోక్సభ కార్యకలాపాలు ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ప్రతిపక్షం గందరగోళం సృష్టించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్ను వాడనున్నారు.ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలుపన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?స్థిరమైన ట్యాక్స్ ఇయర్ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
నెల కరెంట్ బిల్ రూ.200 కోట్లు: దెబ్బకు ఫ్యూజులు అవుట్
సాధారణంగా నెలకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే వేల రూపాయలోనే ఉంటుంది, కదా. కానీ హిమాచల్ప్రదేశ్లోని ఓ వ్యక్తికి కరెంట్ బిల్ ఏకంగా రూ.200 కోట్ల కంటే ఎక్కువే వచ్చింది. కరెంట్ బిల్ ఏమిటి? రూ.200 కోట్లు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదివేయాల్సిందే..హిమాచల్ప్రదేశ్లోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన 'లలిత్ ధీమాన్' అనే వ్యాపారవేత్త.. తనకు వచ్చిన ఎలక్ట్రిక్ బిల్ చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ. 2,10,42,08,405. ఇప్పటి వరకు ఇంత కరెంట్ బిల్ బహుశా ఏ ఒక్కరికీ వచ్చి ఉండదు.రూ.2,10,42,08,405 కరెంట్ బిల్ రావడానికి ముందు నెలలో 'లలిత్ ధీమాన్'కు వచ్చిన బిల్లు రూ.2,500 మాత్రమే. భారీ మొత్తంతో కరెంట్ బిల్ రావడంతో అతడు ఫిర్యాదు చేసేందుకు విద్యుత్ బోర్డును సందర్శించాడు. సాంకేతిక లోపం వల్లనే ఈ బిల్లు వచ్చిందని.. విద్యుత్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత అతనికి సరైన కరెంట్ బిల్ ఇచ్చారు. నిజానికి అతనికి వచ్చిన కరెంట్ బిల్ రూ.4047 మాత్రమే.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!సాంకేతిక లోపాల వల్ల భారీ బిల్లులు రావడం ఇదే మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్కు చెందిన ఓ వ్యక్తికి 1,540 రూపాయల కరెంట్ బిల్ వస్తే.. విద్యుత్ శాఖ నుంచి 86 లక్షల రూపాయలకు పైగా బిల్లును స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని అధికారులు గుర్తించి ఆయనకు సరైన బిల్ ఇచ్చారు. -
‘సాక్షి’కి ఎందుకు చెప్పారు?
సాక్షి, అమరావతి: ‘‘ఏమనుకుంటున్నారు మీరంతా..? కరెంట్ గురించి, బిల్లుల గురించి ‘సాక్షి’ వాళ్లకు ఎందుకు చెప్పారు..? ఎవరు చెప్పమన్నారు..? ఇలా అయితే చాలా ఇబ్బంది పడతారు..! మరోసారి ఇలా ఎవరికైనా చెబితే సహించేది లేదు..!’’ అంటూ విద్యుత్ బిల్లుల బాధితులపై కూటమి నేతలు, అధికార యంత్రాంగం బెదిరింపులకు దిగాయి. ఏమిటీ నిరంకుశం?ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్పురం (పల్లపూరు)లో విద్యుత్ బిల్లుల బాధితుల వద్దకు మంగళవారం వచ్చిన భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ) గోపాలకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శివాజీ, లైన్మెన్ శేషగిరితో పాటు దాదాపు పది మంది అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు వారిపై విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడారని గద్దించారు. పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తామంటూ హెచ్చరించారు. ఇకపై విద్యుత్ బిల్లులు, చార్జీల గురించి ఎక్కడా నోరు విప్పవద్దని తమను బెదిరించినట్లు బాధితులు వెల్లడించారు. ఇకపై తమను వేధింపులకు గురి చేస్తారని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఏమిటీ నిరంకుశత్వమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమే కానీ.. మీరెలా రాసేస్తారు?దీనిపై ఏఈ శివాజీని వివరణ కోరగా.. ‘‘మావైపు తప్పు ఉన్న మాట వాస్తవం.. అయినా మీరు ఎలా రాసేస్తారు?’’ అంటూ ‘సాక్షి’ ప్రతినిధిని సైతం బెదిరించే ధోరణిలో మాట్లాడారు. లైన్ మెన్ శేషగిరికి ప్రతి నెలా విద్యుత్ బిల్లు నిమిత్తం డబ్బులిస్తున్నా తమకు రసీదు ఇవ్వడం లేదని ఎంఎంపురం వాసి పాపమ్మ ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని లైన్మెన్ దృష్టికి తేగా రసీదు ఎక్కడో పడేశానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. గోడు ఆలకించకుండా బెదిరింపులా..!పేదలకు సంక్షేమ పథకాలిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో తమ నడ్డి విరుస్తుండటంతో హాహాకారాలు చేస్తున్నారు. వారి గోడును తెలుసుకుని వాస్తవాలను ‘సాక్షి’ అందరి దృష్టికి తెస్తోంది. వారి కష్టాలను ‘గ్రౌండ్ రిపోర్ట్’ రూపంలో ప్రచురిస్తోంది. అయితే ఇదంతా ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. కరెంటు చార్జీలు పెంచినా, పేదలకు ఉచిత విద్యుత్ను దూరం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణితో పాలకులు వ్యవహరిస్తున్నారు. అనుమతి ప్రకారమే చార్జీలు: ఇంధన శాఖఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితోనే ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. ‘కరెంటు కోత.. చార్జీల మోత’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆ శాఖ స్పందించింది. ఎం.ఎం.పురంలో పాచిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు సిగారపు పాపమ్మకు పాత బకాయిల వల్లే రూ.1,345 విద్యుత్ బిల్లు వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల బిల్లుల్లో కొంత, వచ్చే నెల బిల్లుల నుంచి మరికొంత మేర సర్దుబాటు చార్జీలు విధిస్తున్నట్లు వెల్లడించింది. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ వినియోగదారుడికీ సబ్సిడీ తొలగించలేదని, ఎవరికైనా సబ్సిడీ రాకుంటే సంబంధిత ధృవపత్రాలతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హతను పరిశీలించి మంజూరు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎలాంటి లోడ్ రిలీఫ్ అమలు చేయడం లేదని పేర్కొంది. -
భూ భారతి బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) బిల్లు–2024కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు.ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాలు పంచుకోలేదు. ఈ–ఫార్ములా రేసింగ్ అంశాన్ని సభలో చర్చించాలని శుక్రవారం మొత్తం సభలో పట్టుపట్టిన బీఆర్ఎస్ కీలకమైన ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొనలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లును ఇతర పక్షాలైన బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. అయితే, ఈ సవరణలను పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. ఆనంద భాష్పాలొస్తున్నాయి.. భూ భారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు ప్రకటించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు జూపల్లి కృష్ణారావులతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ సభ్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలసి అభినందించారు. అంతకుముందు చర్చకు ముగింపుగా మంత్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలకమైన ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మూడో మంత్రిగా ఈ బిల్లు సభ ఆమోదం పొందినందుకు తన జన్మ ధన్యమైందని, ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.వాస్తవానికి, ఈ బిల్లును మంత్రి పొంగులేటి పట్టుపట్టి మరీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేశారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి స్పీకర్ అనుమతి మేరకు సభలో ప్రవేశపెట్టించిæ శీతాకాల సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురావాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆఫీసర్స్ గ్యాలరీలో ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్కుమార్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి. లచ్చిరెడ్డిలను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.స్పీకర్కు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేల ధన్యవాదాలుఅసెంబ్లీలో భూభారతి బిల్లుకు సభ ఆమోదం లభించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలియజేశారు. స్పీకర్ చాంబర్లో ప్రసాద్కుమార్ను శాలువాతో సన్మానించారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రంప్ ప్రతిపాదనల్ని తిరస్కరించిన హౌస్
వాషింగ్టన్: వచ్చే ఏడా ది మార్చి 14 వ రకు ఫెడరల్ ప్రభుత్వ వ్యయంపై ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలురు శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను ప్రతినిధుల సభ తిరస్కరించింది. రుణ పరిమితి పెంచుతూ చేసిన ప్రతిపాదనల్ని సభలో ప్రవేశపెట్టగానే ఒక్క పెట్టున నిరసనలు చెలరేగాయి. హఠాత్తుగా తీసుకొచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేది లేదని సభ్యులు ప్రకటించారు. బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు.174–235 ఓట్ల తేడాతో వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటించారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సాయం, రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్ డాలర్లను బైడెన్ ప్రభుత్వం వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్ అనుకూ లురు అంటున్నారు. శుక్రవారంలోగా ఈ విషయంలో స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదముంది. -
జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం
-
అతుల్ సుభాష్కు బిల్లు నివాళి..!
అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. చట్టాలన్ని ఆడవాళ్లకేనా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. భార్య కుటుంబం పెడుతున్న తప్పుడు కేసులతో ఎంతోమంది అతుల్ సుభాష్ లాంటి భర్తలు వేధింపులకు గురవ్వుతున్నారనే వాదన వినిపిస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని బాధిత భర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పాలంటే ఆ టెక్కీ మరణం చర్చనీయాంసంగా మారడమే గాక బీటలు వారిపోతున్న వైవాహిక వ్యవస్థ, చట్టంలోని లోసుగులను లేవనెత్తింది. ప్రస్తుతంఈ విషయమే హాట్టాపిక్ మారింది. ఈ తరుణంలో ఢిల్లీ రెస్టారెంట్ చెందిన జంబోకింగ్ ఫ్రాంచైజీ ఆ టెక్కీ అతుల్కి వినూత్నంగా నివాళి ఆర్పించడం నెట్టింట వైరల్గా మారింది. హౌజ్ ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీ అవుట్లెట్కి ఓ వ్యక్తి వెళ్లాడు. అతను అక్కడ తినేసి తిరిగి వెళ్లేటప్పడూ అందుకున్న రసీదు అతడిని ఆకర్షించింది. అందులో "జస్టీస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్ ట్యాగ్తో అతడి ఆత్మహత్యకు తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందిరిలానే అత్యంత ముఖ్యమైనది. మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని రాసి ఉంది. అతడు వెంటనే ఆ రసీదుని ఫోటో తీసి తన స్నేహితుడికి పంపండంతో రెడ్డిట్లో వైరల్గా మారింది. ఆ జంబోకింగ్ ఫ్రాంచైజీని స్వామి సమర్థ్ ఫుడ్స్ నడుపుతోంది. అందర్ని కదలించిన ఆ టెక్కీ ఆవేదనను సహృద్భావంతో అర్థం చేసుకుని ఇలా వినూత్నంగా నివాళులర్నించడమే గాక అతడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది. పైగా అందుకోసం ఇలా రసీదుని ఉపయోగించుకోవడమనేది ప్రశంసనీయం. అంతేగాదు సదరు వ్యక్తి ఈ విషయమై జంబోకింగ్ ఫ్రాంచైజీ యజమానిని ప్రశ్నించగా.. దానికి ఆ వ్యాపారి ప్రతీది వ్యాపారం కాదని తన దైన శైలి బదులిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. నెటిజన్లు కూడా.. ఆ వ్యాపారి విశాల హృదయాన్ని ప్రశంసించగా, ఇలా జొమాటా, స్విగ్గీలు కూడా చెయ్యొచు గదా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: గట్ హెల్త్పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
విపక్షాల వ్యతిరేకత మధ్యే జమిలి బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
-
‘జమిలి’కి వేళయిందా?!
మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి? ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి. కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది. ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి. దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది. దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి? -
జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదం
Lok Sabha Session Updatesలోక్సభ రేపటికి వాయిదాతిరిగి ప్రారంభమైన లోక్సభ లంచ్కు ముందు జమిలి బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదంఇక.. జేపీసీ ముందుకు జమిలి బిల్లులు!లోక్సభలో జమిలి ప్రవేశపెట్టడానికి ఆమోదంపార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) ముందుకు బిల్లులువన్ నేషన్.. వన్ ఎలక్షన్లో భాగంగా 129 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడాజేపీసీ ద్వారా విస్తృస్థాయి చర్చకు అవకాశంఅతిత్వరలో జేపీసీ ఏర్పాటుజేపీసీ చైర్మన్ను ఎంపిక చేయనున్న లోక్సభ స్పీకర్సంఖ్యా బలం దృష్ట్యా బీజేపీ నుంచే జేపీసీకి చైర్మన్జేపీసీలో విపక్ష సభ్యులకు కూడా స్థానంసభ్యుల పేర్లను ప్రతిపాదించని తరుణంలో.. సభ్యత్వం కోల్పోయే అవకాశంజమిలి బిల్లు కాపీ కోసం క్లిక్ చేయండి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు లోక్సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలుబిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ ఓం బిర్లాకొత్త పార్లమెంట్లో ఫస్ట్ డిజిటల్ ఓటింగ్అనుమానాలున్నవాళ్లకు స్లిప్పులు పంచిన సిబ్బందిఅనుకూలంగా 269 ఓట్లు.. వ్యతిరేకంగా 198 ఓట్లులోక్సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా‘జమిలి’ బిల్లుపై ఓటింగ్ అనంతరం 3 గంటలకు వాయిదాపడ్డ లోక్సభ ‘జమిలి’ బిల్లు ‘జేపీసీ’కి.. సాధారణ మెజారిటీతో ఓకే అన్న లోక్సభ కొత్త పార్లమెంట్ భవనంలో జమిలి బిల్లుపై తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్విపక్షాలు డివిజన్ కోరడంతో ఓటింగ్కు అనుమతిచ్చిన స్పీకర్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి, జేపీసీలో చర్చకు పంపేందుకు అనుకూలంగా 269 ఓట్లు బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 198 ఓట్లు #WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha. (Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO— ANI (@ANI) December 17, 2024జేపీసీకి జమిలి బిల్లు పంపేందుకు సిద్ధం: అమిత్ షా జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ కి పంపేందుకు సిద్ధంఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృతంగా చర్చించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారుజేపీసీ నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తాం లోక్సభలోకి జమిలి ఎన్నికల బిల్లు లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మేఘ్వాల్ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్య అని మండిపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెండు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి కుదించడం రాజ్యాంగ విరుద్ధం కాంగ్రెస్ ఎంపీ మనీష్తివారీ డిమాండ్ జమిలి ఎన్నికల బిల్లుపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్ జమిలి ఎన్నికలు నియంతృత్వ పాలనకు నాంది అని వ్యాఖ్యబిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన బిల్లును ఉపసంహరించుకోవాలని టీఎంసీ, డీఎంకే డిమాండ్జమిలి ఎన్నికలు ఎన్నికల సంస్కరణ కాదన్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల కమిషన్కు సర్వాధికారాలు వస్తాయిజమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేనపుడు బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నించిన డీఎంకే జమిలి బిల్లు రాజ్యాంగ విరుద్ధం: ఎంఐఎం అధినేత అసదుద్దీన్జమిలి ఎన్నికలు ఒక లీడర్ ఈగో కోసమే వచ్చిన ఆలోచనరాష్ట్రాల హక్కులను హరిస్తున్నారుబిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాంజమిలి ఎన్నికలకు వైఎస్సార్సీపీ మద్దతులోక్సభలో జమిలి బిల్లులకు టీడీపీ మద్దతుజమిలి ఎన్నికల బిల్లుపై దేశమంతా చర్చ జరగాలి: ఎంపీ రఘునందన్రావు గతంలో కూడా నాలుగు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయిజమిలి ఎన్నికలతో అధ్యక్ష తరహా పాలన జరగదుఈ బిల్లుకు 31 పార్టీలు మద్దతిస్తున్నాయిఇంకా 15 పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉందిఏ పార్టీని మేము బుల్డోజ్ చేయంజమిలి ఎన్నికలు దేశ ప్రజల ఆకాంక్షప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలికాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలిఇండియా కూటమిలో ఇప్పటికే లుకలుకలు ఉన్నాయివన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తప్పనిసరిగా పాస్ అవుతుందని నమ్మకం ఉందిఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్..జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టనున్నారుఈ సందర్భంగా కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసిందిఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరింది సభలోకి వెళ్లేముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం ఉందిసభలోకి రెండు బిల్లులు..జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాటిని ఇవాళ లోక్సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు.20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది.జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది. -
జమిలి ఎన్నికల బిల్లు వాయిదా!
-
పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
-
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం కసరత్తు
-
2027లో జమిలి ఎన్నికలు..?
సాక్షి,న్యూఢిల్లీ:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడిందన్న ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదించాల్సిన బిల్లు కూడా ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కాగా,ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోరని ప్రచారం జరగడం గమనార్హం. -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దుఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. -
ఆ రాష్ట్రంలో యువతుల వివాహ వయస్సు పెంపు
దేశంలో యువతుల వివాహ వయస్సు 18గా ఉంది. అంటే వారికి చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సవరించింది.హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 21 ఏళ్ల వయస్సు వచ్చాకనే ఆడపిల్లలకు వివాహం చేయాలనే నిబంధనను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ తాజాగా యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.ఈ సందర్భంగా మహిళా సాధికారత శాఖ మంత్రి ధని రామ్ షాండిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిషేధించేందుకు బాల్య వివాహ చట్టం 2006ను రూపొందించామని తెలిపారు. లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు యువతుల కనీస వివాహ వయస్సును పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం ఆడపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశామని మంత్రి తెలిపారు. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
వక్ఫ్ బోర్డు బిల్ పై కేంద్రం కీలక నిర్ణయం
-
Gold Scam: క్యారెట్లలో కిరికిరి.. కొనేదంతా బంగారం కాదు!
హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీకి చెందిన ఒక మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి మరో ఆభరణం తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదు. హాల్మార్క్ సెంటర్కు పంపి పరిశీలిస్తే ఆభరణంలో రాగి 16.47 శాతం, వెండి 15.23 శాతం ఉండగా బంగారం 68.12 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఆ ఆభరణాన్ని విక్రయించిన వ్యాపారి ఇచ్చిన రసీదు అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.బంగారంపై మహిళలకుండే మక్కువ అంతా ఇంతా కాదు. బంగారంతో చేసిన ఆభరణాలపై ఉండే క్రేజే వేరు. ధనం లేకున్నా, తులం బంగారం అయినా ఒంటి మీద ఉండాలని సగటు మధ్య తరగతి మహిళలు భావిస్తుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కొత్త బంగారు ఆభరణాలు కొనేవారి సంఖ్య, అన్సీజన్లో పాత బంగారంతో కొత్త ఆభరణాలు చేయించేకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికంగా ఉంటోంది. గతంలో పెళ్లినాడు ఏ నగలైతే పెట్టుకునేవాళ్లో వాటినే భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరించేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.పాత నగలను ఫ్యాషన్కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొనేటప్పుడు ఆ ఆభరణాన్ని మొత్తం బంగారం కిందే లెక్కించి వ్యాపారి డబ్బులు వసూలు చేస్తాడు. అదే కొంత కాలం తర్వాత కొన్న బంగారాన్ని కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, ఆర్థిక అవసరాల కోసం అమ్మడానికో వెళితే అసలు రంగు బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో పేర్కొంటూ వీలైనంత తక్కువ చెల్లించడం సర్వసాధారణం. ఇక వజ్రా భరణాల్లో మేలిమి బంగారం నేతి బీరలో నెయ్యి చందంగానే మారింది. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. సాక్షి హైదరాబాద్మోసం ఇలా..ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నుంచి చిన్నపాటి స్వర్ణకారుడి షాపు వరకు కూడా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటాయి. ఆభరణంలో పటుత్వం కోసం రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్తోనే ఉంటుంది. అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారన్నమాట.హాల్మార్క్ ముద్ర తప్పనిసరివంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్ మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధన మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్మార్క్ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.స్వచ్ఛత...క్యారెట్లలోబంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛత లేదా నాణ్యత కలిగి ఉన్నట్టన్న మాట. ధర కూడా ఆ మేరకే ఉంటుంది. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలుపుతారు. బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్ ద్వారా తెలుస్తోంది. అయితే వాస్తవ నిష్పత్తి, క్యారెట్ల మధ్య తేడాలు.. వ్యాపారులు, ఎప్పుడూ బంగారం కొనుగోళ్లలో మునిగి తేలేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.ఆభరణంలో బంగారమెంత?కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ లెక్క ద్వారా తెలుసు కోవచ్చు. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట. అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో ఉంటుంది. ఇలా ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగు తేలిపోతుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్ ఎక్కువగా ఉందన్నమాట. క్యారెట్లు..రకాలు24 క్యారెట్లు: పూర్తి స్థాయి స్వచ్ఛత/నాణ్యత కలిగిన బంగారం. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఖరీదు ఎక్కువ. ఖరీదెక్కువ, ఆభరణానికి పనికిరాదు.. మరెందుకు ఇది అంటే బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎక్కువగా ఉపయోగ పడుతుంది. కొంతమంది 24 క్యారెట్ల బంగారం (బిస్కెట్) కొని ఆభరణాలు చేయించుకుంటుంటారు.22 క్యారెట్లు: ఇందులో 22 వంతులు బంగారం ఉంటే రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి లోహాలు ఉంటాయి అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 916 కేడీఎం గోల్డ్ లేదా 91.6 కేడీయం గోల్డ్ అని కూడా అంటారు. 18 క్యారెట్లు: ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే.. ఆరు భాగాలు ఇతర మెటల్స్ ఉంటాయి. మొత్తం మీద 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొంటుంటారు.14 క్యారెట్లు: ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. టంచ్ మిషన్లతో ‘పంచ్’నగ నచ్చకనో, పాతబడిందనో, కొత్త మోడల్ మార్కెట్లోకి రావడంతో మార్చుకుందామనో జ్యువెలరీ దుకాణదారుని దగ్గరకు వెళతాం. అప్పుడు పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్ మిషన్లో పరిశీలిస్తారు. మిషన్లో ముందే సవరించిన రీడింగ్తో బంగారం శాతాన్ని నిర్ధారణ చేస్తారు. సాధారణంగా పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగా నిర్ధారణ చేస్తుంటారు. ఇది టంచ్ మిషన్లతో జరుగుతున్న మోసం. వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్దారుడి దగ్గరే నిర్ధారణ చేయాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్–రే ఫ్లోరోసెన్స్ మిషన్ (కంప్యూటర్ అనుసంధాన యంత్రాల టంచ్ మిష¯Œన్)తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అధికారిక కాగితంపై కాకుండా సాధారణ పేపర్పైనే ప్యూరిటీ పర్సంటేజీలను వేస్తున్నారు.బంగారు పూతనే వన్ గ్రామ్వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం ఎక్కువ జరగడం అందరికీ తెలిసిందే. ఎంతో వ్యయం చేసి ఆభరణాలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఒరిజినల్ బంగారాన్ని తలదన్నేలా కన్పించే ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరిగింది. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూసి వీటిని తయారు చేస్తారు. అందుకే వీటిని వ¯Œన్ గ్రామ్ గోల్డ్గా వ్యవహరిస్తుంటారు. ఇమిటేషన్ (నకిలీ)జ్యువెలరీ కంటే వ¯Œన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు. బంగారం స్వచ్ఛత ఇలా..క్యారెట్ స్వచ్ఛత24 క్యారెట్ 99.923 క్యారెట్ 95.822 క్యారెట్ 91.621 క్యారెట్ 87.518 క్యారెట్ 75.014 క్యారెట్ 58.3బంగారం నాణ్యత పరిశీలన తప్పనిసరిబంగారం కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై అవగాహన అవసరం. నాణ్యత పరిశీలన తప్పనిసరి. చాలవరకు జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేష¯Œన్ మిషన్ వినియోగించడం లేదు. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే సంబంధిత అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్లు సరఫరా చేస్తే తనిఖీలతో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే అవకాశం ఉంటుంది.వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి. హాల్మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే ఆభరణం కొనుగోలు చేయాలి. హాల్మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.– భాస్కర్ కూచన, రిటైర్డ్ అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, హైదరాబాద్ -
రిజర్వేషన్ల పెంపు.. బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీహార్లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది. Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024 -
ఒకే బిల్లు.. చెల్లింపులు రెండు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు నిధుల కటకట ఉండగా, ప్రతీ పనికి ప్రభుత్వం ఒక వైపు ఆచితూచి ఖర్చు పెడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ట్రెజరీ విభాగం మాత్రం ఒకే చెక్కుకు రెండేసి చొప్పున చెల్లింపులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ప్రైవేటు కంపెనీతో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఎస్) అమలు చేయిస్తోంది. దీనిపై ఐదేళ్లుగా ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్టీఓ పరిధిలో ఒకే మొత్తానికి సంబంధించి ఒక చెక్ను స్థానిక అధికారులు క్లియర్ చేయగా, అదే చెక్ను స్థానిక అధికారుల ప్రమేయం లేకుండానే ఆన్లైన్ పద్ధతిలో ఈ–కుబేర్ నుంచి చెల్లించేశారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మార్కెట్ కమిటీ నుంచి గత నవంబర్ 22న వచ్చి న రూ.30,65,987 (టోకెన్ నంబర్ : 2438538332) మొత్తాన్ని ఖజానాలో సరిపోను నగదు లేని కారణంగా ఈ ఏడాది మార్చి 31న రిజెక్ట్ చేశారు. అదే మొత్తం కోసం తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 25న చెక్ను మళ్లీ సబ్మిట్ చేస్తే.. రామన్నపేట ఎస్టీఓ అనుమతితో మే 30న రూ.30,65,987 మొత్తాన్ని సంబంధిత అకౌంట్కు బదిలీ చేశారు. మళ్లీ అదే మొత్తానికి సంబంధించి మరో చెక్ (నం. 251940047) ఎస్టీఓ ప్రమేయం లేకుండానే మరో రూ.30,65,987 మొత్తాన్ని అదే అకౌంట్కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రామన్నపేట సబ్ట్రెజరీ అధికారి (ఎస్టీఓ).. ఉన్నతాధికారులకు నివేదించి, ఆపై రామన్నపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఐడీ, పాస్వర్డ్లను వాడుకుని ఖాతాల నుంచి చెల్లింపులు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎంప్లాయీస్ గెజిటెడ్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వాస్తవ ఖర్చులే ట్రూ అప్ చార్జీలు
సాక్షి, అమరావతి: ట్రూ అప్ చార్జి.. ప్రతి నెలా కరెంటు బిల్లు రాగానే అందులో ఈ చార్జీని చూసి సంబంధం లేని ఏదో చార్జీ వేసేశారని భావిస్తుంటారు. ఈ అమాయకత్వాన్నే ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు, కొన్ని పచ్చ పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. వాస్తవానికి ట్రూ అప్ అంటే వేరే ఖర్చులు కాదు. వినియోగదారులకు సంబంధం లేనివి అంతకన్నా కాదు. విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు పెట్టిన వాస్తవ ఖర్చులే అవి. అది కూడా ఆంధ్రప్రదేశ్ విదుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినవే.ప్రతి ఏటా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులపై విధించే చార్జీలను ఏపీఈఆర్సీనే నిర్ణయిస్తుంది. ఆ ఏడాది యూనిట్కు ఎంత వసూలు చేయాలని ఈఆర్సీ చెబితే అదే రేటును డిస్కంలు వసూలు చేయాలి. కానీ, బహిరంగ మార్కెట్లో ప్రతి రోజూ కొనే విద్యుత్కు అదనంగా ఖర్చవుతుంటుంది. ఉదాహరణకు ఈఆర్సీ అనుమతించిన రేటు రూ.6 అయితే కొన్న రేటు రూ.8 అయితే, పైన పడిన రూ.2 భారాన్ని కొనుగోలు సమయంలో డిస్కంలు పవర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టేస్తుంటాయి. ఆ అప్పులు తీర్చడం కోసం రూ.2 తో కొన్న విద్యుత్ను వినియోగదారులకే అందించినందున ఆ ఖర్చును వారి నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్సీని కోరుతుంటాయి. దీనినే ట్రూ అప్ చార్జీగా పిలుస్తున్నారు.ఖర్చు చేసినంతా కాదుడిస్కంలు నివేదికలో ఇచ్చిన మొత్తాన్ని యథాతధంగా ఆమోదించాలని లేదు. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, అన్ని అంశాలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదించాయి. కానీ నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలను దాదాపు రూ.3,977 కోట్లుగానే ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. 2021–22కు సంబంధించి ప్రతి త్రైమాసికానికి రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది.2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నెల నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి నెలా సర్దుబాటు తరువాత రెండో నెలలో అమల్లోకి వస్తుంది. నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరుకోవడం, థర్మల్ కేంద్రాలలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకూ పెరిగింది. అయినా ప్రస్తుతం డిస్కంలు కమిషన్ ఆదేశాల మేరకు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. 2022–23కు రూ.7,300 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు కోరినా ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు నివేదించిన రూ.10,052 కోట్ల ట్రూ అప్ చార్జీలపైనా ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల్లోకి నెట్టేసింది. సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. అదే విధంగా 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఏపీఈఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్ సంస్థల ఆదాయం బాగానే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది.ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా నిధులు ఇస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఖర్చులు పెరిగినప్పటికీ వ్యవసాయ, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది.2020–21 ఆర్ధిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4800 కోట్లను 2022–23 టారిఫ్లో డిస్కంలు తగ్గించాయి. వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
‘ఉబర్’ రైడ్కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
పబ్లిక్ పరీక్షల బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో అవతకవకలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు–2024కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పత్రాల లీక్ కారణంగా నష్టపోయిన కోట్లాది మంది యువత ఈ తరహా బిల్లు కోసమే ఎదురు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరీక్ష పత్రాలు లీక్చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీల చేర్పు అభినందనీయమని ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలలు అత్యవసరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు అత్యవసరమని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. జమ్మూ కశ్మీర్ షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్డర్ సవరణ బిల్లులు–2024కు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. వేగివాడలో డీఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడలో ‘డిమాన్స్ట్రేషన్ కం సీడ్ ప్రొడక్షన్ ఫారం’ (డీఎస్పీ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ కోచింగ్ అంబేడ్కర్ ఫౌండేషన్ (డీఏఎఫ్)’, అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (డీఏసీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉచిత కోచింగ్ స్కీమ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అవలంభించేందుకు ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల)ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి చొప్పున కేవీకేలు ఉన్నట్టు వివరించారు. మిల్లెట్, ఎర్రపప్పు, బెంగాల్ చిట్రా, కదిరి, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తి కోసం కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొబైల్ సందేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. -
అసెంబ్లీలో యూసీసీ బిల్లు.. విపక్షాల రగడ.. సభ వాయిదా!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ 2024 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ‘వందేమాతరం, జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. దీనిపై పలు ప్రశ్నలు సంధించారు. యూనిఫాం సివిల్ కోడ్పై చర్చించేందుకు సభను మధ్యాహ్నం 2:00 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ రీతూ ఖండూరి భూషణ్ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా సమావేశంలో సభలో ప్రశ్నోత్తరాల సమయం ఉండదని నిర్ణయించారు. యూసీసీపై చర్చతోపాటు రాష్ట్ర ఆందోళనకారులకు రిజర్వేషన్లపై సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్ వ్యాపార సలహా కమిటీకి రాజీనామా చేశారు. యూసీసీపై చర్చకు సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యశ్పాల్ ఆర్య మాట్లాడుతూ తాము యూసీసీ బిల్లును వ్యతిరేకించడం లేదని అన్నారు. అయితే రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనల ప్రకారం సభ పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ఆరుగురు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మృతికి సభలో నివాళులర్పించారు. -
UCC Bill: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. యూసీసీపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పోర్చుగీస్ పాలనా కాలం నుండి గోవాలో యూసీసీ అమలులో ఉంది. యూసీసీ కింద వివాహం, విడాకులు, భరణం, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. మంగళవారం సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు. యూసీసీ గురించి ఇటీవల మాట్లాడిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీనివలన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బిల్లుపై సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను అభ్యర్థించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాను ఆమోదించి, ఫిబ్రవరి 6న బిల్లుగా సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు సంపుటాలలో 740 పేజీలతో కూడిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రికి సమర్పించింది. 2022లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీపై చట్టం చేసి, రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 2000లో ఏర్పడిన ఉత్తరాఖంఢ్లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 2022 మార్చిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో యూసీసీ అమలుపై హామీనిచ్చింది. కాగా మంగళవారం అసెంబ్లీలో యూసీసీపై చర్చ జరగనున్న సందర్భంగా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకుంటే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. -
పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్.. లోక్సభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్ -
‘ఎక్స్’లో హాట్టాపిక్గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
గేర్బాక్స్ రిపేర్కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్..
కారులో సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవాలంటే ఖర్చు వేలల్లో ఉంటుంది, అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో గేర్బాక్స్లో సమస్యను పరిష్కరించుకోవడానికి ఏకంగా ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా కారు ఇంజిన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే.. ఇలాంటి సమస్యలే తలెత్తుతూ ఉంటాయి. ఇటీవల ఫోక్స్వ్యాగన్ అమియో కారులోని DSG గేర్బాక్స్ ఇంజిన్లో సమస్య తలెత్తడంతో దానిని రిపేర్ చేసుకోవడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బిల్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గేర్బాక్స్లో సమస్యను పరిష్కరించుకోవడానికే.. ఇంత బిల్ వచ్చిందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫోక్స్వ్యాగన్ అమియో యజమాని 2వ, 3వ గేర్ మధ్య అప్షిఫ్ట్ చేసేటప్పుడు, డౌన్షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నట్లు గ్రహించి సర్వీస్ సెంటర్కు వెళ్లి తన సమస్యను తెలియజేశాడు. డీఎస్జీ గేర్బాక్స్లో పెద్ద సమస్య ఉన్నట్లు గుర్తించి, దానిని రిపేర్ చేయడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ గేర్బాక్స్లో ఎక్కడ సమస్య ఉందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు. -
బిల్లు ఎగ్గొడదామని చూశారు..కెమెరాకి చిక్కారు..
-
పైరసీకి అడ్డుకట్ట వేస్తాం
‘‘పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఓ సినిమా నిర్మాణానికి పడ్డ కష్టం పైరసీ వల్ల వృథాగా పోతోంది. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది’’ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ఈ విషయమై శుక్రవారం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో,ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించాం. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న పైరేటెడ్ కంటెంట్పై నోడల్ ఆఫీసర్స్కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు 48 గంటల్లో ఆ కంటెంట్ను ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించేలా చర్యలు చేపడతారు’’ అని చెప్పుకొచ్చారు. -
బొగ్గు దిగుమతుల బిల్లు రూ.3.85 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది బొగ్గు దిగుమతులపై రూ.3.85 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో దేశం మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం నుండి 21 శాతానికి తగ్గింది. అయితే భారతదేశం ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల (ఎంటీ) కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశం నుంచి భారీ విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహానికి దారితీస్తోంది. అడవుల సంరక్షణకు పెద్దపీట: బొగ్గు మంత్రిత్వశాఖ ఇదిలా ఉండగా, అడవులను సంరక్షించే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచనలను పట్టించుకోకుండా బొగ్గు గనులను వేటినీ వేలం వేయలేదని కూడా స్పష్టం చేసింది. ఉదాహరణకు, లెమ్రు ఎలిఫెంట్ కారిడార్ పరిధిలోకి వచ్చే బొగ్గు గనులను డి–నోటిఫై చేయాలన్న ఛత్తీస్గఢ్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు లెమ్రు ఎలిఫెంట్ కారిడార్కు ఆవల ఉన్న ప్రాంతాలను కూడా మినహాయింపు కోసం పరిశీలించినట్లు పేర్కొంది. ఛత్తీస్గఢ్లో 10 శాతం నిల్వలు ఉన్న 40కి పైగా కొత్త బొగ్గు బ్లాకులను బొగ్గు తవ్వకాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. దట్టమైన హాస్డియో–అరాండ్ బొగ్గు క్షేత్రం పరిధిలోని తొమ్మిది బొగ్గు గనులను కూడా బొగ్గు బ్లాకుల తదుపరి రౌండ్ వేలం నుంచి దూరంగా ఉంచిన్నట్లు తెలిపింది. అదేవిధంగా, తదుపరి వేలం ప్రక్రియ నుండి మూడు లిగ్నైట్ గనులను మినహాయించాలన్న తమిళనాడు అభ్యర్థన కూడా అంగీకరించినట్లు పేర్కొంది. ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు... అటవీ ప్రాంతాలను వేలంలో పెట్టాలని పరిశ్రమ డిమాండ్లు ఉన్నప్పటికీ వాటిని రక్షించడం మా బాధ్యత అని మంత్రిత్వశాఖ స్పష్టంగా సూచిస్తోంది’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త అసెంబ్లీలో బిల్ పాస్..
-
ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..
సైదాబాద్: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కుతోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చేశారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్ణం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలను బీజేపీ గాలికొదిలేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న వ్యవస్థలో ఓబీసీలకు ప్రభుత్వం ఏం ప్రాధాన్యత ఇస్తుందో చెప్పాలని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ ప్రస్తావనే లేదని అన్నారు. మద్దతు ఇస్తున్నాం.. కానీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్న రాహుల్ గాంధీ.. కుల గణన చేపట్టి అత్యధిక జనాభా ఉన్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి మారేప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై రాహుల్ ప్రశ్నించారు. 90లో ముగ్గురు మాత్రమే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నారని రాహుల్ చెప్పారు. బడ్జెట్లో కేవలం 5 శాతం మాత్రమే వారి ఆధీనంలో ఉందని అన్నారు. కుల గణన చేయడంతోపాటు మహిళా బిల్లులో ఓబీసీలకు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే అమలు చేయండి.. పంచాయతీ రాజ్ వ్యవస్థే మహిళలకు అధికారం ఇచ్చిందని, అన్నాళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు మరో కీలక పరిణామం అని ఆయన అన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి తీసుకురావడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈ బిల్లు అమలులోకి రావాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని అన్నారు. ఇదీ చదవండి: కొత్త పార్లమెంటులో లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు. -
నారీ శక్తికి వందనం.. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు లోక్ సభలో "నారి శక్తివందన్" బిల్లుపై చర్చ
-
ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? .. ఆ(మె) బిల్లు వెనక
మహిళలకు చట్ట సభల్లో, ముఖ్యంగా లోక్సభ, అసెంబ్లీల్లో మూడో వంతు రిజర్వేషన్లు.. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నఅంశం. అదే సమయంలో, అంతేకాలంగా విజయవంతంగా పెండింగ్లోనూ ఉన్న అంశం. అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపేవే. కానీ తీరా సదరు పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆమోదం పొందకపోవడం, చివరికి సంబంధిత లోక్ సభ కాలపరిమితి తీరడం, దాంతో బిల్లుకు కూడా కాలదోషం పట్టడం... ఇదీ వరస! 1989లో తెరపైకి... మహిళలకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం దివంగత ప్రధాని రాజీవ్ గాందీతో మొదలైంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన హయాంలో, అంటే 1989లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అయితే అది లోక్ సభలో ఆమోదం పొందింది గానీ రాజ్యసభలో గట్టెక్కలేదు. అనంతరం తెలుగు తేజం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా 1992, 1993లో ఈ మేరకు 72 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఉభయ సభలూ ఆమోదించాలి. అలా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని స్థానాలు, చైర్ పర్సన్ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేందుకు ఇది దోహదం చేసింది. దేవేగౌడ నుంచి మన్మోహన్ దాకా.. లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ తొలిసారిగా 1996లో దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కారు పార్లమెంటులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. కానీ లోక్ సభా ఆమోదం పొందలేక అది కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999ల్లోనూ, ఆ తర్వాత 2002, 2003ల్లోనూ నాలుగుసార్లు బిల్లు పెట్టినా మోక్షానికి నోచుకోలేదు. 2004లో యూపీయే ఈ అంశాన్ని తమ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చాక 2008లో మన్మోహన్ సింగ్ సర్కారు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అక్కడినుంచి స్టాండింగ్ కమిటీకి వెళ్ళడం, దాని నివేదికను కేంద్రం ఆమోదించడం, చివరికి రాజ్యసభ మహిళా బిల్లును ఆమోదించడం జరిగిపోయాయి. అయితే అదంతా సులువుగా ఏమీ జరగలేదు. బిల్లును వ్యతిరేకించిన పలువురు ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటికి పంపి మరీ ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంతా చేస్తే, ఆ బిల్లు దిగువ సభ అయిన లోక్ సభ ముందుకు రానే లేదు. చివరికి 2009లో 15వ లోక్ సభ రద్దుతో అలా పెండింగులోనే ఉండిపోయింది. కాకపోతే శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం పొందింది గనక నేటికీ కాలదోషం పట్టకుండా అలాగే ఉంది. ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడింట ఒక వంతు,అంటే 33 శాతం స్థానాలను కేటాయించడం దీని ముఖ్యోద్దేశం. ఈ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం, లోక్ సభలో మంగళవారం ఈ మేరకు ప్రవేశపెట్టడం తెలిసిందే.ఆ మూడు అసెంబ్లీల్లో అత్యధికం... అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఛత్తీస్గఢ్ దే! అయితే అక్కడ వారు ఎందరున్నారో తెలుసా? కేవలం 14.4 శాతం! 13.7 శాతంతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 12.35 శాతంతో జార్ఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి. 15 అసెంబ్లీల్లో 10% కన్నా తక్కువ... గోవా, గుజరాత్,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,ఒడిశా, సిక్కిం, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం. 7 అసెంబ్లీల్లో 0–12% కన్నాతక్కువ... బీహార్, హరియాణా,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ. లోక్సభలో 15 శాతమైనా లేరు... లోక్ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78.మొత్తం సంఖ్య 543లో ఇది 15 శాతం కూడా కాదు. రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్లుండి రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు
-
ఆర్టీసీ ఉద్యోగులు.. ఇక ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.? డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు. -
టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళి సై ఆమోదం
-
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్భవన్ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్భవన్కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్భవన్కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్భవన్ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్భవన్కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్భవన్కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోమహిళా బిల్లు ఆర్.కృష్ణయ్య డిమాండ్
కాచిగూడ (హైదరాబాద్): పా ర్లమెంట్ ప్రత్యేక సమావేశా లలో మహిళా బిల్లు పెట్టాల ని, మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేకసభ కోటా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శని వారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మా ట్లాడుతూ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని అన్నారు. మహిళా బి ల్లులో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించక పోతే మహిళా బిల్లుకు సార్ధకత లేదన్నారు. మ హిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతోపాటు వి ద్యా, ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50శాతం టికెట్లు ఇవ్వాలని, బీసీలకు అన్యాయం చేసే పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. -
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్పోర్టల్లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్పోర్టల్లోనూ అప్లోడ్ చేయాలి. -
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు. గవర్నర్ కావాలనే ఆపుతున్నారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది. -
శాండ్విచ్ కట్ చేసి, తినేలోపు ఊహించని షాక్.. ఈ రెస్టారెంట్కి వెళ్లకూడదు బాబోయ్!
సాధారణంగా రెస్టారెంట్లో తిన్నాక ఆర్డర్ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్లో చూస్తాం. ఏ హాటల్కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్ మాత్రమే కాదు ప్లేట్స్కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్గా మారింది. రెండు పీసులకే ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్న ఓ బ్రిటీష్ టూరిస్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్ రాగానే శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు. శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్తో వాదించకుండా బిల్ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్షాట్ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్లో రెస్టారెంట్కు ఒక స్టార్ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది. -
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్ను నియమించుకొని ఎన్నికల కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించారు. -
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం -
లోక్సభలో పాసైన డేటా పరిరక్షణ బిల్లు
ఢిల్లీ: దేశ పౌరుల డిజిటల్హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు.. లోక్సభలో ఎట్టకేలకు పాసైంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఆగస్టు 3న లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘గోప్యత’ దెబ్బతింటుందన్న విపక్షాల అనుమాన ఆందోళనల నడుమే ఇవాళ బిల్లు పాస్ కావడం గమనార్హం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ మంత్రి(సహాయ) రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో.. వ్యక్తుల నుంచి సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం గనుక పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లుతో సోషల్ మీడియా కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఈ బిల్లు భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో సేకరించిన.. ఆఫ్లైన్లో సేకరించి డిజిటలైజ్ చేయబడిన వాటి ప్రాసెసింగ్కు వర్తిస్తుంది. ► వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలి. ► డేటా విశ్వసనీయులు డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి, డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాని ప్రయోజనం అందించిన తర్వాత డేటాను తొలగించడానికి బాధ్యత వహిస్తారు. ► సమాచారాన్ని స్వీకరించే, సరిదిద్దే, తొలగించే హక్కు, ఫిర్యాదులను పరిష్కరించే హక్కుతో సహా వ్యక్తులకు ఈ బిల్లు నిర్దిష్ట హక్కులను అందిస్తుంది. ► రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నిరోధం వంటి కారణాలతో బిల్లులోని నిబంధనలను అమలు చేయడం నుంచి ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు. ఇదీ చదవండి: కుటుంబ పాలన.. క్విట్ ఇండియా -
గవర్నర్కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ పాపం తెలిసో తెలియకో అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. ఎందుకు పని పెట్టుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగారు. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్నవే. మొత్తం మీద గవర్నర్కు జ్ఞానోదయమై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపి పంపినందుకు సంతోషం. ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లో పడింది. నేను రవాణా మంత్రిగా అంకితభావంతో పనిచేసి రూ.14 కోట్ల నష్టంలోని సంస్థను రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. శక్తిసామర్థ్యాలుంటే సంస్థ నష్టాలను పూడ్చవచ్చు. కానీ డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి చేయిదాటింది. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, తగిన డబ్బిస్తామని నడిపించుకోవాలని చెప్పాం. లాభాలు తీసుకురావాలని బెస్ట్ ఐపీఎస్ అధికారిని నియమించాం. మంచి అనుభవమున్న బాజిరెడ్డి గోవర్దన్ను చైర్మన్ను చేశాం. వారు విశ్వప్రయత్నాలు చేసినా డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. డీజిల్ లీటర్ రూ. 60 నుంచి రూ.110 కావడంతో ఆమాంతంగా ఖర్చు పెరిగి రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇటీవల కేబినెట్లో.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపొద్దని అనుకున్నామని, ఇప్పుడేం చేద్దామని చర్చించాం. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత. పైగా ఆర్టీసీని తీసేయడానికి లేదు. అది మంచి నైపుణ్యాలున్న సంస్థ. జీరో యాక్సిడెంట్తో ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. కానీ అది మనుగడ సాగించే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వమే సాకాలి. మరో దారిలేదు. ఇప్పటికే ఏడాదికి బడ్జెట్లో పెట్టి మరీ రూ.1,500 కోట్లు వారికి ఇస్తున్నాం. ప్రభుత్వంలో లేదన్న పేరే తప్ప గవర్నమెంటే సాదుతోంది. కాబట్టి ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఉద్యోగులకు భద్రత వస్తుంది. సంస్థకు చిక్కులు పోతాయనే ఉద్దేశంతో విలీనం నిర్ణయం కేబినెట్లో తీసుకున్నాం’ అని కేసీఆర్ వివరించారు. భూములపై కన్ను అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. ‘గతంలో వద్దన్నవారే మళ్లీ ఎట్లా తీసుకున్నారని పిచ్చివాగుడు చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఏ పనిచేసినా ఓ బాధ్యతతో, దృక్పథంతో, పరిశీలనతో చేస్తుంది. ఇక సగం సగం ఎందుకు పూర్తిగానే బాధ్యత తీసుకుందామని నిర్ణయించాం. మరో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులను పెట్టి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని కొందరు దుర్మార్గులు, నీచులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంటి పిల్లవాడిని సాదుకోవాలి తప్ప చంపుకోలేము. మరిన్ని సౌకర్యాలు పెంచి, అవసరమైతే మరిన్ని స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా సరీ్వసులు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవి వారికి కూడా వస్తాయి’ అని సీఎం తెలిపారు. -
‘విలీనానికి’ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాజ్భవన్లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు సిఫారసులతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో విలీనంపై మూడురోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయ్యింది. ముగిసిన హైడ్రామా ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్భవన్కు పంపింది. అయితే బిల్లు పరిశీలనకు సమయం కావాలని 3వ తేదీన రాజ్భవన్ ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో అదే రోజు బిల్లును పరిశీలించిన గవర్నర్ తమిళిసై 5 సందేహాలపై ప్రభుత్వ నుంచి వివరణలు కోరారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు రాజ్భవన్ను ముట్టడించి ధర్నా నిర్వహించగా, ప్రభుత్వ ప్రొద్బలమే ఇందుకు కారణమని రాజ్భవన్ ఆరోపించింది. కాగా ప్రభుత్వం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్.. ఈ నెల 5న రెండోసారి మరికొన్ని సందేహాలకు సమాధానాలను కోరగా, ప్రభుత్వం వెంటనే ఆ మేరకు వివరణలు పంపించింది. రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఎట్టకేలకు ఆదివారం బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలి ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం తర్వాత కూడా సంస్థ భూములు, ఆస్తులపై యాజమాన్య హక్కులను ఆర్టీసీ సంస్థే కలిగి ఉండాలి. సంస్థ అవసరాల కోసమే వాటిని వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలి. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలి. బకాయిల చెల్లింపు బాధ్యతను తీసుకోవాలి. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పారితోశాకాలు, జీతభత్యాలు, పే స్కేలు, సర్విసు నిబంధనలు, బదిలీలు, పదోన్నతులు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలి. వైద్యపరంగా అనర్హులు(మెడికల్లీ అన్ఫిట్)గా మారే ఉద్యోగులు కారుణ్య నియామకం కింద తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోరే సదుపాయాన్ని కల్పించాలి. అత్యంత కఠినంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను సరళీకరించి మానవీయంగా మార్చాలి. అందరికీ సమాన ప్రయోజనాలు ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర సర్విసు నిబంధనల మేరకు సమాన ప్రయోజనాలు, జీతాలు, పీఎఫ్ చెల్లించాలి. వారి ఉద్యోగ భద్రతను పరిరక్షించి వారి సేవలను ఇతర శాఖల్లో వినియోగించుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సర్విసులో ఉన్నంత కాలం వారికి ఆర్టీసీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కొనసాగించాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం వైద్య ప్రయోజనాలు అందించాలి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సంస్థ, యూనియన్ల పాత్రే కీలకం. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణను ప్రభుత్వం తీసుకుని, ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్వతంత్ర సంస్థకు లేదా మరేదైనా పద్ధతిలో అప్పగించాలి. నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వాలి. -
నేనైతే సంతకం పెట్టాను.. కానీ అంతా వాళ్ల చేతిలోనే ఉంది
సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కేంద్రం చేతిలో ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తన వద్దకు నివేదిక రాగానే, పరిశీలించిన సంతకం పెట్టినట్టు వివరించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ మార్మోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ మిత్రపక్షం ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర హోదాకోసం తీర్మానం చేసింది. దీనిని రాజ్నివాస్కు పంపించారు. అయితే, దీనిని ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తుంగలో తొక్కేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సమాధానం ఇస్తూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తీర్మాన నివేదిక తనకు జూలై 22న అందినట్టు పేర్కొన్నారు. మరుసటిరోజే తాను పరిశీలించి సంతకం కూడా చేశానని, అదే రోజున కేంద్రం అనుమతి కోరుతూ ఢిల్లీకి పంపించినట్టు వివరించారు. నిబంధనల పరంగా ఇందులోని అంశాలను కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వరకు రాష్ట్ర హోదా ఫైల్లో సంతకం పెట్టానని, అమల్లోకి రావాలంటే కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
-
ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్ తమిళిసై
-
కార్మికులకు అండగా ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు. తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు? ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్లో ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్భవన్ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్భవన్’
సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు రాజ్భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్భవన్లోకి వెళ్లి గవర్నర్తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్భవన్లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్లో వదిలేశారు. -
ఆర్టీసీ బిల్లు జాప్యంపై బండి సంజయ్ కామెంట్లు
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ బిల్లు విషయంలో తొందరపాటు పనికి రాదని.. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తోందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇవాళ(శనివారం) తొలిసారి ఆయన సొంత జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టు వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై భుజాలపై తుపాకీ పెట్టి ఈ ప్రభుత్వం కాల్చాలని చూస్తోంది. గవర్నర్ను రెండు రోజుల్లోనే పరిశీలించి ఆమోదించాలంటే ఎలా?. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు సంబంధించిన బిల్ అది. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే ఇంతలా పరిశీలన చేస్తారు. ఇలాంటి బిల్స్ లో ఏ గవర్నరైనా ఇలానే పరిశీలిస్తారు అని తెలిపారాయన. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ కానీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై కానీ వ్యతిరేకం కాదని గుర్తించాలి బండి సంజయ్ కోరారు. ఆర్టీసీ కార్మికులు కొంత సంయమనంతో ఉండండి. మీకు సరైన న్యాయం జరుగుతుంది. రేపొద్దున తిరకాసు చేసి.. ఆ నెపాన్ని గవర్నర్పై నెట్టేసే వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసే కుట్ర జరగుతుందోని అని ఆరోపించారాయన. అంతకు ముందు.. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న మోతె వాగు బ్రిడ్జ్, శంకరపట్నం మండలంలో దెబ్బ తిన్న కల్వల ప్రాజెక్టులను సందర్శించారాయన. ఇదీ చదవండి: హలో కేటీఆర్గారూ.. ఇది గుర్తుందా? -
టీఎస్ఆర్టీసీ బిల్లు రగడ: గవర్నర్ అడిగిన వివరణలపై సర్కార్ రిప్లై
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. దీనిపై రాజ్భవన్కు అధికారులు రిప్లై పంపించారు. ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. విలీనం అయిన తర్వాత విధివిధానాలో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఏపీలో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని తెలంగాణ సర్కార్ తెలిపింది. కాగా, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు. చదవండి: ఆర్టీసీ విలీనం: గవర్నర్, కేసీఆర్ సర్కార్ పంచాయితీ.. ‘బట్టకాల్చి మీదేస్తున్నరు’ -
మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్
-
రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత.. గవర్నర్తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు
►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్రెడ్డి తెలిపారు. ►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ►రాజ్భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు. ►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్భవన్ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది. రెండు గంటల బంద్లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
నేడు ఆర్టీసీ ఉద్యోగుల రాజ్భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్భవన్ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
వచ్చి రెండు రోజులేగా అయ్యింది.. టైం పడుతుంది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్కు నడుమ మధ్య జరుగుతున్న కోల్డ్వార్ తెలిసిందే. ఈ క్రమంలో.. ‘బిల్లుల పెండింగ్’ అంశం కూడా హాట్ టాపిక్గా ఉంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాల్సి ఉండగా.. గవర్నర్ నుంచి అందుకు అనుమతులు రాలేదు. ఈ తరుణంలో.. రాజ్భవన్ స్పందించింది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఆ సంస్థ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బిల్లును రూపొందించింది.. ఆర్థికపరమైంది కావడంతో దానిని గవర్నర్కు పంపింది కూడా. అయితే రెండు రోజులు గడిచినా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఆమె అనుమతి ఇస్తేనే అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగేది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుండగా.. మరోవైపు ఈ పరిణామంపై రాజ్భవన్ వర్గాలు స్పందిస్తూ.. బుధవారం మధ్యాహ్నాం ఆర్టీసీ బిల్లు రాజ్భవన్కు చేరింది. కాబట్టి గవర్నర్ ఈ బిల్లును పరిశీలించడానికి కొంత సమయం పడుతుంది. పైగా న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమయం కావాలి అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: ‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’ -
సినిమా అంటే హీరో ఒక్కడే కాదు: రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్లో అధికభాగం హీరోల రెమ్యునరేషన్లేనని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు. సినిమా కోసం పనిచేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని తెలిపారు విజయసాయి రెడ్డి. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని ఆయన కోరారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదీ చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? -
13 గంటలు ఆటోలో ఊరంతా తిరిగి.. డ్రైవర్ డబ్బులు అడిగేసరికి..
ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని సైబర్ సిటీలో ఒక మహిళ హల్చల్ చేసింది. జ్యోతి అనే ఈ మహిళ మేదాంత హాస్పిటల్ సమీపంలో ఒక ఆటోను రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకుంది. మర్నాటి ఉదయం 11 గంటల వరకూ అదే ఆటోలో పలుచోట్ల తిరిగింది. ఈ సమయంలో ఆటోవాలా ఆమెను ఎక్కడకు వెళ్లాలో సరిగ్గా చెప్పండి.. లేదంటే డబ్బులిచ్చి, ఆటో దిగిపోండి అని అన్నాడు. ఆటో డ్రైవర్ దీపక్ డబ్బులు అడగగానే ఆమె నానా హంగామా చేసింది. డబ్బులడిగితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. దీంతో ఈ విషయమై ఆటో డ్రైవర్ గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో డ్రైవర్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఒక యాప్ ద్వారా గత రాత్రి ఆమె ఆటో బుక్ చేసుకున్నదని, ఉదయం 11 గంటల వరకూ ఆటోలో ఇటునటు తిప్పాలని కోరిందన్నాడు. తరువాత ఆటో బిల్లు వెయ్యి రూపాయలు అయ్యిందని చెప్పగానే, ముందు పేటీఎం చేస్తానని చెప్పిందని, తరువాత గొడవకు దిగిందని తెలిపాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
రెస్టారెంట్లో మహిళకు వింత అనుభవం.. పాటలు విన్నారని ఊహించని షాక్ ఇచ్చారు!
రెస్టారెంట్కు స్నేహితులతో కలిసి వెళ్లి.. టేస్టీ పుడ్ని లాగించేసి కాసేపు సరదాగా గడిపేసి రావడం అంటే అందరికీ ఇష్టమే. అయితే సాధారణంగా రెస్టారెంట్ అంటే బిల్ కాస్త ఖరీదుగానే ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా సన్నద్ధంగానే ఉంటాం. మహా అయితే భోజనం ధరలు కాస్త ఎక్కువగా ఉండడం, సర్వీస్ ఛార్జీ వంటివి ఊహిస్తాం. అయితే బ్రిటన్లోని ఓ రెస్టారెంట్కు వెళ్లిన మహిళకు వెయిటర్ ఇచ్చిన బిల్ చూడగానే ఊహించని షాక్ తగిలింది. బిల్లో ఇలాంటివి కూడా వేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోని నెట్టింట షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్లోని ఓ మహిళ తన స్నేహితులంతా కలిసి సరదాగా రెస్టారెంట్కు వెళ్లింది. ఇంకేముందు చిట్ చాట్ మొదలుపెట్టిన కాసేపటి ఆర్డర్ పెట్టిన పుడ్ వచ్చేసింది. కబుర్లు చెప్పుకొంటూ వాటిని ఆరగించారు. చివర్లో వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి షాక్ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం నడుస్తోంది. యాజమాన్యం ఆ పాటలు విన్నందుకు 8 పౌండ్లు బిల్లో చేర్చింది. ఏం చేయాలో తోచక వారు బిల్లు చెల్లించి బయటకు వచ్చేశారు. తరువాత తమకు ఇలాంటి అనుభవం ఎదురైందంటూ రెస్టారెంట్ నిర్వాహకులు ఇచ్చిన రసీదును సోషల్మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇలాంటివి యూకేలో మునుపెన్నడూ లేవంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ బిల్లులో మరికొన్ని ఫీజులు ఉండటంతో రెస్టారెంట్ యాజమాన్యం పుడ్ లవర్స్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: 2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ విజ్ఞప్తులు -
వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది.. ప్రజలు భోజనాల నుంచి ఫాస్ట్గా రెడీ అయ్యే ఫాస్ట్పుడ్స్పై మొగ్గు చూపుతున్నారు. అందుకే హోటల్స్ అనే కాకుండా పుట్పాత్లపై కూడా ఫాస్ట్ పుడ్ సెంటర్లకి గిరాకీ పెరుగుతోంది. ఈ కేటగిరి ఆహారంలో బయట పుడ్కి ప్రత్యామ్నాయంగా మ్యాగీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం రెండు నిమిషాల్లోనే నోరూరించే వంటకం సిద్ధం కావడంతోపాటు దీని ధర కూడా తక్కువే. ఇంకేముంది చిన్నారుల నుంచి పెద్దల వరకు మ్యాగీని ఎగబడి తింటున్నారు. అయితే అదే మ్యాగీ ఎయిర్పోర్టులో కొంటే ఆ బిల్ చూసి ఓ యూట్యూబర్కి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే ఆ బిల్ని ఫోటో తీసి నెట్టింట పెట్టి.. ఈ షాకింగ్ విషయాన్ని సోషల్మీడియాలో షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ ఇటీవల ఎయిర్పోర్ట్లో ఉండగా ఆకలేసింది. సరే ప్రయాణం కాబట్టి తీరిగ్గా తినే టైం లేదని మ్యాగీ ఆర్డర్ చేశాడు. అనుకున్నట్లుగా మ్యాగీ రావడం మనోడు కడుపునిండా తినేశాడు. అయితే చివరిలో వెయిటర్ తెచ్చిన బిల్ చూసి ఆ యూట్యూబర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మ్యాగీ మసాలా నూడుల్స్ ధర రూ. 184గా చూపించి దానికి జీఎస్టీ రూ. 9.20 జోడించడంతో రూ. 193.20 బిల్లు అయింది. చేసేదేమిలేక ఆ వ్యక్తి బిల్లు చెల్లించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బిల్ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘వామ్మో.. మరీ ఇంత ధరకు అముతున్నారా.. ఈ ధరకు బిర్యానీ వస్తుందని కొందరు కామెంట్ చేయగా... ఎయిర్పోర్టులో ధరలు అలానే ఉంటాయంటూ మరొకరు కామెంట్ చేశారు. చదవండి: వీడియో: బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని.. -
బుట్టాయిగూడెంలో తమ్ముళ్ల పరువు పాయే.. పాత బిల్లుతో బొక్కబోర్లా!
ద్వారకా తిరుమల: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చిమ్మాలన్న దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకుడు చివరికి భంగపడ్డారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటన వివరాలున్నాయి.. బుట్టాయిగూడేనికి చెందిన నోముల రాంబాబు పూరి గుడిసెకు 2021 అక్టోబర్ నుంచి 2022 నవంబర్ వరకు (13 నెలలకు) రూ.26,660 విద్యుత్ బిల్లు వచ్చిం ది. అతను అధికారులను సంప్రదించగా, అంత బిల్లు రావడానికి మీటరు జంప్ అవడమే కారణమని తెలుసుకున్నారు. 2022 నవంబర్ 30న రూ.16,840 బిల్లును మినహాయించి, మిగిలిన రూ.9,820 చెల్లించాలని సూచించారు. పైగా, రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. అప్పటి నుంచి అతడికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోంది. అయితే రాంబాబు పాత బకాయితో పాటు ఆ తర్వాతి నెలల బిల్లులు కూడా చెల్లించలేదు. అతని బకాయి రూ.10,150కు చేరింది. దీంతో అధికారులు నెల క్రితం అతని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రాంబాబు ఈ నెల 7న రూ.2 వేలు మాత్రమే చెల్లించాడు. అయితే అధికారులు మొత్తం బిల్లు చెల్లించాలని సూచించారు. గోపాలపురం టీడీపీ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం అక్కడికి వచ్చారు. ఆయనకు రాంబాబు పాత బిల్లు చూపాడు. వెంటనే ఆయన పాత బిల్లు పట్టుకొని పూరి గుడిసెకు వేలల్లో బిల్లు వచ్చిం దంటూ రోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు అది పాత బిల్లని తేలడంతో నాలుక్కరుచుకున్నారు. ప్రతి నెలా ఎస్సీ సబ్సిడీ వస్తోంది ప్రభుత్వం గతేడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రతి నెలా విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని, అతనికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోందని భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణ తెలిపారు. పాత బిల్లు బకాయికి సంబంధించి రాంబాబు శనివారం మరో రూ.500 చెల్లించాడని, దాంతో అతడి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. బిల్లు నెలకు రూ.26,660 వచ్చిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్బాటిల్కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
మద్దతుదారులకు ట్రంప్ షాక్.. అంత పని చేశాడా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్ధతుదారులకు షాక్ ఇచ్చాడా?. తాజాగా రహస్య పత్రాల వ్యవహారంలో ఫ్లోరిడా మియామీ కోర్టుకు హాజరైన ఆయన.. దారిలో లిటిల్ హవానాలోని ఓ క్యూబన్ రెస్టారెంట్కు వెళ్లాడు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ట్రంప్ రెస్టారెంట్కు వెళ్లిన సమయంలో జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే వాళ్లను ఉద్దేశించి ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ అంటూ బిల్లు తానే కడతానంటూ గట్టిగా అరిచి ప్రకటించాడాయన. దీంతో అక్కడున్నవాళ్లంతా ఎగబడి మరీ తిండి కోసం పోటీ పడ్డారు. అయితే కాసేపటికే అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పది నిమిషాల తర్వాత గప్చుప్గా ట్రంప్ అక్కడికి వెళ్లిపోవడంతో కంగుతినడం మద్దతుదారుల వంతు అయ్యింది. ట్రంప్ ఇంత పని చేస్తాడా? అని నిరాశకు లోనయ్యారంతా. ట్రంప్ ఆ రెస్టారెంట్లో పది నిమిషాలు మాత్రమే గడిపాడు. ఎలాంటి ఆర్డర్ చేయలేదని తెలుస్తోంది. అయితే.. అక్కడ నుంచి వెళ్లిన ట్రంప్ మాత్రం తన ప్రైవేట్ ప్లేన్లో మెక్డొనాల్డ్స్ ఫుడ్ను ఆరగించాడని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి. Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles: report https://t.co/TxZ0I949ZA Kind of like when he left people out in the cold at one of rally’s. He had no buses to take people home he bussed in. — James Tate (@JamesTate121) June 15, 2023 JUST IN: Trump supporters left empty-handed after he promised 'food for everyone' at Miami's Versailles Idiots 😂😂😂 I guess they had to go home and drink some more kool-aid pic.twitter.com/dsK3UImpTy — CoffeyTimeNews (@CoffeyTimeNews) June 15, 2023 Mr. Generosity showed up at a restaurant and shouted "food for everybody". He then left without paying a cent. And this is the face of rhe republican party. https://t.co/6va9vvwVPR — Dan ain't Q (@dan6654) June 15, 2023 -
అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు!
వాషింగ్టన్: అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్ మెంగ్ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గ్రేస్ మెంగ్ వర్చువల్గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం. ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. మరో ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్మ్యాన్ శేఖర్ కృష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్ కృష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే. ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్ హాలీడేస్ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తో పాటు ఫెడరల్ హాలీడేస్(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్లో న్యూఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్డే, మెమొరియల్ డే, జూన్టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్గివింగ్ డే, క్రిస్మస్ డేలు ఉన్నాయి. -
మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి. హైదరాబాద్లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి. 570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 33 కేసుల పరిష్కారం... ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి. -
ఫారిన్ ఏజెంట్ బిల్లుపై రణరంగంగా జార్జియా
తిబ్లిస్: జార్జియా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక బిల్లు రణరంగానికి దారితీసింది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ నిరసనకారులు రాజధాని తిబ్లిస్లోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. నిరసనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులకు, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు జురాబ్ జపారిడ్జ్ సహా 66 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జురాబ్ను బాగా కొట్టినట్టుగా కూడా వార్తలు వెలువడ్డాయి. జార్జియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుపై స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రకారం 20 శాతానికి పైగా విదేశీ నిధులు కలిగిన స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు తమని తాము విదేశీ ఏజెంట్లుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రకటించుకోకపోతే జైలు శిక్షతో పాటుగా భారీగా జరిమానాలు విధిస్తారు. -
ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
సాక్షి, చెన్నై: విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం గడువును ఆ శాఖ తాజాగా పొడిగించింది. శనివారం అధికారులతో జరిగిన సమావేశం అనంతరం మంత్రి సెంథిల్ బాలాజీ ఈమేరకు వివరాలను వెల్లడించారు. వివరాలు.. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు లింక్ చేసిన వారికే విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పిస్తామని తొలుత ప్రకటించారు. దీంతో విద్యుత్ వినియోగదారులలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో సాంకేతిక సమస్యలు, ఆన్లైన్లో నమోదులో జాప్యం వంటి సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. డిసెంబరు 31వ తేదీ వరకు వినియోగదారులకు గడువు ఇచ్చారు. అయితే శుక్రవారం నాటికి 1.63 కోట్ల మంది వినియోగదారులు మాత్రమే తమ ఆధార్ను అనుసంధానం చేసినట్లు వెలుగు చూసింది. దీంతో జనవరి 31వ తేదీ వరకు మరో గడువు ఇస్తున్నట్లు విద్యుత్ శాఖమంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఇదే చివరి అవకాశం అని, ఈ నెలాఖరులోపు ఆధార్ను అనుసంధానించ ని పక్షంలో ఆ తదుపరి చర్యలకు వినియోగదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు -
'ప్రేమంటే ప్రేమే!' ఆ బిల్లుపై తక్షణమే గర్వంగా సంతకం చేస్తా: జో బైడెన్
అమెరికా సెనేట్ స్వలింగ, కులాంతర వివాహాలను రక్షించడానికి సంబంధించిన కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు 12 మంది రిపబ్లికన్లతో సహా 61 మంది సభ్యుల్లో దాదాపు 36 మంది సభ్యుల ఆమోదం లభించింది. ఈ మేరకు సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమేర్ మాట్లాడుతూ...ఈ చట్టం చాలా కాలంగా వస్తోంది కానీ ఇప్పుడే ఆమోదం లభించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలను సమాఖ్య చట్టంలో పొందుపరిచేలా చేసింది ఈ బిల్లు. అమెరికా నిష్కళంకమైన సమానత్వం వైపు అడుగులు వేసేలా కీలకమైన బిల్లును ఆమెదించిందని అన్నారు. ఈ బిల్లు ప్రకారం యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల వివాహం చేసుకుంటే అది ఆ రాష్ట్రంలో చెల్లుబాటు అయితే కచ్చితంగా దాన్ని గుర్తించాలి. అలాగే యూఎస్ రాజ్యంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన వివాహాల గుర్తింపుకు పూర్తి హామీ ఇస్తోంది. అంతేగాక యూఎస్ రాష్ట్రాలు తమ చట్టాలకు విరుద్ధంగా వివాహా లైసెన్స్ను జారీ చేయాల్సిన అవసరం ఈ బిల్లుకు లేదు. ద్వైపాక్షిక ఎన్నిక ద్వారా ఈ చట్టాన్ని రూపొందించారు. అంతేగాక స్వలింగ వివాహాలను జరుపుకోవడానికి అవసరమయ్యే వస్తువులు లేదా సేవలను అందించడానికి ఇష్టపడని సంస్థలకు మతపరమైన రక్షణను అందించే సవరణ కూడా ఉంది. ఈ బిల్లు మతస్వేచ్ఛ పునరుద్ధరణ చట్టం రక్షణను తగ్గించడం లేదా రద్దు చేయడం వంటివి చేయకుండా నిరోధించే నిబంధనను కలిగి ఉంది. జూలైలో ఆమోదించిన ఈ బిల్లుపై యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించింది. సెనేట్ నవంబర్లో ఎన్నికల రోజు, జనవరిలో అధికారం చేపట్టే కొత్త చట్టసభల మధ్య ఈ బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ....ఈ ద్వైపాక్షిక ఓటును ప్రశంసించడమే కాకుండా సెనేట్ ఈ బిల్లును ఆమోందించనట్లయితే గర్వంగా ఆ బిల్లుపై సంతకం చేస్తాను. స్వలింగ సంపర్కులైన యువత తాము పూర్తి సంతోషకరమైన జీవితాలను గడిపి, స్వంత కుటుంబాలను రూపొందించుకునేలా ఈ బిల్లు చేస్తోంది. సెనేట్ రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్ని ఆమెదించడంతో అమెరికా ఒక ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించే అంచున నిలబడి ఉంది. 'ప్రేమనేది ఎప్పటికే ప్రేమే' అమెరికన్లు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే హక్కును కలిగి ఉండాలి. అని బైడెన్ అన్నారు. (చదవండి: చిన్నారికి అత్యవసర శస్త్ర చికిత్స...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు) -
ఈ రెస్టారెంట్ బిల్ చూస్తే....వాట్? అని నోరెళ్లబెడతారు!
రెస్టారెంట్కి వెళ్తే బిల్ కచ్చితంగా వేలల్లోనే ఉంటుంది. ఎంతకాదనుకున్న ఒక మనిషికే ఏదో ఒక్క వైరైటీ లాగించిన.... సాధారణంగా తక్కువలో తక్కువ కనీసం రూ. 1000 నుంచి రూ. 1200ల వరకు అవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చాలా ఏళ్ల కిందట అంటే 1985ల్లోని రెస్టారెంట్ బిల్ ఒకటి నెట్టింట వైరల్ తెగ అవుతోంది. అందులో రెసిపీల ఖరీదు వింటే ఆ! అని నోరెళ్ల బెట్టకుండా ఉండరు. వివరాల్లోకెళ్తే....ఢిల్లీలో లజపతి నగర్ ప్రాంతంలో ఉన్న లాజీజ్ రెస్టారెంట్ అండ్ హోటల్ డిసెంబర్ 20, 1985 నాటి రెస్టారెంట్ బిల్ని ఫేస్బుక్లో షేర్ చేసింది. అందులో కస్టమర్ షాహీ పన్నీర్ , దాల్ మఖ్నీ, రైతా, కొన్ని చపాతీలు ఆర్డర్ చేశాడు. అతను ఆర్డర్చేసిన వాటిల్లో మొదటి రెండు రెసీపీలు రూ. 8, మిగతా రెండు రెసీపీలు ఒక్కొక్కటి రూ. 5, నుంచి రూ. 6 రూపాయాలు మాత్రమే. మొత్తం బిల్ కేవలం అక్షరాల రూ. 26\-రూపాయలే. ప్రస్తుతం ఈ ఖరీదుకి ఒక చిప్స్ పాకెట్ మాత్రమే కొనుక్కోగలం. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అందరూ వాట్ ఇది నిజమేనా! అని షాక్ అయ్యారు. నెటజన్లంతా ఔను నాటి కాలంలో పెట్రోల్ ధర, జీతం కూడా తక్కువగానే ఉన్నా అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు అంటూ నాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. (చదవండి: ఘోస్ట్ పేషెంట్తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు) -
ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు!
టర్కీకి చెందిన ప్రముఖ చెఫ్ నుస్రెత్ గోక్సె.. 'సాల్ట్ బే'గా చాలామందికి సుపరిచితమే. రెస్టారెంట్లో ఆహార పదార్థాలపై మోచేతి పైనుంచి ఉప్పుచల్లే ఈయన తీరుతో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు దేశాల్లో రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో ధర కాస్త ఎక్కువే. గతేడాది లండన్లో ఈయన రెస్టారెంట్లోని ధరలు చూసి అందరూ అవాక్కయ్యారు. మరీ ఇంత ఎక్కువా అని వాపోయారు. ఇప్పుడు అబుధాబిలోని సాల్ట్ బేకు చెందిన నుస్రే-ఈటీ రెస్టారెంట్లో ఓ బిల్లు చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ బిల్లు మొత్తం 6,15,065 దిర్హాంలు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. అక్షరాలా రూ. కోటి 30 లక్షలు. మొత్తం 10 మంది కలిసి అబుధాబిలోని సాల్ట్ బే రెస్టారెంట్కు వెళ్లారు. ఎక్కువగా ఆల్కహాలే ఆర్డర్ చేశారు. అందులో చాలా ఫేమస్ అయిన పిట్రస్ వైన్ కూడా ఉంది. 2009 నాటి ఈ వైన్కే దాదాపు రూ.కోటి రూపాయల బిల్లు అయింది. ఇతర ఫుడ్, వ్యాట్తో కలిపి మొత్తం రూ.1.3 కోట్ల బిల్లు అయింది. ఈ బిల్లు రషీదును స్వయంగా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు సాల్ట్ బే. 'నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు'ని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. మరీ ఆ రేంజ్లో ధరలు ఏంటని సాల్ట్బేను కొందరు ఏకిపారేశారు. కొంతమందైతే అతడ్ని అన్ఫాలో కూడా చేశారు. ఎందుకంత ధర..? అయితే ఈ బిల్లులో ఫ్రెంచ్ ఫ్రైస్ ధర 45 డాలర్లు(రూ.3,600)గా ఉంది. దీంతో ఓ నెటిజన్.. బంగాళాదుంపలు ఏమైనా చంద్రుడిపై కాస్తున్నాయా? ఎందుకంత ధర అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైన్కీన్ బీరు ధర కూడా 55 డాలర్లుగా ఉంది. ఇది ఒక్క బీరు ధరా? లేక 12 బీర్ల ప్యాక్కా? అని ఓ యూజర్ సెటైర్లు వేశాడు. మరో నెటిజన్ అయితే.. సాల్ట్ బేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవ్వు పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి స్వతహాగా ఈ స్థాయికి చేరుకున్నావు. నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. కానీ నీ రెస్టారెంట్లో ధరలు ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి. కేవలం సంపన్నుల కోసమేనా. నువ్వు చెఫ్ కాదు చీప్ అంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు సాల్ట్ బే మాత్రం ఈ బిల్లుపై వస్తున్న విమర్శలు అసలు పట్టించుకోలేదు. తన స్టయిల్లోనే ముందుకు సాగుతున్నాడు. ఓ స్టీక్కు(కాల్చిన మాంసం ముద్ద) గోల్డ్ కోట్ చేసి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఫెడరల్ బ్యాంక్ 24 క్యారట్ల బంగారంతో ఈ స్టీక్కు కోటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు మరోసారి షాక్ అయ్యారు. చదవండి: కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా.. -
కొత్త డేటా ప్రైవసీ చట్టం.. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఇవే!
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను నిర్దిష్ట దేశాలకు బదిలీ చేసేందుకు, అక్కడ నిల్వ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త డేటా ప్రైవసీ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం భారత్కు వెలుపల ఏయే దేశాలు, ప్రాంతాలను ఎంచుకోవచ్చనేది నోటిఫై చేయనుంది. అలాగే సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించనుంది. శుక్రవారం ఈ మేరకు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) బిల్లు 2022 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిపై డిసెంబర్ 17లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. భారత్కు సంబంధించిన డేటాను దేశీయంగానే నిల్వ చేయాలంటూ గత బిల్లులో చేసిన ప్రతిపాదనలు పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. తాజా మార్పులతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి సంస్థలకు ఊరట లభించనుంది. పార్లమెంటు ఆమో దం పొందాక ముసాయిదా బిల్లు .. చట్టంగా మారుతుంది. వ్యక్తిగత డేటా విషయంలో ఒకవైపు వ్యక్తుల హక్కులు, బాధ్యతలను మరోవైపు డేటా సేకరించే సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తూ ఈ బిల్లును రూపొందించినట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. చట్టబద్ధత, పారదర్శకత తదితర ఏడు సూత్రాల ప్రాతిపదికన బిల్లును తయారు చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వివరించింది. ‘పౌరుల డేటా రక్షణ, పరిశ్రమకు వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడం, దేశ భద్రత.. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా బిల్లు రూపొందింది‘ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వివాదాస్పద అంశాలు తొలగించి డేటా బిల్లును సరళతరం చేశారని న్యాయ సేవల సంస్థ జేఎస్ఏ పార్ట్నర్ రూపీందర్ మాలిక్ పేర్కొన్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. ► వ్యక్తిగత డేటాను సేకరించే ముందు వ్యక్తుల సమ్మతి తీసుకోవాలి. సదరు డేటాను షేర్ చేయడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో డేటాను సేకరించిన వ్యక్తులు, కంపెనీలపై రూ. 500 కోట్ల వరకూ జరిమానా విధించవచ్చు. 2019లో జారీ చేసిన గత ముసాయిదాలో ఈ పెనాల్టీని రూ. 15 కోట్లు లేదా కంపెనీ గ్లోబల్ టర్నోవరులో 4% (ఏది ఎక్కువైతే అది)గా ప్రతిపాదించారు. ► అలాగే ఏదైనా పత్రం, సర్వీసు, గుర్తింపు ధ్రువీకరణ లేదా చిరునామా ధ్రువీకరణ కోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు. ► దేశ సార్వభౌమత్వం, సమగ్రత కాపాడేందుకు రాష్ట్ర ఏజెన్సీలకు బిల్లులోని నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ► కంపెనీలు తాము సేకరించిన డేటాను నిర్దిష్ట వ్యవధి వరకే నిల్వ చేసుకోవచ్చు. ► డేటా సేకరించే సేకరించే సంస్థలు.. నిబంధనల పాటింపు కోసం డేటా రక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుండి వచ్చే ఫిర్యాదులను కూడా ఈ బోర్డు వినాలి. ► యూజర్లు తమ సమ్మతిని తెలియజేసేందుకు, సమీక్షించుకునేందుకు, ఉపసంహరించుకునేందుకు ఆయా కంపెనీలు పారదర్శకమైన ప్లాట్ఫాంను అందుబాటులో ఉంచాలి. ► వ్యక్తిగత డేటాను సరిచేసుకునేందుకు, తొలగించేందుకు యూజర్లకు హక్కులు ఉంటాయి. ► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించకూడదు. ప్రాసెస్ చేయకూడదు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు ఇవ్వకూడదు. ► భారీ కంపెనీలు తాము ప్రాసెస్ చేసే డేటా పరిమాణాన్ని బట్టి .. నిబంధనల పాటింపును మదింపు చేసేందుకు స్వతంత్ర డేటా ఆడిటర్ను నియమించుకోవాలి. ► డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ముసాయిదాలో ఉంది. ఇది నిబంధనల ఉల్లంఘన కేసులను విచారణ చేసి, తగు నిర్ణయాలు తీసుకుంటుంది. ► వ్యక్తిగత డేటాను స్వయంగా లేదా డేటా ప్రాసెసర్లతో ప్రాసెస్ చేసే డేటా ఫిడ్యుషియరీ సంస్థలకు వివిధ రకాల జరిమానాలుంటాయి. చదవండి: ‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ -
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అపాయింట్మెంట్ కోరాం.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్భవన్కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు -
అసలేం జరుగుతోంది?.. ముదురుతున్న వివాదం.. సబిత వ్యాఖ్యలపై స్పందించిన రాజ్భవన్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై వివాదం ముదురుతోంది. యూనివర్శిటీ బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్భవన్ వర్గాలు స్పందించాయి. గవర్నర్ నుంచి లేఖ రాలేదనడం సరికాదని, యూనివర్శిటీల బిల్లు వ్యవహారంపై మెసెంజర్ ద్వారా నిన్ననే(సోమవారం) సమాచారం ఇచ్చామని రాజ్భవన్ పేర్కొంది. చదవండి: తెలంగాణలో పొలిటికల్ హీట్.. ప్రధాని మోదీ పర్యటనపై వివాదం కాగా, ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్భవన్కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సోమవారం గవర్నర్ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. కొంతకాలం నుంచి రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. ఈ క్రమంలో ప్రగతిభవన్, రాజ్భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్ హెలికాప్టర్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. -
ఏ ‘వెలుగులకు’ ఈ కొత్త చట్టం?
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 2014 నుంచీ జరుగుతున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నప్పటికీ ఈ దఫా మాత్రం 2003 నాటి విద్యుత్ చట్టంలో మార్పులు చేయాలనే పట్టుదలను కేంద్రం కనబరుస్తోంది. ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నాయనీ, దాని నుంచి బయటపడవేసేందుకే ఈ కొత్త చట్టమనే అభిప్రాయాన్ని కేంద్ర విద్యుత్శాఖ పెద్దలు చెబుతున్నారు. ఇది అంతి మంగా డిస్కంలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకేనని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు–2022పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యుత్ చట్టం–2003లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తెచ్చేందుకు 2014 నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై గతంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. 2019లో కూడా మరోసారి ప్రయత్నం జరిగింది. మెజార్టీ రాష్ట్రాలు, విద్యుత్ ఉద్యో గులు, రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరోసారి కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం వ్యతిరేకతను లెక్క చేయకుండా చట్టం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. మరోసారి అదే వ్యతిరేకత వచ్చిన ఫలితంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు –2022 కాస్తా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెంతకు చేరింది. అయినప్పటికీ గెజిట్ల జారీ ద్వారా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తూ కేంద్రం ముందుకే అడుగులు వేస్తోంది. దేశంలోని డిస్కంల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లకు చెల్లించాల్సిన బకాయిల వ్యవహారం కేంద్రానికి కొత్త మార్పులకు ఊతమిస్తోందని చెప్పకతప్పదు. 1998–99 నుంచి విద్యుత్ రంగంలో తెచ్చిన కాలానుగుణ సంస్కరణలు డిస్కంలు, జెన్ కోలను కాపాడలేకపోయావనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. దేశ వ్యాప్తంగా 57 డిస్కంలు ఏకంగా 1.40 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. ఇందులో ఆయా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం రూ.76 వేల కోట్లు ఉండగా... మిగిలిన 64 వేల కోట్ల మేర ఆయా ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు. అయితే, విద్యుత్ను తీసుకున్నందుకుగానూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో)లకు డిస్కంలు రూ.1.10 లక్ష కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అటు డిస్కంలు, ఇటు జెన్కోలను కాపాడే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త చట్టం తెస్తున్నామనేది కేంద్ర పెద్దల ఉవాచ. విద్యుత్ పంపిణీ రంగంలో కేవలం ఒకరే కాకుండా ఎక్కువ మంది ఉండాలనీ, తద్వారా డిస్కంలలో పోటీతత్వంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయనీ కేంద్రం చెబుతోంది. అందుకే డిస్కంలల్లో ప్రైవేటీకరణకు తాజా చట్టం తెరలేపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో ప్రైవేటు డిస్కంలు సేవలందిస్తు న్నాయి. ఇక ఒడిశాలో ఏకంగా 4 ప్రైవేటు డిస్కంలు విద్యుత్ పంపిణీ రంగంలో పనిచేస్తున్నాయి. అయితే, మరింత విస్తృతంగా కొత్త నెట్ వర్క్ అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న నెట్వర్క్లోనే ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకే కొత్త చట్టం వస్తోందని తెలు స్తోంది. దీనితో పాటు కొత్త చట్టంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని విద్యుత్రంగ నిపుణులు చెబుతున్నారు. అవి: 1. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్, సభ్యుల నియామకానికి త్రిసభ్య కమిటీ స్థానంలో నలుగరు సభ్యుల కమిటీని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ ప్రతి నిధి ఇందులో భాగస్వామ్యం కానున్నారు. తద్వారా రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చనుందన్న విమర్శలు వస్తున్నాయి. 2.ఒక రాష్ట్రం కాకుండా 2,3 రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ను రాష్ట్రాల ఈఆర్సీలు కాకుండా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈ ఆర్సీ) ఇవ్వనుంది. తద్వారా రాష్ట్రాల ఈఆర్సీల పాత్ర నామ మాత్రంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 3.విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే నేరుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే అధికారం జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ల చేతుల్లోకి వెళ్లనుంది. తద్వారా రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఎస్ఎల్డీసీ) అధికారం కుంచించుకుపోనుందన్న ఆందోళన నెలకొంది. 4. ప్రస్తుతం ఉన్న చట్టంలో యూనివర్సల్ సప్లై ఆబ్లిగేషన్ అనే నిబంధన ఉంది. ఒక రైతు కోసం కూడా కొత్తగా లైన్ల అవసరం ఏర్పడితే డిస్కంలు వేయా ల్సిందే. తాజా చట్టంలో ఈ ఆబ్లిగేషన్ను తొలగించారు. తద్వారా సామాన్య వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చట్టంపై మరింత లోతైన చర్చ జరగాల్సిందేనన్న వైఎస్సార్సీపీ అభిప్రాయా నికి సానుకూల స్పందన వస్తోంది. అనుమానాలు నిజమేనా? ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ చట్టం–2003లో రూపొందిం చారు. కాలక్రమంలో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సవరణలు చేసి కొత్త బిల్లును తెరమీదకు తెచ్చింది ఇప్పుడే. అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త బిల్లు ముందుకు వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ బిల్లులోని కొన్ని అంశాలు కేంద్ర వైఖరిపై అనుమానం వ్యక్తం చేసే విధంగానే ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం సెక్షన్ 14, 42లల్లో ఏమని పేర్కొన్నారంటే... ‘‘విద్యుత్ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ కోసం ఏ సంస్థకైనా, ఏ వ్యక్తికైనా సంబంధిత కమిషన్ లైసెన్స్ను జారీచేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ పొందిన సంస్థ లేదా వ్యక్తులు తమ పరిధిలోని వినియోగ దారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ నెట్వర్క్ (విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) వగైరా)ను సొంతంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.’’ అయితే, కొత్త బిల్లులో ఈ రెండు క్లాజ్లలో మార్పులు చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో పాటు, ఇప్పటికే ప్రభుత్వరంగ డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్ పంపిణీ నెట్వర్క్ను ఉపయోగించే వెసులుబాటును కల్పించారు. ఈ రెండు క్లాజులలో చేయనున్న మార్పులను గమనిస్తే ప్రైవేటు సంస్థలకు విద్యుత్ పంపిణీ రంగంలోకి బార్లా తలుపులు తెరుస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ప్రస్తుతం మునిసిపాలిటీ/ జిల్లా పరిధిలో మాత్రమే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులకు అవకాశం ఉండేది. తాజాగా సెప్టెంబరు 8వ తేదీ కేంద్రం విడుదల చేసిన గెజిట్లో మాత్రం మునిసిపాలిటీ/ మూడు జిల్లాలతోపాటు ఏదైనా పేర్కొన్న చిన్న ప్రాంతంలో కూడా విద్యుత్ పంపిణీ లైసెన్సును పొందే అవకాశం ఉందని పేర్కొంది. ((తద్వారా కేంద్రం తాజా అడుగులు మరింత ఆందోళనను పెంచే విధంగానే ఉన్నాయని చెప్పకతప్పదు.)) విస్తృత చర్చ జరగాల్సిందే! ఏడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా 52 అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలకూ అధికారం ఉంటుందని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో విద్య, ధరల నియంత్రణ, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ వంటి అంశాలతో పాటు విద్యుత్ కూడా ఒక అంశం. ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఏవైనా మార్పు చేర్పు లతో పాటు కొత్త చట్టాలు చేసే సమయంలో రాష్ట్రాల అభిప్రాయం కూడా కేంద్రం తీసుకోవడం పరిపాటి. ముసాయిదా విద్యుత్ (సవ రణ) నిబంధనలు–2022 విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై అనేక పార్టీలు గుర్రుమంటున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై కొత్త చట్టం తెస్తున్న నేపథ్యంలో దీనిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ప్రతిపాదించిన బిల్లులో ఉన్న లోపాలు, చేయాల్సిన మార్పులపై కూడా తన అభిప్రాయాన్ని పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. భిన్న అభిప్రాయాలు, అనుమానాల నేపథ్యం లోనే పార్లమెంటులో ఆగస్టు 8న కేంద్రం ఈ ముసాయిదాను ప్రవేశ పెట్టింది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో చివరకు విద్యుత్పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ముందు ఉంచనున్నట్టు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. దీంతో వివాదం కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగింది. విశాల ప్రజానీకంలో నెలకొన్న సందే హాల నివృత్తి తర్వాతే కేంద్రం ముందుకు వెళితే ఆమోదయోగ్యంగా ఉంటుంది. – కె.జి. రాఘవేంద్రారెడ్డి సీనియర్ జర్నలిస్ట్ -
Tele-Communications Bill 2022: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ సేవలకూ లైసెన్స్
-
పౌరుల డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ►రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ►కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ►రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ►చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్గా మారుస్తుంది. ►భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ►అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
టాయిలెట్ బిల్లుకు జీఎస్టీ ఘటన!! ఐఆర్సీటీసీ వివరణ
ఢిల్లీ: జీఎస్టీ.. దేశంలో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. నిత్యావసరాల మొదలు.. చాలావాటిపై కేంద్రం జీఎస్టీ వడ్డన చేయడంతో.. సోషల్మీడియాలోనూ విపరీతమైన విమర్శలు వినిపించాయి. తాజాగా టాయిలెట్కు వెళ్లినా ఫారినర్లకు భారీ బిల్లుతో పాటు అందులో జీఎస్టీ సైతం పడడంతో కంగుతిన్నారు. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగింది. ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో వాష్ రూమ్ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు భారీ బిల్లు ఫ్లస్ జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో దిగారు. వాళ్లను శ్రీవాస్తవ అనే గైడ్ రీసివ్ చేసుకున్నాడు. అయితే.. స్టేషన్లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి తీసుకెళ్లారు శ్రీవాస్తవ. కేవలం ఐదు నిమిషాల్లో వాళ్లు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఐదు, పది రూపాయలు.. మహా అయితే రూ. 20 ఇవ్వాల్సి వస్తుందని శ్రీవాస్తవ భావించారు. కానీ, అక్కడి రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు చేతిలో పెట్టడంతో.. ఆయన షాక్ అయ్యారు. ఐదు నిమిషాల పాటు వాష్ రూం వాడుకున్నందుకు ఒక్కొక్కరి బిల్లు రూ. 100లు వేశారు. పైగా దానిపై జీఎస్టీ రూ. 12 జత చేశారు. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, సిబ్బంది ఒత్తిడితో చివరికి చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఐఆర్సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి ప్రవేశానికి ప్రత్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పారు. అంతేకాదు లాంజ్లో ఉన్నంతసేపు టూరిస్టులు, ఫారినర్లు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని, కాంప్లిమెంటరీగా కాఫీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ స్టేషన్లో వాష్రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథి దేవో భవ పిలుపును ఐఆర్సీటీసీ అవమానిస్తోందని, ఇలా చేయడం వల్ల విదేశీయులు ఇక్కడి వ్యవస్థలపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యవహారంపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. సోమవారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదన్న ఆయన.. కింది స్థాయి లో కూడా ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కింద స్థాయిలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయన్న సంగతిని వైఎస్సార్సీపీ ఎంపీ గుర్తు చేశారు. -
PDP Bill: ‘గోప్యత’ బిల్లు మళ్లెప్పుడో!
దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పీడీపీ) బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. 2019 డిసెంబర్ 11న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపారు. ఏళ్ల తరబడి సాగిన తర్జనభర్జనల అనంతరం జేపీసీ 81 సవరణలు ప్రతిపాదించింది. దీంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును మళ్లీ ప్రవేశపెడతామనీ, ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నామనీ ప్రకటించింది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఇందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు లభించడమే. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోప్యత కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. కానీ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలు – జాతీయ భద్రత, శాంతి భద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే జేపీసీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు సూచించడంతో... ప్రభుత్వం తాత్కాలికంగా బిల్లును వెనక్కి తీసుకుంది. – డా. ఎం. సురేష్ బాబు, ప్రజా సైన్సు వేదిక అధ్యక్షులు -
ఐదు తులాల బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో ఐదు తులాల బంగారు నాణేన్ని ఆర్డర్ చేశాడో వ్యక్తి. సీల్డ్బాక్స్లో బిల్ ఇన్వాయిస్ మాత్రమే పంపించిందా దుకాణం. నష్టపరిహారంగా 18 శాతం వడ్డీతో నగదు ఇవ్వాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రవిచంద్ర (24) 2016 డిసెంబర్ 17న ఆన్లైన్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కు చెందిన 50 గ్రాముల బంగారాన్ని హైదరాబాద్లోని షాపర్స్స్టాప్లో ఆర్డర్ చేశాడు. అందుకోసం రూ.1,53,091 చెల్లించాడు. ఆరమెక్స్ కొరియర్ ద్వారా బంగారం పంపుతున్నట్లు 2016 డిసెంబర్ 22న మలబార్ గోల్డ్ నుంచి సమాచారం వచ్చింది. కానీ డిసెంబర్ 26న ఇ–కామ్ ఎక్స్ప్రెస్ కొరియర్ ద్వారా సీల్డ్బాక్స్ వచ్చింది. అనుమానాస్పదంగా ఉన్న ఆ కవర్ను వీడియోగ్రఫీ సాయంతో తెరిచి చూడగా, అందులో గోల్డ్ కాయిన్ లేదు. కేవలం రూ.1,53,091కి సంబంధించిన బిల్లు మాత్రమే ఉంది. దీంతో అతను వీడియోను జత చేస్తూ షాపర్స్స్టాప్ హైదరాబాద్, ముంబై ఆఫీసుల్లో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో 2017లో హైదరాబాద్లోని వినియోగదారుల ఫోరం–1 కోర్టును ఆశ్రయించాడు. 2019 ఫిబ్రవరి 5న ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై షాపర్స్స్టాప్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎస్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలను, సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్కె జైస్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్ధించారు. వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని, అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇచ్చేంతవరకు 18 శాతం వడ్డీతో ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక రూ.50 వేల నష్టపరిహారం, రూ.10వేలు ఖర్చుల కింద చెల్లించాలని, ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని తీర్పులో పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!) -
గవర్నర్ అధికారాల కోతలో దీదీ సక్సెస్!
పశ్చిమ బెంగాల్లో గవర్నర్ అధికారాలకు మరింత కోత పెట్టింది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఆసక్తిరేపిన ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది బెంగాల్ అసెంబ్లీ. బీజేపీ వ్యతిరేకత కూడా ఇక్కడ పని చేయకపోవడం గమనార్హం. యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా వ్యవహరించాల్సిన గవర్నర్ ప్లేస్లో.. ఇకపై సీఎం వ్యవహరించాలన్నది ఆ బిల్లు ఉద్దేశం. కోల్కతా: యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా గవర్నర్ బదులు.. సీఎం వీసీగా వ్యవహరించే బిల్లుకు West Bengal University Laws (Amendment) Bill, 2022 సోమవారం ఆమోదం తెలిపింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ. డెబ్భై మందికిపైగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నా.. బిల్లు పట్ల నిరసనలు వ్యక్తం చేసినా.. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 40 ఓట్లు మాత్రమే బిల్లు వ్యతిరేకంగా రావడం గమనార్హం. మొత్తం ఓట్లలో 183 బిల్లుకు అనుకూలంగా వచ్చాయి. యూనివర్సిటీ ఛాన్స్లర్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే.. రాజకీయ జోక్యం నేరుగా, అదీ ఎక్కువగా ఉంటుందని, విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అసెంబ్లీ.. ఈ బిల్లును మెజార్టీతో ఆమోదించింది. తర్వాతి దశలో ఈ బిల్లు.. గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. కేబినెట్ సలహా మేరకు ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా కాలం పాటు బిల్లులను తమ వద్దే ఉంచుకుని.. రాష్ట్రపతికి పంపిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీలకు ఛాన్స్లర్ల నియామకంలో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తన అనుమతి లేకుండానే.. 25 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ను నియమించారంటూ ఈ జనవరిలో ఆయన బెంగాల్ సర్కార్పై ఆరోపణలు గుప్పించారు. అయితే శాంతినికేతన్లోని విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీకి ప్రధాని వైస్ ఛాన్స్లర్గా ఉన్నప్పుడు.. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు చాన్స్లర్గా ఎందుకు వ్యవహరించరాదు అంటూ ప్రశ్నిస్తున్నారు బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు. ఇదిలా ఉంటే.. యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాన్ని.. రాష్ట్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం గత నెలలో ఓ బిల్లును ఆమోదించింది. -
ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు
ప్రముఖ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ తన మాజీ భార్యపై విజయం సాధించడంతో ఫుల్ ఖుషి ఉన్నాడు. గృహ హింస, పరువు నష్టం దావా కేసు కోర్టు ఆయనకు అనుకులంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న జానీ డేప్ వరుసగా యూకేలోని మ్యూజిక్ కన్సర్ట్స్కు హజరవుతున్నాడు. ఈ క్రమంలో గిటారిస్ట్ జెఫ్ బెక్తో కలిసి బ్రిటన్లో బర్మింగ్హెమ్లో దర్శనమిచ్చాడు. ఆదివారం సాయంత్రం అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్న జానీ డెప్ రెస్టారెంట్కు అయిదు అంకెల బిల్లు కట్టి షాకిచ్చాడు. చదవండి: ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్ దీంతో జానీ కట్టిన బిల్లు న్యూయార్క్ పత్రికల్లో కథనంగా ప్రచురితమైంది. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా బర్మింగ్హోమ్లోని ‘వారణాసి’ రెస్టారెంట్లో జానీ డెప్ ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి కర్రీపార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్టెయిల్స్, రోజీ ‘ఆంపైయిన్ వంటివి ఏర్పాటు చేశారు. అక్కడి ఇండియన్ డిషెస్ టేస్ట్ చేసిన జానీ డెప్ వాటికి ఫిదా అయ్యాడట. దీంతో రెస్టారెంట్ వెయిటర్స్ని మెచ్చుకుంటూ వారితో కలిసి ఫొటోలు దిగాడు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించిన జానీ చివరగా 50 వేల పౌండ్ల బిల్లు కట్టాడు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 49 లక్షల రూపాయలు. చదవండి: రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్ అగర్వాల్? దీంతో రెస్టారెంట్ యాజమాన్యం ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మహమ్మద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, జానీ డెప్ తమ రెస్టారెంట్లో డిన్నర్కు వస్తున్నట్లు చెప్పారన్నాడు. మొదట జోక్ అనుకున్నానని, ఆ తర్వాత ఆయన భద్రత దృష్ట్యా మొదట సిబ్బంది రెస్టారెంట్ అంతా తనిఖి చేశారని చెప్పాడు. దీంతో నిజమని నమ్మనన్నాడు. ఇక ఈ విందులో శిష్ కబాబ్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా, మసాలా, ట్యాంబ్ కరాహీ, కింగ్ తందూరీ ప్రాన్స్ వంటి వంటకాలు వడ్డించినట్లు తెలిపాడు. కాగా ఇంగ్లాండ్లోని బర్మింగ్హోమ్లో అతిపెద్ద రెస్టారెంట్స్లో ఇండియన్ ‘వారణాసి’ రెస్టారెంట్ ఒకటి. -
వాడని విద్యుత్కు వాచిపోయే బిల్లు
మహబూబాబాద్: వందో..రెండు వందలో కాదు.. ఏకంగా మూడు కోట్లకు పైగా విద్యుత్ బిల్లు వస్తే..? అలాంటి అనుభవమే జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి శ్రీరంగం వెంకటేశ్వర్లుకు కలిగింది. తన ఫ్లాట్కు రూ.3,21,05,218 విద్యుత్ బిల్లు రావడంతో లబోదిబోమంటూ విద్యుత్ అధికారులను సంప్రదించగా సరిచేసి కొత్త బిల్లు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంకటేశ్వర్లు ఫ్లాట్కు గత ఏడాది నవంబర్లో రూ.175 బిల్లు వచ్చింది. ఏడాదికి పైగా ఆ ఫ్లాట్లో ఎవరూ లేకపోవడంతో విద్యుత్ వినియోగం కూడా లేదు. వచ్చే బిల్లును నెలనెలా చెల్లిస్తున్నా.. ఈ నెల రూ.3,21,05,218 బిల్లు వచ్చింది. దీనిపై ఈఆర్వో విభాగం ఏఈ రమేష్ను వివరణ కోరగా.. బిల్లుతీసే మెషీన్లో లోపం వల్ల అంత మొత్తం బిల్లు వచ్చిందని పేర్కొన్నారు. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం సాయంత్రం సరిచేసి రూ.175 బిల్లు ఇచ్చామని ఆయన వివరించారు. (చదవండి: ‘ప్లేట్’ మార్చి.. అమ్మేసి... ) -
వారి మాట వినరా!?
సమస్య ఎవరిదైతే వారి గోడు కదా వినాల్సింది. వారి అభిప్రాయం కదా ఆలకించాల్సింది. ఆ పని చేయకుండానే, సమస్యను పరిష్కరిస్తున్నామంటే దానికి అర్థం ఏముంటుంది! ఆడవారి కనీస వివాహ వయస్సును 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు పెంచేందుకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చూస్తే అలాగే అనిపిస్తోంది అంటున్నారు విమర్శకులు. మన దేశంలో ఆడవారి వివాహ వయస్సు బిల్లును లోతుగా అధ్యయనం చేసే బాధ్యత మీద పడ్డ 31 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళా ఎంపీకి చోటు దక్కడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆడవారి జీవితానికి సంబంధించిన విషయంపైనా మగవాళ్ళే కూర్చొని, మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా అని మహిళా ఎంపీలే కాదు, మహిళా సంఘాలూ వేస్తున్న ప్రశ్న అర్థవంతమైనదే కాదు... సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సినది కూడా!\ మగపిల్లలకు ఇప్పటికే ఉన్నట్టుగా, ఆడపిల్లలకు కూడా కనీస వివాహ వయఃపరిమితిని 21 ఏళ్ళకు పెంచడం స్త్రీ సాధికారతకు తోడ్పడే చర్య అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆడపిల్లలు మరింత చదువుకోవడానికీ, సామాజిక అవగాహన పెంచుకోవడానికీ అది వీలు కల్పిస్తుందని భావిస్తోంది. అందుకు తగ్గట్టే 2006 నాటి బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని సవరించే బిల్లును ప్రభుత్వం ఇటీవలి పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. లోక్సభలో హడా విడిగా ఆమోదింపజేసింది. రాజ్యసభలో విపక్షాల ఒత్తిడితో ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, సూచనలు ఇవ్వడం కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాల్సి వచ్చింది. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ సహా 140 దేశాల్లో కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళే అన్న వాదన ఒకపక్క, తీరా ఈ స్థాయీ సంఘంలోనే లైంగిక సమానత్వం లేకుండా పోవడం మరోపక్క చర్చ రేపాయి. ప్రస్తుతం మన లోక్సభలో 81 మంది, రాజ్యసభలో 29 మంది – మొత్తం 110 మంది మహిళా ఎంపీలున్నారు. కానీ, మహిళలకు సంబంధించిన చరిత్రాత్మక బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన పార్లమెంటరీ సంఘంలోనే స్త్రీలకు కనిష్ఠ ప్రాతినిధ్యం దక్కడం శోచనీయం. అందుకే, ఆ స్థాయీ సంఘంలో చోటు దక్కిన ఏకైక మహిళ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్ నేరుగా ఉపరాష్ట్రపతి సచివాలయానికి లేఖ రాయాల్సి వచ్చింది. దేశంలోని స్త్రీలందరిపైనా ప్రభావం చూపే ఒక నిర్ణయం గురించి చర్చలు జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో వీలైనంత ఎక్కువమంది మహిళలకు చోటివ్వాలి కదా అన్నది సుస్మిత లాంటి అనేకుల వాదన. అంతే కాదు... పార్లమెంటరీ నిబంధనల్లోని 84(3), 275 కింద ఉభయ సభల్లోని ఏ మహిళా ఎంపీ అయినా సరే వ్యక్తిగతంగా కానీ, లిఖితపూర్వకంగా కానీ ఈ ప్రతిపాదిత బిల్లుపై స్థాయీ సంఘానికి తమ అభిప్రాయాన్ని వెల్లడించే వీలు కల్పించాలని కోరుతున్నారు. స్త్రీలు – పిల్లలు – విద్య – యువతరం – క్రీడలపై నెలకొల్పిన ఆ పార్లమెంటరీ స్థాయీ సంఘం బుధవారం తొలిసారి సమావేశమవుతోంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుధే సారథ్యం లోని ఆ కమిటీలో 31 మందిలో 16 మంది బీజేపీ ఎంపీలే. ఏ పార్లమెంటరీ కమిటీకైనా తమ సభ్యు లను నామినేట్ చేసేది రాజకీయ పార్టీలే. ఒక్క టీఎంసీ మినహా పార్టీలన్నీ తమ పురుష ఎంపీలనే నామినేట్ చేయడంతో చిక్కొచ్చిపడింది. పదే పదే స్త్రీల సమస్యలు పరిశీలనకు వచ్చే ఈ మహిళా– శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో వీలైనంత ఎక్కువమంది మహిళలకే ప్రాతినిధ్యం కల్పించడం సమంజసం, సహజ న్యాయం కూడా! ప్రభువులు ఆ శాఖ బాధ్యతలనైతే ఓ మహిళా మంత్రి (స్మృతీ ఇరానీ)కే అప్పగించారు కానీ, స్థాయీ సంఘ సభ్యుల అంశంలో మాత్రం పార్టీలలో ఎందుకో ఆ ఆలోచన కొరవడింది. అదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. లింగ సంబంధమైన కీలక అంశంపై చర్చించే చట్టసభా సంఘంలోనే లైంగిక అసమానత్వం చోటుచేసుకోవడం విడ్డూరమే కాదు... విషాదం. కమిటీలో దాదాపు అంతా మగవాళ్ళే ఉండడం... తెలిసి జరిగినా, తెలియక జరిగినా తప్పక సరిదిద్దుకోవాల్సిన పొరపాటే. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ మొదలు డీఎంకె ఎంపీ కనిమొళి దాకా పలువురు వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని ఆ కోణంలో నుంచే సర్కారు చూడాలి. అలాగే ఈ సంఘంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం తప్పనిసరి. ఆడపిల్లల వివాహ వయసుపై అనేక ఆందోళనలుండే గిరిజన సమాజపు వాణిని వారే వినిపించ గలరు. చిన్న వయసులో పెళ్ళిళ్ళ వల్ల ఆడపిల్లలు పౌష్టికాహార లోపానికీ, మాతృత్వ సమయంలో అనారోగ్యాలకూ గురికావడం ఎక్కువ. ఈ సాధకబాధకాలను స్త్రీలే సరిగ్గా వివరించగలరు. హిందూ, ముస్లిమ్, క్రైస్తవ, పార్సీ – ఇలా దాదాపు 7 వ్యక్తిగత చట్టాలలో సైతం యువతుల వివాహ వయసు సూత్రాలను ఈ కొత్త బిల్లుతో సవరించాల్సి వస్తుంది. ఆ మాటకొస్తే, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికే బీజేపీ చేపట్టిన ఈ డొంక తిరుగుడు బిల్లులు, సవరణలన్నీ అనే విమర్శ కూడా లేకపోలేదు. ఏమైనా, మూడు నెలల్లో తన సూచనలివ్వాల్సిన ఈ కమిటీ... సత్వరమే ఈ బిల్లుతో ప్రభావితమయ్యే భాగస్వామ్య పక్షాలందరి గోడూ వినడం, వాటికి విలువ ఇవ్వడమే అసలైన ప్రజాస్వామిక చర్య. లేదంటే, ప్రపంచానికి పోయే సూచన ఒకటే – ‘ఈ దేశంలో ఇవాళ్టికీ మగవాళ్ళే ఆడవారి హక్కులను నిర్ణయిస్తున్నారు. మహిళలు మౌనప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు’. పాలకులు ఆ నిందను నిజం చేయకపోతే అదే పదివేలు! -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు..!
రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో క్రిప్టో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. తాజాగా క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000కు పైగా క్రిప్టోకరెన్సీ చెలామణీలో ఉందని, రాబోయే రోజుల్లో కేవలం ఒకటి లేదా రెండు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉండవచ్చుని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుత క్రిప్టో ధరలు పూర్తిగా నీటి బుడగలాంటిదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తోన్న క్రిప్టో క్రేజ్ను 17వ శతాబ్దం నాటి నెదర్లాండ్స్ తులిప్ మానియాతో అభివర్ణించారు. చదవండి: క్రిప్టో ప్రపంచంలోనూ స్టార్టప్స్ హవా అన్ రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్..! క్రిప్టో కరెన్సీలను అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్తో రఘురాం రాజన్ పోల్చారు. చిట్ఫండ్స్ నుంచి డబ్బులు పొందిన వారిలాగే క్రిప్టో ఆస్తులు కలిగినవారు కూడా రాబోయే రోజుల్లో బాధపడక తప్పదని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి అసలు వ్యాల్యూ లేదన్నారు. క్రిప్టోలో కొన్ని మాత్రమే చెల్లింపుల కోసం మనుగడ సాగిస్తాయని..వాటిలో కూడా క్రాస్ బార్డర్ పేమెంట్స్ వాడతారని తెలిపారు. భారత్లోని 15-20 మిలియన్ల క్రిప్టో ఇన్వెస్టర్లు సుమారు 5.39 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీను కల్గి ఉన్నారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని లోకసభలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రిప్టో బిల్లులో ఆర్బీఐచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం ప్రేమ్ వర్క్, దేశంలో అన్ని ప్రయివేటు క్రిప్టోల నిషేధం లేదా కఠిన నిబంధనలతో పాటు క్రిప్టో కరెన్సీ అంతర్లీన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చదవండి: క్రిప్టో నియంత్రణకు సమయం ఇదే! -
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ రద్దను బిల్లుని కేంద్రం ప్రవేశపెట్టనుంది. ‘‘ ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్’’ అని లోక్సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్లో పేర్కొంది. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులు ప్రవేశపెడుతుండగా జాబితాలో 25వ అంశంగా వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలన, ఆమోదాన్ని ప్రతిపాదించింది. అయితే, తొలిరోజైన నవంబరు 29నే ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత వారం, ప్రధాన మంత్రి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసన తెలుపుతున్న రైతులను వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో, మూడు చట్టాలను రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాలను అధికారికంగా రద్దు చేసే వరకు నిరసనకారులు వేచి ఉంటారని రైతు నాయకుడు రాకేష్ టికైత్ అన్నారు. అలానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్రం మరో నాలుగు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, పప్పు పంపిణీ చేశారు. దీన్ని మరో నాలుగు నెలలు పొడిగించారు. గడిచిన 15 నెలల కాలానికి గాను ఈ పథకానికి కేంద్రం 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. చదవండి: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు -
ఇక అంతా వ్యక్తిగతమేనా?
స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకుండా జీవితం నడవని పరిస్థితుల్లో... వ్యక్తిగత సమాచార గోప్యత ఓ దేవతా వస్త్రం. సాంకేతికత సాయంతో ఎవరి డేటా అయినా ఇట్టే చేజిక్కించుకోవచ్చన్నది పదే పదే బయటపడ్డ పచ్చి నిజం. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) సోమవారం ఆమోదించిన ‘వ్యక్తిగత సమాచార భద్రత (పీడీపీ) బిల్లు’ నివేదికకూ, సిఫార్సులకూ ఇప్పుడింత ప్రాధాన్యం అందుకే! ప్రైవేట్ సంస్థలను నియంత్రిస్తూనే, కేంద్రానికీ, సీబీఐ – రా– ఈడీ లాంటి సంస్థలకూ మినహాయింపులిస్తూ, విస్తృతాధికారాలు కట్టబెడుతున్నదీ బిల్లు. రెండేళ్ళ చర్చోపచర్చల తర్వాతా కొన్ని అంశాల పట్ల జేపీసీలోని ప్రతిపక్ష సభ్యులు కొందరు అసమ్మతి తెలిపిందీ అందుకే! అయితేనేం, మెజారిటీ జేపీసీ సభ్యుల అంగీకారం పొందిన ఈ తుది నివేదిక, చేసిన సిఫార్సులు ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శీతకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. అసలీ బిల్లు రావడం వెనుక పెద్ద కథే ఉంది. వ్యక్తిగత గోప్యతా హక్కు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందంటూ 2017 ఆగస్టులో ‘జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీమ్ కోర్టు తేల్చి చెప్పడంతో ఈ బిల్లుకు బీజం పడింది. దేశంలో డేటా భద్రతకు సంబంధించి సమగ్ర విధివిధానాలు రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ ఇచ్చిన ఆదేశం దీనికి మూలమైంది. సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో పలువురు నిపుణులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పీడీపీకి చట్టం చేయాలని సిఫార్సు చేస్తూ, ముసాయిదాను తయారుచేసింది. మూడేళ్ళ క్రితం 2018లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ – సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) శాఖకు నిపుణుల కమిటీకి ఆ ముసాయిదాను సమర్పించింది. 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పేర్కొన్న మినహాయింపులపై అభ్యంతరాలు రావడంతో, జేపీసీకి నివేదించారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన జేపీసీ ఈ బిల్లును లోతుగా పరిశీలించి, విస్తృత చర్చలు సాగించి, రెండేళ్ళ తర్వాత ఇప్పుడు తుది ముసాయిదా నివేదికను అందిస్తోంది. జేపీసీలోని కనీసం ఏడుగురు ప్రతిపక్ష సభ్యులు కొన్ని అంశాలలో విభేదించిన ఈ తుది నివేదిక ఎప్పుడో రావాల్సింది. కోవిడ్ సహా అనేక పరిణామాలతో అయిదుసార్లు జేపీసీ గడువును పొడిగించారు. దాంతో రెండేళ్ళ సుదీర్ఘకాలం పట్టింది. ఇప్పటికి నివేదిక, సిఫార్సులు వచ్చాయి. వాటిలోని వివరాలన్నీ పూర్తిగా బయటకు రాలేదు. అలాగే ఆ అంశాలన్నీ రేపు పార్లమెంటు చేసే తుది చట్టంలో ఉంటాయా అన్నదీ ఇప్పుడే చెప్పలేం. అయితే, ప్రాథమికంగా దేశంలోని వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కోసం ఓ నియంత్రణ వ్యవస్థను ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది. వ్యక్తిగతం, సున్నితం, కీలకం – అంటూ వ్యక్తిగత డేటాను 3 వర్గాలుగా వర్గీకరించి, ప్రతి వర్గానికీ ప్రత్యేకమైన విధివిధానాలు నిర్ణయిస్తారు. భారత పౌరుల డేటాతో వ్యవహారాలు నడిపే దేశ, విదేశీ సంస్థలన్నీ ఈ ప్రతిపాదిత చట్టానికి లోబడాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడితే చెల్లించాల్సిన పెనాల్టీలనూ పేర్కొన్నారు. అయితే, అనుమతి లేకుండానే డేటాను వాడుకొనే బిల్లులోని క్లాజు 35 సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికీ అసమ్మతి తెలుపుతున్నాయి. చరిత్రాత్మక సుప్రీమ్ తీర్పు ప్రాతిపదికన శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న ప్రమాణాలకు తగ్గట్టు ఈ బిల్లు లేదని ఓ వాదన. డేటా దుర్వినియోగాన్ని అరికట్టే ‘డేటా రక్షణ ప్రాధికార సంస్థ’ సభ్యుల ఎంపిక విధివిధానాలూ పలచబడ్డాయనేది మరో అభ్యంతరం. దేశభద్రతతో పాటు కొత్తగా ‘ప్రజాజీవన భద్రత’ మిషతోనూ ప్రభుత్వ సంస్థలు ఈ చట్టం పరిధిలోకి రాకుండా, వ్యక్తిగత డేటాను వాడుకొనే వీలుండడం ఇంకో వివాదాస్పద అంశం. ఇది ఈ చట్టం ఉద్దేశాన్నే నీరుగారుస్తోందన్నది ప్రతిపక్షాల అసమ్మతి స్వరం. ప్రభుత్వాలు తల్చుకొంటే, ‘పెగసస్’తో తెలియని నిఘా సాధ్యమైన దేశంలో... ప్రభుత్వసంస్థలకిచ్చే ఈ అతి వెసులుబాటు సైతం దుర్వినియోగం కాదని నమ్మకం లేదు. ప్రతిపక్షాలు, పౌర సమాజం భావన, భయమూ అదే! ప్రైవేట్ సంస్థల నుంచి మన వ్యక్తిగత డేటా లీకు కావడం, వాటిని మూడో వ్యక్తికి అమ్మేయడం లాంటివి దేశంలో అనేకం చూశాం. ఆధార్ మొదలు బ్యాంకు ఖాతాల వివరాల దాకా అనేకం అంగట్లో అమ్మకం కావడమూ చూశాం. చట్టం కానున్న ఈ బిల్లు దాన్ని ఏ మేరకు సమర్థంగా అరికడుతుందన్నది ఇప్పుడు కీలకం. అలాగే, వ్యక్తిగత డేటాను ఎక్కడ, ఎలా సురక్షితంగా భద్రపరుస్తారు, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారన్నదీ కూలంకషంగా చూడాల్సి ఉంది. ఇది వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించే బిల్లు. మరి, గూగుల్ మ్యాప్స్ లాంటి వ్యక్తిగతేతర డేటా భద్రత మాటేమిటి అంటున్న సైబర్ చట్టాల నిపుణుల ప్రశ్నలూ పట్టించుకోవాల్సి ఉంది. నేటి డిజిటల్ ప్రపంచంలో కీలకమైన ఇలాంటి చట్టం తేవడానికి ఈ మాత్రం చర్చ జరగడం ఆనందదాయకం. ప్రజాస్వామ్యానికి ఆరోగ్యదాయకం. ప్రతిపక్ష అభ్యంతరాలతో ఈ బిల్లు ఇదే రూపంలో, ఈ సమావేశాల్లోనే చట్టం రూపం దాల్చకపోవచ్చు. చట్టం రావడానికి ఇంకొద్ది రోజులు పట్టినా పట్టవచ్చు. అయితేనేం, మంచో చెడో అసలంటూ పీడీపీ మీద చర్చ ఇంతదాకా రావడం మంచిదే. ట్విట్టర్, ఫేస్బుక్లకు వాటంగా మారే మధ్యవర్తిత్వ హోదాను తొలగించి, సోషల్ మీడియా వేదికలుగానే ఈ బిల్లులో పరిగణించాలన్న సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫారసూ కీలకమే. ఆ మేరకు ఈ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును స్వాగతించాల్సిందే. లోటుపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించే లోగా, ఓ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటికిది ఓ ముందడుగు. -
క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!
క్రిప్టోకరెన్సీపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29 నుంచి ప్రారంభమై డిసెంబర్ 23న ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం సుమారు 26 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో క్రిప్టోకరెన్సీ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 'క్రిష్టొకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు" ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. క్రిప్టోపై కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్లో అందుబాటులోకి రానుంది. మరోవైపు అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించనున్నుట్లు తెలుస్తోంది. ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని..! క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాగా క్రిప్టోకరెన్సీపై ఓ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. Crypto bill is listed for the #WinterSession #IndiaWantsCrypto https://t.co/Lr4aHdJjhl — Nischal (WazirX) ⚡️ (@NischalShetty) November 23, 2021 చదవండి: ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట.. ఏడాదిలో రూ.25 లక్షలు లాభం! -
ఫోన్ చేసినట్లు అమిత్ షా మీకు చెప్పారా?
సాక్షి, అమరావతి: సమగ్రమైన బిల్లు తీసుకురావాలనుకోవడం వెనకడుగు వేయడమతుందా? చంద్రబాబు ఇలాంటివి తప్పుడు ప్రచారం చేయడంలో దిట్ట అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము వికేంద్రీకరణపై వెనుకడుగు వేయలేదని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటే ఆయన ఖర్మని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెప్పారని, సాంకేతిక సమస్యలను తొలగించి మళ్లీ వస్తామని అన్నారు. అమిత్ షా ఫోన్ చేస్తే బిల్లు రద్దు చేశామనడం అవివేకమని మండిపడ్డారు. ఫోన్ చేసినట్లు అమిత్ షా వీళ్లకు చెప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటివి ప్రచారం చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. మండలి విషయంలోనూ తాము వేసింది వెనుకడుగు కాదని స్పష్టం చేశారు. ఆ రోజు మండలిలో తమ బలాన్ని ఉపయోగించి ప్రతీ దాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేశారని మండిపడ్డారు. అనేక బిల్లులు ఆపింది నిజం కాదా అని నిలదీశారు. అలా ఒక సభను దుర్వినియోగం చేయొచ్చా? అని ప్రశ్నించారు. అందుకే అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం నుంచి స్పందన రాలేదని అన్నారు. మరో వైపు ఇప్పుడు ఆ శక్తుల బలం తగ్గిందని అందుకే మండలి కొనసాగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాజధానిపై రకరకాల ప్రచారం చేస్తున్నారని, కానీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
రాజధాని వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి: బుగ్గన
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఏపీ ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా æ అన్ని ప్రాంతాలకు భాగస్వామ్యం ఉండాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణ–సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధికి ఇంజన్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను పలు రాష్ట్రాలు రాజ«ధానిలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వికేంద్రీకరణతో అభి వృద్ధికి ఊతమిచ్చాయని తెలిపారు. ఉమ్మడి ఏపీలో మాత్రం అన్ని కేంద్ర సంస్థలను హైదరాబాద్లోనే నెల కొల్పడంతో అభివృద్ధి చెందిన ప్రాంతవాసులే విభజన ఉద్యమాన్ని నిర్వహించి సాధించుకున్నారని గుర్తు చేశారు. దీనివల్ల భాషా ప్రతిపదికన ఏర్పడిన ఏపీ 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ విభజన వాదం రాకూడదంటే వికేంద్రీకరణ అవసరాన్ని శివరామకృష్ణన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. వికేంద్రీకరణ ఎంతో అవసరమన్న కమిటీ.. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్ర ప్రదేశ్గా అవతరించింది. 50–60 ఏళ్లలో ఎన్నో సంఘట నలు జరిగాయి. చరిత్ర అనుభవాల నుంచి మనం నేర్చు కున్న పాఠాలను పరిపాలనలో అన్వయించాల్సిన అవస రం ఉంది. హైదరాబాద్ ఒక మహానగరంగా ఏర్పడినందు వల్లే వేర్పాటువాదం వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సారాంశం. విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతో విలువైనది. రాష్ట్రానికి వికేంద్రీకరణ ఎంతో అవ సరమని, పలు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాలో అందులో సూచించారు. మూడు పంటలు పండే విలువైన గుంటూరు, తెనాలి భూములను అనవసరమైన వాటికి వృథా చేయవద్దని కమిటీ పేర్కొంది. ఆ అనుభవాల నుంచి నేర్చుకుందాం.. ఇతర రాష్ట్రా లను చూసి మనం నేర్చుకోవా ల్సింది ఎంతో ఉంది. ఉమ్మడి ఏపీలో బీహెచ్ఈఎల్ లాంటి గొప్ప సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అదే బీహెచ్ఈఎల్ను యూపీకిస్తే హరిద్వార్లోని కొండ ప్రాంతంలో నెల కొల్పారు. తమిళనాడు లోనూ తిరుచ్చిలో పెట్టారు. అక్కడ సేలం అభివృద్ధి చెందడానికీ ఇదీ ఓ కారణం. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థను ఇస్తే హైదరాబాద్లో పెట్టారు. ఒడిశా దీన్ని కోరాపుట్లో ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రభుత్వం నాసిక్లో ఏర్పాటు చేసింది. ఇదేవిధంగా షోలా పూర్లో టెక్స్టైల్స్, కొల్లాపూర్లో ఫౌండ్రీలు, అహ్మద్ నగర్లో ఆటోమొబైల్ సంస్థలు, పుణెలో ఆటో మొబైల్, సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చాయి. ముంబై కాస్మొ పాలిటన్ మహానగరంగా ఎదిగింది. ఇవన్నీ మనం గమనించాలి. మిగతా రాష్ట్రం ఏమైంది? ఐడీపీఎల్ పూర్వ ఉద్యోగుల వల్ల హైదరాబాద్లో వివిధ ఫార్మసీ సంస్థలు ఏర్పాటయ్యాయి. కేంద్రం ఇచ్చిన ఐడీపీ ఎల్ను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో నెలకొల్పితే బిహార్ ప్రభుత్వం ముజఫర్పూర్లో ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్కు ఐడీపీఎల్ ఇస్తే కొండ ప్రాంతం ఉన్న రిషికేశ్లో స్థాపించారు. హెచ్ఎంటీ, బీడీఎల్, ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మిథాని, ఎన్ఎండీసీ, ఎన్ఎఫ్సీ, ఎన్జీఆర్ఐ, ఎన్ఎఫ్డీపీ, డీఎంఆర్ఎల్, హెచ్ సీఎల్, బీఎల్ఆర్ఎల్, ఐఐసీటీ, సీసీఎంబీ, డీఆర్డీవో.. ఇలా అన్నీ తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టడం వల్ల గొప్ప నగరమైంది. మిగతా రాష్ట్రం ఏమైంది? మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక మాదిరిగా అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగలేదు. ఐఐటీ, ఐఎస్బీ, బిట్స్, టిస్ లాంటి ఉన్నతవిద్యాసంస్థలను హైదరాబాద్లోనే నెలకొల్పారు. అన్నీ ఒక్కచోటే కేంద్రీకరించడం వల్ల వేర్పాటువాదం ప్రారంభమైందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. 2013–14లో విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల విలువ రూ.56,500 కోట్లుగా ఉంది. ఇందులో ఒక్క హైదరాబాద్ నుంచే 56 వేల కోట్లు విలువైన వ్యాపారం జరిగింది. విభజన తర్వాతా అదే తప్పిదమా? రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు మళ్లీ అభివృద్ధిని కేంద్రీకతం చేసే బాటలో నడిచారు. శివ రామకృష్ణన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. కృష్ణా జిల్లాలా శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. విజయనగరం జిల్లా గుంటూరుతో సమానంగా ఉండాలి. నెల్లూరుతో తుల తూగేలా చిత్తూరు ఉండాలనే ఆలోచన ఏ పాలకులకైనా వస్తుంది. కానీ చంద్రబాబుకు మాత్రం రాలేదు. బాహు బలి సినిమా మాదిరిగా 7,500 చదరపు కిలోమీటర్లలో రాజధాని ప్రాంతం పెట్టారు. ముంబైను గమనిస్తే థానే, కళ్యాణ్, నవీ ముంబై, ఉల్లాస్నగర్, మీరా అన్నీ కలిపినా 4,500 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. గత సర్కారు మిగిల్చిన భారీ అప్పులు, పెండింగ్ బకాయిలతోపాటు రెండేళ్లుగా కోవిడ్తో అల్లాడుతున్నాం. వారు (టీడీపీ) అధికారంలో ఉంటే రాజధానిని అభివృద్ధి చేసేవారట. ముంబైకి రెండింతల నగరాన్ని కడతారంట. 33 వేల ఎకరాలను అమాయకుల నుంచి తీసుకున్నది గాక వేల ఎకరాల అటవీ భూమి కూడా కావాలని ప్రతిపాదన పెట్టారు. 50 వేల ఎకరాల్లో రోడ్లు, కాల్వలు, కరెంట్ లాంటి కనీస వసతులకే రూ.లక్ష కోట్లు అవసరమవు తాయి. ఇది ప్రభుత్వం చేయగల పనేనా? 2019లో అధి కారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్ నిపుణుల కమిటీని నియమించి నివేదిక కోరారు. బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపుతో అధ్యయనం నిర్వహించారు. రాష్ట్రమంతా అభి వృద్ధి చెందాలని, శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలోని రైతు కూడా బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. బాబు ఆలోచన సరికాదని తేలింది.. వికేంద్రీకరణ తప్పనిసరిగా చేపట్టాలని జస్టిస్ శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు స్పష్టం చేశాయి. దీంతో చంద్రబాబు ఆలోచన తప్పని తేలింది. వికేంద్రీకరణలో భాగంగా లోకల్ జోన్లు, బోర్డులు నెలకొల్పి ఉత్తరకోస్తా, కోస్తాంధ్ర, రాయల సీమను అభివృద్ధి చేస్తూనే శాసనసభ అమరావతిలో, సచి వాలయం విశాఖలో, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఉండాలని ప్రభుత్వం భావిస్తే టీడీపీ తప్పుబడుతోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందరం కలిసి ఉండాలి. కర్నూలు నుంచి నాడు రాజ ధానిని హైదరాబాద్కు తరలించిన విషయాన్ని మరవద్దు. భాగస్వాములతోనూ చర్చిస్తాం.. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. భాగస్వాముల తోనూ చర్చిస్తాం. ఎవరైతే ఒక శాతమో, రెండు శాతమో ప్రలోభాలకు లోనయ్యారో వారి ప్రశ్నలకూ సమాధానం చెబుతాం. హేతుబద్ధంగా సమాధానమిస్తాం. అన్ని ప్రాంతాలవారు భాగస్వామ్యలయ్యేలా, రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపేలా పరిపాలన వికేంద్రీకరణ– సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టాం. -
3 రాజధానుల ఉపసంహరణ బిల్లుపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉపసంహరణ బిల్లులపై చర్చకు స్పీకర్ అనుమతించారు. పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణకమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని మంత్రి బుగ్గన అన్నారు. కోస్తాను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదన్నారు. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యం. అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. -
మూడు రాజధానులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: AP 3 Capitals Bill: 'ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే.. శుభం కార్డుకు చాలా సమయం ఉంది' కాగా, 2019 సెప్టెంబర్ 13న రాజధానిపై అధ్యయనానికి జీఎన్రావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 2019 డిసెంబర్ 20న పరిపాలన వికేంద్రీకరణకు జీఎన్రావు కమిటీ సిఫార్సు చేసింది. 2019 డిసెంబర్ 29న జీఎన్రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. మూడు రాజధాలను ఏర్పాటు చేయాలని 2020 జనవరి 3న హైపవర్ కమిటీ తెలిపింది. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశముందని హైపవర్ కమిటీ పేర్కొంది. 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టగా, వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి శాసనమండలి పంపించింది. 2020 జూన్ 16న మరోసారి అసెంబ్లీ ముందు వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టగా, 2020 జూన్ 17న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ రెండో సారి ఆమోదం తెలిపింది. 2020 జులై 18న మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం గవర్నర్కు పంపింది. 2020 జులై 31న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ సోమవారికి వాయిదా అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం పై దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అభివృద్ధి వికేంద్రీకరణ రిపీల్ బిల్లును దాఖలు చేయడానికి అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. రిపీల్ బిల్లుతోపాటు సంబంధిత వివరాలన్నీ శుక్రవారం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. -
నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, చెన్నై: మెడికల్ ప్రవేశపరీక్ష నీట్ నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ సీఎం ఎంకే స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తమిళ విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతునివ్వాలని విపక్షాలను కోరారు. ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. తమిళనాడులో నీట్ జరుగుతుందా లేదా తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని, చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. నీట్పై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని మండిపడ్డారు. నీట్నును రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామని, అయితే నీట్ తీర్మానానికి మద్దతిస్తున్నామని పళనిస్వామి అన్నారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి -
తన పెళ్లికి రానందుకు అతిథికి 17 వేల బిల్లు పంపిన వధువు
ఇంట్లో శుభకార్యాలకు అతిథులను పిలవడం ఆనవాయితీ. ఇక మనకు కావాల్సిన వాళ్లని తప్పకుండా రావాలని మరీ మరీ పిలుస్తుంటాం కూడా. వారి వారి మధ్య ఉన్న బంధం బట్టి అతిథులు పిలిచిన కార్యాలకు హాజరుకావడం సహజం. ఈ క్రమంలో కొందరు వీలు లేకనో లేదా అంత కంటే ముఖ్యమైన పని ఉన్న కారణంగానో కార్యానికి వెళ్లలేకపోవచ్చు. ఇది మామూలుగా జరిగే తతంగమే. కానీ ఓ పెళ్లి కూతురు తన పెళ్లికి రానందుకు ఓ అతిథికి 17 వేల రూపాయల ఫైన్ వేసి కట్టాలని పంపడంతో అతడు షాక్ అయ్యాడు. అసలేం జరిగిందంటే... అమెరికాలోని చికాగోలో ఓ యువతి తన పెళ్లికి రావాల్సిందిగా ఒక వ్యక్తిని పిలిచింది. అందుకు అతను తప్పక హాజరవుతానని చెప్పాడు. అందులోనూ జంటగా వస్తామని మాటివ్వడంతో.. ఇద్దరి కోసం ఆ పెళ్లి కూతురు రెండు సీట్లను రిజర్వ్ చేసింది. ఇందుకుగాను ఒక్కో సీటుకు 120 డాలర్ల చొప్పున.. 240 డాలర్లను ఖర్చు పెట్టింది. అయితే చివరకు వస్తానని చెప్పిన అతిథి ఆ పెళ్లి రిసెప్షన్కు వెళ్లలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ పెళ్లి కూతురు.. ఆ వ్యక్తి రెండు సీట్లు రిజర్వ్ చేయడం కోసం అయిన ఖర్చు 240 డాలర్లు.. అంటే మన కరెన్సీలో 17,700 రూపాయల బిల్లును రానందుకు పెనాల్టీగా ఓ ఇన్వాయిస్ బిల్లును అతడికి పంపించింది. (చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్) ఆ బిల్లులో.. నువ్వు చెప్పినట్లు రిసెప్షన్కు రాకపోగా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. కనుక నీ కోసం రిజర్వ్ చేసిన సీట్లకు అయిన ఖర్చు నువ్వే చెల్లించాలి. జెల్లే లేదా పేపాల్.. ఇలా ఏ పేమెంట్ ద్వారా అయినా చెల్లించు.. అంటూ ఇన్వాయిస్తో పాటు.. ఒక నోట్ను కూడా పంపించింది ఆ నవ వధువు. ప్రసుతం ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కొందరు మండిపడగా, మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. -
మధ్యప్రదేశ్ గ్యాంగ్స్టర్ నిరోధక బిల్లు.. 10 ఏళ్ల జైలు శిక్ష.. ఆస్తుల జప్తు
భోపాల్: మంద బలం, అధికార బలం కోసం కొందరు తహతహలాడుతుంటారు. ఓ పది మంది రౌడీలను వెంటేసుకుని ఓ గ్యాంగ్కు లీడర్ అయిపోతారు. డబ్బుల కోసం జనాలను పీడిస్తూ.. వివిధ నేరాలకు పాల్పడుతూ.. అడ్డు అదుపు లేకుండా ప్రర్తిస్తారు. అయితే ఇకపై గ్యాంగ్స్టర్గా మారాలంటే వారి వెన్నుల్లో వణుకు పుట్టించే ఓ చట్టాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసురానుంది. మధ్యప్రదేశ్లో వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా "మధ్యప్రదేశ్ గ్యాంగ్స్టర్ నిరోధక బిల్లు" ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ఈ చట్టం ప్రకారం.. గ్యాంగ్స్టర్లకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు ఆస్తులను అటాచ్ చేయడం జరుగుతుందని అన్నారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, పేకాట డెన్లు నిర్వహిస్తున్న వారిని కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు. -
స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించారు’’ అని అన్నారు. -
Airtel: కస్టమర్లకు నచ్చినట్టుగా ప్లాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ ఎయిర్టెల్ భారత్లో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. గృహ వినియోగదారులకు ఫైబర్, డీటీహెచ్, మొబైల్ సర్వీసులను ఒకే గొడుకు కిందకు తెచ్చింది. రెండు లేదా అన్ని కనెక్షన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. నచ్చిన విధంగా ప్లాన్ను రూపొందించుకోవచ్చు. ఫైబర్ రూ.499, డీటీహెచ్ రూ.153, మొబైల్ రూ.499 నుంచి నెలవారీ ప్లాన్స్ మొదలవుతాయి. లేదా కంపెనీ ప్రవేశపెట్టిన నాలుగు రకాల ప్లాన్స్లో దేనినైనా ఎంచుకోవచ్చు. రూ.998 ప్లాన్లో రెండు మొబైల్, ఒక డీటీహెచ్ కనెక్షన్ పొందవచ్చు. రూ.1,598 ప్లాన్ కింద రెండు మొబైల్, ఒక ఫైబర్, రూ.1,349 ప్లాన్లో మూడు మొబైల్, ఒక డీటీహెచ్, రూ.2,099 ప్లాన్ కింద మూడు మొబైల్, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ ఇస్తారు. జీఎస్టీ అదనం. ఎటువంటి అదనపు భారం లేకుండా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ఇన్స్టాలేషన్, సర్వీస్ చార్జీలు లేవు. ఎయిర్టెల్ బ్లాక్ వినియోగదారులు కస్టమర్ కేర్ ప్రతినిధిని 60 సెకన్లలోపే ఫోన్లో సంప్రదించవచ్చని కంపెనీ తెలిపింది. -
corona patient: బిల్ చూసి మైండ్ బ్లాక్.. ఏంటీ 22 కోట్లా!
వాషింగ్టన్: కోవిడ్ సోకిన ఓ వ్యక్తికి వైరస్ నుంచి విముక్తి లభించినా, బల్ రూపంలో భారీ షాక్ ఎదురైంది. ట్రీట్మెంట్ అనంతరం ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన బిల్ చూడగానే అతని మైండ్బ్లాంక్ అయింది. దేవుడా.. అంటూ గుండె పట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.22 కోట్లండి. ఇక ఆ బిల్లును సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అమెరికాలో ఓ వ్యక్తి కరోనా సోకిందని ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో నాలుగు నెలల చికిత్స అనంతరం అతను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇక డిశ్చార్జ్ సమయంలో అతనికిచ్చిన 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్ చూసి బెంబేలిత్తిపోయాడు. ఆ రసీదుని వీడియో తీసి ‘టిక్టాక్’లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్గా మారి కొద్ది రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ల వ్యూస్ను సంపాదించుకుంది. కాగా అగ్రరాజ్యంలో వైద్యం కోసం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రపంచంలోనే అత్యత్తమ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు ఉంటాయి. అందుకే ఆ దేశంలో ఆరోగ్య బీమా తీసుకుంటే ఆస్పత్రుల్లో భారీగా బిల్లు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. చదవండి: ప్రియుడి 23 లక్షల బైక్ను తగలబెట్టేసిన ప్రియురాలు -
ఆ బిల్లుకు సెనేట్ ఆమోదం
వాషింగ్టన్: ఆసియన్ అమెరికన్లతోపాటు పసిఫిక్ ఐలాండర్స్పై పెరుగుతున్న విద్వేష పూరిత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సెనేట్ గురువారం ఆమోదముద్ర వేసింది. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో పెరిగిపోయిన ఇటువంటి ఘటన లను సెనేట్లోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ముక్త కంఠంతో ఖండించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జనవరిలో కుదిరిన అంగీకారం ప్రకారం సెనేట్ ఈ బిల్లును 94–1 ఓట్ల తేడా తో ఆమోదించింది. తాజా పరిణామంతో విద్వేష నేరాల దర్యాప్తును వేగవంతం చేయడానికి వీలుపడుతుంది. కొద్ది వారాల్లో ఈ బిల్లు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు సమాన సంఖ్యలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు వెళ్లనుంది. ( చదవండి: అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా ) -
బిల్లు కట్టలేదని రోగిని స్టోర్ రూమ్ లో ఉంచిన ఆసుపత్రి వర్గాలు
-
విత్తనంపై రైతు పెత్తనానికి గండి!
విత్తనాల సాగు, అమ్మకాల్లో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు పలు ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో తీసుకొస్తున్నప్పటికీ విత్తన రైతు మూలాలను దెబ్బతిసే చర్యలకు మాత్రం సాహసించలేదు. కానీ 2019లో ప్రధాని మోదీ తీసుకొచ్చిన సీడ్ బిల్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలను పక్కన బెట్టింది. ప్రధానంగా రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ముసాయిదా లోపాయకారీగా ప్రైవేట్ రంగ కంపెనీలకు లబ్ధి కలిగిస్తూ నామమాత్ర ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకుంది. అందుకే తాము రైతు ఉద్యమాన్ని ప్రారంభించకపోయి ఉంటే 2019 విత్తన బిల్లుకు కేంద్రం ఇప్పటికే చట్ట రూపం కల్పించేదని రైతు నేత రాకేష్ టికాయత్ చేసిన ప్రకటన సత్యమే అని చెప్పాలి. కేంద్రప్రభుత్వం రైతుల డిమాండ్లను గనుక పరిష్కరించకపోతే 16 రాష్ట్రాల్లో విద్యుత్ లైన్లను తెంచిపారేస్తామని ఇటీవలే రైతు నేత రాకేష్ తికాయత్ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన 2019 విత్తన బిల్లు మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రైతు ఉద్యమం కనుక జరగక పోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాటికే ప్రైవేట్ సీడ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విత్తన బిల్లుకు చట్టరూపం కల్పించేదని టికాయత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ సీడ్ బిల్లులో ఉంటున్న అత్యంత సమస్యాత్మకమైన అంశం ఏమిటి అనేది చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో విత్తన క్రమబద్ధీకరణ నియంత్రణ విషయంలో సీడ్ బిల్లు తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఏమిటో చూద్దాం. 1966 సీడ్స్ యాక్ట్కు చట్టరూపం ఇవ్వడం ద్వారా వ్యవస్థీకృత సీడ్ ప్రోగ్రాంని దేశంలో అమలులోకి తీసుకురావడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడమే ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టాన్ని తీసుకురావడానికి గాను 1968 సీడ్స్ నిబంధనలను రూపొందించారు. ఇప్పటివరకు ఈ చట్టం పరిమిత స్థాయిలోనే అమలవుతోంది. పైగా కొన్ని రకాల విత్తన రకాలను మాత్రమే ఈ చట్టం నియంత్రిస్తోంది. 1983లో నిత్యావసర సరుకుల చట్టం 1955 అధికారాల కింద విత్తన నియంత్రణ చట్టాన్ని నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. విత్తన పంపిణీ, సరఫరాను నియంత్రణ కోసం దీన్ని తీసుకొచ్చారు. రెండు దశాబ్దాల తర్వాత, 1966 సీడ్స్ యాక్ట్ను రద్దు చేసి దాని స్థానంలో సీడ్స్ బిల్ 2004ను తీసుకొచ్చారు. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈ బిల్లును సమర్ఫించినప్పుడు, ఈ బిల్లుకు వ్యతిరేకంగా కమిటీ బలమైన ప్రతిపాదనలు చేసింది. ప్రైవేట్ కంపెనీల లాభార్జనకు వ్యతిరేకంగా, రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ఈ ముసాయిదా బిల్లు ఏం చెబుతోంది అనే అంశాన్ని కమిటీ నిశితంగా పరిశీలించింది. అంతకు కొన్ని సంవత్సరాలకు ముందు, 2001లో అంటే బిల్లుని ఇంకా ప్రవేశపెట్టక ముందు, పంటల రకాలు, రైతుల హక్కుల చట్టం (పీపీవీఎఫ్ఆర్ఏ) తీసుకొచ్చారు. విత్తన వ్యాపారంలో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు ఈ చట్టంలో పొందుపర్చారు. విత్తన వ్యాపారంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి దారి కల్పించడాన్ని గౌరవిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రమాణాలను భారత్ పాటించాల్సినందువల్ల ఇలాంటి చట్టం ఒకటి తీసుకురావలసిన అవసరం అప్పట్లో ఏర్పడింది. శాసనపరమైన సంక్లిష్టతల మధ్యనే నరేంద్రమోదీ ప్రభుత్వం 2019లో సీడ్ బిల్లు ముసాయిదాను తీసుకొచ్చింది. అయితే ఈ ముసాయిదాలో నాటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పాక్షికంగా మాత్రమే మనం చూడవచ్చు. రైతులు తమ విత్తనాలను నమోదు చేసుకోవాలని, అవి తక్కువ అంకురోత్పత్తిని, భౌతిక స్వచ్ఛతను, జన్యు స్వచ్ఛతను కలిగి ఉండేలా జాగ్రత్తలు పాటించాలని బిల్లు ప్రతిపాదించిందన్న వాస్తవానికి వ్యతిరేకంగా స్టాండింగ్ కమిటీ ప్రధానంగా మాట్లాడింది. అలాంటి నిబంధనలు విత్తనాలను తయారు చేసి అమ్మే రైతుల హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని కమిటీ గుర్తించింది. పైగా ఈ చట్టం మార్కెట్ను పూర్తిగా ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచేస్తోందని కమిటీ భావించింది. అందుకే విత్తనాల ధరల నియంత్రణపై, వాటి స్వీయ ధ్రువీకరణ తొలగింపుపై కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ ప్రయివేట్ విత్తన సంస్థలను అదుపుచేసే అంశాలను స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అలాగే తొమ్మిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో విత్తన పంటల బీమా స్కీమ్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరాన్ని కమిటీ లేవనెత్తింది. అలాగే గుర్తించదగిన మరికొన్ని సూచనలను కూడా చేసింది. స్టాండింగ్ కమిటీ చేసిన అనేక ప్రతిపాదనలను 2019 ముసాయిదా బిల్లులో పొందుపర్చారు. కానీ అనేక కీలకమైన అంశాలపట్ల ముసాయిదా ఇప్పటికీ మౌనం పాటిస్తోంది. రైతు మాత్రమే కాకుండా ప్రతి విత్తన ఉత్పత్తిదారుకూ చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్న క్లాజ్ 1(3)(బి)ని సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని ప్రస్తుత ముసాయిదా పొందుపర్చింది కూడా. అయితే సాంప్రదాయిక విత్తన రకాలను నిల్వ చేసుకునేవారిని, లేదా విత్తనాలకు మరికాస్త విలువ కల్పించేవారిని కూడా చేరుస్తూ రైతు అనే నిర్వచనాన్ని మరింతగా విస్తరించాలనే స్టాండింగ్ కమిటీ సిఫారసుకు ఈ బిల్లులో చోటు లభించలేదు. తమ వద్ద ఉన్న విత్తనాలను తప్పకుండా నమోదు చేయాలని రైతులను ఈ ముసాయిదా ఇప్పుడు బలవంత పెట్టడం లేదు కానీ, రైతులు లేక కంపెనీలు కానివారు, (బహుశా దేశీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు) విత్తనాలను ఉత్పత్తి చేసి, అమ్ముకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. అలాగే మార్కెట్లో నాసిరకం విత్తనాలను, అవాంఛనీయమైన విత్తనాలను అమ్మడానికి వీల్లేకుండా, తప్పుముద్రతో వస్తున్న విత్తనాలను నిత్యం తనిఖీ చేయడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది కానీ, ఈ ముసాయిదా బిల్లులో అలాంటి యంత్రాంగం ప్రస్తావన లేదు. పైగా విత్తనం అనే నిర్వచనం పరిధిలో సింథటిక్ విత్తనాలను పొందుపర్చరాదని కమిటీ సూచించింది కానీ ఈ ముసాయిదా బిల్లు అదే సింథటిక్ విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలు అనే నిర్వచనంతో చేర్చింది. అలాగే రైతుల భాగస్వామ్యం గురించి కమిటీ నొక్కి చెప్పింది. వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి వచ్చిన రైతు ప్రతినిధులను కేంద్ర విత్తన కమిటీలో తప్పకుండా పొందుపర్చాలని స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి కోరింది. ముసాయిదా బిల్లు రైతు ప్రతినిధుల భాగస్వామ్యాన్ని పొందుపర్చింది కానీ దానికి ఒక అర్హతను జోడిస్తూ ఆ డిమాండ్ను పలుచబార్చింది. విత్తన నియంత్రణ అమలులో రైతులను ఒక పార్టీగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని సూచిస్తూ, రైతుల ప్రాతినిధ్యం రొటేషన్ ప్రకారం ఉంటుందని ముసాయిదా బిల్లు పేర్కొంది. అలాగే కేంద్ర విత్తన కమిటీ ద్వారా లేక రాష్ట్ర స్థాయి విత్తన కమిటీల ద్వారా విత్తనాల ధరలను నియంత్రించవలసిన అవసరం గురించి స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి నొక్కి చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించే లేదా ఇతర అనివార్య కారణాలతో కొత్త విత్తన రకాల నమోదును ప్రజలు వ్యతిరేకించేలా ఒక నిబంధనకూడా బిల్లులో పొందుపర్చాలని కమిటీ కోరుకుంది. దీనికి అనుగుణంగా విత్తన శాతం మూలాన్ని ప్రకటించాలని కూడా కమిటీ సూచించింది. అయితే ఈ సిఫార్సులు వేటినీ ముసాయిదా బిల్లులో చేర్చలేదు. రైతుల ప్రయోజనాల మాట ఏమిటి? దేశవ్యాప్తంగా విత్తనాల వ్యాపారంలోకి ప్రైవేట్ రంగం విస్తరించిన నేపథ్యంలో విత్తనాల ధరలు చుక్కలంటుతున్నాయి దీంతో విత్తన సాగు వ్యయం కూడా పెరిగిపోతోంది. ఉదాహరణకు ఆవాల విత్తనాలను అమ్మడంలో భాగం పంచుకుంటున్న పయనీర్ అనే ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఒక కిలో ఆవాల విత్తనాలను 750 రూపాయలకు అమ్ముతోంది. ఇతర ప్రైవేట్ కంపెనీలు అమ్ముతున్న ధరలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. పలురకాల ప్రకృతిపరమైన ఉపద్రవాల కారణంగా తమ పంట కచ్చితంగా చేతికొస్తుందన్న నమ్మకం రైతులకు లేకపోగా, విత్తన సాగుకు పెట్టిన ఖర్చు కూడా వారు పొందలేకపోతున్నారు. సాగుకోసం చేసిన అప్పుల్ని చెల్లించడానికి డబ్బు అందుబాటులో లేకపోవడంతో వీరు తరచుగా రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. శ్రుతి జైన్ వ్యాసకర్త జర్నలిస్ట్ (ది వైర్ సౌజన్యంతో) -
బిట్కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బిట్కాయన్పై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. తాజా పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం సిద్దం చేసింది. తద్వారా బిట్ కాయిన్, ఈథర్, రిపెల్ లాంటి ప్రైవేటు డిజిటల్ కరెన్సీలపై వేటు వేయనుంది. అంతేకాదు సొంత క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాగే రూపాయి డిజిటల్ వెర్షన్ను జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని జనవరి 25 న జారీ చేసిన బుక్లెట్లో ఆర్బీఐ తెలిపింది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, నష్టాల భయాలను కూడా హైలైట్ చేసింది. అలాదే దీనిపై అనేక అనుమానాలున్నాయని కూడా వ్యాఖ్యానించింది. ప్రతిపాదిత బిల్లు క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 ప్రకారం ఇండియాలో బిట్కాయిన్, ఇథెర్, రిపుల్ సహా ఇతర ప్రైవేటు డిజిటల్ కరెన్సీల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి కేంద్రం 2019లోనే దేశంలో క్రిప్టోకరెన్సీనిబ్యాన్ చేసే బిల్లు తయారు చేసింది గానీ పార్లమెంటులో పెట్టలేదు. అలాగే 2018 లో క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ విధించిన బ్యాన్ను సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేసింది. (ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ) సాధ్యం కాదంటున్న నిపుణులు క్రిప్టో పరిశ్రమ నిపుణులు ఈ వార్తలపై స్పందిస్తూ క్రిప్టోకరెన్సీలు 'పబ్లిక్' కనుక ఇవి నిషేధం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి, తమ వాదనలు వినిపిస్తా మంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీలను పబ్లిక్ క్రిప్టోకరెన్సీలుగా పరిగణిస్తారు, ఎవరైనా లావాదేవీలను జరుపుకోవ్చని చెబుతున్నారు. భారతదేశంలో 7 మిలియన్లకు పైగా క్రిప్టో హోల్డర్లు ఉన్నారు. 100కోట్ల బిలియన్ డార్లకుపైగా క్రిప్టో ఆస్తులు భారతీయుల సొంతం. ప్రభుత్వం ఈ సంపద మొత్తాన్ని రాత్రికి రాత్రి నిషేధిస్తుందని తాను భావించడం లేదని క్రిప్టోకరెన్సీ మార్పిడి ఎక్సేంజ్ వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి అన్నారు. ఆర్బీఐ అధికారిక సమాచారంలో, బిట్కాయిన్ ప్రైవేట్గా, మిగిలిన వాటిని పబ్లిక్ బ్లాక్చైన్లుగా వర్గీకరించారని, ఇది తప్పని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వర్గీకరణపై స్పష్టమైన సమాచారం లేదని కాయిన్డీసీఎక్స్ సీఈఓ సుమిత్ గుప్తా ట్వీట్ చేశారు.(ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి) కాగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం 20 బిల్లుల జాబితాను సిద్ధం చేసింది. సీసీఐ సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021, మైనింగ్ మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి -
చైనాకు మరో షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మరో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ద టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ) ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది.మరోవైపు ఇదొక చారిత్రాత్మక చర్యగా, చైనాకు స్పష్టమైన సందేశంగా ధర్మశాల అభివర్ణించింది. ఈ నిర్ణయం ప్రస్తుత దలైలామా, టిబెటన్ బుద్ధిస్ట్ లీడర్లు, టిబెట్ ప్రజలదే అని టీపీఎస్ఏ స్పష్టం చేస్తోందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించింది. దీనిపై స్పందించిన చైనా అమెరికాపై మండిపడుతోంది. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీసుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్లోని ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై సంతకం చేయకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. టీపీఎస్ఏ చట్టం టిబెటన్ స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయంగా సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు లాబ్సాంగ్ సాంగాయ్ పేర్కొన్నారు. దీని కోసం తాము రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. చైనా ఇప్పటికే తరువాతి దలైలామాను నియమించే ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికా ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా తొమ్మిదేళ్ల క్రితం టిబెట్పై దాడి చేసి, చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును దారుణంగా అణచివేసిన చైనా టిబెట్ బౌద్ధమతాన్నికూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. భారతదేశంలో 80 వేల మంది టిబెటన్లు ప్రవాసంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 150,000 మంది ఉన్నారు. -
కేసీఆర్.. కళ్లుండి చూడలేని కబోది
సాక్షి, హైదరాబాద్ : గత ప్రభుత్వాల అసంబద్ధ వ్యవసాయ విధానాల వల్లే రైతులకు ఈ కష్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం సంవత్సరం వస్తే రైతులకు మాత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ 26న వచ్చిందని తెలిపారు. వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్..కళ్లుండి చూడలేని కబోది అని, పిట్ట కథలు చెప్పి పబ్బం గడపడమే కేసీఆర్ కు తెలుసునని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 6850 కోట్ల రూపాయిలతో వ్యవసాయ ఉత్పత్తుల కల్పనకు కేంద్రం ఖర్చు చేయబోతుందని చెప్పిన బండి సంజయ్.. బూత్ స్థాయి నుంచి ప్రజలకు అర్థమయ్యేలా ఈ బిల్లు ప్రయోజనాల గురించి తెలియజేస్తామని వెల్లడించారు. తమ ఉనికి చాటుకోవడానికే కాంగ్రెస్ రైతుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని కానీ రైతుల మద్దతు మాత్రం ఆ పార్టీకి లేదని పేర్కొన్నారు. (అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: డీకే అరుణ ) -
ఆర్థికవేత్తల్లో ఇంత అయోమయమా?
మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రప్రభుత్వం ఆమోదింపచేసుకున్న నేపథ్యంలో.. పైకి ఎన్ని ఆకర్షణీయ మాటలను చెప్పినా, వ్యవసాయ మార్కెట్లను ప్రయివేటీ కరించడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పుకోబోతోందని రైతులు గ్రహిస్తున్నారు. ధాన్య సేకరణనుంచి, కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని, సర్కారీ మండీల రద్దు ద్వారా తమ వ్యవసాయ రాబడులు మరింత అస్థిరతకు గురవుతాయని రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్ రైతులు పోస్ట్ చేస్తున్న వీడియోలను గమనిస్తే అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది. భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ ఆర్థికశాస్త్రవేత్తలలో ప్రొఫెసర్ అశోక్ గులాటి అగ్రగణ్యులు. పైగా నేను చదివి, సంప్రదించి, గౌరవించే పండితులలో ఆయన ఒకరు. రైతుల పట్ల నిజమైన ఆర్తి కలిగి ఉన్న మంచి మేధావి ఆయన. నరేంద్రమోదీ నేతృత్వంలో నడుస్తున్న నేటి ప్రభుత్వంతోపాటు ఏ ప్రభుత్వాలనైనా వ్యతిరేకించే దన్ను కలిగినవారు. అవసరమైతే రైతు ఉద్యమాలను కూడా వ్యతిరేకించే దమ్ము కూడా ఉంది. అనేక సంవత్సరాలు వ్యవసాయరంగంపై చేసిన కృషికి తోడుగా, ఆయన కేంద్రప్రభుత్వం ఇటీవల రూపొందించి ఆమోదింపజేసుకున్న మూడు నూతన వ్యవసాయబిల్లులను స్వాగతించారు. వీటిని భారతీయ వ్యవసాయానికి 1991 ఉద్యమం అని కూడా ఆయన పిలిచారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ది ప్రింట్ చీఫ్ ఎడిటర్ శేఖర్ గుప్తా సైతం నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా గులాటి వాదనలను యథాతథంగా ఉల్లేఖించారు. విషాదకరమైన విషయం ఏమిటంటే గులాటి ఈ అంశంలో పూర్తిగా తప్పుచేశారు. ఇది పాక్షిక పాండిత్యానికి, తప్పుడు డేటాకు లేక పేలవమైన హేతువుకు సంబంధించిన తప్పిదం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ విధాన సలహాదారుగా తన అనుకూలతా స్థానం ఫలితంగా నెలకొన్న విస్పష్టమైన తప్పు (ఆయన ఇప్పటికీ ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నారా?). ఇద్దరు ఆర్థికవేత్తలు జీన్ డ్రెజ్, అశోక్ కొత్వాల్ మధ్య జరిగిన లోతైన చర్చను చదివినప్పుడు నాకు ఇది మరింత స్పష్టంగా అర్థమైంది. సబ్సిడీ ధరతో పేదలకు ఆహార పంపిణీ చేయడానికి నగదు బదిలీ చేయాలని కొత్వాల్ ఇచ్చిన సలహాకు స్పందనగా డ్రెజ్.. ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు, పేదల పక్షాన సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు మధ్య తేడా గురించి ఒక స్పష్టమైన విభజన రేఖ గీస్తూ మాట్లాడారు. ఒక విధాన సలహాదారు ప్రభుత్వానికి తాను ఇచ్చే సలహాలు పూర్తిగా మంచి స్ఫూర్తితో అమలవుతాయని అంచనా వేస్తూనే తన సలహాలు అందించే ప్రయోజనాలు ఏమిటనే విషయంపై తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంది. ఒక విధానం పర్యవసానాలు ఏమిటి? వాస్తవ జీవితంలో ఆ విధానం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుంది అని పేదల పక్షం వహించే సలహాదారు తప్పక దృష్టి పెట్టాలి. పేదలకు సహాయం చేయడానికి ప్రత్యక్ష నగదు బదిలీ అనేది అత్యంత సమర్థవంతమైన, ఖర్చుతగ్గించే మార్గంగా కాగితంమీద బాగానే కనిపిస్తుందని, కానీ రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాల సరఫరా అనేది పేదలకు వాస్తవంగా వారి జీవితాలకు మేలు కలిగించే అంశంగా ఉంటుందని డ్రెజ్ నొక్కి చెప్పారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో కూడా ఇదే వాస్తవం. సలహాదారులు–వ్యవసాయదారులు ప్రొఫెసర్ గులాటి మాటల్లో చెప్పాలంటే ఈ బిల్లులు అత్యుత్తమమైనవి. ఈ చట్టాలు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి, కొనుగోలుదారులు వ్యవసాయ ఉత్పత్తులను కొని, నిల్వ చేసుకోవడానికి మేలైన అవకాశాన్ని, స్వేచ్ఛను కలిగిస్తున్నాయి. తద్వారా వ్యవసాయ మార్కెటింగ్లో పోటీని సృష్టించవచ్చు. మార్కెటింగ్ వ్యయాలను తగ్గించి, రైతులకు మెరుగైన ధరలను కల్పించడం, అదే సమయంలో వినియోగదారులు చెల్లించే ధరలను తగ్గించడం వైపుగా వ్యవసాయంలో మరింత సమర్థవంతమైన పంపిణీని సృష్టించడంలో ఈ పోటీ అనేది సహాయపడుతుంది అని గులాటి ఆ వ్యాసంలో చెప్పారు. సైద్ధాంతిక మొండితనం కలిగిన వారు మినహా ఈ రకమైన సలహాలతో ఎవరు విభేదించగలరు? ఈ పోటీ వల్ల రైతులు కనీస మద్దతు ధరను పొందలేరంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనల తప్పుడు ప్రచారానికి లోనవటం వల్లే ఈ బిల్లులను నిరసిస్తున్నారని స్వామినాథన్ అయ్యర్ రాస్తున్నారు. ఈ వాదనలోని హేతువు ఏమంత చెడ్డది కాదు. కానీ క్షేత్రవాస్తవాలపై వీరి అంచనాలు షాక్ కలిగిస్తున్నాయి. పైగా ఈ చట్టాలు ఎలా అమలవుతాయి అనే అంశంపై వీరి అంచనాలు మంచి జరుగుతుందనే సద్భావనపైనే ఆధారపడ్డాయి. సహజంగానే వీరి నిర్ధారణలు చాలా తప్పు అని తేలుతుంది. ఆర్థిక శాస్త్రంలోని తికమకలను అర్థం చేసుకోలేని మన దేశ రైతు పైన పేర్కొన్న మేధావుల కంటే ఈ చట్టాలపై మరింత మెరుగైన అంచనాను కలిగి ఉంటాడు. మేఖలా కృష్ణమూర్తి వంటి ఆంత్రోపాలజిస్టు కానీ, సుధా నారాయణన్ వంటి క్షేత్రవాస్తవాలకు సమీపంగా ఉండే ఆర్థికవేత్త కానీ ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్లపై వేసే ప్రభావంపై మరింత వివేచనతో ఉంటారు. సంస్కరణ–వాస్తవికత రైతులకు వరాలు వాగ్దానం చేస్తున్నాయని చెబుతున్న ఈ చట్టాల గురించి నాలుగు అంచనాలను మనం పరిశీలిద్దాం. మొదటి అంచనా ఏమిటంటే సర్కారీ మండీలకు తప్పనిసరిగా తమ ఉత్పత్తులను అమ్మాల్సి వస్తున్నందున తమ పంటలను బయట అమ్ముకునేటప్పుడు వీరికి తగిన అనుభవం ఉండదన్నదే. ఇది తప్పు. ఎందుకంటే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో నాలుగింట ఒక భాగం మాత్రమే ఈ మండీల ద్వారా కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న ‘స్వేచ్ఛ’ను మన రైతుల్లో నాలుగింట మూడొంతుల మంది ఇప్పటికే ఆస్వాదిస్తున్నారు. రైతుల్లోని మెజారిటీకి ఇప్పుడు కావలసింది మండీల నుంచి స్వేచ్ఛ కాదు. మరింత చక్కగా నిర్వహించే మండీలు వారికి అవసరం. గత కొన్నేళ్లుగా విస్తృతంగా రైతులతో సమావేశమవుతూ వస్తున్న నేను రైతులు పదేపదే ఒక అంశంపై ఫిర్యాదు చేయడం గమనించాను. తమకు అందుబాటులో మండీలు లేవని, ఉన్నా సరైనరీతిలో అవి పనిచేయడం లేదని రైతులు ఆరోపించారు. రెండో అంచనా ఏమిటంటే, కమిషన్ ఏజెంట్ల నుంచి ఈ చట్టాలు రైతులను కాపాడతాయన్నదే. ఇది కూడా తప్పే. మండీలు రైతులను మోసగించలేవని చెప్పలేం కానీ వేలాదిమంది రైతులతో నేరుగా సంప్రదించలేని బడా వ్యవసాయ కంపెనీలు నెలకొల్పే ప్రైవేట్ మండీలకు ఈ సర్కారీ మండీల నిర్వహణదారులు తమ సేవలను అప్పనంగా అందించడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంటే ఇకనుంచి రెండు రకాల దళారీల నుంచి రైతులు పీడనకు గురవుతారు. ఇంతవరకు కొనసాగుతూ వస్తున్న పాత కమిషన్ ఏజెంట్లు, ఇప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్న కార్పొరేట్ సూపర్ దళారీలు. మూడో అంచనా ఏమిటంటే, మార్కెట్ న్యాయబద్ధంగానే పనిచేస్తుంది కాబట్టి తమ ఉత్పత్తులను నిల్వచేసే స్టాకిస్టులు లేక వ్యాపారుల ద్వారా అదనపు లాభాలను ఇప్పుడు రైతులు పొందగలుగుతారన్నదే. కానీ ప్రైవేట్ వ్యాపారులు తాను సంపాదించే అదనపు లాభాల్లో ఒక వాటాను రైతులకు ఇవ్వాలని ఎందుకనుకుంటారు? రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన ధరను ఇవ్వకుండా వీరు తమలోతాము కుమ్మక్కు కారని గ్యారంటీ ఏదైనా ఉందా? ఇంతవరకు జరిగిన విధంగానే కొన్ని సీజన్లలో రైతులకు మంచి ధర ఇస్తూ మిగతా సమయాల్లో రైతులను అణచివేయడాన్ని వీరు కొనసాగించరని ఎవరు హామీ ఇస్తారు? నాలుగో అంచనా ఏమిటంటే ప్రభుత్వం వ్యవసాయ మౌలిక పెట్టుబడిలో తన వాటాను పెంచడం ద్వారా రైతాంగానికి తోడ్పడుతుందన్నదే. ఇదో నయవంచన. ఈ 3 చట్టాలు విధానాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్తు పర్యవసానాల సూచికలుగా ఉంటున్నాయని ఆర్థికవేత్తల కంటే బాగా రైతులు అర్థం చేసుకుంటారు. మదుపు, క్రమబద్ధీకరణ, విస్తృత కృషి రూపాల్లో వ్యవసాయం నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లుగా మోదీ ప్రభుత్వం ఈ చట్టాల రూపకల్పన ద్వారా స్పష్టంగా వెల్లడించింది. ప్రైవేట్ వ్యాపారులు ధాన్యపు గిడ్డంగులను, కోల్ట్ స్టోరేజీలు నిర్మించడంలో మదుపు పెడతారు కాబట్టి తాను వ్యవసాయ రంగంనుంచి తప్పుకోవచ్చని ప్రభుత్వ భావన. రైతులకు స్పష్టమైన సంకేతాలు రైతులకు భవిష్యత్ చిత్రపటం ఏమిటన్నది స్పష్టంగా తెలుసు. వ్యవసాయ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం అంటే ఇంతవరకు తాము అనుభవిస్తున్న ఆ మాత్రపు స్వేచ్చను కూడా వారు పొగొట్టుకోవడమే అవుతుంది. ప్రభుత్వం ధాన్య సేకరణనుంచి కూడా తప్పుకోబోతోందని వారు గ్రహించగలరు. సర్కారీ మండీల రద్దు ద్వారా పర్యవసానాలు వీరికి చక్కగా తెలుసు. కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని కూడా వీరు పసిగట్టగలరు. ఆర్థికవేత్తల కంటే రైతులే రాజకీయ సంకేతాలను స్పష్టంగా గ్రహించగలరు. ఇప్పటికే ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్ రైతులు పోస్ట్ చేస్తున్న వీడియోలను గమనించినట్లయితే మన దేశంలోని కొందరు అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త అధ్యక్షుడు, స్వరాజ్ ఇండియా స్వరాజ్ అభియాన్, జై కిసాన్ ఆందోళన్ సభ్యుడు మొబైల్ : 98688 88986 -
లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేదు
సంగారెడ్డి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో వ్యాపారులకు అవకాశం కల్పించారని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీ, అమెజాన్కు లాభం చేకూరే విధంగా మోదీ నిర్ణయం ఉందని ఆయన విమర్శించారు. వ్యవసాయ బిల్లులతో రైతులకు నష్టం కలుగుతుందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ర్టంలో కేసీఆర్ రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారని , మాయమాటలతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేయలేదని, పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రైతు ద్రోహి అని, పచ్చి అబద్ధాలతో కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను అమలు చేయబోమని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. -
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, నల్గొండ : గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు నల్గొండ పట్టణంలో రామగిరిలో మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకుడు జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, దుబ్బాక నర్సింహా రెడ్డి సహా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా సంతకాల సేకరణను చేపట్టారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. 'వ్యవసాయ బిల్లులను పార్లమెంటరీ సంప్రదాయాన్ని అనుసరించకుండా మూజువాణి ఓటుతో తీసుకోచ్చారు. ఈ బిల్లులు వ్యవసాయదారులకి, వినియోగదారులకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీటి వల్ల మార్కెట్ వ్యవస్థ పోయి కార్పొరేట్ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా సంతకాలను సేకరించి కేంద్రానికి అందచేస్తాం' అని తెలిపారు. ప్రజాస్వామ్యంపై, మహిళలపై, దళితులపై, ప్రశ్నించే వారిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. రాహుల్గాంధీపై పోలీసులు ప్రవరర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. -
ఇది ప్రజాఉద్యమం.. విపక్షాల పాత్ర లేదు
చండీగఢ్: కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారత్ బంద్కు పిలుపున్చిన రైతు సంఘాలు తమ ఆందోళనను సెప్టెంబర్ 29 వరకు పొడిగించాయి. ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి రాష్ట్ర కార్యదర్శి సర్వాన్ సింగ్ పాంధర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులందరి నుంచి తమకు మద్దతు లభిస్తోందని, ఇది ప్రజా ఉద్యమం అని పేర్కొన్నారు. తాము బిల్లులను చదివామని, కార్పొరేట్ల కంపెనీల ప్రయోజనాలకే ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. తమ వైఖరిపై ప్రతిపక్షాలను దోషులుగా చేసి మాట్లాడటం సరైంది కాని అభిప్రాయపడ్డారు. వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. (వ్యవసాయ బిల్లులు : మోదీ సర్కార్పై బాదల్ ఫైర్) ఈ నిరసన ప్రదర్శనలో ఏ రాజకీయ పార్టీని అనుమతించమని స్పష్టం చేశారు. ఇదివరకే వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్లో ఎస్ఏడీ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రైల్ రోకోలో భాగంగా పంజాబ్లో వేలాదిమంది రైతులు రైల్వే పట్టాలపై అడ్డంగా పడుకుని నిరసన చేపడుతున్నారు. దాదాపు 28 ప్యాసింజర్ రైళ్లను అడ్డుకున్నట్లు సమాచారం. కేంద్రం తమ వైఖరి మార్చుకోకుంటే తమ ఆందోళనల్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు రైతులకు అర్థమయ్యేలా వ్యవసాయ బిల్లుల ప్రాధాన్యత వివరించాలని, ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యవసాయ, కార్మిక చట్టాల సంస్కరణల కోసం తీసుకొచ్చిన బిల్లులను పూర్తిగా సమర్థించుకున్న మోదీ.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. (వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలే) -
వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలే
న్యూఢిల్లీ: రైతుల విషయంలో ఎప్పుడూ అసత్యాలే పలికిన వాళ్లు ఇప్పుడు వారి ఆసరాతో ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రధాని మాట్లాడుతూ 85% ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసే చట్టం ఒకటి తయారవడం దశాబ్దాల్లో ఇది మొదటిసారని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్దయాళ్ ఉపాధ్యాయ్ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ, కార్మిక చట్టాల సంస్కరణల కోసం తీçసుకొచ్చిన బిల్లులను పూర్తిగా సమర్థించుకున్నారు. పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘‘వాళ్లు వదంతులు ప్రచారం చేస్తున్నారు. వీటి నుంచి రైతులను రక్షించాలంటే కొత్త వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యతను వారికి వివరించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత బీజేపీ కార్యకర్తలు తీసుకోవాలి. రైతుల భవిష్యత్తును ప్రకాశవంతం చేయాలి’’అని ఉద్బోధించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కార్మిక సంస్కరణలు దేశవ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూర్చనుందని, స్థిరమైన ఆదాయంతోపాటు ఆరోగ్య సేవలు అందించేలా చేస్తాయని ప్రధాని తెలిపారు. ఇప్పటివరకూ కేవలం 30 శాతం మందికి కనీస వేతన చట్టం వర్తించేదని, కొత్త చట్టాల వల్ల అసంఘటిత రంగ కార్మికులందరికీ అమల్లోకి వస్తుందని వివరించారు. -
వ్యవసాయ బిల్లు; కార్పొరేట్లకు తెరిచిన ద్వారాలు..
సాక్షి, నల్లగొండ : కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను నిర్వీర్యం చేసే చర్య జరుగుతోందని ఆరోపించారు. జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా కనీస మద్దతు ధరను తీసివేసే యోచన జరుగుతోందని అన్నారు. లాభ నస్టాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. (గ్రేటర్లో ఆర్టీసీ బస్సులు నడపండి) ‘నూతన వ్యవసాయ బిల్లు అన్యాయమైనది. అందుకే రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్ యార్డులు నిర్వీర్యం అవుతాయి. టోటల్ విధానాన్ని రద్దుచేసి, కార్పొరేట్లకు ద్వారాలు తెరిచారు. ఈ చట్టాలు కేంద్రం చేతుల్లోకి తీసుకోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతంది. నూతన విద్యుత్ విధానం రైతులకు శరాఘాతం వంటిది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పిస్తే కేంద్రం ఫెడరల్ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విద్యా విధానం, జీఎస్టీ, తదితర పథకాలు అన్నీ కూడా రాష్ట్రాల మీద భారం మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతోంది.’ అని మండిపడ్డారు. (బీజేపీ మాయ మాటల పార్టీ: హరీశ్ రావు) -
వ్యవసాయ బిల్లు ..కార్పోరేట్ బిల్లులా ఉంది
సాక్షి, ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు కార్పోరేట్ బిల్లులా ఉందని పిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఈ బిల్లుతో కార్పొరేట్ ఆదాని, అంబానీ వాళ్ళకి లాభం వచ్చేలా ఉంది తప్పా రైతులకు న్యాయం జరగదన్నారు. నూతన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట ఉరితాడుగా మారనున్నదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి దమ్ము ఉంటే బిల్లుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తాడా అంటూ సవాల్ విసిరారు. ఈనెల 25న రాష్ర్ట వ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు నిరసనగా ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు. (రైతులకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ) -
విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం
-
వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్సీపీ మద్దతు
-
వ్యవసాయ బిల్లుల ఆమోదాన్ని స్వాగతించిన ప్రధాని
-
కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగాను. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్లు, బిల్లులకు వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేశాను. ఒక సోదరిగా, బిడ్డగా రైతుల పక్షం నిలబడినందుకు గర్వంగా ఉంది’ అని సంబంధిత బిల్లులు లోక్సభ ఆమోదం పొందేందుకు కొన్ని గంటల ముందు ఆమె ట్వీట్ చేశారు. అంతకుముందు, ఆ బిల్లులను ఎస్ఏడీ అధ్యక్షుడు, ఆమె భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ లోక్సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవి పంజాబ్లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయన్నారు. భారత్ ఆహార రంగంలో స్వావలంబన సాధించడంలో పంజాబ్ రైతుల పాత్రను మరచిపోకూడదన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కేబినెట్లో తమ పార్టీ ప్రతినిధి అయిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తాను, తమ పార్టీ పదేపదే చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన తన రాజీనామా లేఖలో కౌర్ ఆరోపించారు. తమ పార్టీలోని ప్రతి సభ్యుడు రైతేనని, రైతు సంక్షేమం ధ్యేయంగా తమ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనలను పట్టించుకోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకోవడం లేదన్నారు. కౌర్ రాజీనామాను ప్రధాని మోదీ ఆమోదించారా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఎన్డీఏలో శిరోమణి అకాలీదళ్ బీజేపీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పక్షం. బీజేపీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన పార్టీ. అయితే, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లులను ఎస్ఏడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పంజాబ్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో, బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎస్ఏడీకి నెలకొన్నది. ఎన్డీఏలో ఎస్ఏడీ కొనసాగేది, లేదని త్వరలో నిర్ణయిస్తామని సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. రైతుల కోసం ఏ త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని పార్లమెంట్ వెలుపల మీడియాతో స్పష్టం చేశారు. రెండు బిల్లుల ఆమోదం ఎస్ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఆర్ఎస్పీలు వాకౌట్ చేశాయి. వ్యవసాయ రంగానికే చెందిన మరో బిల్లు ‘ఎసెన్షియల్ కమాడిటీస్(అమెండ్మెంట్)’ మంగళవారం లోక్సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ల స్థానంలో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఇవి ఇంకా రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు లోక్సభ ఆమోదం పొందడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులకు మధ్యవర్తుల బెడద తొలగుతుందన్నారు. ఈ బిల్లుల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ కొనుగోలు విధానాలు కొనసాగుతాయని రైతులకు హామీ ఇచ్చారు. -
20 లక్షల బిల్లు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం!
రాంగోపాల్పేట్: కరోనా మహమ్మారి పేరుతో దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం, హైకోర్టు హెచ్చరికలు జారీ చేస్తున్నా అవి తమకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నాయి. వివరాలివీ... ముషీరాబాద్కు చెందిన 49 సంవత్సరాల ఓ వ్యక్తి సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గత నెల 20వ తేదీన సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అతను పనిచేసే సంస్థకు చెందిన ఇన్య్సూరెన్స్ నుంచి డబ్బు చెల్లించేందుకు వారు ఒప్పుకున్నారు. ఇలా 22 రోజులకు గాను రూ. 20 లక్షల బిల్లు వేశారు. చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయన మరణించారు. చికిత్సకు రూ. 20 లక్షలు బిల్లు అయిందని... బీమా సొమ్ము పోను మిగతా రూ. 8 లక్షలు చెల్లించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో నిరుపేద అయిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. విషయం చెప్పి మృతదేహం ఇవ్వాలని కోరినా అప్పగించలేదు. విషయం తెలుసుకున్న క్రైస్తవ సంఘాల నాయకులు అక్కడికొచ్చి ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం... జీహెచ్ఎంసీ, పోలీసులు సకాలంలో రాకపోవడంతో మృతదేహం అప్పగింతలో ఆలస్యం జరిగిందని స్పష్టం చేసింది. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం: మత్తయ్య కరోనా పేరుతో ప్రజలను దోపిడీకి గురిచేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని క్రైస్తవ ధర్మప్రచార సమితి అధ్యక్షుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. చిన్నచిన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇలాంటి పెద్ద పెద్ద ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమ తప్పు బయటపడకుండా బాధితులను బెదిరింపులకు పాల్పడి తమకు అనుకూలంగా రాయించుకున్నారని ఆరోపించారు. -
కరోనా బిల్లుకు భయపడిన వ్యాపారి ఏం చేశారంటే
సూరత్: కరోనా బిల్లు చూసి గుండె గుభేలుమన్న సూరత్కు చెందిన ఒక వ్యాపారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ నుండి కోలుకున్న వ్యాపారవేత్త తనలాగా పేదలు కష్టపడకూడదని భావించి పెద్ద మనసు చేసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. సూరత్కు చెందిన, ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఒక ప్రైవేట్ క్లినిక్లో 20 రోజులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి బిల్లు చూసి ఒక్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. వ్యాపారవేత్తనైన తన పరిస్థితే ఇలా ఉంటే..ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఫలితంగా తన 30,000 చదరపు అడుగుల (2,800 చదరపు మీటర్లు) కార్యాలయ ప్రాంగణం కోవిడ్-19 ఆసుపత్రిగా మారిపోయింది. తన మనవరాలు ‘హిబా’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను షేక్ పొందారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చులు చాలా భారంగా ఉన్నాయని, తానూ పేద కుంటుంబంలోంచే వచ్చాననీ, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని భావించానన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని వెల్లడించారు. సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, మంచాలు, పరుపులతో పాటు విద్యుత్, ఇతర ఖర్చులను తాను భరించనున్నట్టు చెప్పారు. వంట, భోజనాల గది, వంటవారు, రోగుల రోజువారీ ఆహార అవసరాలు ఇలా అన్ని వసతులను సమకూర్చుతామన్నారు. తద్వారా కరోనా మహమ్మారి బారిన పడిన పేదలు ఇక్కడ ఉచితంగా చికిత్స పొందుతారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దాదాపు 35,000 మంది మరణించారు. -
10 రోజుల చికిత్సకు రూ.9.09 లక్షలు
సిలికాన్ సిటీలో రోగుల అవస్థలను కార్పొరేట్ ఆస్పత్రులు కాసులుగా మార్చుకుంటున్నాయి. అవసరం వారిది, ఎంతైనా బిల్లు చెల్లిస్తారనే ఆలోచనతో లక్షలకు లక్షలు బాదుతున్నారు. బనశంకరి: కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగికి చికిత్స అందించడానికి 10 రోజులకు రూ.9.09 లక్షలు బిల్ అవుతుందని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి స్పష్టం చేసింది. దీంతో రోగి బంధువులు కళ్లు తేలేశారు. వివరాలు.. 67 ఏళ్ల కోరమంగల వాసి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు వైట్పీల్డ్లో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోగిని పరిశీలించిన డాక్టర్లు 10 రోజులు చికిత్స చేయాలి, రూ.9.09 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. అది విన్న కుటుంబసభ్యులు హడలిపోయి ఆసుపత్రిలో చేర్పించలేమని చెప్పేశారు. షాక్ తిన్నాం: బంధువులు రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం కోసం వేచి చూస్తున్నామని, సోమవారం శ్వాసతీసుకోలేకపోవడంతో మేము కొలంబియా ఏషియా ఆసుపత్రికి తీసుకువచ్చామని, వైద్యులు ఇంత ఖర్చవుతుందని చెప్పారని వివరించారు. అది విని షాక్కు గురయ్యామని తెలిపారు. తరువాత ఓ స్వచ్ఛంద సేవాసంస్థవారితో మాట్లాడగా తక్కువ ఫీజులతో వైద్యం చేసే మరో ఆస్పత్రి గురించి చెప్పారని, అక్కడ మేము రూ.25 వేలు చెల్లించి చేర్పించామని చెప్పారు. వైద్యం పేరుతో రోగుల దుస్థితిని లాభంగా వినియోగించుకోరాదని వారు హితవు పలికారు. ఈ తతంగంపై వైద్య విద్యా మంత్రి సుధాకర్ మాట్లాడుతూ ఆ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక కొలంబియా ఏషియా ఆసుపత్రి మేనేజర్ మాట్లాడుతూ రోగి తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. సుగర్, బీపీ ఉన్నాయి. తక్షణం చికిత్స అందించే అవసరం ఉంది. కరోనా ఉందో లేదో తెలియరాలేదు. ఇలాంటి పరిస్థితిలో చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ముందే తెలిపాము. ఇదే ఫైనల్ బిల్లు కాదు అని చెప్పారు. ఇదీ బిల్లు వెంటిలేటర్ రూ.1.40 లక్షలు, రూ.3 లక్షలు ఔషధాలు, ల్యాబ్ పరీక్షలకు రూ.2 లక్షలు, రూమ్ అద్దె రూ.75 వేలు, నర్సింగ్ చార్జ్లు రూ.58,500, రేడియోలజీ, ఫిజియోథెరపీకి రూ.35,000, సర్జికల్ సామగ్రికి రూ.25,000 అవుతుందని బిల్ చూపారు. -
7లక్షలమంది భారతీయులు వెనక్కి!
-
అందుకే ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం..
సాక్షి, అనంతపురం: సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. శనివారం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన మైనార్టీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మత ప్రాతిపదికన విభజిస్తున్నారని.. తమ పౌరసత్వానికే ముప్పు ఉందని ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అందుకే కేంద్రం తెచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తున్నామని’ ఆయన తెలిపారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించింది కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే అని.. ఏపీ లోని అన్ని జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని వివరించారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని అంజాద్ బాషా పేర్కొన్నారు. -
లైంగిక దాడులకు చట్టబద్ధత బిల్లు!
ఇస్తాంబుల్: మానవ జీవనానికి అనువైన దేశంగా గణతికెక్కిన టర్కీలో 18 ఏళ్ల లోపు పిల్లలను రేప్ చేసిన వారే పెళ్లి చేసుకున్నట్లయితే వారికి శిక్ష నుంచి మినహాయించే బిల్లు టర్కీ పార్లమెంట్ సిద్ధం చేసింది. ‘మ్యారీ యువర్ రేపిస్ట్’గా పిలుస్తున్న ఈ బిల్లును ఈ నెలాఖరులో ప్రవేశపెడుతున్నట్లు తెలియగానే ఇటు దేశంలోని ప్రతిపక్ష ఎంపీలు, అటు ఐక్యరాజ్య సమితి మండిపడింది. దీనివల్ల రేప్లకు చట్టబద్ధత లభించడమే కాకుండా బాల్య వివాహాలు ఎక్కువవుతాయని, పిల్లలపై రేప్లు మరింత పెరగుతాయని ఐక్యరాజ్య సమతి హెచ్చరించింది. అంతేకాకుండా నచ్చిన బాలికలను పెళ్లి చేసుకునేందుకే లైంగిక దాడులు పెరగుతాయని, ఇష్టం లేకపోయినా రేపిస్టులను పెళ్లి చేసుకోవాలంటూ బాలికలపై ఒత్తిడి పెరుగుతుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. వెంటనే బిల్లును నిలిపి వేయాల్సిందిగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసింది. వాస్తవానికి 2016లోనే ఈ బిల్లును టర్కీ ప్రభుత్వం పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టింది. 15 ఏళ్ల లోపు బాధితులను రేపిస్టులు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి బెదిరింపులు, ఒత్తిడులు లేకుండా బాలికల అనుమతి తీసుకోవాలని నాటి బిల్లులో ప్రతిపాదించారు. ఆ బిల్లుపై అప్పుడు కూడా ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో పాలకపక్ష ఏకే పార్టీ తదుపరి సంప్రతింపుల పేరిట బిల్లును ఉపసంహరించుకుంది. ఇప్పుడు మైనర్ బాలికల వయస్సును 15 నుంచి 18 ఏళ్లకు పెంచుతూ బిల్లును సవరించారు. పౌర వివాహాలను చేసే హక్కును ముస్లిం ముఫ్తీలకు కల్పిస్తూ 2017లో కూడా టర్కీ ప్రభుత్వం ఓ వివాదాస్పద చట్టం తీసుకొచ్చింది. దీని వల్ల బాల్య వివాహాలు పెరుగుతాయని, పైగా దేశ లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చినా బిల్లు నాడు పాసయింది. ఇప్పుడు ఏం జరగతుందో చూడాలి. -
ప్రాణం తీసిన బిల్లు వివాదం
ముషీరాబాద్: మద్యం మత్తులో నలుగురు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండకు చెందిన అభిలాష్ హైదరాబాద్కు వచ్చి రాంనగర్లో ఉంటూ జొమాటో కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు వంశీ ఇటీవల ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 24న రాంనగర్లో ఉంటున్న తమ స్నేహితుడు హరీష్ గదికి వెళ్లారు. వంశీ స్నేహితుడు చంద్రకాంత్ కూడా అక్కడికి రావడంతో నలుగురు కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా వంశీ పుట్టినరోజు విషయం గుర్తుకు రావడంతో అందరూ కలిసి రాంనగర్లోని ఓ బేకరీకి వెళ్లి కేక్ కట్చేశారు. అనంతరం మరో రెస్టారెంట్కు వెళ్లి మరోసారి మద్యం తాగారు. ఆ తర్వాత నారాయణగూడలోని ఓ హోటల్కు వెళ్లి బిర్యాని తిన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ వచ్చినందున అదనంగా రూ.600 ఖర్చయ్యిందని అభిలాష్ అనడంతో మనస్తాపానికి లోనైన చంద్రకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వంశీ అభిలాష్తో వాగ్వాదానికి దిగడంతో అందరూ కలిసి అక్కడినుంచి హరీష్ గదికి వెళ్లిపోయారు. అక్కడ కూడా వాగ్వాదం కొనసాగడంతో అభిలాష్ వంశీపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికిలోనైన వంశీ అభిలాష్ను బలంగా నెట్టివేయడంతో తల నేలకు తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మిగతా ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. -
సిటిజన్ ఫైట్
-
నేడు లోక్సభకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుతోపాటు చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా పొడిగింపునకు ఉద్దేశించిన బిల్లును సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్ షా దిగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుందని లోక్సభ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం నేడు సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోటా 2020 జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులకు విప్ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది. పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ నేత శశిథరూర్ విరుచుకుపడ్డారు. గాంధీజీ ఆలోచనా విధానం పై జిన్నా వాదానికి గెలుపు వంటిదే పౌరసత్వ బిల్లు అని విమర్శించారు. ఈ బిల్లును నిరసిస్తూ 10వ తేదీన బంద్ పాటించాలని ఈశాన్య విద్యార్థుల సమాఖ్య పిలుపునిచ్చింది. -
రెస్టారెంట్ రసీదులో ‘భయపెట్టె పాప’
సాధారణంగా పిల్లలను, కుటుంబ సభ్యులను తీసుకొని రొటీన్కు భిన్నంగా ఏదైనా రెస్టారెంట్కు పసందైన భోజనం కోసం వెళ్లతారు. అలా రెండేళ్ల తన పాపను కింబర్లీస్జే అనే మహిళ న్యూజిలాండ్ క్రైస్ట్చర్చ్లోని కాఫీసుప్రీం రెస్టారెంట్కు వెళ్లింది. కానీ ఆమెకు ఊహించని విధంగా ఆ రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. వివరాలు.. రెస్టారెంట్లో పని చేసే సిబ్బంది సదరు మహిళలకు టేబుల్ నంబర్ను కేటాయింటే రసీదుపై కింబర్లీస్జే కూతురును ఉద్దేశిస్తూ ‘భయపెట్టే పాప’ అని టైప్ చేసి ఇచ్చారు. ఆ రసీదు చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెస్టారెంట్ సిబ్బంది తన కుమార్తె మీద ఉద్దేశపూర్వకంగా అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండటమే కాకుండా రసీదు మీద రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ రసీదు ఫోటోను ఆమె తనఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసి.. క్రైస్ట్చర్చ్లోని కాఫీసుప్రీం రెస్టారెంట్ సిబ్బంది తన కూతురిని అగౌవరపరిచారని వాపోయారు. అదే విధంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం తమ సిబ్బందికి కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలనే విషయంలో సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ‘నా కూతురు ఎప్పుడూ ఎవరిని భయపెట్టలేదు. ఎలాంటి సమస్యలు కలిగించలేదు. ఈ రోజు రెస్టారెంట్కి వచ్చిన చాలా మంది నా కూతురిని చూసి చాలా క్యూట్గా ఉందని మురిసిపోయారు’ అని కింబర్లీస్జే వివరించారు. ఈ ఉద్దేశపూర్వక చర్యతో రెస్టారెంట్ యాజమాన్యం తరచూ వచ్చే కస్టమర్లను కోల్పోయిందని తెలిపారు. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో తమ సిబ్బంది చేసిన తప్పుకు చింతిస్తున్నామని పాప తల్లి కింబర్లీస్జేకి రెస్టారెంట్ యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. -
నేరస్తుల అప్పగింత బిల్లు వెనక్కి
హాంకాంగ్/బీజింగ్: కొన్ని నెలలుగా నిరసనలకు కారణమైన వివాదాస్పద ‘నేరస్తుల అప్పగింత’ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు బుధవారం హాంకాంగ్ ప్రకటించింది. ఈ బిల్లుపై వ్యతిరేకతే తరువాత కాలంలో మరిన్ని ప్రజాస్వామ్య మార్పులను కోరుతూ తీవ్రమైన నిరసనలకు కారణమైంది. బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు హాంకాంగ్ సిటీ సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ స్థానిక చట్ట సభలో ప్రకటించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు కొందరు ప్రజాస్వామ్య మద్దతుదారులైన సభ్యులు ప్రయత్నించగా ఆయన సమాధానమివ్వలేదు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ను మార్చలేదు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్ను మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న మీడియా కథనాలను చైనా తోసిపుచ్చింది. అది స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టించిన రాజకీయ వదంతి అని పేర్కొంది. కేరీ లామ్ స్థానంలో తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ను నియమించే దిశగా చైనా ఆలోచిస్తోందని లండన్ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తోసిపుచ్చారు. లామ్కు తమ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. హాంకాంగ్లో త్వరలోనే హింస నిలిచిపోయి, సాధారణ స్థితి ఏర్పడుతుందన్నారు. నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కు తీసుకోవడంతో పాటు లామ్ రాజీనామా చేయాలన్నది హాంకాంగ్లోని ప్రజాస్వామ్య వాదుల ప్రధాన డిమాండ్. బిల్లులో ఏముంది? ఈ బిల్లు ఆమోదం పొందితే చైనాతో పాటు ప్రపంచంలోని ఏ దేశానికైనా నేరానికి పాల్పడినట్లుగా భావిస్తున్న తమ పౌరులను హాంకాంగ్ అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హాంకాంగ్కు అమెరికా, యూకే సహా 20 దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. చైనాతో మాత్రం లేదు. 1997లో హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింద హాంకాంగ్కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. చాన్ అనే హాంకాంగ్ పౌరుడు తైవాన్లో తన గర్ల్ఫ్రెండ్ను హత్య చేసి తిరిగి హాంకాంగ్కు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చింది. చాన్ హాంకాంగ్ జైళ్లో ఉన్నాడు. నేరస్తుల అప్పగింతకు ముందు ఆ అభ్యర్థనను కోర్టులో సవాలు చేసే అవకాశం బిల్లులో ప్రతిపాదించారు. ఏడేళ్లు, లేదా ఆపై శిక్ష పడే నేరాలకే అప్పగింత వర్తించేలా ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. -
హోటల్ గది అద్దె చెల్లించాలన్నందుకు..
కాచిగూడ: ఫంక్షన్ చేసుకునేందుకు ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకుని బకాయి ఉన్న బిల్లు డబ్బులు చెల్లించాలని కోరినందుకు హోటల్ యాజమాన్యంపై దాడిచేసిన ఇద్దరు యువకులను నారాయణగూడ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ ప్రాంతానికి చెందిన మచ్చ రోహన్ హైదర్గూడలో రాస్తా కేఫ్ నిర్వహిస్తున్నాడు. టిక్ టాక్ బృందం ఫంక్షన్ చేసుకునేందుకు శనివారం రూ.10 వేలకు ఒక గదిని అద్దెకు తీసుకోగా అడ్వాన్స్గా రూ.4 వేలు చెల్లించారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని అడగడంతో బృందం సభ్యులకు మచ్చ రోహన్కు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన హసీబ్ అహ్మద్ అన్సారీ, హఫీజ్ అహ్మద్ అన్సారీలతో పాటు మరో ముగ్గురు యువకులు మచ్చ రోహన్పై దాడి చేశారు. ఈ ఘటనలో రోహన్ కాలు విరిగింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ పుటేజీలో లభ్యమైన ఆధారాలతో ఇద్దరు యువకులను గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన రూ.180
లక్నో: డబ్బు.. మనుషులను రాక్షసులను చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బిల్లు చెల్లించలేదనే కోపంతో ఓ హోటల్ యజమాని కస్టమర్ను చంపేశాడు. ఉత్తరప్రదేశ్లోని బాదోమీ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. సూరజ్ సింగ్, విశాల్ దూబే అనే యువకులు భోజనం కోసం ఓ హోటల్కు వెళ్లారు. భోజనం తర్వాత వెయిటర్ వారికి రూ.180 బిల్లు ఇచ్చాడు. అయితే తాము తిన్న భోజనానికి ఎక్కువ బిల్లు వేశారంటూ సూరజ్, విశాల్లు హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా పెద్దదై కొట్టుకొనేవరకు వెళ్లింది. ఆగ్రహించిన హోటల్ యజమాని గుర్మయిల్, అతడి కుమారుడు సురేంద్ర సింగ్లు, సిబ్బందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో విశాల్, సూరజ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో విశాల్ అక్కడ నుంచి తప్పించుకోగా.. సూరజ్ను తీవ్రంగా కొట్టారు. గాయాలతో కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్మయిల్, సురేంద్ర సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ఇద్దరు వెయిటర్లు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
స్టార్ హోటల్లో దిగాడు.. లక్షల్లో బిల్లు ఎగ్గొట్టాడు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తాజ్బంజారా హోటల్కు ఓ వ్యాపారి లక్షల్లో బిల్లు ఎగ్గొట్టి పరారయ్యాడు. తాజ్బంజారా హోటల్ జీఎం హితేంద్రశర్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. విశాఖపట్నం వినాయకటెంపుల్ సమీపంలోని కిర్లంపుడి లేఅవుట్లో ఉన్న సాగర్ దీప అపార్ట్మెంట్స్లో నివసించే అక్కింశెట్టి శంకర్ నారాయణ్ గతేడాది ఏప్రిల్ 4న తాజ్బంజారా హోటల్కు వచ్చి తాను ఏడాదిపాటు వ్యాపారనిమిత్తం ఇక్కడ బస చేయడానికి ఉంటున్నానని ఒకేగదిని దీర్ఘకాలిక ప్రాతిపదికన కేటాయించాల్సిందిగా కోరాడు. దీంతో గతేడాది ఏప్రిల్ 4న ఆయనకు హోటల్లో రూమ్ నెంబర్ 405 కేటాయించారు. మధ్యలో రూ.13.62 లక్షలు బిల్లు చెల్లించాడు. దీంతో హోటల్ నిర్వాహకులను నమ్మిస్తూ తర్వాత బిల్లులు వాయిదాలు వేస్తూ వచ్చాడు. గత ఏప్రిల్ 15వ తేదీన ఆయన గదికి తాళం వేసి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా రాకపోవడంతో నిర్వాహకులు సంప్రదిస్తూ వచ్చారు. మొత్తం 102 రోజులకుగాను హోటల్ బిల్లు రూ. 25,96,693 కాగా అందులో రూ. 13,62,149 చెల్లించాడు. మిగతా రూ. 12,34,544 బాకీ పడ్డాడు. ఈ మొత్తాన్ని చెల్లించకుండానే గది విడిచి పరారయ్యాడు. జూన్ 26వ తేదీన ఆయనకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. వెతికినా ఫలితం లేకుండా పోయింది.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం
-
ప్రభుత్వ ఉద్ధేశం స్పష్టంగా ఉండాలి
-
జీఎస్టీ ‘జీరో’!
సాక్షి సిటీబ్యూరో: మార్కెట్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా దానికి బిల్లు తీసుకోవడం వినియోగదారుడి హక్కు అని ఓవైపు అవగాహన కల్పిస్తున్నా... ‘సకాలంలో పన్నులు చెల్లించండి... దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ మరోవైపు ప్రచారం చేస్తున్నా పరిస్థితిలో మార్పులు రావడం లేదు. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట్, పంజగుట్ట, సరూర్నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో జీరో దందా జోరుగా సాగుతోంది. బిల్లులు లేకుండానే రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. జీఎస్టీ నుంచి మినహాయింపు పొందేందుకు వ్యాపారులు ఇలా చేస్తుండగా అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాపార లావాదేవీలపై తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ విభాగంపై ఉందని క్షేత్రస్థాయి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఒరిజినల్ బిల్లుల్లేవ్... వినియోగదారులు రూ.100 నుంచి లక్షల్లో కొనుగోలు చేసినా వ్యాపారులు మాత్రం ఒరిజినల్ బిల్లులు ఇవ్వడం లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే తెల్లకాగితంపైనే రాసిస్తున్నారు. ఈ నామమాత్రపు బిల్లు కాగితంపై దుకాణం పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలేమీ ఉండవు. ఫలితంగా ఆ వస్తువు విక్రయించినందుకు వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించడం లేదు. వినియోగదారుడు చెల్లిస్తున్న పన్ను కాస్త వ్యాపారి ఖాతాలోకే వెళ్లిపోతోంది. ఒరిజినల్ బిల్లు ఇస్తే వస్తువు ధర మరింత పెరుగుతుందని వినియోగదారులను పక్కదోవ పట్టిస్తున్న వ్యాపారులు యథేచ్ఛగా జీరో దందా సాగిస్తున్నారు. వాస్తవానికి వస్తువు ధరలోనే జీఎస్టీ కలిపి ఉంటుంది. లెక్కలు ఉష్కాకి... నగరంలోని హోల్సేల్ మార్కెట్లలో బేగంబజార్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక్కడి నుంచి జిల్లాలకూ ఉత్పత్తులు సరఫరా అవుతుంటాయి. దీన్ని ఆనుకొని ముక్తియార్జంగ్, కిషన్గంజ్, ఉస్మాన్గంజ్, మహరాజ్గంజ్ తదితర మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడి దుకాణాలు చూసేందుకు చిన్నగా ఉన్నా పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతుంది. డబ్బులు చెల్లిస్తే చాలు నేరుగా గోడౌన్ల నుంచే సరుకులు తరలిస్తారు. ఇక్కడ నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా... లెక్కల్లో చూపేది మాత్రం నామమాత్రమే. వాణిజ్య పన్నుల అధికారులకు ప్రతి నెల మామూళ్లు అందుతాయని, అందుకే ఇక్కడ తనిఖీలపై శ్రద్ధ వహించరని బేగంబజార్లోని ఓ వ్యాపారి పేర్కొనడం గమనార్హం. వ్యవసాయ ఉత్పత్తులు, విడిగా ఉన్న వాటికి పన్ను మినహాయింపు ఉండడంతో కొంతమంది వ్యాపారులు ప్యాక్ చేయకుండా విక్రయిస్తూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని చాలామంది జీఎస్టీ చెల్లించడం లేదని కొందరు వ్యాపారులు పేర్కొన్నారు. 2017–18లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.55వేల కోట్లు సమకూరిందని అధికారులు చెప్పారు. ఇందులో హైదరాబాద్ నుంచే 60–65 శాతం ఉంది. నగరంలో జీరో వ్యాపారం పెరిగిపోవడంతో ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.