Blood
-
రక్తం మారింది... ప్రాణం పోయింది
జగ్గంపేట: ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మిడిమిడి జ్ఞానం ఓ విద్యార్థిని ఉసురు పోసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 16 ఏళ్ల బాలికకు.. వేరే గ్రూపు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు పోవడానికి కారకులయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ బాలిక కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పోలీస్స్టేషన్ వెనుక ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో ఆమెను రెండు రోజుల క్రితం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయానికి ఆస్పత్రి వైద్యుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన ఇచ్చిన సలహాలతో జగ్గంపేట ఆస్పత్రి సిబ్బంది రక్తం ఎక్కించారు. అయితే బాధిత బాలిక బ్లడ్ గ్రూపు ఒకటి అయితే, సిబ్బంది మరో గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆరోగ్యం వికటించింది. ఈ క్రమంలో మూత్రంలో నుంచి, నోటి నుంచి రక్తం రావడంతో సిబ్బంది కంగారు పడి, రాజమహేంద్రవరంలో ఉన్న డాక్టర్కు సమాచారమిచ్చారు. ఆ డాక్టర్ సూచన మేరకు ఆ బాలికను తక్షణం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం రాత్రి బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆమె బంధువులు ఆందోళన చేయడంతో రాజమహేంద్రవరానికి చెందిన ఒక టీడీపీ నేత ఎటువంటి కేసులు లేకుండా సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
గర్భధారణ సమయంలో ఎటాక్ చేసే వ్యాధి..! హాలీవుడ్ నటి సైతం..
హాలీవుడ్ నటి, మోడల్ గాల్గాడోట్ వైవిధ్య భరితమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి గాల్గాడోట్ ఇజ్రాయెల్కి చెందిన నటి, మోడల్గా, నాట్యకారిణిగా కెరీర్ సాగిస్తుండగానే అనూహ్యంగా హాలీవుడ్లో నటించే అవకాశం వచ్చింది. అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూడలేనంతగా సక్సెస్ని అందుకుంది. కెరీర్ మంచి పీక్లో ఉండగానే 2008లో ఇజ్రాయెలీ రియల్ ఎస్టేట్ డెవలపర్ జారోన్ యారోన్ వర్సనోను వివాహం చేసుకుంది.ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా. అయితే నాల్గోసారి గర్భందాల్చడం గాల్కి ప్రాణాంతకంగా మారిపోయింది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. మహిళలంతా తప్పక ఈవ్యాధిపై అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం అంటూ ఆరోగ్య స్ప్రుహని కలిగిస్తోంది. ఇంతకీ గాల్ నాల్గోసారి గర్భందాల్చినప్పుడూ ఏ వ్యాధిని ఎదుర్కొంది? ఎందువల్ల వస్తుంది..? తదితరాa గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!.గాల్గాడోట్కి నాల్గో గర్భధారణలో అది పెద్ద ఆరోగ్య సవాలుని ఎదుర్కొంది. సరిగ్గా ఎనిమిదోనెలలో ఉండగా సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ (CVT) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చుస్తుండగానే ఆమె పరిస్థితి విషమించడం మొదలైంది. దీంతో వైద్యులు ఆమెకు గర్భంతో ఉండగానే బ్రెయిన్కి సర్జరీ చేశారు. ఆ క్లిష్ట సమయంలోనే ఓరి అనే బిడ్డకు జన్మనిచ్చింది గాల్. అంతటి పరిస్థితిలోనూ సడలని నమ్మకంతో ఆ సమస్య నుంచి నెమ్మదిగా బయటపడటం మొదలు పెట్టింది. ఈ విషయాన్నే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అందరికీ ఈ వ్యాధిపై కచ్చితంగా అవగాహన ఉండాలని చెబుతోంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు దీనిపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమని తెలిపింది. సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటే..సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అనేది స్ట్రోక్ సంబంధిత అరుదైన రూపమని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా విపరీతమైన తలనొప్పి, మూర్చ వంటివి వస్తాయని అన్నారు. మెదడు సిరల సైనస్లలో రక్తం గడ్డకట్టడం లేదా సరైన రక్తప్రసరణ లేకుండా నిరోధించడం వల్లన ఈ పరిస్థితి ఏర్పడుతుందట. దీంతో బ్రెయిన్లో ఒక విధమైన ఒత్తిడి పెరిగి తత్ఫలితంగా తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్యలు లేదా ఫిట్స్ వంటి సమస్యలు వస్తాయని అన్నారు వైద్యులు. లక్షణాలు..తీవ్రమైన నిరంతర తలనొప్పిదృష్టి సమస్యలుమూర్చవికారం లేదా వాంతులుమాట్లాడటంలో ఇబ్బంది, నరాల సంబంధిత సమస్యలుకారకాలు..గర్భం దాల్చినప్పుడు, ముఖ్యంగా ప్రసవానంతర కాలంలోనూ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందది. డీ హైడ్రేషన్మెనింజైటిస్ వంటి అంటువ్యాధులు కారణంగానివారణ:దీన్ని సకాలంలో గుర్తిస్తేనే నివారించగలం. ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్లతో ఈ సమస్యను గుర్తిస్తారు వైద్యలు. మెదుడులోని గడ్డకట్టిన ప్రాంతాన్ని కరిగించేలా మందులు ఇవ్వడం లేదా సమస్య తీవ్రతను అనుసరించి సర్జరీ చేయాల్సి రావడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలామటుకు సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటేనే ఈ సమస్య నుంచి త్వరితగతిన బయటపడగలుగుతారు. అయితే కొందరూ రోగులు నాడీ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారని అన్నారు వైద్యులు. (చదవండి: ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!) -
మరో మహమ్మారి.. 15 మందిని కబళించిన ‘బ్లీడింగ్ ఐ’
కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో వ్యాధుల భయం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మార్బర్గ్, ఎంపాక్స్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 17 దేశాలను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. మార్బర్గ్ వైరస్ను ‘బ్లీడింగ్ ఐ’ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో ఈ వైరస్ కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. కొన్నివందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారినపడి, ప్రాణాలతో పోరాడుతున్నారు.తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో..ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బ్లీడింగ్ వైరస్ అనేది 50శాతం మరణాల రేటుతో తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో ఉంది. ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తూ, ప్రపంచదేశాలను వణికిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని ‘బ్లీడింగ్ ఐ’ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఇతర వైరస్ల వ్యాప్తితో పోరాడుతున్న ఆఫ్రికా దేశాలను ఈ కొత్త వైరస్ ఇప్పుడు చుట్టుముట్టింది.లక్షణాలివే..బ్లీడింగ్ ఐ వైరస్ సోకినప్పుడు తొలి లక్షణాలు రెండు నుండి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తాయి. తరువాత అతిసారం, వికారం, వాంతులు, దురద, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీటి తరువాత ముక్కు, పంటిచిగుళ్ళు, కళ్ళు, నోరు, చెవుల నుండి రక్తస్రావం అవుతుంది. అలాగే వాంతులు, మలంలో రక్తం, అంతర్గత రక్తస్రావం, వృషణాల వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. తరువాత బ్లీడింగ్ ఐ వైరస్ బాధితునికి ప్రాణాంతకంగా మారుతుంది.కరోనా కంటే ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులలో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలలో గబ్బిలాలు నివసిస్తాయి. ఇవి ఈ వైరస్కు ప్రధాన కారకంగా గుర్తించారు. కరోనా కంటే మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని పలు నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల ద్వారా లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ వైరస్కు ఎటువంటి మందులు లేవు. నివారణ చర్యలే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్ను వణికించిన వ్యాధులు -
‘బ్లడ్బ్యాంకులకు ‘రక్తహీనత’ అధ్వాన్నంగా పరిస్థితి
సాక్షి, దాదర్: ముంబైసహా రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే వివిధ ప్రభుత్వ, కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అత్యవసరమైనవి మినహా సాధారణ ఆపరేషన్లన్నిటినీ వాయిదా వేయాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో కేవలం 43,062 యూనిట్ల రక్తం నిల్వలున్నాయి. అయినప్పటికీ కొన్ని బ్లడ్బ్యాంకులు ఇక్కడి రోగులకు అందించాల్సిన రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్గా స్పందించిన రాష్ట్ర రక్త నిల్వల పరిషద్ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పరిస్ధితులు సాధారణ స్ధితికి వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు రక్తాన్ని పంపించడాన్ని నిషేధించాలని పరిషద్ నిర్ణయించింది. ప్రైవేట్ బ్లడ్బ్యాంకుల దోపిడీ... సాధారణంగా ఏటా దీపావళి, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో జనాలు తమ కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు లేదా విహార యాత్రలకు, పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతుంటారు. ఈ సమాయల్లో స్వచ్చంద సేవా సంస్ధలు, రాజకీయ పార్టీలు అక్కడక్కడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ దాతలు ఎవరూ ముందుకురారు. దీంతో దీపావళి, వేసవి సెలవుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత తీవ్రంగా ఉంటుంది. ఈసారి దీపావళి పర్వదినానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా తోడు కావడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పదాధికారులు బిజీగా ఉన్నారు. వీరిలో రక్తదాతలు కూడా ఉండడంతో పరిస్ధితి అధ్వాన్నంగా తయారైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రాజకీయ పార్టీల తరఫున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలులేకుండా పోయింది. స్వయం సేవా సంస్ధలు శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బిజీగా ఉండడంతో రక్త దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో అత్యవసర ఆపరేషన్లకే రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి వెంట ఉన్న బంధువులు రక్తం కోసం ఉరుకులు, పరుగులు తీయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో రక్తం లభించకపోవడంతో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులపై దృష్టిసారించారు. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించి రక్తాన్ని తీసుకువస్తున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో అయితే రోగుల బంధువులు రక్త దానం చేస్తేనే అందుకు బదులుగా అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా కొద్ది రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలతో రాజకీయ పార్టీలు చాలా బిజీగా ఉంటాయి. అంతేగాకుండా పదాధికారులు, కార్యకర్తలు విందులు, వినోదాలతో బిజీగా ఉండడంవల్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సమయం దొరకదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పరిస్ధితులన్నీ సాధారణ స్ధితికి వస్తే తప్ప రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలుకాదు. అంతవరకు రక్తం కొరతను చవిచూడక తప్పదని తాజా పరిస్ధితులను బట్టి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరపున కాకుండా వివిధ ధార్మిక, సామాజిక సేవా సంస్ధల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పరిషద్ పిలుపు నిచ్చింది. నివాస సొసైటీల ఆవరణలో, పాఠశాల మైదానాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. శిబిరాలు తమకు దగ్గరలోనే ఉండటం వల్ల రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వస్తారని పరిషద్ భావిస్తోంది. లేదంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్ధితి చేయి దాటిపోయే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తంచేసింది. -
Clinical Vampirism: ఈ జబ్బు గురించి తెలుసా?
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలా రక్తాన్ని రుచి చూసే ఆ పిశాచాల్లాంటి క్యారెక్టర్స్ను ఇంగ్లిష్లో ‘వాంపైర్స్’ అని పిలుస్తారు. కానీ అలా రక్తం తాగే కోరికతో ఉండే ఒక జబ్బు ఉంటుందనీ, ఆ మెడికల్ కండిషన్ పేరే ‘వాంపైరిజమ్’ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ వాంపైరిజమ్ గురించిన కథనమే కాస్త సంక్షిప్తంగా... ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతో కొంత రుచి చూస్తుంటాడు. దీనికి ఉదాహరణే... వేలు తెగినప్పుడు గబుక్కున అకస్మాత్తుగా చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఇందులో రక్తాన్ని రుచిచూడడానికంటే... అలా కంటిన్యువస్గా రక్తస్రావం జరగకుండా నివారించేందుకే ఇలా తెగిన వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఎవరికి వారు తమ సొంత రక్తాన్ని రుచి చూసే ఆ ప్రక్రియకు ‘ఆటో వాంపైరిజమ్’ అంటారు. వేలు తెగి రక్తస్రావం అవుతున్నప్పుడు చాలామందిలో కనిపించే ఈ ప్రక్రియ చాలా సాధారణమైన ప్రతిక్రియగా భావించవచ్చు. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఓ అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారిలో రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరిక పుట్టడాన్ని ‘క్లినికల్ వాంపైరిజమ్’ అంటారు. మరికొందరిలోనైతే ఇది కాస్త రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ ‘బిహేవియరల్ థెరపీ’ అనే చికిత్స చేస్తారు. అన్నట్టు... ఈ జబ్బు ‘రెన్ఫీల్డ్స్’ పేరిట 2023లో ఓ అమెరికన్ మూవీ కూడా విడుదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది ఓ ‘అమెరికన్ యాక్షన్ కామెడీ హారర్’ థీమ్తో తయారైన సినిమా. -
ఆస్పత్రి వద్దు.. బడికి వెళ్తానమ్మా..
గార్లదిన్నె: తన ఈడు పిల్లలతో కలసి బడికెళ్లాల్సిన ఓ చిన్నారి తలసేమియా వ్యాధి బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు. ‘అమ్మా... ఈ ఆస్పత్రి వద్దు.. నేనూ బడికి పోతా’నంటూ ఆ చిన్నారి అమాయకంగా అడుగుతుంటే నిరుపేద తల్లిదండ్రుల కంట నీరు ఆగడం లేదు. చాపకింద నీరులా కబళిస్తున్న మృత్యువు బారి నుంచి తమ బిడ్డను దక్కించుకునేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు పడుతున్న వేదన మాటల్లో వర్ణించలేం. తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు.కూలికెళితేనే పూట గడుస్తుంది..గార్లదిన్నె మండలం పాత కల్లూరులో నివాసముంటున్న సురేంద్ర, సుజాత దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఆదాయం అరకొరగా ఉన్నా... ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు శ్రీకాంత్ అరుదైన వ్యాధిబారిన పడి మృత్యువుతో పోరాడుతున్నాడు.15 రోజులకోసారి రక్తమార్పిడిఏడేళ్ల వయసున్న శ్రీకాంత్... నెల రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో సమీపంలోని పామిడిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మరో ప్రైవేట్ వైద్యుడికి చూపించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిలో ఎర్ర రక్తకణాలు క్షీణిస్తున్న విషయాన్ని పసిగట్టిన సదరు వైద్యుడి సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యులు వెంటనే రక్తం ఎక్కించారు. అయినా మార్పు కనిపించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని హయ్యర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు... హైదరాబాద్ లేదా బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో నేరుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తలసేమియా వ్యాధితో శ్రీకాంత్ బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆపరేషన్ చేసే వరకూ ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. దీంతో కుమారుడి వద్ద తన భార్యను ఉంచి సురేంద్ర స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబపోషణ కోసం తన వద్ద ఉన్న రెండు గేదెలు అమ్మడంతో పాటు ఇతరుల వద్ద అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని బెంగళూరుకు వెళ్లాడు. ఇప్పటి వరకూ వైద్యం కోసం దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇన్పేషెంట్గా ఉంటే ఆస్పత్రి ఖర్చులు భరించలేని దుస్థితికి చేరుకోవడంతో అదే ఆస్పత్రి బయట ఓ గదిని అద్దెకు తీసుకుని రోజూ వెళ్లి చికిత్స చేయించుకుని వస్తున్నారు. ఈ క్రమంలో సురేంద్ర అక్కడే కూలి పనులకు వెళుతుండగా.... తల్లి సుజాత కుమారుడి బాగోగులు చూసుకుంటోంది.బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి ...రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తున్న కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు నిరుపేద తల్లిదండ్రులు మొక్కని దేవుడంటూ లేడు. రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారీ రూ.20 వేలు ఖర్చు వస్తోంది. ప్రస్తుతం చేతిలో నయా పైసా లేదు. బెంగళూరులోనే సురేంద్ర కూలీ పనుల ద్వారా సంపాదిస్తున్న అరకొర డబ్బు రోజు వారి అవసరాలకు సరిపోతోంది. స్వశక్తితో కుమారుడికి నయం చేయించుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఇలాంటి పరిస్థితిలో తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు.బ్యాంక్ వివరాలు...ఖాతాదారు పేరు : కె.సుజాతబ్యాంక్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కల్లూరు శాఖ, గార్లదిన్నె మండలంఖాతా నంబర్ : 3879 010 6265ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0002737ఫోన్పే నంబర్లు : 90145 15056,81067 51483 -
క్యాన్సర్కు నమ్మకమే ఆన్సర్
బ్లడ్ క్యాన్సర్ సోకిన డాక్టర్ నేత్రావతి... తన గురించి తన ఆరేళ్ల కొడుకు ఎక్కడ భయపడతాడో, అసలే ఆందోళనలో ఉన్న తనను చూసి అతడెక్కడ బెంగపడతాడో అని తనకు జబ్బును ఆ చిన్నారి నుంచి దాచిపెట్టింది. తాను స్వయానా డాక్టర్. అందునా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావడంతో కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా చూస్తుండేది. దాంతో మొదట్లో తనలో కనిపించిన లక్షణాలను చూసి తనకూ కోవిడ్ సోకిందేమో అనుకుంది. ఎట్టకేలకు అది చాలా తీవ్రమైన ఓ తరహా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. చికిత్స జరగకపోతే బతికేది రెండువారాలూ... మహా అయితే మూడు వారాలు!! ఇప్పుడామె పూర్తిగా కోలుకుని, తనలా క్యాన్సర్ బారిన పడి ఆందోళనతో బెంబేలెత్తుతున్నవారికీ కౌన్సెలింగ్ చేయడం, ధైర్యం చెప్పడం చేస్తోంది. అదీ తాను చికిత్స తీసుకున్న మణిపాల్ హాస్పిటల్లోనే. ఈలోపు మరికాస్త ఎదిగిన కొడుకు ఆమె వీడియోలను చూసి... ‘అమ్మా... నువ్వెంత ధైర్యవంతురాలివి. నిజంగా నువ్వు విజేతవమ్మా’’ అంటుంటే... క్యాన్సర్ మీద కంటే పెద్ద విజయమిది అంటోంది ఆ తల్లి. ఆ విజయగాధను విందాం రండి. డాక్టర్ నేత్రావతి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఊరట కలిగిస్తున్న సమయమది. అప్పట్లో 2020 – 2021 నాటి రోజుల్లో కరోనా వైరస్ ఉద్ధృతంగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆ క్షణాల్లో ఒకనాడు తనకూ జ్వరంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. తీవ్రమైన అలసట. ఒకవైపు చెయ్యి లాగేస్తోంది. విపరీతమైన నిద్రలేమి. ఒకవేళ నిద్రపడితే అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసుకుంటే ఒళ్లంతా చల్లటి చెమటలు. ఈ లక్షణాలన్నీ దాదాపుగా కోవిడ్నే తలపిస్తున్నాయి. అందునా తాను రోజూ కరోనా రోగులకు సేవలందిస్తూ ఉండటంతో కోవిడ్ సోకిందేమోనని మొదట అనుకుంది.తీరా చూస్తే తీవ్రమైన బ్లడ్క్యాన్సర్... అసలు సమస్య తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకుని రి΄ోర్టు చూసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ 10,000 కంటే కిందికి పడి΄ోయింది. (ఇవి కనీసం 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి). హిమోగ్లోబిన్ కౌంట్ ఐదు కంటే తక్కువ! (ఇది మహిళల్లో 12 నుంచి 15 వరకు ఉండాలి). తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోయి ఉంది. అవేవీ కోవిడ్కు సంబంధించినవి కావు. ఏదో తేడా కొడుతోంది అనుకుంది. మణిపాల్ హాస్పిటల్లోని హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున కళాషెట్టిని సంప్రదించింది. వ్యాధి నిర్ధారణలో అది ‘అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అనే బ్లడ్ క్యాన్సర్గా తేలింది.నాకే ఎందుకిలా... డాక్టర్ నేత్రావతి మంచి ఆరోగ్యస్పృహ ఉన్న వ్యక్తి. తానే స్వయానా డాక్టర్. ప్రతి వీకెండ్కూ బెంగళూరు కబ్బన్ పార్కులో పచ్చటి చెట్ల మీది నుంచి వచ్చే పచ్చి గాలి పీలుస్తూ కొడుకూ, భర్తతో సైక్లింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తుంటుంది. వేళకు నిద్రలేవడం, సమయానికి నిద్ర΄ోవడంతో పాటు డాక్టర్ కావడంతో మంచి ఆరోగ్య స్పృహతో ఉండటం, ఆరోగ్యకరమైనవి తినడం ఇవన్నీ చేస్తుండేది. తీరా బ్లడ్ క్యాన్సర్ కనిపించాక... అందరూ చెప్పే మాటే తన నోటి నుంచీ వచ్చింది. అందరిలాగే తానూ అనుకుంది... ‘‘నాకే ఎందుకిలా?!’’ ఆమె వెతలు ఆమె మాటల్లోనే...‘‘ఎట్టకేలకు చికిత్స మొదలైంది. నిజానికి క్యాన్సర్ వ్యాధి కంటే దాని చికిత్సా... అది మనిషి మీద చూపే శారీరక, మానసిక దుష్ప్రభావాలే ఎక్కువగా కుంగదీస్తుంటాయి. నాకున్న ΄÷డవాటి ఒత్తైన జుట్టును చూస్తూ చూస్తూ కోల్పోవాల్సి వచ్చింది. కీమోతో నోట్లోని, కడుపులోని మ్యూకస్ పారలు తీవ్రంగా దెబ్బతిని, ‘మ్యూకోసైటిస్’ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. కీమో మొదలైన రెండు లేదా మూడు వారాల పాటు నోట్లో ఉండే మ్యూకస్ పారలు దెబ్బతినడం వల్ల నోట్లో తెల్లటి చీముమచ్చలు వస్తాయి. దాంతో తినడం, తాగడం, మాట్లాడటం కష్టమయ్యేది. కీమోథెరపీలోని మందులు ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను తుదముట్టిస్తూనే ఆరోగ్యకరమైన మంచి కణాలనూ దెబ్బతీస్తుంటాయి. దాంతో ఈ దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. కష్టమనిపించనప్పునడు నా ఆరేళ్ల కొడుకు రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకున్నా.’’డాక్టరే పేషెంట్ అయితే...‘‘ఈ చికిత్స ప్రక్రియల సమయంలో మరెన్నో కాంప్లికేషన్లు కనిపించాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. రక్తపోటు పడిపోయింది. ఎందుకు వస్తోందో తెలియని తరచూ వచ్చే జ్వరాల మధ్య ఒక్కోసారి శ్వాస ఆడేది కాదు. ఊపిరి అందడమే కష్టమయ్యేది.’’ ‘‘ఇలాంటి దశలో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. తమను తాము తమాయించుకోలేరు. ఇక ఆ బాధితురాలు ఒక డాక్టరైతే... లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి అది ఆవేదన మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఒక్కమాటలో చెప్పాలంటే జబ్బుకూ, నాకూ జరిగే ఈ పోరులో... నా మానసిక బలం, నా మీద నాకున్న విశ్వాసం ఇవన్నీ గతంలో నేనేనాడూ చూడని స్థాయికి పెరిగాయి. నేను తట్టుకోగలిగే నా సహనపు చివరి అంచు సరిహద్దును మరింత ఆవలకు నెట్టాను’’ అంటూ తన ఆవేదనను కళ్లకు కట్టారు డాక్టర్ నేత్రావతి. చివరగా...డాక్టర్ నేత్రావతి చెబుతున్న మాటలివి... ‘‘జబ్బు తర్వాత మంచి క్రమశిక్షణతో కూడిన జీవితం క్రమం తప్పకుండా ఫాలోఅప్, డాక్టర్ సలహాలు ఖచ్చితంగా పాటించడం. ఇతరులు చెప్పే ప్రత్యామ్నాయ చికిత్సలను పెడచెవిన పెట్టడం, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర, మధ్యాహ్నం ఓ చిన్న పవర్న్యాప్... ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పడు కంప్లీట్ బ్లడ్ కౌంట్లో తెల్లరక్తకణాలు నార్మల్గా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నా.ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు... ‘అక్యూ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా – ఏపీఎల్’ అని పిలిచే ఆ బ్లడ్ క్యాన్సర్ ఒకప్పుడు చాలా ప్రమాదకరం. కానీ ఇటీవల కొత్త చికిత్సా ప్రక్రియలు వస్తున్న కొద్దీ దాని గురించిన భయం తగ్గుతూ వస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ జబ్బుకు చికిత్స తీసుకున్నవారిలో 99% మంది నాలుగేళ్లు పైబడి జీవిస్తుంటే... ఐదేళ్లకు పైబడి జీవిస్తున్నవారు 86% మంది ఉన్నారు. -
50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!
బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ (ఎన్హెచ్ఎస్బీటీ(NHSBT)) శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. దీంతో దాదాపు 50 ఏళ్లుగా నిపుణులను కలవరపరుస్తున్న వైద్య రహస్యానికి తెరపడింది. ఈ సరికొత్త ఆవిష్కరణ రక్తమార్పిడి పద్ధతులను మార్చడమే కాకుండా రోగులకు కొత్త ఆశను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. పరిశోధకులు కనుగొన్న కొత్తబ్లడ్ రూప్ మాల్(MAL). ఇది ఏన్డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన జన్యుపర మూలం. దీన్ని 1972లో మానవులు రక్తంలో గుర్తించారు. దీని వల్ల రక్త మార్పిడిలో ప్రతి చర్యలు లేదా సమ్యలు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందనేది నాటి శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు. నిజానికి ఏనడబ్ల్యూజే యాంటిజన్ అనేది అధిక సంఘటన యాటిజన్లని అర్థం. దాదాపుగా మానవులందరి ఎర్రరక్త కణాలపై ఈ యాంటిజెన్లు ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఉండవు. దీన్ని గుర్తించడం కష్టం కూడా. అందువల్ల రక్తమార్పిడిలో కొందరు రోగులకు సమస్యలు ఎదురయ్యేవి. ఇది వైద్య శాస్త్రంలో చేధించలేని మిస్తరీగా ఉండేది. అది ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణతో 50 ఏళ్ల మిస్టరీని చేధించగలిగారుఈ మేరకు దాదాపు 20 ఏళ్లుగా ఈ ఎన్హెచ్ఎస్ బ్లండ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ పరిశోధనకే అంకితమైన పరిశోధకుడు లూయిస్ టిల్లీ మాట్లాడుతూ.. తాము ఈ ఏన్డబ్ల్యూజే యాంటిజెన్ బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమునా అరుదైన రక్తరకాలు ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెబుతున్నారు. రక్తమార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రతిచర్యలకు లేదా సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం. ప్రతిఏడాది దాదాపు 400 మంది రోగులు రక్తమార్పిడితో సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పారు. వారికి రక్తం సరిపోలక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ఆ సమస్యలన్నింటికి ఈ కొత్త రక్తనమునా చెక్ పెట్టిందన్నారు. ఈ కొత్త బ్లడ్గ్రూప్ ఏన్డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ ఉన్న దాతలు, గ్రహితలు ఇద్దరిని గర్తించడానికి జన్యు రూప పరీక్షలకి అనుమతిస్తుంది కాబట్టి అరుదైన కేసుల్లో రోగులకు ఎదురయ్యే రక్తమార్పిడి సమస్యలను ఇది నివారించగలుగలదని ధీమాగా చెబుతున్నారు. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల సంరక్షణను మెరుగుపరుచడమే కాకుండా రక్తమార్పిడి భద్రత, ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప అద్భత ఆవిష్కరణగా పేర్కొన్నారు నిపుణులు.(చదవండి: ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్లోనే పెట్టి పడేస్తున్నారా?) -
గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!
రక్తంలో పలు రకాల గ్రూప్లు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్లు ఉంటాయి. దాన్ని అనుసరించే ఎవరికైన రక్తదానం చేయడం వంటివి చేస్తాం . అయితే బ్లడ్ గ్రూప్ని బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరీ బ్లడ్ గ్రూప్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా చూద్దామా..!గుండె సమస్యలు వచ్చే ప్రమాదం..ఈ రోజుల్లో చాలా మందికి గుండెజబ్బుల బారినపడుతున్నారు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయట. మిగతా బ్లడ్ గ్రూప్లు ఏ, బీ, ఏబీ వాళ్లకి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. అయితే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయని తెలిపారు.పెప్టిక్ అల్సర్..ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లకి వస్తుంది.కేన్సర్కేన్సర్ ఎక్కువగా ఏ,బీ, ఏమీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దపెద్ద కేన్సర్లు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువగా ఉంటుందట.ఒత్తిడిసాధారణంగా సమస్యలు వస్తే ఒత్తిడికి గురవుతారు. సమస్యను బట్టి కొందరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు.వెయిన్స్ త్రాంబోఎంబోలిజంకొంతమందికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్ త్రాంబోఎంబోలిజం అంటారు. అయితే ఇది ఎక్కువగా ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మధుమేహ వ్యాధి..ప్రస్తుతం చాలా మందికి మధుమేహం వస్తోంది. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఏ, బీ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకి వస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం మాత్రమే. పూర్తి వివరాలను కూలంకషంగా తెలుసుకుని వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణుల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
పిక్కకు ఓ లెక్కుంది..! అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు..!
మనిషికి శరీరం పైభాగంలో అంటే రొమ్ములో ఒక గుండె ఉంటుంది. అదే రీతిలో రెండు కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... పిక్కలు. నిజానికి అవి అచ్చంగా గుండెలు కాకపోయినప్పటికీ గుండె చేసే పనినే పిక్కలూ కొంతవరకు చేస్తాయి. గుండె రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేసినట్టే సరిగ్గా పిక్క కూడా రక్తాన్ని పైకి పంప్ చేయడంతోపాటు పైకెళ్లాల్సిన రక్తం భూమ్యాకర్షణకు లోనై కిందికి వెళ్లకుండా అక్కడి కవాటాలు ఆపుతాయి. అందుకే ‘పిక్క’ను శరీరపు రెండో గుండెకాయగా కొందరు చెబుతుంటారు. గుండె చేసే పనిని పిక్కలు ఎలా చేస్తాయో చూద్దాం. పిక్కను పరిశీలనగా చూసినప్పుడు అది కూడా ఇంచుమించూ ‘హార్ట్ షేపు’లోనే కనిపిస్తుంది. గుండె తన పంపింగ్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంటే... కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వచ్చేలా చూస్తుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. గుండె డ్యూటీలను పిక్క ఎలా చేస్తుందంటే... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడి రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ అనే కండరాలు ఈ పనిలో కీలకంగా ఉంటాయి. ఈ కండరాలు క్రమబద్ధమైన రీతిలో స్పందిస్తూ... ముడుచుకోవడం (కాంట్రాక్ట్ కావడం), తెరచుకోవడం (రిలాక్స్కావడం)తో కాళ్లకు సరఫరా అయ్యే రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. రక్తం మళ్లీ కిందికి పడిపోకుండా వాల్వ్స్ (కవాటాల) సహాయంతో మూసుకు΄ోతూ పైవైపునకే ప్రవహించేలా చూస్తాయి. ఒకవేళ అలా పిక్కలు పనిచేయకపోతే రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అప్పటికీ ఈ రక్తంలోని ఆక్సిజన్ను కండరాలు వినియోగించుకున్నందున తగినంత ఆక్సిజన్ అందక తీవ్రమైన అలసటకు గురవుతాయి. పిక్క గుండెలా పనిచేయకపోతే... కాళ్ల చివరలకు రక్తసరఫరా తక్కువగా జరగడం వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం సరిగా జరగకపోవడం చెడు రక్తాన్ని తీసుకు΄ోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడంతో ఈ కింది పరిణామాలు జరగవచ్చు. అవి... ⇒ కాళ్లు అలసిపోవడం ⇒ కాళ్లూ, పాదాలలో వాపు ⇒ కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకపోవడం ⇒ కాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్తో బాధపడటం వేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరలు ఉబ్బి చర్మం నుంచి బయటకు కనిపించడం) ∙కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్). ఎవరిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటే...? చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారిలో ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండే లెక్చరర్లు, టీచర్లు, కండక్టర్లు, ట్రాఫిక్ ΄ోలీసులు... మొ‘‘ వారిలో స్థూలకాయుల్లో గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలల్లో ఈ సమస్య కనిపించవచ్చు.సమస్యను అధిగమించడం కోసం... పాదాలను మడమ దగ్గర్నుంచి పైకీ కిందికీ (ఫ్లెక్స్ అండ్ పాయింట్) కదిలిస్తూ ఉండటం ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్) బరువును / ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం. కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమిపెట్టేలా ‘వీనస్ స్టాకింగ్స్’ వంటి తొడుగులను ధరించాలి. అప్పటికీ అలాగే కనిపిస్తుంటే వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలి. --డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, సీనియర్ వాస్కులార్ అండ్ ఎండో వాస్కులార్ సర్జన్(చదవండి: డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్) -
కవలలకు జన్మనిచ్చిన బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు
ఇండోర్(మధ్యప్రదేశ్): ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు కవలలకు జన్మనిచ్చారు. ప్రపంచంలోనే ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మైయెలాయిడ్ లుకేమియా అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్తో బాధ పడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా చూడటం సవాల్తో కూడుతున్న వ్యవహారమని ఆస్పత్రిలోని క్లినికల్ హెమటాలజీ విభాగం ప్రొఫెసర్ అక్షయ్ లహోటీ తెలిపారు. ‘ఈ గర్భవతిని మా ఆస్పత్రిలో చేరి్పంచిన సమయంలో ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల(డబ్ల్యూబీసీ)సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో, కీమో థెరపీతోపాటు సాధారణ క్యాన్సర్ మందులు ఇవ్వలేకపోయాం’అని ఆయన చెప్పారు. ‘దేశ, విదేశాల్లోని నిపుణులను సంప్రదించాక ఆమె ఆరోగ్యంతోపాటు గర్భంలోని ఇద్దరు శిశువులకు ఎటువంటి హాని వాటిల్లకుండా ప్రత్యేకంగా మందులు ఇచ్చాం’అని లహోటీ తెలిపారు. ‘మొదటిసారి గర్భం దాలి్చన బాధితురాలికి బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం చెప్పలేదు. గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఆమెకు సాధారణ ప్రసవం చేశాము. బాబు, పాప జని్మంచారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు’ అని గైనకాలజిస్ట్ డాక్టర్ సుమిత్రా యాదవ్ వివరించారు. మైయెలాయిడ్ లుకేమియా ఉన్న మహిళలకు సురక్షిత ప్రసవం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు. -
పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్: ఈ కేన్సర్ని ఎలా గుర్తించాలి..?
భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూ 71 ఏళ్ల వయసులో మరణించాడు. గైక్వాడ్ 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. వాటిలో 2 సెంచరీలతో కలిపి మొత్తం 2,254 పరుగులు చేశాడు. అతను 1983లో పాకిస్తాన్పై 201 పరుగులు చేశాడు. అయితే గైక్వాడ్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. అసలు ఈ ప్రాణాంతకమైన వ్యాధి అంటే ఏంటీ..? ఎందువల్ల వస్తుంది..? అంటే..ఇది ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి. ఇక్కడ మాజీ గైక్వాడ్ తన అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు ధైర్యంగా పోరాడుతూ లండన్లో చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. బ్లడ్ కేన్సర్ అంటే..కేన్సర్ అంటే కణాల నియంత్రణ లేని పెరుగుదల. అదే విధంగా, బ్లడ్ కేన్సర్ అంటే రక్త కణాల అనియంత్రిత పెరుగుదల. రక్త కేన్సర్ హెమటోలాజిక్ కేన్సర్ అని కూడా పిలుస్తారు. ఎముక మజ్జ, శోషరస వ్యవస్థ, రక్త కణాల వంటి రక్తం-ఏర్పడే కణజాలాలలో (ప్రాధమిక, ద్వితీయ లింఫోయిడ్ అవయవాలు) ప్రారంభమవుతుంది.ఎలా ప్రభావితం చేస్తుందంటే..రక్త కణాల విధులు,ఉత్పత్తిలు బ్లడ్ కేన్సర్ ద్వారా ప్రభావితమవుతాయి. చాలా వరకు కేన్సర్లు రక్తం ఉత్పత్తి అయ్యే ప్రదేశం నుంచి అంటే ఎముక మజ్జ నుంచి ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రక్త కణాల అభివృద్ధి ప్రక్రియ అసాధారణ రకం కణాల పెరుగుదల ద్వారా చెదిరిపోతుంది. ఈ కేన్సర్ రక్త కణాలు రక్త నష్టాన్ని నివారించడం, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడడం మొదలైన ప్రాథమిక విధులను నిర్వహించకుండా రక్తాన్ని ఆపుతాయి.లుకేమియా సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది.లింఫోమా సాధారణంగా 16 నుంచి 24 ఏళ్ల వయసు గల వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవారితో పోలిస్తే 31% మంది పురుషులు లుకేమియాతో బాధపడుతున్నారు.ఈ కేన్సర్లో రకాలు..మైలోమా: ఎముక మజ్జలో మొదలై ప్లాస్మా కణాలను ప్రభావితం చేసే కేన్సర్లింఫోమా: ఇది ఎముక మజ్జను కలిగి ఉన్న శోషరస వ్యవస్థకు సంబంధించిన కేన్సర్లుకేమియా:ఇది పిల్లలు,యుక్తవయస్కులలో వచ్చే అత్యంత సాధారణ రక్త కేన్సర్ఎందువల్ల అంటే..దీనికి డీఎన్ఏ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. డీఎన్ఏ రక్తకణాలు ఎప్పుడూ విభజించాలి, లేదా గుణించాలి లేదా ఎప్పుడు చనిపోవాలనేది చెబుతుంది. ఇక్కడ డీఎన్ఏ సూచనలు ఆధారంగా శరీరం అసాధారణమైన రక్త కణాలను అబివృద్ధి చేస్తుంది. ఇవి సాధారణం కంటే వేగంగా పెరుగుతాయి,గుణించబడతాయి. అలాగే ఒక్కోసారి సాధారణం కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. దీంతో సాధారణ కణాలు గుమిగూడి ఎముక మజ్జలో స్థలాన్ని గుత్తాధిపత్యం చేసే అసాధారణ కణాల సముహంలోకి సాధారణ రక్త కణాలు పోతాయి. అందువల్ల ఎముక మజ్జ సాధారణ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల జన్యుమార్పిడి మూడు రకాలు కేన్సర్లకు కారణమవుతుంది. సంకేతాలు, లక్షణాలుబ్లడ్ కేన్సర్ని బట్టి లక్షణాలు మారతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మూడు రకాల బ్లడ్ కేన్సర్లో కామన్గా కనిపించే సంకేతాలు ఏంటంటే..అలసట తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా నిరంతర అధిక జ్వరంరాత్రి చెమటలతో తడిచిపోవడంఅసాధారణ రక్తస్రావం లేదా గాయాలుఊహించని విధంగా బరువు తగ్గడంరోగనిరోధక వ్యవస్థపై ప్రభావం కారణంగా తరచుగా ఇన్ఫెక్షన్లువాపు శోషరస కణుపులు లేదా విస్తరించిన కాలేయం లేదా ప్లీహముఎముక నొప్పిఈ లక్షణాలన్నీ కొన్ని వారాలకు మించి శరీరంలో ఉంటే తక్షణమే వైద్యుడుని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: రియల్ లైఫ్ వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే 14 కిలోలు..!) -
అన్యురిజమ్స్ అంటే?
మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అకస్మాత్తుగా ప్రమాదకరంగా పరిణమించే ఈ సమస్య గురించి...మెదడులోని ఏప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి ఉంటే ఆప్రాంతం పేరుతో అన్యురిజాన్ని చెబుతారు. ఉదాహరణకు సెరిబ్రమ్ అనే ప్రదేశంలో ఉంటే సెరిబ్రల్ అన్యురిజమ్స్ అంటారు. మెదడు చుట్టూ ఉండే ప్రధాన ప్రాంతం సబార్కనాయిడ్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమైతే దాన్ని ‘సబార్కనాయిడ్ హ్యామరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రదేశాన్ని బట్టి మెదడు ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ అవయవం ప్రభావితమవుతుంది. అయితే ఇలా అన్యురిజమల్ బ్లీడ్కి గురైన ప్రతి ఏడుగురిలోనూ నలుగురు ఏదో ఒక రకమైన వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. కీలక ప్రాంతంలో రక్తస్రావం కాగానే మొదట అది పక్షవాతానికీ (స్ట్రోక్కు), తీవ్రతను బట్టి కోమాలోకి తీసుకెళ్లే అవకాశాలెక్కువ.బయట పడేందుకు అవకాశం తక్కువ... ఎందుకంటే? అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో అవి వారి జీవితకాలంలో అవి చిట్లక΄ోవచ్చు. ఉబ్బు చిన్నగా ఉన్నవి కాకుండా... ‘జెయింట్ అన్యురిజమ్స్’ అని పిలిచే పెద్దవి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలెక్కువ. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా వస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక వల్ల గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు: కంట్రోల్లో లేని అధిక రక్త΄ోటు, డయాబెటిస్ వంటి జబ్బులు. చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు (ఈ కారణంగా ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ) రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్తో కలిగే కాంప్లికేషన్లు ఆరోగ్యకరంగా లేని జీవనశైలి పొగాకు వాడకం, మద్యం అలవాటు యాక్సిడెంట్లో రక్తనాళాలకు గాయం కొన్ని అరుదైన కేసుల్లో : ఉదా. ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియాకిడ్నీల్లో నీటితిత్తులు వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్.చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు: జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం.చికిత్సలు: మందులిస్తూ చేసే చికిత్స: ఇది రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స. రక్త΄ోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొన్ని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె (క్రేనియమ్) తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిగాక ముందులాగే రక్తప్రసరణ జరిగేలా చూస్తారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ను ప్రవేశపెట్టి... అందులో నుంచి మరింత చిన్నపైప్లను అన్యురిజమ్స్ వరకు చేరేలా చేసి, అక్కడ కాయిల్ అనే డివైజ్ని అన్యురిజమ్ నింపడానికి వాడతారు. దాంతో ఉబ్బిన బలహీన ప్రాంతానికి రక్తసరఫరా ఆగడంతో చిట్లడం జరగదు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియతో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. దాంతో పెద్ద రక్తనాళాల దగ్గర ఉన్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇక ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’తో రక్తపు దిశను మళ్లించి ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. (చదవండి: కేరళలో నిఫా వైరస్ కలకలం..!) -
ఉత్తరప్రదేశ్.. రక్తదానంలో నంబర్ వన్
రక్తదానం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ముందున్నారు. రాష్ట్ర జనాభాలోని 14.61 శాతం మంది ప్రజలు 2023లో రక్తదానం చేసి, తమ సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడంలో యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.ఆర్టీఐ కార్యకర్త విపుల్ శర్మ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-రక్తకోష్ పోర్టల్ డేటాను షేర్ చేసింది. దీనిలోని వివరాల ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో రక్తదానం చేసేవారి సంఖ్య ప్రతి ఏటా 50 శాతానికి పైగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ 2021లో 45 లక్షల యూనిట్ల రక్తం సేకరించగా, అది 2022 నాటికి 80 లక్షల యూనిట్లకు పెరిగింది. 2023లో దేశంలోని మూడు వేలకు పైగా బ్లడ్ బ్యాంక్లలో మొదటిసారిగా 1.29 కోట్ల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో అత్యధికంగా 18.11 లక్షల యూనిట్ల రక్తాన్ని ఉత్తరప్రదేశ్లోని 400కు పైగా బ్లడ్ బ్యాంకులు అందించాయి.మహారాష్ట్రలో 15.20 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, గుజరాత్లో 10.51 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమెరికన్ రెడ్క్రాస్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సగటున 4.3 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక పురుషునిలో సగటున 5.7 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి రోజూ 400 నుండి రెండు వేల మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఒకసారి అర లీటరు రక్తాన్ని దానం చేయవచ్చు. 2018లో దేశంలోని 124 బ్లడ్ బ్యాంకులు ఈ-రక్తకోష్ పోర్టల్లో నమోదయ్యాయి. ఆ ఏడాది వీటిలో మొత్తంగా 35 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 2019లో రక్తదానం 43 లక్షల యూనిట్లకు పెరిగింది. అయితే 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో కేవలం 40 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించారు. -
అమ్మానాన్న బొమ్మను రక్తంతో గీసి...
యాక్రలిక్, ఆబ్స్ట్రాక్ట్, పాప్ ఆర్ట్, పెయింటర్లీ, వాటర్ కలర్, ఆయిల్ పెయింట్, పేస్టల్స్ కాదేదీ పెయింటింగ్కు అనర్హం అన్నట్లు... విచిత్రంగా రక్తంతో బొమ్మలు గీసి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. నగరానికి చెందిన అనిల్ కుమార్. కొందరు కాన్వాస్పై యాక్రిలిక్తో అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తే మరికొందరు మట్టిముద్దలతో శిల్పాలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఈ క్రియేటివిటీ మరింత పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో వైవిధ్యమైన రీతిలో కళాకారులు మ్యాజిక్ చేస్తున్నారు. నగరానికి చెందిన యువ చిత్రకారుడు అనిల్ కుమార్ దీని కోసం బ్లడ్ను ఉపయోగిస్తూ... ‘రక్త’ సంబంధాలను సరికొత్తగా పునర్నిర్వచిస్తున్నాడు. అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. బ్లడ్ ఆర్ట్ అనే పదం వినడానికి ప్రత్యేకంగా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ‘బ్లడ్ పెయింటింగ్ భావోద్వేగాలను పంచుకునేందుకు సాటిలేని మార్గం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ప్రేమికులు...తమ మధ్య ఉన్న బలమైన సంబంధాలను తెలియజెప్పేందుకు ఓ శక్తివంతమైన సాధనమని’ అనిల్ అంటున్నాడు. దైవకృపతో అబ్బిన కళ... దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అనిల్ కుమార్కు ఎటువంటి చదువు, సాధన లేకుండా చిత్రకళ అబ్బింది...అతని కళాత్మక ప్రయాణం 2019లో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం హాబీ..అలా అలా పోట్రెయిట్స్ గీయడం అలవాటైంది. బీటెక్ పూర్తి చేసినా ఏదో ఒక ఉద్యోగంలో ఇమడలేక పోట్రెయిట్ (పెన్సిల్ స్కెచింగ్) కళలో ప్రావీణ్యం సంపాదించాను. అప్పుడు నేను పెన్సిల్స్ (మైక్రో ఆర్ట్) మీద పేర్లు చెక్కడం ప్రారంభించాను’ అని అనిల్ చెప్పాడు. అయితే ఫేస్ డ్రాయింగ్లు మైక్రో ఆర్ట్ ద్వారా ప్రొఫెషనల్ అనిపించుకున్నప్పటికీ సరైన ఆర్డర్స్ లేక ఏదో ఒక ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమ్మాయి ‘కళ్ల’తో పుట్టిన కళ... బెంగుళూర్కు చెందిన మైక్రో ఆర్ట్ కస్టమర్ తన సోదరి కళ్లను తన రక్తంతో గీయమని అడిగారు. ‘తొలుత నేను ఒప్పుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో చేసిన ఆ వర్క్ని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. అయినా అప్పుడు కూడా బ్లడ్ ఆర్ట్ని సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మానాన్నల మ్యారేజ్ డే రోజున నా రక్తాన్ని ఉపయోగించి వారిద్దరి చిత్రాలనూ గీశాను. అది వారి మనసుకు హత్తుకోవడం మాత్రమే కాదు నా భవిష్యత్తును మార్చేసింది’ అని అనిల్ గుర్తు చేసుకున్నాడు. దేశవిదేశాల నుంచి... అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. వేలాది మంది తమ ప్రియమైన వారి బ్లడ్ పెయింటింగ్స్ కోసం నాకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. ‘దాంతో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనీసం కొన్ని వారాల పాటు సమయం తీసుకోవాల్సి వస్తోంది’ అని అనిల్ చెప్పాడు. జాగ్రత్తలు తప్పనిసరి..‘ఈ మాధ్యమాన్ని ఉపయోగించి చిత్రాలు గీసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రభావితమయ్యే మొదటి వ్యక్తి చిత్రకారుడే.. కాబట్టి.. గ్లవ్స్, మాస్క్ ధరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి’ అని అనిల్ కుమార్ స్పష్టం చేశాడు. రక్తాన్ని సేకరించడం నుంచి గోడపై కళాకృతిని అలంకరించడం వరకూ... ప్రతీది కఠినమైన పరిశుభ్రతతో జరుగుతుందని చెప్పాడు. తమకు కావాల్సిన పోట్రెయిట్ను గీయించుకోవాలనుకున్న కస్టమర్స్... అనుభవజ్ఞులైన ల్యాబ్ టెక్నీషియ సాయంతో చిన్న ట్యూబ్ ద్వారా సేకరించిన బ్లడ్ (సుమారు 3 నుంచి 4గ్రా) అనిల్కు అందిస్తారు. దానిని కనీసం వారం రోజుల వరకూ భద్రంగా నిల్వచేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పోర్ర్టెయిట్ను మాత్రమే పూర్తి చేస్తున్నానని అనిల్ చెబుతున్నాడు. కస్టమర్ తీసుకెళ్లేవరకూ దుర్వాసన లేదా తేమను గ్రహించకుండా ఆర్ట్వర్క్ను సంరక్షించడానికి ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగిస్తామన్నాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతితో వేసిన సిసలైన చిత్రకళ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఏఐ కూడా రీ క్రియేట్ చేయలేని బ్లడ్ ఆర్ట్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది’ అంటున్నాడు అనిల్. -
రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..
చంద్రమండలంలో అడుగుపెట్టే మేధా శక్తి ఉన్న మనిషి సృష్టించలేనిది.. అరచేతిలోనే ప్రపంచాన్ని అందిపుచ్చుకునే సాంకేతికత ఉన్నా కూడా తయారు చేయలేని పదార్థం. ఎన్ని కొంగొత్త ఆవిష్కరణలు చేసినా.. కృత్రిమంగా తయారు చేయడానికి వీలుపడనిది...'రక్తం'. నిరంతరం వ్యాధులతో పోరాడే వారికి..రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు అత్యవసరమైనది.. 'రక్తమే'. ఈ నేపథ్యంలోనే రక్తదానాన్ని ప్రోత్సహించడం కీలకమన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ 14న నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రక్తదానంపై ఉన్న అపోహలు, సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్ గురించి సవివరంగా తెలుసుకుందాం.ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. జూన్ 14నే ఎందుకంటే.. నోబెల్ గ్రహిత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టైనర్ పుట్టినరోజున జరుపుకుంటున్నాం. ఆయన ఏబీఓ బ్లడ్ గ్రూప్ కనుగొన్నందువల్లే రక్తమార్పిడి గురించి ప్రపంచానికి తెలిసింది. అందువల్లే కార్ల్ ల్యాండ్స్టైనర్ గౌరవార్థం ఇలా ఆయన జయంతి రోజున రక్తదాతల దినోత్సవం పేరుతో రక్త దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ఈ రోజున మనమిచ్చే రక్తంతో ఎన్ని ప్రాణాలు నిలబడతాయో శిబిరాలు నిర్వహించి మరీ తెలియజేస్తారు అధికారులు. అయితే చాలామందిలో రక్తదానం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. మనం గనుక ఇప్పుడు దానం చేస్తే ఏమైనా.. అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. ఒక్కసారి రక్తదానం చేశాక మళ్లీ తొందరగా కోలుకుంటామా అనే భయం కూడా ఉంటుంది చాలమందిలో. అయితే వైద్యులు అవన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు. పైగా రక్తదానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు..రక్తదానం చేసిన 48 గంటల్లోనే ఒక వ్యక్తి రక్త పరిమాణం సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. వృద్ధులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రక్తదానం చేయవచ్చని చెబుతున్నారుమందులు వాడుతున్నావారు కూడా రక్తదానం చెయ్యొచని చెబుతున్నారు. రక్తదానం కేంద్రంలో వారే వాడే మందులు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్ని సమయాల్లో కొన్ని రోజుల పాటు ఆయా మందులను నిరోధించమని చెప్పి..తర్వాత దాత నుంచి రక్తాన్ని తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.అలాగే రక్తదానం చేసే ప్రక్రియ సాధారణంగా 15 నిమిషాలకు మించి సమయం పట్టదు. జీవితాలను నిలబట్టే మహత్తర కార్యం ఇది అని చెబుతున్నారు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడతాం అనుకుంటారు. ఇది కూడా అపోహ అని తేల్చి చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే రక్తదాన కేంద్రాలు అంటువ్యాధులను నివారించడానికి కఠినమైన భద్రతా ప్రోటాకాల్లను పాటిస్తాయి. పైగా దానం చేసిన రక్తాన్ని ఉపయోగించే ముందు అంటువ్యాధుల కోసం క్షణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది నొప్పి లేకుండా దాతనుంచి సునాయాసంగా చిన్న పాటి సుదితో రక్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానం చేసే వ్యక్తి, వయసు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా ఏడాదికి చాలాసార్లు రక్తదానం చెయ్యొచ్చని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి 2 నెలలు లేదా 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్..భారతదేశంలోని ఆస్పత్రుల్లో దాదాపు 14.6 మిలియన్ల యూనిట్ల రక్తం డిమాండ్ ఉన్నట్లు అంచనా వేశాయి. అయితే ఈ డిమాండ్ తగ్గట్టు కేవలం 96% మాత్రమే రక్తం అందుబాటులో ఉందని, దాదాపు ఒక మిలియన్ యూనిట్ వరకు చాలా సెంటర్లలో కొరత ఉందని పేర్కొంది నివేదిక. అందువల్లే స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రజల్లో చైత్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు వంటివి ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్తం కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2017లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల యూనిట్ల రక్తం కొరతను ఉందని, ఏకంగా 119 దేశాల్లో బ్లడ్ సెంటర్లలో రక్తం అందుబాటుల్లో లేదని వెల్లడించాయి నివేదికలు.దీన్ని పరిష్కరించేందుకు స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలి. రక్త నిర్వహణ పద్ధతులను మెరుగుపరచాలి, రక్తమార్పిడి వ్యవస్థలను బలోపేతం చేయాలి. రక్త మార్పిడి ఎలాంటప్పుడంటే..ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు తక్షణమే రక్తం అవసరం. సురక్షితమైన రక్తం అందుబాటుల్లో ఉండే ప్రాణాలను రక్షించగలుగుతాం. వైద్య విధానాలు: శస్త్ర చికిత్సలు, కేన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి, ప్రసవం తదితర వాటికి రక్తమార్పిడి అవసరం అవుతుంది. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హిమోఫిలియా వంటి పరిస్థితుల్లో బాధపడుఉన్న రోగులకు వారి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా రక్తమార్పిడి అవసరం. రక్తహీనత: ఐరన్ లోపం లేదా ఇతర కారణాల వచ్చే రక్తహీనత, ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలను పునరుద్ధరించడానికి రక్తమార్పిడి అవసరంబ్లడ్ డిజార్డర్స్: లుకేమియా, లింఫోమా, రక్త సంబంధిత రుగ్మతల చికిత్స కోసం రక్తమార్పిడి కీలకం. ప్రసూతి మరణలను నివారించడానికి, గర్భధారణ, ప్రసవ సమయంలో సురక్షితమై రక్త మార్పిడి చాలా కీలకం.తదితర వాటిలో సురక్షితమైన రక్తం అవసరమవుతుంది. అందువల్ల ఈ దినోత్సవం రోజున ప్రజలు స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేస్తే సురక్షితమైన రక్తం కొరతను నివారించగలుగుతాం. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం. అంతేగాదు రక్తం ఇవ్వడం అంటే ప్రాణం ఇచ్చినట్లే అని అందరూ గ్రహించాలి. ఈ మహాత్తర నిస్వార్థ కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకుని ఈ సమస్యను నివారిద్దాం.(చదవండి: రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!) -
పుణే పోర్షే కేసు: మకందర్కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్ను అతని తల్లి శాంపిల్తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?
లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే డైట్లో మామిడిపండ్లు తీసుకోవడం, టీలో చక్కెర వేసుకోవడం వంటివి చేస్తున్నారని ఈడీ ఆరోపణలు చేసింది. అయితే కోర్టు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం తినడానికి అనుమతించినందున మామిడిపండ్లు, స్వీట్లతో సహా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవ్యక్తి ఇలాంటివి తింటారా అనేది ఈడీ వాదన, కానీ కేజ్రీవాల్ న్యాయవాది మాత్రం డాక్టర్ సూచించన ప్రకారమే ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ మామిడి పండు కారణంగా డయాబెటిస్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయలు పెరుగుతాయా అంటే..? నిజానికి అరవింద్ కేజ్రీవాల్ టైప్2 డయాబెటిస్ పేషెంట్. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. ఇక్కడ ఆయన డైట్లో మామిడిపండ్లు తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? అసలు షుగర్ పేషెంట్లు తినోచ్చా అంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో మామిడి పండు ఒకటి. ఇది అధిక చక్కెర కంటెంట్ తోపాటు ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ సీ, ఫైబర్, కాపర్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే ఇందులో 90 శాతానికి పైగా కేలరీలు చక్కెర నుంచే వస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చక్కెర స్థాయిలను ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా మామిడి, అరటి పండ్లు, సపోటా, వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎల్ సుదర్మన్ రెడ్డి అన్నారు. అయితే ఇందులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాటి మొత్తం చక్కెర ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. అందులో ఉండే ఫైబర్ శరీరంలోని రక్తం చక్కెరను గ్రహించే రేటుని తగ్గిస్తుంది. పైగా శరీరంలోని కార్బోహైడ్రేట్లు ప్రభావాన్ని తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ పండుని తీసుకుంటే షుగర్ పేషంట్లకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపారు. అయితే దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందేలా షుగర్ పేషెంట్లు ఎలా తీసుకుంటే మంచిదంటే.. మామిడి పండును డయాబెటిక్ ఫ్రెండ్లీగా మార్చే మార్గాలు.. ముందుగా డైట్ని అరకప్పు మామిడి కప్పులతో ప్రారంభించండి ఆ రోజు అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. ప్రోటీన్లు తీసుకోవాలి. అందుకోసం గుడ్డు, కొన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. మామిడి పండ్లు అమితంగా ఇష్టం అనుకునేవారు ఆరోజు మంచిగా పండ్లు తింటూనే సరిపడ ప్రోటీన్ ఫైబర్ అందేలా ఫుడ్స్ని జోడిస్తే సరి. అప్పుడు మామిడిపండ్లు డయాబెటిస్ పేషెంట్లు తిన్నా ఏం కాదు. (చదవండి: 61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!
డైట్ల ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్థాలను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే..శరీరానికి ఉపయోగపడే గట్ బ్యాక్టీరియా అందిస్తుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధన పేర్కొంది. అంతేగాదు ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎలా రక్తపోటుని తగ్గిస్తాయో సవివరంగా పేర్కోంది. ఏం చెబుతోందంటే.. మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మహిళలు, పురుషులు బీపీని తగ్గించడానికి తినాల్సిన డైటరీ ఫైబర్(ఎక్కువ ఫైబర్ ఉన్నవి) కొద్ది మొత్తంలో అందించారు. ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్న వారిలో రక్తపోటు తగ్గడమే గాక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మందులతో సంబంధంల లేకుండా బీపీ గణనీయంగా తగ్గడం గుర్తించామనని అన్నారు పరిశోధకులు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బీపీ ఎక్కువ ఉన్న మహిళలు ఉదాహరణకు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రోజుకి సుమారు 28% పైబర్ తీసుకోవాలని సూచించింది. అదే పురుషులకైతే రోజుకి 38 గ్రాముల వరకు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రతి అదనపు 5 గ్రా సిస్టోలిక్ బీపీ 2.8 mmHgకి, డయాస్టోలిక్ బీపీ 2.1 mmHgకి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పైబర్ కంటెంట్ ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన గట్ మైక్రోబయోమ్ని అందించి తద్వారా బీపీకి దోహదపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ రెగ్యులేటరీ యాసిడీలను ఉత్పత్తి చేసేలా అనుమతిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ కోసం డైటరీ ఫైబర్కి ప్రాధాన్యత ఇవ్వడం గురించి హైలెట్ చేసిందని పరిశోధకుడు మార్క్స్ చెప్పారు. తాము రోగులకు ట్రీట్మెంట్లో భాగంగా అధిక ఫైబర్ ఉన్న పదార్థాలను ఇచ్చాక రక్తపోటు తగ్గి హృదయ నాళాలను మెరుగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యుల ఆహారంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) పేర్కొంది. అలాగే పెద్దలు సగటు ఆహారంలో కనీసం 15 గ్రాముల చొప్పున ఫైబర్ తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి సాధారణ నియమంగా, ప్రతి భోజనంలో కనీసం ఒక తృణధాన్యాలు (ఉదా., బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, క్వినోవా, బుల్గుర్) చేర్చండి హోల్గ్రెయిన్ బ్రెడ్ను ఎంచుకోండి (ఒక స్లైస్లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది) తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్తో ఉడికించాలి సలాడ్లకు బీన్స్ జోడించండి - దీనిలో ప్రతి ½ కప్పు సర్వింగ్లో 7 నుంచి 8 గ్రా ఫైబర్ ఉంటుంది వారానికి రెండు లేదా మూడు సార్లు, సూప్లు, కూరలు వంటి వాటిలో మాంసానికి బదులుగా చిక్కుళ్ళు (ఉదా., పప్పులు, బఠానీలు, బీన్స్, చిక్పీస్, వేరుశెనగలు) వేయండి. రోజుకు కనీసం ఐదు పండ్లు లేదా కూరగాయలను తినే యత్నం చేయండి తృణధాన్యాలకు పండ్లను జోడించడం మరింత మంచిది. పండ్ల రసాల కంటే పండు పలంగా తినడానికే ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్య ఫైబర్ అంది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది లేదా మందుల అవసరం లేకుండానే రక్తపోటు తగ్గిపోవడం జరుగుతుంది. (చదవండి: పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..) -
జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన జైలులో ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు ‘ఎక్స్ ’వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. అయితే ఆయనకు ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ దేశం కోసం 24 గంటలు పని చేసేవారిని ఆతీసీ అన్నారు. కానీ తీహార్ జైలు అధికారులు ఆ ఆరోపణలన్నింటిని కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, షుగర్ లెవెల్స్ కూడా తగ్గలేదని పేర్కొనడం గమనార్హం. అయితే ఇక్కడ మధుమేహ వ్యాధితో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులు బరువు మీద ప్రభావం చూపిస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి? తదితరాల విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం!. ఇన్సులిన్ నిర్వహణ: ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు..వారి శరీరం ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేయదు. పైగా ప్రతిస్పందించదు. దీని వల్లే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఎప్పుడైతే శరీరం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించలేకపోతుందో అప్పుడు రక్తప్రవాహంలో చక్కెర ప్రసరణకు దారితీస్తుంది. ఫలితంగా అదికాస్త కొవ్వుగా పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది. కొందరూ బరువు ఎలా తగ్గిపోతారు.. రక్తంలోని చక్కెర స్థాయిలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే శరీరం ముఖ్యమైన శక్తి వనరులను కోల్పోతుంది. శక్తి కోసం గ్లూకోజ్ను సమర్థవంతంగా వినియోగిచదు. దీంతో శక్తికోసం శరీరం ఉన్న కొవ్వు నిల్వలను, కండరాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంద. దీంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1తో బాధపడేవారిలో ఈ పరిస్థితి ఎదురవ్వుతుంది. ద్రవాలను కోల్పోతుంది.. రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు డీ హైడ్రేషన్, నీటి నిలుపదలకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కారణంగా మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ వెళ్లపోతుండటంతో నిర్జలీకరణ దారితీసి, శరీర బరవును తాత్కలికంగా పెంచే రీహైడ్రేషన్కి గురై బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీవక్రియ ప్రభావం దీర్థకాలికి వ్యాధి అయిన బ్లడ్ షుగర్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇక్కడ కణాలలోకి గ్లూకోజ్ పొందాలంటే శరీరానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. ఈ అదనపు ఇన్సులిన్ కొవ్వు నిల్వకు దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకుంటే..? బరువు నిర్వహణకు ఇది అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులు సరైన మందులు వాడుతూ..ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలాగే శారీర శ్రమ, రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా పర్యవేక్షించడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతాం. బరువు కూడా అదుపులో ఉంటుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. వ్యక్తిగత నిపుణులు, వైద్యులు సలహాలు సూచనలతో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తల తీసుకుని ఆచరిస్తే మంచిది అనేది తెలసుకోవడం ఉత్తమం. (చదవండి: మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్) -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్వెజ్గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్ని బట్టి చికెన్ లేదా మటన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!
మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే. విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు. ఎందుకు తాగుతున్నారంటే.. ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి గేదెలను ఉపయోగిస్తారట!) -
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!
రక్తంతో జుట్టు రాలు సమస్యకు చికిత్స చేస్తారట. దీన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాప్మా థెరపీ అని అంటారు. ఈ కొత్త చికిత్స విధానాన్ని హార్వర్ మెడికల్ వైద్య బృందం అభివృద్ధి చేసింది. దీని వల్ల బట్టతల, ఆడవాళ్ల జుట్టు రాలు సమస్యను తగ్గించొచ్చిన చెబుతున్నారు. ఇక్కడ వైద్యులు బాధితుల సొంత రక్తంతోనే వారి హెయిర్ గ్రోత్ని డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి!. ఎందుకంటే మన రక్తంలోని ప్లాస్మాలో పుష్కలంగా ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి హెయిర్ని పెరిగేలా చేయగలవట. అందుకని రోగి నుంచి తీసుకున్న రక్తంలోని ప్లాస్మాని తీసుకుని దానిని తలలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయగానే ఆ ప్రదేశంలోని చర్మం ఆకృతి మెరుగపడి తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. చెప్పాలంటే ఈ చికిత్స హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వివిధ చికిత్సల కంటే సురక్షితమైనది, సమర్థవంతమైనది. ఈ చికిత్స విధానం గురించి నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ప్రచురితమయ్యింది. ఈ థెరఫీని జుట్టు రాలు సమస్యలను, బట్టతల సమస్యను నివారిస్తుందని అన్నారు. ఈ చికిత్స విధానంలో ప్లాస్మాలోని ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ రూపంలో తలపై ఇవ్వడంతో వెంట్రుకల కుదుళ్ల దగ్గర జుట్టు పెరిగేలా వృద్ధికారకాలను ఉత్ఫన్నం చేస్తాయి. తద్వారా వంశపారంపర్యంగా వచ్చే ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా బట్టతల, ఆడవారిలో వచ్చే జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. జుట్టు బాగా కురుల్లా ఉండాలనుకునేవారు ఈ థెరపీని సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు చేయించుకోవచ్చట. అలాగే రోగి రక్తాన్ని సేకరించేటప్పుడూ గడ్డకట్టకుండా, ప్లేట్లెట్స్ యాక్టివ్గా ఉండేలా ప్రత్యేకమైన ట్యూబలో సేకరిస్తారు. ఆ తర్వాత ఎర్ర రక్త కణాలను వేరు చేసి ప్లేట్లెట్లను మాత్రమే తీసుకునేలా మొత్తం రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఇలా వేరు చేసిన ప్లేట్లెట్లను సిరంజి ద్వారా నెత్తిపై చర్మానికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో గ్రోత్ మొదలవుతుంది. ఎవరెవరూ చేయించుకోవచ్చంటే.. ఈ ప్లాస్మా థెరపీ ఆరోగ్యవంతమైన పెద్దలకు చెయ్యొచ్చు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు సిఫార్సు చెయ్యరు. అలాగే రక్తస్రావం, ప్లేట్లెట్ పనిచేయకపోవడం లేదా ప్లేట్లెట్ సమస్య ఉన్నా, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా ఈ ప్లాస్మా థెరపీని సిఫార్సు చెయ్యరు వైద్యులు. దీన్ని ఇంజెక్ట్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ప్రీ హెచ్ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్-అప్ తదితరాలను చెక్ చేసి గానీ రక్తాన్ని సేకరించారు సురక్షితమా..? ఈ చికిత్స చాలా సురక్షితమైనదని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రోగులు సొంత రక్తంతోనే ఈ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఈ ప్రక్రియ సమయంలో వైద్యులు సరైన స్టెరిలైజేషన్ నిర్వహించకపోతే మాత్రం రోగికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం బాగా ఉంటుంది. తలపైన ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం కాబట్టి ఆ ప్రాంతమంతా కాస్త నొప్పిగా కూడా ఉండొచ్చు, గానీ అది ఒక్కరోజులోనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలని సూచించారు. (చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!) -
షేవింగే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది, నెల రోజులు కోమాలో!
ఇన్ గ్రోయిన్ హెయిర్ అమెరికాలో ఒక వ్యక్తిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ సెప్పిస్ బారిన పడ్డాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. బతికే అవకాశం చాలా తక్కువని చెప్పారు.చివరికి బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. కానీ అనూహ్యంగా.. కోలుకోవడం విశేషంగా నిలిచింది.. వివరాలు ఇలా ఉన్నాయి న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అమెరికాటెక్సాస్ రాష్ట్రానికి చెందిన36 ఏళ్ల స్టీవెన్ స్పైనాల్ గజ్జల వద్ద ఉన్న ఇన్గ్రోన్ హెయిర్ను తొలగించుకున్నాడు. దీనికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ సోకి చివరికి సెప్సిస్షాక్కు దారి తీసింది. రక్తం గడ్డకట్టడం, డబుల్ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కి దారితీసింది. ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరింది. దీంతొ కోమాలోకి వెళ్లి పోయాడు. ఇక కష్టం అని ప్రకటించిన వైద్యులు చివరి ఆశగా వెంటిలేటర్పై ఉంచి దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించిన స్టీవెన్ కొద్దిగా కోలుకున్నాడు. మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని సోదరి మిచెల్ పోస్ట్ చేసిన టిక్టాక్ వీడియో సమాచారం ప్రకారం 2022 ఏడాది చివరల్లో అనారోగ్యానికి గురైన స్టీవెన్ 2023 చివరినాటికి కొద్దిగా బలం పుంజు కున్నాడంటూ స్టీవెన్ రికవరీ జర్నీనీ షేర్ చేసింది. ఇందు కోసం 8వేల డాలర్లు ఖర్చు అయినట్టు తెలిపింది. గోఫండ్మీ ద్వారా విరాళాలకోసం అభ్యర్థించింది. (ఇన్ గ్రోయిన్ హెయిర్: పురుషులు ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేకదిశలో(ఎదురు) షేవ్ చేసుకున్నా, కట్ అయినా వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే వీటిమీద రాంగ్ డైరెక్షన్లో వెంట్రుకలొస్తాయి. దీనికి సాధారణంగా వైద్య చికిత్స అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ షేవింగ్ జెల్ లేదా క్రీమ్ లాంటివి వాడతారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే సెప్సిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీన్నే " సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. మహిళలల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనా ప్రకారం ప్రతీ ఏడాది 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్ బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 270,000 మంది మరణిస్తున్నారు.) -
Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? దేనివల్ల అనే విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. నిజానికి ఇక్కడ సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడూ ఆయనకు ఇలా జరగడం అందర్నీ తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంటే ఇక్కడ సద్గురు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. నిజానికి ఇలా మెదడులో రక్తస్రావం అవ్వడానికి ముందు సంకేతమే తీవ్రమైన తలనొప్పి అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టైంలోనే వైద్యులను సంప్రదిస్తే మెదడులో బ్లీడింగ్ జరగకుండా కొంత నిరోధించగలమని చెబుతున్నారు. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుందంటే..? బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే ఇది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్ని ఐస్కీమిక్ స్ట్రోక్గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.. ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇక్కడ సద్గురు నాలుగువారాలుగుఆ తీవ్రమైన తలనొప్పిని ఫేస్ చేశారు. అయినప్పటికీ సామాజికి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో సమస్య తీవ్రమయ్యిందని చెప్పొచ్చు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఎందుకు వస్తుందంటే.. అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. అయితే జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి కూడా స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలను ఒక నెల ముందు నుంచి కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా పసిగడితే ప్రాణాపాయం నుంచి బయటపడగలమని అంటున్నారు నిపుణులు. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
USA: ‘ఈసారి నేను గెలవకపోతే’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికల్లో తన గెలుపునకు సంబంధించి దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ తనతోనే సాధ్యమని, బైడెన్తో కాదని చెప్పారు. ఒహియోలో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి బెర్నీ మొరినో తరపున ప్రచారం చేస్తూ శనివారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Here’s the whole clip of Donald Trump talking about the bloodbath. pic.twitter.com/pu8M35B5MR — Molly Pitcher (@AmericanMama86) March 17, 2024 ‘నేను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేను గనుక గెలవకపోతే ఈ దేశంలో మళ్లీ మీకు ఎన్నికలు ఉంటాయో లేదో చెప్పలేను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బైడెన్ క్యాంపెయిన్ టీమ్ స్పందించింది. ‘ట్రంప్ మళ్లీ జనవరి 6 (2021లో వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్పై దాడి జరిగిన రోజు)ను కోరుకుంటున్నాడు. ట్రంప్ తీవ్రవాద, కక్షపూరిత వైఖరికిగాను నవంబర్లో ప్రజలు అతడికి మళ్లీ ఓటమిని రుచి చూపించనున్నారు’ అని బైడెన్ టీమ్ ఎక్స్(ట్విటర్) పోస్టు చేసింది. Biden-Harris campaign statement on Trump tonight promising a “bloodbath” if he loses pic.twitter.com/8mBYh4QKnf — Biden-Harris HQ (@BidenHQ) March 17, 2024 కాగా, ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ పడ్డ జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల ప్రైమరీ బ్యాలెట్లలో వీరిద్దరే అధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్ అయ్యారు. 1952, 1956లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఒకసారి పోటీపడ్డ ఇద్దరు అభ్యర్థులు తిరిగి రెండోసారి పోటీపడ్డారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికాలో గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మళ్లీ ఈ ఏడాది ఎన్నికల్లో పోటీపడనుండటం విశేషం. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్ను పేల్చేసిన అమెరికా -
ల్యాబ్కు ఆకాశ్ రక్త నమూనాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్కు ఇప్పటికే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించి ఆయన మద్యం సేవించలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు... తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కు పంపినట్లు తెలిసింది. అలాగే ఆకాశ్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆకాశ్ స్టేట్మెంట్ను మేజి్రస్టేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నాయని.. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రమాదం జరిగిందని ఆకాశ్ చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి ముందు రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర లేకపోవడంతోనే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర మత్తు ఆవహించిందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అనే దానిపై ల్యాబ్ రిపోర్టులు వస్తేనే సైంటిఫిక్ ఎవిడెన్స్ లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. వాహన తయారీ లోపాలేమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే ప్రయాణించిన వాహనంలో తయారీ లోపాలేమైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. ప్రమాద తీవ్రతకు కారు విడిభాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే అంతకంటే ఎక్కువ వేగంతో వాహనం ప్రయాణిస్తోందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పటాన్చెరు పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని పరిశీలించారు. -
రెడ్లైట్ థెరఫీతో షుగర్కి చెక్! పరిశోధనలో షాకింగ్ విషయాలు
చక్కెర వ్యాధి పేరు చెబితేనే అందరికి భయం వేస్తుంది. అదీగాక ఇటీవల కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీన్ని అదుపులో పెట్టుకోవడమే గానీ తగ్గడమనేది ఉండదు. అలాంటి చక్కెర వ్యాధిని జస్ట్ ఎరుపు రంగు కాంతితో అడ్డుకట్టవేయొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేగాదు చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. దీన్ని రెడ్ లైట్ థెరఫీ అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏంటీ థెరఫీ? ఎలా తగ్గించొచ్చు?.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో డయాబెటిస్ని ‘రెడ్లైట్ థెరపీ’(ఎరుపు రంగు కాంతి)తో నియంత్రించొచ్చని వెల్లడయ్యింది. ఈ రెడ్ లైట్ స్టిమ్యులేటెడ్ ఎనర్జీ ప్రొడక్షన్లో నాన్-ఇన్వాసివ్, నాన్-ఫార్మాకోలాజికల్ అనే టెక్నిక్ గ్లూకోజ్ వినియోగాన్ని పెంచుతుందని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని నిరూపితమయ్యింది. ఈ పరిశోధనలో రెడ్లైట్ థెరపీ ద్వారా మైటోకాండ్రియాలో 670 నానోమీటర్ల ఉత్తేజిత శక్తి (స్టిమ్యులేటెడ్ ఎనర్జీ)ని ఉత్పత్తి చేయగలిగినట్లు గుర్తించారు. అది గ్లూకోజ్ వినియోగానికి దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో ముఖ్యంగా గ్లూకోజ్ తీసుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అనూహ్యంగా 27.7% తగ్గడమే కాకుండా గ్లూకోజ్ స్పైకింగ్ను గరిష్టంగా 7.5%కి తగ్గించింది. ఈ మైటోకాండ్రియా కీలకమైన సెల్యులార్ ప్రక్రియలకు శక్తిని అందిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ గ్లూకోజ్ని ఉపయోగించి శక్తి అధికంగా ఉండే న్యూక్లియోసైడ్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP)ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏటీపీ ఉత్పత్తిలో మెరుగుదల కారణంగా మైటోకాండ్రియా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుందని చెప్పారు పరిశోధకులు. అందుకోసం సుమారు 30 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై పరిశోధనలు చేశారు. ఒక 15 మందికి 670 nm రెడ్ లైట్ థెరఫీ ఇవ్వగా మిగిలిన వాళ్లకు ఈ థెరపీ ఇవ్వలేదు. వారందరి దగ్గర నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నోటి గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షను తీసకున్నారు. అలాగే గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో కూడా పరీక్షించారు. ఈ అధ్యయనంలో సుమారు 45 నిమిషాలు రెడ్లైట్ ఎక్స్పోజర్ని పొందిన వ్యక్తుల రక్తంలో గణనీయంగా గ్లూకోజ్ స్థాయిలు తగ్గగా, మిగిలిన వారిలో చక్కెర నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ థెరఫీ తీసుకున్న వారిలో భోజనం తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన గ్లూకోజ్ స్పైక్లు కూడా తగ్గినట్లు గుర్తించారు. అలాగే మనం ఉపయోగించే ఈ ఎల్ఈడీ లైట్లలలో కూడా నీలం రంగే ఉంటుంది కానీ అస్సలు ఎరుపు రంగు ఉండదని అన్నారు. అందువల్ల మైటోకాండ్రియా ఏటీపీ ఉత్పత్తి ఫంక్షన్ని తగ్గిస్తోందని చెప్పారు. ఇలా శరరీం ధర్మానికి విరుద్ధంగా పనిచేయడం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు తెలిపారు పరిశోధకులు. ఇది క్రమేణ దీర్ఘకాలిక మధుమేహనికి దోహదం చేసి బలహీననపరుస్తుందని అన్నారు. ఈ పరిశోధన కాంతి ప్రాముఖ్యతను తెలియజేసింది. అలాగే ఈ ఎరుపు రంగ కాంతిలో జస్ట్ 15 నిమిషాలు ఉంటే చాలు మంచి ఫలితాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన మొత్తం జర్నల్ ఆఫ్ బయోఫోటోనిక్స్లో ప్రచురితమయ్యింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఎల్ఈడీ లైట్లు వినియోగం పెరగుతున్నందువల్ల త్వరితగతిన అందరూ ఈ ముప్పుని గుర్తించాలని అన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!) -
నవజాత శిశువులను కాపాడే అరుదైనా బ్లడ్ గ్రూప్!
రక్తమార్పిడ్లు గురించి విన్నాం. చాలామందికి ప్రమాద కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్ల రక్తం ఎక్కించాల్సి ఉంటంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ నవజాత శిశువులకు కూడా ఒక్కోసారి జననంలో ఎదురయ్యే సమస్యల కారణంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అయితే వారికి ఎక్కించే రక్తం విషయంలో మాత్రం వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఎక్కించాక ఏవైనా సమస్యల రాకుండా పలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ నవజాత శిశువులకు ఎలాంటి రక్తాన్ని ఎక్కిస్తారు? ఆ రక్తానికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారంటే.. అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ బీ-ని నవజాత శిశువులకు ఎక్కిస్తారు. ఆ రక్తాన్ని నియో అనే బ్లడ్ని బ్లూ ట్యాగ్ బ్యాగ్లె కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే? ఈ బ్లడ్ అప్పుడే పుట్టిన శిశువులకు ఇచ్చేది కాబట్టి దానిపై నియో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. ఇక్కడ ‘నియో’ అంటే నియోనాటల్. 28 రోజుల వయసున్న చిన్నారుల గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతుంటారు. ఇక ఈ రక్తం నవజాత శిశువులతో పాటు కొందరు రోగులకు సాయం చేస్తుంది. ఎలాంటి పరీక్షలు చేస్తారంటే.. సాధారణంగా దానం చేసిన రక్తంనతంటికీ హెచ్ఐవీ, హెపటీటిస్ బీ, సీ, ఈ, అలాగే సిఫిలిస్ వంటి పరీక్షలు చేపడతామని హెమటాలసీ డాక్టర్ ఆండీ చార్టన్ వివరించారు. ఆ పరీక్షలు అన్ని పూర్తి అయిన తర్వాత రోగులకు సరిపోతుందా? లేదా? అని అనేది తెలుసుకోవడం కోసం కొన్ని శాంపిల్స్ తీసుకుని మరిన్ని పరీక్షలను, ప్రక్రియలను చేపడతామని చెప్పారు. అంటే..కొందరి వ్యక్తులకు అంతకుముందు రక్తమార్పిడి సమయంలో వచ్చిన అలర్జిక్ రియాక్షన్ల ప్రొటీన్లు తొలగించిన తర్వాత రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని తెలిపారు శిశువులకు ఎక్కించాలంటే తప్పనసరిగా ఆ పరీక్ష.. నవజాత శిశువులకు, ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్లకు(రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న రోగులకు), గర్భిణులకు, గర్భాశయంలో ఎదిగే పిండానికి ఎక్కించే రక్తానికి తప్పనిసరిగా సైటోమెగాలో(CMV) అనే వైరస్కు సంబంధించి పరీక్షించాల్సి ఉంటుంది. ఇది హెర్పస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ చాలా సాధారణం. ఇది హానికరమైనది కాదు. స్వల్పంగా ఫ్లూ వంటి లక్షణాలను లేకపోతే ఎలాంటి లక్షణాలను ఇది కలిగి ఉండదు. కానీ, కొందరికి మాత్రం ఇది ప్రమాదకరం. ఈ వైరస్ వల్ల పిల్లలకి మూర్ఛ రావొచ్చు, కళ్లు మసకబారడం, వినికిడి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కిడ్నీ, ప్లీహాన్ని దెబ్బతీయొచ్చు. చాలా అరుదైన కేసుల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చు. ఒకవేళ రక్తంలో ఈ వైరస్ ఉంటే అది ఇలాంటి శిశువులకు, రోగులకు ఇవ్వడానికి పనికిరాదు. అయితే ఈ రక్తం దొరకడం అనేది అత్యంత అరుదు. అందువల్ల ఈ రక్తం గల దాతలు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎందరో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. దయచేసి బీ నెగిటివ్ గ్రూప్ కల వారు తమ రక్తం ఎంతో అమూల్యమైనదని గర్వించడమే గాకుండా ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎన్నో ప్రాణాలను రక్షించిన వారవ్వుతారు. (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
హైదరాబాద్లో మెడికల్ మాఫియా.. అక్రమంగా బ్లడ్, ప్లాస్మా అమ్మకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్లోని హీమో ల్యాబొరేటరీస్లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీని అడ్డుకునే శక్తి వారికి మాత్రమే ఉంది: కేటీఆర్ వ్యాఖ్యలు -
అక్కడ నది హఠాత్తుగా నెత్తుటి రంగులో ప్రవహిస్తోంది!
ఎక్కడైన నదిలో నీళ్లు తెల్లగానే ఉంటాయి. కానీ ఇక్కడ నదిలో నీళ్లు మాత్రం ఎర్రటి నెత్తురులా మారిపోయాయి. చెప్పాలంటే రక్తంలా ప్రవహిస్తున్నాయి నీళ్లు. ఇలా ఎందుకు జరిగిందో అని స్థానికలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన దక్షిణ రష్యాలో చోటు చేసుకుంది. ఇలా జరగడానకి కారణం ఏంటన్నది అక్కడి అధికారులకు అంతు చిక్కని మిస్టరీలా ఉంది. వివరాల్లోకెళ్తే..దక్షిణ రష్యాలోని కెమెరోవోలోని ఇస్కిటిమ్కా నది సడెన్గా ఎరుపు రంగులో ప్రవహిస్తోంది. ఒకప్పుడూ చక్కగా ప్రవహించే నది ఇలా రక్తపు నదిలా ఎలా మారిందనేది తెలియక స్థానికులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడూ ఈ ఘటనే సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ఈ ఘటన నీటి కాలుష్యం గురించి తక్షణమే తీసుకోవాల్సిన చర్యల ఆవశక్యతను తెలియజేసింది. అంతేగాదు బాతులు వంటి చిన్న జంతువులు ఏవీ ఆ నీటిలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Travel Nature Wanderlust (@worlderlust) ఈ ఘటనపై పర్యావరణ అధికారులు సైతం భయాందోళనలు వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగానే ఇలా జరిగిందేమో! అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ నగర డిప్యూటీ గవర్నర్ ఆండ్రీ పనోవ్ డ్రైనేజీ లీక్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అక్కడ నది ఇలా సడెన్గా రంగు మారడానికి కచ్చితమై కారణం ఏంటన్నది రసాయన పరీక్ష ద్వారా తెలియాల్సి ఉంది. కాగా, ఇలాంటి ఘటనే సరిగ్గా జూన్ 2020లో ఉత్తర సైబీరియాలో నోరిల్స్క్ సమీపంలోని పవర్ స్టేషన్లో డీజిల్ రిజర్వాయర్ కూలిపోవడంతో ఇలాంటి ఘటన జరిగింది. దీని కారణంగా అనేక ఆర్కిటిక్ నదులన్నీ ఎర్రగా మారి ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా దాదాపు 15 వేల టన్నుల ఇంధనం నదిలోకి పోగా, ఆరు వేల టన్నులు మట్టిలోకి ఇంకిపోయింది. ఆ టైంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అత్యవసర పరిస్థితిని కూడాప్రకటించారు. మళ్లీ ఇదే తరహాలో రష్యాలోని మరో నగరంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఇలాంటి ఘటనలు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, జలవనరులను కాలుష్య కోరల నుంచి కాపాడు కోవాల్సిన ప్రాముఖ్యతలను గూర్చి నొక్కి చెబుతున్నాయని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. మానవ తప్పిదాలు, పారిశ్రామిక కార్యకలాపాలు పర్యావరణానికి ఎలా నష్టం కలిగిస్తున్నాయో ఇప్పటికైనా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే మానవళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
సినిమా రక్తం
‘టప్’మంటూ లైట్ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు. హిందీలో ‘దుష్మన్’ అనే సినిమా పెద్ద హిట్. రాజేష్ఖన్నా హీరో. లారీ డ్రైవర్. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్’గా తీస్తే హిట్ అయ్యింది. ఇదే రాజేష్ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్ దక్కే అవకాశం లేదు. పోలీస్జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్’లో అమితాబ్ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు. ‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్ తీసిన బి.ఎన్.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. ఎన్.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్ నియమం ఉండేది. అంతెందుకు? చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్కు పంపితే క్లయిమాక్స్లో సంజీవ్ కుమార్ గబ్బర్ సింగ్ను ఎలా చంపుతాడు... సెన్సార్ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్ రీషూట్ చేసి గబ్బర్ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది? రామ్గోపాల్ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్తోపాటు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్గన్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి. రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి. సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్హాఫ్లో కాకపోతే సెకండ్ హాఫ్లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్’ పడవలసిందే కదా!! -
మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!?
'సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా!?' ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇవి కూడా చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి! -
రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి!
'మన శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ ప్రతి కణానికి సరిగ్గా అందడంలో రక్తం పాత్ర ముఖ్యమైనది. సరైన ఆరోగ్యం కోసం తగినంత రక్తం శరీరంలో ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో రక్తం లోపించిన పరిస్థితిని అనీమియా అంటారు. రక్తం సరిగ్గా ఉండటానికి సరైన ఆహారాలు తినటం ఎంత ముఖ్యమో ప్రాసెస్డ్ ఆహారాలు, కృత్రిమ షుగర్స్ గల ఆహారాలు తగ్గించడం కూడా అంతే ముఖ్యం.' ఐరన్ అనేది ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ లో కనిపించే ఒక ఖనిజం. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావు, గుడ్లు, మాంసం, చేపలు, టోఫు, పప్పులు, చిక్కుళ్ళు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. విటమిన్ బి 12 అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్తకణాలు సరిగా పనిచేయలేవు. అందువల్ల ఆహారంలెఓ విటమిన్–బి 12 లభించే మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నప్పుడు, ఎర్ర రక్త కణాలు సరిగా పెరగలేవు, అందువల్ల ఫోలిక్ యాసిడ్ ఉండే గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు, బీన్స్, చిక్కుళ్ళు తీసుకోవాలి. ప్రోటీన్లు అనేవి శరీరం యొక్క నిర్మాణాత్మక భాగాలు. ప్రోటీన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా అవసరం. ప్రోటీన్ల–మూలం మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, చిక్కుళ్ళు, ధాన్యాలు, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఐరన్ మన రక్తం లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో ముఖ్యమైనది. ఆకు కూరల్లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల రక్తం పెరిగి అనీమియా వంటి సమస్య రాకుండా ఉంటుంది. చిక్కుళ్ళు, పప్పు దినుసులు చిక్కుళ్ళు, పప్పు దినుసుల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ప్లాంట్ బేస్డ్ ఐరన్ రక్తవృద్ధికి సహాయపడాలంటే వీటితో పాటు విటమిన్ సి అధికంగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే వీటిలో ఫోలియేట్, విటమిన్ బి 6 కూడా ఉండటం వల్ల రక్తం తయారవ్వటానికి ఇవి బాగా దోహదం చేస్తాయి. నట్స్, సీడ్స్ బాదం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వంటి నట్స్, సీడ్స్ లో ఫోలియేట్, ఐరన్, విటమిన్ ఇ ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ ఎర్ర రక్తకణాలు నష్టపోకుండా కాపాడుతుంది. బీట్ రూట్ బీట్ రూట్స్ లో ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అందుకని మన శరీరం లో బ్లడ్ లెవల్స్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ బీట్రూట్స్ లో ఉండే నైట్రేట్స్ రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి అలాగే రక్తంలో ఆక్సిజన్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి. సిట్రస్ పండ్లు నారింజ పళ్ళు, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అనేది మన శరీరంలో రక్తం పెరగడానికి అవసరం అయ్యే ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. అందుకనే ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు ఈ సిట్రస్ పండ్లు కూడా తీసుకోవటం మంచిది. ఇవి కూడా చదవండి: ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే.. -
'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!
బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. అప్పటిదాక గడప దాటని అమాయకపు తల్లి అయినా బిడ్డ జోలికొస్తే.. శివంగిలా మారిపోతుంది. ఏదో విధంగా కాపాడాలని తపించిపోతుంది. అలానే ఇక్కడొక తల్లి కూడా వెరొక దేశంలో అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో చిక్కుకుని విలవిలలాడుతున్న కూతుర్ని రక్షించాలని తప్పనపడింది. అందుకు ఆ దేశం వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి ఒప్పందం చేసుకోవడమే ఒక్కటే ఆ తల్లి ముందున్న మార్గం. అయితే ఆ దేశానికి భారతీయ పౌరులెవ్వరికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ఆ తల్లి హైకోర్టులో పోరాడి అనుమతి తెచ్చుకుని మరీ వెళ్లేందుకు పయనమవుతుంది. అక్కడ వాళ్లతో 'బ్లడ్ మనీ డీల్' చేయబోతోంది. ఏంటీ బ్లడ్ మనీ డీల్..? ఏంటా ఆ తల్లి గాథ అంటే.. నిమిషా ప్రియా అనే ఒక నర్సు 2011లో యెమెన్కి వెళ్లింది. అక్కడ ఆమె సనాలో నర్సుగా పనిచేసేది. అయితే ఏం జరిగిందే ఏమో 2017 యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. ఆమె సన్నిహితుల ప్రకారం..ఆమె పాస్పోర్ట్ని మహదీని తీసుకుని ఇవ్వకపోవడంతో ఎలాగైన అతడి నుంచి తీసుకునే క్రమంలో మహదీన్కి మత్తు మందులను ఇంజెక్ట్ చేసింది. దీంతో అతడు మరణించాడు. ఏం చేయాలో పాలుపోని నిమిషా తన సహోద్యోగి హనన్ సాయంతో ట్యాంకులో పడేసే క్రమంలో అతడి శవాన్ని ముక్కలు చేశారు. అయితే నిమిషా పోలీసులకు దొరికిపోయింది. దీంతో యెమెన్ ట్రయల్ కోర్లు కేసుని విచారించి..నిమిషాకి మరణ శిక్ష విధించగా, ఆమె సహోద్యోగికి జీవత ఖైదు విధించింది. 2018 నుంచి నిమిషా యెమెన్ జైలులోనే ఉంది. అప్పటి నుంచి నిమిషా కుటుంబం ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం ఈ విషయమై యెమెన్ సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే..? అక్కడ ఆమె అప్పీలును తిరస్కరించింది యెమెన్ సుప్రీం కోర్టు. దీంతో నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే 'బ్లడ్ మనీ డీల్' ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే నిమిషాకి శిక్ష తప్పుతుంది తిరిగి భారత్లోని తన కుటుంబం చెంతకు వెళ్లిపోవచ్చు. అందుకోసం ఆమె తల్లి ప్రేమ కుమారి యెమెన్కి వెళ్లాలనుకుంది. కానీ 2017లో కేంద్రం యెమెన్కి ట్రావెల్ బ్యాన్ విధించింది. దీని కారణంగా ప్రభుత్వ అనుమతి లేకుండా యోమెన్కి వెళ్లటం ఆమెకు అసాధ్యం అందుకని ఆమె ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. అయితే ధర్మాసనం ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని, ఆ తల్లికి కూతురుని రక్షించుకోవడానికి యెమెన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం యెమెన్తో భారత్కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు పేర్కొంది. అందువల్ల ఆ దేశంతో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం తన వాదనను హైకోర్టుకి తెలిపింది. దీంతో హైకోర్టు భారత ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేకుండా తన స్వంత పూచీతో బాధ్యతతో ప్రయాణిస్తానని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ తల్లిని కోరింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇవాళ (బుధవారం)ఆ తల్లికి పశ్చిమ ఆసియా దేశమైన యెమెన్ వెళ్లి తన కూతురు విడుదల కోసం "బ్లడ్ మనీ డీల్" చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. 'బ్లడ్ మనీ డీల్' అంటే.. యెమెన్ షరియా చట్టాల ప్రకారం ఆమెను విడుదల చేయడానికి బాధితురాలి కుటుంబం నిర్ణయించిన పరిహారం ఇచ్చేలా నేరుగా చర్చలు జరపడాన్ని " బ్లడ్ మనీ డీల్" అంటారు. అందుకోసం ఆ తల్లి వెళ్లడం అత్యంత ముఖ్యం. ఏదీఏమైన తన కూతురు కోసం ఆ తల్లి పడుతున్న కష్టం ఫలించాలని ఆశిద్దాం. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
13 ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్
ఓర్వకల్లు: ఆటలాడుతూ.. అల్లరి చేసే ఆ బాలుడికి మాయదారి రోగం వచ్చింది. పేద కుటుంబానికి పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఏడేళ్లుగా ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆర్థిక స్థోమత లేక అపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కవిత, పరమేష్ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి అచ్యుత్ కుమార్, హర్షవర్ధన్ కుమారులు. పెద్ద కుమారుడు అచ్యుత్ కుమార్(13)కు ఆరేళ్ల వయస్సు నుంచి తరచుగా జ్వరం రావడం, రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతూ ఉండేది. తెలిసిన చోటల్లా అప్పులు చేసి వైద్యం చేయించారు. వైద్యానికి ఇప్పటికే సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది మార్చిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. బెంగళూరులో వైద్య పరీక్షలు చేసి బ్లడ్ కాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి నయం కావాలంటే దాదాపు రూ.30 లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. అంత డబ్బు లేక తల్లిదండ్రులు దిక్కుతోచక ఇంటికి వెనుతిరిగి వచ్చారు. కుమారుడి అవస్థ చూడలేకఇతరుల వద్ద అప్పులు చేసి కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు హైదరాబాద్లో శస్త్ర చికిత్స చేయాలని, రూ.20 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పడంతో కొందరి సలహా మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికింద దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం రూ.8 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మిగతా రూ.12 లక్షల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్లో భాగంగా తనే ఏజ్ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మాంగనీస్... రక్తనాళాలు సాఫ్!
మాంగనీస్... రక్తనాళాలు సాఫ్! పళ్లపై గారపడితే... డెంటిస్ట్తో తీయించుకోవచ్చు! కానీ... రక్తనాళాల గోడల్లోపల గారలాంటి గట్టి పొరలు ఏర్పడితే? ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. గుండెజబ్బులు, గుండెపోటులకూ దారితీయవచ్చు. అయితే రక్తనాళాల్లోపలి ‘ప్లేక్’ను ఇకపై తేలికగానే తొలగించవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదెలాగో చూసేయండి... గుండెజబ్బులు వచ్చిన వారిలో రక్తం పలుచగా ఉంచేందుకు స్టాటిన్లు అనే రకం మందులు వాడుతూంటారు. రక్తనాళాల్లోని ప్లేక్ను ఈ మందులు కొంత వరకూ నియంత్రించగలవు. అయితే ఒకసారి ప్లేక్ ఏర్పడిన తరువాత మాత్రం ఈ స్టాటిన్ల ప్రభావం పెద్దగా ఉండదు. పేరుకుపోయిన ప్లేక్స్ను తొలగించలేవన్నమాట. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా... చైనాలోని వేర్వేరు యూనివర్శిటీల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా జరిపిన పరిశోధనల్లో ఓ వినూత్న పరిష్కారం ఆవిషృ్కతమైంది. శరీరానికి అవసరమైన సాధారణ పోషకం మాంగనీస్ ఈ ప్లేక్ను రక్తనాళాల నుంచి తుడిచిపెట్టేయగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో స్పష్టమైంది. మాంగనీస్ మన ఆరోగ్యానికి చాలా కీలకమైంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు జీర్ణమయ్యేందుకు కో ఎంజైమ్గా ఉపయోగపడుతూంటుంది. అంతేకాకుండా.. మన నాడులు, మెదడు బాగా పనిచేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తూంటుంది. కండరాలను కలిపే కణజాలం, సెక్స్ హార్మోన్లు, ఎముకలకూ చాలా అవసరం. సాధారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు కావాల్సినంత మాంగనీస్ లభ్యమవుతూంటుంది. నట్స్, పచ్చటి ఆకు కూరలు, కొన్ని రకాల చేపలు, మిరియాలు, కాఫీ, టీ, గింజల వంటి వాటిల్లో మాంగనీస్ ఉంటుంది. శరీరంలో మాంగనీస్ తగ్గితే కండరాలు బలహీన పడతాయి. సంతానం కలగడంలో సమస్యలూ రావచ్చు. మూర్ఛ వచ్చేందుకూ అవకాశం ఉంటుంది. చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల కారణంగా ఇప్పుడు ఈ మాంగనీస్ రక్తనాళాల శుద్ధికీ ఉపయోగపడుతుందని స్పష్టమైంది. చైనా శాస్త్రవేత్తలు ఎలుకలకు తగిన మోతాదులో మంగనీస్ అందించి పరిశీలించగా.. వాటి రక్తనాళాల్లో ప్లేక్ ఏర్పడేందుకు కారణమైన కొవ్వుల మోతాదు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. ఏర్పడ్డ ప్లేక్ కూడా రక్తనాళాల గోడల నుంచి విడిపోయి శుభ్రమయైనట్లు కూడా తెలిసింది. ‘‘శరీరానికి అత్యవసరమైన మూలకాల్లో మాంగనీస ఒకటి. కానీ దీన్ని ఇప్పటివరకూ పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎంజైమ్ ఆధారిత రియాక్షన్స్కు ఇదెలా సాయపడుతోందో తెలుసుకోలేదు’’ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావ్ వాంగ్ తెలిపారు. రక్తంలో కొవ్వుల రవాణా విషయంలో మాంగనీస్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తమ ప్రయోగాల ద్వారా వెల్లడైందని చెప్పారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటి సంక్లిష్ట కొవ్వులకు మాంగనీస్ అతుక్కుపోగలదని, తద్వారా అక్కడి రసాయన కూర్పును మార్చేయడం ద్వారా ప్లేక్ ఏర్పడకుండా నిరోధిస్తుందని వాంగ్ తదితరులు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. పరిశోధన వివరాలను లైఫ్ మెటబాలిజమ్ జర్నల్ ప్రచురణకు స్వీకరించింది. -
ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. వారిలో రిస్క్ తక్కువ
మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. సాధారణంగా మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు (Human Blood Groups) కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయన్నది తెలిసిందే. వీటిలో రేర్ బ్లడ్ గ్రూప్ ఏది? ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారన్నది ఇప్పుడు చూద్దాం. మామూలు బ్లడ్ గ్రూపులలోని ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యుల్స్ ఉంటాయి. ఆ మాలిక్యుల్స్ని బట్టి బ్లడ్ గ్రూపులను నిర్ణయిస్తారు. A- యాంటిజన్ ఉంటే A గ్రూపు, B-యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్గా లేకపోతే నెగిటివ్గా భావిస్తారు. Group A –ఇందులో యాంటిజన్ A, యాంటిబాడీస్ B ఉంటుంది Group B –యాంటిజన్ B and యాంటిబాడిస్ A ఉంటుంది Group AB –యాంటిజన్స్ AB ఉంటుంది కానీ యాంటిబాడీస్ ఉండవు (neither A nor B). Group O – యాంటిజన్స్ ఉండవు కానీ AB యాంటిబాడీస్ ఉంటాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అందించిన వివరాల ప్రకారం.. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎంతెంత మంది ఉన్నారంటే.. O పాజిటివ్ బ్లడ్: 42% A పాజిటివ్ బ్లడ్: 31% B పాజిటివ్ బ్లడ్: 15% AB పాజిటివ్ బ్లడ్ : 5% O నెగిటివ్ బ్లడ్ : 3% A నెగిటివ్ బ్లడ్ : 2.5% B నెగిటివ్ బ్లడ్ : 1% AB నెగిటివ్ బ్లడ్ : 0.5% మందిలో ఉంది. ఈ గణాంకాలు బట్టి అరుదైన బ్లడ్ గ్రూపులు ఏంటన్నది సులభంగా అర్థమవుతోంది. దేశంలో B నెగిటివ్ బ్లడ్ కేవలం 1% మందిలోనే ఉండగా, అత్యల్పంగా AB నెగిటివ్ బ్లడ్ 0.5% మందిలో ఉంది. దీంతో దీంతో అత్యవసర సమయాల్లో దాతల నుంచి రక్తం లభించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కోసారి సమయానికి సమయానికి రక్తం లభించక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే B నెగిటివ్, AB నెగిటివ్ బ్లడ్ గ్రూపులను అరుదైన బ్లడ్ గ్రూప్స్గా పేర్కొంటారు. అన్ని బ్లడ్ గ్రూప్స్లో కంటే O పాజిటివ్ బ్లడ్ ఉన్నవారు ఎవరికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందుకే వీరిని యూనివర్సల్ డోనర్స్ అంటాం. అంతేకాకుండా మిగిలిన బ్లడ్ గ్రూపుల వారికంటే వీరికి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువని పలు పరిశోధనల్లో వెల్లడైంది. భారత్లో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు సుమారు 29% మంది ఉండగా అత్యధికంగా పెరు దేశంలో O(+,-) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 71% మంది ఉండటం విశేషం. -
యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి?
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువర్గాలకు చెందిన వందలాదిమంది మృతి చెందగా, లెక్కలేనంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే యూదులు తమ వైద్యచికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో, అదే నిజమైతే దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యూదులు తమ పవిత్ర గ్రంథం ‘తోరా’లో ఉన్న నియమనిబంధనలను తప్పక పాటిస్తారు. మారుతున్న కాలంతో పాటు ఈ నిబంధనలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే పాతతరం యూదులు చికిత్స సమయంలో ఎవరి రక్తాన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నా మరొకరి రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించడాన్ని వారు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే యూదులు రక్తాన్ని ప్రాణంతో సమానంగా భావిస్తారు. వేరొకరి రక్తాన్ని తీసుకోవడమంటే వారి ప్రాణాన్ని తీయడమేనని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మెల్లగా మారుతోంది. నేడు యూదులు కూడా తమకు రక్తం అవసరమైనపుడు దానిని ఎక్కించుకునేందుకు అంగీకరిస్తున్నారు. నాటి తరం యూదులు తమ దేవుని శక్తిపై మాత్రమే గాఢమైన నమ్మకాన్ని కలిగివుంటారు. తాము అనారోగ్యానికి గురైనప్పుడు దేవుని ప్రార్థన ద్వారా మాత్రమే ఆరోగ్యవంతులమవుతామని నమ్ముతుంటారు. వీరిలోని చాలామంది నేటికీ వైద్యుల దగ్గర చికిత్స తీసుకోరు. మందులు వాడరు. అయితే నేటి తరం యూదులు ఆధునిక వైద్యాన్ని వినియోగించుకోవడమే కాకుండా, వైద్య పద్ధతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్తో సంబంధం ఏమిటి? -
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
గుండెకు చేటు తెచ్చే ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించుకోండి! లేదంటే..
ట్రైగ్లిజరైడ్స్ అన్నవి కొలెస్ట్రాల్లాగానే రక్తంలోని ఒక రకం కొవ్వులని చెప్పవచ్చు. ఇవి ఉండాల్సిన మోతాదు పెరిగితే ఆ కండిషన్ను ‘హైపర్ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. వీటి మోతాదులు పెరగడం గుండె జబ్బులకు దారితీయవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రక్తంలో ట్రైగ్లిజరైడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా పాటించాలి. బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని అదుపు చేసుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్టేక్)ను తగ్గించుకోవాలి. ఆహారంలో కొవ్వుల్ని... అంటే శాచ్యురేటెడ్ ఫ్యాట్ను, కొలెస్ట్రాల్ మోతాదులను బాగా తగ్గించాలి. ఉదాహరణకు... నెయ్యి, వెన్న, వూంసాహారం (రొయ్యలు, చికెన్ స్కిన్), వేపుళ్లను బాగా తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్లో పీచు ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. వాటితో పాటు వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడమూ మంచిదే. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. పొట్టు తీయని ధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రోట్స్) తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే రెడ్మీట్ను పూర్తిగా మానేయాలి. అయితే మాంసాహారాన్ని ఇష్టపడే వారు వారంలో వుూడుసార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవీ, గ్రిల్డ్ ఫిష్ వూత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినవి తీసుకోకూడదు∙ పొగతాగే అలవాటునూ, ఆల్కహాల్ను పూర్తిగా వూనేయాలి. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించుకోవాలంటే..!
ఆయుర్వేదం ప్రకారం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ రెండూ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పైగా అవి ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ట్రైగ్లిజరైడ్ పెరుగుదల చెడు కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రధాన కారణాలలో ఒకటిగా ఊబకాయం, కదలిక లేకపోవడం, చెడు ఆహారాల వినియోగం, చెడు అలవాట్లు, ఇవన్నీ శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీస్తాయి (బాగా). ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి మొదటి అడుగు ఆయుర్వేదం. జీవనశైలి ఆహారంలో మార్పులతో ఈ సమస్యను సులభంగా బయటపడవచ్చు అటున్నారు నవీన్ నడిమింటి. ముందుగా సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించండి. డెజర్ట్లు, చక్కెర, శుద్ధి చేసిన లేదాప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్ల వినియోగం ద్వారా ట్రైగ్లిజరైడ్ల పరిమాణం పెరుగుతుంది. ఈ ఆహారాలకు బదులుగా, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తీసుకోవడం పెంచాలని ఆయుర్వేదం సలహా ఇస్తుంది. వ్యాయామం రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే రక్తప్రవాహంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గేందుకి దారితీస్తుంది. కేలరీలను తీసుకోవడం తగ్గించండి. మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాస్తా, సోడాలు, ఆల్కహాల్ ఇతర ఆహారాలు తోపాటు అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి, బరువుపై ట్రైగ్లిజరైడ్స్ ప్రభావం బరువుపై ట్రైగ్లిజరైడ్లు అధికంగా ప్రభావం చూపుతాయి. వీటి స్థాయిలు పెరిగిన వ్యక్తుల పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోతుంది. తినడం, నిద్రించడం వంఇ వాటి వల్ల టాక్సిన్లు పేరుకుపోతాయి. ఇది కాస్త చెడు కొలస్ట్రాల్కి దారితీస్తుంది. ఆహారాన్ని తయారు చేసే విధానంలో ఉపయోగించే నూనెల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. లేదంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ప్రమాదం ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఆహారాలు, ఆయుర్వేద మూలికలు తేనె తేనె ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్తో విజయవంతంగా పోరాడుతుంది. ఒక చెంచా తేనెను ఒక గ్లాసు వేడి నీటిలో కరిగించి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సాధారణీకరించి చెడు కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నీటిలో 8 నుంచి 10 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా ½ టీస్పూన్ నిమ్మరసాన్ని కూడా జోడించవచ్చు. వెల్లుల్లి: ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి, ఆయుర్వేదం వెల్లుల్లి వినియోగాన్ని గట్టిగా సిఫార్సు చేస్తుంది. వెల్లుల్లిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, అలిసిన్, అజోయిక్ ఇతర సల్ఫర్ సమ్మేళనాలు వంటి సేంద్రీయ సల్ఫేట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. తురిమి లేదా ఒలిచిన, వెల్లుల్లిని వంటలలో చేర్చమని అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి పాలు కూడా మంచిదే అని చెబుతున్నారు. ఇది ఎలా చేయాలంటే..వెల్లుల్లి 5 నుంచి ఆరు తీసుకుని, రెండు లవంగాలు చూర్ణం చేసి 50 మి.ల్లీ లీటర్ల దేశీయా ఆవు పాలల్లో కలిపి వేడి చేయండి. సగం అయ్యేంత వరకు మరగినిచ్చి ఫిల్టర్ చేసి వేడిగా తాగండి చక్కటి ఫలితం ఉంటుంది. ఆమ్లా ఉసిరికాయలో విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి యాంటీఆక్సిడెంట్. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ధమనులను శుభ్రం అవ్వడమే గాక ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అర్జునుడు ఇది చాలా శక్తివంతమైన ఆయుర్వేద మూలిక, ఇది కొలెస్ట్రాల్ను కరిగించి ధమనులను శుభ్రంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అర్జునుడిని తెల్లవారుజామునే నీటిలో కరిగించి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. గుగ్గులు ఆయుర్వేదంతో ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడే మరొక మూలిక. గుగ్గులు. గుగ్గుల్ స్టెరోన్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను చురుకుగా నిరోధిస్థాయి. ఈ ఆయుర్వేద మూలికను ప్రతిసారి భోజనం తర్వాత తీసుకోవచ్చు కూడా. మీ ట్రైగ్లిజరైడ్లను సాధారణంగా ఉంచడానికి 25 మిల్లీగ్రాం సరిపోతుంది. సెలెరీ ఈ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సెలెరీని సలాడ్గా తినవచ్చు, వంటలలో చేర్చవచ్చు లేదా రసంగా త్రాగవచ్చు. రోజుకు 2 కాడల ఆకుకూరల వినియోగం చెడు కొలెస్ట్రాల్ను 7 పాయింట్లు తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి . అవకాడో అవోకాడోస్లో గణనీయమైన మొత్తంలో ఫైబర్, ఒలేయిక్ యాసిడ్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి, ఇది అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అవోకాడో సాధారణ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నిర్వహించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దీనిలో కొవ్వులు అధికం అనే విషయం గుర్తుంచుకోవాలి. గ్రీన్_టీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించగలవు. ఒక గ్లాసు గ్రీన్ టీలో కూరగాయలు, పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదం గ్రీన్ టీని రోజుకు మూడు సార్లు తాగాలని సిఫార్సు చేస్తోంది. బ్రౌన్రైస్ మీరు మీ సాధారణ ట్రైగ్లిజరైడ్లను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, బ్రౌన్తో కూడిన వైట్ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్లో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి అనే వాస్తవం పక్కన పెడితే, ఇందులో ఫైబర్, సంతృప్త కొవ్వులు కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుద్ధి చేయడానికి, బరువును తగ్గించడానికి ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది . యాపిల్స్ ఈ రుచికరమైన పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వీటిని ఫ్లేవనాయిడ్స్ అని పిలుస్తారు. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించి ఊపిరితిత్తులు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సగటు యాపిల్లో పెద్ద మొత్తంలో విటమిన్లు ఏ, సీ ఉంటాయి. సుమారు 4 గ్రాముల ఫైబర్లో కేలరీలు కేవలం 100 మాత్రమే. యాపిల్స్ తోపాటు, ఆయుర్వేదం బేరి, దానిమ్మ, ద్రాక్షపండ్లు, నారింజలను తీసుకోవడం ద్వారా ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సిఫార్సు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. . బ్రోకలీ బ్రోకలీలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, అవి యాంటీఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. బ్రోకలీతో కలిపి తీసుకుంటే, అందులో ఉండే ఫైబర్లు జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన పిత్త ఆమ్లాలతో బంధించి వాటిని సహజంగా శరీరం నుంచి బయటకు తీస్తాయి. బ్రోకలీ సాధారణ ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బార్లీ బార్లీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెరను సాధారణీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. తృణధాన్యంలో బీటా -గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను 4-10% తగ్గిస్తుంది. అదనంగా, బార్లీ గోధుమలకు చాలా మంచి ప్రత్యామ్నాయం. మీరు దీన్ని బ్రెడ్కు ప్రత్యామ్నాయంగా క్రమం తప్పకుండా తినవచ్చు. చేప చేప నూనె, చేప ట్యూనా, మాకేరెల్, ట్రౌట్, సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలు ఒమేగా 3 యాసిడ్లతో నిండి ఉంటాయి, ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించి గుండె జబ్బులను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆయుర్వేదం వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినాలని అలాగే ప్రతిరోజూ 1 నుంచి 4 గ్రాముల చేప నూనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. దుంప దీని ఆకులలో సినారైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పేరుకుపోయిన టాక్సిన్ని వేగవంతంగా తొలగిస్తుంది. తత్ఫలితంగా కొలెస్ట్రాల్ తగ్గి ధమనులను శుభ్రం అవుతాయి . పాలకూర బచ్చలికూర వీటిలో ల్యూటిన్ ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్స్ని ధమనుల గోడలకు అంటుకోకుండా, మూసుకుపోకుండా నిరోధిస్తుంది. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఇ, ఫలకం తొలగింపుపై శ్రద్ధ చూపుతుంది తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. అలాగే బీన్స్, బఠానీలు, చిక్పీస్, కాయధాన్యాలు మరియు ఇతర ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫ్లాక్స్ సీడ్లో లిగ్నన్లు ఉంటాయి, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. గుండె సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ఉత్పత్తి, శోషణను నియంత్రిస్తాయి. (చదవండి: ఈ పొరపాటు చేస్తే.. మీరు ఏజ్డ్ పర్సన్లా కనిపించడం ఖాయం!) -
సీఎం యోగి ఆదిత్యనాథ్కు విద్యార్థినులు రక్తంతో లేఖ..
లక్నో: ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేసినందుకు స్కూల్ ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానోపాధ్యాయుడు రాజీవ్ పాండే తమను ఆఫీస్కు పిలిచి అసభ్యంగా తాకేవాడని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. తమ తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలపడానికి భయపడేవారమని చెప్పారు. ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్కు విద్యార్థినులు రక్తంతో లేఖ రాశారని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు వేధింపుల గురించి చెప్పగా.. ప్రిన్సిపల్కు, తమ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగిందని విద్యార్థినులు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చి దాడి చేశారని తమపైనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు వర్గాల తరపు నుంచి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు పోలీసులు తమను బెదిరింపులకు గురిచేసి నాలుగు గంటలు స్టేషన్లో ఉంచారని పేర్కొన్నారు. ఇకపై తరగతులకు హాజరకావద్దని పోలీసులు హెచ్చరించినట్లు లేఖలో రాశారు. ప్రిన్సిపల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినందున పోలీసులు చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు లేఖలో తెలిపారు. తామంతా మీ కూతుళ్లమని పేర్కొంటూ.. తమకు న్యాయం చేయాలని సీఎం యోగి ఆదిత్య నాథ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని గాజియాబాద్ సీనియర్ పోలీసు ఆఫీసర్ సలోని అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: 'నాకే సలాం కొట్టవా..?' బాలునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి -
అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్పై అవగాహన కోసం ఈ కథనం. మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ. అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లోలాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు ►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి ►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్) ►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙ ►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం. ►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్కు దారితీసే అంశాలు. చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙ జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం చికిత్సా ప్రత్యామ్నాయాలు శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా... మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్లతో మెదడులోని అన్యురిజమ్స్కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు. ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం... అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ (చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!) -
యువతలో పెరుగుతున్న హైపర్ టెన్షన్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): హైపర్ టెన్షన్ (బ్లడ్ ప్రెజర్).. యువత గుండెలను సైలెంట్గా పట్టేస్తోంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లేలా చేస్తోంది. క్యాన్సర్లకూ కారణం అవుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే హైపర్టెన్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రక్తపోటుతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి తోడు కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమం ఇలా... ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు బాధితులను గుర్తించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మూడేళ్ల క్రితం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తొలుత ఉమ్మడి కృష్ణాను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా.. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రక్తపోటుపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. రక్తపోటు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స అందేలా చూడటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. పట్టణ ప్రజలు ఎక్కువగా రక్తపోటుకు గురవుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం తొలుత పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పీహెచ్సీలు సీహెచ్సీల్లో అమలు చేస్తున్నారు. వరంలా మారిన వెల్నెస్ సెంటర్లు.. ఒకప్పుడు రక్తపోటును పరీక్షించుకోవాలంటే గ్రామీణులు దూర ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారి ఇంటి సమీç³ంలోనే వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు (వెల్నెస్ సెంటర్స్) అందుబాటులోకి వచ్చాయి. దీంతో బీపీ చెక్ చేయించుకునేందుకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. అంతేకాదు రక్తపోటు ఉందని నిర్ధారణ అయితే కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా నెలలో రెండుసార్లు వారి గ్రామానికే వస్తున్న వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు వాడుతున్నారు. దీంతో గ్రామీణులు రక్తపోటును అదుపులో ఉంచుకునే అవకాశం లభించింది. పట్టణ వాసులు సమీపంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎప్పుడైనా వెళ్లి పరీక్ష చేయించుకుని మందులు వాడుకోవచ్చు. రక్తపోటుకు కారణాలివే.. ♦ జీవన శైలిలో మార్పులు, మాంసాహారం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్ తీసుకోవడం. ♦ శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం రక్తపోటు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ♦ ఇటీవల 30 ఏళ్ల వయసు వారు కూడా తీవ్రమైన రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటుకు గురైన సందర్భాలు ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. అదుపులో ఉండాలంటే... ♦ రక్తపోటు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ♦ ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది. ♦ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ♦ ప్రతి మనిషి నెలలో 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం ♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు వైద్యం గ్రామాలకే వెళ్లి అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో రక్తపోటును పరీక్షించి మందులు అందచేస్తున్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉంటే ఎంఎల్హెచ్పీల వద్ద బీపీ పరీక్షించుకోవచ్చు.రక్తపోటును అదుపులో ఉంచుకోకుంటే ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్వో, ఎన్టీఆర్ జిల్లా -
రోజుకొక పెగ్గేసినా..అనర్థమే
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక పెగ్గు చొప్పున తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఏం కాదు అనుకుంటే.. అది పొరపాటేనని ఓ అధ్యయనం హెచ్చరించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించిన ఇటలీ, అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ టీమ్ అధ్యయనం ప్రకారం.. తక్కువ మోతాదులో మద్యం సేవించే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, అధిక రక్తపోటు బారినపడుతున్నారని వెల్లడైంది. 1997 నుంచి 2021 మధ్య కాలంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో మద్యపానం వల్ల సంభవించే పర్యవసానాలపై ఏడు అధ్యయనాలు నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వయసుతో పాటు అధిక రక్తపోటు లేని 19,548 మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 12 ఏళ్ల అనంతరం వీరి రక్తపోటు స్థాయిల్లో నిరంతర పెరుగుదలను కనుగొన్నారు. రోజుకు సగటున 12 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో ఐదేళ్లలో సిస్టోలిక్ రక్తపోటు 1.25 ఎంఎం హెచ్జీ పెరిగినట్టు గుర్తించారు. రోజుకు సగటున 48 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో సిస్టోలిక్ రక్తపోటు 4.9 ఎంఎం హెచ్జీ పెరిగినట్లు తేలింది.. ఒక్క రక్తపోటే కాదు.. అనేక సమస్యలు మద్యాన్ని ఎక్కువా.. తక్కువా.. అని కాదు.. ఏ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో వేగంగా, తక్కువ పరిమాణంలో తాగేవారిలో ఆలస్యంగా ప్రభావాలుంటాయి. రక్తపోటుతో పాటు కాలేయం, గుండె, మెదడుతో పాటు శరీరంలో మద్యపానానికి ప్రభావమవ్వని భాగం ఉండదు. ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి మద్యపానం తోడైతే వేగంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా మద్యపానం ఆరోగ్యానికి మంచిదేనని గతంలో కొన్ని అధ్యయనాలు వచ్చినా.. అవి అవాస్తవమని తర్వాతి రోజుల్లో కొట్టిపడేశారు. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ -
చిన్నారుల ముక్కు నుంచి రక్తం వస్తుందా? చాలావరకు ఇది..
ఈ సీజన్లో పిల్లలు వానల్లో తడిసి, జలుబు చేసి ముక్కు చీదినప్పుడు రక్తం రావచ్చు. చిన్నారుల ముక్కు నుంచి రక్తస్రావం జరగడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. చాలావరకు ఇది ఏమాత్రం ఆందోళనకరం కాదు. పిల్లల ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పిల్లలు కాస్త ముందుకు ఒంగి కూర్చునేలా చూడాలి నోటితో గాలిపీల్చుకొమ్మని చెప్పాలి. రక్తస్రావం అవుతున్న ముక్కు రంధ్రం వైపు భాగాన్ని బొటనవేలు, చూపుడువేలుతో కాసేపు అలాగే నొక్కి పట్టి ఉంచాలి. ముక్కుపైన ఐస్ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ఉంచాలి. వాళ్లు గట్టిగా ముక్కు చీదకుండా చూడాలి. రక్తస్రావం తగ్గాక మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు పిల్లల వేళ్ల గోళ్లు కత్తిరిస్తూ, వాళ్లు ముక్కులో వేళ్లు పెట్టుకుని గిల్లుకోకుండా చూడాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో రక్తస్రావం తప్పక ఆగిపోతుంది. ఒకవేళ ఆగకపోతే తక్షణం డాక్టర్ / ఈఎన్టీ స్పెషలిస్ట్ను కలవాలి. (చదవండి: ఏజెన్సీ ప్రాంతాలను కలవరపెట్టే 'మలేరియా'..తస్మాత్ జాగ్రత్త లేదంటే..) -
బీపీ ఉంటే ఆవేశపడరు..ఆవేశ పడటం వల్లే అది..
రక్తపోటు ముప్పు తప్పుతుంది ఇలా...నేటి ఆధునిక జీవన శైలి కారణంగా న్నపిల్లలనుం పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉరుకులు, పరుగులు... ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలే. ఫలితంగా వయసుతో నిమిత్త లేకుండా రక్తపోటు పెరిగిపోతుంటుంది. హై బీపీ అనేక రోగాలకు ఆలవాలం. వచ్చాక బాధపడే కంటే రాకుండా నివారించుకోవడం మేలు. అందువల్ల అధిక రక్తపోటును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం...చాలామంది అపొహ ఏమిటంటే ఎవరైనా ఇతరులమీద ఆవేశ పడుతుంటే, కేకలు వేస్తుంటే అదంతా బీపీ వల్ల అనుకుంటారు. అయితే అది తప్పు. బీపీ ఉండటం వల్ల ఆవేశపడరు. ఆవేశపడటం వల్ల బీపీ పెరుగుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ముందుగా ఆహారపదార్థాలలో రక్తాన్ని ఉద్రేకపరిచే పదార్థాలను నిషేధించాలి. ఆహారంలో వాడే ప్చమిర్చి బదులు ఎండుమిర్చిని... క్రమంగా దాని బదులు కారపు రుచికోసం మిరియాలను ఉపయోగించాలి. అంటే మిరియాల చారు, మిరియాల కారం ఇలాంటివన్నమాట. మనం వాడే రాళ్ల ఉప్పు గాని, షాపుల్లో దొరికే (అయోడైజ్డ్ సాల్ట్తో సహా) ఇతర ఉప్పుల బదులు సైంధవ లవణం వాడటం మంది. అదేవిధంగా పులుపు కోసం కొత్త చింతపండుకు బదులు పాతచింతపండు లేదా దేశవాళీ టమాటాలు ఉపయోగించడం శ్రేయస్కరం. గడ్డ పెరుగుకు బదులు పలుచని మజ్జిగ మంచిది. ఎందుకంటే, ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ పేగుల్లో విషపదార్థాలు లేకుండా ఉదరంలో పిత్తరసం ప్రకోపించకుండా రక్తపోటు పెరగకుండా కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షాపుల్లో దొరికే స్వీట్లకు బదులు ఇంట్లో పాతబెల్లంతో చేసుకున్న తీపిని వాడుతుంటే ఎలాంటి ప్రమాదం రాదు. కూరల తయారీలో వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, అల్లం, జీలకర్ర, ధనియాలు, మిరియాలను ఉపయోగించడం ఆరోగ్యకరం. ఉదయం 9.30 గంటల లోపు, రాత్రి 7.30 గంటలలోపు తినడం ముగించాలి. రాత్రిపూట కప్పు నీటిలో చెంచా మెంతులు వేసి మూత పెట్టి ఉదయం బ్రష్ చేసుకోగానే ఆ నానబెట్టిన మెంతులను నమిలి తినాలి. మెంతులు నానబెట్టిన ఆ నీటిని కూడా తాగాలి. ఒక పచ్చి ఉల్లిపాయను ముక్కలుగా తరిగి కూరన్నంతో, మజ్జిగన్నంతోనూ కలిపి తింటుంటే క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. (చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు) -
Viral Video: హఠాత్తుగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది
ఏమైందో ఏమో ఒక్కసారిగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ షాకింగ్ ఘటన జపాన్లో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ ప్యాక్టరీ లీక్ కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన ఒకినావాలోని నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు. సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది. నిజానికి లీకైన శీతలీకరణ నీరు వర్షం ద్వారా నదిలోకి ప్రవహించడంతో ఇలా మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఈ రంగులోకి మారిందని వెల్లడించింది ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ. ఈ మేరకు బీర్ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Orion beer factory leak turns Japanese port red. pic.twitter.com/uyw3JC02S2 — Project TABS (@ProjectTabs) June 29, 2023 (చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!) -
Diabetes: పేషెంట్స్కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్లో ఉన్నట్లే..
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటీస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. ఇది వస్తే పేషెంట్లు ఎలా ఉంటారనే దాని గురించి అందరికి తెలిసిందే. దీనికి పూర్తిగా నివారణ లేదు గానీ కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడమే గాక సులభంగా బయటపడవచ్చు. ఐతే ఈ డయాబెటిస్ పేషెంట్లకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నందున కొన్ని రకాల అంటువ్యాధుల వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధుల వచ్చాయి అంటే మీరు డేంజర్లో ఉన్నట్లు అర్థం. సత్వరమే మేల్కోని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ రోగులుకు సాధారణంగా వచ్చే అంటువ్యాధులు నేషనల్ లైబ్రెరీ ఆప్ మెడిసినల్ అధ్యయనాల ప్రకారం..పేషెంట్లో ఆరు శాతం మంది ఇన్ఫెక్షన్ల సంబంధింత వ్యాధుల కారణంగా ఆస్పత్రుల చేరి మరణాల వరకు సంభవించిన కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ల ఇన్ఫక్షన్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పాదాలలో చలనం తగ్గి గాయమైన తెలయకపోవడం. ఆ తర్వాత క్రమంగా అది పెద్దదిగా మారి దాని నుంచి శరీరమంతా ఇన్ఫక్షన్ వ్యాపించి ప్రాణాంతకంగ మారిని కేసులు ఎక్కువే. ఆయా రోగులకు అంత్యభాగంలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే ఏదైన వ్యాధి వస్తే ఈజీగా ఇన్షక్షనే అయ్యే ప్రమాదం ఎక్కువ. రకరకాల చర్మ సమస్యలు వచ్చినా మధుమేహం ఎక్కువగా ఉంది అనడానికి ప్రధమ సంకేతం గోరుచుట్టు, యూరినరీ ఇన్ఫక్షన్లు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి, ముక్కు, గొంతు ఇన్ఫక్షన్లు వచ్చిన సాధారణంగా భావించొద్దు. అలాగే స్త్రీలల్లో జననేంద్రియాలలో ఏదైన ఇన్ఫక్షన్ల వచ్చిన తేలికగా తీసుకోవద్దు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల మాదిరిగా ఉంటాయి. అందువల్లే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాడం ఉత్తమం. (చదవండి: కొబ్బరినీళ్లతో ఇన్ని ప్రయోజనాలా?.. మరి డయాబెటిక్ పేషెంట్స్ తాగొచ్చా?) -
వీడెవండి బాబు! యవ్వనం కోసం.. రక్తం తాగేస్తున్నాడు!
అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ, వాటి కోసం పడే పాట్లు, ఎంచుకునే దారులే వేరు. కొంతమంది వ్యాయామం చేస్తే, మరికొంతమంది కాస్మోటిక్స్ ట్రై చేస్తుంటారు. అయితే, థాయ్లాండ్కు చెందిన రోజాకోర్న్ నైనోన్ మాత్రం రక్తపిపాసిగా మారాడు. అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదు గాని, మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు. నవయవ్వన రూపాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనికి సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారమ్ ఉంది. వాటి చర్మం, రక్తం, మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు. అయితే, ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసిందట. ఇక అప్పటి నుంచి రోజూ ఉదయం, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. అది కూడా కేవలం మూడు, నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే! ‘మొసళ్లు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది. పైగా, మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో ‘లావోఖానో’ అనే థాయ్ మద్యాన్ని కలిపి కాక్టెయిల్ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను’ అని కోర్న్ చెప్పాడు. ఈ మధ్యనే ఈ కాక్టెయిల్ను ఒక పెగ్ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోర్న్. చదవండి: బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్గా నిలిచింది! -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..) -
ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..రక్తంతో లేఖ
బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కచ్చితంగా గెలుస్తారని ఓ కార్యకర్త రక్తంతో పోస్టర్ రూపొందించాడు. అలాగే హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోస్టర్ను స్వయంగా తీసుకెళ్లి జగదీశ్ శెట్టర్కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ శెట్టర్ ఇటీవలే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. అయితే హుబ్బళ్లి ధర్వాడ్ నిజయోజకవర్గంలో రెండో రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప శెట్టర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. శెట్టర్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శెట్టర్ గెలుపు ఖాయమని రక్తంతో పోస్టర్ రూపొందించాడు . బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రతి సవాల్గా ఈ పోస్టర్లను గోడలపై అంటించాడు. చదవండి: ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. డీకే శివకుమార్ సెటైర్లు.. -
అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు?
లక్నో: ఇటీవల దారుణ హత్యకు గురైన గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్కు చెందిన కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు కన్పించడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీస్ను అధికారులు పాక్షికంగా కూల్చారు. అయితే కార్యాలయం లోపల రక్తపు మరకలు, ఓ తెల్లటి వస్త్రం కన్పించడం చూసి షాకయ్యారు. అక్కడే ఓ కత్తి కూడా లభించింది. దీంతో ఈ రక్తపు మరకలు ఎవరివై ఉంటాయని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు. వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అతీక్ అహ్మద్కు చెందిన ఈ ఆఫీస్ ప్రయాగ్రాజ్లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కర్బాల ప్రాంతంలో ఉంది. ఈ కార్యాలయం ఆవరణలోనే 10 అక్రమ ఆయుధాలతో పాటు రూ.74.62 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లోని ఓ హోటల్లో.. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సుశీల్ కుమార్ సింగ్ మృతదేహాన్నిగుర్తించడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే హోటల్కు చేరుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేసుకున్నాడా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. కాగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ముందే ముగ్గరు యువకులు వీరిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
ఫ్రీగా వస్తోందని తప్పతాగి.. కుప్పకూలిపోయాడు
క్లబ్లో ఫ్రీ ఎంట్రీ, ఉచితంగా లిక్కర్ బోర్డు కనిపించేసరికి అతని ప్రాణం ఆగమైంది. లోపలికి దూరిపోయి తాగడం మొదలుపెట్టాడు. అయితే మత్తులో అక్కడ జరుగుతోంది పెద్ద మోసమని అతనికి అర్థం కాలేదు. నాన్ స్టాప్గా అలా తాగుతూనే కుప్పకూలి.. మరణించాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అతని జేబులోంచి డబ్బును లాగేసుకుని.. శవాన్ని బయటకు విసిరిపారేసింది ఆ ముఠా. ఆరేళ్ల కిందట సంచలన సృష్టించిన బ్రిటిష్ టూరిస్ట్ హత్య కేసులో.. 58 మందిపై తాజాగా అభియోగాలు నమోదు చేశారు పోలాండ్ పోలీసులు. ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలు చేస్తున్న క్రమంలో.. సదరు టూరిస్ట్ ప్రాణం తీశారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు 700 నేరపూరితమైన అభియోగాలను ఈ ముఠాపై నమోదు చేశారు. ఏం జరిగిందంటే.. 2017లో బ్రిటన్కు చెందిన మార్క్ సీ అనే వ్యక్తి పోలాండ్లో పర్యటించాడు. ఆ సమయంలో ఓ స్ట్రిప్ క్లబ్కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో ఫుల్గా తాగాడు. ఆపై క్రాకో లో ఉన్న వైల్డ్ నైట్ క్లబ్కు చేరాడు. అక్కడ ఉచిత ప్రవేశం బోర్డు చూసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఫ్రీగా మందు తాగుతూ పోయారు. అయితే ఒక దశకు వచ్చేసరికి.. మార్క్ ఆపేద్దామనుకున్నా క్లబ్ నిర్వాహకులు ఊరుకోలేదు. గంటన్నరలో అతనితో 22 పవర్ఫుల్ షాట్స్ తాగించారు. ఇంకేం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మార్క్. చనిపోయిన తర్వాత ఆ ముఠా.. అతని జేబులో ఉన్న డబ్బు లూఠీ చేసింది. అతని శవాన్ని, మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని క్లబ్ బయటకు నెట్టేసింది. శవ పరీక్షలో.. మార్క్ ఒంట్లో బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 0.4 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. లిక్కర్ పాయిజన్తోనే అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీష్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. ఆరేళ్లుగా దర్యాప్తు చేసింది. మద్యం తాగించి మత్తులో మునిగిపోయే మందు బాబుల నుంచి డబ్బు, నగదు దోచుకుంటున్నట్లు.. ప్రత్యేకించి టూరిస్టులే టార్గెట్గా ఈ మోసం నడుస్తున్నట్లు తేల్చారు. తాజాగా ఈ కేసులో అభియోగాలు మనిషి శరీరం బ్లడ్లో ఆల్కాహాల్ లెవల్ 0.3కి చేరినా, అంతకు మించినా ఆల్కాహాల్ పాయిజనింగ్ జరిగినట్లు లెక్క. దొరికింది కదా అని వేగంగా మద్యం తాగడమూ ఆరోగ్యానికి హానికరమే. మాట, నడకలో తడబాటుతో పాటు తీవ్ర అనారోగ్యం బారినపడడం లేదంటే ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలతో గుండె ఆగిపోవడం లాంటి హఠాత్ పరిణామాలు ఎదురవుతాయి. -
సీఎంకి రక్తంతో రైతు ఆహ్వాన లేఖ! ఎందుకంటే..
మహారాష్ట్రాలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు తన ఉల్లి పంటకు నిప్పంటించాడు. తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కోపంతో సుమారు 1.5 ఎకరాల ఉల్లి పంటకు నిప్పంటించాడు కృష్ణ డోంగ్రే అనే రైతు. ఆ పంట కోసం అని సుమారు రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టానని, ఆ తర్వాత వాటి రవాణా కోసం సుమారు రూ. 30 వేలు అదనంగా ఖర్చు చేశానని వాపోయాడు. ఇంత చేస్తే చివరికి ఉల్లి ధర మార్కెట్లో కేవలం రూ. 25 వేలు పలుకుతోందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగు నెలలుగా రాత్రి, పగలనక కష్టపడి 1.5 ఎకరంలో ఉల్లి పంట పండించాను, దాన్ని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్ల కాల్చేయాల్సి వచ్చిందని ఆవేదనగా చెప్పాడు. ఈ పంట కోసం తన చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయ్యాయని అన్నాడు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించి రైతులకు అండగా నిలవాలని కోరాడు. ఈ ఘటన జరిగి 15 రోజుల అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాధికారి రాకపోగా, కనీసం సానుభూతి కూడా చూపలేదని అన్నాడు. కనీసం మమ్మల్ని మీరు ఇలా చేయకండి మేము ఆదుకుంటామన్న భరోసా కూడా ఇవ్వలేదని అతను వాపోయాడు. ఈ మేరకు రైతు కృష్ణ ఈ ఉల్లి దహనోత్సవానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు రక్తంతో కూడా ఓ లేఖ రాశానని చెప్పారు. ప్రభుత్వం తమ పంటలన్నింటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు. అలాగే ప్రస్తుత నష్టాలకు గానూ అందరికీ క్విటాకు వెయ్యి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డ్రోంగే కోరాడు. Angry Farmer Burns Onion Crop, Invites Eknath Shinde, Writes In Blood https://t.co/lpCk293OJq pic.twitter.com/5yZTFPW36s — NDTV (@ndtv) March 6, 2023 (చదవండి: 'స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందా'! ఏ జీవికైనా అంతేగా..) -
మంచి మాట: సంతోషం సమగ్ర బలం
సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది. ‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. ‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి. నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం. ‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి. ‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి. సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు. – శ్రీకాంత్ జయంతి -
లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?
కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. ♦ శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం ♦ విపరీతమైన అలసట, ♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు ♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు. రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వంశపారంపర్యంగా వచ్చే హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి. వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. కారణాలు: ♦ మద్యం అలవాటు ♦ వైరల్ ఇన్ఫెక్షన్లు ♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ), ♦గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స ఎలాగంటే... ♦కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. ♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. ♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్మేకర్ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు. ♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్ పరిస్థితి విషమించకుండా చూడటమే ప్రధానం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల ,సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ -
Blood Count: టాబ్లెట్లు అక్కర్లేదు! రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగితే
కొంతమంది కొన్ని విటమిన్ల లోపం వల్ల రక్తలేమితో బాధపడుతుంటారు. రక్తలేమి వల్ల నీరసం, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగటం, నిస్సత్తువగా ఉండటంతోపాటు అనేకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఎదురయ్యే సమస్య. సాధారణంగా రక్తలేమికి కొన్ని విటమిన్ టాబ్లెట్లు వాడమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అలా మందులు వాడటం వల్ల కొన్ని దుష్ఫలితాలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల సహజంగానే రక్తం పట్టే ఆహారం తీసుకోమని కూడా చెబుతారు. అలాంటి వాటిలో కొన్ని చిట్కాలు మీకోసం... ►సపోటా జ్యూస్ తాగటం లేదా సపోటా పండ్లు తినడం వల్ల శరీరానికి తొందరగా రక్తం పడుతుంది. ►దానిమ్మ రసం తాగడం, దానిమ్మ పండ్లు తినడం కూడా చాలా మంచిది. బూడిద గుమ్మడి రసం తాగితే.. ►బూడిద గుమ్మడి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ధి అవుతుంది. బూడిద గుమ్మడి కాయ గుజ్జు తీసి దానిని దళసరి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే రసాన్ని కప్పులో పోసుకుని తాగాలి. నెలలోనే రక్తం వృద్ధి! ►కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. లేత కొబ్బరి తింటే కూడా! ►ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. ►రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ►అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ►లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. నోట్: వీటిలో మీ శరీర తత్త్వాన్ని, మీకున్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని మీకు ఏవి బాగా సరిపడతాయో, ఏది సులభమో వాటిని అనుసరిస్తే సరి. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
బ్రెయిన్ స్ట్రోక్కి రక్తం గ్రూప్తో లింక్
వాషింగ్టన్: మీ రక్తం ఏ గ్రూప్ ..? దానిని బట్టి మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎంతో చెప్పేయొచ్చు. ఎ గ్రూప్ రక్తం ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో మనిషి రక్తంలో గ్రూప్కి, స్ట్రోక్కి మధ్య సంబంధం ఉందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను మెడికల్ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రచురించింది. ఒక మనిషి రక్తం గ్రూప్కు సంబంధించిన జన్యు రకాలను, మెదడు సహా ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల యుక్త వయసులో వచ్చే స్ట్రోక్స్కు సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ► ఒక వ్యక్తి రక్తం గ్రూప్ ఎ అయితే 60 ఏళ్ల కంటే ముందుగానే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్ కలిగిన వారి రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉంటుంది. మిగతా గ్రూప్ల వారి కంటే స్ట్రోక్ వచ్చే అవకాశం 16% ఎక్కువ. ► ఓ–బ్లడ్ గ్రూప్ వారు నిశ్చింతగా ఉండొచ్చు. వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. మిగతా గ్రూప్ల కంటే రిస్క్ 12% తక్కువ. ► బి గ్రూప్ రక్తం ఉన్న వారికి ఏ వయసులోనైనా స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో బ్రెయిన్ స్ట్రోక్స్పై జరిగిన 48పైగా అధ్యయనాలను విశ్లేషించి తాజా నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనాల్లో 18 నుంచి 59 వరకు వయసు కలిగిన వారు ఉన్నారు. గతంలో ఒ గ్రూప్ కాని వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నా యని తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ బ్రాక్స్టన్ మిచెల్ చెప్పారు. -
మనోళ్ల బీపీ హై
సాక్షి, హైదరాబాద్: మనవాళ్లను రక్తపోటు సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలోని 50 శాతానికి పైగా జనం తమకు అధిక రక్తపోటు ఉన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. బీపీ పేషెంట్లలో 75 శాతం కంటే ఎక్కువ మందికి రక్తపోటు నియంత్రణలో ఉండడం లేదు. ఈ బీపీ స్థాయిలతో వారి రోజువారీ జీవనం అతలాకుతలం అవుతోంది. ఈ సమస్య పేదవర్గాల్లోనూ ఉంది. యువజనుల్లోనూ బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బీపీ గుండెసంబంధిత జబ్బుల్లో ప్రమాదకారిగా, ప్రాణాంతకంగా మారుతోంది. 2001–2022ల మధ్య భారత్లోని పెషేంట్లపై నిర్వహించిన ‘సిస్టమాటిక్ రివ్యూ అండ్ మెటా అనాలిసిస్ ఆఫ్ పాపులేషన్ లెవల్ నాన్–ఇంటర్వెన్షనల్ స్టడీస్’లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కేరళలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ–మంజేరీ, కిమ్స్ అల్–షిఫా స్పెషాలిటీ హాస్పిటల్–పెరింతల్మన్న సహా వివిధ బృందాలు జరిపిన పరిశోధనలను, 51 అధ్యయనాలను సమీక్ష నిర్వహించారు. ఈ పరిశీలనలో భాగంగా దాదాపు 15 లక్షల మంది బీపీ పేషెంట్లను పరిశీలించారు. ఈ అధ్యయానికి సంబంధించిన తాజా నివేదిక లాన్సెట్ రీజనల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైంది. అధ్యయనంలోని ముఖ్యాంశాలు.. ►ఇండియాలోని 15–49 ఏళ్ల మధ్యలోని 50 శాతం మందికి తమ బీపీ గురించి తెలియదు ►22.5 శాతం పేషెంట్లలో మాత్రమే బీపీ నియంత్రణలో ఉంటోంది ►భారత్లో దక్షిణాదితో పోల్చితే ఉత్తరాదిలో ఈ సమస్యపై తక్కువ అధ్యయనం ►దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో మెరుగైన రీతిలో నియంత్రణ ►పురుషుల్లో నియంత్రణ శాతం తక్కువే ►జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన అలవాట్లతో బీపీ నియంత్రణలో ఉండటం లేదు. నియంత్రణ కోసం.. ►బీపీ నియంత్రణ శాతాన్ని పెంచేందుకు భారత్లో సుస్థిర కమ్యూనిటీ ఆధారిత వ్యూహాలు అనుసరించాలి ►సమస్య తీవ్రత గుర్తించేందుకు మరింత మెరుగైన కమ్యూనిటీ స్థాయి డేటా అవసరం ‘సైలెంట్కిల్లర్’గా మారింది... బీపీ పట్ల అప్రమత్తత అవసరం. గతంలో 50, 60 ఏళ్లు దాటితేనే బీపీ, షుగర్ వస్తాయని భావించేవారు. జీవనశైలి మారడం, పాశ్చాత్య పోకడలకు అనుగుణంగా మారిన ఆహార అలవాట్లతో 20–25 ఏళ్ల యువతలో బీపీ కేసులు పెరుగుతున్నాయి. జంక్ఫుడ్, అధిక ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్, సోడియం మోతాదు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తెలియకుండానే బీపీ పేషెంట్లుగా మారుతున్నారు. బీపీ నియంత్రణలో లేని వారు డయాబెటిస్, హైపర్టెన్సివ్ రెటినోపతి, కిడ్నీ ఫెయిల్యూర్స్, గుండెపోటు బారిన పడుతున్నారు. విదేశాల్లో అయితే క్రమం తప్పకుండా ఆయా వయసుల వారికి వివిధరకాల పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ పౌరుల ఆరోగ్యం గురించిన వివరాలు, మెడికల్ రికార్డ్స్ను భద్రపరుస్తారు. మన దగ్గరా ఆ పద్ధతులు రావాలి. ప్రతి ఒక్కరూ బీపీని తరచూ పరీక్షించుకోవాలి. – డా.ఎ.నవీన్రెడ్డి, క్రిటికల్కేర్ నిపుణుడు, నవీన్రెడ్డి హాస్పిటల్ బీపీ ఉన్నా తెలియడం లేదు.. తెలంగాణలో, హైదరాబాద్లో రక్తపోటుల్లో వచ్చే తేడాల గురించి ఎక్కువమందికి అవగాహన ఉండడం లేదు. గ్రామీణప్రాంతాల్లోని 60 శాతం మందికి తమకు బీపీ, షుగర్ ఉన్న విషయమే తెలియడం లేదు. తల కింది భాగంలో నొప్పి, మెడ భారంగా ఉండడం, నిద్రపోయినపుడు ఆక్సిజన్ సరిగా అందక స్లీప్ అప్నీయా, ఉదయం నిద్ర లేచాక కూడా ఫ్రెష్గా అనిపించకపోవడం వంటివి బీపీకి కారణాలుగా తెలుసుకోవాలి. బీపీ పెరిగి రక్తనాళాలు చిట్లి, పక్షవాతం బారిన పడే దాకా కూడా కొందరు గ్రహించలేకపోతున్నారు. మద్యం, సిగరెట్లు, మసాలాలతో కూడిన ఆహారం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఇతర చెడు వ్యసనాలు దీనికి కారణం అవుతున్నాయి. బీపీకి సంబంధించి 120/80 సాధారణంగా, 140/90 మధ్యతరహా, 150/100 తీవ్రమైనదిగా పరిగణిస్తాం. చిన్న విషయానికే ఆవేశపడటాన్ని ఆగ్జిలేటరీ హైపర్ టెన్షన్గా చూడాలి. – డా. ప్రభుకుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజీషియన్, లైఫ్ స్పెషాలిటీస్ నర్సింగ్హోం -
ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి బెదిరింపులకు దిగింది. ఆ తర్వాత ఇప్పుడూ కీవ్ రాయబార కార్యాలయాలకు జంతువులు కళ్లు, నెత్తుటితో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను పంపుతోంది రష్యా. ఈ మేరకు హంగేరి, నెదర్లాండ్స్, పోలాండ్, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని కీవ్ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన బ్లడ్ ప్యాకేజీలను రష్యా పంపినట్లు సమాచారం. అదీగాక వాటికన్లోని ఉక్రెయిన్ రాయబారి కార్యాలయం తలుపులను ధ్వసం చేసి అక్కడ మానవ మలం వదిలి వేసినట్లు ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే కజకిస్తాన్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. ఉక్రెయిన్ ఎప్పుడూ సదా అప్రమత్తంగానే ఉంటుంది. అలాగే ఈ రాయబార కార్యాలయాలు సదా ఉక్రెయిన్ గెలుపు కోసం సమర్థవంతంగా పని చేస్తూనే ఉంటాయి అని నొక్కి చెప్పారు. ఐతే రష్యా రాయబార కార్యాలయాలు ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. -
చిన్నారికి తక్షణమే సర్జరీ!...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
నాలుగు నెలల శిశువుకి గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్స వెంటనే చేయాలి. ఐతే అందుకు దాతల నుంచి రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ససేమిరా అంటు తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన న్యూజిలాండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్లోని నాలుగు నెలల చిన్నారికి గుండెకి సంబంధించి లైఫ్ సేవింగ్ సర్జరీ వెంటనే చేయాల్సి ఉంది. ఐతే సర్జరీ కోసం దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకు ఆ శిశువు తల్లిదండ్రులు ఆ రక్తం ఉపయోగిస్తే ఏమవుతుందో అని ఆందోళనతో హైకోర్టుని ఆశ్రయించారు. వారికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి సేకరించి రక్తం తమ బిడ్డకు ఎక్కించడంపై విముఖత చూపుతున్నారు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ...తమ బిడ్డకు తీవ్రమైన పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ ఉందని, శస్త్ర చికిత్స వెంటనే చేయాల్సి ఉందని చెప్పారు. ఐతే అందుకు ఉపయోగించే రక్తం పట్ల ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న కలుషిత రక్తం కాకుండా మరేదైనా ఐతే తమకు అభ్యంతరం లేదంటున్నారు. ఐతే న్యూజిల్యాండ్ బ్లడ్ సర్వీస్.. దాతాలు వ్యాక్సిన్ తీసుకునే దానినిబట్టి వారి నుంచి సేకరించిన రక్తాన్ని వేరుచేయడం జరగదని స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తాన్ని ఉపయోగించడం ద్వారా ఏదైనా ప్రమాదం ఉందనే దానిపై ఎటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది. ఈ క్రమంలో ఆక్లాండ్ టె వాటు ఓరా ఆస్పత్రి డైరెక్టర్ వైద్యుడు మైక్ షెపర్డ్ మాట్లాడుతూ..".అనారోగ్యంతో ఉన్న పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకు వారి సంరక్షణ కోసం తీసుకునే నిర్ణయం విషయంలో ఎంత ఆందోళన చెందుతారో అర్థం చేసుకున్నాం. శిశువు ఆరోగ్యం దృష్ట్యా పిల్లల సంరక్షణ చట్టం కింద సదరు చిన్నారిని తల్లిదండ్రుల సంరక్షణ నుంచి తప్పించి కోర్టు కస్టడీకి తీసుకోవాలి. అలాగే దానం చేసిన రక్తాన్ని ఉపయోగించేలా శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేశాం. చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు." ఈ మేరకు హైకోర్టులో విచారణకు ఇరు పార్టీలు బుధవారం కోర్టులో హాజరయ్యారు. ఐతే కోర్టు వద్ద సుమారు వంద మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక మద్దతుదారుల బృందం పెద్ద ఎత్తున గుమిగూడి ఉండటం గమనార్హం. న్యూజిల్యాండ్ ధర్మాసం ఏం చెబుతుందా అని అందరూ ఒకటే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. (చదవండి: జలరాకాసి నోట చిక్కి.. తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..) -
Health: పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బినట్లు కన్పిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే
Health Tips In Telugu- Varicose Veins: సాధారణంగా గుండె... మిగతా మానవ శరీరమంతటికీ తన నుంచి వెలువడే రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తుంటుంది. ఈ రక్తనాళాలను ధమనులు అంటారు. మళ్లీ కొన్ని రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం చేరుతుంది. ఇలా గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్ని సిరలుగా చెబుతారు. కాళ్ల దగ్గర ఉండే ఈ సిరలు దెబ్బతినడం, లేదా పై వైపునకు వెళ్లాల్సిన రక్తం సాఫీగా ప్రవహించకపోవడంతో కాళ్ల కింది భాగంలో, ప్రధానంగా పిక్కల వంటి చోట్ల రక్తనాళాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడాన్ని ‘వేరికోస్ వెయిన్స్’ అంటారు. ఆ కండిషన్పై అవగాహన కోసం... సంక్షిప్తంగా ఈ కథనం. ఇతర శరీర భాగాల విషయంలో ఎలా ఉన్నప్పటికీ కాళ్ల విషయానికి వస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల గుండెకు చేరాల్సిన రక్తప్రసరణ కాస్త ఆలస్యమవుతుంది. అంతేకాదు... వయసు పైబడటం, స్థూలకాయం, కుటుంబ చరిత్ర వంటి అంశాలతోనూ, ట్రాఫిక్ పోలీసులు, బస్కండక్టర్లు వంటి వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా నిలబడే ఉండటం వంటి కొన్ని వృత్తిపనుల్లో రక్తప్రసరణ ఆలస్యం అవుతుంది. మహిళల్లో గర్భం దాల్చడం, హార్మోన్లు ప్రభావం వంటి అంశాలూ రక్తప్రసరణను ఆలస్యమయ్యేలా చేయవచ్చు. ఈ సమస్య శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. కానీ సాధారణంగా మోకాలి కింది భాగం నుంచి పాదాల వరకు వచ్చినప్పుడు ఈ పరిస్థితి చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించి, పడుకునే సమయంలో కాలిని కాస్త ఎత్తుగా ఉండేలా కాలికింద దిండు వేసుకుంటే సరిపోతుంది. కానీ వేరికోస్ వెయిన్స్ బాధిస్తుంటే డాక్టర్ సహాయం అవసరం. వేరికోస్ వెయిన్స్ అంటే కొన్ని సందర్భాల్లో మాత్రం పరిస్థితి ఇంకాస్త తీవ్రంగా ఉంటుంది. కాలి రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా; లేదా మోకాలి కింద ఉండే రక్తనాళాలు దెబ్బతిన్నా లేదా అవి బలహీనపడ్డా, ఆ రక్తనాళాల్లో రక్తాన్ని కిందికి పోకుండా నిలిపే కొన్ని కవాటాలు బలహీనపడటం వల్ల ఒక్కోసారి గుండెకు చేరాల్సిన రక్తసరఫరా సాఫీగా సాగదు. అలాంటప్పుడు మోకాలి కింది రక్తనాళాలు ఉబ్బినట్టుగా ఉండటం, సాలీడు కాళ్లను పోలిన ఉబ్బుతో కనిపించడం, అలా ఉబ్బిన రక్తనాళాలు నీలం, ఎరుపు రంగులో కనిపిస్తుంటే ఆ కండిషన్ను ‘వేరికోస్ వెయిన్స్’గా చెబుతారు. నిర్ధారణ పరీక్షలు వేరికోస్ వెయిన్స్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. వీనస్ అల్ట్రాసౌండ్, లోపలి రక్తనాళాలను చూస్తూ పరిస్థితి తెలుసుకునేందుకు సీటీ, ఎమ్మారై, ‘వీనోగ్రామ్’ వంటి పరీక్షలు చేస్తారు. చికిత్సలు పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు లేదా అప్పటికే రక్తనాళాలు ఉబ్బి బాగా బయటికి కనిపిస్తూ, తీవ్రమైన నొప్పి వస్తున్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా పరిస్థితిని చక్కబరచాల్సి వస్తుంది. ఇందులో దెబ్బతిన్న రక్తనాళాలను శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ఈ ప్రక్రియను ‘వీన్ లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్’ అంటారు. అయితే ఇప్పుడు శస్త్రచికిత్సను అంతగా ఉపయోగించడం లేదు. వైద్యశాస్త్రంలో వచ్చిన గణనీయమైన పురోగతి వల్ల ఇప్పుడు వేరికోస్ లేజర్ చికిత్సలు, గ్లూ చికిత్సల వంటి ఇతర అధునాతన ప్రక్రియలు, చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అది కూడా కోత పెట్టడంతో కాకుండా కేవలం రక్తనాళాల్లోకి (ఇంట్రావీనస్) కాన్యులా పంపడం వంటి సులువైన ప్రక్రియలతోనూ చికిత్స సాధ్యమవుతోంది. -డాక్టర్ శ్రీధర్రెడ్డి బద్దం , సీనియర్ కన్సల్టెంట్, వాస్క్యులార్ అండ్ ఆంకో ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్ చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. దుర్వాసన లేకుండా బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్ అంటూ పారిపోతారు మరి.. Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. -
పురిటిలో మృత్యు ఘోష.. వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి, కవలలు మృతి
వైద్యో నారాయణ హరి అన్న నానుడికి కళంకం తెస్తున్నారు కొందరు వైద్యసిబ్బంది. ఏమాత్రం కనికరం లేకుండా వైద్యాన్ని నిరాకరించడం తమ గొప్పగా భావిస్తారు వీరు. నిరుపేద గర్భిణి కాన్పు కోసం వస్తే వైద్యం చేయడానికి బదులు, దయాదాక్షిణ్యం లేకుండా వెనక్కి పంపేశారు. ఇంట్లో ఆ అభాగ్యురాలు కవలలకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అమ్మ లేని లోకం దండగ అనుకున్నారో ఏమో.. ఆ శిశువులు కూడా తల్లి వెంటే వెళ్లారు. ఈ దారుణం ఏ మారుమూలో పల్లెలోనో కాదు, విద్యా వైద్య సేవలకు పేరుగన్న తుమకూరు నగరంలో చోటుచేసుకుంది. సాక్షి, బెంగళూరు: తుమకూరు నగరంలో ఉన్న జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత ప్రాణం గాలిలో కలిసింది. పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది, అయితే నీకు ఆరోగ్య కార్డు లేదు, చికిత్స చేయలేం అని వైద్యసిబ్బంది కఠినంగా తిరస్కరించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లిపోగా, అక్కడ కవల పిల్లలు జన్మించారు, కానీ తీవ్ర రక్తస్రావం జరిగి కన్నుమూసింది. వైద్యసిబ్బంది అలసత్వం ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్లగా ఈ అమానుష సంఘటన తుమకూరులో జరిగింది. భారతీ నగరలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వీధిలో కస్తూరి (30) అనే మహిళ నివసిస్తోంది. తమిళనాడుకు చెందిన కస్తూరి ఇక్కడకు వచ్చి నెల రోజులు అవుతోంది. ఆమె ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆర్థిక సమస్యలతో భర్త 4 నెలల కిందట బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిండు గర్భిణి అయిన కస్తూరికి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో చుట్టుపక్కల మహిళలు ఆమె చేతికి కొంత డబ్బిచ్చి ఒక వృద్ధురాలిని తోడిచ్చి ఆటోలో జిల్లా ఆస్పత్రికి పంపించారు. జిల్లా ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయడానికి బదులుగా గర్భం దాల్చినప్పుడు ఆస్పత్రిలో నమోదు చేసుకుని కార్డు తీసుకున్నారా? అని అడగ్గా ఆమె లేదు అని చెప్పింది. ఆధార్, రేషన్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు అడ్రస్ చూపగా తమిళనాడు చిరునామాతో ఉంది. అంతే.. మేం వైద్యం చేయం, బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి వెళ్లండి అని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. తీవ్ర రక్తస్రావమై దిక్కుతోచని కస్తూరి ఆటోలో ఇంటికి తిరిగివచ్చింది. కొంతసేపటికి ఆమెకు ప్రసవమై ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. కానీ తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు చూసేవారెవరూ లేకపోయారు. కొంతసేపటికి విలవిలలాడి తల్లీ బిడ్డలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లిని కోల్పోయి కూతురు విలపిస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరారు. ముగ్గురు సస్పెండ్ అంతా జరిగాక ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. డాక్టర్ ఉషా, మరో ఇద్దరి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మంజునాథ్ ప్రకటించారు. రాత్రికి ఆరోగ్యమంత్రి సుధాకర్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మేయర్, కార్పొరేటర్ల నిరసన ఈ దారుణంపై స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 22వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాస్, మేయర్ ప్రభావతి, ఉప మేయర్ టి.కే.నరసింహమూర్తి, కార్పొరేటర్ నయాజ్ అహ్మద్లు బాధితురాలి ఇంటికి వెళ్లి చుట్టుపక్కలవారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లీపిల్లల మృతదేహానికి నివాళులర్పించారు. జిల్లా ఆస్పత్రి వైద్యులు, డిహెచ్ఈ ఇక్కడికి వచ్చేదాకా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, వైద్యులు అందరు లంచాలకు అలవాటు పడి సక్రమంగా వైద్యం చేయడంలేదని, ఆస్పత్రి మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ వీణా వచ్చి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కస్తూరికి తల్లి కార్డు లేక పోవడంతో వెనక్కి పంపించారని చెప్పారు. గర్భిణి ప్రతినెలా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయంచుకునే సమయంలో వారికి తల్లి కార్డు ఇస్తారని అన్నారు. ఇకపై ఇలా జరగుకుండా చూసుకుంటామని, దీనికి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. -
షాకింగ్ వీడియో: రక్తపు మడుగులో పేషెంట్.. చుట్టూ తిరుగుతున్న కుక్క
లఖ్నవూ: ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు. అతని చుట్టూ ఓ వీధి కుక్క తిరుగుతున్న హృదయవిదారక సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమానవీయ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఖుషీనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. వీడియో ప్రకారం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో కింద పడిపోయి ఉన్నాడు. చుట్టూ రక్తం పడి ఉంది. ఆ వ్యక్తి ముఖం, తలపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తి చుట్టూ ఓ వీధి కుక్క సైతం తిరుగుతోంది. 28 సెకన్ల పాటు చూపించిన ఈ వీడియోలో ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ పడకల సహా ఏ ఒక్క డాక్టర్, నర్సు సైతం లేరు. మరోవైపు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆసుపత్రి ఇన్ఛార్జి డాక్టర్ ఎస్కే వర్మ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, చికిత్స అందిస్తున్న సమయంలోనే పలుమార్లు బెడ్ పైనుంచి కిందపడిపోయినట్లు చెప్పారు. ఆ వీడియో తీసిన సమయంలో డాక్టర్, వార్డు బాయ్ మరో వార్డులోని ఎమర్జెన్సీ కేసును చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తిని గోరఖ్పుర్లోని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. The video is from #Kushinagar, #UttarPradesh In the government hospital, the injured youth lying in a pool of blood is lying on the ground instead of the bed, dogs are licking his blood. The fate of every hospital is not like Morbi, which is brightened overnight. pic.twitter.com/5PM5di0Lxv — Today Hind (@today__hind) November 3, 2022 ఇదీ చదవండి: ‘ఒక్క ఉదాహరణ చూపితే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్ -
రక్తం వేగంగా అందించేందుకు త్వరలో యాప్
సాక్షి, హైదరాబాద్: అత్యవసరవేళ రక్తాన్ని వేగంగా అందించేందుకు యాప్ను తయారుచేసినట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. దీని నిర్వహణలో స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుంటామన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున 50సార్లు రక్తదానం చేసిన వారికి చిరు భద్రత పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా రాజ్భవన్లో ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానం మహా దానమన్నారు. గతంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు వచ్చేవారు కాదని, రక్తదానంపై అవగాహన పెరిగి ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలిపారు. రెడ్క్రాస్ ద్వారా రక్తదాన కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాజ్భవన్ సైతం ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బ్లడ్బ్యాంక్ ద్వారా సేవలందిస్తున్న చిరంజీవిని గవర్నర్ తమిళిసై ప్రత్యేకంగా అభినందించారు. రక్తాన్ని అదించేందుకు రూపొందించిన యాప్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం రక్తం అందుబాటులో లేక మరణించిన వారిని చూసి తనకు బ్లడ్ బ్యాంక్ ఆలోచన వచ్చిందన్నారు. సమాజానికి ఉపయోగపడేందుకే చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా బ్లడ్ బ్యాంకును ప్రారంభించామని తెలిపారు. -
మెదడులో కల్లోలం.. 45 ఏళ్ల లోపు వారిలోనూ..
సాక్షి, విజయవాడ: శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్స్ట్రోక్కు గురై పక్షవాతం బారిన పడతారు. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల లోపు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 30 శాతం మంది యువతే.. ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారిలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే వారిలో 25 నుంచి 30 శాతం మంది 45 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్తో వస్తుంటారు. వారి స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగక పోవడం వలన వచ్చే స్ట్రోక్(ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. ప్రధాన కారణాలివే.. ►పెద్ద వయస్సు వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్కు కారణంగా చెబుతున్నారు. ►45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సిక్కుసెల్ అనే రక్తంలో జెనిటిక్ లోపాలు, వంశపారంపర్యంగా, హెరాయిన్ వంటి డ్రగ్స్, మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ►వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్కు గురవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ►ఆడవారిలో హార్మోనల్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా కూడా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండెలోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు. ఆ నాలుగు గంటలే కీలకం.. ఇప్పుడు బ్రెయిన్స్ట్రోక్కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి, నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్తో వైకల్యం రాకుండా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన వారికి త్రోంబలైసిస్ ఇంజెక్షన్ను ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, ఆకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు మందగించడం, తలతిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. జీవన విధానం ముఖ్యం.. ప్రతి ఒక్కరూ మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. కదలిక లేని జీవన విధానం కారణంగా చిన్న వయస్సులోనే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, మధ్య వయస్సు వచ్చేసరికి స్ట్రోక్కు దారి తీస్తున్నాయి. వంశపారంపర్యంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్న వారు మందులు సక్రమంగా వాడటం ద్వారా ముప్పు ను తప్పించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా చాలా వరకూ ఈ వ్యాధిని నివారించవచ్చు. – డాక్టర్ ప్రసన్నకుమార్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులు వస్తున్నాయి.. ఇటీవల 45 ఏళ్లలోపు బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్న(స్ట్రోకింగ్ యంగ్) వారిని తరచూ చూస్తున్నాం. మా వద్ద వస్తున్న స్ట్రోక్ కేసుల్లో 25 శాతం అలాంటి వారే ఉంటున్నారు. తక్కువ వయస్సు వారిలో స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు వాడటం, మద్యపానం, ధూమపానంతో పాటు, హోమోసిస్టీన్, సిక్కుసెల్, రక్తంలో లోపాలు కూడా కారణం కావచ్చు. బ్రెయిన్స్ట్రోక్ లక్షణాలను గుర్తించి నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ డి. అనిల్కుమార్, న్యూరాలజిస్ట్ -
వారి ప్రాణాలకు ఏపీ ప్రభుత్వ అభయం
సాక్షి, అమరావతి : తరచూ రక్త మార్పిడి అవసరమయ్యే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి జబ్బులతో బాధపడే రోగుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ వీరి పింఛన్ను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు వలంటీర్లు ఠంఛన్గా గుమ్మం వద్దకే పింఛన్ చేరవేస్తున్నారు. అంతే కాకుండా వీరికి ఉచితంగా రక్తమార్పిడి సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా వీరి ఆరోగ్యానికి మరింత అండగా నిలిచే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ తరహా జబ్బులతో బాధపడే వారికి వైద్య సేవల కోసం ప్రత్యేక వార్డులను ఆస్పత్రుల్లో ఉంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల వీరి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. విశాఖ కేజీహెచ్, కర్నూల్, కాకినాడ, గుంటూరు జీజీహెచ్లలో హిమోగ్లోబినోపతీస్, హీమోఫిలియా సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగుల వైద్య సేవల కోసం ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను వైద్య శాఖ ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.40 లక్షల చొప్పున రూ.1.60 కోట్లు వెచ్చిస్తోంది. ప్రతి కేంద్రంలో పది పడకలు, ఒక మెడికల్ ఆఫీసర్, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. రక్త పరీక్షలు, రక్త మార్పిడికి సంబంధించిన అధునాతన పరికరాలను ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. వీలైనంత త్వరగా పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి, ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శ్యాక్స్ పీడీ నవీన్కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..!
ఒక రకరమైన ఇబ్బందికరమైన ఇనుము రుచితో ఉండే ఐరన్ ట్యాబ్లెట్లు వాడటం కంటే హాయిగా తినాలనిపించే రుచికరమైన దానిమ్మతో ఒంట్లో ఐరన్ మోతాదులు పెరుగుతాయి. అలా ఈ పండు రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తనాళాలనూ శుభ్రపరుస్తుంది. ఒంటికి మంచి ఆరోగ్యకరమైన రక్తం పట్టడం వల్ల మనిషి చురుగ్గానూ మారుతారు. ఇక ఇదే దానిమ్మ బరువు పెరగకుండా కూడా నివారిస్తుంది. ఇలా దానిమ్మతో బరువు తగ్గడానికి కారణం... ఇందులో ఉండే దాదాపు 7 గ్రాముల పీచు. ఇలా బరువు తగ్గించడం ద్వారా ఇది గుండెజబ్బులనూ నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ కె, విటమిన్ సీ వంటి విటమిన్ల వల్ల రోగనిరోధకSశక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పొటాషియమ్ రక్తపోటును అదుపులో పెడుతుంది. దాదాపు 25 గ్రాముల చక్కెర కారణంగా తక్షణం 144 క్యాలరీల శక్తి సమకూరుతుంది. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉండటం అన్న అంశం కూడా వేగంగా బరువు తగ్గడానికి/పెరగకుండా నివారించడానికి తోడ్పడతాయి. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అయినా... ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను ఒక పండే ఇవ్వడం అన్నది చాలా కొద్ది పండ్ల విషయంలోనే ఉంటుంది. అందుకే రక్తహీనత తగ్గడం, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, వ్యాధినిరోధకతను పెంచుకోవడం లాంటి బహుళ ప్రయోజనాలను పొందాలంటే దానిమ్మ పండు తినడం రుచికరమైన ఓ మంచి మార్గం. -
ఈఎంఎం బ్లడ్ గ్రూప్.. ఎప్పుడైనా విన్నారా?
అహ్మదాబాద్: మనుషుల్లో బ్లడ్ గ్రూప్లు సాధారణంగా ఏ, బీ, ఓ, లేదా ఏబీ అని ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, గుజరాత్కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తిలో కొత్తరకం బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు వైద్యులు. దేశంలోనే అరుదైన రక్తం కలిగిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే.. ఇలా ప్రత్యేక రక్త సమూహం కలిగిన వ్యక్తులను గుర్తించటం ప్రపంచవ్యాప్తంగా ఇది 10వ కేసుగా పలు నివేదికలు వెల్లడించాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన వ్యక్తిలో 'ఈఎంఎం నెగెటివ్' బ్లడ్ గ్రూప్ను కనుగొన్నారు వైద్యులు. సాధారణంగా మానవ శరీరంలో నాలుగు రకాల బ్లడ్ గ్లూప్లు ఉంటాయి. అందులో ఏ, బీ, ఓ, ఆర్హెచ్, డఫ్పీ అంటూ 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. అలాగే.. ఈఎంఎం అధికంగా ఉండే 375 రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఈఎంఎం నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఇతరులకు తన రక్తాన్ని ఇవ్వలేరు.. ఇతరుల నుంచి తీసుకోలేరు. ఎలా నిర్ధారించారు? రాజ్కోట్కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ చేయాల్సి రావటం వల్ల రక్తం అవసరమైంది. ఆసుపత్రిలోని ల్యాబ్లో రక్తం పరీక్షించగా గ్రూప్ తెలుసుకోలేకపోయారు. దీంతో రక్తం నమూనాలను సూరత్లోని రక్త నిధి సేకరణ కేంద్రానికి పంపించినట్లు అక్కడి వైద్యులు సన్ముఖ్ జోషీ తెలిపారు. ఆ రక్తాన్ని పరీక్షించగా ఏ గ్రూప్తోనూ సరిపోలలేదు. దీంతో వృద్ధుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అమెరికాకు పంపించినట్లు చెప్పారు జోషీ. దీంతో అరుదైన బ్లడ్ గ్రూప్గా తేలిందన్నారు. రక్తంలో ఈఎంద్ లేకపోవటం వల్ల దానిని ఈఎంఎం నెగెటివ్గా ఐఎస్బీటీ నామకరణ చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 మంది మాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 మందిలో మాత్రమే ఇలాంటి అరుదైన ప్రత్యేక బ్లడ్ గ్రూప్లను కనుగొన్నారు. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన వ్యక్తిలో అలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ను కొనుగొన్న నేపథ్యంలో ఆ సంఖ్య 10కి చేరింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
ప్లీజ్.. దాతలు సహకరించండి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని కూకట్పల్లికి చెందిన ధర్మేంద్ర మౌలి అనే నాలుగేళ్ల బాలుడు అరుదైన ‘టీ సెల్ లింపోబ్లాస్టిక్ ట్యుకేమియా’ అనే బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారని తండ్రి వీర నాగేంద్ర తెలిపారు. ఒక సూపర్ మార్కెట్లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న తాను బాబు చికిత్స కోసం ఉన్న డబ్బులన్నీ వెచ్చించానని, ప్రస్తుతం సర్జరీ చేయడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని అన్నారు. చదవండి: సేవ చేయాల్సి వస్తుందని.. గొంతునులిమి తండ్రిని హత్య చేసిన కొడుకు ప్రస్తుతం జరగుతున్న చికిత్సకు నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తుందని, కానీ సర్జరీకి అవసరమైన డబ్బుల కోసం దాతల సాయం కావాలని కోరారు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కాకినాడ నుంచి నగరానికి వచ్చానని, తాను సంపాదించిన డబ్బులతో తన బాబుకు చికిత్స అందించే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహకారం అందించాలనుకునే దాతలు తన మొబైల్ నంబర్ 9642842896లో సంప్రదించాని బాలుడి తండ్రి కోరాడు. -
రక్త ఆభరణాలు! ఔను! మానవుని రక్తంతో చేసినవి...
బంగారం, వెండీ, ప్లాటినం వంటి వాటిని కాలదన్నే విచిత్ర ఆభరణాలు రాబోతున్నాయి. మనం ఇంతవరకు తల్లిపాలతో చేసిన ఆభరణాలు గురించి విన్నాం. తల్లిపాలతో ఆభరణాలేంటి అనికొందరూ విమర్మించిన ఇందులో ఎలాంటి తప్పులేదని తయారుచేసి చూపించింది లండన్కి చెందిన జంట. ఐతే ఇప్పుడూ ఒక అడుగు ముందుకేసి మానవుని రక్తంతో తయారు చేసే ఆభరణాలు రూపొందిస్తున్నారు ప్రీతీ మాగో అనే మహిళ. పైగా ఇది మన ప్రియమైన వారి జ్ఞాపకంగా మన వద్ద ఉంటుందంటున్నారు. ప్రీతీ మాగో కంటి ఆస్ప్రతిలో ఆప్టోమెట్రిస్ట్గా పనిచేసేవారు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఉద్యోగాన్ని వదిలేయవలసి వచ్చింది. అదీగాక బిడ్డ సంరక్షణ నిమిత్తం ఆమె ఉద్యోగానికే వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఆర్థిక స్వాతంత్య్రం కూడా కోల్పోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న ఆమెకు తల్లిపాలతో జ్యూవెలరీ తయారు చేయడం గురించి సోషల్ మాధ్యమాల ద్వారా తెలుసుకుంది. దీంతో ఆమె ఆ దిశగా తన గమ్యాన్ని మార్చుకుంది. తన భర్త సాయంతో యూఎస్లో వివిధ జ్యూవెలరీ కోర్సులను నేర్చకుంది. తల్లిపాలతో చేసే ఆభరణాల దగ్గర నుంచి బొడ్డుతాడు, వెంట్రుకలు, దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు ఆమె. ఇంతవరకు చాలామంది పలు రకాలైన ఆభరణాలను తయారు చేశారు గానీ రక్తంతో తయారు చేసే ఆభరణాలనేది అనేది అరుదైన కాన్సెప్ట్ అని, ఇంతవరుకు ఎవరూ ఇలాంటి ఆభరణాలు తయారు చేయలేదని చెబుతున్నారు ప్రీతీ. ఆమె మొదట్లో ఎన్నో వైఫల్యాలు చవిచూసిన అనంతరం 2019లో తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రీతీ తెలిపారు. మనకు ఇష్టమైన వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడూ... వారి గుర్తుగా వారి శరీరం నుంచి సేకరించిన రక్తంతో అందమైన లాకెట్లుగా రూపొందిస్తారు. స్వర్గంలో ఉన్న మన ప్రియమైన ఆప్తులు గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. తాను డీఎన్ఏ కలిగిన మెటీరియల్ని ఉపయోగించి ఈ ఆభరణాలను రూపొందించనట్లు ప్రీతీ పేర్కొంది. (చదవండి: నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్) -
రక్తదాతలూ ఈ విషయం గుర్తుంచుకోండి..!
రక్తదానం చేయాలనుకునేవారు తాము డొనేట్ చేస్తున్న బ్లడ్బ్యాంకులో... రక్తాన్ని కాంపోనెంట్స్ను విడదేసే సౌకర్యం ఉందా, లేదా అని ముందుగా వాకబు చేయాలి. అలా విడదీసే సౌకర్యం ఉంటేనే రక్తదానం చేయాలి. లేదంటే ఎక్కువ మందికి ఉపయోగపడాల్సిన రక్తం... కేవలం ఒకరికే ఉపయోగపడుతుంది. రక్తంలో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా... వంటి అనేక కాంపోనెంట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇవన్నీ కలగలసి ఉన్న రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. గతంలో పేషెంట్స్కు ఏ కాంపొనెంట్ అవసరం ఉన్నా మొత్తం హోల్ బ్లడ్ ఎక్కించేవారు. కానీ ఇప్పుడు బ్లడ్లోని కాంపొనెంట్స్ను విడదీసి... అవసరమున్న దాన్ని మాత్రమే ఎక్కించే వీలుంది. అంటే... ఒక వ్యక్తికి హోల్బ్లడ్ ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. అలా కాకుండా ఏ కాంపొనెంట్ అవసరమో, అదే ఎక్కిస్తే ఒక హోల్ బ్లడ్ను అనేక మందికి సర్దుబాటు చేయవచ్చు. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఓ వ్యక్తికి ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీతన (అనీమియా)తో బాధపడుతున్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగీ సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి ప్లేట్లెట్లు మాత్రమే అవసరం. రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు, వాటిని విడదీసి రకరకాల అవసరాలు ఉన్న అనేకమంది రోగులకు ఎక్కించవచ్చు. అలా ఒకరి రక్తం ఒకే వ్యక్తి కంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు రక్తాన్ని కంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్బ్యాంకులోనే రక్తదానం చేయడం వల్ల ఏకకాలంలో అనేక మందికి రక్తదానం చేసిన ప్రయోజనం ఉంటుంది. -
కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ముఖంపై నెత్తుటి గాయాలతో కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో ఆయనకు నోటి దగ్గర కూడా రక్తపు గాయాలయ్యాంటూ... రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు ఆప్ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తప్పుడు ఆరోపణలతో ఆప్ నాయకులను అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలను అస్త్రంగా వాడుకుంటుందంటూ విరుచుకుపడ్డారు. అయినా ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తితో తమకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు కాబట్టి అతని పరిస్థితి గురించి ఇప్పుడేం చెప్పలేనన్నారు. ఐతే సత్యేందర్ జైన్కి కాస్త బాగోకపోవడంతో గురువారం ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు ఈడీ తెలిపింది. తదుపరి అతను కాస్త మెరుగైన వెంటనే కారులో ఆస్పత్రి నుంచి తిరిగి తీసుకువస్తున్న సమయంలోని ఫోటోలు ట్విట్టర్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆప్ నాయకులు అతనికి మద్ధతుగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఢిల్లీకి మొహల్లా క్లినిక్లు ఇచ్చిన వ్యక్తి సత్యేందర్, నిజాయితీతో ప్రజలకు సేవకు చేసిన గొప్ప వ్యక్తి అని ఆప్ సభ్యుడు వికాస్ యోగి ట్వీట్ చేశారు. మరో వ్యక్తి ... వైరల్ అవుతున్న ఫోటో ప్రధాని మోదీకి ఈడీకి నల్లనిమచ్చ, దేశం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించందంటూ భావోద్వేగంగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ये वो इंसान है जिसने मोहल्ला क्लीनिक बनाया है। लोगों की ईमानदारी से सेवा की है । भाजपा वालों एक दिन भगवान सबका हिसाब करेगा। :( pic.twitter.com/2Fzp36Yo5i — Vikas Yogi (@vikaskyogi) June 9, 2022 ये वो शख़्स है जिसने देश को मोहल्ला क्लिनिक का मॉडल दिया 5 Flyover के निर्माण में दिल्ली की जनता का 300 करोड़ रु बचाया।@SatyendarJain की ये तस्वीर मोदी और उनकी मैना (ED) पर काला दाग है। ये देश तुम लोगों को कभी माफ़ नही करेगा। pic.twitter.com/ejO4KcLLFb — Sanjay Singh AAP (@SanjayAzadSln) June 10, 2022 (చదవండి: అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు -
భయంలోనూ సమయస్ఫూర్తి.. రక్తాన్ని పూసుకుని శవంలా నటించి..
ప్రాణాలు పోతున్నా.. తుపాకీ ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రరాజ్యం ఘోరంగా విఫలమవుతోంది. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటనపై బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శించని వాళ్లంటూ లేరు ఇప్పుడు. చనిపోయిన పిల్లలు, టీచర్ల కుటుంబాల వ్యథ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ‘‘మీకు దణ్ణం పెడతాం. ఏదో ఒకటి చేయండి. చనిపోయిన ఈ పిల్లల్ని గుర్తుపెట్టుకుని.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడండి. నా మనవరాలు చిన్నపిల్ల. అలాంటి ప్రాణాలు మరిన్ని పోకుండా చూడండి. దయచేసి చర్యలు తీసుకోండి’’ అని కన్నీళ్లతో బతిమాలుతోంది 63 ఏళ్ల ఓ బామ్మ. ఆమె పదేళ్ల మనవరాలు అమెరీ గార్జా.. కాల్పుల ఘటనలో కన్నుమూసింది. ఇదిలా ఉంటే.. 11 ఏళ్ల వయసున్న మియా సెర్రిల్లో కాల్పుల ఘటన నుంచి ప్రాణాలతో బయటపడింది. సమయస్ఫూర్తితో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల సమయంలో మియా.. ఓ స్నేహితురాలు పూర్తిగా రక్తపుమడుగులో పడి ఉండడం గమనించింది. వెంటనే ఆ రక్తం తన ఒంటికి, బట్టలకు రాసుకుని చనిపోయినట్లు నటించింది. ఇంతలో తుపాకీతో వచ్చిన దుండగుడు.. ఆమె శరీరాన్ని తన్నుకుంటూ పరీక్ష చేసి వెళ్లిపోయాడట. అంతేకాదు.. అలా నటించే ముందు చనిపోయిన తన టీచర్ దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని.. 911 ఎమర్జెన్సీ నెంబర్కు సాయం కోసం ఫోన్ చేసినట్లు వెల్లడించింది. కాల్పులు జరిపిన వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు.. తనను కూడా కాలుస్తాడని భయపడిపోయిందట!. అయితే దాడిలో బుల్లెట్ శకలాలతో స్వల్పంగా గాయపడిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకున్నా.. దాడి భయం మాత్రం ఆమెలో ఇంకా పోలేదు. ఇదిలా ఉంటే 19 మందిని పొట్టనబెట్టుకున్న 18 ఏళ్ల సాల్వడోర్ రామోస్ను మట్టుపెట్టేందుకు గంటకు పైగా సమయం తీసుకున్నారు. దీంతో టెక్సాస్ పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: నరమేధాలకు కారణం వాళ్లేనా?