cardiac arrest
-
ఆనందంగా అమెరికాకు బయలుదేరి.. అంతలోనే విషాదం
హైదరాబాద్: ‘అందరూ సంతోషంగా ఉండండి... జూలైలో తిరిగివస్తా.. అందరికీ బాయ్’ అని చెప్పి కుమారుడితో కలిసి సంతోషంగా బయలుదేరిన ఓ వృద్ధురాలు.. అమెరికా (America) ప్రయాణంలో మార్గమధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే... లంగర్హౌస్ బాపునగర్లో నివాసముండే కాయిశెట్టి లక్ష్మీబాయి(70)కి నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మూడవ కుమారుడు శ్రీధర్ అమెరికాలోని షార్లెట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కుంభమేళాలో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన ఆయన తిరిగి అమెరికా వెళ్లేందుకు తల్లితో కలిసి ఈ నెల 24న బయలుదేరాడు.శంషాబాద్ (Shamshabad) నుంచి విమానాలు మారుతూ షార్లెట్కు వెళ్తున్న క్రమంలో మియామీ ఎయిర్పోర్టులో ఈ నెల 25న లక్ష్మీబాయికి తీవ్రమైన గుండెపోటు వచ్చి కుప్పకూలింది. వెంటనే అక్కడి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ వార్త విని నగరంలోని ఆమె సోదరి ముత్యాల ప్రమీల, కుమారుడు శ్రీనివాస్, ఇతర కుటుంబీకులు శోకసముద్రంలో మునిగారు. మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని తానా (TANA) నిర్వాహకులు వీరికి సహకరించి మృతదేహాన్ని మన దేశానికి పంపించే ప్రయత్నాలు పూర్తి చేశారు. సోమవారం రాత్రి లంగర్హౌస్కు మృతదేహం చేరనుండగా సంగం శ్మశానవాటికలో మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూతపడిన ట్రాన్స్‘మిత్ర్’ క్లినిక్ ట్రాన్స్జెండర్లకు ఉచిత వైద్యసేవలను అందజేసిన మిత్ర్ క్లినిక్ మూతపడింది. అమెరికా నుంచి వచ్చే ఆర్థిక సహాయం నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్లో అన్ని రకాల వైద్యసేవలను నిలిపివేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని సుమారు 2000 మందికి పైగా ట్రాన్స్జెండర్లకు అవసరమైన వైద్యపరీక్షలు, చికిత్సలను అందజేసేందుకు యూఎస్ ఎయిడ్తో 2021లో ఈ క్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం సుమారు రూ.24 లక్షల ఆర్థిక సహాయం లభించేది.చదవండి: అన్నీ తెలుసుకోవడమే సరైన ‘పని’..అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన వెంటనే యూఎస్ ఎయిడ్ను నిలిపివేస్తూ ‘యాంటీ ట్రాన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్’పైన సంతకం చేయడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మిత్ర్ క్లినిక్లను ఆర్థిక సాయం నిలిచిపోయిందని ట్రాన్స్ ఆరోగ్య నిపుణులు రచన ముద్రబోయిన తెలిపారు. ‘ఒక్క కలం పోటుతో మాకు లభించే ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. తీవ్ర షాక్కు గురయ్యాం. నాలుగేళ్ల వార్షిక వేడుకలు ముగిసిన కొద్ది రోజులకే మిత్ర్ మూతపడింది.’ అని రచన విచారం వ్యక్తం చేశారు. పీఈటీ టీచర్ అరెస్టు ఉప్పల్: హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. ఉప్పల్ సాగర్ గ్రామర్ స్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థి ముంగా సంగారెడ్డి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన పీఈటీ టీచర్ ఎడమ ఆంజనేయులను శనివారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో ఇంకా సాగర్ గ్రామర్ స్కూల్ యాజమాని ధన్సాగర్, క్లాస్ టీచర్ను పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. -
గుండెపోటుతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తన ప్రియతమ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ అకాల మరణం చెందారని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రోహన్ లేకపోయినప్పటికీ.. ఆయన విలువలు మాకు మార్గదర్శకంగా కొనసాగుతాయి. అయన కలలను నిజం చేయడానికి, సంస్థను అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తామని కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.అంకుర్ గోయెల్ (సీఓఓ & వ్యవస్థాపక సభ్యుడు), ఉదయ్ థాక్కర్ (కో-ఫౌండర్ & డైరెక్టర్) నేతృత్వంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇందులో రోహన్ కుటుంబం కూడా ఉంటుంది. రోహన్ మా గురువు, స్నేహితుడు.. నాయకుడు. అతని విజన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని అంకుర్ గోయెల్ & ఉదయ్ థాక్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి.. వీడియో
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఇమ్రాన్ పటేల్.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa— Dee (@DeeEternalOpt) November 28, 2024హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్కు ఓ క్రికెట్ టీమ్ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు జ్యూస్ షాప్ నడిపే వాడు. ఇమ్రాన్ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్ కూడా మృతి చెందాడు. హబీబ్ షేక్ అనే క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్ పేషంట్ అని తెలిసింది. -
ఐదేళ్ల చిన్నారికి కార్డియాక్ అరెస్టు..20 సెకన్ల పాటు..!
యూఎస్లోని ఐదేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్టు గురై కుప్పకూలింది. దాదాపు 20 సెకన్లపాటు గుండె ఆగిపోయింది. అయితే ఆ బాలుడి బతుకుతాడో లేదో అన్న తీవ్ర ఉత్కంఠ రేగింది. ఈక్రమంలో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం మూడు వేర్వేరు ఆస్పత్రలు తరలించారు. అయితే ఆ బాలుడి అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపటడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఈ ఉత్కంఠభరితమైన ఘటన యూఎస్లోని థీమ్ పార్క్ వాల్డ్ డిస్నీ వరల్డ్లో చోటు చేసుకుంది. ఐదేళ్ల ఎర్నెస్టో టాగ్లే అనే చిన్నారి రోలర్కోస్టర్ను రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతని వెనుక కూర్చొన్న ఆమెకు అతడి పల్స్లో ఏదో తేడా ఉన్నట్లు గమనించింది. వెంటనే ఛాతీపై తట్టడం వంటి సీఆర్పీ పనులు చేసింది అతడి తల్లి క్రిస్టీనా. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ముగిసిన వెంటనే తన కొడుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆమె వెంట ఒక నర్సు, ఈఎంటీ మెషిన్ని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎర్నెస్టో దాదాపు 20 సెకన్ల పాటు శ్వాస పీలచ్చుకోవడం లేదు అంటే.. గుండె ఆగిపోయింది. దీంతో వాళ్లు గుండె మళ్లీ సక్రమంగా కొట్టుకునేలా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్(ఈఎంటీ)ను అందించి హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆ బాలుడిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు కాటెకోలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (సీపీవీటీ)తో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇది అరుదైన గుండె పరిస్థితి. దీని కారణంగా సదరు రోగికి తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం లేదా లయ తప్పడం జరుగుతుంటుంది. ప్రాణాంతకమైన ఈ అరిథ్మియాలో వచ్చే ఆకస్మిక కార్డియాక్ అరెస్టుని నివారించేలా ఒక పరికరాన్ని అతడి ఛాతీలో ఉంచారు. అయితే అన్ని నిమిషాలపాటు శ్వాస ఆగిపోయిన టైంలో అతడి గుండె, మెదడు దెబ్బతినకుండా వైద్యులు రక్షించడం విశేషం. ఈ భయానక ఘటన నుంచి తన కొడుకు ఓ యోధుడిలా తిరిగొచ్చడాని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. అంతేగాదు తన కుమారుడిని కాపాడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "ఆ చిన్నారి శక్తి అజేయం, భయానక పరిస్థితిని నుంచి బయటపడ్డ అద్భుత వ్యక్తి". అని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..? రెండింటికి సంబంధం ఏంటీ..?) -
19 ఏళ్లకే గుండెపోటు? ఐపీఎస్ అధికారి కుమార్తె అనుమానాస్పద మరణం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో శనివారం రాత్రి 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థిని అనికా రస్తోగి అపస్మారక స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. దీంతో అనికా కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె గుండెపోటుతో మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. దీంతో అనికా హఠాన్మరణంపై గుండెపోటు టీనేజర్ల పాలిట శాపంగా మారుతోందా? చదువుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? అసలేమైంది లాంటి అనేక సందేహాలు వెల్లువెత్తాయి.మృతురాలు మహారాష్ట్ర కేడర్కు చెందిన 1998 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి సంజయ్ రస్తోగి కుమార్తె. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అనికా బీఏ ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి ఆమె హాస్టల్ రూమ్లోని అపస్మారక స్థితిలో పడి ఉండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హాస్టల్ గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని, లోపల అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు ప్రకటించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆషియానా పోలీసులు తెలిపారు. -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
ఉత్తరప్రదేశ్ లక్నోలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో 19 ఏళ్ల విద్యార్థిని మరణించింది. అనికా రస్తోగి రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హాస్టల్ రూమ్లో గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం హాస్టల్ రూంలో నిద్రిస్తున్న అనికాతో మాట్లాడేందుకు ఆమె స్నేహితురాలు వెళ్లింది. అయితే ఆపస్మారక స్థితిలో ఉండడం గమనించింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు పోటీసులు ప్రకటించారు.మూడవ సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ చదువుతున్న రస్తోగి తండ్రి మహారాష్ట్ర కేడర్కు చెందిన 1998 ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణించినట్లు సంజయ్ రస్తోగికి పోలీసులు సమాచారం అందించారు. -
గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. హెడ్కోచ్కు గుండె పోటు
ప్యారిస్ ఒలింపిక్స్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ బాక్సింగ్ జట్టు ప్రధాన కోచ్ తుల్కిన్ కిలిచెవ్ గుండె పోటుకు గురయ్యాడు. అయితే సకాలంలో స్పందించిన బ్రిటన్ బాక్సింగ్ వైద్య బృందం తుల్కిన్ ప్రాణాలను కాపాడారు. అతడు ప్రస్తుతం ప్యారిస్లోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుల్కిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఒలింపిక్స్ ప్రతినిథులు తెలిపారు.అసలేం జరిగిందంటే?ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ విశ్వక్రీడల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ హసన్బాయ్ దుస్మాటోవ్ బంగారు పతకం సాధించాడు. దీంతో కోచ్ తుల్కిన్ కిలిచెవ్ బాక్సర్తో కలిసి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తుల్కిన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు.అయితే వెంటనే అక్కడే బ్రిటన్ బాక్సింగ్ వైద్యుడు హర్జ్ సింగ్, ఫిజియో రాబీ లిల్లీస్ అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్, డీఫిబ్రిలేటర్తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్యి కిలిచెవ్ ప్రాణాలను రక్షించారు. అనంతరం అతడికి అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో హర్జ్ సింగ్, రాబీ లిల్లీస్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. -
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం.. కార్డియాక్ అరెస్ట్తో యువ షట్లర్ మృతి
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ షట్లర్ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ జిఝి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా జపాన్కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్ జిఝి ఒక్కసారిగా కుప్పకులిపోయాడు.పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024 -
ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
సింగపూర్లో జరిగిన ఒక సంఘటన పుట్టెడు దుఃఖాన్నయినా తట్టుకునే గుండె పట్టరాని ఆనందాన్ని భరించ లేదా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ఎపుడూ నష్టాలను మూటగట్టుకునే వ్యక్తికి ఊహించని అదృష్టం వరించడంతో ఉక్కిరిబిక్కిరయ్యి గుండె ఆగిపోయినంత పనైన ఘటన తాజాగా వెలుగు చూసింది.వివరాలను పరిశీలిస్తే.. సింగపూర్లోని మారినా బే సాండ్స్ క్యాసినోలో ఒక వ్యక్తి జాక్పాట్ కొట్టాడు. లాస్ వెగాస్కు చెందిన గేమింగ్ అండ్ రిసార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఐకానిక్ క్యాసినోలో ఏకంగా 33 కోట్ల రూపాయలు (4 బిలియన్ డాలర్లు) గెలుచుకున్నాడు. అయితే ఎపుడూ నష్టపోయే అతడు ముందుగా ఆ విషయాన్ని నమ్మలేదు. కలో మాయో తెలియని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ ఆనదంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. ఆ ఆనందంలోనే గుండెపోటుతో కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ షాక్తోనే అతను చనిపోయినట్టు ఎక్స్లో పేర్కొన్నారు.🚨 A man won $4 million at Marina Bay Sands Casino in Singapore but tragically suffered a fatal cardiac arrest from the excitement.How f”cked up is that to win millions and didn’t even get the chance to enjoy it and die on the spot. Didn’t get a chance to set up a trust or… pic.twitter.com/UdNxNfbJZH— J Wise (@JWiseKingRa) June 24, 2024అయితే శివుడు ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదన్నట్టు ఆ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకులు అతనికి తక్షణ వైద్య సహాయం అందించారని, దీంతో అతను కోలుకుంటున్నాడని కాసినో. ఆర్గ్ తెలిపినట్టుగా కమెంట్ సెక్షన్లో చూడవచ్చు. -
TN: పురుగుల మందు తాగిన ఎంపీ కన్నుమూత
చెన్నై: లోక్సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. #UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2 — ANI (@ANI) March 28, 2024 డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్కు గురై మృతి చెందారు. 2019లోక్సభ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్కు పిలుపు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం: 1947 జూన్లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు. -
డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!
ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్లోనూ అంతా జోషఫుల్గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!. ఎన్ని ఘటనలు జరిగాయంటే.. ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్లో గుజరాత్లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్లో చోటు చేసుకుంది. రావు విజయ్కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే..? ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు. డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..? శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..? భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!) -
గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!
ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్ షాకిస్తే (డిఫిబ్రిలేషన్) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్ డబ్ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!! గత ఏడాది జూన్లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్ విల్సన్ రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్కు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్ గుండె సాధారణ స్థితికి రాలేదు.!! అంతేనా.. విల్సన్కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్ పక్కనే ఉండిపోయానని, "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
మైదానంలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. గుండెపోటు కారణంగా హోయ్సలా (32) అనే పేరుగల కర్ణాటక క్రికెటర్ మృతి చెందాడు. బెంగళూరులోని ఆర్ఎస్ఐ మైదానంలో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడుతో ఇవాళ (ఫిబ్రవరి 23) మ్యాచ్ జరుగుతుండగా హోయ్సలా మైదానంలోనే కుప్పకూలాడు. హుటాహుటిన సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు. బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హోయ్సలా అండర్ 25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసర బ్యాటర్గా పేరున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్.. కర్ణాటక ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు. క్రికెటర్లు మైదానంలో ఆటగాళ్లు ఇలా మృతి చెందడం ఇది తొలిసారి కాదు. గతంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఇయాన్ ఫాలీ, వసీం రజా, ఎడ్వర్డ్ కాక్స్, అండీ డకెట్, రేమండ్ వాన్ స్కూర్ హార్ట్ అటాక్ కారణంగా మైదానంలోనే ప్రాణాలు వదిలారు. రామన్ లాంబా, ఫిల్ హ్యూస్ లాంటి క్రికెటర్లు బంతి బలంగా తాకడంతో మృతి చెందారు. -
ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా?
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలం ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లారు. ఏమైందో ఏమో గత రాత్రి అకస్మాత్తుగా కార్షియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అస్సలు ఈ ప్యాక్రియాటిక్ క్యాన్సర్ గుండె లయలపై ప్రభావం చూపిస్తుందా?. అది ప్రాణాంతకమా? ఇక్కడ ప్యాంక్రియాస్ అనగా క్లోమ గ్రంధి. ఇది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది కాలేయం కింద, పిత్తాశయం, కడుపు, ప్రేగులకు దగ్గరగా ఉండే ఆకు ఆకారంలో ఉండే అవయవం. ఆహారం జీర్ణం చేయడానికి ముఖ్యమైన ఎంజైమ్ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీనిలో ఏదైనా సమస్య వస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్యాంక్రియాటిక్ రుగ్మతలు అంటే.. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలను కలిగిస్తాయి. ఇది సర్వసాధారణ రుగ్మత అధిక ఆల్కహాల్ తీసుకోవడం లేదా పిత్తాశయ రాళ్లు వంటి కారణాల వల్ల క్లోమగ్రంధిలో సమస్య తలెత్తి కడపు నొప్పి, వికారం, వాంతులకు దారితీస్తుంది. తీవ్రమైన రుగ్మత కాలేయ క్యాన్సర్. దీని కారణంగా కామెర్లు, అతిగా బరువు తగ్గడం తదితర సమస్యలు వస్తాయి. ప్యాంక్రియాటిక్ రుగ్మత లక్షణాలు.. పొత్తి కడుపు నొప్పి నిరంతరం తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వెనుకకు ప్రసరించడం. ప్యాంక్రియాటిక్ రుగ్మతల లక్షణం. ఈ నొప్పి తీవ్రతలో మారవచ్చు మరియు తినడం లేదా పడుకున్న తర్వాత తీవ్రమవుతుంది. ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పరిస్థితుల వల్ల చుట్టుపక్కల కణజాలంపై వాపు, అడ్డుపడటం లేదా ఒత్తిడి కారణంగా ఇది సంభవిస్తుంది. వికారం, వాంతులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు జీర్ణక్రియలో ఆటంకాలు కలిగిచడంతో వికారం, వాంతులు వంటి వాటికి దారితీస్తుంది. ఈ లక్షణాలు తరచుగా పొత్తికడుపు నొప్పితో పాటుగా ఉంటాయి. ఇవి కొవ్వు లేదా పెద్దగా భోజనం తినడం ద్వారా వస్తుంది. కామెర్లు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని కామెర్లు అని పిలుస్తారు. అది కాస్త ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా పిత్త వాహిక అవరోధం వంటి కాలేయ రుగ్మతలకు దారితీయొచ్చు. ముఖ్యంగా పిత్తాశయం నుంచి ప్రేగులలోకి పిత్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల రక్తప్రవాహంలో బిలిరుబిన్ అధికంగా ఏర్పడటంతో కామెర్లు రావడం జరుగుతుంది. అనూహ్యంగా బరువు తగ్గడం అనూహ్యంగా బరువు తగ్గడం అనేది ప్యాంక్రియాటిక్ రుగ్మతకు సంబంధించిన సాధారణ లక్షణం. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఆకలి లేకపోవడం, పోషకాలు శోషించుకోలేకపోవడం, తగిన జీవక్రియలు లేకపోవడం తదితర లక్షణాలు తలెత్తుతాయి. ప్రేగు కదలికల్లో మార్పులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు విరేచనాలు, జిడ్డుగల లేదా జిడ్డుగల మలం లేదా లేత-రంగు మలం వంటి ప్రేగు కదలికలలో మార్పులకు దారితీయవచ్చు. సరైన జీర్ణక్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం వల్ల ఈ మార్పులు సంభవించవచ్చు. మధుమేహం దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి కొన్ని ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతి వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. క్లోమ గ్రంధి రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్కు ఎలా దారితీస్తాయంటే.. ప్యాంక్రియాటైటిస్ లేదా క్లోమ గ్రంధి క్యాన్సర్ వంటి క్లోమ సంబంధిత రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్కు కారణమయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ వాపు లేదా క్యాన్సర్ బారిన పడినప్పుడు, అది గుండెతో సహా సమీపంలోని అవయవాలకు తీవ్రమైన మంట, హాని కలిగించే పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ వాపు శరీరంలో రకరకాల సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరుకు కీలకమైన పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే, ప్యాంక్రియాటిక్ రుగ్మతలు శరీరంపై గణనీయమైన నొప్పి, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.క్రిటికల్ పరిస్థితుల్లో అది కాస్త గుండెపై ఈ ఒత్తిడి ఏర్పడి ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి తత్ఫలితంగా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. ఇక్కడ గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. (చదవండి: నటుడు శరత్బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
పాపులర్ బాడీ బిల్డర్ కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూత
పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) కార్డియాక్ అరెస్ట్తో మరణించారు. బ్రెజిల్కుచెందిన ఈయన సోషల్ మీడియాలో బాగా పాపులర్. అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల అతను మరణించాడనే వార్తలు సోషల్మీడియలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రొడాల్ప్ స్పోర్ట్స్ మెడిసిన్ అడ్ ఫార్మకాలజీ క్లినిక్ ఖండించింది. కాలేయంలో ట్యూమర్,రక్తస్రావం కారణంగా సావో పాలోలో రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు CNN బ్రసిల్ నివేదించింది. ఆదివారం (నవంబర్, 19) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడని , కాలేయంలోని అడెనోమా ఫలితంగా రక్తస్రావం కారణంగా ఆయన గుండె ఆగిపోయిందని తెలిపింది. తన రోజువారీ జీవితంలోని ఫోటోలతోపాటు, జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య కరోలిన్ సాంచెస్తో వీడియోలను కూడా ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. తన రోగులు, ఇతర అథ్లెట్లు, బాడీ బిల్డర్ల అద్భుతమైన ఫలితాలను కూడా చూపించేవారు. ఇన్స్టాగ్రామ్ స్టార్కు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Caroline Sanches (@carolinessanches) సావో పాలోకు దక్షిణాన మోమాలో ఉన్న ఈయన క్లినిక్ ఉంది. సాంచెస్ అక్కడ పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నారు. కాబోయే భర్త ఆకస్మిక మరణం తరువాత సాంచెస్ అతను గిటార్ వాయిస్తూ ‘మన మధ్య ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం’ అంటూ పాడుతున్న వీడియోను ఎప్పటి ఎప్పటికీ శాశ్వతం అంటూ పోస్ట్ చేశారు.కాగా డాక్టర్ శాంటోస్ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో నుండి స్పోర్ట్స్ మెడిసిన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో డిగ్రీలు పొందారు. View this post on Instagram A post shared by Rodolfo Duarte (@rodolfo.drsantos) -
గుండెపోటుతో ఎయిర్ ఇండియా పైలట్ మృతి.. 100 రోజుల్లో మూడో ఘటన
న్యూఢిల్లీ: ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో మృత్యుతపడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఓ యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్ హిమ్మనీల్ కుమార్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పైలట్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సీనియర్ కమాండర్ పైలట్ అయిన హిమ్మనీల్ కుమార్, పెద్దవైన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లను ఆపరేట్ చేసేందుకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఆగస్టు 23న జరిగిన వైద్య పరీక్షల్లో ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆయన మరణించడంపై ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు నెలలో ముగ్గురు పైలట్లు మృతువాతపడ్డారు. గత ఆగస్టులో ఇండిగో ఎయిర్లైన్కి చెందిన పైలట్ పూణేకు విమానం టేకాఫ్ అయ్యే ముందు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయాడు. అతడికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేకపోయారు. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న స్పైస్జెట్ కెప్టెన్ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తుండగా విమానంలోనే మరణించాడు. చదవండి: సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు.. -
ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది! ఆల్మోస్ట్ డెడ్ కానీ..
మృత్యువు ఒడిలోకి వెళ్లి కూడా బతికి వస్తే వాట్ ఏ మిరాకిల్ అనుకుంటాం. మన కళ్లను మనమే నమ్మలేని కఠిన నిజం గందరగోళానికి గురి చేసేలా మన కళ్లముందు మెదిలాడుతుంది. ఆ క్షణం మన ఆనందానికి అవధులుండవు. అలాంటి ఓ అద్భుత ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. యూఎస్లోని టీనా అనే ఓ మహిళ కార్డియాక్ అరెస్టుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. ఓ వైపు శరీరం నీలం రంగులోకి మారిపోతుంది కూడా. ఇంతలో ఆమె భర్త ఆమెను బతికించేలా చేస్తున్న సీపీఆర్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంబులైన్స్ని పిలిపించి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. అంతేగాదు ఆస్పత్రికి వెళ్లే మార్గంలో సైతం ఆమెను బతికించేలా ఆక్సిజజన్ అందించి గుండె పనిచేశాల చేసే ప్రథమ చికిత్సల్లో వేటికి ఆమె స్పందించలేదు. చివరికి ఆస్పత్రిలో వైద్యుల సైతం ఆమె చనిపోయిందని డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఓ శవం మాదిరి నిర్జీవంగా పడి ఉంది టీనా. దీంతో వైద్యులు చివరి ప్రయత్నంగా డీఫిబ్రిలేటర్తో షాక్ ఇద్దాం అని డిసైడ్ అయ్యి ఇస్తే..ఏదో నిద్రలో మెల్కోన్నట్లు కళ్లు తెరించింది. ఆ హఠాత్పరిణామానికి వైద్యులు సైతం సభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అసలు చలనం లేకుండా శవంలా పడి ఉంది. స్పదించదని తెలిసే జస్ట్ అలా కరెంట్ షాక్ ఇచ్చామని చెబుతున్నారు వైద్యులు. ఐతే కళ్లు తెరిచి చూసింది గానీ ఏం మాట్లాడలేకపోయింది. ఈ తంతంగమంతా చూస్తున్న ఆమె సభ్యులు కూడా విస్తుపోయారు. నిజంగా ఆమె బతికిందా దెయ్యమా? అన్నంత టెన్షన్గా చూశారు ఆమెను. ఆమె ఏం మాట్లాడలేదని వైద్యుల కుటుంబంసభ్యులకు చెప్పడంతో అంతా సైలెంట్గా ఉన్నారు. ఆమెకు ఒక పుస్తకం, పెన్ను ఇచ్చి నీకు ఏం జరిగిందో లేక గుర్తున్నది అందులో రాయమని సూచించారు. చనిపోయి బతికావని తెలుసా అని వైద్యులు అడగగా..ఔను! ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉన్నట్లు అనిపించిందని ఎంత ప్రయత్రించినా మేల్కొలేకపోతున్నట్లు తెలిసిందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా జరిగినప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్కి అందక మెదడులో బ్లీడింగ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల బతకదని తేల్చి చెప్పాం అన్నారు. ఆమె బతికినా బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో పరీక్షలు చేసినా వాటి తాలుకా గాయాలు ఏం కనిపించకపోవడం వైద్యులను మరింత ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెను మరో నాలుగు రోజులు పూర్తి అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. (చదవండి: ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!) -
ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోవడమా..! పాపం ఆ వ్యక్తి..
సాధారణంగా గుండెపోటు వస్తేనే మనుషులు గిలగిల లాడిపోతారు. అలాంటిది ఒకేరోజు ఆరుసార్లు గుండె ఆగిపోతే ఆ మనిషి ఉంటాడా? అని డౌటు వస్తుంది కదా!. ఒకవేళ బతికినా పూర్తిస్థాయిలో కోలుకుంటాడా అన్నది అనుమానమే. అచ్చం అలానే భారత సంతతి విద్యార్థి కార్డియాక్ అరెస్ట్కి గురయ్యాడు. అయితే అతను ఏమయ్యాడు? బతికాడా? అనే కదా!. నిజానికి ఇలా ఆరుసార్లు గుండె ఆగిపోవడం జరుగుతుందా? ఎందుకిలా? తదితరాల గురించే ఈ కథనం. యూకేలోని 21 ఏళ్ల భారత సంతతి అమెరికన్ విద్యార్థి అతుల్ రావు ఒకే రోజు ఆరుసార్లు గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ని పిలిపించారు. ఇంతలో సెక్యూరిటీ గార్డు అతని ఛాతీకి కంప్రెషన్ ఇచ్చేలా సీపీఆర్ చేశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చేరేటప్పటికీ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు. ఎక్స్ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)కి యాక్సిస్ చేశారు. గుండె, ఊపిరితిత్తుల పనిని పూర్తిగా భర్తీ చేసేలా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని అమర్చారు వైద్యులు. ఇంతలో క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ పనిచేయం ప్రారంభించాయి. దీంతో అతను లైఫ్ సపోర్ట్ మెషీన్లు, ఈసీఎంఓ తదితరాలు లేకుండానే పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతుల్ ఇప్పుడు యూఎస్కి తిరిగి వెళ్లాడు. పూర్తిగా కోలుకున్నాడు కూడా. స్టూడెంట్ అతుల్ రావు ఎదుర్కొన్న ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో పల్మనరీ ఎంబోలిజం అంటారు పల్మనరీ ఎంబోలిజం అంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పల్మోనరీ ఎంబోలిజం చాలా సందర్భాల్లో కాలులోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం మొదలై ఊపిరితిత్తులకు వెళ్తుంది. అరుదుగా శరీరంలోని వేరే ఏదైనా భాగంలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులకు రక్తప్రవాహాన్ని పరిమితం చేసి, ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా పల్మనరీ ధమనుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. దీన్నే పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఈ పల్మోనరీ ఎంబోలిజంలో గుండె లేదా ఊపిరితిత్తులకి రక్తప్రవాహం ఆగిపోయి పనితీరుకి ఆటకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె లేదా ఊపిరితిత్తులు ఆకస్మికంగా వైఫల్యం చెంది మరణానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉన్న గుండె, రక్తనాళాల వ్యాధులకు సంబంధించిన వాటిల్లో ఇదొకటి. లక్షణాలు శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పులు కాలక్రమేణా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే, చాలా మంది రోగులు శ్లేష్మంతో దగ్గినా. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం ఛాతీ, చేయి, భుజం, మెడ లేదా దవడలో పదునైన నొప్పి దగ్గు పాలిపోయిన చర్మం వేగవంతమైన హృదయ స్పందన విపరీతమైన చెమట ఆత్రుత మూర్ఛపోవడం లేదా స్ప్రుహతప్పిపోవడం గురక ఎవరికి ప్రమాదం అంటే.. కాలులో రక్తం గడ్డకట్టిన వారు కూర్చొని పనిచేసేవారు సిరకు గాయం లేదా గాయం కలిగిన వారు చాలా కాలం పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం లేదా హార్మోన్ పునఃస్థాపన చికిత్స చేయించుకోవడం పొగ స్ట్రోక్ వంటి గుండె జబ్బుల చరిత్రను కలిగి ఉండటం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా(80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన ఉప్కార్, రోటీ కప్డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో బీర్బల్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు జుగ్ను మీడియాకు తెలిపారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయం తెలుసకున్న సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించింది. ఖోస్లా ముఖ్యంగా హాస్య పాత్రలకు పేరు సంపాదించుకున్నారు. 'షోలే' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. షోలేలో ఖైదీగా అతని పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాలలో కూడా నటించారు. CINTAA expresses its condolences on the demise of Birbal (Member since 1981) .#condolence #condolencias #restinpeace #rip #birbal #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/bTXH0LArRp — CINTAA_Official (@CintaaOfficial) September 12, 2023 -
వాల్వ్లు బ్లాక్ కావడం వల్ల గుండెపోటు వస్తుందా? రాకుండా ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే హార్ట్ఎటాక్కు గురవుతున్నారు.అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నడిమింటి నవీన్ మాటల్లోనే.. మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అలాంటి గుండెకు కూడా రక్తం అవసరం అవుతుంది.మరి ఈ గుండె గోడలకు "హృదయ ధమనులు" అనే అతి ముఖ్యమైన రక్త నాళాలు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి. మనం తినే ఆహారంలో అధిక క్రొవ్వు పదార్థాలు ఉన్నట్లైతే ఈ కొవ్వు హృదయ ధమనుల్లో క్రమ క్రమంగా పేరుకు పోయి ఒకానొక దశలో గుండె గోడలకు రక్త సరఫరా పాక్షికంగానో, పూర్తిగానో ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అదృష్టం కొద్దీ బతికితే వైద్యులు హృదయ ధమనులు గుండా రక్తం సాఫీగా ప్రవహించడానికి అవసరమైతే స్టెంట్ వేయడం లేదా రక్తం పలుచబడే ట్యాబ్లెట్స్ వాడమని చెబుతారు. వాల్వ్లు బ్లాక్ కావడం వల్ల వచ్చే గుండెపోటు చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది గుండెపోటు రావడానికి కారణం వాల్వ్లు బ్లాక్ కావడమే అనుకుంటారు. కానీ హార్ట్ఎటాక్ రావడానికి ప్రధాన కారణం కవాటాలు పనిచేయకపోవడం(వాల్వ్లు బ్లాక్ కావడం)కాదు. గుండెపోటు రావడానికి కారణం వృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం చిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్ఫుడ్లు వదలలేకపోవడం కాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడం శక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడం గుండెపోటు రాకుండా ఏం చేయాలి? క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడం ప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక వ్యాయామము చేయడం. ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. హార్ట్ ఎటాక్తో బుల్లితెర నటుడు మృతి!
ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్ హార్ట్ ఎటాక్తో మరణించారు. అతని వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లే. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: యోగి ఆదిత్యనాథ్ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?) పవన్ సొంత ఊరు కర్ణాటక మాండ్యా జిల్లాలోని హరిహరపుర గ్రామానికి చెందినవారు కాగా.. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబయిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. పవన్ హిందీ, తమిళ భాషల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతి పట్ల మాండ్యా ఎమ్మెల్యే హెచ్టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: 1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే) నటుడి భార్య కన్నుమూత ఇటీవలే కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్ల్యాండ్ వెకేషన్లో ఉండగా గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
మహిళల్లో గుండెపోటు రిస్క్ పెరిగింది.. కోవిడ్ కారణమా?
పెరిగిన గుండెపోటు ముప్పు ఇటీవలి రోజుల్లో చిన్న వయసులోనే మహిళలు కూడా గుండెపోటుకు గురవడం 8 శాతం పెరిగిందని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సీఏ మంజునాథ్ తెలిపారు. సోమవారం నటి స్పందన మృతిపై డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ ఇటీవల జీవనశైలి, ఆహార పద్ధతులు మారాయని, దీంతో పాటు మానసిక శారీరక ఒత్తిడులు కూడా గుండెపోటుకు కారణమన్నారు. 40 ఏళ్లలోపు వారికి కూడా గుండెజబ్బులు ► ఒక అధ్యయనం ప్రకారం 40 ఏళ్ల లోపు వయసు వారికి గుండెపోటు రావడం 35 శాతం పెరిగింది. ►గతంలో మహిళల్లో గుండెపోటు కేసులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ► 40 ఏళ్లులోపు మహిళల్లో గుండెపోటు కేసులు 8 శాతం పెరగడం ఆందోళనకరం. ► దేశంలో యువత, మధ్య వయసువారిలో గుండెపోటు వచ్చే ముప్పు 28 శాతం పెరిగింది. ► ఈ కేసుల్లోనూ కార్డియాక్ అరెస్ట్ (గుండె స్తంభించడం) 90 శాతం ఉంది. ► కోవిడ్ మహమ్మారి తరువాత 3 నుంచి 5 శాతం గుండెపోటు కేసులు పెరిగాయి, ప్రతి ఒక్కరూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. - ప్రముఖ వైద్యుడు మంజునాథ్ -
తెగిన లిఫ్ట్ వైర్, 8వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో..
నోయిడా: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని ప్రమాదాలతో రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్లోని లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు జారడంతో గుండెపోటుకు గురై ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో గురువారం ఈ ఘోరం వెలుగుచూసింది. నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి 73 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో 8 ఫ్లోర్లు కిందకు జారిపడింది. అయితే లిఫ్ట్ గ్రౌండ్ను ఢీకొట్టకుండా మధ్య అంతస్తుల్లో చిక్కుకుపోయింది. ఊహించని పరిణామంతో లిఫ్ట్లో ఒంటరిగా ఉన్న మహిళ స్పృహతప్పి పడిపోయింది. కాసేపటికి గమనించిన సిబ్బంది మహిళను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది. అయితే మహిళ తల వెనక, మోచేతి వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. లిఫ్ట్ పడిపోవడం వల్ల ఆమెకు ఈ గాయాలైనట్లు పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని ఆకస్మిక ఘటనతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అపార్ట్మెంట్కు చెందిన వందలాది మంది సొసైటీ కాంప్లెక్స్ బయటకు వచ్చి జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వృద్ధురాలి మృతికి యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చదవండి: ఎట్టకేలకు సీఎం ‘కుర్చీ’లో కూర్చున్న అజిత్ పవార్ -
ఆకస్మిక గుండెపోటు మరణాలపై సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. యువతలో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయని, కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో శుక్రవారం తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు. చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. చదవండి: గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం! ఎన్పీ-ఎన్సీడీ కింద 724 జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్లు, 210 డిస్ట్రిక్ట్ కార్డియాక్ కేర్ యూనిట్లు, 326 డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లు, 6,110 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధి రోగులు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులతో సహా హెల్త్కేర్ డెలివరీ సిస్టమ్లోని వివిధ ఆరోగ్య సదుపాయాలలో చికిత్స పొందుతున్నారని మన్సూక్ మాండవీయ వివరించారు. -
హార్ట్ ఎటాక్, హార్ట్ అరెస్ట్ తేడా ఇదే!
-
అతని గొంతు లేకుండా నా సభల్లేవ్: కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సాయిచంద్ హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను.. చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నట్లు తెలిపారాయన. సాయిచంద్ లేకుండా.. అతని గొంతులేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే నున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. హరీష్ రావు కంటతడి సాయిచంద్ హఠాన్మరణం వార్తతో గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలి వెళ్లారు పలువురు నేతలు. వాళ్లలో మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు. చిన్నవయసులో కన్నుమూయడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ పూర్తికావడంతో గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. ► సాయిచంద్ మృతిపట్ల పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, భువనగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. సాయి చంద్ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది సాయిచంద్ మృతిపట్ల కల్వకుంట్ల తారకరామారావు విచారం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని.. యువకుడైన సాయిచంద్ అకాల మరణం చెందడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Saddened by the loss of a rare talent and a gifted Singer, Sri #SaiChand garu. His mesmerizing voice graced the Telangana moment, stirring souls with countless inspirational songs. Leaving an indelible mark on our hearts, his legacy will forever be cherished. Our heartfelt… pic.twitter.com/nTJzfLIAeS — Santosh Kumar J (@SantoshKumarBRS) June 29, 2023 తెలంగాణ ఉద్యమ గొంతు మూగబోయిందంటే ఇప్పటికి నమ్మశక్యంగా లేదు.. ఇకముందు ఏ సభలోనూ నీ గొంతు ఉండదు ఇక ఆగిపోయిందంటే ఊహించడానికి కూడా కష్టంగా ఉంది.. నీ గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే అన్నా.... ఉద్యమ గొంతుక నీకు జోహార్లు 🙏🙏🙏🙏 Miss u Anna ఓం శాంతి#SaiChand pic.twitter.com/28fuOF9I5K — Srinivas Nelli BRS (@SrinivasNBRS) June 29, 2023 -
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్హౌజ్కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్కు రాజకీయ గురువు ఈయనే! -
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
లాంగ్ కోవిడ్ వల్లే ఆకస్మిక మరణాలు.. వ్యాక్సిన్లే కారణమా? డాక్టర్ల క్లారిటీ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఇటీవల చూస్తున్నాం. అలా కుప్పకూలి మరణించిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమని.. కొన్నిరకాల మందులు వాడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకస్మిక మరణాలకు కారణాలను కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన గుండె సమస్యలు కోవిడ్ తర్వాత ప్రజల్లో గుండె జబ్బులు బాగా పెరిగినట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్ట్ కోవిడ్ కండిషన్) ఎదుర్కొన్న వారిలో గుండె జబ్బులు రెండు రెట్లు అధికమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలోనే కార్డియాక్ అరెస్ట్లు జరుగుతున్నట్టు వెల్లడిస్తున్నారు. ఆకస్మిక మరణాలతోపాటు, కొందరు పీఓటీఎస్ (పాచ్యురల్ టాచీకార్డియా సిండ్రోమ్) ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉన్న పొజిషన్ నుంచి మారినా, కూర్చుని, పడుకుని లేచినా గుండె దడగా ఉండటం జరుగుతుందని (కూర్చుని లేచిన తర్వాత లేదా పడుకున్న తర్వాత గుండె కొట్టుకునే రేటు చాలా త్వరగా పెరగటం) చెబుతున్నారు. ఇవీ కారణాలు ♦ రక్తనాళాల్లో పూడికల వల్ల గుండెపోట్లు వస్తున్నాయి. ♦ గుండె కండరాలు ఉబ్బడం (మయో కార్డిటైస్) వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ♦ గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్–అర్రిటమియా) కూడా కారణం. ♦ పల్మనరీ ఎంబోలిజం (గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) కూడా దీనికి కారణమవుతోంది. ముందుగా గుర్తించడం కష్టమే కోవిడ్ తర్వాత కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారిలో డీ–డైమర్ వంటి పరీక్ష చేసినప్పుడు రక్తం చాలా సాధారణంగా ఉన్నా.. మరుసటి రోజుకే గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబోలిజమ్తో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ ఎంబోలిజంను ముందుగా గుర్తించడం కష్టమేనని పేర్కొంటున్నారు. రక్తంలో నీటి శాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అపోహలెన్నో.. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమని.. ఫలానా వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండెపోటు వస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అత్యుత్తమ మార్గమని గుర్తించి అందరికీ వేయడం జరిగిందంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో వేసిన ఎంఆర్ఎన్ఏ (ప్రైజర్, మోడెర్నా) వంటి వ్యాక్సిన్లలో దుష్పలితాలను గుర్తించారని, అవి మన దేశంలో వేయలేదని స్పష్టం చేస్తున్నారు. ముందు జాగ్రత్తలే మేలు ♦ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు. ♦ శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ♦ జీవన శైలిని మార్చుకోవడం ♦ స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం ♦ రెగ్యులర్గా వ్యాయామం చేయడం ♦నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్తోనే.. కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్టు కోవిడ్ కమిషన్) ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికం. ఆకస్మిక మరణాలకు పల్మనరీ ఎంబోలిజం, కార్డియాక్ అరెస్ట్లు కారణంగా ఉంటున్నాయి. కోవిడ్ తర్వాత హార్మోన్లలో సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. రక్తంలో నీటిశాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడతాయి. అలాంటి వారు ఆకస్మికంగా మరణించే అవకాశం ఉంది. జీవనశైలి మార్చుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను అధిగమించవచ్చు. – బి.విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
సీపీఆర్పై అవగాహన అవసరం
పంజగుట్ట: మన దేశంలో ప్రతి నిమిషానికి 112 కార్డియాక్ అరెస్టులు సంభవిస్తున్నాయని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 80 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతున్నాయని, సీపీఆర్పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రెడ్క్రాస్ సొసైటీ, ప్రెస్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా సీపీఆర్పై ఎన్సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించనున్న సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. రెడ్క్రాస్ మాదిరిగా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీపీఆర్పై అవగాహన కల్పించాలని కోరారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ అశిమా శర్మ మాట్లాడుతూ.. సీపీఆర్ చేసే సమయంలో స్కిల్స్ ఎంతో ముఖ్యమని, బ్రీతింగ్, నాడి చూడాలని, భుజం తట్టి స్పందిస్తున్నారో లేదో చూడాలన్నారు. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు నిమ్స్లో పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సీపీఆర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ బి.విజయ్భాస్కర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, కె.మదన్మోహన్రావు, రమణ పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా పసుమర్రులో 17 ఏళ్ల ఫిరోజ్ గుండెపోటుతో మృతి
-
విషాదం: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల యువకుడు, చూస్తుండగానే...
సాక్షి, అనంతపురం: నిర్దిష్ట కారణాలేంటో తెలియదుగానీ ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా నిండా పాతికేళ్లు కూడా లేని యువత హార్ట్ అటాక్తో చూస్తుండగానే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 1న అనంతపురం జిల్లాలో 19 ఏళ్ల తనూజ నాయక్ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అతన్ని బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డకు గుండెపోటు ఏంటని ఆ తల్లిదండ్రులు స్థాణువయ్యారు. దేవుడు తమకు అన్యాయం చేశాడని, ఆడుతూ పాడుతూ తిరిగే తమ కుమారుడికి ఇంత చిన్న వయసులో ఈ ప్రాణాలు తీసే రోగమేంటని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు తనూజ నాయక్ది మడకశిర మండలం అచ్చంపల్లి తండా. అనంతపురం పట్టణంలోని పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్ చదువుతున్నాడు. కాగా, కబడ్డీ ఆడుతూ తనూజ నాయక్ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!) 17 ఏళ్లకే ప్రాణాంతక ‘పోటు’ పల్నాడు జిల్లా పసుమర్రులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఫిరోజ్కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. -
పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ.. గుండె ఆగి..
కుభీర్: మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ యువకుడు పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తున్నాడు.. బంధువులంతా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరుస్తున్నారు. కానీ ఆ యువకుడు డ్యాన్స్ చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(కె) గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సరదాగా డ్యాన్స్ చేస్తూ..: పార్డి(కె) గ్రామానికి చెందిన నాయుడు రాజుకు భైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. శని వారం సాయంత్రం పెళ్లికొడుకు నాయుడు రాజు ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నాయుడురాజు బంధువు, మహారాష్ట్రకు చెందిన తమ్మళ్ల ముత్యం (18) కూడా దీనికి హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమం పూర్తికాగా.. బంధువులు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ముత్యం కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కాసేప టికి డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. అతడు తిరిగి లేవకపోవడంతో బంధువులు వెంటనే భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముత్యం గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆదివారం మహారాష్ట్రలోని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
జిమ్లో గుండెపోటు.. కానిస్టేబుల్ మృతి
కంటోన్మెంట్: జిమ్లో వ్యాయామం చేస్తూ ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు సికింద్రాబాద్ గ్యాస్మండీ ప్రాంతానికి చెందిన యంజాల విశాల్ (30) ఆసిఫ్ నగర్లోనే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతను రెగ్యులర్గా మారేడుపల్లిలోని హెచ్2ఓ జిమ్లో కసరత్తు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 7.00 గంటల సమయంలో జిమ్కు వెళ్లాడు. వార్మప్ చేస్తున్న క్రమంలోనే జిమ్లోనే కుప్పకూలిపోయాడు. జిమ్ నిర్వాహకులు 108కు సమాచారం అందించి, ఆంబులెన్స్లో యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే విశాల్ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. విశాల్ కసరత్తు చేస్తూ జిమ్లో కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Healthy Heart: మీ గుండె ఆగిపోకూడదనుకుంటే..
గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. మీడియా.. సోషల్ మీడియా వల్ల ప్రతీ ఒక్కరికీ అలాంటి ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇవేవీ లేకుండా ఆగిపోయే గుండె మీది కాకూదదనుకుంటే.. దానికి బలం అవసరం. మరి ఆ బలం ఎలా అందించాలో వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ కథనం. హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్.. ఈ రెండూ వేర్వేరు. గుండె పోటు.. ఉబకాయం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర అనారోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. గుండె రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోడం, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండె పోటు వస్తుంది. ఇక సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎదురయ్యే స్థితి. దీనికి వయసుతో సంబంధం ఉండదు. పైగా దీనిని అంచనా వేయడమూ కష్టం. అందుకే.. ఈ పరిస్థితులను ఎదుర్కొగలిగే గుండె ఉంటే.. సమస్యనేది ఉత్పన్నం కాదు కదా!. ► కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉంటే.. ప్రాణాల మీదకు రాదు. ఆ ఆరోగ్యం కోసం గుండెకూ ఎక్సర్సైజులు అవసరం!. అయితే మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికమైపోయింది. దానికి తగ్గట్లే శారీరక శ్రమకు దూరమైపోతున్నాం. కాబట్టి.. రోజులో కాసేపైనా అలసిపోవడం అవసరం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా.. వాహనాలు, లిఫ్ట్లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా నడవడం, మెట్లు ఎక్కడం లాంటి వాటి ద్వారా గుండెను పదిలంగా చూసుకోవచ్చు. ఇక.. అధిక బరువు అనే ప్రధాన సమస్య, గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల గుండె కొట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి. ► అనారోగ్యమే కాదు.. అలసట, ఒత్తిడిల వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటోంది. కాబట్టి, మనసుకు విశ్రాంతి అవసరం. అది ప్రశాంతతతోనే లభిస్తుంది కూడా. ఈరోజుల్లో ఒత్తిడి.. దాని నుంచి ఏర్పడే ఆందోళన, ఉద్వేగం లాంటివి ప్రతీ ఒక్కరికీ సాధారణం అయ్యాయి. ప్రశాంతత అనేది మనసుకు రిలీఫ్ ఇస్తుంది. అందుకోసం రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. ఉపశమనం కలగొచ్చు. నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే కంటెంట్వైపు మళ్లండి. ఇక కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. ► నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ నిద్ర.. అదీ 7-8 గంటలు హాయిగా నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ► ఫలానా వాటికి ఫలానాది ఓ గుండెకాయ.. అని అనేక సందర్భాల్లో వర్ణిస్తాం. మరి అంతటి ముఖ్యమైన అవయవానికి సరైన ఆహారం అందాల్సిందే కదా!. గుండెకు మంచి ఆహారం అవసరం. అదీ వైద్యనిపుణులను, నిపుణులైన డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం ఇంకా ఉత్తమం. ► గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనేది వైద్యులు మొదటి మాట. రెండో మాటగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటారు. అలాగే.. ఈరోజుల్లో మూడో మాటగా మాంసాహారం ఎక్కువగా తీసుకునేవాళ్లు.. దానిని తగ్గించి తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ► మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ► అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో,చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, పిస్తా వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలంటారు. ► తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. అతిగా వేపుళ్లు, మసాలాలు-కారం దట్టించిన ఫుడ్ కూడా అస్సలు మంచిది కాదు. ► మితంగా తింటే ఏదైనా ఆరోగ్యమే. ఇష్టమొచ్చింది తింటే అధిక చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు దారితీస్తుంది. గుండెకే కాదు.. ఇతర అవయవాలనూ ప్రభావితం చేసి ఇతరత్ర జబ్బులు పలకరించే ప్రమాదం ఉంటుంది. ► ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది. అంటే గతితప్పుతుంది. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ట్ల్యాబ్లెట్లు వేసుకోకూడదు. ► స్మోకింగ్ చేసేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువ. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్మోకింగ్కు దూరంగా ఉండటం మంచిది. ► అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె అతి వేగంగా కొట్టుకోవడం) రిస్క్ ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత ముప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతి వేగంగా కొట్టుకుంటే అతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారితీయవచ్చు. ► మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది. అలాగే, గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది. అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గరి దారి అవుతుంది. ఇది ఇప్పటి యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. సెల్ఫోన్లు, ఇతర అలవాట్లతో చేజేతులారా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ► గుండె సమస్యల్ని గుర్తించడం చాలా కష్టం. రెగ్యులర్ చెకప్ల ద్వారానే సమస్యలను నిర్ధారించుకోవచ్చు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం రాబోయే ముప్పును అంచనా వేయొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. కడుపులో తీవ్రమైన నొప్పి. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం. కడుపులో గ్యాస్ పెరిగినట్లు అసిడిటీగా అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, పుల్లటి తేన్పులు.. ఛాతీలో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యులు దగ్గరికి వెళ్లాలి. ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కార్డియాక్ అరెస్ట్ను అంచనా వేయడం వీలుకాని పని. అందుకే.. గుండెను బలంగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. ఇంటి వైద్యం-సొంత వైద్యం కాదు.. గుండెను కాపాడుకోవాలంటే ఆస్పత్రులకు, వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే!. Sitting in some position Chewing ginger garlic dhaniya Mirch Coughing sneezing laughing None of these will help in heart attack Reach a hospital with Cardiac facilities as soon as possible to get appropriate treatment in #Heartattack to save life https://t.co/3Aa6cT0cCS pic.twitter.com/ELjEyAW6ne — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 24, 2023 -
యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణం ఏంటి?
-
Hyderabad: ఆకస్మిక గుండెపోటుతో ఇద్దరు మృతి.. డాక్టర్లు ఏమంటున్నారంటే!
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో హఠాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండెపోటు అంటారు. మరి గుండెకు రక్తం, ఆక్సిజన్ సరిగా అందకపోతే అది పంపింగ్ చేయలేదు. ఎంత ఎక్కువసేపు అడ్డంకి ఏర్పడితే గుండెకు అంత నష్టం ఏర్పడుతుంది. పురుషుల్లో ఇలాంటి గుండెపోటు 65 ఏళ్లకు.. మహిళల్లో 70 ఏళ్లకు వస్తాయనేది పాత లెక్క. కానీ ఇటీవల ఆ వయసు క్రమంగా తగ్గిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటు ముప్పు అందరిని చుట్టుముడుతోంది. ముఖ్యంగా యువత, చిన్నారుల్లో సడెన్ హార్ఠ్ ఎటాక్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొని.. వరుడి పాదాలకు పసుపు రాస్తుండగా గుండెపోటుతో క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాజాగా బోయినపల్లిలో జిమ్లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ కానిస్టేబుల్ విశాల్ ఉన్నట్టుండి కుప్పకూలాడు.. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే యువకుల్లో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కనిపించకపోవడం అతిపెద్ద సమస్య. చాలాసార్లు నిశబ్ధంగా విరుచుకుపడి.. ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలా వరుసగా జరుగుతున్నసైలెంట్ గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సడెన్ హార్ట్ ఎటాక్పై ప్రముఖ కార్డియాలజిస్ట్ చాణక్య కిషోర్ సాక్షితో మాట్లాడారు. యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణాలు ఏంటి.. దీన్ని ముందుగా గుర్తించగలమా?. ఎలాంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు.. అనే అంశాలపై ఆయన చెప్పిన వివరాలు డాక్టర్ మాటల్లోనే... -
తారకరత్న తాజా హెల్త్ బులెటిన్.. వైద్యులు ఏమన్నారంటే?
సినీనటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు బులెటిన్లో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్లో వైద్యులు వెల్లడించారు. కొన్ని మీడియాల్లో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించినట్లు వచ్చిన కథనాలపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు ఎక్మోపై ఎలాంటి చికిత్స అందించలేదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరాలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
ఆదిలాబాద్: కుప్పకూలిన పెళ్లి కొడుకు.. కన్నుమూత!
సాక్షి, ఆదిలాబాద్: మరి కొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. కానీ, విధి ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది. కాళ్లకు రాసిన పారాణి ఆరిపోక ముందే అర్ధాంతంరంగా అతని జీవితం ముగిసిపోయింది. రెండు వైపులా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఉట్నూరుకి చెందిన సత్యనారాయణకు(34), జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఓ యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నెల 27న అతని వివాహం జరగాల్సి ఉంది. ఆ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లి వేడుకలు ఘనంగా చేయాలని భావించారు. సత్యనారాయణే.. తన పెళ్లి పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా పనులు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్తోనే సత్యనారాయణ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణ.. అదీ వివాహనికి కొద్ది గంటల ముందే కన్నుమూయడంతో ఆ ఊరు ఊరంతా విషాదంలో కూరుకుపోయింది. -
Cardiac Arrest: నిద్రలో ఉలిక్కిపాటు.. చిన్నారి గుండె ఆగింది!
చిన్నాపెద్దా తేడా లేదు. ఎలాంటి అనారోగ్యమూ ఉన్నట్లు కనిపించదు. కానీ, ఉన్నట్లుండి గుండె ఆగిపోయి ప్రాణాలు పోతున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్నారని వినడం పరిపాటిగా మారింది. దీనికి కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నా.. సకాలంలో సమస్యను(చిన్నదైనా సరే) గుర్తించకపోవడమే అసలైన కారణమని అంటున్నారు వైద్య నిపుణులు. తాజాగా.. కర్ణాటకలో పన్నెండేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూశాడు. కుశాల్నగర్లో కూడుమంగళూరు గ్రామంలో ఆదివారం వేకువ ఝామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రలోనే ఉలిక్కిపడి లేచి విలవిలలాడిన చిన్నారి.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. బాధితుడిని కొప్పాలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్గా గుర్తించారు. శనివారం సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన చిన్నారి.. భోజనం చేసి పడుకున్నాడు. అయితే.. నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గం మధ్యలోనే ఆ చిన్నారి కన్నుమూశాడు. కీర్తన్ తండ్రి మంజాచారీ.. కొడుకు చదివే స్కూల్లోనే వ్యాన్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.. -
నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!
ఒక వ్యక్తి ఫ్లైట్ జర్నీలో ఉండగా గుండె పోటుకి గురయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఐదుగంటలు శ్రమించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. విమానంలో తగిన వైద్య పరికరాలు లేకపోయినప్పటికీ.. ఆయన్ను రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో...సదరు పేషెంట్ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన లండన్ నుంచి భారత్కి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బర్మింగ్హామ్లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ , భార సంతతి డాక్టర్ విశ్వరాజ్ వేమల సుమారు 10 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉండగా.. ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 43 ఏళ్ల వ్యక్తి రెండు సార్లు తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయం గురిచి డాక్టర్ విశ్యరాజ్ తెలియజేశారు. ఈ మేరకు విశ్వరాజ్ అతన్నిరక్షించేందుకు విమానంలో పరిమిత పరిధిలోనే ఉన్న వైద్య సామాగ్రితో అతని ప్రాణం కాపాడేందుకు శతవిధాల యత్నించారు. వాస్తవానికి ఆయన లండన్లో ఉన్న తన తల్లిని తిరిగి భారత్లోని తమ స్వస్థలం బెంగళూరుకి తీసుకువెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చిందంటూ తన వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లు విశ్వారాజ్ తెలిపారు. విమానంలో ఉన్న పరిమిత పరిధిలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ సాయంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఐతే అతను స్ప్రుహలోకి రావడానికి సుమారు గంట సమయం పట్టిందని, తనతో మాట్లాడుతుండగానే మరోసారి గుండెపోటుకి గురైనట్లు తెలిపాడు. దీంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరిలో ఆ వ్యక్తి గురించే ఒకటే టెన్షన్ మొదలైంది. అందరం అతను ఐదుగంటల వరకు ప్రాణాలతో ఉండేలా ప్రయత్నించాం. ఆ ప్రయాణికుడు విషయమై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పైలెట్ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తామంతా ముంబైలో దిగుతుండగా అందరిలోనే అతను బతకే ఉండాలంటూ ఒకటే ఆందోళన చెందినట్లు తెలిపారు. ఎట్టకేలకు ముంబైలో దిగినప్పుడూ.. ఆ ప్రయాణికుడు సదరు డాక్టర్ విశ్వారాజ్తో మాట్లాడటమే కాకుండా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. అదీగాక ముంబైలోని ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది అతన్ని సురక్షితంగా కాపాడటమే గాక అతను కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ విశ్వరాజ్ వేముల తన జీవితాంతం ఈ ఘటన మర్చిపోలేనంటూ..ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి: ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..) -
చప్పుడు విందాం.. చటుక్కున మేల్కొందాం! లేదంటే క్షణాల్లో ప్రాణాల మీదకు
చంద్రమౌళిరెడ్డి. వయస్సు 28 సంవత్సరాలు. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగంలో స్థిరపడి పెళ్లికి సిద్ధమవుతున్న వేళ కార్డియాక్ అరెస్టుతో జీవితం అర్ధాంతరంగా ముగిసింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడైన చంద్రమౌళి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. .. ఏది గుండెనొప్పి, ఏది కార్డియాక్ అరెస్టు.. కరోనా నేపథ్యంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడమే ఇందుకు కారణమా? ఎంతో చురుకుగా వ్యాయామం చేస్తున్నా.. రోజువారీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆహార నియమాలు పాటిస్తున్నా.. రేపటి మీద నమ్మకం కలగని పరిస్థితి. కొత్త వేరియంట్లతో సరికొత్త భయం ఉదయిస్తోంది. జిల్లా డెస్క్,కర్నూలు: కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తుమ్మినా.. దగ్గినా.. ఒంట్లో వేడి చేసినా.. మూలం కరోనాతో ముడిపడుతోంది. రోజుకో వార్త.. పూటకో ప్రచారం.. కరోనా రూపం మార్చుకోవడం ఏమో కానీ.. మనిషి ఆరోగ్యం మాత్రం దినదిన గండం అవుతోంది. చైనా మొదలుకొని.. మారుమూల పల్లె వరకు ఇప్పుడు ఇదే చర్చ. అసలేమవుతోంది.. ప్రపంచంలో ఏం జరుగుతోంది.. ఇలాంటి ఆలోచనలతో గుండె వేగం పెరుగుతోంది. ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా కార్డియాక్ అరెస్టు కొత్త ప్రశ్నలను తీసుకొస్తోంది. యువతను గందరగోళంలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో గుండెవ్యాధుల నిపుణుల సలహాలు, సూచనలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పెద్దాసుపత్రితో గుండె పదిలం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో 10 ఐసీయూ, 20 జనరల్ వార్డు పడకలు ఉన్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ విభాగానికి కేథలాబ్ యూనిట్, హార్టింగ్ మిషన్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారు. ఈసీజీ, 2డి ఎకో పరీక్షలతో పాటు టీఎంటీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి స్టెంట్స్ సైతం ఇక్కడే వేస్తున్నారు. ఇక కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఈ విభాగం దాదాపు రూ.5 కోట్లతో ఆధునీకరించి 2016 జులైలో పునః ప్రారంభించారు. అత్యాధునిక మాడులర్ ఆపరేషన్ థియేటర్, పది పడకలున్న ఐసీయూ విభాగం కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తోంది. ఇప్పటివరకు అన్ని రకాల గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్సలు 600 దాకా నిర్వహించారు. తరచుగా గుండె పరీక్షలు ► 25 నుంచి 30 ఏళ్లలోపు వారు గుండెపోటు బారినపడటానికి ప్రధాన కారణం ధూమపానం, స్థూలకాయం. ► కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి ఉన్నా, తక్కువ వయస్సులో షుగర్ వచ్చినా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు అధికం. ► కోవిడ్కు గురైన వారిలో గుండెపోటు కేసులు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ► కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడిన వాళ్లు గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ► రక్తనాళాల్లో ఏవైనా సమస్యలుంటే అవసరమైన చికిత్స తీసుకుంటే గుండెపోటుకు గురికాకుండా చూసుకోవచ్చు. కార్డియాక్ అరెస్టు అంటే.. కార్డియాక్ అరెస్ట్ ఆకస్మికంగా వస్తుంది. శరీరంలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే అలజడితో పాటు అప్పటికే శరీరంలో ఉన్న ఇతర అనారోగ్య కారణాలు ఇందుకు తోడు కావడం. గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతినడం, రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఎలాంటి వయస్సులోనైనా.. యువకుల్లోనే కాదు ఎవరిలోనైనా సడన్గా కార్డియాక్ అరెస్టు రావచ్చు. కరోనా వచ్చిన వారిలోనే కార్డియాక్ అరెస్టు అధికంగా ఉంటుందనే ప్రచారం అవాస్తవం. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు సంబంధం లేదు. వీటిని ముందుగా గుర్తించడం కొద్దిగా కష్టం. ఈసీజీ, ఎకో పరీక్షల్లో కనిపించవు. ఎంఆర్ఐ, పెట్సా్కన్ చేసి నిర్ధారించవచ్చు. జిమ్ చేస్తున్న సమయంలో, తీవ్రమైన భావోద్వేగాలు, మానసిక ఆందోళన కారణంగా కరోనరి ధమనులు మూసుకుపోతాయి. దీనివల్ల సడన్గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 40 ఏళ్లలోపు వారే అధికం గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స పొందుతున్నారు. 40 ఏళ్లలోపు వారే అధికం గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స పొందుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. పనిలో శారీరక శ్రమ తప్పనిసరి. సైకిల్ తొక్కడంతో పాటు వాకింగ్ చేయాలి. గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో స్థూలకాయం ఒకటి. కొవ్వు శాతం అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి. పండ్లు, తాజా కూరగాయలకు భోజనంలో చోటు కల్పిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళనలను దరి చేయనీయకపోవడం ఉత్తమం. వ్యాక్సిన్ గుండెపై ప్రభావం చూపుతుందా? కరోనా వైరస్ నేరుగా గుండె కండరాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టేతత్వం ఎక్కువ అవుతుంది. దీంతో పాటు ఊపిరితిత్తుల్లో, ఇతర అవయవాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టవచ్చు. కాళ్లలో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టి అది ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా చేరవచ్చు. దీనివల్ల రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హార్ట్ ఎటాక్కు దారితీస్తుంది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నç³్పుడు కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. కోవిడ్ వ్యాక్సిన్కు, గుండెపోటుకు సంబంధం లేదు. హార్ట్ ఎటాక్ లక్షణాలు ఉదయం వేళల్లో ఎడమ దవడ కింది భాగంలో నొప్పి ప్రారంభమై పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత నొప్పి క్రమేపీ ఛాతీ వైపునకు, అక్కడి నుంచి ఎడమ భుజం, చేతి వేళ్ల వైపునకు వస్తుంది. కార్డియాక్ అరెస్టు లక్షణాలు గుండె పనితీరులో ఆకస్మిక తేడాతో స్పృహ కోల్పోవడం లేదా శ్వాసను కోల్పోవడం జరుగుతుంది. గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, ఆ వెంటనే ఇతర అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. గుండె చప్పుడు ఆధారంగా చికిత్స హార్ట్ ఎటాక్తో ఆసుపత్రికి వచ్చిన రోగి గుండెచప్పుడును పరీక్షించి చికిత్స ప్రారంభిస్తాం. ముందుగా ధమనులలో అడ్డంకులు కరగడానికి, నొప్పి ఉపశమనానికి మందులు ఇస్తాం. అధిక రక్తపోటు ఉన్నట్లయితే అందుకు తగిన చికిత్స చేస్తాం. రక్తనాళాలలోని అడ్డంకులు, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత, రోగి వయస్సు మీద ఆధారపడి అప్పటికప్పుడు నిర్ణయం ఉంటుంది. కరోనరీ యాంజియోప్లాస్టీ, బెలూన్ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింపజేయడం లేదా కరోనరీ బైపాస్ సర్జరీ చేస్తాం. – డాక్టర్ ఎ.వసంతకుమార్, సీనియర్ కార్డియాలజిస్టు, కర్నూలు -
షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..
భోపాల్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ భిండ్లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో(కార్డియాక్ అరెస్ట్) ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు మనీష్ జాతవ్. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
Aindrila Sharma: యువనటి ఆండ్రిలా శర్మ మృతి.. వైద్యులు చెప్తున్నదేంటి?
విధి వెక్కిరింతకు నేలరాలిన నవ్వుల పువ్వులెన్నో. కష్టాలెన్నింటినో దాటి బతుకుపోరులో బలవంతులుగా మిగిలినా.. ఉసురు తీసే ఉపద్రవాలు మరెన్నో. కళ్లముందే కళకళలాడుతూ కనిపించి.. కనురెప్పపాటులో కానరాకుండా పోతున్న జీవితాలెన్నెన్నో. లయతప్పిన జీవన విధానమో.. శ్రుతిమించిన వ్యాయామ వ్యవహారమో.. తరాలనుంచి సంక్రమించిన పెనుముప్పో! బతుకులైతే మిన్నుముట్టిమన్నులో కలిసిపోతున్నయ్! బెంగాలీ యువనటి ఆండ్రిలా శర్మ ‘ఆఖరి’పోరులో అలసిపోయిన సంగతి చెప్తున్నదేంటి... 24 ఏళ్ల ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసింది. రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆమె ఉన్నట్టుండి నవంబర్ 1న తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆస్పత్రికి తరలించగా ఆండ్రియా బ్రెయిన్ స్ట్రోక్కు గురైందని తెలిసింది. అప్పటినుంచి ఆమెకు వెంటిలేటర్పైనే వైద్యులు చికిత్స అందించారు. బ్రెయిన్ సర్జరీ చేశారు. అయితే, కోలుకుంటోందన్న తరుణంలో ఆండ్రియాకు పలుమార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోట్లు యావత్ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఈ ముప్పు అధికంగా ఉందని పలు మెడికల్ సర్వేలు చెప్పడం గమనించదగ్గది. (చదవండి: హు కిల్డ్ శ్రద్ధా వాకర్.. సినిమాగా రానున్న సంచలన హత్య కేసు) కారణాలేంటి? ఎందుకిలా? చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు రావడానికి వంశపారంపర్యం.. లేక జీవన విధానం కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా భారత్లో ఇటువంటి విషాదాలు మామూలైపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ చరిత్రలో హృద్రోగ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉండాలని, జీవన శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండె సమస్యలు ఉత్పన్నం కావచ్చని అంటున్నారు. గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరాలో ఆటంకం తలెత్తితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చక్కని ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామ గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. యువతకు గుండెపోటు సమస్యలపై పలు రిపోర్టులు ఏం చెప్తున్నాయంటే.. 1. నియంత్రణలేని జిమ్ పద్ధతులు పాటించడం. 2. మితిమీరిన జిమ్ సప్లిమెంట్స్ (ప్రోటీన్ పౌడర్, స్టెరాయిడ్స్) తీసుకోవడం. 3. సులభపద్ధతుల్లో వర్కౌట్స్ చేయపోవడం.. శరీరాకృతి కోసమంటూ మొండిగా కఠిన విధానాలు అవలంభించడం. 4. హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోకపోవడం. శరీరంలో కొవ్వు నిష్పత్తి ఏమేరకు ఉంది, బీపీ నియంత్రణలోనే ఉందా? అని తెలుసుకోవడం అత్యావశ్యకం. 5. గుండె ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. సాచురేటెడ్ కొవ్వులు పరిమితికి మించి తీసుకోవడం. (చదవండి: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి) -
మరో విషాదం.. ప్రముఖ నటి మృతి
ప్రముఖ బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ వెల్లడించారు. ఆమె మరణంతో వారి కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. పది రోజుల క్రితం ఓ ప్రదర్శన కోసం షూట్లో పాల్గొన్నట్లు ఆమె కుమారుడు తెలిపారు. వచ్చే వారం మళ్లీ ఆమె షూట్ పాల్గొనాల్సి ఉందని.. కానీ అంతలోనే ఇలా అకస్మాత్తుగా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. (చదవండి: సీనియర్ నటుడు సుమన్కు అరుదైన పురస్కారం) ముంబైలో జన్మించిన తబస్సుమ్ గోవిల్ బాలీవుడ్లో బేబీ తబస్సుమ్గా పేరు సంపాదించింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా తన సినీ కెరీర్ను ప్రారంభించింది. 1972 నుంచి 1993 వరకు దాదాపు 21 ఏళ్లపాటు ప్రముఖ దూరదర్శన్ తొలి సెలబ్రిటీ టాక్ షో 'ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్'ను కూడా హోస్ట్గా వ్యవహరించింది. సోమవారం సాయంత్రం ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో ఆమె కోసం ప్రార్థన నిర్వహించనున్నట్లు మనవరాలు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. -
అయ్యో.. అత్యుత్సాహం ఎంత పని చేసింది?
వైరల్: మన దేశంలో బారాత్లు, వివాహ వేడుకలు, ఇతర ఫంక్షన్లలో మందు-చిందులు తప్పనిసరిగా మారాయి. అయితే.. ఒక్కోసారి ఆ వేడుకల్లో చేసే అతిచేష్టలు విపరీతాలకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. మరో హఠాన్మరణం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మరదలి పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి(42).. సంతోషంగా చిందులేస్తూ గడిపాడు. అయితే.. ఆయన డ్యాన్స్ అక్కడి వాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో చప్పట్లతో ఆయన్ని మరింత ప్రొత్సహించారు. దీంతో రెచ్చిపోయి అలాగే చాలాసేపు డ్యాన్స్లోనే ఉండిపోయారు ఆయన. ఈ క్రమంలో.. తీవ్రంగా అలసిపోయి ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, సడన్ కార్డియాక్ అరెస్ట్తోనే ఆ వ్యక్తి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్ పాలిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. साली की शादी में डांस करते वक्त 42 साल के व्यक्ति की मौत| pic.twitter.com/ujOulHI6EY — Priya singh (@priyarajputlive) November 13, 2022 -
మూడు సార్లు గుండె ఆగినా.. ప్రాణాలు నిలిపారు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన వరుణ్ అనే 8 ఏళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్ కారణంగా మూడు సార్లు గుండె ఆగిపోయింది. ఇలాంటి స్థితిలో వైద్యులు.. బాలుడికి సీపీఆర్ చేసుకుంటూ మెరుగైన వైద్యం అందించడంతో తిరిగి ప్రాణం పోసుకున్నాడు. వివరాలను బుధవారం కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జీ వివరించారు. వరుణ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయానికి అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఎంతో శ్రమించి వైద్యులు అతని గుండెను పునఃప్రారంభింపజేశారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. బాబుకు ఇన్ఫెక్షన్ సోకడంతో గుండె సామర్థ్యం మందగించిందని తెలుసుకున్నారు. వైద్యం చేసే సమయంలోనే బాలుడి గుండె మూడు సార్లు ఆగిపోయింది. ఆ సమయంలో మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తి పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెరుగైన వైద్యం కారణంగా పక్షవాతం రాలేదు. పిల్లల గుండెకు ఇన్షెక్షన్ సోకి గుండె పనితీరు మందగించడం చాలా అరుదుగా జరుగుతుందని, దీనిని వైద్య పరిభాషలో మయోకార్డియారెస్ట్ అంటారని డాక్టర్ మురార్జీ తెలిపారు. మయోకార్డియాటీస్ ఉన్నప్పుడు తక్కువ మంది పిల్లలకు తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తుతాయని, వారికి ఇంట్రావీనస్ ఆయనోట్రోఫిక్ సపోర్ట్, మెకానికల్ వెంటిలేషన్తో ఇంటెన్సివ్ కేర్ థెరపీ అవసరం ఉంటుందని డాక్టర్ మురార్జీ వివరించారు. చదవండి: (బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం) -
షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!
వాషింగ్టన్: కరోనా ఎంఆర్ఎన్ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ జనరల్ డా.జోసెఫ్ లడాపో వెల్లడించారు. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై(సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం. ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ విశ్లేషణలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కల్గిస్తోంది. అయితే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతో ఉండాలని చెప్పారు. ఏ ఔషధాన్నైనా, వ్యాక్సిన్నైనా అభివృద్ధి చేసేటప్పుడు వాటి భద్రత, సమర్థతపై పరిశోధనలు అత్యంత కీలకమని డా.జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా టీకాల వచ్చినప్పుడు ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు నిర్వహించిన కీలక అధ్యయనం తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అయితే భారత్లో ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పారేద్దామనుకున్న టికెట్కు 1.6 కోట్లొచ్చాయి -
విషాదం నింపిన మారథాన్.. ట్రాక్పైనే కుప్పకూలిన అథ్లెట్
గత ఆదివారం నిర్వహించిన లండన్ మారథాన్ 2022లో విషాదం నెలకొంది. మారథాన్లో పాల్గొన్న 36 ఏళ్ల అథ్లెట్ ట్రాక్పైనే కుప్పకూలాడు. ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా అథ్లెట్ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే చనిపోయిన అథ్లెట్ కుటుంబసభ్యుల వినతి మేరకు నిర్వాహకులు పేరును వెల్లడించలేదు. అయితే అథ్లెట్ మాత్రం సౌత్-ఈస్ట్ ఇంగ్లండ్కు చెందినవాడని పేర్కొన్నారు. మరో మూడు మైళ్లు చేరుకుంటే అతని రేసు పూర్తయ్యేది.. కానీ విధి మరోలా తలిచింది అంటూ మారథాన్ నిర్వాహకులు తమ బాధను వ్యక్తం చేశారు. ''లండన్ మారథాన్లో పాల్గొన్న ప్రతి అథ్లెట్ ఇవాళ మరణించిన తమ సహచర అథ్లెట్కు నివాళి అర్పిస్తున్నారు. అతని కుటుంబసభ్యుల వినతి మేరకు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచాలని భావించాం. అతని కుటుంబసభ్యులకు ఇవే మా ప్రగాడ సానభుతి.''అంటూ పేర్కొంది. ఇక అథ్లెట్ మరణంపై తుది రిపోర్టు రావాల్సి ఉందని నిర్వహాకులు పేర్కొన్నారు. ఇక ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా లండన్ మారథాన్ 2022 ఘనంగా జరిగింది. దాదాపు 40వేల మంది ఈ మారథాన్లో పాల్గొన్నట్లు సమాచారం. 26.2 మైళ్ల దూరంలో భాగంగా సౌత్ లండన్లోని గ్రీన్విచ్ నుంచి మాల్ వరకు ఈ మారథాన్ జరిగింది. పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన అమోస్ కిప్రుటో విజయం సాధించాడు. కిప్రుటో రెండు గంటల నాలుగు నిమిషాల 39 సెకన్లలో మారథాన్ను పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన యెహువాలా మారథాన్ను 2 గంటల 17 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు. పవన విద్యుత్లో దిగ్గజం.. తులసి తంతి 1958లో రాజ్కోట్లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్లకు సుజ్లాన్కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ విండ్ పవర్ యాంట్వెర్పెన్కు చైర్మన్గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. కష్టకాలంలో కంపెనీ.. సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది. -
క్రికెట్లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ హఠాన్మరణం
క్రికెట్లో విషాదం నెలకొంది. ఐసీసీ మాజీ అంపైర్ పాకిస్తాన్కు చెందిన అసద్ రౌఫ్(66) గుండెపోటుతో కన్నుమూశారు. 66 ఏళ్ల అసద్ రౌఫ్ అంతర్జాతీయ క్రికెట్లో 170కి పైగా మ్యాచ్లకు అంపైరింగ్ నిర్వహించారు. ఇందులో 64 టెస్టులు( 49 టెస్టులు ఆన్ఫీల్డ్ అంపైర్గా.. 15 మ్యాచ్లు టీవీ అంపైర్గా), 139 వన్డేలు, 28 టి20 మ్యాచ్లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి అలీమ్ దార్ తర్వాత విజయవంతమైన అంపైర్గా పేరు తెచ్చుకున్న అసద్ రౌఫ్ ఐపీఎల్ మ్యాచ్లకు కూడా అంపైర్గా పనిచేశాడు. అయితే 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అసద్ రౌఫ్ మెడకు చుట్టుకుంది. అసద్ రౌఫ్ ఫిక్సింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. బుకీల నుంచి అసద్ రౌఫ్ ఖరీదైన బహుమతుల్ని స్వీకరించి.. ఫిక్సింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు రాగానే బీసీసీఐ అతడ్ని పక్కన పెట్టి విచారణకి ఆదేశించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషిగా తేలడంతో 2016లో బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసినప్పటికి అంపైర్గా రీఎంట్రీ ఇచ్చేందుకు అసద్ రౌఫ్ ఇష్టపడలేదు. బీసీసీఐ ఇచ్చిన షాక్కు అంపైరింగ్ వదిలేసిన అసద్ రౌఫ్ లాహోర్లోనే ఒక బట్టల షాపు నిర్వహించడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: గంగూలీ, జై షాలకు జై -
ఆపరేషన్ కోసం తీసుకొస్తే.. మత్తు మందే మింగేసింది
సాక్షి, వరంగల్: చేయి విరిగిన ఎనిమిదేళ్ల బాలుడిని ఆపరేషన్ కోసం తీసుకొస్తే ప్రాణం పోయింది. అధిక మోతాదులో అనస్తీషియా ఇవ్వడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా లింగానాయక్ తండాకు చెందిన భూక్యా విహాన్(8)కు కుడిచేయి విరిగింది. 4న ఎంజీఎం ఆస్పత్రి ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేసేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో థియేటర్లోకి తీసుకెళ్లారు. అనస్తీషియా ఇవ్వాల్సిన డోస్ కన్నా ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో కార్డియాక్ అరెస్టయింది. ఉదయం 10 గంటలకు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బయట వైద్యులను అడిగారు. అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్కు సిద్ధం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆర్ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొద్దిసేపటికి బాబు మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో విహాన్ తల్లిదండ్రులు రోదిస్తూ ఆందోళనకు దిగారు. చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పంచాయతీ ప్రత్యక్ష పోస్టుమార్టం: విహాన్ మృతదేహానికి సాయంత్రం 6 గంటల తర్వాత ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడు ఎలా మృతిచెందాడో నిర్ధారణ కావడానికి వీడియో చిత్రీకరణ మధ్య ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రి 7 గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, విహాన్ మృతి ఘటన వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయ సిబ్బంది.. ఎంజీఎం సూపరింటెండెంట్కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కమిటీ వేసి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.. విహాన్ మృతి ఘటనపై విచారణకు అదేశించామని, దీనికోసం ద్విసభ్య కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు. -
హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
మనకు ఏదైనా గాయం కాగానే... శరీరం తనను తాను రిపేరు చేసుకునే తీరు అద్భుతం. ప్రతివారి జీవితంలో ఏదో ఓ సందర్భంలో గాయం కాగానే... (అది మరీ పెద్దది కాకపోతే) కొద్దిరోజుల్లోనే దాని ఆనవాలు కూడా తెలియకుండా పోతుంది. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోవడం... అవే కండరాలు మళ్లీ పునరుజ్జీవం పొందకపోవడం వల్లనే చాలామందిలో మరణం సంభవిస్తుంది. కానీ చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదెలా జరుగుతుందో తెలుసుకుంటే... స్వాభావికంగా జరిగే ఇదే ప్రక్రియను... వైద్య చికిత్సగా ఇవ్వడం ద్వారా గుండెను రిపేరు చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. తమ పరిశోధనల ద్వారా అదెలా జరుగుతుందో... రిపేరుకు కారణమయ్యే ప్రోటీన్ ఏమిటో తెలుసుకున్నారు. దాని గురించి తెలిపేదే ఈ కథనం. మన దేహంలో ఏదైనా భాగం గాయపడగానే... వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ‘లింఫాటిక్ సిస్టమ్’ అనే వ్యవస్థ ఇందుకు తోడ్పడుతుంది. ఇది మన వ్యాధినిరోధక వ్యవస్థలో ఒక కీలక అంశం. దేహంలో అన్నిచోట్ల కండరాలకు రిపేరు జరిగినట్లే... దెబ్బతిన్న గుండె కండరాన్నీ రిపేరు చేయడానికి పూనుకుంటుందీ వ్యవస్థ. రిపేరు ప్రక్రియలో ఏం జరుగుతుంది...? ఎలా జరుగుతుంది? ఏదైనా భాగంలో దెబ్బతగలగానే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ‘మ్యాక్రోఫేజెస్’ అనే కణాలు ఎక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. నిజానికి అవి మన వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా... అవి తెల్లరక్తకణాలపై ఉండే అనుబంధ కణాలే. ‘మ్యాక్రో’ అంటే పెద్దవి... ‘ఫేజెస్’ అంటే హరించేవి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అవి హానికరమైన కణాలనూ/అంశాలనూ, బ్యాక్టీరియాను, అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తినేయడం/హరించడం చేస్తాయి. అలాగే మన రోజువారీ జీవక్రియల్లో భాగంగా మనలో ప్రతిరోజూ 200 నుంచి 1000 వరకు క్యాన్సర్ కణాలూ వెలువడుతుంటాయి. వాటిని కూడా ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించేస్తాయి. (మన వ్యాధినిరోధక శక్తి తగినంత లేని సందర్భాలోనూ, లేదా అక్కడ పుట్టిన మొత్తం క్యాన్సర్ కణాలను ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించలేని సందర్భాల్లోనే క్యాన్సర్ వస్తుందన్నమాట). హానిచేసే కణాలను మాత్రమేగాకుండా... ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) కలిగించే కారకాలనూ, దెబ్బతిన్న తర్వాత శిథిలమైపోయి పోగుబడ్డ కణాల గుట్టలనూ ఇవి నిర్మూలిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే వాటినీ తొలగిస్తాయి. అంతేకాదు... బయటి పదార్థాలనూ (ఫారిన్బాడీస్నూ) ఎదుర్కొంటాయి. ఇలా ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే... ఇవి పెద్దసంఖ్యలో పుట్టి... ఇలా క్లీన్ చేసే ప్రక్రియను ‘ఫ్యాగోసైటోసిస్’ అని అంటారు. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి? ఇంతటి కీలకమైన భూమిక నిర్వహించే ఈ ‘మ్యాక్రోఫేజెస్’ ఎలా ఈ పని చేస్తాయన్నది శాస్త్రవేత్తలు ఇటీవలి తమ అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ‘నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయీ’కి చెందిన ప్రముఖ పాథాలజిస్ట్ ఎడ్వర్డ్ థోర్ప్ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించారు. ‘‘గుండెపోటు రాగానే ఇమ్యూన్ సెల్స్... సరిగ్గా చెప్పాలంటే ‘మ్యాక్రోఫేజెస్’ గుండెకండరం దెబ్బతిన్న చోటికి వెంటనే చేరుకుంటాయి. అక్కడ దెబ్బతిన్న కండరాలనూ, చచ్చుబడ్డ కణజాలాన్నీ (డెడ్ టిష్యూను) తినేయడం ప్రారంభిస్తాయి. ఇందుకోసం ఈ మ్యాక్రోఫేజెస్ ‘వీఈజీఎఫ్–సీ’ అనే ప్రోటీన్ను తయారు చేసి వెలువరిస్తాయి. ‘వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్–సి’ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘వీఈజీఎఫ్–సీ’. ‘డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్’ నవలోలాగా... ఈ మ్యాక్రోఫేజెస్ ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. మంచి మ్యాక్రోఫేజెస్... ‘వీఈజీఎఫ్–సి’ని ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ అదే సమయంలో కొన్ని చెడు మ్యాక్రోఫేజెస్ ఇన్ఫ్లమేటరీ (మంట, వాపు) కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి... అప్పటికే దెబ్బతిన్న గుండె కండరానికీ, ఆ పొరుగున ఉన్న కణజాలాలకు మరింత హాని చేసే అవకాశం ఉంది. ఇలా జరిగే సమయంలో అక్కడ దెబ్బతిని, నశించుకుపోయాక లేదా చచ్చుబడిపోయాక పోగుబడ్డ మృతకణజాలం అంతా తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఆ మృతకణజాలమంతా పూర్తిగా తొలగిపోయి, పరిశుభ్రమైపోయే ప్రక్రియను ‘ఎఫరోసైటోసిస్’ అంటారు. ఈ ప్రక్రియలోనే ‘మ్యాక్రోఫేజెస్’ కీలక భూమిక పోషిస్తాయి. ఈ ప్రక్రియ ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్తో ఎలా జరుగుతుందనే అంశాన్ని ల్యాబ్లో ఎలుకల సహాయంతో మేము కనుగొన్నాం’’ అంటున్నారు ఎడ్వర్డ్ థోర్ప్. ఈ అంశాల ఆధారంగా గుండెకు మేలు జరిగేదెలాగంటే...? ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా... ఈ మ్యాక్రోఫేజెస్నూ, ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్నూ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. వాటి సహాయంతో హార్ట్ ఎటాక్లో దెబ్బతిన్న గుండె కండరాల రిపేరు వేగంగా జరిగేలా చేయాలన్నది ఇప్పుడు పరిశోధకుల ముందున్న లక్ష్యం. అంతేకాదు... గుండెపోటు వచ్చినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల (బయొలాజికల్) తీనుతెన్నులేమిటో తెలుసుకుని, దానికి విరుగుడుగా ‘ఎఫరోసైటోసిస్’ ద్వారా గుండెకండరాన్ని వేగంగా కోలుకునేలా చేయాలని కూడా పరిశోధకులు సంకల్పిస్తున్నారు. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుంది? -
గుండెను గాబరా పెట్టకండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ ఇటీవల ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2020’ నివేదికను వెల్లడించింది. అందులో పేర్కొన్న ప్రకారం 2020లో రాష్ట్రంలో 4,55,000 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 22.3 శాతం అంటే 1,01,353 మరణాలను వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు ధ్రువీకరించిన మరణాల్లో 60.6 శాతం మరణాలు ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన హార్ట్ఎటాక్, కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్టరీ, కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి), అరిథ్మియా సహా పలు రకాల జబ్బుల కారణంగా సంభవించాయి. ఈ వ్యాధుల కారణంగా 61,395 మరణాలు నమోదు కాగా మృతుల్లో అత్యధికంగా పురుషులే ఉన్నారు. మృతుల్లో పురుషులు 39,677 మంది కాగా.. మహిళలు 21,718 మంది ఉన్నారు. రెండో స్థానంలో కరోనా సంబంధిత సమస్యల కారణంగా 12 శాతం, మూడో స్థానంలో శ్వాసకోశ వ్యాధులతో 7.2 శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా సంబంధిత మరణాల్లో 9,751 మందిలో వైరస్ నిర్ధారణ అవగా, 2,442 మందిలో వైరస్ నిర్ధారణ కాలేదు. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులతో 7,328 మరణాలు సంభవించగా.. ఇందులో న్యూమోనియాతో 4,085 మరణాలు నమోదయ్యాయి. క్రమంగా పెరుగుతున్న ధ్రువీకరణ మరణాలు రాష్ట్రంలో మరణాల రిజిస్ట్రేషన్, వైద్యుల ధ్రువీకరణ శాతం క్రమంగా పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో 4,01,472 మరణాలు రిజిస్టర్ కాగా.. ఇందులో కేవలం 12.9 శాతం మరణాలను మాత్రమే వైద్యులు ధ్రువీకరించారు. 2020 సంవత్సరానికి వైద్యుల ధ్రువీకరణ 22.3 శాతానికి పెరిగింది. ఒత్తిడికి గురవ్వకూడదు పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తోడు మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి, జీవన శైలి కారణంగా రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల గుండెకు, గుండె నుంచి ఇతర అవయవాలకు వెళ్లే రక్తప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్బుల బారినపడటంతో పాటు కార్డియోమయోపతి, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించడానికి ప్రయత్నించాలి. తీసుకునే ఆహారం, జీవన శైలిని మార్చుకోవాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు జీజీహెచ్ వ్యాయామం చేయాలి ఏరోబిక్స్, యోగా, ఇతర వ్యాయామాలను జీవన శైలిలో ఓ భాగంగా చేసుకోవాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. తద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అసాంక్రమిక జబ్బుల బారినపడకుండా ఉండవచ్చు. ప్రస్తుతం యువతలో మధుమేహం, రక్తపోటు బయటపడుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. రోజుకు అరగంట మించకుండా వాకింగ్, జాగింగ్, యోగా, ఇతర వ్యాయామాలు చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. స్వీయ రోగ నిరోధకత పెంచుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. కరోనా వచ్చి తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు, ఇతర నియమాలు పాటిస్తే ఊపిరితిత్తులు, గుండె, ఇతర వ్యాధుల బారినపడకుండా ఉండగలరు. – డాక్టర్ రాంబాబు, విమ్స్ డైరెక్టర్ -
Veerappan: వీరప్పన్ సోదరుడి కన్నుమూత
చెన్నై: గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్(75) కన్నుమూశాడు. గుండెపోటుతో సేలం(తమిళనాడు) ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. మత్తయ్యన్.. ఓ హత్య కేసులో సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మే 1న తీవ్ర గుండెపోటు రావడంతో పోలీసులు, మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. 1987లో ఫారెస్ట్ రేంజర్ చిదంబరంను హత్య చేసిన కేసులో.. ఈరోడ్ జిల్లా బంగ్లాపూడుర్ పోలీసులు మత్తయ్యన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో జీవిత ఖైదు పడగా.. 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. ఈయన్ని విడుదల చేయాలంటూ పలు పిటిషన్లు సైతం తెర మీదకు వచ్చాయి. -
గుప్పెడు గుండెను తడితే.. ఆపదలో రక్షణ
సాక్షి, అమరావతి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు (హార్ట్ ఎటాక్), గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్ట్) వంటి సమస్యలకు గురై మరణించటం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి.. సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సీపీఆర్ ఇలా.. గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60నుంచి 70 శాతం అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే 108కు ఫోన్చేసి అంబులెన్స్ను రప్పించి ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఏఈడీ అందుబాటులో ఉంచుకోవాలి విదేశాల్లో జిమ్లు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉంటాయి. వీటిద్వారా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడీ ద్వారా షాక్ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు నుంచి కోలుకునే అవకాశం 60నుంచి 65 శాతం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలామందిని రక్షించడానికి వీలవుతుంది. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం. వైద్య పరీక్షలు చేయించుకోవాలి 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటి వారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకు ఒకసారి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ లేదా స్ట్రెస్ టెస్ట్లు చేయిచుకోవాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, కర్నూలు జీజీహెచ్ -
Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..
సాక్షి, అమరావతి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్ట్) వంటి సమస్యలకు గురై మరణించటం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ.. పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్నెస్తో ఉండేవారు సైతం గుండె సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి.. సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏఈడీ అందుబాటులో ఉంచుకోవాలి విదేశాల్లో జిమ్లు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉంటాయి. వీటిద్వారా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడీ ద్వారా షాక్ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు నుంచి కోలుకునే అవకాశం 60 నుంచి 65 శాతం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలామందిని రక్షించడానికి వీలవుతుంది. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం. సీపీఆర్ ఇలా.. గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60 నుంచి 70% అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే 108కుఫోన్చేసి అంబులెన్స్ను రప్పించి ప్రాథమికచికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి.. 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటి వారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకు ఒకసారి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ లేదా స్ట్రెస్ టెస్ట్లు చేయిచుకోవాలి. కఠిన వ్యాయామాలు చేసే వారికి గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు లాంటి ప్రమాదానికి దారితీయవచ్చు. దీన్నే డిఫెక్షన్ అంటారు. కొవ్వు కణాలతో ఏర్పడిన ‘ప్లాక్’పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. ప్రొటీన్–సి, ప్రొటీన్–ఎస్, యాంటీ థ్రాంబిన్–3 తగ్గటం వంటి లోపాలున్న వారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్న వారిలోనూ క్లాట్ ఏర్పడే గుణం ఎక్కువ. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, కర్నూలు జీజీహెచ్ కఠిన వ్యాయామాలు వద్దు.. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్త ప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్థవంతంగా రక్తాన్ని పంపవు. 40 సంవత్సరాలు పైబడిన వారెవరైనా సరే కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఈ వయసులో ఉన్న వారు జిమ్కు వెళ్లి వ్యాయామాలు మొదలు పెట్టే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కఠిన వ్యాయామాలు చేసినప్పుడు అప్పటికే లోపల ఉన్న సమస్యలు జఠిలమై కార్డియాక్ అరెస్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ చైతన్య, గుండె వైద్య నిపుణులు విజయవాడ -
మొదటిసారే తీవ్రమైన గుండెపోటు.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో మూడు సార్లు వస్తుందని కొందరిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ మరికొందరు మాత్రం మొదటిసారి స్ట్రోక్కే చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. అన్ని కండరాల్లాగే గుండె కండరానికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందుతుంటాయి. ఒకవేళ కొవ్వు పేరుకోవడం వంటి కారణాలతో రక్తనాళాలు ఆ పూడుకుపోతే గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదే ‘గుండెపోటు’ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎంత వేగంగా గుండెకు అందాల్సిన రక్తాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగితే అంతగా గుండెపోటు ప్రభావాన్ని తగ్గించవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకురావాలంటూ వైద్యులు చెప్పేది ఇందుకే. అయితే కొందరిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలన్నీ పూడుకుపోయి... హాస్పిటల్కు చేరేలోపే గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే.... గుండెకే కాదు... గుండెనుంచి మన దేహంలోని ఏ అవయవానికీ రక్తం సరఫరా కాదు. పైగా రక్తనాళాలు పూడుకుపోవడం క్రమంగా జరుగుతున్న కొద్దీ... రక్తసరఫరా సాఫీగా కొనసాగేందుకు పక్కనుంచి రక్తనాళాలు వృద్ధి చెందుతుంటాయి. (చదవండి: ఇకపై నిర్ణయించేది మేమే!) వాటినే కొల్లేటరల్స్ అంటారు. కానీ మొదటిసారే పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేటరల్స్ కూడా వృద్ధిచెందవు కాబట్టి గుండెకు రక్తం అందించేందుకు పక్కనాళాలూ ఉండవు. ఇలాంటి సమయాల్లోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందచి చెబుతుంటారు. రోగి మరణానికి దారితీసే ప్రమాదకరమైన స్థితి ఇది. అందుకే ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటూ పూడిక ఉన్నప్పుడు స్టెంట్ వేయించడం, రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం, అన్ని ప్రధాన రక్తనాళాలూ పూడుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి గుండె శస్త్రచికిత్స చేయించడం వంటివి అవసరమవుతాయి. (చదవండి: మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్) -
What An Idea: గుండె పోటుకి గురైన వృద్ధుడిన కాపాడిన డ్రోన్! ఎలాగంటే..
A drone saved the life of a 71-year-old man: మనం సాంకేతిక టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే మానవుడిని చంద్రునిపై పాదం మోపేలా చేయగలిగింది. సాంకేతిక సాయంతో ఎన్నో విపత్తుల నుంచి బయటపడగలిగాం. ఇప్పుడు మరి కాస్త ముందడుగు వేసి గుండెపోటుతోనే లేక మరేదైన విపత్కర పరిస్థితిలో ఉన్న మనిషికి డ్రోన్ సాయంతో సేవలందించి కాపాడుకోవచ్చు అంటుంది స్వీడన్కి చెందిన ప్రముఖ డ్రోన్ కంపెనీ. అసలు విషయంలోకెళ్లితే....కార్డియాక్ అరెస్ట్తో బాధపడుతున్న 71 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో అత్యధునిక టెక్నాలజీతో ఆవిష్కరించిన డ్రోన్ సహాయపడింది. స్వీడన్లోని ట్రోల్హట్టన్లో తన ఇంటి బయట మంచు కురుస్తున్నప్పుడు ఒక వ్యక్తి గుండెపోటుకు గురైయ్యాడు. అయితే అప్పుడే డాక్టర్ ముస్తఫా అలీ స్థానిక ఆస్పత్రిలో పనిచేసే నిమిత్తం కారులో డ్రైవింగ్ చేసుకుంటూ అటుగా వస్తున్నాడు. సరిగ్గా ఆసమయానికి ఒక వృద్ధుడి గుండె నొప్పితో కుప్పకూలిపోవడం చూశాడు. (చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి) దీంతో అలీ వెంటనే అతనికి సహాయం చేసే నిమిత్తం అతని వద్దకు వెళ్లాడు. అంతేకాదు వెంటనే స్థానిక అంబులెన్స్కి సమాచారం ఇచ్చాడు. అయితే ఆ వృద్ధుడికి పల్స్ లేకపోవడంతో సీఆర్పీ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేయడం ప్రారంభించాడు. అయితే ఇంతలో అతనికి పై నుంచి ఏదో శబ్దం చేసుకుంటూ వస్తుంది ఏంటో అని పైకి చూశాడు. ఒక డ్రోన్ డీఫిబ్రిలేషన్(గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్ పరికరం) తీసుకువచ్చి అతని ముంగిట పడేసింది. ఈ మేరకు అలీ ఆ వృద్ధుడికి డీఫిబ్రిలేషన్తో ప్రథమ చికిత్స అందించాడు. ఆ తర్వాత అంబులెన్స్ రావడంతో ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆ వృద్ధుడు మాట్లాడుతూ.."ఇది చాలా విప్లవాత్మక సాంకేతికత. సమయానికి డీఫిబ్రిలేషన్ని డ్రోన్ తీసుకురావడంతోనే తాను ప్రాణాలతో సురక్షితంగా ఉన్నాను" అని అన్నాడు. ఈ క్రమంలో ఎవర్డ్రోన్ కంపెనీ డ్రోన్ చాలా తక్కువ వ్యవధిలోనే డీఫిబ్రిలేషన్ తీసుకువెళ్లిందని పేర్కొంది. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) -
చలి కాలంలో గుండెపోటు అవకాశాలు ఎక్కువ
గుంటూరు: చలికాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ బి. నాగరాజు సూచించారు. గుంటూరువారి తోట గౌడీయ మఠం పక్కనున్న అమ్మాజీ– పావని మెమోరియల్ హాస్పిటల్లో సోమవారం ఉచిత గుండెజబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ గుండెజబ్బులకు కారణమయ్యే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల పెరుగుతున్న గుండెజబ్బులపై అవగాహన కల్పించి ప్రజల్లో భయాలను తొలగించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తెలిపారు. -
అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా..
రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 6-8 గంటలు నిద్రపోయే వారితో పోల్చితే వీరిలో ఈ సమస్య ఎక్కువట. స్ట్రోక్కు గురైన వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారినపడి అకాల మరణాలకు గురౌతారని అధ్యయనాలు వెల్లడించాయి. Effects & Health Risks of Oversleeping in Telugu: అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. సగటున 62 ఏళ్ల వయస్సున్న దాదాపు 32,000 మందిపై జరిపిన అధ్యయనాల్లో స్ట్రోక్ రిస్క్ గురించి పరిశోధకులు వివరించారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే మెదడు కణజాలాలు దెబ్బతింటాయి. ఫలితంగా స్ట్రోక్ వస్తుంది. రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు 23% ఎక్కువని ఈ అధ్యయనం తెల్పుతోంది. ఐతే అతి తక్కువగా నిద్రపోతే వారిలో స్ట్రోక్ ప్రమాదం 82% ఎక్కువని ఈ నివేదిక తెల్పుతోంది. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధిక నిద్ర స్ట్రోక్కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ, స్ట్రోక్ వచ్చినవారిలో తరచుగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు తెల్పాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం వంటి రుగ్మతలు తలెత్తుతాయట. ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జైదీప్ బన్సాల్ ఏమంటున్నారంటే.. అధిక నిద్రకు, స్ట్రోక్ సంభవించడానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలియరాలేదు. ఐతే ఎక్కువగా నిద్రించేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువు పెరుగుతున్నాయని.. ఈ రెండూ కారణాల వల్లే స్ట్రోక్ ప్రమాదం వస్తుందని వివరించారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే 80% వరకు స్ట్రోక్ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలికి బదులు వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, ధూమపానం, అధిక మద్యపానాలకు దూరంగా ఉండటం, తరచూ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం వంటివి అలవర్చుకోవాలని చెబుతున్నారు. చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్లు.. చివరికి.. -
శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తుందా..!
తిరుపతి సాక్షి : భారత దేశంలో గుండె పోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో చాల మంది ప్రముఖులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తున్నాం. గత వారం కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ (46) వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ప్రఖ్యాత క్రికెట్ ఆటగాళ్లు సౌరవ్ గంగూలి, బ్రియన్ లారా వంటి ఆటగాళ్లు కూడా మధ్య వయస్సులో గుండె పోటుకు గురి అయ్యారు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా గుండె పోటు నుండి తప్పించుకోలేకపోతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఆందోళన, ఒత్తిడి, మన ఆధునిక ఆహారపు అలవాట్లు, ధూమపానం, మధ్యపానం, ఘగర్, బీపీ, స్థూల కాయం ఉన్న వారిలో ఈ జబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం కానీ,అతి డైటింగ్ ,నిద్ర పోవడం వంటి కార్యకలాపాలను పరిమితంగా చేయాలి లేదా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో హ్తె ప్రొటీన్ డైట్ ఇచ్చిన ఎలుకల్లో గుండెపోటు అధికంగా వచ్చినట్లు తేలింది. వైద్య నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం చికిత్సతోపాటు జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. హృదయ స్పందనలో ఏం జరుగుతుంది గుండె కొట్టుకోవడంలో కొంత సమస్య మొదలవుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే చికిత్స చేస్తే పల్స్ తిరిగి మొదలవుతుంది. ఇలా వెంటనే చికిత్స అందించడం వల్ల రోగి జీవితాన్ని కాపాడవచ్చు. ఈ పనిని ఇంజెక్షన్ ద్వారా లేదా యాంజియోప్లాస్టీ ద్వారా చేస్తారు. అటువంటి పరిస్థితిలో కార్డియాలజిస్ట్ బాధితుడిని మరణం నుండి రక్షించగలరు. చాలా మంది రోగులు గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే మరణిస్తారు. గుండెపోటులో 50 శాతం మొదటి గంటలోనే సంభవిస్తాయి. అందువల్ల, మొదటి గంటలో దానిని గుర్తించడం.. చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి లక్షణాలను గుర్తించడం.. వెంటనే ఈ రోగిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ప్రాథమిక చికిత్స ఎలా ఉండాలి గుండెపోటు వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. గుండెపోటు వచ్చిన వెంటనే మొదట ఆస్పిరిన్ మాత్రను అందించాలి. ప్రారంభ చికిత్స సమయంలో ఇంజెక్షన్ సుమారు 1 నుంచి 60–70 శాతం వరకు సక్సెస్ ఉంటుంది. యాంజియోప్లాస్టీ 90% కంటే ఎక్కువ విజయవంతమైంది. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు హదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను 1 నుండి 100 వరకు లెక్క పెట్టుకుంటే..తిరిగి 100 నుండి 1 వరకు లెక్కపెట్టి మనస్సుసై ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు శ్వాస నిశ్వాసలపై ఏకాగ్రత పెడుతుంటారు. మరి కొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో.. లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరం అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ►షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు ఉన్నట్టుండి ఛాతీ భాగం, మెడ భాగంలో నొప్పులు వచ్చి చెమటలు పడుతుంటాయి. ►శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి. ►గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ►మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి. ►తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. ►కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు. ►వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. ►గుండె సమస్యలుంటే.. తప్పకుండా హార్ట్ బీట్ను చెక్ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ►గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి. ►రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి. ►తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే. -
పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు
సాక్షి, బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన అప్పూ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక విషయాన్ని ప్రకటించారు. కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్సైట్ను,యాప్ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్ను లాంచ్ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా షాకింగ్గా ఉంది. ఆయన మరణం తమతోపాటు, సినీ రంగానికి, ముఖ్యంగా యువతకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్త్నుట్లు ఆయన ప్రకటించారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు) కాగా శుక్రవారం తమిళనాడులోని గాజనూరులో పునీత్ రాజ్కుమార్ పర్యటించాల్సి ఉంది. దీంతో ఆయన అభిమానులు పునీత్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అప్పూ ఇక లేడన్న వార్త వారిని శోకసంద్రంలో ముంచేసింది. మరోవైపు పునీత్ భౌతిక కాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచి కడసారి దర్శించు కునేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పునీత్కు తుది నివాళులర్పించేందుకు అభిమాన జనం వేలాదిగా తరలివచ్చారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) On Thursday, he (#PuneethRajkumar) had asked me to release a website regarding Karnataka tourism. I would have launched his app on Nov 1 but he's not between us. It is so shocking. State, cinema, and youths will miss him: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/TfLOCrT4Am — ANI (@ANI) October 30, 2021 Karnataka CM Basavaraj Bommai announces postponement of actor Puneeth Rajkumar’s funeral to Sunday, 31 October. Postponement taking into consideration the sentiment of fans who are still flocking in to pay homage. @TheQuint pic.twitter.com/eSKpHu5xEU — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021 -
అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..
గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడాన్నికార్డియాక్ అరెస్ట్ అంటారు. నిజానికి ఇది ఒక రకంగా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. అమెరికాలో సగానికిపైగా జనాభా దీని భారీన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. ఐతే దీని బారిన పడ్డవెంటనే చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు, ఎవరెవరు దీని బారినపడతారో, చికిత్స ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.. కార్డియాక్ అరెస్ట్కు కారణాలు ►వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గుండెలో నాలుగు గదులు ఉంటాయి. దిగువ రెండు గదులను జఠరికలు, పై రెండు గదులను కర్ణికలు అంటారు. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్తప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది కూడా. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ►కర్ణిక దడ ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్ధవంతంగా రక్తాన్ని పంపవు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎవరికి ఉంది? ►కరోనరీ హార్ట్ డిసీజ్తో బాధపడే వారిలో ఈ సమస్య సాధారణంగా తలెత్తుతుంది. ►గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నవారిలోకూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ►పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. ►గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తినా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఈ కింది కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.. ►ధూమపానం ►ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి ►అధిక రక్త పోటు ►ఊబకాయం ►వంశపారంపర్య గుండె జబ్బులు ►45 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు ►పొటాషియం/మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉన్నవారిలో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ►తలతిరుగుతుంది ►అలసటగా అనిపించడం ►వాంతి ►గుండెల్లో దడ ►ఛాతి నొప్పి ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణం నిలుపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసి, సత్వర చికిత్స అందించడం ద్వారా శరీరానికి రక్తం ప్రసరించేలా ప్రేరేపిస్తారు. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు. చదవండి: మత్స్యకారులకు దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద.. -
కసరత్తు ఎక్కువైనా ప్రమాదమేనా..!
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే.. 40 ఏళ్ల వయసులో సిద్థార్థ్ గుండె పోటుతో మరణించడం కలవరపెడుతుంది. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తుందని వైద్యులు చెబుతారు. అలాంటిది ఫిట్నెస్ ఫ్రీక్ అయిన సిద్థార్థ్ గుండెపోటుతో చనిపోవడం ఏంటనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే అతిగా వ్యాయామం చేయడం. అవును. అతిగా వ్యాయాయం చేయడం వల్లనే సిద్ధార్థ్ గుండెపోటు బారిన పడ్డాడు అంటున్నారు వైద్యులు. సాధారణంగా ప్రతి మనిషికి 30-45 నిమిషాల వ్యాయామం చాలు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు గంటల తరబడి జిమ్కే పరిమితం అవుతారు. సిద్ధార్థ్ కూడా రోజు 3 గంటల పాటు వ్యాయామాలు చేసేవాడు. ఇంత అతి వ్యాయామం వద్దని డాక్టర్లు గతంలోనే సిద్ధార్థ్కు సూచించినప్పటికి అతడు వైద్యుల మాట వినలేదు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. (చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?) అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం అతిగా వ్యాయామం చేయడం వల్ల సడెన్ కార్డియాక్ అరెస్ట్, సడెన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశం పెరుగుతుంది వ్యాయామం చేసే సమయం మధ్యస్థంగా ఉండటం వల్ల ఫిట్గా ఉండటమే కాక మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని సూచించింది. ఈ క్రమంలో అతిగా వ్యాయామాలు చేసే వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. అలానే వ్యాయామం ఫిట్నెస్ యాప్ల మీద, సొంత నిర్ణయాల మీద ఆధారపడి కాకుండా.. నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిదని సూచిస్తున్నారు. -
Chris Cairns: కోలుకుంటున్న మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ క్రిస్ కెయిన్స్ కోలుకుంటున్నాడు. ఆరోటిక్ డిసెక్షన్తో బాధపడుతున్న కెయిన్స్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్న కెయిన్స్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యలు పేర్కొన్నారు. ప్రస్తుతం కెయిన్స్కు వెంటిలేటర్ను తొలగించామని.. త్వరలోనే రూంకు తరలిస్తామని వైద్యులు తెలిపారు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్రౌండర్గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు దిగేవాడు. చదవండి: Chris Cairns: వెంటిలేటర్పై న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ -
ఒక్కసారిగా పేలిన బ్లూటూత్ హెడ్ఫోన్.. ఆగిన గుండె
జైపూర్: వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్ ఒక్కసారిగా పేలి ఆ శబ్ధానికి ఓ బాలుడు గుండె ఆగిపోయింది. ఆ పేలుడుతో బాలుడు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. గుండెపోటుతో బాలుడు మృతి చెందడం దేశంలోనే మొదటిగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన రాజస్థాన్లోని జైపూర్ జిల్లా చౌము మండలం ఉదయ్పుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేశ్ శుక్రవారం ఒకరితో బ్లూటూత్ హెడ్ఫోన్ వేసుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా బ్లూటూత్ పేలిపోయింది. క్షణకాలంలో జరిగిన ఘటనతో బాలుడి గుండె ఆగిపోయి ((కార్డియాక్ అరెస్ట్) అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు సిద్ధివినాయక ఆస్పత్రికి తరలించారు. బ్లూటూత్ పేలడంతో చెవులకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు డాక్టర్ ఎన్ఎన్ రుండ్లా తెలిపారు. ‘గుండెపోటుతో బాలుడు మృతి చెందడం బహుశా దేశంలో ఇదే మొదటి కేసు అయ్యింటుంది’ అని వైద్యులు రుండ్లా వివరించారు. అయితే ఇలాంటి ఘటనే రెండు నెలల కిందట ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగింది. జూన్ నెలలో 38 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి బ్లూటూత్ పేలి మృతి చెందాడు. బ్లూటూత్ పరికరం పేలుడుతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ పేలిన బ్లూటూత్ పరికరం ఏ కంపెనీదో? ఎందుకు పేలుతుందో అనే వివరాలు తెలియడం లేదు. అకస్మాత్తుగా వీటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు బ్లూటూత్ వినియోగించేందుకు భయపడుతున్నారు. -
సెమీస్ హీరో యశపాల్ శర్మ కన్నుమూత
-
భారత మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ కన్నుమూత
ఢిల్లీ: భారత క్రికెట్ ప్రస్థానాన్ని మలుపు తిప్పిన 1983 వరల్డ్ కప్ విజయంలో తనదైన భూమిక పోషించిన మిడిలార్డర్ బ్యాట్స్మన్ యశ్పాల్ శర్మ మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగొచ్చిన అనంతరం యశ్పాల్ తీవ్ర గుండె నొప్పితో కుప్పకూలినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 1978లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన యశ్పాల్ 1985లో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఫస్ట్క్లాస్ కెరీర్ రెండు దశాబ్దాల పాటు సాగింది. యశ్పాల్ 37 టెస్టుల్లో 33.45 సగటుతో 1,606 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 42 వన్డేల్లో 28.48 సగటుతో 4 అర్ధసెంచరీలు సహా 883 పరుగులు సాధించారు. తన 40 వన్డే ఇన్నింగ్స్లలో ఆయన ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం. కోచ్గా... సెలక్టర్గా... ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచ్గా, కామెంటేటర్గా, క్రికెట్ పరిపాలకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. దేశవాళీ క్రికెట్లో యశ్పాల్ అంపైర్గా, మ్యాచ్ రిఫరీగా కూడా పని చేశారు. యశ్పాల్ రెండు పర్యాయాలు సెలక్టర్గా వ్యవహరించారు. 2004 నుంచి 2005 మధ్య కాలంలో పని చేసినప్పుడు ధోనిని ఆటగాడిగా ఎంపిక చేసిన బృందంలో ఉన్న ఆయన... 2008 నుంచి 2011 వరకు సెలక్టర్గా ఉన్నారు. ధోని సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టును ఎంపిక చేసిన కమిటీలోనూ యశ్పాల్ సభ్యుడు కావడం విశేషం. కపిల్ కన్నీళ్లపర్యంతం... మాజీ సహచరుడు యశ్పాల్ మరణవార్త విన్న వెంటనే 1983 వరల్డ్కప్ టీమ్ సభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల జూన్ 25న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరంతా కలుసుకున్నారు. యశ్పాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. యశ్పాల్ మృతి గురించి విన్న కపిల్దేవ్ కన్నీళ్లపర్యంతమయ్యారు. స్పందన కోరగా ‘నాకు మాటలు రావడం లేదు’ అని జవాబి చ్చారు. ‘మా సహచరుల్లో అత్యంత ఫిట్గా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి యశ్పాల్. ఇలా జరగడం బాధాకరం’ అని వెంగ్సర్కార్ వ్యాఖ్యా నించగా... తమ ‘83’ కుటుంబంలో ఒకరిని కోల్పోయామని బల్వీందర్ సంధూ అన్నారు. పరిమిత ‘యశస్సు’ మార్షల్, హోల్డింగ్, రాబర్ట్స్, గార్నర్... ఇలాంటి భీకర పేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 1983 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్పై యశ్పాల్ 89 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన భారత్ను గెలిపించగా, విండీస్కు వరల్డ్ కప్ చరిత్రలోనే అది తొలి ఓటమి. కపిల్, గావస్కర్, వెంగ్సర్కార్, శ్రీకాంత్, అమర్నాథ్వంటి సహచరులతో పోలిస్తే యశ్పాల్కు వరల్డ్ కప్ విజయం ద్వారా తగినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో అతను చేసిన 61 పరుగులు ఇన్నింగ్స్ అద్భుతం. ఈ మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో నాటి అభిమానులు దీనిని ఎప్పటికీ మరచిపోలేరు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్గా మలచిన తీరు అద్భుతం. అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు, సగటు చూస్తే అతను ఒక సాధారణ ఆటగాడిగానే కనిపించవచ్చుగానీ యశ్పాల్లాంటి ఆటగాళ్ల ప్రత్యే కతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలు పనికి రావు. భారత క్రికెట్పై తనదైన ముద్ర వేసిన విశిష్ట ఆటగాడిగా యశ్పాల్ ఎప్పటికీ నిలిచిపోతారు. యశ్పాల్ శర్మ కెరీర్లో ముఖ్య విషయాలు: ►1954 ఆగస్టు 11న పంజాబ్లోని లుధియానాలో జననం ►1978 అక్టోబర్ 13న పాకిస్తాన్తో వన్డే ద్వారా అరంగేట్రం.. మరుసటి ఏడాది 1979లో డిసెంబర్ 2న ఇంగ్లండ్తో మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లో ఎంట్రీ ►1970,80ల కాలంలో భారత మిడిలార్డర్ క్రికెట్లో ముఖ్యపాత్ర ►1980-81లో అడిలైడ్ వేదికగా ఆసీస్తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణింపు ►యశ్పాల్ శర్మ ఒక టెస్టు మ్యాచ్లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు. ► విండీస్ దిగ్గజం మాల్కమ్ మార్షల్ వేసిన బంతి యశ్పాల్ శర్మ తలకు బలంగా తగలడంతో 1985లోనే అర్థంతరంగా ఆటకు వీడ్కోలు Very Very Sad News to Share…World Cup Winner @cricyashpal Sh Yashpal Sharma ji had a major Cardiac Arrest in the morning today…Rest In Peace Champion player @indiatvnews — Samip Rajguru (@samiprajguru) July 13, 2021 -
నా రాజీ.. గుండె బద్ధలవుతోంది: మందిర భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ నటి మందిరా బేడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త రాజ్ కౌశల్ను గుర్తుచేసుకుని ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. రాజ్ కౌశల్తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న పాత ఫొటోను పంచుకున్న ఆమె... ‘‘నా రాజీ.. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక. నా హృదయం ముక్కలైంది’’ అని ఎమోషనల్ అయ్యారు. కాగా సినీ దర్శకుడు రాజ్ కౌశల్(49) జూన్ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరానే స్వయంగా భర్త అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పు కుండ చేతబట్టి తానే అంతిమ సంస్కారాలు చేసి తనలోని సగ భాగానికి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ఆమెపై విద్వేషపు విషం చిమ్మారు. కొడుకు ఉండగా, మందిర ఇలా ఎందుకు చేసిందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు మాత్రం మందిరకు మద్దతుగా నిలబడి ట్రోల్స్ను తిప్పికొట్టారు. ఇక మందిర- రాజ్ కౌశల్ది ప్రేమ వివాహం. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో కొడుకు వీర్ వారి జీవితాల్లోకి కొత్త సంతోషాలు తీసుకొచ్చాడు. అనంతరం ఈ జంట తార అనే బాలికను దత్తత తీసుకున్నారు కూడా. మందిర యాంకర్గా, నటిగా రాణిస్తుండగా, మై బ్రదర్ నిఖిల్, ప్యార్ మే కభీ కభీ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ కౌశల్.. సుమారు 800కు పైగా యాడ్స్ను ప్రొడ్యూస్ చేశారు. -
కరోనాతో ప్రముఖ జర్నలిస్టు కన్నుమూత: అమిత్షా సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్టును బలితీసుకుంది. ఆజ్ తక్ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానాకు ఇటీవల కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గురువారం మెట్రో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సర్దానా అకాలమరణంపై పలువురు జర్నలిస్టు పెద్దలు, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రోహిత్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఇంకా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష సిసోడియా, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా రోహిత్ మరణం షాక్కు గురిచేసిందంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కరోనా మహమ్మారి తన సన్నిహితుడిని బలి తీసుకుంటుదని ఊహించలేదంటూ జీ న్యూస్కు చెందిన సుధీర్ చౌదరి సంతాపం తెలిపారు. రోహిత్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని నష్టమని మరో సీనియర్ జర్నలిస్ట్ భూపేంద్ర చౌబే వ్యాఖ్యానించారు. స్వయంగా ఆయన కోవిడ్తో బాధ పడుతున్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో ఏ మాత్రం వెనుకాడలేదని తోటి జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. కాగా 2000 జీ న్యూస్తో కరియర్ను ఆరంభించిన సర్దానా ఆ తరువాత సర్దానా 2017లో ఆజ్ తక్లో చేరారు. జీ న్యూస్లో 'తాల్ తోక్ కే' , ఆజ్ తక్లో "దంగల్" అనే చర్చా కార్యక్రమాలతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. 2018 లో గణేష్ విద్యార్తి పురస్కార్ అవార్డు గెల్చుకున్నారు. టీవీ న్యూస్ జర్నలిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో రోహిత్ ఒకరు. (రెమిడెసివర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం) अब से थोड़ी पहले @capt_ivane का फ़ोन आया।उसने जो कहा सुनकर मेरे हाथ काँपने लगे।हमारे मित्र और सहयोगी रोहित सरदाना की मृत्यु की ख़बर थी।ये वाइरस हमारे इतने क़रीब से किसी को उठा ले जाएगा ये कल्पना नहीं की थी।इसके लिए मैं तैयार नहीं था।ये भगवान की नाइंसाफ़ी है.. ॐ शान्ति — Sudhir Chaudhary (@sudhirchaudhary) April 30, 2021 Pained to learn about Shri Rohit Sardana ji’s untimely demise. In him, the nation has lost a brave journalist who always stood up for unbiased and fair reporting. May God give his family the strength to bear this tragic loss. My deepest condolences to his family and followers. — Amit Shah (@AmitShah) April 30, 2021 More terrible news friends. Well known Tv news anchor Rohit Sardana has passed away. Had a heart attack this morning. Deep condolences to his family. RIP — Rajdeep Sardesai (@sardesairajdeep) April 30, 2021 -
మారుతి మాజీ ఎండీ కన్నుమూత: ఇండస్ట్రీ దిగ్భ్రాంతి
సాక్షి,ముంబై: ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నోషన్ వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ (78) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 1993-2007 కాలంలోఖత్తర్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఖత్తర్ పనిచేశారు. తరువాత 1999లో తొలుత ప్రభుత్వ నామినీగా, అనంతరం మే 2002 లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీ గా పనిచేశారు.ఖత్తర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్ర మల్టీ-బ్రాండ్ పాన్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ను కార్నేషన్ ఆటోను 2008 లో ప్రారంభించారు. దీనికి ముందు దాదాపు 37 సంవత్సరాల పాటు ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. ఖత్తర్ మరణ వార్తను మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ ధృవీకరించారు. ఆయన హఠాన్మరణంవ్యక్తిగతంగా తనకు తీరని నష్టమని వ్యాఖ్యానించారురు. ఖత్తర్ అకాలమరణంటో ఆటో పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం.. కాంపౌండింగ్ -
విషాదం: మాజీ క్రికెటర్ అశ్విన్ యాదవ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు ఐపీఎల్ సంబరం జరుగుతుండగా హైదరాబాద్ రంజీ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) శనివారం గుండెపోటుతో కన్ను మూశారు. అశ్విన్ అకాలమరణంపై పలువురు క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. అశ్విన్కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. అశ్విన్ యాదవ్ మరణ వార్త తనను దిగ్భ్రాంతి గురి చేసిందని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ట్వీట్ చేశారు. సరదాగా ఉండే అశ్విన్ ఇక లేడంటే నమ్మలేకపోతున్నానంటూ మాజీ రంజీ ఆఫ్ స్పిన్నర్, విశాల్ శర్మ సంతాపం తెలిపారు. అశ్విన్ టీమ్ మ్యాన్ అని ఎపుడు జట్టు విజయం కోసం ఆరాటపడేవాడని గుర్తు చేసుకున్నారు. స్థానిక మ్యాచ్లలో ఎస్బిహెచ్ తరఫున అశ్విన్కు కెప్టెన్గా వ్యవహరించిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ డేనియల్ మనోహర్ మాట్లాడుతూ అశ్విన్ ఇంత చిన్న వయసులో మనకి దూరంకావడం విచారకరమన్నారు. ఫాస్ట్ బౌలర్గా టీమ్కు అండగా ఉండేవాడు. ఫిట్నెస్కు ప్రాణమిచ్చే అశ్విన్కు గుండెపోటు రావడం షాకింగ్ ఉందన్నారు. అశ్విన్ తన ఆటతో ఎపుడూ ఆకట్టుకునేవాడని, చిన్న వయస్సు నుండే వికెట్లు తీసే సామర్ధ్యం కలిగి ఉన్నాడని ఆండ్రూస్ స్కూల్ కోచ్గా పనిచేసిన నోయెల్ కార్ సంతాపం తెలిపారు. 2002లో సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో రాష్ట్ర అండర్ -14 జట్టుకు 25 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు నిలిచాడంటూ నివాళులర్పించారు. కాగా కరియర్లో 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో 2007 లో మొహాలిలో పంజాబ్తో రంజీ ట్రోఫీకి అరంగేట్రం చేశాడు. 2008-09 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీపై 52 పరుగులకు 6 వికెట్లు తీశాడు. యాదవ్ చివరి సారిగా 2009లో ముంబైతో తన రంజీ మ్యాచ్ ఆడాడు. రెండు టీ 20 మ్యాచ్లు కూడా ఆడాడు. Devastated to hear the news of #Ashwinyadav passing away. A Very jovial and fun loving guy, team man to the core, punched way above his skills as a fast bowler. I pray to God for strength to his family. #gonetooearly #OmShanti You will be missed. pic.twitter.com/0gIuOKZr6L — R SRIDHAR (@coach_rsridhar) April 24, 2021 -
ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు, పరిస్థితి విషమం
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్తో బాధపడుతున్న వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపింది. అయితే వ్యాక్సిన్కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది కాగా చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘బిడ్డా... లే నాన్న... నువ్వు తప్ప మాకు దిక్కెవరే..’
అనంతపురం విద్య: ఒక్కగానొక్క కొడుకు.. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నా.. ఏనాడూ తమ బిడ్డకు తక్కువ చేయలేదు. తమ కష్టం బిడ్డకు రాకూడదనుకున్నారు. ఈ క్రమంలోనే తమ స్థాయికి మించి ఉన్నత విద్యాబద్ధులు చెప్పించసాగారు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడతాడనుకుంటున్న తరుణంలో విధి వక్రీకరించింది. తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజుల క్రితం తమతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపిన బిడ్డ కంటికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడనే విషయం తెలియగానే ఈ నిరుపేద దంపతుల గుండె చెరువైంది. ‘అమ్మా.. ఇంకొక్క సంవత్సరం.. ఇంజినీరింగ్ పూర్తవుతుంది. తర్వాత ఉద్యోగం చేసి మీ ఇబ్బందులన్నీ తీరుస్తా..’ అన్న కుమారుడి చివరి మాటలు చెవుల్లో మారుమోగుతుండగా.. ‘బిడ్డా... లే నాన్న... నీవు తప్ప మాకు దిక్కెవరే.. ఉద్యోగం చేస్తానంటివి కదయ్యా... లే అయ్యా.. మా కంటి ముందు నీవుంటే చాలయ్యా’ అన్న తల్లిదండ్రులు రోదనలు విన్న విద్యార్థి లోకం కన్నీటి పర్యంతమైంది. ఏం జరిగిందంటే.. అనంతపురం రూరల్ మండలం నరసనాయకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, సత్యమ్మ దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమారుడు బి.అబ్రçహాం. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న మల్లికార్జున దంపతులు... ఈ కష్టాలు తమ బిడ్డకు రాకూడదని భావించారు. ఈ క్రమంలోనే తమ శక్తికి మించి విద్యాబుద్ధులు చెప్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం అబ్రçహాం... ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉగాది పండుగకు ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి బుధవారం రాత్రి తిరిగి వర్సిటీకి అబ్రహాం చేరుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న బి. అబ్రహాం (20) గురువారం ఉదయం జిమ్లో వర్క్అవుట్ ముగించుకుని హాస్టల్కు చేరుకున్నాడు. టిఫెన్ చేసిన తర్వాత ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఎస్కేయూ హెల్త్ సెంటర్కు వెళ్లాడు. అక్కడ ఈసీజీ తీస్తుండగానే భరించలేని నొప్పితో విలవిల్లాడుతూ కన్నుమూశాడు. తీవ్రమైన గుండెపోటుతో అతను మరణించినట్లు హెల్త్ సెంటర్ వైద్యులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నిరుపేద తల్లిదండ్రులు ఆగమేఘాలపై హెల్త్ సెంటర్ వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ బిడ్డ జ్ఞాపకాలను, అతని చివరి మాటలను గుర్తు చేసుకుంటూ వారు రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ.. -
ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం
సాక్షి, చెన్నై: తమిళ దర్శకుడు జననాథన్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జననాథన్ సోదరి లక్ష్మి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ (మార్చి ,14న) అకాల మరణంతో షాక్లో ఉన్న వారి కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది. (ప్రముఖ దర్శకుడు కన్నుమూత) లక్ష్మి హఠాన్మరణంపై మూవీ ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించడం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా 'లాభం' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జననాథన్ తీవ్ర అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే. -
విషాదం: కోతుల భయంతో గుండె ఆగింది
సాక్షి, ధర్మపురి: కోతులు దాడి చేస్తాయేమోనన్న భయంతో ఓ మహిళ గుండె ఆగి మరణించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బట్టపల్లి మోహన్ ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం కుటుంబంతో ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మోహన్ కూతురు రేవతి (34)కి వివాహం అయినప్పటికీ ధర్మారంలో తండ్రి వద్దనే ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి రేవతి బయటకు వస్తున్న సమయంలో గుంపుగా వచి్చన కోతులు పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసిన రేవతి భయంతో అక్కడే కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు తెలిపారు. కాగా, రేవతికి ముగ్గురు పిల్లలున్నారు. చదవండి: కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్ -
అధిక బరువు: మృత్యుమార్గంలో పయనించడమే
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఉండాల్సిన దాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయణించడమేనని యూఎస్కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో సుమారు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు మూడు లక్షలమందికి పైగా సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: కూల్డ్రింక్స్ తాగితే.. శరీరం చల్లబడుతుందా? -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ కేరళ సంగీత దర్శకుడు ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా నిన్న( గురు వారం) చెన్నైలో తుది శ్వాస విడిచారు. థామస్ మరణంపై కేరళ సాంస్కృతిక మంత్రి ఎకె బాలన్ సంతాపం ప్రకటించారు.సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన ఆయన జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆయన లేని లోటు తీరనిది అంటూమంత్రి ఎకె బాలన్ ఫేస్బుక్లో కుటుంబ సభ్యులను సానుభూతి తెలిపారు. ఇంకా పలు సినీరంగ ప్రముఖులు థామస్ అకాలమృతిపై విచారం వ్యక్తం చేశారు. మలయాళ ప్రముఖ దర్శకుడు కెజి జార్జ్ చిత్రం మన్ను ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన థామస్ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా ఆడమింటే మకాన్ అబూకు ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సలీం అహ్మద్ రచించిన 2011 చిత్రం ఆడమింటే మకాన్ అబూ, ఉత్తమ నేపథ్య స్కోర్తో సహా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకోవడమేకాదు ఆస్కార్కు కూడా నామినేట్ అయింది. వీటితోపాటు భావం (2002), మార్గం (2003), సంచరం అండ్ ఒరిడామ్ (2004) అనే నాలుగు చిత్రాలకు ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు. ఇంకా కుట్టి స్రాంక్ (2009), సంచరం (2004), షాజీ ఎన్ కరుణ్ స్వాహం(1994), సతీష్ మీనన్ భావం (2002) కుంజనంతంతే కడా (2013) లాంటి సినమాలకు సంగీతం సమకూర్చారు. ఇస్సాక్ థామస్ మాజీ ఎంపీ జార్జ్ థామస్ కుమారుడు. కాగా కేరళ కొట్టాయం జిల్లా పాలాలో జన్మించిన ఇస్సాక్ థామస్ పూణేలోని ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టిఐఐ)లో చిత్ర నిర్మాణం, స్క్రీన్ ప్లే చదివారు. అనంతరం కొడైకెనాల్లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో పియానోలో సిక్త్ గ్రేడ్ సాధించారు. -
పాపం పాప.. విమానం గాల్లో ఉండగా..
నాగ్పూర్ : గో ఏయిర్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలిక కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించింది. మంగళవారం లక్నో నుంచి ముంబై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్, శేఖర్ ఖత్, సిద్దార్ద్ నగర్కు చెందిన ఆయుషి పున్వసి ప్రజాపతి అనే ఏడేళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తండ్రి ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి గో ఏయిర్ విమానాన్ని ఎక్కారు. అయితే విమానం గాల్లో ఉండగా బాలిక కార్డియాక్ అరెస్ట్కు గురైంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా విమానాన్ని ఆపి బాలికను నాగ్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ( ఆమెను చంపాలనుకోలేదు.. కల కన్నాను ) పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. విమానం ఎత్తులో ఎగరటం కారణంగానే ఆయుషి కార్డియాక్ అరెస్ట్కు గురైనట్లు అభిప్రాయపడ్డారు. దీనిపై గో ఏయిర్ అధికారులు మాట్లాడుతూ.. ‘‘ పాప రక్తహీనతతో బాధపడుతోంది. తండ్రి ఆ విషయం మాకు చెప్పలేదు. చెప్పుంటే విమానం ఎక్కనిచ్చే వాళ్లం కాదు. 8-10గ్రాముల కంటే తక్కవ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్లు విమానప్రయాణానికి అనర్హులు. ఆ పాపకు కేవలం 2.5 హిమోగ్లోబిన్ మాత్రమే ఉంది. దానికి చికిత్స చేయించుకోవటానికే వారు ముంబై వెళుతున్నారు’’ అని తెలిపారు. -
'దాదా.. నువ్వు త్వరగా కోలుకోవాలి'
కోల్కత : టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం తన ఇంట్లోని జిమ్లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన విలవిల్లాడిపోయారు. దీంతో సౌరవ్ను హుటాహుటిన ఉడ్ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం డాక్టర్ సరోజ్ మోండల్ పర్యవేక్షణలో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా సౌరవ్కు ప్రైమరీ యాంజియో ప్లాస్టీ పూర్తి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దాదా అనారోగ్యం పట్ల పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గంగూలీ ఆరోగ్యంపై స్పందించారు. గంగూలీ మీరు త్వరగా కోలుకోవాలని దేవుడిని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంగూలీకి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలిస్తే బాగుంటుందని ఆయన కుటుంబసభ్యులకు సూచన చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందిస్తూ.. 'దాదా మీకు ఏం కాదు.. త్వరగా కోలుకొని ఇంటికి రావాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ' ట్వీట్ చేశాడు. 'నా మిత్రుడు.. మా దాదా సౌరవ్ గంగూలీ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని ఆ దేవుడిని కోరుతున్నా 'అంటూ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 'నీకు గుండెపోటు వచ్చిందన్న వార్త వినగానే నా గుండె అదిరింది. దేవుడి అండ ఉన్నంత వరకు మీకు ఏం కాదు.. గెట్ వెల్ సూన్ దాదా అంటూ' టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. పాక్ మాజీ క్రికెటర్ వకార్ యునీస్ కూడా గంగూలీ అనారోగ్యంపై స్పందించాడు. 'దాదా.. నువ్వు వ్యక్తిగతంగా చాలా ధృడంగా ఉంటావు.. మీరు త్వరగా కోలుకోవాలి 'అంటూ ట్వీట్ చేశాడు. కాగా 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. (చదవండి: వైరల్ : సెకన్ల వ్యవధిలో సూపర్ రనౌట్) Get well soon, Dada 🙏 pic.twitter.com/3383F3B1M9 — Mumbai Indians (@mipaltan) January 2, 2021 As per reports, BCCI President @SGanguly99 has been admitted to Woodlands Hospital, Kolkata. Here's wishing Dada a speedy recovery 🙌🏻 — Delhi Capitals (@DelhiCapitals) January 2, 2021 Wishing you a speedy recovery Dada @SGanguly99 🙏 — Krunal Pandya (@krunalpandya24) January 2, 2021 -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సాక్షి, ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే (47) గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం ఉదయం పూణేలోని ఆయన నివాసంలో తుది శ్వాస తీసుకున్నారని నరేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. నరేంద్ర హఠాన్మరణంపై మరాఠీ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు తీరనిదంటూ సంతాపం ప్రకటించింది. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన నరేంద్ర, మరాఠీ చిత్ర పరిశ్రమలో గొప్ప మ్యూజిక్ డైరెక్టరుగా ఎదిగారు. పిల్లలనుంచి పెద్దల దాకా అన్ని వయసుల వారిలో తన సంగీతంతో పాపులర్ అయ్యారు. ‘ఏ పేయింగ్ గోస్ట్’ (2015) లాంటి నాటకాలతోపాటు, డియోల్ బ్యాండ్ (2015), బయోస్కోప్ (2015), ఉబూన్ టు (2017) పుష్పక్ విమాన్, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారీ, ముల్షీ పాట్రన్ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. పూణేకు చెందిన స్టూడియో డాన్ ఇన్ఫోటైన్మెంట్లో డైరెక్టర్గా పనిచేశారు. అంతేకాదు అనేక నాటకాలు, సీరియల్స్, సినిమాలు, జింగిల్స్ ద్వారా సంగీత పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అలాగే జీ గౌరవ్ (ఐదుసార్లు), సహ్యాద్రి సినీ అవార్డు, స్టేట్ డ్రామా అవార్డు (రెండుసార్లు), వి శాంతారామ్ అవార్డు, శ్రీకాంత్ ఠాక్రే అవార్డు, ఎం.ఎ. ఆనర్స్, స్టేట్ ఫిల్మ్ అవార్డలును ఆయన దక్కించుకున్నారు. నరేంద్ర భిడేకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేంద్ర అకాలమరణం సంగీత పరిశ్రమకు తీరని నష్టమని నటుడు ఓంకర్ తట్టే సంతాపం తెలిపారు. భిడేతో కలిసి ఒక శాస్త్రీయ పాటను రికార్డ్ చేయడానికి ఎదురుచూస్తున్నామని, కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడిందని చిత్రనిర్మాత సాగర్ వంజారీ గుర్తు చేసుకున్నారు. ఇక ఎప్పటికీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు ఉండదంటూ వంజారీ విచారం వ్యక్తం చేశారు. -
మసాలా మహాశయ్ ఇక లేరు..
న్యూఢిల్లీ: మసాలా ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఎండీహెచ్ అధినేత, స్పైస్ కింగ్గా పేరొందిన మహాశయ్ ధరమ్పాల్ గులాటీ (97) గురువారం కన్నుమూశారు. మాతా చనన్ దేవీ హాస్పిటల్లో కోవిడ్ సంబంధ చికిత్స పొందుతుండగా, గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాదే ఆయన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గులాటీ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు వెల్లువెత్తాయి. ‘మహాశయన్ ది హట్టి (ఎండీహెచ్) అధినేత శ్రీ ధరమ్పాల్ గులాటీ కన్నుమూయడం విషాదకరం. భారతీయ పరిశ్రమలో ఆయన ఎంతో పేరొందారు. ఆయన చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. శరణార్థిగా వచ్చి.. స్పైస్ కింగ్గా ఎదిగి.. పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి రూ. 1,500 కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేతగా, మసాలా మహారాజాగా ఎదిగిన గులాటీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిల్చారు. గులాటీ 1923 మార్చి 27న సియాల్కోట్లో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) జన్మించారు. అక్కడ గులాటీ తండ్రికి ఎండీహెచ్ పేరిట మసాలా ఉత్పత్తుల దుకాణం ఉండేది. అయితే, దేశ విభజన తర్వాత సియాల్కోట్లోని ఆస్తులు అన్నీ వదిలేసి వారి కుటుంబం భారత్ వచ్చేసింది. ఢిల్లీలో స్థిరపడింది. అంతకుముందు 1933లోనే అయిదో క్లాస్ తర్వాత చదువును పక్కన పెట్టిన గులాటీ పలు ఉద్యోగాలు చేశారు. సబ్బుల ఫ్యాక్టరీలో, ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో, మిల్లుల్లో పనిచేశారు. ఎండీహెచ్ పోర్టల్లోని సమాచారం, ఒకానొక ఇంటర్వ్యూలో గులాటీ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం .. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్లో చేతి లో రూ. 1,500తో ఆయన ఢిల్లీ వచ్చారు. అందులో రూ. 650 వెచ్చించి ఒక గుర్రపు బగ్గీని కొని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, కుతుబ్ రోడ్, కరోల్ బాగ్ తదితర మార్గాల్లో నడిపిస్తూ జీవనం సాగించారు. 1948లో కొత్త మలుపు.. గుర్రపు బగ్గీతో వచ్చే ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, మెల్లమెల్లగా తరలివస్తున్న కుటుంబసభ్యుల పోషణాభారం పెరిగిపోతుండటంతో చెరకు రసం బండి వంటి ఇతర వ్యాపారాలూ గులాటీ ప్రయత్నించారు. కానీ అవేవీ సానుకూలంగా కనిపించకపోవడంతో చివరికి తమ కుటుంబం గతంలో వదిలేసిన మసాలా ఉత్పత్తుల వ్యాపారం వైపు మళ్లీ దృష్టి సారించారు. 1948 అక్టోబర్లో గుర్రపు బగ్గీని అమ్మేసి ఢిల్లీలోని కరోల్ బాగ్లో ఒక చిన్న మసాలా ఉత్పత్తుల షాపు తెరిచారు. అక్కణ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించారు. ఈ క్రమంలో ప్రకటనల్లో ప్రచారకర్తగా కూడా ఆయన కనిపించి .. ఇంటింటికీ సుపరిచితమయ్యారు. ప్రత్యేకంగా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 1959 నుంచి అధికారికంగా ఆయన ఎండీహెచ్ కంపెనీని నెలకొల్పారు. ఎండీహెచ్ ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ చేసే 50కు పైగా మసాలా ఉత్పత్తులను దేశ, విదేశాల్లో విక్రయిస్తోంది. బ్రిటన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 1,000 మందికి పైగా స్టాకిస్టులు, 4 లక్షల మందికి పైగా రిటైల్ డీలర్లు ఉన్నారు. రోజుకు 30 టన్నుల మసాలాలను ప్రాసెస్ చేసే మెషీన్లు ఉన్నాయి. 2017లో రూ. 21 కోట్ల వార్షిక వేతనంతో ఎఫ్ఎంసీజీ రంగంలోనే అత్యధికంగా ప్యాకేజీ పొందిన అధినేతగా గులాటీ నిల్చారు. తన వేతనంలో 90 శాతం భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్కు ఆయన విరాళంగా ఇచ్చేవారు. 250 పడకల ఆస్పత్రి, 20కి పైగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2019లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
వాసన్ హెల్త్ కేర్ ఫౌండర్ కన్నుమూత
సాక్షి, చెన్నై : వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ (51) ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. అరుణ్ మరణవార్తను చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఒమాండురార్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కాగా అరుణ్ దేశవ్యాప్తంగా వాసన్ ఐ కేర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. -
దర్శక నిర్మాత విజయరెడ్డి ఇక లేరు
ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత బి. విజయరెడ్డి (84) శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై, కేకే నగర్లో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై, కన్నమ్మాపేటలోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విజయరెడ్డి 1955లో నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్కు చేరుకున్నారు. దర్శకుడు విఠలాచార్య దృష్టిలో పడ్డారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘మన తుంబిడ హెన్ను అరే’ చిత్రానికి సహాయ ఎడిటర్గా పనిచేశారు. ఆ తర్వాత పలు చిత్రాలకు పని చేసిన విజయరెడ్డి సినిమా రంగంలోని పలు శాఖల గురించి తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చేశారు. 1970లో ‘రంగా మహల్ రహస్య’ అనే కన్నడ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్, విష్ణువర్థ¯Œ వంటి ప్రముఖ నటులతో ఈయన అత్యధిక చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా రాజ్కుమార్ కథానాయకుడిగా ‘మయురా, హుళ్లి హాళినా మేవు’ వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ‘శ్రీనివాసకల్యాణం, భక్త ప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన ఘనత విజయరెడ్డిది. ఆయన కన్నడలోనే 40 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘శ్రీమతి’. ఆ తర్వాత ‘ఏకలవ్య, మా ఇంటి వెలుగు, చలాకీ రాణి కిలాడీ రాజా, మావూరి మొనగాళ్లు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డికి భార్య దమయంతి, కుమారులు త్రినాథ్ రెడ్డి, నాగిరెడ్డి, కుమార్తెలు నాగలక్ష్మి, శ్యామల రుషి ఉన్నారు. విజయరెడ్డి మృతికి దక్షిణ భారత వాణిజ్య మండలి అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్ తదితర చిత్రరంగ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. -
సినీ నిర్మాత కృష్ణకాంత్ గుండెపోటుతో మృతి
సినీ నిర్మాత కృష్ణకాంత్ (52) గుండెపోటుతో బుధవారం సాయంత్రం కన్నుమూశారు. లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థలో మేనేజర్గా పని చేసిన కృష్ణకాంత్ తర్వాత తిరుడా తిరిడి చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. తర్వాత శింబు నటించిన మన్మథుడు,కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి చిత్రాలను నిర్మించారు. ఈయన బుధవారం గుండెపోటుకు గురవడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణకాంత్కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. శింబు, టీ రాజేందర్, దర్శకుడు సుబ్రమణ్యంశివ కృష్ణకాంత్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణకాంత్ భౌతికకాయానికి గురువారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు -
గుంటూరు: నటుడు జయప్రకాశ్రెడ్డికి నివాళులు
-
నటుడు జయప్రకాశ్రెడ్డి కన్నుమూత
సాక్షి, గుంటూరు : టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్రెడ్డి(74) కన్నుమూశారు. గుండెపోటుతో బాత్రూమ్లో కుప్పకూలిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు జయప్రకాశ్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కొరిటెపాడు శ్మశానవాటికలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్రెడ్డి.. రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి... రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్సింగ్, నాయక్, రేసుగుర్రం, మనం, టెంపర్, సరైనోడు తదితర సినిమాల్లో నటించారు. సీనియర్ కథానాయకులతో పాటు యువ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలరించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ ‘అలెగ్జాండర్’(ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్లైన్) పేరుతో ఇటీవల ఓ సినిమాను కూడా నిర్మించారు. జయప్రకాశ్రెడ్డి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయప్రకాశ్రెడ్డి మరణం పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. ఘజియాబాద్లోని తన నివాసంలో ఇవాళ (బుధవారం) ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. రాజీవ్ త్యాగి మరణించాడని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాజీవ్ త్యాగి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. నిజమైన దేశభక్తుడు, బలమైన నేతను కోల్పోయామని తెలిపింది. త్యాగి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించింది. (చదవండి: కేంద్ర మంత్రి యశోనాయక్ శ్రీపాదకు కరోనా) కాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఓ ప్రముఖ వార్తా చానెల్లో ఆయన డిబేట్లో పాల్గొన్నారు. డిబేట్ అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇదిలాఉండగా.. గత అక్టోబర్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్లో మీడియా ఇన్చార్జిగా నియమించారు. త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన కీలకంగా పనిచేశారు. త్యాగి మృతి పట్ల కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షురాలు సోనియా గాంధీ , రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, బీజేపీ నేత సబిత్ పాత్రా, ఎన్సీపీ నేత నవాబ్మాలిక్ ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. (కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ!) -
నిజాలు బయటకు రావట్లేదు: కన్నా ఫణీంద్ర
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుహారిక మృతిలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆమె భర్త కన్నా ఫణీంద్ర సైబరాబాద్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిందని చెబుతున్న సుహరిక మృతిపై అనుమానం ఉందని, కేసు విచారణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ను కోరారు. 2020 మే 29న సుహరిక చనిపోయిన సమయంలో ఉన్న ప్రవీణ్, వివేక్, వివాస్, పవన్లతో పాటు సుహరిక తల్లి సాగరిక కూడా నిజాలు దాస్తున్నారని, వారిని మళ్లీ విచారించి న్యాయం చేయాలని సీపీకి సమర్పించిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. (‘కన్నా’ కోడలు అనుమానాస్పద మృతి) సీబీఐటీ సమీపంలోని ఫామ్ హౌస్లోనే సుహరిక చనిపోయి ఉంటుందని, అది దాచి ఏఐజీ ఆసుపత్రికి ఐదు నిమిషాల వ్యవధిలో చేరే మీనాక్షి బాంబూస్ విల్లా నంబర్ 28లో జరిగినట్టుగా చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఎందుకంటే మెడికో లీగల్ కేసు రికార్డు ప్రకారం 11.30 గంటల ప్రాంతంలోనే అచేతనంలోనే ఉందని, 12.45 గంటల ప్రాంతంలోనే ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారని, 1.13 గంటల ప్రాంతంలో సుహరిక చనిపోయిన విషయాన్ని తనకు చెప్పారన్నారు. సుహరిక తల్లి కూడా తన కూతురి మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రాయదుర్గం పోలీసులు కేసు విచారణ సజావుగా త్వరితగతిన సాగేలా చూడాల’ని కన్నా ఫణీంద్ర కోరారు. -
ఆగిన ఏక్..దో..తీన్
-
బాలీవుడ్లో విషాదం: గుండెపగిలే వార్త
ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత సరోజ్ ఖాన్(72) తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె బాంద్రాలోని గురునానక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆమె మరణం బాలీవుడ్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత) ‘ఉదయం లేవగానే దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ ఇక లేరనే విషాదకర వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యాను. అమె కొరియోగ్రాఫీలో డ్యాన్స్ చేయడం చాలా సులభం. ఎవరితోనైనా డ్యాన్స్ చేయించగలరు. సరోజ్ ఖాన్ మరణంగా సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. అమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘మనందరికి శాశ్వత గుడ్బై చెప్పి వెళ్లిపోయారు సరోజ్ ఖాన్. మనిషి కేవలం శరీరంతోనే కాదు హృదయంతో మరియు ఆత్మతో నృత్యం చేస్తాడు అని నృత్య కళాకారులకు మాత్రమే కాకుండా యావత్ దేశానికి చాలా అందంగా నేర్పించారు. ఆమె మరణం వ్యక్తిగతంతో ఎంతో తీరని లోటు. ఆమె తియ్యటి తిట్లను కూడా మిస్సవుతాను’ అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. ‘ఉదయం లేవవగానే గుండె పగిలిపోయే విషాదకర వార్త విన్నాను. మీ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ముఖ్యంగా మిమ్మల్ని స్పూర్తిగా తీసుకొని కొరియోగ్రాఫర్లుగా మారిన నా లాంటి ఎంతో మందికి ఇది ఎంతో విషాదకర వార్త. మీతో కలిసి డ్యాన్స్ చేయడం, కొరియోగ్రాఫీలో డ్యాన్స్ చేయడం, మీతో కలిసి కొరియోగ్రాఫర్గా పనిచేసిన క్షణాల మరిచిపోలేనివి. డ్యాన్స్పై మీకున్న ప్రేమ, అభిరుచి, ప్రతీ పాటకు మీరు కొరియోగ్రాఫీ చేసే విధానం ఎంతో మందికి స్పూర్తి. ఇలాంటి విషయాలు మాకు ఎన్నో నేర్పించినందుకు ధన్యవాదాలు. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచిపోతారు. సరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘దిగ్గజ కొరియోగ్రాఫర్, మూడు సార్లు జాతీయ అవార్డు గ్రహీత సరోజ్ ఖాన్ (72) మరణ వార్త విని షాక్కు గురయ్యాను. ఆమె కొరియోగ్రాఫీ చేసిన 2000కు పైగా పాటలు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ విషాద సమయంలో సరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని సరోజ్ ఖాన్ మృతిపట్ల మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. डान्स की मल्लिका #सरोजखान जी अलविदा।आपने कलाकारों को ही नहीं बल्कि पूरे हिन्दुस्तान को बहुत ख़ूबसूरती से सिखाया कि “इन्सान शरीर से नहीं, दिल और आत्मा से नाचता है”।आपके जाने से नृत्य की एक लय डगमगा जाएगी। मैं पर्सनली ना सिर्फ़ आपको बल्कि आपकी मीठी डांट को भी बहुत मिस करूँगा।🙏😥 — Anupam Kher (@AnupamPKher) July 3, 2020 Woke up to the sad news that legendary choreographer #SarojKhan ji is no more. She made dance look easy almost like anybody can dance, a huge loss for the industry. May her soul rest in peace 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) July 3, 2020 -
కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత
-
ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత
సాక్షి, ముంబై: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. గత నెల (జూన్) 20న శ్వాసకోశ సమస్య కారణంగా ఖాన్ ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్గా తేలింది. పరిస్థితి మెరుగుకావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. సరోజ్ ఖాన్ హఠాన్మరణం బాలీవుడ్లో విషాదాన్ని నింపింది. నాలుగు దశాబ్దాల కెరీర్లో, దాదాపు 200కు పైగా సినిమాలకు 2 వేలకు పైగా పాటలకు కొరియోగ్రాఫ్ చేసిన ఘనత ఖాన్ సొంతం. దివంగత నటి శ్రీదేవి సూపర్ హిట్ మూవీ నాగిని, మిస్టర్ ఇండియాతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ లోని డోలా రే డోలా, మాధురి దీక్షిత్-నటించిన తేజాబ్ నుండి ఏక్ దో టీన్, 2007లో జబ్ వి మెట్ నుండి యే ఇష్క్ హాయేతో సహా ఎన్నో మరపురాని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. మూడుసార్లు జాతీయ అవార్డులను ఖాన్ గెల్చుకున్నారు. 1948 నవంబరు 22న సరోజ్ ఖాన్ జన్మించారు. బాలీవుడ్ మాస్టర్జీగా పాపులర్ అయిన సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్ . ఆమెకు భర్త సోహన్ లాల్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
‘కోవిడ్-19 ఖాతాలో చేరని మరణాలు’
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మరణాల్లో స్పష్టత ఉండటం లేదన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కోవిడ్-19 పాజిటివ్గా తేలిన ఓ ట్రక్ డ్రైవర్ (70) మరణించగా, డెత్ సర్టిఫికెట్లో మాత్రం మరణానికి దారితీసిన కారణం గుండెపోటుగా పేర్కొన్నారు. ఢిల్లీలోని ఖజౌరి ప్రాంతానికి చెందిన ట్రక్ డ్రైవర్ మే 4న మరణించగా, మే 2న రాంమనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి అతడికి కరోనా పాజిటివ్గా నివేదిక వచ్చింది. అయితే రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వర్గాలు ఆయన డెత్ సర్టిఫికెట్లో మరణానికి కరోనా వైరస్ను కారణంగా చూపలేదు. కార్డియోపల్మనరీ అరెస్ట్ కారణంగా మరణించాడని మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకినా దాని గురించి ఆస్పత్రి వర్గాలు డెత్ సర్టిఫికెట్లో చూపలేదు. మరోవైపు బాధితుడు హిమాచల్ ప్రదేశ్లోనూ ట్రక్కులు నడిపే క్రమంలో 2008లో హెచ్ఐవీ పాజిటివ్గా తేలినట్టు వెల్లడైంది. ఇక కరోనా వైరస్ సమాచారంలో ఢిల్లీ ప్రభుత్వం గోప్యత పాటిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ఇక ఢిల్లీలో కరోనా వైరస్తో ఇప్పటివరకూ 129 మంది మరణించగా, పాజిటివ్ కేసుల సంఖ్య 9,333కు పెరిగింది. చదవండి : బ్యాంకులకు తాకిన కరోనా -
మాజీ సీఎంకు గుండెపోటు.. పరిస్థితి విషమం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను స్థానిక శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా 1946లో జన్మించిన అజిత్ జోగి భోపాల్లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయన.. కొన్నాళ్లపాటు రాయ్పూర్ నిట్లో లెక్చరర్గా పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి.. ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి చరిత్రలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో 2016లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీని స్థాపించారు. ఇక అజిత్ జోగి తర్వాత బీజేపీ నేత రమణ్ సింగ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి.. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2018లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. -
బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో ఆకస్మిక మృతి
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈవో రుద్ర తేజ్ సింగ్ (46) సోమవారం ఉదయం హఠాత్తుగా కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుతో రావడంతో ఆయన మృతి చెందారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారతదేశం అంతటా డీలర్ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తున్న సమయంలో ఆయన మరణం తమకు తీరని లోటని సంస్థ తెలిపింది.ఈ కష్ట కాలంలో కుటుంబంతోపాటు సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. స్ఫూర్తిదాయకమైన , మానవత్వమున్న నాయకుడిగా రుద్ర నిలిచిపోతారని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బీఎండబ్ల్యూ ఇండియా యాజమాన్యం, సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగి పోయారు. 1996లో యూపీలో చిన్న ఏరియా సేల్స్ మేనేజర్గా జీవితం ప్రారంభించిన రుద్ర తేజ్ సింగ్ క్రమంగా ఎదుగుతూ విజయ పథాన్ని నిర్మించుకున్నారు. 2019 ఆగస్టు 1 ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా ఎంపికైన రుద్ర బీఎండబ్ల్యూ సంస్థకు నాయకత్వాన్ని చేపట్టిన మొదటి భారతీయుడు. అంతకు ముందు రాయల్ ఎన్ఫీల్డ్లో గ్లోబల్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవాన్ని సొంతం చేసుకున్న రుద్ర ప్రతాప్ ఆటోమోటివ్, నాన్-ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక నాయకత్వ పదవులను చేపట్టి విజయం సాధించారు. -
దుబాయ్లో భారత వ్యాపారి హఠాన్మరణం..
దుబాయ్ : నూతన సంవత్సరంలో భార్యతో కలిసి విహారయాత్రగా దుబాయ్కు వెళ్లిన పంజాబ్కు చెందిన వ్యాపారవేత్త నేమ్చంద్ జైన్ (61) గుండెపోటుతో తాను బసచేసిన హోటల్లోనే మరణించారు. భారత్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మందితో కూడిన జైన్ మతస్తులతో నేమ్చంద్ ఈనెల2న తన భార్యతో కలిసి దుబాయ్కు వెళ్లారు. తాము బసచేసిన హోటల్లో ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా తీవ్ర అలసటకు లోనైన నేమ్చంద్ ఆ విషయం భార్యకు చెప్పగా రూంకు వెళ్లి సేదతీరుదామని ఆయనను తీసుకువెళ్లారు. హోటల్ మెట్ల వరకూ చేరిన కొద్దిసేపటికే ఆయన కుప్పకూలారు. వైద్య బృందం అక్కడికి చేరుకుని చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన మరణించారని టూర్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు సునీల్ జైన్ తెలిపారు. బుధవారం తన 62వ పుట్టిన రోజు భారత్లో జరుపుకోవాలని రిటన్ ఫ్లైట్ బుక్ చేసుకున్న విమానంలోనే నేమ్చంద్ భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తమతో పాటు ఉత్సాహంగా దుబాయ్లో గడిపేందుకు వచ్చిన జైన్ మృతి పట్ల బృందం సభ్యులు తీవ్రంగా కలత చెందారు. -
ఢిల్లీ పర్యటనలో డీజీపీ ఆకస్మిక మృతి
న్యూఢిల్లీ : గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందినట్లు ఐజీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. డీజీపీ నందా ఆకస్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవా డీజీపీగా నందా బాధ్యతలు చేపట్టారు. 1988లో ఐపీఎస్ అధికారిగా చేరిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు. కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ లభించాయి. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి అనంతరం సోషియాలజీలో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా ఐపీఎస్ అధికారిణే. పుదుచ్చేరి డీజీపీగా ఆమె పని చేశారు. డీజీపీగా బాధ్యతలను స్వీకరించక ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆమె సేవలందించారు. -
రూ. 90 లక్షలు చేజారడంతో ఆగిన గుండె..
ముంబై : పీఎంసీ బ్యాంక్ స్కామ్ ఖాతాదారులు, డిపాజిట్దారుల ఉసురు తీస్తోంది. పీఎంసీ స్కామ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని ఇంటికి తిరిగివచ్చిన సంజయ్ గులాటీ అనే వ్యక్తి గుండె పోటుకు గురై మరణించిన ఘటన వెలుగుచూసింది. ముంబైలోని ఓషివర ప్రాంతానికి చెందని తపోర్వాలా గార్డెన్స్లో నివసించే సంజయ్ గులాటీకి పీఎంసీ బ్యాంక్ ఓషివర బ్రాంచ్లో రూ.90 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. సంజయ్ను దురదృష్టం వెంటాడుతోంది. మూతపడిన జెట్ ఎయిర్వేస్లో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన సంజయ్ను పీఎంసీ బ్యాంక్ స్కామ్ మరింత విచారానికి లోనుచేసింది. పీఎంసీ డిపాజిటర్ల విత్డ్రాయల్ పరిమితిపై ఆర్బీఐ నియంత్రణలు విధించడం ఆయనను బాధించింది. పీఎంసీ బ్యాంక్లో సంజయ్ ఆయన భార్య, తల్లితండ్రులకు సంబంధించి మొత్తం నాలుగు ఖాతాల్లో రూ. 90 లక్షల డిపాజిట్లున్నాయి. తాను ఉద్యోగం కోల్పోవడం, తమ డిపాజిట్లున్న పీఎంసీ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడంతో తీవ్ర మనస్ధాపానికి లోనైన సంజయ్ గుండెపోటుతో మరణించారు. సోమవారం ఎర్రకోట సమీపంలోని కిల్లా కోర్టు వద్ద జరిగిన నిరసనలో సంజయ్ గులాటీ పాల్గొని మధ్యాహ్నం ఇంటికి తిరిగివచ్చి భార్యను భోజనం తీసుకురమ్మని కోరారని, లంచ్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని ఆయన బంధువు రాజేష్ దువా తెలిపారు. సంజయ్ను కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. -
ఆ మూక హత్యలో ‘న్యాయం’ గల్లంతు!
సాక్షి, న్యూఢిల్లీ : 22 ఏళ్ల తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో 11 మంది నిందితులపై హత్యారోపణలను జార్ఖండ్ పోలీసులు మంగళవారం అనూహ్యంగా కొట్టివేసిన విషయం తెల్సిందే. అన్సారీ దెబ్బల మూలంగా కాకుండా గుండెపోటుతో మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అప్పట్లో వెలువడిన వార్తల ప్రకారం సెరాయ్కెలా–ఖర్సావన్ జిల్లా ధక్తీదీహ్ గ్రామంలో జూన్ నెలలో తబ్రేజ్ అన్సారీపై అల్లరి మూక దాడి చేసింది. ‘జై శ్రీరామ్’ అనాలంటూ ఆ యువకుడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు అతడు నిరాకరించడంతో ... ఓ చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసినప్పటికీ అల్లరి మూక వదిలి పెట్టకపోవడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డారు. మొదటి నుంచి ఈ కేసు దర్యాప్తులో పోలీసుల అలసత్వం ఎక్కువగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన అన్సారీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించకపోగా ఆయనపైనే చోరీ కేసును దాఖలు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. నాలుగు రోజుల తర్వాత అన్సారీని ఆస్పత్రికి తరలించగా ఆక్కడ ఆయన చనిపోయారు. ‘తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లి (బెయిన్ హెమరేజ్) అన్సారీ మరణించారు’ అంటూ ఆరోజు అటాప్సీ నిర్వహించిన వైద్యులు మీడియాకు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో అన్సారీని కట్టేసి చితకబాదిన 11 మంది నిందితులపై పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసును నమోదు చేశారు. ఆ తర్వాత అన్సారీని హత్య చేయాలనే ఉద్దేశం నిందితులకు ఏ కోశానా లేదని, అనుకోని పరిస్థితులు ఆయన హత్యకు దారి తీశాయంటూ పోలీసులు, నిందితులపై 302 సెక్షన్ను తొలగించి 304 సెక్షన్ను నమోదు చేశారు. ఆ తర్వాత దాదాపు మూడు నెలలపాటు కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించ లేదు. మెడికల్ బోర్డు తుది ఫోరెన్సిక్ నివేదికలో గుండెపోటు కారణంగా అన్సారీ మరణించారని ధ్రువీకరించినందున నిందితులపై 304 సెక్షన్ను కూడా కొట్టి వేస్తున్నామని జార్ఖండ్ పోలీసులు మంగళవారం ప్రకటించారు. మూకుమ్మడిగా బాధితుడిపై దాడి చేసిన నిందితులపై కేసు దాఖలు చేయాల్సిన పోలీసులు, బాధితుడిపైనే చోరీ కేసును నమోదు చేయడం, తలకు బలమైన దెబ్బతగలడం వల్ల మెదడులో రక్తస్రావంతో అన్సారీ మరణించారని తొలుత వైద్యులు మీడియాకు చెప్పడం, అది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది నివేదిక వెలువడాల్సి ఉందని మెడికల్ బోర్డు ఆ తర్వాత ప్రకటించడం, తుది నివేదిక మూడు నెలల ఆలస్యంగా రావడం, వచ్చీ రాగానే నిందితులపై 304 సెక్షన్ కింద హత్యా (దారితీసిన) ఆరోపణలను కొట్టివేస్తున్నట్లు పోలీసులు వెంటనే ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటీ ? ఇందులో అనుమానాలకు ఎలాంటి అవకాశం లేదా ? పోలీసులు, మెడికల్ బోర్డు చెబుతున్నట్లుగా బాధితుడు గుండెపోటుతోనే మరణించాడని అనుకుందాం. అయితే అన్సారీని చెట్టుకు కట్టేసి కొట్టినందుకు వారిని ఐపీసీలోని ఏ సెక్షన్ కింద విచారించలేరా ? ఎలాంటి శిక్ష విధించలేరా ? అల్లరి మూక కొట్టడం వల్ల మానసిక ఒత్తిడికి గురై అన్సారీ గుండెపోటు వచ్చి మరణించి ఉండవచ్చుగదా! ఆ దిశగా కూడా దర్యాప్తు జరపొచ్చుగదా! లేదా గుండెపోటును స్వయంకతాపరాధం కింద పరిగణించి ఏ శిక్ష విధించకుండా నిందితులను వదిలేస్తారా ? ఇలాంటి మూక హత్య కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు 2018, జూలై 17వ తేదీన 11 స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మూక హత్యలపై ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి విచారణను త్వరితగతిన ముగించడంతోపాటు ఇలాంటి మూక హత్యలు జరుగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను కూడా సుప్రీం కోర్టు సూచించింది. మూక హత్యలకు అవకాశం ఉన్న ప్రతి జిల్లాకు ఓ నోడల్ అధికారిని నియమించాలని, ఆ అధికారి జిల్లా, తాలూకా, గ్రామస్థాయి పరిస్థితులను రాష్ట్ర డిజీపీకి ఎప్పటికప్పడు పరిస్థితి వివరించాలని, రాష్ట్ర డీజీపీ మూక హత్యల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలను సూచించింది. మరి, జార్ఖండ్లో ఇలాంటి ముందస్తు నిరోధక చర్యలు తీసుకున్నారా ? సుప్రీం కోర్టు మార్గదర్శకాల గురించి అక్కడి పోలీసులకు తెలుసునా ? తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం మనోగతానికి విరుద్ధంగా వ్యవహరించలేమంటూ వదిలేశారా ? 302 సెక్షన్ కింద నిందితులకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉండింది. అదే 304 సెక్షన్ కింది నిందితులకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉండింది. మరి నిందితులను ఇప్పుడు ఏ సెక్షన్ కింద విచారిస్తారు? మూక హత్యల నివారణకు మణిపూర్లోలాగా ‘ప్రత్యేక చట్టం’ ఉండి ఉంటే ఆ చట్టం కింద విచారించే అవకాశం ఉండేది. ఒకే వేళ ఉన్న పాలకపక్షానికి విరుద్ధంగా కేసులను దర్యాప్తు చేసే దమ్మూ ధైర్యం జార్ఖండ్ పోలీసులకు ఉందో, లేదో!? -
అమర్నాథ్ యాత్రలో వైఎస్సార్ జిల్లా భక్తురాలి మృతి
సాక్షి, వైఎస్సార్ : అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహిళా భక్తురాలు భాగ్యమ్మ బల్తాల్ బేస్ క్యాంపులో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. భాగ్యమ్మ మృతదేహాన్ని రేపు విమానంలో స్వస్థలానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అమర్నాథ్ యాత్రలో బుధవారం 15 మంది భక్తులు ఆక్సిజన్ అందక ఇబ్బందికి గురయ్యారు. అయితే తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారికి ఆక్సిజన్ మాస్క్లు అందజేసి, మెడికల్ క్యాంపులకు తరలించారు. -
పబ్జీతో ఆడాడు.. గుండె ఆగింది..!
భోపాల్ : ఆన్లైన్ వీడియోగేమ్ పబ్జీకి బానిసైన ఓ 16 ఏళ్ల యువకుడు ప్రాణాలు విడిచిన ఘటన నీమచ్లో గత మంగళవారం జరిగింది. ఫర్ఖాన్ ఖురేషీ అనే యువకుడు అదేపనిగా 6 గంటలపాటు పబ్జీ ఆడాడు. దీంతో తీవ్ర గుండెనొప్పితో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ‘లంచ్ చేసిన తర్వాత మా తమ్ముడు ఆట మొదలుపెట్టాడు. సహచర ఆటగాళ్లపై తీవ్రంగా కోప్పడ్డాడు. గట్టిగట్టిగా కేకలు వేస్తూ.. అయిపోయింది. పేలిపోయింది. మీ వల్లే ఓడిపోయాను, ఇంకెప్పుడూ మీతో ఆడను అని ఇయర్ఫోన్స్ నేలకేసి కొట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ..కుప్పకూలిపోయాడు’ మృతుని సోదరి కన్నీరుమున్నీరైంది. తమ కుమారున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఫర్ఖాన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే తమ కుమారుడు మరణించినట్టు వైద్యులు చెప్పారని అన్నారు. ‘ఫర్ఖాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే అతని నాఢీ కొట్టుకోవడం ఆగిపోయింది. కరెంట్ షాక్తో అతన్ని బతికించే ప్రయత్న చేశాం. కానీ ఫలించలేదు’ అని డాక్టర్ అశోక్ జైన్ తెలిపారు. ఫర్ఖాన్ మంచి స్విమ్మర్ అని, అతనికి ఎలాంటి గుండె జబ్బులు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ మాయదారి పబ్జీ తమ కుమారున్ని పొట్టనబెట్టుకుందని వాపోయారు. మృతుని సోదరుడు మహ్మద్ హషీమ్ కూడా పబ్జీకి బానిస. అతను రోజూ 18 గంటలు పబ్జీ ఆడతాడు. అయితే, సోదరుని మరణంతో ఉలిక్కిపడిన హషీమ్.. తన మొబైల్ నుంచి ఆ గేమ్ని డిలీట్ చేశాడు. ఇక విపరీతంగా వీడియో, ఆన్లైన్ గేమ్లు ఆడటం కూడా వ్యసనం లాంటిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
పేపర్ చదువుతూ గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సులూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. ఎమ్మెల్యే కనగరాజ్ ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా 2016 మే నుంచి ఇప్పటివరకూ అయిదుగురు ఎమ్మెల్యేలు చనిపోయారు. శ్రీనివేల్, ఏకే బోస్ (తిరుప్పరంగుండ్రం), జయలలిత (ఆర్కే నగర్) కరుణానిధి (తిరువారూర్), కనగరాజ్ (సులూరు) అనారోగ్యంతో కన్నుమూశారు. వీరిలో నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కాగా, మరొకరు డీఎంకే చీఫ్. ఎమ్మెల్యే కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 22 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పదిశాతం స్థానాలు ఖాళీగా ఉండటం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. 39 లోక్సభ స్థానాలతో పాటు, ఎమ్మెల్యేల మరణాలతో ఏర్పడ్డ ఖాళీలతో పాటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. -
బెంగళూరు డిప్యూటీ మేయర్ హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు : కొత్తగా ఎన్నికైన బెంగళూరు డిప్యూటీ మేయర్ రమీలా ఉమాశంకర్ (44) హఠాన్మరణం దిగ్ర్భాంతికి గురి చేసింది. కేవలం వారంరోజుల క్రితమే ఎన్నికైన నగర డిప్యూటీ మేయర్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటకలోని కావేరిపుర వార్డు నుండి 44 జేడీఎస్ కార్పొరేటర్ ఎన్నికైన ఆమె సెప్టెంబరు 28 న బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) డిప్యూటీ మేయర్గా నియమితులయ్యారు. నగర చరిత్రలో రెండవసారి మేయర్ (గంగాంబిక మల్లికార్జున్)గా డిప్యూటీ మేయర్గా ఇద్దరు మహిళలు ఎంపికయ్యి రికార్డు సృష్టించారు. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయ నేతలు ఇతర నగరు ప్రముఖులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిప్యూటీ మేయర్ రమీలా ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అక్టోబర్ 4 న జరిగిన నమ్మ మెట్రో ఆవిష్కరణ కార్యక్రమంలో తనతోపాటు ఆమె పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. చాలా చిన్న వయసునుంచే సామాజిక సేవలో చురుకుగా ఉంటూ, రమీలా ఉమాశంకర్ నగరానికి చాలా సేవ చేశారంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ తన సంతాపాన్ని ప్రకటించారు. నిబద్ధత కల ఒక పార్టీ కార్యకర్త రమీలా ఇక లేరన్నవార్త తను షాక్కు గురి చేసిందన్నారు. -
ప్రముఖ బుల్లితెర నటుడు కన్నుమూత
ముంబై : ప్రముఖ హిందీ బుల్లితెర హాస్య నటుడు కవి కుమార్ ఆజాద్ కన్నుమూశారు. సోమవారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించారు. హిందీ సీరియల్ ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’లో డా. హన్షరాజ్ హాథీ పాత్రతో ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారాయన. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబై మీరా రోడ్లోని వక్రదంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న రాత్రి కోమాలోకి వెళ్లిన ఆయన సోమవారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన నటించిన ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అత్యధిక ఎపిసోడ్స్ ప్రసారమైన సీరియల్గా ఈ రికార్డును నెలకొల్పింది. కేవలం బుల్లితెర మీదే కాకుండా ఆమిర్ ఖాన్ కథానాయకునిగా నటించిన మేలా, ఫన్తూస్ వంటి సినిమాలలో కవి కుమార్ నటించారు. -
యువతలో హార్ట్ సర్క్యుట్
ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో గుండె జబ్బులకు గురైన వారిని చూసేవాళ్లం. దశాబ్ద కాలంగా మధ్యవయస్సు వారు గుండెజబ్బులకు గురవుతున్నారు. తాజాగా యువతలో 20 ఏళ్లకే గుండె అరెస్ట్(షార్ట్సర్క్యుట్) వంటి కారణాలతో మృతి చెందడం ఆందోళన కలిగించే అంశంగా చెపుతున్నారు. దీనిపై కథనం... లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ కుమారుడు 21ఏళ్లకు కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందిన విషయం తెలిసిందే. అంత చిన్న వయస్సులో గుండెజబ్బుతో మృతి చెందడం కొంత ఆందోళన కలిస్తుంది. అంతేకాదు. ఇద్దరు ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ కార్డియాక్ అరెస్ట్తో తమ వద్దకు వచ్చినట్లు విజయవాడకు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి.రమేష్బాబు చెబుతున్నారు. గుండె జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో గుండెపోటుకు గురై సకాలంలో ఆస్పత్రికి రాక ముగ్గురు వైద్యులు మృతి చెందడం ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుతం యువతతోపాటు, 30 నుంచి 40 ఏళ్ల వయస్సులో అధికంగా గుండె జబ్బులకు గురవుతున్నారు. ఒకప్పుడు స్త్రీలలో సైతం 70 ఏళ్లు దాటిన వారిలో గుండె జబ్బులు వచ్చేవని, ప్రస్తుతం 35 ఏళ్లకే వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా అన్ని వర్గాల్లో గుండె జబ్బులు నమోదవుతున్నాయి. కారణాలివే... చిన్న వయస్సులో గుండెజబ్బులకు రెండు రకాల కారణాలున్నాయి. వారి ఫ్యామిలీ హిస్టరీ, జన్యుపరమైన లోపాలు ఒక కారణం. గుండె కండరాలు దలసరిగా ఉండటం(సాధారణంగా 11 ఎంఎం ఉండాలి. కానీ 20 ఎంఎం ఆపైన ఉండటం), గుండెలోపల ఎలక్ట్రికల్ వైరింగ్, కరెంట్లో లోపాలతో షార్ట్సర్క్యుట్కు గురవడం, రక్తనాళాలు కుడి వైపున ఉండాల్సినవి ఎడమ వైపునకు తారుమారుగా పుట్టుకతోనే ఉన్నా గుర్తించకపోవడం వంటిగా పేర్కొంటున్నారు. ఇలాంటి వారు టెన్షన్స్, రెస్ట్ లేకుండా పనిచేయడం వంటి సందర్భాల్లో హార్ట్ షార్ట్ సర్క్యుట్కు గురై సడన్డెత్కు గురవుతారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడంతో 30, 40 శాతం పూడికలు ఉన్నా అవి చిట్లీ రక్తం గడ్డ కట్టి ప్రమాదకరంగా మారుతుంది. కొందరిలో 80 శాతం పూడికలు ఉన్నా ప్రమాదం కావని, కానీ కొందరిలో 30 శాతం ఉన్నా ప్రమాదకరంగా మారతాయంటున్నారు.–డాక్టర్ పోతినేని రమేష్ బాబు, సీనియర్ కార్డియాలజిస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పుట్టిన వెంటనే గుండె పరీక్షలు చేయించడంతోపాటు, ఇరవై ఏళ్లు దాటిన వారు ప్రతి ఒక్కరూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. గుండెలోపాలు ఉన్నట్లు గుర్తించి మందులు వాడటంతోపాటు, సరైన ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం, యోగా వంటివి చేయడం ఎంతో అవసరం. సరైన ఆహార అలవాట్లు కూడా ఎంతో ముఖ్యం. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. తమ కుటుంబంలో ఎవరికైన గుండెజబ్బులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అవగాహన ఎంతో ముఖ్యం నయం చేయగల గుండె జబ్బులతో బాధపడే వారు సరైన అవగాహన లేక మృత్యువాత పడడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం చిన్నవయస్సులో హార్ట్ షార్ట్ సర్క్యుట్కు ప్రధానంగా జన్యుపరమైన సమస్య కారణంగా చెప్పవచ్చు. వైద్యులకు సైతం గుండెపోటు, గుండెజబ్బులపై సరైన అవగాహన ఉండటం లేదు. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఈసీజీ తీయడం ద్వారా గుండెపోటును నిర్ధారించవచ్చు. టెలీ, ఈసీజీ, టెలీమెడిసిన్ సెంటర్ల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చు. యువతలో గుండె షార్ట్సర్క్యుట్లకు సైతం తక్షణ వైద్యంతో నివారించవచ్చు. ప్రివెంటీవ్గా గుర్తిస్తే నయం చేయగల వారు కూడా నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ట్రెడ్మిల్ టెస్ట్ ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ జరగడం లేదు. గుండె రక్తనాళాల్లోని కాల్ఫియం స్కోరు ఆధారంగా గుండెపోటు వచ్చే లక్షణాలను ముందుగా గుర్తించవచ్చు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా నైస్ గైడ్లైన్స్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
భోజనం చేస్తూనే కుప్పకూలిన వైష్ణవ్
సాక్షి, హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ పుత్రశోకంతో తల్లడిల్లిపోయారు. ఏకైక కుమారుడు వైష్ణవ్(21) మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. రాత్రి 10.30 గంటల సమయంలో వైష్ణవ్ తన తండ్రి దత్తాత్రేయ, తల్లి వసంత, సోదరి విజయలక్ష్మీ కలసి ఇంట్లో భోజనం చేస్తున్నారు. వైష్ణవ్ ఒక్కసారిగా పక్కనే ఉన్న సోదరిపైన కుప్పకూలిపోయాడు. ఫిట్స్ వచ్చి ఉండవచ్చని భావించిన కుటుంబసభ్యులు వైష్ణవ్ను హుటాహుటిన ముషీరాబాద్ గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ‘మీరు అవసరం లేదు, మేము చూసు కుంటాం’అని వైద్యులు దత్తాత్రేయకు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే వైష్ణవ్ పల్స్రేటు పూర్తిగా పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసర వైద్యసేవలను అందజేసినా గుండె స్పందించలేదు. తాత్కాలికంగా ఫేస్మేకర్ అమర్చినా ఎలాంటి స్పందన కనిపించలేదు. చివరకు వెంటిలేటర్ అమర్చారు. వైష్ణవ్ను కాపాడేందుకు 15 మంది వైద్యులు సుమారు 2 గంటలపాటు అన్ని విధాలుగా శ్రమించారు. అయినా అతన్ని కాపాడలేకపోయారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ‘సడెన్ కార్డియాక్ అరెస్టు’తో వైష్ణవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఉదయం వరకు తెలియదు... కుమారుడు చనిపోయిన విషయాన్ని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించిన వైద్యులు ఉదయం వరకూ ఆ విషయాన్ని దత్తాత్రేయకు చేరవేయలేదు. తీవ్ర అనారోగ్యం, గుండె బలహీనతతో బాధపడుతున్న దత్తాత్రేయ సతీమణి వసంతకు కూడా కొడుకు చనిపోయిన సంగతి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. రెండు, మూడు రోజుల్లో ఆమెకు ఫేస్మేకర్ అమర్చాల్సి ఉంది. చివరకు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మరణవార్త చెప్పడంతో వెంటనే దత్తాత్రేయ, వసంత, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి వారిని ఓదార్చడానికి విఫలయత్నం చేశారు. ఉదయం 7 గంటలకు వైష్ణవ్ భౌతికకాయాన్ని రాంనగర్లోని నివాసానికి తరలించారు. అనంతరం దత్తన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంతి మయాత్ర సాగింది. మధ్యాహ్నం సైదాబాద్లోని ధోబీఘాట్ శ్మశానవాటికలో దత్తాత్రేయ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. కుమారుడి కడసారి వీడ్కోలు సందర్భంగా దత్తాత్రేయతోపాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో దత్తాత్రేయ సతీమణి గర్భశోకంతో తల్లడిల్లింది. అంత్యక్రియలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల సంతాపం... దత్తాత్రేయ కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాంనగర్ వచ్చి వైష్ణవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. దత్తాత్రేయను ఓదార్చారు. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, సంతోష్ గాంగ్వర్, పలువురు రాష్ట్ర మంత్రులు దత్తాత్రేయను పరామర్శించారు. సీఎం సంతాపం దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దత్తాత్రేయకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కర్ణాటక ఎన్నికలు: బీజేపీ ఎమ్మెల్యే మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్(60) ప్రచారం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం సాయంత్రం జయనగర్, పట్టాభిరామనగర్ ప్రాంతంలో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఛాతీలో తీవ్రమైన నొప్పి రావటంతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని అనుచరులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 1 గం. ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, సివిల్ ఇంజనీర్ అయిన విజయ్కుమార్ అవివాహితుడు. జయనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి నామినేషన్ వేశారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, విజయ్ సేవలను కొనియాడుతూ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. Sri BN Vijay Kumar, Jayanagar's popular 2 term MLA & BJP candidate passed away last night due to cardiac arrest. His humility, dedication & commitment to party and people will be remembered. A great loss for us. Our condolences to his family. We pray for his Sadgati. #OmShanti pic.twitter.com/EcAivkgtt4 — BJP Karnataka (@BJP4Karnataka) 4 May 2018 -
శశికళ భర్తకు సీరియస్?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయనకు ఛాతీ నొప్పి రాగా.. చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త అనారోగ్యం వార్త అందుకోగానే హుటాహుటిన పెరోల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమచారం. కాగా, 74 ఏళ్ల నటరాజన్ లివర్ సంబంధిత వ్యాధితో గతంలోనూ అస్వస్థతకు గురికాగా.. శశికళ పెరోల్పై బయటకు వచ్చారు. అయితే ఆమె అప్పుడు భర్త కోసం కంటే రాజకీయాల పైనే ఎక్కువ దృష్టిసారించారన్న ఆరోపణలు వినిపించాయి. -
‘నీవు మరణించినా...నీ గాత్రం అమరం’
అమృత్సర్ : ప్రముఖ సూఫీ సంగీత విద్వాంసుడు, వడాలి బ్రదర్స్లో చిన్నవాడైన ఉస్తాద్ పురాన్ చాంద్ వడాలి(75) శుక్రవారం ఉదయం అమృత్సర్లో కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న వడాలిని గురువారం అమృత్సర్లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. అంత్యక్రియలు వీరి పూర్వికుల గ్రామం వడాలిలో జరుగనున్నాయి. ఉస్తాద్ పురాన్ చాంద్ వడాలి, ప్యారేలాల్ వడాలిగా ప్రఖ్యాతి. వడాలి బ్రదర్స్ పంజాబీ సూఫీ సంగీతంలో విద్వాంసులు. 1975లో జలంధర్లో హర్భల్లా ఆలయంలో ఇచ్చిన తొలి ప్రదర్శనతో వడాలి బ్రదర్స్ ఎక్కువగా ఖ్యాతి పొందారు. వీరు భజనలు, గజల్స్, కాఫియాన్లు ఎక్కువగా పాడుతుంటారు. హిందీ మూవీ 'పిన్జార్' లో, ఇటీవల విడుదలైన 'తను వెడ్స్ మను' లో కూడా వడాలి బ్రదర్స్ పాటలు పాడారు. ట్విట్టర్ నివాళి.... ‘‘పంజాబ్ సాహిత్యాన్ని, సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఓ షెహన్షా నీ ఆత్మకు శాంతి చేకురాలని వేడుకుంటున్నాము’’ అంటూ ట్విట్టర్ ప్యారేలాల్ వడాలి మృతికి నివాళి అర్పించింది. -
బోనీకపూర్ భార్యల పెద్ద కోరిక నెరవేరలేదు!
సాక్షి, సినిమా: ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం పలు సినిమా ఇండస్ట్రీలలో విషాదం నింపింది. ఆమె భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబైకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు బాలీవుడు ప్రముఖులు బోనీకపూర్ సోదరుడు అనిల్ కపూర్ నివాసానికి చేరుకుంటున్నారు. కాగా, బోనీకపూర్ తొలి భార్య మోనా షౌరీ కపూర్ లాగే రెండో భార్య శ్రీదేవి సైతం ఓ పెద్ద కోరికను తీర్చుకోకుండానే కన్నుమూశారని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. అప్పుడు మోనా కపూర్.. గతంలో బోనీకపూర్ మొదటి భార్య మోనా షౌరీ కపూర్ తమ కుమారుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఫస్ట్ సినిమా రిలీజ్కి కొన్ని నెలలముందు మరణించారు. 13 ఏళ్ల వివాహబంధం తర్వాత 1996లో భర్త బోనీ నుంచి మోనా కపూర్ విడాకులు తీసుకున్నారు. మోనా కపూర్, బోనీల కుమారుడు అర్జున్ కపూర్ నటించిన తొలిచిత్రం ఇషక్ జాదే. 2012 మేలో కుమారుడి తొలి మూవీ విడుదల కావల్సి ఉండగా.. అదే ఏడాది మార్చి 25న మోనా కపూర్ మృతిచెందారు. దీంతో హీరోగా కుమారుడి సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలన్న మోనా కోరిక తీరలేదు. ఇప్పుడు శ్రీదేవి.. మోనాతో విడాకులు తీసుకున్న ఏడాదే నిర్మాత బోనీకపూర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. కాగా, శ్రీదేవికి తన పెద్ద కుమార్తె జాన్వీకపూర్ ను వెండితెర మీద చూసుకోవాలని ఎంతో తాపత్రయపడ్డారు. కానీ కూతురు జాన్వీ నటించిన ఫస్ట్ సినిమా దడక్ రిలీజ్కు కొన్ని నెలల ముందు శ్రీదేవి ఆకస్మికంగా మృతిచెందారు. జాన్వీ తొలి మూవీ ఈ ఏడాది జూలై 20న విడుదల కానుండగా.. ఫిబ్రవరి 24న నటి శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో బోనీ ఇద్దరు భార్యలు మోనా (మాజీ భార్య), శ్రీదేవిలు తమ వారసుల్ని తెరపై చూసుకోవాలనుకున్న పెద్ద కోరిక నెరవేరలేదు. -
శ్రీదేవికి గుండెపోటు..అసలేం జరిగింది?
-
కార్డియాక్ అరెస్ట్ ఎందుకంటే...
సాక్షి, హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎప్పుడూ ఆరోగ్యంగా, చెలాకీగా కనిపించే శ్రీదేవి ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’కు గురై కన్నుమూయడం ఆమె అభిమానులనే కాదు హృద్రోగ నిపుణు లను సైతం నివ్వెరపరిచింది. ఉన్నఫళంగా ఆమె ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’కు ఎందుకు గురైందనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే... ఒత్తిడి వల్ల గుండె రక్తనాళాలు కుంచించుకుపోతాయి... కొందరు సెలబ్రిటీలు కెరీర్, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. మనిషి ఒత్తిడికి గురైనప్పడు గుండె వేగం 120 నుంచి 150సార్లకు పైగా కొట్టుకుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుంచించుకుపోతాయి. అప్పటివరకు రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయిన ప్పటికీ ఒత్తిడి వల్ల అవి కుంచించుకుపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్కు కారణమవుతాయి. – డాక్టర్ ఆర్.వి. కుమార్, హృద్రోగ నిపుణుడు, నిమ్స్ అతిగా వ్యాయామాలతోనూ చేటు... సెలబ్రిటీ స్టేటస్ను మేనేజ్ చేసుకోవడం ఒక దశకు వచ్చిన తర్వాత చాలా కష్టం. వృద్ధాప్యంలో కూడా అందంగా కన్పించాలనే కాంక్షతో కొందరు అతిగా వ్యాయామాలు చేయడం, ఆకలి తగ్గించే మందులు వాడుతుండటం చేస్తుంటారు. వేళకు తినకపోవడం వల్ల శరీరంలో పొటాషియం లెవల్స్ పడిపోతుంటాయి. ఒక్కోసారి ఇవి కార్డియాక్ అరెస్ట్కు దారితీస్తుంటాయి. ఒక దశ దాటిన తర్వాత ఏ పని ఎంతసేపు చేయాలో అంతే చేయాలి. వైద్యుల సలహా మేరకు డైట్ ఎంచుకోవాలి. 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏటా విధిగా హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. – డాక్టర్ గోపిచంద్ మన్నెం, హృద్రోగ నిపుణుడు, స్టార్ ఆస్పత్రి షాక్కు గురయ్యా.. శ్రీదేవి మరణ వార్త విని షాక్కు గురయ్యా. కోట్లాది అభిమానుల గుండెలు బద్దలు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముండ్రం పిరై, లమ్హే, ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాల్లో ఆమె నటన ఎందరో నటీనటులకు ఆదర్శం. ఆమె కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి. – రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రతిభగల నటి.. ఎంతో ప్రతిభ కలిగిన నటి శ్రీదేవి. ఆమె హఠాన్మరణం వల్ల తీవ్ర బాధ కలిగింది. దక్షిణాది భాషా చిత్రాలతోపాటు హిందీలోనూ ఆమె వైవిధ్యభరితమైన నటనను కనబరిచారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో బాధించింది.. శ్రీదేవి అకాల మరణం నన్నెంతో బాధించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనను కన బరిచి చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటిగా ఆమె చెరగని ముద్రవేశారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యు లకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. – ప్రధాని నరేంద్ర మోదీ బహుముఖ ప్రజ్ఞాశాలి.. శ్రీదేవి అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ఆమె అసా ధారణ ప్రతిభ కలిగిన నటి. బహు ముఖ ప్రజ్ఞాశాలి. అనేక భాషల్లో వివిధ రకాల చిత్రాల్లో నటించారు. ఆమె కుటుంబానికి నా సానుభూతి. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. –రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీదేవి మృతికి గవర్నర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీదేవి అకాల మరణం పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల సినిమాల్లో తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. చిన్న వయసులోనే ఆమె మరణించడం విచారకరమన్నారు. శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులకు ఎంతో వెలితిని మిగిల్చిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ సీఎం సంతాపం ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణానికి ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. శ్రీదేవి మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీదేవి తన నటన, ప్రతిభాపాటవాలతో ప్రజలను ఉర్రూతలూగించారని, బాలనటిగా మర్చిపోలేని నటనను ప్రదర్శించారని ఆదివారం ఒక సందేశంలో కొనియాడారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించి మెప్పించిన శ్రీదేవి.. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’సినిమాలో గృహిణిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి విశేష మన్ననలను అందుకున్నారన్నారు. సినీ ప్రియులకు, సినీ రంగానికి శ్రీదేవి మరణం తీరని లోటన్నారు. శ్రీదేవి మరణంతో దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. శ్రీదేవి లేని లోటు తీర్చలేనిది: ఉత్తమ్, లక్ష్మణ్ ప్రముఖ సినీ తార, వందలాది తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన శ్రీదేవి హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. చిత్రపరిశ్రమ ఆమెను కోల్పోవడం దురదృష్టకరమని, ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నా తొలి షూట్ శ్రీదేవితోనే.. బాలీవుడ్ స్టార్ హీరో
సాక్షి, ముంబై : అశేష సినీ వాహినిని శోకసంద్రంలో ముంచేసి నటి శ్రీదేవి(54) అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి హఠాన్మరణంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ శ్రీదేవితో తనకున్న తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. తాను బాలనటుడిగా తొలి చిత్రంలో శ్రీదేవితో కలిసి నటించినప్పటి ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమెను ప్రేమతో ఎంతగానో అభిమానించేవాడినని పేర్కొన్నారు. 'నా సినీ ప్రస్థానంలో తొలిసారి తొలి షాట్లోనే శ్రీదేవితో కలిసి నటించా. ఆ సమయంలో ఆమె ముందు నటించడానికి చాలా ఒత్తిడికి గురయ్యా. నాలో విశ్వాసం పెంచడానికి ఆమె తన చెతులను వణికినట్టు చేయడం నాకింకా గుర్తుంది. ఆ సమయంలో నేను కుదురుకునే వరకు ఆమె నన్ను నవ్వేలా చేశారు. ఇద్దరం నవ్వుతూ చాలా సరదగా గడిపాం. శ్రీదేవి అందరిలోకెల్లా అత్యంత అద్భుతమైన నటి. మిమ్మల్ని కోల్పోవడం మాటల్లో వర్ణించలేము. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా మేడమ్. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ హృతిక్ భావోద్వేగానికి గురయ్యారు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్కు వెళ్లిన శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. I loved her, admired her so much. My 1st ever acting shot was with Sri Devi, I was nervous in front of her n I remember her shaking her hands pretending 2b nervous cause of me just 2 boost my confidence. V had 2 laugh,n she kept laughing until I got it right. Will miss you mam pic.twitter.com/OYXfurcIFx — Hrithik Roshan (@iHrithik) 25 February 2018 At a loss for words. She was the brightest the most magnificent star of all. Rest In Peace... — Hrithik Roshan (@iHrithik) 25 February 2018 -
శ్రీదేవికి గుండెపోటు.. అసలేం జరిగింది?
దుబాయ్: సినీ వినీలాకాశంలో అతిలోకసుందరిగా అందరి మన్ననలు అందుకున్న శ్రీదేవి ఊహించనివిధంగా శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. బోనికపూర్ మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం రస్ ఆల్ ఖైమాకు వెళ్లిన ఆమె శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు పెళ్లిలో అప్పటివరకు సంతోషంగా గడిపిన శ్రీదేవికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బాత్రూమ్లో పడిపోయి అపస్మారస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను బంధువులు వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని భారత కాన్సులేట్ జనరల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బోని పక్కనుండటం అదృష్టం.. శ్రీదేవి చివరిశ్వాస విడిచే సమయానికి భర్త బోనికపూర్, కుమార్తె ఖుషి.. ఆమె పక్కనే ఉండటం అదృష్టమని సన్నిహితులు వ్యాఖ్యానించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పెళ్లి వేడుకలు పూర్తైన తర్వాత కుమార్తెతో పాటు బోనికపూర్ ముంబై తిరిగి వెళ్లాల్సివుంది. శ్రీదేవి తన సోదరి శ్రీలతతో పాటు కొద్దిరోజులు దుబాయ్లో ఉండాలని అనుకున్నారు. బోనికపూర్ ముంబై వెళ్లిపోయివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయం వేస్తోందని సన్నిహితులు పేర్కొన్నారు. దుబాయ్కు వెళ్లేముందు ముంబై విమానాశ్రయంలో బోనికపూర్, శ్రీదేవి, ఖుషి (యోగేన్ షా ఫొటో) ముంబైలో ఒంటరిగా జాహ్నవి శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ షూటింగ్ కారణంగా దుబాయ్కు వెళ్లలేదు. శశాంక్ ఖైతాన్ ‘దడక్’ సినిమాలో బిజీగా ఉండడంతో తల్లితో పాటు వెళ్లలేకపోయింది. తన తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన అంధేరీలోని తన నివాసానికి చేరుకుంది. ఒంటరిగా ఉన్న ఆమెను బంధువులు, సన్నిహితులు ఓదారుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకు తరలించే అవకాశముంది. కేన్సర్ వదంతులు.. శ్రీదేవి ఆరోగ్యంపై గతంలో వదంతులు వచ్చాయి. శ్రీదేవికి కేన్సర్ ఉందని 2010-11 మధ్యకాలంలో సమాచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎనిమిదేళ్లుగా శ్రీదేవి.. హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. -
శ్రీదేవి చివరి ఫొటోలు
దుబాయ్: ప్రముఖ నటీమణి శ్రీదేవి మరణవార్త భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసింది. హీరోయిన్ సోనమ్ కపూర్ సోదరుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం భర్త బోనికపూర్, చిన్నకుమార్తె ఖుషి, సోదరి మహేశ్వరితో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడంతో శ్రీదేవి కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. అంతకుముందు పెళ్లిలో వధూవరులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ పేజీలో శ్రీదేవి పోస్ట్ చేశారు. ఆమె చివరిసారిగా దిగిన ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఆమె చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను చూసి అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు. పెళ్లిలో చలాకీ తిరుగుతూ, అందరినీ అప్యాయంగా పలకరిస్తూ వీడియోలో ఆమె కనిపించారు. -
ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్
సాక్షి, హైదరాబాద్ : గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలుపుతూ గురువారం ఉదయం ట్వీటర్లో ఓ సందేశం ఉంచారు. బహదూర్పుర పీఎస్లో పని చేసే హోంగార్డులు చందన్సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. నగరంలో మరింత మంది కానిస్టేబుల సీపీఆర్ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుంది అంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ వీడియోను కూడా మంత్రి పోస్టు చేశారు. బహుదూర్పుర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, నగర ట్రాఫిక్ డీసీపీ రఘనాథ్ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు. బుధవారం ఉదయం పురానాపూల్ మీదుగా జహనుమా వైపు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కిందపడిపోయాడు. ఇది గమనించిన చందన్సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు పరిగెత్తారు. ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్(కార్డియోపల్మనరి రెససిటేషన్) పద్ధతి ద్వారా ఛాతీపై మసాస్ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్ చేసి అంబులెన్స్లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. Yesterday Homeguards K. Chandan & Inayathulla Khan of Bahadurpura PS saved the life of a person who had suddenly undergone a cardiac arrest at Puranapul Darwaja in Old City🙏🙏 Many Constables & Homeguards in Hyderabad have undergone CPR (cardio pulmonary resuscitation) training pic.twitter.com/k7D13RwqHL — KTR (@KTRTRS) 1 February 2018 -
ఆకస్మిక గుండెపోటు నుంచి రక్షణ!
సాక్షి, అమరావతి: ఆకస్మికంగా గుండెపోటు బారిన పడిన వారిని కాపాడేందుకు ఉద్దేశించి జనసమ్మర్థ ప్రాంతాల్లో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్స్(ఏఈడీ–ఎలక్ట్రిక్ షాక్ యంత్రాల)ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ నిర్ణయించింది. గుండె జబ్బులవల్లే దేశంలో అత్యధికులు చనిపోతున్నారని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ మరణాల్ని నియంత్రించే చర్యల్లో భాగంగా పబ్లిక్ ప్రదేశాల్లో జనరక్ష పథకం కింద ఏఈడీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి? నిర్వహణ ఖర్చులు ఎవరు భరించాలి? ఎలా నిర్వహించాలి? అనే అంశాల్ని వివరిస్తూ మార్గదర్శకాలతో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం జీవో జారీచేశారు. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చి గుండె కొట్టుకోవడం ఆగిపోతే వెంటనే డాక్టర్ అందుబాటులో ఉండరు. ఇలాంటప్పుడు తక్షణమే ఏఈడీతో ఎలక్ట్రిక్ షాకిస్తే గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభిస్తుంది. తర్వాత వీలైనంత త్వరగా బాధితుల్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించడంద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. ఏఈడీలతో షాక్ ఇవ్వడానికి వైద్య నిపుణులక్కర్లేదు. పారామెడికల్స్ కూడా లేకుండా ఒకటి, రెండు సార్లు చూసినవారు(స్వల్ప శిక్షణ పొందినవారు) కూడా ఏఈడీని ఆపరేట్ చేయొచ్చు. ఈ ఉద్దేశంతోనే ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకులు, జిమ్స్, స్టేడియాలు, బస్సు డిపోలు, క్లబ్లు, సామాజిక కేంద్రాలు, కల్యాణ మంటపాలు, ఆడిటోరియాలు, షాపింగ్మాల్స్తోపాటు ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం తప్పనిసరని వైద్యశాఖ పేర్కొంది. అయితే వీటి నిర్వహణ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత ఆయా భవనాలు/సంస్థల యజమానులదేనని స్పష్టం చేసింది. వీటిని ఏర్పాటు చేసేలా రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీలను పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రోత్సహించాలని కూడా ఆదేశించింది. -
యువనటుడు, క్రికెటర్ ఆకస్మిక మృతి
కన్నడ నటుడు, యువ క్రికెటర్ ధృవ్ శర్మ (35) ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మంగళవారం తెల్లవారుఝామున మృతి చెందారు. ఆయనకు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు పరిశ్రమను వెంటాడుతుండటంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తమవుతోంది. సోమవారం రాత్రి గుండెపోటుతో రావడంతో వెంటనే బెంగళూరులోని కొలంబియా ఆసియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధృవ్ శర్మ తుది శ్వాస విడిచారు.. ధృవ్ శర్మ అకాల మరణంపై అనేకమంది పరిశ్రమ పెద్దలు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్, టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి, కన్నడ నటీనటులు, తదితరులు ట్విట్టర్ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు. వినికిడి, మాట బలహీనత ఉన్నప్పటికీ అటు కన్నడ చలనచిత్ర పరిశ్రమకులో ఇటు క్రికెట్ క్రీడలోనూ ధృవ్ విజయం సాధించారు. 2006 లో విడుదలైన స్నేహాంజలి కన్నడ చిత్రం ద్వారా చలనచిత్ర పరిశ్రమలో అరగేంట్రం చేశారు. ఆ తరువాత లిమ్కా బుక్ రికార్డ్స్ లో ప్రత్యేక నటుడిగా చోటు సంపాదించారు. బెంగుళూరు 560023, నీనండ్రే ఇష్త కానో, టిప్పాజీ లాంటి హిట్ చిత్రాలలో కూడా నటించారు. 2005 లో డెఫ్ క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించినప్పటికీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఆడుతూ ఎక్కువ ప్రజాదరణ పొందారు. Am so heart broken, shaken beyond words. My dearest Dhruv Sharma you will be missed forever brother. Thank you for ur warm hugs & love. #RIP pic.twitter.com/lILWZPG0wM — Riteish Deshmukh (@Riteishd) August 1, 2017 -
తొలిరోజు జిమ్.. స్టేట్ చాంపియన్ మృతి
ముంబై: రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించిన మహిళా అథ్లెట్ జెనిడా కర్వాల్హో(29) గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాధ ఘటన ఎవర్షైన్ నగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. నలాస్పరా (తూర్పు)కు చెందిన జెనిడా స్థానిక మధుబన్ హైట్స్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో నిన్న ఉదయం స్థానికంగా ఓ జిమ్లో తొలిరోజు వార్మప్ చేయడానికి వెళ్లింది. గుండెకు సంబంధించిన ఎక్సర్సైజు చేసిన జెనిడా, అందుకు సంబంధించిన జిమ్ సాధనంతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అంతలోనే ఆ అథ్లెట్ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన జిమ్ సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే జెనిడా కర్వాల్హో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే ఆమె మృతిచెందిందని డాక్టర్లు వెల్లడించారు. బీపీ, షుగర్ లాంటి సమస్యలతో సతమతవుతున్నవారు వైద్యుల సూచన మేరకే జిమ్ చేయడం మంచిదని సూచించారు. రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం 'కుటుంబంలో ఆదాయం ఉన్న ఏకైక వ్యక్తి జెనిడా. ఆమె కొన్నేళ్లుగా మధుమేహంతో బాధపడుతోందని' జెనిడా స్నేహితురాలు మధుమిత పూజారి చెప్పింది. స్కూళ్లో చదివేరోజుల్లో.. రాష్ట్రస్థాయిలో పలు కాంపిటీషన్లలో షార్ట్ పుట్ విభాగంలో పాల్గొని జెనిడా పతకాలు సాధించింది. డిగ్రీ చదివే సమయంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించింది. డిస్కస్ అండ్ జావెలిన్ త్రో విభాగాల్లో జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పతకాలు నెగ్గిన ఘనత ఆమె సొంతం. వచ్చే నెలలో కూపర్ హాస్పిటల్లో ఆమె చికిత్స తీసుకోవాల్సి ఉండగా.. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
ట్రాక్టర్ నడిపిన కుక్క.. రైతు మృతి!
ఆయన యూకేలోని నార్త్ సోమర్సెట్లో ఓ బడా రైతు. గట్టిగా చెప్పాలంటే కోటీశ్వరుడు. కానీ, ఆయన తన పెంపుడు కుక్క చేతిలో చనిపోయాడు. ఆ కుక్క పొరపాటున ట్రాక్టర్ గేర్ వేయడంతో.. ఇంజన్ ఆన్లో ఉన్న ఆ ట్రాక్టర్ ముందుకు కదిలి ఆయన చనిపోయారు. ప్రముఖ పాడిరైతు, ప్రాపర్టీ డెవలపర్, స్థానిక కౌన్సిలర్ కూడా అయిన డెరెక్ మీడ్ ఈ ప్రమాదం కారణంగా కార్డియాక్ అరెస్ట్ సంభవించి అక్కడికక్కడే మరణించారు. బాగా ఎక్కువ లోడ్లను తీసుకెళ్లే జేసీబీ ఫాం లోడర్ అనే రకం ట్రాక్టర్ కింద పడి ఆయన నలిగిపోయినట్లు చెబుతున్నారు. బహుశా అప్పటికే దాని ఇంజన్ ఆన్లో ఉండి ఉంటుందని, కుక్క పొరపాటున క్యాబిన్లోకి ప్రవేశించి, అనుకోకుండా గేర్ రాడ్ కదిలించి ఉంటుందని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే దగ్గరలో ఉన్నవాళ్లు పోలీసులకు, అంబులెన్స్కు ఫోన్ చేయడంతో రెండు రెస్పాన్స్ వాహనాలు, ఒక అంబులెన్స్, ఒక ఎయిర్ అంబులెన్స్ అక్కడకు చేరుకుని, మీడ్ను కాపాడేందుకు ప్రయత్నించాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవారని, అలాగే పొలంలో పని చేయిస్తుండగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. -
కాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి
పాట్నా: మరికాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే బరాత్లో డాన్స్ చేస్తున్న పెళ్లికొడుకు హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన బిహార్ లోని కైముర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... కైముర్ జిల్లా సరన్పూర్ ప్రాంతానికి చెందిన దయా శంకర్పాండే కుమారుడు శశికాంత్పాండే (25)కి గత శుక్రవారం వివాహం నిశ్చయించారు. బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి మండపానికి తన గ్రామం నుంచి వివాహ వేదికకు ఊరేగింపుగా వెళ్తున్నారు. బరాత్ సందర్భంగా.. పెళ్లికొడుకును డాన్స్ చేయమని స్నేహితులు బలవంతంగా కారునుంచి దించి డాన్స్ చేయించారు. అందరితో కలిసి సంతోషంతో వరుడు శశికాంత్ ఫుల్లుగా డ్యాన్స్ చేశాడు. అంతలోనే గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పెళ్లికొడుకును పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుతో వరుడు శశికాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. డ్యాన్స్ చేయడం వల్లే గుండెపై ఒత్తిడి పెరిగి చనిపోయాడని తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బాలీవుడ్ నటి రీమా లాగూ గుండెపోటుతో మృతి
ముంబాయి: ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగూ (59) గుండెపోటుతో మృతి చెందారు. గత రాత్రి ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటీన అంథేరీలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రీమా మరణించారు. మరాఠీ రంగ స్థలం నుంచి బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన రీమా లాగూ తల్లి పాత్రకు పెట్టింది పేరు. దూరదర్శన్ ధారావాహికలతో కెరీయర్ ప్రారంభించిన ఆమె కయామత్ సే కయామత్ తక్ (1988) చిత్రంతో వెలుగులోకి వచ్చారు. ఈ చిత్రంలో ఆమె జూహీచావ్లా తల్లి పాత్ర పోషించారు. మరాఠీతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రీమా...తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించిన మైనే ప్యార్ కియా చిత్రంలో సల్మాన్ ఖాన్ తల్లిగా నటించింది. అలాగే హమ్ ఆప్కే హై కౌన్, కుచ్ కుచ్ హోతా హై, హమ్ సాత్ సాత్ హై, కల్ హో నా హో తదితర చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించారు. అలాగే పాపులర్ టీవీ షో ‘తూ తూ మే మే’, శ్రీమన్ శ్రీమతిలోనూ నటించారు. ప్రస్తుతం రీమా నామకరణ్ అనే సీరియల్లో విలన్ పాత్ర పోషిస్తున్నారు. మరాఠీ నటుడు వివేక్ లాగూను వివాహం చేసుకున్న రీమా లాగూకు కుమార్తె మృన్మయీ లాగూ ఉన్నారు. కాగా రీమా మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్ నటీనటులు సంతాపం తెలిపారు. -
దైవజ్ఞశర్మ భార్య గుండెపోటుతో మృతి
సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ భార్య అంజలి(52) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి పది గంటల సమయంలో తీవ్ర గుండెనొప్పితో స్వగృహంలో కుప్పకూలిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించినట్లు తెలిసింది. -
బ్రూఫిన్తో కార్డియాక్ అరెస్టు ముప్పు!
నొప్పి నివారణకు మన దేశంతో పాటు చాలా దేశాల్లో ఉపయోగించే మందు.. ఇబూప్రోఫెన్. దీన్ని ఎక్కువగా బ్రూఫిన్ అనే పేరుతో అమ్ముతుంటారు. ఏవైనా గాయాలు తగిలినప్పుడు కలిగే నొప్పులను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అయితే.. ఈ మందును ఎక్కువగా వాడటం వల్ల కార్డియాక్ అరెస్టు ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వైద్యుల సలహా లేకుండా, తమంతట తామే (ఓవర్ ద కౌంటర్) ఈ మందులను కొనుక్కుని వాడుకునేవారిలో కార్డియాక్ అరెస్టు ముప్పు 31 శాతం అధికంగా ఉందని డెన్మార్క్ పరిశోధకులు చెప్పారు. యూరోపియన్ హార్ట్ జర్నల్లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. ఇబూప్రోఫెన్ మాత్రమే కాదు.. డైక్లోఫెనాక్ వల్ల కూడా ఈ తరహా ముప్పు 50 శాతం పెరుగుతుందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్కు చెందిన ప్రొఫెసర్ గున్నర్ గిస్లాసన్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఇబూప్రోఫెన్తో పాటు ఇతర నొప్పి నివారణ మందుల అమ్మకాలను నియంత్రించాలని ఆయన సూచించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని వాడటం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన తెలిపారు. అలాగని నొప్పి నివారణ మందులన్నీ ప్రమాదకరం అనుకోనక్కర్లేదని.. ఎక్కువగా ఉపయోగించే ఇబూప్రోఫెన్, డైక్లోఫెనాక్ల వల్ల మాత్రం కార్డియాక్ అరెస్టు ముప్పు బాగా పెరుగుతుందని వివరించారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో గత సెప్టెంబర్ నెలలో ప్రచురితమైన ఓ వ్యాసంలో కూడా వీటివల్ల గుండెకు ప్రమాదమని చెప్పారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఇబూప్రోఫెన్, ఇతర నొప్పి నివారణ మందులను సొంతంగా వాడొద్దని గిస్లాసన్ సూచించారు. గుండెకవాటాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు, అవి వచ్చే ముప్పు ఉన్నవాళ్లు కూడా ఈ మందులు వేసుకోకపోవడమే మంచిదన్నారు. ఈ మందులను ఎవరు పడితే వారు అమ్మడం సరికాదని, వైద్యులు కూడా ఆచితూచి ఇవ్వాలని అన్నారు. డెన్మార్క్లో 2001 నుంచి 2010 వరకు కార్డియాక్ అరెస్టుతో బాధపడిన దాదాపు 29వేల మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఇబూప్రోఫెన్ను రోజుకు 1200 మిల్లీగ్రాములకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని గిస్లాసన్ చెప్పారు. -
గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత
-
గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత శేఖర్బాబు(73) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మమత, సంసారబంధం,గోపాలరావుగారి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రీ, చిలకమ్మ తదితర సినిమాలను ఆయన నిర్మించారు. -
గుండెపోటుతో వీఆర్వో మృతి
భద్రాద్రి కొత్తగూడెం: విధి నిర్వహణలో ఉన్న ఓ రెవెన్యూ అధికారిని గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం చోటు చేసుకుంది. పినపాక మండలం గడ్డంపల్లికి చెందిన కోలం అంజమ్మ(40) అశ్వాపురంలో వీఆర్వోగా పనిచేస్తోంది. గత రెండు రోజులుగా భూ దస్తావేజుల విషయంలో పాల్వంచలోని డిప్యూటీ కల్టెర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం కార్యాలయంలో పని చేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెందింది. -
బస్సులో ప్రయాణిస్తూ.. వ్యక్తి మృతి
ఖమ్మం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై బస్సులోనే ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. ఇల్లందుకు చెందిన దేరంగుల వెంకటేశ్వర్లు(58) బస్సులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఇది గుర్తించిన బస్ కండక్టర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. -
బతికే అవకాశం ఫిఫ్టీ...ఫిఫ్
-
అమ్మ గుండె ఆగిందా.. గుండెపోటు వచ్చిందా?
-
అమ్మ గుండె ఆగిందా.. గుండెపోటు వచ్చిందా?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వచ్చినది గుండెపోటు కాదని.. ఆమె గుండె కొద్దిసేపు ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) అపోలో ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన నోట్లో పేర్కొన్నాయి. ఈ కారణంగానే ఆమెకు సోమవారం ఉదయం ఒక ఆపరేషన్ కూడా జరిగినట్లు పార్టీ ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు నిజానికి చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియాక్ అరెస్టు శరీరంలోని వివిధ భాగాలకు రక్తసరఫరాను గుండె ఆపేసినప్పుడు కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది. పేషెంటు ఉన్నట్టుండి కుప్పకూలి, సాధారణంగా ఊపిరి తీసుకోకపోవడం, స్పందనలు లేకపోవడం లాంటి లక్షణాలు ఇందులో సంభవిస్తాయి. కారణం ఏంటి? చాలావరకు వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (వీఎఫ్).. అంటే, గుండె లయ అసాధారణంగా మారడం వల్లే కార్డియాక్ అరెస్టు సంభవిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గుండెకు సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ దారుణంగా పడిపోయినపుడు ఈ పరిస్థితి వస్తుంది. దానివల్ల శరీర భాగాలకు గుండె నుంచి రక్త సరఫరా జరగదు. కార్డియాక్ అరెస్టు తర్వాత కోలుకుంటారా? వెంటనే సరైన చికిత్స అందిస్తే, కార్డియాక్ అరెస్టు నుంచి కూడా కోలుకునే అవకాశాలున్నాయి. చెస్ట్ వాల్ ద్వారా డీఫిబ్రిలేటర్ అనే పరికరంతో విద్యుత్ షాక్లు ఇచ్చి కొన్ని సందర్భాల్లో దీన్ని సరిచేస్తారు. గుండెపోటు-కార్డియాక్ అరెస్టు తేడా ఏంటి? గుండెపోటు వల్ల కూడా కార్డియాక్ అరెస్టు సంభవించవ్చు గానీ, ఈ రెండూ ఒకటి మాత్రం కాదు. గుండెపోటు అంటే గుండె కండరాలకు రక్తసరఫరాకు ఉన్నట్టుండి ఆటంకం కలగడం. దానివల్ల గుండెనొప్పి వచ్చి, గుండెకు శాశ్వతంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ.. అప్పటికీ మిగిలిన రక్తనాళాల ద్వారా గుండె మాత్రం శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తూనే ఉంటుంది, అందువల్ల పేషెంటు ఊపిరి తీసుకుంటూనే ఉంటాడు. కానీ కార్డియాక్ అరెస్టులో మాత్రం శరీరభాగాలకు రక్తం అందదు. గుండెపోటు, కార్డియాక్ అరెస్టు రెండూ ప్రాణాంతకమే. అయితే తక్షణ చికిత్స అందిస్తే మాత్రం కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. -
ప్రాణం పోతున్నా.. క్యూ లైన్లోనే!
-
ప్రాణం పోతున్నా..
కోల్కతా: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. సాధారణ అవసరాలకు సైతం చేతిలో డబ్బు అందుబాటులో లేకపోవడంతో సామాన్యుల సమయం గంటల కొద్ది క్యూ లైన్లలోనే గడిచిపోతుంది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఏటీఎం క్యూ లైన్లో నిలుచున్న ఓ 52 ఏళ్ల వ్యక్తి అక్కడే కుప్పకూలాడు. చాలా సమయం లైన్లో నిలుచున్న అతడికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. బాధతో విలవిలలాడుతున్నా అతడితో పాటు లైన్లో ఉన్నవాళ్లు చూసీచూడనట్లుగా వదిలేసి.. డబ్బుకోసం ముందుకు కదిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోని 80 శాతం ఏటీఎంలలో కొత్త నోట్లు ఉంచడానికి అవసరమైన మార్పులు చేశాం అని అధికారులు చెబుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎక్కడ చూసినా మూసివేసిన, నో క్యాష్ బోర్డులు ఉంచిన ఏటీఎంలే కనిపిస్తున్నాయి. డబ్బు ఉన్న కొద్దిపాటి ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. -
98 శాతం మందికి ఆ టెక్నిక్ తెలియదు
న్యూఢిల్లీ: గుండెజబ్బులతో మృతిచెందేవారి సంఖ్య పెరిగిపోతున్న భారత్లో.. దానిపై అవగాహన మాత్రం దాదాపు శూన్యంగా ఉందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. హఠాత్తుగా గుండెపోటు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడటంలో సహకరించే చిన్న చిన్న టెక్నిక్లు సైతం భారత్లో 98 శాతం మందికి తెలియవని లిబ్రేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సుమారు లక్ష మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువతకు సైతం హార్ట్ ఎటాక్ సమయంలో ఎలా స్పందించాలనే అంశంలో స్పష్టతలేకపోవడం ఆందోళనకరమని లిబ్రేట్ సీఈవో సౌరబ్ అరోరా తెలిపారు. హార్ట్ ఎటాక్ సమయంలో ఎంతగానో ఉపకరించే కార్డియోపల్మొనరి రిసక్సిటేషన్(సీపీఆర్) టెక్నిక్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని సర్వే నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. హార్ట్ ఎటాక్ సంబంధిత కేసుల్లో ఆసుపత్రికి చేరేలోపే 60 శాతం మంది మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో కీలక సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవడం మంచిదన్నారు. -
హోంగార్డు గుండెపోటుతో మృతి
నిడదవోలు : విధి నిర్వాహణలో ఉన్న ఓ హోంగార్డ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న వి. రాంబాబు (50) విధులు నిర్వర్తిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సహచర సిబ్బంది వెంటనే స్పందించి... అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రాంబాబు గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రాంబాబు మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. -
తండ్రికి పిండ ప్రదానం చేస్తూ....
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో తండ్రికి పిండ ప్రదానం చేస్తూ ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. ఈ సంఘటన విజయవాడలోని గొల్లపుడి ఘాట్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడకు చెందిన కామేశ్వరావు (48) ఈ రోజు ఉదయం తండ్రికి పిండ ప్రదానం చేసేందుకు గొల్లపూడి ఘాట్కు వచ్చారు. తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించారు. అక్కడే ఉన్న పోలీసులు అతడి వద్ద ఉన్న ఐడీ కార్డు ద్వారా రైల్వే ఉద్యోగిగా గుర్తించారు. విజయవాడలోని రైల్వే కోచ్ డిపోలో సీనియర్ సెక్షన్ అదికారిగా కామేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామేశ్వరరావు మరణ వార్తను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
గుండెపోటుతో తహశీల్దార్ మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్పల్లి తహశీల్దార్ నరేందర్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్థరాత్రి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే నరేందర్ మార్గమధ్యంలోనే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. నరేందర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
మాజీ మంత్రి జీవి శేషు కన్నుమూత
ఒంగోలు : మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం ఒంగోలులోని స్వగృహంలో ఆయనకు తీవ్రంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజక వర్గం నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా... ఓ సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. -
ఎంపీ రాయపాటికి సతీవియోగం
గుంటూరు : నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ రోజు తెల్లవారుజామున ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లీలాకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. -
విమానంలోనే మృతి చెందిన పారిశ్రామికవేత్త
తిరువొత్తియూరు: ఇండోనేషియా నుంచి దుబాయ్కి వెళుతున్న విమానంలో గుండెపోటుతో పారిశ్రామికవేత్త మృతి చెందాడు. ఇండోనేషియా నుంచి దుబాయ్కి బుధవారం రాత్రి విమానం బయలుదేరింది. విమానంలో ప్రయాణిస్తున్న ఇండోనేషియాకు చెందిన పారిశ్రామికవేత్త అవతీష్భాను (55)కు హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. దీంతో ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపాడు. సదరు విమానం చెన్నై సమీపంలో ఉండటం చేత ఎయిర్ పోర్టు అధికారులతో పైలట్లు సంప్రదించారు. చెన్నై ఎయిర్ పోర్టులో విమానం దిగేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో చెన్నై ఎయిర్ పోర్టులో రాత్రి 9గంటలకు అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. అక్కడ సిద్ధంగా ఉన్న డాక్టర్లు అవతీష్భాను ఆరోగ్యాన్ని పరిశీలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. అవతీష్ భాను మృతదేహాన్ని క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటలకు విమానం తిరిగి దుబాయ్కి బయలుదేరింది. -
కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
ఖమ్మం : విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఇస్లావత్ కేశవరావు అనే కానిస్టేబుల్కు ఆదివారం తీవ్రంగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడు కుప్పకూలి... మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం అందవలసి ఉంది. -
కానిస్టేబుల్కి గుండెపోటు: పోలీస్స్టేషన్లోనే మృతి
మెదక్ : మెదక్ జిల్లా మనూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న విఠల్ (45) అనే కానిస్టేబుల్ గురువారం గుండెపోటుతో స్టేషన్లోనే మృతి చెందాడు. రాత్రి డ్యూటీలో ఉన్న విఠల్ గురువారం వేకువజామున కాసేపు విశ్రమించాడు. నిద్రలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ రోజు ఉదయం సహాచర కానిస్టేబుళ్లు అతడిని నిద్రలేపినా లేవకపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి... మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం కల్యాణ మండలంలోని మాడి గ్రామం.అలాగే అతడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించారు. -
శంఖవరంలో విషాదం
* చిట్టిబాబు హఠాన్మరణంతో కలత చెందిన స్వగ్రామం * కన్నీరుమున్నీరుగా విలపించిన అభిమానులు * శ్రద్ధాంజలి ఘటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖవరం : అజాతశత్రువుగా, సహృదయునిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) కన్నుమూతతో స్వగ్రామం శంఖవరం శోకసంద్రంగా మారింది. కాకినాడలో నివసిస్తున్న చిట్టిబాబుకు ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రాగా అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్సనందిస్తుండగానే ఆయన కన్నుమూశారు. ఈ విషాదవార్త టీడీపీ శ్రేణుల్నీ, ఆయన అభిమానుల్నీ కలచివేసింది. ఎలాంటి భేషజాలూ లేకుండా వ్యవహరించే చిట్టిబాబుకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే గాక జిల్లాలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా పరిగణించే పర్వత కుటుంబంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాలుగో నేత చిట్టిబాబు. ప్రత్తిపాడు నియోజక వర్గపు తొలి ఎమ్మెల్యేగా పర్వత గుర్రాజు ఎన్నికై ఆ కుటుంబానికి వన్నెతెచ్చారు. తరువాత టీడీపీ తరఫున 1994లో ఆ కుటుంబం నుంచి పర్వత సుబ్బారావు, 1999లో ఆయన భార్య బాపనమ్మ ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చిట్టిబాబు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో చిట్టిబాబు గెలిస్తే మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు. ఓటమి చెందినా జిల్లా టీడీపీ పగ్గాలు ఆయనకు అప్పగించారు. పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో గెలవలేకపోయానని మథనపడ్డా జిల్లా సారథిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చిట్టిబాబు భౌతికకాయాన్ని కాకినాడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శంఖవరంలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చినప్పుడు కుటుంబసభ్యులే కాక పలువురు కార్యకర్తలు, అభిమానులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కుటుంబ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, చిట్టిబాబు భార్య అన్నపూర్ణ, తల్లి సీతారత్నం, తమ్ముడు రాజబాబు, కుమారై కనకదుర్గ, కుమారుడు రాజేష్, మరదలు జానకి వెక్కెక్కి విలపించారు. ఎందరో అభిమానులు ఆయన పార్ధివ దేహంపై పడి బావురుమన్నారు. పార్టీ ప్రముఖులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో శంఖవరం చేరుకుని చిట్టిబాబుకు శ్రద్ధాంజలి ఘటించారు. సంతాపసూచకంగా శంఖవరంలో దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. సాయంత్రం చిట్టిబాబు అంత్యక్రియలు జరిగాయి. టీడీపీ మంచి నేతను కోల్పోయింది : చంద్రబాబు చిట్టిబాబు మృతితో తమ పార్టీ మంచితనానికి మారుపేరైన నాయకుణ్ణి కోల్పోంుుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హెలికాప్టర్లో అన్నవరం చేరుకుని అక్కడి నుంచి శంఖవరం వచ్చిన చంద్రబాబు.. చిట్టిబాబు భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉండే చిట్టిబాబు స్వభావం చూసే జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పామన్నారు. మాజీ ఎమ్మెల్యే బాపనమ్మను, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పులపర్తి నారాయణమూర్తి, ఎ.ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, వే గుళ్ల జోగేశ్వరరావు, ఎస్వీఎస్ఎన్ వర్మ, తోట త్రిమూర్తులు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి తదితరులున్నారు. చిట్టిబాబు భౌతికకాయాన్ని కాకినాడ నుంచి శంఖవరం తరలించినప్పుడు వెంట ఎంపీ తోట, మాజీ మంత్రి కొప్పన మోహనరావు ఉన్నారు. ఆస్పత్రి వద్ద ప్రముఖుల నివాళి కాకినాడ సిటీ : చిట్టిబాబు మరణవార్త తెలియగానే ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని, జెడ్పీ చైర్మన్ నామన, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, దాట్ల బుచ్చిరాజు, టీడీపీ నగరఅధ్యక్షుడు నున్న దొరబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య తదితరులు అపోలో ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు. చిట్టిబాబు మృతి తమ పార్టీకి తీరనిలోటని చినరాజప్ప అన్నారు. -
పర్వత చిట్టిబాబు గుండె పోటుతో మృతి
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆదివారం గుండెపోటు మృతి చెందారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిట్టిబాబు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిట్టిబాబు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఎన్ చిన్నరాజప్ప, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సంతాపం తెలిపారు. నేటి సాయంత్రం 4.00 గంటలకు పర్వత చిట్టిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని శంకవరంలో జరగనున్నాయి. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
ఏలూరు : చెరువు పూడిక తీస్తూ ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఏపూరి వెంకటేశ్వరరావు (40) ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో బుధవారం శ్రీరామవరంలో చెరువు పూడిక తీయడానికి వెళ్లిన వెంకటేశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి... వెంకటేశ్వరరావును ఇంటికి చేర్చారు. స్థానిక వైద్యుడిని పిలిచేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. వైద్యుడు వచ్చేలోగానే వెంకటేశ్వరరావు మృతి చెందాడు.