-
TN: పురుగుల మందు తాగిన ఎంపీ కన్నుమూత
చెన్నై: లోక్సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. #UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2 — ANI (@ANI) March 28, 2024 డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్కు గురై మృతి చెందారు. 2019లోక్సభ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్కు పిలుపు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం: 1947 జూన్లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు. -
డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!
ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్లోనూ అంతా జోషఫుల్గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!. ఎన్ని ఘటనలు జరిగాయంటే.. ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్లో గుజరాత్లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్లో చోటు చేసుకుంది. రావు విజయ్కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే..? ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు. డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..? శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..? భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!) -
గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!
ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్ షాకిస్తే (డిఫిబ్రిలేషన్) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్ డబ్ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!! గత ఏడాది జూన్లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్ విల్సన్ రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్కు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్ గుండె సాధారణ స్థితికి రాలేదు.!! అంతేనా.. విల్సన్కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్ పక్కనే ఉండిపోయానని, "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
మైదానంలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. గుండెపోటు కారణంగా హోయ్సలా (32) అనే పేరుగల కర్ణాటక క్రికెటర్ మృతి చెందాడు. బెంగళూరులోని ఆర్ఎస్ఐ మైదానంలో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడుతో ఇవాళ (ఫిబ్రవరి 23) మ్యాచ్ జరుగుతుండగా హోయ్సలా మైదానంలోనే కుప్పకూలాడు. హుటాహుటిన సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు. బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హోయ్సలా అండర్ 25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసర బ్యాటర్గా పేరున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్.. కర్ణాటక ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు. క్రికెటర్లు మైదానంలో ఆటగాళ్లు ఇలా మృతి చెందడం ఇది తొలిసారి కాదు. గతంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఇయాన్ ఫాలీ, వసీం రజా, ఎడ్వర్డ్ కాక్స్, అండీ డకెట్, రేమండ్ వాన్ స్కూర్ హార్ట్ అటాక్ కారణంగా మైదానంలోనే ప్రాణాలు వదిలారు. రామన్ లాంబా, ఫిల్ హ్యూస్ లాంటి క్రికెటర్లు బంతి బలంగా తాకడంతో మృతి చెందారు. -
ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా?
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలం ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లారు. ఏమైందో ఏమో గత రాత్రి అకస్మాత్తుగా కార్షియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అస్సలు ఈ ప్యాక్రియాటిక్ క్యాన్సర్ గుండె లయలపై ప్రభావం చూపిస్తుందా?. అది ప్రాణాంతకమా? ఇక్కడ ప్యాంక్రియాస్ అనగా క్లోమ గ్రంధి. ఇది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది కాలేయం కింద, పిత్తాశయం, కడుపు, ప్రేగులకు దగ్గరగా ఉండే ఆకు ఆకారంలో ఉండే అవయవం. ఆహారం జీర్ణం చేయడానికి ముఖ్యమైన ఎంజైమ్ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీనిలో ఏదైనా సమస్య వస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్యాంక్రియాటిక్ రుగ్మతలు అంటే.. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలను కలిగిస్తాయి. ఇది సర్వసాధారణ రుగ్మత అధిక ఆల్కహాల్ తీసుకోవడం లేదా పిత్తాశయ రాళ్లు వంటి కారణాల వల్ల క్లోమగ్రంధిలో సమస్య తలెత్తి కడపు నొప్పి, వికారం, వాంతులకు దారితీస్తుంది. తీవ్రమైన రుగ్మత కాలేయ క్యాన్సర్. దీని కారణంగా కామెర్లు, అతిగా బరువు తగ్గడం తదితర సమస్యలు వస్తాయి. ప్యాంక్రియాటిక్ రుగ్మత లక్షణాలు.. పొత్తి కడుపు నొప్పి నిరంతరం తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వెనుకకు ప్రసరించడం. ప్యాంక్రియాటిక్ రుగ్మతల లక్షణం. ఈ నొప్పి తీవ్రతలో మారవచ్చు మరియు తినడం లేదా పడుకున్న తర్వాత తీవ్రమవుతుంది. ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పరిస్థితుల వల్ల చుట్టుపక్కల కణజాలంపై వాపు, అడ్డుపడటం లేదా ఒత్తిడి కారణంగా ఇది సంభవిస్తుంది. వికారం, వాంతులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు జీర్ణక్రియలో ఆటంకాలు కలిగిచడంతో వికారం, వాంతులు వంటి వాటికి దారితీస్తుంది. ఈ లక్షణాలు తరచుగా పొత్తికడుపు నొప్పితో పాటుగా ఉంటాయి. ఇవి కొవ్వు లేదా పెద్దగా భోజనం తినడం ద్వారా వస్తుంది. కామెర్లు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని కామెర్లు అని పిలుస్తారు. అది కాస్త ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా పిత్త వాహిక అవరోధం వంటి కాలేయ రుగ్మతలకు దారితీయొచ్చు. ముఖ్యంగా పిత్తాశయం నుంచి ప్రేగులలోకి పిత్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల రక్తప్రవాహంలో బిలిరుబిన్ అధికంగా ఏర్పడటంతో కామెర్లు రావడం జరుగుతుంది. అనూహ్యంగా బరువు తగ్గడం అనూహ్యంగా బరువు తగ్గడం అనేది ప్యాంక్రియాటిక్ రుగ్మతకు సంబంధించిన సాధారణ లక్షణం. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఆకలి లేకపోవడం, పోషకాలు శోషించుకోలేకపోవడం, తగిన జీవక్రియలు లేకపోవడం తదితర లక్షణాలు తలెత్తుతాయి. ప్రేగు కదలికల్లో మార్పులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు విరేచనాలు, జిడ్డుగల లేదా జిడ్డుగల మలం లేదా లేత-రంగు మలం వంటి ప్రేగు కదలికలలో మార్పులకు దారితీయవచ్చు. సరైన జీర్ణక్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం వల్ల ఈ మార్పులు సంభవించవచ్చు. మధుమేహం దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి కొన్ని ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతి వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. క్లోమ గ్రంధి రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్కు ఎలా దారితీస్తాయంటే.. ప్యాంక్రియాటైటిస్ లేదా క్లోమ గ్రంధి క్యాన్సర్ వంటి క్లోమ సంబంధిత రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్కు కారణమయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ వాపు లేదా క్యాన్సర్ బారిన పడినప్పుడు, అది గుండెతో సహా సమీపంలోని అవయవాలకు తీవ్రమైన మంట, హాని కలిగించే పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ వాపు శరీరంలో రకరకాల సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరుకు కీలకమైన పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే, ప్యాంక్రియాటిక్ రుగ్మతలు శరీరంపై గణనీయమైన నొప్పి, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.క్రిటికల్ పరిస్థితుల్లో అది కాస్త గుండెపై ఈ ఒత్తిడి ఏర్పడి ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి తత్ఫలితంగా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. ఇక్కడ గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. (చదవండి: నటుడు శరత్బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
పాపులర్ బాడీ బిల్డర్ కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూత
పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) కార్డియాక్ అరెస్ట్తో మరణించారు. బ్రెజిల్కుచెందిన ఈయన సోషల్ మీడియాలో బాగా పాపులర్. అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల అతను మరణించాడనే వార్తలు సోషల్మీడియలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రొడాల్ప్ స్పోర్ట్స్ మెడిసిన్ అడ్ ఫార్మకాలజీ క్లినిక్ ఖండించింది. కాలేయంలో ట్యూమర్,రక్తస్రావం కారణంగా సావో పాలోలో రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు CNN బ్రసిల్ నివేదించింది. ఆదివారం (నవంబర్, 19) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడని , కాలేయంలోని అడెనోమా ఫలితంగా రక్తస్రావం కారణంగా ఆయన గుండె ఆగిపోయిందని తెలిపింది. తన రోజువారీ జీవితంలోని ఫోటోలతోపాటు, జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య కరోలిన్ సాంచెస్తో వీడియోలను కూడా ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. తన రోగులు, ఇతర అథ్లెట్లు, బాడీ బిల్డర్ల అద్భుతమైన ఫలితాలను కూడా చూపించేవారు. ఇన్స్టాగ్రామ్ స్టార్కు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Caroline Sanches (@carolinessanches) సావో పాలోకు దక్షిణాన మోమాలో ఉన్న ఈయన క్లినిక్ ఉంది. సాంచెస్ అక్కడ పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నారు. కాబోయే భర్త ఆకస్మిక మరణం తరువాత సాంచెస్ అతను గిటార్ వాయిస్తూ ‘మన మధ్య ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం’ అంటూ పాడుతున్న వీడియోను ఎప్పటి ఎప్పటికీ శాశ్వతం అంటూ పోస్ట్ చేశారు.కాగా డాక్టర్ శాంటోస్ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో నుండి స్పోర్ట్స్ మెడిసిన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో డిగ్రీలు పొందారు. View this post on Instagram A post shared by Rodolfo Duarte (@rodolfo.drsantos) -
గుండెపోటుతో ఎయిర్ ఇండియా పైలట్ మృతి.. 100 రోజుల్లో మూడో ఘటన
న్యూఢిల్లీ: ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో మృత్యుతపడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఓ యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్ హిమ్మనీల్ కుమార్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పైలట్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సీనియర్ కమాండర్ పైలట్ అయిన హిమ్మనీల్ కుమార్, పెద్దవైన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లను ఆపరేట్ చేసేందుకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఆగస్టు 23న జరిగిన వైద్య పరీక్షల్లో ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆయన మరణించడంపై ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు నెలలో ముగ్గురు పైలట్లు మృతువాతపడ్డారు. గత ఆగస్టులో ఇండిగో ఎయిర్లైన్కి చెందిన పైలట్ పూణేకు విమానం టేకాఫ్ అయ్యే ముందు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయాడు. అతడికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేకపోయారు. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న స్పైస్జెట్ కెప్టెన్ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తుండగా విమానంలోనే మరణించాడు. చదవండి: సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు.. -
ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది! ఆల్మోస్ట్ డెడ్ కానీ..
మృత్యువు ఒడిలోకి వెళ్లి కూడా బతికి వస్తే వాట్ ఏ మిరాకిల్ అనుకుంటాం. మన కళ్లను మనమే నమ్మలేని కఠిన నిజం గందరగోళానికి గురి చేసేలా మన కళ్లముందు మెదిలాడుతుంది. ఆ క్షణం మన ఆనందానికి అవధులుండవు. అలాంటి ఓ అద్భుత ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. యూఎస్లోని టీనా అనే ఓ మహిళ కార్డియాక్ అరెస్టుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. ఓ వైపు శరీరం నీలం రంగులోకి మారిపోతుంది కూడా. ఇంతలో ఆమె భర్త ఆమెను బతికించేలా చేస్తున్న సీపీఆర్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంబులైన్స్ని పిలిపించి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. అంతేగాదు ఆస్పత్రికి వెళ్లే మార్గంలో సైతం ఆమెను బతికించేలా ఆక్సిజజన్ అందించి గుండె పనిచేశాల చేసే ప్రథమ చికిత్సల్లో వేటికి ఆమె స్పందించలేదు. చివరికి ఆస్పత్రిలో వైద్యుల సైతం ఆమె చనిపోయిందని డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఓ శవం మాదిరి నిర్జీవంగా పడి ఉంది టీనా. దీంతో వైద్యులు చివరి ప్రయత్నంగా డీఫిబ్రిలేటర్తో షాక్ ఇద్దాం అని డిసైడ్ అయ్యి ఇస్తే..ఏదో నిద్రలో మెల్కోన్నట్లు కళ్లు తెరించింది. ఆ హఠాత్పరిణామానికి వైద్యులు సైతం సభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అసలు చలనం లేకుండా శవంలా పడి ఉంది. స్పదించదని తెలిసే జస్ట్ అలా కరెంట్ షాక్ ఇచ్చామని చెబుతున్నారు వైద్యులు. ఐతే కళ్లు తెరిచి చూసింది గానీ ఏం మాట్లాడలేకపోయింది. ఈ తంతంగమంతా చూస్తున్న ఆమె సభ్యులు కూడా విస్తుపోయారు. నిజంగా ఆమె బతికిందా దెయ్యమా? అన్నంత టెన్షన్గా చూశారు ఆమెను. ఆమె ఏం మాట్లాడలేదని వైద్యుల కుటుంబంసభ్యులకు చెప్పడంతో అంతా సైలెంట్గా ఉన్నారు. ఆమెకు ఒక పుస్తకం, పెన్ను ఇచ్చి నీకు ఏం జరిగిందో లేక గుర్తున్నది అందులో రాయమని సూచించారు. చనిపోయి బతికావని తెలుసా అని వైద్యులు అడగగా..ఔను! ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉన్నట్లు అనిపించిందని ఎంత ప్రయత్రించినా మేల్కొలేకపోతున్నట్లు తెలిసిందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా జరిగినప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్కి అందక మెదడులో బ్లీడింగ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల బతకదని తేల్చి చెప్పాం అన్నారు. ఆమె బతికినా బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో పరీక్షలు చేసినా వాటి తాలుకా గాయాలు ఏం కనిపించకపోవడం వైద్యులను మరింత ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెను మరో నాలుగు రోజులు పూర్తి అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. (చదవండి: ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!) -
ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోవడమా..! పాపం ఆ వ్యక్తి..
సాధారణంగా గుండెపోటు వస్తేనే మనుషులు గిలగిల లాడిపోతారు. అలాంటిది ఒకేరోజు ఆరుసార్లు గుండె ఆగిపోతే ఆ మనిషి ఉంటాడా? అని డౌటు వస్తుంది కదా!. ఒకవేళ బతికినా పూర్తిస్థాయిలో కోలుకుంటాడా అన్నది అనుమానమే. అచ్చం అలానే భారత సంతతి విద్యార్థి కార్డియాక్ అరెస్ట్కి గురయ్యాడు. అయితే అతను ఏమయ్యాడు? బతికాడా? అనే కదా!. నిజానికి ఇలా ఆరుసార్లు గుండె ఆగిపోవడం జరుగుతుందా? ఎందుకిలా? తదితరాల గురించే ఈ కథనం. యూకేలోని 21 ఏళ్ల భారత సంతతి అమెరికన్ విద్యార్థి అతుల్ రావు ఒకే రోజు ఆరుసార్లు గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ని పిలిపించారు. ఇంతలో సెక్యూరిటీ గార్డు అతని ఛాతీకి కంప్రెషన్ ఇచ్చేలా సీపీఆర్ చేశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చేరేటప్పటికీ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు. ఎక్స్ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)కి యాక్సిస్ చేశారు. గుండె, ఊపిరితిత్తుల పనిని పూర్తిగా భర్తీ చేసేలా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని అమర్చారు వైద్యులు. ఇంతలో క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ పనిచేయం ప్రారంభించాయి. దీంతో అతను లైఫ్ సపోర్ట్ మెషీన్లు, ఈసీఎంఓ తదితరాలు లేకుండానే పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతుల్ ఇప్పుడు యూఎస్కి తిరిగి వెళ్లాడు. పూర్తిగా కోలుకున్నాడు కూడా. స్టూడెంట్ అతుల్ రావు ఎదుర్కొన్న ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో పల్మనరీ ఎంబోలిజం అంటారు పల్మనరీ ఎంబోలిజం అంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పల్మోనరీ ఎంబోలిజం చాలా సందర్భాల్లో కాలులోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం మొదలై ఊపిరితిత్తులకు వెళ్తుంది. అరుదుగా శరీరంలోని వేరే ఏదైనా భాగంలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులకు రక్తప్రవాహాన్ని పరిమితం చేసి, ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా పల్మనరీ ధమనుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. దీన్నే పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఈ పల్మోనరీ ఎంబోలిజంలో గుండె లేదా ఊపిరితిత్తులకి రక్తప్రవాహం ఆగిపోయి పనితీరుకి ఆటకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె లేదా ఊపిరితిత్తులు ఆకస్మికంగా వైఫల్యం చెంది మరణానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉన్న గుండె, రక్తనాళాల వ్యాధులకు సంబంధించిన వాటిల్లో ఇదొకటి. లక్షణాలు శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పులు కాలక్రమేణా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే, చాలా మంది రోగులు శ్లేష్మంతో దగ్గినా. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం ఛాతీ, చేయి, భుజం, మెడ లేదా దవడలో పదునైన నొప్పి దగ్గు పాలిపోయిన చర్మం వేగవంతమైన హృదయ స్పందన విపరీతమైన చెమట ఆత్రుత మూర్ఛపోవడం లేదా స్ప్రుహతప్పిపోవడం గురక ఎవరికి ప్రమాదం అంటే.. కాలులో రక్తం గడ్డకట్టిన వారు కూర్చొని పనిచేసేవారు సిరకు గాయం లేదా గాయం కలిగిన వారు చాలా కాలం పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం లేదా హార్మోన్ పునఃస్థాపన చికిత్స చేయించుకోవడం పొగ స్ట్రోక్ వంటి గుండె జబ్బుల చరిత్రను కలిగి ఉండటం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా(80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన ఉప్కార్, రోటీ కప్డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో బీర్బల్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు జుగ్ను మీడియాకు తెలిపారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయం తెలుసకున్న సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించింది. ఖోస్లా ముఖ్యంగా హాస్య పాత్రలకు పేరు సంపాదించుకున్నారు. 'షోలే' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. షోలేలో ఖైదీగా అతని పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాలలో కూడా నటించారు. CINTAA expresses its condolences on the demise of Birbal (Member since 1981) .#condolence #condolencias #restinpeace #rip #birbal #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/bTXH0LArRp — CINTAA_Official (@CintaaOfficial) September 12, 2023 -
వాల్వ్లు బ్లాక్ కావడం వల్ల గుండెపోటు వస్తుందా? రాకుండా ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే హార్ట్ఎటాక్కు గురవుతున్నారు.అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నడిమింటి నవీన్ మాటల్లోనే.. మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అలాంటి గుండెకు కూడా రక్తం అవసరం అవుతుంది.మరి ఈ గుండె గోడలకు "హృదయ ధమనులు" అనే అతి ముఖ్యమైన రక్త నాళాలు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి. మనం తినే ఆహారంలో అధిక క్రొవ్వు పదార్థాలు ఉన్నట్లైతే ఈ కొవ్వు హృదయ ధమనుల్లో క్రమ క్రమంగా పేరుకు పోయి ఒకానొక దశలో గుండె గోడలకు రక్త సరఫరా పాక్షికంగానో, పూర్తిగానో ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అదృష్టం కొద్దీ బతికితే వైద్యులు హృదయ ధమనులు గుండా రక్తం సాఫీగా ప్రవహించడానికి అవసరమైతే స్టెంట్ వేయడం లేదా రక్తం పలుచబడే ట్యాబ్లెట్స్ వాడమని చెబుతారు. వాల్వ్లు బ్లాక్ కావడం వల్ల వచ్చే గుండెపోటు చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది గుండెపోటు రావడానికి కారణం వాల్వ్లు బ్లాక్ కావడమే అనుకుంటారు. కానీ హార్ట్ఎటాక్ రావడానికి ప్రధాన కారణం కవాటాలు పనిచేయకపోవడం(వాల్వ్లు బ్లాక్ కావడం)కాదు. గుండెపోటు రావడానికి కారణం వృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం చిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్ఫుడ్లు వదలలేకపోవడం కాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడం శక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడం గుండెపోటు రాకుండా ఏం చేయాలి? క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడం ప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక వ్యాయామము చేయడం. ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. హార్ట్ ఎటాక్తో బుల్లితెర నటుడు మృతి!
ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్ హార్ట్ ఎటాక్తో మరణించారు. అతని వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లే. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: యోగి ఆదిత్యనాథ్ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?) పవన్ సొంత ఊరు కర్ణాటక మాండ్యా జిల్లాలోని హరిహరపుర గ్రామానికి చెందినవారు కాగా.. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబయిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. పవన్ హిందీ, తమిళ భాషల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతి పట్ల మాండ్యా ఎమ్మెల్యే హెచ్టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: 1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే) నటుడి భార్య కన్నుమూత ఇటీవలే కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్ల్యాండ్ వెకేషన్లో ఉండగా గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
మహిళల్లో గుండెపోటు రిస్క్ పెరిగింది.. కోవిడ్ కారణమా?
పెరిగిన గుండెపోటు ముప్పు ఇటీవలి రోజుల్లో చిన్న వయసులోనే మహిళలు కూడా గుండెపోటుకు గురవడం 8 శాతం పెరిగిందని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సీఏ మంజునాథ్ తెలిపారు. సోమవారం నటి స్పందన మృతిపై డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ ఇటీవల జీవనశైలి, ఆహార పద్ధతులు మారాయని, దీంతో పాటు మానసిక శారీరక ఒత్తిడులు కూడా గుండెపోటుకు కారణమన్నారు. 40 ఏళ్లలోపు వారికి కూడా గుండెజబ్బులు ► ఒక అధ్యయనం ప్రకారం 40 ఏళ్ల లోపు వయసు వారికి గుండెపోటు రావడం 35 శాతం పెరిగింది. ►గతంలో మహిళల్లో గుండెపోటు కేసులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ► 40 ఏళ్లులోపు మహిళల్లో గుండెపోటు కేసులు 8 శాతం పెరగడం ఆందోళనకరం. ► దేశంలో యువత, మధ్య వయసువారిలో గుండెపోటు వచ్చే ముప్పు 28 శాతం పెరిగింది. ► ఈ కేసుల్లోనూ కార్డియాక్ అరెస్ట్ (గుండె స్తంభించడం) 90 శాతం ఉంది. ► కోవిడ్ మహమ్మారి తరువాత 3 నుంచి 5 శాతం గుండెపోటు కేసులు పెరిగాయి, ప్రతి ఒక్కరూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. - ప్రముఖ వైద్యుడు మంజునాథ్ -
తెగిన లిఫ్ట్ వైర్, 8వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో..
నోయిడా: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని ప్రమాదాలతో రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్లోని లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు జారడంతో గుండెపోటుకు గురై ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో గురువారం ఈ ఘోరం వెలుగుచూసింది. నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి 73 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో 8 ఫ్లోర్లు కిందకు జారిపడింది. అయితే లిఫ్ట్ గ్రౌండ్ను ఢీకొట్టకుండా మధ్య అంతస్తుల్లో చిక్కుకుపోయింది. ఊహించని పరిణామంతో లిఫ్ట్లో ఒంటరిగా ఉన్న మహిళ స్పృహతప్పి పడిపోయింది. కాసేపటికి గమనించిన సిబ్బంది మహిళను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది. అయితే మహిళ తల వెనక, మోచేతి వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. లిఫ్ట్ పడిపోవడం వల్ల ఆమెకు ఈ గాయాలైనట్లు పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని ఆకస్మిక ఘటనతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అపార్ట్మెంట్కు చెందిన వందలాది మంది సొసైటీ కాంప్లెక్స్ బయటకు వచ్చి జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వృద్ధురాలి మృతికి యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చదవండి: ఎట్టకేలకు సీఎం ‘కుర్చీ’లో కూర్చున్న అజిత్ పవార్ -
ఆకస్మిక గుండెపోటు మరణాలపై సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. యువతలో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయని, కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో శుక్రవారం తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు. చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. చదవండి: గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం! ఎన్పీ-ఎన్సీడీ కింద 724 జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్లు, 210 డిస్ట్రిక్ట్ కార్డియాక్ కేర్ యూనిట్లు, 326 డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లు, 6,110 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధి రోగులు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులతో సహా హెల్త్కేర్ డెలివరీ సిస్టమ్లోని వివిధ ఆరోగ్య సదుపాయాలలో చికిత్స పొందుతున్నారని మన్సూక్ మాండవీయ వివరించారు. -
హార్ట్ ఎటాక్, హార్ట్ అరెస్ట్ తేడా ఇదే!
-
అతని గొంతు లేకుండా నా సభల్లేవ్: కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సాయిచంద్ హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను.. చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నట్లు తెలిపారాయన. సాయిచంద్ లేకుండా.. అతని గొంతులేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే నున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. హరీష్ రావు కంటతడి సాయిచంద్ హఠాన్మరణం వార్తతో గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలి వెళ్లారు పలువురు నేతలు. వాళ్లలో మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు. చిన్నవయసులో కన్నుమూయడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ పూర్తికావడంతో గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. ► సాయిచంద్ మృతిపట్ల పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, భువనగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. సాయి చంద్ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది సాయిచంద్ మృతిపట్ల కల్వకుంట్ల తారకరామారావు విచారం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని.. యువకుడైన సాయిచంద్ అకాల మరణం చెందడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Saddened by the loss of a rare talent and a gifted Singer, Sri #SaiChand garu. His mesmerizing voice graced the Telangana moment, stirring souls with countless inspirational songs. Leaving an indelible mark on our hearts, his legacy will forever be cherished. Our heartfelt… pic.twitter.com/nTJzfLIAeS — Santosh Kumar J (@SantoshKumarBRS) June 29, 2023 తెలంగాణ ఉద్యమ గొంతు మూగబోయిందంటే ఇప్పటికి నమ్మశక్యంగా లేదు.. ఇకముందు ఏ సభలోనూ నీ గొంతు ఉండదు ఇక ఆగిపోయిందంటే ఊహించడానికి కూడా కష్టంగా ఉంది.. నీ గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే అన్నా.... ఉద్యమ గొంతుక నీకు జోహార్లు 🙏🙏🙏🙏 Miss u Anna ఓం శాంతి#SaiChand pic.twitter.com/28fuOF9I5K — Srinivas Nelli BRS (@SrinivasNBRS) June 29, 2023 -
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్హౌజ్కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్కు రాజకీయ గురువు ఈయనే! -
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
లాంగ్ కోవిడ్ వల్లే ఆకస్మిక మరణాలు.. వ్యాక్సిన్లే కారణమా? డాక్టర్ల క్లారిటీ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఇటీవల చూస్తున్నాం. అలా కుప్పకూలి మరణించిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమని.. కొన్నిరకాల మందులు వాడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకస్మిక మరణాలకు కారణాలను కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన గుండె సమస్యలు కోవిడ్ తర్వాత ప్రజల్లో గుండె జబ్బులు బాగా పెరిగినట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్ట్ కోవిడ్ కండిషన్) ఎదుర్కొన్న వారిలో గుండె జబ్బులు రెండు రెట్లు అధికమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలోనే కార్డియాక్ అరెస్ట్లు జరుగుతున్నట్టు వెల్లడిస్తున్నారు. ఆకస్మిక మరణాలతోపాటు, కొందరు పీఓటీఎస్ (పాచ్యురల్ టాచీకార్డియా సిండ్రోమ్) ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉన్న పొజిషన్ నుంచి మారినా, కూర్చుని, పడుకుని లేచినా గుండె దడగా ఉండటం జరుగుతుందని (కూర్చుని లేచిన తర్వాత లేదా పడుకున్న తర్వాత గుండె కొట్టుకునే రేటు చాలా త్వరగా పెరగటం) చెబుతున్నారు. ఇవీ కారణాలు ♦ రక్తనాళాల్లో పూడికల వల్ల గుండెపోట్లు వస్తున్నాయి. ♦ గుండె కండరాలు ఉబ్బడం (మయో కార్డిటైస్) వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ♦ గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్–అర్రిటమియా) కూడా కారణం. ♦ పల్మనరీ ఎంబోలిజం (గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) కూడా దీనికి కారణమవుతోంది. ముందుగా గుర్తించడం కష్టమే కోవిడ్ తర్వాత కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారిలో డీ–డైమర్ వంటి పరీక్ష చేసినప్పుడు రక్తం చాలా సాధారణంగా ఉన్నా.. మరుసటి రోజుకే గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబోలిజమ్తో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ ఎంబోలిజంను ముందుగా గుర్తించడం కష్టమేనని పేర్కొంటున్నారు. రక్తంలో నీటి శాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అపోహలెన్నో.. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమని.. ఫలానా వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండెపోటు వస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అత్యుత్తమ మార్గమని గుర్తించి అందరికీ వేయడం జరిగిందంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో వేసిన ఎంఆర్ఎన్ఏ (ప్రైజర్, మోడెర్నా) వంటి వ్యాక్సిన్లలో దుష్పలితాలను గుర్తించారని, అవి మన దేశంలో వేయలేదని స్పష్టం చేస్తున్నారు. ముందు జాగ్రత్తలే మేలు ♦ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు. ♦ శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ♦ జీవన శైలిని మార్చుకోవడం ♦ స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం ♦ రెగ్యులర్గా వ్యాయామం చేయడం ♦నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్తోనే.. కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్టు కోవిడ్ కమిషన్) ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికం. ఆకస్మిక మరణాలకు పల్మనరీ ఎంబోలిజం, కార్డియాక్ అరెస్ట్లు కారణంగా ఉంటున్నాయి. కోవిడ్ తర్వాత హార్మోన్లలో సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. రక్తంలో నీటిశాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడతాయి. అలాంటి వారు ఆకస్మికంగా మరణించే అవకాశం ఉంది. జీవనశైలి మార్చుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను అధిగమించవచ్చు. – బి.విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
సీపీఆర్పై అవగాహన అవసరం
పంజగుట్ట: మన దేశంలో ప్రతి నిమిషానికి 112 కార్డియాక్ అరెస్టులు సంభవిస్తున్నాయని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 80 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతున్నాయని, సీపీఆర్పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రెడ్క్రాస్ సొసైటీ, ప్రెస్క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా సీపీఆర్పై ఎన్సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించనున్న సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. రెడ్క్రాస్ మాదిరిగా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీపీఆర్పై అవగాహన కల్పించాలని కోరారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ అశిమా శర్మ మాట్లాడుతూ.. సీపీఆర్ చేసే సమయంలో స్కిల్స్ ఎంతో ముఖ్యమని, బ్రీతింగ్, నాడి చూడాలని, భుజం తట్టి స్పందిస్తున్నారో లేదో చూడాలన్నారు. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు నిమ్స్లో పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సీపీఆర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ బి.విజయ్భాస్కర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, కె.మదన్మోహన్రావు, రమణ పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా పసుమర్రులో 17 ఏళ్ల ఫిరోజ్ గుండెపోటుతో మృతి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement