Dress
-
నోరూరించే పాప్కార్న్ డ్రెస్లో నటి ఎమ్మా స్టోన్..!
పాప్ కార్న్ని ఇష్టపడనివారు ఉండరు. టైం పాస్గానూ, మూవీ థియోటర్లలోనూ తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. అలాంటి ఈ పాప్ కార్న్ మన తాత ముత్తాతల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ బెస్ట్ స్నాక్ ఐటెంగా రాజ్యమేలుతుంది. అలాంటి పాప్ కార్న్తో ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేసింది హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్. అసలు పాప్కార్న్తో ఫ్యాషన్ ఏంటి అనే కదా..!. ఆమె పాప్ కార్న్తో డిజైన చేసిన ఎరుపు రంగు గౌనులో మెరిసింది. ఇంతకీ ఆ గౌను ఎలా ఉంటుందో తెలుసా..!.ఈ చిరుతిండితో ఫ్యాషన్గా ఉండొచ్చనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో గానీ ఆ గౌను డిజైనింగ్ మాత్రం అదుర్స్. ఎరుపు రంగుతో కూడిన క్లాసిక్ పాపకార్న్ బకెట్ మాదిరిగా ఉంది. అచ్చం మనం మూవీ థియేటర్లో కొనుగోలు చేసే పాప్ కార్న్ బకెట్ మాదిరిగా డిజైన్ చేశారు. అంతేగాదు ఆమె నడుమ వద్ద శంఖాకారం మాదిరి పాకెట్స్లలో పాప్కార్న్తో నిండి ఉన్నాయి. ఎమ్మా రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా నడుస్తూ వస్తూ..చేతిలో పాప్ కార్న్ ప్యాకెట్తో తింటూ వచ్చింది. చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మ వచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన నోరూరడమే గాక ఇలా చిరుతిండిని స్టైల్గా మార్చిన క్రియేటివిటిని మెచ్చుకోకుండా ఉండలేరు.ఇక నటి ఎమ్మాస్టోన్ సాటర్డే నైట్ లైవ్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇలా వెరైటీ లుక్లో తళుక్కుమంది. రెడ్ కార్పెట్పై ఏ లిస్ట్ సెలబ్రిటీల పాప్ సంస్కృతికి అద్దం పట్టేలా ఎమ్మా స్టోన్ ఇలా సరికొత్త ప్యాషన్ లుక్తో సందడి చేసింది. అయితే ఇలా ఆహార ప్రేరేపిత ఫ్యాషన్ స్టార్ట్ చేయడం తొలిసారి కాదు. గతంలో మైఖేల్ షానన్ పసుపు చిప్స్ బ్యాగ్తో రెడీ అయ్యి 2024 మెట్ గాలాకు హాజరయ్యారు. మైఖేల్ డిజైనర్ వేర్ని ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ బాలెన్సియాగా రూపొందించారు. ఆ బ్రాండ్ పేరు "మ్యాక్సీ ప్యాక్". అంతేగాదు ఆ ఆహార ప్రేరేపిత డిజైనర్వేర్లో చీజ్, ఉల్లిపాయ వంటివి కూడా ఉండటం విశేషం. అయితే సోషల్ మీడియాలో ఈ డిజైనర్ వేర్ పలువురిని విశేషంగా ఆకర్షించింది. Emma Stone and Meryl Streep #SNL50 pic.twitter.com/VvsIhIjs7e— best of emma stone (@badpostestone) February 17, 2025 (చదవండి: డిజైర్ డిజైన్స్..! మధ్యతరగతి వాళ్లు కూడా కొనేలా డైమండ్స్..) -
వజ్రాల్లో ఒదిగిపోయిన దేవర భామ జాన్వీ కపూర్.. (ఫోటోలు)
-
Delhi Election 2025: కేజ్రీవాల్ ఇంటికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢ్లిలీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు((శనివారం) జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది. #WATCH | Delhi: A young supporter of AAP National Convenor Arvind Kejriwal, Avyan Tomar reached the residence of Arvind Kejriwal dressed up as him to show support. pic.twitter.com/dF7Vevy6En— ANI (@ANI) February 8, 2025 ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి 'బేబీ మఫ్లర్ మ్యాన్' వచ్చాడు. ఇతని పేరు అవ్యాన్ తోమర్. కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన ధరించిన లాంటి దుస్తులు ధరించి వచ్చాడు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న అవ్యాన్ తోమర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడికి వస్తుంటామని, ఆమ్ ఆద్మీ పార్టీనే మా కుమారునిని ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిందని తెలిపారు. #WATCH | Delhi: Avyan Tomar's father, Rahul Tomar says, "... We always come here on result days... The party has also given him the name of 'Baby Muffler Man'..." pic.twitter.com/cMdDc3sGWf— ANI (@ANI) February 8, 2025 -
ప్రియుడితో కలిసి ట్విన్నింగ్ డ్రెస్లో బిగ్ బాస్ బ్యూటీ
-
ముత్యాలే డ్రెస్సులుగా!
ముత్యాల ఆభరణాలు మనసును ఆహ్లాదంగా మార్చేస్తాయి. ముత్యాల వరసలతో చేసిన డ్రెస్సులు వేసుకుంటే.. వేడుకలలో హైలైట్గా నిలుస్తున్న ఈ స్టైలిష్ డ్రెస్సులను సెలబ్రిటీలే కాదు నవతరమూ కోరుకుంటోంది.వెస్ట్రన్, ఇండియన్ పార్టీ ఏదైనా ముత్యాల డిజైనరీ డ్రెస్సులను ధరిస్తున్నారు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు.సాధారణంగా ఆభరణాలలో చూసే ముత్యాలను డ్రెస్ డిజైనింగ్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే, ముత్యాలు ఇటీవల ఫ్యాషన్లో కీలకమైన అంశంగా మారాయి. తెలుపు, సిల్వర్, వైట్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న మెటీరియల్పైన తెల్లని ముత్యాలను మరింత ఆకర్షణీయమైన ఎంపికగా డిజైనర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరహా దుస్తులు స్వచ్ఛతకు, క్లాసీ లుక్కు ఉదాహరణగా నిలుస్తున్నాయి. శారీస్, స్కర్ట్స్ మీదకు టాప్స్గా ఉపయోగించే వాటిలో కోర్ జాకెట్స్, ష్రగ్స్, బ్లౌజ్ బ్యాక్ డిజైన్కి ఎక్కువ శాతం ముత్యాల వరసలను ఎంచుకుంటున్నారు. లెహంగా, శారీ ఎంబ్రాయిడరీలోనూ జర్దోసీ, సీక్వెన్స్తోపాటు కాంబినేషన్గా ముత్యాల వరసలు విరివిగా కనిపిస్తున్నాయి. వింటర్–సమ్మర్ పార్టీవేర్కి, ఇండోవెస్ట్రన్ స్టైల్స్కి చిన్న, పెద్ద ముత్యాలను ఉపయోగిస్తూ చేసే డ్రెస్ డిజైన్స్ ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ముత్యాలతో చేసే డిజైన్స్ ఖరీదులో ఘనంగా ఉంటే వాటి స్థానంలో ఉపయోగించే వైట్ బీడ్స్తో రెప్లికా డిజైన్లు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో తక్కువ ఖరీదులోనూ ఈ తరహా డిజైన్స్ లభిస్తున్నాయి. ఈ డిజైనరీ డ్రెస్సులే ఓ పెద్ద అట్రాక్షన్ కావడంతో మరే ఇతర ఆభరణాలు, హంగుల అవసరం ఉండదు. (చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..) -
ఐశ్వర్య డ్రెస్సింగ్పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
మరింత బోల్డ్గా డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్.. క్రేజీ అవార్డ్ కొట్టేసింది!
-
దీపావళి వేళ సంప్రదాయబద్ధంగా కనిపించేలా స్టైలింగ్ చిట్కాలు..
అమావాస్య నాడు జరుపుకునే ఈ వెలుగుల పండుగ అంటే అందరికి ఇష్టం. అన్ని మతాల వారు జరుపుకునే గొప్ప పండుగా. ముఖ్యంగా ఈ దీపాల వెలుగులో అద్భతంగా కనిపించేలా ముస్తాబవ్వాలని మగువలు భావిస్తారు. అందుకోసం స్టైలిష్ లుక్లో కనిపిస్తూనే సంప్రదాయబద్ధంగా హుందాగా ఉండాలంటే ఈ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి..దీపావళి అంటే దీపాల వెలుగులు, రుచికరమైన స్వీట్లు మాత్రమే కాదు. పండుగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేయడంలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయంగా స్టైలిష్ లుక్లో కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి..రిచ్ లుక్ చీర..దీపావళి వెలుగులు విరజిమ్మిలే కనిపించేందుకు రిచ్ లుక్ ఉన్న శారీని ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. బంగారు పసుపు, ఎరుపు, నారింజ, ఊదా రంగులు పండుగ వాతావరణాన్ని తలిపించేలా చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ట్రెండింగ్లో ఉన్న సీక్విన్ చీరలను ఎంచుకుంటే స్టైలిష్గా ఉంటారు. అనార్కలి గౌనుగ్రాండ్గా కనిపించేలా డ్రెస్ ధరించాలంటే మాత్రం అనార్కలీని ఎంపిక చేసుకోవడం మంచిది. ఈ పొడవాటి గౌన్లు మొత్తం రూపాన్ని కొత్తగా కనిపించేలా చేయడమే గాక వేడుకకే ఓ లుక్ వస్తుంది. .లెహంగాస్లెహంగాలు సాంప్రదాయ ఆధునిక సౌందర్యాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. క్లాసిక్ చోలిస్ నుండి ట్రెండీ క్రాప్ టాప్స్ వరకు విభిన్న బ్లౌజ్ స్టైల్స్తో జత చేస్తే ఆ లుక్కే వేరు. అందుకోసం క్లిష్టమైన ఎంబ్రాయిడరీ లేదా మిర్రర్ వర్క్తో అలంకరించిన గ్రాండెడ్ కలర్ లెహంగాలు ఎంచుకోండిచీరకట్టు స్టైల్ డిజైర్వేర్..గ్రాండెడ్ చీరతో డిఫెరెంట్ లుక్లో కనిపించాలనుకుంటే..రెడీమేడ్ డ్రెస్డ్ స్కర్ట్లను ఎంచుకోండి. వాటిని అద్భుతమైన బ్లౌజ్లతో జత చేయండి. సల్వార్ సూట్పండుగలకు ఇష్టమైన, సల్వార్ సూట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి సరైన ఆభరణాలను జోడిస్తే మరింత అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో వివిధ రకాల సల్వార్లు దర్శనమిస్తున్నాయి. మంచి కలర్తో కూడిన సల్వార్ సూట్లు వేడుకలను మరింత కలర్ఫుల్ మయం చేస్తాయి.(చదవండి: ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!) -
గ్రీన్ డ్రెస్లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
భార్యల్ని పొట్టిబట్టల్లో చూసి మురిసిపోతారా? హవ్వా!!
బిగ్ బాస్-6 ఫేమ్, హీరోయిన్ సనా ఖాన్ గుర్తుందా. హాట్ గ్లామరస్ రోల్స్ మాత్రమేచేస్తూ చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోసిన సనాఖాన్ తాజాగా మహిళల వస్త్రధారణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యలు చిన్న దుస్తులు వేసుకోవడానికి భర్తలు ఎలా అనుమతిస్తారు అంటూ ప్రశ్నలు వేస్తోంది. అంతేకాదు ఆ సమయంలో తనకేదో దెయ్యం పట్టింది, అందుకే తన సినిమాల్లో ఆధునికత పేరులో పిచ్చి బట్టలు వేసుకున్నాను, ఇపుడు సిగ్గుపడుతున్నాను అంటూ వ్యాఖ్యానించడం నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.రుబీనా దిలైక్తో నిర్వహించిన పోడ్కాస్ట్లో సనాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సైతాన్ కారణంగానే సింప్లిసిటీకి బదులు మోడ్రన్ దుస్తులు, సల్వార్-కమీజ్పై స్లీవ్లెస్ ధరించేలా చేసిందని, తన జీవితంలో అదొక అధ్వాన్నమైన సమయమని చెప్పింది. ప్రస్తుతం తప్పు ఏంటో తెలుసుకున్నా, సిగ్గుపడుతున్నా అని పేర్కొంది. అంతేకాదు ప్రతీ పురుషుడు తన భార్య నిరాడంబరంగా దుస్తులు ధరించాలని కోరుకుంటాడు, కానీ కొంతమంది ఎక్స్పోజింగ్ దుస్తులు వేసుకునేలా భార్యల్ని,ఎందుకు ప్రోత్సహిస్తారో అర్థం కాదని వాపోయింది. ‘ఆమె నీ భార్య కొంచెమైనా ఆత్మగౌరవం ఉండాలంటూ’ హితవు పలకడం గమనార్హం. కాగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో ‘జై హో’, టాలీవుడ్లో కళ్యాణ్రామ్తో ‘కత్తి’, నాగార్జునతో ‘గగనం’, మంచు మనోజ్తో ‘మిస్టర్ నూకయ్య’ సినిమాల్లో నటించింది సనాఖాన్. రియాల్టీ షో బిగ్ బాస్ 6లో కూడా హల్ చల్ చేసింది. 2019 తర్వాత సనా ఖాన్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఆ తర్వాత నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్ని పెళ్లి చేసుకుని అందర్నీ దిగ్భ్రాంతికి గురించింది. 2023లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. -
Krithi Shetty: పింక్ కలర్ డ్రెస్లో మెస్మరైజ్ చేస్తున్న కృతి శెట్టి (ఫోటోలు)
-
అంతర్జాతీయ బ్రాండ్తో చేతులు కలిపిన స్వదేశ్.. లిమిటెడ్ ఎడిషన్!
హైదరాబాద్: భారతీయ కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే స్వదేశ్ బ్రాండ్, అంతర్జాతీయ వస్త్ర తయారీదారులు ఫాల్గుణి షేన్ పీకాక్తో కలిసి హైదరాబాద్లో స్వదేశ్ ఫ్లాగ్ షిప్ స్టోర్లో ప్రత్యేక ప్రదర్శనను ప్రకటించారు. ఫాల్గుణి షేన్ పీకాక్ 20వ వార్షికోత్సవంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ పద్ధతులను అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్ తో మేళవించారు. కాంచీవరం సిల్క్స్, చికంకారీ ఎంబ్రాయిడరీ, బనారసి బ్రోకేడ్స్ వంటి ఐకానిక్ భారతీయ హస్తకళలు ఉన్నాయి.స్వదేశ్లో ప్రత్యేకంగా లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ కోచర్.. భారతీయ హస్తకళా వారసత్వాన్ని పునఃసమీక్షిస్తుంది. వినూత్న డిజైన్తో పాటు అద్భుతమైన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఫాల్గుణి షేన్ పీకాక్ 20 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ లగ్జరీ కోచర్ డిజైనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంప్రదాయ కళానైపుణ్యాన్ని జోడిస్తూ, రంగులతో ప్రయోగాలు చేస్తూ సరిహద్దులను విస్తరించింది. వర్చువల్ స్టైలింగ్ వంటి మార్గదర్శక ఫీచర్ల ద్వారా టెక్నాలజీ పరంగా బ్రాండ్ అభివృద్ధి చెందింది. అందుకే ఇది సెలబ్రిటీలకు సైతం నచ్చేసింది.రెండు దశాబ్దాల ఫ్యాషన్ ఆవిష్కరణను ప్రతిబింబిస్తూ, ఫాల్గుణి షేన్ పీకాక్ సహ వ్యవస్థాపకుడు షేన్ పీకాక్ ఇలా పేర్కొన్నాడు, "స్వదేశ్తో కలిసి నడవడం స్పెషల్గా అనిపిస్తోంది. ఎందుకంటే మా డిజైన్లకు భారతీయ హస్తకళ తోడవటంతో ఫ్యాషన్లో కొత్త కోణాలను అన్వేషించేందుకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా భారత్తో పనిచేసి ఇక్కడి వారసత్వం, సంస్కృతి నుంచి ప్రేరణ పొందే ఆకృతులను తయారు చేశాం. ఈ లిమిటెడ్ ఎడిషన్ సేకరణలో క్లిష్టమైన జరీ వర్క్ తో బెస్పోక్ చీరలు ఉన్నాయి. హైదరాబాద్ లోని స్వదేశ్ స్టోర్ను సందర్శించేందుకు వస్త్రప్రియులను ఆహ్వానిస్తున్నాము" అని చెప్పారు. -
Karisma Kapoor: బాలీవుడ్ బ్యూటీ సీరియల్ లుక్స్.. గ్లామర్ మాత్రం (ఫొటోలు)
-
తాజా మొలకలు త్వరగా ఎదిగేలా చేస్తుంది.. ఎలా అంటే?
మొలకెత్తిన గింజలు తినడం పాత అలవాటే అయినా, వాటికి లేలేత ఆకులు పుట్టుకొచ్చేంత వరకు పెంచి, వాటిని ‘మైక్రోగ్రీన్స్’ పేరిట తినే అలవాటు ఇటీవలి కాలంలో పెరుగుతోంది. మట్టి కుండీల్లో గింజలు చల్లి ‘మైక్రో గ్రీన్స్’ పెంచుతుంటారు. ఇలా పెంచడం వల్ల కొన్ని గింజలు కుళ్లిపోయి, వృథా కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ‘ఆటోస్ప్రౌట్’ పరికరం గింజలను ఏమాత్రం వృథా పోనివ్వకుండా, తక్కువ వ్యవధిలోనే ‘మైక్రోగ్రీన్’ మొలకలు ఎదిగేలా చేస్తుంది.దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. దీనిలో అరకిలో గింజలను వేస్తే, రెండు నుంచి ఆరు రోజుల్లోగా ఆకుపచ్చని మొలకలు పెరుగుతాయి. స్టెయిన్లెస్ స్టీల్, టెంపర్డ్ గ్లాస్, కొద్ది కలప తప్ప ప్లాస్టిక్ లేకుండా తయారు చేసిన ఈ పరికరం అధునాతన మిస్టింగ్ టెక్నాలజీతో త్వరగా ఆరోగ్యకరమైన మొలకలు ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇందులో మూడు అంతస్తుల ట్రేలలో గింజలను చల్లుకుని పెట్టుకోవచ్చు. దీనిని ఆన్ చేసుకుంటే, దీని లోపల ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి, మిస్టింగ్ టెక్నాలజీ సౌకర్యంతో వెలువడే తేమ వల్ల మొలకలు త్వరగా పెరుగుతాయి. ‘ఆటోస్ప్రౌట్’ స్వీడిష్ కంపెనీ ఈ ఆటోమేటిక్ స్ప్రౌటింగ్ మెషిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5,192 స్వీడిష్ క్రోనాలు (రూ.41,369)దుస్తులను త్వరగా ఆరబెడుతుంది..దుస్తులను ఉతుక్కోవడం ఒక ఎత్తు అయితే, వాటిని ఆరబెట్టుకోవడం మరో ఎత్తు. ఎండ కాసే సమయంలో ఆరుబయట దండేలకు ఆరవేస్తే దుస్తులు ఏదోలా ఆరిపోతాయి. మబ్బు పట్టినప్పుడు, ఎడతెగని ముసురు కురిసేటప్పుడు దుస్తులను ఆరబెట్టుకోవడం ఎవరికైనా సవాలే! ఇంటి లోపల దండేలు కట్టుకుని, దుస్తులను ఆరబెట్టుకుందామనుకుంటే, అవి ఒక పట్టాన ఆరవు. గంటలు గడిచే కొద్ది ముక్క వాసన కూడా వేస్తాయి.అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు డచ్ కంపెనీ ‘స్పీడ్డ్రైయర్’ తాజాగా ఈ రోటరీ క్లాత్స్ ర్యాక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఆరుబయటనే కాదు, ఇంటి లోపల కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది. దీనికి దుస్తులను తగిలించి, ఆరబెడితే, ఇది వేగంగా తిరుగుతూ దుస్తులు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. ఒకసారి దుస్తులను ఆరబెట్టడానికి ఇది వినియోగించుకునే విద్యుత్తు కేవలం 10 వాట్లు మాత్రమే! దీని ధర 219 యూరోలు (రూ.20,519) మాత్రమే! -
మినీ డ్రెస్లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!
బాలీవుడ్ జాన్వీ కపూర్ తన అభినయంతో వేలాదిమందు అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ డిజైనర్ వేర్ దుస్తులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఉలాజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవలే మూవీ టైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది ఆ ట్రైలర్. అందులో లీడ్రోల్లో కనిపించిన జాన్వీకపూర్ చాలా డిఫరెంట్ లుక్లో కనిపించింది. ఆమెలో దాగున్న సరికొత్త నటన ఈ రోల్ ద్వారా బయటపడనుంది కూడా. ఇక ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్కి ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ ప్రియుడు శిఖర్ పహారియా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాన్వీ తెల్లటి రన్వే మినీ దుస్తులతో స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. ఈ డ్రెస్ని డీప్ ఆఫ్-ది-షోల్డర్ నెక్లైన్, స్విర్ల్ ఎంబ్రాయిడరీతో రూపొందించారు. అందుకు తగ్గట్టుగా చెవిపోగులు, ఉంగరాలు ధరించి స్టన్నింగ్ లుక్తో మిస్మరైజ్ చేసింది. ఈ దుస్తులు సీ త్రూ సిల్హౌట్ అయినా ఆమె దీన్ని కవర్ చేసేలా లోపల చక్కటి స్కిన్ వేర్ని ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి. అయితే నెటిజన్లు ఈ డ్రెస్ చూడటానికి మనం ఇష్టంగా తినే రవ్వదోసలా ఉంటంటూ ఒకరూ, మరికొందరూ టీవీలు, డైనింగ్ టేబుల్స్పై వేసే తెల్లటీ ఎంబ్రాయిడరీ క్లాత్లా ఉందని కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!) -
ఎలాంటి సందేశం ఇస్తున్నారు?.. అమలాపాల్పై విమర్శలు!
మలయాళ బ్యూటీ అమలాపాల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇద్దరమ్మాయిలతో మూవీలో అమాయకమైన అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే తల్లైన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం లెవెల్ క్రాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. అందులో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్కు హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో అమలాపాల్ ధరించిన డ్రెస్పై నెట్టింట చర్చ నడుస్తోంది.అలాంటి డ్రెస్లో కాలేజీ ఈవెంట్కు రావడం అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈవెంట్లకు వెళ్లేటప్పుడు మినిమం సెన్స్ ఉండాలంటూ అమలాపాల్ను విమర్శిస్తున్నారు. అయితే తన డ్రెస్పై వస్తున్న విమర్శలపై అమలాపాల్ తాజాగా స్పందించింది. ఆ డ్రెస్లో తాను సౌకర్యంగానే ఉన్నానని తెలిపింది. అలాంటి డ్రెస్లో ఈవెంట్కు వెళ్లడం తప్పుగా అనిపించలేదని.. అయితే ఇక్కడ నా ఫోటోలు ఎలా తీశారనేదే అసలు సమస్య అని అన్నారు. ఆ దుస్తుల్లో నన్ను చూడటం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడలేదని అమలాపాల్ స్పష్టం చేసింది. అంతే కాదు.. నేను అన్నిరకాల దుస్తులు ధరిస్తానని తెలిపింది. డ్రెస్ ఎంపిక విషయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే అలా కనిపించానని చెప్పుకొచ్చింది. కాగా.. గత నెలలోనే అమలాపాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్ను ఆమె పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో గర్భం ధరించినట్లు ప్రకటించింది. ఆమె నటించిన లెవెల్ క్రాస్ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
ఈ హీరోయిన్కు 50 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా? (ఫోటోలు)
-
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!
ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సాయంతో రోబోట్లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. ఆమె ఈ ఏఐ డ్రెస్ని రోబోటిక్ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్ స్నేక్ డ్రెస్ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ డ్రెస్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ డ్రెస్ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్ అయినా ఫ్యాషన్ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by She Builds Robots (@shebuildsrobots) (చదవండి: సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!) -
స్లిమ్గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు కాస్తా బొద్దుగా తయారయ్యి..సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ ప్రదర్శనకు హాజరైన విద్యాబాలన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె లుక్ అంతా మారిపోవడంతో..ఇంతలా స్లిమ్గానా అంటూ.. అందరి చూపులు ఆమెపైనే. చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడంతా విద్య నాజుగ్గా మారడమే హాట్టాపిక్గా మారింది. ఈ కార్యక్రమంలో విద్య సోదరి కుమారుడు కూడా వచ్చాడు. ఆమె బ్లాక్ డ్రస్లో ఓ రేంజ్ స్టన్నింగ్ లుక్తో కనిపించింది. గోల్డెన్ కలర్ చెవుపోగులు, లైట్ మేకప్తో గ్లామరస్గా ఉంది. అంతేగాదు ఫిట్గా ఉండాలని కోరుకునేవారికి స్ఫూర్తిగా ఉంది విద్య. మల్లెతీగలా కనిసిప్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆరాతీస్తున్నారు. అయితే విద్య అంతలా స్లిమ్ అవ్వడానికి ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే..ప్రతి రోజు వ్యాయమం చేసే అవకాశం లేకపోయిన కనీసం రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయడంకూల్డ్రింగ్స్, అధిక చక్కెర గల పళ్ల రసాలతో సహా టీ, కాఫీలకు దూరంగా ఉండటంరోజంతా హైడ్రేషన్గా ఉండేలా నీళ్లు బాగా తాగేదని, ఇది ఆకలిని కంట్రోల్ చేసేందుకు ఉపకరించిందని వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు మంచిగా నిద్రపోవడం. నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినడం వంటివి చేయాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. టీవీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లుకు దూరంగా ఉండటం వంటివి చేస్తే..ఎవ్వరైనా..ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?) -
కలర్ఫుల్ డ్రెస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్.. ఫోటోలు
-
గులాబీలా మెరిసిపోతున్న హీరోయిన్ రాశీ సింగ్.. చూస్తే అంతే (ఫొటోలు)
-
ఎవరీ పూబంతి.. అందాల సందళ్లు మోసుకొచ్చింది! (ఫోటోలు)
-
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
-
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
Sreeleela: సమ్మర్ స్పెషల్ లుక్లో శ్రీలీల (ఫోటోలు)
-
Rakul Preet Singh: డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
Meena Durairaj: యెల్లో..యెల్లో..మీనా బ్యూటిఫుల్లో..! (ఫోటోలు)
-
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
-
Pooja Hegde HD Photos: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
-
Pragya Jaiswal: కలర్ఫుల్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
-
Sonakshi Sinha Photos: వెల్వెట్ డ్రెస్లో అందంగా.. సోనాక్షి (ఫొటోలు)
-
కోట్లు సంపాదించే మృణాల్.. మరీ అంత చీప్ డ్రెస్సులు ధరిస్తుందా?
-
కలర్ఫుల్ లంగావోణీలో యాంకర్ సుమ లుక్స్.. ఫోటోలు
-
Stunning Looks of Sonakshi Sinha: రెడ్ లెహంగాలో జిగేలుమంటున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
-
బొమ్మరిల్లు ముద్దుగుమ్మ జెనిలియా డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు ‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్ ఎంతమంది అబ్బాయిల మైండ్స్లో నాటుకుపోయిందో! ‘బొమ్మరిల్లు’లో అలా అడిగిన హ..హ..హాసిని.. జెనీలియా కూడా ఎంతమంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిందో! ఇప్పటికీ ఆమె పట్ల అదే క్రేజ్ చిన్న నుంచి పెద్ద వరకు. ఆమె గ్లామర్కీ అదే గ్రేస్..ఆడవాళ్లకు మెరిసే ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు. నా దృష్టిలో ఆడవాళ్ల జ్యూలరీలో ముక్కుపుడకను మించింది లేదు. అలాగే చీరకట్టును బీట్ చేసే ట్రెడిషనల్ వేర్ లేదు! అని అంటోంది జెనీలియా. ఇక ఆమె ట్రెడిషనల్ వేర్లో అయినా.. మోడర్న్ డ్రెస్లో అయినా! దేన్నయినా ఫ్యాషన్గా మలచుకోగల స్టయిల్ జెనీలియాది!. ఆ స్టయిల్ కోసం జెనీలియా ఈ బ్రాండ్స్నీ కన్సిడర్ చేస్తుంది. ఒసా బై ఆదర్శ్ వెడ్డింగ్ కలెక్షన్స్కి కేరాఫ్ ఇది. దీని స్థాపకుడు ఆదర్శ్ మఖ్రియా. దేశంలోని సంప్రదాయ వస్త్రరీతులన్నిటికీ తన బ్రాండ్ని పడుగు.. పేకలుగా మార్చాడు. ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్లతో పెళ్లి వస్త్రాలకు కొత్త కళను అద్దుతాడు. అందుకే ఈ డిజైన్స్కి డిమాండ్ ఎక్కువ. కోల్కతా, ఢిల్లీల్లో స్టోర్స్ ఉన్నాయి. మల్టీడిజైనర్ స్టోర్స్లోనూ ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. ధర మాత్రం సామాన్యులకు అందేలా ఉండదు. .జెనిలియా ధరించిన ఒసా బై ఆదర్శ్ డ్రెస్ ధర రూ. 1,77,555 నారాయణ్ జ్యూలర్స్ 80 ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ ఇది. సంప్రదాయ నగలు.. ఆధునిక ఆభరణాలు.. రెండిటికీ పెట్టింది పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజీలేని నాణ్యత.. కల్తీకాని నమ్మకానికి పర్యాయపదం ఈ జ్యూలర్స్. ధర.. ఆభరణాల డిజైన్, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ద పింక్ పోట్లీ ఇది ముంబై బ్రాండ్. హ్యాండీ క్రాఫ్ట్స్ బ్యాగ్స్, పోట్లీలు, బట్వాలకు ప్రసిద్ధి. దీపా, ప్రణతి అనే తల్లీకూతుళ్ల ఆవిష్కార ఈ పింక్ పోట్లీ. ప్రొడక్షన్ విషయాలు దీపా చూసుకుంటే బ్రాండింగ్, మార్కెటింగ్, బిజినెస్ వ్యవహారాలు ప్రణతి చూసుకుంటుంది. ఆలియా భట్, కరీనా కపూర్, సోనం కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలెందరో దీనికి హాట్ ఫేవరేట్స్. ధరలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. జ్యూలరీ బ్రాండ్: నారాయణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే..!) -
Tamannaah Bhatia: బార్బీ బొమ్మలా మెరిసిపోతున్న తమన్నా!
-
రాధిక మర్చంట్ డ్రెస్ ధర వింటే...
ఇషా అంబానీ నిర్వహించిన రోమన్ హోలీ ఈవెంట్లో కాబోయే మరదలు రాదికా మర్చంట్ శాటిన్ డ్రెస్లో ఆకర్షించింది. అందానికి తగ్గ స్టెయిలష్ బ్రాండ్లతో మరింత అందంగా కనిపించే రాధికా ఈ డ్రస్లో సినీ సెలబ్రెటీలను తలదన్నేలా కనిపించింది. కాక్టెయిల్ పార్టీలకు కరెక్ట్గా సరిపోయే డ్రస్లో అదిరిపోయింది. అందరి అటెన్షన్ ఆమె ధరించే డ్రస్పైనే పడింది. ఈ వేడుకలో ప్రముఖ సెలబ్రెటీలు, బాలీవుడ్ సినీ తారలు తమదైన స్టైయిలిష్ డిజైన్ వేర్లు, ఆభరణాలతో సందడి చేశారు. ఇందులో ఇషా అంబానీ గౌను డిజైనింగ్కే 100 గంటలు పట్టగా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరతో స్టన్నింగ్ లుక్తో కనిపించింది. ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన శాటిన్ డ్రెస్ ధర ఏకంగా రూ. 6.4 లక్షలు పలుకుతుందట. రాధిక ఆ డ్రెస్కి తగ్గట్టుగా అత్యంత లగ్జరియస్ ఆభరణాలను కూడా ధరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీలకు కాబోయే కోడలకు తగ్గ రేంజ్లో ఆమె డ్రస్ ధర ఉంది. అలాగే ఆమె నెక్కు ధరించిన నయీమ్ ఖాన్ గోల్డ్ ఆర్మీరీ జోడియాక్ క్లచ్ ధర ఏకంగా రూ. 1.67 లక్షలు. అంతేగాదు ఆమె ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా బంగారంతో డిజైన్ చేసిన లెహంగాతో అందర్నీ మంత్రముగ్ధులన్ని చేసిన సంగతి తెలిసిందే. ఆమె అందానికి తగ్గ సింపుల్ డిజైనింగ్ వేర్లతో అందర్నీ కట్టిపడేసే ఆకర్షణీయమైన అందం రాధిక సొంతం. (చదవండి: ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్కి అంత టైం పడుతుందా!) -
అద్భుతమైన క్రిస్టల్ గౌనుతో టాప్ 20కి చేరుకున్న సినీ శెట్టి!
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేత సిని శెట్టి ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో బిజీగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో (Miss World Pageant) సినీ శెట్టి క్రిస్టల్ గౌనులో మెరిసింది. ముంబైలో జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీట్లో ఆమె ఆసియా అండ్ ఓషియానియ తరుఫు నుంచి బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డుని దక్కించుకుని టాప్ 20కి చేరుకుంది. అలాగే ప్రాంతీయ పరంగా ఐదో స్థానంలోనూ నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ పెప్లమ్ సైల్బాడీ డ్రెస్లో అదిరిపోయింది. వీ నెక్లైన్తో కూడిన పొడవు గౌను, కట్స్ ఉండి, లైన్స్ ఆర్ట్వర్క్లో క్రిస్టల్ పూసలతో అలంకరించి ఉంది. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాల డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ క్రిస్ట్ల్ గౌను కారణంగా ఆమె ఈ ఘనతను దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఇక సినీ శెట్టి ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం కోసం జయంతి రెడ్డి డిజైన్ చేసిన ఎరుపు రంగు బనారసీ చీరను ధరించింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఆరుగజాల బెనారస్ చీరపై ఎంబ్రాయిడరీ అంచు మంచి లుక్ ఇవ్వగా, దానికి పూర్తి విభిన్నంగా నేవి బ్లూ కలర్ బ్లౌజ్ని జత చేయడంతో మరింత ఆకర్షణ ఉంది. అందుకు తగ్గట్లు బంగారు గాజులను ధరించింది సినీ శెట్టి. ఈ సంప్రదాయ లుక్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేంత గ్లామరస్గా ఉంది. కాగా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్ మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: స్టన్నింగ్ లుక్లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక! డ్రెస్ ధర ఎంతంటే..) -
స్టన్నింగ్ లుక్లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక!
నిహారిక కొణిదెల.. యాంకర్గా, నటిగా, నిర్మాతగానే కాదు ట్రెండీ లుక్స్తో ఫ్యాషన్ ఐకాన్ గానూ ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే ఆమెకు స్ట్రీట్ షాపింగే ఇష్టమట. సెలబ్రిటీలు అందరూ బ్రాండెడ్ దుస్తులే ధరిస్తారు అని అనుకుంటారు. కానీ నాకు మాత్రం స్ట్రీట్ షాపింగే ఇష్టం. నచ్చిన వాటిని వెదికి వెదికి వెలికి తీస్తాను అంటోంది. ఇక ఆమె ఫ్యాషన్ సెన్స్ను క్యారీ చేస్తున్న బ్రాండ్స్లో కొన్ని ఇక్కడ.. డ్రెస్ బ్రాండ్:తన్వా బై దీపిక హైదరాబాద్ ఎన్ఐఎఫ్టీలో డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన దీపిక ఆనంద్.. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. ఈ మధ్యనే హైదరాబాద్లోనే ‘తన్వా బై దీపిక’ పేరుతో సొంత ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించింది. ఆధునిక డిజైన్స్ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలకు హాట్ ఫేవరెట్గా మారింది. ధరలు.. సామాన్యుడికీ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లోనూ లభ్యం. ఇక్కడ నిహారిక ధరించిన తన్వా బై దీపిక డిజైనర్ డ్రస్ ధర రూ. 21,000/- జ్యూలరీ బ్రాండ్: రియా జ్యూయెల్స్ వెరైటీ డిజైన్స్కు క్రేజీ కేరాఫ్ ఈ బ్రాండ్. అన్ని రకాల బంగారు, వెండి పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్ వంటి ఇతర డిజైనర్ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. ఉంగరం ధర: రూ.750/-, కమ్మలు ధర: రూ.4,200/- (చదవండి: సారా టెండూల్కర్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లు ఇవే!) -
'అఖండ' హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
‘కంచె’ సినిమాతో తెలుగులో ఎంటరైన ప్రగ్యా జైస్వాల్కి ఇక్కడ అభిమానం గణం ఎక్కువే!. మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా ప్లాన్ బి ఉండాలి. అప్పుడే ఎక్కడైనా సంతోషంగా ఉండగలం అంటోని ప్రగ్యా. ఇక ఆమెకు అంతటి ఘనమైన ఫ్యాన్ ఫాలోయింగ్కి కారణం తన గ్లామర్. ఆ గ్లామర్కొక స్టయిల్ని క్రియేట్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్దే. ఆ ఫ్యాషన్లో ఈ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.. సావన్ గాంధీ.. ఢిల్లీకి చెందిన సావన్ గాంధీ కొంత కాలం పలు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పనిచేసి.. తర్వాత తన పేరు మీదే ఫ్యాషన్ హౌస్ని ప్రారంభించాడు. అందమైన డిజైన్స్తో అనతికాలంలోనే సూపర్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు.అల్లికలు, కుందన్ వర్క్స్లోనూ ఈ బ్రాండ్ ఫేమస్. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు అమెరికా, లండన్లోనూ స్టోర్స్ ఉన్నాయి. ధర లక్షల్లోనే! ఆన్లైన్లోనూ లభ్యం. ఇక ప్రగ్యా ధరించిన చీర ధర ఏకంగా రూ. 1,59,000/-. ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే ఇద్దరు స్నేహితులు.. సంప్రదాయ రాజాభరణాలు, గిరిజన ఆహార్యాన్ని ఆధునిక తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియంను ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి నమూనాలనే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆన్లైన్లోనూ లభ్యం. ఈనా.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్లో ఈనా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్ లభించే ఈ పోల్టిస్, క్లచెస్, బకెట్ బ్యాగ్స్కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అందుకే, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తగని మోజు. ధర కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ లభిస్తాయి. ఇక్కడ ప్రగ్య ధరించి బ్యాగ్ ధర రూ. 9,800 (చదవండి: శృతి హాసన్ ధరించి బ్రౌన్కలర్ చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్లో ఇలా చూడండి!) -
యానిమల్ సక్సెస్ మీట్లో అలియా ధరించిన డ్రస్ ధర ఎంతంటే..?
సెలబ్రెటీలు ధరించిన డ్రస్లు ఎప్పడూ అత్యంత ఖరీదులోనే ఉంటాయి. వాటికి గోల్స్ అంచు లేదా డైమండ్లు పొదగబడి ఉండటం వంటివి జరుగుతాయి కూడా. అయితే కొన్ని ఖరీదైన డ్రస్లు చూస్తే ఏముంది ఇందుల? ఎందుకింత ఖరీదు? అనిపిస్తుంది. అలాంటి డ్రస్ అలియా వేసుకొచ్చింది. అదికూడా తన భర్త నటించిన యానిమల్ మూవీ సక్సెస్ మీట్కి. ఆమె భర్త రణబీర్ కపూర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీ ఈరేంజ్లో దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అదిగాక ఈ మూవీలో "జమల్ జమలు కుదు" పాట ఎంతలా వైరల్ అవుతోందో చెప్పాల్సివసరం లేదు. ఈ మేరకే ఈ సినిమా బృందం తమ మూవీ విజయోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మూవీ సక్సస్ని పంచుకునేందుకు మంచి గ్రాండ్ లుక్తో వచ్చారు. ఈ వేడుకలో ఆమె నీలిరంగు దుస్తుల్లో స్టన్నింగ్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాటిన్ కటౌట్ డ్రస్లో చాలా గ్లామరస్గా కనిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ రసారియో కలక్షన్స్ ఈ డ్రెస్ని డిజైన్ చేసింది. దీని ధర ఏకంగా రూ. 1.5 లక్షలు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ రణబీర్, అలియా జంట, రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీడియోల్, అనిల్కపూర్, డైరెక్టర్లు,తదితర బాలివుడ్ తారాగణమంతా హాజరయ్యారు. (చదవండి: జమల్ జమలు కుదు... యానిమలు!) -
క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్చరణ్ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్ను స్పెషల్గా జరుపుకుంటుంది. రీసెంట్గా మెగా ఫ్యామిలి క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన ఆ డ్రెస్ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.గూసీ బ్రాండ్కు చెందిన రెడ్ కలర్ స్కర్ట్లో తళుక్కున మెరిసింది ఉపాసన. చూడటానికి సింపుల్గా కనిపించిన ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్లో ఉపాసన చాలా క్లాసీ లుక్లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
నైట్ పార్టీలో కృతిసనన్ వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
బాలీవుడ్ భామ కృతిసనన్.. బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు సరసన నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సక్సెస్లతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ ఏడాది తెలుగులో ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే, తొలుత మోడల్గా కెరీర్ ఆరంభించిన కృతిసనన్ ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో మంచి ఫ్యాషన్ సెన్స్ను కనబరుస్తూ ట్రెండీ లుక్స్తో మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఓ నైట్ పార్టీలో కృతి వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చూడటానికి చాలా సింపుల్గా ఉన్న ఈ మినీ డ్రెస్ ధర అక్షరాలా రూ. 1.7 లక్షలు. అలాయా బ్రాండ్కు చెందిన ఈ డ్రెస్కు క్యూట్ బెల్ట్ మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇక ఎప్పటిలాగా సింపుల్ అండ్ న్యూడ్ మేకప్ లుక్లో తళుక్కున మెరిసింది మన మిమీ. -
డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి..
ప్రిన్స్ డయానా దుస్తులు వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు మునుపు ఆమె ధరించిన స్వెట్టర్ ధర, వివాహ దుస్తులు ఇలానే కోట్లలో ధర పలికి ఆమె ఫ్యాషన్ ఐకాన్ అని ప్రూవ్ చేసింది. మళ్లీ మరోసారి అదే రికార్డు స్థాయిలో ప్రిన్స్ డయానికి సంబంధించిన డ్రస్ అమ్ముడిపోయింది యువరాణి క్రేజ్ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ డ్రస్ని ప్రిన్స్ డయానా 1985లో ఫోరెన్స్లోని బాలేరినాలో సాయంత్రం ఈ దుస్తులను ధరించింది. అలాగే వాంకోవర్ పర్యటనలో ఈ డ్రస్తో ఫోటోగ్రాఫర్ల కంట పడినట్లు జూలియన్స్ వేలం సంస్థ పేర్కొంది. ఈ డ్రస్ టాప్ నీలిరంగు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి నల్లటి వెల్వెట్ కలర్లో ఉండగా, స్కర్ట్ ఊదారంగులోని ఆర్గ్కాన్జాలా ఉండి పైన రిబ్బన్ మాదిరిగా ఉంటుంది. లండన్లో జూలియన్స్ నిర్వహించిన వేలంలో అంచనా వేసిన దానికంటే 11 రెట్టు ధర పలికడం విశేషం. ఇంతకమునుపు వేలం వేసిన డయనా గౌనుల్లో ఒక దాని రికార్డుని బ్రేక్ చేసేలా రూ. 9 కోట్లు పలికింది. ఈ దుస్తులు యువరాణి ప్రిన్స్ డయానా రాజదర్పాన్ని తెలియజేసేలా ఉండటమే గాక ఆ డ్రస్ అత్యధికంగా అమ్ముడుపోయి ఆమె ఫ్యాషన్ ఐకాన్కి కేరాఫ్ అని మరోసారి చాటి చెప్పింది. వేలంలో అత్యధిక ధర పలికిన దుస్తులగా ప్రపంచ రికార్డును డయాన ధరించిన దుస్తులే నిలవడం విశేషం. నిజానికి జూలియన్స్ వేలం నిర్వాహకులు ఈ డ్రస్ వేలంలో సుమారు రూ. 83 లక్షల నుంచి కోటి రూపాయ వరకు పలికే అవకాశం ఉందనుకున్నారు. కనివినీ ఎరుగని రీతిలో అత్యధికంగా పలికీ దటీజ్ ప్రిన్స్ డయానా అనేలా ఆశ్చర్యపరిచింది. కొందరూ కొద్దికాలమే బతికినా వారి ప్రభావం అలానే ఉంటుంది. అందరి మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు కూడా. ఆఖరికీ వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారి మాదిరిగానే ఓ అద్భుతంగా నిలుస్తాయి కాబోలు. (చదవండి: శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?) -
‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన!
మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. ఈ ఉద్యమ ప్రచారం 13 రోజుల పాటు కొనసాగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఉత్సాహంతో కూడిన మద్దతు లభిస్తున్నదని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ తెలిపారు. రానున్న 13 రోజుల్లో ఈ పనుల్లో భాగస్వాములయ్యేందుకు దాదాపు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. చేనేత కళను ప్రోత్సహిస్తూనే, ఈ పనిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారం సాగుతున్నదన్నారు. చేనేత పని అంత సులభం కాదని, ఇది గణితంతో ముడిపడివుందని, అలాగే ఎంతో సహనం అవసరమన్నారు. శ్రీరామునికి అందించబోయే దుస్తులు పట్టుతో తయారవుతున్నాయని, వెండి బ్రోకేడ్తో ఈ వస్త్రాలను అలంకరిస్తామని ఆమె తెలిపారు. కాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రామమందిరం ట్రస్ట్కు చెందిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్లు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆ చూకీ చెబితే రూ. 50 వేలు! -
దివంగత శ్రీదేవి చిన్నకూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
దివంగత నటి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా దూసుకుపోతుంది. బాలీవుడ్తో పాటు తాజాగా టాలీవుడ్లోనూ జాన్వీ గ్రాండ్గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ‘ద ఆర్చీస్’ మూవీతో బీటౌన్లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్లో ఖుషీ ధరించిన డ్రెస్ అండ్ జ్యువెలరీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సినిమాలు చేయకపోయినా శ్రీదేవి కూతురిగా, ఫ్యాషన్ ఐకాన్గా ఖుషీ కపూర్కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా తన తొలి డెబ్యూ సందర్భంగా ఖుషీ అరుదైన డ్రెస్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లికి నివాళులు అర్పిస్తూ శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది ఖుషీ. గతంలో ఇదే డ్రెస్ను దివంగత శ్రీదేవి 2013 ఐఫా అవార్డు ప్రధానోత్సవంలో ధరించింది. ఇప్పుడు ఖుషీ సైతం అదే డ్రెస్ను రిపీట్ చేసింది. దీంతో పాటు తల్లి ధరించిన డైమండ్ చోకర్నే వేసుకొని దేవకన్యలా మెరిసిపోయింది. కాగా ఆర్చీస్లో ఖుషి కపూర్తో పాటు సుహానా ఖాన్, వేదాంగ్ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండాలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు స్టార్ కిడ్స్ ఉండటంతో ది ఆర్చీస్పై ఇప్పటికే హైప్ నెలకొంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!
దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి వేళ ఒక మహిళ వినూత్నంగా అలంకరించుకుంది. ఇళ్లను అలంకరించేందుకు వినియోగించే చిరు దీపాలను తన దుస్తులకు అల్లుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీపావళికి ఇటువంటి దుస్తులు పర్ఫెక్ట్ అని కితాబిస్తున్నారు. వర్షా. యాదవ్ పేరిట ఉన్న ఇన్స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఒక మహిళ ఘాగ్రా చోళీని ధరించి కనిపిస్తుంది. ఘాగ్రాతో పాటు వేసుకున్న చున్నీకి రంగురంగుల దీపాలు అతికించి ఉన్నాయి. కాంతులీనుతున్న ఈ దుస్తులను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు! View this post on Instagram A post shared by Varsha Bai (@varsha.yadav777) -
దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!
పట్టుబట్టలతోనే కాదు మనవైన సంప్రదాయ దుస్తులతోనూ వెలిగిపోవచ్చు. మోడ్రన్ షేర్వాణీలను ధోతీ ప్యాంట్లతో మ్యాచ్ చేయచ్చు. పర్యావరణ అనుకూలమైన డ్రెస్సులను ఎంచుకోవచ్చు. పాత కాలం నాటి ప్రింట్లు, హ్యాండ్మేడ్ డిజైన్స్కి ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఎవర్గ్రీన్ లుక్తో రాబోయే రోజులను ప్రకాశవంతంగా మార్చడానికి ఈ దీపావళి నుంచే మొదలుపెట్టవచ్చు. పండగ రోజున దీపాలనే కాదు సరికొత్త ట్రెండ్తో వార్డ్ రోబ్లను కూడా వెలిగించవచ్చు. ప్రతి వేడుకలోనూ మెరిసిపోవచ్చు. నియో–సంప్రదాయం పాతకాలం నాటి కుర్తాలు, షేర్వాణీలు ఇప్పుడు కొత్తగా రూపాంతరం చెందాయి. ఈ దీపావళికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే, లేయర్డ్ షేర్వాణీలు, ధోతీ ప్యాంట్లను ధరించవచ్చు. వీటిని మోడర్న్ డిజైన్, ఓల్డ్ ట్రెడిన్ తో మిళితం చేయచ్చు. ఈ మిక్స్ అండ్ మ్యాచ్ వల్ల సొగసైన రూపాన్ని పొందవచ్చు. ఇక నియాన్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. వీటిలో బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి సాధారణ రంగుల నుండి కాంతివంతంగా కనిపిస్తాయి. పర్యావరణ అనుకూలం సరైన అవగాహనతో ఫ్యాష పర్యావరణ అనుకూల బట్టల వైపు మొగ్గు చూపుతోంది. సేంద్రియ పత్తి, వెదురు, జనపనార బట్టలు స్థిరంగా ఉండటమే కాకుండా మట్టి సొబగులను కూడా వెదజల్లుతాయి. సురయ్యా, ఇతర ప్రముఖ బ్రాండ్లు ఈ ట్రెండ్లో ముందంజలో ఉన్నాయి. చేతితో తయారు చేసిన పాదరక్షలు పాదరక్షల్లో మన దేశీయ హస్తకళా నైపుణ్యం తనదైన ముద్ర వేస్తోంది. జూతీలు, కొల్హాపురీ, ఎంబ్రాయిడరీ ఇతర అలంకారాలతో చేతితో తయారు చేసిన పాదరక్షలలో దేనిని ఎంపిక చేసుకున్నా పండగ కళ కనిపిస్తుంది. ఇవి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా, వేడుకలో ప్రత్యేకమైన టచ్ను అందిస్తాయి.పేస్టల్స్ పెరుగుదల దీపావళి ప్రకాశవంతమైన రంగులకు పర్యాయపదంగా ఉన్నప్పటికీ, లావెండర్, మింట్, బేబీ పింక్ పేస్టెల్ కలర్స్ పండుగ కళను పెంచుతాయి. ఈ రంగులు ప్రశాంతతతోపాటు రిచ్నెస్ను కళ్లకు కడతాయి. డిజిటల్ ప్రింట్లు సాంప్రదాయ మూలాంశాలు సాంకేతికత మన జీవితంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తున్నప్పుడు ఫ్యాషన్ను మాత్రం ఎందుకు వదిలివేయాలి... అందుకే, లోటస్ లేదా పీకాక్ ఫెదర్స్తో కూడిన భారతీయ సంప్రదాయ మూలాంశాలను ప్రదర్శించే డిజిటల్ ప్రింట్లు గొప్పగా కనిపిస్తున్నాయి. ఈ ప్రింట్లు, డిజైన్లు సంప్రదాయానికి ఆధునిక టచ్ను అందిస్తున్నాయి. పాతకాలపు డిజైన్ల పునరుద్ధరణ బనారసీ సిల్క్స్, చికంకారి ఎంబ్రాయిడరీ, బంధని వంటి పాతకాలపు వస్త్రాల ఆకర్షణ మళ్లీ మళ్లీ ఆకట్టుకుంటుంది. డిజైనర్లు ఈ సంప్రదాయ వస్త్రాలను ఆధునిక దుస్తులలో డిజైన్ చేస్తున్నారు. మనదైన గొప్ప వారసత్వాన్ని దేశీయ కళాకారులు కాపాడుతున్నారు. (చదవండి: అందాల చందమామ కాజల్ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
AI ఆవిష్కరణలకు వేదికగా మారిన అడోబీ
ప్రముఖ టెక్ దిగ్గజం అడోబీ అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ‘అడోబీ యాన్యువల్ మ్యాక్స్ కాన్ఫిరెన్స్ నిర్వహించింది. అక్టోబర్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ 10 ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్లో అడోబీ సంస్థ సుమారు 11 కొత్త ఏఐ ఆధారిత ప్రోటో టైప్ టూల్స్ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్నీక్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వీడియో అప్స్కేలర్, ప్రాజెక్ట్ స్టార్డస్ట్లు హైలెట్గా నిలిచాయి.ముఖ్యంగా ఆబ్జెక్ట్-అవేర్ ఎడిటింగ్ ఇంజన్ ఏఐ టూల్ సాయంతో ఫోటోల్లో అనవసరమైన వస్తువుల్ని తొలగించడం కావాల్సిన వాటిని జత చేయొచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ ప్రింరోస్ చూపురులను వీపరితంగా ఆకట్టుకుంది. ‘ఫ్లెక్సిబుల్ టెక్స్టైల్ డిస్ప్లే’లో భాగంగా అడోబీ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల డిజైన్లు మారిపోడంతో పాటు నచ్చిన చిత్రాల్ని సైతం వీక్షించొచ్చు. ఇప్పటికే అడోబీ స్మార్ట్ డిస్ప్లే ఫాబ్రిక్ టెక్నాలజీని గతంలోనే పరిచయం చేసింది. కానీ ఇప్పుడు ఈ సాంకేతికలో ఏఐని జోడించింది. అందంగా తీర్చిదిద్దింది. -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్గా కనిపిస్తుంటాయి. -
సింగిల్ షోల్డర్..డబుల్ బ్యూటీ!
క్లాస్ గా ఉండాలి.. కలర్ ఫుల్ గా కనిపించాలి. కంఫర్ట్వేర్గా కరెక్ట్ అనిపించాలి .. వెస్టర్న్లుక్ ఉండాలి.. ఇండియన్ స్టైల్ లో మెరవాలి. వీటన్నిటికి ఒకే ఒక ఆన్సర్... సింగిల్ షోల్డర్ టాప్స్. సంప్రదాయపు వేడుకలకు వెస్టర్న్ పార్టీలకు నప్పే ఈ డ్రెస్సింగ్కి కేప్ స్టైల్గానూ పేరుంది. లెహంగా, పలాజో, టులిప్ ప్యాంట్స్కి నప్పే ఈ సింగిల్ షోల్డర్ కుర్తీలు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలకు ఎంబ్రాయిడరీ చేసిన కేప్ లేదా సింగిల్ షోల్డర్ కుర్తీలను ఎంచుకోవచ్చు. ప్లెయిన్ లేదా ఫ్లోరల్ గెట్ టు గెదర్, బర్త్ డే పార్టీలకు ప్లెయిన్, ఫ్లోరల్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ డ్రెస్సింగ్ లోనే ప్రత్యేకత ఉంటుంది కాబట్టి, ఇతర అభరణ హంగులేవీ అక్కర్లేదు. (చదవండి: యాంటీ యాక్నె డ్రింక్ తాగారా?) -
ఆ ఊరిలోని మహిళలు ఏడాదిలో ఐదు రోజులు దుస్తులు లేకుండా..
కొన్ని ఊర్లలో చాలా వింతైనా ఆచారాలు ఉంటాయి. వింటేనా చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఊరిలా ఓ వింత ఆచారం ఉంది. అది వింటే ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. బాబోయ్ ఇదేమి ఆచారం రా బాబు అనేస్తారు. అంత వింతగా జుగుప్సకరంగా ఉంటుంది. వివరాల్లోకెళ్తే..హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి ఒడిలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఇది సాంప్రదాయ జీవన విధానానికి చాలా ప్రసిద్ధి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ గ్రామంలో ఉత్సుకతను రేకెత్తించే ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ పిని గ్రామంలో మహిళలంతా స్వచ్ఛందంగా ఏడాదిలో ఒక ఐదు రోజుల పాటు దుస్తులు ధరించడం మానేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. ఎందుకిలా అంటే?.. గ్రామస్తులు ప్రకృతికి, స్థానిక దేవత పట్ల ప్రగాఢమైన గౌరవం, కృతజ్ఞతకి గుర్తుగా ఇలా చేస్తారట. ఐదురోజుల పాటు బట్టలు లేకుండా ప్రకృతితో గడుపుతరట. తమ గ్రామంలోని స్త్రీలు సూర్యుని కాంతి, వెలుగు, స్వచ్ఛమైన గాలిని తమ మేనిపై స్వాగతించేలా ప్రకృతిని ఆలంగినం చేసుకుంటారని అక్కడ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. ఈ సంప్రదాయం వెనుకు ఉన్న ప్రధాన కారణం తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా స్త్రీలు వివస్త్రగా ఉంటారట. ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ.. ఇలా బట్టలు విప్పి తమ గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ ఐదు రోజులు వారికి గొప్ప ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక భక్తి మార్గం అని చెప్పాలి. అంతేగాదు దుస్తులు దైవంతో అనుబంధం ఏర్పరుచుకోవడానికి అవరోధంగా అక్కడ మహిళలు భావిస్తారట కూడా. నిజమే కదా! ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే మనల్ని సృష్టించిన భగవంతుడు ముందు సిగ్గు, బిడియం ఉండకూదు. మనం చిన్నగా ఉన్నప్పుడూ మన తల్లిదండ్రలు వద్ద ఎలా ఉంటామో అలానే భగవంతుడితో ఉండాలని చెప్పకనే చెబుతున్నారు వీళ్లు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
అందాల తార శ్రీలీల ధరించిన లంగావోణి ధర తెలిస్తే షాకవ్వుతారు!
శ్రీలీల.. తెలుగు ప్రేక్షకుల మైండ్లో రిజిస్టర్ అయిన పేరు.. హార్ట్లో ప్రింట్ అయిన రూపు!. మన హద్దుల్లో మనం ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు చిత్ర పరిశ్రమ అనేది గౌరవనీయమైన ఇండస్ట్రీనే. హీరోయిన్ అవ్వాలనుకునే తెలుగమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే అని అంటోంది ముద్దగుమ్మ శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఆమె అటు సినిమాలతో ఇటు తన ఫ్యాషన్ స్టయిల్తో అభిమానులను అలరిస్తోంది. శ్రీలీల వార్డ్ రోబ్లోని ఫ్యాషన్ బ్రాండ్స్లో ఒకట్రెండు ఇక్కడ.. నితికా గుజ్రాల్.. చాలామంది సెలబ్రిటీస్కి ఇది ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్తో అందమైన డిజైన్స్ రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ డిజైన్స్కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అయితే వీటి ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. శ్రీలీల ధరించిన నితికా గుజ్రాల్ ధర రూ. 72,500/- మంగత్రాయ్ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో మంగత్రాయ్ జ్యూయెల్స్ ఒకటి. 1905లో చంగల్ లాల్ గుప్తా, అతని కుమారుడు దర్పణ్ గుప్తా కలసి ఈ బంగారు అభరణాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయ డిజైన్స్ తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఆభరణాన్ని అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు తయారు చేస్తారు. అదే వీరి ప్రత్యేకత. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతో పాటు ఆన్లైన్లోనూ లభ్యం. --దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
అందాల తార సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్ ధర తెలిస్తే..షాకవ్వుతారు!
స్టార్ కిడ్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత ఎప్పుడూ ఆ ప్రీఫిక్స్ అవసరం రానివ్వకుండానే కెరీర్ని మలచుకుంది సోనాక్షి సిన్హా.. కేవలం తన టాలెంట్తోనే! సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ పాత్రల ఎంపికలో తన స్టయిల్ ప్రత్యేకమని చాటుకుంది. ఫ్యాషన్లోనూ ఆ స్టయిల్నే క్రియేట్ చేసుకున్న ఆమె ఫాలో అయ్యే బ్రాండ్స్ కొన్ని..‘ఎలాంటి సమస్యకైనా పనిని మించిన మందు లేదు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో నా కాలక్షేపం.. జిమ్లో గడపడం, పెయింటింగ్, స్కెచెస్ వేయడం, సినిమాలు చూడడమే! ఏకే – ఓకే... ఫ్యాన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలన్న అనామికా ఖన్నా తపనకు.. కోల్కతాలోని ఆమె డిజైనర్ స్టోర్ అద్దం పడుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రాల పద్ధతులకు పాశ్చాత్య ధోరణులను మిక్స్ చేసి సరికొత్త డిజైన్స్ను రూపొందించడం అనామికా ప్రత్యేకత. అదే అమెను.. వారానికో డ్రెస్ కూడా అమ్ముడవని రోజుల నుంచి సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, దీపికా పడుకోణ్, ఐశ్వర్య రాయ్ లాంటి సెలబ్రిటీలు అనామికా డిజైనర్ వేర్లో ఒక్కసారైనా మెరిసిపోవాలని ఆశపడే స్థాయికి ఎదిగేలా చేసింది. ఆపై తన బ్రాండ్ నేమ్ని పలు దేశాలకూ విస్తరింపజేసి తిరుగులేని ఫ్యాషన్ డిజైనర్గా మారింది. సామాన్యులు వీటి ధరలను అందుకోవడం కష్టమే. ఆన్లైన్లోనూ లభ్యం. సోనాక్షి సిన్హా ధరించి ఏకే ఓకే డ్రస్ ధర రూ. 38,000/- క్యూరియో కాటేజ్.. ఇదొక మహిళల బ్రాండ్! ఇక్కడ పనిచేసేవారందరు కూడా మహిళలే! ఒకరకంగా చెప్పాలంటే మహిళల చేత మహిళల కోసం రూపుదిద్దుకున్న ప్రత్యేక బ్రాండ్ ఇది. అందుకే ఇక్కడ లభించే ఏ డిజైన్ను చూసినా వెంటనే ప్రేమలో పడిపోతారు. 1971లో ఏక్తా బఠీజా ప్రారంభించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం వారి మూడోతరం వారసులు అదే ప్యాషన్తో కొనసాగిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ కొనుగోలు చేయొచ్చు. సోనాక్షి సిన్హా ధరించిన జ్యూలరీ ధర రూ. 23,990/-, ఉండగం ధర రూ. 6,990/- ---దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..!
సోషల్ మీడియాలో జనం తమకు ఎదురైన మంచి లేదా చెడు అనుభవాలను వెల్లడిస్తుంటారు. దీనిపై అదే సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఒక మహిళ ఇటువంటి విచిత్ర ఉదంతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఎదురైన అనుభవం తనకు నిద్రపట్టనీయలేదని ఆమె ఆ పోస్టులో వాపోయింది. ఆ మహిళ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దీంతో నేను మా ఇంటి బాల్కనీలోకి వచ్చాను. అయితే అక్కడి దృశ్యాన్ని చూసి భయపడిపోయాను’ అని పేర్కొంది. ఆమెకు చెట్టుకు వేలాడుతూ తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక మహిళ ఆకృతి కనిపించింది. ఇది ఆమెను ఎంతో భయానికి గురిచేసింది. ఈ వీడియో చూశాక తాను విపరీతమైన భయంతో వణికిపోయానని, ఉపశమనం కోసం 10 నుంచి 15 సార్లు హనుమాన్ చాలీసా పఠించానని తెలిపారు. మర్నాటి ఉదయం ఏం జరిగిందో కూడా ఆ మహిళ తెలియజేసింది. ఉదయాన్నే తాను బాల్కనీలోకి వెళ్లి చూడగా, అప్పటి వరకూ మనసులో ఉన్న భయం తొలగిపోయిందని తెలిపింది. ఆ చెట్టుకు వేలాడుతున్నది దెయ్యం కాదని, ఎవరో మహిళ హ్యాంగర్కు ఆరబెట్టిన నైటీ చెట్టుపైన పడినట్లు గుర్తించానని తెలిపారు. అనిరుద్ధ్ జోషి అనే మహిళ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేయగా, దీనికి లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఒక యూజర్ ‘తాను ఇకపై రాత్రవేళ నిద్రపట్టకపోతే బాల్కనీలోకి వెళ్లను’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు రాత్రంతా బాల్కనీలోనే ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేదో’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! 🤣🤣🤣😂😂🤣🤣🤣 pic.twitter.com/N60zQjFKPx — Aniruddha Joshi (@aniruddha3365) August 20, 2023 -
బికినీతో ఎయిర్పోర్టుకు మోడల్.. ఖంగుతిన్న సిబ్బంది..
బికినీ డ్రెస్లో ఎయిర్పోర్టుకు వచ్చింది బ్రిజెల్కు చెందిన ఓ మోడల్. మోడల్ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కేన్ చాన్(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్ను ఇన్స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్లోని నవేగాంటెస్ ఎయిర్పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. మోడల్ వేషధారణ చూసిన ఎయిర్పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. View this post on Instagram A post shared by Kine-chan/Digital Influencer (@kinechan2.0) కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్.. కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు! -
సైనిక దళాల డ్రస్ రిహార్సల్.. రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు..
ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధానిలో నేడు సైనిక దళాల డ్రస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు అధికారులు. స్వాతంత్య్ర వేడుకలకు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగష్టు 15న జరగనున్న వేడుకలకు వివిధ సైనిక దళాలు నేడు ఎర్రకోట వద్ద డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నాయి. 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇక్కడ నుంచే ఉపన్యాసం ఇవ్వనున్నారు. డ్రెస్ రిహార్సల్కు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. #WATCH | Ahead of Independence Day, full dress rehearsal of different armed forces under way at Red Fort in #Delhi (ANI) pic.twitter.com/84euGIuIe7 — TOI Delhi (@TOIDelhi) August 13, 2023 ఆగష్టు 15న ఎలాంటి ఇబ్బందులు తెలత్తకుండా మొత్తం కార్యక్రమాన్ని ముందే రిహార్సల్స్ చేస్తున్నారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. రిహార్సల్స్ జరిగే మార్గాల్లో వాహనాలు రాకుండా దారి మళ్లించారు. నోయిడా నుంచి వచ్చే ప్రయాణికులకు వేరే మార్గాలను సూచించారు. ఎర్రకోట మార్గంలో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు. Traffic Advisory In view of #IndependenceDay Full Dress Rehearsal on August 13, 2023, #DelhiTrafficPolice advises commuters to avoid these roads and take alternate routes at the mentioned timings. pic.twitter.com/5oAxPbkjkR — Delhi Traffic Police (@dtptraffic) August 12, 2023 యూపీలోనూ వర్కింగ్ డే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం వర్కిండే డే అని ప్రకటించారు. హర్ గర్ తిరంగ, మేరీ మాత మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 15 వేడుకల కోసం స్కూళ్లకు ఆదివారం సెలవును రద్దు చేశారు. డుస్తుంది. ఆదివారం సెలవు అయినప్పటికీ నేరుగా అధికార వర్గాలు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యార్థులు పాఠశాలలకు యధావిథిగా వచ్చి.. వేడుకల్లో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నేడు మధ్యాహ్నం భోజనం స్కీం కూడా నడుస్తుంది. ఇదీ చదవండి: మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు -
స్పెషల్ ఎట్రాక్షన్గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ తన డ్రెస్సింగ్ స్టయిల్తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ బద్ధంగా చీర కట్టినా, పాశ్చాత్య దుస్తులైనా ఆమెది ప్రత్యేక శైలి. లక్షల ఖరీదు చేసే అత్యంత ఖరీదైన డిజైనర్ దుస్తులు ధరించినా ఆమెకు ఆమే సాటి. హై-ఎండ్ బ్రాండ్లను ఇష్టపడే ఫ్యాషన్ ఔత్సాహికులందరికీ నీతా అంబానీ వార్డ్రోబ్ ఒక రోల్మోడల్ తాజాగా నీతా అంబానీ న్యూయార్క్ వెకేషన్లో గూచీ కో-ఆర్డ్ సెట్ ఆకర్షణీయంగా నిలిచింది. నీతా లగ్జరీ లేబుల్ గూచీ నుండి బ్రౌన్-హ్యూడ్ ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. అంబానీ ఫ్యాన్ పేజీ షేర్ చేసిన వివరాల ప్రకారం న్యూయార్క్ నగర వీధుల్లో ఫ్యాన్స్తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో ఓపెన్ ట్రెసెస్, డైమండ్ చెవిపోగులు, ఖరీదైన ఓరాన్ చెప్పులను ధరించడం అభిమానులను ఎట్రాక్ట్ చేసింది. నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ విలువ రూ. 2.8 లక్షలు నీతా గూచీ కో-ఆర్డ్ సెట్ భారీ ధర 2.8 లక్షలు అట. సిల్క్-శాటిన్ జాక్వర్డ్ షర్ట్ ధర 2,128 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1,76,135. మరోవైపు, ఆమె మ్యాచింగ్ ట్రౌజర్ విలువ 1200 యూరోలు అంటే మన రూపాయిల్లో రూ. సుమారు 1,08,805. మొత్తం మీద నీతా అంబానీ కో-ఆర్డ్ సెట్ ఖరీదు రూ. 2,84,940 అని తెలుస్తోంది. ఓరాన్ చెప్పుల విలువ రూ. 6.5 లక్షలు నీతా అంబానీ ధరించి విలాసవంతమైన పాదరక్షల జత విలువ భారతీయ కరెన్సీలో దాదాపు 7 లక్షల రూపాయలు (రూ. 6,49,428). ఇక ఆమె చీరల విషయానికి వస్తే సాంప్రదాయ, నేత చీరలకు ముఖ్యంగా గుజరాతీ పటోలా చీరల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల రూ. 1.7 లక్షలు విలువైన డిజైనర్ నవదీప్ తుండియా రూపొందించిన నీలం , ఎరుపు రంగు కలగలిసిన గుజరాతీ పటోలా మెరిసిన సంగతి తెలిసిందే. గార్జియస్ బిజినెస్ విమెన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నీతా అంబానీ లగ్జరీ లేబుల్ వైఎస్ఎల్ హీల్స్ ఎక్కువగా ధరిస్తారు. ఆమె వార్డ్రోబ్లో ఉన్న 6 ఖరీదైన వైఎస్ఎల్ హీల్స్ ఉన్నాయట. -
తాలిబాన్ సంచలన నిర్ణయం.. వాటిపై నిషేధం, అలా జరిగితే ఇదే మొదటి సారి
2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆ దేశ ప్రజలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అందులో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి, యూనివర్సిటీ విద్యను అభ్యసించడాన్ని నిషేధించడంతోపాటు పాఠశాల విద్యపైనా అనేక ఆంక్షలు విధించారు. చివరికి మహిళలు బ్యూటీ పార్లర్లను నిషేధించారు. తాజాగా పురుషుల దుస్తులపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్దమయ్యారు తాలిబన్లు. వివరాల్లోకి వెళితే.. పురుషులు ధరించే నెక్టైలపై నిషేధం విధించేందుకు తాలిబన్లు సిద్ధమయ్యారు. నెక్టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. ఈ విషయాన్ని ‘ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్’ డైరెక్టర్ మొహమ్మద్ హషిమ్ షాహీద్ వ్రార్ వెల్లడించారు. అఫ్గాన్లో మతపరమైన విధానాలను నిర్ణయించే స్వతంత్ర సంస్థ ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్. ఆయన దీనిపై మాట్లాడుతూ.. "కొన్నిసార్లు, నేను ఆసుపత్రులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఆఫ్ఘన్ ముస్లిం ఇంజనీర్ లేదా డాక్టర్ నెక్టైని ఉపయోగించడం చూశాను. నెక్టైకి మూలం ఏంటి.. క్రిస్టియన్ శిలువను పోలి ఉందని, వీటిని నిషేధించాల్సి ఉందని" అని పేర్కొన్నాడు. నెక్టీలపై నిషేధం విధించినట్లయితే, తాలిబాన్ అధికారులు పురుషుల దుస్తులపై ఆంక్షలు విధించడం ఇదే మొడటి సారి అవుతుంది. Video: Mohammad Hashim Shaheed Wror, General Director of the Invitation and Guidance Directorate (an independent body that determines religious policies within the interim govt), said that the necktie originated from the Christian cross and that it is “ordered in Shariah that you… pic.twitter.com/UMHesWX6TM — TOLOnews (@TOLOnews) July 26, 2023 చదవండి US Woman Got 100 Amazon Orders: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
సమంత వేసుకున్న ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీలను చాలామంది ఫాలో అవుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాళ్లు వేసుకున్న డ్రెస్సులు, వాచీలు, గాడ్జెట్స్పై జనాలు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. వాళ్లు ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఆ వార్తలు క్షణాల్లో వైరల్గా మారుతుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత వేసుకున్న డ్రెస్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆ స్టోరీ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. సమంత ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనూ సామ్ అవుట్ఫిట్స్ సూపర్ ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మయోసైటిస్ నుంచి బయటపడిన సమంత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించదని టాక్. పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్కు వెళ్లిన సమంత తాజాగా బాలికి వెకేషన్కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటుంది. రీసెంట్గా సమంత వేసుకున్న ఓ డ్రెస్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో ఓ డ్రెస్లో సమంత క్యూట్ లుక్స్తో మెస్మరైజ్ చేసింది. ఇక ఆ డ్రెస్ కాస్ట్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కల్ట్ గయా కామెరూన్ నిట్ బ్రాండ్కు చెందిన గ్రీన్ కలర్ డ్రెస్లో సమంత స్టైలిష్గా దర్శనమిచ్చింది. ఆ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 37, 790 రుపాయలు అని తేలింది. దీంతో ఇంత సింపుల్ డ్రెస్ అంత ఖరీదా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన అద్భుతమైన ఫిజిక్, స్టైల్తో ఫ్యాన్స్ను ఎపుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూత లూగించడం, లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చెయ్యడం అలవాటు.పబ్లిక్ అప్పీరెన్స్లో ఫ్యాషన్ ఐకాన్గా నిలవడం ఆమెకు అలవాటు.తన వార్డ్రోబ్లో లగ్జరీ యాక్ససరీస్కు పాపులర్ అయిన ఈ చయ్యా చయ్యా అమ్మడు ఇటీవల వెకేషన్ను ఎంజాయ్ చేసి వచ్చిందట అజర్బైజాన్లోని బాకులో ఆనందంగా గడిపిన క్షణాలుంటూ కొన్నిఫోటోలు, వీడియోతో అందరినీ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అజర్బైజాన్ వెకేషన్లో ధరించిన వైట్-హ్యూడ్ ట్యాంక్ డ్రెస్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. తెల్లని పొడవాటి వైట్ గౌను, మెడలో రెండు గొలుసులు, సన్ గ్లాసెస్తో స్పెషల్ లుక్లో ఉంది. సోర్చ్ అన్నోన్ అనే బ్రాండ్కు చెందిన ఈ డ్రెస్ ధర భారతీయ కరెన్సీలో టాక్స్లు మినహాయించి రూ. 5,909లట. కాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ను మలైకా వివాహం ,అర్హాన్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బీటౌన్ హీరో అర్జున్ కపూర్ల ప్రేమయాణం గురించి తెలిసిందే. -
నటి బోల్ట్ అవుట్ఫిట్... ఉర్ఫీ జావెద్ను ఫాలో అవుతున్నారుగా!
బాలీవుడ్ బుల్లితెర భామ నియా శర్మ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై, జమై రాజా, ఇష్క్ మే మార్జవాన్, నాగిన్ -4 సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. ఆమెకు ఇన్స్టాలో దాదాపు 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికెళ్లినా ప్రతిసారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దు గుమ్మ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) తాజాగా ఆమె తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో నియా శర్మ బ్యాక్సైడ్ ఎలాంటి దుస్తులు లేకుండా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఆ వీడియోలో నియా శర్మ పూర్తిగా బ్యాక్ లెస్గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ ఉర్ఫీ జావెద్ను ఆదర్శంగా తీసుకున్నారా? అంటూ రాసుకొచ్చాడు. ఆమెకు కనీసం దుస్తులు వేసుకోనేందుకు కూడా టైం లేదా అంటూ రాశారు. అంతేకాకుండా మరో నెటిజన్ రాస్తూ ఏకంగా దుపట్టానే డ్రెస్గా మార్చిసేంది అంటూ కామెంట్ చేశాడు. మరికొందరేమో చీప్ డ్రెస్సింగ్ అంటూ ట్రోల్స్ చేశారు. కాగా.. 'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె రవి దూబేతో కలిసి 'జమై రాజా' అనే ప్రముఖ షోలో కనిపించింది. నియా శర్మ బాక్స్ క్రికెట్ లీగ్, ఖత్రోన్ కే ఖిలాడీ -8, బిగ్ బాస్ ఓటీటీ లాంటి రియాలిటీ షోలలో పాల్గొంది. (ఇది చదవండి: 14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడి బర్త్డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల (జూన్ 26) పుట్టినరోజు వేడుకును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.అతని ప్రేయసి మలైకా అరోరా స్టార్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్లో దిల్ సే చిత్రంలోని సూపర్హిట్ సాంగ్ ఛైయ్యా ఛైయ్యాకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఎంత అనే చర్చ జోరందుకుంది. దీని ధర అక్షరాల 99వేల రూపాయలట. మలైకా అరోరా రిబ్బడ్ బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అంటారు. స్లీవ్లెస్ వైట్ గౌన్పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను అందంగా డిజైన్ చేశారు. మలైకా వైట్ అండ్ రెడ్ గౌనులో మెరిసిపోవడమేకాదు, కిల్లింగ్ స్టెప్స్తో ఇరగదీసింది. ఈ వేడుకలో అతని సోదరి ఖుషీ కపూర్, అన్షులా కపూర్తో పాటు ఆమె ప్రియుడు రోహన్ థక్కర్, కునాల్ రావల్, అర్పితా మెహతా తదితరులు సందడి చేశారు. -
డ్రెస్ కవర్ చేసుకోలేక ఇబ్బంది పడ్డ శ్రియా.. వైరల్ అయిన వీడియో
సీనియర్ బ్యూటీ శ్రియ శరన్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. అయితే తాజాగా శ్రియా దరించిన ఈ డ్రెస్పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె నడుస్తన్నప్పుడు ఆమె డ్రెస్ ఎక్కడ జారిపోతుందో అనేంతగా ఉంది. ఆ సమయంలో డ్రెస్ను కవర్ చేసుకోలేక ఎంతో కష్టపడింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ తో విరుచుకపడుతున్నారు. (ఇదీ చదవండి: ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. ప్రెగ్నెన్సీ అంటోన్న నెటిజన్స్!) కొందరు అంతగా ఇబ్బంది పడే డ్రెస్ ఎందుకు వేసుకోవడం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీ దారుణమైన కామెంట్ ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు శ్రియాను బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్తో పోల్చుతున్నారు. ఇలాంటి చెత్త డ్రెస్లు ఆమెనే ఇచ్చిందా అంటూ.. ఉర్ఫీ జావేద్ 2.0 వెర్షన్ వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. దీంతో శ్రీయా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 2001లో టాలీవుడ్ నుంచి ఇష్టం సినిమాతో శ్రియా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె 2002లో వచ్చిన సంతోషం చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత, ఆమెకు టాలీవుడ్ టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కింది. తాజాగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఆమె చేసిన 'దృశ్యం 2' సినిమా భారీ విజయం సాధించింది. అనంతరం తను మళ్లీ బిజీ యాక్టర్గా మారిపోయింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) (ఇదీ చదవండి: అడివి శేష్కు ఛాలెంజ్ విసిరిన హైదరాబాద్ సీపీ) -
అలియా హాలీవుడ్ ఎంట్రీ: ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే..!
నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ఫ్యాన్ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ అలియా తన గ్లామర్ లుక్లో అందర్ని మరోసారి మెస్మరైజ్ చేసింది. బ్రెజిల్లోని సావో పాలోలో జరిగిన నెట్ఫ్లిక్స్ టుడమ్ 2023 ఈవెంట్కు హాజరైన అలియా రెండో రోజు అందంగా మెరిసిపోయింది. ఫుల్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో గ్లోబల్ ప్లాట్ఫారమ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ డ్రెస్ ఖరీదు ఎంత అనేది చర్చకు తెర లేచింది. అలియా భట్ హై వెయిస్ట్ పెప్లమ్ గౌను ధర రూ. 1.38 లక్షలు ఎక్కడ ఏమి ధరించాలో అలియా భట్కి తెలుసు, అందులోనూ గ్లోబల్ ఈవెంట్, హాలీవుడ్ ఎంట్రీ.. తొలిరోజు విమర్శల నేపథ్యంలో రెండో రోజు జాగ్రత్త పడింది. హై వెయిస్ట్ పెప్లమ్ , సెంటర్-బ్యాక్ స్లిట్, బాడీ ఫిట్టింగ్ గ్రీన్ డ్రెస్లో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. ఈ డ్రెస్ ధర 1690 డాలర్లు అంటే రూ.1,38,525 అన్నమాట. హార్ట్ ఆఫ్ స్టోన్తో హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు ఈ సినిమా ట్రైలర్లాంచ్తో మరో మెట్టు ఎదిగిపోయింది. క్లాస్ మినిమల్ అవతార్లో హార్ట్ ఆఫ్ స్టోన్ సహ-నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్లతో కలిసి పోజులిచ్చింది. ఈ ఫోటోలను షేర్ చేసిన అలియా "ఒబ్రిగాడో బ్రెజిల్...అందరి ప్రేమకు ధన్యవాదాలు! అంటూ గ్రీన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం. కాగా ఇదే ఈవెంట్లో తొలి రోజు డ్రెస్సింగ్కు సంబంధించి అలియా అద్భుతంగా కనిపించి నప్పటికీ, ఈవెంట్లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కారణంగా విపరీతంగా ట్రోలింగ్ గురైంది. గన్ని బ్రాండ్ మ్యాచింగ్ స్కర్ట్తో పింక్-హ్యూడ్ గ్లోసీ జాకెట్-షేప్ టాప్ను ధరించింది. ఈ బ్లేజర్ ధర రూ. 39,952, మ్యాచింగ్ క్రాప్ టాప్ ధర రూ. 20,200. టోటల్గా పింక్-హ్యూడ్ శాటిన్ అవుట్ఫిట్ ధర రూ. 93,628. -
వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!
రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి భారీ విజయాలను అందుకుంది. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో పింక్ సిండ్రెల్లా డ్రెస్లో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. డ్రెస్సే అందంగా ఉంది అనుకుంటే అంతకంటే అందమైన రకుల్ ప్రీత్ను చూసి ఈవెంట్కి వచ్చిన వారు తమ చూపు తిప్పుకోలేకపోయారు. సిండ్రెల్లా దుస్తుల్లో హోయలుపోతున్న రకుల్ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. (ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను) ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దుస్తుల్లో రకుల్ ప్రీత్ సింగ్ని చూసిన వాళ్లు.. 'బాలీవుడ్ సిండ్రెల్లా' అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. కానీ రకుల్ డ్రెస్సును ఒకరు ఎత్తిపట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హిందీలో మాత్రం రెండు చిత్రాలకు ఓకే చెప్పింది. తాజాగా బాలీవుడ్లో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాలో నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (ఇదీ చదవండి: బాధపడుతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్!) -
వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
లవ్బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఆస్కార్ హీరో రామ్చరణ్, ఉపాసన కామినేనితో కలిసి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. త్వరలోనే తల్లి దండ్రులు కాబోతున్న మెగా హీరో దంపతులు ఈవేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన ఆకుపచ్చ డ్రెస్లో బేబీ బంప్తో నిండుగర్భిణీగా చాలా అందంగా కనిపించారు. బ్లాక్ అండ్ కాంబినేషన్ డ్రెస్లో రామ్చరణ్ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, మరింత అందంగా కనిపించారు. బనారసీ ఎంబ్రాయిడరీ అంచుతో, సైడ్ స్లిట్లతో సిల్క్ మెటర్నటీ ఫ్యాషన్ కఫ్తాన్ డ్రెస్లో ఉపాసన డ్రెస్కు తగ్గినట్టుగా మాచింగ్ చోకర్, చెవి పోగులతో స్పెషల్ లుక్లో ఆకట్టుకున్నారు. ప్రముఖ డిజైనర్, జయంతి రెడ్డి కలెక్షన్స్ కు చెందిన ఈ డ్రెస్ ధర రూ. 19,900 అట. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా మెగా హీరో వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి శుక్రవారం (జూన్9, 2023) ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సిగ్గులమొగ్గయ్యి ఆకట్టుకున్న సొట్ట బుగ్గల సుందరి లావణ్య కట్టుకున్న చీర ఎంత అనేది కూడా ఇంటర్నెట్లో చర్చకు తెరతీసింది. డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన చీర ధర రూ. 75వేలని తెలుస్తోంది. Welcome to the Konidela family dearest Lavanya 🤗❤️ Looking forward to celebrating my dearest thodi kodalu. Varunnnnnn soooooo happy for you. @Itslavanya @IAmVarunTej pic.twitter.com/69mMin4tXf — Upasana Konidela (@upasanakonidela) June 10, 2023 p> నా ప్రియమైన తోడి కోడలా స్వాగతం కొణిదెల కుటుంబంలోకి ఆహ్వానం అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మై డియర్ లావణ్య తోడికోడలుగా మారే వేడుక కోసం ఎదురు చూస్తున్నాను. వరుణ్ చాలా హ్యాపీగా ఉంది అంటూ ఉపాసన తన సంతోషాన్ని ప్రకటించారు. -
ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్ ఉతకనవసరం లేదు!
దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్ ధరిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్ వినియోగిస్తున్నారు. జీన్స్ ధారణ మనిషికి మంచి లుక్నిస్తుంది. కొందరు జీన్స్ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్ను ఫ్రిజ్లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు. అయితే జీన్స్ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్ పాడయిపోతుంది. అలాగే జీన్స్ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్ సీఈఓ చిప్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్ను కనీసం 6 నెలల తరువాతనే వాష్ చెయ్యాలి. అయితే జీన్స్ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్లో నుంచి జీన్స్ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్బర్గ్ ఫోటో వైరల్
ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్ జుకర్బర్గ్. మాగ్జిమా (7), ఆగస్ట్(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్కమ్ టూ ది వరల్డ్’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్ చేసి స్వాగతం పలికాడు జుకర్బర్గ్. తాజా విషయానికి వస్తే... పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్ డ్రెస్లను డిజైన్ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్బర్గ్. తాను డిజైన్ చేసిన గౌన్ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు జుకర్బర్గ్. ఈ ఫొటో బాగా వైరల్ అయింది. చదవండి: కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల.. ‘జుకర్ బర్గ్... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?
టాలీవుడ్ మెగా హీరో రామ్చరణ్ భార్య ఉపాసన కామినేని త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. తన జీవితంలో ఒక ముఖ్యమైన విశేషం గురించి ఉపాసన గత ఏడాది డిసెంబరులో ప్రకటించి నప్పటినుంచి మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. దీనికి తగ్గట్టుగానే లగ్జరీ మెటర్నిటీ ఫ్యాషన్ స్టయిల్స్తో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సన్నిహితులు, ఫ్రెండ్స్తో సమక్షంలో ఘనంగా నిర్వహించిన బేబీ షవర్ ఫోటోలు వైరల్గా మారాయి. రామ్చరణ్, ఉపాసన స్నేహితులు, స్మితారెడ్డి, సరిన్ కట్టా త్వరలో కాబోయే మమ్మీకి ఇంటిమేట్ బేబీ షవర్ను నిర్వహించారు. ఈ బేబీ షవర్కి అల్లు అర్జున్, సానియా మీర్జా, కనికా కపూర్ , వారి ఇతర సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం, ఉపాసన గులాబీ రంగు గౌన్లో, తన బేబీ బంప్ను ప్రదర్శిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పింక్ గౌన్ ధరే ఇపుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపాసన కామినేని పింక్ డ్రెస్ రూ. 90 వేలు ఉపాసన కామినేని యొక్క పింక్ ప్యాటర్న్డ్ డ్రెస్లో అందంగా ముస్తాబయ్యారు. డీప్ వీనెక్తో ,షార్ట్ స్లీవ్స్తో ఉన్న గౌను నీడిల్ థ్రెడ్ బ్రాండ్కు చెందింది. దీని ధర 1102 డాలర్లు. అంటే మన కరెన్సీలో (టాక్స్లు అన్ని కలిపి) అక్షరాలా రూ. 90,471. ఏప్రిల్ 19, 2023న త్వరలో కాబోతున్న మమ్మీ ఉపాసన కామినేనికి రామ్ చరణ్ కుటుంబం బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుక కోసం, ఉపాసన జపనీస్ బ్రాండ్ ఇస్సీ మియాకే నుండి బ్లూ కలర్ ప్లీటెడ్ ట్యూనిక్ డ్రెస్లో అలరించింది. ప్లీటెడ్ హాఫ్-స్లీవ్ ట్యూనిక్ బాడీ ఫిట్, ఫ్లేర్ ప్లీట్స్, సైడ్ గస్సెట్, ఫ్లేర్డ్ షేప్ హై నెక్ ఉన్నాయి. అధికారిక వెబ్సైట్లో, ట్యూనిక్ ధర 430 డాలర్లు అంటే రూ. 35,352 అన్నమాట. వైట్ ఫ్లవర్ డ్రెస్ 1.12 లక్షలు ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి కాబోయే మమ్మీ ఉపాసన గ్లామరస్ ప్రెగ్నెన్సీ స్టైల్లో తన ఫ్యాన్స్ను కట్టిపడేస్తున్నారు. మొదటి మూడు నెలల్లో ఒకసారి తెల్లటి-రంగు పూల డ్రెస్లో బేబీ బంప్ను ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ డ్రెస్ బ్రాండ్ జిమ్మెర్మాన్కు చెందినది. దీని ధర సుమారు రూ. 1,11,651. -
డైవర్స్ తీసుకోవడాన్నిగ్రాండ్గా సెలబ్రేట్ చేసింది..రీజన్ వింటే..
డైవర్స్ అన్న పదం వింటేనే గుండె ఝల్లుమంటుంది. అదికూడా అప్పటి వరకు ఉన్న బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. ఏదో కారణంతో విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురేతే.. ఆ బాధ మాట్లలో చెప్పలేం. ఐతే ముఖ్యంగా ఆడవాళ్లు, అదికూడా పిల్లలున్న తల్లి సమాజంలో ఒంటరిగా బతకడం మరింత కష్టం అవుతుంది. దీంతో వాళ్లు దిగాలు పడిపోవడం (లేదా) ఇక జీవితమైపోయింది అనుకుని అంతం చేసుకోవడం వంటి పిచ్చి పనులు చేస్తారు. అలా కాదు మనం జీవితం అక్కడితో అయిపోలేదంటోంది అమెరికాకు చెందిన మహిళ. మనం దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుని నువ్వేంటో చూపేలా బతకాలంటోంది. వివరాల్లోకెళ్తే..యూఎస్లోని లారెన్ బ్రూక్ అనే మహిళ 2012లో పెళ్లి చేసుకుంది. పదేళ్ల వివాహ బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటే తట్టకోలేకపోయింది. సరిగ్గా 2012లో విడాకులు కావాలంటూ ఆమె మాజీ భర్త కోర్టు మెట్లెక్కాడు. దీంతో ఆమె పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలతో తానేం చేయగలను, ఏమవుతుంది జీవితం అని డీలా పడిపోయింది. ఎన్నో కన్నీటి రాత్రులను గడిపింది. డైవర్స్ ఆగిపోతుందేమో!.. తన భర్త మళ్లీ వచ్చేస్తాడేమో అన్న ఆశ భంగపడుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. జనవరి 2023న కోర్టు అధికారికంగా బ్రూక్ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఇక ఎన్నాళ్లు ఈ బాధను మోయాలి. ఔను! ఈ రోజుతో దీనికి ముగింపు పలకాలి అని గట్టిగా నిర్ణయించుకుంది బ్రూక్. అందులో భాగంగానే తాను విడాకులు తీసుకోవాడాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యింది. ఇన్నిరోజులు ఏదో జరగుతుందన్న ఆశతో కన్నీళ్లతో గడిపాను. మంచో చెడో ఏదో ఒకటి అయ్యింది. ఇక్కడితో నా కన్నీళ్లకు స్వస్తి పలికి.. సెలబ్రేషన్తో ఆ విషాదానికి ముగింపు చెప్పాలనుకుంది. తన తల్లి ఫెలిసియా బౌమన్ (58), తన బెస్ట్ఫ్రెండ్ సమక్షంలో ఈ విషాదాన్ని వేడుకగా చేసుకుంది. ఆ వేడుకను ఆమె తల్లి, స్నేహితురాలు ఫోటోషూట్ చేశారు. మహిళలు తాను విడిపోయాను అని చెప్పుకునేందుకు చాలా సిగ్గుపడతారని బ్రూక్ చెబుతోంది. అలా కాదని ఇక నుంచి చాలా శక్తిమంతమైన మహిళగా తయారయ్యేందుకు నాంది ఇదేనని చెప్పడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశ్యం అంటోంది బ్రూక్. నీతో నువ్వు పోరాడుతూ ఈ సమాజాన్ని ఎదుర్కొనే గొప్ప మహిళ తానేనని ప్రతి ఒక్క స్త్రీ తెలసుకోవాలని చెప్పేందుకే ఇలా చేశా. కామెడీగా మాత్రం కాదని చెప్పింది. "మనల్ని వద్దు అనుకున్న వాళ్లు సిగ్గుపడి తలదించుకునేలా తలెత్తి బతకాలి. బంధం కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. ముందుకు సాగాలి" అంటూ భావోద్వేగంగా చెప్పింది. ఈ మేరకు తన పెళ్లి నాటి దుస్తులు, ఫోటోలు వాటి తాలుకా జ్ఞాపకాలను కాల్చేసి.. వేడుకలా సెలబ్రేట్ చేసుకుంది. రిలేషన్ని కోల్పోయానన్న బాధతో ఉండకూడదు స్ట్రాంగ్గా ఉండి నవ్వేంటో నిరూపించుకునే తరుణం ఇది. ఇది నీకు దొరికిన అద్భుతమైన అవకాశంగా ఛాలేంజింగ్గా తీసుకో అని చెబుతోంది బ్రూక్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్ మనిపించకుండా ఉండలేం!) -
సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారకు అలియా భట్ సప్రైజ్ గిఫ్ట్
-
డ్రెస్తో జాన్వీ కపూర్ తిప్పలు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్లో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. 2018లో దఢక్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది జాన్వీ కపూర్. తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మెరిసింది భామ. జాన్వీ స్టైలిష్ లుక్తో అదరగొట్టింది. ఈ ఫంక్షన్లో వెరైటీ డ్రెస్లో కనిపిస్తూ సందడి చేసింది. అయితే ఆ డ్రెస్సులో వేదికపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. జాన్వీ పసుపు రంగు కటౌట్ గౌను ధరించిన వేదికపై ఫోటోలకు ఫోజులివ్వగా.. ఆ దుస్తుల్లో చాలా అసౌకర్యంగా కనిపించింది. దీంతో నెటిజన్స్ జాన్వీ కపూర్ డ్రెస్పై దారుణంగా ట్రోల్స్ చేశారు. మీరు ఎందుకు వెస్టర్న్ కల్చర్ను కాపీ కొడుతున్నారు అని ప్రశ్నించారు. మరొ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీరంతా ఉర్ఫీ జావెద్ను అంటారు.. మళ్లీ బాలీవుడ్ మొత్తం ఆమెనే ఫాలో అవుతారు అంటూ కామెంట్ చేశారు. జాన్వీ డ్రెస్ టెంట్ వేసుకునే పరదాలా ఉందని ఫన్నీ కామెంట్ చేశాడు. (ఇది చదవండి: పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి) కాగా.. జాన్వీ తదుపరి చిత్రం వరుణ్ ధావన్తో కలిసి బవాల్లో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్లో తమ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ కోసం శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. జాన్వీ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రయాణికులు అలాంటి దుస్తుల్లో రావద్దు.. ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఓ యువతి టు పీస్ బికినీ టైప్ దుస్తులు ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన చేసింది. రైలులో ప్రయాణించేవారు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు మెట్రోలో ఇతరులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా అన్పించే దుస్తులు ధరించవద్దని యాజమాన్యం సూచించింది. తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. సమాజానికి ఆమోదయోగ్యమైన వేషధారణలో ప్రయాణించాలని తెలిపింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించింది. 'మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు వేషధారణ మంచిగా ఉండాలని ప్రయాణికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసిన యువతి పేరు రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది. తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది. చదవండి: దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్లో.. -
బర్త్డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్గా సెలబ్రెట్ చేసుకున్నాడు. మార్చి 27తో చరణ్ 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సోమవారం రాత్రి జరిగిన చరణ్ బర్త్డే పార్టీలో టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్స్ పాల్గొని సందడి చేశారు. ఇక చరణ్ బర్త్డే సందర్భంగా RC15 నుంచి వరుస అప్డేట్స్ వదిలారు మేకర్స్. చదవండి: బిగ్బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడిని ముద్దాడుతూ ఓ ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం స్వయంగా ఇంటికి వెళ్లి చరణ్కి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో చరణ్ ధరించిన లైట్ బ్లూ షర్ట్పై అందరి దృష్టి పడింది. బర్త్డే సందర్భంగా చరణ్ వేసుకున్న ఆ షర్ట్ స్పెషాలిటీ, బ్రాండ్ ఏంటి? అని ఫ్యాన్స్ ఆరా తీయగా దాని ధర తెలిసి అంతా అవాక్కవుతున్నారు. చదవండి: తొలిసారి బేబీ బంప్తో ఉపాసన.. ఫొటోలు వైరల్ దీంతో చరణ్ షర్ట్ కాస్ట్ వైరల్గా మారింది. కాగా ఈ షర్ట్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేయగా ఇది ఫార్ ఫేచ్ అనే ఫారిన్ షాపింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కనిపించింది. జాన్యా వటనాబి ప్యాచ్ వర్క్తో డిజైన్ చేసిన ఈ షర్ట్ను డీటైల్ అని పిలుస్తారు. ఇక ఈ వెబ్ సైట్ ప్రకారం.. ఈ షర్ట్ ధర 983 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 80,961 రూపాయలు. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. -
వసంతాలు విరిసేవేళ
వసంతం విచ్చేసిందని ప్రకృతి మనకు పంపించే తొలి కబురు రంగుల వేడుకైన హోలి. రాబోయే వేసవిని తట్టుకోవడానికి మన మేనిని హాయిగొలిపేలాఉంచడానికి స్వచ్ఛమైన తెలుపును పరిచయం చేసేది హోలి.ఎందుకంటే రంగుల హంగులను అందంగా ఇముడ్చుకునేది తెలుపే!ఇంద్రధనుస్సు ఎలాగూవేసుకున్న దుస్తులను అందంగా పలకరిస్తుందిపువ్వుల నవ్వుల్ని, పచ్చదనాన్నీ అద్దుతుంది. ఆ హంగులను అద్దుకున్న తెలుపు మన జీవితాలను ఆనందమయం చేస్తుంది. అందుకే, వసంతాలు విరిసేవేళా నిన్ను నేను చూశాను...అంటూతెలుపు రంగు డ్రెస్ల ఎంపికకు మొదటి ఓటు వేయవచ్చు. తెలుపుతోపాటు క్రీమ్ కలర్ థీమ్ ఉన్న డ్రెస్సులు ఎంతో అందాన్నీ, హాయినీ ఇస్తాయి. వీటిలో కాటన్, లినెన్, చికన్ కారీ వర్క్, ఇతర ఎంబ్రాయిడరీ లేదా చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్న డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. పూర్తి వైట్ ఇష్టపడని వారు క్రీమ్ కలర్, ఇతర కాంబినేషన్ కలర్స్తో ఉన్న డ్రెస్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులు అన్ని పార్టీలలోనూ ప్రత్యేకంగా ఉంటాయి. -
జరీ అంచు ఆభరణం
సంప్రదాయ వేడుకలలో జరీ అంచు చీరల రెపరెపలు మనకు పరిచయమే. పువ్వులు, హంసలు, గోపురపు డిౖజైన్లతో అవి అందంగా ఆకట్టుకుంటాయి. వాటిని అంచు వరకే ఎందుకు పరిమితం చేయాలనే ఆలోచనతో ఆభరణంగా రూపుకడుతున్నారు డిజైనర్లు. పాత చీరెల అంచులైనా కొత్తగా మార్కెట్లో లభించే జరీ బార్డర్స్ అయినా ఇలా మనసుదోచేలా మురిపిస్తున్నాయి. సంప్రదాయ వేడుకలు వేడుకకు తగినట్టు డ్రెస్ ఎంపిక ఉంటుంది. దానికి మ్యాచింగ్గా ఈ జరీ మాలలు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి. ఫ్యాబ్రిక్ రోలర్ నూలు దారాలను ఉండగా చేసి, వాటికి కట్ చేసుకున్న బార్డర్ని అతికించి, కావల్సిన పరిమాణంలో ఫ్యాబ్రిక్ బీడ్స్ను తయారు చేసుకోవచ్చు. లాకెట్స్తో ప్రత్యేకం ముగ్గు, గోపురం, దేవతా మూర్తుల లాకెట్స్ని ఈ జరీ అంచు చెయిన్స్కు జత చేయచ్చు. లేదంటే, బార్డర్ ఫ్యాబ్రిక్నే లాకెట్లా తయారు చేసి, వేసుకోవచ్చు. బీడ్స్తో జత కట్టి రంగు రంగుల పూసలను ఎంపిక చేసుకొని, వాటితో జరీ బాల్స్ను జత చేసి దండగా సిద్ధంగా చేసుకోవచ్చు. గాజుల అందం రంగు వెలసిన వెడల్పాటి గాజులను వాడకుండా పక్కన పడేయటం ఇళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. వాటితో జరీ అంచును ఇలా అందంగా తయారుచేసుకోవచ్చు. 1.పాత సిల్క్ , జరీ అంచు ఉన్న చీరను ఎంపిక చేసుకోవాలి. జరీ అంచు బాగుంటే, దానిని చీర నుంచి కట్ చేసుకోవాలి. 2. ఎంపిక చేసుకున్న గాజుకు కట్ చేసిన జరీ అంచును చుట్టి, అన్నివైపులా గ్లూతో అతికించాలి. 3. ఎక్కడా జరీ పోగులు బయటకు రాకుండా సరి చూసుకోవాలి. 4. పూర్తిగా గాజు తయారీ పూర్తయ్యాక ఫ్యాబ్రిక్ చివర్లు కూడా బయటకు కనిపించకుండా అతికించాలి. 5. రెండు రకాల గాజు మోడల్స్ తయారు చేసుకొని, కాంబినేషన్గా ధరించవచ్చు.