holi
-
కర్నూలు జిల్లా: స్త్రీ వేషధారణలతో రథి మన్మథులకు పురుషుల పూజలు (ఫోటోలు)
-
విజయవాడలో హోలీ సందడి (ఫోటోలు)
-
అయోధ్య బాల రామ్ ప్రత్యేక ఆకర్షణ బోర్డర్ లో హోలీ సంబరాలు
-
కర్నూలు జిల్లా సంతేకుళ్లారు గ్రామంలో వెరైటీగా హోలీ పండగ
-
హోలీ వేళ సీఎం యోగి రుద్రాభిషేకం!
హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. సీఎం యోగి పలు సందర్భాల్లో శివుణ్ణి పూజిస్తుంటారు. తరచుగా కాశీకి వెళ్లి విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తుంటారు. సీఎం యోగి తాజాగా చేసిన ఒక పోస్ట్లో గడచిన ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో విజయం సాధించామన్నారు. ఈ 7 సంవత్సరాలు ‘న్యూ ఉత్తర ప్రదేశ్ ఆఫ్ న్యూ ఇండియా’ను సృష్టించేందుకు కృషి చేశామన్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur pic.twitter.com/RA4r1oJDHG — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2024 ప్రజా సంక్షేమ బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజల సహకారం లభిస్తున్నదని, అందుకు వారికి కృతజ్ఞతలు. హ్యాపీ హోలీ’ అని పేర్కొన్నారు. आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रेरणादायी मार्गदर्शन में उत्तर प्रदेश की 25 करोड़ जनता की सेवा, सुरक्षा और समृद्धि के संकल्प को आज 07 वर्ष पूरे हो रहे हैं। इन 07 वर्षों में सबका साथ-सबका विकास के मंत्र के माध्यम से हर व्यक्ति के जीवन में सकारात्मक परिवर्तन लाने… — Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 25, 2024 -
మోదీ వాటర్ గన్లపై కాంగ్రెస్ ఆగ్రహం
హోలీ వేడుకలకు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లు కనిపిస్తున్నాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ వాటర్ గన్ల వినియోగంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, కమలం గుర్తు కలిగిన వాటర్ గన్లు విరివిగా విక్రయమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ బీజేపీ వైఖరిపై పలు విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే బ్రాండింగ్పై బీజేపీ దృష్టి పెట్టిందని ఆరోపించారు. మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్స్, ఇతర హోలీ సామగ్రి తయారీకి అయ్యే ఖర్చును మోదీ ప్రభుత్వం భరిస్తున్నట్లుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లను వినియోగించరని స్పష్టం చేశారు. -
అయోధ్యలో హోలీ వేడుకలు.. రంగుల్లో రామ్లల్లా!
రామ్లల్లా అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువైన దరిమిలా తన మొదటి హోలీని జరుపుకుంటున్నాడు. రంగుల పండుగ సందర్భంగా బాలరాముని మనోహర విగ్రహం పూలతో అలంకృతమయ్యింది. బాలరాముని నుదిటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్లల్లా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామ్లల్లాను దర్శించుకునేందుకు ఆలయంలో బారులతీరారు. రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆలయ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ధార్మిక నగరి అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. అయోధ్యలో గత ఏకాదశి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రామనగరిలో కొలువైన దేవతలు, రుషులకు రంగులు పూశారు. రాముని పరమ భక్తుడైన హనుమంతునికి కూడా హోలీ రంగులను పూశారు. -
Colors of Politics: నెహ్రూ నుంచి మోదీ వరకూ..
హోలీకి భారత రాజకీయాలకు మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. మొఘల్ చక్రవర్తులు, బ్రిటీష్ పాలకులు కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోలీ సందర్భంగా ప్రజల కోసం తన నివాసం తీన్ మూర్తి భవన్ తలుపులు తెరిచేవారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఢిల్లీ ప్రజలతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఎన్నికల సంవత్సరంలో జరిగే హోలీ వేడుకలు రాజకీయాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. తీన్ మూర్తి భవన్ గతంలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివాసంగా ఉండేది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ భార్య జాక్వెలిన్ భారత్లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నాటి దౌత్యవేత్త బీకే నెహ్రూ తన ఆత్మకథ ‘నైస్ గైస్ ఫినిష్ సెకండ్’లో జాక్వెలిన్ హోలీ వేడుకల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. హోలీ వేడుల్లో నెహ్రూ.. 1962లో కెన్నెడీ భార్య జాక్వెలిన్ తొమ్మిది రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. అయితే ఆమె హోలీ రోజు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోజు ఆమె జవహర్లాల్ నెహ్రూకు వీడ్కోలు చెప్పడానికి తీన్ మూర్తి భవన్కు వెళ్లారు. ఆమె ఆరోజున ఫ్యాషన్ దుస్తులు ధరించారు. అక్కడ ఉన్న నాటి అమెరికన్ అంబాసిడర్ గాల్బ్రైత్ కుర్తా పైజామా ధరించి వచ్చారు. బికె నెహ్రూ తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని నెహ్రూ హోలీ వేడుకలను ఎంతో ఇష్టపడేవారు. జాక్వెలిన్ తీన్ మూర్తి భవన్కు చేరుకోగానే వివిధ రంగులలో గులాల్ నింపిన చిన్న గిన్నెలను వెండి ట్రేలో ఆమె ముందుకు తీసుకువచ్చారు. నెహ్రూ.. జాక్వెలిన్ నుదుటిపై గులాల్ రాశారు. అక్కడే ఉన్న ఇందిరా గాంధీ కూడా జాక్వెలిన్కు రంగులు పూశారు. అనంతరం నెహ్రూ.. పాలం విమానాశ్రయంలో జాక్వెలిన్ కెన్నెడీకి వీడ్కోలు పలికారు. దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా హోలీ ఆడేవారు. తీన్ మూర్తి భవన్లో హోలీని జరుపుకునే ఈ ప్రక్రియ 1963 వరకు కొనసాగింది. 1964లో నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆ సంవత్సరం అక్కడ హోలీ జరగలేదు. 1964లో ఆయన మరణానంతరం ప్రధానమంత్రి నివాసంలో హోలీ వేడుకలు నిలిచిపోయాయి. ఇందిర నివాసంలో.. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సఫ్దర్జంగ్ రోడ్లోని ఆమె ప్రభుత్వ నివాసంలో హోలీ వేడుకలు జరిగేవి. ఆరోజు వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక వంటకాలు వడ్డించేవారు. తరువాతి కాలంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు తమ ఇంట్లో హోలీ ఆడేవారు. పలువురు కాంగ్రెస్ నేతలు వారి నివాసానికి చేరుకుని హోలీ వేడుకల్లో పాల్గొనేవారు. వాజపేయి, మోదీల రంగుల కేళి అటల్ బిహారీ వాజపేయి దేశ ప్రధాని అయ్యాక ఆయనకు గులాల్ పూయడానికి చాలా మంది ఆయన నివాసానికి వెళ్లేవారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాటి ప్రధాని వాజపేయి సమక్షంలో హోలీ వేడుకలు చేసుకున్న ఉదంతం 1999లో జరిగింది. వాజ్పేయి తన నివాసంలో హోలీ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో మిత్రపక్షాలే కాకుండా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. నాడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాడు వాజ్పేయి, మోదీ పరస్పరం రంగులు పూసుకున్నారు. అప్పటి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ ఆడేవారు. నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హోలీ వేడుకలను మానసిక వికలాంగ చిన్నారుల మధ్య జరుపుకునేవారు. ఇందులో రంగులు, గులాల్ బదులు పూలు జల్లుకునేవారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారిక నివాసంలో కూడా హోలీ వేడుకలను ఉత్సాహంగా జరుగుతుంటాయి. పాత ఢిల్లీ వీధుల్లో ఉరిమే ఉత్సాహం పాత ఢిల్లీ వీధుల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు అతీతంగా నేతలంతా ఒకరినొకరు కలుసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తాజాగా ఆయన దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో నూతన చైతన్యం, ఉత్సాహం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రధాని మోదీ వాటర్ గన్లకు ఆదరణ!
రంగుల పండుగ హోలీకి దేశవ్యాప్తంగా సన్నాహాలు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల మార్కెట్లలో పండుగ కొనుగోళ్లు జరుగుతుండగా, మరోవైపు పూలతో ఇళ్లను అలంకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. యూపీ, ఎంపీలతో సహా అనేక రాష్ట్రాల మార్కెట్లలో జనం మోదీ మాస్క్లను, వాటర్ గన్లను కొనుగోలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వాతావరణానికి ఈ హోలీ వేడుకలు తోడై ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి, ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్గన్ను జనం విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతం నుంచి దక్షిణాది వరకు అంతటా హోలీ సందడి కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో జనం ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో హోలీ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో వివిధ దేశాల రాయబారులు పూలతో హోలీ వేడుకలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
Holi 2024 Celebrations Photos: ఉత్తరాదిలో రంగుల హోలీ పండుగ సంబురాలు (ఫొటోలు)
-
ఆ గ్రామం.. హోలీకి దూరం!
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? బీహార్లోని ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు. -
కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన.. హోలీకి దూరం
అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసినందుకు నిరసనగా 'హోలీ' జరుపుకోమని పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కలవకుండా అడ్డుకున్నారని విలేకరుల సమావేశంలో రాయ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు.. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆఫీస్ బేరర్లు, ఇండియా బ్లాక్ ప్రతినిధులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల అమరవీరుల దినోత్సవమైన శనివారం షాహీదీ పార్క్లో సమావేశమవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరవుతారని ఆయన తెలిపారు. మార్చి 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని, మార్చి 25న హోలీ రోజున ఎలాంటి కార్యక్రమం నిర్వహించబోమని, మార్చి 26న ప్రధాని నివాసాన్ని చుట్టుముడతామని రాయ్ తెలిపారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరెస్టుకు వ్యతిరేకంగా భారత కూటమి సభ్యుల మధ్య చర్చల అనంతరం త్వరలో ఉమ్మడి ఉద్యమం ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. -
వింత హోలీ వేడుకలు.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!
దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదేవిధంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా మహిళల కన్నా పురుషులు హోలీ వేడుకల్లో అత్యంత ఉత్సాహాన్ని కనబరచడం చూస్తుంటాం. కానీ యూపీలోని ఒక ప్రాంతంలో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో హోలీ మర్నాడు స్త్రీలు తమ ప్రత్యేక హోలీని జరుపుకుంటారు. ఆరోజు అక్కడ మహిళలదే రాజ్యం. పురుషులెవరూ గ్రామంలో కనిపించరు. పిలిభిత్ నగరంలోని మధోతండా ప్రాంతంలో ఈ ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. హోలీ మర్నాడు ఈ ప్రాంతంలోని మహిళలంతా గుంపులు గుంపులుగా తిరుగుతూ హోలీ వేడుకలు చేసుకుంటారు. ఆ రోజున స్థానిక మహిళలు హోలీ సంప్రదాయ పాటలు పాడుతూ రోడ్లపై తిరుగుతారు. పాదచారులు, వాహనదారుల నుంచి చందాలు సేకరిస్తారు. ఆ రోజున గ్రామంలోని పురుషులంతా తమ ఇళ్లలో దాక్కుంటారు. లేదా ఊరి బయట ఎక్కడైనా తలదాచుకుంటారు. పిలిభిత్ నగర చరిత్రపై పరిశోధనలు సాగిస్తున్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ మధోతండాలో మహిళలు జరుపుకునే హోలీకి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. మాధోతండా అనేది అడవి అంచున ఉన్న ప్రాంతం. పూర్వం రోజుల్లో హోలీ మరుసటి రోజున పురుషులు వేటకు వెళ్లేవారు. ఈ రోజున మహిళలు ఒకచోట చేరి హోలీ ఆడుకునేవారు. క్రమేణా ఈ హోలీ సంప్రదాయ రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు వేటతో పాటు అడవిలోకి వెళ్లడాన్ని నిషేధించినందున స్థానికంగా ఉన్న మగవారు ఆ రోజున గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళతారు. తండాలో మహిళలు హోలీ ఆడే సమయంలో వారికి పురుషులెవరైనా ఎదురైతే వారి నుండి భారీగా చందా వసూలు చేస్తారు. -
హోలీ రాకుండానే యువకుల హంగామా!
రంగుల పండుగ హోలీ మరికొద్ది రోజుల్లో రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రాకుండానే కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్న వారిపై వాటర్ బెలూన్లు విసురుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుల చేష్టలకు బలైనవారితో పాటు ఈ వీడియో చూసిన వారంతా ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటివారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నీరు నింపిన కొన్ని బెలూన్లను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కారులో వెళుతున్నవారు సన్రూఫ్ నుండి ఆ బెలూన్లను రోడ్డుపై వెళుతున్న వారిపైకి విసరడం వీడియోలో కనిపిస్తుంది. కాగా అదే రోడ్డుపై ఆ కారును వెంబడిస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఉదంతాన్ని ఈ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 9 లక్షల 94 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇలా చేయడం తప్పు. వీరిపై చర్య తీసుకోవాలి’ అని రాశారు. మరొక యూజర్ ‘ఆ కారు నంబర్ను చూసి, పోలీసులకు ట్యాగ్ చేయాలి’ అని కోరాడు. Water-Balloon Kalesh (On 16.03.24 in vasant kunj New Delhi, these two boys throwing random water balloons on people and ladies too on the street) pic.twitter.com/2rU5jLe4f6 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 19, 2024 -
యూపీ ఉద్యోగులకు యోగీ సర్కారు హోలీ కానుక!
ఈ నెల 25న దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు యూపీ సర్కారు శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ డీఏ పెంపుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించనుంది. యూపీలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపునకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ కరువు భత్యం పెంపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా పెరగనుంది. ఈ డియర్నెస్ అలవెన్స్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.314 కోట్ల అదనపు భారం పడనుంది. -
అక్కడి యూనివర్సిటీల్లో హోలీ వేడుకలు నిషేధం..
విశ్వవిద్యాలయాల్లో హోలీ వేడుకల్ని నిషేధిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల కారణంగా సామాజిక సంస్కృతిక విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. దేశానికి ఉన్న ఇస్లామిక్ గుర్తింపునకు భంగం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో జూన్ 12న హోలీ వేడుకలు జరిగిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 'వివిధ రకాల మత విశ్వాసాలు, ఆచారాలతో కూడిన వైవిధ్యత ఇతర మతాలను గౌరవించే సమాజాన్ని సృష్టిస్తుంది. ఈ రకమైన సమాజాన్ని అందరూ కోరుకుంటారు. ఈ వాస్తవాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం' అని విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంటూ హోలీ వేడుకలను నిషేధించింది. Holi celebrations in Quaid-I-Azam University Islamabad Pakistan 🍁 Biggest holi celebration in Pakistan 💓 pic.twitter.com/xdBXwYEglt — QAU News (@NewsQau) June 13, 2023 క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు ఈసారి ఘనంగా జరిగాయి. వీటిని యూనివర్సిటీకి చెందిన సంస్కృతిక సంస్థ నిర్వహించింది. ఇవి కాస్త వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో మార్చి నెలలో హోలీ వేడుకలు జరుపుతున్న హందూ విద్యార్థులపై ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ దాడులు జరిపింది. ఇందులో 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు. Holi celebrations Quaid-i-Azam University Islamabad 🖤 🥀#QAU_ISLAMABAD #holi #holi2023 pic.twitter.com/CHVkY5NL1m — QAU News (@NewsQau) June 19, 2023 ఇదీ చదవండి: ముంబై దాడుల ప్రధాన సూత్రధారికి అండగా నిలిచిన చైనా -
హవ్వా! రోడ్డు మీద ఇదేం పని.. హద్దులు మీరిన ప్రేమ జంట
సమాజంలో నివసిస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ప్రజలు జీవితం సాగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇవేమి తమకు పట్టవంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నవ్వులు పాలవతుంటారు. తాజాగా ఓ ప్రేమికులు బైక్పై ప్రయాణిస్తూ రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించిన వింత ఘటన రాజస్థాన్లో జైపూర్లో చోటచేసుకుంది. ఆ వీడియోలో.. హోలీ జరుపుకున్న అనంతరం ఓ జంట బైక్పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్పై కూర్చొన్న లవర్.. ప్రేమికుడిని హగ్ చేసుకోని కూర్చుని రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. దీనంతటిని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఇదంతా తెలిసినా ఆ జంట ఏ మాత్రం భయపడకుండా వారి పనిలో వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారుడి నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు మార్చి 7న మోటారు వాహనాల చట్టం 1988, రాజస్థాన్ మోటారు వాహనాల చట్టం 1990 ప్రకారం మోటారుబైక్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటకు రూ. 5,000 జరిమానా కూడా విధించారు పోలీసులు. -
హోలీ వేడుకల్లో సందడి చేసిన యూఎస్ అత్యున్నత అధికారి
ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారిక నివాసంలో బుధవారం హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు జైశంకర్, కిరణ్ జిజు తోపాటు యూఎస్ అత్యున్నత అధికారి గినా రైమోండో పాల్గొన్నారు. ఆమె ముఖానికి రంగులు పులుముకుని, ఓ దండ ధరించి డ్రమ్ బీట్లకు లయబద్ధంగా స్టెప్లు వేసి సందడి చేశారు. ఆ వేడుకలో కృష్ణుడి వేషధారణలో ఒక కళాకారుడు అక్కడున్న ప్రేక్షకులను బాగా అలరించాడు. కాగా, ఇండో యూఎస్ సీఈవో ఫోరమ్లో పాల్గొనేందుకు యూఎస్ వాణిజ్య కార్యదర్శి రైమోండో న్యూఢిల్లీ వచ్చారు. ఆమె మార్చి 7 నుంచి 10 వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె భారత్ యూఎస్ల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేసేలా వివిధ రంగాల సహకారంపై చర్చిస్తారు. గతేడాది యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఎంఎస్ రైమోండో గత నవంబర్లోనే ప్రారంభించారని యూఎస్ వాణిజ్య విభాగం పేర్కొంది. (చదవండి: నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్) -
గోగుపూల హోలీ.. ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే. కాలక్రమేణా ప్రకృతిని వీడి ఆధునికత వైపు పరుగులు తీస్తూ.. పండుగల్లోని సహజ వేడుకలకు కృత్రిమ రంగులను అద్దుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ కొన్ని సంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు కొంతమంది నేటికీ రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ఈ పూలు హోలీ పండుగకు ముందే అడవుల్లో చెట్ల నిండా పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పూలు తెచ్చుకునే రంగులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోగుపూల రంగులు ఎక్కువమందికి చేరేలా నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఓ యత్నం చేశారు. మోదుగు పూలను సేకరించి.. పదిహేను రోజుల క్రితం ఉపాధి కూలీలతో స్థానిక అడవిలో మోదుగు పూలను సేకరించారు. వాటి పూల కాడలను తీసి శుభ్రపరిచారు. తేమ పోయేలా ఎండలో ఆరబెట్టారు. ఆ తర్వాత గిర్నీలో మర పట్టించి, పొడిలా మార్చారు. ఆ పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి, ప్యాకెట్లలో నింపారు. ఇప్పటికి పదిహేను కిలోల మోతాదులో సేకరించారు. ఆ పొడిని కొద్దిగా నీటిలో వేసుకుని మరిగిస్తే ఆరెంజ్ కలర్ రంగు వస్తుంది. ఈ రంగును నీటిలో కావాల్సినంత మేర కలుపుకొని హోలీ వేడుకల్లో చల్లుకునేందుకు వాడుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వశాఖల అధికారులకు ఉచితంగా అందజేశారు. రసాయనాలు లేని ఈ సహజ రంగులతో ఎలాంటి చర్మ, అనారోగ్య సమస్యలు తలెత్తవు. చిన్నా, పెద్దా అందరూ ఈ సహజ రంగులను వాడుకోవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి.. గతంలో చాలామంది ఈ మోదుగు పూలను హోలీ రంగుల్లో వాడేవారు. ప్రస్తుతం తగ్గిపోయింది. మళ్లీ అందరికీ సహజ సిద్ధ రంగును వాడేలా చేసేందుకు ఈ పొడిని తయారు చేశాం. వచ్చే ఏడాదికి మార్కెట్లో అందుబాటులో ఉండేలా చేస్తాం. దీని ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం కల్పించవచ్చు. – విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి. -
Hyderabad: తాగునీటి సరఫరా నిలిపివేతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద చేపట్టాల్సిన గోదావరి మెయిన్ 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్ బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడించారు. హోలీ పండగ నేపథ్యంలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నెల 8వ తేదీకి బదులు 9వ తేదీ గురువారం ఉదయం 6 నుంచి 11వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సరఫరా అంతరాయానికి సంబంధించి జీఎంలు తమ పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా 24 గంటలు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. చదవండి: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే..? -
‘ నా భార్య అలిగింది, సెలవులు కావాలి సార్’.. ఎస్పీకి మొరపెట్టుకున్న ఇన్స్పెక్టర్
లక్నో: హోలీ సందర్భంగా ఫరూఖాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా, చాలా మంది పోలీసు సిబ్బంది సెలవులు రద్దయ్యాయి. అయితే, పోలీసు శాఖకు చెందిన ఓ ఇన్స్పెక్టర్ తన సమస్య విన్నవిస్తూ హోలీ సందర్భంగా 10 రోజుల సెలవు కోరారు. అయితే అతని సమస్య విని అధికారులు, పోలీసులు నవ్వుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా భార్య అలిగింది సార్.. వివరాల్లోకి వెళితే.. ఫరూఖాబాద్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ హోలీ పండుగ నేపథ్యంలో సెలవు కోరుతూ జిల్లా ఎస్పీకు లేఖ రాశారు. అందులో..”హోలీ రోజున నా భార్య తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. గత 22 ఏళ్ల నుంచి హోలీ రోజున తన పుట్టింటికి తీసుకెళ్లమని నన్ను అడుగుతోంది. కానీ ప్రతి హోలీ పండుగకు డ్యూటీ కారణంగా తనని తీసుకెళ్లడం కుదరలేదు. ఈ సారి మాత్రం పండగకి తన ఇంటికి తీసుకువెళ్లాలంటూ పట్టుబట్టింది. దీంతో ఆమె నాపై అలిగింది.. కోపంతో రగిలిపోతుంది. ఈ కారణంగా.. నాకు సెలవులు అవసరం. సర్, నా సమస్యను అర్థం చేసుకుని పది రోజలు సెలవు ఇవ్వాలని ” రాసుంది. ఈ లేఖ పోలీసు సూపరింటెండెంట్ చేరడంతో, అతను లేఖను చదివి నవ్వాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అభ్యర్థనను పరిశీలించి ఐదు రోజుల సెలవును ఆమోదించారు. ఆ తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: వీడియో: పరీక్షలో చిట్టీలు అందించేందుకు వెళ్లాడు, చివరికి పోలీసులకు చిక్కి.. -
ఇది కదా ఆఫర్లు .. ఫ్లిప్కార్ట్ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా బిగ్ బచత్ ధమాల్ సేల్తో ముందుకు వచ్చింది. మార్చి 3 నుంచి మార్చి 5 వరకు జరిగే ఈ ప్రత్యేక సేల్లో 1000 కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్లపై 80 శాతం డిస్కౌంట్కే అందిస్తున్నట్లు తెలిపింది. మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్స్, దుస్తులు, టీవీలుపై ఆకర్షణీమైన తగ్గింపుతో వినియోగదారులకు స్పెషల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ను పరిచయం చేస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇక పలు రిపోర్ట్ల ప్రకారం.. ఫ్లిప్కార్ట్ ఫర్నీచర్,మ్యాట్రెసెస్, షూర్యాక్స్,వార్డ్రోబ్, పోర్టబుల్ ల్యాప్ట్యాప్ స్టాండ్స్పై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇక కస్టమర్లు బెడ్రూమ్, లివింగ్ రూమ్ పర్నిచర్పై 70 శాతం డిస్కౌంట్, ప్రీమియం ప్రొడక్ట్లపై 60 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. హోమ్ అప్లయెన్సెస్పై 75 శాతం, టీవీలపై 60 శాతం, సమ్మర్ సీజన్ సందర్భంగా ఎయిర్ కండీషనర్లపై 55 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్లిప్కార్ట్ బిగ్ బచత్ సేల్లో ల్యాప్ట్యాప్స్పై 45 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా..యాపిల్, శాంసంగ్, పోకో, రియల్ మీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. వీటితో పాటు ఫుడ్, టాయిస్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, హోమ్ డెకోర్, ఫర్నీషింగ్, కిచెన్ టూల్స్తో పాటు ఇతర హోం ప్రొడక్ట్స్పై ప్రమోషనల్ ఆఫర్స్, బ్యాంక్స్, ఫిన్ టెక్ కంపెనీలు ఇచ్చే ఆఫర్స్ అందుబాటులోకి ఉన్నాయి. -
వసంతాలు విరిసేవేళ
వసంతం విచ్చేసిందని ప్రకృతి మనకు పంపించే తొలి కబురు రంగుల వేడుకైన హోలి. రాబోయే వేసవిని తట్టుకోవడానికి మన మేనిని హాయిగొలిపేలాఉంచడానికి స్వచ్ఛమైన తెలుపును పరిచయం చేసేది హోలి.ఎందుకంటే రంగుల హంగులను అందంగా ఇముడ్చుకునేది తెలుపే!ఇంద్రధనుస్సు ఎలాగూవేసుకున్న దుస్తులను అందంగా పలకరిస్తుందిపువ్వుల నవ్వుల్ని, పచ్చదనాన్నీ అద్దుతుంది. ఆ హంగులను అద్దుకున్న తెలుపు మన జీవితాలను ఆనందమయం చేస్తుంది. అందుకే, వసంతాలు విరిసేవేళా నిన్ను నేను చూశాను...అంటూతెలుపు రంగు డ్రెస్ల ఎంపికకు మొదటి ఓటు వేయవచ్చు. తెలుపుతోపాటు క్రీమ్ కలర్ థీమ్ ఉన్న డ్రెస్సులు ఎంతో అందాన్నీ, హాయినీ ఇస్తాయి. వీటిలో కాటన్, లినెన్, చికన్ కారీ వర్క్, ఇతర ఎంబ్రాయిడరీ లేదా చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్న డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. పూర్తి వైట్ ఇష్టపడని వారు క్రీమ్ కలర్, ఇతర కాంబినేషన్ కలర్స్తో ఉన్న డ్రెస్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులు అన్ని పార్టీలలోనూ ప్రత్యేకంగా ఉంటాయి. -
హోలీ వేడుకలు.. ఫ్రెండ్ భార్యపై రంగు చల్లిన దోస్త్.. ఇంతలో భర్త వచ్చి..
కోల్కత్తా: రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా రంగులు చల్లుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కొన్ని చోట్ల ఘర్షణలు, అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వేడుకల్లో కత్తితో పొడుచుకొని ఓ వ్యక్తి మరణించగా పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోల్కత్తాలో సుజిత్ మల్లిక్, దిలీప్ అనే వ్యక్తులు మంచి స్నేహితులు. ఉత్తరప్రదేశ్కు చెందిన దిలీప్ చౌహాన్ (45) కొన్ని సంవత్సరాల క్రితం కోల్కత్తా చేరుకుని నాటూన్పల్లిలోని తన బంధువులు నివాసం ఉంటున్న ఏరియాలోనే అద్దె ఇల్లు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. సుజిత్ మల్లిక్ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా, హోలీ రోజున వీధిలో వీరంతా కలిసి సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో దిలీప్ అతని స్నేహితుడు సుజిత్ మల్లిక్ భార్యపై రంగులు చల్లాడు. అది గమనించిన సుజిత్.. తన భార్యపై బలవంతంగా ఎందుకు రంగులు చల్లావని దిలీప్ను అడిగాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తీవ్ర ఆవేశంతో సుజిత్ మల్లిక్.. దిలీప్ను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం నిందితుడు పారిపోయి డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉన్నడాని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మాలిక్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. -
దేశంలో దుమ్మురేపిన హోలీ అమ్మకాలు, చైనాకు రూ.10వేల కోట్ల నష్టం!
దేశంలో హోలీ అమ్మకాలు సరికొత్త రికార్డుల నమోదు చేశాయి. కరోనా భయం తొలగి, ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారని..తద్వారా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో హోలీ అమ్మకాలు 30శాతం పెరిగాయని ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. అదే సమయంలో చైనాకు రూ.10వేలకోట్ల నష్టం వాటిల్లినిట్లు సీఏఐటీ తెలిపింది. మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారతదేశ రిటైల్ రంగానికి ఈ ఏడాది హోలీ అమ్మకాలు ఒక వరంలా మారాయని సీఏఐటీ తెలిపింది."హోలీ పండుగ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే వ్యాపారంలో దాదాపు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి.అంచనా ప్రకారం..హోలీ సందర్భంగా దేశంలో సుమారు రూ.20వేల కోట్ల వ్యాపారం జరిగిందని" ట్రేడ్ బాడీ తెలిపింది. అంతేకాకుండా, ఏడాది దేశీయ మార్కెట్లో చైనా వస్తువుల అమ్మకాలు జరగలేదని స్పష్టం చేసింది. గతంలో దేశీయ మార్కెట్లో చైనా ఉత్పుత్తుల హవా ఉండేది.హోలీ వేడుకల సందర్భంగా రూ.10వేల కోట్లు జరిగేవి. కానీ ఈ ఏడాది భారత్ మార్కెట్లో చైనా ఉత్పుత్తులు అమ్మకాలు జరగలేదని సీఏఐటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక హోలీకి ప్రధానంగా రంగులు, బొమ్మలు, బెలూన్లు, హెర్బల్ కలర్స్,గులాల్, వాటర్ గన్, బెలూన్లు, చందన్, డ్రెస్ మెటీరియల్ వంటి దేశీయ వస్తువులు భారీ అమ్మకాలను నమోదు చేసుకున్నాయని చెప్పారు. మరోవైపు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ఐటమ్స్, టెక్స్టైల్స్, పువ్వులు, పండ్లు, బొమ్మలు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, కిరాణా, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పూజా సామాగ్రి మొదలైనవి కూడా విపరీతమైన అమ్మకాలు జరిపి భవిష్యత్తులో దేశీయ మార్కెట్కి మంచి రోజులొచ్చాయనే సంకేతాలిచ్చినట్లైందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. హోలీ రోజున మంచి అమ్మకాలను చూసిన తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారులు ఏప్రిల్-మేలో రాబోయే వివాహ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది భవిష్యత్ రోజుల్లో జరిగే వ్యాపారాలకు మరింత సహాయపడుతుందని ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా 40వేల వాణిజ్య సంఘాలు,8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సీఏఐటీ పేర్కొంది. కరోనా నుంచి దేశం సురక్షితంగా ఉన్నందునే హోలీ వేడుకలు ఘనంగా జరిగాయని ఖండేల్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్పై ఆగ్రహం..! -
హోలీ వేడుకల్లో అపశృతి.. ఆడుకుందామని బయటికి పిలిచి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): హోలీ ఆడుకుందామని స్నేహితుడిని బయటికి పిలిచిన ముగ్గురు బాలురు తమతో పాటు తెచ్చుకున్న బ్లేడ్తో వీపుపైన, తొడలపైన గాయపరిచి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక ఉండే ఇందిరానగర్లో నివసించే శ్రీహరి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. (చదవండి: సంతానం కలగలేదు.. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని.. ) శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీహరి తన ఇంటి ముందు హోలీ ఆడుకుంటుండగా సమీపంలో నివసించే ముగ్గురు స్నేహితులు అభి, నాని, బబ్లూ ముగ్గురూ అక్కడికొచ్చి శ్రీహరికి రంగులు పూశారు. బలవంతంగా నెత్తి మీద కోడిగుడ్లు కొట్టారు. వారి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురూ కలిసి తమతోపాటు తెచ్చుకున్న బ్లేడ్తో శ్రీహరి వీపు మీద గాట్లు పెట్టారు. తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండగా శ్రీహరి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా తొడలపై గాట్లు పెట్టారు. అదే సమయంలో బాధితుడి తల్లి లక్ష్మి అక్కడికొచ్చి తీవ్రంగా గాయపడిన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాడికి పాల్పడ్డ ముగ్గురు బాలలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అభి, నాని, బబ్లూలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)
-
Hanami In Japan: లీ హోలీ.. జపాన్లో హనామి, థాయ్లాండ్లో సోంక్రాన్, ఇంకా...
మనదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్లలోను, భారతీయ సంతతివారు ఎక్కువగా నివసించే ఆఫ్రికా, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. హోలీ మాదిరిగానే వసంతానికి స్వాగతం పలుకుతూ వివిధ దేశాల్లో జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం. హనామి జపాన్ జపాన్లో జరుపుకొనే వసంతోత్సవాన్ని ‘హనామి’ అంటారు. ‘హనామి’ అంటే పుష్పసందర్శనం. ఈ కాలంలోనే జపాన్లో చెర్రీ చెట్లు నిండా పూలతో విరగబూసి కనువిందు చేస్తాయి. ప్లమ్ వృక్షాలు కూడా ఇలాగే విరగబూస్తాయి గాని, జపాన్లో చెర్రీ వృక్షాలే విరివిగా కనిపిస్తాయి. చెర్రీ పూలను జపానీస్ భాషలో ‘సకురా’ అంటారు. హనామి వేడుకలు ఏటా మార్చి నెలలో ఆఖరి వారం నుంచి మే తొలివారం వరకు జరుగుతాయి. ఏటా ఫిబ్రవరిలో జపాన్ వాతావరణ శాఖ ఆ ఏడాది చెర్రీవృక్షాలు ఏ సమయంలో పుష్పించడం ప్రారంభిస్తాయో అంచనా వేసి, తేదీని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వేడుకలు మొదలవుతాయి. తొలుతగా ఒకినావా దీవి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. మన కార్తీక వనభోజనాలను ఉసిరిచెట్ల కింద చేసుకునే పద్ధతిలోనే జపాన్ ప్రజలు వసంతకాలంలో ఆరుబయట విరగబూసిన చెర్రీచెట్ల కింద, ప్లమ్ చెట్ల కింద ఉల్లాసంగా ఉత్సాహంగా విందు వినోదాలు చేసుకుంటారు. చాలాచోట్ల రాత్రివేళ కూడా చెట్లకు పేపర్లాంతర్లు వేలాడదీసి, ఆరుబయటే ఆటపాటలతో విందు వినోదాలతో గడుపుతారు. టోక్యోలోని ఉయెనో పార్కులో ‘హనామి’ వేడుకలు చాలా సందడిగా జరుగుతాయి. ‘హనామి’ వేడుకల సంప్రదాయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలో గెన్మెయి మహారాణి కాలం నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. జపాన్లో మృతుల కళేబరాలను చెర్రీ చెట్ల కింద సమాధి చేసే ఆచారం కూడా ఉంది. ‘హనామి’ వేడుకల్లో పెద్దలను స్మరించుకుంటూ ప్రార్థనలు జరుపుతారు. వసంతానికి స్వాగతం పలుకుతూ ఆరుబయట ప్రకృతి ఒడిలో గడుపుతారు. హనామి తరహా వేడుకలు తైవాన్, కొరియా, ఫిలిప్పీన్స్, చైనాలలోనూ జరుగుతాయి. జపాన్ 1912లో అమెరికాకు మైత్రీచిహ్నంగా మూడువేల చెర్రీ మొక్కలను కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి అమెరికాలోనూ పలుచోట్ల ఈ వేడుకను ‘చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సోంక్రాన్– థాయ్లాండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడంతోనే థాయ్లాండ్లో వసంతోత్సవాలు మొదలవుతాయి. థాయ్లాండ్ వాసులు ఏటా ఏప్రిల్ 13న నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ రోజు నుంచి మొదలయ్యే వసంత స్వాగతోత్సవాలు మాత్రం మూడు రోజుల పాటు– ఏప్రిల్ 15 వరకు చాలా సందడిగా కొనసాగుతాయి. ఈ వేడుకల కోసం అక్కడి ప్రభుత్వం ఏప్రిల్ 12 నుంచి 16 వరకు సెలవు దినాలను ప్రకటిస్తుంది. బంధుమిత్రులతో ఈ వేడుకలు జరుపుకోవడానికి ఉపాధి కోసం నగరాల్లో పనిచేసుకునే వారంతా స్వస్థలాలకు పయనమవుతారు. థాయ్లాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ‘సోంక్రాన్’ అంటారు. ‘సోంక్రాన్’కు మూలం సంస్కృతంలోని ‘సంక్రాంతి’ పదమే. సౌరమానం ప్రకారం తొలి సంక్రాంతి అయిన మేష సంక్రాంతినే థాయ్లాండ్ వాసులు నూతన సంవత్సరంగా పాటిస్తారు. భారత్లో కూడా సౌరమానం పాటించేవారు మేష సంక్రాంతినే నూతన సంవత్సరంగా పాటిస్తారు. థాయ్లాండ్ వాసులు మిగిలిన వారికి భిన్నంగా వరుసగా మూడురోజుల పాటు వసంతోత్సవాలను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా థాయ్ ప్రజలు బౌద్ధారామాలను దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు. నగరాలు, పట్టణాల్లోని కూడళ్లలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేసి, జనాలంతా కూడళ్లలోకి చేరుకుని ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ సందడి చేస్తారు. నీళ్లు చిమ్ముకునే ఆచారం వల్ల ఈ వేడుకలను ‘వాటర్ ఫెస్టివల్’ అని కూడా అంటారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికల వరకు సంప్రదాయ దుస్తులు ధరించి, చక్కగా అలంకరించుకున్న మహిళలు, యువతులు సంగీతవాద్యాలతో పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళతారు. కొన్నిచోట్ల అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఊరేగింపులో పాల్గొన్న అందమైన మహిళలను, యువతులను ‘లేడీ సోంక్రాన్’, ‘మిస్ సోంక్రాన్’ బిరుదులిచ్చి, కిరీటాలతో వారిని ఘనంగా సత్కరిస్తారు. ఈ సందర్భంగా కొందరు ఆలయాల పునరుద్ధరణ కోసం ఇసుకను దానం చేస్తారు. పెద్దలను స్మరించుకుంటూ, బౌద్ధ భిక్షువులకు అన్నసంతర్పణలు చేస్తారు. మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ వసంతకాలం అడుగుపెట్టే తొలిరోజు మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తారు. మెక్సికోలోని తీరప్రాంత పట్టణాల్లో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఏటా మార్చి నెలలో వసంతారంభంగా వాతావరణ నిపుణులు ప్రకటించిన రోజున ఈ సంబరాలను జరుపుకొంటారు. సాధారణంగా మార్చి 19–22 తేదీల మధ్య వసంత రుతువు మొదలవుతుంది. సంగీత వాద్యాలతో దారిపొడవునా పాటలు పాడుతూ, నవ్వుతూ తుళ్లుతూ, కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ విచిత్ర వేషధారణలతో ఉత్సాహంగా ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపులో తినుబండారాలు, పానీయాలు విరివిగా దొరుకుతాయి. ఈ వేడుకలు కొన్నిచోట్ల వారంరోజుల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు రెండు వారాల వరకు కూడా కొనసాగుతాయి. కార్నివాల్ వేడుకలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో మెక్సికోకు వస్తుంటారు. శాషిల్యూటెన్– స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో వసంతోత్సవాన్ని ఏప్రిల్లో జరుపుకుంటారు. చలిదేశం కావడం వల్ల అక్కడ వసంతకాలం కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మధ్యయుగాల నుంచే స్విట్జర్లాండ్లో ఈ వేడుకలు జరుపుకొనే ఆచారం ఉంది. అప్పట్లో వేసవిలోని మొదటి పనిదినాన ఈ వేడుకలను జరుపుకొనేవారు. గత శతాబ్దం నుంచి ఈ వేడుకలను ఏప్రిల్ మూడో సోమవారం రోజున జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. విద్యుత్తు లేని మధ్యయుగాల కాలంలో శీతాకాలంలో పగటి వెలుతురు ఉన్నంత సేపే పనిగంటలు నడిచేవి. వేసవిలోని తొలి పనిదినాన కాలానికి తగినట్లు పనివేళలను నిర్ణయించుకునే వారు. సాయంత్రం ఆరుగంటలకు చర్చిగంటలు మోగగానే పనివేళలను ముగించుకోవాలని అప్పట్లో శాసనం కూడా తెచ్చారు. శీతాకాలం వెళ్లిపోతూ వసంతం ప్రారంభమైదనడానికి సూచనగా స్విస్ ప్రజలు నగరాలు, పట్టణాల కూడళ్లలో పెద్దసంఖ్యలో గుమిగూడి, గోనెపట్టాలు, ఇతర వ్యర్థాలతో తయారుచేసే శీతాకాలం దిష్టిబొమ్మను తగులబెడతారు. దీని తలభాగంలో మందుగుండు కూడా దట్టిస్తారు. బొమ్మ కొంత కాలిన తర్వాత మంటలు తలవరకు వ్యాపించి, మందుగుండుకు నిప్పు తాకగానే పేలుడు సంభవిస్తుంది. ఈ ఆచారం మనదేశంలో జరిగే హోలికాదహనం, కామదహనం మాదిరిగానే కనిపిస్తుంది. శీతాకాలం దిష్టిబొమ్మను ‘బోగీ’ అంటారు. మనం భోగిమంటలు వేసుకుంటాం, వాళ్లు ‘బోగీ’కి మంట పెడతారు. గమ్మత్తుగా లేదూ! సెమానా శాంటా– గ్వాటెమాలా గ్వాటెమాలాలో ‘సెమానా శాంటా’ పేరిట వసంతోత్సవాలను జరుపుకొంటారు. ‘సెమానా శాంటా’ అంటే పవిత్ర వారం అని అర్థం. ఈ వారాన్ని ‘సెమానా మేయర్’ (ప్రధానవారం) అని కూడా అంటారు. ఈ వారం రోజులూ గ్వాటెమాలా నలుమూలలా చర్చ్లలో ప్రార్థనలు, వీథివీథినా ఊరేగింపులు జరుగుతాయి. ‘శాంటా హెర్మన్డాడ్’ అనే శాంతిపరిరక్షక దళాల నాయకత్వంలో పిల్లా పెద్దా అందరూ క్రీస్తు, మేరీమాతల చిత్రపటాలు ధరించి, పాటలు పాడుతూ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈస్టర్ ఆదివారంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ పవిత్రవారానికి సన్నాహాలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే లా క్యుయారెస్మా (లెంట్)తో ప్రారంభమవుతాయి. ‘లెంట్’ రోజుల్లో క్యాథలిక్లు ఉపవాసాలు, ప్రార్థనలతో కాలం గడుపుతారు. ప్రపంచవ్యాప్తంగా కేథలిక్లు ఈ ఆచారాలను పాటించినా, గ్వాటెమాలాలో మాత్రం మరింత విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. పవిత్రవారంలో ఊరేగింపు జరిపే దారుల్లో ‘లాస్ ఆంఫ్రోబాస్’ అనే రంగురంగుల తివాచీలను పరుస్తారు. ఈ తివాచీల హస్తకళా నైపుణ్యం చూసి తీరాల్సిందే! గ్వాటెమాలా ప్రజలు ఈ వేడుకల కోసం స్వయంగా ఈ తివాచీలను తయారు చేస్తారు. వీటి తయారీలో సహజసిద్ధమైన రంగులనే వాడతారు. రంపపుపొట్టు, ఎండిపోయిన పూలు, ఆకులు, పండ్లు, చెట్ల బెరళ్ల నుంచి అత్యంత ఆకర్షణీయమైన రంగులను తయారు చేయడం ఇక్కడి విశేషం. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్: హాలండ్, మిషిగాన్ అమెరికాలో మిషిగాన్ రాష్ట్రంలోని హాలండ్ నగరంలో ఏటా ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ పేరిట వసంతోత్సవ సంబరాలు జరుగుతాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే డచ్ ప్రజలు ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ ఏటా మే నెల రెండోవారంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ రుతువులో ట్యూలిప్ మొక్కలు విరగబూస్తాయి. గత శతాబ్దకాలంగా మిషిగాన్లోని హాలండ్ నగరంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థిరపడ్డ డచ్ ప్రజల కోరిక మేరకు 1928లో హాలండ్ నగరపాలక సంస్థ నెదర్లాండ్స్ నుంచి లక్ష ట్యూలిప్ మొక్కల దిగుమతికి అనుమతించింది. వాటిని స్థానిక పార్కులకు పంపిణీ చేసింది. మరుసటి సంవత్సరం ఆ మొక్కలు విరగబూయడంతో చిన్నస్థాయిలో వేడుక జరుపుకొన్నారు. హాలండ్ నగర శతవార్షిక సంవత్సరమైన 1947 నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలను ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ వేడుకల సందర్భంగా ట్యూలిప్ పూలను ప్రదర్శిస్తూ ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మార్జానా– పోలండ్ పోలండ్లో వసంతోత్సవాలను ‘మార్జానా’ పేరిట జరుపుకొంటారు. ‘మార్జానా’ అనేది పురాతన స్లావిక్ మతానికి చెందిన శీతాకాల మృత్యుదేవత. చెక్, స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా దేశాలలో ఈ దేవతను ‘మోరానా’ అని, రష్యాలో ‘మారెనా’ అని, ఉక్రేనియాలో ‘మారా’ అని, బల్గేరియాలో ‘మొరా’ అని పిలుస్తారు. పునర్జన్మల విశ్వాసంతో ముడిపడి ఉన్న వేడుక ఇది. శీతకాలం ముగిసే సమయంలో జనాలు పాటలు పాడుకుంటూ, వాయిద్యాలను మోగిస్తూ భారీ ఊరేగింపు జరిపి, ‘మార్జానా’ దేవత దిష్టిబొమ్మను దగ్గర్లోని నదుల్లోను, జలాశయాల్లోను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనంతో మరణించిన ‘మార్జానా’ తిరిగి ‘కోస్త్రోమా’– అంటే వసంత దేవతగా జన్మిస్తుందని విశ్వసిస్తారు. నిమజ్జనానికి ముందు కొన్నిచోట్ల మార్జానా దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టడం లేదా, దిష్టిబొమ్మకు చుట్టిన దుస్తులను చించేయడం వంటి పనులు చేస్తారు. ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకల్లో ఎక్కువగా పిల్లలు, యువతీ యువకులు పాల్గొంటారు. ‘మార్జానా’ను నిమజ్జనం చేసి, విందు వినోదాలతో వేడుకలు జరుపుకొంటే పంటలు బాగా పండుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. సింబురిజాదా – బోస్నియా బోస్నియాలో వసంతోత్సవమంటే ఆహారోత్సవమే! ‘సింబురిజాదా’ పేరిట ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకలు విలక్షణంగా ఉంటాయి. ఈ వేడుకలను జనాలు ఆరుబయట జరుపుకొంటారు. నదులు, తటాకాల ఒడ్డున, ఉద్యానవనాల్లోను గుంపులు గుంపులుగా చేరి, ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు. ఆరుబయట పొయ్యిలు ఏర్పాటు చేసుకుని, భారీస్థాయిలో గుడ్లను గిలకొట్టి వాటితో సామూహికంగా తయారుచేసే వంటకాలను అందరూ ఆరగిస్తారు. వేడుకలను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు ఉచితంగా ఈ గుడ్ల వంటకాలను వడ్డిస్తారు. వసంత స్వాగతోత్సవ వేడుకల్లో గుడ్లు మాత్రమే ఎందుకు? వేరేవి ఏవైనా వండుకుంటే కుదరదా? అంటే, కుదరనే కుదరంటారు బోస్నియా వాసులు. జీవావిర్భవానికి మూలం గుడ్డు. ఎక్కడైనా గుడ్డు నుంచే పిల్ల పుడుతుంది. వసంతంతోనే కొత్త రుతువు మొదలవుతుంది. అందువల్ల కొత్త జీవానికి సంకేతంగా గుడ్లతోనే సంప్రదాయ వంటకాలు చేసుకుంటామని చెబుతారు. ఫాలెస్– స్పెయిన్ స్పెయిన్లో ‘ఫాలెస్’ పేరిట వసంతారంభంలో వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలను సెయింట్ జోసెఫ్ సంస్మరణార్థం ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు భారీ ఎత్తున జరుపుకొనే సంబరాల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ‘ఫాలెస్’ అంటే కాగడా అని, నిప్పుపెట్టడం అని అర్థాలు ఉన్నాయి. ‘ఫాలెస్’ వేడుకల్లో ఊరేగింపులు, విందు వినోదాలు, గానాభజానాలు అట్టహాసంగా జరుగుతాయి. విందుల్లో గుమ్మడికాయ, చాక్లెట్తో తయారుచేసే ప్రత్యేక సాంప్రదాయక వంటకాలను వడ్డిస్తారు. ఈ వేడుకల్లో ప్రజలు కొత్తదనానికి స్వాగతం పలికే క్రమంలో పాతవాటన్నింటినీ వదులుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే పాత వస్తువులన్నిటినీ కూడళ్లలో గుట్టలుగా పోసి, వాటికి నిప్పంటిస్తారు. ఈ తతంగం మన భోగిమంటల మాదిరిగా ఉంటుంది. పెద్దసైజులో తయారు చేసే దిష్టిబొమ్మలను కూడా ఈ మంటల్లో వేసి తగులబెడతారు. స్పెయిన్లోని వాలెన్షియా నగరంలో ఈ వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయి. చదవండి: Cricketers Holy Celebrations: రోహిత్ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో -
Holi 2022: కామదహనం కథ తెలుసా?
ఆమని అంటే ఆహ్లాదానికి మారుపేరు. శిశిరంలో ఆకులురాలి మోడువారిన కొమ్మలకు మారాకులు వేసే రుతువు వసంతం. వణికించే చలి తీవ్రత ఉండదు, ఉడుకెత్తించే ఎండల ధాటి ఉండదు, కుండపోత వర్షాల చిత్తడి చిరాకు ఉండదు. అత్యంత ఆహ్లాదభరితమైన రుతువు కాబట్టే వసంతానికి రుతురాజుగా గుర్తింపు వచ్చింది. అంతెందుకు, భగవద్గీతలోని విభూతియోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ‘రుతూనాం కుసుమాకరః’– అంటే ‘రుతువుల్లో వసంతాన్ని నేనే’ అని స్వయంగా చెప్పుకున్నాడు. వసంతాగమనంతోనే ప్రకృతి రాగరంజితమవుతుంది. వసంతానికి స్వాగతం పలుకుతూ దేశమంతటా.. డోలాపూర్ణిమ, హోలీ వేడుకలు జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా చాలా వరకు ప్రాక్ పాశ్చాత్య దేశాలలో వసంతానికి స్వాగతం పలికే సంప్రదాయ వేడుకలు ఉన్నాయి. ఫాల్గుణ పూర్ణిమ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే హోలీ పండుగ పురాతనకాలం నుంచే ఉంది. ఈ పండుగ వసంత పౌర్ణమిగా, డోలా పూర్ణిమగా, డోలాయాత్రగా, కాముని పున్నమిగా, వసంతోత్సవంగా, రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది. ఫాల్గుణ పౌర్ణమికి సంబంధించి పలు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రాధాకృష్ణుల అజరామర ప్రణయానికి నీరాజనాలు పడుతూ పలుచోట్ల వైష్ణవాలయాల్లో డోలా పూర్ణిమ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. హోలీ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో హోలికా దహనం, ఇంకొన్ని చోట్ల కామదహనం తతంగాలను కూడా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు పెరిగిన మథుర, బృందావనం ప్రాంతాల్లో పదహారు రోజులపాటు వసంతోత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. హోలీ వెనుకనున్న పురాణగాథలు కొన్ని చెప్పుకుందాం. హిరణ్యకశిపుడు ఘోరతపస్సు చేసి రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఘోరతపస్సు చేసి, తనను చంపడం దాదాపు అసాధ్యమనే రీతిలో బ్రహ్మ నుంచి వరాలు పొందాడు. విష్ణుద్వేషి అయిన అతడు.. వరగర్వంతో దేవతలను ముప్పుతిప్పలు పెట్టేవాడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిశిక్షలు విధించినా ప్రహ్లాదుడు తన విష్ణుభక్తిని మానుకోలేదు. తండ్రి విధించిన శిక్షల నుంచి విష్ణునామ జపంతోనే అతడు సురక్షితంగా బయటపడ్డాడు. హిరణ్యకశిపుడు ఒకసారి చితినిపేర్చి, తన సోదరి హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి నిప్పంటించాడు. హోలిక కప్పుకున్న శాలువను అగ్ని కాల్చలేదు. అందువల్ల ఆమె సురక్షితంగా ఉంటుందని తలచాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించడంతో హోలిక శాలువ ఎగిరిపోయి, ప్రహ్లాదుడిని చుట్టుకుంది. చితిమంటల్లో హోలిక హాహాకారాలు చేస్తూ దహనమైపోయింది. అదేరోజు అసుర సంధ్యవేళ శ్రీమహా విష్ణువు నరసింహావతారంలో స్తంభాన్ని చీల్చుకుని వచ్చి, ఆరుబయట హిరణ్యకశిపుడిని తన ఒడిలో పెట్టుకుని, గోళ్లతో అతడి గుండెచీల్చి సంహరించాడు. ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికా దహనం జరగడం వల్ల, కొన్నిప్రాంతాల్లో హోలీ ముందురోజు రాత్రి హోలిక దిష్టిబొమ్మలను దహించడం ఆనవాయతీగా వస్తోంది. కామదహనం కథ ఇదిలా ఉంటే, కామదహనం కథ సుప్రసిద్ధమైనదే. దేవతల కోరికపై మన్మథుడు శివుడికి తపోభంగం కలిగించాడు. కోపోద్రిక్తుడైన శివుడు మూడోకన్ను తెరవడంతో అతడు కాలి బూడిదయ్యాడు. మన్మథుడు దహనమైన రోజు గనుక ఫాల్గుణ పౌర్ణమినాడు కొన్నిచోట్ల దిష్టిబొమ్మలతో కామదహనం తతంగాన్ని నిర్వహిస్తారు. హోలీపండుగ రోజున రంగలు చల్లుకునే ఆచారం గురించి ఒక చిన్న గాథ ఉంది. రాధ తెల్లగా, తాను నల్లగా ఉండటంతో చిన్నారి కృష్ణుణ్ణి తోటి గోపబాలకులందరూ ఆటపట్టించేవారు. వారి వేళాకోళాలకు కృష్ణుడు చిన్నబోవడం చూసి, యశోదమ్మ రాధ మీద చల్లమని రంగు నీళ్లిచ్చింది. రాధ మీద రంగు చల్లి, కిలకిలా నవ్వాడు కృష్ణుడు. వెంటనే రాధ తాను కూడా చేతికందినంత రంగు తీసుకుని, కృష్ణుడి ముఖానికి రంగు పూసింది. వీరిద్దరినీ చూసి, రేపల్లె జనాలంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సందడి చేశారట. మనుషుల మధ్య రంగుల తేడాలను రూపుమాపడానికి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే ఆచారం ఏర్పడిందని చెబుతారు. హోలీ రోజున బంధుమిత్రులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని, రంగులు చల్లుకుంటూ వసంతాగమనాన్ని ఆస్వాదిస్తారు. చదవండి: World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు -
కరీంనగర్ జిల్లాలో అంబరాన్ని అంటిన సంబరాలు
-
బండిమెట్లో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి తలసాని
-
హోలీ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న యూత్
-
సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
-
ఇందిరా పార్క్లో హోలీ సంబరాలు
-
విశాఖ ఆర్కే బీచ్లో హోలీ సంబరాలు
-
Holi Festival 2022: హోళీ సప్తవర్ణశోభితం
-
Holy 2022: హోలీ మరకలు త్వరగా పోవాలంటే..
ఎంత జోష్గా హోలీ ఆడతామో.. శరీరానికి, దుస్తులకు అంటిన రంగుల్ని వదిలించుకునేందుకు అంతే తంటాలు పడుతుంటాం. ఆర్గానిక్, కెమికల్ రంగులతో పాటు గుడ్లు, బురద, ఆయిల్.. ఇలా హోలీకేళీకి ఏదీ అతీతం కాదు. త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి. హోలీ ఆడిన తర్వాత రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. ► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది. ► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు) ► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్కి బాదం నూనె కలిపి పేస్ట్లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. ► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి. ► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు. ► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ► ఒకవేళ హెయిర్ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్లా వేసుకుంటే మంచిది. మరకలు పొగొట్టుకోండిలా... హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు. ► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి. ► అరకప్పు వెనిగర్లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి. ► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి. ► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది. ► వెనిగర్లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఉపయోగించాలి. చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆడపిల్లల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. హోలీలో ఆర్గానిక్ రంగుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కెమికల్స్ ఉన్న రంగులు వాడతామో అప్పుడే ఈ ఇబ్బంది. కాబట్టి.. వీలైనంత వరకూ సహజసిద్ధమైన రంగులతో హోలీని సెలబ్రేట్ చేస్కోండి. హ్యాపీ హోలీ.. -
హైదరాబాద్: హోలీ రంగుల్లో ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు
-
హోళీ రంగోలీ! రంగు పడాల్సిందే! (ఫొటోలు)
-
హోలి: ఇక్కడ పురుషులకు నిషేధం!
రకరకాల రంగులను ఒకరి మీద ఒకరు చల్లుకునే హోలి పండుగను ఇష్టపడని వారంటూ ఉండరు. హోలి కోసం పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎదురు చూస్తుంటారు. ఎంతో సరదా గా చేసుకునే పండగని ఉత్తర ప్రదేశ్లోని ఓ గ్రామంలో మాత్రం మహిళలే చేసుకుంటారు. వీరి హోలి సంబరాల్లోకి పురుషులు ఎవరైనా పొరపాటున వచ్చారంటే తన్నులు తినాల్సిందే. నిబంధన అతిక్రమించిన పురుషులకు శిక్షగా లంగా, జాకెట్ను ధరింపచేసి హోలీ రంగులు చల్లుతారు. వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఇదే తంతు జరుగుతోంది. యూపీలోని హరీమ్పూర్ జిల్లాలో కుందౌరా అనే కుగ్రామం ఉంది. ఊరి జనాభా ఐదువేలు మాత్రమే. ఇక్కడ హోలీ పండుగను కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటారు. మూడురోజులపాటు హోలీ సంబరాలు జరుగుతాయి. హోలి మొదటి రోజు మాత్రం పురుషులు రంగులు చల్లుకుంటూ హోలి ఆడతారు. రెండో రోజు కన్నెపిల్లలు, మహిళలు మాత్రమే హోలి ఆడతారు. ఈరోజు మహిళలు, అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తుల్లో ఆరు బయట హోలి ఆడవచ్చు. ఈ సంబరాల్లోకి మగవాళ్లకు అస్సలు అనుమతి లేదు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అత్తాకోడళ్లు సైతం ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ నాట్యం చేస్తారు. సంప్రదాయం ప్రకారం మామగారి ముందు కోడళ్లు కొన్ని పద్ధతులు పాటించాలి. అందువల్ల పురుషులను ఈ పండక్కి బయటకు రానివ్వరు. పురుషులు ఇంటికే పరిమితమవ్వాలి లేదా ఊర్లో ఉండకూడదు. సూర్యాస్తమయం అయ్యాకే ఊర్లోకి రావాలి. హోలీ రెండోరోజు పురుషులు ఆరుబయట కనిపించడం నిషేధం కనుక ఎవరైనా వచ్చారంటే శిక్షను అనుభవించాలి. ఆరుబయట కనిపించిన పురుషులకు లెహంగా చోళీ ధరింపచేసి రంగులు చల్లుతారు. కొన్ని సందర్భాల్లో మహిళలు వారిని కొడుతుంటారు అర్ధరాత్రిదాకా... మూడో రోజు హోలి పండుగను రామ్ జానకి గుడి ఆవరణలో నిర్వహిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద మొత్తం దీనిలో పాల్గొంటారు. అర్ధరాత్రి వరకు జరిగే ఈ సంబరాల్లో మహిళలు డోలు, కంజిరాలు వాయిస్తూ నృత్యం చేస్తారు. కొంతమంది మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సాయంత్రం కాగానే ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసి ఇంట్లో పురుషులకు వడ్డిస్తారు. ఇక్కడ కూడా ఫోటోలు, వీడియోలు నిషేధం. -
అక్కడి అమ్మాయిని పెళ్లాడితే గాడిదమీద ఊరేగిస్తారు.. ఇదేం ఊరురా బాబోయ్!
ముంబై: భారతదేశంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలకు నిలవు. అందులో కొన్ని వింతగా కూడా ఉంటాయి. అయితే ఆచార వ్యావహారాలు ఎలా ఉన్నా పాటించడం మాత్రం పక్కాగా పాటిస్తుంటాం. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో హోలీ రోజున ఒక వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వినడానికే కాదు ఆచరించడానికి కూడా కొంచెం వింతగా ఉంటుంది, కానీ తప్పదు మరి. ఆ గ్రామంలో కొత్త అల్లుడిని హోలీ రోజు గాడిద ఎక్కించి ఊరేగిస్తారట ! ఇదేం ఆచారం రా బాబు అనుకుంటున్నారా. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లి చూద్దాం.. (చదవండి: వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది! ) బరాబర్ గాడిద ఎక్కాలి.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోగల విదా గ్రామంలో 90 ఏళ్ల క్రితం ఈ ఆచారం మొదలైంది. దీన్ని అదే గ్రామానికి చెందిన ఆనంద్రావు దేశ్ముఖ్ ప్రారంభించారు. అప్పట్లో ఆనంద్రావు తన అల్లుడిని గాడిద ఎక్కించి ఊరేగించి ఆపై చివర్లో కొత్తబట్టలు పెట్టారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ ఊరిలో హోలీ రోజు ఈ తంతు జరుగుతోంది. ముందుగా గ్రామంలో కొత్త అల్లుళ్లు ఎవరెన్నారో తెలుసుకుంటారు. ఆపై వారి ఈ ఆచారం నుంచి తప్పించుకోకుండా నిఘా కూడా పెడ్తారు. కొత్త అల్లుళ్ల సర్వేకి కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుందట. అందుకోసం ఆ గ్రామంలోని కొందరు ఏకంగా ఇంటింటా సర్వే కూడా చేస్తారు. ఆచారం ప్రకారం ఈ గాడిద సవారీ గ్రామం మధ్య నుంచి మొదలై 11 గంటలకు ఆ ఊరిలోని హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. ఊరేగింపు ముగింపులో అల్లుడికి నచ్చిన బట్టలు కూడా పెడతారు. -
అమెజాన్ బంపరాఫర్..! పలు ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు..!
హోలీ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త 'హోలీ షాపింగ్ స్టోర్' సేల్ను కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్లో భాగంగా కెమెరా, హెడ్ఫోన్స్, స్పీకర్స్, వెయిరబుల్స్, ఇంకా మరెన్నో వాటర్ఫ్రూఫ్ గాడ్జెట్స్పై కొనుగోలుదారులకు 60 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ కార్డులపై అతి తక్కువ ధరలకు ఈఎంఐ ఆప్షన్ను కూడా అందిస్తోంది అమెజాన్. ఈ ఆఫర్ కొన్ని రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. పలు ఉత్పత్తులపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ ఆఫర్స్..! హెడ్ఫోన్స్ నాయిస్ బడ్స్ వీఎస్103 ఇయర్ బడ్స్ను కేవలం రూ. 1,499కు పొందవచ్చును. బోట్ ఎయిర్డోప్స్ 441 టీడబ్ల్యూఎస్ను రూ. 1,999కు లభించనుంది. స్పీకర్లు జేబీఎల్ గో2 వైర్లేస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్ రూ. 2,184 ధరకు రానుంది. బోట్ స్టోన్ గ్రెనేడ్ స్పీకర్ రూ. 1,499కు లభించనుంది. బోట్ స్టోన్ మార్వెల్ ఎడిషన్ స్పీకర్ రూ. 1,299కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. స్మార్ట్వాచ్ boAt Xtend స్మార్ట్వాచ్ ఈ సేల్లో రూ. 2,999కు రానుంది. Noise ColorFit Pulse Grand స్మార్ట్వాచ్ రూ. 2,699కు లభించనుంది. కెమెరా GoPro HERO10 బ్లాక్ కెమెరా కొనుగోలుదారులకు రూ. 50 వేలకే లభించనుంది. Insta360 ONE R ట్విన్ ఎడిషన్ కెమెరా 5.7K రిజల్యూషన్తో వీడియోల, చిత్రాలను షూట్ చేస్తుంది. H.265 ఎన్కోడింగ్, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ , AI-ఆధారిత అల్గారిథమ్తో రానుంది. ఇది రూ. 40,499కు అందుబాటులో ఉండనుంది. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్లాక్! -
హోలీ కంటే ముందే యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం
-
సీఎం ట్వీట్పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’
ఇస్లామాబాద్: దీపావళి పండుగ నాడు.. హోలీ శుభాకాంక్షలు తెలిపి.. విమర్శల పాలవుతున్నారు పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి. ఆ వివరాలు.. నవంబర్ 4న ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు, రాజకీయవేత్తలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరందరి మధ్యలో పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి తెలిపిన శుభాకాంక్షలు నెటిజనుల దృష్టిని ఆకర్షించాయి. దీపావళి సందర్భంగా సింధ్ ప్రాంత సీఎం మురద్ అలీ షా ట్విటర్లో తన ఫోటోని షేర్ చేశారు. దీని మీద హోలీ శుభాకాంక్షలు అని ప్రింట్ చేయించాడు. ఇది చూసిన నెటిజనులు.. మీకు దీపావళి పండగకి, హోలీకి తేడా తెలియదా అంటూ విమర్శించడం ప్రారంభించారు. పొరపాటు గుర్తించి వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. కానీ నెటిజనులు అప్పటికే ఆ ట్వీట్ను స్క్రీన్షాట్ తీసి.. వైరల్ చేశారు. (చదవండి: Diwali 2021: ఈ మీమ్స్ చూస్తే.. నవ్వాపుకోలేరు!!) పాకిస్తాన్కు చెందిన జర్నలిస్ట్ ముర్తాజా సోలంగి సీఎం ట్వీట్ స్క్రీన్ షాట్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ‘‘సింధ్ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు. ఇక్కడ విషాదకర అంశం ఏంటంటే.. సింధ్ సీఎం ఆఫీస్లో పని చేసే సిబ్బందికి దీపావళికి, హోలీకి తేడా తెలియదు. ఇది చాలా విచారకరం’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్కు గిఫ్ట్ ఇస్తాడట Sindh has the largest number of Hindu population in Pakistan with areas where Hindus are in overwhelming majority. One can only be sad at the state of affairs if the staff at the CM House Sindh doesn’t know the difference between Diwali and Holi. Sad indeed. pic.twitter.com/QdpDe6f3Pl — Murtaza Solangi (@murtazasolangi) November 4, 2021 -
ఉత్సవంతో వచ్చిన కరోనా: అటవీ గ్రామాల్లో కల్లోలం
ఆసిఫాబాద్: ఆరు ఊర్లను ఉప్పెనలా ముంచింది... గడపగడపకు రోగులు.. ప్రతి ఇల్లు ఒక క్వారంటైన్ మారింది.. కాటేసే రోగం దెబ్బకు నిద్రలేని రాత్రులు గడపుతున్నారు.. పల్లెలపై కరోనా పంజా విసిరింది. హోలీ సందర్భంగా నిర్వహించిన ఉత్సవం ఆ గ్రామాలను కరోనా కొంపముంచేసింది. ప్రస్తుతం ఆరు ఊర్లు కరోనాతో అల్లాడుతున్నాయి. ఒక్క ఉత్సవం ఆ అటవీ జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చేలా చేసింది. హోలీ సందర్భంగా గిరిజనులు లేంగి ఉత్సవాన్ని లింగపూర్ మండలంలోని మోతిపటార్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దాదాపు ఐదు వేల మందికి పైగా గిరిజనులు హజరయ్యారు. మహారాష్ట్ర నుంచి కూడా వందల సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. ఆ ఉత్సవాల్లో ఆడిపాడి సరదాగా గడిపారు. అయితే ఆ ఉత్సవంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వలన కరోనా వ్యాపించింది. మహారాష్ట్ర వారితో సోకిన కరోనా ప్రస్తుతం ప్రతి ఊరికి పాకింది. కొత్తపల్లి గ్రామంలో 1,200 మంది ఉంటే వీరిలో 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇంటికి ఒకరు కరోనాతో సతమతమవుతున్నారు. ఉత్సవంలో పాల్గొన్న మిగతా గ్రామాలు మోతిపటార్,లింగపూర్, మామిడిపల్లి, మరో రెండు గ్రామాల్లో ఇదే పరిస్థితి. పరీక్షలు నిర్వహిస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తుండడంతో పల్లెవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా ఉగ్రరూపంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు వేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ తెలిన వారికి హోంక్వారంటైన్ చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఇల్లు హోంక్వారంటైన్ మారింది. ఒక మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది కూడా. కరోనా ప్రస్తుతం ఇతర గ్రామాలకు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యాధికారులు మకాం వేసి రోగులు కోలుకోవడానికి వైద్యం అందిస్తున్నారు. ఉత్సవం జరిగి 22 రోజులు దాటిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులు మూసివేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఈ గ్రామాలకు రాకుండా.. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు వెళ్లకుండా రాకపోకలు నిషేధం విధించారు. నిత్యావసర వస్తువులు గ్రామస్తులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఉత్సవమే కరోనా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. చదవండి: సంపూర్ణ లాక్డౌన్.. రేపటి నుంచి 1వరకు -
హోలీ విషాదం: కల్తీ మద్యానికి ఆరుగురి మృతి
పాట్నా: కల్తీ మద్యం కాటుకు బిహార్లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. కల్తీ మద్యం తాగి కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిలో 24 గంటల్లో ఆరుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. హోలీ రోజు సరదాగా మద్యం తాగగా.. వారి ప్రాణం మీదకు వచ్చింది. ఈ ఘటనలు నవాడ జిల్లా ఖరిడి బిఘా, గుండాపూర్ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 29న హోలీ పండుగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన రామ్దేవ్ యాదవ్, అజయ్ యాదవ్, దినేశ్, శైలేంద్ర యాదవ్, లోహ సింగ్, గోపాల్ కుమార్ వేర్వేరుగా మద్యం కొన్నారు. పండుగ ఆనందంలో వారు ఇతరులతో కలిసి మద్యం సేవించారు. అయితే సేవించిన అనంతరం వారి కళ్లు తిరిగాయి. స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ విధంగా ఒకేరోజు ఆరు మందికి కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ఆ దుకాణంలో మద్యం తీసుకున్న వారందరికీ ఆ విధంగా అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు బిగుసరాయి ప్రాంతంలో కూడా ఇద్దరు కల్తీ మద్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో ఏవిధంగా మద్యం ఏరులై పారుతోందని ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ప్రశ్నించింది. కల్తీ మద్యం తాగి ప్రజలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై మంత్రి శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్!
హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరికి హోలీ బోనాంజా బహుమతిని ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కిమ్ కింద రూ.10,000 అడ్వాన్స్ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కీం పొందేందుకు చివరి తేదీ మార్చి 31. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మూడో ఇన్స్టాల్మెంట్ ఎర్రీర్స్ను విడుదల చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్రిపుర ప్రభుత్వం హోలీ సందర్భంగా డియర్నెస్ అలవెన్స్ హైక్ను ప్రకటించింది. ఇదొక్కటే కాదు పెన్షనర్స్ 3 శాతం డీఏ హైక్ పొందనున్నారు. అలాగే, గత జూలై నుండి పెండింగ్లో ఉన్న డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ కు సంబంధించిన శుభవార్త చెప్పింది. చదవండి: హైదరాబాద్ రోడ్ల మీదకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్ -
హోలీ మంటల్లో ‘సాగు’ ప్రతులు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హోలికా దహనం నిర్వహించారు. కొత్త చట్టాల ప్రతులను ఆదివారం హోలీ మంటల్లో వేసి దహనం చేశారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అలాగే కనీస మద్దతు ధరపై మరో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) బచావో దివస్గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ అధికారులను ఘెరావ్ చేస్తామని పేర్కొంది. కనీస మద్దతు ధర, ప్రజా పంపిణీ వ్యవస్థకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎఫ్సీఐకి నిధుల కేటాయింపులను ప్రతిఏటా భారీగా తగ్గిస్తోందని గుర్తుచేసింది. ఆందోళనలను అణచివేసేందుకు హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఈ బహుబలి కజ్జికాయ బరువెంతో తెలుసా?
లక్నో : భారత దేశ ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఉత్తర భారత దేశ ప్రజలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. రంగులతో, పిండి వంటలతో అద్భుతంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా గుజియా(కజ్జికాయ) లేనిదే హోలీ పండుగ పూర్తికాదని అంటారు. అందుకే, పండుగ పూట తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా చేసుకోవటానికి ఉత్తరప్రదేశ్, లక్నోలోని ఓ స్వీట్ షాపు వెరైటీగా కజ్జికాయను తయారు చేసింది. దానికి ‘బాహుబలి కజ్జికాయ’ అని పేరు పెట్టింది. పేరుకు తగ్గట్టుగానే దాని బరువు 1.5 కేజీలు. ఇది 35.4 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఈ కజ్జికాయ ఐడియా గురించి స్వీట్ షాపు మార్కెటింగ్ హెడ్ మాట్లాడుతూ.. ‘‘ కొత్తగా ఏదైనా చేయాలనే బాహుబలి కజ్జికాయను తయారు చేశాము. ఈ కజ్జికాయకు వినియోగదారులనుంచి మంచి స్పందన వస్తోంది. అయితే వీటి ధర తయారు చేయటానికి ఉపయోగించిన పదార్ధాలను బట్టి మారుతుంది’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ బాహుబలి కజ్జికాయ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి, చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం.. -
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు...
-
తెలంగాణలో హోలీ సంబరాలు..
-
మందుబాబులకు షాక్.. ఆరోజు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్ : మరో నాలుగు రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది. ఈ క్రమంలో హోలీ నాడు రంగులతో ఆటలే కాకుండా ఫుల్గా తాగి రోడ్లపై తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటారు. వీరి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వీటన్నింటికి చెక్ పెట్టడానికి హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా జంట నగరాల్లో ఈ సారి కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని పోలీసులు భావిస్తున్నారు. హోలీ పండుగ నేపథ్యంలో 36 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ మందుబాబులకు షాక్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్బంగా మార్చి 28 తేది సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని..పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణీకులపైనా.. వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ సీపీ హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: కరోనా టెర్రర్.. హోలీ పండుగపై నిషేధం -
చితక్కొడుతున్న మహిళలు : లాత్మర్ హోలీ
-
చితక్కొడుతున్న మహిళలు : హోలీ ఇలా కూడా
సాక్షి,లక్నో : ఉత్తరప్రదేశ్లో రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో యూపీ మథుర జిల్లాలో హోళీ సంబరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూమార్ హోలీ సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కరోనా మార్గనిర్దేశనాలను పాటించకుండా వేలాదిమంది ఈ సంబరాల్లో సందడి చేయడం వివాదం రేపింది. అయితే తాజాగా లాఠ్మార్ హోలీ సంబరాలు వార్తల్లో నిలిచాయి.. రంగులు జల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు ఆడవారు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీమార్ హోలీ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. దేశవ్యాప్తంగా మార్చి 29న హోలీ వేడుక జరుపుకోనుండగా యూపీలో మధుర-బృందావన్-బర్సానాలో వారం ముందుగానే ఈ సంబరం ప్రారంభమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత లాఠీమార్ హోలీ మంగళవారం నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ వేడుకను నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో నిర్వహించగా, బుధవారం బర్సానా, నందగావ్లో హోలీ ఆడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా, ప్రతిగా రాధ తదితరులు కృష్ణుడ్ని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీమార్ దాడినుంచి తప్పించుకునేందుకు పురుషులు కవచాలను కూడా ధరిస్తారట. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేస్తున్నారు. కరోనా విస్తరిస్తోంటే...కనీస జాగ్రత్తలు పాటించడంలేదుని, మాస్క్లు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించడం లేదంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో హోలీ, డోలోత్సవం రద్దు
భువనేశ్వర్: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామూహికంగా నిర్వహించుకునే హోలీ, డోలోత్సవం వేడుకల్ని రద్దు చేసిననట్లు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. హోలీ పండగను పురస్కరించుకుని ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. కోవిడ్ నిబంధనల కార్యాచరణతో ఆలయాల్లో సేవాదుల నిర్వహణ యథాతథంగా కొనసాగుతుంది. కుటుంబీకులతో కలిసి ఇంటిలో హోలీ పండగ జరుపుకునేందుకు అడ్డంకి లేదు. బహిరంగ ప్రదేశాలు, ప్రాంగణాల్లో సామూహిక హోలీ వేడుకల్లో పాలుపంచుకునే వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 కింద చర్యలు చేపడతామని ఎస్సార్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసి హెచ్చరించారు. అక్కడక్కడ కనిపిస్తున్న సార్స్–కోవ్ 2 ఛాయలు రాష్ట్రంలో కలవరం రేపుతున్నాయి. సంక్రమణ నివారణ కోసం కోవిడ్ – 19 నిబంధనల ఆచరణతో జాగ్రత్తతో మసలుకోవాలని ఎస్సార్సీ సూచించారు. కలెక్టర్ ఉత్తర్వులతో భక్తుల అనుమతి స్థానిక పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆలయాలు, దేవస్థానాలు, ప్రార్థన మందిరాలు, ధార్మిక ప్రాంగణాల పరిసరాలకు సాధారణ ప్రజానీకం, భక్తుల్ని అనుమతిస్తారు. బ్రెజిల్. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రపంచ దేశాలతో పాటు మహరాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మలి దశ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. హోలీ, డోలోత్సవం దగ్గర పడుతున్నాయి. ఈ పండగలను పురస్కరించుకుని ప్రజలు గుంపుగా చేరుతారు. ఉమ్మడిగా రంగులు చల్లుకుని వేడుక జరుపుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ – 19 నిబంధనల కార్యాచరణ అసాధ్యం. కోవిడ్ సంక్రమణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల సామూహిక నిర్వహణను నివారించినట్లు ఎస్సార్సీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డోలోత్సవంపై బీఎంసీ నిఘా హోలీ పండగ బహిరంగ వేడుకల నివారణ నేపథ్యంలో ప్రత్యేక సహాయ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో భువనేశ్వర్ నగర పాలక సంస్థ (బీఎంసీ) తాజా ఆదేశాలు జారీ చేసింది. హోలీ పండగ నేపథ్యంలో నిర్వహించే డోలోత్సవంపట్ల బీఎంసీ ప్రత్యేకంగా నిఘా వేస్తుందని పేర్కొంది. డోలోత్సవంలో భాగంగా పలు ఆలయాల నుంచి ఉత్సవ మూర్తుల్ని బహిరంగ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక భేటీ ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా లెక్కకు మిక్కిలిగా ప్రజలు గుమి గూడి రంగులు చల్లుకుని వేడుకలు జరుపుకోవడం ఆచారం. ఈ ఏడాది కరోనా సంక్రమణ నేపథ్యంలో ఈ కార్యక్రమంపట్ల భువనేశ్వర్ నగర పాలక సంస్థ ఆంక్షలు జారీ చేసింది. ఉత్సవ మూర్తుల్ని పల్లకిలో తీసుకుని వచ్చే సందర్భంగా ఒక్కో పల్లకితో అత్యధికంగా 6గురు వ్యక్తుల్ని మాత్రమే అనుమతిస్తారని బీఎంసీ కమిషనర్ ప్రేమ చంద్ర చౌదరి తెలిపారు. డోలోత్సవం నిర్వహణకు బహిరంగ ప్రాంతంలో అత్యధికంగా 50 నుంచి 60 మంది వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తారని ప్రకటించారు. ఈ మేరకు నిర్వాహకులు ముందస్తుగా దరఖాస్తు దాఖలు చేసి అనుమతి పొందడం అనివార్యంగా పేర్కొన్నారు. చదవండి: దారుణం: నిద్రలేపి నుదుటిపై తుపాకీతో... -
హైదరాబాద్ లో హోలీ సంబరాలు
-
అధికారులూ.. సిగ్గు సిగ్గు
పహాడీషరీఫ్: హోలీ పండుగ వచ్చిందంటే పార్దీ కులస్థుల్లో (నక్కల పిట్టలోల్లు) ఏ ఒక్కరిని కదిలించినా జల్పల్లి గ్రామం పేరే చెబుతారు. తమ పూర్వీకులు మొత్తం జల్పల్లిలోని పిట్టలగూడెంలో ఉండి తదనంతరం నగరంతో పాటు ఇతర జిల్లాలలో పార్దీవాడలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. హోలీ సమయంలో ఏ స్థాయిలో స్థిరపడిన వారైనా జల్పల్లిలోని పిట్టల గూడెంకు వచ్చి మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇలా వచ్చిన ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. విఫలమవ్వడం కాదు.. కావాలనే తమ పట్ల వివక్ష చూపారని పార్దీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీటిను కూడా సమకూర్చకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశామని వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలకు స్నానాలు చేసేందుకు నీరు లేకపోవడంతో మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలోని మూత్రశాలలో కొంత మంది స్నానాలు చేశారు. ఇది కూడా నచ్చని మున్సిపాలిటీ అధికారులు ఏకంగా వారు రాకుండా కార్యాలయ గేట్కు తాళం వేశారు. ఒకవైపు మున్సిపాలిటీ పరిధిలోని తమకు నచ్చిన వారి ఇళ్లల్లోకి ఏకంగా నీటి ట్యాంకర్లను పంపిస్తున్న అధికారులు ఏడాదికోసారి ఉత్సవం కోసం వచ్చిన వారికి నీరు ఇవ్వకపోవడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని కారణంగా యువతులు, మహిళలు జల్పల్లి, ఉందాసాగర్ చెరువుల వద్ద స్నానాలు చేయాల్సిన పరిస్థితి. కావాలనే మాపై వివక్ష చూపిస్తున్నారు.. పహాడీషరీఫ్లో వచ్చే నెలలో నిర్వహించనున్న ఇజ్తెమా (ఇస్లామిక్ సమ్మేళనం)కు దేశం నలుమూలల నుంచి ముస్లింలు రావడాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తోందనీ కానీ చిన్న పాటి ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చే తమకు మాత్రం నీరు, విద్యుత్ సదుపాయాలు కూడా ఎందుకు కల్పించడం లేదని నక్కల పిట్టల్లోల సంఘం నాయకులు విజయ్ కుమార్, చిట్టిబాబు, రవి, రమేశ్ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆడ పడుచులు స్నానం చేసేందుకు వస్తే మున్సిపాలిటీ గేట్కు తాళం వేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మార్కెట్లకు సెలవు : హోలీ శుభాకాంక్షలు
సాక్షి, ముంబై : హోలీ పర్వదినం సందర్భంగా ఈ రోజు (21, మార్చి) మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగిన కీలక సూచీలు చివరికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 23 పాయింట్లు ఎగిసి 38,386 వద్ద, నిప్టీ 11 పాయింట్లు నీరసించినా 11,521కి పైన ముగియడం విశేషం. మరోవైపు కీలక వడ్డీరేట్లపై ఫెడ్ యథాతథంగా నిర్ణయం ఆసియా మార్కెట్లకు జోషినిస్తోంది. వాషింగ్టన్లో రెండు రోజులపాటు జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ద్రవ్యోల్బణం ఒత్తిడులతో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లు 2.25-2.5 శాతం శ్రేణిలో ఉన్నాయి. -
అమెజాన్ హోలీ సేల్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం మరోసారి డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. హోలీ పండుగ సందర్భంగా ది గ్రేట్ అమెజాన్ హోలీ సేల్ 2019 పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం20, రియల్ మి యూ, హావావే వై 9, వివో 5ప్రొ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3వేలు దాటిన కొనుగోళ్లపై నోకాస్ట్ ఈఇంఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్,కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ను ఆపర్ చేస్తోంది. అలాగే డెబిట్ కార్డు కొనుగోళ్లపై నో ఈఎంఐ, 5,400 రూపాయల విలువైన తక్షణ క్యాష్ బ్యాకు, 3టీబీ జియో డాటా ను అందివ్వనుంది. దీంతోపాటు హోలి స్టోర్ పేరుతో ప్రకటించిన సేల్లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గాడ్జెట్లను కూడా అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. మార్చి 9న మొదలైన ఈ సేల్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. -
పుత్ర శోకం
విశాఖ క్రైం: హోలీ వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని రాకాసి అలలు అందని లోకానికి తీసుకుపోయాయి. కొడుకే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. హోలీ వేడుకల్లో భాగంగా స్నేహితులతో సరదాగా ఆర్కే బీచ్కు వెళ్లిన దొండపర్తికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి సముద్రంలో మునిగి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బెలగాం గ్రామానికి చెందిన పోలి అప్పలనాయుడు కుటుంబం నాలుగేళ్ల క్రితం కుమారుడి చదువు కోసం విశాఖ నగరానికి పొట్టచేత పట్టుకొని వచ్చింది. అప్పలనాయుడు కారు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబం పోషిస్తున్నాడు. ఈయనకు భార్య సత్యవతి, కుమారుడు సాయికుమార్(14) ఉన్నారు. దొండపర్తి కుమ్మరివీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి పక్కనే సమీప బంధువు కోలా నాగేశ్వరరావు, పొన్నాడ పుష్పవతి దంపతులు కూడా ఉంటున్నారు. సాయికుమార్ అక్కయ్యపాలెంలోని ఎన్టీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండగకు పాఠశాల సెలవు కావడంతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే సాయికుమార్ స్నేహితులు ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తల్లి సత్యవతి ఎక్కడికి వెళుతున్నావురా.. అంటే రైల్వే గ్రౌండ్కి అని చెప్పి స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్కు వెళ్లాడు. అక్కడ సరదాగా హోలీ సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. అనంతరం స్నానాల కోసం అందరూ సముద్రంలోకి దిగారు. అంతే ఒక్కసారిగా పెద్ద కెరటం వచ్చి సాయికుమార్ను లోపలికి లాక్కెళ్లిపోయింది. గమనించిన స్నేహితులు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. వెంటనే సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలియడంతో సాయికుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ వద్దకు చేరుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడి మృతదేహం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్కు తరలించారు. సాయికుమార్తో వెళ్లిన నలుగురు విద్యార్థులను పోలీసులు విచారించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హోలీ వేడుకల్లో టీనేజర్ హత్య.. కలకలం!
సాక్షి, జైపూర్: హోలీ వేడుకలు ఓ దళిత కుటుంబంలో పెను విషాదం నింపాయి. హోలీ అడుతుండగా ఆయుధాలతో దాడిచేయడంతో దళిత టీనేజర్ మృతిచెందడం కలకలం రేపింది. ఈ ఘటన రాజస్థాన్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నీరజ్ జాటవ్(16) అనే టీనేజర్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హోలీ సందర్భంగా బయటకు వెళ్లాడు నీరజ్. అయితే ఇతర సామాజిక వర్గానికి చెందిన మిత్రులు, స్థానికులతో హోలీ రంగులు రుద్దుకుంటూ హోలీ ఆడుతున్నాడు. అంతలోనే గొడవ మొదలైంది. దళిత బాలుడు నీరజ్పై కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న దళిత టీనేజర్ కుటుంబసభ్యులు నీరజ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన నీరజ్ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మృతిచెందాడని ఏఎస్పీ పుష్పేంద్ర సోలంకి తెలిపారు. హోలీ ఆడుతున్న నీరజ్ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్యచేశారని, ఆ టీనేజర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం. -
హోలీలో అపశ్రుతి
పుల్కల్(అందోల్): రెండు కుటుంబాల్లో హోలీ పండగ విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థులు నదిలో నీట మునిగి దుర్మరణం పాలైన సంఘటన పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన కిషన్, మంజుల దంపతుల కొడుకు సాయికిరణ్, యాదయ్య, వీరమణి దంపతుల కొడుకు సాయికుమార్లు మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. అనంతరం వారిద్దరూ మరో ఐదుగురితో కలిసి స్నానానికని మంజీర నదికి వెళ్లారు. ఇందులో ఈత రాని ఐదుగురు నది ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయికిరణ్, సాయికుమార్లతోపాటు మరో ఇద్దరు నీట మునగడాన్ని ఇంటర్ విద్యార్థి మల్లేశం గమనించాడు. వెంటనే నీట మనుగుతున్న ఇద్దరిని కాపాడి బయటకు తీశాడు. కానీ సాయికిరణ్, సాయికుమార్లను కాపాడేంత శక్తి లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురికి సమాచారం ఇచ్చాడు. కానీ అంతలోపే సాయికుమార్, సాయికిరణ్లు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిద్దరూ 10వ తరగతి విద్యార్థులే. వీరి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు మంజీర నదికి వెళ్లి వారి మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చెరేకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. మంజీర నదిలో స్నానం చేయడం కోసం వెళ్లి మృతి చెందిన సాయికుమార్, సాయికిరణ్లు ఇద్దరూ ప్రాణస్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. ఐదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారని, ఎప్పుడూ వారు కలిసే ఉండే వారన్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్కరే.. సాయికుమార్, సాయికిరన్లు ఇద్దరు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్ తండ్రి యాదయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి వీరమణి కూలీ పని చేస్తూ తన కొడుకును చదివిస్తోంది. మరో విద్యార్థి సాయికిరణ్ సైతం వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. గ్రామంలో విషాదం.. అందరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటుంటే ఆ గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు విద్యార్థులు మంజీర నదిలోనే పడి మృతి చెందారని, వారికి పోస్టుమార్టం నిర్వహించవద్దని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం కోసం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించామని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. -
ఏపీ సీఎం హోలీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : దుష్టశక్తులకు ఓటమి తప్పదని, చెడుపై అంతిమంగా మంచి గెలుస్తుందన్న సందేశాన్ని ఇచ్చే పండుగ హోలీ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల వారందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
తెలుగు వారి జీవితాలు రంగులమయం కావాలి
సాక్షి, అమరావతి : రంగుల పండుగైన హోలీ తెలుగు వారి జీవితాలను రంగులమయంగా, సంతోషకరంగా మార్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గురువారం ఆయన హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అంతా మంచి జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
హోలీ అంటే చిరాకు
కరణ్ జోహార్ బాలీవుడ్ అగ్ర దర్శక– నిర్మాత. తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ తెరనిండా నటీనటులతో కలర్ఫుల్గా ఉంటాయి. కానీ కర ణ్కు మాత్రం కలర్ఫుల్ ఫెస్టివల్ ‘హోలీ’ అంటే చిరాకట. ఇంకో విశేషం ఏంటంటే దానికి కారణం అభిషేక్ బచ్చన్ అట. ఎందుకలా? అని అడిగితే ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లారు కరణ్. ‘‘నా 7ఏళ్ల వయసప్పుడు అనుకుంటా.. ఓసారి హోలీకి మా వీధిలోని పిల్లలందరూ కలిసి నాకు రంగులు పూయటానికి వచ్చారు. ఆ రంగులు అంటకుండా ఉండటం కోసం వాళ్లకు దొరక్కుండా పరిగెత్తే ప్రయత్నంలో కిందపడిపోయాను. దెబ్బలు తగిలాయి. దాంతో వాళ్లతో గొడవ పడ్డాను. ఆ తర్వాత కొన్నేళ్లకు ఓ హోలీ రోజు అమితాబ్ బచ్చన్వాళ్ల ఇంటికి వెళ్లాను. నాకు హోలీ అంటే ఎందుకు భయమో అమిత్జీతో చెబుతున్నప్పుడు మా సంభాషణంతా వెనుక నుంచి అభిషేక్ బచ్చన్ విన్నాడు. మొత్తం విన్న తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అమాంతం ఎత్తుకొని రంగులున్న వాటర్ పూల్లో పడేశాడు. అంతే... అక్కడితో నాకు హోలీ అంటే చిరాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఎప్పూడు హోలీ ఆడలేదు’’ అని పేర్కొన్నారు కరణ్. -
సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
గవర్నర్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ప్రజలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ సమగ్రతకు చిహ్నమని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
ఒకటో తేదీనే హోలీ
సాక్షి, హైదరాబాద్ : హోలీ పండగ మార్చి ఒకటో తేదీనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రెండో తేదీన, రాష్ట్రం ఒకటో తేదీన హోలీ సెలవులుగా ఇప్పటికే ప్రకటించాయి. కానీ రెండు తేదీలు భిన్నంగా ఉండటంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. దీంతో సెలవు విషయంలో స్పష్టత ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగం దేవాదాయ శాఖను కోరింది. ఇప్పటికే పండితులతో చర్చించి ఒకటో తేదీనే ఖాయం చేసుకున్న దేవాదాయ శాఖ, అదే విషయాన్ని మరోసారి సాధారణ పరిపాలన విభాగానికి స్పష్టం చేసింది. పండితులతో కూడిన విద్వత్ సభతో చర్చించిన మీదటే ఒకటో తేదీని ఖరారు చేసినట్టు దేవాదాయ శాఖ తెలిపింది. -
హోలీ సెలవుపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్ : హోలీ సెలవు దినం మార్చి ఒకటినా లేక రెండో తేదీనా అన్న దానిపై గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న హోలీ సెలవు ప్రకటించింది. కేంద్రం మాత్రం మార్చి 2న ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో ఏ తేదీన సెలవు ప్రకటించాలో స్పష్టత ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీ అదర్సిన్హా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నోట్ రాశారు. రెండో తేదీకి సెలవు మార్చుకోవాలా? లేక ఒకటో తేదీనే సెలవు ప్రకటించాలా అన్న దానిపై అత్యవసరంగా తెలపాలని ఎండోమెంట్కు రాసిన నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. -
అగ్రకులస్తులపై హోలీ రంగులు చల్లాడని..
అగ్ర కులానికి చెందిన వారిపై హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లిన వ్యక్తిని పోలీసులు కొట్టి చంపారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొదెర్మ జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ చౌదరి, మరికొంత మంది గ్రామస్తులు హోలీ సందర్భంగా రంగులు చల్లుకుంటున్నట్లు ఆమె భార్య తెలిపారు. ఈ సమయంలో అటువైపుగా వచ్చిన చౌకీదార్ రాజేంద్ర యాదవ్పై కూడా వీరందరూ రంగులు చల్లారని వెల్లడించారు. దీంతో కోపగించుకున్న రాజేంద్ర.. రంగులు చల్లిన దళితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో గ్రామానికి వచ్చిన పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకుని స్పృహతప్పి పడిపోయే వరకూ చితకబాదారని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రదీప్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తను కలుసుకునేందుకు ఆయన సోదరుడితో కలిసి స్టేషన్కు వెళ్లగా చూడటానికి అనుమతించలేదని తెలిపారు. అంతేకాకుండా కులం పేరిట తమను దూషించారని ఆరోపించారు. మరుసటి ప్రదీప్ను పోలీసులు ఇంటి వద్ద వదిలేశారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్ను వెంటనే ఆసుపత్రికి తరలించామని.. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారని తెలిపారు. -
ఇక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే
బోధన్ రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో సోమవారం హోలీ సందర్భంగా పిడిగుద్దులాట ప్రశాంతంగా సాగింది. గ్రామం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో హోలీ రోజు 130 ఏళ్ల నుంచి పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు. సోమవారం గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడిగుద్దులు కురిపిం చుకున్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిడిగుద్దులాటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
యువీ చిందేశాడు.. క్రికెటర్ల సంబరాలు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు, మాజీలు హోలీ పండుగ సందర్భంగా సందడి చేశారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రోజున జంతువులపై రంగులు పూయవద్దని అభిమానులను కోరాడు. వెటరన్ హర్భజన్ సింగ్.. తన భార్య గీతా బస్రాతో కలసి హోలీ చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇక యువరాజ్ సింగ్ హోలీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రంగులు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, సంపద, శాంతి కలిగించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు. అజింక్యా రహానె ఇతర ఆటగాళ్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. -
హోలీ పేరుతో అసభ్యంగా తాకుతారు: నటి
ముంబయి: హోలీ తనకు సురక్షితంగా అనిపించదని ప్రముఖ బాలీవుడ్ నటి షెనాజ్ ట్రెజరీవాలా చెప్పింది. ఇష్క్ విష్క్ అనే చిత్రంలో అలీషా అనే పాత్రతో సుపరిచితురాలైన ఆమె తనకు హోలీ పేరుతో చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పారు. హోలీ పేరుతో అక్కడా ఇక్కడ చేతులు వేస్తుంటారని, తడిమి చూస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పద్దతి తనకు నచ్చదని కుండబద్ధలు కొట్టేసింది. ‘ఇది హోలీ అంటూ ఎక్కడెక్కడో చేతులు వేస్తుంటారు. అందుకే హోలీనాడు నాకు భద్రతగా అనిపించదు. హోలీ పేరుతో నన్ను చాలా ఇబ్బందికరంగా గతంలో తడిమి చూశారు. అందుకే నేనెప్పుడూ హోలీ కోసం అంత ఉత్సాహంగా ఎదురుచూడను. ఈ విషయం చెప్పడానికి తానేమి సిగ్గుపడటం లేదని, తనపై అలా అనుచితంగా చేసిన వాళ్లే సిగ్గుపడాలంటూ ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చింది. -
సంబరాలకు దూరంగా రాజ్నాథ్..!
న్యూఢిల్లీ/రాయ్పూర్: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నేతలంతా సంబరాల్లో మునిగిఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 12 మంది సిఆర్పీఫ్ జావానులు మృతిచెందడమేనని ఆయన చెప్పారు. శనివారం ఉదయం గం 9.15 సమయంలో కొత్తచెరువు గ్రామంలోని బేజి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు మెరుపుదాడి జరిపి సీఆర్పీఎఫ్, 219వ బెటాలియన్పై మెరుపుదాడి చేయడం తెలిసిందే. కు చెందిన 12 మందిని కాల్చిచంపి వారి దగ్గర ఉన్న ఆయుధాలను దొంగిలించిన సంగతి తెలిసిందే. దీనినిపిరికి చర్యఅని వర్ణిస్తూ.. జవానుల త్యాగాలు వృధా కాబోవన్నారు. మావోల దాడి వ్యూహాత్మకమే : పోలీసులు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వ్యూహాత్మకంగా తమ టార్గెట్ను పరిధిలోకి రానిచ్చిన మావోలు మందుపాతరలు పేల్చారనీ, దేశీయంగా తయారైన మోర్టార్లను వినియోగించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో హాలీవుడ్ చిత్రం ‘రాంబో’ తరహాలో బాణాలకు చివర పేలుడు పదార్థాలు కట్టి దాడికి తెగబడ్డారని అన్నారు. బస్తర్ జిల్లాలోని నారాయణపూర్, కొండాగావ్ క్యాంపులపై మావోయిస్టులు ఇలాగే బాంబులున్న బాణాలతో విరుచుకుపడ్డారని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ 219వ బెటాలియన్కు చెందిన 112 మంది జవాన్లు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నిర్మాణంలో ఉన్న భెజ్జీ–ఇంజ్రమ్ రోడ్డు మార్గాన్ని పహారా కాసేందుకు బయల్దేరారు. పహారాతోపాటు భెజ్జీలో ప్రతి శనివారం జరిగే మార్కెట్ స్థలాన్ని జవాన్లే సిద్ధం చేయాలి. ఈ క్రమంలో వారి కదలికలను మావోయిస్టులు పసిగట్టారు. జవాన్లు ఉదయం 8.50 గంటలకు కొత్తచెరు ప్రాంతానికి చేరుకోగానే అక్కడే నక్కిఉన్న మావోలు మందుపాతరలు పేల్చడమే కాకుండా తూటాలవర్షం కురిపించారు. ఈ దాడిలో 12 మంది జవాన్లు చనిపోయారు. గత ఏడాదిన్నరలో మావోలు చేసిన అతి పెద్దదాడి ఇదేనని పోలీసులు తెలిపారు. మావోలు మార్చి, జూన్ మాసాల్లో వ్యూహాత్మక ఎదురుదాడి కార్యక్రమాన్ని(టీసీఓసీ) పాటిస్తారు. చెట్లన్నీ ఎండిపోయి భద్రతా బలగాల కదలికలు స్పష్టంగా కనిపించడం వల్లే వారు టీసీఓసీని పాటిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. -
హోలీ వేడుకల్లో విషాదం
కాలువలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం అనపర్తి : అప్పటి వరకు వారు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగి తేలారు. ఆ వేడుకే చివరి వేడుకగా మిగులుతుందని ఊహించలేదు. మిత్రులందరితో సంతోషంగా గడిపిన కొద్ది సేపటికే ఇద్దరు విద్యార్థులు కాలువలో పడి గల్లంతు కావడంతో తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అనపర్తిలో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, అనపర్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన నీలం పవన్, అనపర్తికి చెందిన కొవ్వూరి మధుసూధన్రెడ్డిలు అనపర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. హోలీ పండుగను వీరు అనపర్తిలో మిగిలిన స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. తమపై పడిన రంగులను కడిగేసుకునేందుకు వీరిద్దరూ మరో స్నేహితుడు మనస్స్తో కలిసి నల్ల కాలువ వద్దకు వచ్చారు. అక్కడ మధుసూదన్ చొక్కా విప్పుకుని కాలువలో శుభ్రం చేసుకుంటున్న సమయంలో కాలుజారి గల్లంతైనట్టు తెలుస్తోంది. మధుసూదన్రెడ్డిని రక్షించే క్రమంలో పవన్ కూడా గల్లంతయ్యాడు. ఒడ్డున మనస్స్ ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఒక యువకుడికి తెలిపి బోరుమన్నాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కూడా నల్ల కాలువ వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో పవన్ అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు మనవడు. విషయం తెలుసుకున్న సిరసపల్లి ఘటనా స్థలానికి చేరుకుని విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్సై కిషోర్బాబు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, అనపర్తి డీసీ చైర్మన్ తాడి వెంకటరామారెడ్డి, తహసీల్దార్ ఆదినారాయణ తదితరులు ఘటనా స్థలికి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో పవన్ మృతదేహం లభ్యమైంది. పవన్ కాలికి చెప్పులు ఉండడంతో మధు సూదన్రెడ్డిని రక్షించే క్రమంలో మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మధుసూదన్రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రాత్రి సమయం కావడం.. గాలింపునకు అననుకూలంగా ఉండకపోవడంతో గాలింపు చర్యలను నిలుపుదల చేశారు. తల్లిదండ్రుల చెంతకే పవన్ కాలువలో స్నేహితుడిని రక్షించబోయి మృతి చెందిన పవన్ తల్లిదండ్రుల చెంతకే వెళ్లిపోవడాన్ని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. పవన్ తల్లిదండ్రులు సంధ్య, వీరభద్రరావులు దుప్పలపూడిలో ఉండేవారు. రెండేళ్ల క్రితం వీరభద్రరావు గుండెపోటుతో చనిపోగా, భర్త చనిపోయిన మూడు నెలలకే సంధ్య కూడా మృతి చెందారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరి చిన్నారులు తాతయ్య సిరసపల్లి నాగేశ్వరరావు వద్ద ఉండి చదువుకుంటున్నారు. నాగేశ్వరరావు కుమార్తెను, అల్లుడిని మనవళ్లలో చూసుకుంటూ జీవిస్తున్న సమయంలో ఇప్పుడు చిన్న మనవడు పవన్ కాలువ ప్రమాదంలో మృతి చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. దేవుడా ఎంత కష్టం పెట్టావంటూ నాగేశ్వరరావు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, సహచర ప్రజాప్రతినిధులు నాగేశ్వరరావును ఓదార్చే ప్రయత్నం చేశారు. -
హోలీ.. రంగేళి
–నగరంలో ఘనంగా వేడుకలు కర్నూలు(హాస్పిటల్): హోళీరే రంగేళీ హోళీ అంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగుల హోళీ ఆడుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు నగరంలోని ప్రధాన వీధుల్లో రంగులు చల్లుకున్నారు. రాజవిహార్, పెద్దమార్కెట్, నెహ్రూరోడ్, ఎన్ఆర్ పేట, కొత్తపేట, ప్రకాష్నగర్, బుధవారపేట, చాణిక్యపురికాలనీ, శంకరమఠం, ఎన్సీసీ అధికారుల క్వార్టర్స్, మాధవీనగర్, టెలికాంనగర్, నంద్యాల చెక్పోస్ట్, బృందావన్నగర్, బళ్లారిచౌరస్తా, అశోక్నగర్, వెంకటరమణకాలనీ తదితర ప్రాంతాల్లో జనం రంగుల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రధానంగా ఆదివారం పండుగ రావడంతో పండుగ వాతావరణం మరింత రంగుల మయంగా మారింది. హోళీ అనంతరం సాయంత్రం కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోనూ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
హోలి సంబరాల్లో పాల్గొన్న బైకర్స్ అరెస్ట్..
ఖాట్మాండు: నేపాల్లో 1,295 మంది ద్విచక్ర వాహనదారుల(బైకర్స్)ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. హోలి సంబరాల్లో పాల్గొన్న యువకులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో అదుపులోకి తీసుకున్నామని ఖాట్మాండు పోలీసులు తెలిపారు. 694 మందిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసామని, 596 మందిని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా హెల్మెట్ లేకుండా, అతివేగంతో బైక్లు నడిపారని పోలీసులు పేర్కొన్నారు. కొంత మంది పబ్లిక్ ప్రాంతాల్లో మద్యం సేవించారని, మరికొంత మంది అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులు రావడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. హోలి సందర్భంగా 61 చెక్ పాయింట్లు పెట్టామని, ఖట్మాండు, భాక్తపూర్, లలీత్పూర్ జిల్లాల్లో ఈ అరెస్టులు చేశామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. నేపాల్లో హోలిని రెండు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా భారత్ సరిహద్దు టెరై లోయ ప్రాంతాల్లో జరుపుకోవడానికి యువతి,యువకులు ఉత్సాహం చూపిస్తారు. -
ముద్దొచ్చే ఈ బుజ్జాయి ఎవరో తెలుసా?
ముద్దొచ్చే బొద్దు బుగ్గలతో.. ఫొటో పోజివ్వడం కన్నా చేతిలోనే లడ్డూపైనే మక్కువ చూపిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో తెలుసా? బాలం పిచికారీ.. తునే ముజే మారీ.. అంటూ 'హే జవానీ హై దివానీ' సినిమాలో హోలీ పాటతో అలరించిన రణ్బీర్ కపూర్ తెలుసు కదా. అతనే ఈ బుజ్జాయి. హోలీ సందర్భంగా అతని చిన్నప్పుడు తీసిన ఫొటో ఇది. మరోసారి దేశమంతా రంగుల్లో తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో ఈ అరుదైన హోలీ ఫొటోను రణ్బీర్ తల్లి నీతూ కపూర్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. రణ్బీర్ అభిమానులను ఈ ఫొటో ఆకట్టుకుంటూ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. Happy n SAFE Holi !!! -
హోలీ వేడుకల్లో కలెక్టర్, కమిషనర్
కరీంనగర్: హోలీ వేడుకలు కరీంనగర్లో కన్నుల పండుగలా జరిగాయి. స్త్రీ పురుష వయోభేదం లేకుండా రంగుల్లో మునిగితేలారు. పరస్పరం రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో సీపీ కమలాసన్ రెడ్డి పోలీస్ లతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొని రంగుల్లో మునిగి తేలారు.